breaking news
Corporate
-
యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్తో సెంట్రల్ బ్యాంక్ జట్టు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్తో కో లెండింగ్ (80:20 నిష్పత్తిలో) భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇరు సంస్థలు కలసి ఉమ్మడిగా రుణాలు ఇవ్వనున్నాయి. సెపె్టంబర్ త్రైమాసికానికి బలమైన పనితీరు నమోదు చేసింది. బ్యాంకుల రుణ ఆస్తుల నాణ్యత కూడా బలపడింది.నికర లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 33 శాతం వృద్ధితో రూ.1,213 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో బ్యాంక్ ఆర్జించిన లాభం రూ.913 కోట్లుగానే ఉంది. బ్యాంక్ మొత్తం వ్యాపారం విలువ సెప్టెంబర్ చివరికి 14 శాతానికి పైగా పెరిగి రూ.7.38 లక్షల కోట్లకు చేరింది.బ్యాంక్ మొత్తం రుణాల్లో వసూలు కాని స్థూల మొండి బాకీలు (ఎన్పీఏలు) క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఉన్న 4.59% నుంచి 3.01 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు (కేటాయింపుల అనంతరం) సైతం ఇదే కాలంలో 0.69% నుంచి 0.48 శాతానికి దిగొచ్చాయి. క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 17.34 శాతంగా ఉంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 19,611 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత క్యూ2తో పోలిస్తే బ్యాంకు నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సుమారు 10 శాతం పైగా పెరిగి రూ. 19,611 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం సుమారు 11 శాతం పెరిగి రూ. 18,641 కోట్లుగా నమోదైంది. ఇక రుణాల్లో 10 శాతం వృద్ధి దన్నుతో నికర వడ్డీ ఆదాయం 4.8 శాతం ఎగిసి రూ. 31,550 కోట్లకు చేరింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ (నిమ్) మాత్రం 3.5 శాతం నుంచి 3.27 శాతానికి నెమ్మదించింది. రాబోయే ఒకటి రెండేళ్లలో ఇది స్థిరంగా కొనసాగవచ్చని, లేదా మరింతగా పెరగొచ్చని బ్యాంకు తెలిపింది. సమీక్షాకాలంలో వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తి 1.36 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గింది. లక్ష్యాల వైపు ముందుకు.. క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తిని 96 శాతానికి పరిమితం చేసుకోవడం, రుణ వృద్ధిని మెరుగుపర్చుకోవడంలాంటి గతేడాది నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా ముందుకు వెళ్తున్నట్లు బ్యాంకు ఎండీ శశిధర్ జగదీశన్ తెలిపారు. 2027 ఆర్థిక సంవత్సరం నుంచి బ్యాంకింగ్ వ్యవస్థకు మించి రుణ వృద్ధి సాధించగలమని, మార్కెట్ వాటాను పెంచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీఎస్టీ క్రమబదీ్ధకరణ, ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు, ఆర్బీఐ రేట్ల కోత తదితర పాలసీలపరమైన అంశాల దన్నుతో క్షేత్ర స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని, దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యాపార వృద్ధికి గణనీయంగా అవకాశాలు లభించగలవని జగదీశన్ తెలిపారు. కంపెనీల కొనుగోళ్ల లావాదేవీలకు నిధులు సమకూర్చేలా (ఎక్విజిషన్ ఫైనాన్స్) బ్యాంకులకు అనుమతి లభించడం ఇటు బ్యాంకర్లకు, అటు రుణగ్రహీతలకు మేలు చేసే విషయమని సీఈవో శ్రీనివాసన్ వైద్యనాథన్ తెలిపారు. దీనితో కార్పొరేట్లకు లావాదేవీల వ్యయాల భారం తగ్గుతుందన్నారు. తాము కూడా ఎక్విజిషన్ ఫైనాన్స్ కార్యకలాపాలు చేపట్టే దిశగా తుది మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నామని వైద్యనాథన్ వివరించారు. ఉద్యోగాలపై జనరేటివ్ ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం ఉంటుందని భావించడం లేదని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీల రాకతో కొందరు సిబ్బంది బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి మారొచ్చని తెలిపారు. జనరేటివ్ ఏఐ సహా వివిధ టెక్నాలజీలపై బ్యాంకు అంతర్గతంగా కొన్ని ప్రయోగాలు చేస్తోందన్నారు. మరిన్ని విశేషాంశాలు.. → సమీక్షాకాలంలో బ్యాంక్ స్థూల స్లిపేజీలు రూ. 7,400 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో రూ. 1,100 కోట్లు వ్యవసాయ రుణాలున్నాయి. → మొత్తం ప్రొవిజన్లు రూ. 2,700 కోట్ల నుంచి రూ. 3,500 కోట్లకు పెరిగాయి. అయితే, అంతకు ముందు త్రైమాసికంలో నమోదైన రూ. 14,441 కోట్లతో పోలిస్తే తగ్గాయి. → రిటైల్ రుణాలు 7.4 శాతం పెరిగాయి. స్మాల్, మిడ్ మార్కెట్ సంస్థలకు రుణాలు 17 శాతం, కార్పొరేట్..హోల్సేల్ రుణాలు 6.4 శాతం పెరిగాయి. → వడ్డీయేతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 21,730 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 6.4 శాతం పెరిగి రూ. 17,980 కోట్లుగా నమోదయ్యాయి. -
స్పైస్జెట్ కీలక నిర్ణయం: నజాఫ్కి ఫ్లైట్ సర్వీస్
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ (SpiceJet) తాజాగా ఇరాక్లోని నజాఫ్కి నాన్స్టాప్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ముంబై-నజాఫ్ రూట్లో 2025 అక్టోబర్ 18 నుంచి, అహ్మదాబాద్ రూట్లో 19 నుంచి సర్వీసులు మొదలవుతాయని పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు కీలక ఆధ్యాత్మిక కేంద్రాల్లో నజాఫ్ కూడా ఒకటి. కొత్త విమానాలను సమకూర్చుకోవడం సహా దేశ, విదేశ రూట్లలో మరిన్ని రూట్లకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు స్పైస్జెట్ వివరించింది. ఈ సర్వీసులు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఇదీ చదవండి: దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్ -
గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్
పెరుగుతున్న బంగారం ధరలు.. ఆర్ధిక శ్రేయస్సు కంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడిని సూచిస్తుందని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీధర్ వెంబు హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఐఎమ్ఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గీతా గోపీనాథ్ రాసిన కథనంపై స్పందిస్తూ.. యూఎస్ మార్కెట్లపై చేసిన అంచనాతో తాను ఏకీభవిస్తున్నానని శ్రీధర్ వెంబు చెప్పారు. ''అమెరికా స్టాక్ మార్కెట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం కూడా ఒక పెద్ద హెచ్చరిక సంకేతాన్ని సూచిస్తోంది. నేను బంగారాన్ని పెట్టుబడిగా భావించను, దానిని ఆర్థిక ప్రమాదానికి బీమాగా భావిస్తున్నాను. వ్యవస్థలోని అన్ని రుణాలను తిరిగి చెల్లించడానికి AI కృషి చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను'' అని ఆయన ట్వీట్ చేశారు.గీతా గోపీనాథ్ ఏమన్నారంటే?వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికన్ స్టాక్ మార్కెట్ ఇటీవల బాగా దెబ్బతింది. డాట్ కామ్ క్రాష్ తరువాత జరిగిన దానికంటే.. స్టాక్ మార్కెట్ కరెక్షన్ మరింత తీవ్రమైంది. టారిఫ్ యుద్ధాలు.. సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అంతర్లీన సమస్య అసమతుల్య వాణిజ్యం కాదు అసమతుల్య వృద్ధి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని మరిన్ని దేశాలు/ప్రాంతాల్లో అధిక వృద్ధి మరియు రాబడి అవసరం.పెట్టుబడిదారులు చాలావరకు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగిపోతోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత పెరగడం మాత్రమే కాకుండా.. ఆర్థిక స్థిరత్వంలో కొత్త ఆందోళనలు పుడుతున్నాయి. ఈ తరుణంలో 2026 జనవరి నాటికి 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.50 లక్షలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు!కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు.. ముఖ్యంగా చైనా, జపాన్లలో బలమైన డిమాండ్ కారణంగా ప్రపంచ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని, ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) వ్యవస్థాపక సభ్యుడు & మాజీ చైర్మన్ అనంత పద్మనాబన్ పేర్కొన్నారు.I agree with Dr Gita Gopinath.The US stock market is in a clear and massive bubble.The degree of leverage in the system means that we cannot rule out a systemic event like the global financial crisis of 2008-9. Gold is also flashing a big warning signal. I don't think of… https://t.co/7xVPL3FXDq— Sridhar Vembu (@svembu) October 18, 2025 -
వరుస సెలవులు.. ఐదు రోజులు బ్యాంకులు బంద్!
భారతదేశంలో ఎక్కువమంది జరుపుకునే పండుగలలో.. దీపావళి ఒకటి. ఈ ఫెస్టివల్ సమయంలో అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 23 వరకు.. బ్యాంకులకు వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ కథనంలో ఈ సెలవులకు సంబంధించిన మరిన్ని వివరాలు చూసేద్దాం.➤అక్టోబర్ 19, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 20, సోమవారం: దీపావళి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 21, మంగళవారం: గోవర్ధన్ పూజ / లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 22, బుధవారం: బలిపాడ్యమి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలోని బ్యాంకులకు సెలవు).➤అక్టోబర్ 23, గురువారం: భాయ్దూజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (అహ్మదాబాద్, గ్యాంగ్టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్కతా, లక్నో, సిమ్లాలలో బ్యాంకులుకు సెలవు).అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: దీపావళికి.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ గిఫ్ట్ -
బాస్ అంటే ఇలా ఉండాలి: ఉద్యోగులకు 51 కార్లు గిఫ్ట్
దసరా, దీపావళి పండుగలు వచ్చాయంటే.. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు ఇస్తాయి, మరికొన్ని ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటాయి. ఇలాంటి కోవకు చెందిన కంపెనీలలో ఒకటి.. 'మిట్స్ నేచురా లిమిటెడ్' (Mits Natura Limited). ఈ కంపెనీ బాస్ తన ఉద్యోగులు గత రెండేళ్లుగా కార్లను గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా ఇదే విధానం కొనసాగించారు. ఈసారి ఏకంగా 51 మందికి కార్లను గిఫ్ట్ ఇచ్చారు.ప్రముఖ ఔషదాల తయారీ సంస్థ.. మిట్స్ నేచురా లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ ఎంకే భాటియా ఈ దీపావళికి.. తమ సంస్థలో పనిచేస్తూ ఉత్తమ పనితీరును కనపరిచిన 51 మంది ఉద్యోగులకు కార్లను గిఫ్ట్ ఇస్తూ.. వాటి తాళాలను తానే స్వయంగా అందజేసి.. ప్రతి ఒక్కరినీ అభినందించారు.ప్రతి సంవత్సరం ఇంత ఖరీదైన కార్లను ఎందుకు బహుమతిగా ఇస్తారని భాటియాను అడిగినప్పుడు.. నా ఉద్యోగులే నా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు వెన్నెముక. వారి కృషి, నిజాయితీ, అంకితభావం మా విజయానికి పునాది. వారి ప్రయత్నాలను గుర్తించడం.. వారిని కూడా ఎదిగేలా చేయడం మా విధి అని ఆయన అన్నారు.కార్లను గిఫ్ట్ ఇవ్వడం అనేది ప్రదర్శించుకోవడానికి కాదు. జట్టులో స్ఫూర్తిని నింపడానికి, సంస్థను ఒక కుటుంబంలా ముందుకు తీసుకెళ్లడానికి అని ఆయన అన్నారు. టీమ్ లేదా ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పుడు.. కంపెనీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. అయితే ఈ సారి బ్రాండ్ కార్లను గిఫ్ట్ ఇచ్చారు అనే విషయం అధికారికంగా వెలువడలేదు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు! -
భారత రైల్వేలో అపార అవకాశాలు
భారతీయ రైల్వే వ్యవస్థ ప్రస్తుతం గణనీయమైన పరివర్తన దశలో ఉంది. భారత రైల్వే కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన లక్ష్యాల ప్రకారం.. 2047 నాటికి 7,000 కిలోమీటర్ల మేర హై-స్పీడ్ కారిడార్లను విస్తరించడం, వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను పెద్ద ఎత్తున ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు ప్రతిపాదించారు. దాంతో అంతర్జాతీయ, దేశీయ కంపెనీలకు భారత రైల్వే మార్కెట్లో అపారమైన అవకాశాలు లభిస్తాయనే అంచనాలున్నాయి.ప్యాసింజర్ల అవసరాలకు అనువుగా..అంతర్జాతీయ కంపెనీలతోపాటు దేశీయ సంస్థలు భారతీయ ప్యాసింజర్ల అవసరాలు తీర్చడానికి కొన్ని విధానాలు అనుసరించాల్సి ఉంటుంది. హై-స్పీడ్, ప్రీమియం విభాగం (వందేభారత్ వంటివి) అవసరమే అయినప్పటికీ మెజారిటీ ప్రయాణీకులకు సరసమైన ప్రయాణం(అమృత్ భారత్ వంటివి) అవసరం. ధరల విషయంలో భారతదేశ మార్కెట్కు ప్రత్యేకంగా సరిపోయే భాగాలను, రైళ్లను ఉత్పత్తి చేయాలి. భారతీయ రైళ్లలో రద్దీని దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసే విధంగా కోచ్ డిజైన్లలో మార్పులు చేయాల్సి ఉంటుంది. సీటింగ్, లగేజీ స్థలం వంటివి దృష్టిలో ఉంచుకోవాలి.దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని భారతీయ భాగస్వాములకు బదిలీ చేయాలి. రైల్వే విడి భాగాలు, వ్యవస్థలను భారతదేశంలోనే తయారుచేయడానికి తయారీ యూనిట్లను నెలకొల్పాలి. తద్వారా స్థానిక ఉపాధి కల్పన పెరుగుతుంది. ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేయాలనే లక్ష్యం ‘మేక్ ఇన్ ఇండియా’ కేంద్రాల నుంచే ప్రారంభమైతే అంతర్జాతీయ కంపెనీలకు భారత ప్రభుత్వ సహకారం మరింత లభించే అవకాశం ఉంటుంది.భద్రత ప్రమాణాలు కీలకంరైళ్ల వేగం పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలు అత్యంత కీలకం. కవచ్ వంటి స్వదేశీ సాంకేతికతలతో అనుసంధానం అయ్యే అత్యాధునిక సిగ్నలింగ్, ట్రాకింగ్ నిర్వహణ వ్యవస్థలను అందించాలి. రైలు ఆలస్యాలను, నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి అత్యంత విశ్వసనీయత కలిగిన డివైజ్లను అందించాలి. దాంతోపాటు రైళ్లలో మెరుగైన సౌకర్యాలు (ఉదా: పరిశుభ్రమైన మరుగుదొడ్లు, మెరుగైన సీటింగ్, వినోద వ్యవస్థలు) అందించడంపై దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా కోచ్ డిజైన్లను అభివృద్ధి చేయాలి.కంపెనీలకు వాణిజ్య అవకాశాలుభారత రైల్వే విస్తరణలో హై-స్పీడ్ కారిడార్లు, వందే భారత్, అమృత్ భారత్ వంటి రైళ్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో కంపెనీలకు అనేక వాణిజ్య అవకాశాలున్నాయి.మౌలిక సదుపాయాలుప్రభుత్వం 2047 వరకు 7,000 కి.మీ.ల హై-స్పీడ్ కారిడార్లను ఏర్పాటు చేయాలని తలపెట్టిన నేపథ్యంలో అధిక నాణ్యత కలిగిన ట్రాక్ మెటీరియల్స్, వెల్డింగ్ సాంకేతికతలు, ట్రాక్ నిర్వహణ యంత్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణ నైపుణ్యం అవసరం. హై-స్పీడ్ రైళ్లకు అత్యాధునిక ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ (OHE), ప్రపంచ స్థాయి సిగ్నలింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ముఖ్యం. కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.వందేభారత్ స్లీపర్ వెర్షన్లు, మెట్రో రైళ్లు, అమృత్ భారత్ (నాన్-ఏసీ జనరల్ క్లాస్) రైళ్లను పెద్ద సంఖ్యలో తయారు చేయాల్సి ఉంటుంది. కంపెనీలు కోచ్ డిజైన్, ప్రొపల్షన్ సిస్టమ్స్, బ్రేకింగ్ సిస్టమ్స్ వంటి అత్యంత కీలక భాగాలను సరఫరా చేయవచ్చు. భారత రైల్వేతో కలిసి సంయుక్తంగా ఉత్పత్తి ప్రారంభించవచ్చు.ఎగుమతి ఉత్పత్తి కేంద్రాలుభారతదేశాన్ని రైల్వే భాగాల తయారీ కేంద్రంగా ఉపయోగించుకోవడానికి కంపెనీలకు ఇదో అవకాశం. ఇక్కడ తక్కువ ఖర్చుతో తయారైన రైల్వే భాగాలను ఆఫ్రికా, ఆసియాలోని ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎగుమతి చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిర్వహణ వ్యవస్థలు, డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత ట్రాక్ పర్యవేక్షణ, ప్రయాణీకుల సమాచార వ్యవస్థలను అందించడంలో అవకాశాలు ఉన్నాయి. కొత్త రైళ్లను, సాంకేతికతలను నిర్వహించడానికి ప్రస్తుత రైల్వే వర్క్షాప్లను ఆధునీకరించడానికి అత్యాధునిక యంత్రాలు, నైపుణ్యం అవసరం.అమృత్ భారత్ స్టేషన్ పథకంఈ పథకం కింద వేల సంఖ్యలో స్టేషన్లను పునరుద్ధరిస్తున్నారు. కంపెనీలు స్టేషన్ డిజైన్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, లాంజ్ సౌకర్యాలు, రిటైల్ స్పేస్ల అభివృద్ధిలో పాలుపంచుకోవచ్చు. ఇందులో భారీ పెట్టుబడులు అవసరం కాబట్టి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాల ద్వారా ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడంలో కంపెనీలు ముఖ్య పాత్ర పోషించవచ్చు.ఇదీ చదవండి: పలుచబడిన ఐపీఎల్ మార్కెట్! కారణాలివే.. -
పలుచబడిన ఐపీఎల్ మార్కెట్! కారణాలివే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మార్కెట్ విలువ 2025లో గణనీయంగా పడిపోవడానికి దారితీసిన అంశాలను ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో విశ్లేషించారు. ఐపీఎల్ విలువ గతేడాది రూ.92,500 కోట్ల నుంచి 2025లో రూ.76,100 కోట్లకు పడిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలను తెలియజేస్తూ అవి మార్కెట్, ప్రకటనలు, చట్టపరమైన మార్పులు, క్రికెట్ మార్కెట్పై చూపిన ప్రభావాన్ని అంచనా వేశారు.మీడియా హక్కులపై ఏకఛత్రాధిపత్యండిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనం కావడం ద్వారా మార్కెట్లో ఒకే పెద్ద బ్రాడ్కాస్టర్ (జియోస్టార్)కు అవకాశం ఏర్పడింది. గతంలో మీడియా హక్కుల కోసం పెద్ద సంస్థల మధ్య తీవ్రమైన పోటీ (బిడ్డింగ్ వార్) ఉండేది. దీని వల్ల మీడియా హక్కులను చేజిక్కించుకునేందుకు మరింత డబ్బు వెచ్చించేవారు. డిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనంతో ప్రధాన బ్రాడ్కాస్టర్గా ఏర్పడినప్పుడు పోటీ లేకపోవడం వల్ల ఐపీఎల్ (IPL) మీడియా హక్కుల కోసం చెల్లించే ధరలు తగ్గిపోయాయి. ఇది ఐపీఎల్ (IPL) మొత్తం విలువపై తీవ్ర ప్రభావం చూపింది.ఫాంటసీ, గేమింగ్ ప్రకటనలపై నిషేధంకొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టం కింద ఫాంటసీ స్పోర్ట్స్, ఇతర గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం లేదా కఠినమైన నిబంధనలు విధించారు. ఐపీఎల్ (IPL) ప్రసారాలకు ఫాంటసీ గేమింగ్ సంస్థలు ఒకప్పుడు అతిపెద్ద ప్రకటనదారులుగా ఉండేవి. కొత్త నిబంధనలతో ఈ వర్గాన్ని కోల్పోవడం లేదా వారి ప్రకటన బడ్జెట్ తగ్గడం వల్ల లీగ్ (League) ప్రకటనల ఆదాయంపై భారీగా దెబ్బతింది.ఆర్థిక అనిశ్చితిప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ఆర్థిక మందగమనం, అనిశ్చితి నెలకొన్నప్పుడు కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా కంపెనీలు తమ ప్రకటనల బడ్జెట్లను పరిమితం చేశాయి. ముఖ్యంగా బ్రాండ్ (Brand) ప్రచారం కోసం చేసే ఖర్చు తగ్గింది.Why IPL valuation dropped again in 2025- from Rs 92,500 cr to Rs 76,100 cr:1. Disney Star–Viacom18 merger → single broadcaster (JioStar) → no bidding war, lower media-rights value.2. Ban on fantasy & gaming ads under new Online Gaming Act → loss of key advertiser category.…— Harsh Goenka (@hvgoenka) October 16, 2025ఫ్రాంచైజీల లాభాలపై ఒత్తిడిఏటా ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి, వారి జీతాల కోసం అయ్యే ఖర్చు (సాలరీ క్యాప్) పెరుగుతూ వస్తోంది. మరోవైపు ప్రధాన స్పాన్సర్షిప్ ఒప్పందాల విలువ అనుకున్నంత వేగంగా పెరగడం లేదు. అధిక ఖర్చులు, స్తబ్దుగా ఉన్న వీటి ఆదాయాల కారణంగా లాభాలు తగ్గుతున్నాయి.గ్లోబల్ క్రికెట్ప్రపంచ క్రికెట్ మార్కెట్లో అనేక కొత్త లీగ్లు పుట్టుకొస్తున్నాయి. ఇది ప్రేక్షకులను ఐపీఎల్ నుంచి కాస్త దూరంగా ఉంచుతుంది. ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ (BBL), కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), సౌతాఫ్రికా టీ20, యూఏఈ (UAE) లీగ్ వంటి అనేక అంతర్జాతీయ లీగ్లు ఉన్నాయి.ఇదీ చదవండి: అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్ -
ఒకప్పుడు మిలిటరీ డాక్టర్.. ఇప్పుడేమో క్యాబ్ డ్రైవర్!
బెంగళూరుకు చెందిన ఓ మహిళకు కెనడాలో కారులో మిస్సిస్సాగా నుంచి టొరంటోకు ప్రయాణిస్తున్నప్పుడు వింత అనుభవం ఎదురైంది. తాను ఎక్కిన క్యాబ్ డ్రైవర్తో మాటామంతి సాగిస్తుండగా తన ప్రొఫైల్ విని ఆశ్చర్యపోయింది. ఆ డ్రైవర్ తనతో ఏ విషయాలు పంచుకున్నారో రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయింది.క్యాబ్ డ్రైవర్ బెంగళూరు మహిళ మేఘనా శ్రీనివాస్తో చెప్పిన వివరాల ప్రకారం..‘నేను ఆఫ్ఘనిస్తాన్కు చెందిన వ్యక్తిని. గతంలో యూఎస్, కెనడా కోసం మిలిటరీలో వైద్యుడిగా పనిచేశాను. ప్రస్తుతం కెనడాలో పర్మనెంట్ రెసిడెంట్(PR) కోసం ప్రయత్నిస్తున్నాను. నా వైద్య వృత్తిని కొనసాగించడానికి అవసరమైన లైసెన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం కెనడాలో ఒక డిగ్రీ కోసం చదువుతున్నాను. రోజువారీ ఖర్చుల కోసం ఇలా క్యాబ్ నడుపుతున్నాను. క్యాబ్ నడపడం ద్వారా సుమారు నెలకు 4,000 డాలర్లు సంపాదిస్తున్నాను. కానీ టొరంటోలో ఒక పడకగదికి సుమారు 3,000(రూ.2.63 లక్షలు) డాలర్లు చెల్లించవలసి వస్తుంది. టొరంటోలో అద్దెగదులు చాలా ఖరీదైనవి’మేఘనా తన పోస్ట్లో విదేశాలకు మకాం మార్చే ముందు ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి సరైన ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. కెనడాకు వెళ్లే ముందు విద్యార్థులు, ఇతర వ్యక్తులు క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. అక్కడి విద్యా వ్యవస్థ లేదా నగరాల గురించి మాత్రమే కాకుండా జీవన ఖర్చులు, విధానాలు, ఉద్యోగ మార్కెట్.. వంటి చాలా అంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
స్వల్పంగా పెరిగిన నిరుద్యోగిత
న్యూఢిల్లీ: సెప్టెంబర్లో నిరుద్యోగం (ఉపాధి లేమి) కాస్తంత ఎగిసింది. ఆగస్ట్లో 5.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్లో 5.2 శాతానికి పెరిగింది. 15 ఏళ్లు, అంతకుమించి వయసులోని వారికి సంబంధించి ఉపాధి వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది జూలైలో నిరుద్యోగిత 5.2 శాతంగా ఉంటే, జూన్, మే నెలల్లో 5.6 శాతం, ఏప్రిల్లో 5.1 శాతం చొప్పున నమోదు కావడం గమనార్హం. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన నిరుద్యోగ రేటు సెప్టెంబర్లో స్వల్పంగా పెరిగినట్టు గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్లో 4.3 శాతంగా ఉంటే, సెప్టెంబర్లో 4.6 శాతానికి ఎగిసింది. అదే పట్టణ ప్రాంతాల్లో మాత్రం 6.7 శాతం నుంచి 6.8 శాతానికి చేరింది. ఉపాధి గణాంకాలు.. → పట్టణ మహిళల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్లో ఉన్న 8.9 శాతం నుంచి సెప్టెంబర్లో 9.3 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగిత 5.2 శాతం నుంచి 5.5 శాతానికి ఎగిసింది. → పట్టణ పురుషుల్లో ఉపాధి లేమి 5.9 శాతం నుంచి 6 శాతానికి.. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. → పనిచేసే జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) సెప్టెంబర్ చివరికి 52.4 శాతానికి చేరింది. ఈ ఏడాది మే నెల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శ్రామికశక్తి పెరగడం ఇందుకు అనుకూలించింది. → మహిళల్లో డబ్ల్యూపీఆర్ జూన్లో 30.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 32.3 శాతానికి మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కారి్మక శక్తి గత మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. జూన్లో 33.6 శాతంగా ఉంటే, సెప్టెంబర్ చివరికి 36.3 శాతానికి చేరింది. → 15 ఏళ్లు, అంతకుమించిన జనాభాలో కార్మికుల భాగస్వామ్య రేటు జూన్లో నమోదైన 54.2 శాతం నుంచి సెప్టెంబర్ చివరికి 55.3 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 56.1 శాతం నుంచి 57.4 శాతానికి మెరుగుపడగా, పట్టణాల్లో మాత్రం 50.9 శాతం వద్దే కొనసాగింది. మహిళా కారి్మకుల భాగస్వామ్య రేటు (పనిచేసే వారు) జూన్లో ఉన్న 32 శాతం నుంచి సెప్టెంబర్ చివరికి 37.9 శాతానికి పుంజుకున్నది. -
రిలయన్స్ క్యూ2.. గుడ్
టెలికం, డిజిటల్ ప్లాట్ఫామ్ రిలయన్స్ జియో సహా.. రిలయన్స్ రిటైల్, ఆయిల్ టు కెమికల్స్(ఓ2సీ) విభాగాల దన్నుతో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పటిష్ట పనితీరు చూపింది. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) క్యూ2లో నికర లాభం 10 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ తాజాగా జూలై–సెప్టెంబర్(క్యూ2) ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 18,165 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 16,653 కోట్లు ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆర్జించిన రూ. 26,994 కోట్లతో పోలిస్తే 33 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ. 2.35 లక్షల కోట్ల నుంచి రూ. 2.39 లక్షల కోట్లకు ఎగసింది. కొత్త కస్టమర్లను జత చేసుకోవడం, వినియోగదారునిపై ఆదాయం పుంజుకోవడం, వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ బిజినెస్లతో జియో లాభం 13 శాతం పుంజుకోగా.. స్టోర్ల నిర్వహణ మెరుగుపడటంతో రిటైల్ విభాగం ఆర్జన 22 శాతం ఎగసింది. మరోవైపు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా చమురును ప్రాసెస్ చేయడంతో బలపడిన రిఫైనింగ్ మార్జిన్లు ఈ క్యూ2లో ఆర్ఐఎల్కు జోష్నిచ్చాయి. క్యూ1తో పోలిస్తే ఇన్వెంటరీ నష్టాలు రెట్టింపై రూ. 8,421 కోట్లకు చేరాయి. నిర్వహణ లాభం(ఇబిటా) 15% జంప్చేసి రూ. 50,367 కోట్లను తాకింది. రుణ భారం రూ. 3.38 లక్షల కోట్ల(క్యూ1) నుంచి రూ. 3.48 లక్షల కోట్లకు పెరిగింది. ఓ2సీ ఓకే: చమురు, రసాయనాల విభాగం ఇబిటా 21% జంప్చేసి రూ. 15,008 కోట్లను తాకింది. జామ్నగర్ జంట రిఫైనరీల చమురు శుద్ధి మార్జిన్లు బలపడ్డాయి. కొత్త రికార్డ్తో 20.8 మిలియన్ టన్నుల చమురును ప్రాసెస్ చేసింది. ఇంధన రిటైల్ బిజినెస్ జియో–బీపీ డీజిల్, పెట్రోల్ విక్రయాలు 30 శాతం జంప్చేశాయి. రిటైల్ నెట్వర్క్ 2,000 ఔట్లెట్లకు చేరింది. ఇక కేజీ–డీ6 క్షేత్రాలలో గ్యాస్ ఉత్పత్తి 5 శాతంపైగా క్షీణించింది.ఫలితాల నేపథ్యంలో ఆర్ఐఎల్ షేరు 1.4 శాతం లాభంతో రూ. 1,417 వద్ద ముగిసింది. రిటైల్ భళా రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం 22 శాతం ఎగసి రూ. 3,457 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 90,018 కోట్లను తాకింది. ఇబిటా 17 శాతం అధికమై రూ. 6,816 కోట్లయ్యింది. ఈ కాలంలో కొత్తగా 412 స్టోర్లను జత చేసుకోవడంతో వీటి సంఖ్య 19,821కు చేరింది. నిర్వహణ మార్జిన్లను మెరుగుపరిచేందుకు కార్యకలాపాల క్రమబదీ్ధకరణను చేపట్టింది. ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఎజియో కేటలాగ్ 35 శాతం పెరిగి 2.7 మిలియన్ ఆప్షన్లకు చేరింది. ఆన్లైన్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ యాప్ డౌన్లోడ్స్ 60 లక్షలను దాటాయి. జియో జోరు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థ జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం క్యూ2లో 13 శాతం పుంజుకుని రూ. 7,379 కోట్లను తాకింది. డేటా మినిట్స్ వినియోగం, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ), సబ్స్క్రయిబర్ల సంఖ్య మెరుగుపడటం ఇందుకు సహకరించింది. కస్టమర్ల సంఖ్య 49.81 కోట్ల నుంచి 50.64 కోట్లకు పెరిగింది. ఏఆర్పీయూ రూ. 208.8 నుంచి రూ. 211.4కు బలపడింది. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సరీ్వస్ జియోఎయిర్ఫైబర్ వినియోగదారుల సంఖ్య 9.5 మిలియన్లకు చేరింది. ఇది ప్రపంచంలోనే అత్యధికంకాగా.. నెలకు మిలియన్ కొత్త కనెక్షన్లు జత కలుస్తున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది.జియోస్టార్ జూమ్ మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ జియోస్టార్ నికర లాభం రూ. 1,322 కోట్లను తాకగా.. రూ. 7,232 కోట్ల ఆదాయం అందుకుంది. రూ. 1,738 కోట్ల ఇబిటాతోపాటు 28.1 శాతం మార్జిన్లు సాధించింది.ఓ2సీ, జియో, రిటైల్ విభాగాల దన్నుతో క్యూ2లో పటిష్ట పనితీరు ప్రదర్శించాం. అన్నివిధాలా డిజిటల్ సరీ్వసుల బిజినెస్ వృద్ధి కొనసాగుతోంది. అధిక అమ్మకాల కారణంగా రిటైల్ విభాగం ఆదాయం, ఇబిటా పుంజుకున్నాయి. ఇంధన మార్కెట్ల అనిశి్చతుల్లోనూ ఓ2సీ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కొత్త వృద్ధి ఇంజిన్లు న్యూఎనర్జీ, మీడియా, కన్జూమర్ బ్రాండ్స్లో నమోదవుతున్న పురోగతికి సంతోíÙస్తున్నాం. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
రూ. 1 లక్ష కోట్ల మార్కెట్లోకి ఓలా ఎలక్ట్రిక్ ఎంట్రీ..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విభాగంలోకి ప్రవేశించింది. గృహావసరాల కోసం ఓలా శక్తి పేరుతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) సొల్యూషన్ను ఆవిష్కరించింది.దేశీయంగా విద్యుత్ కొరత లేదని, కాకపోతే నిల్వ చేసుకోవడానికి సంబంధించి సవాళ్లు ఉంటున్నాయని సంస్థ సీఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు. దీన్ని ఒక అవకాశంగా మల్చుకోవచ్చని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి బ్యాటరీ, సెల్ టెక్నాలజీని రూపొందించామని, ఓలా శక్తి దానికి కొనసాగింపని అగర్వాల్ చెప్పారు.అధునాతన 4680 భారత్ సెల్ని ఉపయోగించి దీన్ని పూర్తిగా దేశీయంగా తయారు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం బీఈఎస్ఎస్ మార్కెట్ రూ. 1 లక్ష కోట్లుగా ఉండగా, 2030 నాటికి రూ. 3 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.ఓలా శక్తి ముఖ్య ఫీచర్లుతక్షణ పవర్ స్విచింగ్:సాంప్రదాయ ఇన్వర్టర్లు లేదా డీజిల్ జనరేటర్ల మాదిరిగా కాకుండా, ఉపకరణాలను సురక్షితంగా ఉంచుతూ, తక్షణమే (0 మిల్లీసెకన్లు) శక్తిని మారుస్తుంది.స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్:రియల్టైమ్లో శక్తి వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. నియంత్రిస్తుంది. వినియోగ విధానాలను తెలుసుకుని వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. విద్యుత్, డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది.వోల్టేజ్ రక్షణ: విస్తృత వోల్టేజ్ పరిధిలో (120V–290V) పనిచేస్తుంది. పరికరాలను హెచ్చుతగ్గుల నుండి రక్షిస్తుంది.సురక్షితం, సమర్థవంతం: రన్నింగ్ లేదా నిర్వహణ ఖర్చులు లేకుండా ఆటోమోటివ్-గ్రేడ్ భద్రత, 98 శాతం వరకు సామర్థ్యం. వాతావరణ నిరోధకత: IP67-రేటెడ్ బ్యాటరీలకు దుమ్ము, నీరు, భారీ వర్షాల నుండి పూర్తిగా రక్షణఅధునాతన ఫీచర్లు:టైమ్-ఆఫ్-డే (ToD) ఛార్జింగ్, స్మార్ట్ బ్యాకప్ ప్రాధాన్యత, రిమోట్ డయాగ్నస్టిక్స్, OTA సాఫ్ట్వేర్ అప్డేట్లు, విస్తరణ ఎంపికలు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఆన్లైన్ ఆపరేషన్.ధర, లభ్యతఓలా శక్తి 1.5 kWh, 3 kWh, 5.2 kWh, 9.1 kWh కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. మొదటి 10,000 యూనిట్లకు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.. 1.5 కిలోవాట్లకు రూ.29,999, 3 కిలోవాట్లకు రూ. 55,999, 5.2 కిలోవాట్లకు రూ.1,19,999, 9.1 కిలోవాట్లకు రూ. 1,59,999 లుగా కంపెనీ నిర్ణయించింది. రూ.999 ధరతో రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మకర సంక్రాంతి నుండి డెలివరీలు ఉంటాయని భావిస్తున్నారు. -
బ్యాంకులు.. భలే లాభాలు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 58 శాతం జంప్చేసి రూ. 1,226 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 777 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 5,856 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 5,055 కోట్ల వడ్డీ ఆదాయం సాధించింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.72 శాతం నుంచి 1.83 శాతానికి తగ్గాయి.ఇండియన్ బ్యాంక్ లాభం ప్లస్ ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో స్టాండెలోన్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 3,018 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,706 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ. 11,964 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 11,125 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,099 కోట్ల నుంచి రూ. 739 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.48%ం నుంచి 2.6 శాతానికి తగ్గాయి. సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం అప్ ప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో స్టాండెలోన్ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 351 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం లాభించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 325 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం క్షీణతతో రూ. 808 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడ్డాయి. వడ్డీయేతర ఆదాయం 26 శాతం ఎగసి రూ. 516 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 43 శాతం క్షీణించి రూ. 63 కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.4 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గాయి. బ్రాంచీల సంఖ్య 948కు చేరింది. -
ఏఐ ఎఫెక్ట్.. ఆ ఉద్యోగాలపై ప్రభావం: నితిన్ మిట్టల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇది నిజమే అని కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే డెలాయిట్ గ్లోబల్ ఏఐ లీడర్ నితిన్ మిట్టల్ (Nitin Mittal).. ఈ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు.ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందా, ఉద్యోగులు.. ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లు, కోడింగ్ వంటి కొన్ని ఉద్యోగాలు ఏఐకు ప్రభావితం కావడం అనివార్యం. అయితే ఏఐ కారణంగా కోల్పోయిన ఒక్క ఉద్యోగాన్ని కూడా నేను చూడలేదు. దాదాపు ఉద్యోగులంతా AIతో ఎలా కలిసి పనిచేయాలో నేర్చుకుంటున్నారని మిట్టల్ పేర్కొన్నారు.ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం పెంచుకోవడానికి ఆసక్తి చూపనివారిని, ఖాళీ సమయాన్ని డూమ్స్క్రోలింగ్లో గడిపేవారినికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని నితిన్ మిట్టల్ చెప్పారు. అంతే కాకుండా ఏఐ ఎవరూ ఊహించని ఉద్యోగాలను సృష్టిస్తుందని.. కాబట్టి ఇందులో తప్పకుండా నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు! -
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే..
పచ్చనోటు మనిషి జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుంది. డబ్బుపై ఆశ కడు పెదరికంలో ఉన్న వ్యక్తిని సైతం రాజును చేయగలదు. ఆ ఆశ కొద్దిగా మితిమీరితే అదే డబ్బు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుంది. ఒకప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న బీఆర్ శెట్టి జీవితంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఆ ఆశే తన రూ.87,936 కోట్ల(అంచనా) విలువైన వ్యాపారాన్ని కేవలం రూ.74కే అమ్ముకునేలా చేసింది. అసలు అంత విలువైన కంపెనీని ఎందుకు ఇంత తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.బి.ఆర్.శెట్టిగా ప్రసిద్ధి చెందిన బావగుతు రఘురామ్ శెట్టి 1942 ఆగస్టు 1న కర్ణాటకలోని ఉడిపిలో తుళు మాట్లాడే బంట్ కుటుంబంలో జన్మించారు. ఇతని పూర్వీకుల మాతృభాష తుళు, కానీ తాను కర్ణాటకలో పుట్టుడంతో కన్నడ మీడియం పాఠశాలలో చదివారు. మణిపాల్లో ఫార్మాస్యూటికల్ విద్యను పూర్తి చేశారు. ఉడిపి మునిసిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా కూడా కొన్ని రోజులు పనిచేశారు. చంద్రకుమారి శెట్టిని వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.స్టాక్ ఎక్స్ఛేంజీలో..శెట్టి 31 ఏళ్ల వయసులో ఇతర ఖర్చులుపోను జేబులో కేవలం రూ.665తో యూఏఈలోని దుబాయ్కు కుటుంబంతో సహా వలస వెళ్లారు. అక్కడే 1975లో యూఏఈ మొదటి ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రం న్యూ మెడికల్ సెంటర్ హెల్త్ (ఎన్ఎంసీ)ను స్థాపించారు. తన భార్య అందులో ఏకైక వైద్యురాలిగా సేవలందించేంది. ఒకే క్లినిక్తో ప్రారంభమైన ఎన్ఎంసీ తక్కువ కాలంలోనే పెద్ద ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎదిగింది. బహుళ దేశాల్లో ఏటా మిలియన్ల మంది రోగులకు సేవలు అందించేది. ఇది యూఏఈలో అతిపెద్ద ప్రైవేట్ హెల్త్కేర్ ప్రొవైడర్గా ప్రసిద్ధి చెందింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) నుంచి లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన మొదటి ఆరోగ్య సంరక్షణ సంస్థగా ఎన్ఎంసీ అప్పట్లో చరిత్ర సృష్టించింది.వ్యాపారాల జాబితా..శెట్టి కేవలం ఆ సంస్థను స్థాపించడంతోనే ఆగిపోకుండా తన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నారు. దాంతో ఇతర వెంచర్లు ఆరోగ్య సంరక్షణకు అతీతంగా విస్తరించాయి. అతను నియోఫార్మా అనే ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీని, ఫినాబ్లర్ అనే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థను స్థాపించారు. తన వ్యాపార పోర్ట్ఫోలియోలో రిటైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటాలిటీలో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్లో ఐకానిక్ కట్టడంగా ఉన్న బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. సొంతంగా ప్రైవేట్ విమానం కూడా ఉండేది. 2019 నాటికి శెట్టి భారతదేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో 42వ స్థానంలో నిలిచారు. తన మొత్తం ఆస్తుల విలువ రూ.18,000 కోట్లుగా ఉండేది.అనధికార నగదు లావాదేవీలు2019లో ఎన్ఎంసీపై ఆర్థిక అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తడంతో కీలక మలుపు చోటుచేసుకుంది. యూకేకు చెందిన ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ సంస్థ మడ్డీ వాటర్స్ ఎన్ఎంసీ హెల్త్ అనధికారికంగా తన నగదు ప్రవాహాన్ని పెంచిందని, రుణాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపించింది. ఈ వాదనలు ఎన్ఎంసీ స్టాక్ ధరలు తీవ్రంగా క్షీణించేందుకు కారణమయ్యాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఈ వ్యవహారం దెబ్బతీసింది. ఆ తర్వాత జరిపిన దర్యాప్తులో కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో గణనీయమైన అవకతవకలు జరిగినట్లు తేలింది. శెట్టి నిబంధనల దుర్వినియోగం, మోసం ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో 2020 ప్రారంభంలో ఎన్ఎంసీను ఎక్స్చేంజీ బోర్డు నుంచి తొలగించారు. నేరారోపణలు రాకముందు ఎన్ఎంసీ కంపెనీ విలువ సుమారు రూ.87,936 కోట్లుగా ఉండేది. ఈ సంస్థను బలవంతంగా అక్కడి నిబంధనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకొచ్చి చివరకు కేవలం రూ.74కే విక్రయించారు.ఇతర కంపెనీలపై ప్రభావంఈ పతనం శెట్టికి చెందిన ఇతర వెంచర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఫినాబ్లర్ కంపెనీలో కూడా ఇలాంటి ఆరోపణలు, ఆర్థిక ఇబ్బందులున్నట్లు కొన్ని రిపోర్ట్లు వెలువడ్డాయి. ఇది అతని ప్రతిష్టను మరింత దిగజార్చింది. ఈ పరిణామాల దృష్ట్యా యూఏఈ సెంట్రల్ బ్యాంక్ శెట్టి ఖాతాలను స్తంభింపజేసింది. అతనిపై అనేక అధికార పరిధుల్లో చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.పడిపోయిన ఆస్తుల విలువబ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చిన అప్పులు పెరుగుతుండడం, న్యాయపరమైన సవాళ్లతో శెట్టి ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలింది. అతని ఆస్తుల నికర విలువ పడిపోయింది. అతను దివాలా తీసినట్లు తన దగ్గరి వర్గాలు ప్రకటించాయి. అతని విలాసవంతమైన జీవనశైలి, ఆర్థిక దుర్వినియోగం అతని పతనానికి దోహదం చేశాయని నివేదికలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు -
అవసరాలకు అనువైన బహుమతులు.. తీరు మార్చుకున్న కంపెనీలు
ప్రతి సంవత్సరం దీపావళి వచ్చిందంటే దాదాపు చాలా కంపెనీల ఉద్యోగుల చేతుల్లో పండుగ బహుమతులు ఉండడం ఖాయం. ఈ దీపావళి బహుమతుల ప్రదానంలో ఇటీవలి కాలంలో మార్పులు వస్తున్నాయి. గతంలో కేవలం సాంప్రదాయ స్వీట్ బాక్స్లు, చాక్లెట్లకే పరిమితమైన కార్పొరేట్ గిఫ్టింగ్ సంస్కృతి ఇప్పుడు ఉద్యోగుల అవసరాలు, వినియోగానికి ఉపయోగపడే కన్స్యూమర్ వస్తువుల వైపు మళ్లుతోంది.కొత్త ట్రెండ్గతంలో దీపావళి బహుమతులు అంటే ఖరీదైన మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లు ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. అయితే నేటి తరం కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల దైనందిన జీవితంలో ఉపయోగపడే వస్తువులను అందించడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ మార్పునకు నిదర్శనంగా ఇటీవల కొన్ని ఉదాహరణలు కనిపిస్తున్నాయి.ఇటీవల ఒక ప్రముఖ టెక్నాలజీ సంస్థ తన ఉద్యోగులందరికీ ప్రయాణాలకు ఉపయోగపడే వీఐపీ (VIP) బ్యాగులను బహుమతిగా అందించింది. ఇది ఉద్యోగులకు వ్యక్తిగతంగా ఎంతగానో ఉపయోగపడుతుంది.తాజాగా మరో కంపెనీ ఉత్తమ నాణ్యత గల కిచెన్వేర్ సెట్లను దీపావళి కానుకగా ఇచ్చింది. దీనితో పాటు కొంతమంది ఉద్యోగులకు విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కూడా అందించినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Bhavika Goyal (@bhavika.inframes)బహుమతుల ఎంపికలో కంపెనీలు కేవలం లాంఛనాన్ని కాకుండా ఉద్యోగుల అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి.ట్రెండ్ మార్పునకు కారణాలుస్వీట్ బాక్స్లు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తే కన్స్యూమర్ వస్తువులు దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి. ఉద్యోగులకు ఇవి తమ రోజువారీ జీవితంలో ఉపయోగపడే విలువైన కానుకగా నిలుస్తాయి.పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా చాలా మంది ఉద్యోగులు అధిక షుగర్, క్యాలరీలు ఉన్న స్వీట్ బాక్స్లను పక్కన పెట్టేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే వస్తువుల పంపిణీకి కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయి.మంచి నాణ్యత గల కన్స్యూమర్ వస్తువులను అందించడం ద్వారా కంపెనీలు తమ ఉద్యోగులపై శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా ఒక సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకోవచ్చు.ఉద్యోగికి ఉపయోగపడే బహుమతిని ఇవ్వడం వల్ల సంస్థ పట్ల వారి విధేయత పెరుగుతుంది. ఇది ఉద్యోగులు సంస్థలో కొనసాగడానికి దోహదపడుతుంది.కేవలం లాంఛనం కాకుండా ఇలాంటి బహుమతులు పండుగ వాతావరణంలో సంస్థ గౌరవాన్ని, ప్రోత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి.బహుమతుల ఎంపికలో క్రియేటివిటీని చూపడం ద్వారా కంపెనీ తమ అంతర్గత ఆవిష్కరణ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.ఇదీ చదవండి: ఆన్లైన్ షాపింగ్.. డబ్బు మిగలాలంటే ఇలా చేయాల్సిందే.. -
ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్: అప్పుడే అన్నీ కొనేశారు!
స్కోడా కంపెనీ భారతదేశంలో.. ఆక్టావియా ఆర్ఎస్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. దీనిని సంస్థ కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. బుకింగ్స్ అక్టోబర్ 6 నుంచే మొదలైపోయాయి. ఈ కారు ధర రూ. 49.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).స్కోడా తన ఆక్టావియా ఆర్ఎస్ కారును లాంచ్ చేయడానికి ముందే.. అన్ని యూనిట్లు అమ్ముడైపోయాయి. దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుంటారు. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువ. ఇది ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 13 ఇంచెస్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అదనపు అప్గ్రేడ్లను పొందుతుంది.ఇదీ చదవండి: ఇండియన్ బైక్స్: ఇప్పుడు స్పెయిన్, పోర్చుగల్లో..2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 261 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్కు డెలివరీ చేస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. -
16000 ఉద్యోగాల కోత!.. నెస్లే కీలక నిర్ణయం
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణపొందిన ఆహార, పానీయాల దిగ్గజం 'నెస్లే' (Nestle).. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు గురువారం ప్రకటించింది. సెప్టెంబర్ 2025 ప్రారంభంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఈఓ ఫిలిప్ నవ్రాటిల్ ఆధ్వర్యంలో కంపెనీ పరివర్తనను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది."ప్రపంచం మారుతోంది, నెస్లే కూడా వేగంగా మారాలి" అని సీఈఓ నవ్రాటిల్ ఒక ప్రకటనలో అన్నారు. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని.. దీని ప్రకారమే ఉద్యోగాల కోతలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోత!.. తాజాగా అమెజాన్నెస్లే తొలగించనున్న మొత్తం 16,000 మంది ఉద్యోగులలో.. సుమారు 12,000 మంది వైట్ కాలర్ ఉద్యోగులు, మిగిలిన 4,000 మంది ఉత్పత్తి, సరఫరా గొలుసులు సంబంధించిన ఉద్యోగులు ఉండనున్నారు. ఉద్యోగాల తొలగింపులు తరువాత.. కంపెనీ పొదుపు లక్ష్యం 3 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్గా సంస్థ నిర్ణయించుకుంది. -
కస్టమర్లకు రూ.1000 కోట్లకు పైగా ఆదా చేసిన అమెజాన్
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (GIF) 2025లో భాగంగా 276 కోట్ల కస్టమర్ సందర్శనలతో ఆల్-టైమ్ రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఇందులో దేశవ్యాప్తంగా టైర్ 2, 3 నగరాల భాగస్వామ్యం బలంగా ఉందని చెప్పింది. బ్యాంక్ ఆఫర్లు, జీఎస్టీ ప్రయోజనాలు, క్యాష్బ్యాక్ రివార్డుల ద్వారా కస్టమర్లకు ఈ ఫెస్టివల్ సీజన్లో రూ.1000 కోట్లకు పైగా ఆదా అయినట్లు పేర్కొంది. సెప్టెంబర్ 22 నుంచి నెలరోజుల పాటు జరుగుతున్న ఈ ఫెస్టివల్లో ఇంకా కొన్ని రోజులు మిగిలున్న నేపథ్యంలో ఈ ఈవెంట్కు సంబంధించిన కొన్ని అంశాలను పంచుకుంది.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025కు 276 కోట్లకు పైగా కస్టమర్ల సందర్శనలు నమోదయ్యాయి.మొత్తం కస్టమర్లలో 70% మందికి పైగా టైర్ 2, 3 నగరాల నుంచే ఉన్నారు.దేశవ్యాప్తంగా కాంగ్రా, హరిద్వార్, ముజఫర్పూర్, జామ్నగర్ వంటి ప్రాంతాల విక్రేతలు రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు చేశారు.బ్యాంక్ ఆఫర్లు, జీఎస్టీ ప్రయోజనాలు, క్యాష్బ్యాక్ రివార్డుల ద్వారా కస్టమర్లకు రూ.1000 కోట్లకు పైగా ఆదా అయింది.జీఎస్టీ బచత్ఉత్సవ్లో భాగంగా విక్రేతలు వందల కోట్ల జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించారు.కొత్తగా చేరిన అమెజాన్ ప్రైమ్ సభ్యుల్లో 70% మంది టైర్ 2, 3 నగరాలకు చెందినవారే.ప్రైమ్ సభ్యులకు వేగవంతమైన డెలివరీలు అందాయి.గత ఏడాదితో పోలిస్తే 60% అధికంగా ‘సేమ్-డే డెలివరీలు’ (1.4 కోట్లు) జరిగాయి.టైర్ 2, 3 నగరాల్లో రెండు రోజుల్లో డెలివరీలు 37% పెరిగాయి.B2B మార్కెట్లో కొత్త బిజినెస్ కస్టమర్ సైన్-అప్లు 30% (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి.బల్క్ ఆర్డర్లు దాదాపు 120% (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయి.కార్పొరేట్ గిఫ్టింగ్ 60% (ఏడాది ప్రాతిపదికన) వృద్ధి చెందింది.చిన్న, మధ్య తరహా వ్యాపారాల (SMBs) భాగస్వామ్యం రికార్డు స్థాయిలో ఉంది. వీరిలో మూడింట రెండొంతుల మంది టైర్ 2, 3 నగరాలకు చెందినవారే.అమెజాన్ బజార్ (అల్ట్రా-అఫర్డబుల్ ప్రొడక్ట్స్ స్టోర్)లో విక్రేతల భాగస్వామ్యం 2 రెట్లు పెరిగింది.ప్రతి నలుగురు కస్టమర్లలో ఒకరు అమెజాన్ పే ఉపయోగించారు.ప్రతి 4 ఆర్డర్లలో ఒకటి యూపీఐ ద్వారా పూర్తయింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధి నమోదు చేసింది.మొబైల్స్, గృహోపకరణాల కొనుగోళ్లలో ప్రతి 6 ఆర్డర్లలో ఒకటి ఈఎంఐ ద్వారా జరిగింది. వీరిలో ఐదులో నాలుగు కొనుగోళ్లు నో కాస్ట్ ఇఎంఐ ద్వారానే జరిగాయి.రూ.30,000 పైబడిన ప్రీమియం స్మార్ట్ఫోన్లు 30% వృద్ధి చెందాయి.ఫ్యాషన్, బ్యూటీ విభాగం 95% వరకు వృద్ధిని నమోదు చేసింది. ల్యాబ్-గ్రోన్ డైమండ్ జువెలరీ 390% (y-o-y) వృద్ధి చెందింది.కొరియన్ బ్యూటీ ఉత్పత్తులు 75% పెరిగాయి.ద్విచక్ర వాహనాల అమ్మకాలు 105% (y-o-y) పెరిగాయి. సగటున 6 రోజుల్లోనే డెలివరీ అందించారు.అమెజాన్ ఫ్రెష్ టైర్ 2, 3 నగరాల నుంచి 60% వృద్ధిని నమోదు చేసింది. పండుగ సమయంలో టీని అధిగమించి కాఫీ 30% వృద్ధిని సాధించింది.ఫెస్టివ్ లైట్లు, అలంకరణ వస్తువుల అమ్మకాలు 500% పెరిగాయి.ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..‘రికార్డు స్థాయిలో 276 కోట్ల కస్టమర్ సందర్శనలతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 మరోసారి కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పింది. భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన, ఆదరణ పొందిన ఆన్లైన్ షాపింగ్ గమ్యస్థానంగా అమెజాన్ నిలిచింది’ అన్నారు.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు -
విప్రో లాభం ఫ్లాట్
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ.3,246 కోట్లను దాటింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.3,209 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 2 శాతం పుంజుకుని రూ.22,697 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా నికర లాభం 2.5 శాతం నీరసించగా.. ఆదాయం ఇదే స్థాయిలో బలపడింది.మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ఐటీ సర్వీసుల ఆదాయం –0.5–+1.5 శాతం స్థాయిలో నమోదుకాగలదని కంపెనీ తాజాగా అంచనా వేసింది. వెరసి 259.1–264.4 కోట్ల డాలర్ల మధ్య ఆదాయ గైడెన్స్ ప్రకటించింది. అయితే ఇటీవల సొంతం చేసుకున్న హర్మన్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ ఆదాయ అంచనాలను దీనిలో కలపకపోవడం గమనార్హం! ప్రస్తుతం డిమాండ్ వాతావరణం పటిష్టంగా కనిపిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. విచక్షణా వ్యయాలు ఏఐ ఆధారిత ప్రాజెక్టులవైపు మరలుతున్నట్లు వెల్లడించారు. హెచ్1బీ వీసా ఫీజు ప్రభావం అంతంతే..యూఎస్ ఉద్యోగులలో 80% స్థానికులే కావడంతో హెచ్1బీ వీసా ఫీజు పెంపు ప్రభావం నామమాత్రమేనని కంపెనీ సీహెచ్ఆర్వో సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. డిమాండ్ ఆధారంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ చేపట్టనున్నట్లు తెలియజేశారు. క్యూ2లో ఇతర విశేషాలు..2,260 మంది ఉద్యోగులు జతకావడంతో. సిబ్బంది సంఖ్య 2,35,492ను తాకింది.2 మెగా రెన్యువల్స్, 13 భారీ డీల్స్ ద్వారా మొత్తం ఆర్డర్లు 31 శాతం జంప్చేసి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఐటీ సర్వీసుల మార్జిన్లు 16.7%గా ఉన్నాయి.ఇదీ చదవండి: మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు -
మూడు నెలల్లో 8,203 మందికి ఇన్ఫీ ఉద్యోగాలు
ఐటీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో 8,203 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,31,991కు చేరిందని చెప్పింది. ఇన్ఫీ క్యూ2 ఫలితాలను వెల్లడించిన క్రమంలో అందులోని వివరాల ప్రకారం..జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ.7,364 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.6,506 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం పుంజుకుని రూ.44,490 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ.40,986 కోట్ల టర్నోవర్ అందుకుంది. పూర్తి ఏడాదికి ఆదాయంలో 1–3 శాతం వృద్ధి(జూన్లో ప్రకటించిన) అంచనాలను తాజాగా 2–3 శాతానికి సవరించింది. నిర్వహణ మార్జిన్లు నామమాత్ర క్షీణతతో 21%గా నమోదయ్యాయి.షేరుకి రూ.23 డివిడెండ్వాటాదారులకు ఇన్ఫోసిస్ బోర్డు షేరుకి రూ.23 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈనెల 27 రికార్డు డేట్ కాగా నవంబర్ 7 కల్లా చెల్లించనుంది. దీనికితోడు రూ.18,000 కోట్ల విలువైన సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్) కోసం వాటాదారుల అనుమతి తీసుకోనున్నట్లు కంపెనీ సీఎఫ్వో జయేష్ సంగ్రాజ్కా తెలిపారు.ఇతర విశేషాలుక్యూ2లో 8,203 మంది ఉద్యోగులు జత కలిశారు. దీంతో సిబ్బంది సంఖ్య 3,31,991ను తాకింది. 2025 జూన్ చివరికల్లా 3,23,788 మంది ఉద్యోగులున్నారు.ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు గత క్యూ2లో నమోదైన 12.9 శాతం నుంచి 14.3 శాతానికి పెరిగింది.ఈ కాలంలో 3.1 బిలియన్ డాలర్ల(రూ. 27,525 కోట్లు) విలువైన కాంట్రాక్టులను సాధించింది. ఆదాయంలో ఫైనాన్షియల్ సర్వీసుల విభాగం 5.6 శాతం వృద్ధితో 27.7 శాతం వాటాను ఆక్రమించింది.తయారీ విభాగం 9.3 శాతం, హైటెక్ బిజినెస్ 8.3 శాతం, కమ్యూనికేషన్స్ 5.7 శాతం చొప్పున సమకూర్చాయి. రిటైల్ నామమాత్రంగా నీరసించగా.. లైఫ్ సైన్సెస్ 9 శాతం క్షీణించింది.ఉత్తర అమెరికా వాటా 1.7 శాతం పుంజుకుని ఆదాయంలో 56.3 శాతానికి చేరింది.యూరప్ బిజినెస్ 10.6 శాతం ఎగసి 31.7 శాతం వాటాను ఆక్రమించింది. భారత్ వాటా 2.9 శాతమే.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
కుల గణనలో పాల్గొనబోం
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టిన సామాజిక, విద్యా సర్వే, కులగణనలో పాల్గొనబోమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తి ప్రకటించారు. తాము వెనుకబడిన కులాలకు చెందిన వారం కాదన్నారు. ఇటీవల తమ నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్లతో వారు.. ‘మా ఇంట్లో సర్వే చేపట్టవద్దు’అని తెలిపినట్లు సమాచారం. అదేవిధంగా, ఎన్యుమరేటర్లకిచ్చిన ప్రొఫార్మాలో సుధామూర్తి..‘మేం వెనుకబడిన కులాలకు చెందిన వారము కాదు. అందుకే, ఆ గ్రూపుల కోసం ప్రభుత్వం చేపట్టిన సర్వేలో మేం పాల్గొనడం లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై మంత్రి తంగదాడి స్పందిస్తూ.. వెనుకబడిన కులాల సంక్షేమంపై వారికి ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోందని విమర్శించారు. ఈ పరిణామంపై సుధామూర్తి దంపతులు, ఇన్ఫోసిస్ అధికారులు స్పందించలేదు. -
రూ.3,900 కోట్లు సమీకరించిన జెప్టో
న్యూఢిల్లీ: క్విక్కామర్స్ సంస్థ జెప్టో తాజాగా 450 మిలియన్ డాలర్ల (రూ.3,900 కోట్లుl. సుమారు) నిధులను సమీకరించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏడాది క్రితం 350 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ నాటికి కంపెనీ మార్కెట్ విలువ 5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అక్కడి నుంచి చూస్తే 40 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. తాజా నిధుల సమీకరణంలో అధిక భాగం కొత్త ఈక్విటీ షేర్ల జారీ రూపంలోనే ఉంది. అలాగే తొలినాళ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో కొందరు స్వల్ప వాటాలను విక్రయించారు. ఈ విడతలో కాల్పర్స్ నుంచి ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం కంపెనీ ఖాతాల్లో 900 మిలియన్ డాలర్ల మేర నికర నగదు నిల్వలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాలకు పూర్తిగా సరిపోతాయని కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పలీచా తెలిపారు.త్వరలో పబ్లిక్ ఇష్యూ చేపట్టాలనుకుంటున్న జెప్టోలో ప్రస్తుతం దేశీ ఇన్వెస్టర్ల వాటా 12 శాతంగా ఉండగా, కొన్ని వారాల్లోనే ఇది 40 శాతానికి చేరుకుంటుందని చెప్పారు. క్విక్కామర్స్ విభాగంలో బ్లింకిట్, ఇన్స్టామార్ట్లకు గట్టిపోటీనిస్తున్న జెప్టో పట్ల ప్రైవేటు ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కనిపిస్తోంది. రోజువారీ 17 లక్షల ఆర్డర్లను స్వీకరిస్తున్నట్టు.. మెజారిటీ డార్క్స్టోర్లు లాభాల్లోకి వస్తున్నట్టు పలీచా తెలిపారు. గతేడాది నిధుల సమీకరణ నాటితో పోల్చితే ఈ విడత మెజారిటీ స్టోర్లు లాభాల్లోకి వచ్చినట్టు చెప్పారు. విస్తరణపై వ్యయం తాజాగా సమకూరిన పెట్టుబడులతో బ్యాలన్స్ షీట్ను మెరుగ్గా నిర్వహించగలమని, మోస్తరు విస్తరణకు వ్యయం చేయొచ్చని పలీచా చెప్పారు. ఒకవైపు కార్యకలాపాలను విస్తరిస్తూనే, లాభాల్లోకి రావడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. -
రూ.6,500 కోట్లతో జీహెచ్సీఎల్ విస్తరణ
న్యూఢిల్లీ: దేశీయంగా సోడాయాష్ తయారీలో రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న జీహెచ్సీఎల్ రూ.6,500 కోట్లతో గుజరాత్లోని కచ్ జిల్లాలో సోడాయాష్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వచ్చే ఆరు నెలల్లో ప్లాంట్ నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ ఎండీ ఆర్ఎస్ జలాన్ ప్రకటించారు. ఇది పూర్తయితే సోడాయాష్ తయారీ సామర్థ్యం రెట్టింపై 2.3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తికి చేరుకుంటుందని తెలిపారు. 2030 నాటికి 300 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి, ఈ ప్లాంట్ ఏర్పాటు కీలక మద్దతుగా నిలవనుంది. సోలార్ గ్లాస్ తయారీలో సోడాయాష్ ను కీలక ముడి పదార్థంగా వినియోగిస్తుంటారు. ఈ రంగానికి జీహెచ్సీఎల్ ముఖ్య సరఫరాదారుగా ఉండడం గమనార్హం. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిలో అధిక భాగాన్ని కొనుగోలు చేసినట్టు, పర్యావరణ అనుమతులు సహా అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేసినట్టు జలాన్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సోడాయాష్ తయారీ సామర్థ్యం 1.2 మిలియన్ టన్నులుగా ఉండగా, కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్లాంట్లో రెండు దశల్లో కలిపి 1.1 మిలియన్ టన్నుల కొత్త సామర్థ్యం తోడుకానుంది. సోలార్ గ్లాస్ పరిశ్రమ అవసరాలకు.. ముఖ్యంగా సోలార్ గ్లాస్ తయారీ కోసమే రూపొందించిన లార్జ్డెన్స్ సోడాయాష్ ను కొత్త ప్లాంట్లో తయారు చేయనున్నట్టు జలాన్ తెలిపారు. ‘‘119 గిగావాట్ల నుంచి 300 గిగావాట్లకు సోలార్ విద్యుదుత్పాదన పెంచుకోవడం అన్నది మాకు పెద్ద మార్కెట్ను కల్పించనుంది. గణనీయమైన సామర్థ్యంతో డెన్స్ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. కనుక మాకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నాయి’’అని వివరించారు. పర్యావరణ అనుకూలమైన, అధిక ఇంధన సామర్థ్యంతో, అత్యాధునిక సాంకేతికతకు ఈ ప్లాంట్ నిర్మాణంలో వినియోగిస్తున్నట్టు తెలిపారు. కంపెనీ వద్ద రూ.1,000 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయని.. రుణం, ఈక్విటీ జారీ రూపంలో మిగిలిన నిధులను సుమకూర్చుకోనున్నట్టు చెప్పారు. మొత్తం మీద రుణ భారం ఈక్విటీలో 0.6–0.7 రెట్లు మించదన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఎలాంటి రుణ భారం లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశ అవసరాల్లో 20 శాతం మేర సోడాయాష్ ను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా సోడాయాష్ తయారీలో చైనా వాటా 45 శాతంగా ఉంది. భారత్లోకి చౌకగా సోడాయాష్ ను పంపిస్తుండడంతో ఇక్కడి పరిశ్రమల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్సీఎల్ కొత్త ప్లాంట్తో ముందుకు వెళుతోంది. -
హైదరాబాద్ యువతకు ఫ్లిప్కార్ట్ ట్రైనింగ్, ఉద్యోగావకాశాలు
యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ జట్టు కట్టాయి. హైదరాబాద్, బెంగళూరులోని యువతకు ఉద్యోగ నైపుణ్యాల శిక్షణనివ్వడంతో పాటు అవకాశాలను కూడా దక్కించుకోవడంలో తోడ్పాటు అందించనున్నాయి. ఈ ప్రోగ్రాం కింద 540 మందికి ట్రైనింగ్ కల్పించనుండగా, వీరిలో కనీసం 70 శాతం మంది మహిళలు ఉంటారు.సుమారు 380 మంది ట్రైనీలకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) రంగంలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. ఇందులో పాల్గొన్న వారి కుటుంబాలతో పాటు సుమారు 2,700 మందికి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుంది. బీఎఫ్ఎస్ఐ కంటెంట్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలైన అంశాల్లో శిక్షణనిస్తారు.ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్లు ఇదివరకే భాగస్వామ్యంతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అది సత్ఫలితాలను ఇవ్వడంతో మరోసారి యువతకు శిక్షణ ఇచ్చేందుకు సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఈ భాగస్వామ్యంతో గతంలో 546 మంది యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. వీరిలో 73 శాతం మంది అర్థవంతమైన ఉపాధి అవకాశాల నుండి ప్రయోజనం పొందుతున్నారు. నిర్మాణాత్మక పోస్ట్-ప్లేస్మెంట్ ట్రాకింగ్ ద్వారా యువతకు ఉపాధిని మరింత పెంచడం, దీర్ఘకాలిక ఉద్యోగ నిలుపుదల, స్థిరమైన ఆదాయ వృద్ధికి మద్దతు ఇవ్వడం కొత్త ప్రాజెక్ట్ లక్ష్యం. -
రైలు వెనుక 'X' గుర్తు కనిపించకపోతే డేంజరే..!
దేశంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రవాణా సాధనాలు రైళ్లు. సరళమైనవి, సౌకర్యవంతమైనవి, దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటంతో నిత్యం కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. వీటిని భారతీయ రైల్వే నిర్వహిస్తోంది.ఇండియన్ రైల్వే విస్తృత నెట్వర్క్, క్లిష్ట కార్యకలాపాలతోపాటు అనేక విశిష్ట చిహ్నాలు, గుర్తులతో ప్రయాణికులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. అలాంటి ప్రముఖ గుర్తుల్లో ఒకటి, ప్రతి రైలు చివరి కోచ్పై ఉండే బోల్డ్ ‘ఎక్స్’ (X) గుర్తు. మొదటిసారి చూసినప్పుడు ఇది కేవలం డిజైన్ లేదా సాధారణ గుర్తుగా అనిపించవచ్చు. అయితే, ఈ గుర్తు రైలు భద్రత, కార్యకలాపాల సమర్థతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వాస్తవ అర్థం, ఉపయోగాన్ని తెలుసుకోవడం ట్రాక్ నిర్వహణ, రైలు ఆపరేషన్లకు ఎంతో అవసరం.రైలు పూర్తిగా దాటిందని నిర్ధారణచివరి కోచ్పై ఉన్న "X" గుర్తు ప్రధానంగా రైలు పూర్తిగా స్టేషన్ గుండా దాటిందని రైల్వే సిబ్బందికి తెలియజేస్తుంది. ఇది ఒక దృశ్య సూచనగా పని చేస్తూ, అన్ని కోచ్లు పూర్తిగా వెళ్లిపోయాయని నిర్ధారించడంలో సహాయపడుతుంది. రాత్రి సమయంలో లేదా దృష్టి మందగించే వాతావరణంలో ఇది మరింత కీలకంగా మారుతుంది. కేవలం సిగ్నళ్లపై ఆధారపడటం చాలనిపించినా ఈ "X" మార్కింగ్ అదనపు భద్రతా పొరగా నిలుస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపుకొన్నిసార్లు అరుదైన సంఘటనల్లో, ఒక కోచ్ రైలు నుండి వేరు కావచ్చు. అలాంటి సందర్భంలో, రైలు చివరి కోచ్పై "X" గుర్తు కనపడకపోతే, అది తక్షణమే ఒక హెచ్చరికగా మారుతుంది. దీనివల్ల రైల్వే అధికారులు సమస్యను వెంటనే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ప్రమాదాలను నివారించడంలో, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను పరిరక్షించడంలో కీలకంగా ఉంటుంది. -
అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?
పండుగలు, పబ్బాలు అనగానే ఇంటిని శుభ్రం చేసుకోవడం, అలంకరించుకోవడం మొదలు పూజలు, పిండివంటలు అబ్బో ప్రతీ ఇంట్లోనూ ఈ హడావిడి మామూలుగా ఉండదు. సామాన్యుల నుంచి కుబేరుల దాకా ఈ సందడి ఉంటుంది. ఇక వెలుగుల పండుగ దీపావళి అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. దీపావళి వేడుకలు, భారతదేశంలో అత్యంత ధనిక కుటుంబం అనగానే మొదటగా రిలయన్స్ అంబానీ ఫ్యామిలీ గుర్తొస్తుంది. మరి అంబానీ కుటుంబంలో వంటలు ఎవరు చేస్తారు? అసలు అక్కడ ఫుడ్ మెనూ ఎవరు ప్రిపేర్ చేస్తారు. వంటింట్లో ఎవరి ప్రాముఖ్యత ఎంత?ముంబైలోని అతి విలాసవంతమైన భవనం, ముఖేష్ అంబానీ ఉండే భవనం ‘యాంటిలియా’లో వందలాది మంది సిబ్బంది పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉంటారు. మరి అలాంటి ఇంట్లో వంటింటి పెత్తనం ఎవరిది అనేది ఇపుడు చర్చ. రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ముఖేష్, నీతా దంపతులకు ముగ్గురు సంతానం, ఆకాష్,అనంత్, ఇషా. కూతురు పెళ్లి అయ్యి అత్తవారింటికి వెళ్లింది. ఇక ఇద్దరు కొడుకులు, కోడళ్లతో నివసించే ఉమ్మడి కుటుంబం. అలాగే రిలయన్స్ ఫౌండర్ దివంగత ధీరూభాయ్ అంబానీ సతీమణి, ముఖేష్ తల్లి కూడా వీరితోపాటే ఉంటారు. చదవండి: Diwali 2025 : ఈవస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనక వర్షం!Radhika Merchant Vs Sloka Mehta ఈ ఉమ్మడి కుటుంబంలో కిచెన్ బాధ్యత ఎవరిదన్న కుతూహలం అందరిలో ఉంటుంది. పెద్ద కోడలు శ్లోక మెహతా, చిన్నకోడలు రాధికా మర్చంట్ మధ్య చాలా సఖ్యత ఉంటుందట. అంబానీ కుటుంబం శాఖాహారులు. తాజా వార్తల ప్రకారం పెద్ద కోడలు శ్లోక మెహతా రోజువారీ మెనూను నిర్ణయిస్తారు. శ్లోకకు కుటుంబ సంప్రదాయాలు ఆహార ప్రాధాన్యతలు బాగా తెలుసు. ఆమె వంట గదిని పర్యవేక్షిస్తుంది. కుటుంబం, అతిథులు, పండుగలు, విందు భోజనాలను ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. రాధిక మర్చంట్ ఇటీవల అంబానీ కుటుంబంలో చేరిన నేపథ్యంలో ఇంటి పద్ధతులను ఆచారాలను ఇపుడిపుడే అవగాహన చేసుకుంటోంది. సంప్రదాయాలను నేర్చుకుంటోంది. కుటుంబ కార్యక్రమాలతో పాటు వివిధ ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తూ ముద్దుల కోడలు అనిపించుకుంటోంది.(బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు )కాగా అంబానీలు ఆరోగ్యకరమైన, సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. ముఖేష్ అంబానీ ఇంట్లో వండిన భోజనాన్ని ఇష్టపడే స్వచ్ఛమైన శాఖాహారి. క్షణాల్లో వంటకాలను తయారు చేసి, వేడిగా వడ్డించేందుకు చెఫ్లు రెడీగా అందుబాటులో ఉంటారు. దీనికితోడు అప్పుడప్పుడు హోటళ్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ముఖ్యంగా ఆదివారాల్లో ముంబైలోని 'మైసూర్ కేఫ్' నుంచి కూడా ఆర్డర్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మొరింగా సాగుతో.. రూ. 40 లక్షల టర్నోవర్ -
ఈ కంపెనీ దీపావళికి ఇచ్చిన గిఫ్ట్లు చూశారా..?
దీపావళి.. దేశంలో అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన్ని పుస్కరించుకుని దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు బోనస్లు, బహుమతులు (Diwali Gifts) ఇస్తుంటాయి. కొన్ని సంస్థలు కేవలం స్వీట్ బాక్స్ లతోనే సరిపెట్టేస్తుంటాయి. మరి కొన్ని కంపెనీలు అయితే అవి కూడా లేకుండా ఉద్యోగులకు వట్టి చేతులు చూపిస్తుంటాయి. కేవలం కొన్ని కంపెనీలే తమ ఉద్యోగులకు గుర్తుండిపోయేలా బహుమతులిచ్చి ఆశ్చర్యపరుస్తుంటాయి.భారతీయ టెక్నాలజీ సంస్థ ఇన్ఫో ఎడ్జ్ (Info Edge) తన ఉద్యోగులకు ఇచ్చిన దీపావళి బహుమతులపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఉద్యోగులు స్వయంగా చిత్రీకరించిన అనేక ఇన్స్టాగ్రామ్ రీల్స్ వైరల్ అవుతున్నాయి, సంస్థ వారికిచ్చిన రిచ్ గిఫ్ట్ హ్యాంపర్స్ను హైలైట్ చేస్తున్నాయి.వీడియోలలో ప్రతి ఉద్యోగి తమ వర్క్స్టేషన్ వద్దకు రాగానే, వీఐపీ బ్రాండెడ్ సూట్కేస్, స్నాక్స్ బాక్స్, సాంప్రదాయ దీపం (దియా) అమర్చి ఉండటం కనపడుతోంది. ఆఫీసు అంతటా పండుగ శోభను సంతరించుకుని, డెస్కులు అందంగా అలంకరించి ఉన్నాయి.వైరల్గా మారిన దీపావళి గిఫ్ట్ రీల్స్తమ సంస్థ ఇచ్చిన గిఫ్ట్లను చూపుతూ ఉద్యోగులు చేసిన రీల్స్ సోషల్ మీడియా లో వైరల్గా మారాయి. ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తీసిన వీడియోలలో, బహుమతులను చూస్తూ వారు ఆశ్చర్యపోతున్న క్షణాలు బంధించారు. కొన్ని క్లిప్లలో ఉద్యోగులు సూట్కేస్ తెరిచి చూపించారు. లోపల మరొక చిన్న సూట్కేస్ ఉంది. అలాగే స్నాక్స్ బాక్స్ లను అన్బాక్స్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడాది కూడా ఈ సంస్థ ఉద్యోగులకు ఎయిర్ఫ్రైయర్లు బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు.నెటిజన్ల స్పందనలుఈ వీడియోలు వైరల్ కావడంతో, సోషల్ మీడియా కామెంట్లు వ్యంగ్యంతో పాటు అసూయతో నిండిపోయాయి. “నేను నా ఆఫీస్ నుండి వచ్చిన కాజు బర్ఫీ బాక్స్ని చూస్తూ ఈ వీడియోను చూస్తున్నాను” ఒకరు కామెంట్ చేయగా “దీనిని నా మేనేజర్కి చూపించాను. ఆయన ఇది ఏఐ అన్నాడు!” మరో వ్యక్తి హాస్యంగా కామెంట్ చేశారు.కంపెనీ గురించి..ఇన్ఫో ఎడ్జ్ సంస్థను 1995లో సంజీవ్ బిఖ్చందానీ స్థాపించారు. ఇది నౌకరి, 99ఎకర్, జీవన్ సాథీ, శిక్షిక.కామ్ వంటి ప్రధాన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను నిర్వహిస్తోంది. అలాగే, పలు స్టార్ట్అప్లలో కూడా పెట్టుబడులు పెట్టింది. సంస్థ ప్రధాన కార్యాలయం నోయిడాలో ఉంది.ఇదీ చదవండి: ఈ కంపెనీల్లో కెరియర్కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్ -
లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా 2025: టాప్లో జెప్టో
లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా 2025 జాబితాలో క్విక్ కామర్స్ ప్లాట్ఫాం జెప్టో అగ్రస్థానంలో నిల్చింది. జెప్టో నంబర్ వన్ స్థానంలో నిలవడం వరుసగా ఇది మూడో ఏడాది. తర్వాత స్థానంలో ఎంటర్ప్రైజ్ స్టోరేజ్ సంస్థ లూసిడిటీ, 10 మినిట్స్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విష్ మూడో స్థానంలో నిల్చాయి. హైదరాబాదీ స్టార్టప్ సంస్థ భాంజూ ఏడో ర్యాంకు దక్కించుకుంది.ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగంపై ఆసక్తి, ప్రతిభావంతులను ఆకర్షించగలిగే సామర్థ్యం తదితర అంశాల ప్రాతిపదికన లింక్డిన్ ఈ జాబితాను రూపొందించింది. ప్రారంభించి అయిదేళ్లు మించకుండా, భారత్లో ప్రధాన కార్యాలయం, కనీసం 30 మంది ఉద్యోగులు కలిగి ఉండి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న సంస్థలను దీని కోసం పరిగణనలోకి తీసుకున్నారు. 2024 జూలై 2 నుంచి 2025 జూన్ 30 వరకు డేటా ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. వివిధ కేటగిరీలలో కార్యకలాపాలు సాగిస్తున్న టాప్ మూడు సంస్థలు వేగంగా వృద్ధి చెందుతూ, కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తున్నాయని లింక్డిన్ తెలిపింది. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు క్విక్ కామర్స్, ఏఐ-నేటివ్ ప్లాట్ఫాంలు, స్పెషలైజ్డ్ ఫిన్టెక్ సంస్థలు కీలక చోదకాలుగా నిలుస్తున్న తీరు జాబితాతో వెల్లడైంది.లిస్టు ప్రకారం..వీక్డే (4వ ర్యాంకు), కాన్విన్ (6), లైమ్చాట్ (19) తదితర ఏఐ స్టార్టప్లు.. జార్ (5వ స్థానం), కార్డ్91 (18), డెజర్వ్ (16) ఫిన్టెక్ సంస్థలు టాప్ 20 జాబితాలో నిల్చాయి.టాప్ 20లో తొమ్మిది స్టార్టప్లకు కేంద్రంగా నిలుస్తూ అంకురాల రాజధానిగా బెంగళూరు అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. జెప్టో, స్విష్, లూసిడిటిలాంటి సంస్థలు నగరం నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి.ఢిల్లీ, ముంబై నుంచి రెండు చొప్పున లిస్టులో చోటు దక్కించుకున్నాయి. పుణెకి చెందిన ఈమోటోర్యాడ్ 9వ ర్యాంకులో నిలిచింది. -
వేలాది ఉద్యోగాల కోత!.. తాజాగా అమెజాన్
2025 ప్రారంభం నుంచి అనేక దిగ్గజ కంపెనీలు.. తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా చేరింది. సంస్థ దాదాపు 15 శాతం ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తున్నట్లు.. ఫార్చ్యూన్ తన నివేదికలో వెల్లడించింది.అమెజాన్ కంపెనీ.. తొలగించనున్న ఉద్యోగులలో పీపుల్ ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ టీమ్ (PTX) అని పిలువబడే హెచ్ఆర్ విభాగం నుంచి ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. కాగా ఇతర విభాగాల్లో కూడా ఉద్యోగుల తొలగింపు ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు అనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.అమెజాన్ హెచ్ఆర్ విభాగంలో.. ప్రపంచ వ్యాప్తంగా 10,000 మందికంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలలో భారీ పెట్టుబడుల మధ్య తన ఖర్చులను తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున.. కంపెనీ సిబ్బందిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.ఐటీ ఉద్యోగుల తొలగింపులుఏఐ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో.. కంపెనీలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి & ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నాయి.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): టీసీఎస్ కంపెనీ రెండు సార్లు సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులలో 2 శాతం అని తెలుస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలు, ఏఐ విస్తరణల మధ్యసంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో పెద్దమొత్తంలో ఉద్యోగుల తొలగింపు చేపట్టింది.విప్రో: విప్రో విషయంలో.. తొలగింపులకు సంబంధించిన అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, టెక్ రంగంలో దాని వ్యయ సామర్థ్యం, ఉత్పాదకతను మెరుగుపరచడానికి 24,516 ఉద్యోగాలను తగ్గించిందని కొన్ని నివేదికలు వెల్లడించాయి.మైక్రోసాఫ్ట్ కంపెనీ సుమారు 40% కంటే ఎక్కువ లేదా దాదాపు 4,000 ఉద్యోగాలను తగ్గించినట్లు సమాచారం. గూగుల్ (100 మంది), యాక్సెంచర్ (ప్రపంచ వ్యాప్తంగా 11000 మంది), సేల్స్ఫోర్స్ (సుమారు 4000 మంది), ఐబీఎమ్ (1000 మంది), కాగ్నిజెంట్ (3500 మంది) వంటి కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తొలగించాయి.ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ యూఎస్ వ్యాపారం నుంచి ఒత్తిడి & పెరిగిన H-1B వీసా రుసుము వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని కంపెనీలు మానవ శ్రామిక శక్తి కంటే ఉత్పాదకత మరియు సామర్థ్యాన్ని పెంచడానికి ఇష్టపడే కృత్రిమ మేధస్సు ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయడానికి సుముఖత చూపుతున్నాయి.ఇదీ చదవండి: మరోమారు స్పెషల్ ఆఫర్: రూ. 1తో నెల రోజులు ఫ్రీ! -
జీసీసీల్లో హైరింగ్ జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీక్వెన్షియల్గా జూన్ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో హైరింగ్ 5–7 శాతం పెరగడం దీనికి నిదర్శనం. ఏఐ–డేటా, ప్లాట్ఫాం ఇంజినీరింగ్, క్లౌడ్, ఫిన్ఆప్స్, సైబర్సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ నెలకొంది. క్వెస్ కార్ప్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), తయారీ, ఆటోమోటివ్, ఎనర్జీ, టెక్నాలజీ, హార్డ్వేర్ మొదలైన రంగాలు జీసీసీల వృద్ధికి కీలకంగా ఉంటున్నాయి. భారత్లో జీసీసీల పరిణామక్రమం ప్రస్తుతం అత్యంత వ్యూహాత్మక దశలోకి ప్రవేశిస్తోందని క్వెస్ కార్ప్ సీఈవో (ఐటీ స్టాఫింగ్) కపిల్ జోషి తెలిపారు. నియామకాలకు కేటాయించే బడ్జెట్లు ప్రధానంగా ఆదాయార్జన, సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టే విధంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్లో సుమారు 1,850 జీసీసీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 20 లక్షల మంది పైగా ప్రొఫెషనల్స్ ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 25 లక్షలకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. నివేదికలో మరిన్ని విశేషాలు .. → ఏఐ, డేటా సైన్స్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు ఎనిమిది శాతం పెరగ్గా, ఫిన్ఆప్స్ ఆధారిత క్లౌడ్ సేవల విభాగంలో హైరింగ్ 6 శాతం పెరిగింది. → హైదరాబాద్, బెంగళూరులాంటి ప్రథమ శ్రేణి మెట్రో నగరాలు ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు కీలకంగా నిలుస్తున్నాయి. ఇక కోయంబత్తూరు, కొచ్చి, అహ్మదాబాద్లాంటి ద్వితీయ శ్రేణి హబ్లలో త్రైమాసికాలవారీగా నియామకాలు 8–9 శాతం పెరిగాయి. తక్కువ వ్యయాలతో సరీ్వసులను అందించేందుకు తోడ్పడే కేంద్రాలుగా ఇలాంటి నగరాలు ఎదుగుతున్నాయి. → ఏఐ–డేటాలో అత్యధికంగా 41 శాతం స్థాయిలో నిపుణుల కొరత ఉంది. ప్లాట్ఫాం ఇంజినీరింగ్ (39 శాతం), క్లౌడ్–ఇన్ఫ్రాస్ట్రక్చర్ (25 శాతం), సైబర్సెక్యూరిటీ (18 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దీనితో, హైరింగ్ ప్రక్రియలో, ముఖ్యంగా ప్రథమ శ్రేణి నగరాల వెలుపల, మిడ్–సీనియర్ హోదాల్లో నియామకాల్లో జాప్యం జరుగుతోంది. → జూలై–సెప్టెంబర్ వ్యవధిలో జీసీసీల్లో నియామకాలకు సంబంధించి దక్షిణాది మెట్రో నగరాలు ముందు వరుసలో ఉన్నాయి. 26 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిలి్చంది. తర్వాత స్థానాల్లో హైదరాబాద్ (22 శాతం), పుణె (15 శాతం), చెన్నై (12 శాతం) ఉన్నాయి. → బెంగళూరులో ఎక్కువగా అడ్వాన్స్డ్ ఏఐ, ఫిన్ఆప్స్ ఉద్యోగాలకు, హైదరాబాద్లో మలీ్ట–క్లౌడ్ ఇంటిగ్రేషన్ సంబంధ కొలువులకు డిమాండ్ నెలకొంది. పుణె, చెన్నైలో ఆటోమోటివ్ సాఫ్ట్వేర్, ప్లాట్ఫాం ఇంటిగ్రేషన్ మొదలైన విభాగాల్లో నిపుణులకు డిమాండ్ ఉంది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్లో కన్సాలిడేటెడ్ నికర లాభం 25 శాతం క్షీణించి రూ. 5,528 కోట్లకు పరిమితమైంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంట రుణాలపై రూ. 1,231 కోట్ల ప్రొవిజన్లు చేపట్టడం ప్రభావం చూపింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 26 శాతం నీరసించి రూ. 5,090 కోట్లకు చేరింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,918 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 2 శాతం నామమాత్ర వృద్ధితో రూ. 13,745 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.99 శాతం నుంచి 3.73 శాతానికి బలహీనపడ్డాయి. ట్రేడింగ్ ఆదాయం 55 శాతం తగ్గడంతో ఇతర ఆదాయంలోనూ 1 శాతం కోతపడి రూ. 6,625 కోట్లకు పరిమితమైంది. ప్రొవిజన్లు రూ. 2,204 కోట్ల నుంచి రూ. 3,547 కోట్లకు పెరిగాయి. రెండు రకాల పంట రుణ ప్రొడక్టులను నిలిపివేయడం ఇందుకు కారణమైంది. 10 లక్షల క్రెడిట్ కార్డులు: త్రైమాసికవారీగా యాక్సిస్ బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.57 శాతం నుంచి 1.46 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో 10 లక్షల క్రెడిట్ కార్డులను విక్రయించింది. కనీస మూలధన నిష్పత్తి 16.55 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో యాక్సిస్ ఫైనాన్స్ నికర లాభం తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో రూ. 327 కోట్ల నుంచి రూ. 385 కోట్లకు బలపడింది. యాక్సిస్ ఫైనాన్స్ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు. దీంతో లిస్టింగ్ చేపట్టవలసి ఉంటుందని తెలియజేశారు.ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 1,169 వద్ద ముగిసింది. -
హ్యుందాయ్ పెట్టుబడుల ధమాకా!
ముంబై: కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్) దేశీయంగా భారీ పెట్టుబడులకు తెరతీస్తోంది. దక్షిణ కొరియా మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ కో ప్రెసిడెంట్, సీఈవో జోస్ మునోజ్ 2030కల్లా దేశీ యూనిట్ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా హ్యుందాయ్ కార్ల తయారీ, అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా రెండోపెద్ద కేంద్రంగా భారత్ నిలవనున్నట్లు తెలియజేశారు. భారత్లో తొలిసారి పర్యటిస్తున్న మునోజ్ ఎగుమతుల్లో హెచ్ఎంఐఎల్ వాటా 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా వృద్ధి లక్ష్యాలలో భాగంగా కంపెనీ ఆదాయాన్ని సైతం 1.5 రెట్లు పెంచుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించే ప్రణాళికల్లో ఉన్నట్లు హెచ్ఎంఐఎల్ ఎండీ అన్సూ కిమ్ తెలియజేశారు. ఇందుకు వీలుగా 2030కల్లా 26 ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. వీటిలో 7 కొత్త ప్రొడక్టులకు కంపెనీ తెరతీయనుంది. తద్వారా ఎంపీవీ, ఆఫ్రోడ్ ఎస్యూవీ విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటితోపాటు 2027కల్లా స్థానికంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీని దేశీ మార్కెట్కోసం తయారు చేసే లక్ష్యంతో ఉంది. ఈ బాటలో లగ్జరీ విభాగ బ్రాండ్ జెనిసిస్ను దేశీయంగా 2027కల్లా విడుదల చేయాలని ఆశిస్తోంది. మూడు దశాబ్దాలు దేశీయంగా మూడు దశాబ్దాల విజయం తరువాత గతేడాది ఐపీవో ద్వారా కంపెనీ లిస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి దశ వృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నట్లు మునోజ్ కంపెనీ తొలిసారి నిర్వహించిన ఇన్వెస్టర్ డే సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 2030కల్లా రూ. 45,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల్లో 60 శాతం ప్రొడక్ట్, ఆర్అండ్డీపైనా.. మిగిలిన 40 శాతం సామర్థ్య విస్తరణ, అప్గ్రెడేషన్ కోసం వినియోగించనున్నట్లు వివరించారు. అమ్మకాలరీత్యా ప్రస్తుతం హ్యుందాయ్కు భారత్ మూడో పెద్ద మార్కెట్గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా విజన్కు అనుగుణంగా ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా భారత్ను అభివృద్ధి చేయనున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. కాగా.. కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ 2026 జనవరి 1నుంచి ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలిసారి భారతీయ వ్యక్తికి సారథ్యం అప్పగించడమనేది మాతృ సంస్థకు దేశీ కార్యకలాపాలపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. హ్యుందాయ్ క్యాపిటల్ దేశీయంగా 2026 రెండో త్రైమాసికం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు.చిన్న కార్లు వీడేదిలేదు దేశీయంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఉన్నదని మునోజ్ పేర్కొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అప్గ్రేడ్ కావడానికి వీలయ్యే చిన్న కార్ల విభాగాన్ని వీడబోమని స్పష్టం చేశారు. ఎంట్రీలెవల్ కస్టమర్లు తదుపరి దశలో అప్గ్రేడ్ అయ్యేందుకు వీలయ్యే ప్రొడక్టులపైనా దృష్టి కొనసాగించనున్నట్లు తెలియజేశారు. భారత్ను రెండు మార్కెట్లుగా పేర్కొనవచ్చని, గ్లోబల్ మార్కెట్ల తరహాలో మరిన్ని ఎస్యూవీలు, ఆఫ్రోడ్ వాహనాలకు వీలున్నట్లే మరోపక్క ఎంట్రీలెవల్ కార్లకు డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
ఈ కంపెనీల్లో కెరియర్కు తిరుగులేదు! లింక్డ్ఇన్ లేటెస్ట్ లిస్ట్
ప్రపంచపు అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన లింక్డ్ఇన్ (LinkedIn).. 2025 లింక్డ్ఇన్ టాప్ స్టార్టప్స్ ఇండియా జాబితాను (2025 LinkedIn Top Startups India List) ప్రకటించింది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగ ఆసక్తి, ఎంగేజ్మెంట్, అగ్రశ్రేణి ప్రతిభ ఆకర్షణ వంటి సూచకాలపై ఆధారపడి రూపొందించిన ఈ జాబితా.. వేగంగా ఎదుగుతున్న, అభివృద్ధికి అనుకూలమైన స్టార్టప్లను హైలైట్ చేస్తుంది.అగ్రస్థానాల్లో నిలిచిన స్టార్టప్స్క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో (Zepto) వరుసగా మూడవ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఎంటర్ప్రైజ్ క్లౌడ్ స్టోరేజ్ సంస్థ లూసిడిటీ రెండో స్థానంలో, బెంగళూరుకు చెందిన 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేసే ప్లాట్ఫామ్ స్విష్ మూడో స్థానాన్ని పొందాయి. ఈ సంస్థలు విభిన్న రంగాల్లో పని చేస్తున్నప్పటికీ, వేగవంతమైన వృద్ధి, టెక్నాలజీలో లోతు, కేటగిరీ సృష్టిలో చురుకుదనంతో నిలిచాయి.ప్రాంతీయ ప్రాముఖ్యతబెంగళూరుకు చెందిన 9 స్టార్టప్స్ టాప్ 20లో చోటు దక్కించుకోగా, ఢిల్లీ, ముంబై ఆధారిత అంకుర సంస్థలు చెరో 2 జాబితాలో చేరాయి. ఇక పుణె(EMotorad), హైదరాబాద్ (Bhanzu) వంటి నగరాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.2025 టాప్ 20 స్టార్టప్స్ జాబితాజెప్టోస్విష్వీక్డేజార్కాన్విన్భాన్జురిఫైన్ ఇండియాఈమోటోరాడ్అట్లిస్ఇంటర్వ్యూ.ఐఓబ్లిస్ క్లబ్ఫస్ట్ క్లబ్స్నాబిట్గోక్విక్డెజెర్వ్న్యూమెకార్డు 91లైమ్ చాట్యాప్స్ ఫర్ భారత్ఉద్యోగ అవకాశాల కోసం చిట్కాలు ఈ జాబితా యువతకు కెరీర్ ఎంపికల్లో స్పష్టతనిచ్చే గైడ్గా నిలుస్తోంది. వేగంగా ఎదుగుతున్న సంస్థలను ఎలా ఎంచుకోవాలో, వాటిలో ఎలా ఉద్యోగం పొందాలో కొన్ని చిట్కాలను లింక్డ్ఇన్ ఇండియా సీనియర్ ఎడిటర్ నిరజితా బెనర్జీ అందించారు. అవి.. * స్టార్టప్ స్కేలింగ్ ట్రెండ్లను గమనించండి* వ్యవస్థాపకుల పట్ల విశ్వాసం, వ్యూహాలను పరిశీలించండి* ఆవిష్కరణతో పాటు కార్యాచరణలో నైపుణ్యం ఉన్న కంపెనీలను ఎంచుకోండి* మార్కెట్ విస్తరణ, ప్రొడక్ట్-మార్కెట్ ఫిట్ను అంచనా వేయండి -
వాళ్లు ఇస్తున్న సబ్సిడీలు అన్యాయం: భారత్పై చైనా ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ ఉత్పత్తి రంగాలలో భారత్ అందిస్తున్న సబ్సిడీలు (EV Battery Subsidies) దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా లాభాన్ని కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ చైనా (China) బుధవారం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద ఫిర్యాదు చేసింది. చైనా చేసిన ఫిర్యాదు వివరాలను త్వరలో పరిశీలిస్తామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.భారత్ ‘ నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్ పైల్’ (NCMS) కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిసిన వెంటనే చైనా ఈ ఫిర్యాదు చేసింది. ఈ స్కీం లక్ష్యం అరుదైన భూ మూలకాలు (rare earth elements) వంటి కీలక ఖనిజాల లభ్యతను మెరుగుపరచడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం. ఈ మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఇతర గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు కీలకం కావటంతో, వాటి ఎగుమతిపై ఆంక్షలు విధించాలని చైనా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.ఇతర దేశాలపైనా..చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్తో పాటు తుర్కియే, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఈ తరహా ఫిర్యాదులు డబ్ల్యూవో వద్ద నమోదయ్యాయి. డబ్ల్యూవో నిబంధనల ప్రకారం మొదటి దశలో చర్చల ద్వారానే వివాద పరిష్కారం వెతకాలి. చర్చలు ఫలితం ఇవ్వకపోతే, సమస్యపై తీర్పునిచ్చే ప్యానెల్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.ఈ విషయంపై స్పందించిన భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్.. చైనా సమర్పించిన వివరాలను త్వరలో అధ్యయనం చేస్తామని తెలిపారు. చర్చలతో పరిష్కారం సాధించే దిశగా భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.ఇక వాణిజ్య సంబంధాల పరంగా చైనా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే 2023-24లో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాతో దిగుమతులు 11.52% పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
‘ఐయామ్ సారీ.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటా..’
జోహో సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా కొన్ని రోజులు దూరంగా ఉంటానని ప్రకటించారు. కంపెనీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కొన్ని కోడ్లను మరింత సమర్థవంతంగా సృష్టించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇటీవల కాలంలో ఎక్స్ వంటి సామాజిక మధ్యమాల్లో చాలా చురుకుగా ఉన్న వెంబు తాను రన్ చేయాలనుకునే కొన్ని కోడ్లను మెరుగుపరిచేందుకు కొంతకాలం ఆన్లైన్ ఎంగేజ్మెంట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పనిలో నాణ్యత ముఖ్యమని చెప్పడం కంటే మనమే ఆ పనిని సమర్థంగా చేసి చూపించాలన్నారు. తన సోషల్ మీడియా అనుచరులకు ఇలా కఠినమైన పరిమితిని విధించవలసి వచ్చినందుకు చింతిస్తున్నానని చెప్పారు.ఇటీవల కాలంలో కంపెనీ తయారు చేసిన దేశీయ ఆన్లైన్ కమ్యునికేషన్ ప్లాట్ఫామ్ అరట్టై యాప్కు ఆదరణ పెరుగుతోంది. ఆ యాప్ను ఉపయోగించాలని పలువురు మంత్రులు, వ్యవస్థాపకులు, సీఈఓలు పిలుపునిచ్చారు. దీంతో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేవారు సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ & యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.అరట్టై అంటే.. తమిళంలో సరదాగా ముచ్చటించుకోవడం అని అర్థం. దీనిని జోహో సంస్థ.. వాట్సప్కు పోటీగా అభివృద్ధి చేసింది. ఇది వాట్సప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కలిగి ఉంది. దీనికి అశ్వినీ వైష్ణవ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ వంటి కేంద్రమంత్రులు కూడా మద్దతు ప్రకటించారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా కూడా తాను అరట్టై డౌన్లోడ్ చేసుకున్నానంటూ ట్వీట్ చేశారు.అరట్టై.. వాట్సప్ మధ్య తేడాలుఅరట్టై.. వాట్సాప్ రెండూ మెసేజింగ్ యాప్స్ అయినప్పటికీ, అరట్టైలో కొన్ని అదనపు ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ గురించి జోహో సీఈఓ శ్రీధర్ వెంబు గత కొన్ని రోజులుగా తన ఎక్స్ ఖాతాలో చెబుతూనే ఉన్నారు.అరట్టై ఆండ్రాయిడ్ టీవీలతో సహా విస్తృత శ్రేణి పరికరాలకు యాక్సెస్ను అందిస్తుంది. అయితే వాట్సాప్ ప్రస్తుతం వీటికి మద్దతు ఇవ్వదు. వినియోగదారులు తమ అరట్టై ఖాతాను ఒకేసారి ఐదు పరికరాల్లో ఉపయోగించవచ్చు.అరట్టైలో పాకెట్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, నోట్స్, రిమైండర్లు, ఇతర ఫైల్లను స్టోర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాట్సాప్లో ఈ ఫీచర్ లేదు. అయితే, వాట్సాప్ 'యు' చాట్ విండోను అందిస్తుంది, ఇక్కడ వినియోగదారులు తమతో తాము చాట్ చేసుకోవచ్చు, కావలసినవి సేవ్ చేసుకోవచ్చు.అరట్టై యాప్.. తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లు & పాత 2G/3G నెట్వర్క్లలో కూడా సజావుగా పనిచేసేలా రూపొందించబడింది. ఇది గ్రామీణ వినియోగదారులకు, బడ్జెట్ పరికరాలను కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా అరట్టైలో యూపీఐ చేయడానికి కూడా జోహో సిద్ధమవుతోంది. దీనికోసం ఐస్పిరిట్ గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా? -
టెక్ దిద్దే కొలువులు!
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో నాలుగు కొత్త టెక్నాలజీలు అంతర్జాతీయంగా ఉద్యోగాల మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), రోబోటిక్స్, అడ్వాన్స్డ్ ఎనర్జీ సిస్టమ్స్, సెన్సార్ నెట్వర్క్స్ వీటిలో ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఉద్యోగులు పని చేసే ఏడు కీలక రంగాలపై వీటి ప్రభావం గణనీయంగా ఉండనుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వ్యవసాయం, తయారీ, నిర్మాణం, హోల్సేల్..రిటైల్ వాణిజ్యం, రవాణా.. లాజిస్టిక్స్, బిజినెస్..మేనేజ్మెంట్, హెల్త్కేర్ మొదలైనవి ప్రభావిత రంగాల జాబితాలో ఉంటాయి.నవీన టెక్నాలజీలతో ఈ రంగాల్లో ఉత్పాదకత పెంచుకునేందుకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఉత్పాదకతను పెంచుకోవాలంటే, రిసు్కలను అదుపులో ఉంచుకోవాలంటే ప్రభుత్వాలు, పరిశ్రమ, డెవలపర్లు సమష్టిగా పని చేయాల్సి రానుంది. పెట్టుబడుల కోసం మూలధనాన్ని సమకూర్చుకోవడం, గ్లోబల్గా టెక్నాలజీ వినియోగాన్ని విస్తృత స్థాయిలో పెంచడం, అందరికీ సాంకేతికత అందుబాటులోకి వచ్చేలా చూడటంలాంటి అంశాలు కీలకంగా ఉంటాయని నివేదిక వివరించింది.‘ఇప్పుడు, రాబోయే రోజుల్లో తీసుకోబోయే నిర్ణయాలపై భవిష్యత్తులో టెక్నాలజీ బాటను నిర్దేశిస్తుంది. సానుకూల ఫలితాలను సాధించాలంటే, ఏయే టెక్నాలజీలు, ఏడు కీలక రంగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలవనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం‘ అని డబ్ల్యూఈఎఫ్ హెడ్ టిల్ లియోపాల్డ్ తెలిపారు. నివేదికలో మరిన్ని అంశాలు.. ⇒ డెస్క్ ఉద్యోగాల్లోనే కాకుండా ఇతరత్రా కొలువుల్లోనూ కొత్త టెక్నాలజీలు గణనీయంగా మార్పులు తెస్తున్నాయి. డ్రోన్ టెక్నాలజీతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పట్టణ ప్రాంతాల్లో డెలివరీలు చేస్తుండగా, ఘనా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్య పరికరాలను చేరవేస్తున్నారు. ⇒ పలు ఆఫ్రికన్ దేశాల్లో రూఫ్టాప్ పునరుత్పాదక విద్యుత్ సిస్టమ్లు అందుబాటులోకి రావడంతో, కరెంటు కోతల వల్ల సిబ్బందిని ఇంటికి పంపించివేయాల్సిన పరిస్థితి తగ్గుతోంది. దీంతో పని వేళల్లో స్థిరత్వం వచి్చంది. అలాగే ఈ విద్యుత్ వ్యవస్థను నిర్వహించే నిపుణులకు డిమాండ్ ఏర్పడింది. ⇒ విద్యుదుత్పత్తి, నిల్వ చేసే టెక్నాలజీలు ఇటు హోల్సేల్ అటు రిటైల్ వ్యాపార సిబ్బంది పనితీరును కూడా మెరుగుపరుస్తున్నాయి. దక్షిణాఫ్రికా, నైజీరియా, భారత్లాంటి దేశాల్లో టోకు వర్తకులు రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీలను ఉపయోగిస్తూ కరెంటు కోతలను అధిగమిస్తున్నారు. డీజిల్ వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో ఎనర్జీ సిస్టం మానిటరింగ్, రిఫ్రిజిరేషన్ మేనేజ్మెంట్లాంటి విభాగాల్లో కొలువులు ఏర్పడుతున్నాయి. ⇒ హోల్సేల్, రిటైల్ వ్యాపారంలో క్లిక్–అండ్–కలెక్ట్ (ఆన్లైన్లో ఆర్డరు పెట్టి, పికప్ పాయింట్లో సరుకులు తీసుకోవడం) ప్రక్రియలో ఏఐని వినియోగిస్తుండటం వల్ల ఆఫ్రికా, భారత్, లాటిన్ అమెరికాలో ఉద్యోగాల స్వరూపంలో మార్పులు వస్తున్నాయి. ⇒ సెమీ–ఆటోమేటెడ్ నిర్మాణ యంత్రాల వల్ల ఉద్యోగులకు శారీరక శ్రమ భారం తగ్గి, భద్రత పెరుగుతోంది. ఏఐ డేటా ప్రాసెసింగ్తో రోబోటిక్స్ను జతపరిస్తే హెల్త్కేర్ రంగంలో పేషంట్ల చికిత్స, ఉద్యోగుల పనితీరు విధానాల్లో సరికొత్త మార్పులు తీసుకురావచ్చు. -
మూడోసారి చంద్రశేఖరన్కే ఓటు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కంపెనీల ప్రమోటర్, ప్రధాన ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్కు చైర్మన్గా మూడోసారి ఎన్.చంద్రశేఖరన్ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తాజాగా టాటా ట్రస్ట్స్ సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టాటా సన్స్ ఈక్విటీ మూలధనంలో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ బోర్డు నియామకాలు, పాలనా సంబంధ అంశాలలో రెండుగా చీలిపోయిన నేపథ్యంలో చంద్రశేఖరన్కు బాధ్యతలు అప్పగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ దాతృత్వ ట్రస్ట్ల సమాహారమైన టాటా ట్రస్ట్స్ చంద్రశేఖరన్వైపు ఎప్పుడు మొగ్గు చూపిందీ వెల్లడికానప్పటికీ దీనిపై టాటా సన్స్ స్పందనను గమనించవలసి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత వారం సమావేశంలో టాటా ట్రస్ట్స్ గత వారం నిర్వహించిన బోర్డు సమావేశంలో సాధారణ అంశాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. 180 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం కలిగిన టాటా సన్స్ కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూసే ఉద్ధేశ్యంతో వివాదాస్పద అంశాల జోలికిపోలేదని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి మూడోసారి చైర్మన్గా చంద్రశేఖరన్కు బాధ్యతలు అప్పగించేందుకు సిఫారసు చేసినట్లు వెల్లడించాయి. దీనిపై టాటా సన్స్ బోర్డు నిర్ణయం తీసుకోవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి.అయితే 65 ఏళ్ల వయసు దాటనున్న చంద్రశేఖరన్ ఎగ్జిక్యూటివ్గా పదవిని నిర్వహిస్తారా లేక టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం నాన్ఎగ్జిక్యూటివ్గా బాధ్యతలు తీసుకుంటారా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. 2022 ఫిబ్రవరిలో ఐదేళ్ల కాలానికి చైర్మన్గా చంద్రశేఖరన్ను రెండోసారి టాటా సన్స్ ఎంపిక చేసుకుంది. దీంతో 2027 ఫిబ్రవరివరకూ ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.అయితే టాటా సన్స్లో 18.4 శాతం వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ కుటుంబం ఈ అంశంపై ఓటింగ్కు దూరంగా ఉండటం గమనార్హం! 2016 అక్టోబర్లో టాటా సన్స్లో చేరిన చంద్రశేఖరన్ 2017 జనవరిలో చైర్మన్గా ఎంపికయ్యారు. తదుపరి అప్పటి చైర్మన్ సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికాక 2017 ఫిబ్రవరిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. -
‘పాన్డబ్బాలో ఆర్థిక పాఠాలు నేర్చుకున్నా’
ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్ ఆంత్రప్రెన్యూర్గా మారారు. తన వ్యాపార ప్రయాణం ఏదో ఫ్యాన్సీ కార్పొరేట్ ఆఫీసుల్లోనో లేదా ప్రముఖ బిజినెస్ స్కూల్స్లోనో మొదలవలేదు. తన కాలేజీ బయట వీధుల్లో పాన్డబ్బా నడుపుతున్న ఒక చిరు దుకాణాదారుడి నుంచి మొదలైందని చెప్పారు. ఇటీవల ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు.‘మా కాలేజీ బయట పాన్డబ్బా, బీడీ స్టాల్ నడుపుతున్న సదా అనే వ్యక్తి నుంచి ఎన్నో వ్యాపార మెలకువలు నేర్చుకున్నాను. సదా నుంచి కేవలం లాభనష్టాల గురించి మాత్రమే కాదు.. డబ్బు నిర్వహణ, చిన్న తరహా పెట్టుబడులు, ఆర్థిక సహకారం..వంటి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. అది మైక్రోఫైనాన్సింగ్కు సంబంధించి ఓ డాల్ఫిన్ వెర్షన్’ అన్నారు. వివేక్ తన పదహారో ఏట స్టాక్ మార్కెట్లో పోర్ట్ఫోలియోను నిర్మించుకున్నారు. ఎక్కువగా కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే ఒక టెక్ స్టార్టప్ను ప్రారంభించారు. 22 సంవత్సరాల వయసులో మంచి లాభంతో దాన్ని ఓ బహుళజాతి సంస్థకు విక్రయించినట్లు తెలిపారు.వ్యూహాత్మక పెట్టుబడులుముంబయిలోని మిథిబాయి కాలేజీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్లో పట్టా పొందిన వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం తన వద్ద ఉన్న సంపదను రెండు భాగాలు విభజించినట్లు గతంలో చెప్పారు. 60 శాతం సంపదను స్థిరంగా ఆదాయం సమకూర్చే విభాగాల్లో పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు. మరో 40 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీ, రియల్ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నట్లు, ఆకర్షణీయ స్టార్టప్ల్లో వెంచర్ క్యాపిటలిస్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో ప్రయోగాత్మక పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.రియల్ ఎస్టేట్: వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో దృష్టి సారించి కర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్థాపించారు.డైమండ్ బిజినెస్: దేశవ్యాప్తంగా 18 స్టోర్లతో సోలిటారియో అనే డైమండ్ కంపెనీని స్థాపించారు.ఈవెంట్ మేనేజ్మెంట్: వివేక్ ‘మెగా ఎంటర్టైన్మెంట్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు.ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్: సుమారు రూ.3,400 కోట్ల (సుమారు 400 మిలియన్ డాలర్లు) విలువైన ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ స్టార్టప్ను ప్రారంభించారు.ఫ్యామిలీ కార్యాలయం: ‘ఒబెరాయ్ ఫ్యామిలీ ఆఫీస్’ ద్వారా పెట్టుబడులను మేనేజ్ చేస్తున్నారు. -
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు..
తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ తమిళనాడులో రూ.15,000 కోట్ల తాజా పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్మెంట్తో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఉద్యోగ కల్పన జరగనుందని కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 14,000 ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ అంచనా వేస్తుంది.ఫాక్స్కాన్ చేయబోయే పెట్టుబడి విలువ ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆర్ అండ్ డీ ఇంటిగ్రేషన్, ఏఐ నేతృత్వంలోని అధునాతన టెక్ కార్యకలాపాలు, బ్యాటరీ టెక్నాలజీలు వంటి అత్యాధునిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీ ఉత్పాదకత, ఆవిష్కరణల్లో ముందంజలో ఉండాలని చూస్తోంది.ఆమోదాలు వేగవంతం చేయడానికి..ఈ పెట్టుబడి ప్రకటనలో అత్యంత ముఖ్యమైన అంశం ‘గైడెన్స్ తమిళనాడు’. ఇది భారతదేశంలోని మొదటి ఫాక్స్కాన్ డెస్క్ అవుతుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులను సమన్వయం చేయడానికి ఈ డెస్క్ను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ ఈ ప్రాజెక్ట్కు పూర్తి మద్దతు ఇస్తుంది. సింగిల్ విండో ఫెసిలిటేషన్ ద్వారా ఆమోదాలను వేగవంతం చేస్తుంది. టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేషన్ మెకానిజమ్ల ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చడంలో కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ఫాక్స్కాన్ కంపెనీ ఇండియాలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తోంది.ఇదీ చదవండి: ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు! -
మార్కెట్లోకి కొత్త వాచ్.. ధర రూ.1,79,995
వాచీల తయారీ దిగ్గజం టైటాన్ తాజాగా స్టెల్లార్ 3.0 కలెక్షన్ కింద 9 టైమ్పీస్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. వీటిలో మూడు లిమిటెడ్ ఎడిషన్ వాచీలు ఉన్నాయి. టైటానియంలో అమర్చిన రెండు శాటిలైట్ డిస్కులతో రూపొందించిన వ్యాండరింగ్ హవర్స్ వాచ్ ధర రూ. 1,79,995గా ఉంటుందని సంస్థ తెలిపింది.ఇవి కేవలం 500 పీస్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఉల్క శకలంతో రూపొందించిన ఐస్ మెటియోరైట్ వాచీ ధర రూ.1,39,995గా, నార్తర్న్ లైట్స్ని తలపించే ఆరోరా సెలమ్ ధర రూ. 95,995గా ఉంటుందని సంస్థ సీఈవో (వాచెస్ అండ్ వేరబుల్స్) కురువిల్లా మార్కోస్ తెలిపారు.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
ఆర్బీఎల్ బ్యాంక్పై ఎమిరేట్స్ ఎన్బీడీ కన్ను
ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ వాటాలను దక్కించుకోవడంపై ఎమిరేట్స్ ఎన్బీడీ దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గత కొద్ది నెలలుగా దీనిపై సంప్రదింపులు జరుగుతున్నాయని, 51 శాతం వాటాను కొనుగోలు చేయడంపై ఎమిరేట్స్ ఎన్బీడీ ఆసక్తిగా ఉందని వివరించాయి. అయితే, ఇంకా డీల్ నిబంధనలేమీ ఖరారు కాలేదని, ఈ చర్చలు ఫలవంతమవుతాయా లేదా అనేది చెప్పలేమని పేర్కొన్నాయి.ప్రమోటర్లెవరూ లేకపోవడంతో ఆర్బీఎల్లో 100 శాతం వాటాలు పబ్లిక్ షేర్హోల్డర్ల వద్దే ఉన్నాయి. 1963లో నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్గా ప్రారంభమైన ఎమిరేట్స్ ఎన్బీడీ ప్రస్తుతం భారత్లో చెన్నై, గురుగ్రామ్, ముంబై శాఖల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 17,786.79 లక్షల కోట్లుగా ఉంది. దీని బట్టి చూస్తే 51 శాతం వాటాల విలువ సుమారు రూ. 9,071 కోట్లుగా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
ప్రైవేట్ రంగానికీ పీఎం గతి శక్తి పోర్టల్
లాస్ట్–మైల్ డెలివరీ సేవలను మెరుగుపర్చుకోవడంలో, మౌలిక సదుపాయాల సంబంధ సాధనాలను అభివృద్ధి చేయడంలో ప్రైవేట్ రంగానికి తోడ్పాటు అందించేలా కేంద్రం కీలక చర్య తీసుకుంది. ప్రైవేట్ రంగానికి కూడా పీఎం గతి శక్తి పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. యూనిఫైడ్ జియోస్పేషియల్ ఇంటర్ఫేస్ (యూజీఐ) ద్వారా ‘పీఎం గతిశక్తి పబ్లిక్’ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఆవిష్కరించారు.ఇది విజయవంతంగా ఉపయోగపడుతున్న సందర్భాలను, ఉత్తమ వినియోగ విధానాలను వివరించే పీఎం గతిశక్తి కాంపెన్డియమ్ మొదలైన వాటిని కూడా ఆయన విడుదల చేశారు. మౌలిక సదుపాయాల ప్రణాళికలు వేసుకునేందుకు, పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఎన్ఎంపీ (నేషనల్ మాస్టర్ ప్లాన్)లోని నిర్దిష్ట డేటా ఈ వెబ్ ప్లాట్ఫాం ద్వారా ప్రైవేట్ సంస్థలు, కన్సల్టెంట్లు, పరిశోధకులకు అందుబాటులో ఉంటుంది. మౌలిక సదుపాయాల అసెట్స్కి సంబంధించిన 230 డేటా సెట్స్ వివరాలను పొందేందుకు, సైట్ యోగ్యతను విశ్లేషించుకునేందుకు, కనెక్టివిటీ.. అలైన్మెంట్ ప్లానింగ్ మొదలైన వాటికి ఈ ప్లాట్ఫాం ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
హెచ్సీఎల్ క్యూ2 ఫ్లాట్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 4,235 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం పుంజుకుని రూ. 31,942 కోట్లను తాకింది. అయితే త్రైమాసికవారీగా(క్యూ1లో రూ. 3,843 కోట్లతో పోలిస్తే) నికర లాభం 10 శాతం ఎగసింది. పూర్తి ఏడాదికి సరీ్వసుల ఆదాయం 4–5 శాతం స్థాయిలో పురోగమించగలదని కంపెనీ తాజాగా అంచనాల(గైడెన్స్)ను సవరించింది. ఇంతక్రితం 3–5 శాతం ఆదాయ అంచనాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులందరికీ వేరియబుల్ పే అమలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ నుంచి ఇంక్రిమెంట్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఈ కాలంలో 3,489 మందికి ఉపాధి కల్పించడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,26,440కు చేరింది. ఫ్రెషర్స్తో కలిపి 5,1196 మందిని విధుల్లోకి తీసుకుంది. షేరుకి రూ. 12 డివిడెండ్ వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున హెచ్సీఎల్ టెక్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 17 రికార్డ్ డేట్. క్యూ2లో అడ్వాన్స్డ్ ఏఐ ఆదాయం 10 కోట్ల డాలర్లను(రూ. 876 కోట్లు) అధిగమించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. నిర్వహణ లాభ మార్జిన్ 17.5 శాతంగా నమోదైంది. మార్జిన్లు త్రైమాసికవారీగా 1.16 శాతం బలపడగా.. 16 శాతం అధికంగా 2.6 బిలియన్ డాలర్ల(రూ. 22,500 కోట్లు) విలువైన కాంట్రాక్టులు అందుకుంది. ఎలాంటి భారీ డీల్ లేకుండానే తొలిసారి ఆర్డర్లు 2.5 బిలియన్ డాలర్లను తాకినట్లు విజయకుమార్ పేర్కొన్నారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో గ్లోబల్ డెలివరీ మోడల్ 5 ద్వారా వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. గతేడాదితోపోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్స్ను అధికంగా తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.9 శాతం నుంచి 12.6 శాతానికి స్వల్పంగా తగ్గింది. కాగా.. ఆదాయంలో 56 శాతం వాటాగల యూఎస్ బిజినెస్ 2.4 శాతం పుంజుకోగా.. యూరప్ 7.6 శాతం బలపడింది. మార్కెట్లు ముగిశాక కంపెనీ ఫలితాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో రూ. 1,495 వద్ద యథాతథంగా ముగిసింది. -
ఎస్బీఐ నుంచి కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ
బీమా రంగ దిగ్గజం ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ ఫ్లాగ్షిప్ ఆరోగ్య బీమా పథకం హెల్త్ ఆల్ఫాను ఆవిష్కరించింది. జీవన విధానాలు, ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్లు 50 పైగా కవరేజీ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. సమ్ ఇన్సూర్డ్ రూ. 5 లక్షల నుంచి ఉంటుంది. దీర్ఘకాలికంగా 5 ఏళ్ల వరకు పాలసీ వ్యవధిని ఎంచుకోవచ్చు.క్లెయిమ్స్ చేయకపోతే ఏటా పది రెట్లు క్యుములేటివ్ బోనస్, జిమ్.. స్పోర్ట్స్ గాయాలకు కవరేజీ, కోట్ జనరేట్ చేసిన అయిదు రోజుల్లోగా కొత్త పాలసీని కొనుగోలు చేస్తే 5 శాతం వెల్కం డిస్కౌంటు, డే కేర్ ట్రీట్మెంట్ మొదలైన ఫీచర్లు ఈ పాలసీలో ఉన్నాయి. జీఎస్టీ సంస్కరణల తర్వాత పరిశ్రమలో తొలిసారిగా ప్రవేశపెట్టిన పథకం ఇదని సంస్థ డిప్యూటీ సీఈవో మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ తెలిపారు.ప్లాన్ పూర్తి ఫీచర్లు10 రెట్ల వరకు క్యూమ్యులేటివ్ బోనస్: ఇది ఒక అదనపు కవర్. పాలసీ కింద ఏదైనా క్లెయిమ్ చేయకపోతే ప్రతి సంవత్సరం గరిష్ఠంగా 10 రెట్లు క్యూమ్యులేటివ్ బోనస్ అందిస్తుంది.అన్లిమిటెడ్ సమ్ ఇన్సూర్డ్: ఈ పాలసీ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ పరిమితి లేకుండా ఉంటుంది. పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం, ఎంత మొత్తం క్లెయిమ్ అయినా చెల్లిస్తారు.ఎండ్లెస్ సమ్ ఇన్ష్యూర్డ్: ఒకే క్లెయిమ్లో బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ దాటి ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ ప్రయోజనాన్ని పాలసీ జీవితంలో ఒక్కసారి మాత్రమే వినియోగించవచ్చు.జిమ్ & స్పోర్ట్స్ ఇంజురీ కవర్: ఇది ఇండస్ట్రీలోనే మొదటిసారిగా అందిస్తున్న ప్రత్యేక అదనపు కవర్. హాబీ స్పోర్ట్స్ లేదా డైలీ ఫిట్నెస్ కార్యకలాపాలలో గాయపడిన సందర్భాలలో ఓపీడీ ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ పరీక్షలు, ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్లు, ఫిజికల్ థెరపీ కవర్ అవుతాయి.ప్లాన్ అహెడ్: ఈ ప్రత్యేక అదనపు ప్రయోజనం వల్ల పాలసీదారు సంపాదించిన వెయిటింగ్ పీరియడ్ కంటిన్యూయిటీని కొత్తగా పెళ్లి అయిన జీవిత భాగస్వామికి (గరిష్ఠంగా 35 ఏళ్ల వయస్సు వరకు), నవజాత శిశువులకు (గరిష్ఠంగా 2 మంది పిల్లలు) వర్తింపజేయవచ్చు. అయితే వారు వివాహం లేదా పుట్టిన తేదీ నుండి 120 రోజులలోపు పాలసీలో చేరాల్సి ఉంటుంది.వెల్కమ్ డిస్కౌంట్: కోటేషన్ రూపొందించిన 5 రోజులలోపుగా పాలసీ కొనుగోలు చేసినట్లయితే 5శాం ప్రత్యేక "వెల్కమ్ డిస్కౌంట్" ఇస్తారు. -
జరిమానా చెల్లించి, తప్పు అంగీకరిస్తే కేసు మూసివేత!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ (వాల్మార్ట్ యాజమాన్యంలోనిది)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘన కేసును పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించింది. సంస్థ తన తప్పును అంగీకరించి జరిమానా చెల్లించడం ద్వారా సుదీర్ఘ న్యాయపరమైన చిక్కులు లేకుండా కేసును మూసివేసేందుకు ఈడీ ప్రతిపాదించినట్టు సమాచారం.అసలు కేసేంటి?ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇండియా వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు FEMA, పోటీ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలపై ఈడీ చాలా కాలంగా దర్యాప్తు చేస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలకు విరుద్ధంగా ఈ కంపెనీలు తమ ప్లాట్ఫామ్లపై రాయితీలను ఇస్తూ అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయనే ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. ఈడీ మొదట్లో 2009 నుంచి 2015 మధ్య జరిగిన ఉల్లంఘనలపై కంపెనీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. వాల్మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత కూడా 2016 నుంచి దాని వ్యాపార కార్యకలాపాల్లో దర్యాప్తును విస్తరించింది.FEMA ‘కాంపౌండింగ్’ అంటే ఏమిటి?కాంపౌండింగ్ అనేది ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ఒక నిబంధన. ఇది ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థలు వాటి తప్పును స్వచ్ఛందంగా అంగీకరించడానికి, నిర్ణీత జరిమానా చెల్లించడానికి, తద్వారా క్రిమినల్ ప్రాసిక్యూషన్ లేదా సుదీర్ఘ న్యాయపరమైన అడ్డంకులను నివారించడానికి వీలు కల్పిస్తుంది. రెగ్యులేటరీ సంస్థలు కేసులను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించడానికి ఇది ఒక సాధారణ యంత్రాంగంగా ఉపయోగపడుతుంది.ఈడీ ఆఫర్ఈడీ ఇచ్చిన ఈ ఆఫర్ ఫ్లిప్కార్ట్కు చాలా ముఖ్యమైనది. ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్ను అంగీకరిస్తే అది సంవత్సరాల తరబడి సాగే న్యాయ పోరాటాలు, అధిక వ్యయం, కార్యకలాపాలపై నిరంతర ప్రతిబంధకాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తప్పును అంగీకరించి జరిమానా చెల్లించడం ద్వారా సంస్థ తన ప్రతిష్ట దెబ్బతినకుండా కొంతమేరకు కాపాడుకోవచ్చు. ప్రస్తుతం ఇలాంటి పరిశీలనలో ఉన్న అమెజాన్ ఇండియా వంటి ఇతర ఈ-కామర్స్ సంస్థలకు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ కంటే కాంపౌండింగ్ మార్గం ఒక ఆచరణాత్మక పరిష్కారంగా కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ను ఫ్లిప్కార్ట్ అంగీకరిస్తుందా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం.. -
ఎస్బీఐలో మహిళలకు అవకాశాలు
ఎస్బీఐ మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించనుంది. 2030 నాటికి తన సిబ్బందిలో మహిళల భాగస్వామ్యాన్ని 30 శాతానికి పెంచుకునేందుకు గాను లింగ వైవిధ్యం దిశగా ఒక వ్యూహాన్ని రూపొందించుకున్నట్టు సంస్థ డిప్యూటీ ఎండీ, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ప్రకటించారు.‘‘కస్టమర్లకు సేవలు అందించే విభాగంలో (ఫ్రంట్లైన్) ఇప్పటికే మహిళల ప్రాతినిధ్యం 33 శాతంగా ఉంది. కానీ, మొత్తం సిబ్బందిలో మహిళల వాటా 27 శాతమే ఉంది. దీన్ని మరింత పెంచుకోనున్నాం. దాంతో లింగ వైవిధ్యం మరింత మెరుగుపడుతుంది’’అని చెప్పారు. ఎస్బీఐలో 2.4 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నారు.బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్యాంకులోని అన్ని స్థాయిల్లోనూ మహిళలు రాణించేలా చూసేందుకు బ్యాంకు కట్టుబడి ఉన్నట్టు కిషోర్ కుమార్ చెప్పారు. అలాగే, లక్ష్యిత కార్యక్రమాల ద్వారా నాయకత్వం, ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
బీఎంఎస్డీ 2025లో టీమ్ ఒరంగుటాన్ విజయం
బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా షోడౌన్ (BMSD) 2025 ఆన్లైన్ గేమింగ్ పోటీలో టీమ్ ఒరంగుటాన్ ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. హైదరాబాద్లోని లైవ్-స్టూడియో అరేనాలో ఉత్కంఠభరితంగా ఈ పోటీలు నిర్వహించారు. మూడు రోజుల హై-ఇంటెన్సిటీ పోటీ తర్వాత టీమ్ ఒరంగుటాన్ ఛాంపియన్గా నిలవడంతోపాటు భారతదేశపు అగ్రశ్రేణి బీజీఎంఐ జట్టుగా నిలిచింది.రూ.1 కోటి ప్రైజ్ పూల్లో ఒరంగుటాన్ అధికభాగం వాటా రూ.30 లక్షలను దక్కించుకుంది. దాంతోపాటు రాబోయే గ్లోబల్ ఛాంపియన్షిప్లో స్లాట్ను కైవసం చేసుకుంది.గెలుపొందిన టీమ్లు, నగదు బహుమతులు కింది విధంగా ఉన్నాయి.ఛాంపియన్: టీమ్ ఒరంగుటాన్(రూ.30 లక్షలు)రెండో స్థానం: K9 ఈస్పోర్ట్స్ (రూ.15 లక్షల నగదు బహుమతి)మూడో స్థానం: టీమ్ సోల్ (రూ.10 లక్షల నగదు బహుమతి)అంతర్జాతీయ వేదికపై అడుగుఈ టోర్నమెంట్ భారతదేశపు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ పోటీదారుల కోసం అంతర్జాతీయ వేదికకు ద్వారాలు తెరిచింది. ఫైనల్స్లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లు ప్రతిష్టాత్మకమైన బీజీఎంఐ ఇంటర్నేషనల్ కప్ (బీఎంఐసీ)కు అర్హత సాధించాయి. ఈ కప్లో వారు కొరియా, జపాన్ నుంచి వచ్చిన ఎలైట్ జట్లతో పోటీ పడతారు.బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా షోడౌన్లో భాగంగా మరిన్ని విభాగాల్లో బహుమతులు అందించారు. అవి..అవార్డువిజేతబహుమతిటోర్నమెంట్ MVPOnePlusK9Njboiరూ. 2 లక్షలుఫైనల్స్ MVPM4xSNoWJoDరూ. 1 లక్షబెస్ట్ క్లచ్ అవార్డుM4xSNoWJoDరూ. 50,000బెస్ట్ IGL (ఇన్-గేమ్ లీడర్)iQOOxOGAARUరూ. 75,000ఫ్యాన్ ఫేవరెట్ ప్లేయర్GxdLJonaThan03రూ. 50,000 ఈస్పోర్ట్స్ కమ్యూనిటీపై ప్రభావంసెప్టెంబర్ 18 నుంచి వారాల పాటు సాగిన 16 ఉత్తమ బీజీఎంఐ జట్ల మధ్య జరిగిన పోరుతో ఈ ఫైనల్స్ ముగిశాయి. ఈ సందర్భంగా క్రాఫ్టన్ ఇండియా ఈస్పోర్ట్స్ అసోసియేట్ డైరెక్టర్ కరణ్ పాఠక్ మాట్లాడుతూ..‘బీజీఎంఐ షోడౌన్ భారతదేశ ఈస్పోర్ట్స్ కమ్యూనిటీలో లోతైన ప్రతిభను, అభిరుచిని మరోసారి ప్రదర్శించింది. బీఎంఐసీ వండి అంతర్జాతీయ పోటీల్లో గుర్తింపు పొందేందుకు పోటీదారులు సిద్ధంగా ఉన్నారు. వారి ప్రదర్శనలు ఇండియన్ ఈస్పోర్ట్స్ సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రతిబింబిస్తాయి’ అన్నారు.ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం.. -
బంగారంతో ప్రైవేట్ జెట్ కొనొచ్చు! ఎప్పుడంటే..
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు, యూఎస్ టారిఫ్ల మధ్య పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఆల్-టైమ్ రికార్డులను బద్దలు కొడుతూ సామాన్యులకు అందని విధంగా బంగారం విలువ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా చేసిన ఓ ఆసక్తికరమైన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం విలువ పెరుగుతున్న తీరుపై ఇది చర్చకు తెరలేపింది.బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి గోయెంకా ఒక కిలో బంగారం విలువను దశాబ్దాల కాలంలో విలాసవంతమైన కార్ల ధరలతో పోల్చి చూపారు. ఈ పోలిక బంగారం పెట్టుబడిదారులకు గొప్ప ఆశాజనక సందేశాన్ని ఇస్తుండగా సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై దాని ప్రభావాన్ని సూచిస్తోంది.హర్ష్ గోయెంకా ట్వీట్ చేసిన పసిడి-కారు పోలికలు ఇవే:కింద తెలిపిన విధంగా కేజీ బంగారం విలువ ఆయా సంవత్సరాల్లో సదరు కార్ల ధరలకు సమానం ఉంది(అంచనా మాత్రమే).1990లో 1 కేజీ బంగారం=మారుతి 8002000లో 1 కేజీ బంగారం=ఈస్టీమ్2005లో 1 కేజీ బంగారం=ఇన్నోవా2010లో 1 కేజీ బంగారం=ఫార్చ్యూనర్2019లో 1 కేజీ బంగారం=బీఎమ్డబ్ల్యూ2025లో 1 కేజీ బంగారం=ల్యాండ్ రోవర్పెట్టుబడికి పసిడి స్వర్ణయుగం!ఈ పోస్ట్లో గోయెంకా మరింత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పెరుగుతున్న ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం విలువ మరింత ఆశాజనకంగా మారుతుందని అంచనా వేశారు.2030లో 1 కిలో బంగారం = రోల్స్ రాయిస్ కారు ధరకు సమానం అవుతుంది.2040లో 1 కిలో బంగారం = ఒక ప్రైవేట్ జెట్ ధరలకు సమానంగా మారుతుంది అన్నారు.1990: 1kg gold = Maruti 8002000: 1kg gold = Esteem2005: 1kg gold = Innova2010: 1kg gold = Fortuner2019: 1kg gold = BMW2025: 1kg gold = Land RoverLesson: Keep the 1kg gold- in 2030 it may equal a Rolls Royce car and in 2040 a private jet🛩️! 😀— Harsh Goenka (@hvgoenka) October 12, 2025బంగారం విలువ ఎందుకు పెరుగుతోంది?నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బంగారానికి పెట్టుబడి సురక్షిత సాధనంగా డిమాండ్ను పెంచుతున్నాయి. అదనంగా అమెరికన్ డాలర్ విలువ బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. చాలా మంది పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తుండటంతో దాని విలువ రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా హర్ష్ గోయెంకా ట్వీట్ ద్వారా స్పష్టమవుతున్నట్టుగా కేవలం మూడు దశాబ్దాల కాలంలోనే ఒక కిలో బంగారం విలువ సాధారణ కారు స్థాయి నుంచి అత్యంత విలాసవంతమైన ‘ల్యాండ్ రోవర్’ స్థాయికి చేరింది. భవిష్యత్తులో అది ‘రోల్స్ రాయిస్’ లేదా ‘ప్రైవేట్ జెట్’ ధరల స్థాయికి చేరుతుందని అంచనా వేయడం పసిడిలో పెట్టుబడికి ఉన్న దీర్ఘకాలిక విలువను నొక్కి చెబుతోంది. భారతదేశంలో బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, తరతరాలకు సంపదను అందించే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం అని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. -
దీపావళి పండుగ ప్రయాణాలకు డిమాండ్
దీపావళి సందర్భంగా ప్రయాణాలు, హోటల్ బుకింగ్లకు బలమైన డిమాండ్ కనిపిస్తోంది. దీపావళి సోమవారం రావడంతో, వరుస సెలవుల నేపథ్యంలో పట్టణాలు, విహార ప్రదేశాలు, వివిధ పట్టణాల మధ్య బస్ సేవలకు జోరుగా బుకింగ్లు నమోదవుతున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 95–100 శాతానికి చేరింది. జీఎస్టీ సంస్కరణలతో మధ్యశ్రేణి హోటళ్లకు డిమాండ్ ఏర్పడినట్టు హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) ప్రెసిడెంట్ కేబీ కచ్చు తెలిపారు.ఈ ఏడాది దీపావళి కారణంగా వారాంతం ఎక్కువగా ఉండడంతో మెరుగైన పండుగ అనుభవం కోసం ఎక్కువ మంది ముందుగానే తమ ప్రయాణాలకు ప్రణాళిక వేసుకున్నట్టు ఎబిక్స్ ట్రావెలర్స్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విక్రమ్ ధావన్ తెలిపారు. ప్రధానంగా టైర్–2, 3 పట్టణాల్లో వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఎయిర్లైన్ బుకింగ్లలోనూ 65–70% విహార పర్యటనలకు సంబంధించే ఉన్నట్టు తెలిపారు. క్రితం ఏడాది దీపావళి సీజన్తో పోల్చితే ఈ విడత 15–20% బుకింగ్లు పెరిగాయని చెప్పారు.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా -
డీమార్ట్కు పెరిగిన లాభాలు.. మూడు నెలల్లో రూ.685 కోట్లు
న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లు నిర్వహించే అవెన్యూ సూపర్మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ క్యూ2లో కన్సాలిడేషన్ ప్రాతిపదికన రూ.684.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది రెండో త్రైమాసికంలో నమోదు చేసిన రూ.659.44 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం.ఇదే క్యూ2లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 15% పెరిగి రూ.14,444.50 కోట్ల నుంచి 16,218.79 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 16% వృద్ధి చెంది రూ.15,751.08 కోట్లుగా నమోదయ్యాయి. ఇతర ఆదాయాలతో కలిపి మొత్తం ఆదాయం 15.3% పెరిగి రూ.16,695.87 కోట్లకు చేరింది.‘‘అవసరమైన చోట్ల ధరలు తగ్గిస్తూ జీఎస్టీ క్రమబద్ధీకరణ ఫలాలు కస్టమర్లకు అందిస్తున్నాము. ఈ క్వార్టర్లో 8 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 432కి చేరింది. ప్రస్తుతం మాకున్న మార్కెట్లలో 10 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాము’’ అని సీఈవో అన్షుల్ అసావా తెలిపారు. -
బెజోస్ మాజీ భార్య భారీ విరాళం..
అమెజాన్ (Amazon) సహ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మాజీ భార్య మెకెంజీ స్కాట్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. శాన్ రాఫెల్కు చెందిన లాభాపేక్షలేని సంస్థ ‘10,000 డిగ్రీస్’కు తాజాగా 42 మిలియన్ డాలర్లు (రూ. 372 కోట్లు) విరాళం అందించారు. ఈ విరాళం, విద్యలో వైవిధ్యం, సమానత్వం, చేరికకు (DEI: Diversity, Equity, and Inclusion) ఆమె చూపుతున్న దృఢమైన మద్దతును మరోసారి రుజువు చేస్తోంది.విద్యార్థుల అభ్యుదయానికి ఆమె నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. మొట్టమొదటి తరం, తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు సహాయం చేయడంలో స్కాట్ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ‘నేటివ్ ఫార్వర్డ్’ అనే సంస్థకు గతంలో ఆమె 10 మిలియన్ డాలర్లు విరాళం ఇవ్వడం ఈ దిశగా మరో ఉదాహరణ. ఇది యూఎస్లో స్థానిక విద్యార్థులకు అతి పెద్ద స్కాలర్షిప్ అందించే సంస్థగా గుర్తింపు పొందింది.దాతృత్వానికి మారుపేరుఫోర్బ్స్ ప్రకారం 2025 అక్టోబర్ 11 నాటికి స్కాట్ రియల్టైమ్ నెట్వర్త్ 32.5 బిలియన్ డాలర్లు. ఆమె 2019లో జెఫ్ బెజోస్తో విడాకులు పొందిన తర్వాత, అమెజాన్లో 4% వాటాను పొందారు. ఆ ఏడాది మేలో, ఆమె గివింగ్ ప్లెడ్జ్పై సంతకం చేసి, తన జీవితకాలంలో సంపదలో కనీసం సగం విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు.స్కాట్ విరాళాలు ఇచ్చే సంస్థలపై నియంత్రణ విధించకుండా, అవి తమ అవసరాలను బట్టి నిధులను ఎలా వినియోగించాలో స్వేచ్ఛను ఇస్తారు. ఇది ‘తీగలు లేని దాతృత్వం’ (no-strings-attached philanthropy)గా గుర్తింపు పొందింది. -
ఇన్సూరెన్స్ ఏజంట్లను కాపాడుకోవడం కష్టమైపోయింది..
జీవిత బీమా కంపెనీలకు ఏజంట్ల రిటెన్షన్ (వారు వైదొలగకుండా అట్టే పెట్టుకోవడం) సవాలుగా ఉంటోందని టాటా ఏఐఏ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (ప్రొప్రైటరీ బిజినెస్, అలైడ్ చానల్స్) అమిత్ దవే తెలిపారు. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ 2023–24 వార్షిక నివేదిక ప్రకారం పరిశ్రమలో కొత్తగా 9.7 లక్షల మంది జీవిత బీమా ఏజంట్లు చేరగా, 6.9 లక్షల మంది నిష్క్రమించినట్లు చెప్పారు.సత్వర ప్రయోజనాలు లభిస్తాయంటూ పరిశ్రమపై నెలకొన్న అభిప్రాయమే ఇందుకు కారణంగా ఉంటోందని తెలిపారు. ఇలా ఏజంట్ల నిష్క్రమణ అనేది వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడానికి, కస్టమర్ల నమ్మకాన్ని పొందడానికి సవాలుగా ఉంటోందని దవే తెలిపారు. ఈ నేపథ్యంలో ఏజంట్లను రిటైన్ చేసుకునేందుకు పరిశ్రమ పలు ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు.క్లయింట్ కమ్యూనికేషన్, డిజిటల్ టూల్స్ మొదలైన వాటిల్లో కంపెనీలు శిక్షణనిస్తున్నాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నాయన్నారు.ఇదీ చదవండి: బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు -
బంగారాన్నే నమ్ముతా: జోహో సీఈఓ శ్రీధర్ వెంబు
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో క్రిప్టో కరెన్సీకి కూడా క్రేజ్ పెరుగుతోంది. అయితే స్వదేశీ సాంకేతిక ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తున్న జోహో (Zoho)వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీధర్ వెంబు.. తాను బంగారాన్నే(Gold) నమ్ముతా అంటున్నారు.క్రిప్టో క్రేజ్ లేదా తాజా మార్కెట్ ట్రెండ్లకు లోనుకాకుండా బంగారాన్ని సంపదకు విశ్వసనీయమైన నిల్వగా కొనసాగిస్తున్నారు. కరెన్సీ క్షీణతకు రక్షణగా బంగారాన్ని భావించే శిబిరంలో 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఈమేరకు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోప్ట్ పెట్టారు. తనకు క్రిప్టోకరెన్సీలపై ఆసక్తి లేదని, బంగారాన్ని స్థిరమైన, కాలాతీత పెట్టుబడిగా చూస్తానని పేర్కొన్నారు. లిన్ ఆల్డెన్ అనే స్థూల ఆర్థిక వ్యూహకర్త చేసిన విశ్లేషణలో కూడా ఇదే భావనను సమర్థిస్తుందని ప్రస్తావించారు. ఆమె పరిశోధన ప్రకారం, అమెరికా ట్రెజరీ బాండ్లు, స్టాక్స్,రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ద్రవ్యోల్బణాన్ని అనుసరించే బంగారాన్ని దీర్ఘకాలంలో అధిగమించలేకపోయాయి.ఆల్డెన్ చెప్పినట్లు, కేవలం 4 శాతం స్టాకులే మార్కెట్ రాబడికి ముఖ్య కారణమవుతాయి. రియల్ ఎస్టేట్ కూడా పన్నులు, నిర్వహణ ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాల వల్ల బంగారంతో పోలిస్తే తక్కువ పనితీరు చూపించింది.ఇదిలా ఉండగా, 2025లో ట్రంప్ విధించిన వాణిజ్య సుంకాలు, అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు వంటివి బంగారం ధరలు ఔన్స్కు 4,000 డాలర్లు (రూ. 3.57 లక్షలు) దాటేలా చేశాయి. ఈ పరిణామాలు వెంబు నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి.ఇదీ చదవండి: ఆ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములా చచ్చింది.. కొత్తది వచ్చింది: రాబర్ట్ కియోసాకిశ్రీధర్ వెంబు లాజిక్ స్పష్టంగా ఉంది. బంగారం తక్షణ లాభాల కోసం కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం. “బంగారం ఓర్పునకు సంబంధించినది” అని చెబుతూ, ఆధునిక హైప్తో నిండిన పెట్టుబడి ప్రపంచంలో ఆయన దృఢమైన వైఖరి విశిష్టంగా నిలుస్తోంది.I have long been in the "gold as insurance against currency debasement" camp, for over 25 years now. Over the long term, gold has held its purchasing power in terms of commodities like petroleum, and gold has held its own against broad stock market indexes. No, I am not… pic.twitter.com/dyfnCFa7T6— Sridhar Vembu (@svembu) October 12, 2025 -
వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం.. ఎమ్ఆర్ఐ, పోలీస్ రిపోర్ట్
కోవిడ్ సమయంలో దాదాపు అన్ని కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులను 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు పరిమితం చేశాయి. అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీస్ బాట పట్టించాయి. కాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే.. ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఎన్ని ఇబ్బందులున్నా కార్యాలయానికి రావాల్సిందే అంటూ పట్టుపడుతున్నాయి.ఇటీవల రెడ్దిట్ వేదికగా ఒక పోస్ట్ వైరల్ అయింది. ఇందులో మా అత్త, వాళ్ల సోదరుడు ఒక స్కూటర్ ప్రమాదంలో గాయపడ్డారు. నా భార్య చెల్లెలు బెంగళూరులో ఐటీ జాబ్ చేస్తోంది. ఆమె తన తల్లికి ప్రమాదం జరగడంతో.. వారిని చూసుకుంటూ, నెల రోజులు వర్క్ ఫ్రొమ్ హోమ్ సదుపాయం కల్పించాలని కంపెనీని కోరింది. దీనికోసం వాళ్ల ఎమ్ఆర్ఐ స్కాన్, పోలీస్ రిపోర్ట్ వంటివి కూడా షేర్ చేసింది. అయితే కంపెనీ తనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించడానికి ఒప్పుకోలేదు.నిజానికి ఆమె సెలవు అడగలేదు, ఇంటి నుంచి పనిచేస్తానని అభ్యర్థించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కార్పొరేట్ కంపెనీల తీరు ఇలా ఉందని.. రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ఇండియాలోని ప్రైవేట్ కంపెనీల వర్క్ కల్చర్ గురించి విమర్శించారు.ఇదీ చదవండి: 2026లో జీతాలు పెరిగేది వీరికే! -
తెలుగు కుబేరులు.. టాప్ 100లో ఆరుగురు
దేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా (Forbes India) విడుదల చేసింది. ఊహించినట్టుగానే ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) రూ .9.32 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.ఆరుగురు తెలుగువారుఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో ఆరుగురు తెలుగు (Telugu) పారిశ్రామికవేత్తలు స్థానం సంపాదించడం విశేషం. వీరిలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి రూ. 88,800 కోట్ల సంపదతో జాతీయ స్థాయిలో 25వ ర్యాంకు, తెలుగువారిలో అగ్రస్థానాన్ని సంపాదించారు.మేఘా ఇంజనీరింగ్ అధిపతులు పీపీ రెడ్డి, పీవీ కృష్ణా రెడ్డి 70వ స్థానంలో, జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంథి మల్లికార్జున రావు 83వ ర్యాంకు, అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి.రెడ్డి 86వ స్థానం, హెటిరో గ్రూప్ చైర్మన్ బి.పార్థసారధి రెడ్డి 89వ ర్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అధినేత కె.సతీష్ రెడ్డి 91వ స్థానంలో నిలిచారు. -
పేరులో చిన్న మార్పు: పతనమైన బీర్ల కంపెనీ!
విజయవంతంగా.. లాభాలను గడిస్తూ దూసుకెళ్తున్న కంపెనీ, బ్రాండ్ పేరులోని చిన్న పదాన్ని తొలగించడం వల్ల ఊహకందని నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వినడానికి ఈ మాట కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.గత దశాబ్దంలో విజయవంతమైన స్టార్టప్ సంస్థల్లో బిరా 91 ఒకటి. ఇది ఒక ప్రసిద్ధ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్. 2023 చివరలో ఈ కంపెనీ ఐపీఓ కోసం సిద్ధమైంది. అయితే లిస్టింగ్ నిబంధనలను పాటించడానికి.. బీ9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిరా 91 మాతృ సంస్థ) నుంచి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించి.. బీ9 బెవరేజెస్ లిమిటెడ్గా పేరు మార్చుకుంది. దీని కోసం 2024 జనవరిలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద పేరును మార్చుకుంది. ఈ చర్య కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయేలా చేసేసింది.కంపెనీ కొత్త పేరుతో తెరమీదకు రావడంతో.. అన్ని రాష్ట్రాల్లో బిరా 91 అమ్మకాలను చాలామంది నిషేధించారు. దీనికి కారణం కొత్త పేరు.. పాత కంపెనీదే అని నమ్మకపోవడం. అమ్మకం దారులు ప్రతి ఒక్క వేరియంట్కు కొత్త చట్టపరమైన ఆమోదాలు, లేబుల్ ఆమోదాలు, ఉత్పత్తి రిజిస్ట్రేషన్లు, కొత్త లైసెన్స్లను డిమాండ్ చేశారు. వీటిని జారీ చేయడంలో అధికారిక జాప్యం కోలుకోలేని దెబ్బ కొట్టింది.ఒకదాని తర్వాత ఒకటి సమస్యలకు దారితీసింది. దీంతో పంపిణీ మొత్తం ఆగిపోయింది. కోట్ల విలువైన ఉత్పత్తి.. గిడ్డంగుల్లోనే ఉండిపోయింది. మొత్తం మీద కంపెనీ రూ. 700 కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇందులో పెట్టుబడిపెట్టడానికి వచ్చిన సంస్థలు కూడా వెనుకడుగు వేశాయి.Bira 91 was one of the successful start-up stories of last decade. It is a popular craft beer brand. They were growing so well. Reality is strange than what you can imagine. A procedural goof up has lead to whole company being collapsing and the founder now being forced even to…— D.Muthukrishnan (@dmuthuk) October 10, 2025 -
‘ఓపెన్ఏఐ పుట్టిందే ఓ అబద్ధంతో..’
ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAIని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ కంపెనీ దాని వ్యవస్థాపక లక్ష్యానికి పూర్తిగా ద్రోహం చేసిందని తీవ్రంగా ఆరోపించారు. ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా మస్క్ OpenAI ‘ఒక అబద్ధంపై నిర్మించబడింది. ఒక స్వచ్ఛంద సంస్థగా వెలసి సొంత ఆర్థిక లాభం కోసం పని చేస్తుంది’ అని పేర్కొన్నారు.మస్క్ తాజా దాడి నేపథ్యంOpenAI ఇటీవల తన వైరల్ టెక్స్ట్-టు-వీడియో అప్లికేషన్ ‘సోరా’ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దీనిపై వస్తున్న పోస్ట్లకు ప్రతిస్పందనగా మస్క్ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 2022లో వచ్చిన ఓపెన్ ఏఐకు చెందిన చాట్జీపీటీ (ChatGPT) కేవలం ఆరు నెలల్లోనే అధిక ప్రజాదరణ పొందింది. శామ్ ఆల్ట్మన్ 2015లో ఓపెన్ఏఐ ప్రారంభించినప్పుడు.. మస్క్ కూడా అందులో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత 2018లో బయటకు వచ్చేసారు. మస్క్ ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత.. 2019లో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 17 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టింది.2024లో మస్క్ ఓపెన్ఏఐ కంపెనీపై కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. కంపెనీ మొదలుపెట్టినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇంకా ఆ దావాపై తీర్పు వెలువడలేదు.ఇదీ చదవండి: చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. -
తదుపరి టెక్ హబ్గా మరో నగరం
బెంగళూరు భారతదేశంలోని టెక్ రాజధానిగా ప్రసిద్ధి చెందినప్పటికీ కర్ణాటకలోని తీరప్రాంత నగరం మంగళూరు కొత్త టెక్, స్టార్టప్ హబ్గా అభివృద్ధి చెందుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ దాస్ పాయ్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి వంటి ప్రముఖులు దీన్ని భవిష్యత్ ఆవిష్కరణల కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు. అయితే మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని బెంగళూరు వైద్యుడు డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఎక్స్ వేదికగా వెలసిన పోస్ట్లు వైరల్గా మారాయి.ఆరిన్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు మోహన్ దాస్ పాయ్ పోస్ట్ ప్రకారం.. ‘మంగళూరులో ఇప్పటికే 25,000 మంది టెక్ నిపుణులు ఉన్నారు. గొప్ప ప్రతిభ, మెరుగైన జీవన నాణ్యత, సరసమైన గృహాలు, ఉన్నత విద్యా సంస్థలు, అద్భుతమైన బీచ్ ఉంది’ అని తెలిపారు. ఈ పోస్ట్కు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి మద్దతు తెలియజేస్తూ..‘మంగళూరు కేవలం టెక్ హాట్ స్పాట్ మాత్రమే కాదు. యువ పారిశ్రామికవేత్తలు, సమతుల్య జీవితం కోసం చూసే నిపుణులకు ఆదర్శ గమ్యస్థానం. ఇది ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన ప్రదేశం. ఇది ఆసియాలో ఆవిష్కరణలకు కొత్త గమ్యస్థానంగా మారుతుంది’ అన్నారు.The first step should be to build a proper International Airport away from the hill on which it is perched currently. https://t.co/VIF0QBWoep— Dr Deepak Krishnamurthy (@DrDeepakKrishn1) October 6, 2025అయితే, బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ దీపక్ కృష్ణమూర్తి స్పందిస్తూ..‘మంగళూరు తదుపరి సిలికాన్ కోస్ట్ కావడానికి ముందు చుట్టూ కొండ ప్రాంతం కావడంతో ప్రమాదకరమైన రన్వే కాకుండా మెరుగైన అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం’ అని అన్నారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.కొందరు మంగళూరు విమానాశ్రయం ఇప్పటికే బెంగళూరు విమానాశ్రయం మాదిరిగా సౌకర్యవంతంగా, నగరానికి దగ్గరగా ఉందని చెప్పారు. అయితే, టెక్ హబ్గా మారిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ సాధ్యమా అని డాక్టర్ దీపక్ ప్రశ్నించారు. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.32 మిలియన్ల ప్రయాణికులను నిర్వహించించినట్లు నెటిజన్లు తెలిపారు. ఇది మునుపటి రికార్డును మించిపోయిందని, ప్రస్తుతం రన్వేను 150 మీటర్లు పొడిగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా -
అనిల్ అంబానీ సహయకుడి అరెస్ట్
అనిల్ అంబానీ సహాయకుడు.. రిలయన్స్ పవర్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అయిన 'అశోక్ కుమార్ పాల్'ను ఫేక్ బ్యాంక్ గ్యారెంటీ కేసుకు సంబంధించి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై ఈడీ తన దర్యాప్తును విస్తృతం చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.రిలయన్స్ పవర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేస్తున్న అశోక్ పాల్కు.. రూ. 68.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపైనే ఆయనను ఢిల్లీ కార్యాలయంలో ప్రశ్నించిన ఈడీ.. గురువారం రాత్రి అరెస్టు చేసినట్లు, శనివారం కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్ కోరనున్నట్లు సమాచారం.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన పాల్.. 2023 జనవరి 29న కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా నియమితులయ్యారు. ఆయనకు సుమారు ఏడు సంవత్సరాలకు పైగా రిలయన్స్ పవర్తో అనుబంధం ఉంది. అయితే భువనేశ్వర్, కోల్కతాతో సహా పలు ప్రాంతాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ సోదాలు ప్రారంభించిన చాలా రోజుల తరువాత ఈ అరెస్టు చేయడం జరిగింది.ఏమిటి ఈడీ కేసురిలయన్స్ పవర్తో పాటు.. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపైన రూ. 17వేల కోట్ల బ్యాంకు లోన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరయ్యారు. ఇందులో భాగంగానే ఆగస్టులో ముంబైలోని 35 ప్రదేశాలలో సోదాలు నిర్వహించిన తర్వాత ED దర్యాప్తు చేపట్టింది. అక్రమ నగదు బదిలీ నిరోధక చట్టం.. కింద 50 కంపెనీలు, గ్రూప్తో సంబంధం ఉన్న 25 మంది వ్యక్తులను కవర్ చేసింది. తాజాగా సీఎఫ్ఓ అరెస్ట్ కేసులో మరింత కీలకంగా మారిందని తెలుస్తోంది.ఇదీ చదవండి: అరట్టై ప్రైవసీపై సందేహం: శ్రీధర్ వెంబు రిప్లై ఇలా.. -
‘ప్రపంచానికి 200 మంది ఎలాన్ మస్క్లు అవసరం’
అమెరికాకు, ప్రపంచానికి ఎలాన్ మస్క్ వంటి వ్యవస్థాపకులు పెద్ద సంఖ్యలో అవసరమని డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ అన్నారు. ఇటీవల పియర్స్ మోర్గాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ వ్యవస్థాపక విజయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ముఖ్యంగా స్పేస్ ఎక్స్ వినూత్న రాకెట్ క్యాచింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు.అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే రాకెట్ బూస్టర్లను పట్టుకోవడానికి యాంత్రిక టెక్నాలజీ (చాప్ స్టిక్లు) ఉపయోగించి మస్క్ ఇటీవల ప్రపంచం దృష్టిని ఆకర్షించారని నొక్కి చెబుతూ.. ‘మనకు 200 మంది ఎలాన్ మస్క్లు అవసరం. యూఎస్తోపాటు ప్రపంచానికి మస్క్ అవసరం ఉంది. పాశ్చాత్య నాగరికతకు తనలాంటి వారు కచ్చితంగా ఉపయుక్తంగా మారుతారు. దాంతోపాటు ప్రపంచానికి డొనాల్డ్ ట్రంప్ అవసరం కూడా ఉంది’ అని ఎరిక్ అన్నారు.ఎలాన్ మస్క్, తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాన్ని ప్రస్తావిస్తూ ‘వారు ఇద్దరు బలమైన జట్టుగా ఉన్నారని భావిస్తున్నాను. ఒకరినొకరు భారీ ప్రశంసలతో, అపార గౌరవాన్ని కలిగి ఉన్నారు’ అని పేర్కొన్నారు. మస్క్ ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో స్పందించారు. ఎరిక్ ట్రంప్ ఇంటర్వ్యూలోని వ్యాఖ్యలపై ‘ధన్యవాదాలు’ అని రాసి హార్ట్ ఎమోజీని జోడించారు.ఇదీ చదవండి: రెరా ఉన్నా 10 శాతం మార్టగేజ్ క్లాజ్ అవసరమా? -
ఇక ఎస్బీఐ ఎండీగా ప్రైవేట్ అభ్యర్థులు!
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (పీఎస్బీ) దిగ్గజం ఎస్బీఐలో ఒక ఎండీ పోస్టుతో పాటు ఇతర పీఎస్బీల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలాంటి టాప్ హోదాలకు ప్రైవేట్ రంగ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేలా నియామకాలపై క్యాబినెట్ కమిటీ (ఏసీసీ) మార్గదర్శకాలను సవరించింది. వీటి ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ఒక మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పోస్టుతో పాటు పీఎస్బీల్లో ఈడీ పోస్టులకు ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో పని చేస్తున్న వారే కాకుండా ప్రైవేట్ రంగానికి చెందిన వారు కూడా పోటీపడొచ్చు.ఎస్బీఐ ఎండీకి సంబంధించి ప్రైవేట్ అభ్యర్ధులకు బ్యాంకు బోర్డు స్థాయిలో కనీసం రెండేళ్లు, 15 ఏళ్ల బ్యాంకింగ్ అనుభవం సహా మొత్తం మీద కనీసం 21 ఏళ్ల అనుభవం ఉండాలి. ఎస్బీఐలో నాలుగు ఎండీ పోస్టులు ఉండగా, కొత్త మార్గదర్శకాల ప్రకారం వాటిల్లో ఒకటి ఓపెన్గా ఉంటుంది. సాధారణంగా ఎండీ, చైర్మన్ పోస్టులను అంతర్గత సిబ్బందితోనే భర్తీ చేయడం ఆనవాయితీగా ఉంటోంది. ప్రస్తుతం ఎస్బీఐ కాకుండా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ మొదలైన 11 పీఎస్బీలు ఉన్నాయి. అటు పీఎస్బీల్లో ఈడీ పోస్టులకు సంబంధించి ప్రైవేట్ అభ్యర్థులకు బ్యాంకు బోర్డు స్థాయి లో మూడేళ్లు సహా బ్యాంకింగ్ రంగంలో 12 ఏళ్లు, మొత్తం మీద కనీసం 18 ఏళ్ల అనుభవం ఉండాలి. యూనియన్ల నిరసనఏసీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) వెల్లడించింది. దీనిపై కేంద్రానికి నిరసన తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల స్వభావాన్ని దెబ్బతీసేందుకు జరుగుతున్న దాడిగా దీన్ని అభివర్ణించింది.ఇదీ చదవండి: రుణమే.. బంగారమాయెనే! -
దేశవ్యాప్తంగా కార్నివాల్స్పై కసరత్తు
గిన్నిస్ రికార్డులకెక్కిన తమ విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్నివాల్స్ను నిర్వహించనున్నట్లు శ్రేయాస్ మీడియా వెల్లడించింది. దేశ, విదేశీ కళాకారులతో ఏపీలోని అరకు, గండికోట వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సంస్థ ఫౌండర్ గండ్ర శ్రీనివాసరావు తెలిపారు.30 పైచిలుకు భారీ కాన్సర్ట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రకటనల హక్కులను దక్కించుకుని, వేలాది బ్రాండ్స్ని కోట్ల మందికి చేరువ చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. తాజాగా సెపె్టంబర్లో 11 రోజుల పాటు సాగిన విజయవాడ ఉత్సవ్లో 15 లక్షల మంది పైగా పాల్గొనగా, స్థానికంగా రూ. 1,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనాలున్నట్లు తెలిపారు. ఎక్స్పోలో 600 స్టాల్స్ ఏర్పాటు చేయగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించిందన్నారు. వచ్చే అయిదేళ్లలో విజయవాడ ఉత్సవ్తో రూ.5,000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్నివాల్స్కు పలు బ్రాండ్స్ ముందుకొస్తున్నాయని తెలిపారు. -
టాటా సన్స్ని లిస్ట్ చేయాల్సిందే..
న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు నెలకొన్న తరుణంలో, టాటా సన్స్ను స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేయాలన్న డిమాండ్ను ఎస్పీ గ్రూప్ చైర్మన్ షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ పునరుద్ఘాటించారు. సంస్థ లిస్టింగ్తోనే వ్యవస్థాపకుడు జంషెట్జీ టాటా కోరుకున్న పారదర్శకత సాధ్యపడుతుందని, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, ప్రజల్లో నమ్మకం కూడా పెరుగుతుందని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. టాటా సన్స్ను లిస్టింగ్ చేయాలంటూ తాము ఎప్పటినుంచో కోరుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో టాటా సన్స్ను అప్పర్ లేయర్ సంస్థగా లిస్ట్ చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ విధించిన గడువును సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఘనమైన వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు, భవిష్యత్తులో ముందుకు సాగేందుకు పారదర్శకత అత్యంత కీలకమనేది తమ నమ్మకమని మిస్త్రీ వివరించారు. ఆర్బీఐ ఒక రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర సంస్థగా సమానత్వం, న్యాయం, ప్రజాప్రయోజన సూత్రాలను నిలబెట్టే నిర్ణయాలు తీసుకుంటుందని తాము విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్ కేవలం ఆర్థికపరమైనదే కాకుండా నైతిక, సామాజిక బాధ్యతని మిస్త్రీ తెలిపారు. టాటా గ్రూప్ ప్రమోటర్, హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి 18.37 శాతం, టాటా ట్రస్ట్స్కి 66 శాతం వాటాలు ఉన్నాయి. టాటా సన్స్లో వాటాలను వినియోగించుకుని, రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఎస్పీ గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రశాంతంగా టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశం ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో శుక్రవారం టాటా ట్రస్ట్స్ బోర్డు భేటీ అయ్యింది. అయితే, ఇందులో వివాదాస్పద అంశాల ప్రస్తావనేమీ రాలేదని, సమావేశం సజావుగానే సాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాతృత్వ కార్యకలాపాలు, ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులకు నిధులు తదితర అంశాలను సమీక్షించినట్లు పేర్కొన్నాయి. బోర్డులో నియామకాలు, గవర్నెన్స్ అంశాలపై టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు నెలకొనడం, చైర్మన్ నోయల్ టాటా తదితరులు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో భేటీ కావడం తెలిసిందే. -
లండన్లో టీసీఎస్ ఏఐ జోన్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లండన్లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఎక్స్పీరియన్స్ జోన్కు తెరతీయనుంది. ఏఐ కేంద్రంతోపాటు డిజైన్ స్టుడియోను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. తద్వారా యూకేలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో అక్కడ దేశవ్యాప్తంగా 5,000 ఉద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం యూకేలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 42,000 మందికిపైగా మద్దతిస్తున్నట్లు తెలియజేసింది. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, స్టార్టప్స్సహా ఇతర భాగస్వామ్యాలతో నెలకొల్పిన ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్ను వినియోగించుకోనున్నట్లు వివరించింది. -
మన గురించి మనమే చెప్పుకోవాలి
న్యూఢిల్లీ: సినిమాలు, కొత్త టెక్నాలజీలు మొదలైన మాధ్యమాల ద్వారా అసమాన వృద్ధి గాథను అంతర్జాతీయంగా భారత్ స్వయంగా చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ‘మౌనం వహించడమనేది వినయం కాదు. లొంగిపోవడం. మన గురించి మనమే చెప్పుకోకపోతే, వేరే వాళ్లు మన గురించి ఇష్టమొచి్చనట్లుగా రాస్తారు’ అని ఫిలిం, కమ్యూనికేషన్స్, ఆర్ట్స్ సంస్థ విజ్లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఉద్బోధించారు. పాశ్చాత్య దృష్టికోణంతో తీసిన గాం«దీ, స్లమ్డాగ్ మిలియనీర్లాంటి చిత్రాలే దీనికి నిదర్శనమన్నారు. తన కథను ప్రపంచానికి చెప్పడంలో భారత్ విఫలమైనందునే, ఇతరులు వాస్తవ పరిస్థితులను మార్చేసి లబ్ధి పొందేందుకు ఆస్కారం లభించిందని అదానీ పేర్కొన్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్టోరీటెల్లింగ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదని ఆయన తెలిపారు. 2023లో అమెరికన్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఎకాయెకిన 100 బిలియన్ డాలర్లు పడిపోయిందని, దశాబ్దాల కష్టం ఏ విధంగా తప్పుడు కథనాలతో రాత్రికి రాత్రి తుడిచిపెట్టుకుపోతుందనడానికి ఇది నిదర్శనమని అదానీ వ్యాఖ్యానించారు. ‘కొద్ది రోజుల వ్యవధిలోనే మా మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లు పైగా పడిపోయింది. ఇదేదో ఫండమెంటల్స్ మారడం వల్లో లేక వాస్తవ పరిస్థితుల వల్లో జరిగినది కాదు. కేవలం ఒక తప్పుడు కథనాన్ని ఆయుధంగా మార్చుకోవడం వల్ల జరిగినది. నేటి ప్రపంచంలో నిజాన్ని గట్టిగా అరిచి చెప్పాలని ఈ అనుభవం నాకు నేరి్పంది. ఎందుకంటే మనం మౌనం వహిస్తే, మన తలరాతను ఇతరులు రాసేందుకు అస్కారం ఇచి్చనట్లవుతుంది‘అని ఆయన పేర్కొన్నారు. టాప్గన్, ఇండిపెండెన్స్ డే, బ్లాక్ హాక్ డౌన్లాంటి అమెరికన్ సినిమాలు కేవలం చిత్రాలే కాదని, శక్తి సామర్థ్యాల ప్రదర్శన కూడా అని అదానీ చెప్పారు. రాబోయే రోజుల్లో సినిమా భవిష్యత్తును కృత్రిమ మేథ సరికొత్తగా తీర్చిదిద్దుతుందని ఆయన తెలిపారు. ఈ సాధనాలను ఉపయోగించుకుని భారత గాథను ప్రామాణికంగా ప్రపంచానికి చాటి చెప్పాలని యువ క్రియేటర్లకు సూచించారు. -
‘మస్క్.. నీ సంపద బిల్గేట్స్కు మాత్రం ఇవ్వొద్దు’
టెస్లా అధినేత, టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం 485 బిలియన్ డాలర్లకు పైగా సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు. తన సంపదను దానం చేసే గివింగ్ ప్లడ్జ్ తీసుకున్న ఎలాన్ మస్క్కు అలా చేయొద్దని, ఆయన సంపదను బిల్గేట్స్కు మాత్రం ఇవ్వొద్దని సలహా ఇచ్చినట్లు పేపాల్ (PayPal) వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఇన్వెస్టర్ పీటర్ థీల్ తాజాగా వెల్లడించారు.2012లో ఎలాన్ మస్క్.. మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ (Bill Gates), వారెన్ బఫెట్లు కలిసి తీసుకొచ్చిన "గివింగ్ ప్లెడ్జ్" చొరవపై సంతకం చేశారు. దీని ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతులు తమ సంపదలో కనీసం సగం భాగాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలి.రాయిటర్స్కు లభించిన ఉపన్యాస సిరీస్ ట్రాన్స్క్రిప్ట్లు, ఆడియో రికార్డింగ్స్ ప్రకారం.. గివింగ్ ప్లెడ్జ్ ప్రకారం బిల్ గేట్స్ ఎంపిక చేసిన వామపక్ష సంస్థలకు ఆయన సంపద వెళ్తుందని మస్క్కు థీల్ (Peter Thiel) చెప్పాడు. ఈ సంభాషణ సందర్భంగా దైవ విరోధుల చేతుల్లోకి అధికారం వెళ్తే ప్రపంచానికే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వెలిబుచ్చారు.తన సంపదను విరాళంగా ఇవ్వవద్దని థీల్ మస్క్కు సలహా ఇచ్చినప్పుడు, "మరి నేనేమి చేయాలి- నా పిల్లలకు ఇవ్వాలా?" అని మస్క్ అడిగినట్లు థీల్ చెప్పారు. దీనికి థీల్ ఇచ్చిన సమాధానం.. "బిల్ గేట్స్కు ఇవ్వడం మాత్రం చాలా తప్పు". బిలియనీర్లు మరణం తర్వాత వారి సంపద విధి గురించి మరింత విమర్శనాత్మకంగా ఆలోచించాలని థీల్ వాదించారు. ఒక వేళ సంవత్సరంలోపు మస్క్ మరణిస్తే బిలియన్ల డాలర్లు గేట్స్ చేతుల్లోకి వెళ్తాయన్నారు. గేట్స్ చొరవ వంటి వాగ్దానాల ద్వారా సంపదను ఇతరులు నిర్దేశించడానికి అనుమతివ్వడం అంత మంచిది కాదని థీల్ సూచించారు.కాగా ఎలాన్ మస్క్ 2012లో "గివింగ్ ప్లెడ్జ్"పై సంతకం చేశారు. కానీ తన సంపదను ఎలా వినియోగించాలన్నది మాత్రం ఆయన వివరంగా పేర్కొనలేదు.ఇదీ చదవండి: ఈ దుబాయ్ యువరాణి ఎంత రిచ్ అంటే.. -
ఈ దుబాయ్ యువరాణి ఎంత రిచ్ అంటే..
ప్రపంచవ్యాప్తంగా రాజ కుటుంబాలు ముఖ్యంగా వారి విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే దుబాయ్ యువరాణి (Dubai Princess) షేఖా మహ్రాకు ఇన్స్టాగ్రామ్లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచూ తన జీవనశైలి, వ్యాపార యత్నాలు, సొంత ప్రయాణాల గురించి అభిమానులతో పంచుకుంటారు.షేఖా మహ్రా నేపథ్యం1994 ఫిబ్రవరి 26న జన్మించిన షేఖా మహ్రా (Sheikha Mahra).. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. ఆమె తన ప్రారంభ విద్య దుబాయ్లోని ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేసి, లండన్లో అంతర్జాతీయ సంబంధాల్లో డిగ్రీ పొందారు. ఆమె పరోపకార కార్యకలాపాలలోనూ చురుకుగా పాల్గొంటారు. స్థానిక డిజైనర్లకు సహకారం అందిస్తుంటారు.షేఖా మహ్రా నెట్వర్త్పలు నివేదికల ప్రకారం.. షేఖా మహ్రా నెట్వర్త్ 300 మిలియన్ డాలర్ల నుండి 1.5 బిలియన్ల డాలర్ల (రూ.2,600 కోట్ల నుంచి రూ.13,000 కోట్లు) మధ్య ఉంటుందని అంచనా. ఆమె సంపాదనకు ఆమె కుటుంబ వారసత్వం, వ్యాపారంలో విజయాలు, 2024లో ప్రారంభించిన లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్ "మహ్రా ఎం1"తో సహా పలు కారణాలు దోహదం చేశాయి. తన వ్యక్తిగత అనుభవం ప్రేరణతో "డివోర్స్" పేరుతో ఆమె తన బ్రాండ్ మొదటి ఫ్రాగ్రన్స్ను విడుదల చేయగా విజయవంతమైంది.విలాసవంతమైన జీవనశైలిషేఖా మహ్రా విలాసవంతమైన జీవనశైలితో ప్రసిద్ది చెందారు. రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, ఫెరారీ వంటి లగ్జరీ కార్లెన్నో ఆమె వద్ద ఉన్నాయి. ఆమె సంపాదన నెలకు సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లు). ఆమెకు గుర్రాలంటే అమితమైన ఇష్టం. ఫ్యాషన్ సెన్స్ కూడా మహ్రా ప్రసిద్ది చెందారు.రూ.9 కోట్ల ఉంగరం 2024లో షేఖా మహ్రా తన భర్త షేక్ మానా బిన్ మోహమ్మద్ కు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులు ప్రకటించింది. తర్వాత 2025లో ఆమె రాపర్ ఫ్రెంచ్ మోంటానాతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 11 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ ధరించారు. దీని విలువ 1.1 మిలియన్ డాలర్లు (రూ.9 కోట్లు) అని అంచనా. View this post on Instagram A post shared by Xtianna (@_xtianna_) -
అమెజాన్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు
రాయల్ ఎన్ఫీల్డ్ ఆన్లైన్ ఉనికి విస్తరణలో భాగంగా అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, కొత్త మీటియోర్ 350 బైక్లను అమెజాన్ ఇండియా ద్వారా ఆన్లైన్లో కొనుగోళ్లు చేయోచ్చు.అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, పూణే నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినప్పట్టకీ.., డెలివరీ, విక్రయానంతర సేవలను కస్టమర్ ఎంపిక చేసుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ద్వారా అందిస్తామని కంపెనీ తెలిపింది. -
స్మార్ట్ఫోన్ కంపెనీలో జెరోధా కామత్ ఇన్వెస్ట్మెంట్
స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ నథింగ్ (Nothing)లో వెల్త్టెక్ యూనికార్న్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) 2.1 కోట్ల డాలర్లు(రూ. 186 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ ఇటీవల చేపట్టిన 20 కోట్ల డాలర్ల(రూ. 1,775 కోట్లు) నిధుల సమీకరణలో భాగంగా పెట్టుబడులను సమకూర్చినట్లు కామత్ వెల్లడించారు.1.3 బిలియన్ డాలర్ల(రూ. 11,530 కోట్లు) విలువలో నథింగ్ సిరీస్ సీ రౌండ్కు పెట్టుబడులు అందించినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ ఏఐ టెక్నాలజీ కంపెనీగా అభివృద్ధి చెందేందుకు ప్రధానంగా నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు సెప్టెంబర్లో నథింగ్ ప్రకటించింది. నథింగ్కు తెరతీయకముందు కార్ల్ పే.. స్మార్ట్ఫోన్ల దిగ్గజం వన్ప్లస్ సహవ్యవస్థాపకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్ రాజీనామా
దేశీ విమానయాన కంపెనీ ఆకాశ ఎయిర్ (Akasa Air) అంతర్జాతీయ కార్యకలాపాల సీనియర్ వైస్ప్రెసిడెంట్, సహవ్యవస్థాపకురాలు నీలూ ఖత్రి రాజీనామా చేశారు. తద్వారా మూడేళ్ల క్రితమే ఏర్పాటైన కంపెనీ నుంచి నిష్క్రమించారు. ప్రొఫెషనల్గా కొత్త దారిలో ప్రయాణించేందుకు వీలుగా నీలూ ఖత్రి (Neelu Khatri) పదవిని వొదులుకున్నట్లు ఆకాశ ఎయిర్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే అంతకుమించి వివరాలు వెల్లడించలేదు.2022 ఆగస్ట్ 7న కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన ఖత్రి ఆకాశ ఎయిర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులలోనూ ఒకరిగా సేవలు అందిస్తున్నారు. కంపెనీ వ్యవస్థాపకుడు వినయ్ దూబే సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంపెనీ సహవ్యవస్థాపకుల జాబితాలో ఆదిత్య ఘోష్, ఆనంద్ శ్రీనివాసన్, బెల్సన్ కౌటినో, భవిన్ జోషీ, ప్రవీణ్ అయ్యర్ సైతం ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో కొంతమంది కంపెనీ నుంచి వైదొలగడం గమనార్హం! మరోపక్క ఆగస్ట్లో ప్రేమ్జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ తదితర సంస్థల నుంచి నిధుల సమీకరణ పూర్తి చేసుకున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించిన విషయం విదితమే. ఇదీ చదవండి: ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితా: టాప్ 10లో ఒక్క మహిళ -
జీసీసీలకు కీలక హబ్గా తెలంగాణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటుకు తెలంగాణ కీలక గమ్యస్థానంగా మారినట్లు స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ ఎక్స్ఫినో ఒక నివేదికలో తెలిపింది. గత మూడేళ్లుగా భారత్లో ఏర్పాటైన 40 శాతం సెంటర్లను హైదరాబాద్ ఆకర్షించినట్లు వివరించింది. ఇదే వ్యవధిలో బెంగళూరు వాటా 33 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. కేపబిలిటీ సెంటర్లకు సంబంధించి దేశ, విదేశాల్లో తెలంగాణకి పెరుగుతున్న ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోందని రిపోర్ట్ తెలిపింది.టాలెంట్ లభ్యత, మౌలిక వసతులు, పాలసీలు మొదలైనవి రాష్ట్రానికి సానుకూలంగా ఉంటున్నాయని పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 360 జీసీలు ఉన్నట్లు వివరించింది. వీటిలో సుమారు 3.1 లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉన్నారని, రాష్ట్ర వైట్–కాలర్ సిబ్బందిలో ఇది 14 శాతమని రిపోర్ట్ తెలిపింది. ‘‘భారత్లో కొత్తతరం జీసీసీ పవర్హౌస్గా తెలంగాణ వేగంగా ఎదుగుతోంది. నిపుణులైన సిబ్బంది లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాలతో గ్లోబల్ దిగ్గజాలను ఆకర్షిస్తోంది’’ అని ఎక్స్ఫినో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ తెలిపారు. వ్యయాల విషయంలో ఇతర నగరాలకు దీటుగా పోటీనిస్తూ, టెక్నాలజీ, టెక్యేతర కార్యకలాపాలకు కీలకమైన హబ్గా తెలంగాణ నిలుస్తోందని సంస్థ సీఈవోగా కొత్తగా ఎంపికైన పి. ఫ్రాన్సిస్ తెలిపారు. కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతున్న కొత్త తరం జీసీసీలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఉంటోందని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → తెలంగాణలో 47.8 లక్షల మంది వైట్–కాలర్ ప్రొఫెషనల్స్ అందుబాటులో ఉన్నారు. వీరిలో 23.3 లక్షల మందికి ఏడాది పైగా అనుభవం ఉంది. → జీసీసీ సిబ్బందిలో 33 శాతం మంది మహిళలు ఉన్నారు. నాయకత్వ స్థానాల్లో 19 శాతం మంది ఉన్నారు. → రాష్ట్రంలోని మొత్తం జీసీసీ ఉద్యోగాల్లో ఇంజినీరింగ్, ఐటీ వాటా 57 శాతంగా ఉంది. -
టీసీఎస్ క్యూ2.. ఓకే
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్ (క్యూ2)లో నికర లాభం వార్షికంగా నామమాత్ర (1.4 శాతం) వృద్ధితో రూ. 12,075 కోట్లను తాకింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 11,909 కోట్లు ఆర్జించింది. ప్రధానంగా బీఎఫ్ఎస్ఐతోపాటు వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం సైతం స్వల్పంగా 2.4 శాతం పుంజుకుని రూ. 65,799 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 64,259 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే త్రైమాసికవారీగా (క్యూ2తో పోలిస్తే) నికర లాభం 5.3 శాతం క్షీణించగా, ఆదాయం 3.7 శాతం ఎగసింది. వాటాదారులకు ఒక్కో షేరుకీ రూ. 11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 15 రికార్డ్ డేట్కాగా.. నవంబర్ 4కల్లా చెల్లించనుంది. క్యూ2లో అన్ని విభాగాలలోనూ వృద్ధి పథంలో సాగినట్లు కంపెనీ సీఎఫ్వో సమీర్ సేక్సరియా పేర్కొన్నారు. క్రమబద్ధ ఎగ్జిక్యూషన్, వ్యూహాత్మక పెట్టుబడులతో మార్జిన్లనకు బలాన్నిచ్చినట్లు తెలియజేశారు. వేతన పెంపు, భవిష్యత్ అవసరాలకు సంసిద్ధత, కొత్త భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా, టీసీఎస్ క్యూ2లో 10 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. లిస్ట్ఎంగేజ్ కొనుగోలు మసాచుసెట్స్(యూఎస్) సంస్థ లిస్ట్ఎంగేజ్లో 100 శాతం వాటాను టీసీఎస్ కొనుగోలు చేసింది. ఇందుకు యాజమాన్య ప్రోత్సాహకాలు, వ్యయాలుకాకుండా 7.28 కోట్ల డాలర్లు (సుమారు రూ. 645 కోట్లు) వెచ్చించింది.డేటా సెంటర్లకు సై.. 57,700 కోట్ల పెట్టుబడి భారీ పెట్టుబడి ప్రణాళికలతో డేటా సెంటర్ల బిజినెస్లోకి ప్రవేశించనున్నట్లు టీసీఎస్ తాజాగా ప్రకటించింది. ఇందుకు రానున్న 5–7ఏళ్లలో 6.5 బిలియన్ డాలర్ల(రూ. 57,700 కోట్లు)పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కృతివాసన్ వెల్లడించారు. తద్వారా దశలవారీగా 1 గిగావాట్ సామర్థ్యంగల డేటా సెంటర్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. వీటికి పెట్టుబడులను ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు టీసీఎస్ వివరించింది. 150 మెగావాట్లకు బిలియన్ డాలర్లు అవసరంకాగా.. గిగావాట్ సామర్థ్యానికి 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచ్చించవలసి ఉంటుందని కంపెనీ మదింపు చేసింది. టీసీఎస్ షేరు బీఎస్ఈలో 1.2% బలపడి రూ. 3,062 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి.6,000 ఉద్యోగాల కోత కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు టీసీఎస్ సీహెచ్ఆర్వో సుదీప్ కున్నుమల్ వెల్లడించారు. ఇది మొత్తం సిబ్బంది సంఖ్యలో 1 శాతమేనని తెలియజేశారు. అయితే మరింత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తారన్న వదంతులను తోసిపుచ్చారు. కాగా.. ఐటీ నిపుణుల యూనియన్ నైట్స్ వివరాల ప్రకారం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య క్యూ2లో 5,93,314కు చేరింది. ఈ ఏడాది క్యూ1లో నమోదైన 6,13,069 సంఖ్యతో పోలిస్తే 19,755 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే ఈ క్యూ2లో 18,500 మందికి ఉపాధి కల్పించినట్లు కున్నుముల్ పేర్కొన్నారు. భవిష్యత్లో డిమాండుకు అనుగుణంగా నియామకాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీ సిబ్బందిలో 2%(12,261) మందిని తొలగిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించడం తెలిసిందే.పటిష్ట పనితీరు క్యూ2లో ప్రదర్శించిన పటిష్ట పనితీరు సంతోషాన్నిచ్చింది. అంకితభావం, సామర్థ్యాలు చూపిన మా ఉద్యోగులకు కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సర్వీసుల కంపెనీగా అవతరించే ప్రయాణంలో ఉన్నాం. ఇందుకు అనుగుణంగా నైపుణ్యం, మౌలికసదుపాయాలు, వ్యవస్థాగత భాగస్వామ్యాలలో ట్రాన్స్ఫార్మేషన్కు ప్రాధాన్యతనిస్తున్నాం. తగిన పెట్టుబడులు వెచ్చిస్తున్నాం. – కె. కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
TCS: ఒక్క శాతమే పెరిగిన లాభం.. ఒక్కో షేరుకు డివిడెండ్ ఎంతంటే..
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెండో త్రైమాసిక ఫలితాలను (Q2 Results) ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి టీసీఎస్ ఏకీకృత లాభం కేవలం 1.4 శాతం పెరిగి రూ.12,075 కోట్లకు చేరుకుంది.గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.11,909 కోట్లు. సమీక్షలో ఉన్న త్రైమాసికంలో కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.64,259 కోట్లతో పోలిస్తే 2.4% పెరిగి రూ.65,799 కోట్లకు చేరుకుంది.టీసీఎస్ డివిడెండ్టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు ఈక్విటీ షేర్ హోల్డర్లకు రూ.11 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. డివిడెండ్ అందుకోవడానికి వాటాదారుల అర్హతను నిర్ణయించడానికి టీసీఎస్ డివిడెండ్ రికార్డు తేదీని అక్టోబర్ 15గా నిర్ణయించారు.ఇదీ చదవండి: అరట్టై అదుర్స్.. ఆ రెండింటిలో లేని ఫీచర్ ఇదే.. -
బిహార్ బిలియనీర్లు.. బిజినెస్లో తోపులు!
బిహార్ అంటే పేద రాష్ట్రం, నిరక్షరాస్యులు ఎక్కువ అనే అభిప్రాయం దేశంలో చాలామందికి ఉంటుంది. కానీ బిహార్ (Bihar) సాంప్రదాయకంగా పండితులు, నాయకులు, సాంస్కృతిక గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు నిలయంగా కూడా ఉంది.మైనింగ్ నుండి ఫార్మాస్యూటికల్స్, సెక్యూరిటీ సర్వీసులు, పునరుత్పాదక ఇంధనం, రాజకీయాల వరకు వివిధ రంగాల్లో సంకల్పం, విజన్తో వేల కోట్ల సంపదను ఎలా సృష్టించగలరో బిహార్ సంపన్నులు (Richest People In Bihar) చూపిస్తున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. 2025లో బిహార్ లోని టాప్ 10 ధనవంతులు, వారి వ్యాపార సామ్రాజ్యాలు, నెట్వర్త్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.అనిల్ అగర్వాల్నెట్వర్త్: రూ.16,000–17,000 కోట్లుబిజినెస్: వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడు (మైనింగ్ & మెటల్స్)నేపథ్యం: పాట్నాలో స్క్రాప్ డీలర్ గా ప్రారంభించిన అగర్వాల్ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వనరుల కంపెనీలలో ఒకదాన్ని నిర్మించారు. ఇప్పుడు లండన్ లో ప్రధాన కార్యాలయం ఉంది.రవీంద్ర కిషోర్ సిన్హానెట్వర్త్: రూ.5,000–10,000 కోట్లుబిజినెస్: SIS (సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్)నేపథ్యం: భారతదేశపు అతిపెద్ద సెక్యూరిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కంపెనీని నిర్మించిన మాజీ జర్నలిస్ట్.మహేంద్ర ప్రసాద్నెట్వర్త్: రూ .4,000 కోట్లు పైనేబిజినెస్: అరిస్టో ఫార్మాస్యూటికల్స్నేపథ్యం: "కింగ్ మహేంద్ర"గా పిలువబడే ఈయనది బిహార్ ఫార్మా ఉనికిలో కీలక పాత్ర.సంప్రదా సింగ్నెట్వర్త్: (2019లో మరణించడానికి ముందు): రూ .25,000 కోట్లు పైనేబిజినెస్: ఆల్కెమ్ లేబొరేటరీస్నేపథ్యం: తన సోదరుడితో కలిసి ముంబైలో ఆల్కెమ్ ను స్థాపించి, దానిని ప్రముఖ ఫార్మా బ్రాండ్ గా తీర్చిదిద్దారు.సుబ్రతా రాయ్నెట్వర్త్: రూ .3,000 కోట్లు పైనేబిజినెస్: సహారా ఇండియా (ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, మీడియా)నేపథ్యం: 1978లో సహారాను కనీస మూలధనంతో స్థాపించి, దానిని జాతీయ సమ్మేళనంగా నిర్మించారు.శుభమ్ సింగ్నెట్వర్త్: రూ.500+ కోట్లుబిజెనెస్: భారత్ ఊర్జా డిస్టిలరీస్ (ఇథనాల్ ప్లాంట్)నేపథ్యం: కేవలం 26 సంవత్సరాల వయస్సులో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన ఇంధన పారిశ్రామికవేత్తలలో ఒకరుగా బిహార్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని నడిపించారు.సుభాష్ చంద్రనెట్వర్త్: రూ .5,000+ కోట్లుబిజినెస్: ఎస్సెల్ గ్రూప్, జీ మీడియానేపథ్యం: భారతదేశపు అతిపెద్ద మీడియా సామ్రాజ్యాలలో ఒకదాన్ని నిర్మించారు. బీహార్ వెలుపల ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ మూలాలు బిహార్తో ముడిపడి ఉన్నాయి.సుమంత్ సిన్హానెట్వర్త్: రూ .3,000+ కోట్లుబిజినెస్: రెన్యూ పవర్నేపథ్యం: మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా తనయుడైన సుమంత్ భారత క్లీన్ ఎనర్జీ రంగంలో ప్రముఖ పేరు తెచ్చుకున్నారు.ఇదీ చదవండి: నా బంగారం.. ఇంకా పెరుగుతుందోచ్: ‘రిచ్ డాడ్’ రాబర్ట్ -
ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్స్ జాబితా: టాప్ 10లో ఒక్క మహిళ
భారతదేశంలోని అత్యంత ధనవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాను.. ఫోర్బ్స్ ఇండియా (Forbes India) రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) అగ్రస్థానంలో నిలిచారు.105 బిలియన్ డాలర్ల నికర విలువతో ముకేశ్ అంబానీ.. ప్రధమ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈయన సంపద 12 శాతం క్షీణించింది. 2వ స్థానంలో మౌలిక సదుపాయాల దిగ్గజం గౌతమ్ అదానీ & కుటుంబం 92 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. మొత్తం మీద వందమంది ధనవంతుల సంపద 2025లో 9 శాతం తగ్గింది.ఓపీ జిందాల్ గ్రూప్కు చెందిన సావిత్రి జిందాల్ మూడో స్థానంలో నిలిచారు. వీరి నికర విలువ 3.5 బిలియన్లు తగ్గి.. 40.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టాప్ 10 జాబితాలో ఉన్న మహిళగా ఈమె రికార్డ్ క్రియేట్ చేశారు. టెలికాం దిగ్గజం సునీల్ మిట్టల్, టెక్ బిలియనీర్ శివ నాడార్ వరుసగా నాలుగు, ఐదోస్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకిభారతదేశంలోని టాప్ 10 బిలినీయర్స్➤ముకేశ్ అంబానీ: 105 బిలియన్ డాలర్లు➤గౌతమ్ అదానీ & కుటుంబం: 92 బిలియన్ డాలర్లు➤సావిత్రి జిందాల్: 40.2 బిలియన్ డాలర్లు➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 34.2 బిలియన్ డాలర్లు➤శివ్ నాడర్: 33.2 బిలియన్ డాలర్లు➤రాధాకిషన్ దమానీ & కుటుంబం: 28.2 బిలియన్ డాలర్లు➤దిలీప్ షాంఘ్వీ: 26.3 బిలియన్ డాలర్లు➤బజాజ్ కుటుంబం: 21.8 బిలియన్ డాలర్లు➤సైరస్ పూనవల్లా: 21.4 బిలియన్ డాలర్లు➤కుమార్ మంగళం బిర్లా: 20.7 బిలియన్ డాలర్లుForbes India Rich List 2025: India's richest, Mukesh Ambani, remains a 'centibillionaire', Savitri Jindal is the only woman in the top 10, while Sunil Mittal and family are the biggest gainers. Here's a look at India's 100 richest.https://t.co/V7HUD44U4Z— Forbes India (@ForbesIndia) October 9, 2025 -
మార్పు మంచిదే! ఎవరిపై ఎంత ప్రభావం?
ప్రతి ఇంట్లో తరచుగా ఉపయోగించే కొన్ని వస్తువులను వాటి పరిశుభ్రత, పనితీరు లేదా భద్రత కోసం ఒక నిర్దిష్ట సమయం తర్వాత మార్చాల్సి ఉంటుంది. అందులో టూత్ బ్రష్, కిచెన్ స్పాంజ్, సాక్స్లు/ లోదుస్తులు, దిండు.. వంటి వస్తువులున్నాయి. ఈ నిరంతర మార్పు ప్రక్రియ వినియోగదారులకు, కార్పొరేట్ కంపెనీల్లో కంపెనీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.గృహోపకరణాల్లో సాధారణంగా ఏయే వస్తువులు ఎంత కాలానికి మారుస్తారో కింది విధంగా ఉంది.టూత్ బ్రష్ - ప్రతి 3 నెలలకుదిండు - ప్రతి 1–2 సంవత్సరాలకుకిచెన్ స్పాంజ్ - ప్రతి 1–2 వారాలకుసాక్స్, లోదుస్తులు - ప్రతి 6–12 నెలలకురన్నింగ్ షూస్ - ప్రతి 300–500 మైళ్లకుతువ్వాళ్లు - ప్రతి 1–2 సంవత్సరాలకుబెడ్షీట్ - ప్రతి 1–2 వారాలకుకటింగ్ బోర్డు - ప్రతి 1–2 సంవత్సరాలకునిత్యావసర వస్తువులను క్రమం తప్పకుండా మార్చడం వల్ల అనేక వాణిజ్యపరమైన అంశాలు కీలకం అవుతాయి. ఈ వస్తువులకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. వినియోగదారులు నిర్ణీత వ్యవధిలో కొత్త వస్తువును కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి, కంపెనీలకు స్థిరమైన ఆదాయ ప్రవాహం (Steady Revenue Stream) లభిస్తుంది.పునరావృత కొనుగోలు (Repeat Purchases)టూత్ బ్రష్లు, కిచెన్ స్పాంజ్లు వంటివి తక్కువ కాలంలోనే మార్చాల్సి రావడం వల్ల, వినియోగదారులు తరచుగా ఒకే బ్రాండ్ను లేదా స్టోర్ను ఎంచుకునే అవకాశం ఉంది. ఇది వినియోగదారుల విశ్వసనీయత (Customer Loyalty) పెరగడానికి దోహదపడుతుంది.మార్కెటింగ్, బ్రాండింగ్ (Marketing and Branding)కంపెనీలు తమ వస్తువుల మార్పు వ్యవధిని బట్టి మార్కెటింగ్ వ్యూహాలను రూపొందిస్తాయి. ‘ప్రతి మూడు నెలలకు మార్చండి’ వంటి సందేశాలు కొనుగోళ్లను పెంచడంలో సహాయపడతాయి.సరఫరా గొలుసు సామర్థ్యంస్థిరమైన డిమాండ్తో ఉత్పత్తిదారులు తమ సరఫరా గొలుసును (Supply Chain) మరింత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం (Cost of Production) తగ్గుతుంది.కొత్తదనం, ఆవిష్కరణమార్కెట్లో స్థిరంగా సర్వీసు అందించడానికి కంపెనీలు టూత్ బ్రష్లలో కొత్త సాంకేతికతలు, లేదా బెడ్షీట్లలో కొత్త డిజైన్లు వంటి నూతన ఉత్పత్తులను (New Products) ప్రవేశపెట్టడానికి ఆసక్తి చూపుతాయి.వినియోగదారులకు లాభాలుటూత్ బ్రష్, కిచెన్ స్పాంజ్, బెడ్షీట్లను క్రమం తప్పకుండా మార్చడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు పెరగకుండా నియంత్రించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రన్నింగ్ షూస్, కటింగ్ బోర్డుల వంటి వాటిని సమయానికి మార్చడం వల్ల వాటి అసలు పనితీరును (ఉదాహరణకు, షూస్ కుషనింగ్) తిరిగి పొందవచ్చు. కొత్త దిండ్లు, మెత్తటి తువ్వాళ్లు, శుభ్రమైన బెడ్షీట్లు మెరుగైన నిద్ర, సౌకర్యాన్ని అందిస్తాయి.నష్టాలునిరంతరంగా వస్తువులను కొనుగోలు చేయడం వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు ఇది మరింత ప్రభావం చూపుతుంది. తరచుగా వస్తువులను పారవేయడం వల్ల వ్యర్థాలు పెరుగుతాయి. ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ప్లాస్టిక్ టూత్ బ్రష్లు వంటివి భూమిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. వస్తువుల మార్పు తేదీలను గుర్తుంచుకోవడం, వాటిని మళ్లీ మళ్లీ కొనుగోలు చేయాల్సి రావడం ఒక అదనపు భారం అవుతుంది.కార్పొరేట్ కంపెనీలకు లాభాలుఈ వస్తువుల మార్పు చక్రం స్థిరంగా ఉండటం వల్ల కంపెనీలు తమ ఆదాయాన్ని, ఉత్పత్తిని సులభంగా అంచనా వేయగలుగుతాయి. కొత్త వస్తువుల ఆవిష్కరణ లేదా మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను పెంచుకునేందుకు, మార్కెట్ వాటాను విస్తరించేందుకు నిరంతర అవకాశం లభిస్తుంది. భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం వల్ల తయారీ ప్రక్రియలో ప్రామాణీకరణ పెరుగుతుంది. ఫలితంగా ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది.కంపెనీలకు నష్టాలుముడిసరుకు ధరలు పెరిగినప్పుడు స్థిరమైన ఉత్పత్తిని కొనసాగించడానికి కంపెనీలు అధిక వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ మార్కెట్లో అనేక కంపెనీలు ఉండటం వలన తీవ్రమైన పోటీ ఉంటుంది. ధరలు, నాణ్యత, మార్కెటింగ్ పరంగా నిలదొక్కుకోవడం ఒక సవాలు. ఒక ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టిన కొద్ది కాలానికే మెరుగైన సాంకేతికతతో కూడిన మరో కొత్త ఉత్పత్తి వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు, సాధారణ టూత్ బ్రష్ స్థానంలో ఎలక్ట్రిక్ బ్రష్లు రావడం.ఇదీ చదవండి: ఫొటోలకు ప్రాణం పోసేలా వీడియో.. గ్రోక్ ఏఐ కొత్త ఫీచర్ -
84 ఏళ్ల వయసులోనూ స్టైలిష్ హెయిర్స్టైల్
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్లో అధునాతన సాంకేతిక అభివృద్ధి విభాగానికి బాధ్యత వహిస్తున్న చీఫ్ ఇంజినీర్ షోటారో ఓడేట్ ‘అనిమే’ అనే హెయిర్ స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం తన హెయిర్ స్టైల్ కారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 84 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఆటోమోటివ్ నిపుణుడు సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలో అపారమైన కృషి సంస్థలో ప్రత్యేక గుర్తింపు సాధించారు.ఇటీవల ఒక జపనీస్ షోలో ఓడేట్ మాట్లాడుతూ అనిమే స్పైకీ హెయిర్స్టైల్ను ఐదేళ్లుగా కొనసాగిస్తున్నానని వెల్లడించారు. తన జుట్టు అసాధారణంగా గట్టిగా, సులభంగా ముడుచుకుపోతుందని పేర్కొన్నారు. తన పేలవమైన నిద్ర అలవాట్ల కారణంగా ప్రతి ఉదయం జుట్టు అస్తవ్యస్తంగా ఉండేదని చెప్పారు. ఈక్రమంలో కొత్త హెయిర్ స్టైల్ను అనుసరించినట్లు తెలిపారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈయన తన చిన్నతనంలో తన జుట్టును స్టైల్గా ఉంచుకోవడానికి చాలా సమయాన్ని గడిపేవారట.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు..షోటారో ఓడేట్ కేవలం హెయిర్స్టైల్ను ఫాలో అవ్వడంలో మాత్రమేకాదు సాంకేతిక రంగంలో చాలా కృషి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన సురక్షిత డ్రైవింగ్ టెక్నాలజీలకు సంబంధించి మొత్తం 253 పేటెంట్లు కలిగి ఉండటం విశేషం. ఆయన 2003లో హోండాలో చేరినప్పుడు సీట్ బెల్టుల్లో ప్రత్యేకత కలిగిన డిజైనర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోండా సెన్సింగ్ 360+ ADAS సిస్టమ్ లీడ్ ఇంజినీర్గా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.About to go to bed so im going to put this up... Shotaro Odate. 84 years old. Chief Engineer at Honda. Looks strong and rocks the Sasuke Hairstyle daily.Something to strive for. pic.twitter.com/hnUotU6vKV— Jonathan Magno 🇺🇲 🇵🇭 (@HyperM0nkey1) September 29, 2025Honda Chief Engineer Shotaro OdateBeing cool is ageless and timeless. 😊 pic.twitter.com/9KByqO0gtH— meemingwong (@freetheatoms) September 22, 2025 -
అతను లేరు.. తనకో చరిత్ర ఉంది
రతన్ టాటా మరణించి ఏడాది కావొస్తున్నా.. తాను చేసిన మంచి పనులు ఇప్పటికీ ఆయనను గుర్తుచేసుకునేలా చేస్తున్నాయి. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, విపత్తు సహాయ కార్యక్రమాలు వంటి విభాగాల్లో సేవలు అందించి.. ఎంతోమందికి ఉపయోగపడిన రతన్ టాటా.. భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా కృషి చేశారు.రతన్ టాటా దిగ్గజ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతూనే.. భారతదేశ ఆర్థిక స్థిరత, ఉపాధి, విదేశీ పెట్టుబడులు, టెక్నాలజీ అభివృద్ధి మొదలైన రంగాల్లో తనదైన ముద్ర వేశారు. టాటా సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో ఈయన పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి. ఎన్నో జాతీయ.. అంతర్జాతీయ రంగాల్లో పెట్టుబడులు పెట్టి.. కొత్త స్టార్టప్లను ప్రోత్సహించారు. ఇందులో భాగంగానే గ్లోబల్ కంపెనీలు, స్టార్టప్లు, టెక్నాలజీ, ఫిన్టెక్, హెల్త్కేర్, కన్స్యూమర్ ప్రాడక్ట్స్ మొదలైన విభాగాల్లో ఇన్వెస్ట్ చేశారు.ముఖ్యంగా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా రతన్ టాటా.. ఓలా క్యాబ్స్, పేటీఎం, స్నాప్డీల్, అర్బన్ ల్యాడర్, అప్స్టాక్స్, ఫస్ట్క్రై మొదలైన స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. దీని ద్వారా దేశంలో పరిశ్రమలు పెరగడమే కాకుండా.. ఉద్యోగావకాశాలు కూడా మెండుగా లభిస్తాయని భావించారు.రతన్ టాటా గురించిరతన్ టాటా 1937 డిసెంబర్ 28న దేశంలోనే అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయనకి పదేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడంతో.. నానమ్మ దగ్గర పెరిగారు. తరువాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వెంటనే ఐబీఎం కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ జేఆర్డీ టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్లో చేరమని సలహా ఇచ్చారు. దాంతో అమెరికా నుంచి ఇండియాకు వచ్చి జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.1991లో జేఆర్డీ టాటా.. రతన్ టాటాను టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలా మంది బోర్డ్ అఫ్ మెంబెర్స్ ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. ఎటువంటి అనుభవంలేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్లందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగులు తీసింది. రూ.10 వేలకోట్లుగా ఉండే వ్యాపారాన్ని దాదాపు రూ.30 లక్షల కోట్లకు చేర్చారు.ఇంత పెద్ద కంపెనీకి సారథ్యం వహిస్తున్నప్పటికీ రతన్ టాటా ప్రపంచంలో, భారతదేశంలోని ధనవంతుల జాబితాలో ఏనాడూ స్థానం సంపాదించలేదు. ఎందుకంటే టాటా కంపెనీకి వచ్చే లాభాల్లో దాదాపు 66% శాతం టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలకే విరాళం ఇస్తున్నారు. ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవ సంస్థలకు కాకుండా రతన్ టాటాకు చెందితే ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉండేవారు.రతన్ టాటా ఎదుర్కొన్న అవరోధాలురతన్టాటా తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలను అవమానాలను ఎదుర్కొన్నారు. ఉదాహరణకు..1998లో రతన్ టాటా, టాటా ఇండికా కార్లను ప్రవేశపెట్టారు. ఆ కార్లు మొదట సంవత్సరం ఆశించినమేర విక్రయాలు జరగలేదు. దాంతో అందరూ టాటా ఇండికా విభాగాన్ని అమ్మేయాలని సలహా ఇచ్చారు. దాంతో ఫోర్డ్ కంపెనీని ఆశ్రయించారు. కార్ల తయారు చేయడం తెలియనప్పుడు ఎందుకు సాహసం చేయడమని అవమానించారు. ఆ తరువాత క్రమంగా ఇండికాను లాభాలబాట పట్టించారు.ఇదీ చదవండి: 2026లో జీతాలు పెరిగేది వీరికే!.. రిపోర్ట్ వచ్చేసిందియూరప్కు చెందిన కోరస్ స్టీల్ కంపెనీను కొనుగోలు చేశారు. అలాగే ఇంగ్లాండ్కు చెందిన టెట్లీ టీ కంపెనీను కొని ‘టాటా టీ’లో విలీనం చేశారు. దాంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టీ కంపెనీగా టాటా ఎదిగింది. ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా గ్రూప్లో కలుపుకుని టాటాను ఒక అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు రతన్ టాటా. ఒకప్పుడు ఏ బ్రిటిష్ వాళ్లైతే భారతీయులను పరిపాలించారో.. అదే బ్రిటిష్ వారికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. -
ఎస్ఈఐఎల్ ఎనర్జీకి గోల్డెన్ పీకాక్ అవార్డు
ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియాకి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్’ పురస్కారం లభించినట్లు లభించింది. కార్పొరేట్ గవర్నెన్స్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తున్నందుకు గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐవోడీ) ఈ అవార్డును ప్రకటించినట్లు తెలి పింది.పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో కూడుకున్న వ్యాపార విధానాలను పాటించడంపై తమకున్న నిబద్ధతకు ఇది గుర్తింపని సంస్థ సీఈవో జనమేజయ మహాపాత్ర తెలిపారు. నవంబర్ 4న జరిగే గోల్డెన్ పీకాక్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ (ఐపీపీ) దిగ్గజంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
మోదీ లాంటి నాయకుడుండటం మన భాగ్యం : తెగ పొగిడేసిన ఆకాశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ విప్లవాన్ని నడిపించే నాయకుడిని కలిగి ఉండటం భారతదేశ అదృష్టమంటూ కొనియాడారు.బుధవారం న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2025)కు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ, భారతి గ్రూప్ సునీల్ భారతి మిట్టల్ ఇతర కార్పొరేట్ పెద్దలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆకాష్ అంబానీ పీఎం మోదీ నాయకత్వాన్ని, దార్శనికతను ప్రశంసించారు, మోదీ లాంటి నాయకుడిని కలిగి ఉండటం ఇండియా అదృష్టమన్నారు, మోదీ విజన్ గత పాతికేళ్లుగా దేశ సాంకేతిక , ఆర్థిక ప్రయాణాన్ని నిర్దేశించిందనీ, భారతదేశ డిజిటల్ విప్లవంలో ఆయన పాత్ర కీలకమైనదని అభివర్ణించారు.#WATCH | Delhi: On PM Modi's 25 years of serving as head of a government, Chairman of Reliance Jio Infocomm Limited, Akash Ambani says, "It has been an absolutely revolutionary mode for India and we are lucky to have a leader like him." pic.twitter.com/R8i5gdwddx— ANI (@ANI) October 8, 2025అలాగే స్టార్టప్లు, విద్యావేత్తలు మరియు పరిశ్రమ నాయకుల సంయుక్త ప్రయత్నాల ద్వారా ప్రపంచ ఆవిష్కరణ కేంద్రంగా మారే దిశగా దేశం పురోగతిని ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుందని అంబానీ అన్నారు. చిప్ తయారీ నుండి ఫ్రాడ్ మేనేజ్ మెంట్ సిస్టం, తదుపరి తరం వైర్లెస్ కనెక్టివిటీ వరకు, తాము పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని గమనించామని పేర్కొన్నారు. ఇది భారతదేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థకుగర్వకారణమైన క్షణం, దేశం ప్రపంచ డిజిటల్ విప్లవంలో ముందంజలో ఉండ బోతోందన్నారు.ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులుసెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ SP కొచ్చర్ మాట్లాడుతూ, ఐఎంసీ భారతదేశం అధునాతన కనెక్టివిటీ, డిజిటల్ ప్రయాణంలో ఒక కొత్త దశ అన్నారు. దేశీయ సాంకేతిక పురోగతి సమర్థుల చేతుల్లో ఉందనీ మెరుగైన కనెక్టివిటీ మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ,భద్రత, ఆవిష్కరణ, సహకారంపై నిరంతర దృష్టి కారణంగా దేశం చాలా వేగంగా గ్లోబల్ డిజిటల్-ఫస్ట్ ఎకానమీగా అవతరించనుందన్నారు.చదవండి: నడుం నొప్పి తట్టుకోలేక, ఎనిమిది కప్పల్ని మింగేసింది... కట్ చేస్తే -
వెయ్యి కొత్త ఉద్యోగాలు.. డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ ప్రకటన
గ్లోబల్ డిజిటల్ ఇంజినీరింగ్ కంపెనీ నగారో వచ్చే 12–18 నెలల్లో 1,000 మంది పైగా నిపుణులను నియమించుకునే యోచనలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె సహా కీలక హబ్లలో ఈ నియామకాలు చేపట్టనున్నట్లు సంస్థ తెలిపింది. కంపెనీకి ప్రస్తుతం భారత్లో 13,000 మంది ఉద్యోగులు ఉన్నట్లు నగారో సీఈవో మానస్ హుమాన్ వివరించారు.స్టార్టప్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) హైరింగ్ పెరగడంతో మార్కెట్లో నిపుణుల కొరత నెలకొందని, అయితే అంతర్జాతీయ అనిశ్చితులపై ఆందోళన వల్ల ఉద్యోగాలు మారే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు మానస్ తెలిపారు. అంతర్జాతీయంగా వాణిజ్య, టారిఫ్లపరమైన అనిశ్చితులు ప్రభావం చూపుతున్నాయని వివరించారు. -
జాబ్లో చేరిన 4 నెలల్లోనే రూ.1లక్ష వేతనం పెంపు
వేతనాల పెంపు కోసం చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కేవలం నాలుగు నెలల్లోనే భారీ వేతన పెంపును అందుకున్నాడు. కంపెనీలో చేరినప్పుడు తన సీటీసీ(CTC)లో 100% పెరిగిన కొద్ది నెలలకే మరోసారి వేతన పెంపు అందుకున్నాడు. ఈమేరకు రెడ్డిట్లో చేసిన పోస్ట్ కాస్తా వైరల్గా మారింది.పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నేను ప్రముఖ కంపెనీలో ఇటీవలే చేరాను. నాకు 7.2 ఏళ్ల పని అనుభవం ఉంది. అంతకుముందు పని చేసిన కంపెనీతో పోలిస్తే కొత్త సంస్థ 100 శాతం సీటీసీను పెంచింది. నేను ఇంటర్వ్యూలో అడిగిన దానికంటే ఎక్కువగానే వేతనం ఇచ్చారు. దాంతో నాకు ఏటా రూ.31 లక్షలు ఆఫర్ చేశారు. కొత్త సంస్థలో చేరి నాలుగు నెలలైంది. ఇటీవల అప్రైజల్స్ వచ్చాయి. అందులో ఆశ్చర్యంగా నాకు మరో లక్ష పెంచారు. దాంతో నా వార్షిక వేతనం రూ.32 లక్షలైంది’ అని రాసుకొచ్చారు.ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇది అసాధారణమైనది కాదు. మంచి స్టార్టప్ కంపెనీలు నైపుణ్యాలున్న వారి కోసం ఇలా చేస్తాయి’ అని ఒకరు తెలిపారు. మరోవ్యక్తి స్పందిస్తూ..‘కేవలం 5 నెలల్లోనే నేను 16% పెంపు పొందాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
వయసు తక్కువే కానీ.. సంపదలో రారాజులు
భారతదేశ స్టార్టప్, వ్యాపార రంగంలో యువతరం శక్తి అద్భుతమైన ప్రభావాన్ని చూపుతోంది. హురున్ రిచ్ లిస్ట్ 2025 విడుదల చేసిన జాబితా ప్రకారం భారత్లో అత్యంత ధనిక యువ వ్యాపారవేత్తలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుతున్నారు. సాంకేతికత, ఫిన్టెక్, సైబర్ సెక్యూరిటీ, నిర్మాణ రంగాలు.. వంటి వాటిలో తమదైన ముద్ర వేస్తున్నారు.అతి పిన్న వయస్కుడిగా కైవల్య వోహ్రా రికార్డుకైవల్య వోహ్రా కేవలం 22 ఏళ్ల వయస్సులోనే రూ.4,480 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న తన ‘జెప్టో’ స్టార్టప్ నిమిషాల్లో కిరాణా సామాగ్రిని డెలివరీ చేయడంలో నగర జీవన విధానాన్ని మార్చేసింది. జెప్టో సహ-వ్యవస్థాపకుల్లో మరొకరు ఆదిత్ పలిచా (23). రూ.5,380 కోట్ల సంపదతో ముందుకు సాగుతున్నారు.రితేష్ అగర్వాల్ (31): ప్రిజం (OYO) వ్యవస్థాపకుడు. రూ.14,400 కోట్ల నికర విలువతో గ్లోబల్ ఆతిథ్య రంగంలో తనదైన ముద్ర వేశారు. భారతీయ స్టార్టప్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన దార్శనికత ముఖ్యమైనది.అరవింద్ శ్రీనివాస్ (31): శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న పెర్ప్లెక్సిటీ ద్వారా రూ.21,190 కోట్లు సేకరించి గ్లోబల్ టెక్ మార్కెట్లో భారతదేశ ప్రతిభను తెలియజేశారు.త్రిష్నీత్ అరోరా (30): చండీగఢ్కు చెందిన ఈయన తన సైబర్ సెక్యూరిటీ సంస్థ టాక్ సెక్యూరిటీ ద్వారా రూ.1,820 కోట్ల సంపదను ఆర్జించారు.శాశ్వత్ నక్రానీ (27): ఫిన్టెక్ ప్లాట్ఫామ్ భారత్పే సహ వ్యవస్థాపకుడిగా రూ.1,340 కోట్ల నికర విలువతో చిన్న వ్యాపారాల చెల్లింపులను డిజిటలైజ్ చేయడంలో ముందంజలో ఉన్నారు.రోహన్ గుప్తా & ఫ్యామిలీ (26): ఎస్జీ ఫిన్సర్వ్ ద్వారా రూ.1,140 కోట్ల సంపదతో డిజిటల్ ఫైనాన్షియల్ సేవలను ఆధునీకరిస్తున్నారు.హార్దిక్ కొఠియా అండ్ ఫ్యామిలీ (31): సూరత్ కేంద్రంగా ఉన్న రేజోన్ సోలార్ ద్వారా రూ.3,970 కోట్ల సంపదతో పునరుత్పాదక ఇంధన పరిష్కారాలపై దృష్టి సారించి పర్యావరణ అనుకూల ఆవిష్కరణ లాభదాయకతను నిరూపించారు.హర్షారెడ్డి పొంగులేటి (31): హైదరాబాద్కు చెందిన ఈయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా రూ.1,300 కోట్ల నికర విలువతో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగంలో భారతదేశ వృద్ధికి దోహదపడుతున్నారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
దేశంలో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లు ప్రారంభం
భారతదేశంలో కస్టమర్ సపోర్ట్, మేనేజ్మెంట్ను మెరుగుపరచడానికి షావోమి ప్రధాన నగరాల్లో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇది భారత మార్కెట్ పట్ల కంపెనీ దీర్ఘకాలిక నిబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పింది. కంపెనీ తీసుకున్న నిర్ణయంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, జైపూర్, ముంబై, పుణె, అహ్మదాబాద్ల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్లో కేంద్రాలు ప్రాథమికంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.భవిష్యత్తులో దేశవ్యాప్తంగా 100 ప్రీమియం సర్వీస్ సెంటర్లకు విస్తరించాలని సంస్థ యోచిస్తోంది. ఈ సందర్భంగా షావోమి ఇండియా సీఈవో సుధీన్ మాథుర్ మాట్లాడుతూ..‘కంపెనీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం కంటే మమ్మల్ని విశ్వసించే వ్యక్తులతో శాశ్వత సంబంధాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఈ ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించాని నిర్ణయించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
అంబుడ్స్మన్ స్కీమ్ విస్తరణ
రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పరిధిలోకి రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు చేరనున్నాయి. ఇందుకు 2021 ఏకీకృత అంబుడ్స్మన్ పథకం(ఐవోఎస్)లోకి వీటిని చేరుస్తూ ఆర్బీఐ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నవంబర్ 1నుంచి రూ.50 కోట్ల డిపాజిట్ పరిమాణంగల అన్ని వాణిజ్య బ్యాంకులతోపాటు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులు, నాన్షెడ్యూల్డ్ ప్రైమరీ(అర్బన్) సహకార బ్యాంకులకు ఏకీకృత అంబుడ్స్మన్ స్కీమ్ వర్తించనుంది.కనీసం రూ. 100 కోట్లు అంతకుమించిన ఆస్తులు కలిగిన అన్ని నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లనూ పథకం కవర్ చేయనుంది. అయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలను ఈ పథకం నుంచి మినహాయింపునివ్వగా.. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలను చేర్చింది. ఈ ఆర్బీఐ ఐవోఎస్ను 2021 నవంబర్లో ప్రవేశపెట్టింది. అంబుడ్స్మన్ అనేది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఇతర నియంత్రిత సంస్థల వినియోగదారుల కోసం కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ. క్రెడిట్ రిస్క్లో సవరణబ్యాంకుల క్రెడిట్ రిస్క్ నిబంధనలను సవరించేందుకు ఆర్బీఐ తాజాగా ప్రతిపాదించింది. సంభవించిన నష్టాల ఆధారంగా ప్రొవిజనింగ్ చేపట్టేందుకు ప్రస్తుతం బ్యాంకులను ఆర్బీఐ నిబంధనలు అనుమతిస్తున్నాయి. వీటిస్థానే అంచనా రుణ నష్టాల ఆధారిత ప్రొవిజనింగ్కు వీలు కల్పించే విధంగా ఆర్బీఐ నిబంధనల సవరణకు ప్రతిపాదించింది. తద్వారా క్రెడిట్ రిస్క్ నిర్వహణా విధానాలను మరింత పటిష్టం చేయనుంది. అంతేకాకుండా వివిధ ఫైనాన్షియల్ సంస్థలను పోల్చి చూడటంలో మరిన్ని అవకాశాలకు తెరతీయనుంది. 2025 ఆర్బీఐ మార్గదర్శకాలు పేరుతో అంతర్జాతీయంగా అనుమతించిన నిబంధనలు, అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా తాజా ముసాయిదాను రూపొందించింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, దేశవ్యాప్త ఫైనాన్షియల్ సంస్థలు– అసెట్ క్లాసిఫికేషన్, ప్రొవిజనింగ్ అండ్ ఇన్కమ్ రికగ్నిషన్ పేరుతో ముసాయిదాను విడుదల చేసింది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
బజాజ్ అలయెంజ్ పేరు మార్పు
డైవర్సిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం బజాజ్ ఫిన్సర్వ్ తాజాగా బీమా రంగ భాగస్వామ్య సంస్థలను రీబ్రాండింగ్ చేసింది. దీంతో ఇకపై బజాజ్ అలయెంజ్ జనరల్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయెంజ్ లైఫ్ ఇన్సూరెన్స్.. బజాజ్ జనరల్, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్గా సేవలు అందించనున్నాయి. ఈ ఏడాది మొదట్లో రెండు సంస్థలలోనూ భాగస్వామ్య కంపెనీ అలయెంజ్ ఎస్ఈకి గల 26 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు బజాజ్ గ్రూప్ ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకుంది.ఈ ఒప్పందాన్ని అమలు చేయడంతో వీటిలో బజాజ్ గ్రూప్ వాటా ప్రస్తుతం 74 శాతం నుంచి 100 శాతానికి చేరనుంది. ఎస్పీఏకు అన్ని రకాల అనుమతులు లభించడంతో రెండు సంస్థలూ బజాజ్ గ్రూప్నకు పూర్తి అనుబంధ సంస్థలుగా అవతరించనున్నాయి. భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా బజాజ్ గ్రూప్ తొలుత వీటిలో కనీసం 6.1 శాతం వాటా కొనుగోలుని పూర్తి చేయవలసి ఉంటుంది. దీంతో అలయెంజ్ ప్రమోటర్ గుర్తింపును కోల్పోవడం ద్వారా ఇన్వెస్టర్గా మారనుంది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
నేడే నవీ ముంబై విమానాశ్రయం ప్రారంభం
దాదాపు రూ.19,650 కోట్లతో నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (బుధవారం) ప్రారంభించనున్నారు. ముంబైకి కనెక్టివిటీని పెంచేందుకు, ప్రస్తుత విమానాశ్రయంపై భారాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని గ్లోబల్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఐఏటీఏ తెలిపింది. దీనితో భారత ఎకానమీకి కూడా గణనీయంగా లబ్ధి చేకూరుతుందని వివరించింది.భారత ఏవియేషన్ ప్రస్తానంలో నవీ ముంబై ఎయిర్పోర్ట్ ప్రారంభం కీలక మైలురాయిగా నిలుస్తుందని ఐఏటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ (ఏషియా–పసిఫిక్) షెల్డన్ హీ తెలిపారు. తొలి దశలో ఏటా 2 కోట్ల మంది ప్యాసింజర్ల హ్యాండ్లింగ్ సామర్థ్యంతో, ఎయిర్పోర్టులో ఒక టర్మినల్, ఒక రన్వే ఉంటాయి. దేశీయంగా మొట్టమొదటిసారిగా వాటర్ ట్యాక్సీతో కనెక్ట్ అయిన విమానాశ్రయం ఇదే అవుతుందని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
కేంద్రం చెంతకు పంచాయితీ!
బోర్డు నియామకాలు, గవర్నెన్స్ అంశాలపై ట్రస్టీల మధ్య విభేదాలతో టాటా ట్రస్ట్స్లో అంతర్గతంగా ఆధిపత్య పోరు నెలకొన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. హోంమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో టాటా ట్రస్ట్స్ వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ట్రస్టీ డేరియస్ ఖంబట్టా కూడా ఉన్నారు.ట్రస్టీల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో టాటా గ్రూప్నకు చాలా ప్రాధాన్యమున్న నేపథ్యంలో దాని పూర్తి నియంత్రణను ఏ ఒక్కరి చేతికో ఇవ్వడం శ్రేయస్కరమేనా కాదా అనేది ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న సవాలుగా మారిందని వివరించాయి. టాటా ట్రస్ట్స్ ట్రస్టీల మధ్య విభేదాలు టాటా సన్స్పైనా ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి.రెండు వర్గాలుగా ట్రస్టీలు..156 ఏళ్ల దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ గొడుగు కింద 30 లిస్టెడ్ కంపెనీలతో పాటు 400 కంపెనీలు ఉన్నాయి. దీనిపై గణనీయంగా ప్రభావం చూపే.. టాటా ట్రస్ట్స్కి టాటా సన్స్లో 66 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్ బోర్డులో నియామకాలు, గవర్నెన్స్ అంశాల మీద వివాదం నెలకొంది. టాటా సన్స్ బోర్డులో నామినీ డైరెక్టరుగా మాజీ డిఫెన్స్ కార్యదర్శి విజయ్ సింగ్ పునర్నియామకం కోసం సెప్టెంబర్ 11న జరిగిన ఆరుగురు ట్రస్టీల సమావేశంలో దీనికి బీజం పడింది. విజయ్ పేరును ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ ప్రతిపాదించగా, నలుగురు ట్రస్టీలు (మెహ్లి మిస్త్రీ, ప్రమిత్ ఝవేరీ, జహంగీర్ హెచ్సీ జహంగీర్, డేరియస్ ఖంబట్టా) వ్యతిరేకించారు. తదుపరి మెహ్లీ మిస్త్రీని నామినేట్ చేయాలంటూ ఆయన తరఫున ఉన్న నలుగురు ట్రస్టీలు ప్రతిపాదించగా, టాటా గ్రూప్ విలువలను ప్రస్తావిస్తూ దాన్ని నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ వ్యతిరేకించారు. దీనితో విభేదాలు తారస్థాయికి చేరినట్లు సమాచారం.ఇదీ చదవండి: ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలికీలకమైన నిర్ణయాల్లో తనను పక్కన పెడుతున్నారంటూ మెహ్లీ మిస్త్రీ భావిస్తుండగా, ఆయన సారథ్యంలోని ట్రస్టీలంతా కలిసి.. ట్రస్ట్స్లో నోయెల్ టాటా ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గ్రూప్లో కొందరు భావిస్తున్నారు. టాటా సన్స్లో 18.37 శాతం వాటాలున్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి మెహ్లీ మిస్త్రీకి బంధుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధిపత్యం కోసం పోరు నడుమ ట్రస్టీలు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 10న టాటా ట్రస్ట్స్ బోర్డు మరోసారి సమావేశం కానుండగా, అజెండా వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై టాటా ట్రస్ట్ టాటా సన్స్, వేణు శ్రీనివాసన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. టాటా గ్రూప్లో అత్యున్నత స్థాయిలో కొన్నాళ్ల క్రితం కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పటి గౌరవ చైర్మన్ రతన్ టాటా, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ మధ్య విభేదాలు తలెత్తాయి. ఇవి చివరికి మిస్త్రీ ఉద్వాసనకు దారి తీశాయి. ప్రస్తుతం రతన్ టాటా, మిస్త్రీ.. ఇద్దరూ మరణించారు. -
కెనరా హెచ్ఎస్బీసీ @ రూ. 100–106
న్యూఢిల్లీ: బీమా రంగ కంపెనీ కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 100–106 ధరల శ్రేణి ప్రకటించింది. ఈ నెల 10న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారు 23.75 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా కంపెనీ రూ. 2,516 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. 14న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 9న షేర్లను ఆఫర్ చేయనుంది. లిస్టింగ్లో కంపెనీ విలువ రూ. 10,000 కోట్లుగా నమోదయ్యే వీలుంది.ఈ భాగస్వామ్య సంస్థలో పీఎస్యూ కెనరా బ్యాంక్కు 51%, హెచ్ఎస్బీసీ గ్రూప్ కంపెనీ హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ (ఏషియా పసిఫిక్) హోల్డింగ్స్కు 26% చొప్పున వాటా ఉంది. ఐపీవోలో కెనరా బ్యాంక్ 13.77 కోట్ల షేర్లు(14.5 శాతం వాటా), హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్ 47.5 లక్షల షేర్లు(0.5 శాతం వాటా)తోపాటు.. ఇన్వెస్టర్ సంస్థ పంజాబ్ నేషనల్బ్యాంక్ (పీఎన్బీ) 9.5 కోట్ల షేర్లు(10 శాతం వాటా) విక్రయించనున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 140 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ బాటలో ఈ నెల 9న కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఐపీవో సైతం ప్రారంభం కానుంది. ఇది 13న ముగియనుంది. -
2026లో జీతాలు పెరిగేది వీరికే!
భారతదేశంలో 2026లో జీతాలు 9 శాతం పెరుగుతాయని, Aon యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ అండ్ టర్నోవర్ సర్వే ద్వారా వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ, 2025లో నమోదైన 8.9 శాతం జీతాల వృద్ధి కంటే.. ఈ అంచనా స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది.రియల్ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) వరుసగా 10.9 శాతం, 10 శాతం చొప్పున అత్యధిక జీతాల పెరుగుదలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎగుమతులు తగ్గడం, ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రభావం కారణంగా టెక్నాలజీ కన్సల్టింగ్ రంగాలు మాత్రం 6.5 శాతానికి పరిమితం చేయనున్నాయి. 2025 ఐటీ కంపెనీలు 7 శాతం జీతాల పెరుగుదలను ప్రకటించాయి.టాప్/సీనియర్ & మిడిల్ మేనేజ్మెంట్ జీతాల వృద్ధి వరుసగా 8.5 శాతం, 8.9 శాతం వద్ద ఉంటాయి. అయితే.. జూనియర్ మేనేజ్మెంట్ జీతాలు మాత్రం 9.5 శాతానికి (2025లో 9.3 శాతం పెరుగుదల) చేరే అవకాశం ఉంది. పోటీ మార్కెట్లో యువ ప్రతిభను ఆకర్షించడంలో భాగంగానే ఈ కొంత జీతాల పెంపు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఏడాది ఉద్యోగ విరమణ 17.1 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది.1060 కంపెనీల నుంచి సేకరించిన డేటాఈ నివేదికను.. 45 పరిశ్రమలలోని 1,060 కంటే ఎక్కువ కంపెనీల నుంచి డేటా ఆధారంగా రూపొందించారు. ఇందులో సుమారు 43 శాతం కంపెనీలు FY26కి వార్షిక ఆదాయ వృద్ధిని 10 శాతం కంటే ఎక్కువ అంచనా వేయగా.. 27 శాతం మంది 5–10 శాతం వృద్ధిని ఆశిస్తున్నారు. మరో 12 శాతం మంది ఎటువంటి ప్రభావం లేదని అంచనా వేస్తున్నారు. 14 శాతం మంది 0–5 శాతం వృద్ధిని చూస్తున్నారు. 4 శాతం మంది మాత్రం ప్రతికూల వృద్ధిని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు -
ఐఐహెచ్ఎల్ మారిషస్ చేతికి స్టెర్లింగ్ బ్యాంక్
న్యూఢిల్లీ: బహమాస్కి చెందిన స్టెర్లింగ్ బ్యాంకులో మిగతా 49 శాతం వాటాలను దక్కించుకున్నట్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) మారిషస్ వెల్లడించింది. దీనితో బ్యాంకు కొనుగోలు పూర్తయినట్లు వివరించింది.2022 సెప్టెంబర్లో బ్యాంకులో 51 శాతం వాటాను ఐఐహెచ్ఎల్ మారిషస్ కొనుగోలు చేసింది. బ్యాంకు పేరును ’ఐఐహెచ్ఎల్ బ్యాంక్ అండ్ ట్రస్టు’ గా మార్చనున్నట్లు సంస్థ తెలిపింది. బ్యాంకింగ్, బీమా తదితర ఆర్ధిక సేవలందించే ఐఐహెచ్ఎల్ నికర విలువ 1.26 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్లో అయిదో పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఇండస్ఇండ్ బ్యాంక్నకు ఐఐహెచ్ఎల్ ప్రమోటరుగా ఉంది. -
మిలియనీర్గా ఎదిగిన బార్బర్: ట్యాక్సీగా రూ.3.2 కోట్ల కారు!
ఎక్కడైనా ట్యాక్సీ కోసం.. మారుతి కారునో, మహీంద్రా కారునో లేదా టాటా కారునో ఉపయోగిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన ఒక బార్బర్ ఏకంగా రూ.3.2 కోట్ల విలువైన కారును ట్యాక్సీగా అద్దెకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు.బెంగళూరుకు చెందిన రమేష్ బాబు.. టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లెక్కలేనన్ని కార్లను ఈ ఫ్లీట్లో చేర్చిన ఈయన.. తాజాగా 'రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ' కారును చేర్చారు. ఈ కారును డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.రమేష్ బాబు టూర్స్ అండ్ ట్రావెల్స్లో.. ఇప్పటికే రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ మేబాచ్, జీ వ్యాగెన్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130, బీఎండబ్ల్యు ఐ7 వంటి కార్లు చేరాయి. ఇప్పుడు తాజాగా రేంజ్ రోవర్ ఎల్డబ్ల్యుబీ చేరింది. ఈ కారు ఫుజి వైట్ క్లాసీ షేడ్లో ఉన్న హెచ్ఎస్ఈ లాంగ్ వీల్బేస్ వేరియంట్. ఇది 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ ద్వారా 346 బీహెచ్పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.రమేష్ బాబు లగ్జరీ కార్లురమేష్ బాబు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కష్టాలను అధిగమించి.. నేడు మిలియనీర్ స్థాయికి ఎదిగారు. బెంగళూరులో జన్మించిన రమేష్ బాబు తండ్రి బార్బర్, అయితే తన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో.. తల్లి తమను పోషించడానికి పనిమనిషిగా పనిచేసింది. ఈ క్రమంలో రమేష్ బాబు చిన్న చిన్న పనులు చేస్తూ.. పాఠశాల విద్యను పూర్తి చేసి, తండ్రికి చెందిన బార్బర్ షాప్ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులోనే మెల్లగా ఎదిగి, మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు.ఇదీ చదవండి: రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్: టెలిగ్రామ్ సీఈఓమారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసిన తరువాత.. దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా కొంత డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఆలా అద్దెకు కార్లను ఇవ్వడం ద్వారా సంపాదించడం ప్రారభించి.. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రీమియం కార్ల అద్దె కంపెనీ ఏర్పాటు చేశారు. 2011లో అద్దెకు ఇవ్వడానికి రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ I కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈయన అనేక ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నారు. -
రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్
స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుందని.. అందరూ నమ్ముతుంటే, ఫోన్ వాడకపోవడం వల్లే నేను సక్సెస్ సాధించా అని టెలిగ్రామ్ కో-ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) చెబుతున్నారు. ఇంతకీ అదెలా సాధ్యమైంది?, వివరాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ''రోజులో వీలైనంత సమయం.. సుమారు 11 నుంచి 12 గంటలు నిద్ర కోసం కేటాయించడానికి ప్రయత్నిస్తాను. అయితే అన్ని గంటలు నిద్రకోసం కేటాయించినా.. నిద్రపోను. మంచం మీద పడుకుని ఆలోచిస్తూనే ఉంటాను'' అని దురోవ్ పేర్కొన్నారు.పడుకున్నప్పుడే.. నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. తాను సోషల్ నెట్వర్కింగ్లో ఉన్నప్పటికీ.. స్మార్ట్ఫోన్ వాడకం చాలా తక్కువని పేర్కొన్నారు. నిద్ర లేచిన వెంటనే తన ఫోన్ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నోటిఫికేషన్లు, సోషల్ మీడియా వంటివన్నీ ఒక వ్యక్తి రోజును డిసైడ్ చేస్తాయని నమ్ముతాను.జీవితంలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవాలి. ఇతర వ్యక్తులు, కంపెనీ వంటివన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి కాదు. ప్రతి రోజూ ఉదయం ఫోన్ లేకుండానే మీ దినచర్యను ప్రారభించడం అలవాటు చేసుకోవాలి.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలువ్యాయామం చేసేటప్పుడు.. ఇతరత్రా పనులు చేసేటప్పుడు కూడా వీలైనంత ఫోనుకు దూరంగా ఉండాలి. ఫోన్ దూరంగా ఉన్నప్పుడే మీకు అద్భుతమైన ఆలోచనలు రావొచ్చని దురోవ్ చెబుతున్నారు. టెక్నాలజీ, కనెక్టివిటీ వంటి వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. జీవితంలో ఏది ముఖ్యమో దానికోసం సమయం వెచ్చించాలని ఆయన సూచించారు. -
పానీ పూరీలానే...ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా రెసిపీ వైరల్
ప్రముఖ వ్యాపారవేత్త, RPG ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా (Harsh Goenka) ఆహార ప్రియుడు. తరచుగా సోషల్ మీడియాలో తనకు ఆహారం పట్ల ఉన్న ప్రేమ గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆహార ప్రియులకు ఎంతో ఇష్టమైన పానీ పూరీని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర రెసిపీని పంచుకున్నారు. అందులోనూ తనకిష్టమైన ట్రీట్లలో ఒకదాని రెసిపీని పంచుకోవడం విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by Harsh Goenka (@harshgoenka)>పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తాజా ఇన్స్టా పోస్ట్లో ఆయనలోని భోజన ప్రియుడు మరోసారి మనకు దర్శనమిస్తాడు. వ్యాపారానికిమించి, తరచూ ఆసక్తికర విషయాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులతో టచ్లో ఉండటం హర్ష గోయెంకాకు బాగా అలవాటు. పాపులర్ స్ట్రీట్ ఫుడ్ (Street Food) పానీ పూరీ (Pani Puri)ని గుర్తు చేస్తుందీ అంటూ ఆలూ రెసిపీ షేర్ చేశారు. అదే బంగాళాదుంపలను ఉపయోగించి తయారుచేసిన క్రిస్పీ ఫ్రైడ్ ఫ్రెంచ్ డెలికేసీ రెసిపీ.విదేశాలకు వెళ్ళినప్పుడు పోమ్మెస్ సౌఫ్లీస్ అనే ఫ్రెంచ్ ఫ్రైడ్ బంగాళాదుంప వంటకాన్ని ఆస్వాదించినట్టు హర్ష గోయెంకా తెలిపారు. ఈ క్రిస్పీ డిలైట్ను పానీ పూరితో పోల్చారు. "ఇవి మన పానీపూరీల్లాగే ఉంటాయి. కానీ ఎవరూ వాటిని ఎందుకు తయారు చేయరా.. అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది’’ అన్నారు. టేస్ట్ పానీ పూరీలా ఉండకపోవచ్చు..కానీ గాలిమాత్రం ఉంటుంది అంటూ చమత్కరించారు.చదవండి: 84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా!ఇంతకీ దీని రెసిపీ ఏంటంటే..లండన్ లేదా పారిస్లో హర్ష గోయెంకాకు ఇష్టమైన వాటిలో ఒకటి - పొమ్మెస్ సౌఫిల్స్.ఎలా తయారు చేయాలి:బంగాళాదుంపలను చాలా సన్నగా ముక్కలుగా కట్ చేసిన బాగా ఆరబెట్టాలి..మీడియం-వేడి నూనెలో (150°C) తేలికగా సెట్ అయ్యే వరకు ఒకసారి వేయించాలి.వాటిని నూనె నుండి బయటకు తీసిన తర్వాత, కొద్దిసేపు ఆరనివ్వాలి.మళ్ళీ వేడి నూనెలో (190°C) వేయించాలి . దీంతో అవి అద్భుతంగా ఉబ్బుతాయి! వీటిపై సాల్ట్ చల్లుకొని వేడిగా ఆరగించడమే. దీనిపై నెటిజన్ల కామెంట్లతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇదీ చదవండి : రెండేళ్ల శ్రమ ఒక మినిట్లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో -
ఫ్లెక్స్ ఆఫీస్ ట్రెండ్.. హైదరాబాద్ టాప్
దేశంలో ఫ్లెక్స్ ఆఫీస్ ట్రెండ్ వేగంగా సాగుతోంది. అభివృద్ధి చెందిన నగరాల్లో.. హైబ్రిడ్ వర్క్ మోడల్కు ఇదొక ఉత్తమ పరిష్కారం. మైహెచ్క్యూ (MyHQ) 'ఫ్లెక్స్ ఆఫీస్ స్టాక్ ఫుట్ప్రింట్' పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.మైహెచ్క్యూ డేటా ప్రకారం.. భారతదేశంలోని మొత్తం ఫ్లెక్స్ ఆఫీసులలో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈ నగరం ఫ్లెక్స్ ఆఫీస్ హబ్గా మారింది. ఇక్కడ కూడా ప్రధానంగా.. హైటెక్ సిటీలో 23.4 శాతం ఫ్లెక్స్ ఆఫీసుల, మాదాపూర్లో 11.2 శాతం ఉన్నట్లు నివేదిక చెబుతోంది. ఆ తరువాత జాబితాలో బంజారా హిల్స్ (9.9%), బేగంపేట (9.9%), కొండాపూర్ (9.5%), ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ (5.3%) మొదలైనవి ఉన్నాయి.మెట్రో సౌకర్యం, రవాణా కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ఫ్లెక్స్ ఆఫీసుల సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్య గడిచిన మూడేళ్ళలో పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ ట్రెండ్సెట్టర్గా మారిపోయింది. దీంతో ఫ్లెక్స్ ఆఫీసులకు డిమాండ్ పెరుగుతోంది.కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ప్రారంభమైంది. అయితే కరోనా దాదాపు కనుమరుగైపోయినప్పటికీ.. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ విధానాలకు అలవాటుపడిపోయారు. దీనిని నివారించడానికి.. సంస్థలు హైబ్రిడ్ వర్క్ కల్చర్ స్టార్ట్ చేశాయి. దీనికోసం ఫ్లెక్స్ ఆఫీసులను ఎంచుకోవడం మొదలైంది. దీంతో ఫ్లెక్సిబుల్ ఆఫీసులు పుట్టుకొచ్చాయి. ఫ్లెక్సిబుల్ సొల్యూషన్స్ ప్రస్తుతం అన్ని కార్యాలయ లావాదేవీలలో 20% వాటా కలిగి ఉన్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్ వ్యాప్తి దాదాపు 30%కి చేరుకుంటుందని సమాచారం.ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగాలుఫ్లెక్స్ ఆఫీస్ (Flexible Office) అనేది.. ఒకవిధమైన ఆఫీస్ వర్క్ స్పేస్. ఇక్కడ ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీలు తక్కువ ఖర్చుతో.. కార్యాలయ నిర్వహణ చేసుకోవడానికి ఫ్లెక్స్ ఆఫీస్ ఉపయోగపడుతుంది. ఫ్రీలాన్సర్లు, రిమోట్ వర్కర్లు తమకు అవసరమైన స్థలాన్ని ఎంచుకుని పని చేయవచ్చు. ఉద్యోగ వాతావరణం ఉంటుంది కాబట్టి.. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. -
జీఎస్టీ క్రమబద్ధీకరణ తర్వాత ఎస్బీఐ జనరల్ నుంచి కొత్త హెల్త్ ప్లాన్
భారతదేశంలో ప్రముఖ బీమా సంస్థల్లో ఒకటైన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తమ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హెల్త్ ఆల్ఫా (Health Alpha) పేరుతో సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఆధునిక వైద్య ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అన్ని వయసుల వారికి మెరుగైన రక్షణ కల్పించడానికి రూపొందిస్తున్నట్లు చెబుతున్న ఈ ప్లాన్ వివిధ రకాల ప్రత్యేకతలు, సౌకర్యాలు, ప్రయోజనాలు కలిగి ఉందని కంపెనీ తెలిపింది.అనూహ్యంగా పెరిగే వైద్య ఖర్చుల నుంచి పాలసీదారులకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఎస్బీఐ జనరల్ (SBI General) ఈ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. జీఎస్టీ సంస్కరణల తర్వాత ఎస్బీఐ ప్రారంభించిన మొదటి ఆరోగ్య బీమా ఇది.అదనంగా ప్రీమియం చెల్లించకుండా 10 రెట్లు క్లెయిం-ఫ్రీ క్యుమిలేటివ్ బోనస్ను అందిస్తున్నట్లు చెప్పింది. ఈ ప్లాన్లో బేస్ కవరేజీపై గరిష్ట పరిమితి లేదని తెలిపింది. ‘జిమ్, స్పోర్ట్స్ ఇంజ్యూరీ కవరేజి కూడా లభిస్తుంది. అందుకు ఓపీడీ ప్రయోజనాలు, పరీక్షలు, చికిత్స, మందుల ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ప్లాన్ కొనుగోలు చేసేందుకు కోట్ చేసిన 5 రోజుల్లోగా కొనుగోలు చేసినట్లయితే ప్రీమియంపై 5% తగ్గింపు పొందవచ్చు’ అని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: చనిపోయేంత కాలం బ్యాంకు నుంచి డబ్బు వచ్చేలా.. -
ఏపీలో 172 బావుల ఏర్పాటుకు రూ.8,110 కోట్లు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (PML) బ్లాకుల్లో 172 ఆన్షోర్ బావులను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. వీటి ద్వారా చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం రూ.8,110 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అడవులు, వాతావరణ మార్పులకు సంబంధించిన ఒక కమిటీ గత నెలలో జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి (EC) ఇవ్వడానికి సిఫార్సు చేసింది.ఈ ఆన్షోర్ బావుల ఏర్పాటు కోసం పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (EMP)కు సంబంధించి మూలధన వ్యయం రూ.172 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఏటా ఈఎంపీ రెన్యువల్ కోసం చేసే ఖర్చు రూ.91.16 కోట్లు ఉంటుందని చెప్పింది. కమిటీ బహిరంగ విచారణలో చేసిన హామీల కోసం రూ.11 కోట్లు కేటాయించనున్నట్లు పేర్కొంది. పర్యావరణ అనుమతిని సిఫార్సు చేస్తూ కమిటీ ఓఎన్జీసీని అన్ని పర్యావరణ పరిరక్షణ చర్యలు, భద్రతా ఏర్పాట్లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.మే నెలలో జారీ చేసిన ఎన్ఓసీ (NOC) ప్రకారం కోరింగా వన్యప్రాణుల అభయారణ్యం పర్యావరణ సున్నిత ప్రాంతం (eco-sensitive area) నుంచి 10 కి.మీ. లోపు ఏ బావిని కూడా ఏర్పాటు చేయరు. ముందస్తు అనుమతి లేకుండా అటవీ భూమి/ రక్షిత ప్రాంతంలో పైప్లైన్లు ఏర్పాటు చేయరు.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే.. -
వరుసలో చివరి అక్షరం అని తీసిపారేయకండి!
కార్పొరేట్ కంపెనీలు, కొత్తగా ప్రారంభమవుతున్న స్టార్టప్లు తమ పేర్లను ‘Z’ అనే అక్షరంతో ప్రారంభించడానికి మొగ్గు చూపుతున్నాయి. అయితే ఇలా కంపెనీలు Zతో పేర్లను ప్రారంభించడానికిగల కారణాలను మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈ పంథాను ఇప్పటికే అనుసరించిన కొన్ని ప్రముఖ కంపెనీల వివరాలను కింద చూద్దాం.Gen Zతో అనుబంధంజెన్జీ- 1990 నుంచి 2010ల మధ్య జన్మించిన Gen Z (జనరేషన్ Z) ప్రస్తుతం ప్రపంచ వినియోగదారుల్లో, శ్రామిక శక్తిలో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు. ఈ తరం డిజిటల్ నేటివ్గా మారుతున్నారు. వీరు వేగవంతమైన మార్పులను అంగీకరించే వారిగా ఉన్నారు. కంపెనీ పేరులో 'Z' ఉండటం ద్వారా తాము ఈ ఆధునిక, సాంకేతికత ఆధారిత, డైనమిక్ తరానికి చెందినవారమని, వారి అవసరాలను తీర్చగలమని పరోక్షంగా కంపెనీలు సందేశం పంపవచ్చు.'Z' అక్షరం యువతలో ట్రెండీగా, విభిన్నంగా కనిపిస్తుంది. ఇది కొత్తదనాన్ని, భవిష్యత్తు, సాంప్రదాయేతర విధానాన్ని సూచిస్తుంది.మార్కెట్లో విభిన్నతఆంగ్ల అక్షరమాల (Alphabet)లో చివరి అక్షరం 'Z'. ఇది ఒక కంపెనీని సులభంగా గుర్తుంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. 'A' లేదా 'G'.. వంటి సాధారణ అక్షరాలతో పోలిస్తే 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి కంపెనీ పేరు వేగంగా దృష్టిని ఆకర్షిస్తుంది.కొన్నిసార్లు వెబ్సైట్ డైరెక్టరీల్లో లేదా యాప్ స్టోర్ల్లో (A-Z జాబితా) పేర్లు ఆల్ఫాబెటికల్ క్రమంలో ఉన్నప్పుడు 'Z' తో ప్రారంభమయ్యే పేర్లు జాబితాలో చివరిలో కనిపించి వినియోగదారులకు ప్రత్యేకంగా గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది.డొమైన్ నేమ్స్ఇంటర్నెట్లో కొత్త స్టార్టప్లకు తమకు నచ్చిన పేరుతో డొమైన్ పేరు (ఉదా: example.com) దొరకడం చాలా కష్టం. 'Z' అక్షరం అరుదుగా ఉపయోగించబడటం వల్ల ఈ అక్షరంతో ప్రారంభమయ్యే అర్థవంతమైన పేర్లు, వాటికి అనుగుణమైన డొమైన్ నేమ్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ సులభంగా లభిస్తాయి.'Z' తో ప్రారంభమయ్యే పేర్లను తరచుగా పలకడం, వినడం సులువుగా ఉంటుంది. (ఉదాహరణకు: జెప్టో, జొమాటో). ఇది వేగవంతమైన డిజిటల్ యుగానికి సరిపోయేలా ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..'Z' అక్షరంతో ప్రారంభమైన ప్రముఖ కంపెనీలుకంపెనీస్థాపించబడిన దేశంప్రధాన వ్యాపారంZeptoభారతదేశంక్విక్ కామర్స్ (10 నిమిషాల కిరాణా డెలివరీ)Zetwerkభారతదేశంమ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ (B2B)Zomatoభారతదేశంఆన్లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ అగ్రిగేటర్Zerodhaభారతదేశంఆన్లైన్ స్టాక్ బ్రోకరేజ్ (ట్రేడింగ్)Zillowఅమెరికారియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేస్Zoomఅమెరికావీడియో కమ్యూనికేషన్స్ టెక్నాలజీ -
‘దీపావళి’ పర్యాటక కళ!
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణ బుకింగ్లకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులతో పండుగ సంబరాలు చేసుకునేందుకు.. దేశ, విదేశాల్లోని సుందర ప్రదేశాలు చూసి వచ్చేందుకు.. ఇలా అన్ని రకాల ట్రావెల్ బుకింగ్లకు డిమాండ్ ఏర్పడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బంధు మిత్రులను కలుసుకోవడం పడుగల సీజన్లో ప్రయాణాలకు కీలక డిమాండ్గా ఉన్నట్టు మేక్మై ట్రిప్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో రాజేష్ మాగోవ్ తెలిపారు. ఈ సమయంలో వేడుకల కోసం స్వస్థలాలకు వెళుతుంటారని చెప్పారు. అత్యధికంగా బుకింగ్లు జరిగిన టాప్–10 ప్రదేశాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయంటూ.. పుణ్యక్షేత్రాలకు సైతం డిమాండ్ పెరిగినట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూఏఈ, సింగపూర్, థాయ్లాండ్, వియత్నాంకు బుకింగ్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా కొత్త ప్రదేశాలకు చూసి వచ్చేందుకు ఆసక్తి పెరుగుతోందని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రాజీవ్ కాలే సైతం తెలిపారు. ‘‘ఒక్కొక్కరు పర్యటన కోసం చేసే సగటు వ్యయం పెరుగుతుండడం ఆసక్తికరం. ప్రయాణికులు ఎక్కువ రోజులు బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా కనిపించే మూడు రోజులకు బదులు 6–12 రోజులకు బుక్ చేసుకుంటున్నారు’’అని తెలిపారు. యూరప్లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆ్రస్టియా, స్పెయిన్, పోర్చుగల్ ప్రధాన బుకింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. స్వల్పకాలం కోసం వియత్నాం, ఒమన్, మాల్దీవులు, బాలి, కంబోడియాకు డిమాండ్ నెలకొన్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. వీసా పరంగా సులభ ప్రవేశానికి అవకాశం ఉన్న థాయ్లాండ్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, దుబాయి–అబుదాబి, ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్కు ఎప్పటి మాదిరే డిమాండ్ కనిపిస్తున్నట్టు చెప్పారు. వారణాసికి డిమాండ్.. దేశీయంగా కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, అండమాన్తోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలైన చార్ధామ్, కైలాస్ మానససరోవర్, అయోధ్య, వారణాసి వెళ్లొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ఫ్లయిట్ బుకింగ్లు పెరిగినట్టు ఇక్సిగో గ్రూప్ సీఈవో అలోకే బాజ్పాయ్ తెలిపారు. గతేడాదితో పోల్చి చూస్తే 60–65 శాతం డిమాండ్ పెరిగినట్టు చెప్పారు. ముఖ్యంగా అయోధ్య, వారణాసికి బుకింగ్లు 100 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. జెనరేషన్ జెడ్, దంపతులు అయితే క్రూయిజ్ బుకింగ్లు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ దీపావళి సీజన్కు ముందు 4, 5 స్టార్ హోటళ్లలో బుకింగ్లు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా 5 స్టార్ కోసం రెండు రెట్లు అధికంగా బుకింగ్లు వస్తున్నట్టు క్లియర్ట్రిప్ అధికార ప్రతినిధి సైతం తెలిపారు. పండుగలకు ముందు నాటితో పోల్చి చూస్తే ఫ్లయిట్ బుకింగ్ రెండు రెట్లు, హోటల్ బుకింగ్లు 3.5 రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. -
ఇండియన్ ఆయిల్ డైరెక్టర్గా సౌమిత్ర పి శ్రీవాస్తవ
ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్గా.. సౌమిత్ర పి శ్రీవాస్తవ (Saumitra P Srivastava) బాధ్యతలు స్వీకరించారు. కంపెనీలో సుమారు 30ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈయన.. ఐఐటీ రూర్కెలా నుంచి సివిల్ ఇంజినీరింగ్, ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ఎల్పీజీ వ్యాపార విభాగంలో నాలుగేళ్ల పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఆయిల్ సంస్థలో చేరిన.. సౌమిత్ర పి శ్రీవాస్తవ సేల్స్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో వ్యాపార విస్తరణకు కీలకంగా మారారు. ఈయనకు ముంబై, ఢిల్లీ డివిజన్ కార్యాలయాలను నడిపిన అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా సేల్స్ విభాగంలో పనిచేశారు. మహారాష్ట్ర, గోవా హెడ్ ఆఫ్ స్టేట్గా పనిచేసిన సమయంలో.. ప్రధాన ఉత్పత్తులు, వ్యాపారాలను ఈయన విజయవంతంగా నిర్వహించారు. -
టిమ్ కుక్ తరువాత యాపిల్ సీఈఓ ఎవరు?
టిమ్ కుక్ (Tim Cook)కు వచ్చే ఏడాదికి 65 ఏళ్లు నిండుతాయి. 2011లో యాపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన కంపెనీ నుంచి నిష్క్రమించిన తరువాత.. అతని స్థానంలో ఎవరు రావచ్చనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే!.గత కొన్ని సంవత్సరాలుగా.. యాపిల్ కంపెనీ నుంచి ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వైదొలిగారు. ఈ జాబితాలో డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, రిటైల్ హెడ్ ఏంజెలా అహ్రెండ్ట్స్, సీఎఫ్ఓ లూకా మాస్ట్రీ, సీఓఓ జెఫ్ విలియమ్స్ ఉన్నారు. వీరు కంపెనీ నుంచి వైదొలిగినప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. కానీ టిమ్ కుక్ నిష్క్రమణ తప్పకుండా చర్చనీయాంశమే. ఎందుకంటే.. ఆయన స్థానాన్ని పొందే వ్యక్తి యాపిక్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతటి వ్యక్తి 'జాన్ టర్నస్' అని వినిపిస్తోంది.జాన్ టర్నస్.. యాపిల్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్లో ఉంటూ.. కీలక పదవులను చేపట్టారు. ఈయన వ్యూహాలు కూడా హార్డ్వేర్ పాత్రకు మించి ఉంటాయి. ప్రస్తుతం ఈయన వయసు 50 ఏళ్లు. యాపిల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిక్ కుక్ వయసు 50 సంవత్సరాలే.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?జాన్ టర్నస్కు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. ఈయన యాపిల్ మొట్టమొదటి కొత్త ఐఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ అయిన ఐఫోన్ ఎయిర్ను పరిచయం చేశారు. ఈయన ఐఫోన్ 17 లాంచ్ సందర్భంగా లండన్లోని యాపిల్ రీజెంట్ స్ట్రీట్ స్టోర్లో కస్టమర్లను కూడా పలకరించారు. ఇలాంటి కారణాల వల్ల కుక్ స్వయంగా అతన్ని ఎక్కువగా విశ్వసిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతాయి. అయితే సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే అంశం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. -
హైదరాబాద్లో ప్రారంభమైన రీఫర్ రైలు సర్వీస్
ఇండియా ఫార్మాస్యూటికల్ లాజిస్టిక్స్ను ప్రోత్సహించడంలో భాగంగా.. డీపీ వరల్డ్, హైదరాబాద్లో మొట్టమొదటి స్పెషల్ రీఫర్ రైలు (Reefer Rail)ను ప్రారంభించింది. తిమ్మాపూర్ (Thimmapur) నుంచి నవా షెవా (Nhava Sheva) మధ్య దీని సేవలను అందిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తరలించాల్సిన వస్తువులను.. ఈ రీఫర్ రైలు ద్వారా సరఫరా చేస్తారు. ఫార్మా ఎగుమతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.వారానికి ఒకసారి మాత్రమే ప్రయాణించే ఈ రైలులో 43 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లు ఉంటాయి. ఇది నెలకు నాలుగుసార్లు ప్రయాణిస్తుంది. స్పెషల్ ట్రైన్ ప్రారంభించడం వల్ల.. 43 ట్రక్కుల అవసరం తగ్గడం మాత్రమే కాకుండా.. రోడ్డుపై రద్దీ కూడా కొంత తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు కూడా 70 శాతం వరకు తగ్గుతాయి.ప్రతి కంటైనర్ ఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉండటం కోసం.. కావలసిన ఏర్పాట్లను చేశారు. సాంకేతిక నిపుణులు దీనిని పర్యక్షిస్తూ ఉంటారు. కాబట్టి దీని ద్వారా వస్తువులను సురక్షితంగా గమ్యం చేర్చవచ్చు. -
ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరులలో ఒకరు. ఈయన సంపద కొన్ని చిన్న దేశాల జీడీపీ(GDP)ల కంటే ఎక్కువ. ఇంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తన పర్సులో ఎంత డబ్బు పెట్టుకుంటారో బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. అయితే దీనికి అంబానీ సమాధానం ఇచ్చారు.ముకేశ్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే.. వీరు ఖరీదైన ఇంట్లో నివసించడం, అత్యంత లగ్జరీ కార్లను తమ రోజువారీ వినియోగిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా కూడా విలువైన ఆభరణాలు ధరించడం.. అనంత్ అంబానీ బ్రాండెడ్ గడియారాలు ధరించిన సన్నివేశాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ముఖేష్ అంబానీ మాత్రం.. ఎక్కువగా సాధారణ దుస్తులు ధరించి, ఫార్మల్ ప్యాంటుతో కనిపిస్తారు.డబ్బు ఒక వనరు మాత్రమేముకేశ్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు, డబ్బు కేవలం ఒక వనరు మాత్రమే అని వెల్లడించారు. నేను ఎప్పుడూ పర్సులో నగదు లేదా క్రెడిట్ కార్డులను తీసుకెళ్లనని స్వయంగా వెల్లడించారు. అయితే బిల్లులు చెల్లించడానికి ఎల్లప్పుడూ నాతో ఎవరైనా ఉంటారని పేర్కొన్నారు. తాను స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ తనతో డబ్బు తీసుకెళ్లలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!బిరుదులు ఇష్టం ఉండదుమీడియా లేదా ఏదైనా ప్రత్యేక వార్తాపత్రిక తనను ఏదైనా బిరుదుతో సత్కరించడం తనకు ఇష్టం ఉండదని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచ ధనవంతులలో ఒకరైన ఈయన.. తన వ్యక్తిగత జీవితంలో చాలా నిశ్చింతగా ఉండటానికి ఇష్టపడతారని వీటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అతను సరళమైన జీవనశైలిని ఆస్వాదిస్తాఋ, ఉదయాన్నే నిద్రలేవడం.. ఎక్కడికీ వెళ్ళే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. -
కొత్త రకాల వీసాలను ప్రకటించిన యూఏఈ
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించింది. రెసిడెన్సీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. వీటిలో ఏఐ, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజం కోసం నాలుగు కొత్త వీసా (New Visa) కేటగిరీలు ఉన్నాయి.అంతే కాకుండా, వ్యాపార, ట్రక్ డ్రైవర్ వీసాలకు సంబంధించి కూడా మార్పులు చేశారు. మానవతా సహాయం, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, నివాసితుల బంధువులు, స్నేహితులకు కూడా రెసిడెన్సీ అవకాశం కల్పిస్తున్నారు.నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు ఇవే..ఏఐ స్పెషలిస్ట్ వీసా: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందు కోసం టెక్ ఫోకస్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది. ఒకటి లేదా ఎక్కువ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ వీసా: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ లోని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా ఇది. విశ్రాంతి లేదా ప్రదర్శన నిమిత్తం వచ్చే ప్రముఖులకు దీన్ని కేటాయిస్తారు.ఈవెంట్ వీసా: పండుగలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేవారికి ఈ ఈవెంట్ వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ఈవెంట్ నిర్వాహకులచే స్పాన్సర్ చేయాలి.క్రూయిజ్ టూరిజం వీసా: క్రూయిజ్ ట్రావెలర్లకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇది. లైసెన్స్ పొందిన మారిటైమ్ సంస్థల ద్వారా స్పాన్సర్ చేస్తారు.రెసిడెన్సీ, ఇతర వీసా అప్డేట్లుహ్యుమానిటేరియన్ రెసిడెన్స్ పర్మిట్: సంక్షోభ పరిస్థితుల నుంచి వచ్చే వ్యక్తులకు ఒక సంవత్సరం పునరుద్ధరించతగిన వీసా.స్నేహితులు, బంధువుల కోసం విజిట్ వీసా: నివాసితులు తమ బంధువులకు దీన్ని స్పాన్సర్ చేయవచ్చు.ట్రక్ డ్రైవర్ వీసా: లాజిస్టిక్స్ లో కార్మిక కొరతను పరిష్కరించే వీసా. లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది.వితంతువులు, విడాకులకు రెసిడెన్సీ: నిర్వచించిన పరిస్థితులలో ఒక సంవత్సరం పునరుద్ధరణ అనుమతి.బిజినెస్ ఎక్స్ ప్లోరేషన్ వీసా: బిజినెస్ ప్రారంభించేందుకు వచ్చే ఆర్థిక సాల్వెన్సీ రుజువు ఉన్న వ్యాపారవేత్తలకు జారీ చేస్తారు. -
హైదరాబాద్లో ఎలి లిల్లీ తయారీ కేంద్రం ఏర్పాటు
గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Company) భారతదేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి 1 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్లో మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం భారతదేశం అంతటా కంపెనీ కాంట్రాక్ట్ తయారీ నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులను ప్రశంసించారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భవించడానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమైన మౌలిక సదుపాయాలు, సులభతర వ్యాపారం (Ease of Doing Business) వంటి అంశాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకం అవుతున్నట్లు చెప్పారు.కంపెనీ ఏర్పాటు చేయబోయే అత్యాధునిక సదుపాయంలో ఇంజినీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రవేత్తలు, నిపుణుల కోసం తక్షణమే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు బలాన్ని ఇస్తూ వినూత్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ..‘మా గ్లోబల్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. లిల్లీ డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్.. వంటి వాటికి ఔషధాలు తయారు చేస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..
భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ముందుంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% జీడీపీ వృద్ధిని సాధించింది. తయారీ, సేవల రంగాల్లో బలంగా ఉంది. అయితే దేశ సంపదకు మూలమైనవారు.. కంపెనీల వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రం దేశాన్ని విడిచి వెళ్తున్నారు. తమ సంస్థలు భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నా తాము విదేశాల్లో స్థిరపడేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు కొన్ని కారణాలను కోటక్-ఈవై సర్వే వెల్లడించింది.భారతదేశం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుంటే దాని సంపద సృష్టికర్తలు ఎందుకు నిష్క్రమిస్తున్నారనే దానిపై కోటక్ ఈవై నివేదిక రూపొందించింది. భారతీయ ధనవంతులు విదేశాలకు వలస వెళ్లడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలిపింది.మెరుగైన జీవన నాణ్యత, మౌలిక సదుపాయాలుప్రపంచంలోని 50 అత్యంత కలుషితమైన నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి. ఇది సంపన్న కుటుంబాలను సింగపూర్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి సురక్షితమైన, సుసంపన్నమైన జీవన వాతావరణానికి ప్రేరేపించేలా చేస్తుంది.ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలుభారతదేశం జీడీపీలో ప్రజారోగ్యం కోసం కేవలం 2.1%, విద్య కోసం 2.9% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచ ప్రమాణాలైన 6% కంటే చాలా తక్కువ. దీని కారణంగా ధనవంతులు మెరుగైన ప్రైవేట్ సేవలు, ప్రపంచ స్థాయి విద్య కోసం యూఎస్ఏ, యూకే లేదా కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు.స్నేహపూర్వక పన్ను విధానాలు..భారత్లో 42.74% అధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉంది. దుబాయ్లో సున్నా పన్ను. పోర్చుగల్లో పదేళ్ల పన్ను మినహాయింపులు ఆకర్షణీయంగా తోస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో 52 మిలియన్లకు పైగా కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం వలన పౌర వివాదాలు దశాబ్దాల పాటు సాగుతున్నాయి. ఇది వ్యాపారవేత్తలకు ఆమోదయోగ్యం కాని జాప్యాన్ని సూచిస్తుంది.విదేశాల్లోని భారతీయులుపేరుస్థూల విలువ (రూ.కోట్లలో)ప్రస్తుత ప్రదేశంగోపీచంద్ హిందూజా & ఫ్యామిలీ1,85,310లండన్లక్ష్మీ మిట్టల్1,75,390లండన్జే చౌదరి1,46,470శాన్ జోస్, అమెరికాఅనిల్ అగర్వాల్1,11,400లండన్షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, కుటుంబం88,650మొనాకోప్రకాష్ లోహియా87,700లండన్వివేక్ చాంద్ సెహగల్57,060మెల్బోర్న్జయశ్రీ ఉల్లాల్50,170శాన్ ఫ్రాన్సిస్కోయూసఫ్ అలీ, ఎం.ఎ.46,300అబుదాబిరాకేష్ గంగ్వాల్42,790మయామి, అమెరికా నీరవ్ మోదీ (యూకే), మెహుల్ చోక్సీ (ఆంటిగ్వా) వంటివారు పరారీలో ఉన్నారు. ఈ వజ్రాల వ్యాపారులు అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.దేశీయ పెట్టుబడుల బలహీనతలిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS-దేశం నుంచి విదేశాలకు వెళ్లే డబ్బు) కింద విదేశీ చెల్లింపులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 27.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 38% పెరిగింది. ఈ మూలధనం విదేశీ రియల్ ఎస్టేట్, రెసిడెన్సీ కార్యక్రమాలకు మళ్లించబడుతుంది. ఇది దేశీయ వృద్ధికి ఉపయోగపడదు. దీనికి విరుద్ధంగా భారతదేశంలోకి ఎఫ్డీఐ 2022-23లో 84.8 బిలియన్ డాలర్ల నుంచి 71 బిలియన్ డాలర్లకు తగ్గింది.2023లో 6,500 మంది మిలియనీర్లు భారతదేశాన్ని విడిచిపెట్టారని హెన్లీ & పార్టనర్స్ నివేదించింది. 2025 నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి 8,000కి పెరగవచ్చని గతంలో అంచనా వేసింది. ఇది ప్రతిభతోపాటు సంపదను కోల్పోవడాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు -
అదానీ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు
టాప్ బిలియనీర్ గౌతమ్ అదానీకి (Gautam Adani) ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్పై రెండు వేర్వేరు డిమాండ్ నోటీసుల్లో మొత్తం రూ .23.07 కోట్లు జరిమానాలు విధించింది. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయాలని యోచిస్తోంది.ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో 2015-16 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయానికి సంబంధించిన తప్పుడు వివరాలను అందించడం"పై రూ .14.22 కోట్ల జరిమానా విధించగా, 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయాన్ని తక్కువగా నివేదించడం"పై మరో రూ .8.85 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.సవాలు చేస్తాం.."నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా కంపెనీ రెండు ఉత్తర్వులను సవాలు చేస్తుంది. దీంతోపాటు సమాంతరంగా, సంబంధిత ఉత్తర్వుల ప్రకారం లేవనెత్తిన జరిమానా డిమాండ్లపై స్టే కోరుతుంది" అని ఏసీసీ రెగ్యులేటర్ ఫైలింగ్స్లో తెలిపింది. ఈ రెండు డిమాండ్ నోటీసులను అక్టోబర్ 1న స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. ఈ జరిమానాలు సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది.అదానీ సిమెంట్ గురించి..అదానీ సిమెంట్.. అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థ. ఇది కంపెనీలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్లో అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థ ఏసీసీ లిమిటెడ్ను 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు! -
మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు!
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన కథనం వైరల్గా మారింది. రిక్రూట్మెంట్ సమయంలో పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం అని చెప్పిన కంపెనీ సడెన్గా ఫిజికల్గా ఆఫీస్కు రావాలని ఆదేశించినట్లు అందులో రాసుకొచ్చారు. అయితే మేనేజర్ కావాలనే ఇలా తనను వేదిస్తున్నట్లు చెప్పారు. తాను ఉంటున్న ప్రాంతం ఆఫీస్కు 300 కి.మీ ఉండడంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.‘రిక్రూట్మెంట్ సమయంలో పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం అన్నారు. నేను కంపెనీలో చేరి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీస్కు 300 కి.మీ. ఇప్పటివరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆఫీస్కు రమ్మనారు. కానీ ఇప్పడు నన్ను మేనేజర్ కావాలనే ప్రతివారం రమ్మంటున్నాడు. టీమ్ బిల్డింగ్, ఆఫీస్ సంస్కృతిని సంరక్షించడం అనేవి కారణంగా చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై మేనేజర్తో మాట్లాడినా లాభం లేకుండా పోయింది. ఇది స్నేహపూర్వకమైన వృత్తిపరమైన సంబంధాన్ని ఘర్షణకు, ఒత్తిడికి తావిస్తుంది. మేనేజర్ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాను. అదేసమయంలో కెరియర్ అవకాశాలు, టీమ్ రిలేషన్స్ దెబ్బతింటాయేమోనని ఆలోచలున్నాయి’ అని పోస్ట్లో తెలిపారు.రెడిట్ ప్లాట్ఫామ్లో వెలసిన ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగి పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అనివార్య సమస్య అని పేర్కొన్నారు. ‘టీమ్ బిల్డింగ్’ లేదా ‘ఆఫీస్ సంస్కృతి’ని సంరక్షించడం అనే సాకుతో చాలామంది ఇలా ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నట్లు కొందరు చెప్పారు. కొంతమంది మేనేజర్లు తాము రిమోట్గా పని చేస్తూనే కింది సిబ్బందిని కార్యాలయానికి రావాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి? -
రెనోలో 3000 మంది బయటకు!: కారణం ఇదే..
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ తొలగింపులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.రెనాల్ట్ కంపెనీ.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం మీద సంస్థ తన మొత్తం ఉద్యోగులలో 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలగింపులు సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాలలో కూడా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెనాల్ట్ కంపెనీ 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 98,636 మంది సిబ్బందిని నియమించింది. ''ఆటోమోటివ్ మార్కెట్లోని అనిశ్చితులు.. పోటీ వాతావరణం దృష్ట్యా, మా కార్యకలాపాలను సరళీకృతం చేయడానికి తగిన మార్గాలను పరిశీలిస్తున్నాము. ఇందులో భాగమని లేఆఫ్స్ కూడా చేయడానికి చూస్తున్నట్లు'' రెనాల్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?రెనాల్ట్ జూలై ఆర్థిక నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 11.2 బిలియన్ యూరోల (13 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసింది. ఇందులో భాగస్వామి నిస్సాన్పై కూడా 9.3 బిలియన్ యూరోల నష్టం ఉంది. కంపెనీ నికర ఆదాయం కూడా 461 మిలియన్ యూరోలకు తగ్గిపోయింది. ఖర్చులు పెరగడం.. పెరుగుతున్న పోటీ వాతావరణం నుంచి ఉత్పన్నమయ్యే వాణిజ్య ఒత్తిళ్లు ఈ తగ్గుదలకు కారణమని సమాచారం. -
డీమార్ట్ ఆదాయం జంప్.. 3 నెలల్లో ఎన్ని వేల కోట్లు వచ్చాయంటే..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ ఆదాయం రూ. 16,219 కోట్లుగా (స్టాండెలోన్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 14,050 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. త్రైమాసికాలవారీగా క్యూ1లో నమోదైన రూ. 15,932 కోట్లతో పోలిస్తే 1.8 శాతం వృద్ధి చెందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.2025 సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం స్టోర్స్ సంఖ్య 432గా ఉంది. స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలను ఆమోదించేందుకు అక్టోబర్ 11న కంపెనీ బోర్డు మసావేశం కానుంది. ఆంధ్రపద్రేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో డీమార్ట్కి కార్యకలాపాలు ఉన్నాయి. -
హైదరాబాద్లో హార్ట్ఫోర్డ్ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ ది హార్ట్ఫోర్డ్ తాజాగా హైదరాబాద్లో తమ ఇండియా టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అధునాతన వర్క్స్టేషన్లు, శిక్షణా సదుపాయాలు మొదలైన ప్రత్యేకతలతో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. డిజిటల్, కృత్రిమ మేథ సామర్థ్యాలను పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల తెలిపారు.సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ పేరొందిన నేపథ్యంలో నగరాన్ని ఎంచుకున్నట్లు చీఫ్ డేటా, ఏఐ, ఆపరేషన్స్ ఆఫీసర్ జెఫ్ హాకిన్స్ తెలిపారు. దాదాపు 200 ఏళ్ల పైగా చరిత్ర గల ది హార్ట్ఫోర్డ్కి ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని హార్ట్ఫోర్డ్, షికాగో తదితర ప్రాంతాల్లో టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి. -
జొమాటో డెలివరీ సిబ్బందికి హెచ్డీఎఫ్సీ పెన్షన్
న్యూఢిల్లీ: జొమాటో, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మధ్య భాగస్వా మ్యం కుదిరింది. జొమాటో డెలివరీ భాగస్వాములకు ‘ఎన్పీఎస్ ప్లాట్ఫామ్ వర్కర్స్మోడల్’ను హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఆఫర్ చేయనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రారంభించారు.‘‘ప్లాట్ఫామ్ ప్రారంభించిన 72 గంటల్లోనే 30,000 మందికి పైగా డెలివరీ భాగస్వాములు శాశ్వత రిటైర్మెంట్ ఖాతా నంబర్లను (ప్రాన్) తీసుకున్నారు. లక్ష మందికి పైగా డెలివరీ భాగస్వాములకు ఎన్పీఎస్ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని జొమాటో ప్రకటించింది. -
లిస్టింగ్ బాటలో మరిన్ని కంపెనీలు
ఈ ఏడాది ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ మరోవైపు ప్రైమరీ మార్కెట్లు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ నెలలోనూ (అక్టోబర్) సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేయనున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి హైదరాబాద్ కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్, ఆర్వీ ఇంజినీరింగ్ ఇటీవలే ప్రాస్పెక్టస్లు దాఖలు చేయగా.. అదే బాటలో మరో 5 కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. ఈ జాబితాలో రన్వాల్ డెవలపర్స్, లాల్బాబా ఇంజినీరింగ్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్, సీజే డార్సిల్ లాజిస్టిక్స్, జెరాయ్ ఫిట్నెస్ చేరాయి. 2025లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 77 కంపెనీలు లిస్ట్కాగా.. ఈ నెలలో టాటా ఇన్వెస్ట్మెంట్, ఎల్జీ ఎల్రక్టానిక్స్ తదితర దిగ్గజాల ఐపీవోలకు తెరలేవనుంది. రూ. 2,000 కోట్లపై కన్ను రియల్టీ రంగ కంపెనీ రన్వాల్ డెవలపర్స్ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ముంబై కంపెనీ రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సందీప్ సుభాష్ రన్వాల్ మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ సహా అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1988లో ఏర్పాటైన కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాల్లో రిటైల్, వాణిజ్య ప్రాపరీ్టలను నిర్వహిస్తోంది. 1,500 కోట్ల సమీకరణ .. రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి స్టెరిలైట్ ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. కార్యకలాపాల విస్తరణ, రుణ భారం తగ్గింపు లక్ష్యాలతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా 77.9 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇంతే పరిమాణంలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు ట్విన్ స్టార్ ఓవర్సీస్తోపాటు కైలాష్ చంద్ర మహేశ్వరి, జాకబ్ జాన్, రామ్గురు రాధాకృష్ణన్ షేర్లను విక్రయించనున్నారు. సెపె్టంబర్ 20 నాటికి కంపెనీకి రూ.600 కోట్ల రుణ భారం ఉంది. ఐపీవోలో సమీకరించే నిధుల్లో రుణ చెల్లింపులకు రూ.350 కోట్లు వినియోగించాలన్న ప్రణాళికతో ఉంది. మిగిలిన నిధులను విస్తరణ కార్యకలాపాలకు వెచి్చంచనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే లాల్బాబా ఇంజనీరింగ్ ఐపీవోలో భాగంగా తాజా షేర్ల జారీ రూపంలో రూ.630 కోట్ల నిధులను, ప్రమోటర్ల వాటాల విక్రయ రూపంలో మరో రూ.370 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ రూపంలో సమకూరే నిధుల నుంచి రూ.271 కోట్లను మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది. హల్దియా ప్లాంట్ విస్తరణకు కేటాయించనుంది. రూ.209 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించుకోనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ సంస్థ సీమ్లెస్ ట్యూబులు, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇంటెగ్రేటెడ్ రైల్ స్టిస్టమ్స్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీజే డార్సిల్స్ లాజిస్టిక్స్ సమగ్ర లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ సీజే డార్సిల్ లాజిస్టిక్స్ భారత్తో పాటు అంతర్జాతీయంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సరుకు రవాణా, వేర్హౌసింగ్ తదితర సేవలను అందిస్తోంది. సెబీకి సమరి్పంచిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 2.64 కోట్ల వరకు షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు 99.05 లక్షల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్త యంత్రపరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించుకోనుంది.జెరాయ్ ఫిట్నెస్ జిమ్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు 43.92 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి కంపెనీకి ఐపీవో ద్వారా నిధులేమీ లభించవు. దేశ, విదేశాల్లో కమర్షియల్ జిమ్లు, హోటళ్లు, కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జెరాయ్ ఎక్విప్మెంట్ను అందిస్తోంది. జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ్రస్టేలియా, సెర్బియా, స్వీడన్ తదితర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఉన్నాయి. -
పండక్కి సెలవు తీసుకుంటే.. జాబ్ నుంచి తీసేశారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులను చూస్తుంటే.. ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు, ఎందుకు, ఎలా పోతున్నాయో కూడా అర్థం కానీ పరిస్థితి కనిపిస్తోంది. దుర్గా పూజకు.. అనుమతితో సెలవు తీసుకున్నందుకు ఉద్యోగం నుంచి తీసేశారంటూ.. ఒక టెకీ రెడ్దిట్ వేదికగా పోస్ట్ చేశారు.దుర్గా పూజకు సెలవు తీసుకున్నందుకు తొలగించారు.. అనే శీర్షికతో వైరల్ అయిన రెడ్డిట్ పోస్ట్లో ఒక టెకీ తన అనుభవాన్ని వెల్లడించారు. నేను సెలవు తీసుకుంటానని మూడు వారాల ముందే మేనేజర్కు సమాచారం ఇచ్చాను. కంపెనీ సీఈఓ నుంచి కూడా అనుమతి పొందాను. కానీ హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టెర్మినేషన్ మెయిల్లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా సెలవు తీసుకున్న కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.గత కొన్ని రోజులుగా కంపెనీ కోసం ఎంతో కష్టపడి పనిచేసాను. పనిగంటలు పొడిగించినప్పుడు కూడా వర్క్ చేసాను. అనుమతితో సెలవు తీసుకున్నప్పటికీ.. నన్ను కంపెనీ నుంచి తొలగించారు. నాకు చాలా బాధగా ఉంది. కంపెనీ వాళ్ళు నాకు రిలీవింగ్, ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్స్ వంటివి ఇస్తారా లేదా అనే సందేహం కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో నాకు సలహా ఇవ్వండి అని పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు ఆ కంపెనీలోనే ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులో ఎదుర్కొనేవారు' అని ఒకరు వెల్లడించగా.. ''వినడానికి బాధగా ఉంది, మీరు ఏదో చిన్న స్టార్టప్లో పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది, అలాంటి సంస్థల్లో.. ఇలాంటివి చాలా సాధారణం'' అని ఇంకొకరు అన్నారు. -
ఈపీఎఫ్ఓ కాంటెస్ట్: ట్యాగ్ చెప్పు.. క్యాష్ పట్టు!
భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO), MyGov సహకారంతో, EPFO కోసం ఒక ట్యాగ్లైన్ కాంటెస్ట్ ప్రారంభించింది. సంస్థ ఆశయాలు, విధులకు అద్దం పట్టేలా (ఈపీఎఫ్ఓకు సూటయ్యే విధంగా) ఓ మంచి ట్యాగ్లైన్ అందించాలని ప్రజలకు సూచించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈ కాంటెస్ట్ 2025 అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది.వచ్చిన మొత్తం ట్యాగ్లైన్లలో మూడు ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడం జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగే ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కావడానికి కూడా వారికి ఆహ్వానం లభిస్తుంది.నగదు బహుమతిమొదటి బహుమతి: రూ. 21,000రెండవ బహుమతి: రూ. 11,000మూడవ బహుమతి: రూ. 5,100తప్పకుండా పాటించాల్సిన షరతులు➤ఈ పోటీలో పాల్గొనేవారు భారతీయ పౌరులై ఉండాలి. ➤ట్యాగ్లైన్ హిందీలోనే ఉండాలి.➤ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే.. అంటే ఒక ట్యాగ్లైన్ మాత్రమే ఇవ్వాలి. ➤ఈ ట్యాగ్లైన్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, దార్శనికతకు అద్దం పట్టేలా ఉండాలి.➤ఏఐ కంటెంట్ ఉపయోగించకూడదు.Be the voice of trust & security!Join the EPFO Tagline Contest & craft a line that echoes financial safety & social empowerment.👉 https://t.co/86rKW27zrS #EPFO #FinancialSecurity #MyGovContest@LabourMinistry pic.twitter.com/4en8gQljTt— MyGovIndia (@mygovindia) October 3, 2025 -
షాపింగ్ మాల్స్ విస్తరణ: రిటైల్ కేంద్రాలకు అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: సంస్థాగత పెట్టుబడులు ద్వితీయ శ్రేణి పట్టణాలకు శరవేగంగా విస్తరిస్తున్నాయి. పట్టణీకరణ, అధిక జనాభా, కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో వ్యవస్థీకృత రిటైల్ కేంద్రాలకు అవకాశాలు లభిస్తున్నాయి. మారుతున్న వినియోదారుల అభిరుచులతో ప్రపంచ బ్రాండ్లు విస్తరణపై దృష్టిసారిస్తున్నాయి.చంఢీఘడ్, ఇండోర్, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు నెక్సస్(బ్లాక్ స్టోన్), డీఎల్ఎఫ్, ఫీనిక్స్ మిల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, లేక్షోర్, రహేజా గ్రూప్, పసిఫిక్ వంటి సంస్థాగత దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు వచ్చే 3–5 ఏళ్లలో 4.25 కోట్ల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలో కొత్తగా 45 షాపింగ్ మాల్స్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి.ప్రస్తుతం ఈ ఏడు సంస్థలకు సమష్టిగా 3.4 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 58 మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రేడ్-ఏ, బీ, సీ కేటగిరీ మాల్స్ అన్నీ కలిపి 650 షాపింగ్ మాల్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. ఇండియాలో 11 కోట్ల చ.అ. నాణ్యమైన రిటైల్ స్పేస్ ఉంది. అమెరికాలో 70 కోట్ల చ.అ., చైనాలో 40 కోట్ల చ.అ. రిటైల్ స్థలం అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అధిక శాతం స్థలం సంస్థాగత నిర్మాణ సంస్థల యాజమాన్యంలోనే ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. -
వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది?
భారతదేశపు అతి పిన్న వయసున్న బిలియనీర్గా అరవింద్ శ్రీనివాస్(31)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. చెన్నైలో జన్మించిన ఈయన పెర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడిగా, ఆ సంస్థ సీఈఓగా ఉన్నారు. దాంతోపాటు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.21,190 కోట్ల (సుమారు $2.5 బిలియన్లు) నికర విలువతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తమిళనాడులోని చెన్నైలో పెరిగిన అరవింద్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ పట్ల అభిరుచి పెంచుకున్నారు. తన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ సంపాదించారు. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ తన నైపుణ్యాలను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలతో కలిసి మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలో OpenAI, గూగుల్, డీప్ మైండ్ల్లో పనిచేశారు. ఇక్కడ అతను అత్యాధునిక ఏఐ నమూనాలు, ఎల్ఎల్ఎం(లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్)పై అనుభవం సాధించారు. ఇది అతని సొంత కంపెనీ స్థాపనకు కీలకంగా మారింది.పెర్ప్లెక్సిటీ ఏఐ2022లో శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్వినిస్క్తో కలిసి పెర్ప్లెక్సిటీ ఏఐను స్థాపించారు. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్ కాదు. ఇది ఒక ఇంటెరాక్షన్ ఏఐ సెర్చ్ ఇంజిన్. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి వేగవంతమైన మార్గంగా దీన్ని శ్రీనివాస్ అభివర్ణించారు. మార్కెట్లో తన పోటీదారులకు బలమైన ప్రత్యామ్నాయంగా పెర్ప్లెక్సిటీ నిలుస్తుంది. సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా హైపర్లింక్ల జాబితాను అందించడానికి బదులుగా పెర్ప్లెక్సిటీ ప్రత్యక్ష, ఇంటెరాక్షన్ సమాధానాలను అందిస్తుంది. ఇది మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐను రియల్టైమ్ వెబ్ డేటాతో విలీనం చేస్తుంది. ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీలో గుర్తింపు లభించింది. ఈ స్టార్టప్కు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్తో సహా అగ్రశ్రేణి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమకూరాయి.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
సెలవుల్లేవ్.. వారంలో 7 రోజులు పని!
భారతదేశంలో మారుతి సుజుకి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కంపెనీ సెప్టెంబర్ నెలలో తమ ఉత్పత్తిని 26 శాతం పెంచింది. వాహనాల ఉత్పత్తి పెరగడం వల్ల.. కొనుగోలుదారులకు సకాలంలో డెలివరీలు జరిగాయి. ఈ తరుణంలో ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించడానికి.. ప్రొడక్షన్ టీమ్ ఆదివారాలు & సెలవు దినాలలో పని చేయాలని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో మారుతి సుజుకి దాదాపు 1,65,000 వాహనాలను డెలివరీ చేసింది. ఈ అమ్మకాలు గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 27.5 శాతం ఎక్కువ. త్వరలో డెలివరీలు రెండు లక్షలకు చేరుకుంటుందని చెబుతున్నారు. కంపెనీ సేల్స్ పెరగడానికి జీఎస్టీ 2.0 కూడా సహకరించింది. గత పదేళ్లలో ఇంతటి వృద్ధి (బుకింగ్స్ & డెలివరీలు) ఎప్పుడూ చూడలేదని కూడా పార్థో బెనర్జీ అన్నారు.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?డిమాండుకు తగ్గ డెలివరీలు చేయడానికి.. మారుతి సుజుకి గత నెలలో 12,318 యూనిట్ల ఆల్టో & ఎస్ ప్రెస్సో మోడళ్లను ఉత్పత్తి చేసింది. బాలెనో, సెలెరియో, డిజైర్ & స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ మోడళ్ల ఉత్పత్తి సెప్టెంబర్లో 93,301 యూనిట్లు. బ్రెజ్జా, ఎర్టిగా & ఫ్రాంక్స్ వంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 79,496 యూనిట్లకు చేరుకుంది. ఈకో ఉత్పత్తి కూడా 13,201 యూనిట్లకు పెరిగింది. మొత్తం మీద కంపెనీ ఈ ఏడాది అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. -
ఈ–స్పోర్ట్స్ కోసం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ప్రతిపాదన
ఈ–స్పోర్ట్స్, డిజిటల్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించేందుకు, రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం అమలుకు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను (ఓజీఏఐ) ఏర్పాటు చేసేలా కేంద్రం ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీనికి ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సారథ్యం వహిస్తుంది. సమాచార–ప్రసార శాఖ, యూత్ అఫైర్స్ తదితర శాఖల సమన్వయంతో ఇది పనిచేస్తుంది.ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ (పీఆర్వోజీ) చట్టం 2025 కింద కేంద్రం ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ఆవిష్కరించింది. వీటిపై అక్టోబర్ 31లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ముసాయిదా ప్రకారం ఓజీఏఐకి మెయిటీలోని అదనపు కార్యదర్శి స్థాయి అధికారి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇది దేశీయంగా చట్టబద్ధంగా ఆడతగిన ఈ–స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ఆమోదిస్తుంది.అలాగే పీఆర్వోజీ చట్టాన్ని ఉల్లంఘించే గేమ్స్, స్పోర్ట్స్ను రద్దు కూడా చేయగలదు. ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసులు ఆఫర్ చేసే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ మనీ గేమ్స్పై ప్రకటనలు ఇస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
యూఏఈకి ఉచిత వీసాలు.. అబుదాబి కంపెనీ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు అబుదాబిలోని ఏడీఎన్హెచ్ కంపెనీ (Abu Dhabi company) తెలంగాణలోని జీటీఎం సంస్థ ద్వారా ఉచితంగా వీసాలను (free visa) జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలుమార్లు అనేకమందికి ఉచితంగా వీసాలు ఇచ్చిన ఈ సంస్థ..మరోసారి ఉచిత వీసాల జారీ కి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏడీఎన్హెచ్ కంపెనీ క్లీనింగ్, క్యాటరింగ్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఈనెల 10న జగిత్యాలలో, 11న నిజామాబాద్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉన్న యువకులకు అర్హత వయస్సు 21 నుంచి 38 ఏళ్ల వరకూ ఉండొచ్చని జీటీఎం సంస్థ చైర్మన్ చీటి సతీష్రావు ‘సాక్షి’తో చెప్పారు.బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండాలని, పచ్చబొట్టు కనబడకుండా ఉండాలని తెలిపారు. ఒరిజినల్ పాస్పోర్టుతో జగిత్యాల లేదా నిజామాబాద్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 23 వేల వరకూ వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు జీటీఎం సంస్థ నిజామాబాద్ (8686860999), ఆర్మూర్ (8332062299), జగిత్యాల (8332042299), సిరిసిల్ల (9347661522) నంబర్లలో సంప్రదించాలని సతీష్రావు సూచించారు. -
డీ2సీలోనే ఎఫ్ఎంసీజీ కొనుగోళ్లు
గత ఐదేళ్లలో దేశీయంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ప్రధానంగా డైరెక్ట్టు కన్జూమర్(డీ2సీ) విభాగంలోని కంపెనీలనే కొనుగోలు చేసినట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇతర సంస్థల కొనుగోళ్లలో ముప్పావువంతు డీ2సీ సంస్థలేనని తెలియజేసింది. తద్వారా ఎఫ్ఎంసీజీ రంగంలోని దిగ్గజాలు వృద్ధికి ఊతమివ్వడంతోపాటు.. ప్రీమియం విభాగాలలో విస్తరణకు దారి ఏర్పరచుకున్నట్లు తెలియజేసింది. దీంతోపాటు విస్తరణ, లాభదాయకతల్లో టార్గెట్ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.ఈ జాబితాలో హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) ఇటీవల అప్రైజింగ్ సైన్స్ ప్రయివేట్(మినిమలిస్ట్)ను రూ. 2,706 కోట్లకు సొంతం చేసుకోగా.. సాతియా న్యూట్రాస్యూటికల్స్(ప్లిక్స్)ను రూ. 380 కోట్లకు మారికో కొనుగోలు చేసింది. హీలియోస్ లైఫ్స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను రూ. 272 కోట్లు వెచి్చంచి ఇమామీ టేకోవర్ చేయగా.. స్ప్రౌట్లైఫ్ ఫుడ్స్(యోగా బార్)ను రూ. 225 కోట్లకు ఐటీసీ చేజిక్కించుకుంది. ఈ అధ్యయనానికి 82 ఎఫ్ఎంసీజీ కంపెనీలను, 58 డీ2సీ సంస్థలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
వంట గదుల్లో నలభీములు!
ముంబైలోని చిన్న వంటగదిలో 29 ఏళ్ల జస్టిన్ వారంలో ఒక రాత్రి తన ఎయిర్ ఫ్రయర్లో స్వీట్ పోటాటో వెజెస్ వేయిస్తూ, సలాడ్ సిద్ధం చేస్తుంటాడు. వంట అనేది అతనికి విసుగెత్తించే పనికాదు, రిలాక్స్ అవడానికి, స్నేహితులను ఎంటర్టైన్ చేయడానికి, కొత్త రుచులను అన్వేíÙంచడానికి అదో మార్గం. జస్టిన్ ఇప్పుడు భారతదేశ నగరాల్లో పెరుగుతున్న ఒక వర్గానికి ప్రతినిధి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పురుషులు స్టైలిష్ గాడ్జెట్లు, ఆధునిక కుక్వేర్తో వంటింట్లోకి అడుగుపెడుతున్నారు. ఇది మారుతున్న అలవాట్లకే కాదు వాణిజ్యపరంగా కూడా ఒక విప్లవం. దృక్పథం మారుతోంది...ఆన్లైన్లో వంటింటి సామాను కొనేవారిలో ఇపుడు 30% మంది పురుషులే ఉంటున్నారు ఐదారేళ్ల క్రితం ఇది చాలా తక్కువ శాతం మాత్రమే. ఇంట్లో వంటగది ఎలా ఉండాలి, కుకింగ్ త్వరగా అయేందుకు ఏమేం వస్తువులు కొనాలి అనే నిర్ణయాన్నిఇపుడు అనేక ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకుంటున్నారని స్టాల్ కిచెన్స్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు.వంటింటి సామ్రాజ్యానికి ఇప్పటికీ మహిళలే మహారాణులైనా పురుషుల వాటాకూడా క్రమంగా పెరుగుతోందని వండర్ చెఫ్ వ్యవస్థాపకుడు రవి సక్సేనా స్పష్టంచేశారు. 70% వారానికోసారి...ఆన్లైన్ కొనుగోళ్ల ఆల్గరిథమ్ను పరిశీలిస్తే వంటింటి సామాను కొనే పురుషులు రెండు రకాలని తెలుస్తోంది. మొదటిరకం.. స్వతంత్రంగా జీవించే యువకులు వీరు రోజువారీ వాడుకకు పనికివచ్చే, నాన్–టాక్సిక్ కుక్వేర్, ఒకటి రెండు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఇక రెండో రకం ప్యాషనేట్ కుక్స్ (బిజీ ప్రొఫెషనల్స్) వీరు ప్రతిరోజూ వంట చేయకపోయినా, ప్రీమియం సెట్లు కొనుగోలు చేసి సంప్రదాయ కుటుంబ వంటకాలతోపాటు రెస్టారెంట్లో లభించే రుచులను వంటింట్లో తయారుచేసేందుకు ప్రయతి్నస్తారు. కుక్వేర్ కొనే పురుషుల్లో 70% మంది కనీసం వారానికి ఒకసారి వాటిని వాడతారు. వీరు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులు, పూర్తి సెట్లను కొనడానికి ఇష్టపడతారు. వీరి సగటు ఆర్డర్ విలువ ఇతరులతో పోలిస్తే 12% ఎక్కువని ఎంబర్ కుక్వేర్ సీఈఓ సిద్ధార్థ్ గడోదియా చెప్పారు. పురుషులకు బాగా నచ్చేవి, ఎక్కువగా కొనే కిచెన్ ఉత్పత్తులు మలీ్ట–ఫంక్షనల్ పరికరాలు (కలపడం, ముద్ద చేయడం, కట్ చేయడం, ఆవిరి వేయడం, వండడం ఇలా ఆల్ రౌండర్ టైపువి. స్టీలు పెనాలు, మూకుళ్లు ఉంటాయని గడోదియా తెలిపారు. మొత్తానికి, పురుషులు వంటింట్లోకి అడుగుపెట్టడం వల్ల కుక్వేర్ మార్కెట్కి కొత్త కళ వచి్చంది.పురుషులు వంటగదిలోకి రావడానికి కారణాలు→ ఆరోగ్యంపై శ్రద్ధ (తక్కువ నూనె, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించడం) → ఫ్లెక్సిబుల్ వర్క్ ప్యాటర్న్స్ (హోమ్ ఆఫీస్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్) → సోషల్ మీడియాలో నోరూరిస్తూ లభించే సులభమైన రెసిపీలు -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. కలిసొచ్చిన నవరాత్రి: అమ్మకాల్లో అరుదైన రికార్డ్!
భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో వాహన విక్రయాలు కొంత పెరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం వెహికల్ సేల్స్ ఊహకందని రీతిలో గణనీయంగా పెరిగాయి. దీనికి కారణం మోదీ ప్రభుత్వం అమలుచేసిన జీఎస్టీ 2.0 అని తెలుస్తోంది. కొత్త జీఎస్టీ సంస్కరణల కారణంగా.. కార్లు, బైకులు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సేల్స్ భారీగా పెరిగాయి.ఆటోమొబైల్ రంగంఏ రంగం ఎలా ఉన్నా.. ఆటోమొబైల్ రంగానికి మాత్రం పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. మారుతి సుజుకి నవరాత్రి అమ్మకాలు.. గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యాయి. నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో 1.65 లక్షల వాహనాలను కంపెనీ డెలివరీ చేసింది. మొదటి రోజు 30,000 కార్లను డెలివరీ చేసి అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సంస్థ మొత్తం బుకింగ్లు 1.50 లక్షలుగా నివేదించింది. ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ భావిస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ 85,000 వాహనాలను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే.. మారుతి సుజుకి సేల్స్ ఏ స్థాయిలో పెరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది.ఇక దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఫెస్టివల్ సీజన్లో 60 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఎక్స్యూవీ700, స్కార్పియో ఎన్ వంటి కార్లను ఎక్కువ సంఖ్యలో విక్రయించింది. ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, టియాగో వంటి మోడళ్లకు డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ 50,000 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ క్రెటా, వెన్యూలకు డిమాండ్ పెరగడంతో..ఈ ఎస్యూవీల వాటా మొత్తం అమ్మకాలలో 72 శాతానికి పైగా పెరిగింది.ఇక టూ వీలర్స్ విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ ముందు వరుసలో నిలిచింది. అంటే ఈ బ్రాండ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ షోరూమ్ల వద్ద రద్దీ ఈ నవరాత్రిలో రెట్టింపు అయ్యింది. కమ్యూటర్ విభాగంలోని బైకుల సేల్స్ గణనీయంగా పెరిగాయి. బజాజ్ ఆటో కూడా బలమైన అమ్మకాలను నమోదు చేసింది.ఎలక్ట్రానిక్స్ రంగంఆటోమొబైల్ రంగం పక్కన పెడితే.. ఎలక్ట్రానిక్స్ రంగం కూడా మంచి పురోగతిని సాధించింది. హైయర్ అమ్మకాలు 85 శాతం పెరిగాయి. ఈ కంపెనీ తన దీపావళి స్టాక్ అయిన.. 85 ఇంచెస్, 100 ఇంచెస్ టీవీలను దాదాపుగా విక్రయించేసింది. అంతే కాకుండా ఈ సంస్థ రోజుకు 300-350 యూనిట్ల 65 ఇంచెస్ టీవీలను సేల్ చేసింది.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?భారతదేశంలోని అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ అమ్మకాలు.. గత సంవత్సరం నవరాత్రి కంటే 20-25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ వంటి సేల్స్ అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ 'విజయ్ సేల్స్' అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందాయి. -
రాడిసన్ బ్లూ ప్లాజాకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు
బంజారా హిల్స్లో రాడిసన్ బ్లూ ప్లాజా, క్లాసిఫైడ్ హోటల్స్ - 5 స్టార్ కేటగిరీ కింద.. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు 2025 పొందింది. హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందుకుంది.టూరిజం ఎక్సలెన్స్ అవార్డును.. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ తరపున సౌత్ ఇండియా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ జోషి, రాడిసన్ బ్లూ ప్లాజా బంజారా హిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజర్షి భట్టాచార్జీ అందుకున్నారు. ఆతిథ్యంలో అత్యుత్తమ ప్రతిభ, అత్యుత్తమ సేవా నాణ్యత ఈ అవార్డు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉందని జోషి పేర్కొన్నారు. -
నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!
కార్పొరేట్ ఉద్యోగాలు నీటిమీద బుడగలాగా మారిపోయాయి. ఎప్పుడు జాబ్ పోతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. దీనికి కారణం కొన్ని కంపెనీల ప్రవర్తనే. ఇటీవల ఒక కంపెనీ నాలుగు నిముషాల మీటింగ్ తరువాత.. లేఆఫ్స్ అంటూ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాకు చెందిన ఒక కంపెనీలో.. రిమోట్గా పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్లో తనకు ఎదురైన ఆకస్మిక & షాకింగ్ లేఆఫ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. నేను ఉదయం 9 గంటలకు లాగిన్ అయ్యాను. 11 గంటలకు కంపెనీ సీఓఓ భారతదేశానికి చెందిన ఉద్యోగులతో మీటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మీటింగ్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే సాగింది.నాలుగు నిమిషాల మీటింగ్లోనే.. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు, మీటింగ్ పూర్తైన తరువాత మెయిల్స్ అందుతాయని చెప్పాడు. తొలగింపులు పనితీరుకు సంబంధించినవి కాదని, అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఇది విన్న నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యాను.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుఉద్యోగులను ఎక్కువగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏమిటంటే.. ముందస్తు సరైన సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం. అక్టోబర్ నెల పూర్తి జీతం నెలాఖరులోగా చెల్లిస్తామని, పెండింగ్లో ఉన్న సెలవులను నగదుగా మారుస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని ఉద్యోగి పేర్కొన్నారు. నేను ఉద్యోగం కోల్పోవడం ఇదే మొదటిసారి, ఇది నిజంగా బాధాకరం వెల్లడించారు. -
పండుగ వేళ.. ‘కొత్త రకం’ బంగారానికి డిమాండ్..
దేశంలో కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చారిత్రక గరిష్టాలను తాకాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్తో రూపాయి బలహీనపడటం, అస్థిర అంతర్జాతీయ పరిస్థితులు.. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను పసిడి వైపు నెట్టివేశాయి. దాని ధరను మరింత పెంచేశాయి.అయితే పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనడం చాలా కష్టంగా మారింది. ఫలితంగా, వినియోగదారులు ఇప్పుడు మరింత తక్కువ క్యారెట్ ఆభరణాల వైపు మళ్లుతున్నారు. 9 క్యారెట్లు, 14 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.బంగారం సెంటిమెంట్..నిశ్చింతైన పెట్టుబడిగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగానూ ఇళ్లలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లి సీజన్ తో పాటు దసరా, దీపావళి వంటి పండుగలను బంగారం కొనడానికి అత్యంత శుభ సమయాలుగా పరిగణిస్తారు. కానీ ధరలు కొత్త గరిష్టాలను తాకడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో దుకాణదారులు సంప్రదాయం, స్థోమత రెండింటినీ సమతుల్యం చేస్తూ తక్కువ క్యారెట్ పసిడి ఆభరణాలను కొనుగోలుదారులకు అందుబాటు తీసుకొచ్చారు.ప్రభుత్వ మద్దతు22 క్యారెట్ల బంగారం మాదిరిగానే 9 క్యారెట్, 14 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్కింగ్ ను అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న చర్య కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచింది. తక్కువ క్యారెట్ల ఆభరణాలను ఎంచుకున్నప్పుడు కూడా వినియోగదారులు నాణ్యత గురించి భరోసా పొందుతారు.ఎవరు కొంటున్నారు..?పాత కొనుగోలుదారులు ఇప్పటికీ దీర్ఘకాలిక విలువ కోసం 22 క్యారెట్ల ఆభరణాలను ఇష్టపడుతున్నారు. యువ వినియోగదారులు తక్కువ క్యారెట్లలో తేలికపాటి, అధునాతన ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పు రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో ఆభరణాల పోకడలను పునర్నిర్వచించే అవకాశం ఉంది. సంప్రదాయాన్ని స్థోమత, ఫ్యాషన్తో మిళితం చేస్తుంది. -
టాటా సన్స్ ఐపీవో గడువు మిస్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసిన గడువు ముగియడంతో తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై స్పందించారు. రిజిస్ట్రేషన్ రద్దయ్యేవరకూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకునే వీలున్నట్లు తెలియజేశారు.టాటా సన్స్సహా.. కొన్ని సంస్థలను ఆర్బీఐ ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్కు ఆదేశించింది. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కీలక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ(సీఐసీ) రిజిస్ట్రేషన్ను అప్పగించేందుకు గతేడాది ఆర్బీఐకు దరఖాస్తు చేసింది.తద్వారా తప్పనిసరి లిస్టింగ్ను తప్పించుకుకోనుంది. కాగా.. ఆర్బీఐ ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలుగా గుర్తింపు పొందిన 15 సంస్థలను సెపె్టంబర్ 30లోగా ఐపీవో చేపట్టమంటూ ఆదేశించింది.టాటా సన్స్మినహా మిగిలిన కంపెనీలు నిబంధనలను పాటించాయి. కంపెనీ లిస్టయితే 18 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ లబ్ది పొందనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk).. దాదాపు అర ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి.. ఇప్పుడు 500.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. ఈయన నికర విలువ ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే 150 బిలియన్ డాలర్లు ఎక్కువ.దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలాన్ మస్క్.. సంపద అతని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla)తో ముడిపడి ఉంది. సెప్టెంబర్ 15 నాటికి అతను 12.4 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల నాటికి టెస్లా షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. దీంతో మస్క్ సంపదకు 9.3 బిలియన్ డాలర్లు యాడ్ అయ్యాయి. ఇలా కంపెనీ స్టాక్ వాల్యూ ఎప్పటికప్పుడూ పెరుగుతూ ఉండటం వల్ల.. మస్క్ సంపద కూడా పెరుగుతూనే ఉంది.డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కాగా కంపెనీ ఇప్పుడు ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ, స్పేస్ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ పాస్పోర్ట్తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరికపిచ్బుక్ డేటా ప్రకారం, ఎక్స్ఏఐ జూలై నాటికి 75 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. అదే సమయంలో స్పేస్ఎక్స్ విలువ 400 బిలియన్ డాలర్లు (బ్లూమ్బెర్గ్ ప్రకారం). మస్క్ సంపద ఇదే వృద్ధి రేటుతో కొనసాగితే.. 2023 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాగలరని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. -
అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు
సోషల్ మీడియాలో నెలల తరబడి తన ఉద్యోగ అన్వేషణ గురించి.. వివరించిన భారతీయ మహిళ 'అనన్య జోషి' తగిన ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో అమెరికా (America) విడిచిపెట్టాల్సి వచ్చింది. సెప్టెంబర్ 29న ఆమె అమెరికా విడిచిపెట్టే సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి 2024లో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అనన్య జోషి.. F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా బయోటెక్ స్టార్టప్లో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే స్టూడెంట్ వీసాతో చదువు పూర్తి చేసుకున్న తరువాత.. ఎఫ్-1 వీసా(F-1 Visa)తో ఉద్యోగంలో చేరింది. ఎఫ్-1 వీసా కలిగి ఉన్న వ్యక్తులు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల సమయంలో మరో ఉద్యోగాన్ని పొందాలి. లేకుంటే దేశం వీడి బయటకు వచేయాలి.ఇదీ చదవండి: బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుఉద్యోగం కోల్పోయిన అనన్య.. నెల రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ.. చివరికి నిరాశే మిగిలింది. చేసేదేమీ లేక అమెరికా విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి వచ్చే సమయంలో.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రయాణంలో నేను చాలా కష్టతరమైన అడుగు వేసాను. ఐ లవ్ యూ అమెరికా అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Ananya 🐬 | Relatable Adult Life (@ananyastruggles) -
మళ్లీ ముకేశ్ నంబర్ వన్!
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశంలోకెల్లా ధనవంతుడిగా నిలిచారు. 2025 ఎం3ఎం హురున్ ఇండియా బిలియనీర్ జాబితా ప్రకారం అంబానీ సంపద 6 శాతం క్షీణించి రూ. 9.55 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ 2025లో దేశీయంగా అపర కుబేరుడిగా అవతరించారు. దీంతో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ రూ. 8.14 లక్షల కోట్ల సంపదతో దేశీ బిలియనీర్లలో రెండో ర్యాంకుకు పరిమితమయ్యారు. గతేడాది అదానీ సంపద 95 శాతం జంప్చేసి రూ. 11.6 లక్షల కోట్లను తాకడంతో అంబానీని అధిగమిస్తూ టాప్ చెయిర్ను పొందిన సంగతి తెలిసిందే. నిజానికి యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు పతనమైనప్పటికీ తిరిగి నష్టాలు రికవర్ అయ్యాయి. కాగా.. తొలిసారి హెచ్సీఎల్ గ్రూప్ రోష్నీ నాడార్ మల్హోత్రా టాప్–3లో చోటు సాధించారు. రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో మూడో ర్యాంకులో నిలవగా.. సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం రూ. 2.46 లక్షల కోట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఈ బాటలో కుమార మంగళం బిర్లా రూ. 2.32 లక్షల కోట్ల సంపదతో ఐదో ర్యాంకులో నిలిచారు. నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం సంపద 43 శాతం జంప్చేసి రూ. 2.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నారు. దేశ జీడీపీలో హురున్ జాబితాలో చోటుచేసుకున్న బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ. 167 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. జాబితాలో రూ. 1,000 కోట్ల సంపదతో 1,687 మంది వ్యక్తులు స్థానం పొందగా.. ఈ సంఖ్య 284 పెరిగింది. వీరిలో 148 కొత్తగా చోటు సాధించారు. గత రెండేళ్లుగా భారత్లో ప్రతీ వారం ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నట్లు హురున్ పేర్కొంది. దీంతో జాబితాలో చోటు పొందినవారిద్వారా ప్రస్తుతం రోజుకి రూ. 1,991 కోట్ల సంపద జమవుతున్నట్లు తెలియజేసింది. కాగా.. పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్లతో జాబితాలో స్థానాన్ని పొందారు. తద్వారా యువ బిలియనీర్గా నిలిచారు. యువ బిలియనీర్లలో ఓయో వ్యవస్థాపకుడు 31 ఏళ్ల రితేష్ అగర్వాల్ సైతం రూ. 14,400 కోట్ల నెట్వర్త్తో పిన్నవయస్కుడిగా జాబితాలో చోటు సాధించారు.జెప్టో వ్యవస్థాపకులకు చోటుహురున్ తాజా జాబితాలో ఈకామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో సహవ్యవస్థాపకులు 23 ఏళ్ల ఆదిత్ పాలిచా, 22 ఏళ్ల కైవల్య వోహ్రా చోటు సంపాదించారు. బిలియనీర్లలో పిన్న వయసు్కలు(జెన్ జెడ్)గా నిలిచారు. 2021లో ఏర్పాటైన జెప్టో వేగంగా వృద్ధి చెందడంతో వోహ్రా సంపద రూ. 4,480 కోట్లకు చేరగా, పాలిచా నెట్వర్త్ రూ. 5,380 కోట్లను తాకింది. కంపెనీ విలువ 5.9 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 1,140 కోట్ల సంపదతో ఎస్జీ ఫిన్సర్వ్ వ్యవస్థాపకుడు రోహన్ గుప్తా, ఆయన కుటుంబం సైతం చోటు సాధించారు. -
ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు
దసరా, దీపావళి పండుగల సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. “ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్” పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గింపు జీఎస్టీ ధరలపై అందిస్తోంది. అగ్రగామి బ్యాంక్ కార్డులపై అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ స్టోర్స్, ఆన్లైన్ (www.reliancedigital.in)లో రూ.15000 వరకు సత్వర డిస్కౌంట్ కల్పిస్తోంది.కస్టమర్లు పేపర్ ఫైనాన్స్ ఎంచుకుంటే రూ.30,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో పెద్ద విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం సులభం అవుతుంది. రిలయన్స్ డిజిటల్ వారి ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ అక్టోబర్ 25 వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయి. రిలయన్స్ డిజిటల్ లో లభించే కొన్ని డీల్స్ ఇవీ...• తోషిబా 65 ఇంచ్ క్యూ ఎల్ఈడీ రూ. 45,990 లకే.• ఐఫోన్ 16ఈ ప్రారంభ ధర రూ.44,990• 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ప్రారంభ ధర రూ.17,990• రిఫ్రిజిరేటర్ కొంటే రూ.8,990 వరకు విలువ గల ఫ్రీబీస్.• డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.18,990• సెమీ- ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధరలో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రారంభ ధర రూ. 10,990• చిన్న డొమెస్టిక్ వస్తువులు 1 కొంటే 5% తగ్గింపు, 2 కొంటే 10% తగ్గింపు, 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులపై 15% తగ్గింపు• పర్సనల్ ఆడియో, స్మార్ట్ వాచీలు, టాబ్లెట్స్, ఇతర టెక్ యాక్సెసరీస్ పై 5% తగ్గింపు. -
చేతులు కలిపిన ఎల్ఐసీ, ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)తో బ్యాంకెష్యూరెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకు వెల్లడించింది. దీనితో ఎల్ఐసీ టర్మ్ ప్లాన్లు, ఎండోమెంట్ పాలసీలు మొదలైన పథకాలను బ్యాంకు శాఖలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందని వివరించింది.ఎల్ఐసీకి చెందిన 3,600 పైగా శాఖలు, శాటిలైట్ ఆఫీసులతో పాటు తమ 2,000 పైగా టచ్పాయింట్ల విస్తృత నెట్వర్క్తో దేశవ్యాప్తంగా జీవిత బీమా లభ్యతను మరింతగా పెంచవచ్చని ఆర్బీఎల్ తెలిపింది. -
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 బిలియనీర్లు.. కళ్లు చెదిరే విషయాలు
2025లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 358కి పెరిగింది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 తాజా నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 24మంది కొత్త బిలియనీర్లు జాబితాలో చేరారు. 13 ఏళ్ల క్రితం హురున్లిస్ట్ మొదలైనప్పటి నుండి భారతదేశ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగి 350కి చేరుకుంది. ఈ జాబితాలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలుM3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్టలో చోటు సంపాదించుకున్న వారు ధనవంతులు రోజుకు 1,991 కోట్ల సంపదను ఆర్జించారు.2025లో టాప్ 10 మంది మొత్తం సంపద జాబితాలోని మిగిలిన జాబితాలో 28 శాతానికి సమానం. ఒక్క ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ సంపదే మొత్తం సంపదలో 12శాతం ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల (USD 105 బిలియన్లు) సంపదతో, ముఖేష్ అంబానీ & కుటుంబం అత్యంత ధనవంతులైన భారతీయుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ & కుటుంబం రూ.8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది.M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 సంచిత సంపద INR 167 లక్షల కోట్లు. ఇది వార్షిక ప్రాతికపదికన ఇది 5 శాతం పెరుగుదల. ఇది స్పెయిన్ GDP కంటే ఎక్కువ . భారతదేశ GDPలో దాదాపు సగానికి సమానం.సుంకాల ఎదురుదెబ్బ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో M3M హురున్ ఇండియా రిచ్ లిస్టర్ల సగటు సంపద 10,320 కోట్ల 9,850 కోట్లకు తగ్గింది.నీరాజ్ బజాజ్ & కుటుంబం సంపద రూ. 2.33 లక్షల కోట్లు పెరిగి, నాలుగు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది.మరో విధంగా చెప్పాలంటే, బజాజ్ గ్రూప్కు చెందిన నీరాజ్ బజాజ్ & కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు, 69,875 కోట్లు పెరిగి వారి సంపద 2.33 లక్షల కోట్లకు చేరుకుంది.చెన్నైలో జన్మించిన పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్, INR 21,190 కోట్ల సంపదతో 2025 M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో బిలియనీర్గా అరంగేట్రం చేశారు. జాబితాలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ కూడా ఆయనే.రోష్ని నాడార్ మల్హోత్రా & కుటుంబం రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో టాప్ 3లో అడుగుపెట్టారు, భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. రోష్ని నాడార్ టాప్ 10లో అతి పిన్న వయస్కురాలు కూడా.జాబితాలో ఉన్న పద్దెనిమిది మంది లక్ష కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. గత సంవత్సరం కంటే ఆరుగురు ఎక్కువ. పదేళ్ల క్రితం దశాబ్దం ఇద్దరు మాత్రమే ఉన్నారు.హురున్ ఇండియా యునికార్న్ & ఫ్యూచర్ యునికార్న్ లిస్ట్ 2025 నుండి అరవై ఐదు మంది యునికార్న్ వ్యవస్థాపకులు—13 మంది గజెల్( Gazelle founders) వ్యవస్థాపకులు , 5 మంది చీతా వ్యవస్థాపకులు (Cheetah founders)M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు సంపాదించారు. -
అంబానీ Vs అదానీ: తాజా కుబేరుడెవరు?
దేశంలో అత్యంత ధనవంతుడి హోదా ముఖేష్ అంబానీ(Mukesh Ambani), గౌతమ్ అదానీల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. ఇప్పటికే భారతదేశ అపర కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీ తాజా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లోనూ టాప్లో నిలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో ఎం3ఎం ఇండియా ప్రచురించిన ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List 2025) 14వ ఎడిషన్ ప్రకారం.. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ .9.55 లక్షల కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.8.15 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(Gautam Adani), ఆయన కుటుంబం తర్వాతి స్థానాల్లో ఉన్నారు.తొలిసారిగా రోష్ని నాడార్ మల్హోత్రా, ఆమె కుటుంబం రూ .2.84 లక్షల కోట్లు సంపదతో భారతదేశపు అత్యంత ధనిక మహిళగా ఖ్యాతి సంపాదించారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంఖ్య ఇప్పుడు 350 దాటింది. ఇది 13 సంవత్సరాల క్రితం జాబితా ప్రారంభమైనప్పటి నుండి ఆరు రెట్లు పెరిగింది. వారి మొత్తం సంపద రూ.167 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు సగం.ఇదీ చదవండి: దేశపు అత్యంత యువ బిలియనీర్.. ఈ చెన్నై కుర్రాడు -
దేశపు అత్యంత యువ బిలియనీర్.. ఈ చెన్నై కుర్రాడు
పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో (M3M Hurun India Rich List 2025) అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా చరిత్ర సృష్టించారు. చెన్నైకి చెందిన 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ 21,190 కోట్ల వ్యక్తిగత సంపదతో రిచ్ లిస్ట్లో అరంగేట్రం చేశారు. డీప్-టెక్, ఏఐ (AI)-ఆధారిత ఆవిష్కరణలలో భారతదేశం ఎంత వేగంగా ఎదుగుతోందన్న దానికి ఇది ప్రతిబింబం.ప్రపంచ దిగ్గజాలకు పోటీగా ఉన్న ఏఐ-ఆధారిత సెర్చ్ ఇంజిన్ అయిన పెర్ప్లెక్సిటీ అరవింద్ శ్రీనివాస్కు ప్రపంచస్థాయి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఆయన్ను దేశపు అత్యంత ఉత్తేజకరమైన కొత్త-యుగ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా చేసింది. జెప్టోకు చెందిన కైవల్యా వోహ్రా (22), ఆదిత్ పాలిచా (23) సహా ఇతర యువ పారిశ్రామికవేత్తలతో పాటు ఆయన ఈ జాబితాలో ఉన్నారు.భారతదేశంలో ఇప్పుడు 358 మంది బిలియనీర్లు ఉన్నారని నివేదిక చూపిస్తుంది. ఇందులో రికార్డు స్థాయిలో 1,687 మంది 1,000 కోట్ల రూపాయల సంపదను దాటినవారు ఉన్నారు. ఆ 358 మంది బిలియనీర్ల మొత్తం సంపద 167 లక్షల కోట్ల రూపాయలు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు సగం. గడిచిన రెండేళ్లలో దేశంలోని ధనవంతులు సగటున రోజుకు 1,991 కోట్ల రూపాయల సంపదను పెంచుకున్నారు. దేశంలో ప్రతి వారం ఒక కొత్త బిలియనీర్ తయారవుతున్నారు. -
అంబానీ, అదానీ తరువాత.. మరోసారి టాప్లో రోష్నీ నాడార్
ప్రముఖ టెక్ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL) చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ధనవంతులైన వ్యాపారవేత్తగా మరోసారి తన ఘనతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతు రాలైన మహిళగా చరిత్ర సృష్టించారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. తద్వారా భారతదేశ సంపదలో పెరుగుతున్న కొత్త తరం మహిళా నాయకుల ప్రతిభను చాటి చెప్పారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List) ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, రోష్ని నాదర్ మల్హోత్రా అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎంపికయ్యారు. హురున్ ప్రకారం రిలయన్స్ అధినేతముఖేష్ అంబానీ మరోసారి తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంబానీ ఫ్యామిలీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ ఆనిలిచారు. మొత్తం ఆస్తి .రూ.9.55 కోట్లు. ఇక రూ. రూ.8.15 లక్షల కోట్ల కోట్ల సంపదతో అదానీ గౌతమ్ అదానీని అధిగమించారు.భారతదేశంలోని సంపన్న వర్గం గణనీయంగా పెరిగింది. దేశం ఇప్పుడు 350 మందికి పైగా బిలియనీర్లు ఉండగా. ఈజాబితా ప్రకారం గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య గణనీనయంగా పెరుగుతూ వస్తోంది. జాబితా వీరి మొత్తం సంపద మొత్తం రూ.167 లక్షల కోట్లు.ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగం.కాగా హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా. ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్. HCL గ్రూప్లో అధిక వాటాను స్వీకరించిన తర్వాత భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు రోష్నీ. -
అదానీ ఎయిర్పోర్ట్స్కి డిజిటల్ సొల్యూషన్స్ దన్ను
ప్రయాణికులు, భాగస్వాములకు మరింత మెరుగైన అనుభూతిని అందించే దిశగా తమ విమానాశ్రయాల్లో డిజిటల్ సొల్యూషన్స్ను విస్తృతంగా వినియోగించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ (ఏఏహెచ్ఎల్) తెలిపింది. డిజిటల్ వ్యూహంలో భాగంగా ఏవియో, అదానీ వన్యాప్, ఎయిర్పోర్ట్ ఇన్ ఏ బాక్స్ లాంటి స్మార్ట్ ప్లాట్ఫాంలను ఉపయోగించనున్నట్లు వివరించింది.కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకోవడంలో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, గ్రౌండ్ హ్యాండ్లర్స్, సర్వీస్ ప్రొవైడర్లకు ఏవియో సహాయపడుతుంది. మరోవైపు, ఎయిర్పోర్ట్ సర్వీసున్నింటినీ ఒకే చోట అందించే డిజిటల్ ప్లాట్ఫాం అదానీ వన్యాప్ ఉపయోగపడుతుంది. దేశంలో తొలిసారిగా ఆయా విమానాశ్రయాల్లో ప్రత్యేకమైన సర్వీసులను, అదానీ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రాం ప్రయోజనాలను పొందవచ్చు.ఎయిర్పోర్ట్ ఇన్ ఏ బాక్స్ ప్లాట్ఫాం ప్రస్తుత కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాలను పటిష్టపర్చుకోవడంతో పాటు భవిష్యత్ విస్తరణ అవసరాల్లోనూ సహాయకరంగా ఉంటుంది. అదానీ గ్రూప్నకు చెందిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఏహెచ్ఎల్కి ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి, జైపూర్, లక్నో విమానాశ్రయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే.. -
నిధుల వేటలో 4 కంపెనీలు
సెప్టెంబర్లో సందడే సందడిగా సాగిన ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. దిగ్గజాలు టాటా క్యాపిటల్, వియ్వర్క్ ఇండియా, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానుండగా.. మరో 4 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి 2 కంపెనీలు తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్ కంపెనీలు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, విరూపాక్ష ఆర్గానిక్స్ చేరాయి. మరోపక్క సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిస్టింగ్కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో గోప్యతా మార్గంలో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు అప్డేటెడ్గా ఏక్వస్ మరోసారి సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. షేర్ల జారీ, ఆఫర్.. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇన్ఫ్రా కన్సల్టెన్సీ సేవల సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 202.5 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 67.5 లక్షల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 76 కోట్లను రుణాల చెల్లింపునకు, దేశీ అనుబంధ సంస్థ ఎస్ఆర్ఏ ఓఎస్ఎస్లో రూ. 21.9 కోట్లు, విదేశీ అనుబంధ సంస్థలైన ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్లో రూ. 34.8 కోట్లు, బ్రిటన్ సంస్థ ఆర్వీ అసోసియేట్స్లో రూ. 20.8 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, డెడికేటెడ్ ఫ్రైట్ రైల్ కారిడార్ మొదలైన ప్రాజెక్టులకు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ సేవలు అందించింది. ఫార్మా రంగ కంపెనీ ఫార్మాస్యూటికల్ రంగ హైదరాబాద్ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న నిధులలో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణపై వెచి్చంచనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఆర్అండ్డీ ఆధారిత ఫార్మా కంపెనీ విరూపాక్ష ప్రధానంగా ఏఐపీలు, ఇంటరీ్మడియేట్స్ను తయారు చేస్తోంది. 2025 మార్చి31కల్లా 54 ప్రొడక్టుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 811 కోట్ల ఆదాయం, రూ. 78 కోట్ల నికర లాభం ఆర్జించింది. హైదరాబాద్లో నాలుగు, కర్ణాటకలోని హమ్నాబాద్లో రెండు చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. లారస్, న్యూలాండ్, దివీస్ ల్యాబ్స్, ఆర్తి డ్రగ్స్ తదితరాలను ప్రత్యర్ధి సంస్థలుగా భావించవచ్చు.సాస్ సేవలతో.. సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోకు సెబీ అనుమతించింది. జూన్లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.83 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, రూ. 152 కోట్లు ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ డెవలప్మెంట్కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లకు వినియోగించనుంది. కంపెనీ గతంలో 2021 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ అనుమతి లభించకపోవడం గమనార్హం! కంపెనీ ఏఐ ఆధారిత క్లౌడ్లో భాగమైన సాఫ్ట్వేర్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) రూ. 598 కోట్ల ఆదాయం, రూ. 13 కోట్ల నికర లాభం ఆర్జించింది.లిస్టింగ్కు ఏక్వస్ రెడీ కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, ఏరోస్పేస్ పరికరాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దీంతో ఐపీవో చేపట్టేందుకు వీలు చిక్కనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 720 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.17 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థలు ఏరోస్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, ఏక్వస్ కన్జూమర్ ప్రొడక్ట్స్ రుణ చెల్లింపులకు, మెషీనరీ, ఎక్విప్మెంట్ కొనుగోలుకి వెచ్చించనుంది. అంతేకాకుండా ఇతర సంస్థల కొనుగోళ్లకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వినియోగించనుంది. కంపెనీ గోప్యతా మార్గంలో సెబీకి జూన్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీంతో ఐపీవోకు వీలుగా మరోసారి అప్డేటెడ్ పత్రాలు అందించింది. కంపెనీలో అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్తోపాటు.. కాటమారన్, స్పర్ట గ్రూప్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ క్లయింట్లలో బోయింగ్, బోయింగ్, బంబార్డియర్, జీకేఎన్ ఏరోస్పేస్, హనీవెల్, ఈటన్ తదితర దిగ్గజాలున్నాయి. -
డ్రైవర్ అవసరం లేని ఆటో: ధర ఎంతో తెలుసా?
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీదారు ఒమేగా సీకి మొబిలిటీ (OSM).. భారతదేశంలో తన మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాను లాంచ్ చేసింది. కంపెనీ దీనికి 'స్వయంగతి' అని పేరు పెట్టింది. ఇది ప్యాసింజర్ వెర్షన్, కార్గో వెర్షన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.4 లక్షలు, రూ. 4.15 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఒమేగా సీకి మొబిలిటీ.. ఈ సరికొత్త అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. ఇది 10.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 120 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే దీనికి కావలసిన ఛార్జింగ్ సదుపాయాల గురించి ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు.స్వయంగతి ఒమేగా సీకి.. ఏఐ స్వయంప్రతిపత్తి వ్యవస్థను పొందుతుంది. ఈ సెటప్లో లి-డార్ టెక్నాలజీ, జీపీఎస్, ఆరు మీటర్ల వరకు అడ్డంకి గుర్తింపు, మల్టీ సెన్సార్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ డ్రైవర్ అవసరం లేకుండానే.. ప్రీ-మ్యాప్ చేసిన మార్గాలను నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. కంపెనీ ఈ ఆటో రిక్షాను ఇప్పటికే టెస్ట్ చేసింది. రెండో దశలో కూడా టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.విమానాశ్రయాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, స్మార్ట్ సిటీలలో ఈ ఎలక్ట్రిక్ రిక్షాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ ఈ ఆటో రిక్షాను లాంచ్ చేసింది. ఒమేగా సీకి మొబిలిటీ రాబోయే రెండు సంవత్సరాలలో 1,500 అటానమస్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) తన ఉద్యోగులలో సుమారు 2 శాతం లేదా 12,000 ఉద్యోగాలను తగ్గించుకోవడానికి ప్రణాళిక వేసినట్లు రెండు నెలల క్రితమే ప్రకటించింది. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే.. టీసీఎస్ తన ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.కంపెనీలో ఏం జరుగుతోందనే విషయాన్ని.. ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో వెల్లడించారు. మూడు రోజుల క్రితం నన్ను మీటింగ్ రూమ్కు పిలిచి, రాజీనామా చేయాలని చెప్పారు. కానీ నేను దాన్ని తిరస్కరించాను. అయితే నాలో భయం మొదలైంది. టీసీఎస్ నేను ఉద్యోగం చేస్తున్న మొదటి కంపెనీ. కాబట్టి నేను కోల్పోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ రాజీనామా చేయకపోతే.. టెర్మినేషన్ తరువాత బ్యాడ్ రివ్యూ ఇస్తామని కూడా బెదిరించారు. మీకు నచ్చినట్లు చేయండి, రాజీనామా మాత్రం చేయనని చెప్పేశాను. నాలో భయం, బాధ ఉన్నప్పటికీ.. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.మరో ఉద్యోగి కూడా తన అనుభవాన్ని షేర్ చేశారు. నన్ను రాజీనామా చేయమని ఒక ప్యానెల్ ఎదురుచూస్తోంది. నేను రోజూ సక్రంగా పని చేస్తున్నాను. అంతే కాకుండా.. ప్రతి కాల్, మెసేజ్, మెయిల్స్ వంటి వాటికి స్పందిస్తున్నాను. నా కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నేను ఒక్కడినే అని, నా ఉద్యోగం పోతే నా పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందని పేర్కొన్నాను. కానీ ఒకదానికొకటి లింక్ చేయవద్దని హెచ్ఆర్ చెప్పారు. ఇప్పుడు నేను జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటున్నానని ఆ ఉద్యోగి వెల్లడించారు.ఉద్యోగులను తొలగిస్తున్న వేళ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన నగరాల్లో IT & ITES ఉద్యోగుల సంఘం (UNITE) ప్రదర్శనలు నిర్వహించింది. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు దాదాపు 30,000 మందిని ప్రభావితం చేస్తాయని ఆరోపించింది . అయితే, టీసీఎస్ ఈ వాదనను తిరస్కరించింది. ఈ తగ్గింపు దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 2 శాతం లేదా దాదాపు 12,000 మందికి పరిమితం అని పేర్కొంది.ఇదీ చదవండి: మాంద్యం ఎఫెక్ట్: భారీ లేఆప్స్ ప్రకటించిన లుఫ్తాన్ససెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) మద్దతుతో దేశంలో నిరసనలు జరిగాయి. UNITE నాయకులు TCS తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తొలగింపుల సంఖ్య వెల్లడించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు. కాగా టీసీఎస్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 6,00,000 కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం. -
పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం!
దేశవ్యాప్తంగా పండుగ సీజన్లో రిటైలర్లు ఆకర్షణీయ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుండడంతో ఏటా వాణిజ్యం పెరుగుతోంది. ఇది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మరీ అధికంగా ఉంటుంది. వస్తువులపై రాయితీలు, మార్కెటింగ్, వినియోగదారుల సెంటిమెంట్ కలగలిసి ఆర్డర్ వాల్యూమ్లు పండుగ సీజన్లో అధికమవుతుంటాయి. అయితే ఇటీవలకాలంలో రిటైలర్ల వద్ద ఆర్డర్లు, ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని డెలివరీ చేసే గిగ్ కార్మికుల కొరత భారీగా ఉందని కొందరు చెబుతున్నారు.గిగ్ వర్కర్ల సంక్షోభంపండుగ సమయంలో భారీగా వస్తున్న ఆర్డర్లను నిర్వహించడానికి ఈ-కామర్స్, క్విక్-కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికులపై అధికంగా ఆధారపడతాయి. ఈ గిగ్ వర్కర్లు గిడ్డంగులు, డార్క్ స్టోర్ల నుంచి వస్తువుల తుది డెలివరీ వరకు కీలక విభాగాల్లో పనిచేస్తారు. ఆన్లైన్ షాపింగ్ చెయిన్లో వీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే, ఈ ఏడాది కార్మిక కొరత మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉందని స్టాఫింగ్ ఏజెన్సీలు తెలుపుతున్నాయి. వస్తువుల పంపిణీ కేంద్రాలుగా పనిచేసే డార్క్ స్టోర్లు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. గిడ్డంగులు అసాధారణంగా అధిక అట్రిషన్ రేట్లను (పని మానేసే వారి సంఖ్య) ఎదుర్కొంటున్నాయి. డెలివరీ కార్గో విమానాల సంఖ్య కూడా తగ్గిపోయింది.కార్మికుల కొరతకు కారణాలుతాత్కాలిక సిబ్బందికి మార్కెట్లో డిమాండ్ సంవత్సరానికి 15-20% పెరిగింది. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో వీరి అవసరం అధికమైంది. దాంతో మార్కెట్లో అధిక రాబడి వస్తున్న విభాగాల్లోకి వీరు మారుతున్నారు. గిగ్ పాత్రల్లో ముఖ్యంగా డెలివరీలో నెలకు 35-40% అట్రిషన్ రేట్లు కనిపిస్తున్నాయి. కార్మికులు తరచుగా స్వల్ప వేతన పెంపు కోసం ఇతర ప్లాట్ఫామ్ల్లోకి మారుతున్నారు. సీజన్ తర్వాత వీరు పూర్తిగా ఈ ఫీల్డ్ వదిలేసి నిర్మాణం వంటి ఇతర పనుల కోసం వెళుతున్నారు. తర్వాతి సీజన్లో తిరిగి వస్తున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.గిగ్ కార్మికులకు సరైన రక్షణ వ్యవస్థలు లేకపోవడం, దీర్ఘకాలిక ఒప్పందాలు కరవవ్వడం, కనీస కెరియర్ పురోగతి వంటివి లోపించడం కూడా వీరి సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. భారతదేశ గిగ్ ఆర్థిక వ్యవస్థలోని లోతైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడంలో కంపెనీలు, ప్రభుత్వ యాంత్రాగాలు విఫలమవుతున్నాయి.టైర్-2, టైర్-3 మార్కెట్ల పెరుగుదలఇండోర్, కొచ్చి, భువనేశ్వర్, నాగ్పూర్ వంటి నగరాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇవి గిగ్ నియామకంలో 30-40% పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో టాలెంట్ పూల్ పరిమితంగా ఉండటం వల్ల కార్మికులను ఆకర్షించడం కంపెనీలకు సవాలుగా మారుతోంది.తాత్కాలిక పరిష్కారాలుతక్షణ అవసరాలను పూరించడానికి ఈ-కామర్స్ సంస్థలు డిజిటల్ ఫ్లెక్సి-హైరింగ్ ప్లాట్ఫారమ్లు, స్టాఫింగ్ ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. కళాశాల విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారు, పట్టణ వలసదారులతో సహా సాంప్రదాయేతర కార్మిక వర్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, కొత్తగా క్విక్-కామర్స్ రంగంలోకి వస్తున్న కంపెనీలతో వీరికి డిమాండ్ పెరుతోంది.ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్ -
మార్చి నుంచి మార్కెట్ల అప్ట్రెండ్
దేశ ఈక్విటీ మార్కెట్లలో మరికొన్ని త్రైమాసికాల పాటు ఆటుపోట్లు కొనసాగుతాయని జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) రిషి కోహ్లి పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి స్థిరమైన అప్ట్రెండ్లో కొనసాగొచ్చని అంచనా వేశారు. ఆర్థిక మూలాలు, స్థూల ఆర్థిక, సైక్లికల్ అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తాయన్నారు. జూన్ త్రైమాసికం ఫలితాలు వివిధ రంగాల మధ్య అసహజంగా ఉన్నాయంటూ, రానున్న నెలల్లో ఇవి స్థిరపడతాయని చెప్పారు.అంతర్జాతీయ అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన బ్లాక్రాక్తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్. ఇటీవలే ఈ సంస్థ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ను ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద సమీకరించే పెట్టుబడుల్లో అధిక శాతాన్ని లార్జ్క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిషి కోహ్లీ తెలిపారు.బ్లాక్రాక్కు చెందిన సిస్టమ్యాటిక్ యాక్టివ్ ఈక్విటీస్ ప్లాట్ఫామ్ ఆధారితంగా ఈ పథకం పెట్టుబడులు పెట్టనుంది. డేటా విశ్లేషణ, నిపుణుల పరిశీలనతో పోర్ట్ఫోలియోను నిర్మించనుంది. ‘ఫ్లెక్సీక్యాప్ మా మొదటి యాక్టివ్ ఫండ్. చురుకైన, భిన్నమైన, తక్కువ వ్యయాలతో కూడిన పరిష్కారాలు అందించడమే మా లక్ష్యం. అన్ని మార్కెట్ సైకిల్స్లో రిస్క్ నియంత్రణ దృష్టిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం’ అని వివరించారు.ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్ -
జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్
యూజర్లు పౌష్టికాహారాన్ని అన్వేషించడానికి, ఆర్డర్ చేయడానికి వీలుగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో తమ యాప్లో కొత్తగా ‘హెల్దీ మోడ్’ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి గురుగ్రామ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉందని, త్వరలో మిగతా మార్కెట్లలోనూ ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది.మెట్రో నగరాల్లోని 18–45 ఏళ్ల వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. భాగస్వామ్య రెస్టారెంట్లు ఇచ్చే వివరాలను బట్టి ఒక్కో వంటకానికి ‘కనిష్టం’ నుంచి ‘సూపర్’ వరకు ‘హెల్దీ స్కోరు’ ఉంటుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ ఫీచరులో మార్పులు, చేర్పులకు సంబంధించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని యూజర్లను కోరారు.ఇదీ చదవండి: ఆర్బీఐ రూటెటు..? -
మహీంద్ర వర్సిటీ, అపోలో హెల్త్కేర్ అకాడెమీ జట్టు
అలైడ్ హెల్త్ సైన్సెస్లో బ్యాచిలర్స్ కోర్సు ప్రారంభించే దిశగా హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీ, అపోలో హెల్త్కేర్ అకాడెమీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. డిమాండ్ అధికంగా ఉన్న అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ మొదలైన స్పెషలైజేషన్స్పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి పెడుతుంది.బోధనకు సంబంధించి మహీంద్రా వర్సిటీకి చెందిన ఆధునిక మౌలిక సదుపాయాలు, క్లినికల్ నైపుణ్యాల్లో అపోలో హెల్త్కేర్ అకాడెమీ అనుభవంతో విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చని ఇరు సంస్థలు తెలిపాయి. ఆఖరు సంవత్సరంలో ఇంటర్న్షిప్తో పాటు అపోలో హాస్పిటల్స్, భాగస్వామ్య నెట్వర్క్లలో ప్లేస్మెంట్పరంగా కూడా మద్దతు లభిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి -
వచ్చే ఏడాది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్
ఈపీసీ కాంట్రాక్టర్ సంస్థ టీకేఐఎల్ ఇండస్ట్రీస్(గతంలో థిస్సెన్క్రుప్ ఇండస్ట్రీస్ ఇండియా) వచ్చే ఏడాదిలో దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా స్విట్జర్లాండ్ కంపెనీ సోహైటెక్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టీకేఐఎల్ ఇండస్ట్రీస్ ఎండీ, సీఈవో వివేక్ భాటియా తాజాగా వెల్లడించారు. సోహైటెక్తో భాగస్వామ్యంతో దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్ విభాగంలో అత్యంత ఆధునిక ఇన్నొవేటివ్ సొల్యూషన్లను అందించనున్నట్లు తెలియజేశారు.ఇందుకు ప్రొప్రయిటరీ ఆర్టిఫిషియల్ ఫొటొసింథసిస్(ఫొటొఎలక్ట్రోలిసిస్) టెక్నాలజీని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సౌర(సోలార్), పవన(విండ్) తదితర పునరుత్పాదక ఇంధనాల నుంచి గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేయనున్నట్లు వివరించారు. వీటిని పలు పరిశ్రమలలో వినియోగించేందుకు వీలుంటుందని తెలియజేశారు. తాజా సాంకేతికతతో రానున్న 12 నెలల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ సంస్థగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు ఏర్పాటుకు స్టీల్, ఆయిల్ మార్కెటింగ్ తదితర రంగాలలోని కంపెనీలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి -
ఐఐపీకి మైనింగ్ దన్ను
న్యూఢిల్లీ: ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4 శాతం వృద్ధి నమోదు చేసింది. మైనింగ్ రంగం 6 శాతం మెరుగుపడటం ఇందుకు తోడ్పడిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. గతేడాది ఆగస్టులో ఐఐపీ వృద్ధి దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉండగా, మైనింగ్ రంగం 4.3 శాతం క్షీణత నమోదు చేసింది. తాజాగా సూచీలో నాలుగింట మూడొంతుల వాటా ఉండే తయారీ రంగం వృద్ధి 1.2 శాతం నుంచి 3.8 శాతానికి పెరిగింది.విద్యుదుత్పత్తి 3.7 శాతం క్షీణత నుంచి బైటపడి 4.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు, జూలై ఐఐపీ వృద్ధి గణాంకాలను ముందుగా అంచనా వేసిన 3.5 శాతం నుంచి 4.3 శాతానికి ఎన్ఎస్వో సవరించింది.ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 4.3 శాతం నుంచి 2.8 శాతానికి నెమ్మదించింది. రాబోయే రోజులలో జీఎస్టీ క్రమబద్ధీకరణతో పండుగ సీజన్లో వినియోగం పుంజుకుంటుందని, నిల్వలన్నీ అమ్ముడైపోతే, సెపె్టంబర్–అక్టోబర్లో తయారీ రంగ ఉత్పత్తి మెరుగుపడటానికి దోహదపడగలదని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు.