Corporate
-
టీసీఎస్ కొత్త ఆఫీస్: నెల అద్దె ఎన్ని కోట్లంటే..
దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) చెన్నైలోని ఓజోన్ టెక్నో పార్క్లో దాదాపు 6,30,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీనికి నెలవారీ అద్దె రూ. 2.8 కోట్లు అని.. రియల్ ఎస్టేట్ డేటా అనలిటికల్ సంస్థ ప్రాప్స్టాక్ ద్వారా తెలిసింది.చెన్నైలోని నవలూర్లో టీసీఎస్.. ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. అద్దె 2025 మార్చి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ స్థలాన్ని ప్లాటినం హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 10 సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని కోసం టీసీఎస్ రూ. 25.5 కోట్లు డిపాజిట్ చేసినట్లు సమాచారం. అద్దె నెలకు చదరపు అడుగుకు రూ. 45 చొప్పున చెల్లించాల్సి ఉంది. అయితే ప్రతి మూడు సంవత్సరాల తర్వాత అద్దె 12 శాతం పెరుగుతుంది. అయితే ఈ విషయంపై టీసీఎస్ అధికారికంగా స్పందించలేదు.చెన్నైలో ఇతర వాణిజ్య రియల్ ఎస్టేట్ లావాదేవీలు➤జనవరి 2025లో వాల్మార్ట్.. చెన్నైలో 4.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని నెలకు రూ. 3.26 కోట్ల అద్దెకు లీజుకు తీసుకున్నట్లు ప్రాప్స్టాక్ యాక్సెస్ చేసిన పత్రాల ద్వారా తెలిసింది. ఈ ఆఫీస్ స్థలం ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో ఉంది. కంపెనీ దీనికోసం రూ.19.55 కోట్లు డిపాజిట్ చేసింది.ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..➤మార్చిలో, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా.. చెన్నైలోని తన ఇండియా ప్రధాన కార్యాలయాన్ని బాగ్మనే కన్స్ట్రక్షన్స్కు రూ. 612 కోట్లకు విక్రయించింది. ఈ ఆస్తి చెన్నైలోని ఓల్డ్ మహాబలిపురం రోడ్(OMR)లోని తోరైపక్కంలో ఉంది. ఇది నగరంలోని కీలకమైన ఐటీ కారిడార్లలో ఒకటి. ఈ ఒప్పందాన్ని మధ్యవర్తిత్వం వహించిన జేఎల్ఎల్ ధృవీకరించింది.➤గత ఏడాది ఆగస్టులో, ఐటీ సేవల దిగ్గజం LTI మైండ్ట్రీ.. చెన్నైలోని మనపక్కం శివారులో 5.85 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని రూ.3.98 కోట్ల నెలవారీ అద్దెకు లీజుకు తీసుకుంది. -
జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల అన్ని టెలికాం ఆపరేటర్లను వినియోగదారుల ప్రయోజనం కోసం.. వాయిస్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను కలిగి ఉన్న సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ప్రతిస్పందనగా, రిలయన్స్ జియో ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించకుండా.. కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్లు (రూ.458, రూ.1958) ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ & టెక్స్ట్ మెసేజస్ వంటివి మాత్రమే అవసరమయ్యే వారికి ఉపయోగపడతాయి. అంటే ఈ ప్లాన్లలో డేటా లభించదు.రూ.458 ప్లాన్ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే ఉంటుంది. వ్యాలిడిటీ సమయంలో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 ఎస్ఎంఎస్లు, నేషనల్ రోమింగ్ వంటివి లభిస్తాయి. అంతే కాకుండా.. జియో సినిమా, జియో టీవీ, జియోకు సంబంధించిన యాప్లను యాక్సెస్ చేయవచ్చు.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?రూ. 1,958 ప్లాన్ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు, నేషనల్ రోమింగ్ సేవలు ఉన్నాయి. వీటితో పాటు.. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ యాక్సెస్ను పొందుతారు. కొత్త ప్లాన్ల తీసుకొచ్చిన జియో.. రూ. 479, రూ. 1899 ప్లాన్లను నిలిపివేసింది. -
10 వారాల్లో రూ.16,700 కోట్లు తెచ్చారు..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కెనరా బ్యాంక్ ఉద్యోగులు అద్భుతమైన ఘనత సాధించారు. బ్యాంక్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో పది వారాల్లో రూ.16,700 కోట్లు సమీకరించారు. డిపాజిట్ల వృద్ధి లేమితో సతమతమవుతున్న కెనరా బ్యాంకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బ్యాంకులో పనిచేసే 82,000 మంది సిబ్బందిని నిధుల సమీకరణకు వెళ్లాలని కోరింది.పీటీఐ నివేదిక ప్రకారం.. ఇటీవల పెరిగిన డిపాజిట్ల ఉపసంహరణతో బ్యాంకింగ్ వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కెనరా బ్యాంక్ టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులందరికీ డిపాజిట్ల సేకరణకు పిలుపునిచ్చింది. 2024 జనవరి 26న ప్రారంభమైన ఈ డ్రైవ్కు సిబ్బంది మనస్ఫూర్తిగా సహకరించారు.‘బ్యాంక్ డిపాజిట్లను పెంచడానికి సహకరించాలని మొత్తం 82,000 మంది సిబ్బందిలో ప్రతిఒక్కరికీ పిలుపునిచ్చాం. కాసా (కరెంట్, సేవింగ్స్ అకౌంట్) లేదా రిటైల్ టర్మ్ డిపాజిట్ రూపంలో ఒక్కొక్కరూ రూ.10 లక్షలు తీసుకురావాలని కోరాం' అని కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కె సత్యనారాయణ రాజు తెలిపారు.సీడీ నిష్పత్తి విషయంలో కెనరా బ్యాంక్ 80 శాతం పరిమితిని చేరుకునే అంచున ఉందని ఆయన తెలిపారు. పీరియడ్ ఎండ్ లో అధిక సంఖ్యలో డిపాజిట్లు పెట్టడం ఈ డ్రైవ్ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. కాసా బ్యాలెన్స్ లలో కూడా స్థిరత్వం ఉన్నందున ఈ డ్రైవ్ మొత్తం వ్యాపారానికి సహాయపడిందని పేర్కొన్నారు. ఈ డ్రైవ్ కారణంగా కెనరా బ్యాంక్ బల్క్ డిపాజిట్లపై ఆధారపడటం కూడా తగ్గిందని ఆయన అన్నారు. అధిక వ్యయ రుణాల వాటా 25 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని వివరించారు. -
ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ మార్పుల కారణంగా భారతదేశ రక్షణ సాంకేతిక రంగాన్ని పెట్టుబడిదారులు అవకాశంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం బలమైన విధాన మద్దతు, వేగవంతమైన సాంకేతిక పురోగతి ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం దృష్టి సారించడం, పరిశ్రమ ఆవిష్కరణలు, వ్యూహాత్మక పరిష్కారాలకు భారత్ గ్లోబల్ హబ్గా రూపాంతరం చెందే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడుల వృద్ధికి కారణాలుదేశీయ రక్షణ తయారీని బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చర్యల వల్ల వివిధ కంపెనీలతో ఇటీవల 253 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడంతో రూ.53,439 కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం వల్ల రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడిదారులకు భారత్ ఆకర్షణీయంగా మారుతోంది.సాంకేతికత అభివృద్ధిసివిలియన్, మిలిటరీ అప్లికేషన్లకు సర్వీసులు అందించే డ్యుయల్-యూజ్ టెక్నాలజీలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. నిఘా, వ్యూహాత్మక కార్యకలాపాల కోసం స్వయంప్రతిపత్తి కలిగిన డ్రోన్ల తయారీ సంస్థలపై దృష్టి సారిస్తున్నారు. రియల్ టైమ్ ముప్పును గుర్తించడం కోసం ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను రూపొందించే కంపెనీలను గుర్తిస్తున్నారు. సముద్ర భద్రత, అన్వేషణ కోసం అండర్ వాటర్ డ్రోన్లు, అధునాతన డిఫెన్స్ ఇమేజింగ్, ఇంటెలిజెన్స్ కోసం హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాల వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ అంతరించనుందా..?కంపెనీల తీరుడిఫెన్స్ టెక్ స్టార్టప్లు డీప్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ), మాడ్యులర్ టెక్నాలజీ, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నాయి. కంపెనీలు తక్కువ ఖర్చుతో సుస్థిరమైన, కృత్రిమ మేధ ఆధారిత రక్షణ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి. -
బస్సులో వస్తావా? ఉద్యోగం లేదు పో..
జాబ్ ఇంటర్వ్యూకు బస్సులో వచ్చిన యువతికి ఉద్యోగం లేదు.. ఏమీ లేదు పో.. అంటూ ఓ కంపెనీ వెనక్కి పంపేసింది. తనకు ఎదురైన ఈ షాకింగ్ అనుభవాన్ని ఆ యువతి ప్రొఫెషనల్ సామాజిక వేదిక రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. తన అర్హతలు, నైపుణ్యాలు చూడకుండా కేవలం తాను ప్రజా రవాణాను ఉపయోగించినందుకు ఇంటర్వ్యూ నుంచి పంపించేశారని ఆమె వాపోయారు.యువతి రెడ్డిట్ పోస్ట్ ప్రకారం.. బస్సు దిగి కంపెనీ భవనంలోకి నడిచి వస్తున్న ఆమెను సెక్యూరిటీ కెమెరాల్లో గమనించిన హైరింగ్ మేనేజర్.. ఇంటర్వ్యూ మొదలవ్వగానే ఆమె అర్హతలు లేదా అనుభవం గురించి కాకుండా మొదట ఆమె బస్సులో రావడం గురించే అడిగాడు. ప్రజా రవాణాను ఉపయోగించినందుకు అసహనం వ్యక్తం చేసిన ఆయన అంతటితో ఆగకుండా వ్యక్తిగతంగానూ కామెంట్ చేశాడు. ఎర్రగా ఉన్న ఆమె జుట్టును "అన్ ప్రొఫెషనల్" అని వ్యాఖ్యానించాడు.అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే.. "ఇప్పుడే ఇంటర్వ్యూకు వెళ్లొచ్చాను. నేను కంపెనీ భవనం వైపు నడిచిరావడం కెమెరాల్లో చూశానని బాస్ చెప్పారు. నీకు మంచి ట్రాన్స్పోర్ట్ లేదా అని అడిగారు. ప్రజా రవాణాను ఉపయోగించకూడదని చెప్పి కొన్ని నిమిషాలు మందలించాడు. నన్ను ఎవరూ నియమించుకోరని, తానైతే ఇలాంటి వారికి అస్సలు జాబివ్వనని చెప్పాడు. ఎందుకంటే వారు సమయానికి రారు. ఇక నా ఎర్రటి జుట్టు గురించి ఫిర్యాదు చేయడం కొనసాగించాడు. అది నన్ను అన్ ప్రొఫెషనల్ గా మార్చింది అన్నాడు. ఇంటర్వ్యూ ప్రశ్నలు అడగలేదు. తమకు చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, షేక్ హ్యాండ్ ఇచ్చి నన్ను పంపించేశారు."అయితే ఇంతకీ సదరు కంపెనీ ఏది.. అనుచితంగా ప్రవర్తించిన ఆ హైరింగ్ మేనేజర్ పేరేంటి అన్నది ఆమె వెల్లడించలేదు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ పోస్ట్కు చాలా మంది యూజర్లు ప్రతిస్పందించారు. అలా ప్రవర్తించిన ఆ మేనేజర్ తీరును తప్పుబట్టారు. ఆమెకు మద్దుతుగా నిలిచారు. -
టైటాన్ కొత్త ఆటోమేటిక్ వాచీలు
ముంబై: వాచీల తయారీ సంస్థ టైటాన్ సరికొత్త ఆటోమేటిక్స్ కలెక్షన్ శ్రేణిని ప్రవేశపెట్టింది. ఫీనిక్స్, నెక్సస్, గోల్డెన్ హార్ట్ తదితర వాచీల్లో ఆకర్షణీయమైన స్కెలిటల్ డయల్స్ ఉంటాయని సంస్థ తెలిపింది. అలాగే, డ్యుయల్ ఫినిష్ సాలిడ్ లింక్ స్ట్రాప్లు, 21 జ్యుయల్ బేరింగ్లు మొదలైన ప్రత్యేకతలతో వీటిని రూపొందించినట్లు టైటాన్ వాచెస్ మార్కెటింగ్ హెడ్ అపర్ణ రవి తెలిపారు. వీటి ధర శ్రేణి రూ. 18,325 నుంచి రూ. 22,150 వరకు ఉంటుంది. -
అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్లోని జామ్నగర్లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 200 కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?మామిడి తోట పెట్టడానికి కారణం1997లో గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో అక్కడ మామిడి తోటను ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా గుర్తింపు తెచ్చింది. ఈ మామిడి తోట ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. -
‘వేద’ మా అమ్మ పేరు.. ‘వేదాంత’ నా కంపెనీ పేరు..
వేదాంత గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్ తన తల్లి స్ఫూర్తితో సాధారణ వ్యక్తి నుంచి ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బీహార్లోని పాట్నాలో జన్మించిన అగర్వాల్, కెరీర్ ఆరంభంలో విఫలమైనప్పుడు నిరాశకు గురయ్యారు. అప్పుడు అమ్మే అండగా నిలిచింది. గుండెల్లో ధైర్యం నింపింది. మాతృ దినోత్సవం సందర్భంగా ఈ తల్లీకొడుకుల అనుబంధం గురించి తెలిపేదే ఈ కథనం..విజయవంతమైన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రారంభ రోజులు పరీక్షగానే ఉంటాయి. ఎవరు అవమానించినా, హేళన చేసినా ఈ పరీక్షలో వారికి తోడుగా నిలిచేది తల్లి మాత్రమే. అలాగే అనిల్ అగర్వాల్కూ అమ్మ అండగా నిలిచింది. విజయం వైపు నడిపించింది. “అనిల్.. ముందుకు సాగు.. తలుపులు తెరుచుకుంటాయి” అని తన తల్లి చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటారాయన.ఈ మాటలు ఆయనలో సంకల్పాన్ని నింపాయి. వేదాంతను స్థాపించి భారత జీడీపీలో 1.4% వాటా సాధించే సంస్థగా నిలిపారు.ప్రస్తుతం వేదాంత ఒక పెద్ద మార్పును చేస్తోంది. 83% ఆమోదంతో డీమెర్జర్కి క్రెడిటర్స్ ఆమోదం లభించింది. దీనివల్ల సంస్థ ఐదు స్వతంత్ర విభాగాలుగా విడిపోతుంది. సెప్టెంబర్ 2025 నాటికి ఎన్సీఎల్టీ ఆమోదంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అగర్వాల్ ఆశిస్తున్నారు. ఈ డీమెర్జర్ షేర్హోల్డర్ల విలువను పెంచి, రుణ భారాన్ని తగ్గిస్తుంది. గత ఐదేళ్లలో వేదాంతలో పెట్టుబడులు 4.7 రెట్ల రాబడిని ఇచ్చాయి.వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతపై కూడా అగర్వాల్ దృష్టి ఉంది. అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ ద్వారా నడిచే నంద్ఘర్ కార్యక్రమం బాల్య విద్యను ప్రోత్సహిస్తుంది. మదర్స్ డే సందర్భంగా, తల్లుల పాత్రను గౌరవిస్తూ తన తల్లి స్ఫూర్తిని తాజాగా మరోసారి గుర్తు చేసుకున్నారు అనిల్ అగర్వాల్. ఈమేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ చేశారు.‘మొదటిసారి, ‘మదర్స్ డే’ రోజున అమ్మ లేదు!అమ్మ అంటే కేవలం శరీరం మాత్రమే కాదు… ఆమె మీ ఉనికే. ఆమె శరీర రూపంలో మనతో లేకపోయినా, ఆమె ఆత్మ శ్వాస మనతోనే ఉంటుంది.కాలం, దేవుడి కృపగా మారి కన్నీళ్లను ఆరబెడుతుంది. అంతులేని బాధను సానుకూల శక్తిగా మార్చి మనకు బతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది.విచారం, కాలంతో పాటు శక్తిగా మారుతుంది, ఎందుకంటే మీ ప్రేమ నిజమైనది.ఉదయం లేచినప్పుడు ఏదో భక్తి గీతం, ఆలోచించకుండానే నోటిలోకి వచ్చినట్లు, అలాగే అమ్మ జ్ఞాపకం మనసులో వెలుగును నింపుతూ ఉంటుంది.ఖాదీ బట్టల వాసన లేదా అగరబత్తి సుగంధంలో తరచూ అమ్మ ఉనికిని అనుభవిస్తాను.మా అమ్మకు ఇంగ్లీష్ రాదు, కానీ లండన్లో ఉంటూ ఆమె ఇంగ్లీష్ వాళ్లతో చక్కగా సంభాషించేది. భావనల భాషకు పదాల అవసరం ఎప్పుడూ ఉండదు.పెద్ద నిర్ణయం తీసుకునే ప్రతిసారీ ఒక క్షణం ఆగిపోతాను. అమ్మ ఆశీర్వాదం కావాలన్నట్లు అనిపిస్తుంది.‘వేద’ నా అమ్మ పేరు.“వేదాంత” అక్కడి నుండే పుట్టింది.నా విజయం నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రసాదమే.అమ్మ జ్ఞాపకానికి ఒక నిర్దిష్టమైన రోజు అవసరం లేకపోయినా, ఇలాంటి ఒక రోజును నిర్ణయించడం నాకు చాలా సానుకూల ఆలోచనగా అనిపిస్తుంది. ప్రపంచమంతా ఒక మాటగా కలిసి ఈ రోజును అమ్మకు అంకితం చేస్తోంది. ఇది చాలా మంచి విషయం.‘మదర్స్ డే’ సందర్భంగా ప్రతి అమ్మకు నా నమస్కారం!’ -
స్విగ్గీకి ‘క్విక్’గా వచ్చిన నష్టాలు.. 3 నెలల్లో డబుల్!
ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ ప్లాట్ఫామ్ స్విగ్గీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టం రెట్టింపై రూ. 1,081 కోట్లను తాకింది. క్విక్కామర్స్పై భారీ పెట్టుబడులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,046 కోట్ల నుంచి రూ. 4,410 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు మరింత అధికంగా రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,610 కోట్లకు పెరిగాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో స్థూల ఆర్డర్ విలువ 18 శాతం అధికమై రూ. 7,347 కోట్లకు చేరినట్లు స్విగ్గీ వెల్లడించింది. నిర్వహణ లాభం(ఇబిటా) ఐదు రెట్లు ఎగసి రూ. 212 కోట్లను తాకింది. స్విగ్గీ స్మార్ట్ సగటు ఆర్డర్ విలువ 13 శాతం మెరుగుపడి రూ. 527కు చేరగా.. 316 డార్క్ స్టోర్లను జత కలుపుకుంది.కాగా స్విగ్గీ ప్రధాన పోటీదారు ఈ మధ్యనే ఎటర్నల్గా పేరు మార్చుకున్న జొమాటో నికర లాభాలు కూడా భారీగా పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సంస్థ నికర లాభాలు 78 శాతం పతనమై రూ39 కోట్లతో సరిపెట్టుకుంది. సంస్థ రెవెన్యూ 64 శాతం పెరిగి రూ.5,833 కోట్లుగా చోటు చేసుకుంది. కంపెనీ వ్యయాలు 68 శాతం పెరిగి రూ.6,104 కోట్లకు చేరడంతో లాభాల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. -
1,600 డీల్స్.. వీసీ పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు నెమ్మదించిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ–వీసీ) పెట్టుబడులు గతేడాది మళ్లీ జోరందుకున్నాయి. 9 శాతం పెరిగి 43 బిలియన్ డాలర్లకు చేరాయి. సుమారు 1,600 డీల్స్ నమోదయ్యాయి. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ), బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ’ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్ 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.ఆసియా–పసిఫిక్లోకి వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో దాదాపు ఇరవై శాతం భారత్లోకి ప్రవహించాయని రిపోర్ట్ వివరించింది. తద్వారా ఈ ప్రాంతంలో పీఈ–వీసీ ఇన్వెస్ట్మెంట్లకు రెండో అతి పెద్ద గమ్యస్థానంగా భారత్ స్థానం మరింత పటిష్టమైందని తెలిపింది. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వంపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ఇన్వెస్టర్లు పెట్టుబడుల ద్వారా స్వల్ప వాటాలతో సరిపెట్టుకోకుండా సంస్థలను పూర్తిగా కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. 2022లో నమోదైన పీఈ డీల్స్ విలువలో సంస్థల కొనుగోళ్ల ఒప్పందాల వాటా 37 శాతంగా ఉండగా 2024లో 51 శాతానికి పెరిగింది. వివిధ రంగాలవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన అసెట్స్లో నియంత్రణాధికారాలను చేజిక్కించుకోవడంపై ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి పెడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. గతేడాది వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు 16 శాతం వాటా దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే డీల్ విలువ 70 శాతం పెరిగింది. ఆర్థిక సేవల విభాగం 25 శాతం వృద్ధి చెందింది. 14 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డీల్స్ ఏడు ఉన్నాయి. హెల్త్కేర్ విభాగంలోకి కూడా గణనీయంగా నిధులు వచ్చాయి. హెల్తియం వంటి భారీ మెడ్టెక్ లావాదేవీల దన్నుతో ఒప్పందాల పరిమాణం 80 శాతం పెరిగింది. ఫార్మా సీడీఎంవోల్లోకి పెట్టుబడులు పెరిగాయి. పెర్ఫీషియంట్ (3 బిలియన్ డాలర్లు), ఆల్టిమెట్రిక్ (900 మిలియన్ డాలర్లు), జీఈబీబీఎస్ (865 మిలియన్ డాలర్లు) లాంటి భారీ డీల్స్ ఊతంతో ఐటీ ఆధారిత సర్వీసులు, ఐటీ రంగం 300 శాతం మేర అసాధారణ వృద్ధి కనపర్చింది. ఇన్వెస్టర్లు పలు సంస్థల నుంచి నిష్క్రమించడంలోనూ ఆసియా–పసిఫిక్లోని ఇతర మార్కెట్లను భారత్ అధిగమించింది. ఇలాంటి డీల్స్ విలువ 33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మెరుగ్గా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో తమ వాటాలను విక్రయించడం ద్వారా వైదొలగడం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దేశీయంగా నిధుల సమీకరణ 2024లో కొత్త గరిష్టాలకు చేరింది. కేదార క్యాపిటల్ 1.7 బిలియన్ డాలర్ల నిధులు, క్రిస్క్యాపిటల్ 2.1 బిలియన్ డాలర్లు సమీకరించాయి. పటిష్టమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రైవేట్ వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు మొదలైన అంశాల తోడ్పాటుతో 2025పై అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. -
ఐటీలో ‘చిన్న’ హిట్టు.. ‘పెద్ద’ యావరేజు..
గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని పలు స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు గణనీయంగా రాణించాయి. పెద్ద సంస్థలను మించిన పనితీరును కనపర్చాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసుల సంస్థలు అటు క్యూ4లోను ఇటు పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ అదరగొట్టాయి. కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎంఫసిస్ వంటి సంస్థలు 2025 ఆర్థిక సంవత్సరంలో 7 శాతం నుంచి 32 శాతం వరకు ఆదాయ వృద్ధి సాధించాయి.మరోవైపు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి మాత్రం సుమారు 4 శాతానికే పరిమితమైంది. పైపెచ్చు విప్రో ఆదాయం రెండు శాతం క్షీణించింది. జనవరి–మార్చి త్రైమాసికంలోను ఇదే తరహా ఫలితాలు కనిపించాయి. సీక్వెన్షియల్గా కోఫోర్జ్ ఆదాయం 4.7 శాతం పెరిగి రూ. 3,410 కోట్లకు, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ. 2,982 కోట్లకు చేరాయి. భారీ డీల్స్ను దక్కించుకున్నప్పటికీ పెద్ద కంపెనీలు మిశ్రమ ఫలితాలు కనపర్చాయి. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.కొత్త టెక్నాలజీలు, నాయకత్వం దన్ను.. చిన్న కంపెనీలు మెరుగ్గా రాణించడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. జెన్ఏఐలాంటి కొత్త టెక్నాలజీలను వేగవంతంగా అందిపుచ్చుకోవడం, ప్రాజెక్టులను సత్వరం ఎగ్జిక్యూట్ చేయగలగడం, స్థిరమైన నాయకత్వం మొదలైన అంశాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. జెన్ఏఐలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీలనేవి, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా తమను తాము మల్చుకోగలిగే చిన్న సంస్థలకు అవకాశంగా, ప్రస్తుతమున్న భారీ సంస్థలకు కొంత సవాలుగా మారొచ్చని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) ఒక నివేదికలో తెలిపింది.వ్యయాలను తగ్గించే కొత్త టెక్నాలజీలను వెనువెంటనే అందించేలా తమ సర్వీస్ పోర్ట్ఫోలియోలను పునర్వ్యవస్థీకరించుకోవడమనేది పెద్ద సంస్థలకు కాస్త సవాలుగా ఉంటుందని పేర్కొంది. వాటి భారీ పరిమాణమే ఇందుకు కారణమని వివరించింది. అదే మధ్య స్థాయి కంపెనీలు, దీర్ఘకాలికంగా వ్యూహాత్మక ప్రయోజనాలు పొందేందుకు స్వల్పకాలికంగా ఆదాయాన్ని పణంగా పెట్టేందుకు సాహసం చేయడానికి వీలుంటుందని వివరించింది. స్థిరమైన నాయకత్వం కూడా కంపెనీల పనితీరులో కీలక పాత్ర పోషిస్తోంది.చాలా మటుకు మధ్య స్థాయి కంపెనీల సీఈవోలు అయిదేళ్లకు పైగా కొనసాగుతుండటం వల్ల విజన్, ఎగ్జిక్యూషన్ నిలకడగా ఉంటోంది. పెద్ద కంపెనీల లీడర్షిప్లలో మాత్రం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. 2023 జూన్లో టీసీఎస్ సీఈవోగా కె. కృతివాసన్ నియమితులు కాగా, 2023 డిసెంబర్లో టెక్ మహీంద్రాకు మోహిత్ జోషి, 2024 ఏప్రిల్లో విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు.ఈసారీ జోరు .. గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చిన్న, మధ్య స్థాయి సంస్థల జోరు కొనసాగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కోఫోర్జ్లాంటి కంపెనీల ఆదాయ వృద్ధి 16.4 శాతం స్థాయి నుంచి 20.8 శాతానికి పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఆర్డర్లు పెద్ద సంఖ్యలో లభిస్తుండటం, అలాగే డీల్స్ పరిమాణం కూడా భారీ స్థాయిలో ఉండటం ఇందుకు దోహదపడొచ్చని పేర్కొన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.56 బిలియన్ డాలర్ల మెగా డీల్ కుదుర్చుకున్న ఏకైక దేశీ కంపెనీగా కోఫోర్జ్ నిల్చిందని వివరించాయి.అమెరికాకు చెందిన సేబర్కు 13 ఏళ్ల పాటు సర్వీసులు అందించేందుకు ఈ కాంట్రాక్టు ఉపయోగపడనుంది. మరోవైపు, పెద్ద కంపెనీలే కాస్త అనిశ్చితి ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీల్స్ బాగానే ఉంటున్నా, అమెరికాలో టారిఫ్లపరమైన అనిశ్చితులు, డిస్క్రిషనరీ వ్యయాల విషయంలో క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం వంటి అంశాలతో స్థూలఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొనడం ఇందుకు కారణం.ఎఫ్ఎంసీజీలోనూ అదే తీరు.. నీల్సన్ఐక్యూ నివేదిక ప్రకారం వినియోగదారుల బడ్జెట్కి అనుగుణమైన ఉత్పత్తులను అందించడంలో పెద్ద బ్రాండ్లకు చిన్న బ్రాండ్లు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో ఇవి 17.8 శాతం మేర వృద్ధి సాధించాయి. మిడ్ సైజ్ సంస్థలు 14.6 శాతం మేర పెరిగాయి. దాదాపు రూ. 5 లక్షల కోట్ల దేశీ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో చిన్న, మధ్య స్థాయి సంస్థల వాటా సుమారు 35 శాతం ఉంటుంది. లో బేస్, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త మెరుగుపడటం, ద్రవ్యోల్బణం నెమ్మదించడం తదితర అంశాలు వీటికి సానుకూలంగా నిల్చాయి.మరోవైపు, రూ. 5,000 కోట్లకు పైగా రెవెన్యూ ఉండే దిగ్గజాలు క్యూ4లో 6.4 శాతం మాత్రమే వృద్ధి కనపర్చాయి. బడా కంపెనీల ఉత్పత్తుల ధరలు 4.7 శాతం పెరగ్గా, అమ్మకాల పరిమాణం 1.7 శాతంగా నమోదైంది. అంతక్రితం క్యూ4లో ధరలు 0.3 శాతం తగ్గగా అమ్మకాల పరిమాణం ఏకంగా 8.1 శాతంగా నమోదైంది. నివేదిక ప్రకారం.. చిన్న ప్యాక్లు, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం దన్నుతో జనవరి–మార్చి త్రైమాసికంలో ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగం 11 శాతం వృద్ధి చెందింది. -
కెనరా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త
ముంబై: ప్రభుత్వరంగ కెనరా బ్యాంక్ రుణ రేట్లను తగ్గించింది. ఏడాది కాలపరిమితికి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 9% చేసినట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. దీనితో వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు భారం తగ్గనుంది.ఇక, ఒకరోజు ఎంసీఎల్ఆర్ 8.20%, ఒక నెల, మూడు, ఆరు నెలల కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 8.25% – 8.80 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కొత్త రేట్లు మే 12 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ఆర్బీఐ గత నెల రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరుశాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ జనరల్ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ
ముంబై: ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కొత్తగా ఎస్బీఐ జనరల్ ఫ్లెక్సీ హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకొచ్చింది. సొంతిల్లు లేదా అద్దె ఇంటికి సంబంధించి సమగ్రమైన బీమా రక్షణను ఈ ప్లాన్ అందిస్తుందని ఎస్బీఐ జనరల్ తెలిపింది. కస్టమర్లు తమ అవసరాలకు అనుకూలంగా దీన్ని తీసుకోవచ్చని పేర్కొంది.ఇంట్లోని విలువైన వస్తువులతోపాటు.. ప్రత్యామ్నాయ వసతి కోసం అయ్యే వ్యయాలు, ఇంట్లో చోరీల నుంచి రక్షణ ఇలా అన్ని రకాల రక్షణలు ఈ ప్లాన్లో అందుబాటులో ఉంటాయి. ఫైర్ కవర్ ఒక్కటి తప్పనిసరిగా ఉంటుంది. మిగిలినవి పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఒక్కసారి ప్రీమియంతో 20 ఏళ్లకు రక్షణ పొందొచ్చని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. -
అందాలతో అలరిస్తూ.. వ్యాపారాలు పెంచుతూ..
తెలంగాణ రాష్ట్రం 2025 సంవత్సరానికిగాను మిస్ వరల్డ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇస్తుంది. మే 31 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. కేవలం ఇది ఒక ప్రతిష్ఠాత్మక అందాల పోటీ మాత్రమే కాదు. స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు దోహదపడే కార్యక్రమం. వినోదం, స్పాన్సర్షిప్లు, పర్యాటకం, డొనేషన్స్ను సమ్మిళితం చేసే శక్తివంతమైన ప్రపంచ వ్యాపార నమూనా. 130కిపైగా దేశాల నుంచి అందగత్తెలు, జడ్జీలు, కార్యక్రమాన్ని ఎండార్స్ చేసే కంపెనీల ప్రతినిధులు విచ్చేస్తారు. ఈ ఈవెంట్ చుట్టూ జరిగే వ్యాపార ధోరణులను విశ్లేషిద్దాం.స్పాన్సర్షిప్లు, బ్రాండ్ భాగస్వామ్యాలుఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ కంపెనీలతో సహా ప్రధాన బ్రాండ్లు గ్లోబల్ విజిబిలిటీ కోసం ఈ ఈవెంట్ను ఉపయోగించుకుంటున్నాయి. ప్రఖ్యాత కాస్మెటిక్ దిగ్గజాలు, ఆభరణాల డిజైనర్లు, లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ల పోటీదారులు ఈవెంట్ సెగ్మెంట్లను స్పాన్సర్ చేస్తూ హై-ప్రొఫైల్ మార్కెటింగ్ అవకాశాన్ని అందుకోవచ్చు.బ్రాడ్కాస్టింగ్, మీడియా హక్కులుఈ అందాల పోటీని ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు ప్రత్యేక ప్రసార హక్కుల కోసం నెట్వర్క్ సంస్థలు పోటీ పడుతుంటాయి. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు, పే-పర్-వ్యూ మోడల్స్, ప్రకటనలు, స్పాన్సర్షిప్ ఇంటిగ్రేషన్ల ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు.పర్యాటకంఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇతర దేశాల ప్రముఖులు హైదరాబాద్ రానున్నారు. దాంతో స్థానికంగా ఆతిథ్య రంగం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా సేవలు, స్థానిక వ్యాపారాలు గణనీయంగా ప్రయోజనం పొందుతాయి. స్థానిక పర్యాటకం, సాంస్కృతిక సంపదను అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు ఈ ఈవెంట్ను ఉపయోగించుకుంటారు.టికెట్ అమ్మకాలు, వీఐపీ ప్యాకేజీలుప్రీమియం సీటింగ్, లగ్జరీ అనుభవాలు, గాలా డిన్నర్లతో మిస్ వరల్డ్ ఈవెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. ఇది టికెట్ ఆదాయానికి దోహదం చేస్తుంది. వీఐపీలు, స్పాన్సర్ల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉంటాయి.ఇదీ చదవండి: ఎస్బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానాబ్రాండ్ ప్రమోషన్మిస్ వరల్డ్ ఈవెంట్లో సుందరీమణులు ధరించే బ్రాండెడ్ దుస్తులు, యాక్సెసరీల ద్వారా కంపెనీలు తమ బ్రాండ్ను ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కో-బ్రాండెడ్ ఉత్పత్తుల విక్రయాలు పెంచుకునేందుకు ఈ ఈవెంట్ను ఉపయోగించుకుంటారు. -
ఎస్బీఐ, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై భారీ జరిమానా
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) నిబంధనలు పాటించలేదనే కారణంతో ప్రముఖ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై జరిమానా విధించింది. ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, నిర్దేశించిన మార్గదర్శకాలకు బ్యాంకులు కట్టుబడి ఉండేలా ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది.బ్యాంకుల రుణాలు, అడ్వాన్స్లు, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో కస్టమర్ ప్రొటెక్షన్కు సంబంధించిన అంశాలు, కరెంట్ అకౌంట్ ఖాతాలు ఓపెన్ చేయడంలో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది. దాంతో ఎస్బీఐకి రూ.1.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.1 కోటి జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది. ఈ జరిమానాలు బ్యాంకింగ్ రంగంలో మరింత జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి దిద్దుబాటు చర్యగా పనిచేస్తాయని పేర్కొంది.ఇదీ చదవండి: సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంబ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావంరెగ్యులేటరీ నిబంధనల అమలు ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ కఠినమైన పర్యవేక్షణను ప్రతిబింబిస్తుంది. అంతర్గత నియంత్రణలను బలోపేతం చేయడానికి, కస్టమర్ రక్షణ యంత్రాంగాలను మెరుగుపరచడానికి బ్యాంకులను ప్రోత్సహిస్తుంది. ఈ చర్యలు ఇతర బ్యాంకులకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయని కొందరు భావిస్తున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని, వాటిని పాటించడంలో లోపాలను నివారించాలని కోరుతున్నారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు సరిహద్దు రాష్ట్రాల్లోని తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇరు దేశాల పరస్పర దాడులకు ప్రతిస్పందనగా ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఈవై ఇండియా సూచించింది. యుద్ధ కార్యకలాపాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ఎన్సీఆర్, ఛండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్లోని సిబ్బంది ఈ మేరకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.డెలాయిట్, కేపీఎంజీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా సహా ఇతర ఐటీ, కన్సల్టింగ్ సంస్థలు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. అత్యవసరం కాని ప్రయాణాలపై ఆంక్షలు విధించామని, సరిహద్దు రాష్ట్రాల్లోని ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచించారు. భారత్-పాక్ యుద్ధ నేపథ్యంలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్లలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ విధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాస్మతి బియ్యం ధరల పెరుగుదలకు యుద్ధం కారణం..?సమస్యాత్మక జిల్లాల్లో తాత్కాలిక పాఠశాలల మూసివేతలు, విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. సున్నితమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన పలు డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయి. -
దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన సరఫరాకు ఒప్పందం
దీర్ఘకాలిక పునరుత్పాదక ఇంధన సరఫరా కోసం కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), ఏఎం గ్రీన్ ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం సీఐఎల్ సోలార్, పవన శక్తి ద్వారా ఏఎం గ్రీన్ ఉత్పత్తి చేయబోతున్న గ్రీన్ అమ్మోనియా సౌకర్యాలకు 4,500 మెగావాట్ల కార్బన్ రహిత శక్తిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఒప్పందంపై సీఐఎల్ జీఎం (ఈ అండ్ ఎం) సుదర్శన్ బోరా, ఏఎం గ్రీన్ బిజినెస్ డెవలప్మెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శతన్షు అగర్వాల్ ఇరు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో సంతకాలు చేశారు.దేశవ్యాప్తంగా భారీ పునరుత్పాదక ఇంధన విస్తరణ జరపాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్, రాజస్థాన్ల్లో సోలార్ పవర్ కెపాసిటీని 2,500 మెగావాట్ల నుంచి 3,000 మెగావాట్ల వరకు పెంచాలని నిర్ణయించారు. 1,500 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని 2,000 మెగావాట్లకు విస్తరించాలని చూస్తున్నారు. ఇందుకోసం దక్షిణ భారతదేశంలో అనువైన స్థలాలను అన్వేషిస్తున్నారు. ఈమేరకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రూ.25,000 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఏఎం గ్రీన్ ఈ పునరుత్పాదక శక్తిని పంప్డ్ హైడ్రో స్టోరేజీతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఉత్పత్తి సౌకర్యాలకు స్థిరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాను ఇది నిర్ధారిస్తుంది. గ్రీన్కో గ్రూప్ ప్రమోటర్లు స్థాపించిన ఏఎం గ్రీన్ 2030 నాటికి ఏటా 5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక ఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్కు సమానం. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యంలో 20%గా ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఐటీఆర్ దాఖలుకు 5 ప్రధాన అంశాలుఈ సందర్భంగా సీఐఎల్ సుస్థిరమైన ఎనర్జీని సరఫరా చేసేందుకు కట్టుబడి ఉందని సంస్థ ఛైర్మన్ పీ.ఎం.ప్రసాద్ తెలిపారు. భారతదేశ ఇంధన తయారీలో బొగ్గు కీలక భాగంగా ఉన్నప్పటికీ, సీఐఎల్ గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఈమేరకు కంపెనీ చురుకుగా పనిచేస్తోందని పేర్కొన్నారు. గ్రీన్కో అండ్ ఏఎం గ్రీన్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి ఈ ప్రాజెక్టుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఇతర గ్రీన్ మాలిక్యూల్స్ తయారీలో గణనీయంగా ఖర్చు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద కార్బన్-ఫ్రీ, పునరుత్పాదక ఇంధన సరఫరాదారుగా ఉన్న సీఐఎల్తో జతకట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. -
ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)–2025 మ్యాచ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ను వెంటనే నిలిపేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వారం రోజులపాటు లీగ్ను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి మ్యాచ్లకు సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ 2025ను నిలిపివేయడం ప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లలో ఆందోళనలకు కారణమవుతుంది. ప్రకటనల ఆదాయంలో 35% తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. లీగ్ వాయిదా పడడం వల్ల మార్కెటింగ్ ప్రణాళికలకు అంతరాయం కలిగినట్లు తెలియజేస్తున్నారు.బ్రాడ్కాస్టర్లు, బ్రాండింగ్ కంపెనీల ఆందోళనభారతదేశంలో అత్యంత లాభదాయకమైన క్రీడా ఈవెంట్లలో ఐపీఎల్ ఒకటి. ఇది మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షిస్తోంది. భారీ ప్రకటనల ఆదాయాన్ని సృష్టిస్తోంది. మార్కెటింగ్ కీలకంగా మారిన ఈ లీగ్ పునఃప్రారంభించకపోతే జియోహాట్స్టార్ వంటి బ్రాడ్కాస్టర్లు రూ.2,000 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. చాలా బ్రాండ్లు ఐపీఎల్ వాణిజ్య ప్రకటనల కోసం గణనీయంగా బడ్జెట్ కేటాయించాయి. అధిక వ్యూయర్షిప్ ద్వారా రాబడిని పెంచాలని నిర్ణయించాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వారు తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి కొత్త వ్యూహాలతో ముందుకుసాగాలని కంపెనీలు భావిస్తున్నట్లు తెలియజేస్తున్నారు.జట్లు, ఫ్రాంచైజీలపై ప్రభావంప్రకటనదారులు, బ్రాడ్కాస్టర్లకు మించి ఈ వాయిదా నిర్ణయం నేరుగా ఐపీఎల్ ఫ్రాంచైజీలపై ప్రభావం చూపుతుంది. సెంట్రల్ రెవెన్యూ పూల్పై ఆధారపడే జట్లు తమ సంపాదనలో 20% క్షీణతను చూడవచ్చని కొందరు అంటున్నారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో అనిశ్చితి కారణంగా అనేక ఫ్రాంచైజీలు స్పాన్సర్షిప్లను, టిక్కెట్ల అమ్మకాల ద్వారా సమకూరే ఆదాయాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇండియా-యూఎస్ వయా యూరప్భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లీగ్ నిలిపివేతకు జాతీయ ప్రయోజనాలే కారణమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పేర్కొంది. తొలుత వారం రోజుల విరామం ప్రకటించినప్పటికీ, అప్పటివరకు యుద్ధం సమసిపోనట్లయితే ఇది మరింతకాలం పోడిగించే అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం అయితే లీగ్ను రద్దు చేసుకోవచ్చని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. -
ఏటీఎంల మూసివేత వదంతులు.. బ్యాంకుల స్పష్టత
భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ఏటీఎంలను మూసివేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖండించాయి. ఏటీఎంలన్నీ పూర్తి స్థాయిలో సజావుగానే పని చేస్తున్నాయని, వాటిలో తగినన్ని నగదు నిల్వలు ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి. డిజిటల్ సేవలు కూడా సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి.‘మా ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు, డిజిటల్ సేవలు అన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి‘ అని ఎస్బీఐ ఎక్స్లో పోస్ట్ చేసింది. ధ్రువీకరించుకోకుండా ఏ వార్తలను విశ్వసించొద్దంటూ కస్టమర్లకు సూచించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొదలైనవి కూడా ఇదే తరహా మెసేజీలను పోస్ట్ చేశాయి.కాగా ఏటీఎంల మూసివేత అంటూ వచ్చిన వార్తా కథనాలను ప్రభుత్వ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం తనిఖీ చేసి అవి పూర్తిగా ఫేక్ అని తేల్చేసింది. భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో ఇండియాలోని ఏటీఎంలపై రాన్సమ్వేర్ దాడి కారణంగా మూడు రోజులపాటు సర్వీసులు పని చేయవన్నట్లు సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు వచ్చాయి. -
ఎల్ఐసీ కొత్త సర్వీసు.. వాట్సాప్ నుంచే..
ప్రభుత్వ రంగ భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపులు మరింత సులభతరంగా మారాయి. పాలసీల ప్రీమియంను వాట్సాప్ నుంచే సులభంగా చెల్లించే సదుపాయాన్ని ఎల్ఐసీ ప్రారంభింంది. ఎల్ఐసీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న పాలసీదారులు.. 8976862090 వాట్సాప్ నంబర్ ద్వారా తమ పాలసీలకు సంబంధిం చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుసుకోవచ్చు.అక్కడి నుంచే నేరుగా యూపీఐ/నెట్బ్యాంకింగ్/కార్డు ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయొచ్చని ఎల్ఐసీ ప్రకటించింది. రశీదును సైతం పొందొచ్చని పేర్కొంది. కొత్త సదుపాయం ద్వారా పాలసీదారులు ఉన్న చోట నుంచే చెల్లింపులు చేసుకోవడానికి వీలు కల్పిస్తుందని ఎల్ఐసీ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి తెలిపారు. ఎల్ఐసీ పోర్టల్పై ఇప్పటి వరకు 2.2 కోట్ల మంది పాలసీదారులు రిజిస్టర్ చేసుకుని ఉండగా, వీరందరికీ నూతన సేవ సౌకర్యాన్ని ఇవ్వనుంది. -
స్టార్టప్లకు మరింత సాయం
న్యూఢిల్లీ: ‘క్రెడిట్ గ్యారంటీ స్కీమ్’ (సీజీఎస్) సవరణతో స్టార్టప్లకు రుణ వితరణ సులభతరం అవుతుందని.. పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరింత ఆర్థిక సాయం లభిస్తుందని, గొప్ప టెక్నాలజీ ఆవిష్కరణకు ఊతం లభిస్తుందని కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) పేర్కొంది. సవరించిన సీజీఎస్ఎస్కు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం గమనార్హం. దీంతో ఒక్కో స్టార్టప్కు హామీతో కూడిన రుణ వితరణ పరిమితి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెరిగింది. ఇదంతా కూడా హామీలేని రుణమే. ‘‘ఈ పథకం విస్తరణతో స్టార్టప్లకు రుణ వితరణ రిస్్కలు మరింత తగ్గుతాయి. ఆర్అండ్డీ, ప్రయోగాలు, అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతికతలను సృష్టించడానికి కావాల్సిన ఆర్థిక మద్దతు లభిస్తుంది’’అని డీపీఐఐటీ ప్రకటించింది. స్టార్టప్కు ఇచ్చే రుణాలు రూ.10 కోట్ల వరకు ఉంటే వాటికి ప్రభుత్వ హామీ 85 శాతంగా, అంతకుమించిన రుణాలకు 75 శాతంగా ఉంటుందని తెలిపింది. దేశంలో స్టార్టప్లకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా 2016 జనవరి 16న కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టడం తెలిసిందే. ఇందులో భాగంగానే 2022 అక్టోబర్ 6న సీజీఎస్ఎస్ పథకాన్ని తీసుకొచి్చంది. స్టార్టప్లకు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్లు, ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్బీఎఫ్సీలు మంజూరు చేసే రుణ సదుపాయాలకు నిర్దేశిత మేర ప్రభుత్వం హామీ కల్పించింది. ఈ ఏడాది జనవరి నాటికి 1.61 లక్షల స్టార్టప్లను ప్రభుత్వం గుర్తించడం గమనార్హం. -
వాటా విక్రయానికి యస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)సహా పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న యస్ బ్యాంక్లో కొంతమేర వాటా విక్రయించనున్నాయి. తద్వారా జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) మొత్తం 20 శాతం వాటా సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకి రూ. 21.50 ధరలో ఇందుకు రూ. 1,483 కోట్లు వెచ్చించనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద లావాదేవీగా ఈ వాటా విక్రయం నమోదుకానున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. ఎస్ఎంబీసీకి యస్ బ్యాంక్లో 13.19 శాతం వాటా ఎస్బీఐ విక్రయించనుంది. డీల్ విలువ రూ. 8,889 కోట్లు. ఈ బాటలో ఇతర బ్యాంకులు యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా ఉమ్మడిగా 6.81 శాతం వాటా అమ్మనున్నాయి. వీటి విలువ రూ. 4,594 కోట్లు. ఫలితంగా యస్ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారుగా ఎస్ఎంబీసీ అవతరించనుంది. 2020 మార్చిలో యస్ బ్యాంక్ పునర్నిర్మాణ పథకంలో భాగంగా 2020 మార్చిలో ఎస్బీఐసహా 7 ప్రయివేట్ రంగ బ్యాంకులు ఇన్వెస్ట్ చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(ఈసీసీబీ) యస్ బ్యాంక్లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను విక్రయించేందుకు అనుమతించినట్లు ఎస్బీఐ పేర్కొంది. యస్ బ్యాంక్లో ప్రస్తుతం ఎస్బీఐ 24 శాతం వాటా కలిగి ఉంది. 13 శాతంపైగా వాటా అమ్మకం ద్వారా రూ. 8,889 కోట్లు అందుకోనుంది. ఇతర బ్యాంకులలో హెచ్డీఎఫ్సీ 2.75 శాతం, ఐసీఐసీఐ 2.39 శాతం, కొటక్ మహీంద్రా 1.21 శాతం, యాక్సిస్ 1.01 శాతం, ఐడీఎఫ్సీ ఫస్ట్ 0.92 శాతం, ఫెడరల్ 0.76 శాతం, బంధన్ 0.7 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. తదుపరి దశ వృద్ధికి తాజా లావాదేవీ దోహదపడనున్నట్లు యస్ బ్యాంక్ ఈ సందర్భంగా పేర్కొంది. కాగా.. ఇందుకు ఆర్బీఐ, సీసీఐ తదితర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించవలసి ఉంది. టాప్–2లో జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థ ఎస్ఎంబీసీ 2 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. తద్వారా జపాన్లో రెండో పెద్ద బ్యాంకింగ్ కార్పొరేషన్గా నిలుస్తోంది. దేశీయంగా ప్రధాన విదేశీ బ్యాంకులలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా సొంత అనుబంధ సంస్థ, డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీ.. ఎస్ఎంఎఫ్జీ ఇండియా క్రెడిట్ కంపెనీని నిర్వహిస్తోంది. వాటా చేతులు మారుతున్న వార్తలతో యస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 10 శాతం జంప్చేసి రూ. 20 వద్ద ముగిసింది. -
మొదలైన రెండో దశ హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్: వివరాలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL)కు చెందిన సీఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ (HMIF), తన హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ చొరవ ద్వారా నంద్యాల జిల్లాలోని 115 చెంచు గిరిజన కుటుంబాలను జీవనాధార వ్యవసాయం నుంచి స్థిరమైన వ్యవసాయ అటవీప్రాంతానికి మార్చడం ద్వారా వారికి సాధికారత కల్పించింది.అక్టోబర్ 2022లో హ్యుందాయ్ ప్రారంభించిన ఈ చొరవ స్థిరమైన వ్యవసాయ అటవీప్రాంతం, భూమి, నీటి నిర్వహణ & సామర్థ్య నిర్మాణ జోక్యాలను సమగ్రపరచడం ద్వారా నంద్యాల జిల్లాలోని చెంచు లక్ష్మీ గూడెం, నరపురెడ్డి కుంట, బైర్లూటీ, నాగలూటీ గ్రామాలలో విస్తరించి ఉన్న చెంచు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచింది.మొదటి దశలో.. బోరు బావులు, బిందు సేద్యం ద్వారా ఉద్యానవన తోటలను అభివృద్ధి చేయడానికి సంహరించింది. ఇందులో భాగంగానే ఆదాయ ఉత్పత్తి కోసం మొత్తం 250 ఎకరాల భూమిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో అటవీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి.. పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించింది. దీంతో వారి ఆదాయం కూడా పెరిగింది.నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 20 గ్రామాలలోని గిరిజన.. అణగారిన కుటుంబాలకు పర్యావరణం & స్థిరమైన జీవనోపాధిని అందించడానికి దాని ఆగ్రోఫారెస్ట్రీ చొరవ రెండవ దశను హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఈ రోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ITDA) అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏజీ నాయక్, ఐటీడీఏ డివిజనల్ హార్టికల్చర్ ఆఫీసర్ కే. చందన.. HMIF అధికారులు ప్రాజెక్ట్ నేమ్ బోర్డును ఆవిష్కరించి.. లబ్ధిదారులకు మొక్కలను అందజేశారు. -
ఇండియా-యూఎస్ వయా యూరప్
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడం ఎయిరిండియాకు కొత్త రూట్లలో తమ కార్గో విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. కార్గో సర్వీసుల్లో భాగంగా యూరప్ మీదుగా యూఎస్, కెనడాకు విమానాలను నడపవలసి వస్తుంది. అయితే పాకిస్థాన్ మీదుగా కాకుండా చుట్టూ తిరిగి అమెరికా వెళ్తుండడంతో కార్గో రవాణాకు ఎక్కువ సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఫలితంగా ఇంధన వినియోగం పెరుగుతున్నట్లు పేర్కొంది. అందుకు కొన్ని నాన్స్టాప్ విమానాలు, వన్-స్టాప్ విమానాలను నడుపుతున్నట్లు చెప్పింది.ఆపరేషనల్ మార్పులుముంబై-న్యూయార్క్ విమాన సర్వీసులను నాన్ స్టాప్ సర్వీసులకు పునరుద్ధరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఢిల్లీ-అమెరికా/కెనడా విమానాలు వియన్నా లేదా కోపెన్ హాగన్లో ఇంధనం నింపుకుంటున్నాయని చెప్పింది. ఢిల్లీ-యూఎస్ మార్గంలో నాన్స్టాప్ విమానాల్లో ఇంధనం సాధారణంగా 90-130 టన్నుల వరకు ఖర్చవుతుంది. కానీ వన్-స్టాప్ విమానాలు ఈ ఇంధన భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. దాంతోపాటు ఎక్కువ సరుకు రవాణాకు వీలుంటుంది.కార్గో సామర్థ్యం పెంపుయూరప్గుండా ప్రయాణించే వన్-స్టాప్ విమానాలు నాన్స్టాప్ విమానాల కంటే 2-3 రెట్లు అధికంగా కార్గోను మోసుకెళ్లగలవని కంపెనీ తెలిపింది. దాంతో ఈమేరకు కొన్ని నాన్స్టాఫ్, నాన్ స్టాఫ్ విమానాలను నడుపుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?పెరుగుతున్న మామిడి ఎగుమతులుదేశంలో ఉత్పత్తవుతున్న మామిడి ఎగుమతులు పెరుగుతున్నాయి. దాంతో కార్గో అవసరాలు అధికమయ్యాయి. గత వారం ఎయిరిండియా వన్ స్టాప్ విమానాల ద్వారా 20 టన్నుల మామిడిని అమెరికాకు ఎగుమతి చేశారు. ఈ సీజన్లో తమ సంస్థ ఇప్పటికే 350 టన్నుల మామిడి పండ్లను రవాణా చేసిందని కేబీ ఎక్స్పోర్ట్స్ సీఈఓ కౌశల్ కఖర్ పేర్కొన్నారు. జూన్ నాటికి ఇది 1,200 టన్నులు దాటుతుందని అంచనా వేస్తున్నారు. రీ-రూట్ చేసిన కొన్ని సంస్థల విమానాలు వాటి ప్రయాణాల్లో అసౌకర్యాన్ని ఎదుర్కొంటుండగా, ఎయిరిండియా కార్గో ఆదాయాన్ని పెంచుకోవడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తుంది. -
పెట్రోల్, డీజిల్, గ్యాస్పై టెన్షన్.. ఆయిల్ కంపెనీ క్లారిటీ
భారత్-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కొరత వస్తుందేమోనన్న ఆందోళనతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను ముందే కొని నిల్వ చేసుకునేందుకు దేశంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కడుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టత ఇచ్చింది. దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.ఈ మేరకు ఐఓసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఒక పోస్ట్ చేసింది. "భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంధనం, ఎల్పీజీ మా అన్ని అవుట్లెట్లలో సమృద్ధిగా అందుబాటులో ఉంది" అని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇండియన్ ఆయిల్ వద్ద ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, తమ సరఫరా మార్గాలు సజావుగా పనిచేస్తున్నాయని తెలిపింది. వినియోగదారులు అనవసర ఆందోళనతో పెట్రోల్ బంక్లకు పోటెత్తవద్దని సూచించింది.ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి, ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ భయాందోళనలు నెలకొన్నాయి.#IndianOil has ample fuel stocks across the country and our supply lines are operating smoothly.There is no need for panic buying—fuel and LPG is readily available at all our outlets.Help us serve you better by staying calm and avoiding unnecessary rush. This will keep our…— Indian Oil Corp Ltd (@IndianOilcl) May 9, 2025 -
సరిహద్దు రాష్ట్రాల్లోనే భారీగా బ్యాంకు డిపాజిట్లు..
భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిస్థితులు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్నాయి. పాకిస్తాన్పై ఓవైపు మెరుపుదాడులతో విరుచుకుపడుతూనే మరోవైపు సరిహద్దు వెంబడి ఆ దేశం చేస్తున్న దాడులను భారత్ సైనిక దళాలు తిప్పికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వం హై అలర్ట్ కొనసాగుతోంది. అయితే ఈ సరిహద్దు రాష్ట్రాల్లోనే గణనీయమైన డిపాజిటర్ బేస్ ఉండటంతో బ్యాంకింగ్ రంగం ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుంది.జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశ మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 12.81 శాతం అంటే రూ .26.21 లక్షల కోట్లు ఆ అయిదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే మొత్తం అడ్వాన్సులలో 13.41 శాతం అంటే రూ .22.13 లక్షల కోట్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నాయి.జమ్ముకశ్మీర్లో..ఘర్షణకు కేంద్ర బిందువైన కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ అస్థిర నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)తో సహా పాకిస్థాన్తో 3,323 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. జమ్ముకశ్మీర్ బ్యాంకుల్లో రూ.1.49 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇవి దేశ డిపాజిట్లలో 0.73 శాతం. అడ్వాన్సులు రూ .73,879 కోట్లు. మొత్తం అడ్వాన్స్లలో 0.45 శాతం.పంజాబ్లో..భారత్లో మరో ముఖ్యమైన సరిహద్దు రాష్ట్రం పంజాబ్. ఇది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ తో 547 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. దేశంలోని మొత్తం డిపాజిట్లలో 3 శాతం అంటే రూ.6.14 లక్షల కోట్లకుపైగా ఈ రాష్ట్రం నుంచి ఉన్నాయి. ఇక రూ.5.35 లక్షల కోట్ల మేర (3.24 శాతం) రుణాలను ఇక్కడి బ్యాంకులు వితరణ చేశాయి.రాజస్థాన్పాకిస్థాన్ లోని సింధ్, పంజాబ్ ప్రావిన్సుల వెంబడి 1,035 కిలోమీటర్ల ఎడారి సరిహద్దు కలిగిన రాజస్థాన్ లో రూ.6.98 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు (3.41 శాతం), రూ.6.25 లక్షల కోట్లు (3.79 శాతం) అడ్వాన్సులు ఉన్నాయి.గుజరాత్సర్ క్రీక్, రాన్ ఆఫ్ కచ్ వెంబడి పాకిస్తాన్ తో 508 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ ఈ రాష్ట్రాలలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉంది. ఇక్కడి బ్యాంకుల్లో రూ.10.8 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు (5.27 శాతం), రూ.9.45 లక్షల కోట్లు (5.73 శాతం) రుణాలు ఉన్నాయి.హిమాచల్ ప్రదేశ్పాకిస్తాన్ తో నేరుగా సరిహద్దును పంచుకోనప్పటికీ జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లకు దగ్గరగా ఉండటం వల్ల హిమాచల్ ప్రదేశ్ కూడా ఉద్రిక్తతల వలయంలో ఉంది. దేశ డిపాజిట్లలో 0.4 శాతం అంటే రూ.81,840 కోట్లు, అడ్వాన్సుల్లో 0.2 శాతం అంటే రూ.32,736 కోట్లు ఇక్కడి బ్యాంకులకు ఉన్నాయి. -
ఐటీలో ఒక్కో ఉద్యోగి వల్ల ఆదాయం ఎంతంటే..
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో 2025 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతి ఉద్యోగి ద్వారా సమకూరే ఆదాయం(రెవెన్యూ పర్ ఎంప్లాయి-ఆర్పీఈ) పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల ద్వారా సమకూరే ఆదాయం ఏడేళ్ల గరిష్టాన్ని తాకినట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. మెరుగైన వనరుల వినియోగం, ఆటోమేషన్, కార్యాచరణ సామర్థ్యాల ద్వారా ఇది సాధ్యమైందని కంపెనీలు తెలిపాయి. కాగా, ఇటీవల సంస్థల త్రైమాసిక లాభాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. ఒక్కో ఉద్యోగి ద్వారా 2024-25లో ఏయే సంస్థకు ఎంత సమకూరిందో కింద తెలుసుకుందాం.టీసీఎస్: 49,638 డాలర్లు(సుమారు రూ.41.67 లక్షలు) గతేడాది కంటే ఇది 2.7 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్టాన్ని చేరింది. టీసీఎస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 6,07,979.ఇన్ఫోసిస్: 59,575 డాలర్లు(సుమారు రూ.50 లక్షలు). గతంలో కంటే 1.8% పెరిగి ఏడేళ్ల గరిష్టానికి చేరింది. ఇన్ఫోసిస్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 3,17,240.హెచ్సీఎల్ టెక్: 61,946 డాలర్లు (సుమారు రూ.51.9 లక్షలు). గతంలో కంటే 6.2% పెరిగింది. హెచ్సీఎల్ టెక్ కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 2,27,000.విప్రో, టెక్ మహీంద్రా రెండూ ఆర్పీఈలో క్షీణతను నమోదు చేశాయి.క్రమబద్ధీకరించిన కార్యకలాపాలు, సమర్థవంతంగా ప్రాజెక్ట్ల అమలు, అధునాతన ఆటోమేషన్ వ్యూహాల కారణంగా ఆర్పీఈలో మెరుగుదల కనిపించినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, లేఆఫ్స్ పేరుతో ఇటీవల కాలంలో చాలామంది ఉద్యోగులను తొలగించడంతోనే కంపెనీలకు ఇలా ఆర్పీఈ పెరిగినట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?కంపెనీలకు లాభాలు ఉన్నప్పటికీ ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితితో ఐటీ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఐటీ సేవలకు డిమాండ్ మందగించడం, వ్యయ ఒత్తిళ్లు, లేఆఫ్స్ ఆందోళనలు భవిష్యత్ రాబడులపై ప్రభావం చూపనున్నాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలతో ఐటీ సంస్థలు స్కిల్ డెవలప్మెంట్, ఆటోమేషన్, కాస్ట్ ఎఫిషియెన్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. -
60 నుంచి 45 ఏళ్లకు రిటైర్మెంట్ వయసు?
శరవేగంగా మారుతున్న భారత కార్పొరేట్ ప్రపంచంలో 60 ఏళ్ల వరకు హాయిగా పనిచేయాలనే ఆలోచన మెల్లమెల్లగా కనుమరుగవుతోంది. ఈ రోజుల్లో వృత్తి నిపుణులు పని వాతావరణంలో చాలా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. దాంతో యువ ఉద్యోగుల్లో 45 ఏళ్లు వచ్చేవరకే రిటైర్ అవ్వాలనే ధోరణి పెరుగుతోంది. అయితే ఇది ఆదోళన కలిగించే అంశమని కొందరు నిపుణులు భావిస్తున్నారు.ఈ సందర్భంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, అడ్వైజర్ సార్థక్ అహుజా మాట్లాడుతూ..‘ఉద్యోగుల్లో ఈ మార్పు వాస్తవమే. ఇది ఆందోళన కలిగించే అంశం. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 45 ఏళ్లకు మారుతుండడంతో భారతీయ కార్పొరేట్లలో ఆందోళన కలిగించే అంశం. ఇది మంచి పద్ధతి కాదు. లీగల్ లేదా వైద్యం వంటి రంగాల్లో పని చేస్తున్న వృత్తి నిపుణుల వయసు పెరిగే కొద్దీ ఎక్కువ గౌరవం, అధిక వేతనం అందుతాయి. అదే సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్, టెక్ వంటి కార్పొరేట్ ఉద్యోగాలు ఇందుకు పూర్తి విరుద్ధం. వయసు పెరిగేకొద్దీ పనితీరు కాస్త తగ్గుతుంది. కొత్త టెక్నాలజీలకు అలవాటుపడే మనస్తత్వం ఉండదు. సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా టెక్నాలజీ వంటి విభాగాల్లో 40 ఏళ్ల పైబడినవారు పనికిరారని చాలా కంపెనీలు భావిస్తున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో భారీగా క్షీణించిన రూపాయి విలువ‘40 ఏళ్లు పైబడినవారు నైపుణ్యం లేనివారు కాదు. వారు యువ ప్రతిభావంతుల మాదిరి చురుకుగా ఉండకపోవచ్చు. కానీ వారి అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే చాలా కంపెనీలు వీరిని పూర్తిగా తొలగించడం లేదు. అయితే కంపెనీల్లో కొత్త విభాగాలు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు మాత్రం వీరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో 40 ఏళ్లు పైబడిన వారికి మెరుగైన నైపుణ్యాలు ఇచ్చేందుకు అప్ స్కిల్ సెంటర్లకు డిమాండ్ పెరుగుతోంది’ అని అహుజా వివరించారు. -
విమానాశ్రయాల్లోకి నో ఎంట్రీ.. నిజమేనా?
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో ఒకటే ఎయిర్ పోర్టుల్లోకి నో ఎంట్రీ వార్త. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లోకి ప్రవేశంపై నిషేధం విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది.ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఒక పోస్ట్ చేసింది. "ఫేక్ న్యూస్ అలర్ట్. భారతదేశం అంతటా విమానాశ్రయాల్లోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు సోషల్ మీడియాలో పోస్టులు ఉన్నాయి. ఆ వార్తులు ఫేక్. ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు" అని పేర్కొంది.ఎయిర్పోర్టులకు ముందే చేరుకోవాలిభద్రతా తనిఖీల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం మూడు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలని పలు విమానయాన సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేశాయి. ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ఐడీ కార్డులను వెంట తీసుకెళ్లాలని సూచించాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలలో మెరుగైన భద్రతా చర్యల కారణంగా, ప్రయాణానికి కనీసం 3 గంటల ముందు విమానాశ్రయానికి చేరుకోవాలని ఆకాాశ ఎయిర్ లైన్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది. స్పైస్ జెట్ కూడా ఇదే విధమైన అడ్వైజరీని జారీ చేసింది. 🛑 Fake News AlertSocial media posts are claiming that entry to airports across India banned#PIBFactCheck:❌ This claim is #FAKE✅ Government has taken no such decision pic.twitter.com/MoaUcQqO2d— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025 -
సాయుధ దళాల వీరత్వానికి గర్విస్తున్నా: ముఖేష్ అంబానీ
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్లో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ డి అంబానీ పేర్కొన్నారు. భారతదేశం అన్ని రకాల ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిలుస్తుందని ఆయన తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో, భారత సాయుధ దళాలు సరిహద్దు అవతలి నుండి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు కచ్చితత్వం, అసమాన శక్తితో ప్రతిస్పందించాయని కొనియాడారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో భాగంగా రిలయన్స్ కుటుంబం ఎలాంటి మద్దతు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. -
ఏషియన్ పెయింట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం ఏషియన్ పెయింట్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 45 శాతం క్షీణించి రూ. 701 కోట్లకు పరిమితమైంది. డిమాండ్ తగ్గడంతోపాటు, పోటీ తీవ్రత ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,275 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 8,731 కోట్ల నుంచి రూ. 8,359 కోట్లకు స్వల్పంగా(4 శాతం) వెనకడుగు వేసింది. మొత్తం వ్యయాలు రూ. 7,277 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 20.55 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. విదేశీ అమ్మకాలు వీక్ క్యూ4లో ఇతర ఆదాయంతో కలిపి ఏషియన్ పెయింట్స్ మొత్తం టర్నోవర్ 5 శాతం తక్కువగా రూ. 8,459 కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు 2 శాతం నీరసించి రూ. 800 కోట్లకు పరిమితమయ్యాయి. ఇథియోపియా, ఈజిప్్టలలో కరెన్సీ విలువ క్షీణించడం, బంగ్లాదేశ్లో ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణమైనట్లు కంపెనీ ఎండీ, సీఈవో అమిత్ సింగ్లే పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో 1.3 శాతం బలహీనపడి రూ. 2,303 వద్ద ముగిసింది. -
జీ ఎంటర్టైన్మెంట్ పటిష్ట పనితీరు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2024–25) మార్చి త్రైమాసికంలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్ పటిష్ట పనితీరు చూపించింది. నికర లాభం ఎన్నో రెట్ల వృద్ధితో రూ.188 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి లాభం కేవలం రూ.13 కోట్లుగానే ఉంది. వ్యయ నియంత్రణకు తీసుకున్న సమర్థవంతమైన చర్యలు ఫలితమిచ్చాయి. ఆదాయం కేవలం 1.6 శాతం వృద్ధితో రూ.2,185 కోట్ల నుంచి రూ.2,220 కోట్లకు చేరింది. సబ్స్క్రిప్షన్ ఆదాయం, ఇతర అమ్మకాలు, సేవలు మార్చి త్రైమాసికంలో వృద్ధిని నడిపించినట్టు కంపెనీ తెలిపింది.ప్రకటనల వాతావరణం బలహీనంగా ఉన్నప్పటికీ లాభదాయకత పెంచుకున్నట్టు పేర్కొంది. ప్రకటనల ఆదాయం 27 శాతం తగ్గిపోయింది. జీ సినీ అవార్డుల కార్యక్రమం వాయిదా వేయడం, క్రీడలతో కూడిన రద్దీ కేలండర్ను కారణాలుగా తెలిపింది. సబ్్రస్కిప్షన్ ఆదాయం 4 శాతం పెరిగి రూ.986 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 4.2 శాతం తగ్గి రూ.1,958 కోట్లకు పరిమితమయ్యాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు 1 శాతానికి పైగా లాభపడి రూ.111 వద్ద ముగిసింది. -
Operation Sindoor: వెనక్కి తగ్గిన రిలయన్స్.. ట్వీట్ వైరల్
ఆపరేషన్ సిందూర్ కోసం రిలయన్స్ కంపెనీ ట్రేడ్మార్క్ కోసం దాఖలు చేసిందని వస్తున్న వార్తలపై సంస్థ స్పందించింది. ''ఆపరేషన్ సిందూర్'' అనే పదాన్ని ట్రేడ్మార్క్ చేసే ఉద్దేశ్యం లేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ అయిన జియో స్టూడియోస్ అనుమతి లేకుండా ఒక జూనియర్ వ్యక్తి అనుకోకుండా దాఖలు చేసిన ట్రేడ్మార్క్ దరఖాస్తును ఉపసంహరించుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.పహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్.. దాని వాటాదారులందరూ చాలా గర్వంగా ఉన్నారు. ఉగ్రవాదం అనే దుష్టత్వానికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న రాజీలేని పోరాటమే ఈ ''ఆపరేషన్ సిందూర్" అని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదనఉగ్రవాదంపై పోరాడుతున్న భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు రిలయన్స్ పూర్తి మద్దతు ఇస్తుంది. ఇండియా ఫస్ట్ అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తులుమే 7న ఉదయం 10:42 గంటల నుంచి సాయంత్రం 6:27 గంటల మధ్య, 'ఆపరేషన్ సిందూర్' కోసం నాలుగు వేర్వేరు ట్రేడ్మార్క్ దాఖలు అయ్యాయి. ఇందులో రిలయన్స్ మాత్రమే కాకుండా.. ముంబై నివాసి ముఖేష్ చెత్రం అగర్వాల్, భారత వైమానిక దళానికి చెందిన రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కమల్ సింగ్ ఒబెర్హ్, ఢిల్లీలోని న్యాయవాది అలోక్ కొఠారి ఉన్నారని బార్ అండ్ బెంచ్ నివేదించింది. అయితే ఇప్పుడు ట్రేడ్మార్క్ దాఖలు రిలయన్స్ కంపెనీ ఉపసంహరించుకుంది. మిగిలినవాళ్లు ఉంసంహరించుకున్నారా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.Media StatementReliance Industries has no intention of trademarking Operation Sindoor, a phrase which is now a part of the national consciousness as an evocative symbol of Indian bravery.Jio Studios, a unit of Reliance Industries, has withdrawn its trademark application,…— Reliance Industries Limited (@RIL_Updates) May 8, 2025 -
నెలకు వారం రోజులే పని: ఏడాదికి రూ.66 లక్షల సంపాదన
నెల మొత్తం పనిచేసినా జీతాలు సరిగ్గా ఇవ్వని సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే నెలకు కేవలం వారం రోజులు మాత్రమే పనిచేస్తూ.. ఓ వ్యక్తి ఏడాదికి 66 లక్షల రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.నేను సంవత్సరానికి రూ. 66 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను. ఉద్యోగం విషయంలో చాలా ఖచ్చితంగా, సమర్థవంతంగా ఉంటాను. అయితే నెలకు వారం రోజులు మాత్రమే పనిచేస్తాను. మిగిలిన సమయం మొత్తం టీవీ షోలు చూడటం, పాడ్కాస్ట్లు వంటివి చూడటం వంటివి చూస్తానని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నాడు.నేను ఉద్యోగంలో చేరినప్పుడు చాలా వెనుకబడి ఉండేవాడిని. ఆ తరువాతనే అన్నీ నేర్చుకున్నాను. పనిచేయడం వేగంగా నేర్చుకున్నాను. నేను నిమిషానికి 75 పదాలు టైప్ చేయగలిగాను. ఎటువంటి తప్పులు లేకుండా పనిచేయగలిగాను. నా పనికి సంబంధించి ఎవరూ కంప్లైంట్స్ చేయలేదు. నేను మా కంపెనీలో బెస్ట్ ఎంప్లాయిగా నిలిచాను. క్లయింట్లతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. నా పనిని నేనే పూర్తి చేస్తాను. అయితే వారం రోజులు మాత్రమే పనిచేస్తానని ఆ వ్యక్తి స్పష్టం చేసాడు.నేను కూడా ఒకప్పుడు చాలా చదివేవాడిని. ఒక సంవత్సరంలో 200 పుస్తకాలు చదివాను. నాకు ఇష్టమైన ప్రతి అంశంపై లోతుగా పరిశోధన చేసాను. మరి ఇప్పుడు.. నాకు బోర్ కొడుతోంది. ప్రతిదీ సరిగ్గా చేయడం మంచిదని నేను అనుకున్నాను. తక్కువ పనిలోనే ఎక్కువ సాధిస్తున్నాను. అయితే ఏదో ఒక విధంగా నేను కష్టపడుతున్నప్పుడు కంటే ఇప్పుడు అధ్వాన్నంగా ఉన్నాను. ఇది సరైనది కాదని చెప్పాడు.ఇదీ చదవండి: రైల్వే టికెట్తో రోజుకు రూ. 10వేలు, వారానికి రూ. 50వేలుఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు మా పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. ఇంకొందరు పనిలో తీరిక లేకుండా పోతోందని నిరాశను వ్యక్తం చేశారు. -
‘హిందీ నేర్చుకుని ఉంటే రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని’
దేశ టెలికం పరిశ్రమలో ఒకప్పుడు రారాజులా వెలుగొందిన పారిశ్రామికవేత్త ఆయన. సొంతంగా రెండు ఐలాండ్లు.. విదేశాలలో వందల కోట్ల విలువైన విలాస భవనాలతో రాజభోగం అనుభవించిన ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ తర్వాత కాలం కలిసిరాక నష్టాలలో కూరుకుపోయి దివాళా తీశారు. జీవితంలో ప్రతిఒక్కరికీ గతంలో చేసిన పొరపాట్ల గురించి పశ్చాత్తాపం ఉంటుంది. అప్పుడా తప్పు చేయకపోయింటే బాగుండు అని అనుకుంటుంటారు. శివశంకరన్ కూడా అలాంటి పశ్చాత్తాపాలనే వ్యక్తం చేశారు.రెండే తప్పులుదివాళా తీసిన సెల్యులార్ ఆపరేటర్ ఎయిర్ సెల్ వ్యవస్థాపకుడు సి.శివశంకరన్ ఇటీవల తనలో ఇంకా ఉన్న పశ్చాత్తాపాల గురించి నోరు విప్పారు. రణ్వీర్ అల్లాబాడియాతో కలిసి పాడ్కాస్ట్లో మాట్లాడిన ఈ పారిశ్రామికవేత్త రూ.7,000 కోట్లు కోల్పోయి తిరిగి పుంజుకున్న తన ప్రయాణం గురించి వెల్లడించారు. తన జీవితకాల అదృష్టాన్ని పోగొట్టిన రెండు చిన్న తప్పులను బయటపెట్టారు. అవి ఒకటి హిందీ నేర్చుకోకపోవడం, మరొకటి తన కెరీర్ ప్రారంభంలో ఢిల్లీ లేదా ముంబై వంటి ప్రధాన నగరాలకు మకాం మార్చకపోవడం.హిందీ నేర్చుకుని ఉంటే..తాను హిందీ నేర్చుకుని ఉంటే 140 కోట్ల మంది భారతీయులను ఆకర్షించేవాడినని శివశంకరన్ అన్నారు. కచ్చితంగా రూ.లక్ష కోట్లు సంపాదించేవాడిని. భౌగోళికం, భాష తనను భారతదేశ అధికార కారిడార్ల నుంచి ఎలా దూరం చేశాయో స్వయంకృషితో ఎదిగిన ఈ బిజినెస్ టైకూన్ వివరించారు.అప్పు ఎప్పుడూ చేయలేదు'నేను ఎప్పుడూ అప్పులు చేయాలనుకోను. నేను డబ్బును ఆకర్షిస్తాను" అని శివశంకరన్ అన్నారు. 68 ఏళ్ల జీవితంలో తాను వ్యక్తిగతంగా ఎప్పుడూ రూ.100 కూడా అప్పు తీసుకోలేదన్నారు. వ్యవస్థాపక ప్రవృత్తి, బిజినెస్ పరిజ్ఞానం ఉన్నప్పటికీ అతిపెద్ద డీల్స్ చేజారడానికి కారణం తనకు దూరదృష్టి లేకపోవడం కాదని, బహుశా కనెక్షన్ లేకపోవడం వల్ల కావచ్చునని వెల్లడించాడు.రియల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబడులుదివాలా దాఖలు చేయడానికి ముందు తన అత్యంత ఖరీదైన కొనుగోళ్లను కూడా శివశంకరన్ వెల్లడించాడు. రియల్ ఎస్టేట్ లో భారీగా పెట్టుబడులు పెట్టానని, ప్రపంచవ్యాప్తంగా అనేక ఇళ్లు కొన్నానని చెప్పారు. సీషెల్స్ లో తనకు రెండు ద్వీపాలు ఉండేవని, వాటిని ఇప్పుడు అమ్మేశానని వెల్లడించారు. రిపబ్లిక్ ఆఫ్ శివ పేరుతో సొంత దేశంలా ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉండాలని ఈ దీవులను కొనుగోలు చేశానని చెప్పారు. అన్ని ఖండాల్లో నివాసం ఉండాలనే కోరికతో సీషెల్స్, అమెరికా, కెనడా, లండన్లో ఇళ్లు కొన్నట్లు శివశంకరన్ చెప్పుకొచ్చారు. -
గూగుల్ 200 ఉద్యోగాల్లో కోత!
విస్తృత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాలను పర్యవేక్షించే గ్లోబల్ బిజినెస్ యూనిట్ నుంచి గూగుల్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. టీమ్ సహకారాన్ని పెంపొందించడానికి, కస్టమర్ సేవను మెరుగుపరచడానికి, క్రమబద్ధమైన కార్యకలాపాలను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.ఇప్పటికే ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ వంటి కీలక ఉత్పత్తులను కలిగి ఉన్న గూగుల్ ప్లాట్ఫామ్ వివిధ విభాగాల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. మారుతున్న మార్కెట్ డిమాండ్లు, పరిశ్రమ ధోరణుల నేపథ్యంలో తాజా లేఆఫ్స్ను ప్రకటించినట్లు పేర్కొంది. గూగుల్ కృత్రిమ మేధ, డేటా సెంటర్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడి పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెక్ కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. భవిష్యత్తు వృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానాలకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. దాంతో ఉన్న ఉద్యోగులను ఆయా విభాగాలకు కేటాయిస్తున్నాయి.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్ప్రముఖ కంపెనీల్లోనూ ఇదే ధోరణిగూగుల్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇది పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పోటీ పడేందుకు కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. -
ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ప్రముఖ ఆడిటింగ్ సంస్థ ప్రైస్వాటర్హౌజ్కూపర్స్(పీడబ్ల్యూసీ) 1,500 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎస్ కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ ఉద్యోగుల తొలగింపు దాని మొత్తం సిబ్బందిలో 2 శాతంగా ఉంది. ఆడిట్, ట్యాక్స్ విభాగాలకు చెందిన బాధిత ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ మీటింగ్ ద్వారా లేఆఫ్స్ సమాచారం అందించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.తొలగింపునకు కారణాలుప్రస్తుత వ్యాపార డిమాండ్లకు అనుగుణంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సమీకరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించే లక్ష్యంతో ఆలోచనాత్మకంగానే ఈ చర్య తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఆర్థిక అనిశ్చితి, మారుతున్న ఖాతాదారుల డిమాండ్లు, పునర్నిర్మాణ ప్రయత్నాలు వంటి అంశాలను హైలైట్ చేస్తూ డెలాయిట్, కేపీఎంజీ వంటి సంస్థలు కూడా ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మార్కెట్ తీరుకు అనుగుణంగా సంస్థలు మారుతున్నాయి.ఇదీ చదవండి: దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..సవాళ్లుతొలగింపులతో ప్రభావితమైన ఉద్యోగులు తిరిగి కొలువు సాంపాదించాలంటే సవాళ్లను ఎదుర్కోకతప్పదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ కన్సల్టింగ్ రంగంలో ఉపాధి అవకాశాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు అభివృద్ధి చెందాల్సి ఉంటుంది. పెరిగిన ఆటోమేషన్, వ్యాపార వ్యూహాలతో ఆడిట్, ట్యాకేషన్ నిపుణులు డేటా అనలిటిక్స్, అడ్వైజరీ సర్వీసులు లేదా ప్రత్యేక ఫైనాన్స్ రంగాల్లో కొత్త అవకాశాలకు అనుగుణంగా మారవలసి ఉంటుంది. -
27 ఎయిర్పోర్ట్లు, 430 విమానాలు నిలిపివేత
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ దాడి చేసిన నేపథ్యంలో స్థానిక విమానాశ్రయాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలు మే 10 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడనుంది. ఈ చర్య ఫలితంగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 430 ఎయిర్క్రాఫ్ట్లు రద్దు అయినట్లు తెలిసింది. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్డ్ విమానాల్లో 3%గా ఉంది. ఈ ప్రభావం ఒక్క ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్థాన్లోని విమానయాన సంస్థలు కూడా 147 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఇది వారి రోజువారీ షెడ్యూల్లో 17%గా ఉంది.ఇదీ చదవండి: ఉగ్రదేశం మదం అణచిన ఫైటర్ జెట్లుదేశంలోని ప్రభావిత విమానాశ్రయాలు..శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్సర్, లుధియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్కోట్, భుంతర్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్గఢ్, జైసల్మేర్, జోద్పూర్, బికనీర్, ముంద్రా, జామ్నగర్, రాజ్కోట్, పోర్బందర్, కాండ్లా, గ్వాలియర్, హిండన్ సహా కీలక వ్యూహాత్మక విమానాశ్రయాలను మూనివేస్తున్నట్లు చెప్పారు. విమాన రాకపోకల్లో అంతరాయాలను తగ్గించడానికి సంస్థలు పని చేస్తున్నట్లు తెలిపాయి. విదేశీ విమానయాన సంస్థలు సున్నితమైన జోన్లలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపేసి ముంబై, అహ్మదాబాద్ మీదుగా ప్రయాణించే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. విమానయాన సంస్థలు షెడ్యూళ్లను సర్దుబాటు చేయడానికి, ప్రభావిత ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల ప్రయాణాల్లో ఆలస్యం అనివార్యం అవుతుంది. -
ఆర్మీ సిబ్బందికి ఎయిర్ ఇండియా తోడ్పాటు
పాకిస్తాన్తో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సెలవులు రద్దు చేసుకుని విధులకు వస్తున్న భారత సాయుధ దళాల సిబ్బందికి తోడ్పాటు అందించేందుకు ఎయిర్ ఇండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రయాణాల కోసం తమ వద్ద టికెట్లు బుకింగ్ చేసుకున్న ఆర్మీ సిబ్బంది టికెట్లను రద్దు చేసుకుంటే ఉచిత రీషెడ్యూల్ లేదా పూర్తి రీఫండ్స్ అందించనున్నట్లు ప్రకటించాయి.పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు.ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులన్నింటినీ రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న బలగాలను వెంటనే విధులకు రప్పించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), ఐటీబీపీ (ITBP) సహా అన్ని పారామిలిటరీ బలగాలు తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆర్మీ సిబ్బంది ఇప్పటికే బుక్ చేసుకున్న విమాన టికెట్లను ఎటువంటి అదనపు రుసుములు లేకుండా రద్దు చేసుకునేందుకు, రీ షెడ్యూల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది."ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలలో డిఫెన్స్ కోటా కింద 2025 మే 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న సిబ్బందికి తమ డ్యూటీ కమిట్మెంట్లకు మద్దతుగా 2025 జూన్ 30 వరకు విమానాలను రీషెడ్యూల్ చేయడంపై పూర్తి రీఫండ్, వన్ టైమ్ మినహాయింపును అందిస్తున్నాం" అని ఎయిరిండియా ఒక పోస్ట్లో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఇలాంటి పోస్ట్ను షేర్ చేసింది. -
ప్రైవేటు పెట్టుబడులు తగ్గుముఖం!
న్యూఢిల్లీ: ప్రైవేటు మూలధన వ్యయాలు (పెట్టుబడులు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 శాతం మేర తగ్గిపోవచ్చని కేంద్ర ప్రభుత్వ సర్వే అంచనా వేసింది. రూ.4.88 లక్షల కోట్లుగా ఉండొచ్చని కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ నిర్వహించిన ‘ఫార్వార్డ్ లుకింగ్ సర్వే’ తెలిపింది. 2024–25లో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు రూ.6.56 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 2023–24లో రూ.4.22 లక్షల కోట్లు కాగా, 2022–23లో రూ.5.72 లక్షల కోట్లు, 2021–22లో రూ.3.94 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఈ సర్వే నివేదిక వెల్లడించింది. వీటి ప్రకారం 2021–22 నుంచి 2024–25 మధ్య కాలంలో మొత్తం మీద ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 66.3 శాతం పెరిగా యి. 2021–22లో ఒక్కో సంస్థ గ్రాస్ ఫిక్స్డ్ అస్సెట్ (జీఎఫ్ఏ) రూ.3,151 కోట్లుగా ఉంది. ఇది 2022–23లో రూ.3,279 కోట్లకు (4 శాతం వృద్ధి).. 2023–24లో రూ.4,183 కోట్లకు (27 శాతం వృద్ధి) పెరిగింది. విద్యుత్, గ్యాస్, స్టీమ్, ఎయిర్ కండీషనింగ్ సప్లై విభాగంలో ఒక కంపెనీ నుంచి అత్యధిక జీఎఫ్ఏ రూ.14,000 కోట్లుగా ఉంది. 2021–22లో ఒక్కో సంస్థ సగటున రూ.109 కోట్లను మూలధన వ్యయాలపై వెచ్చించింది. 20 22–23లో ఇది రూ.149 కోట్లు, 2023–24లో రూ. 1.07 కోట్లు, 2024–25లో రూ.172 కోట్ల చొప్పున ఉన్నాయి. తయారీ రంగం నుంచి 43.8 % మూ లధన వ్యయాలు ఉంటే.. ఐటీ నుంచి 15.6 %, రవాణా, స్టోరేజీ నుంచి 14 % చొప్పున ఉన్నాయి. వృద్ధి కోసమే పెట్టుబడులు.. ప్రస్తుత ఆస్తుల విలువను పెంచుకోవడంపై పెట్టుబడులకు 28.4 శాతం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. 11.5 శాతం సంస్థలు అవకాశాలను విస్తృతం చేసుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఆదాయ వృద్ధి కోసం 2024–25లో మూలధన వ్యయాలు చేసినట్టు 49.6 శాతం ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు తెలిపారు. 30.1 శాతం సంస్థలు సామర్థ్యాల పురోగతికి, 2.8 శాతం సంస్థలు వైవిధ్యంపై పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించాయి. -
టారిఫ్లకు రెండు వైపులా పదును
న్యూఢిల్లీ: టారిఫ్లనేవి రెండువైపులా పదునున్న కత్తిలాంటివని హెచ్సీఎల్ గ్రూప్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా వ్యాఖ్యానించారు. అమెరికాలాంటి పెద్ద మార్కెట్లలో టారిఫ్ ప్రభావిత పరిశ్రమలు నెమ్మదించినా వాటికి సేవలు కొనసాగించాల్సి రావడం ఒకెత్తైతే, టారిఫ్లవల్ల వ్యయాలు పెరగకుండా చూసుకోవడం మరో ఎత్తవుతుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇవన్నీ కూడా భారతీయ ఐటీ కంపెనీలు కొత్త వ్యాపారావకాశాలను దక్కించుకునేందుకు కూడా తోడ్పడవచ్చని, ఇందుకు టెక్నాలజీ ఉపయోగపడగలదని ఆమె తెలిపారు. అమెరికా టారిఫ్ల ప్రభావం నేరుగా ఐటీ సంస్థలపై పడకపోయినా, అవి సేవలందించే మార్కెట్లలో పరిశ్రమలు మందగించడం వల్ల పరోక్షంగా దెబ్బతినొచ్చనే అంచనాలు ఉన్న నేపథ్యంలో రోష్ని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టారిఫ్లు, డీగ్లోబలైజేషన్లాంటి భౌగోళికరాజకీయాంశాలు ఐటీ సేవలపై ప్రభావం చూపొచ్చని ఇటీవలే ఆరి్థక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా హెచ్సీఎల్ టెక్ సీఈవో సి. విజయకుమార్ కూడా తెలిపారు. -
ఎగిసిన స్టాక్ ఎక్స్ఛేంజీల లాభాలు
స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 2,650 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 4,397 కోట్లకు పరిమితమైంది.అంతక్రితం క్యూ4లో రూ. 5,080 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 35 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 11.46 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎన్ఎస్ఈ నికర లాభం 47 శాతం జంప్చేసి రూ. 12,188 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 19,177 కోట్లకు బలపడింది. ఈ కాలంలో మొత్తం రూ. 59,798 కోట్లమేర సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) చెల్లించింది. బీఎస్ఈ లాభం హైజంప్మరో స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 494 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 107 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 926 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 23 డివిడెండ్ ప్రకటించింది. దీనిలో రూ. 5 ప్రత్యేక డివిడెండ్ కలసి ఉంది.కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్ఈ నికర లాభం 3 రెట్లు దూసుకెళ్లి రూ. 1,322 కోట్లను తాకింది. 2023–24లో కేవలం రూ. 404 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 3,236 కోట్లకు బలపడింది. ఈ కాలంలో ఈక్విటీ డెరివేటివ్స్లో 30.5 బిలియన్ కాంట్రాక్టులు ట్రేడ్కాగా.. రూ. 1,415 కోట్ల ఆదాయం నమోదైనట్లు బీఎస్ఈ వెల్లడించింది. -
పాక్కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు!
లండన్: చదువు, ఉద్యోగం కోసం వెళ్లి శరణార్థి పేరిట అక్కడే శాశ్వతంగా తిష్ట వేస్తున్న పాకిస్తాన్ పౌరులకు యూకే షాకిచ్చింది. ఆసైలం (శాశ్వత నివాసం) దరఖాస్తుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాకిస్తానీ పౌరులకు యూకే వీసా నిబంధనలను కఠినం చేయనుంది. వీసా ఓవర్స్టేలు, ఆసైలం దరఖాస్తులపై కఠిన చర్యల్లో భాగంగా, యూకే ప్రభుత్వం పాకిస్తానీ పౌరులతో పాటు నైజీరియా, శ్రీలంక నుండి వచ్చే వారికి స్టడీ, వర్క్ వీసాలపై కఠినమైన పరిమితులను విధించనుందని టైమ్స్ వార్తా సంస్థ కథనం పేర్కొంది.యూకే శాశ్వత నివాసం కోసం వీసా హోల్డర్ల నుండి దరఖాస్తులు ఇటీల అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో పాకిస్తానీ పౌరులు అగ్రస్థానంలో ఉన్నారు. హోమ్ ఆఫీస్ డేటా ప్రకారం.. 2024లో మొత్తం 108,000 మంది ఆసైలం కోసం దరఖాస్తు చేసుకోగా వీరిలో అత్యధికంగా 10,542 మంది పాకిస్తానీ పౌరులే ఉన్నారు.వీరిలో 16,000 మంది స్టూడెంట్ వీసాలపై యూకేకి వచ్చారు. పాకిస్తానీ, నైజీరియన్, శ్రీలంక దేశీయులు వర్క్, స్టూడెంట్ లేదా విజిటర్ వీసాలపై వచ్చి ఆ తర్వాత ఆసైలం కోసం దరఖాస్తు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని అధికారులు "సిస్టమ్ దుర్వినియోగం"గా వర్ణించారు. ఈ నేపథ్యంలో వీసాలిచ్చే సమసయంలోనే కఠినంగా వ్యవహరించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.కొత్త నిబంధనల్లో భాగంగా వీసా దరఖాస్తుదారులను వారి ఆసైలం దరఖాస్తు రిస్క్ను అంచనా వేయడానికి ప్రొఫైలింగ్ చేస్తారు. అధిక రిస్క్గా భావించిన వారి వీసా దరఖాస్తులను తిరస్కరిస్తారు. అంతేకాదు..వీసా హోల్డర్లు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు నిరూపించుకోకపోతే, వారికి పన్ను చెల్లింపుదారుల నిధులతో నడిచే వసతి సౌకర్యాలను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. యూకే ప్రభుత్వం 2024లోనూ కేర్ వర్కర్లు, స్టూడెంట్లకు డిపెండెంట్లను తీసుకురాకుండా కఠిన నిబంధనల విధించించింది. దీంతో అప్పటి నుంచి 2025 మార్చి నాటికి వీసా దరఖాస్తులు 37 శాతం తగ్గి 7,72,200కి తగ్గాయి.అయితే, ఈ ప్రతిపాదనలు వివాదాన్ని రేకెత్తించాయి. జాతీయత ఆధారంగా ప్రొఫైలింగ్ చేయడం వివక్ష దావాలకు దారితీయవచ్చని ఇమ్మిగ్రేషన్ లాయర్ అహ్మద్ ఖాన్, హెచ్చరించారు. "ఈ విధానాలు మూల కారణాలను పరిష్కరించకుండా మొత్తం సమాజాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం, శ్రామిక లోటుతో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్న విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు కూడా ఆర్థిక ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశాయి. -
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఆర్థిక ఉత్పత్తులు
టైర్ 2, ఇతర పట్టణాల్లో చిన్నతరహా వ్యాపారాలు నిర్వహించే మహిళలు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఆర్థిక ఉత్పత్తులను కోరుకుంటున్నట్టు ‘భారత్ ఉమెన్ యాస్పిరేషన్ ఇండెక్స్ (బీడబ్ల్యూఏఐ) 2025’ నివేదిక వెల్లడించింది. బిజినెస్ మేనేజన్మెంట్ ప్లాట్ఫామ్ ‘టైడ్’ దీన్ని విడుదల చేసింది.అంతేకాదు ఆయా పట్టణాల్లో చిన్నతరహా మహిళా పారిశ్రామికవేత్తల్లో మూడింట ఒక వంతు మంది రుణం పొందే విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తనఖా నిబంధనలు కఠినంగా ఉండడం, ఆర్థిక అక్షరాస్యత తగినంత లేకపోవడం వీరిని రుణ సదుపాయానికి దూరం చేస్తోందని, వీరికి తనఖా రహిత సూక్ష్మ రుణాలు సహా తదితర ప్రత్యామ్నాయ రుణ సదుపాయాలు అందించేందుకు సత్వర విధానపరమైన చర్యలు అవసరమని ఈ నివేదిక సూచించింది.‘‘టైర్ 2, 3, అంతకంటే చిన్న పట్టణాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు డిజిటల్ అవగాహనతో వృద్ధి చెందాలన్న ఆకాంక్షలతో ఉన్నారు. కానీ, రుణ సదుపాయం, నెట్వర్క్లు, తదితర సంస్థాగత అంతరాలు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి’’అని తెలిపింది. మహిళల అభిప్రాయాలు.. 1,300 మంది మహిళా వ్యాపారవేత్తల అభిప్రాయాలను బీడబ్ల్యూఏఐ సర్వే చేసింది. ఆరి్థక, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉందని 58% మంది చెప్పడం గమనార్హం. డిజిటల్ నైపుణ్యాలను పెంచుకోవాలన్న బలమైన ఆకాంక్ష 12 శాతం మందిలో కనిపించింది.28 శాతం మంది నిధుల విషయంలో తమ కుటుంబం నుంచి పురుష సభ్యుడి సహకారం అవసరమని చెప్పారు. వ్యవస్థాపకులుగా వారి ప్రయాణంలో ఇదొక పెద్ద అడ్డంకిగా నివేదిక పేర్కొంది.డిజిటల్ నైపుణ్యాల పెంపు, వారికి లభిస్తున్న వివిధ పథకాల సమాచారం అందించడం, నెట్వర్కింగ్ పెంపు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తల లక్ష్యాలను సులభతరం చేయొచ్చని ఈ నివేదిక సూచించింది. -
జెన్సోల్పై కేంద్రం దర్యాప్తు
కంపెనీల చట్ట నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో తాజాగా జెన్సోల్ ఇంజనీరింగ్, బ్లూస్మార్ట్ మొబిలిటీలపై కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. నిధుల అక్రమ మళ్లింపు, కార్పొరేట్ పాలనలో అవకతవకల ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏప్రిల్లో చర్యలకు తెరతీసిన సంగతి తెలిసిందే.కంపెనీ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. బుకింగ్ ద్వారా క్యాబ్(రైడ్హెయిలింగ్) సర్వీసులు అందించే బ్లూస్మార్ట్ మొబిలిటీని సైతం అన్మోల్ ప్రమోట్ చేయడం గమనార్హం!కంపెనీ నిధులను ఇష్టాసారం వాడేసుకుని, ఇన్వెస్టర్లను నిండా ముంచేసిన జెన్సోల్ ఇంజినీరింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కంపెనీ షేరు ధరతో పాటు నిధుల్లో గోల్మాల్ చోటు చేసుకుందని గతేడాది జూన్లో సెబీకి అందిన ఫిర్యాదుపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)అధికారి పుణెలోని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ప్లాంట్లో జరిపిన తనిఖీల్లో అసలు ఎలాంటి తయారీ కార్యకలాపాలు లేనట్లు బట్టబయలైంది. అలాగే, అక్కడ కేవలం ఇద్దరు ముగ్గురు కార్మికులు మాత్రమే ఉన్నారని గత నెల 15న సెబీ జారీ చేసిన మధ్యంతర ఆదేశాల్లో సెబీ వెల్లడించింది. జెన్సోల్ ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ.. కంపెనీ నిధుల విషయంలో అవకతవకలకు పాల్పడటమే కాకుండా ఇన్వెస్టర్లను పక్కదారి పట్టించిన విషయాన్ని నియంత్రణ సంస్థ బయటపెట్టింది. జెన్సోల్ ప్రమోటర్లు జగ్గీ బ్రదర్స్ 6,400 ఈవీలను కొనుగోలు చేయడం కోసం ఇరెడా, పీఎఫ్సీ నుంచి 978 కోట్ల రుణాలు తీసుకుని కేవలం 4,704 ఈవీలను మాత్రమే (రూ.568 కోట్లు) కొనుగోలు చేసిన విషయం సెబీ దర్యాప్తులో తాజాగా బయటపడిన విషయం తెలిసిందే. మిగతా నిధులను పక్కదారి పట్టించి, జగ్గీ బ్రదర్స్ సొంతానికి వాడేసుకున్నట్లు కూడా సెబీ తేల్చింది. -
ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలు
ఆర్బీఐ ప్రతిపాదించిన నూతన ముసాయిదా నిబంధనలు ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) బంగారం రుణ ఆస్తులు నిదానించేలా చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం), రుణాల పునరుద్ధరణ, టాపప్ బుల్లెట్ రుణాలపై ఈ ముసాయిదా దృష్టి పెట్టిందని.. ఈ నిబంధనలు ఎన్బీఎఫ్సీ రుణ ఆస్తుల వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో ముసాయిదా నిబంధనలు విడుదల చేసిన ఆర్బీఐ, భాగస్వాముల అభిప్రాయాలను ఆహ్వానించింది.బంగారం రుణాల విషయంలో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల మధ్య వ్యత్యాసాలు తగ్గించి, ఏకరూపత తీసుకురావడం ముసాయిదా నిబంధనల లక్ష్యంగా ఉంది. బంగారం రుణాల విషయంలో అసాధారణ ప్రక్రియలను ఎన్బీఎఫ్సీలు పాటిస్తుండడం, బంగారం విలువపై అధిక నిష్పత్తిలో రుణాలు జారీ చేస్తుండడంపై ఆర్బీఐ గతేడాది సెప్టెంబర్లో కాస్తంత హెచ్చరించే ధోరణిని వ్యక్తం చేయడాన్ని నివేదిక ప్రస్తావించింది. 2024–25లో వ్యవస్థ వ్యాప్తంగా బంగారం రుణాలు 50 శాతానికి పైనే పెరిగాయని, బ్యాంక్ల బంగారం రుణ ఆస్తుల విలువ రెట్టింపైనట్టు పేర్కొంది. ఆభరణాలపై తక్కువ రుణాలు..ఎల్టీవీపై ఆర్బీఐ కొత్త నిబంధనల కింద ఎన్బీఎఫ్సీలు బంగారం రుణాల మంజూరు విలువను క్రమబద్దీకరించుకోవాల్సి వస్తుందని తెలిపింది. బుల్లెట్ రుణాలకు సంబంధించిన ఎల్టీవీ ప్రస్తుతమున్న 65–68 శాతం నుంచి 55–60 శాతానికి దిగొస్తుందని అంచనా వేసింది. దీంతో అంతే విలువ కలిగిన బంగారం ఆభరణాలపై మంజూరు చేసే రుణం తగ్గుతుందని తెలిపింది. కస్టమర్ల వద్ద నుంచి నిర్ణీత రోజులకు ఒకసారి (నెల) బంగారం రుణంపై వడ్డీని ఎన్బీఎఫ్సీలు వసూలు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఈ సంస్థలు ఈఎంఐ ఆధారిత బంగారం రుణాలపై దృష్టి పెట్టొచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలుఎల్టీవీ పరిమితి మించితే అదనపు నిధుల కేటాయింపులు చేయాలన్న నిబంధన ఎన్బీఎఫ్సీలపై పెద్ద ప్రభావం చూపించకపోవచ్చని అభిప్రాయపడింది. ఆర్బీఐ ప్రతిపాదిత నిబంధనలు కొంత కాలానికి ఈ రంగం సామర్థ్యాలను బలోపేతం చేస్తాయని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక తెలిపింది. -
నష్టాల్లో జీ మీడియా.. భారీగా తగ్గిన ప్రకటనల ఆదాయం
న్యూఢిల్లీ: జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ నష్టం మార్చి త్రైమాసికంలో మరింత పెరిగిపోయింది. రూ.37 కోట్ల నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం కేవలం రూ.6.51 కోట్లుగానే ఉంది. దీంతో పోల్చి చూస్తే ఆరు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది.ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గి రూ.156 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 6 శాతానికి పైగా పెరిగి రూ.200 కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్లో ప్రకటనల ఆదాయం 13.5 శాతం తక్కువగా రూ.145 కోట్లకు పరిమితమైంది.సబ్స్క్రిప్షన్ ఆదాయం 6.9 శాతం తగ్గి రూ.10 కోట్లుగా ఉంది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీ మీడియా కార్పొరేషన్ రూ.119 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.98 కోట్లుగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 4 శాతానికి పైగా తగ్గి రూ.633 కోట్లుగా ఉంది. -
దక్షిణ భారత్లోనే అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్
భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AMPL) విజయవాడలో.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్ను ప్రారంభించింది.విజయవాడలోని ఏలూరు రోడ్డు, ఎనికెపాడులో ఉన్న ఈ కొత్త డీలర్షిప్ 1.03 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 14 వాహనాలను ఒకేసారి ప్రదర్శించగల కెపాసిటీ ఉన్న ఈ షోరూమ్లో.. ప్యాసింజర్ వెహికల్ (ఐసీఈ & ఈవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్ (ఎస్సీవీ), లాస్ట్ మైల్ మొబిలిటీ (ఎల్ఎంఎం) వాహనాలన్నీ లభిస్తాయి.ఈ కొత్త డీలర్షిప్ ద్వారా కేవలం సేల్స్ మాత్రమే కాకుండా.. సర్వీస్, వాహనాలకు అవసరమైన ఫాస్ట్-ఛార్జింగ్ సౌకర్యం కలిగి ఉంటుంది. టెక్నాలజీని ప్రతిబింబించేలా.. ఆకర్షణీయమైన డిజైన్ పొందిన ఈ షోరూమ్ 61 కొత్త సర్వీస్ బేలు కలిగి ఉంది. ఇవి ఏడాదికి 28000 మందికి సేవలను అందించగలవు.అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్ ప్రారంభంతో.. ఆటోమోటివ్ మానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్వర్క్ను మరింత బలోపేతం చేసుకుంటోంది. ఈ గ్రూప్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 135 మహీంద్రా టచ్పాయింట్లను నిర్వహిస్తోంది.FY 2025లో ఈ గ్రూప్ 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించింది. అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందనమాట. దీంతో AMPL భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న OEM కోసం అతిపెద్ద సేల్స్ అండ్ ఆఫ్టర్-సేల్స్ భాగస్వామిగా నిలిచింది. -
దేశంలో మారుతున్న ఉద్యోగుల ప్రాధాన్యతలు
భారత్లో ఉద్యోగుల ప్రాధాన్యాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏఓఎన్ 2025 ఎంప్లాయ్ సెంటిమెంట్ స్టడీ ప్రకారం ఈ ఏడాది దేశంలో 82 శాతం మంది తాము చేస్తున్న సంస్థలు మారాలని భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 60 శాతంగా ఉంది. మెరుగైన పనిప్రాంత ప్రయోజనాలు, కెరీర్ అవకాశాల కోసం పెరుగుతున్న డిమాండ్ను ఈ ధోరణి నొక్కి చెబుతుంది.ప్రయోజనాలకే ప్రాధాన్యతఏఓన్ రిపోర్ట్లోని అంశాల ప్రకారం.. భారతీయ ఉద్యోగులు 76 శాతం మంది తమ అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం ప్రస్తుతం ఉన్న వెసులుబాట్లను విడిచిపెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగులకు కోరుకునే ఐదు అత్యంత విలువైన ప్రయోజనాలను విశ్లేషించింది.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్లు: ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్మెంట్లు, రిమోట్ వర్క్ ఆప్షన్ల కోసం ఉద్యోగులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు.మెడికల్ కవరేజ్: ఆసుపత్రిలో చేరడం, అవుట్ పేషెంట్ సేవలు వంటి ఆరోగ్య సంరక్షణ చర్యలు మెరుగ్గా ఉన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.కెరీర్ డెవలప్మెంట్ అవకాశాలు: ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతోపాటు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, మెంటార్షిప్, లీడర్ షిప్ ట్రైనింగ్ వంటి సదుపాయాలు కోరుకుంటున్నారు.వేతనంతో కూడిన సెలవులు: పెయిడ్ సెలవులు, పేరెంటల్ లీవ్, వెకేషన్ల కోసం సెలవులు ఇచ్చే కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు.రిటైర్మెంట్ పొదుపు పథకాలు: పెన్షన్ పథకాలు, ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి పెట్టుబడి అవకాశాలకు పెద్దపీట వేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా 13 శాతం మంది ఉద్యోగులతో పోలిస్తే భారత్లో కేవలం 7 శాతం మంది మాత్రమే తక్కువ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే భావనతో ఉంటున్నారు.వైద్య కవరేజ్ తరతరాలుగా అత్యధిక విలువ కలిగిన ప్రయోజనాల్లో ఒకటిగా ఆవిర్భవించింది. జెన్ ఎక్స్(1965-80 మధ్య జన్మించినవారు), జెన్ వై(1980-1995 మధ్య జన్మించినవారు) జెన్ జెడ్(1995-2005 మధ్య జన్మించినవారు) కంటే ఎక్కువగా వైద్య సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జెన్ జెడ్ ఉద్యోగులు వర్క్-లైఫ్ సమతుల్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు.వెల్నెస్ ప్రోగ్రామ్లకు ప్రాముఖ్యతకొవిడ్ తర్వాత కంపెనీలు తమ బ్రాండ్ను రూపొందించడంలో వెల్నెస్ ప్రోగ్రామ్ల ప్రాముఖ్యతను గుర్తిస్తున్నాయని ఏఓఎన్లోని టాలెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇండియా హెడ్ నితిన్ సేథీ పేర్కొన్నారు. మెరుగైన ఆరోగ్యం, వెల్నెస్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్స్ను తమ పాలసీల్లో పొందుపరిచేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగులను నిలుపుకోవడానికి, టాప్ టాలెంట్ను ఆకర్షించడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తుందని చెప్పారు.యువ నిపుణుల్లో పదవీ విరమణ, ఆర్థిక ప్రణాళిక అంశాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయని ఏఓఎన్ హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, స్తబ్దుగా ఉన్న వేతనాల ఆందోళనలే ఈ మార్పుకు కారణమని చెప్పారు. ఇది ఉద్యోగులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడానికి దారితీస్తుందని తెలిపారు.ఇదీ చదవండి: క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేతఅభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి 43% మంది భారతీయ ఉద్యోగులు తమ ఏఐ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తిగా ఉన్నారని ఏఓఎన్ అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి 35 శాతంగా ఉంది. 10 శాతం మంది ఉద్యోగులు తమ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కోసం వారి సంస్థలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. -
క్షిపణి దాడి.. మే 8 వరకు విమానాల నిలిపివేత
అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఎయిరిండియా ఇజ్రాయెల్లోని టెల్ అవివ్ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి రాకపోకలు సాగిస్తున్న విమాన సర్వీసులను మే, 8 వరకు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన క్షిపణి దాడి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దాంతో ఎయిరిండియా ఢిల్లీ-టెల్ అవీవ్ ఎయిర్క్రాఫ్ట్ ఏఐ 139ను ఇటీవల అబుదాబికి మళ్లించినట్లు తెలిపింది. యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి కారణంగా ఇజ్రాయెల్-యెమెన్ ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.క్షిపణి దాడియెమెన్కు చెందిన హౌతీలు హైపర్ సోనిక్ బాలిస్టిక్ క్షిపణితో ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ పరిధిలో దాడికి పాల్పడ్డారు. దాంతో విమానాశ్రయం సమీపంలో టెర్మినల్ 3 పార్కింగ్ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లింది. మే 4న జరిగిన ఈ దాడిలో ఆరుగురికి గాయాలయ్యాయి. బోయింగ్ 787కు చెందిన ఎయిరిండియా విమానం ఏఐ139 ల్యాండ్ అవ్వడానికి గంట ముందు ఈ సంఘటన జరిగింది. ఫ్లైట్రాడార్24.కామ్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం విమానం జోర్డాన్ గగనతలంలో ఉందని, దాడి సమాచారం తెలిసిన వెంటనే దాన్ని అబుదాబికి మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: సాంకేతికతతో యుద్ధానికి సైఎయిరిండియా స్పందనమే 4న జరిగిన ఈ సంఘటనకు ప్రతిస్పందనగా ఎయిరిండియా మొదట టెల్ అవీవ్కు రాకపోకలు సాగిస్తున్న విమానాలను మే 6 వరకు నిలిపివేసింది. అక్కడ కొనసాగుతున్న భద్రతా కారణాల వల్ల విమానాల నిలిపివేతను మే 8 వరకు పొడిగించింది. టెల్ అవీవ్కు ఎయిరిండియా వారానికి ఐదు విమానాలను నడుపుతోంది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ తెలిపింది. క్షేత్రస్థాయిలో సంస్థ బృందాలు ప్రభావిత ప్రయాణీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. -
3జీ క్యాపిటల్ చేతికి స్కెచర్స్
న్యూయార్క్: షూస్ తయారీ సంస్థ స్కెచర్స్ను ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం 3జీ క్యాపిటల్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 9 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కొనుగోలు తర్వాత ప్రైవేట్ సంస్థగా మార్చనుంది. ఈ ఒప్పందానికి స్కెచర్స్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు అనంతరం కూడా కంపెనీకి స్కెచర్స్ చైర్మన్, సీఈవో రాబర్ట్ గ్రీన్బర్గ్, ఆయన మేనేజ్మెంట్ బృందం సారథ్యం వహిస్తుంది. సంస్థ హెడ్క్వార్టర్స్ కూడా మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైన చోటే (కాలిఫోరి్నయా) కొనసాగుతుంది. -
భారీ ఐపీవోకి అవాడా గ్రూప్
న్యూఢిల్లీ: పునరుత్పాదక విద్యుత్ రంగానికి చెందిన అవాడా గ్రూప్లో భాగమైన సోలార్ మాడ్యూల్స్ తయారీ విభాగం భారీ ఐపీవో సన్నాహాల్లో ఉంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 4,000–5,000 కోట్ల వరకు సమీకరించడంపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవోని నిర్వహించేందుకు పలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, న్యాయసేవల సంస్థలతో గ్రూప్ సంప్రదింపులు జరిపినట్లు వివరించాయి. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను 5 గిగావాట్ ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్, సెల్ తయారీ ప్లాంటు నిర్మాణం సహా ఇతరత్రా పెట్టుబడుల కోసం సంస్థ వినియోగించనుంది. అవాడా గ్రూప్లో బ్రూక్ఫీల్డ్కి చెందిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఫండ్, థాయ్ల్యాండ్కి చెందిన జీపీఎస్సీ మొదలైనవి 1.3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. సోలార్ మాడ్యూల్స్ తయారీ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా మొదలైన విభాగాల్లో గ్రూప్ కార్యకలాపాలు ఉన్నాయి. 2024లో పలు సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థలు ఐపీవో ద్వారా నిధులు సమీకరించగా, మరిన్ని ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్కి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ రూ. 2,830 కోట్లు, అక్టోబర్లో వారీ ఎనర్జీస్ రూ. 4,321 కోట్లు సమీకరించాయి. -
UPIలో కీలక మార్పులు: జూన్ 16 నుంచే అమలు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI)లో కీలక మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ అప్డేట్ చేయనున్నట్లు, ఇది 2025 జూన్ 16 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది.యూపీఐ వినియోగదారులు.. లావాదేవీలు చేయడానికి కనీసం 30 సెకన్ల సమయం కేటయించాల్సి ఉంది. ఈ సమయాన్ని తగ్గించడానికి NPCI చర్యలు తీసుకుంటోంది. ఇది అమలులోకి వచ్చిన తరువాత.. ట్రాన్సక్షన్స్ మరింత సులభతరం అవుతుంది.ఇదీ చదవండి: పతనంవైపు యూఎస్ డాలర్!.. బఫెట్ కీలక వ్యాఖ్యలులావాదేవీలు, డెబిట్, క్రెడిట్ సేవల కోసం యూజర్ ఇప్పుడు 30 సెకన్ల సమయం వెచ్చించాల్సి ఉంది. దీనిని 15 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీ స్థితిని తనిఖీ చేసే సమయాన్ని 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు పరిమితం చేయనుంది. లావాదేవీలు చేయడానికి సంబంధించిన టైమ్ తగ్గితే.. యూజర్ల సమయం కూడా ఆదా అవుతుంది. -
ఎయిర్టెల్, టాటా చర్చలకు చెక్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా గ్రూప్ మధ్య డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్ విలీనానికి చెక్ పడింది. విలీన చర్చలను విరమించుకున్నట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది.చర్చలలో రెండువైపులా సంతృప్తికర ఫలితాలను సాధించకపోవడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపింది. డీటీహెచ్ బిజినెస్ల విలీనానికి టాటా గ్రూప్ డీటీహెచ్ విభాగం టాటా ప్లేతో అనుబంధ సంస్థ భారతీ టెలిమీడియా చర్చిస్తున్నట్లు 2025 ఫిబ్రవరి 26న ఎయిర్టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో రెండు సంస్థలూ సరైన పరిష్కారాన్ని సాధించలేకపోవడంతో చర్చలు విరమించుకున్నట్లు వివరించింది. -
ఏప్రిల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఇలా..
న్యూఢిల్లీ: కీలక ఇంధనాలైన పెట్రోల్, డీజిల్ వినియోగం ఏప్రిల్లో పెరిగింది. వరుసగా కొన్ని నెలల పాటు క్షీణత అనంతరం 4 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ఏప్రిల్లో డీజిల్ వినియోగం 8.23 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రితం ఏడాది ఏప్రిల్ నెల అమ్మకాలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగినట్టు పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ విభాగం (కేంద్ర పెట్రోలియం శాఖ పరిధిలోని) డేటా తెలియజేస్తోంది.2023 ఏప్రిల్ నెల విక్రయాలతో పోల్చి చూసినా 5.3 శాతం మేర వినియోగం పెరిగింది. కరోనా ముందు నాటి సంవత్సరం 2019 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 10.45 శాతం అధికం కావడం గమనించొచ్చు. కస్టమర్లు క్రమంగా ఎలక్ట్రిక్, పెట్రోల్ వేరియంట్ల వైపు మొగ్గు చూపిస్తుండడంతో డీజిల్ వినియోగంపై కొంత కాలంగా నెలకొన్న సందేహాలకు తాజా గణంకాలు తెరదించినట్టయింది. మొత్తం పెట్రోలియం ఇంధనాల్లో డీజిల్ వాటా 38 శాతంగా ఉంటుంది.ఇక ఏప్రిల్ నెలలో పెట్రోల్ అమ్మకాలు సైతం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూస్తే 4.6 శాతం పెరిగి 3.43 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్లో ఎన్నికల కారణంగా పెట్రోల్ అమ్మకాలు 19 శాతం వృద్ధిని నమోదు చేయగా, నాటి గరిష్ట పరిమితి మీద మెరుగైన వృద్ధి నమోదైంది. ఎల్పీజీ విక్రయాలు 6.7 శాతం పెరిగి 2.62 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు 3.25 శాతం తగ్గి 7,66,000 టన్నులుగా ఉన్నాయి. -
సరళతర ఎఫ్డీఐ విధానం.. అవకాశాలు అపారం
భారత్ అమలు చేస్తున్న సరళతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్డీఐ) విదేశీ ఇన్వెస్టర్లకు అపారమైన పెట్టుబడి అవకాశాలను ఆఫర్ చేస్తోందని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, ఆటో, పర్యాటక రంగాలకు ఎఫ్డీఐలను ఆకర్షించే శక్తితోపాటు ఉపాధి కల్పనకు చోదకాలుగా నిలవగలవని పేర్కొంది. వీటికితోడుగా ఎగుమతులు, ఆవిష్కరణలు భారత్ తదుపరి దశ వృద్ధిని నడిపించగలవని తెలిపింది.చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో(అనుమతుల్లేని) 100 శాతం ఎఫ్డీఐల రాకకు అనుమతించడం ద్వారా భారత్ ఎంతో ప్రగతి సాధించినట్టు డెలాయిట్ ఇండియా గుర్తు చేసింది. పర్యాటకం, నిర్మాణం, హాస్పిటల్స్, మెడికల్ డివైజ్లను ప్రస్తావించింది. ఈ విధాన నిర్ణయాలు స్థిరత్వాన్ని, స్పష్టతను అందిస్తున్నట్టు డెలాయిడ్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. 70 బిలియన్ డాలర్ల జాతీయ మోనిటైజేషన్ పైపులైన్, 100 పట్టణాల్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు వెంటనే కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలైన పెట్టుబడి జోన్లను అందిస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్పర్యాటకం, ఆతిథ్య రంగంలో హోటళ్లు, రిక్రియేషన్ కేంద్రాల నిర్మాణానికి 100 శాతం ఎఫ్డీఐని అనుమతిస్తున్నట్టు మజుందార్ గుర్తు చేశారు. పారదర్శక, స్థిరమైన పెట్టుబడుల కేంద్రంగా భారత్ ప్రతిష్ట దీంతో మరింత ఇనుమడిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం, సరళతర ఎఫ్డీఐ విధానం.. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి రంగాల్లో అపార అవకాశాలను తీసుకొస్తున్నట్టు మజుందార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2024–2025) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) 27 శాతం అధికంగా 40.67 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ భారత్లోకి రావడం గమనార్హం. -
బఫెట్ వారసుడొచ్చాడు..!
ఒమాహ: ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ (94) ‘బెర్క్షైర్ హాతవే’ చైర్మన్గా ఈ ఏడాది చివర్లో తప్పుకోనున్నారు. తన స్థానంలో వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్కి సారథ్య బాధ్యతలు అప్పగించాలంటూ కంపెనీ బోర్డుకు సిఫారసు చేయనున్నట్టు శనివారం ప్రకటించి ఇన్వెస్టర్లను, ఫాలోవర్లను షాక్కు గురిచేశారు. దీంతో ఆరు దశాబ్దాల పెట్టుబడుల యాత్రకు బఫెట్ ముగింపు పలకనున్నారు. ‘‘కంపెనీ సీఈవోగా ఈ ఏడాది చివర్లో గ్రెగ్ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైంది’’అంటూ వాటాదారులతో నిర్వహించిన ప్రశ్న–జవాబుల కార్యక్రమం చివర్లో బఫెట్ ప్రకటించారు.దీనిపైపై మాత్రం ప్రశ్నలకు అనుమతించలేదు. ఈ నిర్ణయం కంపెనీ బోర్డు సభ్యులైన తన ఇద్దరు పిల్లలు హోవర్డ్, సూసీ బఫెట్కు మాత్రమే తెలుసని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వేదికపై బఫెట్ పక్కనే గ్రెగ్ అబెల్ ఆసీనులై ఉండడం గమనార్హం. ‘‘బెర్క్షైర్ హాతవే కంపెనీ షేరు ఒక్కటి కూడా విక్రయించాలన్న ఉద్దేశం నాకు లేదు. చివరికి వీటిని విరాళంగా ఇచ్చేయాల్సిందే. కానీ, ప్రతీ షేరును కొనసాగించాలన్న నిర్ణయం ఆర్థిక కోణంలో తీసుకున్నదే. ఎందుకంటే నా కంటే కూడా గ్రెగ్ నాయకత్వంలో బెర్క్షైర్ భవిష్యత్ మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నాను’’అని బఫెట్ తెలిపారు.ఇప్పటికే కీలక బాధ్యతలు..బఫెట్ భవిష్యత్ వారసుడిగా గ్రెగ్ అబెల్ (62) గతంలోనే నియమితులయ్యారు. కంపెనీ నాన్ ఇన్సూరెన్స్ వ్యాపార బాధ్యతలను ఆయనే నిర్వహిస్తున్నారు. కానీ, బఫెట్ మరణానంతరమే ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతల్లోకి గ్రెగ్ వస్తారన్న అంచనాలు నెలకొన్నాయి. తనకు రిటైర్మెంట్ ప్రణాళికలేవీ లేవంటూ లోగడ బఫెట్ ప్రకటించడం ఇందుకు దారితీసింది. బెర్క్షైర్ కంపెనీని నడిపించే సామర్థ్యాలు గ్రెగ్ అబెల్కు ఉన్నాయని చాలా మంది ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు.ఇకపై ఇన్సూరెన్స్ వ్యాపారం బాధ్యతల నిర్వహణతోపాటు కంపెనీ వద్దనున్న భారీ నగదు నిల్వలను (2024 చివరికి 334 బిలియన్ డాలర్లు) అబెల్ ఎలా పెట్టుబడులుగా మలుస్తారన్న ఆసక్తి నెలకొంది. బఫెట్ ప్రకటన తర్వాత వేలాది మంది ఇన్వెస్టర్లు నిల్చుని మరీ దిగ్గజ ఇన్వెస్టర్ సేవలకు ప్రశంసలు కురిపించడం కనిపించింది. బఫెట్ సారథ్యంలో (1965 నుంచి నేటి వరకు) బెర్క్షైర్ ఎస్అండ్పీ 500 కంటే (ఏటా 10.4 శాతం) రెట్టింపు స్థాయిలో ఏటా 19.9 శాతం కాంపౌండెడ్ రాబడులు అందించడం గమనార్హం. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం వారెన్ బఫెట్ సంపద విలువ ప్రస్తుతం 169 బిలియన్ డాలర్లుగా ఉంది. -
సెకీతో రిలయన్స్ న్యూ సన్టెక్ ఒప్పందం
ముంబై: రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ సన్టెక్ తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో పాతికేళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం వచ్చే 24 నెలల్లో సమీకృత సోలార్ అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుపై రూ. 10,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కేడబ్ల్యూహెచ్కి రూ. 3.53 ఫిక్సిడ్ రేటు చొప్పున విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. -
ధీరూభాయ్ అంబానీ అసలు పేరేంటో తెలుసా?
భారదేశంలో అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ.. రిలయన్స్ సామ్రాజ్యం గురించి తెలిసిన దాదాపు అందరికీ, ఈ కంపెనీ ప్రారంభించిన వారు ధీరూభాయ్ అంబానీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ధీరూభాయ్ అంబానీ అసలు పేరు ఏమిటో.. బహుశా చాలా తక్కువమందికే తెలిసి ఉంటుంది. ఈ కథనంలో ఆ విషయం తెలుసుకుందాం.సాధారణ కుటుంబంలో జన్మించిన ధీరూభాయ్ అంబానీ.. ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చదువును అర్ధాంతరంగా నిలిపివేసి యెమెన్కు వెళ్లి అక్కడ పెట్రోల్ పంప్లో రూ. 300 జీతానికి పనిచేయడం మొదలుపెట్టారు. కొన్నేళ్ల తరువాత సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఇండియాకు వచ్చి.. ముంబైలోని అద్దె ఇంట్లో రిలయన్స్ ప్రయాణాన్ని ప్రారంభించారు.వస్త్రాల వ్యాపారంతో మొదలైన ఈయన ప్రయాణం.. ఆ తరువాత పెట్రోకెమికల్స్, టెలికాం మొదలైన రంగాలవైపు సాగింది. ఆ తరువాత రిలయన్స్ ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. అందరూ ఈయనను 'ధీరూభాయ్ అంబానీ' అని పిలుచుకునే వారు. కానీ ధీరూభాయ్ అనేది ఆయన ముద్దుపేరు, అంబానీ అనేది ఇంటిపేరు.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..ధీరూభాయ్ అంబానీ అసలు పేరు.. 'ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ' (Dhirajlal Hirachand Ambani). 1932 డిసెంబర్ 28న జన్మించిన ఈయన.. ఏడుపదుల వయసులో 2002 జులై 6న మరణించారు. అప్పటికే రిలయన్స్ సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేశారు. ఆయన మరణించే సమయానికి, ప్రపంచంలో 138వ ధనవంతుడిగా ఉన్నట్లు.. ఆయన వ్యక్తిగత నికర విలువ 2.9 బిలియన్ డాలర్లు (నేటి భారత కరెన్సీ ప్రకారం రూ. 24000 కోట్లు) అని సమాచారం. -
మరిన్ని కంపెనీలు కొంటాం: ప్రముఖ సీఈవో
న్యూఢిల్లీ: వేల్యుయేషన్ సముచితంగా ఉంటే మరిన్ని కంపెనీలను కొనుగోలు చేస్తామని ‘యూనికామర్స్ ఈసొల్యూషన్స్’ సీఈవో కపిల్ మఖీజా తెలిపారు. గత నాలుగేళ్లుగా ఈ–కామర్స్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకున్నాయని, ఆమ్నిచానల్లాంటి కొత్త మోడల్స్ తెరపైకి వచ్చాయని ఆయన చెప్పారు.కంపెనీ ఇటీవలే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫాం షిప్వేను కొనుగోలు చేసిన నేపథ్యంలో కపిల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూనికామర్స్ ప్రస్తుతం 7,000 పైచిలుకు వ్యాపారాలకు సేవలు అందిస్తోందని ఆయన వివరించారు.ఈ–కామర్స్ వ్యవస్థలో కస్టమర్లతో సంప్రదింపుల దశ, లావాదేవీలను ప్రాసెస్ చేసే దశ, ఆర్డరును పూర్తి చేసే దశ అని మూడు దశలు ఉంటాయని, తమ సంస్థ ఈ మూడు అంశాల్లోనూ సర్వీసులు అందిస్తోందని కపిల్ వివరించారు. తాము ఇప్పటికే భారత్ కాకుండా ఆరు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని, మరింతగా విస్తరించే యోచనలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. -
బెర్క్షైర్ హాత్వేను వీడనున్న వారెన్ బఫెట్: నెక్స్ట్ సీఈఓ ఎవరంటే?
శనివారం (2025 మే 3) జరిగిన బెర్క్షైర్ హాత్వే వార్షిక సమావేశంలో.. దిగ్గజ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్' ఊహించని ప్రకటన చేశారు. తాను 2025 చివరి నాటికి కంపెనీ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నట్లు, తరువాత 'హువర్డ్ బఫెట్' కంపెనీ ఛైర్మన్గా బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. గ్రెగ్ అబెల్ సంస్థ సీఈఓగా ఉంటారని అన్నారు.బెర్క్షైర్ హాత్వే సీఈఓగా గ్రెగ్ అబెల్ పేరును ప్రస్తావించగానే.. గ్రెగ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. గ్రెగ్ను సీఈఓగా నియమించాలనే నిర్ణయం తన కుటుంసభ్యులకు తప్ప, గ్రెగ్కు కూడా తెలియవని బఫెట్ పేర్కొన్నారు.కంపెనీని నడిపించడానికి.. రెండు దశాబ్దాలుగా సంస్థలో పనిచేస్తున్న గ్రెగ్ అబెల్ సరైన వ్యక్తి అని కొందరు భావించినప్పటికీ.. పెట్టుబడుల విషయంలో ఈయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అనుమానం వ్యక్తం చేశారు. దీనికి బఫెట్ సమాధానమిస్తూ.. గ్రెగ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి నా సంపద మొత్తానికి కంపెనీలో పెట్టుబడిగా పెడతానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా.. నా సారథ్యంలో కంటే.. గ్రెగ్ సారథ్యంలో కంపెనీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన బఫెట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మంచంలో సగం అద్దెకు: కొత్త ఆలోచనతో డబ్బు సంపాదిస్తున్న మహిళఎవరీ గ్రెగ్ అబెల్?62 ఏళ్ల గ్రెగ్ అబెల్.. రెండు దశాబ్దాలకు పైగా బెర్క్షైర్లో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఆల్బెర్టాలోని ఎడ్మంటన్లో జన్మించిన అబెల్ చిన్నప్పుడు బాటిల్స్ సేకరించడం, అగ్నిమాపక యంత్రాలను సర్వీసింగ్ చేయడం వంటి ఉద్యోగాలు చేశారు. ఆ సమయంలో ఉన్నతమైన విలువలను పొందారు. 1984లో ఆల్బెర్టా యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివారు. బెర్క్షైర్ హాత్వేలో చేరిన తరువాత దినదినాభివృద్ధి చెందిన.. కీలకమైన పదవులను అలంకరించారు. ఇప్పుడు ఈయనను సీఈఓ పదవి వరించింది. -
కంపెనీల కార్పొరేట్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
షాపర్స్స్టాప్ లాభం పతనంరిటైల్ స్టోర్ల దిగ్గజం షాపర్స్స్టాప్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 91 శాతంపైగా పడిపోయి రూ. 2 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 23 కోట్లుపైగా ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 2 శాతం పుంజుకుని రూ. 1,064 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 1,046 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 4 శాతం పెరిగి రూ. 1,090 కోట్లకు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 86 శాతం క్షీణించి రూ. 11 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ. 77 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 7 శాతం వృద్ధితో రూ. 4,628 కోట్లకు చేరింది.ఈక్విటాస్ లాభం పతనంప్రయివేట్ రంగ సంస్థ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ఎస్ఎఫ్బీ) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 80 శాతం క్షీణించి రూ. 42 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 208 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,685 కోట్ల నుంచి రూ. 1,869 కోట్లకు ఎగసింది. ప్రొవిజన్లు రూ. 107 కోట్ల నుంచి రూ. 258 కోట్లకు భారీగా పెరిగాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 2.61 శాతం నుంచి 2.89 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 1.17 శాతం నుంచి 0.98 శాతానికి తగ్గాయి.ఇదీ చదవండి: లోకల్ కంటెంట్పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడిలాటెంట్ వ్యూ అనలిటిక్స్ నికరలాభం రూ.51 కోట్లుడిజిటల్ అనలిటిక్స్ కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్స్ ప్రొవెడర్ లాటెంట్ వ్యూ అనలిటిక్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.51.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు 2023–24 ఇదే క్వార్టర్లో నికరలాభం రూ.45.23 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.187.45 కోట్ల నుంచి రూ.253.29 కోట్లకు పెరిగింది. ‘‘త్రైమాసిక ప్రాతిపదికన 1.9%, వార్షిక ప్రాతిపదికన 35.3 శాతం పెరుగుదలతో వరుసగా తొమ్మిదో సారి ఆదాయం వృద్ధి సాధించడం సంతోషంగా ఉంది. బలమైన వ్యాపార మూలాలు, క్లయింట్లతో సత్సంబంధాలు మా స్థిరమైన పనితీరుకు నిదర్శనం’’ అని కంపెనీ సీఈవో రాజన్ సేతురామన్ తెలిపారు. 2025 మార్చి 31తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం రూ.173.49 కోట్లు, మొత్తం ఆదాయం రూ. 916.78 కోట్లుగా ప్రకటించింది. -
లోకల్ కంటెంట్పై ఫోకస్.. రూ.32 వేల కోట్లు పెట్టుబడి
డిస్నీ-రిలయన్స్ విలీనం తర్వాత ఏర్పడిన మీడియా సంస్థ జియోస్టార్ వేగంగా వృద్ధి చెందుతోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.32,000-33,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఇది అంతకుముందు సంవత్సరం రూ.30,000 కోట్ల పెట్టుబడితో పోలిస్తే 7% అధికం. స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ విస్తరణపై ఫోకస్గా ఉన్న కంపెనీ దేశవ్యాప్తంగా స్థానిక కంటెంట్పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. లోకల్ కంటెంట్కు ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది.వ్యూహాత్మక పెట్టుబడిగత మూడేళ్లలో జియోస్టార్ రూ.85,000 కోట్లు వెచ్చించి ప్రముఖ మీడియా సంస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా రీజినల్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ బ్రాడ్ కాస్టింగ్లో భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ దృష్టి సారించింది. ఐపీఎల్ సీజన్లో 300 మిలియన్ల సబ్స్రైబర్లను చేరుకోవడం, క్రికెట్ పట్ల దేశంలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని స్ట్రీమింగ్లో సాంకేతిక పురోగతిని పెంచడానికి పెద్దపీట వేస్తుంది.ఇదీ చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 50 ఏళ్లు వచ్చే బ్యాటరీస్థానిక కంటెంట్ విస్తరణ విభిన్న భాషా, సాంస్కృతిక ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో జియోస్టార్ హైపర్-లోకల్, ఇండియన్ సెంట్రిక్ కంటెంట్పై ఆసక్తిగా ఉంది. ఇందులో ప్రాంతీయ క్రీడలు, వినోదం కీలకంగా మారబోతున్నట్లు కంపెనీ తెలిపింది. 5జీ, 4జీ నెట్వర్క్ విస్తరిస్తున్నందున జియోస్టార్ తన డిజిటల్ పంపిణీ ఛానళ్లను బలోపేతం చేస్తోంది. స్మార్ట్ టీవీలు, మొబైల్ పరికరాలు లేదా ప్రత్యక్ష ఓటీటీ ప్లాట్ఫామ్ల ద్వారా విస్తృత ప్రేక్షకులకు కంటెంట్ అందుబాటులో ఉండేలా చూస్తోంది. -
డబుల్ ప్రాఫిట్!
మొండిబకాయిలు తగ్గడం, ప్రధాన ఆదాయం పెరగడంతో ప్రభుత్వ రంగ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.313 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఆరి్థక సంవత్సరం ఇదే క్యూ4లో ఆర్జించిన లాభం రూ.139 కోట్లతో పోలిస్తే ఇది 125% అధికం. ఇదే మార్చి త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.2,894 కోట్ల నుంచి రూ.3,836 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.2,481 కోట్ల నుంచి రూ.3,159 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ.689 కోట్ల నుంచి రూ.1,122 కోట్లకు బలపడింది.ఆస్తుల నాణ్యత పరిశీలిస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 5.43% నుంచి 3.38 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 1.63% నుంచి 0.96 శాతానికి పరిమితమయ్యాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 88.69% నుంచి 91.38 శాతానికి పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 17.16% నుంచి 17.41 శాతానికి పెరిగింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.0.07 పైసల డివిడెండ్ ప్రకటించింది.ఇదీ చదవండి: కోటక్ మహీంద్రా బ్యాంక్కు లాభమా..? నష్టమా..?పూర్తి ఆర్థిక సంవత్సరానికి గానూ నికరలాభం 71% వృద్ధి చెంది రూ.1,016 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.10,915 కోట్ల నుంచి రూ.13,049 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,841 కోట్ల నుంచి రూ.3,784 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్ 2.45% నుంచి 2.85 శాతానికి చేరుకున్నాయి. -
కోటక్ మహీంద్రా బ్యాంక్కు లాభమా..? నష్టమా..?
సూక్ష్మ రుణాల విభాగంలో ఒత్తిళ్ల కారణంగా గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం 8 శాతం (కన్సాలిడేటెడ్) క్షీణించింది. రూ.5,337 కోట్ల నుంచి తగ్గి రూ. 4,933 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 4,133 కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ. 3,552 కోట్లకు తగ్గింది. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 5 శాతం పెరిగి రూ. 7,284 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 5.28 శాతం నుంచి 4.97 శాతానికి క్షీణించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 2.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.మార్జిన్ల ఎఫెక్ట్..పాలసీ రేట్ల కోతతో పాటు సూక్ష్మ రుణాల విభాగానికి సంబంధించిన సవాళ్ల వల్ల బ్యాంకు ఎన్ఐఎంలపై ప్రతికూల ప్రభావం పడింది. మైక్రోఫైనాన్స్ విభాగంలో సవాళ్లు మరో త్రైమాసికంపాటు కొనసాగవచ్చని, ఆ తర్వాత సాధారణ స్థాయికి రావచ్చని బ్యాంక్ సీఈవో అశోక్ వాస్వానీ తెలిపారు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల సెగ్మెంట్లలో తీవ్ర ఒత్తిళ్లేమీ ప్రస్తుతం లేవని ఆయన పేర్కొన్నారు. నామినల్ జీడీపీ వృద్ధికి 1.5 నుంచి 2 రెట్లు రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వాస్వానీ చెప్పారు. పోటీ బ్యాŠంకుల తరహాలోనే స్వల్పకాలికంగా తమ ఎన్ఐఎంపైనా ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఏ అనుబంధ సంస్థలోనూ వాటాలను విక్రయించే యోచనేదీ లేదని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షల నుంచి బైటపడటంతో వచ్చే ఆరు నెలల్లో, పూర్వ స్థాయికి నెలవారీ క్రెడిట్ కార్డుల జారీని పెంచుకోనున్నట్లు వాస్వానీ చెప్పారు. రుణాల పోర్ట్ఫోలియోలో అన్సెక్యూర్డ్ లోన్స్ (క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు మొదలైనవి) వాటా 10.5 శాతానికి తగ్గిందని, దీన్ని 15 శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెడతామని వివరించారు. ఇదీ చదవండి: తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయంమరిన్ని కీలకాంశాలు..మార్చి క్వార్టర్లో స్టాండెలోన్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.15,285 కోట్ల నుంచి రూ.16,712 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.27,907 కోట్ల నుంచి రూ.27,174 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ నికర లాభం (స్టాండెలోన్) రూ.13,782 కోట్ల నుంచి రూ.16,450 కోట్లకు (కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ను విక్రయించడం ద్వారా వచ్చిన రూ.2,730 కోట్లతో పాటు) చేరింది. వార్షికంగా చూస్తే ఇది 19 శాతం అధికం. కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ విక్రయ మొత్తాన్ని మినహాయిస్తే నికర లాభం రూ.13,720 కోట్లు వచ్చింది. మొండిబాకీల విషయానికొస్తే.. స్థూల ఎన్పీఏలు 1.39 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 1.42 శాతానికి చేరాయి. అయితే, నికర ఎన్పీఏలు మాత్రం 0.34 శాతం నుంచి 0.31 శాతానికి తగ్గాయి. గ్రూప్ లాభాల్లో అనుబంధ సంస్థల వాటా 29 శాతం పెరగడంతో, సూక్ష్మ రుణాలు..ఆర్బీఐ ఆంక్షల వల్ల తలెత్తిన సవాళ్లను బ్యాంకు కొంత అధిగమించగలిగింది. -
తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయం
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండిబాకీలు తగ్గడం, ఆదాయం పెరగడంతో రూ.2,956 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.2,247 కోట్లతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. ఇక బ్యాంకు మొత్తం ఆదాయం రూ.16,887 కోట్ల నుంచి రూ.18,599 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,015 కోట్ల నుంచి రూ.6,389 కోట్లకు చేరింది. అసెట్ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 3.95 శాతం నుంచి 3.09 శాతానికి దిగి వచ్చాయి. అలాగే, నికర ఎన్పీఏలు కూడా 0.43 శాతం నుంచి 0.19 శాతానికి తగ్గాయి.ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులురూ.16.25 డివిడెండ్..పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేస ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 16.25 చొప్పున డివిడెండు ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర లాభం 35 శాతం వృద్ధి చెంది రూ. 8,063 కోట్ల నుంచి రూ. 10,918 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 63,482 కోట్ల నుంచి రూ. 71,226 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో రూ. రూ. 5,000 కోట్ల మొత్తాన్ని క్విప్ లేదా రైట్స్ ఇష్యూ లేదా రెండింటి మేళవింపుతో బ్యాంకు సమీకరించుకోనుంది. మరో 2,000 కోట్లను బాండ్ల ద్వారా సమకూర్చుకోనుంది. -
ఎస్బీఐ లాభం రూ. 19,600 కోట్లు
న్యూఢిల్లీ: నికర వడ్డీ మార్జిన్లు క్షీణించిన ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సుమారు 8 శాతం క్షీణించింది. రూ. 19,600 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 21,384 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 1,64,914 కోట్ల నుంచి రూ. 1,79,562 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 32 బేసిస్ పాయింట్లు తగ్గి 3.15 శాతానికి పరిమితమైంది. స్టాండెలోన్ ప్రాతిపదికన చూస్తే లాభం వార్షికంగా రూ. 20,698 కోట్ల నుంచి సుమారు 10 శాతం తగ్గి రూ. 18,642 కోట్లకు చేరింది. మార్చి క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 1,28,412 కోట్ల నుంచి రూ. 1,43,876 కోట్లకు ఎగిసింది. 2024–25కి గాను బ్యాంకు ఒక్కో షేరుపై రూ. 15.90 మేర డివిడెండును ప్రకటించింది. పెట్టుబడులపై టారిఫ్ల అనిశ్చితి ప్రభావం.. ‘భారత ఎకానమీపై టారిఫ్ల ప్రభావం పెద్దగా ఉండనప్పటికీ, సుంకాలపై అనిశ్చితి కారణంగా ఎకానమీ, అలాగే పెట్టుబడులపై మాత్రం ప్రభావం పడొచ్చు‘ అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండటంతో తదుపరి మరింతగా రేట్ల కోత ఉండొచ్చని భావిస్తున్నట్లు శెట్టి వివరించారు. తమ రుణాల్లో 27 శాతం భాగం రెపో రేటుతో అనుసంధానమై ఉండటం, ఆర్బీఐ రేట్లను తగ్గించే అవకాశాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ఐఎంలపై ఒత్తిడి కొనసాగవచ్చని శెట్టి చెప్పారు. నిర్దిష్ట అంశం వల్ల క్రితం ఆర్థిక సంవత్సరం బ్యాంకు లాభం అధికంగా నమోదైందని, దానితో పోల్చి చూస్తే ప్రస్తుతం తగ్గిందని పేర్కొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో 12–13 శాతం రుణ వృద్ధిని అంచనా వేస్తున్నామన్నారు. టారిఫ్ యుద్ధాల ప్రభావం రుణ వృద్ధిపై కూడా పడే అవకాశం ఉందని శెట్టి వివరించారు. వాణిజ్య విధానాల్లో మార్పులతో అంతర్జాతీయ ఎకానమీలో అనిశ్చితి నెలకొన్నందున కంపెనీలు తమ పెట్టుబడుల ప్రణాళికలను నెమ్మదిగా అమలు చేసే అవకాశం ఉందన్నారు. దీనితో బ్యాంకులపరంగా రుణ వృద్ధిపైనా ప్రభావం పడుతుందని శెట్టి చెప్పారు. అసెట్ క్వాలిటీ మరింత కాలం మెరుగ్గానే కొనసాగవచ్చన్నారు. 18వేల కొలువులు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఏకంగా 18,000 నియామకాలు చేపట్టనున్నట్లు శెట్టి తెలిపారు. దశాబ్దకాలంలోనే ఇది అత్యధికమని ఆయన పేర్కొన్నారు. ఇందులో 13,400 మంది క్లర్కులు, 3,000 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 1,600 మంది స్పెషలిస్టు ఆఫీసర్లు (టెక్నాలజీ తదితర విభాగాల్లో) ఉంటారని వివరించారు. మరిన్ని విశేషాలు.. ⇒ పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను స్టాండెలోన్ చూస్తే ఎస్బీఐ నికర లాభం 16 శాతం పెరిగి రూ. 61,077 కోట్ల నుంచి రూ. 70,901 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ. 1,11,043 కోట్ల నుంచి రూ. 1,19,666 కోట్లకు పెరిగింది. అసెట్ క్వాలిటీ కూడా మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) పరిమాణం 2024 మార్చి ఆఖరు నాటికి 2.24 శాతంగా ఉండగా తాజాగా 1.82 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏలు సైతం 0.57 శాతం నుంచి 0.47 శాతానికి తగ్గాయి. ⇒ 2025–26లో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్విప్)/ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో) లేదా ఇతరత్రా మార్గాల్లో ఏకమొత్తంగా లేదా విడతలవారీగా రూ. 25,000 కోట్ల వరకు మూలధనం సమకూర్చుకునే ప్రతిపాదనకు ఎస్బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. ⇒ ప్రస్తుతం ఎస్బీఐ కార్పొరేట్ రుణాల పైప్లైన్ (ఇప్పటికే మంజూరైనా ఇంకా విడుదల చేయాల్సినవి, భవిష్యత్ అవసరాల కోసం సంప్రదింపుల దశలో జరుపుతున్నవి) రూ. 3.4 లక్షల కోట్లుగా ఉన్నాయి. మౌలిక రంగం, రెన్యువబుల్ ఎనర్జీ, డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్టీ సెగ్మెంట్ల నుంచి రుణాలకు డిమాండ్ నెలకొంది. మార్చి త్రైమాసికంలో కార్పొరేట్ రుణాల వృద్ధి 9 శాతానికి పరిమితం కాగా, రిటైల్ వ్యక్తిగత రుణాలు 11 శాతం పెరిగాయి. ఇందులో గృహ రుణాల వృద్ధి 14 శాతంగా ఉంది. ⇒ అన్సెక్యూర్డ్ పర్సనల్ రుణాల విభాగంలో పెద్దగా సవాళ్లేమీ లేనందున దీనిపై బ్యాంకుపై మరింతగా దృష్టి పెట్టనుంది. భారీ కార్పొరేట్ లోన్ల విషయంలోనూ సమస్యేమీ లేకపోవడంతో మరికొన్నాళ్ల పాటు అసెట్ క్వాలిటీ మెరుగ్గానే కొనసాగవచ్చు. మొండి పద్దుల నిష్పత్తి రెండు శాతం లోపే కొనసాగవచ్చు. -
ఫార్మా జీసీసీలకు హబ్గా భారత్
సాక్షి, సిటీబ్యూరో: ఫార్మా రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)కు హబ్గా భారత్ అవతరిస్తోంది. అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు ఇండియాలో జీసీసీల ఏర్పాటుపైనే దృష్టి సారిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటం,వినియోగం కూడా బాగుంటుండటంతో అవి భారత్ వైపే మొగ్గు చూపిస్తున్నాయి. 2,500లకు పైగా సెంటర్లు, 45 లక్షల మందికి పైగా నిపుణులతో త్వరలోనే భారత జీసీసీ మార్కెట్ పరిమాణం 100 బిలియన్ డాలర్ల మార్క్ను అధిగమిస్తోందని ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక పేర్కొంది.లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ విభాగాలలో 2024లో 100 సెంటర్లు ఉండగా.. 2030 నాటికి వీటి సంఖ్య 160కి, వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుందని అంచనా వేసింది. భారత్లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా.. ఇక్కడ వర్ధమాన స్టార్టప్ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. దిగ్గజ కంపెనీల జీసీసీల నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్లోని తమ హబ్లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి. -
మంచంలో సగం అద్దెకు.. ఆశ్చర్యపడే ఆదాయం సంపాదిస్తున్న మహిళ!
అద్దెకు తీసుకోవడం అనే మాట వినిపిస్తే.. సాధారణంగా ఇల్లు, కారు, బైకు మొదలైనవి రెంటుకు తీసుకోవడం అని అనుకుంటారు. కానీ ఒక మనిషి ఉపయోగించే మంచంలో సగం అద్దెకు తీసుకుంటారా?, ఇది వినడానికి కొత్తగా అనిపించినా.. ఇదే ఆలోచనతో ఓ మహిళ నెలకు రూ. 54,000 సంపాదిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు క్లుప్తంగా ఈ కథనంలో తెలుసుకుందాం.క్వీన్స్ల్యాండ్కు చెందిన 38 ఏళ్ల మహిళ 'మోనిక్ జెరెమియా'.. "హాట్ బెడ్డింగ్" అనే కొత్త ట్రెండ్ ద్వారా అదనపు డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. ఆమె తన మంచంలో సగం అద్దెకు ఇస్తూ నెలకు 985 ఆస్ట్రేలియా డాలర్లను (రూ.54,000) వసూలు చేస్తోంది. ఎటువంటి భావోద్వేగ సంబంధాలు లేకుండా ఎవరి పక్కనైనా పడుకోవాలనేది ఆమె ఆలోచన.హాట్ బెడ్డింగ్ ద్వారా బెడ్ షేర్ చేసుకునే వ్యక్తులు ఇద్దరూ నియమాలను అర్థం చేసుకుంటే డబ్బు సంపాదించడానికి ఇది మంచి మార్గమని జెరెమియా నమ్మింది. మీరు నాలాగే సాపియోసెక్సువల్ అయితే, శారీరక సాన్నిహిత్యం కంటే.. మానసిక సాంగత్యాన్ని ఇష్టపడితే.. ఒకే బెడ్ మీద ఇద్దరు నిద్రపోవచ్చని చెబుతోంది.2020 కరోనావైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ కోల్పోయి.. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ "హాట్ బెడ్డింగ్" ఆలోచన వచ్చింది. తన మొదటి బెడ్ క్లయింట్ తనకు తెలిసినవాడేనని.. అందువల్ల ప్రారంభంలో అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదని మోనిక్ జెరెమియా చెప్పింది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ.. నియమాలను గౌరవించుకుంటే.. ఒక రూమ్ షేర్ చేసుకున్నట్లు, బెడ్ షేర్ చేసుకోవచ్చు అని అంటోంది. కష్ట సమయంలో.. డబ్బు సంపాదించడానికి హాట్ బెడ్ ఐడియా ఒక స్మార్ట్ మార్గం అని జెరెమియా చెబుతోంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండి -
మూడు ముక్కల్లో అంబానీ 'సక్సెస్ మంత్ర'
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, రిలయన్స్ అధినేత 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగిన ఈయన ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఇటీవల ముకేశ్ అంబానీని పెట్టుబడి ఆధారిత కంపెనీ వ్యవస్థాపకుడు 'అనంత్ లాధా' కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అనంత్ లాధా.. ముకేశ్ అంబానీని కలిసి కొంతసేపు ముచ్చటించారు. ఆ సమయంలో 'విజయం సాధించడానికి ఏమి కావాలి?' అని ప్రశ్నించారు. 'ఫోకస్, డెలిగేట్, డైవర్సిఫై' ఈ మూడు ఉంటే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చని రిలయన్స్ అధినేత సింపుల్గా సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం లాధాను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదీ చదవండి: 'అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుంది': జాగ్రత్తగా ఉండండిముకేశ్ అంబానీ చెప్పిన సక్సెస్ ఫార్ములాను.. అనంత్ లాధా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. ఇది నెటిజన్లను కూడా ఎంతంగానో ఆకట్టుకుంది. ఇది చాలా గొప్ప సలహా అని ఒక నెటిజన్ వెల్లడించగా.. ఇది బంగారం లాంటి సలహా అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇలా అంబానీ ఇచ్చిన సలహా ఎంతోమందిని ఫిదా చేసింది. View this post on Instagram A post shared by Anant Ladha (@anantladha1234) -
కొత్త రిసార్ట్లను ప్రారంభించిన క్లబ్ మహీంద్రా
మహీంద్రా హాలిడేస్ & రిసార్ట్స్ ఇండియా లిమిటెడ్ (MHRIL)లో ప్రధాన బ్రాండ్ అయిన 'క్లబ్ మహీంద్రా' దాని పోర్ట్ఫోలియోలో మూడు కొత్త రిసార్ట్లను జోడించినట్లు ప్రకటించింది. బ్రాండ్ విస్తరణలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోకి కూడా ప్రవేశించింది. అంతే కాకుండా.. బ్రాండ్ వియత్నాంలోని సైగాన్ ప్రాంతం.. అబుదాబిలో కూడా తన ఉనికిని బలోపేతం చేసుకుంది.ఆంధ్రప్రదేశ్లోని గోదావరిలోని దిండి ఆర్వీఆర్.. అద్భుతమైన నదీతీర రిట్రీట్ గంభీరమైన గోదావరి నది వెంబడి ఉంది. పచ్చని కొబ్బరి తోటలు, సుందరమైన బ్యాక్ వాటర్లతో చుట్టుముట్టబడిన ఈ రిసార్ట్, కుటుంబం & స్నేహితులతో కాలం గడపడానికి అనువైన ప్రదేశం. ఈ రిసార్ట్లో 100 గదులు ఉన్నాయి. మొదటి దశలో 50 గదులు ప్రారంభమవుతాయి. మిగిలిన 50 గదులు ఈ ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి ప్రారంభమవుతాయని సమాచారం. -
ప్రపంచంలో పే..ద్ద బ్యాంకులు ఇవే..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూలం బ్యాంకులే. ఆర్థికపరమైన పరిణామాలన్నీ బ్యాంకుల ద్వారానే జరుగుతాయి. అప్పు కావాలన్నా.. సంపాదించిన సొమ్ము దాచుకోవాలన్నా అన్నింటికీ బ్యాంకులే ఆధారం. ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించే సంస్థలతో ప్రపంచ బ్యాంకింగ్ పరిశ్రమ ఆధిపత్య ఉనికిని కొనసాగిస్తోంది. స్టాటిస్టా నివేదిక ప్రకారం 2025 నాటికి ఈ రంగం నికర వడ్డీ ఆదాయం 8.94 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ ఛేజ్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. మొత్తం ఆస్తుల పరంగా ఇది అమెరికాలో అతిపెద్ద బ్యాంకు. ఈ ర్యాంకింగ్స్ లో అమెరికన్ బ్యాంకులు ఆధిపత్యం కొనసాగిస్తుండగా, చైనా బ్యాంకులు టాప్ టెన్ లో నాలుగింటిని ఆక్రమించాయి. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) ఆసియాలోనే అతిపెద్దదిగా అవతరించింది.టాప్ 10లో భారతీయ బ్యాంకుమార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ 10 బ్యాంకులలో ఓ భారతీయ బ్యాంకు కూడా చోటు దక్కించుకుంది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో విలీనం తరువాత భారత్కు చెందిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద బ్యాంకుగా, ప్రపంచవ్యాప్తంగా పదో అతిపెద్ద బ్యాంకుగా మారింది. 2025 మే 2 నాటికి ఇది 184.44 బిలియన్ డాలర్లు (రూ.1,553,706 కోట్లు) మార్కెట్ క్యాప్ కలిగి ఉంది.టాప్ 10 అతిపెద్ద బ్యాంకులు.. వాటి మార్కెట్ క్యాప్1. జెపి మోర్గాన్ ఛేజ్ రూ.57,80,495 కోట్లు2. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) రూ.2,696,421 కోట్లు 3. బ్యాంక్ ఆఫ్ అమెరికా రూ.2,549,084 కోట్లు4. అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా రూ.2,163,540 కోట్లు5. వెల్స్ ఫార్గో రూ.1,968,702 కోట్లు6. చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ (సీసీబీ) రూ.1,824,265 కోట్లు7. బ్యాంక్ ఆఫ్ చైనా రూ.1,745,070 కోట్లు8. హెచ్.ఎస్.బి.సి. రూ.1,660,165 కోట్లు9. మోర్గాన్ స్టాన్లీ రూ.1,580,581 కోట్లు10. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1,553,706 కోట్లుSource: companiesmarketcap.com -
ఆస్తుల్లో వీరెంత.. వారెంత..?
ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థానికంగా ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వాటి ఉత్పత్తులకు ఆదరణ లభిస్తే అపార సంపద చేకూరుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్ అత్యంత ప్రభావవంతమైన సీఈఓలను తయారు చేశాయి. సంపదలో హెచ్చుతగ్గులున్నా ఎవరి ప్రత్యేకత వారిదే. ఇరుదేశాలకు చెందిన ఈ సీఈఓలు తమ కంపెనీల లాభాలను పెంచడమే కాకుండా దేశ వ్యాపార ముఖచిత్రాలను మారుస్తున్నారు. భారత్, పాకిస్థాన్కు చెందిన టాప్ సీఈఓలు, వారి నికర ఆస్తులు, వారి పరిశ్రమల వివరాలు కింద తెలుసుకోవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే భారత సీఈఓల సంపద వేలు, లక్షల కోట్లలో ఉంటే.. పాక్ సీఈఓలలో ఒకరిద్దరు మినహా.. మిగిలిన వారి సంపద పదుల కోట్లకే పరిమితం కావడం గమనార్హం.2025 లెక్కల ప్రకారం ఇండియాలోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు1. ముఖేష్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్గా ముఖేశ్ అంబానీ ఉన్నారు. 110 బిలియన్ డాలర్ల (రూ.9.1 లక్షల కోట్లు) నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. టెలికాం నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు అన్ని రంగాలను అంబానీ శాసిస్తున్నారు.2. గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ ఛైర్మన్గా గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన నికర సంపద 56.3 బిలియన్ డాలర్లు(రూ.4.75 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. దేశంలోని ప్రముఖ పోర్ట్స్ దగ్గర నుంచి పవర్ జనరేషన్ వరకు చాలా రంగాల్లో సేవలందిస్తున్నారు.3. సుందర్ పిచాయ్ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ. 1.3 బిలియన్ డాలర్లు (రూ.10,800 కోట్లు) సమీకరించారు. తమిళనాడులో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్ మాతృసంస్థకు నేతృత్వం వహిస్తూ కృత్రిమ మేధ, ఆన్లైన్ సెర్చ్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు.4. సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈఓ. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ పవర్హైజ్గా మార్చారు. అతను 331 మిలియన్ డాలర్ల (రూ.2,750 కోట్లు) నికర విలువను కలిగి ఉన్నారు.5. ఫాల్గుణి నాయర్ఫాల్గుణి నాయర్ నైకా అనే బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీకి సీఈఓ. ఫోర్బ్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నారు. ఆమె నికర ఆస్తుల విలువ 3.64 బిలియన్ డాలర్లు (రూ.30,300 కోట్లు).ఇదీ చదవండి: రోజూ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు..?పాకిస్థాన్లోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు1. షాహిద్ ఖాన్పాకిస్థానీ-అమెరికన్ వ్యాపార దిగ్గజం ఫ్లెక్స్-ఎన్-గేట్ సీఈఓ షాహిద్ ఖాన్. 13.3 బిలియన్ డాలర్ల (రూ.1.1 లక్షల కోట్లు) సంపదతో పాక్లో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. అతను ఎన్ఎఫ్ఎల్ జట్టు జాక్సన్ విల్లే జాగ్వార్స్, ఇంగ్లీష్ క్లబ్ ఫుల్హామ్ ఎఫ్సీలకు ఆధిపతిగా ఉన్నారు.2. మియాన్ ముహమ్మద్ మాన్షామాన్షా నిషాత్ గ్రూప్ ఛైర్మన్. 5 బిలియన్ డాలర్ల (రూ.41,500 కోట్లు) నికర విలువతో పాకిస్థాన్ తొలి బిలియనీర్ వ్యాపారవేత్త. అతని వ్యాపార సామ్రాజ్యం బ్యాంకింగ్, టెక్స్టైల్స్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తిలో విస్తరించి ఉంది.3. షాజియా సయ్యద్యూనిలీవర్ పాకిస్తాన్ సీఈఓ షాజియా సయ్యద్ నికర విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లు). ఆమె నాయకత్వంలో మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో సుస్థిరత, బ్రాండ్ నమ్మకాన్ని ప్రోత్సహించడంలో గుర్తింపు పొందారు.4. అసద్ ఉమర్ఎంగ్రో కార్పొరేషన్ మాజీ సీఈఓ. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్న ఉమర్ విలువ 3 మిలియన్ డాలర్లు (రూ.25 కోట్లు) ఉంటుందని అంచనా.5. షోయబ్ సిద్ధిఖీజాజ్ పాకిస్థాన్ సీఈఓ షోయబ్ సిద్ధిఖీ. ఈయన సంపద 2 మిలియన్ డాలర్లు (రూ.16.5 కోట్లు). దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ సేవలు, మొబైల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్లను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. -
జుక్.. జాబ్స్.. గేట్స్.. వీళ్ల సీక్రెట్ ఇదేనా?
స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్బర్గ్.. ముగ్గురూ టెక్ ప్రపంచాన్ని శాసించి బిలియన్ డాలర్లు సంపాదించిన వ్యాపారాధినేతలు. వీరి విజయ రహస్యమేంటో తెలిసిపోయింది! బలమైన నాయకత్వం, వ్యూహాత్మక దార్శనికత, సమర్థవంతమైన కమ్యూనికేషన్ ప్రధాన లక్షణాలుగా ఉన్నప్పటికీ, ఈ ముగ్గురికీ సారూప్యత ఉన్న అంశం మరొకటి ఉందని డొనాల్డ్ జి కాస్టెల్లో కాలేజ్ ఆఫ్ బిజినెస్ పరిశోధకులు వెల్లడించారు.ఒకటే చేతివాటంఈ ముగ్గురు సీఈఓలు ఎడమచేతి వాటం వారే. జర్నల్ ఆఫ్ బిహేవియరల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫైనాన్స్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఎడమచేతివాటం కలిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆవిష్కరణలు, విజయవంతమైన కంపెనీలతో దూసుకెళ్లడానికి, వారి ఎడమ చేతి వాటానికి సంబంధం ఉంది. కుటుంబ అనుభవాలు, జన్యుపరమైన వారసత్వం, అకడమిక్ నేపథ్యం, వారు ఎంచుకున్న కెరీర్ మార్గాలు, ఇంకా మరెన్నో అంశాలు కూడా సీఈఓల విజయాలకు కారణం కావచ్చని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ లాంగ్ చెన్ తెలిపారు.ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 472 కంపెనీలకు చెందిన 1,000 మందికి పైగా సీఈవోలను విశ్లేషించారు. రాయడం, గీయడం, తినడం, విసరడం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన సీఈఓల ఫొటోలు, వీడియోలను పరిశీలించి వారి ఆధిపత్యాన్ని నిర్ధారించారు. అనుమానం వచ్చినప్పుడు ఆయా కంపెనీలకు ఫోన్లు చేయడం లేదా వివరణ కోసం ఈమెయిల్స్ పంపడం చేసేవారు. వారు ఏ చేతి మణికట్టుపై వాచీలు ధరించారో కూడా తాము గమనించామని అధ్యయనకర్తలు చెప్పుకొచ్చారు. సాధారణంగా ఎడమచేతి వాటం ఉన్నవారు వాచీని తమ కుడి చేతికి ధరిస్తారు.అధ్యయన ఫలితాలుసీఈఓల్లో అత్యధికులు కుడిచేతి వాటం వారే. వీరు 91.4 శాతం మంది ఉండగా 7.9 శాతం మంది మాత్రమే ఎడమచేతి వాటం వారున్నారు. 0.7 శాతం మంది రెండు చేతివాటాలున్నవారు తేలారు. లెఫ్ట్ హ్యాండ్ సీఈఓల నేతృత్వంలోని సంస్థలు గణనీయంగా అధిక సృజనాత్మక ఉత్పత్తిని ప్రదర్శించాయని, మరింత ప్రత్యేకమైన పేటెంట్లను కలిగి ఉన్నాయని తదుపరి విశ్లేషణలో వెల్లడైంది.ఏదైనా సంస్థ కుడిచేతివాటం ఉన్న సీఈవో నుంచి ఎడమచేతివాటం సీఈఓకి చేతుల్లోకి మారిన తర్వాత ఆ సంస్థ పేటెంట్లు, ప్రశంసాపత్రాల సంఖ్య మరింత పెరుగుతోందని ఫలితాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఎడమచేతివాటం సీఈవో నుంచి కుడిచేతివాటం సీఈఓకి మారిన కంపెనీల ఇన్నోవేషన్ అవుట్పుట్లో ఇలాంటి మార్పు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది.ఎడమచేతివాటం సీఈఓలు నిర్వహించే సంస్థలు ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంటుంది. వారు దేశీయ ఉద్యోగుల కంటే ఎక్కువ ఇన్నోవేషన్ అవుట్ పుట్ ఇస్తారని భావిస్తారు.కుడిచేతివాటం సీఈవోలతో పోలిస్తే ఎడమచేతివాటం సీఈవోలు కాస్త ఎక్కువ ఓపెన్ మైండెడ్ గా ఉంటారు. సృజనాత్మకతను ప్రోత్సహించడంలోనూ ముందుంటారు. -
రూ.1000 కోట్లు దాటిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం 30% జంప్చేసి రూ. 1,050 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 808 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం రూ. 9,106 కోట్ల నుంచి రూ. 9,215 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం మరింత అధికంగా రూ. 6,629 కోట్ల నుంచి రూ. 7,634 కోట్లకు బలపడింది. ఈ ఏడాది సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో అజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు.తద్వారా బ్యాంక్లో ప్రభుత్వ వాటా 94.61 శాతం నుంచి 90 శాతానికి దిగిరానున్నట్లు పేర్కొన్నారు. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 3.1 శాతం నుంచి 2.14 శాతానికి, నికర ఎన్పీఏలు 0.57 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గాయి. ఐవోబీ షేరు ఎన్ఎస్ఈలో 0.6% లాభంతో రూ.38 వద్ద క్లోజైంది. -
అది ఇల్లీగల్.. జేఎస్డబ్ల్యూ స్టీల్కు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ అండ్ పవర్ (బీపీఎస్ఎల్)ను దక్కించుకోవడానికి సంబంధించి జేఎస్డబ్ల్యూ స్టీల్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కంపెనీ సమర్పించిన పరిష్కార ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇది దివాలా చట్టానికి (ఐబీసీ) విరుద్ధమని, అక్రమమని స్పష్టం చేసింది. ఐబీసీ కింద బీఎస్పీఎల్ లిక్విడేషన్ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ని (ఎన్సీఎల్టీ) సుప్రీం కోర్టు ఆదేశించింది.వివరాల్లోకి వెళ్తే, దివాలా చట్టం కింద 2021లో బీఎస్పీఎల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ 49% వాటా దక్కించుకుంది. తర్వాత దీన్ని 83%కి పెంచుకుంది. అయితే, ఇందుకు అనుసరించిన విధానం, నిబంధనలకు విరుద్ధంగా ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అలాగే, నిర్దేశిత గడువులోగా పరిష్కార ప్రణాళికను అమలు చేయలేదని పేర్కొంది.ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, పూర్తి ఉత్తర్వుల కాపీ అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఎక్స్చేంజీలకు జేఎస్డబ్ల్యూ స్టీల్ తెలిపింది. ఈ వార్తలతో శుక్రవారం జేఎస్డబ్ల్యూ స్టీల్ షేరు సుమారు 5% క్షీణించి రూ. 972 వద్ద ముగిసింది. -
బంగారం @ 96,800
న్యూఢిల్లీ: బంగారం మళ్లీ మెరిసింది. జ్యువెలర్లు కొనుగోళ్లకు ముందుకు రావడంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,080 పెరిగి రూ.96,800 వద్ద స్థిరపడింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం కేవలం రూ.180 లాభపడి రూ.96,350 వద్ద ముగిసింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పట్ల సానుకూల ధోరణి కనిపించింది. ఔన్స్కు 47 డాలర్లు పెరిగి 3,269 డాలర్ల స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర సైతం దేశీయంగా కిలోకి రూ.1,600 ఎగసి రూ.97,100 స్థాయి వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల ధోరణితో జ్యువెలర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది.యూఎస్ వాణిజ్య ఒప్పందాలపై తాజాగా నెలకొన్న సందిగ్ధతతో బంగారం పట్ల సానుకూల సెంటిమెంట్ ఏర్పడినట్టు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ వైస్ ప్రెసిడెంట్ జతీన్ త్రివేది తెలిపారు. అస్పష్టతకు తోడు వాణిజ్య సంప్రదింపులపై మారుతున్న అమెరికా వైఖరితో ఇన్వెస్టర్లు బంగారంలో షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు మొగ్గు చూపించినట్టు చెప్పారు. -
బిల్గేట్స్కు అరుదైన వ్యాధి.. పేరెంట్స్కు కూడా అర్థమయ్యేది కాదు!
ప్రపంచ కుబేరులలో ఒకరు.. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 'బిల్గేట్స్' గురించి దాదాపు అందరికీ తెలుసు. కానీ ఈయనకు 'ఆస్పెర్జర్ సిండ్రోమ్' ఉందని, ఇది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) కిందికి వస్తుందని ఆయన కుమార్తె ఫోబ్ గేట్స్ 'కాల్ హర్ డాడీ' పాడ్కాస్ట్లో వెల్లడించారు.'కాల్ హర్ డాడీ' పాడ్కాస్ట్ ఎపిసోడ్లో.. కనిపించిన ఫోబ్ గేట్స్, తన తండ్రిని కలవడానికి తన బాయ్ఫ్రెండ్లను ఇంటికి తీసుకువెళ్లిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అయితే నాన్న వారిని కలవడానికి ఇబ్బందిపడేవారని, అది నాకు చాలా ఫన్నీగా అనిపించేది ఫోబ్ పేర్కొన్నారు.నిజానికి బిల్గేట్స్.. గతంలో ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇప్పటి పరిస్థితుల్లో నేను పెరిగి ఉంటే నాకు ఖచ్చితంగా ఆస్టిజం ఉందని తేలేది. నాకు ఆస్టిజం ఉందా?.. లేదా? అని టెస్టులు చేయించుకోలేదు, డాక్టర్లు కూడా నాకు ఎప్పుడూ దీని గురించి చెప్పలేదు. అయితే నా ప్రవర్తన చిన్నప్పటి నుంచి అలా ఎందుకు ఉందో.. అమ్మానాన్నలకు అర్థమయ్యేది కాదు. అప్పట్లో ఇది ఒక వ్యాధి అని తెలుసుకోవడానికి టెక్నాలజీ కూడా అంత అభివృద్ధి చెందలేదు.ఇదీ చదవండి: సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్గేట్స్ ప్రశంసల వర్షంఒకసారి అమ్మానాన్నలు నన్ను (బిల్గేట్స్) ఓ థెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన నా ప్రవర్తనను మార్చడానికి చాలా ప్రయత్నించారు. నా లోపాన్ని పాజిటివ్గా చూపించడంలో విజయం సాధించాడని పేర్కొన్నారు.ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్నవారు ఇతరులతో మాట్లాడాలన్నా.. కలవాలన్నా ఇబ్బంది పడుతుంటారు. అంతే కాకుండా వీరికి కొన్ని విషయాలపై అమితాసక్తి ఉంటుంది. ఈ డిజార్డర్ ఉన్నవారికి ఇతరులతో ఎలా ఉండాలో తెలియదు. చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. -
రూ.21000 కోట్లు: మూడేళ్ళలో యూట్యూబర్ల సంపాదన..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది సొంతంగా సంపాదించడానికి మార్గాలను వెతుకుతున్నారు. పెట్టుబడి లేకుండా సంపాదించడానికి యూట్యూబ్ ఓ మంచి ఫ్లాట్ఫామ్. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానెల్స్ ప్రారంభిస్తున్నారు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా గత మూడేళ్ళలో కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదించారనే విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ వెల్లడించారు.గత మూడు సంవత్సరాలలో యూట్యూబ్.. భారతీయ క్రియేటర్లకు, మీడియా సంస్థలు మొదలైన వాటికి రూ. 21,000 కోట్లకు పైగా చెల్లించింది. ఈ విషయాన్ని సీఈఓ నీల్ మోహన్ ముంబైలో జరిగిన ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES)లో స్పష్టం చేశారు. అంతే కాకుండా.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించడానికి రాబోయే రెండు సంవత్సరాలలో.. రూ.850 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పెట్టుబడి ప్రత్యేకంగా భారతదేశ కంటెంట్ క్రియేటర్ల ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 1925లో బంగారం రేటు ఇంత తక్కువా?: అదే ధర ఇప్పుడుంటే..భారతదేశంలోని సుమారు 100 మిలియన్ల కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ లేదా యూట్యూబర్లు కంటెంట్ అప్లోడ్ చేశారు. సుమారు 15,000 మంది యూట్యూబర్లు ఒక ఏడాదిలోనే 10 లక్షల సబ్స్క్రైబర్లను పొందిన రికార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2005 ఫిబ్రవరి 14న ప్రారంభమైన యూట్యూబ్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. -
కొందరు కావాలంటే.. ఇంకొందరు వద్దంటున్నారు!
ప్రసార రంగంలో సమతుల్య నియంత్రణ విధానం అవసరమని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఛైర్మన్ అనిల్ కుమార్ లహోటి తెలిపారు. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025లో ఆయన పాల్గొని మాట్లాడారు. టీవీ, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల మధ్య నియంత్రణలో అసమానతలున్నాయని తెలిపారు. అందుకోసం సమతుల్య నియంత్రణ విధానం తోడ్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా న్యూ టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ)పై సమీక్ష కొనసాగుతుందని తెలిపారు.పరస్పర విరుద్ధ డిమాండ్లుప్రధాన బ్రాడ్కాస్టర్లు, పంపిణీదారులు ప్రసార రంగంలో నియంత్రణను కోరుకోవడంలేదని లహోటి చెప్పారు. అందుకు వ్యతిరేకంగా స్థానిక కేబుల్ ఆపరేటర్లు, వినియోగదారులు బలమైన నియంత్రణ పర్యవేక్షణ కోరుతున్నట్లు తెలిపారు. ఈ పరస్పర వాదనల మధ్య సమతుల్యత సాధించడం, పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడంతోపాటు వినియోగదారుల రక్షణను నిర్ధారించడం ట్రాయ్ లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు.కొత్త టారిఫ్ ఆర్డర్పై సమీక్షస్ట్రీమింగ్ సేవలతో పోలిస్తే టీవీ బిల్లులు అధికంగా ఉండడం వల్ల పోటీ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. దాంతో అధికంగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లవైపే వినియోగదారులు మొగ్గు చూపుతున్నారనే వాదనలున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు కొత్త టారిఫ్ ఆర్డర్ను సమగ్రంగా సమీక్షించడానికి ట్రాయ్ ముందస్తు సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకోసం టీవీ బ్రాడ్కాస్టర్లు, ఆపరేటర్ల అభిప్రాయాలు సేకరిస్తోంది. లీనియర్ టీవీ విధానం కఠినమైన ప్రభుత్వ ఆదేశిత ప్రోగ్రామింగ్, అడ్వర్టైజింగ్ కోడ్ల కింద పనిచేస్తుందని, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు స్వీయ నియంత్రణను అనుసరిస్తాయని లహోటి అభిప్రాయపడ్డారు. ఇది న్యాయమైన పోటీపై ఆందోళనలను లేవనెత్తుతుందని చెప్పారు.ఇదీ చదవండి: హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలుడిజిటల్ మీడియాను పర్యవేక్షించే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), వార్తలు, క్యూరేటెడ్ కంటెంట్కు బాధ్యత వహించే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) మధ్య అధికార పరిధిని ట్రాయ్ పరిశీలిస్తోందని లహోటి తెలిపారు. రెండింటి మధ్య స్థిరమైన నియంత్రణ సూత్రాల అవసరాన్ని నొక్కి చెప్పారు. -
హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్జెట్ హజ్ 2025 యాత్రికులకు అంతరాయంలేని ప్రయాణాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా విమాన సర్వీసులు ప్రారంభించినట్లు ప్రకటించింది. గయ, శ్రీనగర్, గౌహతి, కోల్కతాలను సౌదీ అరేబియాతో కలుపుతూ మొదటి దశలో 45 విమానాలను నడపనుంది. మొదటి దశ కార్యకలాపాలు 2025 మే 29 వరకు కొనసాగుతాయని పేర్కొంది.సర్వీసులు ఇలా..గౌహతి నుంచి మెదీనా వరకు మే 3 నుంచి సర్వీసులు ప్రారంభం.శ్రీనగర్ నుంచి మెదీనా వరకు మే 4 నుంచి మొదలు.కోల్కతా నుంచి జెడ్డాకు మే 16న విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి.2025 జూన్ 13 నుంచి జులై 11 వరకు హజ్ యాత్ర కొనసాగనుంది.ఇదీ చదవండి: ‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’యాత్రికుల సామర్థ్యం పెంపుస్పైస్జెట్ సుమారు 15,500 మంది యాత్రికులను తీసుకువెళ్లాలని అంచనా వేసింది. ఇది 2024లో రవాణా చేసిన 13,000 మంది ప్రయాణికులతో పోలిస్తే 18% పెరుగుదలను సూచిస్తుంది. ఈ పెరుగుదల హజ్ కార్యకలాపాల్లో విమానయాన సంస్థ విస్తరిస్తున్న పాత్రను, భారతీయ యాత్రికుల అవసరాలను తీర్చడంలో సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి స్పైస్జెట్ రెండు వైడ్ బాడీ ఎయిర్ బస్ ఏ 340 విమానాలను ఫ్లీట్లో చేర్చింది. ఒక్కొక్కటి 324 మంది ప్రయాణీకులను తీసుకెళ్లగలదు. ఈ విమానాలు శ్రీనగర్, గౌహతి నుంచి మెదీనా వరకు, కోల్కతా నుంచి జెడ్డా వరకు నడుస్తాయి. అదనంగా గయా-మెదీనా మార్గంలో 189 సీట్ల బోయింగ్ 737ను ప్రారంభించనున్నారు. -
పని మనిషికి రూ.83 లక్షల జీతం..
సాధారణంగా ఇళ్లలో పనిచేసే వారంటే చిన్న చూపు చూస్తారు. వారి సంపాదన కూడా చాలా తక్కువగానే ఉంటుంది. కానీ ప్రపంచంలో ఏ వృత్తీ తక్కువ కాదు. ఆ మాటకొస్తే ఐటీ, ఇతర ఉద్యోగాల కంటే పని మనుషులకే ఎక్కువ డిమాండ్. దుబాయ్లో పనిమనుషుల కోసం ఇచ్చిన ఉద్యోగ ప్రకటనే ఇందుకు నిదర్శనం. జీతం ఎంతనుకున్నారు? ఏకంగా నెలకు రూ.7 లక్షలు.దుబాయ్ కు చెందిన ఓ స్టాఫింగ్ ఏజెన్సీ రెండు హౌస్ మేనేజర్ (పని మనిషి) ఉద్యోగాల కోసం ఇచ్చిన నియామక ప్రకటన ఇంటర్నెట్ ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఉద్యోగానికి నెలకు 30,000 ఈఏఈ దిరమ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.7 లక్షలు ఇస్తామని అందులో ప్రకటించారు. దీన్ని సంవత్సరానికి లెక్కేస్తే దాదాపు రూ.83 లక్షలు. భారత్లో చాలా మంది ఐటీ, టెక్, ఫైనాన్స్ నిపుణులకు కూడా ఇంత జీతం లేదు. చెప్పాలంటే ఇది దుబాయ్లో కూడా ఎక్కువ జీతమే. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు ఈ పనిమనిషి కొలువు కోసంతమ ప్రస్తుత ఉద్యోగాలను వదులుకుంటామంటూ జోక్ చేస్తున్నారు.మిడిల్ ఈస్ట్ లోని సంపన్న, రాజకుటుంబాల ఇళ్లలో పనిచేసేందుకు నైపుణ్యమున్న పనివారిని సమకూర్చే రిక్రూట్ మెంట్ ఏజెన్సీ రాయల్ మైసన్ ఇటీవల అబుదాబి, దుబాయ్ లలో వీఐపీ క్లయింట్ల ఇళ్లలో పని చేసేందుకు ఇద్దరు పనిమనుషులు కావాలంటూ ఈ ప్రకటన ఇచ్చింది. "మేము ప్రస్తుతం మా ప్రతిష్ఠాత్మక జట్టులో చేరడానికి నైపుణ్యం, అంకితభావం కలిగిన ఫుల్ టైమ్ హౌస్ మేనేజర్ను వెతుకుతున్నాము. ఈ ఉద్యగానికి నెలకు 30,000 దిరమ్ల ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది" అని రాయల్ మైసన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది.ఎంపికైన అభ్యర్థులు లగ్జరీ ఇళ్లలో రోజువారీ పనులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇతర పనివాళ్లను పర్యవేక్షించడంతోపాటు ఇంటి ఖర్చుల నిర్వహణ బాధ్యతలు కూడా ఉంటాయని జాబ్ లిస్టింగ్ పేర్కొంది. అయితే ఈ పనిమనిషి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి ఇంతకు ముందు లగ్జరీ ఇళ్లలో పనిచేసిన అనుభవం ఉండాలి. -
‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా న్యాయ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) ప్రతిపాదించిన యాంటీట్రస్ట్ పరిష్కారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవి గూగుల్ సెర్చ్కు పూర్తి ప్రతికూలంగా ఉంటున్నాయని తెలిపారు. యూఎస్ డీఓజే ప్రాతిపాదనలు ‘దీర్ఘకాలికంగా అసాధారణమైనవి’గా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రణాళికలు సెర్చ్ ఇంజిన్ నిర్మాణానికి సవాలుగా మారుతాయని పేర్కొన్నారు.సుందర్ లేవనెత్తిన కీలక ఆందోళనలుడీఓజే ప్రతిపాదనలో భాగంగా గూగుల్ తన సెర్చ్ ఇండెక్స్, టెక్నాలజీతో సమకూరిన మార్జినల్ కాస్ట్ను పోటీదారులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇది గూగుల్ పోటీ ప్రయోజనాన్ని నాశనం చేస్తుందని, ఆవిష్కరణలను అణిచివేస్తుందని పిచాయ్ వాదించారు. ప్రభుత్వ ప్రణాళిక దీర్ఘకాలికంగా అసాధారణమైనదని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ గత సంవత్సరం రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు 49 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కంపెనీ టెక్నాలజీ మార్జినల్ కాస్ట్ను పోటీదారులతో పంచుకోవాల్సి వస్తే ఇలాంటి పెట్టుబడులను ఎలా కొనసాగించాలని పిచాయ్ ప్రశ్నించారు.క్రోమ్పై ప్రభావంక్రోమ్ సెక్యూరిటీ, అభివృద్ధిలో గూగుల్ గణనీయమైన పెట్టుబడి పెట్టినట్లు సుందర్ తెలిపారు. క్రోమ్ బ్రౌజర్ను బలవంతంగా విక్రయించాలనేలా డీఓజే పరిశీలిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ ఇంటెలిజెన్స్లో జెమినీ ఏఐని చేర్చడానికి గూగుల్ సంప్రదింపులు జరుపుతోందని, ఇది నాన్ ఎక్స్క్లూజివ్ డీల్స్ వైపు మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: దేశంలో వెపన్స్ తయారీ పెంపుఆగస్టులో తుది తీర్పు2025 ఆగస్టులో ఈమేరకు పరిష్కార మార్గాలపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే యాంటీట్రస్ట్ తీర్పుపై అప్పీల్ చేయాలని యోచిస్తోంది. డేటా సేకరణ, సాంకేతికతలో అన్యాయమైన ప్రయోజనం ద్వారా గూగుల్ సెర్చ్ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని, దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని డీఓజే వాదిస్తుంది. -
దేశంలో వెపన్స్ తయారీ పెంపు
అంతర్జాతీయ అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో దేశాలు తమ డిఫెన్స్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. అందుకు భారీగానే నిదులు గుమ్మరిస్తున్నాయి. కొన్నిదేశాలు స్వయంగా ఆయుధాలు సమకూర్చుకుంటున్నా, అత్యాధునిక వెపన్స్ దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. ఇటీవల ఇండియా-పాక్ మధ్య యుద్ధ భయాలు నెలకొంటున్న నేపథ్యంలో భారత ఆర్మీ ఆయుధ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందాం.దేశీయ ఉత్పత్తిఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ రంగంలో స్వావలంబనపై ప్రభుత్వం ఎప్పటినుంచో దృష్టి సారించింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా పాత ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో ఏకే-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి రష్యాతో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. ఎస్ఐజీ సౌర్ 716 రైఫిల్స్ను అమెరికా నుంచి కొనుగోలు చేస్తుంది. యూఏఈకి చెందిన కారకల్తో క్వార్టర్ బాటిల్ కార్బైన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ తరుణంలో పాక్ ఇండియాతో తలపడి గెలవడం దాదాపు అసాధ్యం.రక్షణ బడ్జెట్భారత్ 2025 సంవత్సరానికిగాను రూ.6.81 లక్షల కోట్ల (80 బిలియన్ డాలర్లు) రక్షణ బడ్జెట్ను కేటాయించింది. ఇండియా అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉంది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 9.8%గా ఉంది. దిగుమతులు తగ్గించుకుంటూ క్రమంగా దేశీయ తయారీను పెంపొందించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇదీ చదవండి: మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లుకీలక సరఫరాదారులుప్రస్తుతానికి దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి పెరిగినప్పటికీ, అధునాతన ఆయుధాల కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ విభాగంలో ప్రధాన సరఫరాదారులుగా ఉన్న దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.రష్యా: చారిత్రాత్మకంగా భారత్కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయినప్పటికీ దాని వాటా 64% నుంచి 45%కి తగ్గింది.ఫ్రాన్స్: భారత్ ఆయుధ దిగుమతుల్లో 29 శాతం వాటాతో రెండో అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది.అమెరికా: డ్రోన్లు, యుద్ధ విమానాలతో సహా భారత్ దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 11% సరఫరా చేస్తుంది. -
రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్ను నిలిపేసిన జోహో
సెమీ కండక్టర్ తయారీలో సంక్లిష్టమైన ఫ్యాబ్రికేషన్ ప్రక్రియలకు సాంకేతిక భాగస్వామిని పొందడంలో ఇబ్బందులు పడుతున్నట్లు జోహో తెలిపింది. ఈ కారణంగా 700 మిలియన్ డాలర్ల(సుమారు రూ.5,830 కోట్లు) చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్గా నిలదొక్కుకోవాలన్న భారత్ ఆకాంక్షలకు ఇలాంటి సంఘటనలు సవాలుగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.టెక్నాలజీ భాగస్వామిని కనుగొనడంలో సవాళ్లుసెమీకండక్టర్ తయారీలోకి ప్రవేశించడానికి, మార్గనిర్దేశం చేయడానికి జోహో వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ఈమేరకు కంపెనీ విస్తృతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ తగిన పార్ట్నర్ను కనుగొనలేకపోయినట్లు సంస్థ తెలిపింది. సెమీకండక్టర్ పరిశ్రమకు అత్యంత ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమని భావిస్తోంది. నమ్మకమైన భాగస్వామి లేకపోవడంతో చిప్ తయారీ ప్రణాళికలను నిలిపివేయాలని నిర్ణయించింది.ముందుగా కర్ణాటకలో సెమీకండక్టర్ ఫెసిలిటీలో 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ.3,332 కోట్లు) పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇది 460 మందికి ఉపాధి సృష్టిస్తుందని, రాష్ట్రంలో మొదటి చిప్ తయారీ ప్రాజెక్టుగా మారుతుందని భావిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం 2024 డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్కు అనుమతులు కూడా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టును నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: బంగారమా..? మాకొద్దు బాబోయ్..!భారత్ లక్ష్యాలపై ప్రభావం..?సెమీకండక్టర్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రపంచ చిప్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించేందుకు భారత్ కృషి చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం బిలియన్ల విలువైన ప్రోత్సాహక పథకాలను ప్రవేశపెట్టింది. కానీ జోహో ఎదుర్కొంటున్న సవాళ్లు దేశీయ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడంలో నిర్మాణాత్మక అడ్డంకులను హైలైట్ చేస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని చిప్ తయారీకి ముందుకువస్తున్న కంపెనీలకు అవి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు చూపేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
వినోద రంగం@ 100 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: వచ్చే పదేళ్లలో దేశీ మీడియా, వినోద పరిశ్రమ మూడు రెట్లు పెరిగి, 100 బిలియన్ డాలర్లకు చేరనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. దీనితో లక్షల కొద్దీ ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇతర రంగాలూ ప్రయోజనాలను పొందుతాయని వేవ్స్ 2025 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతతో కథలను ఆసక్తికరంగా చెప్పే విశిష్ట సామర్థ్యాలు భారత్కి సొంతమని అంబానీ వివరించారు. మనకు సాటిలేదు..ప్రపంచంలో సంక్షోభం, అనిశ్చితి పెరిగిపోతున్న నేపథ్యంలో స్ఫూర్తివంతమైన మన కథలు భవిష్యత్తుపై ఆశాభావం కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. వేల కొద్దీ సంవత్సరాలుగా మన పురాణేతిహాసాలు సౌభ్రాతృత్వం, సాహసం, ప్రకృతిపై ప్రేమను చాటి చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను గెలుచుకున్నాయని అంబానీ వివరించారు. ఈ విషయంలో మరే దేశమూ మనకు సాటిరాదన్నారు. ముక్కలు చెక్కలవుతున్న ప్రపంచాన్ని తిరిగి బాగుచేయడానికి మన కథలను ఆత్మవిశ్వాసంతో మరోసారి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి సంతాపం తెలిపారు. 90 దేశాల నుంచి 10,000 మంది పైగా ప్రతినిధులు వేవ్స్ సదస్సులో పాల్గొంటున్నారు. -
ఆటో.. అటూ ఇటూ!
ముంబై: మార్కెట్లో నెలకొన్న పలు ప్రతికూల సవాళ్ల మధ్య మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) కంపెనీల వాహన అమ్మకాలు ఏప్రిల్లో పెరిగాయి. అయితే టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు తగ్గాయి. ఆసక్తికరంగా, గత నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా, ధీర్ఘకాలం పాటు ద్వితీయ స్థానంలో కొనసాగిన హ్యుందాయ్ మోటార్స్ నాలుగో స్థానానికి దిగివచ్చింది. ⇒ మారుతీ సుజుకీ దేశీయంగా ఏప్రిల్ నెలలో 1,38,074 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్లో అమ్ముడైన 1,37,952 వాహనాలతో పోలిస్తే 1% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 11,519 నుంచి 6,332 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 56,953 నుంచి 61,591 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఏప్రిల్లో కంపెనీ 1,79,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. ⇒ మహీంద్రా అండ్ మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాలు 28% వృద్ధి చెంది 41,000 యూనిట్ల నుంచి 52,330 యూనిట్లకు వచ్చి చేరాయి. మా పోర్ట్ఫోలియో బలాన్ని, కస్టమర్ల ప్రతిపాదనలను అమ్మకాల సంఖ్య తెలియజేస్తుందని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. ⇒ టాటా మోటార్స్ దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు(ఈవీలను కలుపుకొని) క్రితం ఏడాది ఇదే ఏప్రిల్తో పోలిస్తే 47,883 యూనిట్ల నుంచి 45,199 యూనిట్లకు దిగివచ్చాయి. ⇒ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 12% క్షీణించి 44,374 యూనిట్లకు వచ్చి చేరాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 50,021 గా ఉన్నాయి. -
బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
కాదేదీ డోర్ డెలివరీకి అనర్హం అన్నట్లు ఆర్డర్ ఇస్తే చాలు ఇప్పుడు ప్రతీదీ ఇంటి ముంగిటకే వచ్చేస్తోంది. ఈ ఏడాది అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్స్టా మార్ట్ నిత్యావసర సరుకుల మాదిరిగానే బంగారాన్నీ డెలివరీ చేస్తామంటూ ముందుకు వచ్చింది. అయితే డోర్ స్టెప్ గోల్డ్ డెలివరీ కోసం ఆ కంపెనీ చేసిన హై సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వరుస వైరల్ వీడియోలు నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో క్లిప్లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. సెక్యూరిటీ గార్డుతో కలిసి ట్రాఫిక్లో బైక్పై వెళ్తూ కనిపించారు. అందులో సెక్యూరిటీ గార్డు ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో హై సెక్యూరిటీ లాకర్ పట్టుకొని కనిపించాడు. ఈ వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది."ఏమి జరుగుతోంది?" అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రశ్నించగా "రియల్ గోల్డ్ డెలివరీ కర్నే కే లియే రియల్ సెక్యూరిటీ చాహియే బ్రో (రియల్ గోల్డ్ కోసం రియల్ సెక్యూరిటీ కావాలిగా) అని స్విగ్గీ చమత్కారంగా బదులిచ్చింది. ఆన్ లైన్ లో ప్రచారం ఊపందుకోవడంతో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వైరల్ వీడియోలను రీపోస్ట్ చేసింది. దీనికి బంగారమా? నిజంగానా?' అంటూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా దీనికి కూడా ‘డెలివరింగ్ సోనా ఇన్ ఎవరీ కోనా కోనా’(ప్రతి మూలకూ బంగారం డెలివరీ) అంటూ స్విగ్గీ రిప్లయి ఇచ్చింది.కాగా కల్యాణ్ జ్యువెల్లర్స్ నుంచి వివిధ బరువుల బంగారు, వెండి నాణేలను నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్విక్ కామర్స్ సర్వీస్ ద్వారా లభించే నాణేలలో 0.5 గ్రాములు, 1 గ్రాము బంగారు నాణేలు, అలాగే 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల వెండి నాణేలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘అదానీ పవర్’ తగ్గింది!
ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 శాతం నీరసించి రూ. 2,599 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,737 కోట్లు ఆర్జించింది. రూ. 350 కోట్లమేర ఇబిటాపై వన్టైమ్ ఐటమ్ ప్రభావం పడినట్లు కంపెనీ పేర్కొంది.మొత్తం ఆదాయం మాత్రం 5 శాతం వృద్ధితో రూ. 13,787 కోట్ల నుంచి రూ. 14,522 కోట్లకు బలపడింది. విద్యుత్ విక్రయాలు 26.4 బిలియన్ యూనిట్ల(బీయూ)కు చేరాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం భారీగా క్షీణించి రూ. 12,750 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 20,829 కోట్ల లాభం ఆర్జించింది.ఇందుకు ప్రధానంగా వన్టైమ్ ఐటమ్, అధిక పన్ను వ్యయాలు కారణమైనట్లు కంపెనీ తెలియజేసింది. మొత్తం ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 56,473 కోట్లకు చేరింది. ఈ కాలంలో 102.2 బీయూ విద్యుత్ను ఉత్పత్తి చేయగా.. విక్రయాలు 21 శాతం ఎగసి 95.9 బీయూను తాకాయి. ఫలితాల నేపథ్యంలో అదానీ పవర్ షేరు బీఎస్ఈలో 3% క్షీణించి రూ. 532 వద్ద ముగిసింది. నష్టాల బాటలో జేఎస్పీఎల్ప్రయివేట్ రంగ దిగ్గజం జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ని రుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 304 కోట్ల నష్టం నమోదు చేసింది.అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కా లంలో రూ. 933 కోట్ల నికర లాభం ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరు కి రూ. 2 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం సైతం రూ. 15,749 కోట్ల నుంచి రూ. 15,525 కోట్లకు స్వల్పంగా క్షీణించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్పీఎల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 895 వద్ద ముగిసింది. -
లాభాల బ్యాంకులు..
ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం పుంజుకుని రూ. 1,091 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం వృద్ధితో రూ. 2,377 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 33 శాతం జంప్చేసి రూ. 1,006 కోట్లయ్యింది. నికర వడ్డీ మార్జిన్లు 3.21 శాతం నుంచి 3.12 శాతానికి స్వల్పంగా నీరసించాయి.తాజా స్లిప్పేజీలు రూ. 352 కోట్ల నుంచి రూ. 483 కోట్లకు పెరిగాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 1.94 శాతం నుంచి 1.84 శాతానికి దిగిరాగా.. కనీస మూలధన నిష్పత్తి 16 శాతానికి చేరింది. కాగా.. క్యూ4లో స్టాండెలోన్ నికర లాభం రూ. 906 కోట్ల నుంచి రూ. 1,030 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్ఈలో 3.3 శాతం పతనమై రూ. 197 వద్ద ముగిసింది.మరో ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 6 రెట్లు దూసుకెళ్లి రూ. 318 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 55 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 5,890 కోట్ల నుంచి రూ. 6,133 కోట్లకు ఎగసింది.కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం 23 శాతం జంప్చేసి రూ. 2,745 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 21,041 కోట్ల నుంచి రూ. 24,915 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఈ షేరు బీఎస్ఈలో 1.3% నీరసించి రూ. 166 వద్ద ముగిసింది. -
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ .14.50 మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. తగ్గించిన కొత్త ధర మే 1 నుండి అమలులోకి వస్తుంది. మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.రేట్ల తగ్గింపు తరువాత, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ .1,747.50 వద్ద ఉంది. ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో సవరించిన ధరలు ముంబైలో రూ .1,699, కోల్కతాలో రూ .1,851.50, చెన్నైలో రూ .1,906, హైదరాబాద్లో 1,969 వద్ద ఉన్నాయి. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు వంటి కారకాల వల్ల ఎల్పీజీ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్, వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున సర్దుబాటు చేస్తుంటారు. ఈ మార్పు వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో డొమెస్టిక్ సిలిండర్లపై రూ.50 పెరిగింది. రోజువారీ కార్యకలాపాల కోసం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు ఈ తగ్గింపు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. -
వేదాంతా లాభం హైజంప్
డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 154 శాతం దూసుకెళ్లి రూ. 3,483 కోట్లను తాకింది. ఉత్పత్తి వ్యయాలు తగ్గడం, అమ్మకాల పరిమాణం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,369 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ. 36,093 కోట్ల నుంచి రూ. 41,216 కోట్లకు జంప్ చేసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వేదాంతా నికర లాభం భారీ వృద్ధితో రూ. 14,988 కోట్లకు చేరింది. 2023–24లో కేవలం రూ. 4,239 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,46,988 కోట్ల నుంచి రూ. 1,56,643 కోట్లకు ఎగసింది.2025 మార్చి 31 కల్లా స్థూల రుణ భారం రూ. 73,853 కోట్లుగా నమోదైంది. మరోసారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అరుణ్ మిశ్రాను బోర్డు ఎంపిక చేసినట్లు వేదాంతా పేర్కొంది. వివిధ బిజినెస్లను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలను సెప్టెంబర్ చివరికల్లా పూర్తిచేయనున్నట్లు వేదాంతా సీఎఫ్వో అజయ్ గోయెల్ తాజాగా వెల్లడించారు. -
ఒక అరటి పండు ధర రూ.565!
ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ సర్వీసులు తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతున్నాయి. ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లలో వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఈమేరకు వాటి ధరలను హైలైట్ చేస్తూ ప్రయాణికులు సోషల్ మీడియాలో వివరాలు షేర్ చేస్తున్నారు.ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో ఒక్క అరటిపండు ధర రూపాయిల్లో రూ.565, ఒక బీరు రూ.1,697, ఫుల్ మీల్స్ భోజనంకు రూ.2,000 తీసుకుంటున్నారు. ఈ రేట్లు గమనించిన ప్రయాణికులు ఇస్తాంబుల్ విమానాశ్రయాన్ని ‘ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎయిర్పోర్ట్’గా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా సరసమైన భోజనానికి ప్రసిద్ధి చెందిన మెక్ డొనాల్డ్స్, బర్గర్ కింగ్.. వంటి ఫాస్ట్ ఫుడ్ స్టోర్స్లో కూడా ప్రీమియం ధరలు ఉన్నాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: పూర్తి కోడింగ్ పనంతా ఏఐదే!ఇస్తాంబుల్ విమానాశ్రయం రోజూ 2,20,000 మందికిపైగా ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ల్లో ఒకటిగా ఉంది. అక్కడ ఆకట్టుకునే మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నప్పటికీ ఆహార ధరలు చాలా మందికి మింగుడుపడడం లేదు. భోజన ధరలు సాపేక్షంగా సహేతుకంగా ఉన్న ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాలతో పోలిస్తే ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో ఛార్జీలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు భావిస్తున్నారు. -
డ్రైవర్ జీతం నెలకు రూ.4 లక్షలు..! అంబానీయా.. మజాకా..
సాధారణంగా కారు డ్రైవర్ జీతం నెలకు రూ.వేలల్లో ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే దేశంలోని అత్యంత సంపన్నుడిగా పేరొందిన ముఖేశ్ అంబానీ కారు డ్రైవర్ వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. నెలకు సుమారు రూ.2 లక్షలు-రూ.4 లక్షలు! ఇంతకీ ఓ కారు డ్రైవర్కు ఎందుకు ఇంత ప్యాకేజీ ఇస్తున్నారో తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే కింది వివరాలు చదవాల్సిందే.ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనేపథ్యంలో ఆయనకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఉదయం తాను లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు పక్కా ప్రణాళికతో భద్రత సిబ్బంది వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో ఆయన ఒక చోట నుంచి మరో చోటుకు కారులో ప్రయాణిస్తున్న సమయంలో భద్రతలోనూ రాజీ పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్రైవింగ్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకుంటారు.అంబానీ కారు డ్రైవర్ను సాధారణ డ్రైవర్ మాదిరిగా కాకుండా నేరుగా నియమించలేరు. ప్రత్యేకంగా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. ఈ ఏజెన్సీలు ఎంపిక చేసే డ్రైవర్లు కేవలం వాహనం నడిపేందుకే కాదు.. వెపన్ ట్రెయినింగ్లోనూ శిక్షణ పొందుతారు. బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ వాహనాలను నడిపిందుకు కఠినమైన ట్రయినింగ్ తీసుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వాహనాన్ని సజావుగా, సురక్షితంగా నడిపగలరు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునే విన్యాసాలు, భద్రతా బెదిరింపులకు వెంటనే ప్రతిస్పందించేలా వీరికి శిక్షణ ఉంటుంది.ఇదీ చదవండి: టారిఫ్ల ఎఫెక్ట్.. టాప్ కార్ల తయారీ కంపెనీ ఔట్!అంబానీ కార్లు తన అభిరుచులకు తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి. సాధారణ కార్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి సాయుధ వాహనాలు. ఇందుకు ప్రత్యేక డ్రైవింగ్ నైపుణ్యాలు అవసరం అవుతాయి. దాంతోపాటు కేవలం రద్దీ రోడ్లపై వాహనం నడపడమేకాదు, ఈ డ్రైవర్లు అధిక ఒత్తిడి పరిస్థితులకు సిద్ధంగా ఉంటారు. సాధారణ డ్రైవర్ల మాదిరిగా కాకుండా వీరు రహస్య షెడ్యూల్స్, వీఐపీ ప్రోటోకాల్స్కు లోబడి పని చేయాల్సి ఉంటుంది. అందుకే వీరికి అధిక వేతనం ఇస్తున్నారు. -
చిన్న వాటికి చిన్నవి..
స్వీడిష్ హోమ్ ఫర్నీషింగ్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా భారత్లో తన కార్యకలాపాల విస్తరణకు సంబంధించి కొత్త వ్యూహాలను పరిశీలిస్తోంది. బడా నగరాల్లో పెద్ద స్టోర్స్కే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు అనువుగా చిన్న ఫార్మాట్ స్టోర్స్ను కూడా ఏర్పాటు చేయడం ద్వారా కొనుగోలుదారులకు చేరువ కావాలని భావిస్తోంది. సుమారు 10,000 చ.అ. విస్తీర్ణంలో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఐకియా ఇండియా కంట్రీ ఎక్స్పాన్షన్ మేనేజర్ పూజా గ్రోవర్ తెలిపారు.మాల్స్లోనూ స్టోర్స్ను ఏర్పాటు చేసేందుకు, వేగంగా విస్తరించేందుకు కూడా ఈ ఫార్మాట్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు గ్రోవర్ వివరించారు. ఈ కొత్త కాన్సెప్టు విషయంలో రియల్ ఎస్టేట్ డెవలపర్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చిన్న స్టోర్స్లో పరిమిత స్థాయిలోనే ఉత్పత్తులను డిస్ప్లే చేసినా మొత్తం 7,000 ప్రోడక్టుల విస్తృత శ్రేణి నుంచి ఎంచుకునేందుకు డిజిటల్ కేటలాగ్, హోమ్ డెలివరీ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని గ్రోవర్ చెప్పారు.ఇదీ చదవండి: వెండింగ్ మెషిన్ల ద్వారా బంగారం, వెండి కొనుగోలుప్రస్తుతం హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై వంటి ఆరు ప్రాధాన్య నగరాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వివరించారు. పదేళ్ల వ్యవధిలో రూ.10,500 కోట్ల పెట్టుబడులతో 10 స్టోర్స్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనతో 2013లో ఐకియా భారత్కి వచ్చింది. -
ఇండస్ఇండ్లో ఎగ్జిక్యూటివ్ల కమిటీ ఏర్పాటు
డెరివేటివ్స్ అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో సీఈవో సుమంత్ కథ్పాలియా రాజీనామాతో కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఎగ్జిక్యూటివ్ల కమిటీని బోర్డు నియమించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ వెల్లడించింది. కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలు చేపట్టే వరకు లేదా మూడు నెలల వరకు ఈ కమిటీ ఉంటుందని పేర్కొంది. దీనికి బోర్డ్ చైర్మన్ సారథ్యం వహిస్తారు. ఆడిట్ కమిటీ, కాంపన్సేషన్, నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ, రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ నుంచి సభ్యులు ఉంటారు. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో లెక్కింపులో తప్పుడు అకౌంటింగ్ విధానం కారణంగా బ్యాంకుపై సుమారు రూ. 1,960 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందనే అంచనాల నడుమ, నైతిక బాధ్యత వహిస్తూ సీఈవో మంగళవారం నాడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఏం జరిగిందంటే..డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్ఇండ్ బ్యాంక్ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్ ట్రేడ్లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.ఇదీ చదవండి: సమస్యలు విని.. పరిష్కారాలు చెబుతోంది!ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడింగ్ను బ్యాంక్ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్బీఐ ఆడిట్లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి. -
హైదరాబాద్లో ప్రపంచస్థాయి బిస్కెట్ ఫ్యాక్టరీ
ప్రముఖ వ్యాపార సమ్మేళనం లోహియా గ్రూప్ హైదరాబాద్ శివారు మేడ్చల్ లో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇందుకోసం వచ్చే నాలుగేళ్లలో రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు, 6,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఏడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త హైస్పీడ్ ఆటోమేటెడ్ ఫెసిలిటీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 1,000 టన్నులు కాగా దీన్ని 5,000 టన్నులకు పెంచుకునే వీలుందని సంస్థ వెల్లడించింది. బిస్కెట్ల ఉత్పత్తికి కావాల్సిన పిండి, చక్కెర, బెల్లం, తేనె, పాల ఉత్పత్తులు, ఇతర సహజ పదార్ధాలను స్థానికంగా సేకరించనున్నారు. ఉత్పాదక రంగంలో మహిళల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన 'ఉమెన్ ఫస్ట్ ఎంప్లాయిమెంట్ డ్రైవ్'కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం 40 శాతానికి పైగా సిబ్బంది మహిళలేనని కంపెనీ తెలిపింది.బిస్కెట్ల తయారీ ప్రక్రియ వెనుక అధిక నాణ్యత పదార్థాలు, సంక్లిష్టమైన డిజైన్లు, అధునాతన బయోటెక్నాలజీ ఉన్నాయని లోహియా కన్ఫెక్షనరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీషా లోహియా లహోటి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ లలో కార్యకలాపాలను ఏర్పాటు చేసిన ఈ సంస్థ త్వరంలో ఎగుమతులను ప్రారంభించాలని యోచిస్తోంది. -
హైదరాబాద్లో భారీ బ్యాటరీ పరిశ్రమ
హైదరాబాద్: సిగ్ని ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నగరంలో భారీ బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని ఈ-మొబిలిటీ వ్యాలీలో తన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) గిగాఫ్యాక్టరీ మొదటి దశను ప్రారంభించి భారతదేశ క్లీన్ ఎనర్జీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.ఇది దేశంలోనే మొదటి లీడ్ (LEED - లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్) అర్హత పొందిన అత్యాధునిక ఫ్యాక్టరీ. 1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పూర్తి ఆటోమేటెడ్ ఫ్యాక్టరీని రూ.100 కోట్ల పెట్టుబడితో స్థాపించారు. గ్రిడ్-స్కేల్ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం 4.8 గిగావాట్-అవర్ల (GWh) బ్యాటరీ ప్యాక్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ఫ్యాక్టరీకి ఉంది.తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ కర్మాగారం క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ప్రశంసించారు. ఇక ఫ్యాక్టరీ రెండవ దశ ఎలా ఉండనుందో సిగ్ని ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ వెంకట్ రాజారామన్ వెల్లడించారు. రెండో దశలో మరో రూ.150 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని 10.8 GWhకు విస్తరించనున్నట్లు చెప్పారు. 24 నెలల్లో పూర్తయ్యే ఈ విస్తరణ 1,000 పైగా ఉద్యోగాలను సృష్టించి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుందని వివరించారు.ఈ గిగాఫ్యాక్టరీ మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ట్విన్ మోడలింగ్, స్మార్ట్-గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగించి బ్యాటరీ పనితీరు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. సిగ్ని, ఐఐటీ-మద్రాస్తో భాగస్వామ్యం ద్వారా సోడియం-అయాన్ బ్యాటరీలు, సూపర్కెపాసిటర్ల వంటి తదుపరి తరం బ్యాటరీ పదార్థాలను అభివృద్ధి చేస్తోంది. ఇవి శక్తి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అరుదైన పదార్థాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. 1 GWh ఆర్డర్ పైప్లైన్తో, సిగ్ని ఎనర్జీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. -
ఆ టికెట్తో ఇక రైలు ఎక్కలేరు! మే 1 నుంచి కొత్త రూలు..
దేశంలో కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేసే కొత్త రూల్ను భారతీయ రైల్వే ప్రవేశపెడుతోంది. రైళ్లలో ప్రయాణ సౌకర్యాన్ని పెంచడం, రిజర్వ్డ్ కోచ్లలో రద్దీని నివారించడం లక్ష్యంగా ఇండియన్ రైల్వే మే 1 నుండి కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ నిబంధన ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులను ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతించరు.వీరిపైనే ప్రభావంరైల్వే అమలు చేస్తున్న ఈ కొత్త మార్గదర్శకాలు ముఖ్యంగా రైల్వే కౌంటర్ల నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకునే వారిపై ప్రభావం చూపనున్నాయి. ఐఆర్సీటీసీ, ఇతర అధీకృత వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్ అవి రద్దవుతాయి. ఆఫ్లైన్లో రైల్వే కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ప్రయాణికులు వాటితో రైలు ఎక్కే అవకాశం ఉండేది. అలా ఎక్కిన ప్రయాణికులు ఎక్కడైనా ఖాళీ ఉంటే టీటీఈ ద్వారా వాటిని పొందే వీలు ఉండేది. అయితే ఇలా ఎక్కువ మంది స్లీపర్ లేదా ఏసీ బోగీల్లోకి ప్రవేశించి అన్ రిజర్వ్ డ్ సీట్లను ఆక్రమించుకోవడం లేదా ఆయా కోచ్లలో రద్దీకి కారణమవుతున్నారు.టీటీఈలకు అధికారాలుకొత్త ఆదేశాల ప్రకారం.. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్లకు (టీటీఈ) భారతీయ రైల్వే కొన్ని అధికారాలు ఇచ్చింది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో రిజర్వ్డ్ స్లీపర్ లేదా ఏసీ సీట్లను ఆక్రమించుకున్న ప్రయాణికులకు జరిమానా విధించవచ్చు. అలాగే అటువంటి ప్రయాణికులను అన్రిజర్వ్డ్ టికెట్ హోల్డర్లు ప్రయాణించే జనరల్ కోచ్కు పంపించే అధికారం టీటీఈలకు ఉంటుంది.ఈ నిబంధన ఎందుకంటే..ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిబంధనను అమలు చేస్తున్నామని నార్త్ వెస్ట్రన్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ శశికిరణ్ వివరించారు. వెయిటింగ్ టికెట్ హోల్డర్లు కోచ్లలోకి ప్రవేశించి రిజర్వ్డ్ సీట్లను బలవంతంగా ఆక్రమించుకుంటున్నారని, ప్రయాణికులు తిరిగేందుకు కూడా వీలులేకుండా మార్గాలను స్తంభింపజేస్తున్నారని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కొత్త నిబంధనతో రైళ్లలో ఎక్కేందుకు వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆధారపడే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాల్సి ఉంటుంది. ఇకపై స్లీపర్, ఏసీ బోగీల్లో ప్రయాణించాలంటే కన్ఫర్మ్ టికెట్ తప్పనిసరి. లేదంటే మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవడమో లేదా జనరల్ అన్ రిజర్వ్డ్ క్లాస్ లో ట్రావెల్ చేయడమో చేయాల్సి ఉంటుంది. -
భారత్లో ఫాక్స్కాన్ ఆదాయం రూ.1.7 లక్షల కోట్లు
తైవాన్కి చెందిన ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ భారత విభాగం ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపై 20 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.7 లక్షల కోట్లు) చేరినట్లు సమాచారం. ఐఫోన్ విక్రయాలు గణనీయంగా పెరగడం ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, ఉద్యోగుల సంఖ్య కూడా 65 శాతం పెరిగి సుమారు 80,000కు చేరినట్లు పరిశ్రమ, ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.చైనాపై టారిఫ్ల కారణంగా అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్లన్నింటినీ భారత్లోనే తయారు చేయించుకోవాలని యాపిల్ భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫాక్స్కాన్ ఆదాయం అనేక రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఐఫోన్లను అత్యధికంగా తయారు చేసే ఫాక్స్కాన్, చైనాకు వెలుపల రెండో అతి పెద్ద ప్లాంటును బెంగళూరులో సుమారు రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది.ఇండియాలో తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఫాక్స్కాన్ ప్రధాన కేంద్రం ఉంది. ఇక్కడ ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్వహిస్తుంది. ఈ ప్లాంట్ 2017లో ఐఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. 2023లో ఐఫోన్ 15ను అసెంబుల్ చేసింది. ఇది తాజా ఐఫోన్ మోడళ్లలో భారతదేశం భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. 2025 చివరి నాటికి ఐప్యాడ్ అసెంబ్లింగ్ ప్రారంభించాలని యోచిస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా చెన్నై సమీపంలో స్మార్ట్ఫోన్ డిస్ప్లే మాడ్యూల్ అసెంబ్లింగ్ యూనిట్లో కంపెనీ పెట్టుబడులు పెట్టింది.ఇదీ చదవండి: మళ్లీ ఐపీవోల సందడి..!బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఫాక్స్కాన్ 2.5 బిలియన్ డాలర్ల విలువైన ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ ఐఫోన్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. ఏటా 20 మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయడంతో పాటు 40,000 ఉద్యోగాలను సృష్టించనుంది. -
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ స్వతంత్ర దర్యాప్తులో తేలిందని అదానీ గ్రీన్ వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం భారత్లో ప్రభుత్వ వర్గాలకు లంచాలిచ్చారని, అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే క్రమంలో ఆ విషయాన్ని దాచిపెట్టారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, ఎండీ వినీత్ జైన్లపై అమెరికాలో అభియోగాలు మోపారు. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది. స్వతంత్ర దర్యాప్తులో అవకతవకలు జరగలేదని వెల్లడైనట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. -
హైదరాబాద్లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ అవసరాల కోసం హైదరాబాద్లో లీన్ తయారీ ప్లాంటును ప్రారంభించినట్లు ప్రెసిషన్ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ఈ ప్లాంటు లో 180 మంది సుశిక్షితులైన ప్రొఫెషనల్స్ ఉండగా, రాబోయే రోజుల్లో వందల సంఖ్యలో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ రాకేష్ చోప్దార్ వివరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 1,00,000 బ్లేడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్..గ్యాస్ తదితర రంగాల సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇలాంటి వ్యూహాలు తోడ్పడగలవని రాకేష్ తెలిపారు. -
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం ఎగసి రూ. 3,940 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,402 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,764 కోట్ల నుంచి రూ. 15,808 కోట్లకు జంప్ చేసింది.స్టాండెలోన్ ఫలితాలివి. వడ్డీ ఆదాయం రూ. 11,201 కోట్ల నుంచి రూ. 13,824 కోట్లకు బలపడింది. కాగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 19 శాతం వృద్ధితో రూ. 4,546 కోట్లకు చేరింది. నిర్వహణలోని మొత్తం ఆస్తులు(ఏయూఎం) 26 శాతం ఎగసి రూ. 4,16,661 కోట్లయ్యాయి. 2025 మార్చి31కల్లా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 0.96 శాతం, నికర ఎన్పీఏలు 0.44 శాతంగా నమోదయ్యాయి. అందుబాటులోకి షేరు బజాజ్ ఫైనాన్స్ వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 44 డివిడెండ్ చెల్లించనుంది. రూ. 2 ముఖ విలువగల ప్రతీ షేరుని రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించనుంది. అంతేకాకుండా 4:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 1 షేరుకి 4 షేర్లు ఉచితంగా జారీ చేయనుంది. ఈ ప్రతిపాదనలను తాజాగా బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గతంలో నమోదు చేసిన రూ. 249 కోట్ల పన్ను వ్యయాలను రివర్స్ చేసింది. దీంతో పూర్తి ఏడాదిలో పన్ను ప్రొవిజన్ రూ. 99 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. వెరసి క్యూ4లో రూ. 348 కోట్ల పన్ను తగ్గినట్లు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 9,089 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
న్యూఢిల్లీ: అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా మంగళవారం రాజీనామా చేశారు. అంతకన్నా ముందే సోమవారం నాడు డిప్యుటీ సీఈవో అరుణ్ ఖురానా తప్పుకోగా, ఈ ఉదంతం బైటపడటానికి ముందే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) గోవింద్ జైన్ వైదొలిగారు. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోలో దాదాపు రూ. 1,960 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కథ్పాలియా రాజీనామా ఏప్రిల్ 29న పని గంటలు ముగిసిన తర్వాత నుంచి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది.తన దృష్టికి వచ్చిన అంశాల విషయంలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథ్పాలియా వివరించారు. శాశ్వత ప్రాతిపదికన కొత్త సీఈవోను నియమించే వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎగ్జిక్యూటివ్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అనుమతించాల్సిందిగా ఆర్బీఐని ఇండస్ఇండ్ బ్యాంక్ కోరింది. డెరివేటివ్స్ లావాదేవీల అకౌంటింగ్ విధానాల్లో తేడాల వల్ల 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర విలువపై రూ. 1,979 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందంటూ బైటి ఏజెన్సీ నివేదిక ఇచ్చినట్లు బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. దీని వల్ల 2024–25లో బ్యాంకు నికర లాభాలు భారీగా క్షీణించవచ్చని లేదా నష్టాలను ప్రకటించవచ్చని అంచనాలు నెలకొన్నాయి. క్యూ4 ఫలితాలను ఎప్పుడు ప్రకటించేది బ్యాంకు ఇంకా వెల్లడించలేదు. ఏం జరిగిందంటే.. డెరివేటివ్స్ పోర్ట్ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్ఇండ్ బ్యాంక్ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్ ట్రేడ్లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడింగ్ను బ్యాంక్ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్ పోర్ట్ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్బీఐ ఆడిట్లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి. షేరు క్రాష్..!ఈ క్రమంలోనే ఇండస్ఇండ్ బ్యాంకు షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ. 1,576 నుంచి ఒక దశలో సుమారు యాభై శాతం పైగా పతనమైంది. ప్రస్తుతం రూ. 837 వద్ద ట్రేడవుతోంది. అయితే, తాజా వరుస రాజీనామాల పరిణామాలతో బుధవారం బ్యాంకు షేర్లు గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో మూడు రెట్ల వృద్ధి: టాటా ఏఐజీ
హైదరాబాద్: గత ఏడాది వ్యవధిలో 82,000 పైచిలుకు పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్వ్యాప్తంగా తమ రిటైల్ హెల్త్ పోర్ట్ఫోలియోలో మూడు రెట్లు వృద్ధి సాధించినట్లు భారత్లో అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 'టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్' వెల్లడించింది. జాతీయ సగటు కన్నా ఆరోగ్య బీమా విస్తృతి తక్కువగా ఉంటున్న దక్షిణాది మార్కెట్లలో విశ్వసనీయమైన బీమా సాధనాలకు పెరుగుతున్న డిమాండ్కి ఈ వృద్ధి నిదర్శనంగా నిలుస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 51 జిల్లాల్లో కంపెనీ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరులో కీలక శాఖలను ఏర్పాటు చేసింది. టాటా ఏఐజీ నెట్వర్క్, 1,600 పైగా ఆసుపత్రులు, 14,500 అడ్వైజర్లతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, జీవనోపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది.వైద్య బీమా సేవల లభ్యతను మరింతగా పెంచే దిశగా కంపెనీ కొత్తగా మెడికేర్ సెలెక్ట్ పేరిట, మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండే సరళతరమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ స్థాయిలో సగటున వైద్యచికిత్సల ద్రవ్యోల్బణం 13 శాతం స్థాయిలో ఉండగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో 16 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ పెను సవాలును అధిగమించేందుకు, కస్టమర్లకు కీలక పరిష్కారాన్ని అందించేందుకు ఈ సాధనం తోడ్పడగలదు.నవజాత శిశువుల నుంచి సీనియర్ల వరకు, ఎటువంటి వయోపరిమితి లేకుండా అన్ని వర్గాల కస్టమర్లకు అనువైనదిగా, అందుబాటు ప్రీమియంలతో ఉండేలా మెడికేర్ సెలెక్ట్ రూపొందించబడింది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకోతగిన విధంగా ఇది ఉంటుంది. జీవితకాల యంగ్ ఫ్యామిలీ డిస్కౌంట్, 7.5% శాలరీ డిస్కౌంట్లాంటి ఉపయుక్తమైన ఫీచర్ల కారణంగా అన్ని రకాల ఆదాయవర్గాల వారు, జీవితంలో వివిధ దశల్లో ఉన్న వారికి ఇది అనువైనదిగా ఉంటుంది.గడిచిన మూడేళ్లుగా.. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే ఉదంతాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఖర్చులు 25 శాతం పెరగ్గా, సగటు ట్రీట్మెంట్ వ్యయాలు రూ. 1.6 లక్షలకు చేరాయి. కరోనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ) చికిత్స వ్యయాలు 40% పెరిగాయి. సగటు ఖర్చులు కూడా రూ. 1.6 లక్షలకు చేరాయి. 2025లో టాటా ఏఐజీ ఒక కార్డియోవాస్కులర్ కండీషన్ (CAD with STEMI) కేసుకి సంబంధించి హైదరాబాద్లో అత్యధికంగా రూ. 1 కోటి హెల్త్ క్లెయిమ్ చెల్లించింది. తీవ్రమైన కిడ్నీ డిసీజ్ (సీకేడీ) చికిత్స ఖర్చులు 38% పెరిగాయి. ఇవన్నీ కూడా అత్యవసరంగా అందుబాటు ప్రీమియంలతో హెల్త్కేర్ లభ్యత ఆవశ్యకతను సూచిస్తున్నాయి. -
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
భారతీయులు అలంకార ప్రియులు. కాబట్టి చాలామంది ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాలలో కూడా ఎక్కువగా బంగారమే ఉంటుంది. ఇప్పుడు (2025లో) గోల్డ్ అంటే.. కొనడానికి కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకప్పుడు (1925లో) తులం పసిడి రేటు రూ. 18.75 ఉండేదంటే బహుశా కొందరు నమ్మక పోవచ్చు. నమ్మకపోయినా అదే నిజం. ఈ కథనంలో శతాబ్దానికి ముందు ఇండియాలో గోల్డ్ రేటు ఎలా ఉండేదో తెలుసుకుందాం.▸1925: రూ. 18.75▸1935: రూ. 30.81▸1945: రూ. 62.00▸1955: రూ. 79.00▸1965: రూ. 72.00▸1975: రూ. 540.00▸1985: రూ. 2130.00▸1995: రూ. 4680.00▸2005: రూ. 7000.00▸2015: రూ. 26845.00▸2016: రూ. 29560.00▸2017: రూ. 29920.00▸2018: రూ. 31730.00▸2019: రూ. 36080.00▸2020: రూ. 48480.00▸2021: రూ. 50000.00▸2022: రూ. 53000.00▸2023: రూ. 60000.00▸2024: రూ. 80000.00▸2025: రూ. 97970.001925లో 10 గ్రాముల రూ.18.75 వద్ద ఉండేది. అయితే ఈ రోజు గోల్డ్ రేటు రూ. 97,970 వద్దకు చేరింది. అంటే వందేళ్లలో బంగారం ధర 97951.25 రూపాయలు పెరిగింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువవ్వడం, నిల్వలు తక్కువ కావడం. భౌగోళిక, రాజకీయ కారణాలు. బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి పెరగడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దీంతో పసిడి ధర సుమారు లక్ష రూపాయలకు చేరింది.ఇదీ చదవండి: భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే? -
తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్ సీఈవో
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జాతీయ తయారీ కార్యక్రమం రూపురేఖలను ఖరారు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఓ అంతర్ మంత్రిత్వ కమిటీని నియమించింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం చైర్మన్గా ఏర్పాటైన ఈ కమిటీ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.భారత్లో తయారీని మరింత ప్రోత్సహించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దీన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చింది. వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గించడం, భవిష్యత్కు అనుగుణమైన ఉద్యోగులను సిద్ధం చేయడం, ఎంఎస్ఎంఈని బలోపేతం చేయడం, టెక్నాలజీ లభ్యత, నాణ్యమైన ఉత్పత్తులు.. అనే ఐదు అంశాలపై ఈ కమిటీని కీలక సిఫారసులు చేయనుంది. -
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల గురించి తెలుసుకునే చాలామంది.. మొదట సెర్చ్ చేసే విషయం జీతమే. ఎందుకంటే వారి వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా 2024లో సుందర్ పిచాయ్ జీతానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్ వేతనం 2024లో 10.73 మిలియన్ డాలర్లు (రూ. 91.4 కోట్లు). ఇందులో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, ఇతర పరిహారాల రూపంలో అందింది. కాగా ఈయన బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు (రూ. 17.04 కోట్లు). సాధారణ ఉద్యోగి జీతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2023లో పిచాయ్ వేతనం 8.8 మిలియన్ డాలర్లు మాత్రమే.జీతం విషయం పక్కన పెడితే.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఆల్ఫాబెట్ కంపెనీ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లను (రూ. 70.45 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది సంస్థ భద్రత కోసం చేసిన ఖర్చు 6.78 మిలియన్ డాలర్లు. అంటే సెక్యూరిటీ కోసం.. కంపెనీ అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ ఖర్చు చేసింది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..కంపెనీ అందించే భద్రతా ప్యాకేజీలో.. ఇంటి నిఘా, ప్రయాణ రక్షణ, వ్యక్తిగత డ్రైవర్లు వంటివన్నీ ఉంటాయి. అయితే దీనిని సంస్థ సుందర్ పిచాయ్ వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా.. ఉద్యోగ భద్రతలో భాగంగానే భావిస్తుంది. నిజానికి, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం సగటు ఉద్యోగి జీతం కంటే దాదాపు 32 రెట్లు ఎక్కువ. -
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస తొలగింపులు చేపడుతూనే ఉంది. తాజాగా మరో 195 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాదిలోనే ట్రైనీలను తొలగించడం వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం.ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్లో విఫలమైన కారణంగా 195 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. వీరందరికీ కంపెనీ ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సంస్థ సుమారు 800 మంది ట్రైనీలను తొలగించింది.భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఏప్రిల్ 18న దాదాపు 240 మందిని తొలగించగా, అంతకు ముందు ఫిబ్రవరిలో 300 మందికి పైగా ట్రైనీలను, మార్చిలో 30 నుంచి 35 మందిని తొలగించింది. తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్గ్రేషియాతో పాటు రిలీవింగ్ లెటర్ను కూడా సంస్థ అందిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీ తొలంగించిన ట్రైనీలందరినీ.. 2022లో నియమించుకుంది.ఇదీ చదవండి: అద్దె అపార్ట్మెంట్లోనే విక్కీ కౌశల్: వామ్మో రెంట్ మరీ ఇంతనా.. -
ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..
గృహ రుణ రంగ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 25 శాతం జంప్చేసి రూ. 550 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.439 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.1,814 కోట్ల నుంచి రూ. 2,037 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ.5 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. వడ్డీ ఆదాయం రూ.1,693 కోట్ల నుంచి రూ. 1,906 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ.734 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.65 శాతంనుంచి 3.75 శాతానికి మెరుగయ్యాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) ఫ్లాట్గా 1.08 శాతంవద్ద నిలవగా.. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 13 శాతం వృద్ధితో రూ.80,397 కోట్లకు చేరాయి. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 28 శాతం జంప్చేసి రూ.1,936 కోట్లయ్యింది. 2023–24లో రూ. 1,508 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,024 కోట్ల నుంచి రూ. 7,661 కోట్లకు ఎగసింది.యుకో బ్యాంక్ లాభం జూమ్పీఎస్యూ సంస్థ యుకో బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24 శాతం జంప్చేసి రూ. 666 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 538 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,984 కోట్ల నుంచి రూ. 8,136 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం రూ. 1,671 కోట్ల నుంచి రూ. 2,468 కోట్లకు జంప్చేసింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 3.46 శాతం నుంచి 2.69 శాతానికి దిగిరాగా.. నికర ఎన్పీఏలు 0.89 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గాయి. క్యూ4లో ప్రభుత్వ వాటా 95.39 శాతం నుంచి 90.95 శాతానికి క్షీణించింది.ఐడీబీఐ బ్యాంక్ లాభం అప్పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 26 శాతం జంప్చేసి రూ. 2,051 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,628 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,887 కోట్ల నుంచి రూ. 9,035 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 6,979 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు షేరుకి రూ. 2.1 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం జంప్చేసి రూ. 7,515 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 5,634 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 30,037 కోట్ల నుంచి రూ. 33,826 కోట్లకు ఎగసింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 4.53 శాతం నుంచి 2.98 శాతానికి దిగిరాగా.. నికర ఎన్పీఏలు 0.34 శాతం నుంచి 0.15 శాతానికి తగ్గాయి. ఐఆర్ఎఫ్సీ లాభం నేలచూపుక్యూ4లో రూ. 1,667 కోట్లు రూ. 60,000 కోట్ల సమీకరణకు సైరైల్వే రంగ ఫైనాన్స్ కంపెనీ ఐఆర్ఎఫ్సీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో ప్రభుత్వ రంగ సంస్థ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 1,667 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,717 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,478 కోట్ల నుంచి రూ. 6,723 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 4,761 కోట్ల నుంచి రూ. 5,042 కోట్లకు పెరిగాయి. కాగా.. దేశ, విదేశీ మార్కెట్ల నుంచి రూ. 60,000 కోట్లవరకూ పెట్టుబడులు సమీకరించేందుకు బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు వీలుగా ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా పబ్లిక్ ఇష్యూ ద్వారా పన్నురహిత బాండ్లు, సాధారణ బాండ్లు జారీ చేయనుంది. వీటిలో క్యాపిటల్ గెయిన్ బాండ్లు, ప్రభుత్వ హామీగల బాండ్లు తదితరాలున్నట్లు కంపెనీ పేర్కొంది. వివిధ మార్గాలలో చౌకగా పెట్టుబడులను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే పేర్కొన్నారు. -
వ్యాపార ‘పద్మా’లు..
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జైడస్ లైఫ్సైన్సెస్ ఛైర్మన్ పంకజ్ పటేల్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, పారిశ్రామికవేత్త పవన్ కుమార్ గోయెంకా ఉన్నారు. సుజుకీ మోటర్ మాజీ చీఫ్, దివంగత ఒసాము సుజుకీకి (మరణానంతరం) ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అందుకున్నారు.పంకజ్ పటేల్పంకజ్ పటేల్ దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన జైడస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్. 1953 మార్చి 16న గుజరాత్లో జన్మించిన ఆయన హెల్త్ కేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జైడస్ అధిక కొలెస్ట్రాల్ కలిగిన మధుమేహ వ్యాధిగ్రస్తులకు తొలి భారతీయ ఔషధం లిపాగ్లిన్, దేశంలో మొట్టమొదటి హెచ్ 1 ఎన్ 1 వ్యాక్సిన్ వాక్సిఫ్లూ-ఎస్ వంటి ఉత్పత్తులను అభివృద్ధి చేసింది.అరుంధతీ భట్టాచార్యప్రముఖ భారతీయ బ్యాంకర్, కార్పొరేట్ లీడర్గా గుర్తింపు పొందారు. 2013 నుంచి 2017 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్పర్సన్గా పనిచేసిన తొలి మహిళ. ఆమె తన పదవీకాలంలో మహిళా ఉద్యోగులకు విశ్రాంతి సెలవులు, సంస్థలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకాలు వంటి విధానాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సేల్స్ఫోర్స్ ఇండియా ఛైర్పర్సన్, సీఈఓగా ఉన్నారు. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో సహా పలు బోర్డుల్లో పనిచేశారు.పవన్ కుమార్ గోయెంకాఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ వంటి ఐకానిక్ వాహనాల అభివృద్ధికి కృషి చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాను గ్లోబల్ బ్రాండ్గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో పదవీ విరమణ చేసే వరకు మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-స్పేస్) ఛైర్మన్గా ఉన్నారు.ఇదీ చదవండి: భారత్లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..ఒసాము సుజుకి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో సేవలించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, సీఈఓగా పని చేశారు. భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి ద్వారా విప్లవాత్మకమైన పాత్ర పోషించారు. ఇది దేశంలో సరసమైన, నమ్మదగిన వాహనాలకు గుర్తింపుగా మారింది. కంపెనీలో తన నాయకత్వం 1978 నుంచి 2021 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1930 జనవరి 30న జపాన్లో జన్మించిన ఒసాము సుజుకీ 1958లో సుజుకి మోటార్ కార్పొరేషన్లో చేరారు. 2024 డిసెంబర్ 25న తన 94వ ఏట కన్నుమూశారు. -
మహిళలకు ఉద్యోగాల బూమ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఉద్యోగ దరఖాస్తులు (నియామకాలు) గణనీయంగా పెరిగినట్టు.. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఆప్నా వెల్లడించింది. సౌకర్యవంతమైన పని నమూనాలు, టైర్–2, 3 పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆప్నా ఒక నివేదికను విడుదల చేసింది. జనవరి–మార్చి మధ్య 1.81 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని, గతేడాది మొదటి మూడు నెలలతో పోల్చితే 30 శాతం పెరిగినట్టు తెలిపింది. బీపీవో, ఫైనాన్స్, హెచ్ఆర్ తదితర విభాగాల్లో నియామకాలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ పరిస్థితులకు ఈ గణాంకాలు నిదర్శమని పేర్కొంది. ముఖ్యంగా మహిళల నుంచి దరఖాస్తులు 23 శాతం పెరిగి 62 లక్షలుగా ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఫ్రెషర్ల (ఉద్యోగానికి కొత్త/అనుభవం లేని) నుంచి వచి్చనవి 66 లక్షలు ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 46 శాతం పెరిగాయి. చండీగఢ్, ఇందోర్, జమ్షెడ్పూర్ తదితర టైర్ 2, 3 పట్టణాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆప్నా ప్లాట్ఫామ్పై 3.1 లక్షల జాబ్ పోస్టింగ్లు నమోదయ్యాయి. 2024 క్యూ1తో పోల్చితే 26% పెరిగాయి. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి ఎక్కువగా ఉన్నాయి. వరంగల్లో పెరుగుతున్న టెక్ నియామకాలు ఎల్ఐసీ, పేటీఎం, డెల్హివరీ, ఫ్లిప్కార్ట్ తదితర సంస్థల నుంచే లక్ష నియామకాలు జరిగాయి. ఇవి మెట్రోలకు బయట ఇతర పట్టణాల్లోనూ నియామకాలు చేపట్టాయి. సాఫ్ట్వేర్/వెబ్ డెవలపర్ ఉద్యోగాలకు పోస్టింగ్లు 65 శాతం మేర పెరిగాయి. ఈ పోస్ట్లకు ఫ్రెషర్ల నుంచి 42 శాతం అధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ తదితర ఉద్యోగాల్లో నిపుణుల అవసరం పెరిగింది. ఇక కొత్త నియామకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. జైపూర్ లక్నో, రాజ్కోట్, వరంగల్ టెక్నాలజీ ఉద్యోగ నియామకాల్లో కీలక కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఆప్నా నివేదిక వెల్లడించింది. ఈ పట్టణాల్లో 30–50 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకునే విషయంలో టైర్ 2, 3 పట్టణాలు కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది. -
యూట్యూబ్ కంట్రీ ఎండీగా గుంజన్ సోని
న్యూఢిల్లీ: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ఫాం యూట్యూబ్ భారత విభాగం ఎండీగా గుంజన్ సోని నియమితులయ్యారు. ఆమె గతంలో జలోరా, స్టార్ ఇండియా, మింత్రా వంటి సంస్థల్లో కీలక హోదాల్లో సేవలు అందించారు. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ–కామర్స్ తదితర విభాగాల్లో రెండు దశాబ్దాలపైగా అనుభవం ఉంది. సింగపూర్కి చెందిన జలోరాలో గత ఆరేళ్లుగా ఆమె గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కొత్త కేటగిరీలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. స్టార్ ఇండియాలో ఈవీపీగా, మింత్రాలో సీఎంవోగా వ్యవహరించినందున ఆమెకు భారతీయ మీడియా, మార్కెటింగ్ రంగాల్లో కూడా గణనీయంగా అనుభవం ఉందని సంస్థ తెలిపింది. అంతక్రితం ఆమె మెకిన్సేలో పార్ట్నర్గా వ్యవహరించారు. ఫార్చూన్ 500 కంపెనీ అయిన సీబీఆర్ఈ గ్రూప్ బోర్డులో ఉన్నారు. -
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
అసలే ఎండాకాలం.. భానుడి భగభగలు కారణంగా రోడ్డు మీదనే కాదు, ఇంట్లో ఉండటం కూడా కష్టతరమైపోయింది. డబ్బున్నవాళ్ళు ఏసీలు, కూలర్లు వంటివి కొనేస్తుంటారు. పేదవాళ్ళు ఫ్యాన్లకు మాత్రమే పరిమితమవుతారు. ఇప్పటికే మార్కెట్లో లెక్కకు మించిన ఫ్యాన్లు వివిధ ధరలలో అందుబాటులోకి వచ్చేసాయి. కాగా గోల్డ్మెడల్ ఎలక్ట్రికల్స్ కంపెనీ ఓ సరికొత్త ఫ్యాన్ను పరిచయం చేసింది. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (FMEG) కంపెనీలలో ఒకటైన గోల్డ్మెడల్ ఎలక్ట్రికల్స్ 'విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్'ను పరిచయం చేసింది. 360 డిగ్రీలు కదిలే ఈ ఫ్యాన్ మంచి కూలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది హై-గ్రేడ్ ప్లాస్టిక్ చేత నిర్మితమై ఉంది.విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్.. మూడు స్పీడ్ సెట్టింగ్లతో పాటు, నార్మల్, బ్రీజ్, నైట్ వంటి మల్టిపుల్ ఆపరేటింగ్ మోడ్లను పొందుతుంది. ఇన్ఫ్రారెడ్ (IR) రిమోట్ సౌలభ్యంతో.. అడ్జస్టబుల్ సెట్టింగ్లు సులభంగా ఉంటాయి. అంతే కాకుండా స్మార్ట్ ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరుఎక్కువ రోజులు ఇది పనిచేసేలా ఉండటానికి కంపెనీ హై-గ్రేడ్ కాపర్ మోటార్ను ఇందులో ఫిక్స్ చేసింది. ఎనిమిది గంటల వ్యవధిలో ఈ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవడానికి ఒక టైమర్ కూడా ఇందులో ఉంటుంది. విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్ ధర అమెజాన్లో రూ. 11,427. కెంపెనీ దీనిపై రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. -
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జియో ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) విభాగంలో జియో తన ఆధిపత్యాన్ని మరింత బల పరుచుకుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఫిబ్రవరి 2025కి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. జియో తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఎఫ్డబ్ల్యుఏ విభాగంలో అత్యధిక మార్కెట్ షేర్ను సంపాదించింది.ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో జియో ఎయిర్ఫైబర్ యాక్టివ్ సబ్స్క్రైబర్లు 2025 జనవరిలో 4,27,439 ఉండగా ఫిబ్రవరిలో 4,58,372 మందికి పెరిగారు. భారతీ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు ఫిబ్రవరిలో 95,164 మంది మాత్రమే ఉన్నారు. అంటే.. 84% మార్కెట్ వాటా, అద్భుతమైన పనితీరుతో ఈ విభాగంలో జియో తన పోటీదారుల కంటే 5 రెట్లు ఎక్కువగా సబ్స్క్రైబర్ బేస్ను సంపాదించుకుంది.తన 5జీ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం, అందుబాటులో ఉన్న ప్లాన్లను అందించడం.. సులభమైన కస్టమర్ అనుభవాన్ని కల్పించడం ద్వారా జియో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకంగా గ్రామీణ, నగర ప్రాంతాలలో ఎన్నో సవాళ్లను అధిగమించి మారు మూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ కనెక్టివిటీని జియో అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ (జియో ఫైబర్) విస్తరించలేని చోట్ల ప్రతి ఇల్లు మరియు చిన్న వ్యాపారానికి.. గృహ వినోదం, బ్రాడ్బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తెచ్చింది.జియో ఎయిర్ ఫైబర్.. 800కి పైగా డిజిటల్ టీవీ ఛానళ్ళు, 11కి పైగా ఓటీటీ యాప్లు, నిరంతరాయంగా వైఫై, స్మార్ట్ హోమ్ సర్వీస్, హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్తో ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. వివిధ వయస్సుల.. నేపథ్యాల నుంచి వినియోగదారులు ఇప్పుడు నిరవధిక హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్ & ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్ను పొందుతూ డిజిటల్ ఇండియా ప్రయోజనాలను నిజంగా అనుభవిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వందలాది చిన్న, పెద్ద పట్టణాలు, వేలాది గ్రామాల్లో జియో ఎయిర్ ఫైబర్ డిజిటల్ ప్రాణశక్తిగా మారింది. -
హైదరాబాద్లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో
హైదరాబాద్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో భాగమైన 'బిర్లా ఓపస్ పెయింట్స్'.. ఈరోజు హైదరాబాద్లో తన బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను (కంపెనీ యాజమాన్యంలోని కంపెనీ ఆపరేటెడ్ ఎక్స్పీరియన్స్ స్టోర్) ప్రారంభించామని ప్రకటించింది. గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరులో ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించిన అనంతరం, పెయింట్, డెకర్ పరిశ్రమను ఆవిష్కరణ, ప్రీమియం ఆఫర్లు, నిజంగా లీనమయ్యే కస్టమర్ అనుభవం ద్వారా మార్చాలనే బ్రాండ్ నిబద్ధతను ఈ విస్తరణ మరింత బలోపేతం చేస్తుంది.బిర్లా ఓపస్ పెయింట్స్ హైదరాబాద్ స్టూడియో సాధారణ రిటైల్ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకమైన, లీనమయ్యే అనుభవంగా మార్చడానికి ఆలోచనాత్మకంగా రూపొందించారు. ఈ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ దుకాణాలకు అతీతంగా సృజనాత్మకతకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కేంద్రం. ఇది వినియోగదారుల సృజనాత్మకతను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, నిజ జీవిత వాతావరణంలో రంగులను తాకడానికి, అనుభూతి చెందడానికి మరియు ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది.వినియోగదారుల వ్యక్తిగతీకరించిన గైడ్ ద్వారా షేడ్ ఎంపిక, టెక్చర్లు, వినియోగించే నైపుణ్యాలపై నిపుణుల నుంచి ఉచిత మార్గదర్శకత్వాన్ని కూడా పొందవచ్చు. అధునాతన విజువలైజేషన్ సాధనాలు ఇంటి యజమానులు వారు ఎంచుకున్న రంగులు నిజ జీవిత సెట్టింగ్లలో ఎలా కనిపిస్తాయో ముందస్తుగా వీక్షించేందుకు సహాయపడతాయి. పెయింట్లకు మించి, పెయింట్ స్టూడియో వాల్కవరింగ్లు, డిజైనర్ ఫినిషింగ్లు మరియు సమగ్ర డెకర్ సొల్యూషన్ కోసం స్పెషాలిటీ కోటింగ్ ఎంపికలను కూడా కలిగి ఉంది.ఈ స్టోర్ 170 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, రంగుల ఎంపికపై నిపుణుల సంప్రదింపులు, వినూత్న అప్లికేషన్ టెక్నిక్లు, గొప్ప స్థానిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన క్యూరేటెడ్ డెకర్ సొల్యూషన్లతో సహా పలు ప్రత్యేక సేవలను అందిస్తుంది. ఇది స్థానిక అభిరుచులు, వారసత్వానికి అనుగుణమైన ఎంపికలతో శక్తివంతమైన నగర స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రత్యేకమైన షేడ్స్ను క్యూరేటెడ్ డెకర్ ప్యాకేజీలను అందిస్తుంది.దేశ వ్యాప్తంగా.. తన రిటైల్ పాదముద్రను విస్తరించే లక్ష్యంతో బిర్లా ఓపస్ పెయింట్స్ వృద్ధి వ్యూహంలో ఈ ప్రారంభం కూడా ఒక ముఖ్యమైన అడుగు. అనుభవపూర్వక రిటైల్పై దృష్టి సారించి, రాబోయే నెలల్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, జైపూర్, అహ్మదాబాద్ మరియు సూరత్లలో అదనపు అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “హైదరాబాద్లోని మా కొత్త పెయింట్ స్టూడియో కేవలం రిటైల్ స్థలం మాత్రమే కాదు, ఇది మీ పెయింటింగ్ అవసరాలకు ఒక అనుభవ కేంద్రం. అత్యాధునిక సాంకేతికత నుంచి స్థానికంగా ప్రేరణ పొందిన షేడ్ ప్యాలెట్ల వరకు, వినియోగదారులు, నిపుణులు అన్వేషించేందుకు, ప్రయోగాలు చేయడానికి, వ్యక్తీకరించడానికి మేము ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాము. భారతదేశం పెయింట్లతో నిమగ్నమయ్యే విధానాన్ని మార్చడానికి, పెయింటింగ్ ప్రయాణాన్ని మరింత వ్యక్తిగతీకరించేందుకు, లీనమయ్యేలా.. స్ఫూర్తిదాయకంగా మార్చడానికి మా నిబద్ధతను ఈ స్టూడియో ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు. -
సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్గేట్స్ ప్రశంసల వర్షం
తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.తన కుమార్తె ఫోబ్ గేట్స్.. తన స్టార్టప్ కోసం నిధులను సేకరించే క్రమంలో, తన దగ్గరకు వస్తుందని నేను ఊహించాను. ఒకవేళ తను నన్ను సహాయం చేయమని అడిగి ఉంటే.. తప్పకుండా చేసేవాణ్ణి. అయితే కొన్ని షరతులు కూడా పెట్టేవాడినని బిల్గేట్స్ అన్నారు. అయితే నిధుల కోసం నన్ను సంప్రదించకుండా.. సొంతంగా సమకూర్చుకున్న కూతురిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.22 ఏళ్ల ఫోబ్ గేట్స్.. తన స్నేహితురాలు సోషియా కియానీతో కలిసి 'ఫియా' అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక సిజిటల్ ఫ్యాషన్ ప్లాట్ఫామ్. ఇందులో సుమారు 40,000 కంటే ఎక్కువ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న దుస్తుల ధరలను వెల్లడిస్తుంది. వినియోగదారులకు ఫ్యాషన్ ఉత్పత్తుల మీద బెస్ట్ డీల్స్ అందించడంతో పాటు.. ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..2024లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన.. ఫోబ్ గేట్స్ తన స్టార్టప్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు & ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500000 డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. సుమారు 102.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తన తండ్రి బిల్గేట్స్ సహాయం పొందకుండా.. స్టార్టప్ ప్రారభించడం గొప్ప విషయం అని పలువు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో ముగ్గురు పిల్లలను కన్నారు. వారు జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్. -
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
జాబ్ చేసేవారు తమ ఉద్యోగ కష్టాలు.. ఆఫీసులో ఎదురయ్యే అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైనవన్నీ చెప్పుకోవడానికి రెడ్డిట్ ఓ మంచి వేదికగా మారింది. ఇందులో భాగంగానే ఒక వ్యక్తి.. తాను ఆఫీసులో ఎదుర్కొంటున్న కష్టాలను షేర్ చేశారు.నేను పనిచేసే కంపెనీలో.. ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆదివారాల్లో కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటలు పనిచేయాలని మేనేజర్ పేర్కొంటారు. ఇటీవల నేను నాలుగు రోజులు సెలవు కావాలని అడిగాను, చాలా చర్చలు జరిపిన తరువాత సెలవు మంజూరు చేశారు.సెలవులు ఇచ్చారు, కానీ.. సమయం దొరికినప్పుడల్లా ఆఫీస్ వర్క్ చేయాలని మేనేజర్ చెప్పారు. కానీ ఆ సమయంలో పని చేయడం కష్టమవుతుందని, వీలైతే చేస్తానని నేను (ఉద్యోగి) చెప్పాను. అయితే సెలవుల సమయంలో వర్క్ చేయలేకపోయాను.సెలవుల తరువాత నేను ఆఫీసుకి తిరిగి వచ్చాను. ఆ రోజు సాయంత్రానికే.. నా పనితీరు తక్కువగా ఉందని, నన్ను పీఐపీ( పర్ఫామెన్స్ ఇంప్రూమెంట్ ప్లాన్)లో ఉంచినట్లు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. దీనికి కారణం సెలవుల్లో పనిచేయకపోవడమే అని నాకు అర్థమైంది. ఇది నన్ను చాలా గందరగోళానికి గురిచేసింది. చట్టబద్ధంగా ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు? సంస్థలకు తాము చేయగలిగింది చేయగలిగేంత అధికారం ఉందా?..ఈ చర్యలను ఎదుర్కోవడానికి తగిన పరిష్కారం ఉందా.. అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కంపెనీ, మేనేజర్ పేరు చెప్పి అవమానించండి అని ఒకరు అన్నారు. చాలా కంపెనీలలో ఇలాగే జరుగుతోందని ఇంకొకరు అన్నారు. హెచ్ఆర్ను మీకు ఈ మెయిల్ చేయమని చెప్పండి అని మరొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సలహాలు ఇచ్చారు. -
భారత కార్బన్ మార్కెట్ ప్రారంభం..
భారత్తోపాటు ప్రపంచం అంతటా వాతావరణ కాలుష్యం ప్రధాన సమస్యగా మారుతోంది. ఇందుకు కార్బన్ ఉద్గారాలు కీలకంగా ఉన్నాయి. వివిధ ఉత్పత్తుల తయారీలో భాగంగా వీటిని విడుదల చేస్తున్న కంపెనీలపై కాలుష్య నియంత్రణ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అల్యూమినియం, సిమెంట్, క్లోర్-ఆల్కలీ, పేపర్ ఇండస్ట్రీల్లో 282 యూనిట్లకు నిర్దిష్ట ఉద్గార తీవ్రత లక్ష్యాలను నోటిఫై చేయడం ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల సమస్యను కొంతవరకు కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్బన ఉద్గారాలను నియంత్రించడం, పరిశ్రమల్లో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యాచరణను తయారుచేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల ప్రకారం పవర్ ఎక్స్ఛేంజీల్లో కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు ట్రేడ్ కావడంతో భారతదేశం ఇటీవల తన కార్బన్ మార్కెట్ను ప్రారంభించింది.కాంప్లయన్స్ కార్బన్ మార్కెట్పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల మేరకే ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది. బాధ్యతాయుతమైన సంస్థలు (ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్-ఓఈ) ఉద్గార పరిమితులను చేరుకోవాలి. ఈ పరిమితుల కంటే అధికంగా ఉద్గారాలు ఉంటే చర్యలు తప్పవు. టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినా లేదా నివారించినా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రాలను రెగ్యులేటర్లకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పాటించనందుకు జరిమానాలు సైతం విధించేలా నిబంధనలు సిద్ధం చేశారు.కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు అంటే..ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ (CO2) లేదా గ్రీన్ హౌస్ వాయువులు (GHG) నివారిస్తే కంపెనీలకు ప్రత్యేకంగా ఇచ్చే సర్టిఫికేట్లు. కంపెనీలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఆ దిశగా సంస్థలను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. ఒక ప్రాజెక్ట్ విజయవంతంగా GHG ఉద్గారాలను తగ్గించినప్పుడు నియంత్రణ సంస్థలు లేదా స్వతంత్ర సంస్థల ద్వారా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. ఉదాహరణకు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు లేదా అడవుల పెంపకం కార్యక్రమాలతో ఈ క్రెడిట్లను సంపాదించవచ్చు.ఉద్గారాల పరిమితిని దాటిన కంపెనీలు మిగులు క్రెడిట్లు ఉన్న సంస్థల నుంచి ఈ సర్టిఫికేట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది ఉద్గారాల తగ్గింపునకు మార్కెట్ ఆధారిత విధానాన్ని సృష్టిస్తుంది. సంస్థలు ఉద్గారాలను తగ్గించడం లేదా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకోవాలి. దీన్ని పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా నైతిక పద్ధతుల్లో భాగంగా కంపెనీలు తమ ఉద్గారాలను భర్తీ చేయడానికి స్వచ్ఛందంగా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: భారత్లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..ప్రయోజనాలుఇది క్రెడిట్ సర్టిఫికేట్లు కలిగి ఉన్న కంపెనీలకు సుస్థిర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. ఉద్గారాల తగ్గింపునకు సంస్థలకు ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. వాతావరణ కాలుష్య కట్టడికి ఇతర కంపెనీలకు తోడ్పడుతుంది. -
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా 42 అదనపు సెలవులు మంజూరు చేస్తున్నట్లు, దీనికి సంబంధించిన కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అయితే ఈ అదనపు సెలవులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీనా.. లేక ప్రత్యేకంగా కొంతమందికేనా అన్న గందరగోళం నెలకొంది.అవయవ దాతలకు సెలవులువాస్తవంగా అవయవాలను దానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 42 రోజులు స్పెషల్ క్యాజువల్ సెలవులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 2న లోక్సభ ప్రకటనలో తెలియజేశారు. ఈ సెలవులను శస్త్రచికిత్సకు ముందు, ఆసుపత్రిలో చేరినప్పుడు, రికవరీ సమయంలో వినియోగించుకోవచ్చు. ఇది అన్ని అవయవ దాన శస్త్రచికిత్సలకూ వర్తిస్తుంది. అలాగే ఇది వైద్య సిఫార్సుల ఆధారంగా వన్-టైమ్ బెనిఫిట్. ఏటా ఇచ్చే సెలవులు కాదు. ఇది అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న చొరవ. సాధారణ సెలవు విధానం కాదు.ఏటా 42 అదనపు సెలవులు?పూర్తికాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరానికి 42 అదనపు సెలవులను మంజూరు చేసే కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుండి అమలులోకి వస్తోందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. పని-జీవిత సమతుల్యతను మెరుగుపరచడానికి ప్రస్తుత క్యాజువల్, ఆర్జిత, వైద్య సెలవులకు అదనంగా ఈ లీవ్స్ను ప్రభుత్వం ఇస్తోందంటూ నివేదించాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ధ్రవీకరణ రావాల్సి ఉంది. -
రూ.60 లక్షల ఆదాయం: అన్నీ సమస్యలే..
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలోని ప్రధాన నగరాల్లో.. నివాసం చాలా కష్టతరమని గతంలో కొంతమంది పేర్కొన్నారు. ఇప్పుడు రూ. 60 లక్షల వార్షిక ఆదాయం వచ్చే కుటుంబానికి చెందిన బెంగళూరు వ్యక్తి దేశంలో నివసించడం చాలా ఖరీదైనదిగా అయిపోయిందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం..నేను హోరేమావు (బెంగళూరు)లో నివసిస్తున్నాను. మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫీసుకు చేరుకోవడానికి మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి.. ఈ ప్రయాణం నాకు సుమారు 40 నిమిషాలు పడుతుంది. ఆఫీసుకు చేరుకునే సమయానికి నీరసించిపోతాను. ప్రతి రోడ్డులోనూ అడ్డంకులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో?, ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి కానీ ఎప్పటికీ పూర్తి కావు. జవాబుదారీతనం ఎక్కడ ఉందని అన్నారు.బెంగళూరు రోడ్డు పన్ను దేశంలోనే అత్యధికంగా ఉంది. ఢిల్లీలో చెల్లించే దానికంటే నేను రూ. 2.25 లక్షలు ఎక్కువగా రోడ్డు పన్ను చెల్లించాను. దానికి ప్రతిఫలంగా నాకు ఏమి లభిస్తుంది? రోడ్లకు క్రేటర్లు, ట్రాఫిక్ కష్టాలు, నిరంతర నిర్మాణాలు. ఇది పూర్తిగా పగటిపూట జరుగుతున్న దోపిడీ. మనం భారీగా చెల్లిస్తున్నాము, దీని ప్రతిఫలం శూన్యం.కెనడా, జర్మనీ వంటి దేశాలలో..మన ఆదాయంలో 30-40% పన్నుల రూపంలోకి వెళుతుంది. ప్రతిదానిపై GST కూడా. ఇవన్నీ చెల్లించినా మనకు ఏమీ లభించదు. ఉచిత ఆరోగ్య సంరక్షణ లేదు, మంచి విద్య లేదు, మంచి నీరు కూడా లేదు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులకు మనం విడిగా చెల్లించాలి. నీటి ట్యాంకర్లకు అదనం. 30-40% పన్ను చెల్లిస్తూ.. ఇంకా నీరు కొనాల్సిన పరిస్థితి ఉంది. కెనడా లేదా జర్మనీ వంటి దేశాలలో, నేను ఇదే పన్ను చెల్లిస్తే.. ఉచిత ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, మంచి మౌలిక సదుపాయాలు లభిస్తాయి.జీవన నాణ్యత కూడా విచారకరంగా ఉంది. ప్రతిచోటా దుమ్ము, శబ్దం.. వీటివల్ల ఒత్తిడి, కోపం. ప్రశాంతంగా నడవలేము, స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేము. సాయంత్రం 7 గంటల తర్వాత నా భార్యను ఒంటరిగా బయటకు పంపడం సురక్షితం కాదు. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖ అవినీతిమయమైంది. లంచం ఇవ్వకపోతే పని జరగదు.పరిస్థితులు మెరుగుపడతాయా..ప్రతిదీ చాలా ఖరీదైనదిగా మారుతోంది. ఈ సంవత్సరం అద్దె 10% పెరుగుతోంది. స్కూల్ ఫీజులు అంతకు మించే ఉన్నాయి. మా ఇంటి ఆదాయం కంటే ఖర్చులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. నేను నిజంగా ఈ దేశానికి తోడ్పడాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండి ఏదైనా చేయాలనుకుంటున్నాను. కానీ ఈ వ్యవస్థ ఏ మాత్రం బాగాలేదు. మనం పన్ను చెల్లించే ప్రతి రూపాయి రాజకీయ నాయకుల ఖజానా నింపడానికి వెళుతుందనే అభిప్రాయం నాకు ఏర్పడింది.నేను నిజాయితీగా అడుగుతున్నాను. ఇక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని కొంత ఆశ పెట్టుకోవచ్చా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.ఇదీ చదవండి: టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికిందిదీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీకు వేరే ఆప్షన్ ఉంటే.. వేరే దేశంలో సెటిల్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎప్పటికీ మారవని ఒకరు అన్నారు. ఇవన్నీ మారవు.. మనం ఎప్పటికీ అంతం కాని లూప్లో జీవిస్తున్నామని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. -
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
న్యూఢిల్లీ: ఎస్బీఐ కార్డ్ (క్రెడిట్ కార్డు సేవల్లోని) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (2025 జనవరి–మార్చి) రూ.534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.662 కోట్లతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గిపోయింది. క్రెడిట్ కార్డులపై రుణ ఎగవేతలు పెరగడం లాభాలకు గండికొట్టింది. మొత్తం ఆదాయం మాత్రం ఇదే కాలంలో రూ.4,475 కోట్ల నుంచి రూ.4,832 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.2,415 కోట్లకు మెరుగుపడింది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,139 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక రుణాలు (వసూలు కాని/ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 3.08 శాతంగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 2.76 శాతమే. నికర ఎన్పీఏలు గమనించినా.. 0.99 శాతం నుంచి 1.46 శాతానికి పెరిగాయి. నష్టాలు/మొండి బకాయిలకు కేటాయింపులు క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.944 కోట్లుగా ఉంటే, సమీక్షా కాలంలో రూ.1,245 కోట్లకు పెరిగిపోయాయి.ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ కార్డ్ రూ.1,916 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2023–24లో నమోదైన రూ.2,408 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.17,484 కోట్ల నుంచి రూ.18,637 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాలన్స్ షీట్ విలువ రూ.58,171 కోట్ల నుంచి రూ.65,546 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేరు ధర ఒక శాతానికి పైగా లాభపడి రూ.927 వద్ద ముగిసింది. -
పహల్గామ్ బాధితులకు సులువుగా బీమా క్లయిమ్
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బీమా చెల్లింపులు సులభతరం చేసేందుకు దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాలసీదారుల కుటుంబ సభ్యులు / నామినీల క్లెయిమ్ సమర్పణ కోసం సరళీకృత ప్రక్రియను ప్రకటించింది.ఈ ఉగ్రదాడిలో చనిపోయినవారికి హెచ్డీఎఫ్సీ లైఫ్లో బీమా పాలసీ ఉన్నట్లయితే వారి నామినీ / చట్టపరమైన వారసులు డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చు. ఇందుకోసం ఉగ్రవాద దాడి కారణంగా సంభవించిన పాలసీదారు మరణానికి రుజువును స్థానిక ప్రభుత్వం, పోలీసు, ఆసుపత్రి లేదా సంబంధిత అధికారుల నుండి సమర్పించాలి.డెత్ క్లెయిమ్ కోసం నామినీలు కాల్ సెంటర్ నంబర్ 022-68446530, service@hdfclife.com అనే ఈమెయిల్ ద్వారా హెచ్డీఎఫ్సీ లైఫ్ను సంప్రదించవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించవచ్చు. బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సహాయ, సహకారాలు అందించడానికి అన్ని ప్రదేశాలలోనూ కంపెనీ స్థానిక బ్రాంచ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ యోగీశ్వర్ తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేనప్పటికీ, ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సమర్పణకు ప్రయాసలను మాత్రం తగ్గించగలమని ఆయన పేర్కొన్నారు. -
ఈ ‘ప్రపంచ కుబేరుడు’ ఒకప్పుడు క్లీనర్.. అంతేనా.. ఎన్నో ట్విస్ట్లు!
ఎలాన్ మస్క్ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్. ఆయన కెమికల్ ఇంజినీర్. ఎలాన్కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.పన్నెండేళ్లకే తొలి బిజినెస్ ఎలాన్కి చిన్నప్పట్నుంచీ సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్ సాఫ్ట్వేర్ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్. ప్రాణాంతక హైడ్రోజన్ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్’.ఫీజు కోసం క్లీనింగ్ పనికాలేజ్లో ఎలాన్ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్. స్టాన్ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్.ఒక కంపెనీతో ఆగిపోలేదు!ఎలాన్ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్వేర్ను సమకూరుస్తుంది జిప్2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్ కంపెనీ జిప్2ను 307 మిలియన్ డాలర్లకు కొనేసింది. ఎలాన్ తన ఇంకో కంపెనీ ఎక్స్.కామ్ను 2000లో కాన్ఫినిటీ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్’ అనే ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్గా అవతరించింది.పేపాల్ను 2002లో ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్ఎక్స్ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్ ఏఐ, ‘ది బోరింగ్ కంపెనీ’, ఎక్స్ కార్పొరేషన్, ‘థడ్’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్ నెలకొల్పినవే.ఐరన్ మ్యాన్ 2లో చిన్న పాత్రఎలాన్ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్ డాలర్లు. ఇంకో 567 బిలియన్ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతారు ఎలాన్. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో ‘టోనీ స్టార్క్’ పాత్రకు ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ లో మస్క్ చిన్న పాత్ర వేశారు కూడా.తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!ఎలాన్ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్డౌన్ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్డౌన్’’ అని లాక్ డౌన్ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్.కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్ మస్క్. వెళ్లిపో’’ అని ట్వీట్ చేశారు. అందుకు మస్క్ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్ రిసీవ్డ్’ అని రిప్లయ్ ట్వీట్ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్ -
రూ. 10,000 కోట్లు దాటేసిన డీఎస్ గ్రూప్
న్యూఢిల్లీ: దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీ ధరమ్పాల్ సత్యపాల్(డీఎస్) గ్రూప్ నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు వీలుగా మొత్తం రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ వైస్చైర్మన్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. తద్వారా శత వసంతాలు పూర్తి చేసుకోనున్న 2029కల్లా రూ. 20,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.దీనిలో భాగంగా ఆతిథ్యం, ఆహారం, పానీయాల విభాగాలలో ఇతర సంస్థలను కొనుగోలుచేసే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కార్యకలాపాలను వేగంగా విస్తరించే వ్యూహాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. గతంలో నమిలే పొగాకు ఉత్పత్తులతో ప్రసిద్ధమైన కంపెనీ వీటిని టర్నోవర్లో 10 శాతానికంటే తక్కువకు పరిమితం చేసినట్లు తెలియజేశారు.మార్చితో ముగిసిన గతేడాది(2024–25) సాధించిన రూ. 10,000 కోట్ల ఆదాయంలో వీటి వాటా 10 శాతంకంటే తక్కువేనని, అయితే ఈ విభాగం నుంచి పూర్తిగా వైదొలగబోమని స్పష్టం చేశారు. ఆహారం, పానీయాల నుంచి 42 శాతం సమకూరినట్లు వెల్లడించారు. -
డిజిటల్ కామర్స్కు నియంత్రణ సంస్థ ఉండాలి
న్యూఢిల్లీ: పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన ధరలు నిర్ణయిస్తున్నాయని, భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయని, గిగ్ వర్కర్ల శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఈ–కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలపై ఆరోపణలున్న నేపథ్యంలో వాటిని పర్యవేక్షించేందుకు స్వతంత్ర డిజిటల్ కామర్స్ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది.వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద నేషనల్ ఈ–కామర్స్ పాలసీ, ఈ–కామర్స్ నిబంధనలను సత్వరం ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం లగ్జరీగానే పరిగణించవచ్చు కాబట్టి ఈ–కామర్స్ ప్లాట్ఫాంల ద్వారా విక్రయించే ఉత్పత్తులపై ప్రస్తుత జీఎస్టీ నిబంధన ప్రకారం ’లగ్జరీ ట్యాక్స్’ విధించాలని సీఏఐటీ పేర్కొంది.లాభదాయకత లేకపోవడంతో గత రెండు, మూడేళ్లలో 10 లక్షల పైగా కిరాణా దుకాణాలు మూతబడ్డాయని ఆలిండియా కన్జూమర్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) నేషనల్ ప్రెసిడెంట్ ధైర్యశీల్ పాటిల్ తెలిపారు. ఈ వ్యవధిలో కొత్తగా ప్రారంభమైన స్టోర్లతో పోలిస్తే మూతబడినవే ఎక్కువని వివరించారు. -
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)లో వాటాలను మరింతగా పెంచుకుని, దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న 48.99 శాతం వాటాలకే ప్రభుత్వం పరిమితమవుతుందని తెలిపారు. కేంద్రం తన వంతు తోడ్పాటు అందించినందున ఇకపై పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత వొడాఫోన్ ఐడియాదేనని ఆయన తెలిపారు.వొడాఫోన్ ఐడియా బకాయిలకు బదులుగా ప్రభుత్వం వాటాలు తీసుకోవడం వల్ల స్వల్పకాలిక ఊరట లభించినప్పటికీ కంపెనీ నిలదొక్కుకోవాలంటే యూజర్ల బేస్ స్థిరంగా ఉండటం, టారిఫ్లను పెంచడం, దీర్ఘకాలిక రుణాల సమీకరణ మొదలైనవి కీలకాంశాలుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి గట్టెక్కినా, భవిష్యత్తులో బాకీల చెల్లింపుల విషయంలో కంపెనీ సవాళ్లు ఎదుర్కొనవచ్చని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగి మద్దతునిస్తుందా అనే సందేహాన్ని మంత్రి నివృత్తి చేశారు. మరోవైపు, బ్యాంక్ రుణాల చెల్లింపులో ఎంటీఎన్ఎల్ డిఫాల్ట్ కావడంపై స్పందిస్తూ కంపెనీకి గణనీయంగా స్థలాలు ఉన్నాయని, వాటిని నగదీకరణ చేయడం ద్వారా రుణాలను తీర్చేసే అవకాశం ఉందన్నారు. -
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్లో చక్రం తిప్పుతున్నారు
భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల గురించి.. వారి పిల్లల గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే వారి కోడళ్ళు కూడా వ్యాపార సామ్రాజ్యంలో తమదైన గుర్తింపు తెచుకున్నవారే.. అని బహుశా కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ కథనంలో రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ అధినేతల కోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.శ్లోకా మెహతాముఖేష్ & నీతా అంబానీల పెద్ద కోడలు, ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె. 2014 నుంచి తన కుటుంబ వ్యాపారమైన రోజీ బ్లూ డైమండ్స్ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టారు. శ్లోకా రోజీ బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ కూడా. ఈమె నికర విలువ రూ.130 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.రాధిక మర్చంట్ముఖేష్, నీతా అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య 'రాధిక మర్చంట్' ఎన్కోర్ హెల్త్కేర్లో డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతే కాకుండా ఈమె ఎన్కోర్ హెల్త్కేర్కు సీఈఓ & వైస్-చైర్మన్ కూడా. ఈమె నికర విలువ రూ. 10 కోట్ల కంటే ఎక్కువ.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..పరిధి ష్రాఫ్గౌతమ్ అదానీ కోడలు, కరణ్ అదానీ భార్య 'పరిధి ష్రాఫ్'.. వృత్తిరీత్యా న్యాయవాది. ఈమె న్యాయ దిగ్గజం సిరిల్ ష్రాఫ్ కుమార్తె. పరిధి ష్రాఫ్ భారతదేశంలోని అత్యంత చురుకైన చట్టపరమైన మనస్తత్వం కలిగిన వారిలో ఒకరు. సిరిల్ అమర్చంద్ మంగళ్దాస్లో భాగస్వామిగా ఉన్న ఈమె ఎస్సార్-రోస్నెఫ్ట్ వంటి బిలియన్ డాలర్ల ఒప్పందాలపై పనిచేశారు.దివా జైమిన్ షాఈ ఏడాది ఫిబ్రవరిలో గౌతమ్ అదానీ చిన్న కొడుకును వివాహం చేసుకున్న 'దివా జైమిన్ షా'.. ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె చార్టర్డ్ ఫైనాన్స్ అనలిస్ట్.. గతంలో డెలాయిట్ ఇండియాలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా పనిచేశారని సమాచారం. ఈమె వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె మరియు ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ సి. దినేష్ అండ్ కో. ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని. -
అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు: మే 1 నుంచి ఐదేళ్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) శుక్రవారం తన కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్గా చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ'ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సు ఆధారంగా బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.అనంత్ అంబానీ.. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది.రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన అనంత్ అంబానీ.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీలో డైరెక్టర్గా ఉండనున్నారు. ఇప్పటికే అనంత్ పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అనంత్ వేతనం.. ఏడాదికి రూ.4.2 కోట్లు. అయితే ఇప్పుడు ఫుల్ టైమ్ డైరెక్టర్గా నియామకమవ్వడంతో ఆయన వేతనం అంతే ఉంటుందా? పెరుగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన అనంత్ అంబానీ, జంతు సంక్షేమం పట్ల కూడా చాలా మక్కువ కలిగి ఉన్నారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించడం.. వాటి చివరి సంవత్సరాల్లో సంరక్షణ అందించడంపై దృష్టి సారించిన అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆకాష్ అంబానీ గ్రూప్ టెలికాం అండ్ డిజిటల్ సేవల విభాగం అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్గా కూడా ఉన్నారు. ఇషా అంబానీ రిటైల్ విభాగం అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతే కాకుండా ఆకాశ్, ఇషా అంబానీలు కూడా RIL బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు. -
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా..
ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ మార్చితో అంతమైన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 14 శాతం పెరిగి రూ.177 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.156 కోట్లుగానే ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,581 కోట్ల నుంచి రూ.1,961 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాంక్ స్థూల నిరర్థక రుణ ఆస్తులు (ఎన్పీఏలు) 2.99 శాతంగా నమోదయ్యాయి.క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 3.23 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు పెద్దగా మార్పు లేకుండా 1.12 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 1.11 శాతంగా ఉన్నాయి. వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.1.35 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇందుకు కంపెనీ వార్షిక సమావేశంలో (ఏజీఎం) వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.ఆర్బీఎల్ బ్యాంక్ లాభాలకు కోత ప్రైవేటు రంగ ఆర్బీఎల్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ లాభం గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024–25 క్యూ4) గణనీయంగా (76 శాతం) తగ్గిపోయింది. రూ.89 కోట్ల లాభం నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.364 కోట్లుగా ఉండగా, 2024 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.47 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 2 శాతం తగ్గి రూ.1,563 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 7 శాతం వృద్ధి కనిపించింది. ముఖ్యంగా ప్రొవిజన్లు, కంటింజెన్సీలకు (మొండి బకాయిలు, ఇతర అవసరాలకు) కేటాయింపులు రూ.785 కోట్లకు పెరిగిపోవడం లాభాలకు కోత పెట్టింది.క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి రూ.414 కోట్లుగానే ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ 5.45 శాతం నుంచి 4.89 శాతానికి తగ్గింది. బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతను గమనిస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2.6 శాతంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.65 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 0.74 శాతం నుంచి 0.29 శాతానికి తగ్గాయి. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.695 కోట్ల లాభం నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,168 కోట్లుగా ఉంది. ప్రతీ షేరుకు రూ.1 చొప్పున డివిడెండ్ పంపిణీకి బోర్డు సిఫారసు చేసింది. -
ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్
పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి వేదికగా ఉన్న ‘కార్స్ 24’ సంస్థ ఇటీవల 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ చోప్రా ఉద్యోగులకు అంతర్గత నోట్లో స్పష్టం చేశారు. ఈ తొలగింపులు నిరంతర లేఆఫ్స్ ప్రక్రియకు ప్రారంభం కాదని, కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన చర్యగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కార్స్24 సంస్థలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి వాటాలుండడం గమనార్హం.కఠినంగా నియామకాలుకార్స్24 మరింత కఠినమైన విధానాన్ని అనుసరిస్తూ నియామకాల ప్రక్రియ చేపడుతుందని చోప్రా నొక్కి చెప్పారు. ప్రస్తుత లేఆఫ్స్ కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తోడ్పడుతాయని తెలిపారు. కార్స్ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తున్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. కంపెనీ తన ప్లాట్ఫామ్ సామర్థ్యాలను పెంచడానికి, ఆటోమోటివ్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి దేశపు అతిపెద్ద ఆటోమోటివ్ ఫోరమ్ ‘టీమ్-బీహెచ్పీ’ని ఇటీవల కొనుగోలు చేసింది. అదనంగా, కార్స్ 24 వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్, బీమాతో సహా కొత్త కార్ల అమ్మకాలు, అనుబంధ సేవల కోసం ఆన్లైన్ సర్వీసులను ప్రారంభించింది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్ఆర్థిక పనితీరు, వ్యూహాత్మక సర్దుబాట్లుకార్స్ 24 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.498 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది వ్యూహాత్మక సర్దుబాట్ల అవసరాన్ని ఎత్తిచూపింది. యూనిట్ల అమ్మకాలు, సగటు అమ్మకపు ధరల పెరుగుదలతో కంపెనీ నిర్వహణ ఆదాయం 25 శాతం పెరిగి రూ.6,917 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. -
లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసుల ఎగుమతిదారుగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్లతోపాటు, కొత్త ప్రాజెక్టుల్లో పని చేసేందుకు నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఏప్రిల్ 26, శనివారం బెంగళూరులో లేటరల్ నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.మై ఎస్క్యూఎల్ డీబీఏ, అజూర్ ఎస్ఎంఈ, ఐబీఎం డీబీ2, ఏడబ్ల్యూఎస్ ఎస్ఎంఈ, ఒరాకిల్ డీబీఏ, డీబీ2 డిజైనర్ విభాగాల్లో నైపుణ్యాలున్న వారి కోసం టీసీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 15 ఏళ్ల ఫుల్ టైమ్ ఉద్యోగం చేసిన నిపుణుల కోసం కంపెనీ ఈమేరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. విద్య, ఉద్యోగాల మధ్య రెండేళ్లకు మించి గ్యాప్ ఉండకూడదనే షరతు ఉంది.ఇప్పటికే మార్చి 22న ఐదు నగరాల్లోని టెక్ నిపుణుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించిన టీసీఎస్ తిరిగి నెల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. గతంలో జరిగిన నియామకంలో ఆటోమేషన్ టెస్టర్ (సెలీనియం, కుకుంబర్), జావా డెవలపర్స్ (స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్), ఫ్రంట్ ఎండ్ యాంగులర్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్ (పైథాన్), డేటా సైంటిస్ట్స్ (ఎస్ఏఎస్/ఎస్క్యూఎల్), పవర్బీ డెవలపర్, స్నోఫ్లేక్, లీడ్ వెబ్ కాంపోనెంట్ డెవలపర్స్ (యాంగులర్) వంటి వివిధ పోస్టులకు మూడు నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, కోల్కతాల్లో నియమించుకుంది.ఇదీ చదవండి: జియో స్టోర్స్ల్లో స్టార్లింక్ హార్డ్వేర్ఈ ఏడాది జనవరిలో అట్రిషన్(కంపెనీ మారడం) కారణంగా టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గిందని, జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ స్వల్పంగానే ఈ లోటును భర్తీ చేసినట్లు తెలిపింది. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇదే తరహా నియామకాల ప్రక్రియను కొనసాగిస్తుండటంతో టీసీఎస్ నియామకాలు ఊపందుకున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా పైథాన్, డాట్నెట్, ఆండ్రాయిడ్/ ఐఓఎస్ డెవలప్మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ సహా 40+ నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నట్లు ఇన్ఫోసిస్ గత నెలలో అంతర్గత మెయిల్ను పంపించింది.