breaking news
Corporate
-
అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలు
అమెజాన్ ఇండియా డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించింది. ఇంటి నుంచే కస్టమర్లు ‘అమెజాన్ డయాగ్నోస్టిక్స్’ ద్వారా తమకు కావాల్సిన ల్యాబ్ టెస్ట్లను బుక్ చేసుకోవచ్చని, డిజిటల్ రిపోర్ట్లను అమెజాన్ యాప్ నుంచి పొందొచ్చని ప్రకటించింది. ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ సహకారంతో ఈ సేవలను తొలుత హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై పరిధిలో 450 పిన్కోడ్ల వ్యాప్తంగా అందిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ ద్వారా పరీక్షలను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన 60 నిమిషాల్లో సదరు మెడికల్ సిబ్బంది ఇంటికి వచ్చి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించుకుంటారు. నమూనాలు సేకరించిన తర్వాత గరిష్టంగా 6 గంటల్లో ఫలితాలకు సంబంధించిన డిజిటల్ ల్యాబ్ రిపోర్టులుగా అందజేస్తారు. మొత్తం 800 వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. దీంతో కలిపి ప్రస్తుత ఫార్మసీ, క్లినిక్ సేవలను అమెజాన్ మెడికల్తో అనుసంధానించింది. -
నియామకాలపై భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం!
ముంబై: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపించనున్నట్టు స్టాఫింగ్ సొల్యూషన్స్ అందించే జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక తెలిపింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ ఉద్యోగులు తమ కంపెనీలు నియామకాలు నిలిపివేయొచ్చని లేదా తగ్గించుకోవచ్చని చెప్పారు. 2006 మంది ఉద్యోగులను ఈ ఏడాది మే 12 నుంచి జూన్ 6 మధ్య సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. → సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తమ కంపెనీలు మొత్తంగా నియామకాలను నిలిపివేయొచ్చని లేదా నియామకాలు తగ్గించుకోవచ్చని చెప్పారు. → కాంట్రాక్టు ఉద్యోగులు, ఫ్రీలాన్సర్ల నియామకం దిశగా తమ కంపెనీలు అడుగులు వేస్తున్నట్టు 15 శాతం మంది చెప్పారు. → తమ వేతనాల పెంపు, బోనస్లు, ప్రోత్సాహకాలపై భౌగోళిక అస్థిరతలు ప్రభావం చూపించొచ్చని 36 శాతం మంది అభిప్రాయపడ్డారు. → 21 శాతం మంది పని భారం పెరగనుందని ఆందోళన చెందారు. → అంతర్జాతీయ వ్యాపారం, పర్యటనలపై ప్రభావం పడుతుందని 22% మంది చెప్పారు. → బృంద ధైర్యం, విశ్వాసంపై ప్రభావం పడుతుందని 21 శాతం అభిప్రాయపడ్డారు. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల తాము ఎంతో ఆందోళన చెందుతున్నామని, దీని తాలూకూ ఆరంభ హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నట్టు 30 శాతం మంది చెప్పారు. -
తప్పుడు టికెట్ ఇచ్చి తిప్పలు పెడతారా? ఎయిర్లైన్కు జరిమానా
ప్రయాణికుడికి తప్పుడు విమాన టికెట్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేసిన ఎయిర్లైన్ సంస్థ స్పైస్ జెట్కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. స్పైస్ జెట్ తప్పుడు టికెట్లు జారీ చేయడంతో ఓ సీనియర్ సిటిజన్ ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాడని, ఆ ప్రయాణికుడికి రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.ముంబై (సబర్బన్) జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జూన్ 17న జారీ చేసిన ఉత్తర్వులలో ప్రయాణికుడిని "మానసిక వేధింపులకు" గురిచేసిన సంఘటనలో "లోపభూయిష్టమైన సేవ, నిర్లక్ష్య ప్రవర్తన"కు స్పైస్ జెట్ను వినియోగదారుల కమిషన్ దోషిగా పేర్కొంది.వివరాల్లోకి వెళ్తే.. ఘట్కోపర్ ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ 2020 డిసెంబర్ 5న ముంబై నుండి దర్భంగాకు స్పైస్ జెట్లో రానూపోనూ టికెట్లను బుక్ చేసుకున్నారు. ముంబై-దర్భంగా ప్రయాణం పూర్తి కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా తిరుగు ప్రయాణాన్ని విమానయాన సంస్థ రద్దు చేసింది. 2020 డిసెంబర్ 8న ముంబైలో పీహెచ్డీ ఆన్లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికుడు కోరగా అదే రోజు పాట్నా నుంచి కోల్కతాకు, అక్కడి నుంచి ముంబైకి ప్రయాణించేందుకు స్పైస్జెట్ ప్రత్యామ్నాయ టికెట్ అందించింది.అయితే తీరా పాట్నాకు చేరుకున్న తర్వాత ఆ టికెట్లు తప్పుగా ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. దీంతో ప్రయాణికుడు మరుసటి రోజు ఉదయం తన సొంత ఖర్చులతో మరో విమానాన్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆయనకు మానసిక వేదనతోపాటు ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైకి ఆలస్యంగా రావడం వల్ల ఆయన పరీక్షకు కూడా రాయలేకపోయారు.ఇదంతా విమానయాన సంస్థ సేవల్లో లోపం, నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ సదరు వ్యక్తి వినియోగదారుల ప్యానెల్ ను ఆశ్రయించారు. రూ.14,577 ఛార్జీ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2 లక్షలు, లిటిగేషన్ ఖర్చు కింద రూ.25 వేలు స్పైస్ జెట్ నుంచి ఇప్పించాలని కోరారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రద్దు జరిగిందని, దీనికి తమ బాధ్యత పరిమితమని స్పైస్ జెట్ వాదించింది. అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, బుకింగ్ ఏజెన్సీ ద్వారా ఫిర్యాదుదారుడికి పూర్తి టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని ఎయిర్లైన్స్ పేర్కొంది.దీనిపై వినియోగదారుల కమిషన్ స్పందిస్తూ విమానాల రద్దు విమానయాన సంస్థ నియంత్రణకు అతీతమైనదని అంగీకరిస్తూనే ఫిర్యాదుదారుకి తప్పుడు టికెట్లు జారీ చేసిన నిర్లక్ష్య చర్య నుంచి విమానయాన సంస్థ తప్పించుకోజాలదని స్పష్టం చేసింది. ప్రయాణికుడికి మానసిక వేదనకు పరిహారంగా రూ .25,000, లిటిగేషన్ ఖర్చు కోసం రూ .5,000 చెల్లించాలని కమిషన్ విమానయాన సంస్థను ఆదేశించింది. -
కార్పొరేట్ యోగా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. దేశీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, ఎండీలు ‘యోగా డే’ను జరుపుకున్నారు. ప్రతిరోజూ యోగా సాధనతో సత్యాన్ని అన్వేషిస్తున్నాను. శ్వాసపై నియంత్రణతో భావోద్వేగాలపై పట్టు సాధింవచ్చు. యోగా మార్గం పూర్తి క్రమశిక్షణతో కూడుకున్నది. స్వీయ ఆవిష్కరణకు దిక్సూచి లాంటిది’’ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ‘‘యోగా ద్వారా పది నిమిషాల ఉచ్ఛా్వస నిశ్వాసాలతో, పరుగులు పెడుతున్న ప్రపంచంలోనూ ప్రశాంతతను పొందవచ్చు’’ అని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు లభించిన అమూల్యమైన బహుమతి యోగా. ఇది క్రమశిక్షణ, సాధన, జీవన మార్గం’’ అని జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తెలిపారు. యోగా గురువు రామ్దేవ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
హెచ్డీఎఫ్సీ కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొన్నాళ్ల క్రితం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను కొనుగోలుపై ఆసక్తి చూపింది. అందుకోసం ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ చందా కొచర్తో నిర్వహించిన చర్చాగోష్టి సందర్భంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మాజీ చైర్మన్, సీనియర్ బ్యాంకర్ దీపక్ పరేఖ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘ఐసీఐసీఐతోనే హెచ్డీఎఫ్సీ ప్రారంభమైంది. అలాంటప్పుడు సొంతింటికి తిరిగి రావచ్చు కదా, అని ఒకసారి మీరు ఆఫర్ ఇచ్చిన సంగతి నాకు గుర్తుంది. కానీ దాన్ని నేను తిరస్కరించాను. అది సముచితం కాదని చెప్పాను‘ అని పరేఖ్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత నియంత్రణ నిబంధనల ఒత్తిడి కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సంస్థను విలీనం చేశామని, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ తమకు కొంత తోడ్పాటు అందించిందని ఆయన చెప్పారు. విలీనమనేది సంస్థకు మేలు చేసేది కాగా, భారీ స్థాయి బ్యాంకులు ఉండటమనేది దేశానికే మంచి చేస్తుందని పరేఖ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భారతీయ బ్యాంకులు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా మరింత బలోపేతం కావడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 44 ఏళ్ల చరిత్ర గల హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థ రివర్స్ మెర్జర్ ద్వారా అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రివర్స్ మెర్జర్కి ముందు దాన్ని కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతిపాదన చేసింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ ఆర్థికంగా తోడ్పాటు అందించింది. -
కోడింగ్ పోరులో కంపెనీలు..
సాంకేతికత పెరిగే కొద్దీ కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో కొత్త రకం యుద్ధాలు మొదలవుతున్నాయి. పైథాన్, రస్ట్లాంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్లతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాటాల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ కత్తులు దూసుకుంటున్నాయి. ఏఐ టెక్ దిగ్గజాలు ఇటీవలే పోటాపోటీగా కొత్త సాధనాలను ఆవిష్కరించాయి. గూగుల్ తమ గోడింగ్ ఏజెంట్ జ్యూల్స్ను, మైక్రోసాఫ్ట్ గిట్హబ్ ఏఐ ఏజెంటును, కోడింగ్ స్టార్టప్ విండ్సర్్ఫను 3 బిలియన్ డాలర్లతో కొన్న ఊపులో ఓపెన్ఏఐ సంస్థ కోడెక్స్ను ప్రవేశపెట్టాయి. వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, కోడింగ్ రాయడంలో డెవలపర్లకు సహాయం చేయడం, బగ్లను ఫిక్స్ చేయడం, అలాగే కర్సర్, లవబుల్, బోల్ట్లాంటి స్టార్టప్లతో నేరుగా పోటీపడటం. డెవలపర్లు, అంకుర సంస్థలు ఈ పరిణామాలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. జెన్ఏఐ రేసుతో ముందుగా ప్రభావం పడేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగమేనని పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీలు ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కోడింగ్ టూల్స్ను విరివిగా ఉపయోగిస్తుండటం ఇందుకు నిదర్శనమంటున్నారు. టూల్స్ వాడకం ఒక్కటే ఆప్షన్.. ఏఐ టూల్స్ను ఉపయోగించడాన్ని నేర్చుకోవడం తప్ప ప్రస్తుతం వేరే ఆప్షన్ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఇప్పటికే కోడింగ్ 30 శాతం ఏఐ ద్వారానే జరుగుతోంది. అటు ఇన్మొబీ సంస్థ కోడింగ్లో దాదాపు 50 శాతం ఏఐతోనే జరుగుతోంది. దీన్ని 80 శాతానికి పెంచుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం మార్కెట్స్అండ్మార్కెట్స్ గణాంకాల ప్రకారం ఏఐ కోడింగ్ టూల్ మార్కెట్ ఏటా 28 శాతం వృద్ధి చెందుతూ 2028 నాటికి 12.6 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్పాదకత పెరగడంపరంగా ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండటం, మార్కెటింగ్ .. సేల్స్లాంటి నాన్–టెక్నికల్ టీమ్లు కూడా ఉపయోగించడానికి సులువుగా ఉండటం వంటి అంశాల కారణంగా కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ విభాగంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెక్ దిగ్గజాలకు ఆదాయార్జనకు ఇదొక కొత్త మార్గంగా నిలుస్తోంది. కొత్త ఆదాయ మార్గం.. ఫౌండేషనల్ మోడల్స్పై కోట్ల కొద్దీ డాలర్లు కుమ్మరించిన కంపెనీలు ఇప్పుడు వాటిపై రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ ప్లాట్ఫాం అయిన నోవియం వర్గాలు తెలిపాయి. ఎల్ఎల్ఎంలకు కోడ్ జనరేట్ చేయడమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందని వివరించాయి. కర్సర్ అనే సంస్థ గత రెండేళ్లుగా ఏటా 300 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలను ఆర్జిస్తోందని పేర్కొన్నాయి. ఇక బోల్ట్, లవబుల్లాంటి సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. తమ ఇంజినీర్ల ఉత్పాదకత కనీసం 10–20 శాతమైన పెరుగుతుందంటే ఈ టూల్స్పై ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం కోడింగ్ ఆటోమేషన్ అనేది ప్రస్తుతం హాట్ సెక్టార్గా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నికల్యేతర నేపథ్యాలున్న వారు కూడా సులభంగా, సరళంగా వెబ్సైట్లు, చాట్బాట్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతోందని వివరించాయి. సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏఐ టూల్స్ను మిగతా అవసరాల కోసం పెద్దగా ఉపయోగించకపోయినా ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.సవాళ్లూ ఉన్నాయి.. కోడింగ్ పని 70 శాతం వేగవంతమవడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. కోడింగ్ చేయడానికి టూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ, వీటితో సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పని వేగవంతమవుతోంది కాబట్టి ఏఐని ఉపయోగించి ప్రతి ఒక్కరూ కోడింగ్ చేసేయొచ్చనే అపోహలు ఉంటున్నాయని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయితే సరిపోదు, దాన్ని 100 శాతం వరకు తీసుకెళ్లేందుకు నిపుణుల అవసరం అవుతుందని వివరించారు. అంతేగాదు, కోడింగ్ టూల్స్ వినియోగం పెరిగే కొద్దీ రివ్యూ చేయాల్సిన కోడ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ కస్టమర్లపై ప్రభావం పడకుండా రివ్యూ ప్రక్రియలను కూడా కంపెనీలు ఆటోమేట్ చేస్తున్నాయి. తాము ఏకకాలంలో వివిధ సిస్టమ్లను అభివృద్ధి చేస్తూనే, వాటి అమలు తీరుతెన్నులను కూడా పర్యవేక్షించే ప్రయత్నాల్లో ఉన్నామని ఇన్మొబి వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను పరీక్షించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల తమ దగ్గర కోడింగ్లో ఏఐ వినియోగం ప్రస్తుతానికి యాభై శాతం స్థాయిలోనే ఉందని వివరించాయి. -
రూ.43 వేల కోట్ల పడవపై పెళ్లి...
ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల ఆందోళన.విలాసవంతమైన నావపై..వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.భారీగా పెళ్లి ఖర్చువెనిస్ లో బెజోస్, సాంచెజ్ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం.. ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు. -
దేశీయ కళలకు జీవం పోసేలా ఎన్ఎంఏసీసీ భారీ ఈవెంట్
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్ View this post on Instagram A post shared by NMACC India Weekend (@nmacc.indiaweekend)ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివివైజేషన్ టు నేషన్’ ఈవెంట్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. దాంతోపాటు ఈ హైప్రొఫైల్ ఈవెంట్ సెలబ్రిటీల ఫ్యాషన్ షో, దేశ హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయని చెప్పారు. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నీతా అంబానీ చెప్పారు. -
నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన
ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్ ఆంత్రప్రెన్యూర్గా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపార సామ్రాజ్య పునాదికి దారితీసిన అంశాల గురించి, తండ్రి సురేష్ ఒబెరాయ్ చిన్నతనం నుంచే తనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎలా నేర్పించారో చెప్పారు.దుబాయ్ ప్రాపర్టీ ఇన్సైడర్ పాడ్కాస్ట్లో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ‘వ్యాపార మెలకువలు నేర్చుకునే తొలినాళ్లలో నాలో ఆర్థిక అవగాహన పెంపొందించిన ఘనత నా తండ్రికే దక్కుతుంది. అతను ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి నేను దాన్ని ఎలా విక్రయించబోతున్నాననే దానిపై వ్యాపార ప్రణాళికను రూపొందించమని అడిగేవారు. దాంతో నేను 10 ఏళ్ల వయసు నుంచే వ్యాపారంలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా తండ్రి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను ధనవంతుడినని.. మేము కాదనే చెబుతుండేవారు. మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోమన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..‘ఈ కఠినమైన ప్రేమతో కూడిన విధానం టీనేజ్ నుంచే నన్ను తోటివారి కంటే భిన్నంగా ఆలోచించేలా చేసింది. చాలా మంది టీనేజర్లు స్కూళ్లలోని పాఠాలు నేర్చుకుంటుంటే.. నేను మాత్రం మార్కెట్, వ్యాపారం, స్టాక్స్.. వంటి ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. దాంతో నా మొదటి కంపెనీ కోసం 3 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాతి కాలంలో నా పెట్టుబడిదారుల కోసం చాలా డబ్బు సంపాదించాను. నా 23 ఏళ్ల వయసులో ఆ కంపెనీని విక్రయించాను. తర్వాత ఇతర కంపెనీలను కొనుగోలు చేశాను. ప్రస్తుతం తొమ్మిది సంస్థలను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లగలిగాను. మరో నాలుగు కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని యోచిస్తున్నాను’ అని తెలిపారు. -
ఎయిరిండియాకు డ్రీమ్లైనర్ క్రాష్ సెగ
న్యూఢిల్లీ: గతవారం బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా బుకింగ్స్, చార్జీలు పడిపోయాయి. దేశ, విదేశీ రూట్లలో బుకింగ్స్ 20 శాతం పడిపోగా, చార్జీలు సైతం సగటున 8–15 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూన్ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్కి బైల్దేరిన కాస్సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ తగ్గడాన్ని గమనించామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రెసిడెంట్ రవి గోసాయి తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ 18–22 శాతం, దేశీయంగా 10–12 శాతం మేర తగ్గినట్లు వివరించారు. అయితే, ఇదంతా తాత్కాలికమే కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఇండిగో, ఆకాశతో నేరుగా పోటీ ఉన్న దేశీ రూట్లలో ఎయిరిండియా టికెట్ల చార్జీలు 8–12 శాతం తగ్గినట్లు గోసాయి చెప్పారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో చార్జీలు 10–15 శాతం క్షీణించినట్లు వివరించారు. పలువురు ప్రయాణికులు ఎయిరిండియా ఫ్లయిట్స్లో ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్, హై–ఎండ్ లీజర్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సంస్థలకు మళ్లినట్లు వివరించారు. గత వారం రోజులుగా అంతర్జాతీయ రూట్లలో క్యాన్సిలేషన్లు 15–18 శాతం, దేశీ రూట్లలో 8–10 శాతం స్థాయిలో ఉన్నట్లు గోసాయి చెప్పారు. అయితే, ఎయిరిండియా విమానాలు అంతర్జాతీయ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లుగా నియంత్రణ సంస్థలు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారొచ్చని వివరించారు. మరోవైపు, ఎయిరిండియా ఫ్లయిట్స్ బుకింగ్స్ 15–20 శాతం వరకు, చార్జీలు కొన్ని రూట్లలో 10 శాతం వరకు తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా చెప్పారు. -
ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్ను
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు. -
రచ్చకెక్కిన కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం
సన్టీవీ ఛైర్మన్ కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సోదరుడు దయానిధి మారన్ కళానిధితోపాటు మరో ఏడుగురికి లీగల్ నోటీసులు పంపించడంతో పరిస్థితులు తీవ్రంగా పరిణమించాయి. కళానిధి మారన్ తన వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళానిధిపై చర్యలు తీసుకోవాలని దయానిది కోరారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్కు కూడా నోటీసులు అందాయి.కళానిధి మారన్ సారధ్యం వహిస్తున్న సన్ గ్రూప్ ఆధ్వర్యంలో టెలివిజన్, రేడియో, ప్రింట్, సినిమా, క్రీడా విభాగాల్లో వ్యాపారాలున్నాయి. కళానిధితో సంబంధం ఉన్న కీలక కంపెనీలు, వెంచర్ల జాబితా కింది విధంగా ఉంది.మీడియా, ఎంటర్టైన్మెంట్సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ - 37 టీవీ ఛానళ్లు నిర్వహిస్తోంది.సన్ పిక్చర్స్ - చిత్ర నిర్మాణ సంస్థ.సన్ డైరెక్ట్ - డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) శాటిలైట్ టీవీ సర్వీస్.సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ - కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.కేఏఎల్ పబ్లికేషన్స్ / కుంగుమమ్ పబ్లికేషన్స్ - కుంగుమమ్ తమిళ పత్రికను ప్రచురిస్తుంది.కేఏఎల్ కేబుల్స్ - కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.కేఏఎల్ రేడియో / సౌత్ఏషియా ఎఫ్ఎమ్ - సూర్యన్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ వంటి బ్రాండ్ల ద్వారా 69 ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను నిర్వహిస్తుంది.ఇదీ చదవండి: గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్ప్రింట్ మీడియాదినకరన్ - ఈ గ్రూపునకు చెందిన ప్రముఖ తమిళ దినపత్రిక.క్రీడలుసన్ రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ.సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ - దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జట్టు.గతంలోని వెంచర్స్పైస్ జెట్ - మారన్ 2010 నుంచి 2015 వరకు కేఏఎల్ ఎయిర్ వేస్ ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగా అందులో నుంచి నిష్క్రమించారు. -
ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి. -
వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటా
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తన మొత్తం సంపద దాదాపు 17 బిలియన్ డాలర్లను తన 100 మందికి పైగా పిల్లలకు పంచాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదు.. ఈ పిల్లలందరూ తన వీర్యదానం వల్ల పుట్టిన సంతానం కావడం విశేషం. ఫ్రెంచ్ మ్యాగజైన్ లీ పాయింట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల దురోవ్ తాను కనీసం 106 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అని చెప్పారు. వీరిలో ఆరుగురు వేర్వేరు తన భాగస్వాములతో సహజంగా గర్భం దాల్చగా, మిగిలిన 100 మందికి పైగా పిల్లలు 12 దేశాల్లో జన్మించారని చెప్పారు.‘నా పిల్లల్లో కొందరు సహజంగా గర్భం దాల్చి పుట్టినవారున్నారు. చాలామంది నా స్పెర్మ్ దానం వల్ల పుట్టినవారున్నారు. వారంతా నా బిడ్డలే. అందరికీ నా ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి’ అని చెప్పారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం దురోవ్ నికర విలువ 13.9 బిలియన్ డాలర్ల నుంచి 17.1 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక్కో బిడ్డకు సుమారు 131 మిలియన్ డాలర్ల నుంచి 161 మిలియన్ డాలర్ల వరకు వారసత్వంగా లభిస్తుంది. అయితే తన పిల్లలకు సమాన హక్కులు ప్రకటించినట్లు ఉన్న ఇంటర్వ్యూ తేదీ(జూన్ 19, 2025) నుంచి 30 సంవత్సరాల వరకు తన ఆస్తిపై హక్కు ఉండదని చెప్పారు. ముప్పై ఏళ్ల తర్వాతే తమకు హక్కులుంటాయన్నారు. వారు స్వతంత్రంగా ఎదగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దురోవ్ వివరించారు. వారు సాధారణ ప్రజల మాదిరిగా జీవించాలని, ఒంటరిగా తమను తాము నిర్మించుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..దురోవ్ను ఇటీవల ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటి వాటికి వినియోగిస్తున్నారనే వాదనలున్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. -
టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్లోని 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది. -
వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
ప్రముఖ ఐటీ సర్వీస్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధానంగా తన సేల్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వేలాది ఉద్యోగాలను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కంపెనీ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జులై ప్రారంభంలో ఉద్యోగాల్లో కోతలను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.ఇప్పటికే మైక్రోసాఫ్ట్ మే నెలలో 6,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. తర్వాత కొన్ని వారాలకు 300కి పైగా తొలగించింది. ఈ ఏడాది మూడో అతిపెద్ద ఉద్యోగుల తగ్గింపునకు సంస్థ సిద్ధమవుతోంది. గతంలో ప్రకటించిన లేఆఫ్స్ ద్వారా ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ప్రభావితం అయ్యారు. ఈసారి భిన్నంగా మైక్రోసాఫ్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగ కోతలను విధించే అవకాశం ఉంది. జూన్ 2024 నాటికి కంపెనీ మొత్తం 2,28,000 మంది ఉద్యోగుల్లో 45,000 మంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపుప్రత్యేకంగా సేల్స్ విభాగంతో సంబంధం లేకుండా చిన్న, మధ్య తరహా కస్టమర్లకు ఎక్కువ సాఫ్ట్వేర్ సర్వీసులను అమ్మేందుకు థర్డ్ పార్టీ సంస్థలను వాడుకునేలా కంపెనీ ఏప్రిల్లో ప్రణాళికలు ప్రకటించింది. దాంతో ఈ విభాగంలో కోతలకు పూనుకుంటున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. కృత్రిమ మేధ పెట్టుబడుల నిర్వహణ టెక్ కంపెనీలకు సవాలుగా మరుతుంది. దాంతో ఇలా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డేటా సెంటర్ వ్యయం కోసం మైక్రోసాఫ్ట్ సుమారు 80 బిలియన్ డాలర్లు కేటాయించింది. -
కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు
ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. ఓవైపు సొంతంగా కార్యకలాపాలు విస్తరిస్తూనే టాటా గ్రూప్ కంపెనీ కొంతకాలంగా పలు సంస్థలను సొంతం చేసుకుంటోంది. ఏడాది క్రితం క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియాను రూ.7,000 కోట్ల సంయుక్త విలువలో కొనుగోలు చేసింది. మార్కెట్లో కంపెనీ ఎల్లవేళలా ఇతర సంస్థల కొనుగోలుకి సిద్ధంగా ఉంటుందని టాటా కన్జూమర్ డైరెక్టర్ పీబీ బాలాజీ పేర్కొన్నారు.కంపెనీ పోర్ట్ ఫోలియోకు సరిపోయే సంస్థ తగిన ధరలో దొరికితే వదిలిపెట్టబోమని బాలాజీ తెలియజేశారు. అయితే సొంతంగా కార్యకలాపాలు విస్తరించడానికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన కంపెనీ ప్రధానంగా ఫుడ్ విభాగంలో కొనుగోళ్లకు తెరతీసింది. ఈ బాటలో బెంగళూరు సంస్థ కొట్టారం ఆగ్రో ఫుడ్స్ను సైతం చేజిక్కించుకుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుఅత్యంత గరిష్టాలకు చేరిన టీ ధరలు ఇటీవల నిలకడను సంతరించుకుంటున్నట్లు వాటాదారుల వార్షిక సమావేశంలో బాలాజీ పేర్కొన్నారు. వెరసి ఇకపై కంపెనీ మార్జిన్లు, లాభదాయకత మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తేయాకు దిగుబడి గతేడాదిని మించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాఫీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈ ఏడాది సాధారణ స్థితికి చేరవచ్చని అంచనా వేశారు. -
మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలు
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ భారత్లో మరిన్ని చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎంఎస్ఎంఈ) కలిసి పని చేసే ప్రణాళికల్లో ఉంది. తమ ‘వృద్ధి’ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్లో తమ సరఫరా వ్యవస్థలో మరో లక్ష ఎంఎస్ఎంఈలను భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం చిన్న సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడే ఐడియాస్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ (ఐ2ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వాల్మార్ట్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ ఫ్రెమ్స్టాడ్ తెలిపారు.ఇప్పటికే ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ మార్కెట్ప్లేస్ల ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో చిన్న సంస్థలను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధి ప్రోగ్రాం ద్వారా కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఎంఎస్ఎంఈలకు అవసరమయ్యే నైపుణ్యాల్లో వాల్మార్ట్ మార్గదర్శకత్వం వహిస్తోంది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 70,000 ఎంఎస్ఎంఈలకు శిక్షణనిచ్చినట్లు ఫ్రెమ్స్టాడ్ వివరించారు. ఇదీ చదవండి: ‘రేర్ ఎర్త్’ రీసైక్లింగ్పై రూ.100 కోట్ల పెట్టుబడులువృద్ధి ప్రోగ్రాం విజయవంతం కావడంతో మెక్సికో, అమెరికాలో కూడా వాల్మార్ట్ ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గత 25 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న వాల్మార్ట్ రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆహారోత్పత్తులు, ఫార్మా, సైకిళ్లు మొదలైనవి కొనుగోలు చేసింది. -
‘రేర్ ఎర్త్’ రీసైక్లింగ్పై రూ.100 కోట్ల పెట్టుబడులు
రేర్ ఎర్త్ లోహాల (ఆర్ఈఈ) రీసైక్లింగ్ సామర్థ్యాలను వచ్చే ఏడాది, రెండేళ్ల వ్యవధిలో 30,000 టన్నులకు పెంచుకోవాలని ఈ–వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీ అటెరో నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ సీఈవో నితిన్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి 300 టన్నుల సామర్థ్యం ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, ఇతర టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలకంగా ఉంటాయి. నియోడైమియం, ప్రసియోడైమియం, డిస్ప్రోజియంలాంటి అరుదైన ఖనిజాల వెలికితీతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా వివరించారు.ఇదీ చదవండి: బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తుకీలకమైన ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా భారత్ స్వయం సమృద్ధి సాధించాలనేది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్ఈఈ మార్కెట్ 2029 నాటికి ఆర్ఈఈ మార్కెట్ ఏటా 12.6 శాతం వార్షిక వృద్ధితో 10.9 బిలియన్ డాలర్లకు చేరుతుందని, ఆర్ఈఈ మ్యాగ్నెట్ల మార్కెట్ 2033 నాటికి 30.3 బిలియన్ డాలర్ల స్థాయిని దాటొచ్చని అంచనాలు నెలకొన్నాయి. అటెరోకి 46 గ్లోబల్ పేటెంట్లు ఉన్నాయి. అమెరికా, యూరప్లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది. -
దేశీ విస్తరణపై అమెజాన్ దృష్టి
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ దేశీ కార్యకలాపాలను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు ఈ కేలండర్ ఏడాది(2025)లో రూ. 2,000 కోట్లు కేటాయించనుంది. ప్రధానంగా నెట్వర్క్ విస్తరణ, అప్గ్రేడ్పై పెట్టుబడులు వెచి్చంచనుంది. తద్వారా ఆధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలు, ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో అమెజాన్ పేర్కొంది. అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, బ్రాడ్బ్యాండ్ విస్తరణ, డిజిటల్ చెల్లింపులకుతోడు, వినియోగ వ్యయాలు పెరుగుతుండటం వంటి సానుకూలతల నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలను మరింత అప్గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇటీవల కొన్నేళ్లుగా అమెజాన్సహా, రిటైల్ రంగ దిగ్గజం వాల్మార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్ తదితర ఆన్లైన్ సంస్థలు దేశీయంగా ఈబిజినెస్ను పరుగుపెట్టిస్తున్న సంగతి తెలిసిందే. కోట్లకొద్దీ పెట్టుబడులను వెచి్చంచడం ద్వారా దేశీయంగా ఈకామర్స్ మార్కెట్ను భారీగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2030కల్లా ఈకామర్స్ మార్కెట్ 21 శాతం వార్షిక వృద్ధితో 325 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. తాజా పెట్టుబడులతో అమెజాన్ దేశవ్యాప్తంగా అవకాశమున్న పిన్కోడ్లకు సరీ్వసులను విస్తరించాలని భావిస్తోంది. ఇందుకు కొత్త ప్రాంతాలలో వేర్హౌస్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్నవాటిని ఆధునీకరించడం, డెలివరీ నెట్వర్క్ను వేగవంతం చేయడం తదితర సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. -
డ్రీమ్ఫోక్స్కి బ్యాంకులు గుడ్బై?
ముంబై: గతేడాది పలు ఎయిర్పోర్టుల్లో కస్టమర్లు లాంజ్ సర్వీసులను పొందడంలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ట్రావెల్, లైఫ్స్టయిల్ సర్వీసుల అగ్రిగేటర్ డ్రీమ్ఫోక్స్తో ఒప్పందం నుంచి తప్పుకోవాలని పలు బ్యాంకులు, కార్డ్ నెట్వర్క్లు భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మాస్టర్కార్డ్ మొదలైనవి ఉన్నాయి. మరిన్ని బ్యాంకులు వాటి బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లిస్టెడ్ కంపెనీ అయిన డ్రీమ్ఫోక్స్ దేశీయంగా దిగ్గజ ఎయిర్పోర్ట్ లాంజ్ ఆపరేటర్లలో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తోంది. గతేడాది సెపె్టంబర్ 22న సర్వీసుల్లో అంతరాయం కారణంగా పలు విమానాశ్రయాల్లో లాంజ్ని ఉపయోగించుకోలేక బ్యాంకులు, కార్డ్ నెట్వర్క్లకు చెందిన వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 34 ఎయిర్పోర్టుల్లోని 49 లాంజ్ సర్వీసులు అకస్మాత్తుగా నిలి్చపోయాయి. -
9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్
భారత ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సిబుల్ స్టాఫ్(సంస్థలకు అనుకూలంగా అవసరం మేరకే నియమకం అయ్యే ఉద్యోగులు) విధానం కీలకంగా మారుతోంది. సంస్థలు ఈ ఫ్లెక్సీ స్టాఫ్ను ప్రధాన శ్రామిక శక్తిగా స్వీకరించడంతో ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్న గిగ్ ఎకానమీలో 2030 నాటికి 9 లక్షల మంది నిపుణులు చేరుతారని ఒక నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ ఐటీ / ఐటీఈఎస్ రంగంలో 3,90,000 ఫ్లెక్సీ స్టాఫ్ ఉన్నారు. ఇది ఈ రంగంలోని మొత్తం 5.8 మిలియన్ల నిపుణుల్లో 7 శాతం అని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్నెట్ నివేదికలో తెలిపింది. ‘ది రైజ్ ఆఫ్ ఫ్లెక్సీ స్టాఫింగ్: అవుట్లుక్ ఫర్ ఇండియా ఐటీ / ఐటీఈఎస్ టాలెంట్ ల్యాండ్ స్కేప్’ పేరుతో రిపోర్ట్ తయారు చేసింది.2030 నాటికి ఈ ఫ్లెక్సీ స్టాఫ్ రెండింతలు పెరిగి 9,00,000కు చేరుకుంటుందని, 15 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)తో వృద్ధి చెందుతుందని నివేదిక అంచనా వేసింది. రియల్ టైమ్ హైరింగ్ డేటా, మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఆధారంగా కెరియర్నెట్ ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ గ్లోబల్ ఆఫ్షోరింగ్ హబ్ కావడంతో ఐటీ/ ఐటీఈఎస్ సెక్టార్లో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ యాక్సిలరేషన్, ప్రపంచ ఆర్థిక మార్పుల మధ్య ఫ్లెక్సీ స్టాఫింగ్ నియామకం పెరుగుతుందని, స్పెషలైజేషన్, స్కేలబిలిటీకి మద్దతు ఇచ్చేందుకు ఈ నమూనాను చాలా కంపెనీలు అనుసరిస్తున్నట్లు కెరియర్నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు.ఇదీ చదవండి: పీఎస్యూల డీలిస్టింగ్ సరళతరంఐటీ/ఐటీఈఎస్ శ్రామిక శక్తిలో 25 శాతంతో ఫ్లెక్సీ స్టాఫ్ నియామల్లో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ 15 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై సహా ఇతర ప్రధాన నగరాలు మొత్తం వాటాలో సుమారు 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్లెక్సీ ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
హిందుస్తాన్ జింక్లో వాటా విక్రయించిన దిగ్గజ కంపెనీ
అనిల్ అగర్వాల్ గ్రూప్ దిగ్గజం వేదాంతా తాజాగా మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్లో మైనారిటీ వాటా విక్రయించింది. బుక్బిల్డ్ పద్ధతిలో సంస్థాగత ఇన్వెస్టర్లకు హిందుస్తాన్ జింక్లో 1.6 శాతం వాటాకు సమానమైన 66.7 మిలియన్ షేర్లను అమ్మినట్లు వేదాంతా పేర్కొంది. డీల్ విలువను రూ.3,028 కోట్లుగా వెల్లడించింది. కంపెనీ వ్యూహాత్మక కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకున్న విశ్వాసాన్ని తాజా లావాదేవీ ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది.ప్రస్తుత ఏడాది(2025–26)కి కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు అంగీకరించినట్లు మరో ప్రకటనలో స్టాక్ ఎక్స్ఛేంజీలకు వేదాంతా సమాచారమిచ్చింది. ఇందుకు ఈ నెల 24(మంగళవారం) రికార్డ్ డేట్గా ప్రకటించింది. కాగా.. వేదాంతా వివిధ బిజినెస్ విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలు అమలు చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా సమీకరించిన నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడం ద్వారా బ్యాలన్స్ షీట్ పటిష్టతకు వినియోగించే వీలుంది. తద్వారా ఆర్థిక సౌలభ్యతతోపాటు.. స్వతంత్ర కంపెనీలుగా ఏర్పాటుకానున్న వివిధ బిజినెస్ల వృద్ధి ప్రణాళికలకు మద్దతు లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’ఈ ఏడాది సెప్టెంబర్లోగా విభిన్న బిజినెస్లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. విడదీత తదుపరి వేదాంతా అల్యూమినియం, వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంతా పవర్, వేదాంతా స్టీల్ అండ్ ఫెర్రస్ మెటీరియల్స్, వేదాంతా బేస్ మెటల్స్, వేదాంతా లిమిటెడ్ పేరుతో ఆరు సంస్థలుగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది. -
‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’
మోసాలతో సంక్షోభం బారిన పడిన ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఆర్థిక నివేదికల పూర్తిస్థాయి పరిశీలనకు, ఆడిట్ పరమైన లోపాలు ఉన్నాయా? అన్నది నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత మండలి ఐసీఏఐ ప్రకటించింది. ఇప్పటికే ఐసీఏఐకు చెందిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్ఆర్ఆర్బీ) ఈ రెండు సంస్థల ఆర్థిక నివేదికల సమీక్షను ప్రారంభించిందని, ఇందులో గుర్తించిన వాస్తవాల ఆధారంగా, అవసరమైతే ఆడిటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: భారత ఆటబొమ్మల నాణ్యత భేష్‘ఖాతాల్లో అసలు ఏమి జరిగిందన్నది తెలుసుకోవడానికి కనీసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువే సమయం తీసుకోవచ్చు’ అని ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్జిత్ సింగ్ నందా తెలిపారు. ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో వాస్తవాలు, పారదర్శకత లేదని ఎఫ్ఆర్ఆర్బీ గుర్తించినట్టయితే, అప్పుడు ఐసీఏఐ క్రమశిక్షణ చర్యల కమిటీ ముందుకు ఈ అంశం వెళుతుందని చెప్పారు. జెన్సోల్ ఇంజినీరింగ్ ఖాతాల నుంచి నిధులు మళ్లించినట్టు సెబీ దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో రూ.1,979 కోట్ల మేర ఖాతాల్లో లోపాలున్నట్టు, స్వయంగా బ్యాంకు వెల్లడించడం గమనార్హం. -
హైదరాబాదీ సంస్థకు డీబీఎస్ ఫౌండేషన్ అవార్డు
వృద్ధులకు సంరక్షణ సేవలు అందించే హైదరాబాదీ సంస్థ లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్కు (ఇండియా) డీబీఎస్ ఫౌండేషన్ ఇంపాక్ట్ బియాండ్ అవార్డు దక్కింది. దీనితో సంస్థకు సుమారు రూ. 3 కోట్ల గ్రాంట్ ఫండింగ్ లభించింది. ఈ తరహా సేవలకు గణనీయంగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ సీఈవో అనంత్ కుమార్ తెలిపారు. లైఫ్ సర్కిల్ వృద్ధులకు ప్రొఫెషనల్గా సర్వీసులను అందించడమే కాకుండా సంరక్షకులకు శిక్షణతో పాటు జీవనోపాధి కూడా కల్పిస్తోందని డీబీఎస్ ఫౌండేషన్ హెడ్ కరెన్ నిగుయి చెప్పారు. వంద దరఖాస్తులు రాగా సింగపూర్, చైనా, హాంకాంగ్, భారత్కి చెందిన మొత్తం నాలుగు సంస్థలు విజేతలుగా నిల్చియి. వాటిలో లైఫ్ సర్కిల్ కూడా ఒకటి. ఇప్పటివరకు 5,000 మంది సంరక్షకులకు ప్లేస్మెంట్ కల్పించింది.అనుబంధ సంస్థగా జియో పేమెంట్స్ఎస్బీఐ వాటా జియో ఫైనాన్షియల్ చేతికిజియో పేమెంట్స్ బ్యాంక్లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)కు గల మొత్తం 17.8 శాతం వాటాను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 104.54 కోట్లు వెచ్చించినట్లు జియో ఫైనాన్షియల్ తాజాగా వెల్లడించింది. దీంతో జియో పేమెంట్స్ బ్యాంక్ పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించినట్లు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి తదుపరి ఎస్బీఐ నుంచి 7,90,80,000 ఈక్విటీ షేర్లను రూ. 104.54 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. -
ఏసీ అమ్మకాల్లో వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూమ్ ఏసీల విక్రయాలు 10–15 శాతమే పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అధిక డిమాండ్ ఉండే జూన్లో ఉత్తర, పశ్చిమ భారత్లో వేడి వాతావరణం నెలకొనగా, మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కంపెనీలు తమ అంచనాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏసీల అమ్మకాలకు వేసవి సీజన్ ఎంతో కీలకం. అధిక శాతం అమ్మకాలు ఈ సీజన్లోనే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది వేసవిలో మధ్యంతర వర్షాలు ఈ రంగం ఆశలపై నీళ్లు చల్లింది. జూన్లో ఉత్తరాది అంతటా వేడి వాతావరణం నెలకొనడం ఒక్కటి విక్రయాలకు కాస్తంత మద్దతునిచ్చే అంశం. నిజానికి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫిబ్రవరి, మార్చిలోనే రూమ్ ఏసీల అమ్మకాలకు అధికంగా నమోదు కావడం గమనార్హం. దీంతో గతేడాది సీజన్తో పోలి్చతే ఈ ఏడాది 25 శాతం అధిక అమ్మకాలపై కంపెనీలు అంచనాలు వేసుకున్నాయి. తర్వాత మారిన వాతావరణ పరిస్థితులతో ఈ అంచనాలు నిజం కాలేదు. ‘‘25–30 శాతం మేర అమ్మకాల వృద్ధిని ఆశించాం. కానీ, అనుకున్న స్థాయిలో అమ్మకాలు సాధించలేదు. ఈ వేసవి నిరాశపరిచిందనడంలో సందేహం లేదు. కానీ, వ్యాపారంలో ఇదొక భాగమే. ఈ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే’’అని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది ఆర్ఏసీ విక్రయాలు 10–15% వృద్ధికి పరిమితం కావొచ్చని చెప్పారు. జూన్ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయంటూ భారత వాతావరణ శాఖ గత వారం అంచనాలు వెల్లడించడం గమనార్హం. సెపె్టంబర్ క్వార్టర్లో పుంజుకోవచ్చు.. ప్రస్తుత జూన్ త్రైమాసికం రూమ్ ఏసీ రంగానికి అనుకూలంగా లేదని.. సెపె్టంబర్ త్రైమాసికంలో విక్రయాలు పుంజుకోవచ్చని త్యాగరాజన్ పేర్కొన్నారు. పండుగల సందర్భంగా డిమాండ్ పెరగొచ్చన్నారు. ఎనర్జీ లేబుళ్లు మారుతుండడం, డిస్కౌంట్ ఆఫర్లతో గత నిల్వలను తగ్గించుకోగలమన్నారు. ఇంధన ఆదా లేబుళ్లను మార్చే ముందు ముందస్తు కొనుగోళ్లు పెరగడం సహజమేనన్నారు. 2024 అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు గత రెండు నెలల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి సైతం తెలిపారు. కనుక జూన్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చని, గతేడాది మాదిరిగా 25 శాతం వృద్ధిని సాధించడం సవాలుగా పేర్కొన్నారు. వేసవిలో అమ్మకాలు గరిష్టంగా ఉండే సమయంలో వర్షాలు దెబ్బతీసినట్టు చెప్పారు. ఏప్రిల్, మే నెలలో అమ్మకాల వృద్ధిని కోల్పోవడంతో, మిగిలిన ఏడాదిలో కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాదిలో వేడి వాతావరణంతో ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయంటూ, ఇదొక్కటే సానుకూలతగా పేర్కొన్నారు. జూన్లో కాస్త మెరుగు.. హైయర్ అప్లయన్సెస్ ఇండియా మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు మెరుగైన వృద్ధిని సొంతం చేసుకుంది. గతేడాదితో పోలి్చతే రూమ్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు సంస్థ ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ వెల్లడించారు. ‘‘ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకు సానుకూలంగా లేవు. 10–15 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. జూన్లో తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. ఫిబ్రవరి, మార్చిలోనే ప్రణాళిక మేరకు ముందస్తు కొనుగోళ్లు జరిగాయి’’అని వివరించారు. కానీ, ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లు.. ఉష్ణోగ్రతలు పెరగకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా జూన్లో గత పది రోజులుగా ఉత్తరాది ప్రాంతంలో అమ్మకాలు పెరిగినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో మిగిలిన కాలానికి పరిశ్రమ అంచనాలు తగ్గించుకున్నట్టు సతీష్ తెలిపారు. గతేడాది స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చంటూ.. అమ్మకాలు 10–15 శాతం వృద్ధికి పరిమితం కావొచ్చన్నారు. -
రెడిట్ ప్రచారకర్తగా సచిన్ టెండుల్కర్
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫాం రెడిట్కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇకపై తన రెడిట్ ప్రొఫైల్ ద్వారా తన అభిప్రాయాలు, మ్యాచ్ల విశ్లేషణ, ఎక్స్క్లూజివ్ కంటెంట్ను ఆయన షేర్ చేస్తారు. అలాగే భారత్తో పాటు ఇతరత్రా మార్కెట్ల కోసం రూపొందించే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో ఆయన కనిపిస్తారని కంపెనీ వివరించింది. వివిధ వర్గాలందరినీ ఒక చోటికి చేర్చే రెడిట్తో జట్టు కట్టడం సంతోషకరమైన విషయమని టెండుల్కర్ తెలిపారు. శ్రేష్టమైన క్రికెట్కు టెండుల్కర్ పేరు పర్యాయపదమని రెడిట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గేశ్ కౌశిక్ వివరించారు. తమ ప్లాట్ఫాంలో క్రీడలపై ఆసక్తి వార్షికంగా 30 శాతం పెరగడంతో స్పోర్ట్స్ కంటెంట్కి మరింత ప్రాధాన్యం ఇవ్వడం మీద రెడిట్ దృష్టి పెడుతోంది. ఈ మధ్యే ఇటాలియన్ ఫుట్బాల్ లీగ్ సిరీ ఏ, గతేడాది ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ, ఎంఎల్బీ తదితర అమెరికన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
ప్యారిస్ ఎయిర్షోలో రఘు వంశీ టర్బోజెట్ ఇంజిన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యారిస్లో జరుగుతున్న 55వ అంతర్జాతీయ ఎయిర్షోలో హైదరాబాద్ సంస్థ రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్ తమ 40 కేజీఎఫ్ మైక్రో టర్బోజెట్ ఇంజిన్ను ఆవిష్కరించింది. దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించినట్లు సంస్థ ఎండీ వంశీ వికాస్ తెలిపారు. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ), క్రూయిజ్ మిసైల్స్ కోసం తయారు చేసిన ఈ ఇంజిన్ను డీఆర్డీవో అధికారుల సమక్షంలో విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని హార్డ్వేర్ పార్క్లో ఏర్పాటు చేస్తున్న 2,50,000 చ.అ. తయారీ ప్లాంటు 2026 ప్రారంభం నాటికి అందుబాటులోకి రావచ్చన్నారు. -
మేక్మైట్రిప్ భారీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: షేర్లు, మార్పిడికి వీలయ్యే బాండ్ల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్ల(రూ. 21,500 కోట్లు)కుపైగా సమీకరించనున్నట్లు ట్రావెల్ బుకింగ్ సర్వీసుల దిగ్గజం మేక్మైట్రిప్ తాజాగా తెలియజేసింది. నిధులను చైనా సంస్థ ట్రిప్.కామ్ గ్రూప్ వాటా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ట్రిప్.కామ్ గతంలో కొనుగోలు చేసిన క్లాస్ బీ షేర్లను సొంతం చేసుకునేందుకు పెట్టుబడులను వినియోగించనున్నట్లు నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ పేర్కొంది. గత నెలలో పాకిస్తాన్పై చేపట్టిన మిలిటరీ చర్యల తదుపరి చైనా, టర్కీ తదితర దేశాల నుంచి బిజినెస్లను తగ్గించుకోవాలని దేశీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో మేక్మైట్రిప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మేక్మైట్రిప్లో చైనా సంస్థలకు యాజమాన్య హక్కులున్నట్లు ప్రత్యర్ధి కంపెనీ ఈజ్మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ గత నెలలో ఆరోపించిన విషయం విదితమే. -
భారత్లో ఫాల్కన్ జెట్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారత్లో ఫాల్కన్ 2000 బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్ ఏరోస్పేస్ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్తో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (ఆర్ఏఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే ప్రథమం. ప్యారిస్ ఎయిర్షో సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయం ప్రకటించాయి. హై ఎండ్ బిజినెస్ జెట్స్ తయారీకి భారత్ వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ‘ఫాల్కన్ 2000 జెట్స్’ కోసం అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయనున్నాయి. దీంతో బిజినెస్ జెట్స్ను తయారు చేయడంలో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్ సరసన భారత్ కూడా చేరుతుంది. మేకిన్ ఇండియా నినాదానికి తమ మద్దతును తెలియజేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ డి. అంబానీ పేర్కొన్నారు. జంట ఇంజిన్లుండే ఈ విమానాల్లో 8–10 మంది వరకు ప్రయాణించవచ్చు. 2028 నాటికి తొలి మేడిన్ ఇండియా ఫాల్కన్ 2000 విమానం డెలివర్ కానుంది. డసాల్ట్ ఏవియేషన్ గత వందేళ్లలో 90 పైగా దేశాలకు 10,000 మిలిటరీ, పౌర విమానాలను సరఫరా చేసింది. 2017లో డసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. 2019లో ఫాల్కన్ 2000 ముందు భాగా న్ని ఉత్పత్తి చేసినప్పటి నుంచి 100కు పైగా కీలకమైన సబ్–సెక్షన్లను ఈ జేవీ తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా ఫాల్కన్ జెట్స్ తయారీలో కీలకంగా ఎదిగింది. -
ఐటీలో తాత్కాలిక ఉద్యోగులు ఐదేళ్లలో డబుల్!
ముంబై: ఐటీ, ఐటీఈఎస్ రంగంలో తాత్కాలిక ఉద్యోగులకు (ఫ్లెక్సీ వర్క్ఫోర్స్) డిమాండ్ క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో 3,90,000 మంది ఫ్లెక్సీ వర్క్ఫోర్స్ ఉండగా.. వీరి సంఖ్య 2030 నాటికి 9 లక్షలకు చేరుకుంటుందని కెరీర్నెట్ నివేదిక వెల్లడించింది. ఏటా వీరి సంఖ్య 15 శాతం చొప్పున పెరగనుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఐటీ రంగం 58 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తుంటే.. వీరిలో 7 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ రంగంలో పెరుగుతున్న ఫ్లెక్సీ స్టాఫింగ్ పేరుతో కెరీర్నెట్ ఒక నివేదిక విడుదల చేసింది. నియామకాల డేటా, మార్కెట్ పరిశోధన, పరిశ్రమలో ధోరణులను విశ్లేíÙంచి ఈ వివరాలు ప్రకటించింది. ‘భారత్ ప్రపంచ ఆఫ్షోర్ హబ్గా మారుతోంది. కనుక ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరగనుంది. డిజిటల్ టెక్నాలజీలకు మళ్లడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పుల నేపథ్యంలో వేగం, ప్రత్యేకత, విస్తరణ అవసరాలకు మద్దతుగా ఫ్లెక్సీ స్టాఫింగ్ నమూనాను కంపెనీలు అనుసరిస్తున్నాయి’ అని కెరీర్నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలబ్ శుక్లా తెలిపారు.కెరీర్లో పురోగతికి దారి.. నిపుణులకు వృత్తిలో ఎదుగుదల, నైపుణ్యాల అభివృద్ధి, పని–వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యాన్ని ఫ్లెక్సీ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని చెబుతూ.. మిలీనియల్స్, జెనరేషన్ జెడ్ నిపుణులకు ఇవి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్క్ఫోర్స్కు బెంగళూరు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఈ రంగంలోని మొత్తం తాత్కాలిక సిబ్బందిలో 25 శాతం మంది ఈ నగరంలోనే ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ 15 శాతం మంది ఫ్లెక్సీ వర్క్ఫోర్స్కు ఉపాధి కలి్పస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే, చెన్నై ఒక్కోటీ 10 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ తాత్కాలిక ఉద్యోగుల సిబ్బందిలో వృద్ధి నమోదవుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలోని ఫ్లెక్సీ వర్క్ఫోర్స్లో 20 శాతం మేర ఈ నగరాల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. నిపుణుల లభ్యతకు, తక్కువ వ్యయాలతో కూడిన వ్యాపార నమూనాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
జియో బ్లాక్రాక్ కొత్త ప్లాట్ఫామ్ ‘అలాదీన్’
జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ‘అలాదీన్’ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. దీంతో బ్లాక్రాక్కు చెందిన పెట్టుబడుల విశ్లేషణ, రిస్క్ నిర్వహణ ప్లాట్ఫామ్ మొదటిసారి భారత ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.‘‘పెట్టుబడులు ఇక ఎంతో సులభం. జియో ఫైనాన్షియల్, బ్లాక్రాక్ సంయుక్తంగా ఇదే నమ్మకాన్ని ఇన్వెస్టర్ల ముందుకు తీసుకొచ్చాయి. జియో డిజిటల్ ఫస్ట్ విధానానికి, బ్లాక్రాక్ సంస్థకు అంతర్జాతీయంగా పెట్టుబడుల్లో ఉన్న నైపుణ్యం కలగలసి ఇన్వెస్టర్లకు అనుకూలమైన సొల్యూషన్లను అందించనున్నాం’’అని జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ ప్లాట్ఫామ్పై ట్వీట్ చేసింది.ఇది ఆరంభం మాత్రమేనంటూ.. అందరికీ అందుబాటు ధరలకే పెట్టుబడుల సేవలను అందించనున్నట్టు పేర్కొంది. జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్), యూఎస్ ఆధారిత బ్లాక్ రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్. -
జాబ్లో చేరకుండానే రూ.25 లక్షలు..
ఆఫర్ లెటర్ అనేది ఉద్యోగ ఎంపికలో కీలక దశ. స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయి ఆఫర్ లెటర్ చేతికొచ్చేసిందంటే ఇక ఉద్యోగం ఖరారైపోయిందని అభ్యర్థులు ఆనందంగా భావిస్తారు. కానీ ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతమూ ఇవ్వకుండా వేధిస్తున్న కంపెనీని కోర్టుకు లాగి సరిగ్గా బుద్ధి చెప్పాడో అభ్యర్థి..ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోని అబుదాబిలోని ఓ కంపెనీపై స్థానిక కోర్టు తగిన చర్యలు తీసుకుంది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సదరు బాధిత ఉద్యోగికి 'బకాయి వేతనం'గా 1,10,400 దిర్హమ్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.25 లక్షలు చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు తన వేతనాన్ని యజమానులు నిలిపివేశారని ఆరోపిస్తూ సదరు ఉద్యోగి కంపెనీపై దావా వేశారు.👉 సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!ఆఫర్ లెటర్ ప్రకారం.. ఉద్యోగితో ఆ కంపెనీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 7,200 దిర్హమ్ల బేసిక్ వేతనం, నెలకు 24,000 దిర్హమ్ల ప్యాకేజీ ఇస్తామని ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ నిబంధనల్లో పేర్కొంది. కానీ అతని జాయినింగ్ తేదీని కంపెనీ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతం కూడా ఇవ్వకపోవడంతో సదరు ఉద్యోగి కంపెనీని కోర్టుకు లాగాడు.కోర్టు ఏం చెప్పిందంటే..వేతన నివేదిక, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉద్యోగి విధుల్లో చేరిక జాప్యానికి కంపెనీ యాజమాన్యమే కారణమని స్పష్టమైందని కోర్టు పేర్కొంది. కార్మిక చట్టాల ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.1,10,400 (సుమారు రూ.25 లక్షల వరకు) వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.మరోవైపు, సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లాడని, విధులకు హాజరు కాకపోవడం వల్ల అతను పూర్తి వేతనానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది. అయితే ఉద్యోగి విధులకు గైర్హాజరయ్యాడన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని విధుల్లో చేరిక జాప్యం పూర్తిగా కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చిచెప్పింది. కాగా తాను ఎనిమిది రోజులు మాత్రమే సెలవు తీసుకున్నట్లు ఉద్యోగి చెప్పడంతో ఈ మేరకు అతని జీతంలో మినహాయించారు. -
ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్
దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న ఈ కార్యక్రమం ఆటోలు, బైకులు, క్యాబ్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ అవుతుందని పేర్కొంది. రైడ్ పరిమాణం లేదా ఆదాయంపై ఎటువంటి పరిమితులను ఉండవని పేర్కొంది.కొత్త ప్రోగ్రామ్లో భాగంగా డ్రైవర్లు ఈ ప్రణాళికను ఎంచుకోవచ్చని చెప్పింది. కమీషన్ రూపంలో ఓలాకు వెళ్లే ఛార్జీలను ఎటువంటి మినహాయింపులు లేకుండా డ్రైవర్లు ఆ మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు నెలవారీ సబ్స్క్రిప్షన్ పొందాలని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ను ఉపయోగించుకునే డ్రైవర్లు 30 రోజుల పాటు రోజుకు రూ.67 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే నెలకు రూ.2,010 అవుతుంది.ఇదీ చదవండి: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రంఈ ఫీచర్తో డ్రైవర్లు జీరో కమీషన్ క్లెయిమ్ చేసుకునే ఛార్జీలపై ఎలాంటి పరిమితులు లేవని, తమ ఛార్జీల మొత్తాన్ని క్లెయిమ్ చేసేటప్పుడు వాహనం ఎంపికపై కంపెనీ ఎలాంటి ఆంక్షలు విధించదని తెలిపింది. ఈ ఫీచర్ ఓలా ఆటో, ఓలా బైక్స్, ఓలా క్యాబ్స్కు అందుబాటులో ఉంది. ‘కమీషన్లను తొలగించడం వల్ల డ్రైవర్ భాగస్వాములకు మరింత అవకాశాలు లభిస్తాయి’ అని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పు వల్ల డ్రైవర్ ఆదాయం ఏటా రూ.1,36,000 పెరుగుతుందని, ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 30 శాతం అధికమని చెప్పింది. -
ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపద
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ.3.59 లక్షల కోట్ల చొప్పున నికర విలువతో ఇండియాలో సంపద సృష్టికర్తల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. క్రిసిల్ సహకారంతో 360 వన్ వెల్త్ దేశంలోని వివిధ రంగాల్లో సేవలిందిస్తున్న అత్యంత సంపన్నుల జాబితాను తయారు చేసింది.ఈ సమగ్ర జాబితాలో కనీసం రూ.500 కోట్ల నికర విలువ కలిగిన 2,013 మంది ఉన్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, వారసులు, పెట్టుబడిదారులు, వృత్తి నిపుణులు చోటు సంపాదించుకున్నారు. వీరి సంపద దాదాపు రూ.100 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. 161 మంది వ్యక్తులు రూ.10,000 కోట్లకు మించి, 169 మంది వ్యక్తులు రూ.5,000-రూ.10,000 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్నారని ఈ అధ్యయనం తెలిపింది.ఇదీ చదవండి: ఐదు రెట్లు పెరిగిన ఉత్పాదకతమహిళా పారిశ్రామికవేత్తల్లో ఇషా అంబానీ రూ.3.58 లక్షల కోట్లతో అత్యంత ధనిక వ్యాపార యజమానిగా నిలిచారు. వ్యాపారాలను స్థాపించిన లేదా అధిక విలువ జోడించేందుకు గణనీయమైన పాత్ర పోషించిన 72 మంది మహిళా నాయకులను కూడా ఈ నివేదిక గుర్తించింది. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. మొత్తం ప్రమోటర్ సంపదలో రిలయన్స్, టాటా, అదానీ గ్రూపుల వాటా 24 శాతంగా ఉంది. దేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు 360 ఐటీ వెల్త్ క్రియేటర్స్ జాబితాలో ఉన్న కంపెనీల మొత్తం సంపదలో 59 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ మాత్రమే ఇందులో 12% వాటాను కలిగి ఉన్నాయి.అంబానీల ప్రభావంటెలికాం, రిటైల్, ఎనర్జీ, డిజిటల్ సర్వీసెస్.. వంటి కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుస్థిర నాయకత్వాన్ని అంబానీ కుటుంబం కొనసాగిస్తోంది. భారతదేశ డిజిటల్ విప్లవానికి జియో నాయకత్వం వహించడం, రిలయన్స్ రిటైల్ దూకుడుగా విస్తరించడంతో అంబానీ కుటుంబం ఆర్థిక సామ్రాజ్యం రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. -
తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!
బ్రాడ్క్యాస్టింగ్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్)కు ప్రమోటర్లు పెట్టుబడులు సమకూర్చనున్నారు. తద్వారా తమ వాటాను పెంచుకోనున్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థల నుంచి రూ. 2,237 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు జీల్ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో పూర్తిగా మారి్పడికి వీలయ్యే 16.95 కోట్లకుపైగా వారంట్లను జారీ చేసేందుకు బోర్డు అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆల్టిలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రమోటర్ల నుంచి అందుకోనున్న పెట్టుబడుల ద్వారా కంపెనీ ప్రధాన బిజినెస్ విభాగాలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో వృద్ధి అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేసింది.ఒక్కో వారంట్కు రూ.132 ధరలో..ఒక్కో వారంట్కు రూ. 132 ధర చొప్పున ప్రమోటర్లకు 16,95,03,400 వారంట్లను జీల్ జారీ చేయనుంది. తద్వారా నగదు రూపేణా రూ. 2,237.44 కోట్లు లభించనుండగా.. కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.39 శాతానికి చేరనున్నట్లు జీల్ వివరించింది. కాగా.. సెబీ మార్గదర్శకాల ప్రకారం వారంట్ను రూ. 128.58 ధరలో కేటాయించవలసి ఉన్నప్పటికీ బోర్డు రూ. 3.42 ధర అధికంగా నిర్ణయించింది. ఇందుకు ప్రమోటర్లు సైతం అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇష్యూ ధరలో ప్రమోటర్లు ముందస్తుంగా 25 శాతం(రూ. 33) ధర చెల్లించనున్నారు. వారంట్లను అలాట్మెంట్ నుంచి గరిష్టంగా 18 నెలల్లోగా ప్రమోటర్లు షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990ఒక్కో వారంట్కు రూ. 99(75 శాతం) చొప్పున చెల్లించడం ద్వారా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.99 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. దేశీ మీడియా బిజినెస్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)ను జీల్తో విలీనం చేసే ప్రతిపాదనను గతేడాది సోనీ గ్రూప్ విరమించుకున్న నేపథ్యంలో ప్రమోటర్ల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
కార్డీలియా క్రూయిజెస్ ఐపీవో బాట...
న్యూఢిల్లీ: లగ్జరీ క్రూయిజ్ల నిర్వాహక కంపెనీ వాటర్వేస్ లీజర్ టూరిజం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 727 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో దాదాపు రూ. 553 కోట్లను డిపాజిట్ లేదా అడ్వాన్స్డ్ లీజ్ రెంటల్కు చెల్లించనుంది. అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్(ఐఎఫ్ఎస్సీ) ప్రయివేట్ లిమిటెడ్కు నెలవారీ లీజు చెల్లింపులకు సైతం వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.కార్డీలియా క్రూయిజెస్ బ్రాండుతో ప్రస్తుతం వాటర్వేస్ లీజర్ ఎంవీ ఎంప్రెస్ క్రూయిజ్ వెస్సల్ను నిర్వహిస్తోంది. నార్వేజియన్ స్కై, నార్వేజియన్ సన్ అనే మరో రెండు క్రూయిజ్ల నిర్వహణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. ఒక్కో క్రూయిజ్ షిప్ ద్వారా సుమారు 2,000 మంది అతిథులకు సేవలు అందించనుంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహిస్తున్న ఎంప్రెస్ క్రూయిజ్ ప్రధానంగా ముంబై, గోవా, కొచ్చి, చెన్నై, లక్షద్వీప్, విశాఖపట్టణం, పుదుచ్చేరిలకు సేవలందిస్తోంది.శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నాకు సైతం సర్వీసులు నిర్వహించడంతోపాటు.. ఇటీవలే ఆగ్నేయాసియాకు కూడా సేవలు విస్తరించింది. తొలిసారి ఫుకెట్ (థాయ్లాండ్), సింగపూర్, కౌలాలంపూర్ (మలేసియా) తదితర ప్రాంతాలకూ జూలైలో సర్వీసులను మొదలు పెడుతోంది. 2024 డిసెంబర్31తో ముగిసిన తొలి 9 నెలల్లో రూ. 409 కోట్ల ఆదాయం, రూ. 139 కోట్ల నికర లాభం ఆర్జించింది.చదవండి: అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడంతో.. -
త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపు
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్ కంపెనీ జులైలో మరింత మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈసారి తొలగింపులు సంస్థ ఫ్యాక్టరీ కార్మికులు 15 నుంచి 20 శాతం మందిని ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. కొత్త సీఈఓ లిప్-బు టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థ త్వరలో భారీగా శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తుంది. రాబోయే కోతలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇంటెల్ ఫౌండ్రీ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.నిర్ణయం బాధాకరమైనా తప్పదుకంపెనీ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం ఇంటెల్లో కొత్త విడత తొలగింపులు జులై మధ్యలో ప్రారంభమై నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉంది. ఇంటెల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చీఫ్ నాగ చంద్రశేఖరన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ నిర్ణయం చాలా బాధాకరమైనది. కానీ పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అవసరం’ అని చెప్పారు.జాగ్రత్తగా, గౌరవంతో..ఉద్యోగుల తగ్గింపు శాతంపై ఇంటెల్ నేరుగా వ్యాఖ్యానించనప్పటికీ ఉద్యోగులను ‘జాగ్రత్తగా, గౌరవంతో’ చూస్తామని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు మెరుగ్గా స్పందించడానికి ఇంజినీరింగ్ బృందాలను శక్తివంతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు ఉన్నాయని తెలిపింది. గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఇంటెల్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. పీసీ, డేటా సెంటర్ మార్కెట్లలో పెరుగుతున్న పోటీ వల్ల కంపెనీ కాస్త వెనుకబడుతుందనే వాదనలున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదనే అభిప్రాయాలున్నాయి. ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఒరెగాన్లో 3,000 మంది ఉన్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీగట్టిదెబ్బ..రాబోయే తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ కర్మాగారాలపై ప్రభావం చూపనుండగా, సుమారు 20,000 మంది కార్మికులున్న ఒరెగాన్లో గట్టిదెబ్బ పడే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రాధాన్యతలు, నైపుణ్య మదింపుల ఆధారంగా కోతలకు సిద్ధం కావాలని కంపెనీ ఇప్పటికే విభాగాలను నోటిఫై చేసింది. ఉన్నత యాజమాన్యం అందించిన చట్రంలోనే తొలగింపులను అమలు చేసే విచక్షణాధికారాన్ని ఆయా విభాగాధిపతులకు ఇచ్చినట్లు తెలిసింది. -
పాత బంగారానికి 2 క్యారెట్ల అదనపు విలువ
పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బంగారు ఆభరణాల రిటైల్ బ్రాండ్ తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ పాత బంగారానికి గరిష్టంగా 2 క్యారెట్ల అదనపు విలువ పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిమిత కాల ఆఫర్ జూన్ 30, 2025 వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.ఆఫర్ ఎలా పనిచేస్తుందంటే..పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే కస్టమర్లు కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు క్యారెట్ విలువను పొందేలా ఈ ఆఫర్ను డిజైన్ చేశారు. ప్లేయిన్ జ్యువెలరీ లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 1 క్యారెట్ అదనంగా పొందవచ్చు. అదే వజ్రాలతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 2 క్యారెట్లను అదనంగా పొందేందుకు ఈ ఆఫర్ ద్వారా వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంకస్టమర్ల పాత బంగారం 20 క్యారెట్లు ఉండి దాన్ని ఎక్స్ఛేంజ్ ఇచ్చి తిరిగి కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే పాత దాన్ని 21 క్యారెట్లుగా లెక్కిస్తారు. అదే వజ్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు 22 క్యారెట్లుగా విలువ కడుతారు. బంగారం ధరలు పెరుగుతున్నందున ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తనిష్క్ ప్రీమియం డిజైన్లను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదా వ్యక్తిగతంగా తమ ఆభరణాలు కొత్త డిజైన్లలోకి మార్చుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. -
తత్కాల్ కొత్త రూల్ తెలుసు కదా.. ఆధార్ లింక్ చేశారా మరి!?
తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూలై 1 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) యాప్, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఏఐ బోట్లు, ఏజెంట్ల బెడదను నివారించేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తత్కాల్ అనేది ఇండియన్ రైల్వే ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దీని ద్వారా అప్పటికప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తక్కువ సమయంలో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.👉ఇది చదవలేదా? వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయంఇండియన్ రైల్వే అమలు చేస్తున్న కొత్త రూల్ ప్రకారం.. ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ అకౌంట్కు యూజర్ ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కావాల్సినవి యాక్టివ్ ఐఆర్సీటీసీ అకౌంట్, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్.ఆధార్ లింక్ చేసుకోండిలా..ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ( www.irctc.co.in )లోకి లాగిన్ అవ్వాలి.'మై అకౌంట్'పై క్లిక్ చేసి 'అథెంటికేట్ యూజర్' ఎంచుకోండి.మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.'వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.సమ్మతి బాక్సును టిక్ చేసి 'సబ్మిట్' నొక్కండి.మీ ఆధార్ విజయవంతంగా లింక్ అయిన తర్వాత ధ్రువీకరణ కన్పిస్తుంది. -
విప్రోలో మళ్లీ చేతులు మారిన ప్రమోటర్ల వాటాలు
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో 1.72 శాతం చేతులు మారింది. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సమాచారం ప్రకారం 1.72 శాతం వాటాకు సమానమైన 18.05 కోట్ల ఈక్విటీ షేర్లను అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ విక్రయించింది. వీటిని షేరుకి రూ. 259 సగటు ధరలో ప్రమోటర్ గ్రూప్నకు చెందిన ప్రజీమ్ ట్రేడర్స్, జాష్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 4,675 కోట్లుకాగా.. సోమవారం(9న) సైతం అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ 1.93 శాతం వాటాకు సమానమైన 20.23 కోట్ల షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిని షేరుకి రూ. 250 సగటు ధరలో ప్రేమ్జీ ఇన్వెస్ట్కు చెందిన ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, హర్షమ్ ట్రేడర్స్ అండ్ ప్రజీమ్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 5,057 కోట్లుకాగా.. గతేడాది నవంబర్లో ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా ప్రేమ్జీ ఇన్వెస్ట్ 1.6 శాతం వాటాకు సమానమైన 8.49 కోట్ల విప్రో షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 4,757 కోట్లు వెచ్చించింది. అయితే వీటిని ప్రజీమ్, జాష్ ట్రేడర్స్ వీటిని విక్రయించడం గమనార్హం! -
సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రుల జోరు
దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ చెయిన్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఏటా 24 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 20 శాతం పైగా ఎబిటా మార్జిన్లు, 30 శాతం పైగా ఆర్వోసీఈలు (పెట్టుబడిపై రాబడులు), రెండేళ్ల వ్యవధిలోనే బ్రేక్–ఈవెన్ సాధించే అవకాశాలు మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. ఎవెండస్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంలో ఈ సెగ్మెంట్ .. భారీ స్థాయిలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. సుమారు 3.7 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. హాస్పిటల్స్లోకి వచి్చన మొత్తం పెట్టుబడుల్లో ఇది సుమారు 35 శాతం. ఇలా వచి్చన పెట్టుబడుల్లో దాదాపు 70 శాతం భాగం ఐవీఎఫ్, ఐకేర్, తల్లి..బిడ్డ సంరక్షణ, డయాలిసిస్, ఆంకాలజీ వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు దోహదపడ్డాయి. గత మూడేళ్లుగా దంత సంరక్షణ, యూరాలజీ/నెఫ్రాలజీ, స్కిన్..హెయిర్ కేర్ వంటి స్పెషాలిటీ విభాగాల్లోని ప్రముఖ సంస్థల్లోకి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య భారీగా వ్యత్యాసం నెలకొనడం ఇందుకు కారణం.కన్సాలిడేషన్కి అవకాశం.. న్యూఢిల్లీ: నివేదిక ప్రకారం తక్కువ స్థాయి పెట్టుబడి, నిర్దిష్టమైన సేవలకు పరిమితం కావడం తదితర అంశాల వల్ల ఈ విభాగం ఇటు ఇన్వెస్టర్లకు, అటు వ్యవస్థాపకులకు ఆకర్షణీయంగా ఉంటోంది. ఇక ఈ స్పెషాలిటీల్లో అగ్రగాములుగా ఉంటున్న సంస్థలు అధిక వృద్ధి సాధన కోసం ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం కాస్త పెద్ద మొత్తాన్నే వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటు చేసుకునే అవకాశాలను ఇది సూచిస్తోంది.మార్కెట్ క్యాప్ పెరుగుదల.. అగ్ర శ్రేణి సంస్థలు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. దీనితో మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ లిస్టెడ్ సింగిల్ స్పెషాలిటీ చెయిన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న 3.9 బిలియన్ డాలర్ల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం వంటి అంశాల వల్ల దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పేషంట్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపర్చగలిగే సామర్థ్యాలు, సమర్ధవంతంగా కార్యకలాపాలను విస్తరించగలిగే వీలు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే అవకాశం ఉండటం వల్ల ఈ విభాగం ఆకర్షణీయంగా ఉంటోందని ఎవెండస్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చెయిన్లు .. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమవుతున్నాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్లలో అంతరాలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ఆ ప్రాంతాల్లో వృద్ధికి అవకాశం ఉందని గుప్తా చెప్పారు. క్రిత దశాబ్ద కాలంలో ఏ విధంగానైతే మలీ్ట–స్పెషాలిటీ విభాగం విస్తరించిందో అదే విధంగా పబ్లిక్ మార్కెట్లలో ఈ హాస్పిటల్స్ చెయిన్స్ లిస్టింగ్ సందడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు పటిష్టమైన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సంపన్న దేశాల్లో ఈ తరహా మోడల్స్ విజయవంతమయ్యాయని గుప్తా చెప్పారు. -
ఆఫీస్ స్పేస్కి అమెరికన్ సంస్థల దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి. ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సరీ్వసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు. -
ఎస్బీఐలో హోమ్లోన్లు.. గుడ్న్యూస్
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్ల కోత జూన్ 15 నుంచి అమలులోకి వస్తుందని, ప్రస్తుత రెపో లింక్డ్ రుణాలు, కొత్త రుణగ్రహీతలకు వర్తిస్తుందని ఎస్బీఐ పేర్కొంది.వారం రోజుల క్రితం ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటులో సగం శాతం తగ్గింపునకు అనుగుణంగా ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్), గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఈ తగ్గింపు తర్వాత ఈబీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది.రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యుకో బ్యాంక్ వంటివి ఇప్పటికే రుణ రేట్లను తగ్గించాయి. ఎందుకంటే రెపో రేటుతో లింక్ అయిన లేదా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రుణాలుగా పిలిచే, ఫ్లోటింగ్ రేట్లలో ఉన్న రుణాలకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన వెంటనే కాకపోయినా, వచ్చే నెల మొదటి రోజు నాటికి రెపో తగ్గింపును ప్రస్తుత రుణగ్రహీతలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. -
ఐపీవోకి వస్తోన్న సోలార్ కంపెనీ
న్యూఢిల్లీ: సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ రేజాన్ సోలార్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతోంది. రూ. 1,500 కోట్ల సమీకరణకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ని సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ ఇప్పటికే పలు దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను నియమించుకుంది.తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కార్యకలాపాల విస్తరణకు కంపెనీ వినియోగించుకోనున్నట్లు సమాచారం. 2017లో ఏర్పాటైన రేజాన్ సోలార్ దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సోలార్ పీవీ మాడ్యుల్స్ తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. సంస్థవెబ్సైట్ ప్రకారం గుజరాత్లోని కారంజ్, సావా ప్లాంట్లలో 6,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించింది. కంపెనీ ఇటీవల మార్చిలో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 138 కోట్లు సమీకరించింది. -
పిజ్జా కంపెనీలో రూ. 1801 కోట్ల షేర్లు అమ్మేసిన ప్రమోటర్లు
జూబిలెంట్ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్లు గణనీయంగా వాటాలు విక్రయించారు. జూబిలెంట్ ఫుడ్వర్క్స్ (జేఎఫ్ఎల్), జూబిలెంట్ ఇన్గ్రేవియా, జూబిలెంట్ ఫార్మోవాలో రూ. 1,801 కోట్ల విలువ చేసే వాటాలను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశారు.ఎన్ఎస్ఈలోని బ్లాక్ డీల్స్ డేటా ప్రకారం జూబిలెంట్ ఫుడ్వర్క్స్ ప్రమోటర్ అయిన జూబిలెంట్ కన్జూమర్ 1.06 కోట్ల ఈక్విటీ షేర్లను (1.61 శాతం వాటా) విక్రయించింది. అలాగే, జూబిలెంట్ ఇన్గ్రేవియా ప్రమోటింగ్ సంస్థలు (జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్, శ్యామ్ సుందర్ భార్తియా ఫ్యామిలీ ట్రస్ట్) 98.65 లక్షల షేర్లు (6.2 శాతం వాటా) విక్రయించాయి.అలాగే జూబిలెంట్ ఫార్మోవా ప్రమోటర్ సంస్థలు జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్ 32.86 లక్షల షేర్లను (2.06 శాతం వాటా) విక్రయించాయి. ఈ షేర్లను సగటున రూ. 662–1,060.37 రేటుకు అమ్మడంతో మొత్తం అన్ని లావాదేవీల విలువ కలిపి రూ. 1,800.98 కోట్లుగా నమోదైంది. -
సన్ ఫార్మాకు కొత్త ఎండీ.. టాప్ మేనేజ్మెంట్లో మార్పులు
ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, చేర్పులు చేపట్టింది. ఇందులో భాగంగా కీర్తి గనోర్కర్ కంపెనీ ఎండీగా పదోన్నతి పొందారు. దిలీప్ సంఘ్వీ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సంఘ్వీ కొనసాగుతారు.నార్త్ అమెరికా విభాగం ప్రెసిడెంట్, సీఈవో అభయ్ గాంధీ తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో రిచర్డ్ ఆస్క్రాఫ్ట్ చేరతారని కంపెనీ తెలిపింది. ఎంబీఏ, కెమికల్ ఇంజినీర్ అయిన గనోర్కర్ 1996 నుంచి సన్ ఫార్మాలో వివిధ విభాగాల్లో పని చేశారు. 2019 జూన్ నుంచి సన్ ఫార్మా భారత విభాగానికి గనోర్కర్ నేతృత్వం వహిస్తున్నారు.ఆయన సారథ్యంలో వ్యాపారం, మార్కెట్ వాటా నిలకడగా పెరిగిందని సంస్థ వివరించింది. స్పెషాలిటీ విభాగాలు, జపాన్.. యూరప్ మార్కెట్లలోకి కూడా సన్ ఫార్మా విస్తరించడంలో గనోర్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. -
ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!
బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్ ఉద్యోగం కోసం 14 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేశానని ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. విప్రో క్యాంపస్లో ఉన్న ఫొటోలతో పాటు కంపెనీ లోగోను చూపిస్తూ అంతరా మండల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లో వివరాలు షేర్ చేశారు.ధ్రువీకరణ కోసం ఇన్స్టాగ్రామ్లో ఆమె తన ఆఫీస్ ఐడీ కార్డు కూడా పోస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేసి కొలువు దక్కించుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి చివరకు విప్రోలో డెవలపర్ పొజిషన్కు ఎంపికయ్యాను. మీ నిద్రలో వచ్చేవి కలలు కావు.. మిమ్మల్ని నిద్రపోనివ్వనివే అసలైన కలలు’ అని ఆమె రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Antara Mandal (@_antara.mandal)ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచనఅయితే సామాజిక మాధ్యామాల్లో ఈ పోస్ట్పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేయడంపై చాలా మంది వినియోగదారులు విమర్శించారు. కొందరు ఇందుకు భిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూ? అది కూడా డెవలపర్ రోల్ కోసమే.. చాలా ఫన్నీ యార్’ అని ఒక యూజర్ స్పందించారు. -
ఎస్బీఐలో 505 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం
భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను కొత్తగా నియమించుకున్నట్టు ప్రకటించింది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్లో పరిశ్రమలోనే ఇదొక పెద్ద నియామకంగా పేర్కొంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు, కార్పొరేట్ రుణాలు, అగ్రి బిజినెస్, వెల్త్ మేనేజ్మెంట్, ట్రెజరీ కార్యకలపాలు, నియంత్రణలు, నిబంధనల అమలు తదితర విభాగాల్లో వీరు సేవలు అందించనున్నట్టు వెల్లడించింది.ఇదీ చదవండి: మోతీలాల్ ఓస్వాల్పై సెబీ జరిమానాబ్యాంకులో అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు ఎదిగే అవకాశాలను ఎస్బీఐ వీరికి అందిస్తుందని తెలిపింది. 13,455 జూనియర్ అసోసియేట్లను సైతం నియమించుకున్నట్టు ఎస్బీఐ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మంది నియామకం చేపట్టినట్టు.. ఇందులో 13,500 మంది వరకు క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి సైతం తెలిపారు. -
మళ్లీ కొలువుల కళకళ!
ముంబై: ఉద్యోగ నియామకాలు మే నెలలో సానుకూలంగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల వరుస క్షీణత తర్వాత మే నెలలో 8.9 శాతం నియామకాలు పెరిగినట్టు (పోస్టింగ్లు) జాబ్సైట్ ఇండీడ్ ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్లోనే అధిక నియామకాలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. మరింత సంఘటిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మారుతుండడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. భారత్లో ఉద్యోగ నియామకాలు కరోనా ముందు సంవత్సరం (2019) కంటే 80 శాతం అధికంగా ఉన్నట్టు, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎంతో మెరుగని వెల్లడించింది. ముఖ్యంగా యూకే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్లో ఉద్యోగ నియామకాలు ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువగా ఉండడాన్ని తన నివేదికలో ఇండీడ్ ప్రస్తావించింది. వీటితో పోల్చి చూసినప్పుడు భారత్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. భారత్ మార్పు దిశగా ప్రయాణిస్తుండడంతో ఇటీవలి సంవత్సరాల్లో సంఘటిత రంగంలో మరిన్ని ఉద్యోగ కల్పనలకు దారితీస్తున్నట్టు విశ్లేíÙంచింది. ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ స్థాయిలో సంఘటితం వైపు అడుగులు వేయడం లేదని తెలిపింది. ఈ విభాగాల్లో అధిక నియామకాలు.. చిన్నారుల సంరక్షణ విభాగంలో 27 శాతం, వ్యక్తిగత సంరక్షణ, గృహ ఆరోగ్యంలో 25 శాతం, విద్యా రంగంలో 24 శాతం, తయారీలో 22 శాతం చొప్పున మే నెలలో నియామకాలు పెరిగాయి. అదే సమయంలో డెంటల్ రంగలో 10.2 శాతం, వ్యవసాయం, ఫారెస్ట్రీలో 8.6 శాతం, కమ్యూనిటీ, సామాజిక సేవల్లో 6.8 శాతం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 4.2 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. మే నెలలో 1.5 శాతం ఉద్యోగ ప్రకటనల్లో కంపెనీలు జెనరేటివ్ ఏఐ అవసరాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా డేటా అనలైటిక్స్ ఉద్యోగాల్లో 12.5 శాతం వాటికిర, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 3.6 శాతం, సైంటిఫిక్ రీసెర్చ్లో 3.1 శాతం మేర జెనరేటివ్ ఏఐ పరిజ్ఞానాన్ని అవసరాన్ని పేర్కొన్నాయి. -
ఫలితాలతోపాటే వేగంగా వార్షిక నివేదికలు
ముంబై: కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడికి, వార్షిక నివేదికల విడుదలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడిస్తుందని కంపెనీ సీఎఫ్వోలకు సూచించింది. ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్వోలు మరింత లోతుగా సంప్రదింపులు నిర్వహించాలని, తద్వారా మరింత సహకారంతో ఆర్థిక ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని సెబీ హోల్టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ కోరారు. సీఎఫ్వోలకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా విశ్వాసం నిలబెట్టడంలో సీఎఫ్వోలు పోషిస్తున్న ప్రాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వార్షిక ఫలితాలు, వార్షిక నివేదికల వెల్లడికి మధ్య అంతరం 70 నుంచి 140 రోజుల వరకు ఉంటోంది. ఖాతాలు, అంతర్గత నియంత్రణలు, కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ గురించి మరింత లోతైన వివరాలతో కూడిన వార్షిక నివేదిక మరింత సమాచారయుక్తంగా ఉంటుంది. ఈ జాప్యాన్ని తగ్గిస్తే ఇన్వెస్టర్లకు పారదర్శకత పెరుగుతుంది’’అని అనంత నారాయణ్ పేర్కొన్నారు. -
జేఏఎల్ దివాలా పరిష్కార ప్రణాళికకు డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) పరిష్కార ప్రణాళిక దాఖలుకు ఆఖరు తేదీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జూన్ 24కి పొడిగించాయి. బిడ్డర్ల విజ్ఞప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆఖరు తేదీ పొడిగింపును రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించినట్లు జేఏఎల్ తెలిపింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 9తో ముగియాలి. అయితే, పలువురు బిడ్డర్లు పరిష్కార ప్రణాళికను సమరి్పంచేందుకు మరింత గడువు కావాలని కోరడంతో సీవోసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. సుమారు 25 కంపెనీలు జేఏఎల్ను దక్కించుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, వేదాంత, పతంజలి ఆయుర్వేద, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్, సిమెంట్ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో జేఏఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో 2024 జూన్ 3న కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ చేపట్టింది. కంపెనీకి మొత్తం రూ. 57,185 కోట్ల మేర రుణభారం ఉంది. -
ప్రపంచ టాప్ 20 ధనవంతుల జాబితాలో అంబానీ, అదానీకి చోటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో తన సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా ఉన్న ఈ సూచీలో ముఖేశ్ అంబానీ 17వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఇండెక్స్లో టాప్లో టెస్లా సీఈఓ ఎలాన్మస్క్, తర్వాతి స్థానాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్ నిలిచారు.బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతులు జాబితాలో ఇండియా నుంచి ముఖేశ్ అంబానీ(17వ స్థానం), గౌతమ్ అదానీ(20వ స్థానం), శివ్నాడార్(41వ స్థానం), షాపూర్ మిస్త్రీ(52వ స్థానం), సావిత్రి జిందాల్(59వ స్థానం), అజిమ్ప్రేమ్జీ(69వ స్థానం), సునిల్మిట్టల్(73 స్థానం), దిలీప్ సంఘ్వీ(79వ స్థానం), లక్ష్మీ మిట్టల్(86వ స్థానం)లు 100 స్థానాల్లోపు నిలిచారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా.. -
సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతి
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్డబ్ల్యూ కామ్స్టర్ సంస్థ(ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,073 కోట్లు)కు ఛైర్మన్గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్ కపూర్ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్లైన్ సిస్టమ్స్లో కీలక సంస్థగా సోనా కామ్స్టర్ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.గ్లోబల్గా విస్తరణసంజయ్ కపూర్ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్స్టర్ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్లైన్ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలుసంజయ్ నాయకత్వంలో సోనా కామ్స్టార్ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!పరిశ్రమ నాయకత్వానికి సహకారంభారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు. -
భారత ఫార్మా సంస్థలు ఉత్పత్తులను కాపీ కొట్టవు
బెర్న్: భారత ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు స్విప్ కంపెనీల ఉత్పత్తులను కాపీ కొడతాయన్న ఆరోపణలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఇది ఎంతో కాలంగా నెలకొన్న అపోహ అని స్పష్టం చేశారు. మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్) భారత్ గౌరవిస్తుందే కానీ.. ఇతరుల నుంచి టెక్నాలజీని ఎప్పుడూ చోరీ చేయదన్నారు. తమ ట్రేడ్మార్క్లు లేదా పేటెంటెడ్ లేదా కాపీ రైట్ టెక్నాలజీని భారత కంపెనీలు చట్టవిరుద్ధంగా కాపీ చేశాయన్న దానికి స్విప్ కంపెనీలు ఒక్క నిదర్శనం కూడా చూపించలేకపోయినట్టు చెప్పారు. ఈ విషయంలో ఒక్క కంపెనీ కూడా ఏ ఒక్క ఘటనను తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. పేటెంట్లలో స్వల్ప మార్పులను భారత్ అనుమతించబోదన్నారు. దురదృష్టవశాత్తూ కొన్ని కంపెనీలు కొన్ని సవరణలతో అదనపు మేథో హక్కును సొంపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత పేటెంట్ చట్టంలోని సెక్షన్ 3(డీ) కింద అప్పటికే ఉన్న పెటెంటెడ్ ఔషధాల కంటే మరింత ప్రభావవంతమైనవని నిరూపితమైనే కొత్త వాటికి అనుమతులకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం. ఈ నిబంధనలను సవరించాలని కొన్ని బహుళజాతి కంపెనీలు లోగడ కోరినప్పటికీ భారత్ తోసిపుచి్చంది. ఐపీఆర్ ప్రక్రియలను భారత్ మరింత మెరుగుపరుస్తోందని, దీంతో నిబంధనల అమలు భారం తగ్గి, వేగంగా అనుమతులు లభిస్తాయని మంత్రి చెప్పారు. -
ట్రూజెట్ మళ్లీ వస్తోంది..
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిలిపివేసిన ట్రూజెట్ (గతంలో టర్బో మేఘా ఎయిర్వేస్) మళ్లీ సర్వీసులను ప్రారంభించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇన్వెస్టర్ల దన్నుతో బ్రాండ్ను పునరుద్ధరించేందుకు అనుమతుల కోసం పౌర విమానయాన శాఖను సంప్రదించినట్లు కంపెనీ ఎండీ ఉమేశ్ వంకాయలపాటి తెలిపినట్లు వార్తా కథనం వెలువడింది. సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రం తమకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఇక పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)లో ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్ను (ఏవోపీ) రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఉమేశ్ తెలిపారు. ఇందుకోసం సుమారు 180 రోజుల వరకుసమయం పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 600 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు. 2015–2022 మధ్య కాలంలో ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలందించే సంస్థగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ట్రూజెట్ కార్యకలాపాలు సాగించింది. అయితే, కోవిడ్ అనంతర ప్రతికూల ప్రభావాలతో, ఆర్థిక సంక్షోభం తలెత్తి 2022 ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. హబ్గా వైజాగ్.. ఏవోపీ వచ్చాక ఎయిర్బస్ ఏ320 విమానంతో నవంబర్ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఉమేశ్ చెప్పారు. వైజాగ్ తమకు హబ్గా ఉంటుందన్నారు. తొలి ఫ్లయిట్ విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్కి నడిపే అవకాశం ఉందని ఉమేశ్ వివరించారు. ఏ320 విమానాలతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ఉడాన్ స్కీము కింద సర్వీసులు నడిపేందుకు ఏటీఆర్ టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్లను కూడా తీసుకునే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏటీఆర్లకు లక్నో విమానాశ్రయం బేస్గా ఉంటుందన్నారు. -
పాలసీ బజార్లో సీనియర్ సిటెజెన్స్కు ప్రత్యేక సర్వీస్
సీనియర్ సిటిజన్లకు వారి ఆరోగ్య సంరక్షణ, బీమా ప్రయాణంలో ప్రతి దశలో సహకారం అందించేందుకు ఉద్దేశించిన 'సారథి' అనే ప్రత్యేక వృద్ధుల సంరక్షణ సేవలను పాలసీబజార్ ప్రవేశపెట్టింది. పాలసీబజార్ బీమా భాగస్వాముల ద్వారా ఈ సారథి సర్వీస్ లభిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్లకు సరైన బీమా ప్రణాళికలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది. క్లెయిమ్ సహాయాన్ని అందిస్తుంది. కొనసాగుతున్న, వ్యక్తిగతీకరించిన ఫాలో-అప్లను అందిస్తుంది.ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు నివసిస్తుంటారు. అలాంటి వినియోగదారులు కూడా మరో నగరంలో నివసిస్తున్న వృద్ధులైన తమ తల్లిదండ్రుల కోసం పాలసీ బజార్ ‘సారథి’ ద్వారా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు. ఆన్-గ్రౌండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ను వారికి అందించవచ్చు.2050 నాటికి భారత్ లో వృద్ధుల సంఖ్య 31.9 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పెరుగుతున్న విభాగానికి ప్రతిస్పందనగా, సారథి ఈ కింది సేవలు అందిస్తుంది.పాలసీలను సరళంగా వివరించడానికి శిక్షణ పొందిన సలహాదారులువృద్ధుల సంరక్షణలో శిక్షణ పొందిన ఎగ్జిక్యూటివ్ లతో సీనియర్ల కోసం హెల్ప్ లైన్ఆసుపత్రులతో సమన్వయం, అంబులెన్స్ మద్దతుతో సహా సహాయాన్ని క్లెయిమ్ చేస్తుంది.హోమ్ హెల్త్ కేర్, డయాగ్నస్టిక్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో సేవలుకాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా పునరుద్ధరణలు, ప్రీమియం రిమైండర్లు, చెక్-ఇన్లలో సహాయం కోసం ప్రతి సారథి వినియోగదారుడికి 24/7 రిలేషన్షిప్ మేనేజర్ను కేటాయింపుడాక్యుమెంట్ల డోర్ డెలివరీ, డిజిటల్ క్లెయిమ్ సబ్మిషన్లకు సహకారం. -
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్ప్రెస్తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. -
ఊహించని ఘోరం.. విమానప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై పలువురు వ్యాపార ప్రముఖులు స్పందించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ తదితరులు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అహ్మదాబాద్-లండన్ గాట్విక్ ఎయిరిండియా విమానం 171 ఈ రోజు ఘోర ప్రమాదానికి గురైందని నేను తీవ్ర విచారంతో ధ్రువీకరిస్తున్నాను. ఈ వినాశకరమైన సంఘటనతో ప్రభావితమైన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో, మా ప్రాథమిక దృష్టి బాధితులందరికీ, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపై ఉంది. సంఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయపడటానికి, ప్రభావితులకు అవసరమైన మద్దతు, సహకారం అందించడానికి మేము మా శక్తి మేరకు కృషి చేస్తున్నాము" అని పేర్కొన్నారు.అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఘటనపై స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. "ఎయిరిండియా ఫ్లైట్ 171 దుర్ఘటనతో మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఊహించని నష్టాన్ని చవిచూసిన బాధిత కుటుంబాల వైపు మా హృదయాలు ద్రవిస్తున్నాయి. అధికారులందరితో కలిసి పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తున్నాం" అని రాసుకొచ్చారు.👉ఇదీ చదవండి: విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అహ్మదాబాద్-లండన్ విమానం కూలిన విషాద ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను. నా ఆలోచనలు, ప్రార్థనలు విమానంలో ఉన్న వారు, ప్రభావిత ప్రాంత నివాసితుల వైపే ఉన్నాయి. ప్రతి ఒక్కరి భద్రత,సత్వర అత్యవసర ప్రతిస్పందన కోసం ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఘటన జరిగిన వెంటనే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.Deeply shocked and saddened by the tragic #planecrash of the #AirIndia Ahmedabad-London flight during take off in Ahmedabad having 242 passengers on board. My thoughts and prayers are with all those on board and the residents in the affected area. Wishing for everyone's safety… pic.twitter.com/KjTlFfo1Bn— Parimal Nathwani (@mpparimal) June 12, 2025We are shocked and deeply saddened by the tragedy of Air India Flight 171. Our hearts go out to the families who have suffered an unimaginable loss. We are working closely with all authorities and extending full support to the families on the ground. 🙏🏽— Gautam Adani (@gautam_adani) June 12, 2025 -
సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు. -
కొత్త వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్, జీఎస్కే భాగస్వామ్యం
వ్యాక్సిన్ ఆవిష్కరణలో గ్లోబల్ లీడర్గా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) జీఎస్కే పీఎల్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా అయిన షిగెల్లోసిస్ను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు తెలిపాయి.డయేరియా వ్యాధికి కారణం అవుతున్న షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రత, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్-మందులను తట్టుకునే స్వభావం)పై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే షిగెల్లాను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ అనుమతుల ద్వారా ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా ‘ఆల్ట్సాన్ఫ్లెక్స్ 1-2-3’ను అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్), జీఎస్కే పీఎల్సీ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.వ్యాక్సిన్ అభివృద్ధికి జీఎంఎంఏ టెక్నాలజీజనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటిజెన్స్ (జీఎంఎంఏ) టెక్నాలజీని ఈ వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్యాక్టీరియా బాహ్య పొరలను ఉపయోగించే వినూత్న విధానం. ఈ చౌకైన తయారీ ప్రక్రియ ద్వారా టీకాను మరింత తక్కువ ధరల్లో అందించవచ్చని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్..యూరప్లో మొదటి దశ ట్రయల్స్ అనుకూలంగా వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఆఫ్రికాలో రెండో దశ ట్రయల్స్లో 9 నెలల చిన్నారులపై ఎలాంటి భద్రతా సమస్యలు కనిపించలేదని పేర్కొంది. వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి లక్ష్యాలను చేరుకున్నట్లు 2024 నుంచి మధ్యంతర ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నట్లు చెప్పింది. త్వరలో ఈ వ్యాక్సిన్ను వినియోగదారులకు అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్రోటావైరస్, టైఫాయిడ్, పోలియో, కలరా, సాల్మొనెల్లా వంటి డయేరియా వ్యాధి వ్యాక్సిన్లలో కంపెనీ నాయకత్వాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు. యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పేద జనాభాకు సరసమైన ధరలకు వ్యాక్సిన్ అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీకి జీఎస్కేతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ఆరోగ్యంపట్ల సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుందని చెప్పారు. -
‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్
ప్రముఖ కంపెనీ, సరిపడే అనుభవం, నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జీతాలు రూ.లక్షల్లో ఉంటాయని తెలిసిందే కదా. అయితే పెరుగుతున్న జీవనశైలి, ఖర్చులకుతోడు బెంగళూరు వంటి లివింగ్ కాస్ట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ జీతం ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో బెంగళూరులో నివసిస్తున్నవారికి సంవత్సరానికి రూ.50 లక్షలు (ఎల్పీఏ) సరిపోతుందా.. అని సామాజిక మాధ్యమాల వేదికగా టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొందరికి రూ.50 లక్షలు ఇస్తున్నా దాని విలువ సగానికి తగ్గి రూ.25 లక్షలకు సమానమైందా? అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధ్రువీకరించాలని కోరుతున్నారు. అవికాస్తా వైరల్గా మారుతున్నాయి.ఇదీ చదవండి: ‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’సౌరవ్ దత్తా అనే టెకీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ..‘బెంగళూరు ఐటీ పరిశ్రమలో చాలా మంది రూ.50 ఎల్పీఏ సంపాదిస్తున్నారని విన్నాను. వారు పెరిగిన సీటీసీ లేదా రూ.50 ఎల్పీఏ రూ.25 ఎల్పీఏతో సమానమని చెబుతున్నారు. కొంతమంది టెక్కీలు ధ్రువీకరించగలరా?’ అని కోరారు. అందుకు ప్రతిస్పందనగా నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. రూ.50 ఎల్పీఏ కూడా నగరంలోని హై కాస్ట్ టెక్ వాతావరణంలో సరిపోదని కొందరు పేర్కొన్నారు. ‘రూ.50 ఎల్పీఏ ప్రస్తుతం రూ.10 ఎల్పీఏతోనే సమానం. చాలా మంది రూ.1 కోటి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించకపోతే సమయం వృథా అని మరొకరు కామెంట్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని సూచించారు. -
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
భారత ఆర్థిక వృద్ధిని బహిరంగంగా విమర్శించినందుకు హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇటీవల తాను పోస్ట్ చేసిన వివరాలు వైరల్గా మారాయి. దాంతో భారత్ వృద్ధికి కట్టుబడి ఉన్నవారు ఈయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.భాటియా తన ఎక్స్లో ఖాతాలో ‘భారత్లో 41.5 కోట్ల మంది ప్రజలు రోజుకు 3.10 డాలర్ల(రూ.250)తో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అందుకు సిగ్గు పడాల్సిందిపోయి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గుగా వుంది’ అంటూ పోస్ట్ చేశారు. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానానికి ఎగబాకుతున్నట్లు వచ్చిన వార్తలకు స్పందించిన భాటియా ఈమేరకు ఎక్స్లో వ్యాఖ్యలు చేశారు.భాటియా వ్యాఖ్యలను రాజకీయ, వృత్తిపరమైన నేపథ్యాలకు అతీతంగా భారతీయ వినియోగదారులు విస్తృతంగా ఖండించారు. భాటియా పోస్ట్లోని వివరాలు అవుట్డేటెడ్గా కొందరు కామెంట్ చేశారు. ఆయన తన మాటలను భారత రాజకీయ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారా లేక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. మరొకరు ‘మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు. భారత్ ప్రస్తుతం ఇంటున్న స్థానం నుంచి ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిపోయి ప్రతిసారి ఇదే పాట పడుతున్నారు. సిగ్గుగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Instead of hanging your head in shame that 415 million people in India survive on $3.10/day, you brag about being the world’s 4th largest economy. Shame on you.— Sabeer Bhatia (@sabeer) June 10, 2025ఇదీ చదవండి: మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం‘1997 డిసెంబర్లో హాట్మెయిల్ను 400 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అప్పటి నుంచి మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? జీరో.. మీ ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మీరు ఎక్స్ ద్వారా ఉపన్యాసాలు ఇస్తున్నారు’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. ‘నా ఆలోచనా విధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మీలాంటి వారు దూషణలకు దిగుతారు. బలహీన మనస్తత్వం, అభద్రతా భావం’ అంటూ భాటియా స్పందించారు. మరో యూజర్ ‘నువ్వొక అసమర్థుడివి. 36-37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎందుకు గొప్పలు చెప్పుకుంటుంది’ అని ప్రశ్నించారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని స్పష్టం చేశారు. -
జియో బ్లాక్రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతి
జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (పెట్టుబడి సలహా) సేవలు అందించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోపాటు స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ నుంచి అనుమతి లభించినట్టు ప్రకటించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అమెరికాకు చెందిన బ్లాక్రాక్ 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.ఇదీ చదవండి: జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధిమార్క్ పిల్గ్రెమ్ను ఎండీ, సీఈవోగా నియమించినట్టు జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాలు కోరుకుంటున్న నేపథ్యంలో తమ జాయింట్ వెంచర్ సంస్థ ప్రపంచస్థాయి సలహా సేవలు అందించనుందని జేఎఫ్ఎస్ఎల్ ఎండీ, సీఈవో హితేష్ సేతియా తెలిపారు. మరోవైపు జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించేందుకు గత నెల 27న సెబీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. -
జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధి
జీవిత బీమా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో మెరుగైన వృద్ధిని చూశాయి. న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల ద్వారా) 10.8 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.30,463 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది మే నెలలో ఇది రూ.27,034 కోట్లుగా ఉంది.ఇక ఏప్రిల్, మే నెలల్లో కలిపి న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.52,427 కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.47,293 కోట్లుగా ఉంది. మొదటిసారి బీమా పాలసీల విక్రయంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించడం ఈ వృద్ధికి దారితీసింది. ఇదీ చదవండి: యువతకు సత్య నాదెళ్ల సూచనఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల రూపంలో ఆదాయం 5.21 శాతం పెరిగి మే నెలలో రూ.3,525 కోట్లుగా ఉంది. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం మే నెలలో 10.27 శాతం పెరిగి రూ.18,405 కోట్లకు చేరుకుంది. మే నెలలో ఎల్ఐసీ గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.79 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.66 శాతం పెరిగింది. -
క్విక్ రెస్టారెంట్లకు ధరల సెగ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దెబ్బతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) మార్జిన్లపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ మందగించడంతో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ క్యూఎస్ఆర్ కంపెనీలు రేట్లను పెంచాలంటే వెనుకాడుతున్నాయి. స్టోర్ల విస్తరణ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, అదే సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. బీఎన్పీ పారిబా రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిస్కౌంట్లను నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నప్పటికీ సగటు రోజువారీ అమ్మకాలు తగ్గడంతో క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. స్టోర్లను ఎడాపెడా వేగంగా విస్తరించడం, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం తదితర అంశాల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం పడుతోందని వివరించింది. ఇక, ఫుడ్ డెలివరీ సంస్థల విషయానికొస్తే స్విగ్గీ, జొమాటోలాంటి అగ్రిగేటర్ల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. భారీ స్థాయిలో ఎదిగిన ఈ రెండు సంస్థలు.. క్యూఎస్ఆర్ చెయిన్ల కన్నా చిన్నవైన రెస్టారెంట్లను కస్టమర్లకు మరింత చేరువ చేశాయి. దీంతో లిస్టెడ్ క్యూఎస్ఆర్ కంపెనీలకు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇది సరిపోదన్నట్లు ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు తమ సొంత డార్క్ కిచెన్ బ్రాండ్లను (బిస్ట్రో, స్నాక్ మొదలైనవి) ప్రారంభించి, ప్రత్యేక యాప్ల ద్వారా 10–15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలతో గత నాలుగేళ్లుగా చూస్తే ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు పెరుగుతుండగా, క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని నివేదిక వివరించింది. సామర్థ్యాలు పెంచుకోవాలి.. జూబిలెంట్ ఫుడ్స్లాంటి క్యూఎస్ఆర్ కంపెనీలు ముడి సరుకుల ధరలపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ధరలను పెంచేందుకు ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం.. ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్యూఎస్ఆర్ చెయిన్ల అమ్మకాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. లిస్టెడ్ క్యూఎస్ఆర్ చెయిన్ల మొత్తం అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగ్గా, 2025 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితమయ్యాయి. అదే ఫుడ్ డెలివరీ సంస్థల స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంగా నమోదైంది. దేశీ క్యూఎస్ఆర్ మార్కెట్లో పోటీపడాలంటే ప్రస్తుత సంస్థలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవాలంటే వినూత్నమైన విధంగా వేగం, మెనూ, డెలివరీ సామరŠాధ్యలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదాయ పన్ను రేట్ల సవరణలు, ఇతరత్రా సానుకూల పరిణామాలతో డిమాండ్ మళ్లీ పుంజుకోగలదని క్యూఎస్ఆర్ సంస్థలు ఆశిస్తున్నాయి. -
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.Worth it https://t.co/fQk2ULx7jh— Elon Musk (@elonmusk) June 11, 2025 -
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆన్లైన్లో పలు కథనాలు వచ్చాయి. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రూ.3,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి.మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ మే నెలలో 1868 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అనేక అంతరాయాలు వచ్చినప్పటికీ ఏప్రిల్లో 1789 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు మార్చిలో 1830 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.23.95 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరగగా మే నెలలో రూ.25.14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్పీసీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading. Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.The Government remains fully committed…— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025 -
రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఏజెంట్లకు షాక్..దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం -
వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం
రైలు ప్రయాణం అంటే చివరి వరకూ టెన్షనే.. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకైతే తమ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అన్నది రైలు బయలుదేరేంత వరకూ గందరగోళమే. ఈ తికమకను తొలగించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందే తుది చార్టును సిద్ధం చేయాలని నిర్ణయించింది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మే 21న బికనీర్ పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చింది. చివరి నిమిషంలో గందరగోళాన్ని తగ్గించడానికి ముందుగానే చార్ట్ ను సిద్ధం చేయాలని స్థానిక రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటివరకూ రైలు బయలుదేరడానికి 2.3 గంటల నుండి 4 గంటల ముందు మాత్రమే తుది చార్ట్ తయారు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో అనిశ్చితి నెలకొంది.👉ఇదీ చదవండి: తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరితుది చార్ట్ను 24 గంటల ముందే అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు మంత్రి వెంటనే ఆమోదం తెలపడంతో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. బికనీర్ డివిజన్లో జూన్ 6 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ ప్రారంభ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రయాణికులు మెరుగైన స్పష్టతను చూశారు. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ సమయం లభించింది. బికనీర్ ట్రయల్ విజయవంతమైన తరువాత, భారతీయ రైల్వే ఇప్పుడు ఈ విధానాన్ని ఇతర అధిక ట్రాఫిక్ మార్గాలకు విస్తరించాలని యోచిస్తోంది. -
అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా
ఎప్పుడూ వ్యాపారాలపరంగా వార్తల్లో నిలిచే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.కొడుకు, కోడళ్ల స్నేహితుడి పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవడమే కాదు.. అందరూ హుషారుగా డ్యాన్స్లు వేశారు. శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది. ఇక ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.👉ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనంస్కూల్ ఫ్రెండ్స్ అయిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా చాలా ఏళ్ల సుదీర్ఘ స్నేహం తరువాత 2019లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు 2018లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) చైర్మన్గా ఉండగా, శ్లోకా దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by The Wedding Anchor Junaid Arif Currimbhoy (@theweddinganchor) -
డియల్ డిఫెన్స్తో రిలయన్స్ ఇన్ఫ్రా డీల్
ప్రయివేట్ రంగ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ తాజాగా జర్మన్ ఆయుధ తయారీ కంపెనీ డియల్ డిఫెన్స్తో వ్యూహాత్మక సహకరా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో ఆధునిక ఆర్టిలరీ షెల్స్ తయారీని చేపట్టనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానికంగా అత్యంత ఆధునిక వుల్కనో 155 ఎంఎం ప్రెసిషన్ గైడెడ్ మ్యునిషన్ సిస్టమ్(ఆర్టిలరీ షెల్స్)ను రూపొందించనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇవి దేశీ సాయుధ దళాలకు ఉపయోగపడనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ తెలియజేసింది. బిల్టిన్ ఈసీసీఎం సామర్థ్యాలతో రూపొందించనున్న 155 ఎంఎం టీటీఎంలు శత్రువుల ఎల్రక్టానిక్ జామింగ్ ప్రయత్నాలను తప్పించుకోగలవని వివరించింది. 10 సెకన్లలోనే లక్ష్యాలను చేరుకోగలవని వెల్లడించింది. దేశీయంగా రక్షణ రంగ పరికరాల తయారీలో ప్రయివేట్ రంగ ముందడుగును తాజా భాగస్వామ్యం ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది. తదుపరితరం లేజర్, జీపీఎస్ గైడెడ్ టార్గెటింగ్ టెక్నాలజీతో ఈ ఆధునిక మ్యునిషన్ సిస్టమ్స్ రూపొందనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ తెలియజేసింది.ఇదీ చదవండి: ఎస్పీఎంసీఐఎల్కు త్వరలో నవరత్న హోదా!2019లోనే వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెరతీసిన సంస్థల మధ్య మరింత అవగాహన కోసం డియల్ డిఫెన్స్ సీఈవో హెల్మట్ రాచ్తో రిలయన్స్(అడాగ్) గ్రూప్ వ్యవస్థాపకుడు అనిల్ అంబానీ చర్చలు నిర్వహించినట్లు సంయుక్త ప్రకటనలో రెండు సంస్థలు తెలియజేశాయి. కాగా.. ఒప్పందంలో భాగంగా కొత్త హైటెక్ తయారీ ప్లాంటును మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న వటాడ్ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ వెల్లడించింది. తద్వారా దేశీ సాయుధ దళాలకు అవసరమైన ఉత్పత్తులను అందించనున్నట్లు తెలియజేసింది. వార్షికంగా 2 లక్షల ఆర్టిలరీ షెల్స్, 10,000 టన్నుల పేలుడుపదార్ధాలు, 2,000 టన్నుల ప్రొపెల్లంట్ తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంటును నెలకొల్పనున్నట్లు వివరించింది. -
ఎస్పీఎంసీఐఎల్కు త్వరలో నవరత్న హోదా!
సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్పీఎంసీఐఎల్) పనితీరు భేషుగ్గా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. త్వరలోనే నవరత్న హోదాను దక్కించుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ తదితర కార్యకలాపాలు నిర్వహించే ఎస్పీఎంసీఐఎల్ కార్పొరేట్ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.2015లో పునర్వ్యవస్థీకరణ అనంతరం 2016–17లో కంపెనీ మొత్తం రుణాన్ని వడ్డీతో సహా చెల్లించేయడంతో పాటు పటిష్టమైన రాబడులు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో భాగమైన ఈ సంస్థకు ప్రస్తుతం షెడ్యూల్ ‘ఏ’ మినీరత్న కేటగిరీ–వన్ హోదా ఉంది. లాభాలు, నికర విలువ వంటి ఆర్థిక విషయాలతో పాటు నిర్దిష్ట అర్హతా ప్రమాణాలను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు ఇస్తుంది.ఇదీ చదవండి: చిన్న ఎగుమతిదార్లకు కేంద్రం చేయూత2022–23లో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.534 కోట్లు డివిడెండ్ చెల్లించిన కంపెనీ ఆ తర్వాత సంవత్సరంలో (2023–24) రూ.364 కోట్లు అందించింది. 2024–25లో 1,200 కోట్ల బ్యాంక్ నోట్లు, 150 కోట్ల నాణేలు, 1.5 కోట్ల పాస్పోర్ట్ బుక్లెట్స్, 700 కోట్ల పైగా ఎక్సైజ్ అడ్హెసివ్ లేబుల్స్ మొదలైనవి కంపెనీ ఉత్పత్తి చేసింది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకున్న పసిడిని శుద్ధి చేయడం ద్వారా 3.4 మెట్రిక్ టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్కి బదలాయించింది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం, వైష్ణోదేవీ బోర్డు నుంచి వచ్చిన వెండి, బంగారాన్ని కూడా రిఫైన్ చేసింది. -
డివిడెండ్ ధమాకా!
లిస్టెడ్ కంపెనీలు దేశీయంగా వాటాదారులకు గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 5 లక్షల కోట్లు డివిడెండ్గా చెల్లించాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా ఇది 11 శాతం అధికం! అయితే గత ఐదేళ్లలో లేనివిధంగా గతేడాది వాటాదారులకు చెల్లింపులు నెమ్మదించడం గమనార్హం! – సాక్షి, బిజినెస్ డెస్క్ ప్రపంచవ్యాప్త అనిశ్చితులు, మందగమన పరిస్థితుల మధ్య గతేడాది లిస్టెడ్ కార్పొరేట్ సంస్థల ఆదాయం, నికర లాభాలు మందగించాయి. అయినప్పటికీ వాటాదారులకు డివిడెండ్ రూపేణా లాభాల్లో వాటాను పంచడంలో సరికొత్త రికార్డ్ నమోదైంది. లిస్టెడ్ కంపెనీలు ఉమ్మడిగా గతేడాది రూ. 5 ట్రిలియన్లు డివిడెండ్గా చెల్లించాయి. అంతక్రితం ఏడాది (2023–24)లో వాటాదారులు అందుకున్న డివిడెండ్ రూ. 4.52 లక్షల కోట్లే. గతేడాది దేశీ లిస్టెడ్ కంపెనీల నికర లాభం(నష్టాలు, అనుకోని లాభాలను సర్దుబాటు చేశాక) 5 శాతం పైగా ఎగసి రూ. 16 లక్షల కోట్లను తాకాయి.అంతక్రితం ఏడాది రూ. 15.21 ట్రిలియన్లుగా నమోదైంది. బీఎస్ఈలో లిస్టయిన 1,218 ప్రధాన కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న గణాంకాలివి! గతేడాది ఉమ్మడిగా నికర అమ్మకాలు (ఫైనాన్షియల్ సంస్థలైతే వడ్డీ ఆదాయం) 7.5% పుంజుకుని రూ.166.4 ట్రిలియన్లకు చేరాయి. అంతక్రితం ఇవి రూ.154.83 లక్షల కోట్లు. బైబ్యాక్ల వెనకడుగు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)లో గతేడాది నామమాత్ర(1.2 శాతం) వృద్ధి మాత్రమే నమోదైంది. బైబ్యాక్లతో కలిపి వాటాదారులకు కంపెనీలు రూ. 5.08 ట్రిలియన్లు చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో ఇది రూ. 5.03 లక్షల కోట్లుకాగా.. గతేడాది షేర్ల బైబ్యాక్పై లిస్టెడ్ కంపెనీలు రూ. 8,034 కోట్లు వెచ్చించాయి. బైబ్యాక్లు తగ్గడంతో వార్షికంగా చెల్లింపుల నిష్పత్తి 33 శాతం నుంచి 32 శాతానికి క్షీణించింది.అయితే గత దశాబ్ద కాలాన్ని పరిగణిస్తే లిస్టెడ్ కంపెనీలు బైబ్యాక్లు, డివిడెండ్లపై వార్షిక నికర లాభాల్లో 40 శాతం వరకూ వాటాదారులకు చెల్లించాయి. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు బైబ్యాక్లపై నగదు వెచ్చింపును తగ్గించడం ఇటీవల ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క ఇతర రంగాలలోని కంపెనీలు విస్తరణ కోసం నగదును కేటాయించడంతో ఇటీవల డివిడెండ్ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు.లాభాలు ఓకే గత రెండేళ్లలో డివిడెండ్ చెల్లింపులు 7 శాతానికి పరిమితమైనప్పటికీ కంపెనీల లాభాల్లో 16 శాతం పురోగతి నమోదైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. గతేడాది షేర్ల బైబ్యాక్పై లిస్టెడ్ కంపెనీలు గత 9ఏళ్లలోనే కనిష్టంగా నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు. 2017–18లో అత్యధికంగా 22% నగదును బైబ్యాక్కు కేటాయించాయి. 2024–25లో ఇది 1.6 శాతానికి పరిమితమైంది.దిగ్గజాల తీరిలా గరిష్ట డివిడెండ్లు చెల్లించే లిస్టెడ్ దిగ్గజాలలో టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ గతేడాది 73 శాతం అధికంగా రూ. 45,612 కోట్ల డివిడెండ్ చెల్లించింది. దీంతో వరుసగా రెండో ఏడాది(2024–25)లోనూ టాప్చెయిర్ను అలంకరించింది. అయితే బైబ్యాక్కు నో చెప్పింది. ఈ బాటలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ రూ. 17,958 కోట్లు, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ. 17,828 కోట్లు వెచ్చించాయి. టాప్–10 జాబితాలో రూ. 17,009 కోట్లతో వేదాంతా, రూ.16,835 కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రూ.16,331 కోట్లతో పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా, రూ.16,290 కోట్లతో హెచ్సీఎల్ టెక్, రూ.15,411 కోట్లతో ఓఎన్జీసీ, రూ.14,190 కోట్లతో ఎస్బీఐ, రూ.12,455 కోట్లతో హెచ్యూఎల్ నిలిచాయి. వెరసి టాప్–10 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.9 లక్షల కోట్లు డివిడెండ్గా చెల్లించాయి. -
చైనా పప్పులేం ఉడకవు..
భౌగోళిక రాజకీయ అడ్డంకులు ఉన్నప్పటికీ యాపిల్ దాని ప్రధాన తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ భారతదేశంలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకు సాగుతోంది. చైనాకు వెలుపల ఉత్పత్తిని వైవిధ్యపరచడానికి యాపిల్ దీర్ఘకాలిక వ్యూహానికి అనుగుణంగా ఈ చర్యలు చేపడుతోంది. అయితే యాపిల్ భారత్లో తయారీ విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకతను హైలైట్ చేస్తూ కీలక సిబ్బంది బదిలీలకు చైనా అడ్డుకట్ట వేస్తోంది.యాపిల్ భారత్లో విస్తరణ ప్రపంచ సరఫరా గొలుసులకు కీలకంగా మారింది. ముఖ్యంగా కొవిడ్ -19 కాలంలో, పెరుగుతున్న యూఎస్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విస్తరణ ఎంతో కలిసివస్తోంది. దాంతో కొన్ని సంవత్సరాలుగా యాపిల్ దేశంలో తన ఐఫోన్ తయారీని క్రమంగా పెంచుతోంది. 2024లో ఎగుమతులు 17 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొదటిసారి ఇవి దేశ ఫార్మాస్యూటికల్ ఎగుమతులను అధిగమించాయి. ఇది మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు 7% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్య 2026 నాటికి 25%కు పెరుగుతుందని భావిస్తున్నారు.చైనా హైలైట్ చేస్తున్న కీలక అంశాలుట్రంప్ ప్రతిఘటన..యాపిల్ సీఈఓ టిమ్కుక్ను భారత్లో ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక్షంగానే హెచ్చరించారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం, భౌగోళిక ప్రమాదాలను నిర్వహించడం లక్ష్యంగా అమెరికాకు వెళ్లే ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించే యాపిల్ ప్రణాళికకు ఇది విరుద్ధంగా ఉంది.చైనా పుష్ బ్యాక్..చాలాకాలంగా యాపిల్ సరఫరా గొలుసుకు కేంద్రంగా ఉన్న చైనా కీలక ఇంజినీర్లను భారతదేశానికి మకాం మార్చకుండా నిరోధిస్తోంది. ఇది చైనా వెలుపల దాని అధునాతన తయారీ ప్రక్రియలను ప్రతిబింబించే యాపిల్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తోంది. ముఖ్యంగా ఉత్పత్తిలో నాణ్యత నియంత్రణ, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో టాలెంట్ అడ్డంకి ఆపరేషనల్ సవాళ్లను కలిగిస్తుంది.ఇదీ చదవండి: వేగంగా హాస్టళ్ల మూసివేతఫాక్స్కాన్ దూకుడుఈ అడ్డంకులు ఉన్నప్పటికీ ఫాక్స్కాన్ ఇప్పటి వరకు భారత్లో భారీ పెట్టుబడులతో ముందుకు సాగుతోంది. 30,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించేలా భారీ క్యాంపస్ను నిర్మిస్తోంది. హైటెక్ తయారీని ఆకర్షించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను అందిస్తూ భారత ప్రభుత్వం విస్తరణకు చురుకుగా మద్దతు ఇస్తోంది. -
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా అంబానీ ఆధ్వర్యంలో వేడుకలు
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ఈ ఉత్సవాలు ‘గ్రాండ్ స్వాగత్’ పేరుతో సెలబ్రిటీల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. ఈ హైప్రొఫైల్ ఈవెంట్లో మనీష్ మల్హోత్రా రూపొందించిన ఫ్యాషన్ షో ఉంటుంది. ఇది భారతదేశం హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుంది. విజువల్ ఫీస్ట్కు అనుబంధంగా వికాస్ ఖన్నా తయారు చేసిన స్టార్ మెనూతో వంటకాలు ఉంటాయి. ఈ వేడుకల్లో భాగంగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ ఆధ్వర్యంలో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’తో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయి. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నీతా చెప్పారు. View this post on Instagram A post shared by NMACC India Weekend (@nmacc.indiaweekend)ఇదీ చదవండి: అస్థిర ధరలు.. చైనా ఈవీకి సవాళ్లుఅతిథులు బాలీవుడ్ డ్యాన్స్ వర్క్షాప్ల్లో పాల్గొనవచ్చు. గార్బా, దాండియా రాస్ను ఆస్వాదించవచ్చు. ‘ది గ్రేట్ ఇండియన్ బజార్’లో భాగంగా భారతీయ వస్త్రాలు, హస్తకళలు, ప్రాంతీయ వంటకాలను రుచి చూడవచ్చు. ఎస్ఎంఏసీసీ ఇండియా వీకెండ్ యూఎస్లో నిర్వహించే అతిపెద్ద భారతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఉండనుంది. ‘సంస్కృతి విభిన్న ఆచారవ్యవహారాలున్న మనుషులను కలుపుతుంది. సహానుభూతిని పెంపొందిస్తుంది. 5,000 ఏళ్లకు సంబంధించిన భారతదేశ చరిత్రను ప్రపంచానికి తెలియజేసేందుకు ఎదురుచూస్తున్నాం’ అని ఈ సందర్భంగా నీతా అంబానీ అన్నారు. -
ఎంఎస్ఎంఈలకు షిప్రాకెట్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఈ–కామర్స్ సరీ్వసుల సంస్థ షిప్రాకెట్ తమ కార్యకలాపాల విస్తరణలో భాగంగా చిన్న, మధ్య తరహా సంస్థలపై (ఎంఎస్ఎంఈ) మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తమ ప్లాట్ఫాంపై 3 లక్షల మంది పైగా విక్రేతలు ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ ప్లాట్ఫాం ద్వారా 18,000 విక్రేతలు లావాదేవీలు సాగిస్తున్నట్లు సంస్థ సీఈవో అతుల్ మెహతా (డొమెస్టిక్ షిప్పింగ్) సోమవారమిక్కడ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రెండు రాష్ట్రాల్లో సుమారు 35 లక్షల పైగా డెలివరీలు నమోదయ్యాయని ఎస్ఎంఈల కోసం షిప్రాకెట్ యాత్ర 2025 కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తమకు 32 గిడ్డంగులు ఉండగా, హైదరాబాద్లో ఒకటి ఉందన్నారు. 3 డార్క్ స్టోర్స్ ఉండగా.. తదుపరి విడతలో హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్లతో డెలివరీ, క్విక్ డెలివరీ విభాగాలపైనా దృష్టి పెడుతున్నామని మెహతా వివరించారు. -
మైక్రాన్ సెమీకండక్టర్ సెజ్
న్యూఢిల్లీ: సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్ పరికరా ల తయారీకి సంబంధించి మరిన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఇందులో మైక్రాన్ సెమీకండక్టర్ టెక్నాలజీ ఇండియా, హుబ్బళ్లి డ్యూరబుల్ గూడ్స్ క్లస్టర్ (ఈక్వస్ గ్రూప్) ప్రతిపాదనలు ఉన్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటన ప్రకారం గుజరాత్లోని సాణంద్లో మైక్రాన్ సుమారు 37.64 హెక్టార్ల విస్తీర్ణంలో సెజ్ ఏర్పాటు చేయనుంది. దీనిపై రూ. 13,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. మరోవైపు, కర్ణాటకలోని ధార్వాడ్లో ఈక్వస్ గ్రూప్ 11.55 హెక్టార్లలో ఎలక్ట్రానిక్స్ పరికరాల సెజ్ను నెలకొల్పనుంది. దీనిపై రూ. 100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. పెట్టుబడులు.. తయారీకి ఊతందేశీయంగా సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహించే దిశగా సెజ్ నిబంధనలను సరళతరం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అధునాతన రంగాలు ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడి ఉండటం, తయారీ కార్యకలాపాలకు భారీగా పెట్టుబడుల అవసరం నెలకొనడం, లాభాలార్జించేందుకు సుదీర్ఘ సమయం పట్టేసే అవకాశం ఉండటం తదితర అంశాల నేపథ్యంలో పెట్టుబడులు, తయారీకి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం నిబంధలను సడలిస్తోందని వాణిజ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా సెమీ కండక్టర్లు లేదా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ కోసం సెజ్లను ఏర్పాటు చేసేందుకు ఒకేచోట కనీసం 10 హెక్టార్ల స్థలం ఉంటే సరిపోతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి 50 హెక్టార్లుగా ఉంది. ఇక సెజ్లలోని సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థలు అంతర్జాతీయంగానే కాకుండా, నిర్దిష్ట సుంకాలు చెల్లించిన మీదట దేశీయంగా కూడా విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వివరించింది. ఈ సవరణలన్నీ దేశీయంగా హైటెక్ తయారీకి, సెమీకండక్టర్ల తయారీ వ్యవస్థ అభివృద్ధికి, ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని పేర్కొంది. 2025 జూన్ 3న ఈ సవరణలను కేంద్ర వాణిజ్య శాఖ నోటిఫై చేసింది. -
ఐపీవోకు లలితా జ్యువెలరీ
న్యూఢిల్లీ: బంగారు ఆభరణ వర్తక దిగ్గజం లలితా జ్యువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ.1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఎం.కిరణ్ కుమార్ జైన్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అర్హతగల సంస్థ ఉద్యోగులకు డిస్కౌంట్లో షేర్లను ఆఫర్ చేయనుంది. ఐపీవో నిధుల్లో రూ. 1,015 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది. 1985లో చెన్నైలోని టీనగర్లో తొలి స్టోర్ను ప్రారంభించిన కంపెనీ 2024 డిసెంబర్కల్లా 56 స్టోర్లకు విస్తరించింది. తద్వారా గోల్డ్, సిల్వర్, డైమండ్ జ్యువెలరీ విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో అధిక స్టోర్లు కలిగిన కంపెనీకి తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలోనూ కార్యకలాపాలున్నాయి. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల్లో రూ.12,595 కోట్ల ఆదాయం, రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
2 నిమిషాల్లో అమెరికా వీసా.. చెన్నై విద్యార్థి రికార్డ్
అమెరికా వీసా దొరకడం అంటే అంతే ఆషా మాషీ కాదు. అదీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మరీ కష్టం. కానీ చెన్నైకి చెందిన ఓ విద్యార్థి కేవలం రెండు నిమిషాల్లో యూఎస్ వీసా సాధించాడు. చైన్నైలోని అమెరికా కాన్సులేట్ లో జరిగిన ఓ ఘటన ఔత్సాహిక విద్యార్థులు, వీసా అభ్యర్థుల దృష్టిని ఆకర్షించింది. గత నెల 30న అమెరికాలోని శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లిన ఓ విద్యార్థి తన ఎఫ్ -1 స్టూడెంట్ వీసాకు కేవలం 120 సెకన్లలో ఆమోదం పొందాడు. ఇది అత్యంత వేగవంతమైన వీసా అనుమతులలో ఒకటిగా రికార్డులకెక్కింది.శాన్ డియాగో స్టేట్ యూనివర్శిటీలో గేమ్ డెవలప్మెంట్ లో స్పెషలైజేషన్ తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తనకు వీసా ఇంటర్వ్యూ ఎలా సాగిందో ప్రొఫెషనల్ సోషల్ ప్లాట్ఫామ్ రెడిట్లో పంచుకున్నాడు. తన ఇంటర్వ్యూ ఎటువంటి అంతరాయాలు లేకుండా నిమిషాల్లో ముగిసిందని వివరించాడు.మొదటి ప్రయత్నంలోనే.. ఈ విద్యార్థికి మొదటి ప్రయత్నంలోనే అదీ అత్యంత వేగంగా అమెరికా వీసా లభించడం విశేషం. తన ఇంటర్వ్యూ ఉదయం 9.30 గంటలకు షెడ్యూల్ చేసినప్పటికీ 9 గంటలకే లోపలికి అనుమతించడంతో ప్రక్రియ అంతా చకాచకా ముగిసిందని విద్యార్థి చెప్పుకొచ్చాడు. తననో పెద్ద వయసున్న వీసా ఆఫీసర్ ఇంటర్యూ చేశారని, అంతా రెండే నిమిషాల్లో పూర్తయిందని వివరించాడు. ఈ విద్యార్థి తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లు, హాస్పిట్లు ఓనర్లు కావడం, ఆర్థిక నేపథ్యం బలంగా కలిసివచ్చింది. -
IRCTC: పేమెంట్ లేకుండా ట్రైన్, ఫ్లైట్ టికెట్లు
దేశంలో ఎక్కువమంది ప్రయాణించే రవాణా వ్యవస్థ రైల్వేలు. నిత్యం కోట్లాదిమంది రైళ్లలో వివిధ గమ్యస్థానాలకు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణ రైలు సర్వీస్లతోపాటు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను సైతం రైల్వే శాఖ అందిస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రయాణికుల కోసం కొత్త డిజిటల్ పేమెంట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. 'ఈపేలేటర్' పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ స్కీమ్ ద్వారా ప్రయాణికులు రైలు, విమాన టికెట్లను బుక్ చేసుకుని తర్వాత ఎలాంటి వడ్డీ లేకుండా చెల్లించవచ్చు.ఈపేలేటర్ ఆప్షన్ వెబ్సైట్, మొబైల్ యాప్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్లు, టూర్ ప్యాకేజీలను ఈ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అంతేకాక, తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి కూడా ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ప్రయాణికులు ఎలాంటి వడ్డీ లేకుండా 14 రోజుల్లో చెల్లించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.ఈపేలేటర్ సేవను పొందే ప్రక్రియతక్షణ, చెల్లింపు రహిత బుకింగ్ ప్రయోజనాలను పొందే ప్రక్రియ సాధారణ బుకింగ్ మాదిరిగానే సులభంగా ఉంటుంది.ఐఆర్సీటీసీ అందించే రైలు, విమానం లేదా టూర్ ప్యాకేజీలను ప్రయాణికులు ఎంచుకోవాల్సి ఉంటుంది.పేమెంట్ పేజీలోకి వెళ్లిన తర్వాత ప్రయాణికులు 'ఈపేలేటర్' ఆప్షన్ను ఎంచుకుని బుకింగ్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కార్డు వివరాలు లేదా వాలెట్ బ్యాలెన్స్ అవసరం లేదు. -
బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతు
భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదో వేడుక. మ్యాచ్లు జరిగినన్ని రోజులు నిత్యం వీటిపైనే చర్చ. అయితే ఈసారి ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఎంత సంపద సమకూరిందోననే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఐపీఎల్ 2025లో బీసీసీఐకు మీడియా హక్కులు, ఇతర ప్రకటనలు వంటి వాటి ద్వారా ఎంత రాబడి వచ్చిందో తెలుసుకుందాం.ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి ఈ లీగ్ను గెలుచుకుంది. బీసీసీఐకి కీలకంగా మారిన ఐపీఎల్లో వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రసార రుసుము ద్వారా రూ.9,678 కోట్లు అంటే ఒక్కో ఆటకు సుమారు రూ.130.7 కోట్లు రాబడి వచ్చినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. టెలివిజన్ హక్కుల నుంచి డిజిటల్ హక్కులను బీసీసీఐ వేరు చేయడంతో ఆదాయం మరింత పెరిగింది.టెలివిజన్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ వద్ద ఉండగా, డిజిటల్ హక్కులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వయాకామ్ 18 వద్ద ఉన్నాయి. వీటిని అదనంగా స్పాన్సర్షిప్ ఫీజు వస్తుంది. లీగ్ టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్. ఇది 2024 నుంచి 2028 వరకు ఐపీఎల్తో తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రూ.2,500 కోట్లకు పొడిగించింది. అంటే 2025 సీజన్తో సహా ప్రతి సీజన్కు రూ.500 కోట్ల డీల్ కుదుర్చుకుంది.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలువీటితో పాటు అసోసియేట్ పార్టనర్స్ మై11సర్కిల్, ఏంజెల్ వన్, రూపే వంటి ఇతర స్పాన్సర్ల నుంచి కూడా బీసీసీఐ డబ్బు సంపాదించింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్ - సియెట్; అధికారిక అంపైర్ భాగస్వాములు - వండర్ సిమెంట్; ఆరెంజ్ & పర్పుల్ క్యాప్ పార్టనర్- ఆరామ్కో వంటి కంపెనీలు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. టిక్కెట్లు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం బీసీసీఐకి అదనం. అయితే నిర్ణీత కేంద్ర ఆదాయ భాగస్వామ్య ప్రక్రియలో భాగంగా ఒక్కో జట్టుకు బీసీసీఐ రూ.425 కోట్లు ఇస్తుంది. 2024లో బీసీసీఐకి రూ.20,686 కోట్లు సమకూరాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.16,493 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. -
ఎయిర్క్రాఫ్ట్ అప్గ్రేడ్పై రిలయన్స్ ఇన్ఫ్రా దృష్టి
న్యూఢిల్లీ: యుద్ధ విమానాల అప్గ్రేడ్ (నవీకరణ/ఆధునికీకరణ) వ్యాపారంలోని అవకాశాలపై అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా కన్నేసింది. వచ్చే 5–10 ఏళ్ల కాలంలో రూ.5,000 కోట్ల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోవడం పట్ల కంపెనీ ఆశావహంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఓఈఎం కాకుండా సొంతంగా సమగ్రమైన ఎయిర్క్రాఫ్ట్ అప్గ్రేడ్ కార్యక్రమాలను నిర్వహించే తొలి దేశీ కంపెనీగా రిలయన్స్ ఇన్ఫ్రా గుర్తింపు తెచ్చుకోనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి ఇప్పటికే 55 డార్నియర్ –228 ఎయిర్క్రాఫ్ట్ల అప్గ్రేడ్ కాంట్రాక్టును సొంతం చేసుకోవడంతోపాటు విజయవంతంగా అమలు చేసినట్టు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికాకు చెందిన జెనెసిస్ కంపెనీ సహకారంతో ఈ కాంట్రాక్టును అమలు చేసినట్టు తెలిపాయి. మొదట 37 ఎయిర్క్రాఫ్ట్లకు సంబంధించి ఆర్డర్ సొంతం చేసుకోగా, అనంతరం మరో 18 ఎయిర్క్రాఫ్ట్ల అప్గ్రేడ్ కాంట్రాక్టు సైతం లభించినట్టు వెల్లడించాయి. ఈ మొత్తం ఆర్డర్ విలువ రూ.350 కోట్లు ఉంటుందని తెలిపాయి. ఈ డార్నియర్ యుద్ధ విమానాలు ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ వినియోగిస్తున్నవి కావడం గమనార్హం. భారీ మార్కెట్.. యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ల జీవిత కాలం సాధారణంగా 30–40 ఏళ్లుగా ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని అప్గ్రేడ్ చేయడం అవసరం. ఎయిర్క్రాప్ట్ అప్గ్రేడ్, ఎంఆర్వో సేవల కోసం ఒక యుద్ధ విమానం కొనుగోలు ధరతో పోలి్చతే 200–300 శాతం వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ఈ మార్కెట్ రూ.5 లక్షల కోట్లుగా ఉంటే, వచ్చే ఏడేళ్లలో రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనాలు నెలకొన్నాయి. తొలుత దేశీ మార్కెట్తోపాటు తదుపరి అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలను సొంతం చేసుకోవాలన్న వ్యూహాత్మక దృష్టితో రిలయన్స్ ఇన్ఫ్రా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రంపచస్థాయి పరిష్కారాలను అందించాలనుకుంటోంది. ఫ్రాన్స్కు చెందిన థేల్స్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇన్ఫ్రా ఇప్పటికే రఫేల్ ఫైటర్ జెట్స్కు సంబంధించి పనితీరు ఆధారిత లాజిస్టిక్స్ (పీబీఎల్) కార్యక్రమంలో కీలక సంస్థగా సేవలు అందిస్తోంది. -
చదువు కొంటున్నారా?
నాణ్యమైన విద్య.. అందని ద్రాక్ష కాదు..! ఏటేటా భారీగా పెరిగిపోతున్న ఫీజులు పాఠశాల విద్యకే రూ.లక్షలాది ఖర్చు విదేశీ విద్యకు భారీగా వెచ్చించాల్సిందే ముందస్తు ప్రణాళికతో సాధించడం సులభమే పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు–సంస్కారం. అందుకే తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడకుండా పిల్లలను మంచి పాఠశాలల్లో చేర్పించేందుకు తమ వంతు ప్రయత్నిస్తుంటారు.కానీ, నాణ్యమైన విద్య నేడు అందరికీ అందుబాటులో లేదు. పాఠశాల స్థాయి నుంచే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎల్కేజీ, యూకేజీలకు రూ.లక్షల ఫీజులు తీసుకుంటున్న పాఠశాలలు చాలానే ఉన్నాయి. ఉన్నత విద్యకు ఇంకా అధిక మొత్తమే వెచ్చించాల్సి వస్తోంది. నాణ్యమైన చదువుల కోసమని ఈ స్థాయి ఖర్చును భరించడం మధ్యతరగతి వారికి ముందస్తు ప్రణాళికతోనే సాధ్యం.గడిచిన దశాబ్ద కాలంలో స్కూలు ఫీజులు 150–200 శాతం వరకు పెరిగాయి. ఈ ఏడాది హైదరాబాద్, బెంగళూరులో పేరున్న పాఠశాలలు 30 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. సాధారణ ద్రవ్యోల్బణం 6 శాతమే. కానీ విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం వరకు ఉంటోంది. అంటే ఫీజులు ఏటా ఈ స్థాయిలో, ఇంతకుమించి పెరుగుతున్నాయి. దీనికి అదనంగా ట్యూషన్లు, క్రీడల్లో కోచింగ్, సంగీతం/కళలు, పుస్తకాలు, బస్సు రవాణా రూపంలో అదనంగా ఖర్చు చేయాల్సిందే. ఐఐటీల్లోనూ నాలుగేళ్ల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. పాఠశాల చదువు తర్వాత ఐఐటీలు, ఐఐఎంలు, నిట్, బిట్ తదితర ప్రఖ్యాత సంస్థల్లో సీటు రాకపోతే.. ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపేందుకు ఇటీవలి కాలంలో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా ఈ ఫీజులు ఏటేటా పెరుగుతూ పోతున్నాయి. పాఠశాల స్థాయిలో చేసే ఖర్చుకు అదనంగా.. మరోవైపు వారి ఉన్నత విద్యకోసం కావాల్సినంత సమకూర్చుకునేందు కు ప్రాధా న్యం ఇవ్వాల్సిందే. ఇందుకు ముందస్తు వ్యూహం, ప్రణాళిక తప్పకుండా అవసరం. ప్రణాళిక.. విద్యా వ్యయాలను భరించాలంటే అది ముందస్తు ప్రణాళికతోనే సాధ్యమని సరి్టఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ హర్‡్షవర్ధన్ రుంగ్తా పేర్కొన్నారు. విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ (ఫీజులు, ఆహారం, వసతి ఇతర ఖర్చులు) కోసం ప్రస్తుతం 1,00,000 డాలర్లు (సుమారు రూ.86 లక్షలు) అవుతున్నట్టు చెప్పారు. దేశాలను బట్టి ఈ వ్యయాలు మారిపోతాయన్నారు. సింగపూర్తో పోల్చి చూసినప్పుడు యూఎస్, కెనడాలో అధిక చార్జీలు ఉన్నట్టు తెలిపారు. పిల్లల వయసు ఏడాది, ఆలోపు ఉన్నప్పుడే పెట్టుబడుల ప్రణాళిక ఆరంభించాలని సూచించారు. ప్రైవేటు విద్యా వ్యయాలు పెరిగిపోతున్న తీరు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ సీవోవో జైదీప్ కేవల్రమణి పేర్కొన్నారు. ‘‘గత పదేళ్లలో స్కూల్ ఫీజులు 150 శాతానికి పైనే పెరగ్గా, కొన్ని యూనివర్సిటీల్లోనూ 200 శాతం మేర ఫీజులు పెరిగాయి. నాణ్యమైన విద్యకు పెరుగుతున్న డిమాండ్ను ఈ ఫీజులు సూచిస్తున్నాయి’’ అని వివరించారు. పిల్లలు ప్రీ స్కూల్ దశకు రాకముందే ప్రణాళిక మొదలు పెట్టాలని సూచించారు. ముందస్తుగా ఆరంభిస్తే కాంపౌండింగ్తో పెట్టుబడి మెరుగైన వృద్ధిని చూస్తుంది. కాల వ్యవధి.. పిల్లల వయసు ప్రస్తుతం ఎంత? పాఠశాల విద్య, ఉన్నత విద్య కోసం ఎంత సమకూర్చుకోవాలన్న విషయాలపై స్పష్టత అవసరం. చిన్నారి వయసు మూడేళ్లు ఉందనుకుందాం. ఇక్కడి నుంచి కాలేజీ చదువులకు ఇంకా 15 ఏళ్లు మిగిలి ఉంటుంది. ఉన్నత విద్య కోసం కావాల్సినంత సమకూర్చుకునేందుకు 15 ఏళ్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకోవాలి. అదే సమయంలో ఇక్కడి నుంచి ప్లస్2 వరకు (ఇంటర్) అయ్యే ఖర్చులకూ సన్నద్ధత, ప్రణాళిక వేరుగా ఉండాలి. స్కూల్ ఫీజులే కాకుండా, వారికి ఇతర విభాగాల్లో తరీ్ఫదు ఇప్పించాలనుకుంటే అందుకు అయ్యే వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఖర్చుకు సన్నద్ధత విద్యా ద్రవ్యోల్బణం 11–12 శాతం చొప్పున ఉంటోంది. కనీసం 10 శాతాన్ని అంచనా కింద తీసుకుని చూసినా.. ఐఐటీల్లో బీటెక్ కోసం నాలుగేళ్లకు నేడు రూ.12 లక్షల వరకు ఖర్చు అవుతుంటే.. 15 ఏళ్ల తర్వాత ఇది రూ.30 లక్షలకు చేరుతుంది. ఇంకాస్త అదనంగా పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటి వరకు మీకున్న పొదుపు పెట్టుబడులను ఒకసారి పరిశీలించండి. అవి కాకుండా, అదనంగా ఎంత సమకూర్చుకోవాలో స్పష్టతకు రావాలి. పిల్లల విద్యకు ఇప్పటి నుంచి ఎన్నేళ్లకు, ఎంత మొత్తం కావాలన్న అంచనాకు వచ్చిన తర్వాత.. ఆ మొత్తం సమకూర్చుకునేందుకు పెట్టుబడుల ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. పెట్టుబడులకు కావాల్సినంత మిగులు లేకపోతే.. అదనపు ఆదాయ మార్గాలను అన్వేషించాలి.సరైన సాధనాలు.. ఇక్కడి నుంచి ఐదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్లు, పద్దెనిమిదేళ్ల కాలంలో ఎంత మొత్తం కావాలన్న అంచనాకు అనుగుణంగా పెట్టుబడులు మొదలు పెట్టాలి. అంత మొత్తం సమకూర్చునేందుకు వైవిధ్యమైన పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడిపై రాబడి ద్రవ్యోల్బణాన్ని మించేలా చూసుకున్నప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది. ఇందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైనవి. 10 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో ఇవి 12–15 శాతం స్థాయిలో వార్షిక రాబడులను ఇవ్వగలవు.అదే సమయంలో పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించకూడదు. దీనివల్ల ఆటుపోట్ల రిస్క్ పెరుగుతుంది. డెట్ సాధనాలకూ నిరీ్ణత శాతాన్ని కేటాయించుకోవాలి. ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అస్సెట్ ఫండ్స్ను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ ఈక్విటీ, డెట్తోపాటు రియల్ ఎస్టేట్, బంగారం, వెండి తదితర సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఈ పథకం గత పదేళ్లలో ఏటా 13 శాతానికి పైనే రాబడిని ఇవ్వడం గమనార్హం. కాల వ్యవధి కనీసం 7–10 ఏళ్లు అంతకుమించి ఉంటేనే ఈక్విటీలకు కేటాయింపులు చేసుకోవాలి. లేదంటే డెట్ సాధనాలు అనుకూలం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెలు ఉన్న వారు) వంటి పన్ను రహిత సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచనల మేరకు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాతే మిగులు నుంచే ఖర్చులకు వెళ్లాలి. తద్వారా లక్ష్య సాధన తేలిక అవుతుంది. రక్షణ కవచాలుఅనుకోని, ఊహించని ఘటనలు చోటు చేసుకుంటే పిల్లల విద్యా లక్ష్యాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించుకోవడం అవసరం. కనుక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి.. 10–20 ఏళ్లపాటు కుటుంబం జీవన అవసరాలు, పిల్లల విద్యా వ్యయాలు, వారి వివాహం ఖర్చులు, రుణాలు ఏవైనా ఉంటే అంత మేర సమ్ అష్యూర్డ్తో జీవిత బీమా తీసుకోవాలి. ఇందుకు అచ్చమైన టర్మ్ ఇన్సూరెన్స్తోపాటు.. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను పరిశీలించొచ్చు.సమీక్ష అవసరం.. ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా.. అవి అనుకున్న విధంగానే రాబడులను ఇస్తున్నాయా? అన్నది ఏడాదికోసారి నిపుణుల సాయంతో సమీక్షించుకోవాలి. తక్కువ రాబడి ఇస్తుంటే ఇతర సాధనాల్లోకి మారిపోవడం లేదంటే.. పెట్టుబడిని పెంచుకోవడం చేయాలి. అలాగే, అంచనాలకు మించి విద్యా వ్యయాలు పెరుగుతున్నా కూడా పెట్టుబడులను సమీక్షించుకోవాల్సిందే. కనుక పెరిగే సంపాదనకు అనుగుణంగా ఏటా పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అనుకు న్న మేర రాబడులను ఇవ్వకపోవచ్చు. లేదంటే అంచనాలకు మించి ఫీజులు పెరిగిపోవచ్చు. మొత్తం మీద నిరీ్ణ త కాలానికి కావాల్సినంత సమకూరకపోతే అప్పుడు ఉన్నత విద్య కోసం విద్యా రుణాలను ఆశ్రయించడం ఒక మార్గం. కోర్సు పూర్తయిన అనంతరం లేదా ఉద్యోగంలో చేరిన అనంతరం చెల్లింపులు మొదలయ్యే ఆప్షన్ను ఎంపిక చేసుకోవచ్చు. ఆదాయపన్ను పాత విధానంలో విద్యా రుణాలపై చేసే వడ్డీ చెల్లింపుల మొత్తానికీ పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. స్కాలర్షిప్లు భారంగా మారిన విద్యా వ్యయా లను గట్టెక్కేందుకు స్కాలర్షిప్లు కూడా ఒక మార్గం. పేరొందిన సంస్థలు ఏటా నిరీ్ణత సంఖ్యలో విద్యార్థులకు స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తుంటాయి. వీటిని సాధించేందుకు ప్రయత్నించాలి. నిపుణుల సాయం పిల్లల విద్యా వ్యయాలు, ద్రవ్యోల్బణం ప్రభావం, పెట్టుబడి సాధనాల ఎంపిక అన్నవి చాలా సంక్లిష్టమైనవి. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవడం వల్ల అనవసర ఆందోళన, గందరగోళాన్ని నివారించొచ్చు. అంతేకాదు, మెరుగైన సాధనాల ఎంపిక సాధ్యపడుతుంది. కొంత ఫీజుకు వెనుకాడకుండా వారి సాయాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. దీనివల్ల ఎంతో ముఖ్యమైన విద్యా లక్ష్యాలను సాఫీగా అధిగమించొచ్చు.‘నా చిన్నారిని ఖరీదైన ప్రైవేటు స్కూల్కు పంపించను’ఫీజుల పెంపు చేయి దాటిపోతోంది. కొన్ని హైదరాబాదీ స్కూల్స్ ఈ ఏడాది 30% వరకు ఫీజులు పెంచేశాయి! → వార్షిక సగటు ఫీజులు ఇప్పుడు రూ. 60,000–2,00,000 మధ్య ఉన్నాయి. → ఏడాది ఫీజు అంతా ముందే చెల్లించాలని కొన్ని స్కూల్స్ డిమాండ్ చేస్తున్నాయి. → ఒక స్కూల్ ఎల్కేజీకి రూ.4 లక్షలు చార్జ్ చేస్తోంది. → విద్యా ద్రవ్యోల్బణం 12 శాతం చొప్పున పెరుగుతోంది. ఈ ధరలతో మనం పిల్లలను స్కూల్కు పంపేందుకు సన్నద్ధం చేస్తున్నామా.. లేక తల్లిదండ్రులను దివాలా బాట పట్టిస్తున్నామా? ప్రైవేటు స్కూల్స్ నేడు విద్యా సంస్థల కంటే కూడా స్టార్టప్ల మాదిరిగా కనిపిస్తున్నాయి’’ – ఫైనాన్షియల్ అడ్వైజర్, మాజీ వెల్త్ మేనేజర్ (ఐఐఎఫ్ఎల్) నేహ నగర్ లింక్డ్ఇన్లో చేసిన పోస్ట్ ఇది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
డబ్బులు ఊరికే రావు: ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ
తమిళనాడుకు చెందిన ప్రముఖ జువెలరీ రిటైలర్ లలితా జ్యువెలరీ మార్ట్ క్యాపిటల్ మార్కెట్లలోకి అడుగు పెడుతోంది. ఐపీవో ద్వారా నిధుల సమీకరణకు వస్తోంది. ఈమేరకు సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఈ ఐపీవోలో భాగంగా ఫ్రెష్ ఈక్విటీ షేర్ల కింద రూ.1,200 కోట్ల విలువైన షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ.500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ జారీ చేయనున్నారు.1985లో ఏర్పాటైన లలితా జ్యువెల్లరీ తాజా ఇష్యూ ద్వారా వచ్చే రూ.1,014.5 కోట్లను భారత్ లో 12 కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని యోచిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 46 నగరాల్లోని 56 స్టోర్ల ద్వారా ఆభరణాల ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తోంది.లలితా జ్యువెల్లరీ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.359.8 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే ఆదాయం 26 శాతం పెరిగి రూ.16,788 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ.262.3 కోట్ల లాభం, రూ.12,594.7 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. లలితా జ్యువెలరీ మార్ట్ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్ గా ఆనంద్ రాఠీ అడ్వైజర్స్, ఎక్విరస్ క్యాపిటల్ను నియమించారు. -
గౌతమ్ అదానీ వేతనం పెరిగింది.. కానీ..
అదానీ గ్రూప్ చైర్మన్, దేశంలోనే రెండో అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ .10.41 కోట్ల వేతనం అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అదానీ గ్రూప్లోని తొమ్మిది లిస్టెడ్ కంపెనీల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (రూ.2.54 కోట్లు), అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (రూ.7.87 కోట్లు) నుంచి ఆయనకీ ఆదాయం వచ్చింది.గతంతో పోలిస్తే ఈసారి వేతనం పెరిగినప్పటికీ, అదానీ పారితోషికం దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి పారిశ్రామిక అధినేతల కంటే చాలా తక్కువ కావడం గమనార్హం. తోటి వ్యాపారాధినేతలైన సునీల్ భారతి మిట్టల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.32.27 కోట్లు), రాజీవ్ బజాజ్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.53.75 కోట్లు), పవన్ ముంజాల్ (2024 ఆర్థిక సంవత్సరంలో రూ.109 కోట్లు), ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.76.25 కోట్లు), ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్ పరేఖ్ (2025 ఆర్థిక సంవత్సరంలో రూ.80.62 కోట్లు) వంటి వారు అదానీ కంటే ఎక్కువ వేతనం అందుకున్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తన గ్రూప్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్లలో కొంతమంది అదానీ కంటే ఎక్కువ పారితోషిక ప్యాకేజీలను అందుకున్నారు. ఏఈఎల్ సీఈవో వినయ్ ప్రకాశ్ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ ఎండీ వినీత్ ఎస్ జైన్ రూ.11.23 కోట్లు ఆర్జించారు. ఇది భారతదేశ కార్పొరేట్ నాయకత్వంలోని విభిన్న వేతన నిర్మాణాలను హైలైట్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వేతన ఆధారిత సంపాదనలో కంపెనీ వ్యవస్థాపకులనే అధిగమిస్తుండటం గమనించవచ్చు. -
ఐపీవోకి వస్తున్న ఏక్వస్
న్యూఢిల్లీ: కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, వైమానిక విడిభాగాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా మార్గంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా 20 కోట్ల డాలర్లు(రూ. 1,700 కోట్లు) సమీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.తాజా ఈక్విటీ జారీ, ప్రస్తుత ఇన్వెస్టర్ల వాటా విక్రయం ద్వారా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్ట్కానున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీలో ఇప్పటికే అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్సహా కాటమారన్, స్పర్ట గ్రూప్ తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. కంపెనీ ఏరోస్పేస్, కన్జూమర్ రంగాలకు ప్రెసిషన్ మ్యాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ను సమకూర్చుతోందిఏక్వస్ భారత్తోపాటు ఫ్రాన్స్, మూఎస్ఏలలో తయారీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. బహుళ పరిశ్రమ విభాగాలలో తన ప్రపంచ కస్టమర్ బేస్కు ఉత్పత్తులను అందిస్తోంది. ఈ సంస్థకు భారత్లోని కర్ణాటకలో మూడు తయారీ క్లస్టర్లు (బెల్గావి, హుబ్బళ్ళి, కొప్పల్) ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్, జబిల్తో కలిసి ఏక్వస్ కూడా యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తోంది. -
అనిల్ అంబానీకి భారీ ఉపశమనం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దివాలా చర్యలను నిలిపివేస్తూ తాజాగా అపిల్లేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ ఆదేశాలు జారీ చేసింది. తమ అప్పీల్ మేరకు ఎన్సీఎల్టీ ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఆదేశిస్తూ ఇంతక్రితం ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ సీపీ(ఐబీ)/624(ఎంబీ)2022 కేసులో 2025 మే 30న జారీ చేసిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ రద్దు చేసినట్లు పేర్కొంది. తమకు సౌర విద్యుత్ సరఫరా చేసిన ధుర్సర్ సోలార్ పవర్కి చెల్లింపులు జరపలేదంటూ రిలయన్స్ ఇన్ఫ్రాపై ఆరోపణలు ఉన్నాయి. ధుర్సర్కి సెక్యూరిటీ ట్రస్టీగా వ్యవహరించిన ఐడీబీఐ ట్రస్టీషిప్ సర్వీసెస్ సంస్థ 2022 ఏప్రిల్లో రిలయన్స్ ఇన్ఫ్రాపై కార్పొరేట్ దివాలా పరిష్కార చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రిలయన్స్ ఇన్ఫ్రా 2018 ఆగస్టు 28 నుంచి అసలు రూ. 88.68 కోట్లతో పాటు వడ్డీ కూడా బాకీ పడిందని వివరించింది.దీనితో రిలయన్స్ ఇన్ఫ్రాపై ఎన్సీఎల్టీ దివాలా చర్యలకు ఆదేశించింది. అయితే, ధుర్సర్ సోలార్ పవర్కు పూర్తిస్థాయిలో రూ. 92.68 కోట్లు చెల్లించేసినందున దివాలా చట్ట చర్యలను వ్యతిరేకిస్తున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. ఇంధన కొనుగోలు ఒప్పందంలో భాగంగా టారిఫ్లకింద సొమ్ము చెల్లించినట్లు తెలియజేసింది. -
ప్రపంచమంతా సింగిల్ మార్కెట్ కాదు
న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచమంతటినీ గ్లోబల్ కంపెనీలు ఒకే మార్కెట్గా పరిగణించే పరిస్థితి లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని వ్యాఖ్యానించారు. రకరకాల కూటములు, దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాల్సి ఉంటోందని ఆయన చెప్పారు. భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వల్ల అనేక రకాల ధోరణులు ఒకేసారి కనిపిస్తుండటంతో కంపెనీలు తమ ప్రాథమిక సూత్రాలను పునఃసమీక్షించుకుంటూ, సరికొత్త వ్యూహాలను రచించుకోవాల్సి వస్తోందని 2025 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికలో నీలేకని తెలిపారు. కోవిడ్ మహమ్మారి వల్ల సరఫరా వ్యవస్థపరమైన రిస్కులను తగ్గించుకుని, విశ్వసనీయమైన బ్యాకప్ ఆప్షన్లను అభివృద్ధి చేసుకోవాల్సి వచి్చందన్నారు. సకాలంలో డెలివరీ చేయడంపై మాత్రమే దృష్టి పెడితే సరిపోవడం లేదని ఊహించని విధంగా తలెత్తే అంతరాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, తగు వ్యూహాలను సిద్ధంగా ఉంచుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. సోర్సింగ్పరంగా వైవిధ్యాన్ని పాటించాల్సిన అవసరాన్ని టారిఫ్ల వివాదం సూచిస్తోందన్నారు. ఇక కృత్రిమ మేథ వల్ల ఒనగూరే ప్రయోజనాలు, ఎదురయ్యే రిసు్కలు కూడా అనిశి్చతికి దారితీస్తున్నాయని నీలేకని వివరించారు. -
విమాన సిబ్బంది తీరుపై అసహనం
ఎయిర్పోర్ట్లో విమాన ప్రయాణ సంస్థ సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడంతో దాదాపు రూ.2.65 లక్షల విలువైన క్లయింట్ డీల్ను కోల్పోయినట్లు లింక్డ్ఇన్లో ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జైపూర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోస్ట్లోని వివరాల ప్రకారం.. ఇండిగో సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడం వల్ల తాను ప్రయాణించాలనుకున్న విమానాన్ని మిస్సయ్యానని ఓ వ్యక్తి తెలిపారు.చయాన్ గార్గ్ అనే ప్రయాణికుడు ‘ఇండిగో, మీరు దిగజారుతున్నారు’ అనే శీర్షికతో ఓ పోస్ట్ చేశారు. ‘నేను జైపూర్ నుంచి ముంబయి వెళ్లాలనుకున్నాను. దాంతో తెల్లవారుజామున 4:40 గంటలకు జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాను. 5:10 గంటలకు సెక్యూరిటీ క్లియర్ చేశాను. 10-15 నిమిషాల్లో బోర్డింగ్ ప్రారంభమవుతుందని ఇండిగో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. బోర్డింగ్ గేటు రద్దీగా ఉండటాన్ని గమనించి బోర్డింగ్ ప్రారంభానికి ముందు వాష్ రూమ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను 12 నిమిషాల్లో తిరిగి వచ్చాను. అంతలోనే బోర్డింగ్ మూసివేశారు. ఆ సమయానికి బోర్డింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, మూసివేతపై ఆశ్చర్యపోయాను. గేటు మూసివేస్తున్నారని ఎలాంటి ప్రకటనలు చేయలేదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఓఎస్ గురించి తెలుసా..?ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నించగా జైపూర్ విమానాశ్రయంలో బహిరంగ ప్రకటన అవకాశాలు పరిమితంగా ఉన్నాయని తెలియజేసినట్లు గార్గ్ చెప్పారు. ఫ్లైట్ సిబ్బందిని వేడుకున్నప్పటికీ, తాను వెళ్లాల్సిన క్లయింట్ సమావేశం ఎంత అత్యవసరమో వివరించినప్పటికీ బోర్డింగ్ క్లియర్ చేయలేదని తెలిపారు. ప్రయాణానికి ప్రత్యామ్నాయం చూపలేదని చెప్పారు. టికెట్ఫేర్ రీఫండ్ ఇవ్వలేదన్నారు. కనీసం సిబ్బంది తనపై సానుభూతి చూపలేదని వాపోయారు. ఈ వ్యవహారం వల్ల తాను క్లయింట్ను కోల్పోయానని చెప్పారు. దీని విలువ రూ.2.65 లక్షలు, నెల రోజుల శ్రమ క్షణాల్లో వృథా అయిందని తెలిపారు.ఇండిగో స్పందనగార్గ్ లింక్డ్ఇన్ పోస్ట్కు ప్రతిస్పందనగా ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రామాణిక విధానాలను అనుసరించామని పేర్కొంటూ ప్రయాణికుడి నిరాశను అంగీకరించింది. ‘డియర్ మిస్టర్ గార్గ్, ఫ్లైట్ మిస్ అవ్వడం ఎంత నిరాశ కలిగిస్తుందో మాకు తెలుసు. మేము జాగ్రత్తగా ప్లాన్ చేసిన సమయానికి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయాలనుకుంటున్నాం. మా సమీక్ష ప్రకారం ప్రామాణిక ప్రక్రియకు అనుగుణంగా బయలుదేరడానికి 25 నిమిషాల ముందు బోర్డింగ్ గేట్ మూసివేశారు. దురదృష్టవశాత్తూ గేటు మూసివేసిన తరువాత మీరు వచ్చారు. అప్పటికి టేకాఫ్ కోసం తుది సన్నాహాలు జరుగుతున్నాయి. మా ఎయిర్పోర్ట్ సిబ్బంది తదుపరి అందుబాటులో ఉన్న విమానాన్ని మీకు సూచించారు. అందులో ప్రయాణించకూడదనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇండిగో వినియోగదారులందరికీ అంతరాయం లేని ప్రయాణాల కోసం నిరంతరం పనిచేస్తోంది’ అని తెలిపింది. -
ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు
ఉద్యోగులు ప్రస్తుతం తాము చేస్తున్న కంపెనీ పని వాతావరణం నచ్చకో.. మరింత వేతనం ఆశించో.. ప్రమోషన్ కోసమో.. ఇలా విభిన్న కారణాలతో వేరే సంస్థకు మారాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం తాము పని చేస్తున్న కంపెనీ వేతనం ఇచ్చిన తేదీ రోజున లేదంటే తర్వాత రోజున ఉద్యోగులు అధికంగా రాజీనామా పత్రాలను సమర్పిస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా ఉంటోందంటున్నారు. ముంబయికి చెందిన స్టార్టప్ ‘పిట్@గో జీరో’ వ్యవస్థాపకురాలు కిరణ్ షా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.‘ఉద్యోగులకు తాము చేస్తున్న కంపెనీలు నచ్చలేదంటే.. సరిగ్గా వేతనం పడే రోజున లేదా పడిన మరుసటి రోజున రాజీనామా చేస్తున్నారు. ఇది కొన్ని యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ తంతు యువకుల్లో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా అన్ని కంపెనీల్లో ఒకటో తేదీన జీతాలు ఇస్తారు. కాబట్టి ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే కొన్ని యాజమాన్యాలకు చుక్కలే. తమ ఉద్యోగులు ఎక్కడ రాజీనామా పత్రాలతో సిద్ధంగా ఉంటారోననే ఆందోళన చెందుతుంటాయి. ఉద్యోగులు కూడా ఈ విషయంలో కంపెనీలకు విదేయతతో ఉండాలి. తమ డిమాండ్లు ఏమిటో ముందుగా కంపెనీతో చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: 30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు‘ఉద్యోగులు నిజంగా కంపెనీ నుంచి తప్పుకోవాలనుకుంటే హుందాగా తప్పుకోండి. తప్పా కంపెనీ వేతనం పడిన వెంటనే కొలువు నుంచి వైదొలగడం సరికాదు. అప్పటివరకు ఉద్యోగికి ఇచ్చిన బాధ్యతలు వెంటనే మరో వ్యక్తికి అసైన్ చేయాలంటే సంస్థకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తప్పుకుండా నోటీస్ పీరియడ్ చేయాలి. జీతం వేసిన వెంటనే మీ యజమానిని భయభ్రాంతులకు గురిచేయకండి’ అని తెలిపారు. -
30ల్లోనే ముచ్చెమటలు.. తీవ్ర వ్యాధులు
యువత చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం సంపాదించాలనే ధోరణి మంచిదే. అయితే కొలువు సంపాదించాకా కార్పొరేట్ వాతావరణానికి అలవాటుపడలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్కువ వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం, మహిళల్లో పీరియడ్లకు సంబంధించిన పీసీఓఎస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇలా చెబుతున్నవారి సగటు వయసు 40 కంటే తక్కవే కావడం ఆందోళన కలిగిస్తుంది.సమస్యలు షురూ..దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ వయసు బాగా తగ్గిపోతోంది. హృద్రోగ నిపుణులను సంప్రదించేవారి సగటు వయసు ఇప్పుడు కేవలం 35 మాత్రమేనని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఒక్క గుండె జబ్బులకే ఇది పరిమితం కాలేదు.. తీవ్రమైన ఇతర సమస్యలూ చిన్న వయసులోనే ఎదురవుతున్నాయి. తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యం, సమయపాలన లేని ఆహారపుటలవాట్లు, గంటల తరబడి సీట్లకే పరిమితం కావడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పని ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.వ్యయ భారం ఇలా..కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చిన్న వయసులో రావడం ఆయా కుటుంబ సభ్యులను ఆందోళకు గురిచేస్తోంది. ఇది దేశ ఉత్పాదకత, ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ ఖర్చులపై తీవ్ర ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కంపెనీలు ఏడాదికి ఒక ఉద్యోగి నుంచి 30 రోజుల వరకు ఉత్పాదకత, పని దినాలను కోల్పోతాయని అంచనా వేస్తున్నారు. 40 శాతం ఉద్యోగులు మానసిక అనారోగ్య సమస్యలతో నెలలో కనీసం ఒక రోజైనా సెలవు తీసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యాఏం చేయాలంటే..కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం క్రమం తప్పకుండా ఆరోగ్య తనిఖీలను చేపడుతున్నాయి. కానీ ఇలాంటి కార్యక్రమాల్లో కొద్దిమంది ఉద్యోగులే పాల్గొంటున్నారు. చాలా కొద్ది కంపెనీలే ఉద్యోగుల ఆరోగ్యానికి అనుగుణంగా మెరుగైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. కార్పొరేట్ వ్యవస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రస్తుత పని ప్రణాళిల్లో మార్పులు చేయాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల కూడా తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడంతోపాటు ఆరోగ్య బీమా పథకాన్ని ఎంచుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగం ఉన్నన్ని రోజులు కంపెనీ అందించే బీమా ఉపయోగపడొచ్చు. అనుకోని కారణాల వల్ల ఉద్యోగం కోల్పోతే పరిస్థితి దిగజారుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా ఉండడం ఉత్తమం. సంపాదన మొదలు పెట్టిన వెంటనే ఆర్థిక నిపుణులు సలహాతో మంచి ఆరోగ్య బీమాను ఎంచుకోవాలి. -
జస్ట్ పరారీలో ఉన్నాను.. దొంగను కాదు: విజయ్ మాల్యా
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనం వల్ల బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా రాజ్ షమానీకి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కీలక అంశాలు పంచుకున్నారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంకు సంబంధించి మాల్యా 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి ప్రస్తావించారు. 2008 వరకు కంపెనీ సమర్థంగా పనిచేసిందని చెప్పారు.పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా మాట్లాడుతూ.. ‘2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఇది భారత్పై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలో ప్రతి రంగం దెబ్బతింది. డబ్బు సరఫరా నిలిచిపోయింది. రూపాయి విలువ దారుణంగా దెబ్బతింది. 2005లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అనతికాలంలోనే లగ్జరీ సేవలకు పేరు తెచ్చుకున్నప్పటికీ పరిస్థితులు క్షీణించడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. కార్యకలాపాలను పెంచే ప్రణాళికతో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని సంప్రదించాం. సమస్యలు వివరించాం. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానాల సంఖ్యను తగ్గించే ప్రణాళికలతో, ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పాను. ఈ ఆర్థిక పరిస్థితుల్లో పని చేయలేకపోతున్నానని చెప్పాను. బ్యాంకుల మద్దతు ఉంటుందని ముఖర్జీ చెప్పారు. కానీ అలా ఏం జరగలేదు’ అని అన్నారు.గొప్పగా పని చేయలేదన్నారు..‘కొంతకాలానికి పరిస్థితులు మరింత దిగజారడంతో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులను నిలిపివేసింది. కంపెనీ కష్టాల్లో పడింది. మళ్లీ రుణం కోసం బ్యాంకుల వద్దకు వెళితే కంపెనీ అంత గొప్పగా పని చేయలేదని అన్నారు’ అని చెప్పారు. 2016లో భారత్ను విడిచి పారిపోయిన మాల్యా అప్పటి నుంచి యూకేలో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయనను భారత్కు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు.దొంగను కాదు..మాల్యాను ‘చోర్(దొంగ)’ అని పిలవడంపై.. పాడ్కాస్ట్లో స్పందించారు. ‘పారిపోయిన వ్యక్తి’ అనే అంశంపై కూడా మాట్లాడారు. తనను దొంగగా ప్రజలు భావించడాన్ని ఖండించారు. ‘మార్చి 2016 తర్వాత భారత్కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా పిలవండి. నేను పారిపోలేదు. ముందుగా నిర్ణయించిన పర్యటన కోసం భారతదేశం నుంచి బయలుదేరాను. సరైన కారణాల వల్ల నేను తిరిగి రాలేదు. కాబట్టి మీరు నన్ను పారిపోయిన వ్యక్తి అని పిలవాలనుకుంటే మీ ఇష్టం. కానీ ‘చోర్’ అనే ముద్ర వేస్తున్నారు. దొంగతనం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.అప్పు పలుమార్లు రికవరీభారతీయ బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.6,200 కోట్లను పలుమార్లు రికవరీ చేశారని మాల్యా కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. తన నుంచి యునైటెడ్ బ్రేవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యూబీహెచ్ఎల్- ప్రస్తుతం లిక్విడేషన్ దశలో ఉంది), ఇతర అనుబంధ సంస్థల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని పూర్తిగా లెక్కించాలని కోరారు.భారత్కు తిరిగి వస్తారా..?భారత్కు తిరిగి రాకపోవడంపై అడిగిన ప్రశ్నకు విజయ్ మాల్యా సమాధానమిస్తూ..‘భారత్ లో నిష్పాక్షిక విచారణ, గౌరవప్రదమైన హామీ ఉంటే మీరు చెప్పిన దానిపై మరోసారి ఆలోచిస్తాను’ అని చెప్పారు. మాల్యాతో పాటు ఇతర వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం యూకే నుంచి భారత్ రప్పించే ప్రయత్నం చేస్తోంది. కానీ, భారత నిర్బంధ షరతులు ఈసీహెచ్ఆర్ (యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్)లోని ఆర్టికల్ 3ను ఉల్లంఘిస్తున్నాయని, అందువల్ల వారిని వెనక్కి పంపలేమని అప్పీల్ హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది.ఇదీ చదవండి: ఆర్బీఐ హ్యాట్రిక్ నిర్ణయం.. ఈఎంఐలు తగ్గుతాయ్!స్టేట్మెంట్ ఇవ్వాలి..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా రుణదాతలకు రూ.11,101 కోట్లకు పైగా రుణానికి సంబంధించిన కేసులో విజయ్ మాల్యా ఈ ఏడాది ఏప్రిల్ 9న లండన్ హైకోర్టులో దివాలా ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీల్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి బ్యాంకులు వసూలు చేసిన రుణాల రికవరీ వివరాలను కోరారు. వాస్తవానికి రూ.6,200 కోట్లు బకాయి ఉండగా, బ్యాంకులు రూ.14,000 కోట్లు రికవరీ చేశాయని మాల్యా తరఫు న్యాయవాది వాదించారు. రుణం పూర్తిగా క్లియర్ అయిందని, ఇంకా రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, రికవరీ మొత్తాన్ని వివరిస్తూ స్టేట్మెంట్ ఇచ్చేలా బ్యాంకులను ఆదేశించాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. -
ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న టెస్లా షేరు విలువ కుప్పకూలింది. గురువారం ఒక్కరోజే 14 శాతం పడిపోయి 150 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు భారీగా క్షీణించింది. ఈ కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగ విభేదాలే ఇలా టెస్లా షేరు విలువ పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరిగిన షేరు ధర ఇద్దరి మధ్య వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వస్తున్న వరుస కథనాలకు భారీగా కుప్పకూలుతోంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి 916 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది.ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం..ఇటీవల బహిరంగంగా మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్ను ఎదుర్కోవడం కష్టంగా మారిందని, ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.ఈవీ క్రెడిట్లు లేకపోవడంపై అసంతృప్తిఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలాన్కు నాకు మంచి అనుబంధం ఉంది. ఇకపై కలిసి పని చేస్తామో లేదో తెలియదు. (ఇటీవల డోజ్ నుంచి మస్క్ వైదొలిగారు) ట్రంప్ ఇటీవలి చర్యలకు నేను ఆశ్చర్యపోయాను’ అంటూ కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రెడిట్లు లేకపోవడంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంభవిష్యత్తు ఎన్నికల్లో సవాళ్లుట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా మస్క్ వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందించారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, డెమ్స్ సభను నియంత్రించేవారని, సెనేట్లో రిపబ్లికన్లు 51-49తో గెలిచేవారని పేర్కొన్నారు. మస్క్ ఇటీవల బలమైన రాజకీయ వైఖరిని తీసుకున్నారు. కొత్త బడ్జెట్ బిల్లు అసహ్యంగా ఉందని, దానికి మద్దతిచ్చే ప్రజాప్రతినిధులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. -
సర్క్యూలర్ బిజినెస్ మోడల్లో తొలి స్పోర్ట్స్ రిటైలర్
డెకాథ్లాన్ ఇండియా తన ప్రధాన వ్యాపార నమూనాలో సర్క్యూలర్ బిజినెస్ మోడల్ను అనుసరిస్తున్నట్లు తెలిపింది. భారతదేశంలోనే ఈ చొరవ చూపిన మొదటి స్పోర్ట్స్ రిటైలర్గా నిలిచినట్లు పేర్కొంది. ఈ ‘మిషన్ ఎల్ఐఎఫ్ఈ (లైఫ్స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్)’ స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ వ్యర్థాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు చెప్పారు.సర్క్యులర్ బిజినెస్ మోడల్లోని అంశాలు..రిపేర్ సర్వీసులు: 95+ స్టోర్లలో రిపేర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇది వినియోగదారులు వారి స్పోర్ట్స్ వస్తువులకు మరింత సర్వీసు వెసులుబాటును పొందవచ్చు.సెకండ్ లైఫ్ రీసేల్: పునరుద్ధరించిన ఉత్పత్తులు 90+ స్టోర్లలో తిరిగి విక్రయించనున్నారు. ఇది క్రీడా పరికరాలను మరింత చౌకగా చేస్తుంది.బైబ్యాక్ ప్రోగ్రామ్: ఉపయోగించిన పరికరాలను 50+ స్టోర్లలో తిరిగి ఇవ్వవచ్చు. దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంసుస్థిరత లక్ష్యాలుడెకాథ్లాన్ 2024 స్థాయితో పోలిస్తే 2027 నాటికి సర్క్యులర్ బిజినెస్ టర్నోవర్లో 200% వృద్ధిని అంచనా వేస్తుంది. 2027 నాటికి 3,00,000 కంటే ఎక్కువ క్రీడా ఉత్పత్తులను పునరుద్ధరించాలని భావిస్తుంది. డెకాథ్లాన్ గ్లోబల్ డీకార్బనైజేషన్ వ్యూహంలో భాగంగా 2050 నాటికి నికర-సున్నా ఉద్గారాలను, 2030 నాటికి కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను 42% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే అధిక నాణ్యత, దీర్ఘకాలిక ఉత్పత్తులను సరసమైనవిగా మార్చడం లక్ష్యమని డెకాథ్లాన్ ఇండియా సీఈఓ శంకర్ ఛటర్జీ నొక్కి చెప్పారు. -
రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందం
భారత వైమానిక దళంలో కీలకంగా ఉన్న రఫేల్ యుద్ధవిమానాల తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్లు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపాయి. ఇరు కంపెనీలు భారత్, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం రఫేల్ యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి నాలుగు ప్రొడక్షన్ ట్రాన్స్ఫర్ ఒప్పందాలపై ఈమేరకు సంతకాలు చేశాయి. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం విశేషం.దేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా డసో ఏవియేషన్ తెలిపింది. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ఈ తయారీ కేంద్రం భారతదేశ ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల్లో కీలకమైన పెట్టుబడికి ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొంది.ఈ ఒప్పందంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లో రఫేల్కు చెందిన లేటరల్ షెల్స్, పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్లేజ్ సెక్షన్, ఫ్రంట్ సెక్షన్ వంటి కీలక నిర్మాణ విభాగాల తయారీకి ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫ్యూజ్లేజ్ విభాగాలు 2028లో అసెంబ్లింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇరు కంపెనీలు తెలిపాయి. ఈ సదుపాయం ద్వారా నెలకు రెండు ఫ్యూజ్లేజ్లను డెలివరీ చేయనున్నట్లు చెప్పాయి.రఫేల్ యుద్ధ విమానాలను తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల హైదరాబాద్లో ఉత్పత్తి చేయనున్నారు. ‘భారతదేశంలో సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో ఇది ఒక నిర్ణయాత్మక దశ. భారత ఏరోస్పేస్ పరిశ్రమలో ప్రధాన సంస్థల్లో ఒకటైన టీఏఎస్ఎల్తో సహా స్థానిక భాగస్వాముల విస్తరణకు కట్టుబడి ఉన్నాం’ అని డసో ఏవియేషన్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎరిక్ ట్రాపియర్ అన్నారు.ఇదీ చదవండి: ఆడుతూ.. పాడుతూ.. డబ్బు పాఠాలుటాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ మాట్లాడుతూ ‘ఈ భాగస్వామ్యం భారతదేశ ఏరోస్పేస్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన దశ. భారతదేశంలో పూర్తి రఫేల్ ఫ్యూజ్లేజ్ ఉత్పత్తికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్కు పూర్తి సామర్థ్యాలున్నాయి. ఆధునిక, బలమైన ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ను స్థాపించడంలో భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని ఈ ఒప్పందం హైలైట్ చేస్తుంది’ అని అన్నారు. ఈ ఒప్పందాలపై సంతకాలు చేయడం భారతదేశం మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ కార్యక్రమాల పట్ల డసో ఏవియేషన్ నిబద్ధతతో ఉందని అధికారులు తెలిపారు. -
ఆర్సీబీకి మాల్యా అభినందనలు.. ఎస్బీఐ ట్వీట్ వైరల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎట్టకేలకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను గెలుచుకోవడంతో కర్ణాటకలో సందడి నెలకొంది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించిన ఆర్సీబీ ఈ విజయంతో సంబరాలు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుతో పాటు దేశం అంతటా ఈ సంబరాలు జోరుగా సాగుతున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ ఈ వేడుకల్లో ఆసక్తిగా నిలిచింది.భారత్లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి దేశం విడిచి వెళ్లిపోయిన వ్యాపారవేత్త, ఆర్సీబీ జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతోపాటు పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆర్సీబీ జట్టును అభినందించిన మాల్యా ‘18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ఛాంపియన్స్ నిలిచింది. 2025 టోర్నమెంట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఆర్సీబీకి అభినందనలు! ఈ సారి కప్పు మనదే’ అని ట్వీట్ చేశారు. అదికాస్తా వైరల్గా మారింది. అందుకు అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.RCB are IPL Champions finally after 18 years. Superb campaign right through the 2025 tournament. A well balanced team Playing Bold with outstanding coaching and support staff. Many congratulations ! Ee sala cup namde !!— Vijay Mallya (@TheVijayMallya) June 3, 2025‘దయచేసి ఈ శుభ సందర్భంగా కీర్తినగర్లోని ఎస్బీఐ బ్రాంచికి ఒక ఐదు నిమిషాలు వచ్చి వెళ్లండి సర్..’ అంటూ ఒకరు ట్వీట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా మాల్యా ట్వీట్కు ఎస్బీఐ నుంచి వచ్చినట్లు ఉన్న రిప్లై (సర్, భారత్కు రండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం)ను జోడిస్తూ అందుకే ఎక్స్ అంటే తనకు ఎంతో ఇష్టం అని చెప్పారు.That’s why I like X pic.twitter.com/hR3QIEwJWV— Harsh Goenka (@hvgoenka) June 4, 2025ఇదీ చదవండి: మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రిఎస్బీఐ ట్వీట్ నిజమేనా?వైరల్గా మారుతున్న మాల్యా ట్వీట్కు వస్తున్న రిప్లైలు ఆసక్తిగా మారుతున్న తరుణంలో ఎస్బీఐ నుంచి వచ్చిన రిప్లైను ధ్రువీకరించాలని ఏఐ అసిస్టెంట్ గ్రోక్ను ఓ యూజర్ కోరాడు. దానికి ప్రతిస్పందనగా ఇది కల్పితమై ఉండొచ్చని గ్రోక్ సూచించింది. ఏదేమైనా #EeSalaCupNamde అనే హ్యాష్ ట్యాగ్ మరోసారి ట్రెండ్ అయింది. -
మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి
అంతరిక్ష సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కీలకంగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ ఆలోచనలను ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ వ్యతిరేకించారు. ఎలాన్ మస్క్ ప్రస్తుతం చేస్తున్న గ్రహాంతర ప్రయాణాల ప్రయోగాలపై ఎర్రోల్ మస్క్ విమర్శలు గుప్పించారు. రాకెట్లు మానవులు, ఇతర గ్రహాలను కాలనీలుగా మారుస్తాయని మస్క్ అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎర్రోల్ మస్క్ తోసిపుచ్చారు. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. శాస్త్రీయంగా లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు.ఎలాన్ మస్క్ దీనికి బదులుగా గురుత్వాకర్షణ, అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని కుదించేలా అధ్యయనం చేయడం మేలని ఎర్కోల్ మస్క్ చెప్పారు. అంతరిక్ష అన్వేషణలో ఈమేరకు చేసే అధ్యయనాలు భవిష్యత్తు పురోగతికి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కృషిని ప్రస్తావిస్తూ మానవాళి కేవలం రాకెట్లపై ఆధారపడకుండా లోతైన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: ‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..స్పేస్ఎక్స్ ద్వారా అంగారక గ్రహంలో మానవుల నివాసానికి అనువుగా ఉండే ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తండ్రి వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. -
‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..
ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ను నాటకీయంగా తొలగించి 2023 చివరిలో తిరిగి కంపెనీ సీఈఓగా నియమించుకున్న ఘట్టాన్ని ఫీచర్ ఫిల్మ్ ‘ఆర్టిఫిషియల్’ను తెరకెక్కించేందుకు ఫిల్మ్ మేకర్ లూకా గ్వాడాగ్నినో చర్చలు జరుపుతున్నారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్లో ఈ చిత్రాన్ని హేడే ఫిల్మ్స్ పతాకంపై డేవిడ్ హేమన్, జెఫ్రీ క్లిఫోర్డ్ నిర్మించాలని చూస్తున్నారు. నిర్మాతగా వ్యవహరిస్తున్న సైమన్ రిచ్ స్క్రీన్ ప్లే కూడా అందించాలనుకుంటున్నారు. జెన్నిఫర్ ఫాక్స్ సంస్థ నిర్మాణ బృందంలో చేరడానికి చర్చలు జరుపుతోంది.ది హాలీవుడ్ రిపోర్టర్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కో, ఇటలీని కీలక షూటింగ్ ప్రాంతాలుగా గుర్తించారు. సమ్మర్ షూట్ కోసం చర్చలను వేగవంతం చేస్తున్నారు. కాస్టింగ్ ఒప్పందాలు ఏవీ ఇప్పటివరకు ఖరారు కానప్పటికీ, ప్రారంభ చర్చల ప్రకారం ఆల్టమన్ పాత్రను ఆండ్రూ గార్ఫీల్డ్ పోషించవచ్చని, మోనికా బార్బరో కంపెనీ సీటీఓ మీరా మురాటి పాత్రను పోషించవచ్చని అంచనా వేస్తున్నారు. ఆల్ట్మన్ను తొలగించే ప్రయత్నానికి నాయకత్వం వహించిన సహవ్యవస్థాపకురాలు ఇలియా సుట్స్కేవర్ పాత్రలో యురా బోరిసోవ్ నటించవచ్చని చెబుతున్నారు.తొలగింపునకు కారణం ఇదే..ఓపెన్ ఏఐ(OpenAI) సంస్థ సామ్ ఆల్ట్మన్ను సీఈవో బాధ్యతల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ ఆర్థిక సహకారం ఉన్న కంపెనీ ఆయనను విశ్వసించకపోవడమే సీఈఓగా తొలగించడానికి ప్రధాన కారణమని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా.. ఆల్ట్మన్ బోర్డుతో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని సరైన సమాచారం పంచుకోవడం లేదని బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డుకు ఇక ఏమాత్రం నమ్మకం లేదని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: ‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్దాంతో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్మన్ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ మళ్లీ ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్ఏఐ ఒప్పుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. -
దేశంలోని తొలితరం సంపన్న మహిళలు
దేశంలో తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద పెరుగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘2025 కాండేర్ హురున్ ఇండియా ఉమెన్ లీడర్స్’ లిస్ట్ ప్రకారం పది మంది తొలితరం మహిళా పారిశ్రామికవేత్తల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరింది. ప్రధానంగా సాఫ్ట్వేర్, హెల్త్కేర్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో మొదటి నుంచి బిలియన్ డాలర్ల వ్యాపారాలను నిర్మించిన మహిళలు ఈ జాబితాలో చోటు సంపాదించారు.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం కొనడం కష్టమే! తులం ఎంతంటే..లిస్ట్లో జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకురాలు రాధా వెంబు రూ.55,300 కోట్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానంలో అమెరికాకు చెందిన అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ రూ.48,900 కోట్ల సంపదతో ఉన్నారు. టాప్ 10 మహిళల్లో ఏడుగురు భారత్లో ఉండగా, మిగిలిన ముగ్గురు అమెరికాలో నివసిస్తున్నారు. మొత్తం సంపదలో రూ.1.11 లక్షల కోట్లతో సాఫ్ట్వేర్, సేవల రంగం ఆధిపత్యం సాగిస్తోంది. హెల్త్ కేర్, రిటైల్, ఫైనాన్స్, టెక్స్ టైల్స్, మీడియా తదితర రంగాలకు చెందినవారున్నారు.పేరు సందప(రూ. కోట్లల్లో)వయసుకంపెనీరాధా వెంబు55,30052జోహో కార్పొరేషన్జయశ్రీ ఉల్లాల్48,90063అరిస్టా నెట్ కిరణ్ మజుందార్ షా32,00071బయోకాన్ఫాల్గుణి నాయర్29,00061నైకానేహా నర్ఖేడే6,80041సంగమంకవితా సుబ్రమణియన్6,50043అప్స్టాక్స్నేహా బన్సాల్5,10043లెన్స్కార్ట్ఇంద్ర కె నూయి4,80069పెప్సికో జూహీ చావ్లా4,60057నైట్ రైడర్స్ మీనా సేథీ2,70080ఓరియంట్ ఫ్యాషన్ -
విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు
విద్యాలక్ష్మి స్కీము కింద విద్యా రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్లు (0.2%) తగ్గించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వెల్లడించింది. సంస్థను బట్టి విద్యా రుణాలపై వడ్డీ రేటు 7.5% నుంచి ప్రారంభం అవుతుందని వివరించింది. ఉన్నత విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించే లక్ష్యంతో ఈ స్కీమును రూపొందించారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలుగా (క్యూహెచ్ఈఐ) గుర్తింపు పొందిన 860 సంస్థల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది.ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్ బిల్లు-2025 ముసాయిదా విడుదలవిద్యాలక్ష్మి పథకం కింద ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేయాలంటే కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.కేవైసీ వివరాల కోసం: ఆధార్, పాన్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్.అకడమిక్ రికార్డులు: మునుపటి అకడమిక్ ఏడాదిలోని మార్కు షీట్లను సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి.ప్రవేశ పరీక్ష ఫలితాలు: ఇప్పటికే ఏదైనా యూనివర్సిటీలో ప్రవేశం కోసం చూస్తూ, దాని ప్రవేశ పరీక్ష రాసి ఉంటే అందుకు సంబంధించిన ర్యాంక్ కార్డును జోడించాలి.అడ్మిషన్ ప్రూఫ్: ఇప్పటికే సంస్థ నుంచి అడ్మిషన్ వస్తే ఫీజు స్ట్రక్చర్తో పాటు సంస్థ నుంచి అడ్మిషన్ లెటర్.ఫొటోలు: పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.లోన్ హిస్టరీ: ఇప్పటికే బ్యాంకులు/ రుణదాతల నుంచి గతంలో లేదా ప్రస్తుతం ఉన్న రుణాల వివరాలు.ఆదాయ ధ్రువీకరణ పత్రం: రాష్ట్రంలోని నిర్దేశిత పబ్లిక్ అథారిటీ నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం. -
భారత మార్కెట్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: భారత ఐటీ పరిశ్రమ, ఔట్సోర్సింగ్ మోడల్ నుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా ఎదిగిందని బ్రిటన్ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ సీఈవో షాయ్ వైస్ తెలిపారు. ఇండియా మార్కెట్లో విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. తమకు అమెరికా తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్గా భారత్ నిలుస్తోందని వైస్ వివరించారు. వర్జిన్ అట్లాంటిక్ గత పాతికేళ్లుగా భారత్కి విమానాలు నడుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్కి రోజూ అయిదు ఫ్లయిట్స్ను నిర్వహిస్తోంది.ప్రయాణికులను నిరాటంకంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ విమానయాన సంస్థ ఇండిగోతో కంపెనీకి కోడ్õÙర్ ఒప్పందం ఉంది. కొత్త రూట్లలో సర్విసులు ప్రారంభించడమనేది డిమాండ్పై ఆధారపడి ఉంటుందని వైస్ చెప్పారు. భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశల మధ్య వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయని, తమ కార్గో వ్యాపారానికి కూడా ఇది ప్రయోజనకరమైన అంశమని తెలిపారు.భారత్ రూట్లో నడిపే ప్రతి విమానంలో స్థానికతకు పెద్ద పీట వేసేలా నలుగురు లోకల్ సిబ్బంది ఉంటారని, మెనూలో సమోసాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. టారిఫ్లపరమైన ఆందోళనపై స్పందిస్తూ విమానయాన సంస్థలకు ఇలాంటి పరిస్థితులు అలవాటేనని వైస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, బ్రెగ్జిట్, కోవిడ్ మహమ్మారిలాంటివెన్నో చూశాయని చెప్పారు. ఇక సరఫరావ్యవస్థపరంగా అంతరాయాల విషయానికొస్తే తమ దగ్గర తగినన్ని విమానాలు ఉన్నాయని, ఈ ఏడాది డెలివరీలేమీ లేవని వైస్ వివరించారు. -
300 మందికి జాబ్కట్ చేసిన మైక్రోసాఫ్ట్
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ తాజాగా 300 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. మే నెలలో దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపిన కొన్ని రోజుల్లోనే ఇలా మరో 300 మంది ఉద్యోగాలు కట్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. ఈ తొలగింపులు సంస్థ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణానికి అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపినట్లు బ్లూమ్బర్గ్ చెప్పింది. ఈ లేఆఫ్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, దీర్ఘకాలిక ప్రాధాన్యతలపై వనరులను కేంద్రీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.పనితీరుతో సంబంధం లేదు..ఇటీవల టౌన్హాల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగుల తొలగింపులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లేఆఫ్స్ పనితీరుకు సంబంధించినవి కావని, వ్యూహాత్మక మార్పులో భాగంగా ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాలను మైక్రోసాఫ్ట్ వేగంగా విస్తరిస్తోంది. దాంతో ఏఐ మౌలిక సదుపాయాలు, దాని అభివృద్ధి కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ ప్రాజెక్ట్ల్లో దాదాపు 30% కోడ్ రాయడానికి సహాయపడుతుందని సత్య నాదెళ్ల చెప్పారు. ఇది ఆటోమేషన్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్పై అధికంగా ఆధారపడడాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: లకారం దగ్గర్లో పసిడి! ఈరోజు ధరలు ఇలా..ఉద్యోగులపై ప్రభావంమైక్రోసాఫ్ట్ తాజాగా ప్రకటించిన లేఆఫ్స్లో ఏ కేటగిరీ ఉద్యోగులను తొలగించిందో పేర్కొననప్పటికీ, మునుపటి తొలగింపులో ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లను లక్ష్యంగా చేసుకున్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో ఏఐ అసిస్టెడ్ కోడింగ్ టూల్స్ను మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్ఫామ్స్తో సహా ఇతర సంస్థలు ఎంచుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతర్గతంగా సంస్థల్లో తక్కువ మంది సిబ్బంది నియామకానికి కారణమవుతుందని సేల్స్ఫోర్స్ గత వారం తెలిపింది. మైక్రోసాఫ్ట్లో జూన్ 2024 నాటికి 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 55% మంది యూఎస్లో పనిచేస్తున్నారు. -
పెయింటర్స్కు గుర్తింపు ఇస్తున్న ప్రోగ్రామ్..
ప్రతి మనిషి తన జీవితాన్ని రంగులమయం చేసుకోవాలనుకుంటారు. అందుకు సరైన అవకాశం రావాలి. అయితే అలాంటి అవకాశాలు వాటంతటవే వస్తాయని కూర్చుంటే మాత్రం ఎప్పటికీ విజయం వరించదు. జీవితంలో కెరియర్ పరంగా ఎదిగేందుకు వచ్చే ప్రతి మలుపును అవకాశంగా మలుచుకోవాల్సిందే. వివిధ రంగులను కలబోసి ప్రత్యేక రంగులు సృష్టించేవారికి మార్కెట్లో డిమాండ్ ఉంది. అందుకు కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా పెయింటర్లకు శిక్షణ ఇస్తున్నాయి. వాటిని తన జీవితంలో ఎదిగేందుకు అవకాశంగా మలుచుకున్నవారిలో విశాఖపట్నానికి చెందిన గణిరాజు సిరిపురం ఉన్నారు. అందుకు ప్రముఖ పెయింట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్ అందించిన ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా చాలా మందికి శిక్షణ ఇస్తోంది. ఇందులో రంగుల కలయికతో ప్రదేశానికి తగినట్లుగా, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎలాంటి రంగులు తయారు చేయాలో, ఎలాంటి డిజైన్లను ఇష్టపడుతున్నారో వంటి అంశాలను తెలియజేస్తూ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో గణిరాజు సిరిపురం ‘కామ్యాబీ కే రంగ్’ సీజన్ 6లో ప్రతిభ కనబరిచారు.పాఠాలు నేర్చుకున్నారు.. జీవితాలు మార్చుకున్నారు..గణిరాజు ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కంపెనీ తెలిపింది. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ ద్వారా పాఠాలు నేర్చుకొని తమ జీవితాలను మార్చుకున్న కాంట్రాక్టర్ల స్ఫూర్తిదాయక కథలు ఎన్నో ఉన్నాయని చెప్పింది. సీజన్ 6లో గణిరాజు ప్రతిభ కనబరిచినట్లు తెలిపింది. ఇప్పటివరకు వివిధ సీజన్ల్లో ఢిల్లీకి చెందిన జునైద్ కాజ్మీ, గుజరాత్లోని మధపార్కు చెందిన అమృత్ బెన్, వారణాసి నుంచి బంటి బింద్ ముందువరుసలో ఉన్నారని చెప్పింది.కుటుంబ పోషణకు పెయింటింగ్ వైపుఏషియన్ పెయింట్స్ ప్లాట్ఫాం ద్వారా సంస్థ లక్షల మందికి ప్రేరణ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వారిలో విశాఖపట్నంకు చెందిన గణిరాజు సిరిపురం ఒకరు. పట్టుదలతో తన జీవితాన్ని విజయగాథగా మార్చుకున్న ఆయనకు చిన్నప్పటి నుంచి చదువుపై మక్కువ ఎక్కువ. కానీ పేదరికంలో ఉన్న తన కుటుంబాన్ని పోషించడానికి బాధపడుతున్న తండ్రిని చూసి తన కలలను పక్కన పెట్టారు. కుటుంబాన్ని ఆదుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో కుటుంబ పోషణ కోసం పెయింటింగ్ వేసేవారు. ఈ క్రమంలో వైవిధ్యంగా పెయింటింగ్ వేస్తూ తానకంటూ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు.పని పట్ల గౌరవం.. జీవితంపై స్పష్టత..కాలక్రమేణా కస్టమర్ల అంచనాలు పెరుగుతున్న కొద్దీ తనను తాను మెరుగుపరచుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలో ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ గురించి తెలుసుకున్నారు. ఈ ప్లాట్ఫాం ద్వారా ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెన్సీ (ఐడీసీ) వంటి ఆధునిక శిక్షణ పొందారు. ఈ శిక్షణతో తనలో ఆత్మవిశ్వాసంతో పాటు పని పట్ల గౌరవం, జీవితంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రోగ్రామ్లో మెలకువలు నేర్చుకుని వినియోగదారుల మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు గణిరాజు కేవలం పెయింటర్ మాత్రమే కాదు. ఒక కళాకారుడిగా తన కెరియర్లో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన పనికి ఒక గుర్తింపు ఉంది. ఈ వృత్తిలో ఆయన నైపుణ్యం కలిగిన వ్యక్తిగా స్థిరపడ్డారు. సరైన అవకాశం దొరికితే ఎటువంటి కష్టం వచ్చినా జీవితాన్ని రంగులమయం చేసుకోవచ్చని తన కథ చెబుతోంది.ఇదీ చదవండి: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుఎంతో మందికి స్ఫూర్తిదాయకంఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమిత్ సింగిల్ మాట్లాడుతూ ‘కామ్యాబీ కే రంగ్ అనేది సాధారణ క్యాంపెయిన్ మాత్రమే కాదు. వ్యక్తుల విజయాలను స్మరించుకునే ఒక ఉత్సవం. సాధారణ జీవితం సాగించే పెయింటర్లు కంపెనీ ప్రోగ్రామ్ ద్వారా సమాజంలో ఎదగడం చూస్తున్నాం. ఈ ప్రయాణం మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఏషియన్ పెయింట్స్ బ్యూటిఫుల్ హోమ్స్ అకాడమీ దేశవ్యాప్తంగా దాదాపు తొమ్మిది లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. ఇప్పటివరకు 21 లక్షలకు పైగా ట్రైనింగ్ సెషన్లు నిర్వహించింది. ఈ శిక్షణలోని పెయింట్ అప్లికేషన్, వాటర్ప్రూఫింగ్, ఉడ్ ఫినిషెస్, మెషినరీ వాడకం, కస్టమర్ సర్వీస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్లో పాల్గొన్ని 79 శాతం మంది తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. 88 శాతం మంది తమ పనిలో మెరుగయ్యారు. 86 శాతం మందికి సామాజిక గౌరవం లభించింది’ అన్నారు. -
గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న 30 అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాల్లో దేశీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చోటు దక్కించుకుంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ట్రెండ్స్ పేరిట రూపొందించిన నివేదికలో భాగమైన లిస్టులో 23వ స్థానంలో నిల్చింది. తద్వారా భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా నిల్చింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగ ధోరణులు, ప్రభావంపై రూపొందించిన ఈ నివేదికలో మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా తొలి ఎనిమిది స్థానాల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది చైనా నుంచి 3 సంస్థలు, జర్మనీ కంపెనీలు 2, తైవాన్.. నెదర్లాండ్స్ .. దక్షిణ కొరియా.. భారత్ నుంచి ఒక్కో కంపెనీ చొప్పున తొలిసారిగా ఈ లిస్టులో చేరాయి. అమెరికా టాప్.. అత్యంత విలువైన 30 గ్లోబల్ టెక్ కంపెనీల జాబితాలో మూడు దశాబ్దాలుగా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ లిస్టులో 1995లో అమెరికా వాటా 53 శాతంగా ఉండగా 2025లో 70 శాతానికి పెరిగింది. 30 టాప్ కంపెనీల్లో 21 సంస్థలు అమెరికావే ఉన్నాయి. 1995లో జపాన్కి 30 శాతం వాటా ఉండగా ప్రస్తుతం అది సున్నా స్థాయికి పడిపోయింది. -
భారీగా పెరిగిన ఇన్ఫీ సీఈఓ వేతనం.. ఎంతంటే..
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సలీల్ పరేఖ్ వార్షిక వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 22 శాతం పెరిగినట్లు వార్షిక నివేదికలో తెలిపారు. దాంతో ఆయన వేతనం రూ.80.6 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది. ఆయన వేతనం పెరుగుదలకు ప్రధాన కారణం తనకు అనుసంధానించిన నియంత్రిత స్టాక్ యూనిట్లు (ఆర్ఎస్యూ), ఈక్విటీ విలువ పెరగడమేనని తెలిపింది.2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్కు పోటీగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో వంటి కంపెనీ సీఈఓల వేతనం కంటే కూడా సలీల్ ప్యాకేజీ అధికంగా ఉండడం గమనార్హం. దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారుగా ఉన్న టీసీఎస్ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో 4.6 శాతం పెరిగి రూ.26.5 కోట్లకు చేరుకుంది. విప్రో సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ పలియా వేతనం 10 శాతం పెరిగి 6.2 మిలియన్ డాలర్లకు లేదా సుమారు రూ.53.6 కోట్లకు చేరుకుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో పరేఖ్ పారితోషికం రూ.71 కోట్ల నుంచి రూ.56 కోట్లకు తగ్గింది.ఇదీ చదవండి: భారత్లో టెస్లా తయారీ లేనట్లే!సలీల్ పరేఖ్ స్టాక్ ఆప్షన్ల ద్వారా రూ.49.5 కోట్లు ఆర్జించగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.39 కోట్లుగా ఉంది. బేస్ పే కింద రూ.7.5 కోట్లు, రిటైర్డ్ బెనిఫిట్స్ కింద రూ.50 లక్షలు పొందారు. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.19.8 కోట్లుగా ఉన్న ఆయన వేరియబుల్ వేతనం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.23.2 కోట్లకు పెరిగింది. కంపెనీ ఉద్యోగుల సగటు వేతనం రూ.10.72 లక్షలుగా ఉందని సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐ, క్లౌడ్, డేటా, డిజిటల్ రంగాల్లో ఇన్ఫోసిస్ అగ్రగామిగా ఉందని వాటాదారులకు రాసిన లేఖలో పరేఖ్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీ 15,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకుందని, ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 3,20,000 మందికి పైగా ఉద్యోగులున్నట్లు తెలిపారు. -
353 బ్యాంకులపై ఆర్బీఐ జరిమానాలు
నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. భారీ జరిమానాలు విధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 353 బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలపై రూ .54.78 కోట్ల జరిమానాలు విధించినట్లు ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన తన వార్షిక నివేదికలో తెలిపింది.సైబర్ సెక్యూరిటీ, ఎక్స్పోజర్ నిబంధనలు, ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, కేవైసీ మార్గదర్శకాలు, మోసాల వర్గీకరణ, రిపోర్టింగ్ విషయాల్లో నిబంధనలు పాటించని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, సహకార బ్యాంకులపై ఆర్బీఐ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంది. సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్కు డేటాను సమర్పించడం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వంటి అంశాల్లోనూ ఆయా సంస్థలు అలసత్వం ప్రదర్శించాయి.మొత్తం జరిమానాలలో సహకార బ్యాంకులే అత్యధికంగా ఎదుర్కొన్నాయి. రూ.15.63 కోట్ల విలువైన 264 జరిమానాలను ఆర్బీఐ వాటిపై విధించింది. 37 ఎన్బీఎఫ్సీలు, ఏఆర్సీలు రూ.7.29 కోట్ల జరిమానా ఎదుర్కొన్నాయి. 13 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రూ.83 లక్షల జరిమానాను ఆర్బీఐ విధించింది. ఇక వాణిజ్య బ్యాంకుల్లో 8 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.11.11 కోట్లు, 15 ప్రైవేటు రంగ బ్యాంకులకు రూ.14.8 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు విదేశీ బ్యాంకులపైనా ఆర్బీఐ జరిమానా విధించింది. -
దండుకున్న బ్యాంకులు దిగొస్తున్నాయి..!
ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని సామాన్యుల దగ్గర నుంచి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల కింద రూ. కోట్లు దండుకున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేకపోతే విధించే చార్జీలను తొలగిస్తున్నాయి. ప్రధాన బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ తాజాగా అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది. అయితే ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించలేదన్న కారణంతో బ్యాంకులు కస్టమర్ల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నాయో తెలిస్తే అవాక్కవుతారు..మూడేళ్లలో రూ.5,614 కోట్లు లాక్కున్నాయి..2024 ఆర్థిక సంవత్సరంలో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిపి కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఖాతాదారుల నుంచి రూ. 2,331 కోట్లు వసూలు చేశాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన రూ. 1,855.43 కోట్లతో పోలిస్తే 25.63 శాతం ఎక్కువ. గత మూడు సంవత్సరాలలో (2022–2024) ఈ బ్యాంకులు మొత్తం రూ.5,614 కోట్లు సామాన్య కస్టమర్ల నుంచి మినిమమ్ బ్యాలెన్స్ చార్జీల రూపంలో దోచేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐదు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు (యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్) కలిపి కనీస బ్యాలెన్స్ కోసం రూ.21,000 కోట్లకు పైగా వసూలు చేశాయి.సామాన్య ఖాతాదారుల నుంచి చార్జీలు దండుకోవడంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ముందువరసలో నిలిచింది. 2024లో ఈ బ్యాంకు రూ.633.4 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 386.51 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ. 369.16 కోట్లు దండుకున్నాయి. సాధారణంగా, మెట్రో ప్రాంతాల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) రూ.3,000 – రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,000–రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500–రూ.1,000 ఉంటుంది. దీనిని నిర్వహించకపోతే రూ.400–రూ.500 జరిమానా రూపంలో బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆ వస్తువులు ఇక అమ్మరు..
ఆన్లైన్ షాపింగ్ అన్నది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దుస్తుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకూ అన్నింటినీ ఈ-కామర్స్ సంస్థల్లోనే కొనేస్తున్నారు. అయితే ఇలా అన్ని రకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయించేందుకు వీల్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, జియోమార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు వాకీ-టాకీల విక్రయాలను నిలిపేశాయి.రేడియో పరికరాల అక్రమ లిస్టింగ్, అమ్మకాల నివారణ, నియంత్రణ కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) మార్గదర్శకాలను జారీ చేసిన మీదట ఈ-కామర్స్ సంస్థలు తమ విక్రయ వస్తువుల జాబితా నుంచి వాకీ-టాకీలను తొలగించాయని ఎన్డీటీవీ కథనం పేర్కొంది. రేడియో కమ్యూనికేషన్ పరికరాలు ముఖ్యంగా భద్రతా ముప్పును కలిగించే వాకీ-టాకీలను ఆన్లైన్లో అనధికారికంగా విక్రయించడాన్ని అరికట్టడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేశారు.టెలికమ్యూనికేషన్స్ విభాగం, హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు సీసీపీఏ పీఐబీ ప్రకటనలో పేర్కొంది. చట్టాలకు అనుగుణంగా ఉన్నట్లు లేదా లైసెన్సింగ్ వివరాలు లేకుండానే చాలా సంస్థలు ఆన్లైన్లో వాకీటాకీలను విక్రయిస్తున్నట్లు గుర్తించామని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా సంస్థలు వాకీటాకీల ఫ్రీక్వెన్సీ రేంజ్, వాటిని వినియోగానికి లైసెన్స్ అవసరమా అన్న వివరాలను పేర్కొనకుండా, ఆ పరికరాలను స్వేచ్ఛగా ఉపయోగించవచ్చని వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయని గుర్తించిన మీదట తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.దీంతో కొన్ని ఈ- కామర్స్ సంస్థలు తమ లిస్టింగ్ నుంచి వాకీటాకీలను తొలగించినప్పటికీ మరికొన్ని మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగిస్తుండటం గమనార్హం. అన్ని ప్రధాన ఆన్లైన్ విక్రయ సంస్థల్లో 16,970 వస్తువులకు సంబంధించి ఫ్రీక్వెన్సీ, అవసరమైన లైసెన్సింగ్ వివరాలు లేకపోవడంపై సీసీపీఏ గతంలోనే 13 నోటీసులు జారీ చేసింది. ఈ ప్లాట్ ఫామ్ లు నిరంతర పర్యవేక్షణలో ఉన్నాయి. -
విద్యుత్కు భారీ డిమాండ్: వచ్చే ఐదేళ్లలో..
విద్యుత్ డిమాండ్ ఏటా 6 శాతం నుంచి 6.5 శాతం చొప్పున (కాంపౌండెడ్గా) వచ్చే ఐదేళ్ల పాటు పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విస్తరణతోపాటు గ్రీన్ హైడ్రోజన్కు ఇస్తున్న ప్రాధాన్యం, డేటా సెంటర్ల విస్తరణ విద్యుత్ అవసరాలను అధికం చేస్తుందని పేర్కొంది.2025–26 ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 44 గిగావాట్లుగా ఉంటుందని అంచనా వేసింది. 2024-25లో ఆల్టైమ్ గరిష్ట ఉత్పత్తి 34 గిగావాట్లుగా ఉంది. వచ్చే ఐదేళ్లలో అదనంగా ఏర్పడే డిమాండ్లో ఈ మూడు రంగాల నుంచే 20-25 శాతం వాటా ఉంటుందని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెండ్ విక్రమ్ తెలిపారు.రూఫ్టాప్ సోలార్ వినియోగం పెరుగుతుండడం, ఆఫ్ గ్రిడ్ ప్రాజెక్టుల నేపథ్యంలో గ్రిడ్ సామర్థ్య డిమాండ్ కొంత వరకు తగ్గొచ్చన్నారు. రూఫ్టాప్ సోలార్ ఇన్స్టలేషన్లను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రస్తావించారు. 2026 మార్చి నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 520 గిగావాట్లకు చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది.2025–2026లో థర్మల్ విభాగం నుంచి 9-10 గిగావాట్ల కొత్త సామర్థ్యం అందుబాటులోకి రానుండగా.. మిగిలినదంతా పునరుత్పాదక విద్యుత్ వనరుల రూపంలో ఉంటుందని తెలిపింది. రానున్న సంవత్సరాల్లో కొత్త సామర్థ్యంలో పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) కీలక పాత్ర పోషించనుందని పేర్కొంది. థర్మల్ విద్యుత్ విభాగం పట్ల స్థిరమైన అవుట్లుక్తో ఉన్నట్టు ఇక్రా తెలిపింది. -
మరోసారి తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.24 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (జూన్ 1) నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి.వాణిజ్య ఎల్పీజీ ధరలు తగ్గడం వరుసగా ఇది మూడోసారి. మే ప్రారంభంలో కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.14.50 తగ్గించాయి. అంతకు ముందు ఏప్రిల్ 1న సిలిండర్ ధర రూ.41 తగ్గింది. కాగా ఇప్పుడు రూ.24 తగ్గింది. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గినా.. గృహాల్లో ఉపయోగించే ఎల్పీజీ ధరలలో ఎలాంటి మార్పు లేదు.19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు•ఢిల్లీ: రూ. 1723.50•కోల్కతా: రూ. 1826•ముంబై: రూ. 1674.50•చెన్నై: రూ. 1881ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
'ఇకపై ఉద్యోగాల పరిస్థితి ఇది': సర్వేలో కీలక విషయాలు
న్యూఢిల్లీ: ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు నెలకొని, ఖర్చులు విషయంలో కంపెనీలు ఆచి తూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాలు నెమ్మదించనున్నాయి. రిక్రూట్మెంట్ కార్యకలాపాల వృద్ధి (ఎన్ఈసీ) 2.8 శాతానికి పరిమితం కానుంది. గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి త్రైమాసికంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. నియామకాల తీరుతెన్నులపై టీమ్లీజ్ సర్వీసెస్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదిక ప్రకారం 47 శాతం సంస్థలు సిబ్బందిని పెంచుకుంటామని, 28 శాతం సంస్థలు స్థిరంగా కొనసాగిస్తామని, 25 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా 20 నగరాల నుంచి 23 పరిశ్రమలకు చెందిన 1,263 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి.నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు➤డిమాండ్ను బట్టి ఉద్యోగులను తీసుకునే ఫ్లెక్సి స్టాఫింగ్ విధానానికి 69 శాతం సంస్థలు మొగ్గు చూపాయి. దీర్ఘకాలిక వ్యయాల భారం లేకుండా, సత్వరం కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ విధానంలో వీలుంటోంది.➤హైరింగ్ వ్యూహాల్లో గిగ్ ఎకానమీకి (స్వల్పకాలిక కాంట్రాక్టులు, ఫ్రీలాన్స్ వర్కింగ్) ప్రాధాన్యం లభిస్తోంది. 64 శాతం కంపెనీలు గిగ్ విధానాల ద్వారా సేల్స్, కస్టమర్ సరీ్వస్ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.➤ద్రవ్యోల్బణం, ఎగుమతులు మందగించడం, జీడీపీ నెమ్మదించడం తదితర అంశాల కారణంగా వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు 58 శాతం కంపెనీలు తెలిపాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను ఏదో పేరుకి మాత్రమే పెంచుకోవడం కాకుండా, నిర్దిష్ట నైపుణ్యాలున్న వారినే తీసుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక➤76 శాతం కంపెనీలు డిజిటల్ లిటరసీకి, 68 శాతం కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్కి, 63 శాతం సంస్థలు కమ్యూనికేషన్లాంటి కీలక నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపాయి.➤ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్కి డిమాండ్ పెరుగుతుండటంతో ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాలు, అనుబంధ మౌలిక సదుపాయాల రంగాలు, ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లు వృద్ధి చెందనున్నాయి. -
కెనరా బ్యాంక్ గుడ్న్యూస్: పొదుపు ఖాతాల్లో..
బెంగళూరు: సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి అన్ని రకాల సేవింగ్స్ అకౌంట్లకు కనీస నెలవారీ బ్యాలెన్స్ (ఏఎంబీ) నిబంధనను పూర్తిగా ఎత్తివేసినట్లు వెల్లడించింది.సేవింగ్స్ అకౌంట్లు, శాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐ ఎస్బీ అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. దీనితో ఇక ఏ పొదుపు ఖాతా కస్టమరుపైనా కనీస బ్యాలెన్స్ పాటించనందుకు ఎలాంటి రుసుములు లేదా పెనాల్టీల భారం ఉండదని బ్యాంకు తెలిపింది. వేతన జీవులు, సీనియర్ సిటిజెన్లు, విద్యార్థులు, ఎన్నారైలకు కూడా దీనితో ప్రయోజనం లభిస్తుందని బ్యాంకు ఎండీ కె. సత్యనారాయణ రాజు వివరించారు. ప్రస్తుతం అకౌంటు రకాన్ని బట్టి నెలవారీగా కనీస బ్యాలెన్స్ పాటించాల్సి ఉంటోంది. పాటించకపోతే పెనాల్టీ చార్జీలు కట్టాల్సి ఉంటోంది.ఇదీ చదవండి: జీవితాన్ని నాశనం చేసే పదం ఇదే: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
డిజిటల్ ప్లాట్ఫామ్లపై సమస్యాత్మక ప్రకటనలు
ముంబై: సమస్యాత్మక ప్రకటనలకు డిజిటల్ ప్లాట్ఫామ్లు ప్రధాన మాధ్యమంగా మారాయని భారతీయ ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) మొత్తం 9,599 ప్రకటనల ఫిర్యాదులు ఏఎస్సీఐ దృష్టికి రాగా.. ఇందులో 7,199 ప్రకటనల ఉల్లంఘనలను గుర్తించింది. వీటిల్లో 95 శాతం ప్రకటనలు డిజిటల్ ప్లాట్ఫామ్లపై ప్రసారమైనవేనని ఏఎస్సీఐ ప్రకటించింది. వీటిల్లోనూ మూడింట రెండొంతులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రాయోజిత ప్రకటనలు కాగా, 32 శాతం ప్రకటనలు కంపెనీల సొంత వెబ్సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లలో వచ్చినవిగా తెలిపింది. అత్యధికంగా 79 శాతం సమస్యాత్మక ప్రకటనలకు మెటా (ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ మాతృ సంస్థ) కేంద్రంగా ఉన్నట్టు పేర్కొంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక ప్రకటనల్లో 43.52 శాతం ఆఫ్షోర్ బెట్టింగ్కు సంబంధించి ఉంటే, 25 శాతం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినవిగా ఏఎస్సీఐ తెలిపింది. 3,347 ప్రకటనలు చట్ట నిబంధనలను ఉల్లఘించేవిగా ఉండడంతో వాటిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదించినట్టు వెల్లడించింది. డిజిటల్ మీడియా పెద్ద సవాళ్లను తీసుకొస్తోందని.. భాగస్వాములు అందరూ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కలసికట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఏఎస్సీఐ అభిప్రాయపడింది. టీవీ, పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు ఒకే తీరులో ఉంటే.. ఆల్గోరిథమ్ ఆధారితంగా నడిచే డిజిటల్ ప్లాట్ఫామ్లపై మాత్రం విభిన్న యూజర్లకు విభిన్న ప్రకటనలు ప్రదర్శితం అవుతున్నాయని.. వీటిని పర్యవేక్షించడం క్లిష్టంగా మారినట్టు తెలిపింది. డిజిటల్ వేదికలపై సమస్యాత్మక ప్రకటనలను గుర్తించేందుకు వీలుగా.. ఫ్రెంచ్ సంస్థతో ఏఎస్సీఐ జట్టు కట్టడంతోపాటు.. టెక్నాలజీపై పెట్టుబడులను పెంచడం గమనార్హం. -
డేటా సెంటర్ల బూమ్..
న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్ ఎస్టేట్ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్ చ.అ.లుగా ఉన్న స్పేస్ 2030 నాటికి 55 మిలియన్ చ.అ.లకు చేరనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. పరివర్తన దశలో పరిశ్రమ.. ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్ టైమ్ అనాలిసిస్, మెరుగైన యాప్ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్ సేవలు అందించడంలో భారత్కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్ మొత్తం మీద 1.15 బిలియన్ సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. 2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్ఫాంలు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్) సేవల సంస్థల నుంచి డిమాండ్ నెలకొన్నట్లు నె్రక్ట్సా బై ఎయిర్టెల్ సీఈవో ఆశీశ్ ఆరోరా తెలిపారు. ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్ డేటా సెంటర్లు, 14 హైపర్స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్పూర్, గంగాగంజ్లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు. వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్.. హై–డెఫినిషన్ స్ట్రీమింగ్కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్విడ్త్ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్స్కేల్ క్యాంపస్ల విస్తరణపై యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తమ నవీ ముంబై సెంటర్పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్టీటీ జీడీసీ ఇండియా, ఎన్టీటీ గ్లోబల్ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్స్కేల్ సెంటర్స్తో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.హైదరాబాద్, ముంబై సారథ్యం.. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో భారత్లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్ వర్ధమాన హైపర్స్కేల్ హబ్గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి. -
విద్యార్థులకు రూ.కోటి ఉపకార వేతనాలు: రిలయన్స్
ముంబై: రిలయన్స్ డిజిటల్ ఇండియా ‘బూట్ అప్ ఇండియా’ పేరుతో అతిపెద్ద ల్యాప్టాప్ సేల్స్ ప్రకటించింది. వ్యాపారపరంగా మాత్రమే కాకుండా ‘నేటి విద్యార్థులను రేపటి అవకాశాలకు సన్నద్ధం చేయడం’ అనే గొప్ప సంకల్పంతో క్యాంపెన్ నిర్వహించనుంది.సేల్స్లో భాగంగా ల్యాప్ట్యాప్లు, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్స్ ఉపకరణాలు తక్కువ ధరకే లభిస్తాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఒక కోటి రూపాయల ఉపకార వేతనాలు ఇవ్వనుంది. అలాగే 25 కార్లు, 40 బైకులు, 450 పైగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు గెలుచుకునే అవకాశం కలి్పస్తుంది. -
6000 మంది ఉద్యోగుల తొలగింపు అందుకే: సత్య నాదెళ్ళ
మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,000 మంది ఉద్యోగులను, అంటే దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 3 శాతం మందిని తొలగించింది.. అసలు కంపెనీ ఇంతమందిని ఎందుకు తొలగించింది అనే విషయాన్ని సీఈఓ సత్యనాదెళ్ళ వివరించారు.ఇటీవల ఉద్యోగులతో జరిగిన టౌన్ హాల్ సమావేశంలో సత్యనాదెళ్ళ మాట్లాడుతూ.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పనితీరు సరిగ్గా లేకపోవడం కాదు. సంస్థ పునర్వ్యవస్తీకరణలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.పోటీ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ తన కోపైలెట్ ఏఐ అసిస్టెంట్లను మరింత వేగంగా వినియోగదారులకు చేర్చడం మీద కూడా దృష్టి సారించింది. దీనికోసం కొన్ని సంస్థలతో.. ఒప్పందాలను కూడా కుదుర్చుకుంది. ఏఐ టూల్స్ వాడకం మాత్రమే కాకుండా.. ఇందులో ఉద్యోగులకు సైతం శిక్షణ ఇవ్వాల్సిన ఉందని సత్యనాదెళ్ళ వివరించారు.మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం ఏఐ మౌలిక సదుపాయాలలో 80 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఇందులో ఏఐ సామర్థ్యాలను విస్తరించడం మాత్రమే కాకుండా.. వివిధ ప్లాట్ఫామ్లు, సేవలలో దాని కోపైలట్ ఏఐ అసిస్టెంట్లను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: టాటా గ్రూప్లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామామైక్రోసాఫ్ట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ 'అపర్ణ చెన్నప్రగడ' కూడా ఇదే కార్యక్రమంలో పాల్గొన్నారు. కోడింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ అధ్యయనం వాడుకలో లేకుండా పోతుందనే ఆలోచనలను గురించి మాట్లాడుతూ.. "కంప్యూటర్ సైన్స్ చదవకూడదనే లేదా కోడింగ్ చనిపోయిందనే భావన ఏ మాత్రం సరైంది కాదు, ఇందులో ఉద్యోగాలకు ఎటువంటి డోకా లేదని.. భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆమె భరోసా ఇచ్చారు. -
AskDISHA 2.0: క్షణంలో ట్రైన్ టికెట్ బుకింగ్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC).. లేటెస్ట్ ఏఐ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్ 'ఆస్క్ దిశ 2.0' (AskDISHA 2.0) తీసుకొచ్చింది. ఇది ప్రయాణీకులకు అందించే సేవలను మరింత సులభారతం చేస్తుంది. ట్రైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. రీఫండ్ స్టేటస్లను తనిఖీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా 'ఆస్క్ దిశ 2.0' చాట్బాట్ను యాక్సెస్ చేయొచ్చు. వాయిస్ కమాండ్స్ సాయంతో కూడా మీకు కావాల్సిన సమాచారం పొందవచ్చు. ఇంగ్లీష్, హిందీ, గుజరాతీతో సహా వివిధ భాషలలో వాయిస్ కమాండ్లను ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ కొత్త విధానం అనుమతిస్తుంది. అయితే దీనికోసం మీరు ప్రత్యేకంగా ఐఆర్సీటీసీ పాస్వర్డ్ అవసరం లేదు.. ఓటీపీ ద్వారా బుకింగ్స్ పూర్తి చేయొచ్చు.టికెట్ క్యాన్సిల్ లేదా ఫెయిల్ ట్రాన్సాక్షన్స్ జరిగినటప్పుడు రిఫండ్ కూడా చాలా వేగంగా జరగడానికి ఈ 'ఆస్క్ దిశ 2.0' ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులో ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో బుకింగ్ చేసుకోవడం వేగవంతం అవుతుంది.ఇదీ చదవండి: ఫేస్ స్కాన్ చేస్తే.. పేమెంట్ పూర్తయిపోయింది: వీడియోఆస్క్ దిశ 2.0తో టికెట్ బుకింగ్➤IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేయగానే కింద కుడివైపు.. ఆస్క్ దిశ 2.0 చాట్బాట్ కనిపిస్తుంది.➤ఇక్కడ హలో లేదా టికెట్ బుక్ టైప్ చేయడం ద్వారా లేదా వాయిస్ కమాండ్లను ఉపయోగించి చాట్ ప్రారభించవచ్చు. ➤మీ స్టేషన్, గమ్యస్థానం, ప్రయాణ తేదీ, తరగతి (స్లీపర్, 3ఏసీ, 2ఏసీ) ఎంటర్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. ➤ఆస్క్ దిశ.. అందుబాటులో ఉన్న ట్రైన్స్ జాబితా, వాటి టైమింగ్స్, సీట్లు మొదలైనవాటిని చూపిస్తుంది. ఇందులో మీకు కావాల్సిన ట్రైన్, క్లాస్, సీటు మొదలైనవాటిని ఎంచుకోండి.➤చాట్బాట్ మీ వివరాలను ద్రువీకరిస్తుంది. అవసరమైతే.. ఓటీపీ ద్రువీకరనతో చెల్లింపులు పూర్తి చేయాల్సి ఉంటుంది. -
బట్టలుతికే సర్ఫ్ కంపెనీ టర్నోవర్ ఎంతంటే..
హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) ఆధ్వర్యంలోని లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ సర్ఫ్ ఎక్సెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల టర్నోవర్ మార్కును అధిగమించినట్లు తెలిపింది. వినియోగదారుల్లో ఈ బ్రాండ్కు ఉన్న ఆదరణే ఈ మార్కు చేరేందుకు తోడ్పడిందని కంపెనీ సీఈఓ, ఎండీ రోహిత్ జవా తెలిపారు.ఇదీ చదవండి: నీరుగారుతున్న ఉపాధి హామీ చట్టం లక్ష్యం2022 ఆర్థిక సంవత్సరంలో రూ.8,200 కోట్ల అమ్మకాలను నమోదు చేసిన సర్ఫ్ ఎక్సెల్ హెచ్యూఎల్ అతిపెద్ద బ్రాండ్ల్లో ఒకటిగా తన స్థానాన్ని నిలబెట్టుకుందని జవా చెప్పారు. 2025 నాటికి ఇది రూ.10,000 కోట్లు మార్కును చేరినట్లు తెలిపారు. హెచ్యూఎల్ వార్షిక నివేదికలో భాగంగా ఈ మేరకు వివరాలు వెల్లడించారు. హెచ్యూఎల్ హోమ్ కేర్ విభాగం రూ.22,972 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని చెప్పారు. కంపెనీ మొత్తం టర్నోవర్ రూ.60,000 కోట్లు దాటిందని పేర్కొన్నారు. అండర్లైయింగ్ వాల్యూమ్ వృద్ధి(ధరల్లో ఒడిదొడుకులున్నా అమ్మకాలు పెరగడం)లో 2% పెరుగుదలను, ప్రతి షేరుకు 5% ఆదాయం (ఈపీఎస్) వృద్ధి నమోదు చేసినట్లు చెప్పారు. -
ఇది అమలైతే.. ఇన్సూరెన్స్ అంత ఈజీ కాదు..
దేశ బీమా రంగంలో భారీ మార్పు రాబోతోంది. పారదర్శకతను పెంపొందించడం, మోసాలను అరికట్టడంలో భాగంగా రిస్క్ అంచనా కోసం జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సిబిల్ వంటి క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థను తీసుకొచ్చేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కోరింగ్ వ్యవస్థ అమల్లోకి వస్తే ఇన్సూరెన్స్ తీసుకోవడం అంత సులువుగా ఉండదు. ముఖ్యంగా ఫ్రాడ్ హిస్టరీ ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలకు సులభమవుతుంది.పాలసీదారులపై ప్రభావంబ్యాంకులు రుణ దరఖాస్తుదారులను వారి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఎలా అంచనా వేస్తాయో, బీమా ప్రొవైడర్లు కూడా దరఖాస్తుదారులను వారి గత బీమా రికార్డుల ఆధారంగా మదింపు చేస్తారు. క్లీన్ క్లెయిమ్స్ చరిత్ర ఉన్న వ్యక్తులు తక్కువ ప్రీమియంల నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇక మోసపూరిత క్లెయిమ్లకు పాల్పడిన చరిత్ర ఉన్నవారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు. కవరేజీ తిరస్కరణను కూడా ఎదుర్కోవచ్చు.మోసపూరిత క్లెయిమ్లతో రూ. వేల కోట్ల నష్టంప్రస్తుతం బీమా రంగంలో మోసపూరిత క్లెయిమ్లు ఏటా రూ.12,000-రూ.15,000 కోట్లుగా ఉన్నాయి. ఇది బీమా సంస్థలకు సవాలుగా మారింది. బీమా క్రెడిట్ స్కోర్లను అమలు చేయడం ద్వారా తప్పుడు క్లెయిమ్లను తగ్గించడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం, మరింత ప్రీమియంలతో పాలసీలను అందించేందుకు బీమా కంపెనీలకు వీలవుతుంది. ఇది బాధ్యతాయుతమైన పాలసీదారు ప్రవర్తనను ప్రోత్సహిస్తుందని, బీమా ఉత్పత్తులకు విస్తృత అందుబాటును నిర్ధారిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్..క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థ భారత బీమా పరిశ్రమకు గేమ్ ఛేంజర్గా మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు, గోప్యత, డేటా వినియోగానికి సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ, నియంత్రణ సంస్థలు డేటా సంరక్షణ చట్టాలను కచ్చితంగా పాటిస్తామని హామీ ఇస్తున్నాయి. ఇటు బీమా కంపెనీలకు, అటు పాలసీదారులకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే ఈ బీమా క్రెడిట్ స్కోరింగ్ వ్యవస్థ 2026 ప్రారంభం నాటికి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. -
టర్కీ ఎయిర్లైన్స్ డీల్ ప్రశ్నార్థకం
భారత్కు చెందిన ఇండిగో ఎయిర్లైన్స్ టర్కీ ఏవియేషన్ కంపెనీ అయిన టర్కిష్ ఎయిర్లైన్స్తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. టర్కిష్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు బోయింగ్ 777-300ఈఆర్ ఎయిర్క్రాఫ్ట్లను ఇండిగో లీజుకు తీసుకొని నడుపుతోంది. ఈ డీల్ మే31తో ముగుస్తుండగా, మరో ఆరు నెలలు పొడిగించాలని ఇండిగో సంస్థ భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఆ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.టర్కిష్ ఎయిర్లైన్స్తో లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా రద్దు చేయాలని ఇండిగోను కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబి ఏవియేషన్కు ఇటీవల సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేసిన తరువాత ఈ పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి.ఇండిగో వినియోగిస్తున్న టర్కీ సంస్థకు చెందిన రెండు విమానాలకు లీజు అనుమతి మే 31తో ముగుస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. ఈ లీజు పొడిగింపు ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు డీజీసీఏ తెలిపింది. అందుకు బదులుగా స్వల్పకాలిక ఉపశమనం ఇచ్చినట్లు పేర్కొంది. ప్రయాణీకుల సేవలకు తక్షణ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 31 వరకు మూడు నెలలపాటు అనుమతులు పొడిగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ పొడిగింపును మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోమని తేల్చి చెప్పింది.ఇదీ చదవండి: ఆస్టన్ మార్టిన్తో రియల్మీ జట్టుపాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో భారత పౌరులను కిరాతకంగా చంపిన ఘటన నేపథ్యంలో భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. ఈ తరుణంలో పాక్ సైన్యానికి టర్కీ మద్దుతుగా నిలిచిందని భారత్ ఆరోపిస్తోంది. దాంతో ఆ దేశంలోని సంస్థలతో క్రమంగా సంబంధాలు తెంచుకుంటోంది. అందులో భాగంగానే దేశీయ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
అపోలో హాస్పిటల్స్కు పెరిగిన లాభం.. వాటాదారులకు డివిడెండ్
ముంబై: ఆరోగ్య సంరక్షణా సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం జంప్చేసి రూ. 390 కోట్లను తాకింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 254 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.కాగా.. మొత్తం ఆదాయం రూ. 4,944 కోట్ల నుంచి రూ. 5,592 కోట్లకు ఎగసింది. పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 61 శాతం దూసుకెళ్లి రూ. 1,446 కోట్లను తాకింది. 2023–24లో రూ. 899 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 19,059 కోట్ల నుంచి రూ. 21,974 కోట్లకు బలపడింది. రానున్న ఐదేళ్లలో రూ. 8,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ చైర్మన్ ప్రతాప్.సి.రెడ్డి పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సంస్థ షేరు బీఎస్ఈలో 0.7% బలపడి రూ. 6,878 వద్ద ముగిసింది. -
ఎంఎస్ఎంఈలు నాణ్యత ప్రమాణాలను అనుసరించాలి
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) ఉత్పత్తుల తయారీలో స్వచ్ఛంద, తప్పనిసరి ప్రమాణాలను పాటించాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సూచించారు. ఢిల్లీలో జరిగిన ఓ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నట్టు చెబుతూ.. ఈ లక్ష్య సాధనలో ఎంఎస్ఎంఈల పాత్ర ప్రధానంగా ఉంటుందన్నారు.ఎంఎస్ఎంఈలు తమ సమస్యల గురించి తెలియజేయడం, సత్వర పరిష్కారాలను పొందే విషయంలో మరింత చురుగ్గా ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రమాణాల కోసం పరిశ్రమ డిమాండ్ చేయాలని.. వాటిని రూపొందించడంలో పాలు పంచుకోవాలని కోరారు. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) వేగంగా ప్రమాణాలను రూపొందించగలదంటూ.. ప్రమాణాల విషయంలో పరిశ్రమ పాత్ర ప్రముఖంగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.నాణ్యమైన ఉత్పత్తుల దిశగా గత కొన్నేళ్లలో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. ప్రస్తుతమున్న టెస్టింగ్ ల్యాబ్లను బలోపేతం చేయడంతోపాటు, కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు రూ.78 కోట్ల నిధులకు ఇటీవలే ఆమోదం తెలిపినట్టు చెప్పారు. ఏ దేశం అయినా అంతిమంగా తన ఉత్పత్తులు, సేవల్లో విశ్వసనీయతతోనే వృద్ధి చెందగలదని గుర్తు చేశారు. దిగుమతయ్యే నాసిరకం ఉత్పత్తులను తిరస్కరించే ప్రమాణాలను భారత్ కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉగాండా, రువాండాలకు సైతం నాణ్యత నియంత్రణలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం 23,000 వరకు భారతీయ ప్రమాణాలు ఉండగా, అవన్నీ స్వచ్ఛందమేనన్నారు. -
మెట్రోల్లో తగ్గిన బ్యాంకు రుణాలు!
ముంబై: దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా చెప్పుకోతగ్గ మేర క్షీణించింది. ఐదేళ్ల క్రితం బ్యాంకుల మొత్తం రుణాల్లో 63.5 శాతంగా ఉంటే 2025 మార్చి చివరికి 58.7 శాతానికి తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.డిపాజిట్ల విషయంలో దీనికి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే మెట్రోపాలిటన్ శాఖల్లోనే అధికంగా 11.7 శాతం వృద్ధి 2025 మార్చిలో నమోదైంది. ఇదే కాలంలో గ్రామీణ శాఖల్లో 10.1 శాతం, సెమీ అర్బన్ శాఖల్లో 8.9 శాతం, అర్బన్ శాఖల్లో 9.3 శాతం నమోదైంది.ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో బ్యాంకుల రుణాల వాటా తగ్గడం, గ్రామీణ, చిన్న పట్టణాల్లో రుణ వితరణ పెరగడం కొన్ని ముఖ్యమైన ఆర్థిక పరిణామాలను సూచిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ ప్రాప్తి పెరగడం అక్కడి వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, అలాగే చిన్న తరహా పరిశ్రమల విస్తరణకు తోడ్పడవచ్చు. దీని ద్వారా మొత్తం ఆర్థిక వ్యవస్థ మరింత సమతుల్యత సాధించవచ్చు.చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల పెరుగుదల వల్ల స్థిరాస్తి, పేదరిక నిర్మూలన, అలాగే ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. బ్యాంకులు పెద్ద నగరాల బదులుగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో రుణాల వాటా తగ్గడం, డిపాజిట్ల వృద్ధి ఎక్కువగా ఉండటం ఆదాయ స్థాయిలు పెరుగుతుండటం, పొదుపు అలవాట్లు మెరుగుపడటం వంటి జీవన శైలి మార్పులను సూచిస్తున్నాయి. -
ఇదీ సంపాదనంటే.. 24 గంటల్లో రూ.13600 కోట్లు
ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. మార్కెట్లో ఒక్కో వస్తువు ఒక్కోసారి ట్రెండ్ అవుతుంది. అదే క్రమంలో ఇప్పుడు ఓ బొమ్మ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్టోర్లలో అల్లర్లకు కారణమైంది. సెలబ్రిటీల ఫేవరెట్ గా మారింది. దాని సృష్టికర్త సంపదను అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే 24 గంటల్లో రూ.13,600 కోట్లకు పైగా సంపాదించేంతలా...చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ సీఈఓ వాంగ్ నింగ్ సంపద ఒక్క రోజులోనే 1.6 బిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లకు పైగా) పెరిగింది. ఆ సంస్థ సృష్టించిన ‘లబుబు’ (Labubu) బొమ్మలే ఇందుకు కారణం. విచిత్రమైన గ్రెమ్లిన్ ముఖంతో రూపొందించిన ఈ బుజ్జి బొమ్మల క్రేజ్ ప్రపంచాన్ని ఊపేసింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ గర్ల్ గ్రూప్ బ్లాక్పింక్ లీసా, రోస్, రిహన్నా, అనన్య పాండే వంటి చాలా మంది సెలబ్రిటీల దగ్గర ఈ లబుబు బొమ్మలు కనిపించాయి.టాప్ డౌన్లోడింగ్ యాప్లబుబు బొమ్మల క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఈ బొమ్మల కోసం కస్టమర్లు గొడవపడటంతో పాప్ మార్ట్ యూకేలో ఇన్ స్టోర్ అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆన్లైన్లో ఈ బొమ్మలు విక్రయించే పాప్ మార్ట్ మొబైల్ యాప్ అమెరికాలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న షాపింగ్ యాప్గా నిలిచింది, ఇది వాంగ్ నింగ్ నెట్వర్త్ను 18.7 బిలియన్ డాలర్లకు పెంచింది.లబుబు బొమ్మతో బ్లాక్పింక్ రోస్ఏప్రిల్ 2025 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, వాంగ్ నింగ్ అమెరికాలో తన కంపెనీకి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా ఒక్క రోజులో 1.6 బిలియన్ డాలర్ల ధనవంతుడు అయ్యాడు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, అమెరికన్లు లబుబు బొమ్మలను కొనడానికి గంటల తరబడి క్యూ కట్టారు. ఫోర్బ్స్ ప్రకారం వాంగ్ నింగ్ రియల్ టైమ్ నెట్వర్త్ 18.7 బిలియన్ డాలర్లుగా ఉంది. -
ఏపీ, తెలంగాణలో జియో హవా
రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. ఏప్రిల్ 2025కిగాను ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో జియో వైర్లెస్ మొబిలిటీ, వైర్లైన్ బ్రాడ్బ్యాండ్, 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విభాగాల్లో సబ్స్క్రైబర్ల వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది.అత్యంత పోటీ ఉన్న వైర్లెస్(మొబైల్) విభాగంలో అత్యధిక నెట్ సబ్స్క్రైబర్లను జోడించి టాప్లో నిలిచింది. మొత్తంగా ఏప్రిల్లో జియో 95,310 కొత్త సబ్స్క్రైబర్లను జోడించి, మార్చిలో 3,17,76,074 ఉన్న వినియోగదారులను 3,18,71,384కు పెంచుకుంది. ఎయిర్టెల్ 42,600 సబ్స్క్రైబర్లను పెంచుకుంది. బీఎస్ఎన్ఎల్ 1,715 సబ్స్క్రైబర్ల సాధారణ వృద్ధిని చూపింది. కాగా వోడాఫోన్ ఐడియా 9,058 మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది.ఇదీ చదవండి: క్రిప్టో విధానాలపై త్వరలో చర్చా పత్రంజియో ఫైబర్రిలయన్స్ జియో వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్, జియో ఫైబర్, ఏపీ టెలికాం సర్కిల్లో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో దూసుకుపోతోంది. ఏప్రిల్లో జియో ఫైబర్ 54,000కి పైగా కొత్త సబ్స్క్రైబర్లను జోడించింది. దాంతో మొత్తం వైర్లైన్ సబ్స్క్రైబర్ బేస్ను సుమారు 1.66 మిలియన్లకు విస్తరించింది. ఈ వృద్ధి రేటు ఎయిర్టెల్ (సుమారు 18,000 సబ్స్క్రైబర్లు), బీఎస్ఎన్ఎల్ కంటే ఎక్కువ. జియో ఎయిర్ఫైబర్ తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లీడర్గా నిలిచింది. ఏప్రిల్ 2025 నాటికి జియో ఎయిర్ఫైబర్ దేశవ్యాప్తంగా 6.14 మిలియన్ల సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. ఏపీ సర్కిల్లో జియో ఎయిర్ఫైబర్ సబ్స్క్రైబర్ బేస్ జనవరి 2025లో 4,27,439 నుంచి ఏప్రిల్లో 5,23,000కి పెరిగింది. ఈ విభాగంలో 80%కి పైగా మార్కెట్ షేర్ను దక్కించుకుంది. -
చిన్న సంస్థలకు పేపాల్ సర్వీసులు
ఎగుమతులపరమైన సీమాంతర చెల్లింపు లావాదేవీలకు సంబంధించి పేమెంట్ అగ్రిగేటరుగా వ్యవహరించేందుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి తమకు సూత్రప్రాయ అనుమతులు లభించినట్లు పేపాల్ హోల్డింగ్స్ భారతీయ అనుబంధ సంస్థ పేపాల్ పేమెంట్స్ వెల్లడించింది. దీనితో 200 పైగా మార్కెట్లలోని విదేశీ కస్టమర్ల నుంచి భారత్లోని చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు చెల్లింపులు పొందడానికి అవసరమైన సేవలు అందించవచ్చని పేర్కొంది.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!ఈ సంస్థలు అంతర్జాతీయంగా వ్యాపార లావాదేవీలను సురక్షితంగా, సజావుగా నిర్వహించుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని తెలిపింది. భారత్ గ్లోబల్ ఎగుమతుల హబ్గా ఎదుగుతున్న నేపథ్యంలో దేశీ వ్యాపార సంస్థలకు విశ్వసనీయమైన పేమెంట్ సొల్యూషన్స్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించింది. పేపాల్ చెకవుట్, పేపాల్ ఇన్వాయిసింగ్, నో–కోడ్ చెకవుట్ టూల్స్ మొదలైన సురక్షితమైన సాధనాలతో దేశీ చిన్న సంస్థలు, అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తోడ్పాటు అందిస్తున్నట్లు కంపెనీ సేల్స్ హెడ్ ఆబిద్ ముర్షీద్ తెలిపారు. -
ఇండెల్ మనీ నిర్వహణ ఆస్తుల పెంపు
బంగారం తనఖాపై రుణాలు అందించే ఇండెల్ మనీ తన నిర్వహణ ఆస్తులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి (2026 మార్చి) రూ.4,000 కోట్లను పెంచుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థ నిర్వహణ ఆస్తులు (రుణాలు) రూ.2,400 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 కోట్ల రుణాల మంజూరును సాధించాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: యూపీఐ చెల్లింపులు మాకూ వచ్చు!గత ఆర్థిక సంవత్సరంలో 89 కొత్త శాఖలు తెరవడంతో మొత్తం 12 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో శాఖల సంఖ్య 2025 మార్చి 31 నాటికి 365కు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.61 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎన్పీఏలు గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.35 శాతానికి తగ్గాయి. అంతకుముందు సంవత్సరం చివరికి ఇవి 3.17 శాతంగా ఉండడం గమనార్హం. ‘‘రానున్న రోజుల్లో దేశీ వినియోగం మరింత పుంజుకుంటుంది. దీంతో బంగారం రుణాలకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడం ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఇండెల్ మనీ సీఈవో ఉమేష్ మోహనన్ తెలిపారు. -
బ్యాంకింగ్లో మరిన్ని విదేశీ సంస్థల ఎంట్రీకి సానుకూలం
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్బ్యాంక్లో సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్ (ఎస్ఎంఎఫ్జీ) 20 శాతం వాటాలు కొనుగోలు చేయడమనేది భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇతర విదేశీ సంస్థల ప్రవేశానికి సానుకూలాంశంగా ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఈ డీల్తో యస్బ్యాంకులో అతి పెద్ద వాటాదారుగా బోర్డులో ఇద్దరిని నియమించుకోవడంతో పాటు బ్యాంకుపై ఎస్ఎంఎఫ్జీకి గణనీయమైన నియంత్రణ కూడా లభిస్తుందని పేర్కొంది. ఈ లావాదేవీని పరిగణనలోకి తీసుకుంటే భవిష్యత్తులోను ఇలాంటి డీల్స్ మరిన్ని నమోదు కావచ్చని వివరించింది. వోటింగ్ హక్కులు, పెట్టుబడి పరిమితులను పెంచితే విదేశీ బ్యాంకు ఇన్వెస్టర్లు మరింత ఆసక్తి చూపించవచ్చని పేర్కొంది. భారత్లో కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్న విదేశీ బ్యాంకులు.. దేశీయంగా మధ్య స్థాయి బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయొచ్చని వివరించింది. ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల నిబంధనల ప్రకారం భారతీయ బ్యాంకుల్లో విదేశీ సంస్థల ఓటింగ్ హక్కులపై 26 శాతం, పెట్టుబడులపై 15 శాతం పరిమితి ఉంది. -
చాలా స్టార్టప్లు.. విదేశీ సంస్థలకు నకళ్లే
న్యూఢిల్లీ: చాలా మటుకు దేశీ అంకుర సంస్థలు, పాశ్చాత్య బిజినెస్ మోడల్స్ను అనుకరిస్తున్నాయే తప్ప భారత్ అవసరాలకు అనుగుణంగా సిసలైన, సరికొత్త ఆవిష్కరణలేమీ చేయడం లేదని కౌన్సిలేజ్ ఇండియా మేనేజింగ్ పార్ట్నర్ సుహేల్ సేథ్ ఆక్షేపించారు. ‘భారత్లో స్టార్టప్ వ్యవస్థను చూస్తే, దాదాపు అన్నీ కూడా ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో చేసిన వాటికి కాపీలుగా ఉంటున్నాయి. వడా పావ్ దుకాణం మొదలుపెట్టినా స్టార్టప్ అనేస్తున్నారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశీయంగా స్టార్టప్ల సంభాషణలు ఎంత సేపు వేల్యుయేషన్లు, యూనికార్న్ హోదా, వ్యవస్థాపకుల సంపదలాంటి అంశాల చుట్టూనే తిరుగుతుంటాయన్నారు. ఈ నేపథ్యంలో స్టార్టప్కు నిర్దిష్ట నిర్వచనం ఉండాలని సీఐఐ వార్షిక బిజినెస్ సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. స్టార్టప్ అంటే సాంకేతికంగా వినూత్నమైనదిగా, విశిష్టమైనదిగా, మరో దాన్ని పోలి ఉండని విధంగా, స్ఫూర్తివంతంగా ఉండాలని చెప్పారు. చైనాకు పోటీనివ్వగలం: థర్డ్ఐటెక్ సీఈవో కపూర్ పరిశ్రమలో నిపుణుల లభ్యతపరంగా చైనాకి గట్టి పోటీనివ్వగలిగే ఏకైక దేశం భారత్ అని ఫ్యాబ్లెస్ చిప్ల తయారీ సంస్థ థర్డ్ఐటెక్ సీఈవో వృందా కపూర్ తెలిపారు. అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలు పలు దశాబ్దాలుగా భారత్లో పెద్ద ఎత్తున పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇందుకు దోహదపడిందని వివరించారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల డిజైనింగ్ నిపుణుల్లో 20 శాతం మంది హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్నారని కపూర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సైమీకండక్టర్ల తయారీ సామర్థ్యాల్లో, ముఖ్యంగా డిఫెన్స్ ఎల్రక్టానిక్స్లో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పగలిగే సామర్థ్యాలు భారత్కి ఉన్నాయని వివరించారు. -
హైదరాబాద్లో జియోస్టార్ రోడ్షో
హైదరాబాద్: తెలుగు ఆడియెన్స్కు, దక్షిణాదిలో ప్రకటనకర్తలకు మరింత చేరువయ్యే క్రమంలో హైదరాబాద్లో రోడ్షో నిర్వహించినట్లు జియోస్టార్ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ప్రతి నెలా ప్రాంతీయంగా 90 శాతం మంది తమ స్టార్ మా, స్టార్ మా మూవీస్ తదితర చానల్స్లో కంటెంట్ను వీక్షిస్తున్నట్లు వివరించింది.దీంతో పెద్ద ఎత్తున వీక్షకులకు చేరువ కావడానికి ప్రకటనకర్తలకు ఇదొక అవకాశం కాగలదని పేర్కొంది. నటులు ఆమని, శ్రీముఖి, అవినాష్, ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 24,000 గంటల తెలుగు ఎంటర్టైన్మెంట్, 1,800 పైగా టైటిల్స్తో జియోహాట్స్టార్ వద్ద అత్యధిక స్థాయిలో కంటెంట్ ఉన్నట్లు జియోస్టార్ రెవెన్యూ హెడ్ అజిత్ వర్గీస్ తెలిపారు. -
ఐక్యూ నియో 10 స్మార్ట్ఫోన్: ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఐక్యూ తాజాగా నియో 10 ఫోన్ను ఆవిష్కరించింది. ఆఫర్లు, డిస్కౌంట్లు పోగా రూ. 29,999 నుంచి ధర ప్రారంభమవుతుంది. భారత్లో తొలిసారిగా స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్తో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.శక్తివంతమైన 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఓఐఎస్ కెమెరా, 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్.. 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్, మొదలైన ప్రత్యేకతలు ఈ ఫోన్లో ఉంటాయి. అమెజాన్, ఐక్యూ ఈ–స్టోర్లో జూన్ 3 మధ్యాహ్నం నుంచి ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1ఈ కాంప్లిమెంటరీగా లభిస్తుంది. -
టాటా గ్రూప్లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా
దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ 'ఎన్ చంద్రశేఖరన్' టాటా కెమికల్స్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పకున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్లో కంపెనీ వెల్లడించింది."నా ప్రస్తుత.. భవిష్యత్తు నిబద్ధతలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, నేను బోర్డు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా ఉంది. అంతే కాకుండా నా పదవీకాలంలో నాకు మద్దతు.. సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అంటూ.. టాటా సన్స్ చైర్మన్ మే 28న కంపెనీ డైరెక్టర్ల బోర్డును ఉద్దేశించి ప్రసంగించారు.ఎన్ చంద్రశేఖరన్ పదవి నుంచి వైదొలిగిన తరువాత.. 2025 మే 30 నుంచి 'ఎస్. పద్మనాభన్' కొత్త చైర్మన్ బాధ్యతలను తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. నామినేషన్, వేతన కమిటీ సిఫార్సుల ఆధారంగా, మే 28, 2025 నుంచి అమలులోకి వచ్చేలా 'మోదన్ సాహా'ను అదనపు డైరెక్టర్ (నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్)గా నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.ఎవరీ ఎన్ చంద్రశేఖరన్?తమిళనాడులోని నామక్కల్లోని మోహనూర్లోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్ చంద్రశేఖరన్.. ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, తరువాత కోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) డిగ్రీని పూర్తిచేశారు.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిటాటా గ్రూప్తో ఆయన ప్రయాణం 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్గా చేరడంతో ప్రారంభమైంది. సెప్టెంబర్ 2007లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) స్థాయికి త్వరగా ఎదిగారు. అక్టోబర్ 2009లో, కేవలం 46 సంవత్సరాల వయసులో టీసీఎస్ సీఈఓగా నియమితులయ్యారు. -
సిక్ లీవ్ పెట్టి కూర్గ్లో ఎంజాయ్... ఎలా దొరికాడో చూడండి..
సాధారణంగా వీకెండ్ ఎప్పడొస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తుంటారు. ఆ వీకెండ్కు ముందో.. వెనకో మరో సెలవు తోడైతే ఎక్కడికైనా ట్రిప్ వేసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ కొందరైతే ఇందుకోసం సిక్ లీవ్లను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాగే బెంగళూరుకు చెందిన ఓ ఉద్యోగి కూడా ఎక్కువ రోజులు వారాంతాన్ని ఆస్వాదించేందుకు సిక్ లీవ్ పేరుతో నాటకమాడాడు. కానీ దొరికిపోయాడు. అతను ఎలా దొరికిపోయాడు.. ఆ తర్వాత ఏమైంది.. చదవండి...తన వీకెండ్ ట్రిప్ గురించి ఓ రెడిట్ యూజర్ ఇటీవల ఒక పోస్ట్ పెట్టాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి శుక్రవారం సిక్ లీవ్ పెట్టి స్నేహితులతో కలిసి కూర్గ్ వెళ్లాడు. అక్కడ వీకెండ్ అంతా ఎంజాయ్ చేసి సోమవారం ఏమీ తెలియనట్టుగా తిరిగి విధుల్లో చేరాడు. కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన ఓ వీడియో అతన్ని పట్టించింది. ‘గత నెలలో శుక్రవారం సెలవు పెట్టి కూర్గ్ వెళ్లాను. కడుపులో ఇన్ఫెక్షన్ (స్టమక్ ఫ్లూ) అని మా మేనేజర్కు చెప్పాను. అక్కడ హోమ్ స్టేలో ఓ వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో రీల్ వైరల్ అయింది. అందులో బ్యాక్గ్రౌండ్లో నేనున్నాను. అలా దొరికిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.తర్వాత ఏమైందంటే..‘సోమవారం మా స్కిప్ లెవల్ మేనేజర్ ఓ రీల్ లింక్ పంపించారు. ‘ఇప్పుడు నీ కడుపులో ఇన్ఫెక్షన్ బాగైందనుకుంటాను’ అని దానికి జోడించారు. సిక్ లీవ్ ఫేక్ చేసి అలా దొరికిపోయాను. దేవుడి దయ వల్ల ఉద్యోగం పోలేదు. కానీ అప్పటి నుండి ఒక్క వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ కూడా అప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఆయన నన్ను నమ్మడం లేదు' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. వైరల్గా మారిన ఈ రెడిట్ పోస్ట్కు యూజర్లు విశేషంగా ప్రతిస్పందించారు. ‘భలే నవ్వు తెప్పిస్తోంది’.. అని ఒకరు కామెంట్ చేయగా ‘వెంటనే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేయాలి’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. -
కోటీశ్వరుల స్వర్గధామం
ప్రపంచంలోని చాలా దేశాల కంటే చిన్నదైన మొనాకోలో నివసించేందుకు కుబేరులు పోటీపడుతున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఫ్రెంచ్ రివేరా అనే సుందర సముద్రతీరంలో ఈ ప్రాంతం ఉండడం ఒక కారణమైతే.. అక్కడి ఆర్థిక వెసులుబాట్లు కోటీశ్వరులను మరింత ఆకర్షిస్తోంది. సాటిలేని విలాసవంతమైన జీవనశైలితో సుపర్రిచ్ వ్యక్తులకు మొనాకో కలల గమ్యస్థానంగా నిలుస్తుంది. అసలు ఆ దేశం ఎలాంటి సదుపాయాలు అందిస్తుందో తెలుసుకుందాం.పన్ను ప్రయోజనాలుసంపన్నులకు స్వర్గధామంగా ఉంటున్న మొనాకో పన్ను విధానాలు అల్ట్రా రిచ్ వ్యక్తులకు ఆకర్షణీయంగా మారింది. అనేక దేశాల మాదిరిగా కాకుండా మొనాకో సిటిజన్లపై వ్యక్తిగత ఆదాయ పన్నును విధించదు. ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందం కారణంగా ఫ్రెంచ్ పౌరులకు మాత్రం ఇందులోనుంచి మినహాయింపు ఉంది. అక్కడి ప్రజలపై సంపద పన్ను లేదా మూలధన లాభాల పన్ను లేదు. సంపన్న వ్యక్తులు తమ ఆస్తులు కాపాడుకోవడానికి ఆ దేశం మరింత వెసులుబాట్లు అందిస్తోంది. ఈ విధానాలు మొనాకోను పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖులకు అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా చేస్తున్నాయి. మొనాకో విలాసవంతమైన జీవనశైలికి పెట్టిందిపేరు. సూపర్ కార్లు, డిజైనర్ బొటిక్లు, మిచెలిన్ స్టార్ డైనింగ్.. వంటి ఎన్నో సదుపాయాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులను ఆకర్షించేలా హై-ప్రొఫైల్ మోటార్ స్పోర్ట్ ఈవెంట్లు జరుగుతాయి.పౌరసత్వం పొందాలంటే..మొనాకోలో సిటిజన్షిప్ తీసుకుంటే ఎన్నో వెసులుబాట్లు ఉంటాయి. అయితే ఆ దేశం పౌరసత్వం పొందాలంటే కఠిన నిబంధనలు ఉన్నాయి. మొనాకో జుస్ సాంగునిస్ (బ్లడ్ రిలేషన్) సూత్రాన్ని అనుసరిస్తుంది. అంటే మోనెగాస్క్ దంపతులకు జన్మించిన వారు మాత్రమే మొనాకోలో డిఫాల్ట్గా పౌరసత్వాన్ని పొందుతారు. ఇతర పౌరులు మొనాకోలో పిల్లలకు జన్మనిచ్చినా అక్కడి పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు కూడా మోనెగాస్క్ జాతికి చెంది ఉండాలి. మోనెగాస్క్ పౌరుడిని వివాహం చేసుకున్న విదేశీయులు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అది కూడా వివాహం జరిగిన 10 సంవత్సరాల తరువాత మాత్రమే దరఖాస్తు పెట్టాలి. ఇదీ చదవండి: స్వల్ప ఊరట.. లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలుపౌరసత్వం కోసం అప్లై చేసే దరఖాస్తుదారులు మొనాకోలో కనీసం 10 సంవత్సరాలు నివసించి ఉండాలి. వారి ఫైనాన్షియల్ రికార్డులు, నేర చరిత్రను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దరఖాస్తుదారులు అక్కడి ల్యాంగ్వేజీ ఫ్రెంచ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. అన్ని చేసినా తుది నిర్ణయం మొనాకో అంతర్గత మంత్రిత్వ శాఖదే అవుతుంది. -
అమెరికా వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: అమెరికా–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం విజయవంతమైతే ప్రస్తుత అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని, ఎగుమతులు ఇతోధికం అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. భారత్పై విధించిన 26 శాతం అదనపు టారిఫ్లను 90 రోజుల పాటు (జూలై 8 వరకు) అమెరికా నిలిపివేయడం తెలిసిందే. దీంతో ఆలోపే అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు భారత్ విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తోంది. తద్వారా భారత ఎగుమతులపై టారిఫ్ల పూర్తి మినహాయింపు ప్రయోజనం పొందొచ్చని భావిస్తోంది.అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య పెట్టుబడులకు భారత్ ఎంతో విశ్వసనీయ, ఆశావహ కేంద్రంగా కొనసాగుతుందని ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. మధ్యకాలిక వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని మరింత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వస్తాయని అంచనా వేసింది. నైపుణ్యాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న విధానపరమైన చర్యలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్న అంతర్జాతీయ సంస్థల నివేదికలను ప్రస్తావించింది.ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ సహా పలు సంస్థలు 2025–26లో భారత వృద్ధి రేటు 6.2–6.7 శాతం మధ్య ఉండొచ్చని పేర్కొనడం గమనార్హం. బలమైన దేశీ ఆర్థిక మూలాలు, మెరుగైన స్థూల ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ మూలధన వ్యయాల పెంపును ఈ నివేదిక ప్రస్తావించింది. దీంతో వెలుపలి షాక్లను ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడగలదని పేర్కొంది. వినియోగం దన్ను.. వినియోగం బలంగా ఉండడం, గ్రామీణ వినియోగం పుంజుకోవడం, సేవల ఎగుమతులు పటిష్టంగా ఉండడం దేశీ వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. వస్తు ఎగుమతుల్లో ఉన్న బలహీనతలను సేవల ఎగుమతులు భర్తీ చేస్తున్నట్టు వివరించింది. రూపాయి స్థిరంగా ఉండడంతోపాటు బలమైన విదేశీ మారకం నిల్వలు వెలుపలి షాక్లకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా గత బడ్జెట్లో ఆదాయపన్ను భారాన్ని తగ్గించడం, ద్రవ్య నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు, ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు వినియోగాన్ని, పెట్టుబడులను పెంచుతాయని అంచనా వేసింది. దీంతో ఆర్థిక వృద్ధి మరింత పుంజుకుని 6.3–6.8 శాతం అంచనాల్లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని తెలిపింది.ప్రైవేటు రంగం మూలధన వ్యయాలు ఒక్కటే పుంజుకోవాల్సి ఉన్నట్టు తెలిపింది. ఆహార ధరలు తగ్గుముఖం పట్టడంతో ద్రవ్యోల్బణం నియంత్రణల్లోనే ఉండొచ్చని అంచనా వేసింది. రబీ సాగు సానుకూలంగా ఉండడం, వేసవిలో పంటల సాగుతో రానున్న రోజుల్లో ఆహార వస్తువుల పరంగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉండొచ్చని వివరించింది. ఇక నైరుతిలో సాధరణం కంటే అధిక వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతోపాటు, చమురు ధరలు కనిష్టాల్లో ఉండడం ఆర్థిక వ్యవస్థకు అనుకూలిస్తాయని అభిప్రాయపడింది. -
సెబీ మాజీ చీఫ్ మాధవికి క్లీన్ చిట్
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విషయంలో అనైతికంగా వ్యవహరించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సెబీ మాజీ చీఫ్ మాధవి పురి బచ్కు లోక్పాల్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై ఆరోపణలన్నీ ఊహాగానాలు, అభిప్రాయాలతో కూడుకున్నవేనని వ్యాఖ్యానించింది.టీఎంసీ ఎంపీ మహువా మైత్రా సహా ఇతరుల ఫిర్యాదులన్నీ కూడా, అదానీ కంపెనీలను టార్గెట్ చేసుకుంటారని పేరొందిన ఓ షార్ట్సెల్లర్ నివేదిక ఆధారంగా చేసినవేనని పేర్కొంది. ఇవన్నీ నిరాధారమైనవేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు ఆదేశించడానికి ఎలాంటి ఆధారాల్లేవని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.వాటిపై సెబీ చైర్మన్ హోదాలో బచ్ విచారణ జరపాల్సినప్పటికీ.. అదానీ గ్రూప్ కుంభకోణంతో సంబంధమున్న ఆఫ్షోర్ ఫండ్స్లో గతంలో ఆమెకి, ఆమె భర్తకి వాటాలు ఉన్నందున సరైన చర్యలు తీసుకోలేదంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఈ ప్రాతిపదికన దాఖలైన ఫిర్యాదులను లోక్పాల్ తాజాగా కొట్టివేసింది. -
ఐటీసీలో రూ. 12,941 కోట్ల షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మాతృ సంస్థ, బ్రిటిష్ దిగ్గజం బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) తాజాగా దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీలో మైనారిటీ వాటా విక్రయించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో బ్లాక్డీల్స్ ద్వారా 2.5 శాతం వాటా అమ్మివేసింది. షేరుకి రూ. 413కుపైగా సగటు ధరలో 31.3 కోట్ల షేర్లను విక్రయించింది. వీటి విలువ రూ. 12,941 కోట్లు(1.51 బిలియన్ డాలర్లు)కాగా.. ఎన్ఎస్ఈలో మంగళవారం ధర రూ. 434తో పోలిస్తే 4.8 శాతం డిస్కౌంట్లో వాటాను ఆఫర్ చేసింది.కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. ఈ లావాదేవీకి ముందు కంపెనీలో బీఏటీ వాటా 25.44 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థల ద్వారా ప్రస్తుతం 22.94 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ఐటీసీలో 1900 సంవత్సరం ప్రారంభంలోనే బీఏటీ పెట్టుబడులకు తెరతీసింది.తద్వారా దీర్ఘకాలంగా రెండు దిగ్గజాలూ లబ్ధి పొందుతూ వస్తున్నాయి. అయితే 2024 మార్చిలోనూ ఐటీసీలో 3.5 శాతం వాటాను రూ. 17,485 కోట్లకు బీఏటీ విక్రయించడం గమనార్హం! బ్లాక్డీల్ నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో బుధవారం 3.2 శాతం క్షీణించి రూ. 420 వద్ద ముగిసింది. -
విజయ్ మాల్యా ట్వీట్.. గట్టిగా తగులుకున్న నెటిజన్లు
బ్యాంకులకు రూ. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ మాల్యాను తాజాగా సోషల్మీడియాలో యూజర్లు గట్టిగా తగులుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (IPL) సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుపై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్కు విజయ్ మాల్యా అభినందనలు తెలిపారు.ఆర్సీబీని ప్రశంసిస్తూ ‘ఎక్స్’(ట్విటర్)లో విజయ్ మాల్యా ఓ పోస్ట్ పెట్టాడు. అంతే దొరికాడురా అంటూ నెటిజన్లు గట్టిగా తగులుకున్నారు. ఆయన చేసిన పోస్టును ట్రోల్ చేస్తూ చట్టపరమైన చర్యలను ఎదుర్కొనేందుకు భారత్కు తిరిగి రావాలని కోరారు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఇండియా రావచ్చుగా.. అని ఒకరు ట్వీట్ చేయగా భారత్లో ప్లేఆఫ్స్ చూడటానికి రండి.. అంటూ మరొకరు ట్వీట్ చేశారు. 'కమ్ బ్యాక్ టు ఇండియా మ్యాన్'.. "ఎప్పుడు వస్తున్నావు?".. ఇలా మరికొందరు కామెంట్లు చేశారు.ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పేరొందిన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పతనంతో దివాలా తీశాడు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్బీఐ నేతృత్వంలోని భారతీయ బ్యాంకుల కన్సార్టియంకు రూ .9,000 కోట్లకు పైగా ఎగ్గొట్టి ఆర్థిక మోసం, మనీలాండరింగ్ ఆరోపణల మధ్య 2016లో దేశం నుండి పారిపోయాడు. ప్రస్తుతం యూకేలో ఉంటున్న మాల్యా.. దివాలా, భారత్ కు అప్పగింతపై న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. -
టిప్ తంటా.. క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు నోటీసులు
ముందస్తు టిప్ల పేరుతో వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్న క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. "అడ్వాన్స్ టిప్" డిమాండ్ చేస్తున్నందుకు ఓలా, ఉబెర్, రాపిడో సహా నాలుగు క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఈ సంస్థలు అవలంబిస్తున్న అనైతిక కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషి ఇటీవల స్పందించారు.సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తొలుత మే 21న ఉబెర్పై ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత మిగతా సంస్థలపైనా సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఓలా, రాపిడోలపై కూడా దర్యాప్తును విస్తరించింది. అయితే కొన్ని వర్గాలు నమ్మ యాత్రి యాప్ కూడా ఇలాంటి ఫీచర్ను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నాయి. కానీ ఇంతవరకు దానికి నోటీసు జారీ కాలేదు.మరోవైపు తమకు ఇంతవరకు ఎలాంటి ఫార్మల్ నోటీసు అందలేదని రాపిడో తెలిపింది. తాము ఆటోలు, క్యాబ్ల కోసం జీరో-కమిషన్ మోడల్ను అనుసరిస్తున్నామని, బైక్ రైడ్ల కోసం స్పష్టంగా అదనపు ఛార్జీలను వినియోగదారులకు ఎంపికగా అందిస్తున్నామని వివరించింది. ఈ సంస్థలు వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తున్నాయా అని సీసీపీఏ పరిశీలిస్తోంది. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ఉబెర్కు 15 రోజుల సమయం ఇచ్చింది.గతంలో కూడా ఓలా, ఉబెర్లు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ల ఆధారంగా ధరలలో వ్యత్యాసం చూపినందుకు దర్యాప్తును ఎదుర్కొన్నాయి. ఈ తాజా చర్య వినియోగదారుల హక్కులను కాపాడేందుకు కేంద్రం తీసుకుంటున్న కఠిన చర్యలను సూచిస్తుంది. రైడ్ను త్వరగా అందుకునేందుకు ఈ సంస్థలు వినియోగదారుల నుండి ముందస్తు టిప్లు చెల్లించమని కోరడం అనైతికమని, దోపిడీ స్వభావమని కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి విమర్శించారు. టిప్ అనేది స్వచ్ఛందంగా, సేవ అనంతరం ఇవ్వాల్సినదిగా ఉండాలి కానీ, వేగవంతమైన రైడ్ల కోసం ముందస్తు షరతుగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. -
మహిళలకు ఆర్థిక శక్తి.. ఎన్ఎస్ఈ, తెలంగాణ వి హబ్ ఒప్పందం
ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), తెలంగాణ ప్రభుత్వ చొరవ కార్యక్రమం వి హబ్ ఫౌండేషన్ ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం, నిధుల సమీకరణలో మహిళా పారిశ్రామిక వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడమే ఈ ఒప్పందం లక్ష్యం.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో హైదరాబాద్లో ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్, వి హబ్ ఫౌండేషన్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మధ్య జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన వి హబ్ ఫౌండేషన్ తో కలిసి ఎన్ఎస్ఈ మదుపరుల అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళలలో ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. మహిళల నేతృత్వంలోని పరిశ్రమలకు నిధుల సమీకరణ, లిస్టింగ్ ప్రక్రియలో మార్గనిర్దేశం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఎఫ్ఎస్ఐ రంగంలో స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది.2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ఎన్ఎస్ఈ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 14 భాషలలో 14,679 మదుపరుల అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. వీటి ద్వారా 8 లక్షలకు పైగా పెట్టుబడి కార్యకలాపాల్లో పాల్గొనేవారు చేరారు. స్టూడెంట్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ కింద వివిధ రాష్ట్రాలలో 7500 మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందారు. అలాగే, వివిధ రంగాలకు చెందిన 615 కంపెనీలు ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయ్యాయి. సమిష్టిగా రూ. 17,083 కోట్లకుపైగా నిధులు సమీకరించాయి. ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 1,80,000 కోట్లు. -
అడ్రస్ ఆధార్.. ప్రభుత్వం కొత్త కసరత్తు!
దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన అధికారిక గుర్తింపు రుజువు కోసం తీసుకువచ్చిన ఆధార్ మాదిరిగానే ప్రతి చిరునామాకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీ ఉండే కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్లు, స్థలాలను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ఐడీ ఉపయోగపడుతుంది. డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి సహాయపడుతుంది.దుర్వినియోగం కట్టడి..ప్రస్తుతం, చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి దేశంలో ఎటువంటి ప్రామాణిక వ్యవస్థా లేదు. స్పష్టమైన నిబంధనలు లేని కారణంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి. దీన్ని అరికట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వ్యవస్థకు భౌతిక చిరునామాలనూ జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తద్వారా తమ చిరునామా వివరాల వినియోగానికి సంబంధించిన అధికారం స్పష్టమైన వినియోగదారు చేతుల్లో పెట్టడం ఈ కొత్త చొరవ లక్ష్యం.ఆర్థిక వ్యవస్థకూ నష్టం ఈ-కామర్స్, లాజిస్టిక్స్, యాప్ ఆధారిత డెలివరీ సేవలు పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితమైన, ప్రామాణిక చిరునామాలకు డిమాండ్ పెరిగింది. అయితే దేశంలోని చాలా చిరునామాలు అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉంటున్నాయి. కొన్ని సమీప ల్యాండ్ మార్క్ లపై ఆధారపడున్నాయి. ఈ స్పష్టత లేకపోవడం వల్ల తప్పుడు డెలివరీలు, లాజిస్టిక్ అసమర్థతల కారణంగా ఆర్థిక వ్యవస్థకు ఏటా 10–14 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. ఇది దేశ జీడీపీలో సుమారు అరశాతం.👉ఇది చదివారా? ఆధార్ అప్డేట్ గడువు జూన్ 14 వరకే..ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోందంటే..చిరునామాలను ఎలా రాయాలి.. నిల్వ చేయాలి... సురక్షితంగా యాక్సెస్ చేసుకోవాలో నిర్వచించడానికి ప్రతిపాదిత పరిష్కారం సమగ్ర 'డిజిటల్ అడ్రస్ సిస్టమ్'ను రూపొందించారు. ఒక వ్యక్తి చిరునామాను డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో వినియోగించాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. ఈ మేరకు ప్రైవసీ ప్రోటాకాల్స్ను ప్రవేశపెట్టనున్నారు.ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది. ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థ తుదిరూపు దాల్చే అవకాశం ఉంది. ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్వర్క్ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.డిజిపిన్.. స్మార్ట్ అడ్రస్ కోడ్ఈ వ్యవస్థలో గుండెకాయ లాంటిది డిజిపిన్ (డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్). కచ్చితమైన మ్యాప్ కోఆర్డినేట్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఇస్తారు. పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్ల మాదిరిగా కాకుండా డిజిపిన్లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపారా సంస్థలకు స్పష్టమైన కచ్చితత్వాన్ని అందిస్తాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక జనావాసాలు, సాంప్రదాయ చిరునామా వ్యవస్థలు లేని అడవులు, కొండలు వంటి భౌగోళిక సవాళ్లతో కూడిన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. -
‘కొత్త సీఈఓ నియామకానికి పకడ్బందీ ప్రక్రియ అవసరం’
ఇండస్ఇండ్ బ్యాంక్లో అకౌంటింగ్ సంబంధిత వ్యత్యాసాలు బయటపడుతున్న నేపథ్యంలో బ్యాంకుకు కొత్త సీఈఓను నియమించేందుకు ఆర్బీఐ మరింత పకడ్బందీ ప్రక్రియ చేపట్టాలని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త సీఈఓ నియామకం కోసం బ్యాంక్ బోర్డు ఆర్బీఐకి చేసిన ప్రతిపాదనలకు అనుగుణంగా బ్యాంకు నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) నేతృత్వంలో స్వతంత్ర ఉప సంఘం సీఈఓ పేర్లను పరిశీలిస్తే మేలని తెలిపారు.‘బ్యాంక్లో భారీ అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్ఆర్సీ స్వతంత్ర ఉపసంఘం ఆధ్వర్యంలో సీఈఓ అభ్యర్థి సిఫార్సులకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది’ అని ఉన్నత స్థాయి నియామకాలతో సంబంధం ఉన్న ఒక సీనియర్ బ్యాంకర్ తెలిపారు. జూన్ 30లోగా కొత్త సీఈఓ నియామకానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్బీఐ ఇప్పటికే బ్యాంకుకు సూచించింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ విక్రయాలకు ప్రత్యేక అవుట్లెట్లుసీఈఓ ఎంపిక ప్రక్రియలో తమ బ్యాంక్ బోర్డు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని, నిర్ణీత గడువుకు ముందే సిఫార్సులను ఆర్బీఐకి సమర్పిస్తామని బ్యాంక్ తెలిపింది. గ్లోబల్ సెర్చ్ సంస్థలు షార్ట్ లిస్ట్ చేసిన పేర్లను బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం కలిగినవారు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్లతో కూడిన ప్యానెల్ క్షుణ్ణంగా పరిశీలించాలని బ్యాంకింగ్ నిపుణులు తెలుపుతున్నారు. అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్ ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా ఇటీవల రాజీనామా చేశారు. అంతకన్నా ముందే డిప్యుటీ సీఈవో అరుణ్ ఖురానా తన స్థానం నుంచి తప్పుకున్నారు. దానికంటే ముందే బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్వో) గోవింద్ జైన్ వైదొలిగారు. -
పెట్రోల్, డీజిల్ విక్రయాలకు ప్రత్యేక అవుట్లెట్లు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థగా ఉన్న చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) రిటైల్ ఇంధన మార్కెట్లోకి ప్రవేశించడానికి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించాయి. దీంతో సీపీసీఎల్ ప్రత్యేకంగా తన సొంత బ్రాండెడ్ అవుట్లెట్ల ద్వారా పెట్రోల్, డీజిల్ను విక్రయించనుంది.ప్రస్తుతం సీపీసీఎల్ చెన్నైలోని మనాలిలో సంవత్సరానికి 10.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సామర్థ్యంతో క్రూడాయిల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇప్పటివరకు కంపెనీ మొత్తం ఉత్పత్తులను రిటైల్ అమ్మకాలను నిర్వహించే ఐఓసీకి సరఫరా చేసింది. సొంత రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడం ద్వారా ఐఓసీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), రిలయన్స్, షెల్, నయారా ఎనర్జీ వంటి ప్రధాన ఇంధన రిటైలర్లతో సీపీసీఎల్ పోటీ పడనుంది.ఇదీ చదవండి: బ్యాంకుల మొండిబాకీలు ‘రైట్ఆఫ్’కంపెనీ ఉత్పత్తుల పంపిణీ కోసం గతంలో ఐఓసీపై ఆధారపడిన సీపీసీఎల్ రిటైల్ రంగంలోకి ప్రవేశించడం దాని సొంత ఇంధన ధరలు, అమ్మకాల వ్యూహాలను నియంత్రించడం ద్వారా లాభాలు ఆర్జించనుంది. భవిష్యత్తులో ప్రీమియం ఇంధన ఆఫర్లు, ప్రత్యామ్నాయ ఇంధన పరిష్కారాలను విస్తరించడానికి ఈ చర్యలు వీలు కల్పిస్తున్నాయి. అయితే సీపీసీఎల్ తన రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను, వాటి లోకేషన్లను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కంపెనీ తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి ప్రధాన పట్టణ కేంద్రాలు, రహదారుల సమీపంలో వ్యూహాత్మకంగా అవుట్లెట్లను ఏర్పాటు చేస్తుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
బీఎస్ఎన్ఎల్కు లాభాల పంట
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలోనూ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను వీడి రూ.280 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 849 కోట్ల నికర నష్టం నమోదైంది. గతేడాది క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లోనూ రూ.262 కోట్ల నికర లాభం ఆర్జించిన సంగతి తెలిసిందే. వెరసి 2007 తదుపరి వరుసగా రెండో త్రైమాసికంలోనూ లాభాలు ప్రకటించినట్లు కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సిందియా వెల్లడించారు.గత 18ఏళ్ల తరువాత నిర్వహణ లాభం, సానుకూల మార్జిన్లు, నికర లాభాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర నష్టం భారీగా(58 శాతం) తగ్గి రూ.2,247 కోట్లకు పరిమితమైంది. 2023–24లో రూ.5,370 కోట్ల నష్టం నమోదైంది. నిర్వహణ ఆదాయం 8 శాతం ఎగసి రూ.20,841 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 10 శాతం బలపడి రూ.23,400 కోట్లకు చేరగా.. 2023–24లో నమోదైన 3 సర్కిళ్లతో పోలిస్తే సుమారు 10 సర్కిళ్లలో నికర లాభాలు సాధించినట్లు సిందియా వెల్లడించారు.ఇదీ చదవండి: బ్యాంకుల మొండిబాకీలు ‘రైట్ఆఫ్’గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ.24,432 కోట్ల పెట్టుబడులు వెచ్చించినట్లు తెలియజేశారు. ఆదాయంలో మొబిలిటీ నుంచి 6 శాతం వృద్ధితో రూ.7,499 కోట్లు లభించగా.. ఫైబర్ టు హోమ్ బిజినెస్ 10 శాతం అధికమై రూ.2,923 కోట్లు అందుకుంది. ఎంటర్ప్రైజ్ విభాగం 4 శాతం పుంజుకుని రూ. 4,096 కోట్ల ఆదాయం సాధించింది. 4జీ, 5జీ సేవలపై దృష్టి పెట్టడం ద్వారా వృద్ధిని కొనసాగించనున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ ఏ రాబర్ట్ జే రవి పేర్కొన్నారు. -
డీలా పడ్డ ఓలా!.. ఊహించని రీతిలో..
అమ్మకాల్లో అగ్రగామిగా దూసుకెళ్లిన దేశీయ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్.. మే నెలలో కొంత వెనుకపడింది. టీవీఎస్ మోటార్ అగ్రస్థానంలోనూ.. బజాజ్ ఆటో తరువాత స్థానంలోనే నిలవడంతో.. ఓలా ఎలక్ట్రిక్ మూడోస్థానంలో నిలిచింది. చాలా రోజుల నుంచి భారీ అమ్మకాలతో తిరుగులేని కంపెనీగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా తగ్గుముఖం పట్టింది.భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్.. మే నెల మొదటి 26 రోజుల్లో 20 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఏప్రిల్లో నెలతో పోలిస్తే ఈ వాటా చాలా తక్కువ. మే 1వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యకాలంలో కంపెనీ 15,211 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసింది. 2024 మే నెలలో కంపెనీ 37,388 యూనిట్ల రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే.. 2024తో పోలిస్తే 2025లో సేల్స్ 60 శాతం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఈ నెలలో టీవీఎస్ మోటార్ 25 శాతం మార్కెట్ వాటాను నమోదు చేయగా.. బజాజ్ ఆటో 22.6 శాతం వాటాను నమోదు చేశాయి. ఈ కంపెనీల సేల్స్ కొంత తగ్గినప్పటికీ.. ఓలా ఎలక్ట్రిక్ కంటే కూడా ముందంజలో ఉన్నాయి. ఏథర్ ఎనర్జీ మార్కెట్ వాటా కూడా మే నెలలో 14.9% నుంచి 13.1%కి తగ్గింది, ఈ కాలంలో వాహన రిజిస్ట్రేషన్లు 13,287 యూనిట్ల నుంచి 9,962 యూనిట్లకు తగ్గాయి.ఓలా రోడ్స్టర్ ఎక్స్ బైక్ డెలివరీలుతొలి 5,000 మంది కస్టమర్లకు రూ.10,000 ఆఫర్తో రోడ్స్టర్ ఎక్స్ పోర్ట్ఫోలియో మోటార్ సైకిళ్ల డెలివరీలను ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది. ‘‘మోటార్ సైకిల్ విభాగంలోకి ప్రవేశించే క్రమంలో ‘రోడ్స్టర్ ఎక్స్’ అనేది ఒక సాహసోపేతమైన ముందడుగు. ఈ డెలివరీతో ద్విచక్రవాహన కేటగిరిలో ఈవీ సామర్థ్యం అన్లాక్ అవుతుంది. ఈవీల వినియోగం, మరింత పుంజుకుంటుంది’’ అని ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్ ఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు.ఓలా కంపెనీ రోడ్స్టర్ ఎక్స్ సిరీస్లో మోటార్సైకిల్స్ను 2.5కేడబ్ల్యూహెచ్, 3.5కేడబ్ల్యూహెచ్, 4.5కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్లలో అందిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ.99,999, రూ.1,09,999, రూ.1,24,999గా ఉన్నాయి. రోడ్స్టర్ ఎక్స్ ప్లస్లో సిరీస్లో 4.5కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ధర రూ.1,29,999, మరో వేరియంట్ 9.1కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మోటార్ సైకిల్ ధర రూ.1,99,999గా ఉన్నాయి.పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ఇటీవలి కాలంలో ఈవీల జోరు పెరగడం.. ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవడంతో టూవీలర్ విభాగం పుంజుకోవడానికి దోహదపడుతోందని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. 2025 - 26లో అమ్ముడైన మొత్తం టూవీలర్లలో ఈవీల వాటా 6 శాతానికి పైగా నమోదైంది.‘రాబోయే కాలంలో ఈవీల ధరలు దిగొచ్చే అవకాశం ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలతో స్కూటర్ పరిశ్రమలో ఈవీల వాటా మరింత పెరగడం ఖాయం. ఇప్పటికే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది’ అని టీవీఎస్ మోటార్స్ సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ తాజాగా పేర్కొన్నారు. 2024–25లో తొలిసారి ఈ–టూవీలర్లు 10 లక్షల అమ్మకాల మైలురాయిని దాటాయి. మొత్తం 11.4 లక్షలకు పైగా సేల్స్తో ఈ–టూవీలర్ విభాగంలో ఏకంగా 21 శాతం వృద్ధి నమోదైంది.అందుబాటులో విభిన్న మోడళ్లుటీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, హీరో మోటో వంటి టూవీలర్ దిగ్గజాలతో పాటు నవతరం ఎలక్ట్రిక్ వాహన సంస్థలైన ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటివి కొంగొత్త మోడళ్లతో ఈవీ మార్కెట్లో వాటా కోసం పోటీపడుతున్నాయి. స్కూటర్లలో విభిన్న వర్గాల అవసరాలకు, విభిన్న మోడళ్లు అందుబాటులో ఉండడం కూడా ఎకానమీ బైక్లకు మించి స్కూటర్ అమ్మకాలు పుంజుకోవడానికి మరో ముఖ్య కారణమని రాధాకృష్ణన్ చెప్పారు. 2021–22లో టీవీఎస్ టూవీలర్ సేల్స్లో స్కూటర్ల వాటా 25 శాతం ఉండగా.. 2024–25లో ఇది 40 శాతానికి దూసుకెళ్లింది. గతేడాది కంపెనీ మొత్తం 47.4 లక్షల ద్విచక్రవాహనాలను విక్రయించింది. ఇదిలాఉంటే, టీవీఎస్ స్కూటర్ విక్రయాల్లో 15 శాతం ఎలక్ట్రిక్ ఐక్యూబ్దే కావడం మరో విశేషం! -
బ్యాంకులకు కరస్పాడెంట్ల సాయం: ఎందుకంటే?
ముంబై: కస్టమర్ల కేవైసీ వివరాల నవీకరణతోపాటు.. చురుగ్గాలేని ఖాతాలను వినియోగంలోకి తీసుకువచ్చే విషయంలో బిజినెస్ కరస్పాండెంట్ల సాయం బ్యాంక్లు తీసుకునే వెలుసుబాటు లభించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనతో ఆర్బీఐ ఒక ముసాయిదా సర్క్యులర్ విడుదల చేసింది.కాలానుగుణంగా చేయాల్సిన కేవైసీ అప్డేషన్ విషయమై పెద్ద ఎత్తున పని అపరిష్కృతంగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చింది. ఇందులో ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), ఎల్రక్టానిక్ రూపంలో ప్రయోజనం బదిలీ (ఈబీటీ) కోసం తెరిచిన ఖాతాలు కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకిప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం కింద తెరిచిన ఖాతాల విషయంలోనూ కస్టమర్లు సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించినట్టు ఆర్బీఐ తెలిపింది. కేవైసీ అప్డేషన్ విషయంలో సమస్యలపై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్టు పేర్కొంది. కస్టమర్ల సౌకర్యం దృష్ట్యా కేవైసీ అప్డేషన్ విషయంలో బిజినెస్ కరస్పాడెంట్లను అనుమతించేందుకు సవరణలు చేసినట్టు తెలిపింది. దీనిపై జూన్ 6లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆర్బీఐ కోరింది. -
టర్కీ కంపెనీతో కాంట్రాక్ట్ రద్దు
చెన్నై విమానాశ్రయం టర్కీకి చెందిన సెలెబి సంస్థతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంది. జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా కంపెనీ సేవలందిస్తున్న సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) సంస్థ సేవలను నిలిపేసింది. దీన్ని సవాలు చేస్తూ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారణ పూర్తయ్యేవరకు కొత్త గ్రౌండ్ వర్కింగ్ కాంట్రాక్టులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్ కూడా సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.టర్కిష్ ఏవియేషన్ సంస్థ సెలెబి పదేళ్లకు పైగా భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్తో సహా అనేక విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు ప్రతిస్పందనగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు కంపెనీ మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ దాఖలు చేసింది.ఇటీవల కాలంలో టర్కీ పాకిస్థాన్ ఉగ్రచర్యలకు మద్దతు ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో టర్మీ సంస్థల కార్యకలాపాలను నిలిపేయాలని దేశీయ సంస్థలు చూస్తున్నాయి. టర్కీ డ్రోన్ల వాడకంతో సహా ప్రాంతీయ సంఘర్షణల్లో పాక్కు మద్దతుగా టర్కీ ప్రమేయంపై భారతదేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో టర్కీ సంస్థలతో ఒప్పందాలపై దేశీయ కంపెనీలు పున:పరిశీలన చేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్డేట్స్సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దును సవాలు చేస్తూ సెలెబి కంపెనీ ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టును ఆశ్రయించింది. జూన్లో ఈ కేసు విచారణ జరిగే వరకు ముంబై ఎయిర్పోర్ట్ కొత్త గ్రౌండ్ హ్యాండ్లింగ్ కాంట్రాక్టులను ఖరారు చేయకుండా బాంబే హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. -
దిగ్గజ కంపెనీ నిర్ణయం: వేలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!
ఐటీ పరిశ్రమలో ఉద్యోగ కోతలు మరింత పెరుగుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇటీవల దాదాపు 6,700 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఐబీఎం కంపెనీ ఏకంగా 8,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.ఐబీఎం కంపెనీ తొలగించనున్న ఉద్యోగుల జాబితాలో అధికంగా హెచ్ఆర్ విభాగానికి చెందినవారే (సుమారు 200 మంది) ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని తొలగించడానికి ప్రధాన కారణం.. హెచ్ఆర్ ఉద్యోగుల పనిచేయడానికి కంపెనీ ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టడమే. సమాచారాన్ని సేకరించడం, ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, పేపర్ వర్క్ నిర్వహించడం వంటి పనులను పూర్తి చేయడానికి కంపెనీ ఏఐను అభివృద్ధి చేసింది.ఏఐ టెక్నాలజీ పనిని మరింత వేగంగాఈ చేయడంతో.. హెచ్ఆర్ ఉద్యోగుల అవసరం దాదాపు అనవసరమని భావించి కంపెనీ లేఆప్స్ ప్రకటించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ విభాగంలో మరింత మంది ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 2024 నాటికి ఐబీఎంలో ఉద్యోగుల సంఖ్య 2.8 లక్షలు. అయితే కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టిన తరువాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.ఇదీ చదవండి: ఏఐ ఆటోమేషన్కే ప్రాధాన్యత: నివేదికలో కీలక అంశాలుసంస్థలో కొన్ని పనులను ఆటోమేట్ చేయడం వల్ల ఇతర విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వనరులు సమకూరుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ను కొన్ని ఎంటర్ప్రైజ్ వర్క్ఫ్లోలపై ఉపయోగించడం వల్ల కార్యకలాపాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఇతర విభాగాల్లో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు హెచ్ఆర్లోని ప్రస్తుత ఏఐ వ్యవస్థలు అవకాశం కల్పిస్తున్నాయని కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ తెలిపారు. -
ఏఐ ఆటోమేషన్కే ప్రాధాన్యత: నివేదికలో కీలక అంశాలు
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు, సైబర్ ముప్పులను అధిగమించేందుకు కంపెనీల్లోని సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రస్తుతం కృత్రిమ మేథ (ఏఐ) వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా మూడో వంతు సైబర్సెక్యూరిటీ లీడర్లు ఏఐ ఆధారిత ఆటోమేషన్కే ప్రాధాన్యతనిస్తామంటున్నారు. ఐటీ దిగ్గజం విప్రో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదిక ప్రకారం.. సైబర్ సెక్యూరిటీని పెంచుకునేందుకు, బడ్జెట్లను అదుపులో ఉంచుకునేందుకు ఏఐ ఆటోమేషన్పై పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యతనిస్తామని చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లలో (సీఐఎస్వో) 30 శాతం మంది తెలిపారు. సాధనాలను క్రమబద్దీకరించుకోవడం (26 శాతం మంది), సెక్యూరిటీ.. రిస్క్ మేనేజ్మెంట్ ప్రక్రియను మెరుగుపర్చుకోవడం (23 శాతం), నిర్వహణ విధానాలను సరళతరం చేసుకోవడం (20 శాతం) ద్వారా కూడా ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.‘సైబర్ ముప్పులు చాలా వేగంగా అధునాతన రూపు సంతరించుకుంటున్నాయి. ఆ స్థాయిలో సైబర్సెక్యూరిటీ బడ్జెట్లను పెంచుకోవడం కష్టతరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యయాలతో రక్షణ వ్యవస్థాలను పటిష్టం చేసుకునేందుకు కంపెనీలకి ఏఐ ఉపయోగపడుతుంది. అందుకే సీఐఎస్వోలు దీనిపై దృష్టి పెడుతున్నారు‘ అని విప్రో ఎస్వీపీ టోనీ బఫోమెంట్ తెలిపారు.నివేదిక ప్రకారం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడానికే కాకుండా ముప్పులను గుర్తించే సామర్థ్యాలను పెంచుకునేందుకు, సత్వరం స్పందించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నట్లు 31 శాతం మంది వివరించారు. అధునాతన ఏఐ ఆధారిత సెక్యూరిటీ సొల్యూషన్స్లో ఇన్వెస్ట్ చేయడం, నిరంతరాయంగా ఏఐ పరిణామాలను పర్యవేక్షిస్తుండటం, సైబర్సెక్యూరిటీ సిబ్బందిలో కొత్త ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడంలాంటి అంశాలు రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పుడు కీలకంగా మారాయని నివేదిక పేర్కొంది.