breaking news
Corporate
-
బాలాజీ ఫౌండేషన్ దాతృత్వం
హైదారాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలాజీ ఫౌండేషన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.10 లక్షలు వెచ్చించి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ... నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండులో తాగునీటి సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. బాలాజీ ఫౌండేషన్ వ్యాపారంతో పాటు సేవారంగంలోనూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. తన తండ్రి బాలాజీ చౌదరి నెల్లూరు నుంచే తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారని, అలాంటి ప్రాంతంలో బాలాజీ ఫౌండేషన్ సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని బీ న్యూ మొబైల్స్ అండ్ ఎల్రక్టానిక్స్’, బాలాజీ సంస్థ సీవోఈ సాయి నిఖిలేష్ తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ హెల్తినీర్స్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా వ్యాధులను ముందుగా గుర్తించడం, పర్యవేక్షణ, చికిత్స మొదలైన వాటికి కృత్రిమ మేథ (ఏఐ), అల్ట్రాసౌండ్ ఇమేజింగ్లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించడంపై దృష్టి పెడతాయి. ఏఐని ఉపయోగించి, గాటు పెట్టకుండా కాలేయ వ్యాధికి చికిత్సను అందించే దిశగా సీమెన్స్ హెల్తినీర్స్తో భాగస్వామ్యం కీలక ముందడుగు కాగలదని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. వ్యాధులను సకాలంలో కచి్చతంగా గుర్తించేందుకు, మెరుగైన చికిత్సను అందించేందుకు, పేషంట్లకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు అధునాతన టెక్నాలజీలు తోడ్పడతాయని సీమెన్స్ హెల్త్కేర్ ఎండీ హరిహరన్ సుబ్రమణియన్ చెప్పారు. -
పెరిగిన గగనతల ప్రయాణికుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సంస్థలు ఈ ఏడాది జూన్లో 1.36 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. మే నెలలో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో దేశీ ఎయిర్లైన్స్లో 8.51 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 7.93 కోట్ల మంది ప్యాసింజర్లతో పోలిస్తే ఇది 7.34 శాతం అధికం. ఫ్లయిట్ల జాప్యాల వల్ల 1,20,023 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఫ్లయిట్ల రద్దు వల్ల 33,333 ప్రయాణికులపై ప్రభావం పడగా, పరిహారం, ఇతరత్రా సదుపాయాల కల్పన కింద విమానయాన సంస్థలు రూ. 72.40 లక్షలు వెచ్చించాయి. ఇక, మే నెలలో 64.6 శాతంగా ఉన్న విమానయాన సంస్థ ఇండిగో మార్కెట్ వాటా జూన్లో 64.5 శాతానికి పరిమితమైంది. ఎయిరిండియా గ్రూప్ వాటా 26.5 శాతం నుంచి 27.1 శాతానికి చేరింది. ఆకాశ ఎయిర్ వాటా పెద్దగా మార్పు లేకుండా 5.3 శాతం స్థాయిలోనే ఉంది. స్పైస్జెట్ వాటా మాత్రం 2.4 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. -
బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా
ముంబై: కార్మిక, నైపుణ్య ఉద్యోగాల్లో (బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అదే సమయంలో చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉద్యోగం వీడుతుండడం (వలసల రేటు/అట్రిషన్) ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం 19 శాతానికి పెరిగింది. 2020–21 నాటికి వీరి భాగస్వామ్యం 16 శాతంగా ఉండడం గమనార్హం. కానీ, వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఏడాది లోపు అనుభవం ఉన్న మహిళల ఎక్కువగా ఉద్యోగం మానేస్తున్నారు. ఈ వివరాలను ఉదైతి ఫౌండేషన్, క్వెస్కార్ప్ నివేదిక వెల్లడించింది. రిటైల్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, సేవల రంగాల్లో ఉద్యోగం చేస్తున్న 10,000 మంది మహిళలతోపాటు, ఉద్యోగం మానేసిన 1,500 మందిని సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. వలసలు ఎక్కువగా ఉండడం ఉత్పాదకతకు, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్న సాకారానికి విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళల అభిప్రాయాలు.. వచ్చే 12 నెలల్లో ఉద్యోగం వీడనున్నట్టు ఏడాది లోపు అనుభవం ఉన్న 52 శాతం మహిళా ఉద్యోగులు సర్వేలో తెలిపారు. అదే రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిలో ఇలా చెప్పిన వారు 3 శాతంగానే ఉండడం గమనార్హం. వలసల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లోనూ 54 శాతం తమ వేతనం విషయమై సంతృప్తిగా లేరు. 80 శాతం మంది నెలకి రూ. 2,000 కన్నా తక్కువే పొదుపు చేస్తున్నారు. మంచి వేతనం ఇస్తే ఉద్యోగాల్లో తిరిగి చేరతామని 42 శాతం మంది చెప్పారు. 57 శాతం మంది రవాణా పరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటే, 11 శాతం మంది రాత్రి షిఫ్టుల్లో పని ప్రదేశానికి వెళ్లి రావడాన్ని భద్రంగా భావించడం లేదు. రూ.20వేల కంటే అధిక వేతనం పొందుతున్న వారు సమీప కాలంలో ఉద్యోగం విడిచి పెట్టిపోవడం 21 శాతం తక్కువగా ఉండొచ్చన్నది ఈ నివేదిక సారాంశం. వ్యవస్థలోనే లోపం.. ‘‘భారత్ ఆర్థిక సామర్థ్యాల విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలకు ద్వారాలు తెరిచాం. కానీ, వారికి అనుకూలమైన వ్యవస్థల ఏర్పాటుతోనే వృద్ధి చెందగలరు. సామర్థ్యాలు లేకపోవడం వల్ల మహిళల ఉద్యోగాలు వీడడం లేదు. మహిళలు పనిచేసేందుకు, విజయాలు సాధించేందుకు అనుకూలమైన వసతులను మనం కలి్పంచలేకపోతున్నాం’’అని ఉదైతి ఫౌండేషన్ సీఈవో పూజ గోయల్ వివరించారు. -
ఐఆర్డీఏఐ కొత్త చైర్మన్ అజయ్ సేత్
న్యూఢిల్లీ: బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కొత్త చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేత్ను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల కాలానికి లేదా 65 ఏళ్లు వచ్చేంత వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు సేత్ను ఈ పదవిలో నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అజయ్ సేత్ 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. నాలుగేళ్ల పాటు కేంద్ర ఆర్థిక శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలు అందించిన అనంతరం ఈ ఏడాది జూన్లో పదవీ విరమణ చేశారు. దేవాశిష్ పాండా పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియగా, అప్పటి నుంచి ఐఆర్డీఏఐ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. -
ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!
ఓ మహిళా ఉద్యోగిని నియమించిన కొంత కాలానికి తన నియామకం చెల్లదని కంపెనీ తనను కొలువు నుంచి తొలగించింది. అందుకు నియామక సమయానికి ఆమెను గర్భిణిగా గుర్తించడమే కారణమని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వెలిసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్పామ్ టీమ్బ్లైండ్లో చేసిన ఓ పోస్ట్లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.‘ఓ ప్రైవేట్ కంపెనీ ఒక మహిళా అభ్యర్థిని ఉద్యోగంలో నియమించుకుంది. బ్యాంక్గ్రౌండ్ వెరిపికేషన్లో ఆమె 6 నెలల గర్భిణి అని గుర్తించారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉద్యోగానికి దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధంగా కంపెనీ భావిస్తోంది. దాంతో తనను ఉద్యోగం నుంచి తొలగించి తిరిగి ఆ లెవల్-6 కొలువుకు మళ్లీ రిక్రూట్మెంట్ జరుపుతుంది’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్పై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఈ పోస్ట్ ఏ దేశంలోని ఉద్యోగి అప్లోడ్ చేశారో తెలియరాలేదు.ఇదీ చదవండి: అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలుగతంలో ఇలాంటి వివక్షను ఎదుర్కొన్న ఒక ఉద్యోగి రిప్లై ఇస్తూ..‘నేను ఉద్యోగంలో చేరినప్పుడు 5 నెలల గర్భిణిగా ఉన్నాను. ఇప్పుడు కంపెనీలు చూపిస్తున్న చిన్నచూపు సరికాదు. నేను ఉద్యోగంలో చేరి ముందుకు సాగుతున్నాను. కంపెనీలో టాప్ ఎంప్లాయిల్లో ఒకరిగా ఉన్నాను. ప్రతి ప్రాజెక్ట్లోనూ నా నైపుణ్యాలు వాడుతారు. నేను చాలా మంది ఉద్యోగుల కంటే మెరుగ్గా సమస్యలకు పరిష్కారాలు అందిస్తాను. మహిళలు అభద్రతా భావానికి గురికావద్దు. పైన తెలిపిన పోస్ట్లో ఆమెను ఒక కారణం కోసం కంపెనీ నియమించుకుంది. దాన్ని మర్చిపోవద్దు’ అని రాసుకొచ్చారు. -
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరించిన కొద్ది రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ముంబైలోని కంపెనీకి సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అంబానీ వ్యక్తిగత నివాసం లేనప్పటికీ ఢిల్లీ, ముంబైలోని ఈడీ బృందాలు ఆయన గ్రూప్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ నిర్వహించాయి. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ఇప్పటికే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు నియంత్రణ, ఆర్థిక సంస్థల నుంచి అందిన సమాచారం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకుంది. విస్తృత దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్తో సంబంధం ఉన్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను కూడా విచారిస్తున్నారు. ప్రజాధనాన్ని దారి మళ్లించారనేలా ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలతో సహా అనేక సంస్థలను తప్పుదారి పట్టించి ఉండవచ్చని ఈడీ అభిప్రాయపడింది.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సుఫ్రాడ్గా వర్గీకరణరిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ సంస్థ ప్రమోటర్ అనిల్ అంబానీని ‘మోసపూరితం(ఫ్రాడ్)’గా ఎస్బీఐ జూన్ 13న గుర్తించినట్టు ఇటీవల లోక్సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పకంజ్ చౌదరి తెలిపారు. జూన్ 24న ఆర్బీఐకి ఫ్రాడ్ వర్గీకరణ గురించి ఎస్బీఐ నివేదించిందని.. దీనిపై సీబీఐ వద్ద కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫ్రాడ్గా గుర్తించిన విషయాన్ని ఆర్కామ్ బీఎస్ఈకి జూలై 1న వెల్లడించడం గమనార్హం. ఆర్కామ్ ప్రస్తుతం దివాలా పరిష్కార చట్టం కింద చర్యలను ఎదుర్కొంటోంది. ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31వేల కోట్లకు పైగా రుణం తీసుకోగా.. ఈ నిధులను వివిధ గ్రూప్ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ ఆర్కామ్కు తెలియజేయడం గమనార్హం. రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఎస్బీఐ భారీగానే అప్పులు ఇచ్చింది. ఇందులో ఆగస్టు 26, 2016 నుంచి చెల్లించాల్సిన వడ్డీ, ఖర్చులతో కలిపి రూ.2,227.64 కోట్ల అసలు ఉంది. రూ.786.52 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీల ద్వారా నాన్ ఫండ్ బేస్డ్ రుణాలు కూడా ఉన్నాయి. -
ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు
‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2025’ సదస్సు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు పరిచయడం చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సదస్సును ‘భారత్ మండపం’లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక పోర్టల్, మొబైల్ అప్లికేషన్ను మంత్రి ఆవిష్కరించారు.ఇదీ చదవండి: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లుగతంలో నిర్వహించిన మూడు ఎడిషన్లు (సదస్సులు) విజయవంతమైనట్టు, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శి అవినాష్ జోషి తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఈ రంగం ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతుల్లో ఈ విభాగం నుంచే 20 శాతం ఉంటున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎక్విప్మెంట్ తయారీదారులు, ప్యాకేజింగ్ సొల్యూషన్ కంపెనీలు, లాజిస్టిక్స్ సంస్థలు, స్టార్టప్లు పాల్గొనున్నట్టు తెలిపారు. -
ఆడ్కాక్ వాటాలపై నాట్కో కన్ను
దక్షిణాఫ్రికాకు చెందిన ఔషధ సంస్థ ఆడ్కాక్ ఇన్గ్రాం హోల్డింగ్స్లో మైనారిటీ షేర్హోల్డర్ల వాటాలను కొనుగోలు చేయనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం నగదు డీల్ రూపంలో రూ. 2,100 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలిపింది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆడ్కాక్లో నాట్కోకు గతంలో ఉన్న 0.80 శాతంతో కలిపి మొత్తం 35.75 శాతం వాటా (సుమారు 5,16,43,319 షేర్లు) దక్కుతుంది. దీని విలువ 226 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఆడ్కాక్ వేల్యుయేషన్ సుమారు 632 మి. డాలర్లుగా ఉంది.ఇదీ చదవండి: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లుడీల్ తర్వాత కంపెనీలో బిడ్వెస్ట్ (64.25%), నాట్కో (35.75%) ప్రధాన వాటాదార్లుగా ఉంటాయి. 1890లో ఏర్పాటైన ఆడ్కాక్ ఇన్గ్రాం ప్రధానంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ తదితర 4 సెగ్మెంట్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 536 మిలియన్ డాలర్ల ఆదాయం, 33.4% స్థూల మార్జిన్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించేందుకు, కొత్త ఆదాయ మార్గాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని తెలిపారు. కంపెనీకి గల సుదీర్ఘ చరిత్ర, బ్రాండ్స్పై గల నమ్మకానికి ఈ ఒప్పందం నిదర్శనంగా నిలుస్తుందని ఆడ్కాక్ సీఈవో ఆండ్రూ హాల్ తెలిపారు. ఈ డీల్ నాలుగు నెలల్లో ముగియవచ్చని అంచనా. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లు
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,410 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 1,392 కోట్లతో లాభం స్వల్పంగా పెరిగింది. మరోవైపు సమీక్షాకాలంలో ఆదాయం 11 శాతం పెరిగి రూ. 7,673 కోట్ల నుంచి రూ. 8,545 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెండంకెల స్థాయిలో ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. బ్రాండెడ్ ఉత్పత్తుల మార్కెట్లో పనితీరు నిలకడగా ఉండటం, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ (ఎన్ఆర్టీ) పోర్ట్ఫోలియో పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడినట్లు వివరించారు.లెనాలిడోమైడ్ ఔషధం ధరలకు సంబంధించి అమెరికా జనరిక్స్ మార్కెట్లో ఒత్తిడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్పాదకతను మెరుగుపర్చుకుంటూ, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ, ప్రధాన వ్యాపార విభాగాలను బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తామని ప్రసాద్ చెప్పారు. స్థూలకాయాన్ని తగ్గించే ఇంజెక్షన్ సెమాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్ను వచ్చే ఏడాది భారత్ సహా పలు దేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. ఇదీ చదవండి: ‘ఆర్బీఐ రేట్ల కోత మ్యాజిక్ బుల్లెట్ కాదు’మరిన్ని విశేషాలు..విభాగాలవారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ వ్యాపారం సుమారు 10 శాతం పెరిగి రూ. 6,886 కోట్ల నుంచి రూ. 7,562 కోట్లకు చేరగా, ఫార్మా సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్ఏఐ) సెగ్మెంట్ 7 శాతం వృద్ధితో రూ. 766 కోట్ల నుంచి రూ. 818 కోట్లకు పెరిగింది.గ్లోబల్ జనరిక్స్ విషయంలో, కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 3,846 కోట్ల నుంచి రూ. 3,412 కోట్లకు తగ్గింది. లెనాలిడొమైడ్ సహా కొన్ని కీలక ఉత్పత్తుల ధరల తగ్గుదల ఇందుకు కారణమైంది.ఎన్ఆర్టీ పోర్ట్ఫోలియో కలిపి యూరప్ మార్కెట్ రూ. 526 కోట్ల నుంచి రూ. 1,274 కోట్లకు చేరింది.అయిదు కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడం, ధరల పెరుగుదల వంటి అంశాల దన్నుతో భారత మార్కెట్ 11 శాతం పెరిగి రూ. 1,325 కోట్ల నుంచి రూ. 1,471 కోట్లకు చేరింది. -
మింత్రాపై ఈడీ ఫెమా కేసు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–కామర్స్ సంస్థ మింత్రాపై విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదైంది. రూ. 1,654 కోట్ల పెట్టుబడుల విషయంలో మింత్రాతో పాటు, దానితో సంబంధమున్న కంపెనీలు, డైరెక్టర్లపై తమ బెంగళూరు జోనల్ ఆఫీసు ఫిర్యాదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ పేరిట విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరించిన మింత్రా, దాని అనుబంధ కంపెనీలు మలీ్ట–బ్రాండ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. కంపెనీ సింహ భాగం ఉత్పత్తులను వెక్టార్ ఈ–కామర్స్ సంస్థకు విక్రయిస్తోండగా, సదరు కంపెనీ అంతిమంగా కస్టమర్లకు రిటైల్గా విక్రయిస్తోందని ఈడీ వివరించింది. ఈ రెండు సంస్థలూ ఒకే గ్రూప్లో భాగమని తెలిపింది. మరోవైపు, చట్టాలను తాము గౌరవిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని మింత్రా ప్రతినిధి తెలిపారు. డిజిటల్ కామర్స్ ద్వారా దుస్తుల పరిశ్రమకు సాధికారత కలి్పంచడం ద్వారా దేశ నిర్మాణానికి కంపెనీ తన వంతు తోడ్పాటు అందిస్తోందన్నారు. ప్రస్తు నిబంధనల ప్రకారం మార్కెట్ప్లేస్ విధానంలో కార్యకలాపాలు సాగించే కంపెనీల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులున్నాయి. 2007లో ఏర్పాటైన మింత్రా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ గ్రూప్లో భాగంగా ఉంది. -
తిలక్నగర్ చేతికి ఇంపీరియల్ బ్లూ
ముంబై: దేశీ లిక్కర్ కంపెనీ తిలక్నగర్ ఇండస్ట్రీస్ తాజాగా సుప్రసిద్ధ విస్కీ బ్రాండ్ ఇంపీరియల్ బ్లూను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఫ్రెంచ్ లిక్కర్ దిగ్గజం దేశీ యూనిట్ పెర్నాడ్ రికార్డ్ ఇండియాతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ ప్రకారం రూ. 4,150 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో కొనుగోలు చేయనుంది. దీనిలో రూ. 282 కోట్లు లావాదేవీ ముగిసిన నాలుగేళ్ల తదుపరి చెల్లించేందుకు వీలుంది. డీల్ వివరాలను రెండు సంస్థలూ వెల్లడించాయి. కాగా.. ఈ డీల్ ద్వారా పాప్యులర్ బ్రాందీ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ను ఉత్పత్తి చేసే తిలక్నగర్ విస్కీ విభాగంలోనూ సుప్రసిద్ధ బ్రాండ్ను సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) విభాగంలో రెండు భారీ బ్రాండ్లను విక్రయించేందుకు వీలు చిక్కనుంది. అమ్మకాల పరిమాణంరీత్యా ఇంపీరియల్ బ్లూ దేశీయంగా మూడో పెద్ద విస్కీ బ్రాండ్గా నిలుస్తోంది. గతేడాది(2024–25) రూ. 3,067 కోట్ల అమ్మకాలు సాధించింది. రెండు సొంత యూనిట్లు, బాట్లింగ్ సహతయారీ సర్వీసులు డీల్లో భాగంకానున్నాయి. షేరు పరుగు..కొనుగోలు వార్తల నేపథ్యంలో తిలక్నగర్ ఇండస్ట్రీస్ షేరు గత కొద్ది రోజులుగా బలపడుతూ వస్తోంది. తాజాగా బీఎస్ఈలో 0.7 శాతం లాభపడి రూ. 473 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 30 శాతంపైగా లాభపడటం గమనార్హం! ఈ ఏప్రిల్ 7న రూ. 205 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకిన షేరు మంగళవారానికల్లా(22న) రూ. 488 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది!! -
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 9 శాతం ఎగసి రూ. 6,921 కోట్లను తాకింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 6,368 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 42,279 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 39,315 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 5,189 కోట్ల నుంచి రూ. 5,173 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. 1–3 శాతం వృద్ధి పూర్తి ఏడాదికి ఆదాయంలో స్థిర కరెన్సీ ప్రాతిపదికన 1–3 శాతం పురోగతి సాధించగలమని ఇన్ఫోసిస్ తాజాగా అంచనా (గైడెన్స్) వేసింది. తద్వారా గతంలో ప్రకటించిన 0–3 శాతం గైడెన్స్ను స్వల్పంగా మెరుగుపరచింది. 20–22 శాతం స్థాయిలో నిర్వహణ మార్జిన్లు సాధించగలమన్న గత అంచనాలను కొనసాగించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం వృద్ధితో రూ. 8,803 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 21.1 శాతం నుంచి 20.8 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఫ్రీ క్యాష్ఫ్లో 18 శాతం తక్కువగా రూ. 7,533 కోట్లకు చేరింది. విభాగాలవారీగా.. ఇన్ఫోసిస్ క్యూ1 ఆదాయంలో ఫైనాన్షియల్ సరీ్వసుల వాటా 28 శాతం కాగా.. తయారీ 16 శాతం, రిటైల్ 13.4 శాతం చొప్పున ఆక్రమించాయి. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా నుంచి ఆదాయంలో దాదాపు 57 శాతం సమకూరింది. గత క్యూ1లో ఇది 59 శాతంకాగా.. యూరప్ వాటా 32 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 28 శాతమే. గత కొన్ని త్రైమాసికాలుగా యూరప్లో బలమైన వృద్ధిని సాధిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్వో జయేష్ ఎస్. పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం యూరప్లో చేపట్టిన పెట్టుబడుల ఫలితమిదని తెలియజేశారు. అయితే ఇప్పటికీ యూఎస్ అతిపెద్ద మార్కెట్గా నిలుస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో 0.3 శాతం బలపడి రూ. 1,574 వద్ద ముగిసింది.క్యూ1లో ఇతర విశేషాలు.. → 3.8 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. వీటిలో 55 శాతం కొత్తగా పొందినవే. → 210 మంది ఉద్యోగులను జత కలుపుకుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 3,23,788కు చేరింది. → గతంలో ప్రకటించినట్లుగా పూర్తి ఏడాదిలో 20,000 మంది ఫ్రెషర్స్ నియామకం. → ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు దాదాపు యథాతథంగా 14.4 శాతంగా నమోదైంది. -
2 రోజుల్లో రూ.2 వేల కోట్లు.. ‘క్విక్’ కుబేరుడు!
ఎటర్నల్ (జొమాటో) వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) నికర సంపద అమాంతం పెరిగిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.2,000 కోట్లు పెరిగింది. ఎటర్నల్ క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ లో కనిపించిన గణనీయమైన వృద్ధిని ఇన్వెస్టర్లు స్వాగతించడంతో, ఎటర్నల్ షేర్లు రెండు రోజుల్లో 21 శాతానికి పైగా పెరిగాయి. ఎన్ఎస్ఈలో తాజా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ .311.60 ను కూడా తాకాయి.సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అయిన 42 ఏళ్ల దీపిందర్ గోయల్ ఎటర్నల్ కంపెనీలో తనకున్న 3.83 శాతం వాటా కారణంగా కొత్తతరం కంపెనీలో తన వాటా విలువ రూ.11,515 కోట్లకు పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఐఐటీయన్ నికర సంపద 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది.విప్రో, టాటా మోటార్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల కంటే ఎటర్నల్ షేర్లు రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటాయి. ఎటర్నల్ షేర్ల జోరు ప్రత్యర్థి స్విగ్గీపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఆరోజు ఆ కంపెనీ షేరు 7 శాతానికి పైగా పెరిగింది.నెట్ ఆర్డర్ వ్యాల్యూ (ఎన్ఓవీ) పరంగా బ్లింకిట్ ఇప్పుడు జొమాటో కంటే పెద్దది కావడంతో టాప్ బ్రోకరేజీ సంస్థలు ఇప్పుడు రూ.400పై దృష్టి సారించాయి. రూ.400 టార్గెట్ ధరతో ఎటర్నల్ను బైకి అప్ గ్రేడ్ చేస్తూ జెఫరీస్ అత్యంత దూకుడుగా వ్యవహరించింది. పోటీ ముప్పును అతిగా అంచనా వేసినట్లు కూడా అంగీకరించింది.దీపిందర్ గురించి..పంజాబ్లోని ముక్త్సర్లో 1983 జనవరి 26న జన్మించిన దీపిందర్ గోయల్.. ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్లో బీటెక్ పూర్తి చేశారు. 2008లో ఫుడీబే (Foodiebay) అనే వెబ్సైట్తో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రయాణం, తర్వాత జొమాటోగా (Zomato)గా మారింది. దీపిందర్ వ్యూహాత్మక నిర్ణయాలతో జొమాటో దేశ విదేశాల్లో విస్తరించింది. 2022లో బ్లింకిట్ (Blinkit) అనే క్విక్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసి, ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని చూపించారు. 2025లో జొమాటో పేరును ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Limited)గా మార్చారు. -
2032 నాటికి 226 విమానాలు..
విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉంది. 2032 నాటికి 226 విమానాలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్షికంగా సర్వీసుల సామర్థ్యాన్ని 25–30 శాతం మేర పెంచుకోవాలని నిర్దేశించుకుంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుర్ గోయల్ ఈ విషయాలు తెలిపారు.2022 ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ దేశీయంగా 23, అంతర్జాతీయంగా 5 గమ్యస్థానాలకు ఫ్లైట్లు నడుపుతోంది. కంపెనీ దగ్గర ప్రస్తుతం 30 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో అయిదు కొత్త విమానాలు జత కానున్నాయి. త్వరలోనే వ్యయాలను మరింతగా తగ్గించుకుని, లాభాల్లోకి మళ్లగలమని అంకుర్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎయిర్లైన్ మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో 49% పెరుగుదలను నమోదు చేసింది . పరిశ్రమ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆకాశ ఎయిర్ ఏఎస్కే (అవెలబుల్ సీట్ కిలోమీటర్స్)కి యూనిట్ ఖర్చును (ఇంధనం మినహా) 7% తగ్గించగలిగింది. అయితే ఎబిటార్ (Ebitdar) మార్జిన్లు 50% పెరిగాయి. వడ్డీ, పన్నులు , తరుగుదల, రుణ విమోచన, అద్దె ఖర్చులు మినహాయించక ముందు ఆదాయాలను ఎబిటార్ సూచిస్తుంది. విమానయాన పరిశ్రమలో కార్యాచరణ పనితీరుకు కీలకమైన కొలమానంగా దీన్ని చూస్తారు. -
హైదరాబాద్ కంపెనీ.. రూ.1,000 కోట్ల పెట్టుబడులు
గ్లాస్ కంటైనర్ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్ప్యాక్ సంస్థ కొత్తగా అల్యూమినియం క్యాన్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్లో కొత్త ప్లాంటుపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. రెండు దశలుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ సీఎండీ సందీప్ సోమానీ తెలిపారు.ఇది తొలుత 95 కోట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 2028 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. దీన్ని 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 160 కోట్లకు పెంచుకోనున్నట్లు సందీప్ తెలిపారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 41%పెరిగి రూ. 63 కోట్ల నుంచి రూ. 89 కోట్లకు చేరింది.మెరిల్లో ఏడీఐఏ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులుఅబుదాబీ ఇన్వెస్ట్మెంట్ ఆథారిటీ(ఏడీఐఏ), భారత్కు చెందిన మెడికల్ డివైజెస్ తయారీ సంస్థ మైక్రో లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(మెరిల్)లో 200 మిలియన్ డాలర్ల(రూ.1,670 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో మెరిల్లో ఏడీఐఏకు 3% వాటా లభించనుంది.తద్వారా మెరిల్ మార్కెట్ విలువ 6.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.56,859 కోట్లు)చేరుతుందని అంచనా. పెట్టుబడి నిధులను వ్యాపార విస్తరణ, పరిశోధన–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు వినియోగించుకుంటామని మెరిల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ తెలిపారు. గుజరాత్లోని వాపి కేంద్రంగా పనిచేసే మెరిల్ సంస్థ... గుండె సంబంధిత పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు వంటి వైద్య పరికరాలు తయారు చేస్తుంది. -
ఐకియా ఇండియా కొత్త సీఈవోగా ప్యాట్రిక్ ఆంటోనీ
హోమ్ ఫర్నిషింగ్స్ దిగ్గజం ఐకియా ఇండియా కొత్త సీఈవోగా ప్యాట్రిక్ ఆంటోనీ నియమితులయ్యారు. ఆగస్టు నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. కంట్రీ రిటైల్ మేనేజర్, చీఫ్ సస్టైనబిలిటీ మేనేజర్గా (సీఎస్వో) కూడా ఆయన వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది.ప్రస్తుత కంట్రీ రిటైల్ మేనేజర్, సీఎస్వో సుసాన్ పల్వరర్ రాజీనామా చేయడంతో ఆంటోనీ నియమితులయ్యారు. ఐకియాలో సుసాన్ సుమారు 28 ఏళ్లు పనిచేశారు. అయిదేళ్ల పాటు డిప్యుటీ సీఈవోగా కూడా వ్యవహరించారు. 2018లో హైదరాబాద్లో తొలి స్టోర్ ప్రారంభించిన ఐకియా ప్రస్తుతం రెండో విడత విస్తరణపై దృష్టి పెడుతోంది. -
చందా కొచ్చర్పై ఆరోపణలు.. నిజం బట్టబయలు
వీడియోకాన్ గ్రూపునకు రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినందుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ రూ.64 కోట్లు లంచం తీసుకున్నట్లు తేలింది. అప్పిలేట్ ట్రిబ్యునల్ జులై 3న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. వీడియోకాన్కు సంబంధించిన కంపెనీ ద్వారా చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ నుంచి ఈ డబ్బును తరలించినట్లు ట్రిబ్యునల్ తెలిపింది.ఈ చెల్లింపు క్విడ్ ప్రోకో(పరస్పర ప్రయోజనాలు) కేసు అని ట్రిబ్యునల్ పేర్కొంది. దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బలం చేకూరింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 కింద నమోదైన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, వాంగ్మూలాలను ఈడీ అందించిందని, వీటిని చట్టపరంగా ఆమోదించినట్లు అప్పిలేట్ తెలిపింది. రుణ ఆమోదం కోసం ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్గత నిబంధనలను ఉల్లంఘించించారని ఇవి స్పష్టంగా చూపుతున్నట్లు పేర్కొంది.వీడియోకాన్ గ్రూప్ కంపెనీ ఎస్ఈపీఎల్ నుంచి దీపక్ కొచ్చర్ నేతృత్వంలోని నూపవర్ రెన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఆర్పీఎల్)కు రూ.64 కోట్లు పంపినట్లు ట్రిబ్యునల్ వివరించింది. తర్వాతి రోజే వీడియోకాన్కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు తేలింది. ఎన్ఆర్పీఎల్ యాజమాన్య బాధ్యతలు మొదట వీడియోకాన్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్ వద్ద ఉన్నట్లు చూపించినప్పటికీ, నిజమైన నియంత్రణ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన దీపక్ కొచ్చర్ వద్ద ఉందని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. రుణాన్ని ఆమోదించేటప్పుడు చందా కొచ్చర్ ఈ సంబంధాలను ప్రకటించనందున నేరానికి పాల్పడినట్లు స్పష్టమవుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..చందా కొచ్చర్, ఆమె కుటుంబానికి చెందిన అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయడానికి అనుమతిస్తూ 2020 నవంబర్లో అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన తీర్పును ట్రిబ్యునల్ తప్పుబట్టింది. ఆస్తులకు సంబంధించి తగిన ఆధారాలు లేవని అథారిటీ గుర్తించింది. కానీ ట్రిబ్యునల్ దీన్ని తీవ్రంగా విభేదించింది. అప్పటి అథారిటీ కీలక విషయాలను విస్మరించిందని పేర్కొంది. ‘న్యాయనిర్ణేత కీలకమైన భౌతిక వాస్తవాలను విస్మరించి, రికార్డులకు విరుద్ధంగా నిర్ధారణకు వచ్చింది. అందువల్ల, దాని ఫలితాలను మేము సమర్థించలేం’ అని ట్రిబ్యునల్ తెలిపింది. -
ఐపీవోకు మిల్కీ మిస్ట్ డెయిరీ
డెయిరీ ప్రొడక్టుల కంపెనీ మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. అనుమతుల కోసం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.1,785 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 250 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 2,035 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది.ఇదీ చదవండి: ఐఎంఎఫ్కు గీతా గోపీనాథ్ గుడ్బైఈక్విటీ జారీ నిధుల్లో రూ. 750 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 414 కోట్లు పెరుందురై ప్లాంట్ విస్తరణ, ఆధునీకరణకు వినియోగించనుంది. విస్తరణలో భాగంగా వే ప్రొటీన్ కాన్సన్ట్రేట్, యోగర్ట్, క్రీమ్ చీజ్ తయారీ యూనిట్లను నెలకొల్పనుంది. ఈ బాటలో మరో రూ. 129 కోట్లు విసీ కూలర్స్, ఐస్క్రీమ్ ఫ్రీజర్స్, చాకొలెట్ కూలర్స్ తదితరాల ఏర్పాటుకు వెచ్చించనుంది. తమిళనాడులోని ఈరోడ్లో ప్రారంభమైన కంపెనీ పనీర్, చీజ్, యోగర్ట్, బటర్, నెయ్యి తదితర వివిధ డెయిరీ ప్రొడక్టులను రూపొందించి విక్రయిస్తోంది. గతేడాది(2024–25) రూ. 2,349 కోట్ల ఆదాయం, రూ. 310 కోట్ల నిర్వహణ లాభం (ఇబిటా) సాధించింది. -
ఐఎంఎఫ్కు గీతా గోపీనాథ్ గుడ్బై
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు డిప్యూటీ ఎండీగా వ్యవహరిస్తున్న భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. తాను హార్వర్డ్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రాఫెసర్గా తిరిగి వెళ్లనున్నట్టు ఆమె ప్రకటించారు. సెప్టెంబర్ 1న కొత్త బాధ్యతలను ఆమె స్వీకరించనున్నారు. ‘ఐఎంఎఫ్లో ఏడేళ్ల అద్భుత కాలం తర్వాత బోధనా వృత్తిలోకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను’అని ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు.ఐఎంఎఫ్ చరిత్రలో మొదటి మహిళా ముఖ్య ఆర్థికవేత్తగానే కాదు, మొదటి డిప్యూటీ ఎండీగా గోపీనాథ్ పనిచేసి చరిత్ర సృష్టించడం గమనార్హం. ఐఎంఎఫ్లో సేవల పట్ల గీతా గోపీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. అసాధారణ సవాళ్లతో కూడిన సమయంలో పనిచేయాల్సి రావడం జీవితంలో ఒక్కసారి దక్కే అవకాశంగా పేర్కొన్నారు. ‘అధ్యాపక మూలాలాల్లోకి తిరిగి వెళుతున్నాను. అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారంగా పరిశోధనలపై దృష్టి సారించాలని అనుకుంటున్నాను. తదుపరి తరం ఆర్థికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను’అని గోపీనాథ్ తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.ఇదీ చదవండి: రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలాగోపీనాథ్ 2019లో ఐఎంఎఫ్లో ముఖ్య ఆర్థికవేత్తగా చేరారు. 2022 జనవరిలో ఐఎంఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ పదవి సృష్టించి ఆ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఐఎంఎఫ్కు ముందు హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టడీస్, ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేయడం గమనార్హం. గోపీనాథ్ అద్భుతమైన, అసాధారణ నేత అంటూ ఆమె సేవలను ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జీవా కొనియాడారు. -
భద్రత తక్కువ.. ప్రచారం ఎక్కువ
దేశీయంగా చాలా మటుకు విమానయాన సంస్థలు భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా వెచ్చి స్తున్నాయని అత్యధిక శాతం విమాన ప్రయాణికులు భావిస్తున్నారు. ఈ విషయంపై లోకల్సర్కిల్స్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 76 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా టేకాఫ్ సమయంలోనో, ల్యాండింగ్లోనో లేదా విమానంలోనో ఏదో ఒక సమస్య ఎదుర్కొన్నట్లు 64 శాతం మంది తెలిపారు. దేశవ్యాప్తంగా 322 జిల్లాల నుంచి 44,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.‘భారత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎయిర్లైన్స్, భద్రత కన్నా పబ్లిసిటీకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయని భావిస్తున్నారా’ అనే ప్రశ్నకు స్పందించిన 26,696 మంది ప్రయాణికుల్లో 43% మంది ‘అవును. అన్ని సంస్థలు అలాగే ఉన్నాయి’ అని, 33% మంది ‘అవును. కొన్ని సంస్థలే అలా ఉన్నాయి’ అని, 11% మంది ‘ఏ కంపెనీ కూడా అలా లేదు’ అని చెప్పారు. 13 శాతం మంది మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.సూ్థలంగా చెప్పాలంటే చాలా మటుకు ఎయిర్లైన్స్ భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నట్లు వెల్లడైందని లోకల్సర్కిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 63% మంది పురుషులు కాగా, 37% మంది మహిళలు. వీరిలో 46% మంది ప్రథమ శ్రేణి నగరాలకు చెందినవారు. 25% మంది ద్వితీయ శ్రేణి నగరాలకు, మిగతా 29% మంది తృతీయ, చతుర్థ శ్రేణి.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. పెరుగుతున్న ఉదంతాలు..ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గత నెల టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడంతో, 241 మంది ప్రయాణికులు, ఇతరత్రా 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రాష్పై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విచారణ జరిపి, ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది.మరోవైపు, సోమవారం నాడు కొచ్చి–ముంబై ఎయిరిండియా ఫ్లయిట్, ల్యాండింగ్ సమయంలో రన్వే మీద నుంచి పక్కకు జారిపోయిన ఘటనలో ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదే రోజున సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ–కోల్కతా విమానాన్ని ఎయిరిండియా ఆఖరు నిమిషంలో రద్దు చేసింది. ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా గోవా నుంచి బయలుదేరిన ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. -
ఉద్యోగాలకు టాప్.. టాటా గ్రూప్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉద్యోగాలకు అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్లుగా టాటా గ్రూప్, గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ నిలిచాయి. ర్యాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2025 నివేదికలో టాప్ 3 స్థానాలను దక్కించుకున్నాయి. దీని ప్రకారం భారత్లో ఉద్యోగులు వర్క్–లైఫ్ సమతుల్యత, సమానత్వం, ఆకర్షణీయమైన జీతభత్యాలను కోరుకుంటున్నారు. అలాంటి కంపెనీలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరి్థక ఆరోగ్యం, కెరియర్ పురోగతి అవకాశాలు, ప్రతిష్ట అంశాల్లో టాటా గ్రూప్ అత్యధిక స్కోరుతో అగ్రస్థానం దక్కించుకుంది.గూగుల్ ఇండియా రెండో స్థానంలో, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇక అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 ఎంప్లాయర్ బ్రాండ్స్ 2025 జాబితాలో శాంసంగ్ ఇండియా (4), జేపీమోర్గాన్ చేజ్ (5), ఐబీఎం (6), విప్రో (7), రిలయన్స్ ఇండస్ట్రీస్ (8), డెల్ టెక్నాలజీస్ (9), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (10) సంస్థలు ఉన్నాయి. జాబితాలో ఎస్బీఐ ఏకైక భారతీయ బహుళజాతి ప్రభుత్వ రంగ బ్యాంకు కావడం గమనార్హం. ‘సంప్రదాయ ఉద్యోగాలతో నేటి ఉద్యోగులు సంతృప్తిపడటం లేదని 2025 నివేదికతో తేటతెల్లమైంది. వారు నిర్దిష్ట లక్ష్యం, సమానత్వం, అర్థవంతమైన వృద్ధి, వర్క్–లైఫ్ మధ్య సమతుల్యతను కోరుకుంటున్నారు’ అని ర్యాండ్స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. ఉద్యోగాలు మారిపోవాలనే ధోరణి కూడా యువ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తుండటమనేది కంపెనీలకు మేల్కొలుపులాంటిదని ఆయన చెప్పారు.నివేదికలో మరిన్ని విశేషాలు.. ⇒ 34 మార్కెట్లలో 1,70,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 3,500 మంది భారత్కి చెందిన వారు ఉన్నారు. ⇒ జీతానికి మించిన ప్రయోజనాలను ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిగతంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా కంపెనీల్లో వాతావరణం ఉండాలని ఆశిస్తున్నారు. ⇒ 2025 ప్రథమార్ధంలో 47% మంది భారతీయ ఉద్యోగులు, ఉద్యోగం మారాలని ప్రణాళికలు వేసుకున్నారు. జెన్ జెడ్ (51%), మిలీనియల్స్లో (50%) ఈ ఆలోచన బలంగా ఉంది. ⇒ ఏఐ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయ ఉద్యోగుల్లో 61 శాతం మంది దీన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. మిలీనియల్స్ అత్యంత యాక్టివ్ యూజర్లుగా ఉంటున్నారు. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య 13 శాతం పెరిగింది. ఏఐ ప్రభావాలపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కృత్రిమ మేథ తమ పనిపై గణనీయంగా ప్రభావం చూపుతోందని 38 శాతం మంది ఉద్యోగుల్లో అభిప్రాయం నెలకొంది. -
పేటీఎం పంట పండింది!
డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.122.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కొన్ని త్రైమాసికాల నుంచి నష్టాలను పోస్ట్ చేస్తోన్న సంస్థ చాలా రోజుల తర్వాత లాభాలను రిపోర్ట్ చేసింది. కంపెనీ ఎంప్లాయ్ స్టాక్ ఆపరేషన్ ప్లాన్(ఇఎస్ఓపీ)లో గణనీయమైన సర్దుబాట్ల వల్ల ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది.కంపెనీ వార్షికంగా 28% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ.1,917 కోట్లు సమకూరినట్లు చెప్పింది. ఇది దాని చెల్లింపులు, ఆర్థిక సేవల విభాగాల్లో స్థిరమైన వృద్ధిని ప్రతిబింబిస్తుంది. 2021లో పబ్లిక్ లిస్టింగ్ తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్కు ఇది మెరుగైన క్వార్టర్లలో ఒకటి. కొన్నేళ్లుగా వస్తున్న నష్టాల తర్వాత వ్యయ నియంత్రణ, ప్రధాన సర్వీసుల్లో పెరుగుతున్న మానిటైజేషన్తో కంపెనీ స్థిరపడుతున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: ప్రభుత్వ సర్వీసులకు ఓపెన్ఏఐతో భాగస్వామ్యంతక్కువ నిర్వహణ ఖర్చులు, మర్చంట్ సబ్ స్క్రిప్షన్లు, డివైజ్ ఇన్స్టలేషన్ నిరంతర విస్తరణ లాభాలకు ఎంతో తోడ్పడిందని కంపెనీ తెలిపింది. పేటీఎం చెల్లింపుల మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవల పంపిణీ నుంచి బలమైన సహకారం లభించినట్లు చెప్పింది. ఎగ్జిక్యూటివ్ పరిహారం, ఈఎస్ఓపీ గవర్నెన్స్కు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి వన్ 97 కమ్యూనికేషన్స్ ఇప్పటికే చర్యలు చేపట్టింది. కంపెనీ ఎండీ, సీఈఓ విజయ్ శేఖర్ శర్మకు ఇచ్చిన 21 మిలియన్ స్టాక్ ఆప్షన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
ఆర్కామ్, అనిల్ అంబానీపై ‘ఫ్రాడ్’ ముద్ర
రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ సంస్థ ప్రమోటర్ అనిల్ అంబానీని ‘మోసపూరితం(ఫ్రాడ్)’గా ఎస్బీఐ జూన్ 13న గుర్తించినట్టు లోక్సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పకంజ్ చౌదరి తెలిపారు. జూన్ 24న ఆర్బీఐకి ఫ్రాడ్ వర్గీకరణ గురించి ఎస్బీఐ నివేదించిందని.. దీనిపై సీబీఐ వద్ద కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఇదీ చదవండి: జేన్ స్ట్రీట్పై సెబీ నిషేధం ఎత్తివేతఫ్రాడ్గా గుర్తించిన విషయాన్ని ఆర్కామ్ బీఎస్ఈకి జూలై 1న వెల్లడించడం గమనార్హం. ఆర్కామ్ ప్రస్తుతం దివాలా పరిష్కార చట్టం కింద చర్యలను ఎదుర్కొంటోంది. ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ. 31వేల కోట్లకు పైగా రుణం తీసుకోగా.. ఈ నిధులను వివిధ గ్రూప్ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ ఆర్కామ్కు తెలియజేయడం గమనార్హం. -
జేన్ స్ట్రీట్పై సెబీ నిషేధం ఎత్తివేత
క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా యూఎస్ ప్రొప్రయిటరీ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్పై నిషేధాన్ని ఎత్తివేసింది. తద్వారా సెక్యూరిటీస్ మార్కెట్లో తిరిగి లావాదేవీలు నిర్వహించేందుకు అనుమతించింది. ఎఫ్అండ్వో లావాదేవీల్లో మార్కెట్ మ్యానిప్యులేషన్కు పాల్పడిందంటూ ఈ నెల 3న జారీ చేసిన మధ్యంతర ఆదేశాలలో జేన్ స్ట్రీట్పై సెబీ నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: టైర్.. రయ్ రయ్!నిషేధం విధించిన సమయంలో దాదాపు రూ.4,843 కోట్ల జరిమానా సైతం చెల్లించాలని ఆదేశించింది. అయితే సెబీ సూచించిన విధంగా ఎస్క్రో ఖాతాలో గత వారమే జేన్ స్ట్రీట్ రూ.4,843 కోట్లకుపైగా జమ చేయడంతో తాజాగా సెబీ నిషేధాన్ని ఎత్తివేసింది. కాగా.. ఇకపై అక్రమంగా లేదా మ్యానిప్యులేటివ్గా లేదా మోసపూరితంగా లావాదేవీలు చేపడితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చర్యలు తీసుకోనున్నట్లు సెబీ హెచ్చరించింది. -
టైర్.. రయ్ రయ్!
దేశీ టైర్ల తయారీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 7–8 శాతం వరకు పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముఖ్యంగా పాత టైర్లను మార్చడం రూపంలోనే సగం విక్రయాలు ఉంటాయని తెలిపింది. అసలు తయారీదారుల (ఓఈఎం) వాటా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. మొత్తం మీద ఈ విభాగంలో వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ప్రీమియమైజేషన్ పెరుగుతుండడం అమ్మకాలకు ఊతమిస్తుందని అంచనా వేసింది.అయితే వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన తరుణంలో చైనా తయారీదారులు చౌక రేట్లపై టైర్లను భారత్ మార్కెట్లోకి కుమ్మరించే సవాళ్లు పొంచి ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. స్థిరమైన ముడి సరుకుల ధరలు, సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించుకోవడం ఫలితంగా టైర్ల పరిశ్రమ నిర్వహణ లాభం 13–13.5 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేసింది. లీన్ బ్యాలన్స్ షీట్లు (నిల్వలు తగ్గించుకోవడం), మూలధన వ్యయాలను క్రమంగా నిర్వహించడం వంటివి ఈ రంగం రుణ పరపతిని స్థిరంగా ఉంచుతాయని తెలిపింది. దేశంలో అన్ని రకాల వాహన టైర్ల అమ్మకాల్లో 85 శాతం వాటా కలిగిన టాప్–6 కంపెనీలను పరిశీలించించినప్పుడు ఇదే తెలుస్తున్నట్టు పేర్కొంది. మొత్తం డిమాండ్లో 75 శాతం దేశీ మార్కెట్ నుంచి, మిగిలినది ఎగుమతుల రూపంలో ఉంటుందని అంచనా వేసింది. ఇదీ చదవండి: అనధికార ఆస్తులకు బీ-ఖాతాలు జారీటారిఫ్ సవాళ్లు..ఎగుమతుల విషయంలో రిస్క్లను క్రిసిల్ రేటింగ్స్ ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ నుంచి టైర్ల ఎగుమతుల్లో 17 శాతం అమెరికాకే వెళ్లాయని.. పరిశ్రమ మొత్తం పరిమాణంలో ఇది 4–5 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు పోటీపరమైన సానుకూలతలు కనుమరుగవుతాయని పేర్కొంది. చైనాపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో.. అదనపు సరఫరాలు ధరల పరంగా సున్నిత మార్కెట్ అయిన భారత్లోకి మళ్లే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడింది. చౌక దిగుమతులకు కళ్లెం వేసేందుకు వీలుగా.. చైనా నుంచి వచ్చే భారీ ట్రక్, బస్ రేడియల్ టైర్లపై యాంటీ డంపింగ్, కౌంటర్ వేయిలింగ్ డ్యూటీలను కేంద్రం విధించడాన్ని గుర్తు చేసింది. కానీ, ఇతర విభాగాల్లో చౌక దిగుతులు ఒత్తిళ్లకు దారితీయొచ్చని పేర్కొంది. -
దక్షిణాదిలో జీసీసీల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అత్యధిక వాటా దక్షిణాది నగరాలదే ఉంటోంది. మొత్తం జీసీసీల్లో 55 శాతం సెంటర్లు (992) బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ నివేదిక ప్రకారం భారత్లో సుమారు 1,700 జీసీసీలు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 3,200 పైగా జీసీసీల్లో ఇవి దాదాపు 53 శాతం. ఇతర దేశాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండటం, సుశిక్షితులైన నిపుణుల లభ్యత, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, పురోగామి పాలసీలు, వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు మొదలైనవి జీసీసీల ఏర్పాటు సానుకూలాంశాలుగా ఉంటున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాస్ రావు తెలిపారు. ఏ జీసీసీ అయినా దీర్ఘకాలికంగా రాణించాలంటే సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → దేశీయంగా ఉన్న మొత్తం జీసీసీల్లో 94 శాతం సెంటర్లు టాప్ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, పుణెలోనే ఉన్నాయి. → మొత్తం జీసీసీల్లో 50 శాతం వాటా ఐటీ–ఐటీఈఎస్ రంగానిది ఉండగా, 17 శాతం వాటాతో బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా) తర్వాత స్థానంలో ఉంది. → నగరాలవారీగా చూస్తే బెంగళూరులో 487 జీసీసీలు ఉన్నాయి. ఇది మొత్తం సెంటర్స్లో 29 శాతం. → హైదరాబాద్లో 273, ఢిల్లీ–ఎన్సీఆర్లో 272, ముంబైలో 207, పుణెలో 178, చెన్నైలో 162 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ఉన్నాయి. -
ఉపాధి ‘కొత్త’పుంతలు! మే నెలలో ఆల్టైమ్ రికార్డు...
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్వో) సంస్థ కింద నికర సభ్యుల చేరిక కొత్త రికార్డులను తాకింది. ఈ ఏడాది మే నెలలో 20.06 లక్షలకు చేరుకుంది. ఇది ఆల్టైమ్ రికార్డు. ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే మేలో 4.79 శాతం అధిక ఉపాధి నెలకొనగా, గతేడాది మేతో పోల్చి చూస్తే 3 శాతం వృద్ధి సాధ్యమైంది. మే నెలలో మొత్తం నికర సభ్యుల్లో 9.42 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందిన వారు కావడం గమనార్హం. ఏప్రిల్తో పోల్చి చూస్తే 11 శాతం అధికం. మేనెల పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ సోమవారం విడుదల చేసింది. దేశ సంఘటిత రంగంలో ఉపాధి కల్పన బలంగా పెరుగుతోందనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి సభ్యుల చేరిక స్థిరంగా పెరుగుతూ వస్తుండడాన్ని గమనించొచ్చు. ఇతర ముఖ్యాంశాలు..→ కొత్తగా చేరిన సభ్యుల్లో 5.60 లక్షల మంది 18–25 ఏళ్ల వయసులోని వారే. అంటే మొత్తం కొత్త సభ్యుల్లో వీరు 60%గా ఉన్నారు. ఏప్రిల్ నెలతో పోల్చి చూస్తే 14.53 శాతం పెరిగారు. → మేలో 18–25 ఏళ్ల వయసు నుంచి నికర సభ్యుల చేరిక 8.73 లక్షలుగా ఉంది. → 16.11 లక్షల మంది సభ్యులు లోగడ ఒక సంస్థలో ఉద్యోగం మానివేసి, మే నెలలో మరో సంస్థలో కొత్తగా చేరారు. ఏప్రిల్ నెలతో పోల్చి చూస్తే 2 శాతం, క్రితం ఏడాది మే నెలతో పోల్చి చూస్తే 14 శాతం వృద్ధి నమోదైంది. → ఈపీఎఫ్ఓలో కొత్త మహిళా సభ్యుల చేరిక 2.62 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెల కంటే ఇది 7 శాతం అధికం కాగా, గతేడాది మే నెలతో పోల్చి చూస్తే 6 శాతం పెరిగారు. → మే నెలలో మహిళా సభ్యుల నికర చేరిక 4.25 లక్షలుగా ఉంది. ఏప్రిల్ నెల కంటే 7.54 శాతం పెరిగింది. → నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచి 20.33 శాతం మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హరియాణా, ఢిల్లీ, యూపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి 5 శాతానికిపైనే (విడిగా ఒక్కో రాష్ట్రం) సభ్యుల చేరిక నమోదైంది. -
దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ సెంటర్
చెన్నై: ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఒక ప్రధాన అడుగు పడింది. దేశంలో తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం లైఫ్ సైన్సెస్ పై దృష్టి సారించిన ఏఐ కంపెనీ అజిలిసియం, శ్రీ రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (SRIHER) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.మెరుగైన రోగ నిర్ధారణ, వ్యక్తిగతీకరించిన చికిత్స, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ కోసం ఏఐ ఆధారిత సాధనాలను అభివృద్ధి చేయడం, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, డిజిటల్ ట్విన్స్, స్మార్ట్ హాస్పిటల్ టెక్ వంటి డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ రూపొందించడం క్లినికల్ డేటా నాణ్యత, ఇంటర్ ఆపరేబిలిటీ, పరిశోధన సంసిద్ధతను మెరుగుపరచడానికి క్లీన్ హెల్త్ డేటా ఇనిషియేటివ్ను క్రియేట్ చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యాలు.ఒప్పందంలో భాగంగా ఏఐ టూల్స్, జీఎన్ఏఐ, డేటా సైన్స్, అనలిటిక్స్ వంటివి అగిలిసియం సంస్థ సమకూర్చనుండగా రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్లినికల్ డేటాసెట్లు, డొమైన్ నిపుణులు, ఆసుపత్రి వాతావరణం వంటివి కల్పించనుంది. వీటితోపాటు అకడమిక్ సహకారంలో భాగంగా హెల్త్ కేర్ లో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై సర్టిఫికేట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనుంది. ఔషధ ఆవిష్కరణ, రోగనిర్ధారణ, రోగి సంరక్షణలో భవిష్యత్తు ప్రతిభకు శిక్షణ ఇవ్వనుంది. -
‘డ్రాప్ చేసి ఇంటికి వచ్చేలోపు దుబాయ్ వెళ్లింది’
ఏటా వాహనాలు పెరుగుతుండడంతో రోడ్లపై ట్రాఫిక్జామ్ అధికమవుతోంది. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ సంఘటన పెరిగిన ట్రాఫిక్కు అద్దం పడుతోంది. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితురాలిని ఎయిర్పోర్ట్లో దింపి ఇంటికి వెళ్లాలని చూసిన ఓ యువతికి ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. దాంతో ఈమె ట్రాఫిక్ దాటుకొని ఇంటికెళ్లేలోపు తన ఫ్రెండు దుబాయ్ చేరిపోయింది. ఈ వివరాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది.కంటెంట్ క్రియేటర్లు ప్రియాంక, ఇంద్రయాణి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నా స్నేహితురాలు దుబాయ్ బయలుదేరుతుండగా బెంగళూరు విమానాశ్రయంలో డ్రాప్ చేశాను. కొద్దిసేపటికి ఆమె దుబాయ్ చేరుకున్నట్లు సమాచారం అందించింది. కానీ నేను అప్పటికీ బెంగళూరు ట్రాఫిక్లోనే చిక్కుకుపోయాను’ అని పోస్ట్ చేశారు. ‘యదార్థ సంఘటనల ఆధారంగా..’ అని హెడ్డింగ్తో పోస్ట్ చేసిన ఈ వివరాలు వైరల్గా మారాయి. ఇప్పటివరకు ఈ పోస్ట్కు 19 మిలియన్లకు పైగా వ్యూస్, మిలియన్ కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. View this post on Instagram A post shared by TRAVEL_FOODIE_GALS | Priyanka & Indrayani ❤️ (@travel_foodie_gals)దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘బెంగళూరులో కారులో 1 కి.మీ వెళితే 3 గంటలు.. కాలినడక ద్వారా వెళితే 1 కి.మీకు 10 నిమిషాలు సమయం పడుతుంది’ అని ఒక యూజర్ తెలిపారు. ‘ఇతర రాష్ట్రం నుంచి రెండు గంటలు ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన నేను.. ఇంటికి వెళ్లేందుకు ఐదు గంటలు పట్టింది’ అని మరోవక్తి చెప్పారు.ఇదీ చదవండి: ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..జనాభా పెరుగుదల, ఐటీ బూమ్కు అనుగుణంగా బెంగళూరులో మౌలిక సదుపాయాలు లేవని కొందరు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయం సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. రద్దీ సమయాల్లో, ఇంటికి తిరిగి ప్రయాణించేందుకు చాలా సమయం పడుతోంది. ఇది చాలా దేశీయ లేదా తక్కువ దూరంలో ఉన్న అంతర్జాతీయ విమానాల సమయం కంటే చాలా ఎక్కువ అనే వాదనలున్నాయి. -
బిజినెస్ స్కూల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్
హైదరాబాద్: అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అత్యంత సందడిగా జరిగింది. పీజీడీఎం 2025–27 బ్యాచ్కు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం సాగింది. అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ వై లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తి, నైతికత, అభ్యాసం వంటి గుణాలను అలవర్చుకోవాలని విద్యార్థులను కోరారు.అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ వివిధ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది. అవగాహన ఒప్పందాలు చేసుకున్న సంస్థలు డిప్లమేటిక్ క్లబ్, మీస్కూల్, ట్రిగునిటా ఎడ్టెక్, ఏఐఈఎస్ఈసీ ఉన్నాయి. ఇవి విద్యార్థులకు సాంస్కృతిక మార్పిడి, ప్రయోగాత్మక స్టార్టప్ అనుభవం, సృజనాత్మక వృత్తి మార్గాల తలుపులు తెరవనున్నాయి.ఈ సందర్భంగా అశోక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అకడమిక్ హ్యాండ్బుక్, అరోహన్ 2025 పేరుతో 30 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు. ఏ-హబ్ యాక్టివిటీలను డాక్టర్ సబిత (సీఐఓ) పరిచయం చేశారు. టీమ్ పరిచయాన్ని డీన్ డాక్టర్ స్వాతి చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అశోక్ నొముల తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన లాభాలు
ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025 ఏప్రిల్–జూన్ కాలానికి రూ.4,116 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2024 ఇదే కాలానికి ఆర్జించిన రూ.3,679 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మొత్తం ఆదాయం రూ.30,874 కోట్ల నుంచి రూ.31,791 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.26,364 కోట్ల నుంచి అధికమై రూ.27,296 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.9,412 కోట్ల నుంచి రూ.9,113 కోట్లకు దిగివచ్చింది. నిర్వహణ లాభం 11% క్షీణించి రూ.7,785 కోట్ల నుంచి రూ.6,909 కోట్లకు తగ్గింది.స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 4.54% నుంచి 3.52 శాతానికి, నికర ఎన్పీఏలు 0.90% నుంచి 0.62 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు ప్రొవిజన్ల కేటాయింపు రూ.1,651 కోట్ల నుంచి రూ.1,153 కోట్లకు తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 6.83% పుంజుకొని 9,12,214 కోట్ల నుంచి రూ.9,74,489 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో(పీసీఆర్) 116 బేసిస్ పాయింట్లు పెరిగి 93.49 శాతం నుంచి 94.65 శాతానికి చేరింది. మొత్తం వ్యాపారం 5% వృద్ధి చెంది రూ.21,08,762 కోట్ల నుంచి రూ.22,14,422 కోట్లకు ఎగసింది.సెంట్రల్ బ్యాంక్ ఫలితాలు భేష్ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు ప్రకటించింది. ఆదా యం మెరుగవడం, మొండి రుణాలు (ఎన్పీఏలు) తగ్గడంతో ఏప్రిల్–జూన్లో రూ.1,169 కోట్ల నికర లాభా న్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2024– 25) ఇదే క్యూ1 నికర లాభం రూ.880 కోట్లతో పోలి స్తే ఇది 33% అధికం. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.9,500 కోట్ల నుంచి రూ.10,374 కోట్లకు ఎగసింది.బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.8,335 కోట్ల నుంచి రూ.8,589 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం 19% పెరిగి రూ.2,304 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మెరుగవడంతో స్థూల మొండి బకాయిలు 4.54% నుంచి 3.13 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు 0.73% నుంచి 0.49 శాతానికి తగ్గాయి. స్థూల అడ్వాన్సులు 9.97% పుంజుకొని 2,50,615 కోట్ల నుంచి రూ.2,75,595 కోట్లకు చేరుకున్నాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 96.17 % నుంచి 97.02 శాతం పెరిగింది. కనీస మూలధన నిష్పత్తి 15.6% నుంచి 17.6 శాతానికి మెరుగైంది. మొత్తం వ్యాపారం 11% వృద్ధి చెంది రూ.6,35,564 కోట్ల నుంచి రూ.7,04,485 కోట్లకు ఎగసింది. -
అంచనాలు మించిన ఐసీఐసీఐ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం (స్టాండెలోన్) రూ. 12,768 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 11,059 కోట్లతో పోలిస్తే సుమారు 15 శాతం పెరిగింది. ఇది సుమారు రూ. 11,747 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 10.6 శాతం పెరిగి రూ. 19,553 కోట్ల నుంచి రూ. 21,635 కోట్లకు చేరింది. ఇది సుమారు రూ. 20,923 కోట్లుగా ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి.ట్రెజరీ కార్యకలాపాలు మినహా, ఇతరత్రా ఆదాయం 13.7 శాతం పెరిగి రూ. 7,264 కోట్లకు ఎగిసింది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.9 శాతం వృద్ధితో రూ. 13,558 కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో ఇది రూ. 11,696 కోట్లు. మొత్తం వడ్డీ ఆదాయం రూ. 38,996 కోట్ల నుంచి రూ. 42,947 కోట్లకు చేరింది. అసెట్స్ రూ.24,07,395 కోట్ల నుంచి రూ. 26,68,636 లక్షల కోట్లకు చేరాయి.తగ్గిన ఎన్పీఏలు..సమీక్షాకాలంలో బ్యాంక్ అసెట్ నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్పీఏ) 2.15 శాతం నుంచి 1.67 శాతానికి దిగి వచి్చంది. నికర ఎన్పీఏ నిష్పత్తి 0.43 శాతం నుంచి 0.41 శాతానికి గ్గింది. నికర వడ్డీ మార్జిన్ 4.41 శాతం నుంచి 4.34 శాతానికి తగ్గింది. అయితే, ప్రొవిజనింగ్ భారీగా పెరిగింది. మార్చి త్రైమాసికంలో రూ. 1,332 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్ రూ. 1,815 కోట్లకు ఎగిసింది. బ్యాంక్ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 11 శాతం పెరిగి, దాదాపు రూ. 1,427 వద్ద ఉంది.డిపాజిట్లు 12.8% అప్సమీక్షా కాలం ఆఖరు నాటికి డిపాజిట్లు 12.8 శాతం పెరిగి రూ. 16,08,517 కోట్లకు చేరాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 38.7 శాతంగా ఉంది. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 11.2 శాతం, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు 7.6 శాతం పెరిగాయి.దేశీయంగా రుణాల పోర్ట్ఫోలియో 12 శాతం పెరిగి రూ. 13,31,196 కోట్లకు చేరింది.నికర వడ్డీ మార్జిన్ 4.36 శాతం నుంచి 4.34 శాతానికి నెమ్మదించింది. వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ మినహాయించి) 13.7 శాతం వృద్ధితో రూ. 6,389 కోట్ల నుంచి రూ. 7,264 కోట్లకు చేరింది.ఫీజు ఆదాయం వార్షికంగా రూ. 5,490 కోట్ల నుంచి 7.5 శాతం వృద్ధితో రూ.5,900 కోట్లకు పెరిగింది.రిటైల్ రుణాలు వార్షికంగా 6.9 శాతం పెరిగాయి. మొత్తం లోన్ పోర్ట్ఫోలియోలో వీటి వాటా 52.2 శాతంగా ఉంది. కార్పొరేట్ పోర్ట్ఫోలియో 7.5 శాతం పెరిగింది.క్యూ1లో బ్యాంక్ కొత్తగా 83 శాఖలు ప్రారంభించింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 7,066కి, ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల సంఖ్య 13,376కి చేరుకుంది. -
నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.23,422 కోట్లు
న్యూఢిల్లీ: జీవితేతర బీమా (నాన్ లైఫ్) కంపెనీల ప్రీమియం ఆదాయం జూన్లో రూ.23,422 కోట్లుగా ఉంది. 2024 జూన్ నెల ప్రీమియం ఆదాయంతో పోల్చి చూస్తే 5.2 శాతం వృద్ధి చెందింది. కానీ, 2024 జూన్ నెలలో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థల ప్రీమియం ఆదాయం 8.4 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ‘‘1/ఎన్ నిబంధనకు మారాల్సి రావడం పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్లో వృద్ధి సింగిల్ డిజిట్కు నిదానించింది. ప్యాసింజర్ వాహన బీమా వృద్ధి ఆగిపోయింది. ఈ ప్రభావాన్ని బీమా సంస్థలు ఇతర వాణిజ్య మర్గాల రూపంలో కొంత వరకు తగ్గించుకోగలిగాయి’’అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తన నివేదికలో వివరించింది. ప్రీమియం వృద్ధి మోస్తరుగానే ఉన్నప్పటికీ 2024–25లో నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.3 లక్షల కోట్ల మార్క్ను అధిగమించినట్టు గుర్తు చేసింది. నియంత్రణపరమైన మద్దతు, ఇన్సూర్టెక్కు ఆమోదం (టెక్నాలజీ ఆధారిత బీమా సంస్థలు), డిజిటలైజేషన్ వేగవంతం కావడం, మధ్యతరగతి ప్రజలు పెరగడం అనుకూలించినట్టు తెలిపింది. వృద్ధి వేగం ‘‘బీమా ట్రినిటీకి ప్రభుత్వ పరమైన మద్దతుతో నాన్లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వృద్ధి వేగాన్ని అందుకోనుంది. రిటైల్ హెల్త్ విభాగంలో స్టాండలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు (ఒక్క ఆరోగ్య బీమా సేవలు అందించేవి) తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయి’’అని కేర్ఎడ్జ్ తెలిపింది. మోటారు బీమా వృద్ధి విషయమై రానున్న రోజుల్లో వాహన అమ్మకాలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, థర్డ్ పార్టీ బీమా టారిఫ్ల సవరణను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రతిపాదిత కాంపోజిట్ లైసెన్స్ అమల్లోకి వస్తే మధ్య కాలానికి ఈ రంగంలో పోటీతత్వం పూర్తిగా మారిపోతుందని అభిప్రాయపడింది. 1/ఎన్ నిబంధన అన్నది పాలసీలకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ఆరంభంలోనే కాకుండా.. కాలవ్యవధి మొత్తానికి సమానంగా వెల్లడించడానికి సంబంధించినది. -
యస్ బ్యాంక్ లాభం 59% అప్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 801 కోట్ల నికర లాభం ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో నమోదైన రూ. 502 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 59.4 శాతం అధికం. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం, అసెట్ క్వాలిటీ మెరుగుపడటం, వడ్డీయేతర ఆదాయం పటిష్టంగా ఉండటం, వంటి అంశాలు వరుసగా ఏడో త్రైమాసికంలోనూ లాభాలను మెరుగుపర్చుకోవడానికి దోహదపడినట్లు బ్యాంకు తెలిపింది. సమీక్షాకాలంలో యస్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 5.7 శాతం పెరిగి రూ. 2,371.5 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు పెరిగి 2.5 శాతంగా నమోదైంది. మరోవైపు, ట్రెజరీ లాభాల కారణంగా వడ్డీయేతర ఆదాయం 46.1 శాతం పెరిగి రూ. 1,752 కోట్లకు చేరింది. ప్రధానమైన ఫీజుల ఆదాయం 3 శాతం వృద్ధి చెంది రూ. 1,268 కోట్లుగా నమోదైంది. ఇందులో రిటైల్ వాటా 56.4 శాతంగా ఉంది. పటిష్టమైన పనితీరుతో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టినట్లు యస్ బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. సుమితోమో మిత్సుయి కార్పొరేషన్ బ్యాంక్ (ఎస్ఎంబీసీ) డీల్ సెపె్టంబర్ నాటికి పూర్తి కావచ్చని పేర్కొన్నారు. బ్యాంకులో 20 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఎస్ఎంబీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్తుల నాణ్యత మెరుగు→ నిర్వహణ లాభం 53.4 శాతం పెరిగి రూ. 1,358 కోట్లకు చేరింది. పన్నుయేతర ప్రొవిజన్లు 34.1 శాతం పెరిగి రూ. 284 కోట్లకు చేరాయి. → మొత్తం డిపాజిట్లు 4 శాతం పెరిగి రూ. 2,75,843 కోట్లకు చేరాయి. కమర్షియల్ బ్యాంకింగ్, మైక్రోబ్యాంకింగ్ సెగ్మెంట్లలో డిమాండ్తో రుణాలు 5 శాతం పెరిగి రూ. 2,41,024 కోట్లకు పెరిగాయి. → అసెట్ నాణ్యత స్థిరంగా ఉంది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్పీఏ) 1.6 శాతం, నికర ఎన్పీఏలు 0.3 శాతంగా ఉన్నాయి. → ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్) 80.2% మెరుగుపడ్డాయి. → సమీక్షాకాలంలో మొత్తం రూ. 1,170 కోట్ల రికవరీలు, అప్గ్రేడ్లను బ్యాంకు ప్రకటించింది. → స్లిప్పేజీలు క్రితం క్వార్టర్లో రూ. 1,223 కోట్లుగా ఉండగా, తాజాగా రూ. 1,458 కోట్లకు ఎగిశాయి. → క్యూ1లో మూడీస్, ఇక్రా తదితర ఏజెన్సీలు బ్యాంకు రేటింగ్ను అప్గ్రేడ్ చేశాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బొనాంజా!!
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ షేర్హోల్డర్లకు బంపర్ బొనాంజా ప్రకటించింది. తొలిసారిగా బోనస్ షేర్లు జారీ చేయనుంది. 1:1 నిష్పత్తిలో షేరు ఒక్కింటికి ఒక షేరు చొప్పున కేటాయించనుంది. ఇందుకోసం ఆగస్టు 27ని రికార్డు తేదీగా నిర్ణయించారు. ఇష్యూని బోర్డు ఆమోదించిన రెండు నెలల్లోగా, అంటే సెపె్టంబర్ 18లోగా బోనస్ షేర్లు క్రెడిట్ అవుతాయని బ్యాంకు వెల్లడించింది. సుమారు రూ. 766.79 కోట్ల విలువ చేసే షేర్లను బ్యాంకు జారీ చేయనుంది. జూన్ క్వార్టర్ ఆఖరు నాటికి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ. 2 లక్షల వరకు ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ గల చిన్న రిటైల్ షేర్హోల్డర్లు 36 లక్షల పైగా ఉన్నారు. వీరి వాటా సుమారు 10.32 శాతం వరకు ఉంటుంది. గతంలో 2011లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 10 ముఖ విలువ చేసే షేర్లను రూ. 2 ముఖ విలువ చేసే అయిదు షేర్లుగా విభజించింది. ఆ తర్వాత 2019లో వాటిని రూ. 1 ముఖ విలువ చేసే రెండు షేర్లుగా విడగొట్టింది. కంపెనీ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 10 శాతం పెరిగి బీఎస్ఈలో ప్రస్తుతం రూ. 1,957 వద్ద ఉంది. బీఎస్ఈ రికార్డుల ప్రకారం బ్యాంక్ ఇప్పటివరకు ఎన్నడూ బోనస్ షేర్లు ప్రకటించలేదు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 5 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ను కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. దీనికి జూలై 25 రికార్డు తేదీగా ఉంటుంది. ఆగస్టు 11న బ్యాంక్ డివిడెండ్ చెల్లిస్తుంది. 2024 మేలో రూ. 19.5 చొప్పున తుది డివిడెండ్ ఇచ్చిన బ్యాంకు, గత నెలలో రూ. 22 చొప్పున మరోసారి డివిడెండ్ చెల్లించింది. అంతకు ముందు 2022 మేలో రూ. 15.5 చొప్పున, 2023 మేలో రూ. 19 చొప్పున డివిడెండ్ ఇచి్చంది. కన్సాలిడేటెడ్ లాభం స్వల్పంగా డౌన్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 16,258 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ1లో నమోదైన రూ. 16,475 కోట్లతో పోలిస్తే స్వల్పంగా 1.31 శాతం తక్కువ. మరోవైపు, స్టాండెలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం రూ. 16,174 కోట్ల నుంచి సుమారు 12 శాతం వృద్ధితో రూ. 18,155.21 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 83,701 కోట్ల నుంచి రూ. 99,200 కోట్లకు ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మాత్రం ఆదాయం రూ. 1.17 లక్షల కోట్ల నుంచి రూ. 1.33 లక్షల కోట్లకు చేరింది.జూన్ క్వార్టర్ వివరాలు.. → సమీక్షా కాలంలో మొత్తం వ్యయాలు రూ. 59,817 కోట్ల నుంచి రూ. 63,467 కోట్లకు పెరిగాయి. → స్టాండెలోన్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 5.4 శాతం పెరిగి రూ. 31,438 కోట్లకు చేరింది. → నికర వడ్డీ మార్జిన్ 3.46 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. → నిర్వహణ వ్యయాలు రూ. 16,621 కోట్ల నుంచి రూ. 17,434 కోట్లకు పెరిగాయి. ఇందులో రూ. 6,158 కోట్ల మేర ఉద్యోగులపై వ్యయాలు, రూ. 11,276 కోట్లు ఇతరత్ర వ్యయాలు ఉన్నాయి. → మొత్తం ప్రొవిజన్లు రూ. 2,602 కోట్ల నుంచి రూ. 14,442 కోట్లకు ఎగిశాయి. ఇందులో ‘ఫ్లోటింగ్ ప్రొవిజన్’ రూ. 9,000 కోట్లు ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. → అసెట్స్ నాణ్యత స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మార్చి త్రైమాసికంతో పోలిస్తే 1.33 శాతం నుంచి 1.4 శాతానికి పెరిగింది. → స్థూల రుణాలు రూ. 26,53 లక్షల కోట్లకు (6.7 శాతం వృద్ధి, డిపాజిట్లు 16.2 శాతం పెరిగి రూ. 27.64 లక్షల కోట్లకు చేరాయి. → కాసా నిష్పత్తి 38.2 శాతం నుంచి 33.9 శాతానికి తగ్గింది. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ. 6.39 లక్షల కోట్లుగా ఉండగా, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ. 2.98 లక్షల కోట్లుగా ఉన్నాయి. → కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన చూస్తే హెచ్డీబీ ఐపీవో ద్వారా వచి్చన నిధుల కారణంగా ఇతర ఆదాయం రూ. 21,730 కోట్లకు పెరిగింది. → స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.40 శాతంగా, నికర ఎన్పీఏల నిష్పత్తి స్వల్పంగా పెరిగి 0.47 శాతంగా నమోదైంది. → అనుబంధ కంపెనీ హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఐపీవోకి రావడంతో అందులో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 94.32 శాతం నుంచి 74.19 శాతానికి తగ్గింది. -
ఇన్సూరెన్స్ కంపెనీలపై ప్యానెల్ ఏర్పాటు
బీమా సంస్థలు, మధ్యవర్తులు నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి సారించేందుకు బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఐఆర్డీఏఐ 132వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీమా చట్టం, నియంత్రణపరమైన మార్గదర్శకాలను బీమా కంపెనీలు సరిగ్గా పాటిస్తున్నాయా? ఎక్కడైన ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయా? అన్నది పరిశీలించేందుకు పూర్తికాల సభ్యులతో కూడిన ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది.పాలసీలను తప్పుడు మార్గాల్లో విక్రయిస్తుండడం, డేటా లీకేజీ నివేదికల నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కివి జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించి ఆర్1 దరఖాస్తుకు సైతం తాజా సమావేశంలో ఐఆర్డీఏఐ ఆమోదం తెలిపింది. దీని తర్వాత ఆర్2, ఆర్3 స్థాయిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. -
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 76 శాతం జంప్చేసి రూ. 1,111 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 633 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,568 కోట్ల నుంచి రూ. 8,866 కోట్లకు బలపడింది.వడ్డీ ఆదాయం రూ. 6,535 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు ఎగసింది. నిర్వహణ లాభం రూ. 1,676 కోట్ల నుంచి రూ. 2,358 కోట్లకు జంప్చేసింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 2.89 శాతం నుంచి 1.97 శాతానికి, నికర ఎన్పీఏలు 0.51 శాతం నుంచి 0.32 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 17.82 శాతం నుంచి 18.82 శాతానికి మెరుగుపడింది. ఫలితాల నేపథ్యంలో ఐవోబీ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 40 వద్ద ముగిసింది.బంధన్ బ్యాంక్ లాభం క్షీణత ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 65 శాతం క్షీణించి రూ. 372 కోట్లను తాకింది. మొండి రుణాలు పెరగడం, వడ్డీ ఆదాయం తగ్గడం ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,063 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,082 కోట్ల నుంచి రూ. 6,201 కోట్లకు బలపడింది. అయితే వడ్డీ ఆదాయం రూ. 5,536 కోట్ల నుంచి రూ. 5,476 కోట్లకు నీరసించింది.నికర వడ్డీ ఆదాయం రూ. 2,987 కోట్ల నుంచి రూ. 2,757 కోట్లకు వెనకడుగు వేసింది. నిర్వహణ లాభం సైతం రూ. 1,941 కోట్ల నుంచి రూ. 1,668 కోట్లకు క్షీణించింది. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 4.23 శాతం నుంచి 4.96 శాతానికి, నికర ఎన్పీఏలు 1.15 శాతం నుంచి 1.36 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 523 కోట్ల నుంచి రూ. 1,147 కోట్లకు భారీగా పెరిగాయి. ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు 1.1 శాతం పుంజుకుని రూ. 187 వద్ద ముగిసింది. -
ఉద్యోగిని తొలగించారు సరే.. ఆధారాలేవి?
ఒక మాజీ ఉద్యోగి తొలగింపు లేఖ పరువు నష్టం కలిగించేలా ఉందని గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఆ వ్యక్తికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్ను ఆదేశించింది. విప్రో మాజీ ఉద్యోగి అభిజిత్ మిశ్రా రూ.2.1 కోట్ల నష్టపరిహారం కోరుతూ తన తొలగింపు లేఖపై పరువు నష్టం దావా దాఖలు చేశాడు. జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.51 పేజీల తీర్పులో హైకోర్టు కొన్ని అంశాలను పేర్కొంది. ఎలాంటి ఆధారం లేని తొలగింపు లేఖలు ఉద్యోగుల పరువు నష్టం కిందకు వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. లేఖలో ‘దురుద్దేశపూరిత ప్రవర్తన’ అనే పదాన్ని కంపెనీ చేర్చింది. అయితే అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో వెల్లడించలేదని ధర్మాసనం తెలిపింది. ఇది పిటిషనర్ భవిష్యత్తు ఉపాధి, వృత్తిపరమైన గౌరవంపై ప్రత్యక్ష, హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..మిశ్రా విప్రోలో ప్రిన్సిపల్ కన్సల్టెంట్గా పనిచేస్తుండేవాడు. జూన్ 5, 2020న కంపెనీ టర్మినేషన్ లేఖ పంపించింది. అందులో మిశ్రా ప్రవర్తన దురుద్దేశపూర్వకంగా ఉందని, ఇది యజమాని-ఉద్యోగి సంబంధంలో విపత్కర పరిస్థితులకు దారితీసిందని పేర్కొంది. వీటిని సవాలు చేస్తే మిశ్రా ఆ లేఖలో తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని, ఇది తన వ్యక్తిత్వాన్ని కించపరిచిందని, తన ప్రతిష్ఠను దెబ్బతీసిందని కోర్టులు పిటిషన్ దాఖలు చేశాడు. -
అదానీ విల్మర్ నుంచి అదానీ గ్రూప్ ఔట్
న్యూఢిల్లీ: ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మర్)లో మిగిలిన 10.42 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించినట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా పేర్కొంది. బీఎస్ఈ బ్లాక్డీల్ గణాంకాల ప్రకారం షేరుకి రూ. 275.5 ధరలో 13,54,82,400 షేర్లు అమ్మివేసింది. 11 లావాదేవీల ద్వారా దాదాపు రూ. 3,733 కోట్లకు 10.42 శాతం వాటా విక్రయించింది. వీటిలో ఢిల్లీ సంస్థ షాజాయిటన్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్జెడ్సీవో 8.52 శాతం వాటాకు సమానమైన 11.07 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 3,050 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఏడబ్ల్యూఎల్ అగ్రిలో షేర్లు కొనుగోలు చేసిన ఇతర సంస్థలలో క్వాంట్ ఎంఎఫ్, ఐడీఎఫ్సీ ఎంఎఫ్, బంధన్ ఎంఎఫ్తోపాటు.. జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్, మార్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ తదితరాలున్నాయి. -
జీసీసీల్లో హైరింగ్ జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాల పరిస్థితి మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 3–6 శాతం క్షీణించగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మాత్రం 8–10 శాతం హైరింగ్ పెరిగింది. ఏఐ, ప్లాట్ఫాం ఇంజినీరింగ్, సైబర్సెక్యూరిటీలాంటి విభాగాల్లో నిపుణులకు డిమాండ్ నెలకొంది. స్టాఫింగ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అన్ని విభాగాల్లోను పెద్ద సంఖ్యలో రిక్రూట్మెంట్ చేపట్టకుండా, దీర్ఘకాలికంగా మరింత విలువను చేకూర్చే, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడే నైపుణ్యాలున్న వారినే నియమించుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నట్లు నివేదిక పేర్కొంది. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), తయారీ, ఆటోమోటివ్ .. ఎనర్జీ, టెక్నాలజీ..హార్డ్వేర్ లాంటి విభాగాల్లో నియామకాలకు డిమాండ్ నెలకొన్నట్లు వివరించింది. స్మార్ట్ ఫ్యాక్టరీలు, పారిశ్రామిక ఐవోటీ, ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్ఫాంలోకి పెట్టుబడుల ప్రవాహం కారణంగా తయారీ, ఆటోమోటివ్, ఎనర్జీ విభాగాల్లో అత్యధికంగా హైరింగ్ డిమాండ్ త్రైమాసికాలవారీగా 31 శాతం మేర పెరిగింది. మొత్తం జీసీసీ మార్కెట్లో 20 శాతం వాటాతో బీఎఫ్ఎస్ఐ గణనీయంగా నియామకాలు చేపట్టింది. ఏఐ ఆధారిత క్రెడిట్ రిస్క్ అనాలిసిస్, సైబర్సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో ఈ విభాగంలో హైరింగ్ త్రైమాసికాలవారీగా 15 శాతం పెరిగింది. మరోవైపు హాస్పిటాలిటీ, ట్రావెల్..లాజిస్టిక్స్ విభాగంలో హైరింగ్ 25 శాతం, నిర్మాణ..ఇంజినీరింగ్ విభాగంలో 15 శాతం తగ్గింది. నివేదికలో మరిన్ని వివరాలు.. → భౌగోళికంగా చూస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో హైరింగ్ గణనీయంగా ఉంది. 29 శాతం మార్కెట్ వాటాతో బెంగళూరు.. జీసీసీ హబ్గా కొనసాగుతున్నప్పటికీ, ప్రదాన మెట్రోలతో పోలిస్తే నియామకాల వృద్ధి అత్యంత తక్కువగా 3.20 శాతంగా నమోదైంది. ప్రథమ శ్రేణి నగరాల్లో పుణె (10.60 శాతం), చెన్నై (9.40 శాతం) అత్యధిక వృద్ధి నమోదు చేశాయి. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా రిక్రూట్మెంట్పరంగా అధిక వృద్ధి నమోదైంది. కోయంబత్తూర్లో 34.10 శాతం, కోచిలో 27.60 శాతం, అహ్మదాబాద్లో 24.60 శాతం మేర వృద్ధి నమోదైంది. → ఏఐ, డేటా సైన్స్, ప్లాట్పాం ఇంజినీరింగ్ లాంటి విభాగాల్లో హోదాను బట్టి నిపుణుల కొరత 25 శాతం నుంచి 40 శాతం వరకు ఉంటోంది. దీనితో హైరింగ్ ప్రక్రియ నెమ్మదిస్తోంది. అత్యుత్తమ నైపుణ్యాలున్న వారికి మెట్రోల్లో రూ. 50–60 లక్షల స్థాయిలో ప్యాకేజీలు ఉంటున్నాయి. -
రిలయన్స్ రిటైల్ చేతికి కెల్వినేటర్ బ్రాండ్
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ తాజాగా ఎలక్ట్రోలక్స్ గ్రూప్ కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ కెల్వినేటర్ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 160 కోట్లు. దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం గృహోపకరణాల విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు రిలయన్స్ రిటైల్కి ఇది ఉపయోగపడనుంది. రిలయన్స్ రిటైల్ గతంలో కెల్వినేటర్ బ్రాండ్కి లైసెన్సు తీసుకుని, ఉపయోగించుకుంది. దీని కింద ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు మొదలైనవి అమ్ముడవుతున్నాయి. భారతీయ వినియోగదారులకు విశ్వసనీయమైన అంతర్జాతీయ ఉత్పత్తులను అందించేందుకు కెల్వినేటర్ కొనుగోలు తోడ్పడుతుందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఈడీ ఈషా ఎం అంబానీ ప్రకటనలో తెలిపారు. కెల్వినేటర్కు అంతర్జాతీయంగా దాదాపు శతాబ్దంపైగా చరిత్ర ఉంది. అధునాతన టెక్నాలజీ, అత్యుత్తమ పనితీరుతో 1970లు, 1980లలో భారత్లో ఐకానిక్ స్థాయిని దక్కించుకుంది. అమెరికన్ బ్రాండ్ అయినప్పటికీ పలు సంస్థల చేతులు మారి చివరికి స్వీడన్కి చెందిన ఎలక్ట్రోలక్స్ గూటికి చేరింది. ఇటీవలి సీఐఐ, ఈవై సంయుక్త నివేదిక ప్రకారం భారత కన్జూమర్ డ్యూరబుల్స్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒక టి. 2027 నాటికి అతి పెద్ద మార్కెట్లలో నా లుగో స్థానానికి చేరనుంది. 2029 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3 లక్షల కోట్ల స్థాయికి చేరుతుంది. మరోవైపు, క్రిసిల్ రేటింగ్స్ ప్ర కారం 2024–25లో ఈ పరిశ్ర మ (టీవీలు, ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెíషీన్లు) రూ. 1.17 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. -
రిలయన్స్ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో పటిష్ట ఫలితాలు సాధించింది. కంపెనీ చరిత్రలోనే ఒక క్వార్టర్లో అత్యధికంగా రూ. 26,994 కోట్ల రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో సాధించిన రూ. 15,138 కోట్లతో పోలిస్తే ఇది 78 శాతం వృద్ధి. ఇందుకు ప్రధానంగా భారీగా ఇతర ఆదాయం లభించడం, పటిష్టమైన కన్జూమర్ బిజినెస్ వృద్ధి దోహదపడ్డాయి. కాగా, మొత్తం ఆదాయం 5 శాతం బలపడి రూ. 2.48 లక్షల కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ. 2.36 లక్షల కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో లభించిన ఇతర ఆదాయంలో రూ.8,924 కోట్ల లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ (ఏషియన్ పెయింట్స్) విక్రయం ప్రధానంగా నిలిచింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా, ప్రధాన విభాగం చమురు శుద్ధి, పెట్రోకెమికల్ (ఓటూసీ) బిజినెస్ 1.5 శాతం నీరసించింది. ముడిచమురు ధరలు క్షీణించడంవంటివి ప్రభావం చూపాయి.ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,477 వద్ద ముగిసింది.జియో ప్లాట్ఫామ్స్ జోరు నికర లాభం రూ. 7,110 కోట్లు ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ బిజినెస్ల విభాగం.. జియో ప్లాట్ఫామ్స్ క్యూ1 నికర లాభం 25% వృద్ధితో రూ. 7,110 కోట్లను తాకింది. స్థూల ఆదాయం 19% ఎగసి రూ. 41,054 కోట్లకు చేరింది. మొబిలిటీ, హోమ్స్ విభాగంలో సబ్ర్స్కయిబర్లు పెరగడం, డిజిటల్ సరీ్వసుల బిజినెస్ బలపడటం ఇందుకు సహకరించాయి. ఈ కాలంలో 20 కోట్ల 5జీ వినియోగదారులను దాటడం, 2 కోట్ల హోమ్ కనెక్ట్స్కు చేరడం ద్వారా జియో సరికొత్త గరిష్టాలకు చేరినట్లు మాతృ సంస్థ ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 7.4 మిలియన్ సబ్స్క్రయిబర్లతో జియో ఫైబర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్డ్ వైర్లెస్ సంస్థగా అవతరించినట్లు వెల్లడించారు.రిటైల్ లాభం రూ. 3,271 కోట్లు ఆర్ఐఎల్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ1లో 28 శాతం జంప్చేసి రూ. 3,271 కోట్లను తాకింది. వివిధ విభాగాలలో వృద్ధి ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,549 కోట్లు మాత్రమే ఆర్జించింది. స్థూల ఆదాయం 11 శాతం పుంజుకుని రూ. 84,171 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 75,615 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో కొత్తగా 388 స్టోర్లను తెరిచింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 19,592కు చేరింది. నిర్వహణ సామర్థ్యం, ప్రాంతాలవారీగా విస్తరణ, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోపై నిరంతరం దృష్టి పెట్టడంతో రిలయన్స్ రిటైల్ నిలకడైన పనితీరును చూపినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలియజేశారు.రిలయన్స్ అన్ని విభాగాలలో పటిష్ట నిర్వహణ, ఆర్థిక పనితీరుతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అంతర్జాతీయ ఆటుపోట్ల మధ్య ఏడాది క్రితంతో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఇబిటా భారీగా మెరుగుపడింది. ఇంధన మార్కెట్లలో అత్యంత అనిశి్చత పరిస్థితులున్నప్పటికీ ఓటూసీ బిజినెస్ పటిష్ట వృద్ధిని సాధించింది. జియో–బీపీ నెట్వర్క్ ద్వారా విలువ జోడింపు సొల్యూషన్లకు తెరతీశాం. తద్వారా దేశీ డిమాండును అందుకున్నాం. ఇంధనం, పెట్రో ప్రొడక్టుల మార్జిన్లు దన్నుగా నిలిచాయి. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్–ఎండీ -
నీట్ ఫెయిల్.. కట్ చేస్తే రూ.72.3 లక్షల ఉద్యోగం
అనుకున్నది సాధించాలనే తపన చాలామందికి ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితులు అందుకు సహకరించకపోవచ్చు. దాంతో కుంగిపోక ఇతర మార్గం ఎంచుకున్నా అందులోనూ ఉన్నతస్థాయికి వెళ్లొచ్చని బెంగళూరుకు చెందిన ఓ యువతి నిరూపించారు. డాక్టర్గా స్థిరపడేందుకు రాసే నీట్ పరీక్ష కోసం కేఎస్ రితుపర్ణ ఎంతో కష్టపడ్డారు. కానీ పరిస్థితులు అందుకు సహకరించలేదు. ఆ పరీక్షలో అర్హత సాధించలేకపోయారు. దాంతో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇంజినీరింగ్లో చేరారు.మంగళూరులోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో చేరారు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ, నైపుణ్యాలు పెంచుకున్నారు. దాంతో ఇంజినీరింగ్ ఆరో సెమిస్టర్లో ఆమె రోల్స్ రాయిస్లో ఎనిమిది నెలల ఇంటర్న్షిప్ను సాధించారు. తన ప్రతిభను గుర్తించిన కంపెనీ 2024 డిసెంబర్లో ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ను అందించింది. రోల్స్ రాయిస్ జెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో ఏడాదికి రూ.39.6 లక్షలతో కంపెనీలో చేరారు. చేరిన నాలుగు నెలల్లోనే అంటే ఏప్రిల్ 2025లో తన నైపుణ్యాలను గుర్తించిన కంపెనీ తన వేతనాన్ని రూ.72.3 లక్షలకు పెంచింది.ఇదీ చదవండి: ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావా‘నేను నీట్కు ఎంతో ప్రయత్నించాను. కానీ అర్హత సాధించలేకపోయాను. దాంతో ఇంజినీరింగ్ ఎంచుకున్నాను. రోబోటిక్స్, ఆటోమేషన్ ఇంజినీరింగ్ అంటే ఎంతో ఇష్టం. అంకితభావంతో పనిచేస్తూ, కొత్త విషయాలను నేర్చుకోవడం, నూతన ఆలోచనలను టీమ్తో పంచుకోవడం, టెక్నికల్ సమస్యలకు పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించాను’ అని రితుపర్ణ తెలిపారు. రైతులకు సహాయం చేయడానికి కాలేజీలో రోబోను తయారు చేసిన ప్రాజెక్టులో ఆమె పనిచేశారు. గోవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పతకాలు సాధించారు. ఏడో సెమిస్టర్ పూర్తి చేసుకున్న తర్వాత రోల్స్ రాయిస్ టెక్సాస్ జెట్ ఇంజిన్ విభాగంలో చేరనున్నారు. 20 ఏళ్ల యువతి కంపెనీ జెట్ విభాగంలో అత్యంత పిన్న వయస్కురాలుగా రికార్డులకెక్కనుంది. -
ఫేస్బుక్పై రూ.68 వేలకోట్ల దావా
ఫేస్బుక్ ప్రైవసీ ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో మెటాలోని టాప్ ఎగ్జిక్యూటివ్లు, డైరెక్టర్లు వ్యవహరించిన తీరుపై షేర్ హోల్డర్ల బృందంతో బిలియన్ డాలర్ల దావాను పరిష్కరించడానికి మార్క్ జుకర్బర్గ్ అంగీకరించినట్లు తెలిసింది. షేర్ హోల్డర్లు 8 బిలియన్ డాలర్లు (6 బిలియన్ పౌండ్లు-సుమారుగా రూ.68 వేల కోట్లు) నష్టపరిహారంగా కోరుతున్నారు. అయితే వారికి ఏమేరకు ముట్టజెబుతామని చెప్పారో మాత్రం తెలియరాలేదు.డెలావేర్ కోర్టులో జరిగిన విచారణ రెండో రోజుకు చేరుకోనున్న నేపథ్యంలో షేర్ హోల్డర్ల తరఫు న్యాయవాది గురువారం ఈ సెటిల్మెంట్ అమౌంట్ను ప్రకటించారు. దీనిపై స్పందించేందుకు మెటా నిరాకరించింది. జుకర్బర్గ్ చర్యలు కేంబ్రిడ్జ్ అనలిటికా స్కాండల్కు దారితీశాయని, ఇందులో మిలియన్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటాను లీక్ చేసి ఒక రాజకీయ కన్సల్టింగ్ సంస్థ ఉపయోగించిందని మెటా షేర్ హోల్డర్లు ఆరోపించారు.ఇదీ చదవండి: అడుగు దూరంలో ట్రేడ్ డీల్వినియోగదారుల గోప్యతా ఉల్లంఘనల క్లెయిమ్లను పరిష్కరించడానికి కంపెనీ చెల్లించాల్సిన జరిమానాలు, చట్టపరమైన ఖర్చులను 8 బిలియన్ డాలర్లకుపైగా తిరిగి చెల్లించేలా మెటాను ఆదేశించాలని వాటాదారులు న్యాయమూర్తిని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన రాజకీయ కన్సల్టింగ్ సంస్థ కేంబ్రిడ్జ్ అనలిటికా మిలియన్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల డేటాను యాక్సెస్ చేసినట్లు వెల్లడైన తరువాత 2018లో వాటాదారులు దావా వేశారు. -
ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువు
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 35 రోజుల బెంచ్ పాలసీని అమలు చేస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. జూన్ 12న ప్రకటించిన ఈ పాలసీ మొదటి విడత జులై 17తో గడువు ముగిసింది. దాంతో ఈరోజు చాలా మంది ఉద్యోగులు సంస్థలో తమ భవిష్యత్తు ఏమిటనే దానిపై ఆందోళన చెందుతున్నారు.జూన్ 2025లో ప్రవేశపెట్టిన బెంచ్ పాలసీ విధానం ప్రకారం ప్రతి ఉద్యోగి సంవత్సరానికి కనీసం 225 బిల్లింగ్(యాక్టివ్ వర్క్) రోజులను లాగిన్ చేయాలి. ఉద్యోగులు ప్రాజెక్టుల్లో లేనప్పుడు బెంచ్ మీద గడిపే సమయాన్ని ఇది సంవత్సరానికి కేవలం 35 పని దినాలకు పరిమితం చేసింది. టీసీఎస్లోని సుమారు 6,00,000 మంది ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడానికి, నైపుణ్యాలు పునరుద్ధరించుకోవడానికి ఈ చొరవ ఎంతో మేలు చేస్తుందని కంపెనీ నమ్ముతోంది. అయితే నిన్నటితో మొదటి విడత బెంచ్ గడువు ముగియడంతో తమ ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోనని బెంచ్పై ఉన్న కొందరు ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: 34 ఏళ్లకే రిటైర్ అవ్వొచ్చు!టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ ఈ చర్యను కంపెనీలో సహజ పరిణామంగా అభివర్ణించారు. ‘మేము ఇప్పటికే కొన్ని పాలసీలను క్రమబద్ధీకరించాం. ఉద్యోగులు ప్రాజెక్ట్కు సిద్ధంగా ఉండాలి. బిల్లింగ్ డేస్ పెరిగేలా చూడాలి. ఈ మేరకు తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు కంపెనీ సహాయం చేస్తోంది’ అని ఆయన ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా మూడు త్రైమాసికాల నుంచి కంపెనీ ఆదాయం వరుసగా క్షీణిస్తోంది. పెరుగుతున్న ఉద్యోగుల వ్యయం కొంత భారంగా మారుతుందనే వాదనలున్నాయి. -
జియో ఫైనాన్స్ లాభం భళా
డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ నుంచి విడివడిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 313 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు ఎగసింది.అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 79 కోట్ల నుంచి రూ. 261 కోట్లకు భారీగా పెరిగాయి. వడ్డీ ఆదాయం రూ. 162 కోట్ల నుంచి రెట్టింపై రూ. 363 కోట్లకు చేరింది. ఈ కాలంలో జియో పేమెంట్స్ బ్యాంక్(జేపీబీఎల్)లో 14.96 శాతం వాటాకు సమానమైన 7.9 కోట్ల ఈక్విటీ షేర్లను ఎస్బీఐ నుంచి సొంతం చేసుకుంది. ఇందుకు రూ. 104.54 కోట్లు వెచ్చించింది. వెరసి 2025 జూన్ 18 నుంచి జేపీబీఎల్ పూర్తి అనుబంధ సంస్థగా అవతరించినట్లు వెల్లడించింది.సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం వృద్ధిప్రయివేట్ రంగ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 322 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 294 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,736 కోట్ల నుంచి రూ. 2,984 కోట్లకు బలపడింది.వడ్డీ ఆదాయం రూ. 2,314 కోట్ల నుంచి రూ. 2,362 కోట్లకు స్వల్పంగా పుంజుకుంది. నిర్వహణ లాభం రూ. 508 కోట్ల నుంచి రూ. 672 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 4.5 శాతం నుంచి 3.15 శాతానికి, నికర ఎన్పీఏలు 1.44 శాతం నుంచి 0.68 శాతానికి దిగివచ్చాయి. కనీస మూలధన నిష్పత్తి 18.11 శాతం నుంచి 19.48 శాతానికి మెరుగుపడింది. -
Q1 Results: లాభాల కంపెనీలు
టెక్నాలజీ కన్సల్టింగ్, డిజిటల్ సొల్యూషన్ల దేశీ దిగ్గజం ఎల్టీఐమైండ్ట్రీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 1,254 కోట్లను అధిగమించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,134 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 9,841 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 9,143 కోట్ల టర్నోవర్ నమోదైంది. జూన్కల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 83,889కు చేరింది. ఇసాప్లో భాగంగా ఉద్యోగుల సంక్షేమ నిధికి 67,252 షేర్లను కొత్తగా జారీ చేసేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. వీటిని తదుపరి దశలో అర్హతగల ఉద్యోగులకు బదిలీ చేయనుంది.ఇండియన్ హోటల్స్ లాభం జూమ్ఆతిథ్య రంగ టాటా గ్రూప్ దిగ్గజం ఇండియన్ హోటల్స్ కంపెనీ(ఐహెచ్సీఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 27 శాతం జంప్చేసి రూ. 329 కోట్లను అధిగమించింది.గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 260 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 2,102 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,662 కోట్లకు పెరిగాయి. వరుసగా 13వ క్వార్టర్లోనూ రికార్డ్ ఫలితాలు సాధించినట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ చత్వాల్ పేర్కొన్నారు.గైడెన్స్కు అనుగుణంగా ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించినట్లు తెలియజేశారు. హోటళ్ల విభాగం నుంచి 14 శాతం అధికంగా రూ. 1,814 కోట్లు లభించగా.. 31.4 శాతం ఇబిటా మార్జిన్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ కాలంలో 12 ఒప్పందాలు కుదుర్చుకోగా.. కొత్తగా 6 హోటళ్లను ప్రారంభించినట్లు తెలియజేశారు. హోటళ్ల పోర్ట్ఫోలియో 390కు చేరినట్లు వెల్లడించారు. -
కంపెనీలో కొత్త రూల్.. ఇల్లు కొనుక్కున్న సీఈవో
కొందరు ప్రపంచ కార్పొరేట్ లీడర్ల జీవన శైలి భిన్నంగా ఉంటుంది. ప్రముఖ కాఫీ చైన్ స్టార్ బక్స్ సీఈఓ బ్రియాన్ నికోల్ వ్యక్తిగత శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన నివాసం కాలిఫోర్నియాలో ఉంటుంది. సియాటెల్లోని కంపెనీ కార్యాలయానికి నిత్యం దాదాపు 1,600 కిలోమీటర్లు ఆయన కార్పొరేట్ జెట్లో తిరిగేవారు. అయితే ఆయన ఇప్పుడు సియాటెల్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు ఫార్చ్యూన్ వార్తా కథనం తెలిపింది. దీనికి కారణం ఆ కంపెనీ తీసుకొచ్చిన కొత్త విధానమే.ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ కాఫీ చైన్ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు తీసుకురావడానికి కఠినమైన విధానాన్ని అమలు చేస్తోంది. "మనం కలిసి పనిచేస్తే దాన్ని ఉత్తమంగా చేయగలం. ఆలోచనలను మరింత సమర్థవంతంగా పంచుకోగలం. కఠినమైన సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకుని వేగంగా ముందుకు వెళ్లగలం. అందుకే మన ఇన్-ఆఫీస్ సంస్కృతిని పునరుద్ధరిస్తున్నాము" అని నికోల్ ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు.గత ఏడాది ఆగస్టులో స్టార్ బక్స్ సీఈఓగా నికోల్ నియమితులైనప్పుడు, కంపెనీ ఆయన ప్రత్యేక ప్రయాణ ప్రణాళికకు అంగీకరించింది. సియాటెల్ కార్యాలయానికి వారానికి కనీసం మూడు రోజులు వచ్చేలా కాలిఫోర్నియా- సియాటెల్ మధ్య కార్పొరేట్ జెట్లో ప్రయాణించే వెసులుబాటును కంపెనీ కల్పించింది. ఇది ఆ సమయంలో కంపెనీ అనుసరిస్తున్న హైబ్రిడ్ వర్క్ పాలసీకి అనుగుణంగా కల్పించిన వెసులుబాటు. నికోల్ ఇలాంటి రొటీన్ ఫాలో అవడం ఇదే మొదటిసారి కాదు. 2018లో చిపోటిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాంటి సుదూర ప్రయాణ ఏర్పాట్లు చేశారు. తర్వాత తన లొకేషన్ కు దగ్గరయ్యేలా కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని కూడా డెన్వర్ నుంచి కాలిఫోర్నియాకు మార్చాడు.కానీ ఇప్పుడు స్టార్ బక్స్ లో పరిస్థితులు మారుతున్నాయి. అక్టోబర్ నుంచి కార్పొరేట్ ఉద్యోగులందరూ వారంలో కనీసం నాలుగు రోజులు ఆఫీసులో ఉండాలని నికోల్ సిబ్బందికి సూచించారు. కంపెనీ తిరిగి పుంజుకునేందుకు ప్రారంభించిన "బ్యాక్ టు స్టార్ బక్స్" ప్రణాళికలో ఇది భాగం. గత ఏడాదిలో, స్టార్ బక్స్ అమ్మకాలు పడిపోవడం, అంతర్గత మార్పులతోపాటు బ్రాండ్ కు సంబంధించిన నిరసనలను కూడా చూసింది. ఈ నేపథ్యంలో వర్క్ పాలసీని సవరించిన స్టార్ బక్స్ సపోర్ట్ సెంటర్ నుండి రిమోట్ గా పనిచేస్తున్న మేనేజర్లు, టీమ్ లీడర్లు సియాటెల్ లేదా టొరంటోకు మారడానికి 12 నెలల సమయం ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఏదో చోటకు నివాసం మార్చుకోవాలని ఇదివరకే గత ఫిబ్రవరీలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్లను కోరింది.అయితే అందరూ మకాం మార్చేందుకు సిద్ధపడకపోవచ్చు అందుకే అలాంటి వారి కోసం కంపెనీ ఓ అవకాశం కల్పించింది. అదేమిటంటే కంపెనీ చెప్పినట్లు రీలొకేట్ కావడానికి సిద్ధంగా లేనివారు కంపెనీ నుంచి స్వచ్ఛందంగా వైదొలగవచ్చు. ఇందుకోసం వన్-టైమ్ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ను ప్రకటించింది. దీని ప్రకారం కంపెనీ నుంచి వైదొలగేవారికి నగదు పరిహారం చెల్లిస్తారు. ఆయన వేతన పారితోషికం పరిమాణం కారణంగా నికోల్ నియామకం ఇప్పటికే వార్తల్లో నిలిచింది. స్టార్ బక్స్ ఆయనకు సుమారు 113 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఇది అతన్ని అత్యధిక పారితోషికం తీసుకునే కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా చేసింది. మాజీ చైర్మన్, సీఈవో లక్ష్మణ్ నరసింహన్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు.కాగా స్టాక్ బక్స్ సీఈవో నికోల్ జెట్ ప్రయాణాన్ని విడిచి సియాటెల్లో ఇల్లు కొనుక్కోవడం ఆయన్ను కంపెనీ ప్రధాన కార్యాలయానికి దగ్గర చేయడమే కాకుండా పర్యావరణానికి మేలు చేస్తుంది. అదెలా అంటే.. ఆయన జెట్ ప్రయాణం సుదీర్ఘమైనది మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా హాని చేస్తోంది. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ప్రకారం.. ఒక ప్రైవేట్ జెట్ ప్రయాణించిన ప్రతి కిలోమీటరుకు సుమారు 2.5 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తుంది. కాలిఫోర్నియా- సియాటెల్ మధ్య 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే 8,000 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. నికోల్ వారానికి మూడుసార్లు తిరిగితే మొత్తం వార్షిక ఉద్గారాలు 1,152 మెట్రిక్ టన్నులుగా ఉంటాయి. వారంలో ఐదు రోజులు తిరిగే ఆ సంఖ్య 1,920 మెట్రిక్ టన్నులకు చేరుతుంది. -
టాటా ఎల్రక్టానిక్స్, బోష్ జట్టు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల విభాగాల్లో పరస్పరం సహకరించుకునే దిశగా జర్మన్ టెక్నాలజీ సంస్థ రాబర్ట్ బాష్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీ ఎల్రక్టానిక్స్ దిగ్గజం టాటా ఎల్రక్టానిక్స్ వెల్లడించింది. దీని ప్రకారం టాటా ఎల్రక్టానిక్స్ అస్సాంలో ఏర్పాటు చేసే అసెంబ్లీ .. టెస్ట్ యూనిట్లో, గుజరాత్లోని ఫౌండ్రీలో చిప్ల ప్యాకేజింగ్, తయారీ కార్యకలాపాలపై ఇరు సంస్థలు కలిసి పని చేస్తాయి.అలాగే వాహనాల్లో వినియోగించే ఎల్రక్టానిక్స్ తయారీ సేవలను అందించే విధంగా స్థానిక ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టనున్నాయి. దేశీయంగా సమగ్రమైన సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను నెలకొల్పేందుకు తమ భాగస్వామ్యం దోహదపడుతుందని టాటా ఎలక్ట్రానిక్స్ సీఈవో రణ్ధీర్ ఠాకూర్ తెలిపారు. అధునాతన ఆటోమోటివ్ ఎల్రక్టానిక్స్కి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సరఫరా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని రాబర్ట్ బాష్ ఈవీపీ డిర్క్ క్రెస్ చెప్పారు. -
హెల్త్ స్టార్టప్లను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: 2035 నాటికి భారత్ అంతర్జాతీయ మెడికల్ హబ్గా ఎదగాలంటే విదేశీ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఓ నివేదిక సూచించింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగ అంకుర సంస్థలకు మరింత తోడ్పాటు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. కేపీఎంజీ ఇన్ ఇండియా, భారతీయ హోటళ్లు, రెస్టారెంట్ అసోసియేషన్ల సమాఖ్య (ఎఫ్హెచ్ఆర్ఏఐ) రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2025లో 18.2 బిలియన్ డాలర్లుగా ఉండే భారత మెడికల్ టూరిజం మార్కెట్ వార్షికంగా 12.3 శాతం వృద్ధితో 2035 నాటికి 58.2 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ఈ నేపథ్యంలో దీనికి తోడ్పాటు అందించేందుకు ఎంబసీలు, ఎగ్జిబిషన్లు, డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా అంతర్జాతీయంగా బ్రాండింగ్ ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని రిపోర్ట్ సూచించింది. అలాగే, రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో ’హీల్ ఇన్ ఇండియా’ మిషన్ను ఆవిష్కరించాలని పేర్కొంది. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు, సేవలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రభుత్వం ద్రవ్యేతర, ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అంతర్జాతీయ పేషంట్లకు చికిత్స చేసే ఆస్పత్రులకు పన్నులపరంగా మినహాయింపులు ఇవ్వొచ్చు. మార్కెటింగ్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ స్కీము కింద సబ్సిడీలను పెంచవచ్చు. డిజిటల్ ప్లాట్ఫాంలు సహా ఇతరత్రా మాధ్యమాల్లో మార్కెటింగ్, ప్రమోషన్ కోసం సాంకేతిక సహకారం అందించవచ్చు. అలాగే వెల్నెస్ సెంటర్లు సహా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విభాగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవచ్చు‘ అని నివేదిక తెలిపింది. మరిన్ని విశేషాలు.. → మెడికల్ టూరిజానికి ప్రత్యక్షంగా దోహదపడే హెల్త్–టెక్, వైద్య పరిశోధనలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్ల విభాగాల్లో పని చేసే స్టార్టప్లు, ఇతర సంస్థలకు నిర్దిష్ట సబ్సిడీలు, గ్రాంట్లు ఇవ్వాలి. → భారత ఆస్పత్రులను కూడా తమ నెట్వర్క్ల్లో జోడించుకునేందుకు అంతర్జాతీయ బీమా సంస్థలతో కలిసి పనిచేస్తూ బీమా పోర్టబిలిటీ వెసులుబాటును తీసుకురావచ్చు. దీనితో విదేశీ పేషంట్లకు ఆర్థిక ప్రతిబంధకాలు తగ్గుతాయి. బీమా ఉన్న విదేశీ పేషంట్లకు భారత్ మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. → వీసా–ఇన్సూరెన్స్ లింకేజీ మధ్య అంతరాలను తగ్గించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో, బహు భాషల్లో సేవలందించేలా ఆస్పత్రుల్లో సిబ్బందికి శిక్షణనివ్వడంపై దృష్టి పెట్టాలి. → మెడికల్, వెల్నెస్ టూరిజంపై జాతీయ వ్యూ హం, మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా జాతీయ స్థాయిలో మిషన్ ఏర్పాటు చేయాలి. → పాలసీల అమలు, అంతర్–మంత్రిత్వ శాఖల సమన్వయం కోసం జాతీయ మెడికల్, వెల్నెస్ టూరిజం ప్రమోషన్ బోర్డును సమగ్ర జాతీయ మిషన్గా అప్గ్రేడ్ చేయాలి. → మెడికల్ టూరిజం సూచీలో భారత్ 10వ ర్యాంకులో, వెల్నెస్ టూరిజంలో 7వ స్థానంలో ఉంది. → 2024లో భారత్ 4,63,725 మెడికల్ వీసాలను జారీ చేసింది. మెజారిటీ పేషంట్లు బంగ్లాదేశ్, జీసీసీ దేశాలు, ఆఫ్రికా నుంచి వచ్చారు. → 2024లో అంతర్జాతీయంగా మెడికల్ టూరిజం మార్కెట్ 41.75 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. -
అదానీ విల్మర్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ తాజాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్(గతంలో అదానీ విల్మర్)లో మరో 20 శాతం వాటా విక్రయించింది. భాగస్వామ్య కంపెనీ సింగపూర్ సంస్థ విల్మర్ ఇంటర్నేషనల్కు రూ. 7,150 కోట్లకు విక్రయించినట్లు అదానీ గ్రూప్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. గ్రూప్నకు కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్లపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అదానీ విల్మర్లో 44% వరకూ వాటాను విక్రయించనున్నట్లు గతేడాది డిసెంబర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో విల్మర్ ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ లెన్స్ పీటీఈతో అనుబంధ సంస్థ అదానీ కమోడిటీస్ ఎల్ఎల్పీ ఇందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఒప్పందం ప్రకారం షేరుకి రూ. 305 మించకుండా తదుపరి దశలో నిర్ణయించుకునే ధరలో లావాదేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. మరోవైపు 2025 జనవరిలో పబ్లిక్కు కనీస వాటా నిబంధన ప్రకారం షేరుకి రూ. 276.51 ధరలో అదానీ విల్మర్లో 13.51% వాటాను అదానీ ఎంటర్ప్రైజెస్ విక్రయించింది. తద్వారా రూ. 4,855 కోట్లు సమీకరించింది. దీంతో అదానీ విల్మర్లో వాటా 44% నుంచి 30.42%కి దిగివచ్చింది. ఈ బాటలో ప్రస్తుతం మరో 20% వాటాను షేరుకి రూ. 275 ధరలో విల్మర్ ఇంటర్నేషనల్కు విక్రయించింది. తద్వారా రూ. 7,150 కోట్లు అందుకోనుంది. తాజాగా ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్లో విల్మర్ ఇంటర్నేషనల్ వాటా 64%కి బలపడింది. మరోపక్క మిగిలిన 10.42 శాతం వాటాను సైతం త్వరలో విక్రయించనున్నట్లు అదానీ వెల్లడించింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 6,244 కోట్లకు పరిమితమైంది. స్టాండెలోన్ నికర లాభం సైతం 4 శాతం క్షీణించి రూ. 5,806 కోట్లకు పరిమితమైంది. మొండి బకాయిలు, లోన్ అప్గ్రేడ్ విధానాలలో మార్పులు మొత్తం ఫలితాలపై ప్రభావం చూపినట్లు బ్యాంక్ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 6,034 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 35,844 కోట్ల నుంచి రూ. 38,322 కోట్లకు బలపడింది. వడ్డీ ఆదాయం రూ. 30,061 కోట్ల నుంచి రూ. 31,064 కోట్లకు పుంజుకుంది. నికర వడ్డీ ఆదాయం 1 శాతం నామమాత్ర వృద్ధితో రూ. 13,560 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 4.05 శాతం నుంచి 3.8 శాతానికి నీరసించాయి. ఎన్పీఏలు పెరిగాయ్.. క్యూ1లో యాక్సిస్ బ్యాంక్ నిర్వహణ లాభం రూ. 10,106 కోట్ల నుంచి రూ. 11,515 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.28 శాతం నుంచి 1.57 శాతానికి, నికర ఎన్పీఏలు 0.34 శాతం నుంచి 0.45 శాతానికి పెరిగాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 2,039 కోట్ల నుంచి రూ. 3,948 కోట్లకు భారీగా ఎగశాయి. స్థూల స్లిప్పేజీలు రూ. 4,805 కోట్ల నుంచి రూ. 8,200 కోట్లకు భారీగా పెరిగాయి. అయితే టెక్నికల్ ప్రభావాన్ని సర్దుబాటు చేస్తే రూ. 5,491 కోట్లుగా నమోదైనట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ పేర్కొన్నారు. కనీస మూలధన నిష్పత్తి 17.07 శాతం నుంచి 16.85 శాతానికి నీరసించింది. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 1,160 వద్ద ముగిసింది. -
మెప్పించిన విప్రో
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం ఎగసి రూ. 3,337 కోట్లకు చేరింది. డీల్స్లో వృద్ధి ఇందుకు దోహదపడింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 3,037 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఆగస్ట్ 15కల్లా చెల్లించనుంది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,964 కోట్ల నుంచి రూ. 22,135 కోట్లకు బలపడింది. ఈ కాలంలో కొత్తగా 497.1 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇవి 51 శాతం అధికంకాగా.. వీటిలో 131 శాతం వృద్ధితో 266.6 కోట్ల విలువైన భారీ డీల్స్ సాధించింది. క్యూ1లో 114 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,2325 మందికి పరిమితమైంది. ఉద్యోగ వ్యయాలు రూ. 13,428 కోట్లకు చేరాయి. –1 నుంచి +1 మధ్య..: ఈ ఏడాది రెండో త్రైమాసికం(జూలై–సెపె్టంబర్)లో ఆదాయంలో –1 నుంచి +1 మధ్య వృద్ధి నమోదుకావచ్చని తాజాగా అంచనా (గైడెన్స్) ప్రకటించింది. ఇది త్రైమాసికవారీ అంచనా కాగా.. 256–261.2 కోట్ల డాలర్ల మధ్య ఐటీ సర్వీసుల ఆదాయం సాధించవచ్చని భావిస్తోంది. ఆదాయంలో బీఎఫ్ఎస్ఐ విభాగం వాటా 34 శాతంకాగా.. కన్జూమర్ 19 శాతం, కన్జూమర్ 19 శాతం, ఎనర్జీ 18 శాతంగా ఉంది. ఏడాది కాలంలో రెండుసార్లు డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ సీఎఫ్వో అపర్ణ అయ్యర్ పేర్కొన్నారు. అనిశ్చితిలో.. అనిశ్చిత ఆర్థిక వాతావరణంలో కొత్త ఏడాదిని ప్రారంభించాం. దీంతో డిమాండ్ మందగించింది. మా క్లయింట్లు వ్యయ నియంత్రణ, వెండార్ కన్సాలిడేషన్పై దృష్టి పెట్టాం. అయితే ఇదేసమయంలో ఏఐ, డేటా, ఆధునీకరణ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. భారీ డీల్స్ నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధం నుంచి మరింత పురోగతి సాధిస్తాం. – శ్రీని పాలియా, విప్రో సీఈవో–ఎండీఫలితాల నేపథ్యంలో విప్రో షేరు 1% తగ్గి రూ. 260 వద్ద ముగిసింది. -
పెళ్లి చేసుకోండి.. సెలవులిస్తాం
ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ వ్యక్తిగత జీవనాన్ని మెరుగుపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెళ్లి కోసం 10 పనిదినాల పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తమ పౌరులకు పని-జీవిత సమతుల్యత, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి దుబాయ్ ప్రకటించిన ఈ నూతన సెలవు విధానం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది.దీనికి సంబంధించి యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిక్రీ జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న యూఏఈ పౌరులందరికీ వర్తిస్తాయి. ఇందులో దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయాధికారులు, సైనిక సిబ్బంది, ఫ్రీ జోన్లు, స్పెషల్ డెవలప్మెంట్ జోన్లు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ) వంటి సంస్థలు ఉన్నాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. భవిష్యత్తులో అదనపు కేటగిరీల ఉద్యోగులను కవర్ చేయడానికి విస్తరణకు కూడా ఈ డిక్రీ అనుమతిస్తుంది.కొత్త వివాహ సెలవుకు అర్హత పొందడానికి ఉద్యోగులు వారి ప్రొబేషనరీ వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. అలాగే తాము పెళ్లి చేసుకోబోయే వారు కూడా యూఏఈ పౌరులే అయి ఉండాలి. 2024 డిసెంబర్ 31 తర్వాత అయిన వివాహాలకే ఇది వర్తిస్తుంది. ఈ వివాహ ఒప్పందాన్ని యూఏఈ అధీకృత సంస్థలు అధికారికంగా ధృవీకరించాలి. వెరిఫికేషన్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీ అవసరం. పెళ్లి జరిగిన రోజు నుంచి ఈ సెలవులను ఒకసారి కానీ, విడదలవారీగా కానీ ఉపయోగించుకోవచ్చు. వివాహ సెలవుల కాలంలో ఉద్యోగికి వర్తించే అన్ని అలవెన్సులు, ఆర్థిక ప్రయోజనాలతో సహా పూర్తి వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. -
ఒకప్పటి ఎస్టీడీ బూత్బాయ్.. నేటి యువ పారిశ్రామికవేత్త
ఉద్యోగం చేయడం కాదు.. పది మందికి ఉపాధి ఇవ్వాలన్న లక్ష్యం.. ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మరువద్దన్న వినయం.. కొత్తగా చేయాలన్న తపన.. ఆ యువకుడిని విజయతీరాలకు చేర్చింది. ఊరి పేరును బ్రాండ్గా మార్చుకున్న రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన యువకుడు దొంతినేని బాలకృష్ణ (Donthineni Balakrishna) తన ఊరి పేరుతో స్వీట్ల వ్యాపారాన్ని దేశ, విదేశాల్లో విస్తరించాడు. ఎస్టీడీ బూత్బాయ్గా పనిచేసిన కుర్రాడు యువ పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. కరోనా సంక్షోభంలో వ్యాపారం ప్రారంభించి.. విజయవంతంగా దూసుకెళ్తున్న బాలకృష్ణ సక్సెస్స్టోరీ.పల్లె నుంచి పట్నానికి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన దొంతినేని మాధవరావు, శ్యామల కుమారుడు దొంతినేని బాలకృష్ణ పదో తరగతి వరకు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివాడు. ఇంటర్, బీఎస్సీ బయోటెక్నాలజీ హైదరాబాద్లో పూర్తి చేశాడు. చదువుకుంటున్న సమయంలో తల్లిదండ్రులకు భారం కావద్దని నల్లకుంటలో ఎస్టీడీ బూత్లో పనిచేశాడు. ఢిల్లీ, డెహ్రాడూన్లో మెడికల్ యూనివర్సిటీలో పనిచేశారు. ఏది చేసిన అందులో తృప్తి లేదని గ్రహించిన బాలకృష్ణ.. వినూత్నంగా ఆలోచించాడు. 2020లో కరోనాతో ఉద్యోగాలు పోవడం చూసి మనమే ఎందుకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని ఆలోచించి హైదరాబాద్కు తిరిగొచ్చాడు.అక్కాచెల్లెళ్లు సునీత, అనిత, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్నేహితుల అండతో రూ.20 లక్షల పెట్టుబడితో స్వీట్ వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. ఏదైనా బ్రాండ్ ప్రజల్లోకి సులభంగా వెళ్లేలా ఉండాలని తన ఊరు పేరుతో ‘పోతుగల్ స్వీట్స్’ను 2021లో సరూర్నగర్లో అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా బ్రాంచ్ ఓపెన్ చేశారు. హైదరాబాద్లోని కొంపల్లి, హైటెక్సిటీ, కొత్తపేట్, కర్మాన్ఘాట్లలో బ్రాంచ్లు ప్రారంభించారు. స్వీట్స్ వ్యాపారంతోపాటు తంగెడు పేరుతో రెస్టారెంట్, గునుగు పేరుతో క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. దుబాయ్లో నెల రోజుల కిందట పోతుగల్ స్వీ ట్స్ షాప్ ప్రారంభించాడు. రుచి.. శుచి.. నాణ్యతలే ప్రామాణికం ఏ వ్యాపారం ప్రారంభించినా నాణ్యత.. రుచి.. శుచితోనే విజయం సాధిస్తామని నమ్మి బాలకృష్ణ పోతుగల్ స్వీట్స్ను నడిపిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా కస్టమర్ల నమ్మకాన్ని చూరగొన్నాడు. స్వీట్స్ రంగంలో అప్పటికే మార్కెట్లో పేరు గడించిన వ్యాపారులతో పోటీని తట్టుకొని రూ.వంద కోట్ల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాడు. స్నేహితులు రఘునాథ్రెడ్డి, సుధాకర్రెడ్డి, మహేందర్రెడ్డి అండతో స్వీట్స్ వ్యాపారం చేస్తూ 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాడు. ‘పోతుగల్ ట్రెడిషన్ అండ్ హెరిటేజ్ స్వీట్స్’ పేరుతో సంప్రదాయ మిఠాయిలకు కేరాఫ్ అడ్రస్గా బాలకృష్ణ బ్రాంచీలు నిలుస్తున్నాయి. తనకు కేటీఆర్ రోల్ మోడల్ అని కష్టపడి పనిచేసి నిజాయితీగా వ్యాపారం చేస్తే అది విజయతీరాలకు చేరుస్తుందని బాలకృష్ణ అంటున్నాడు. వెయ్యి మందికి ఉపాధి కల్పించి.. అమెరికా, బ్రిటన్లలో పోతుగల్ స్వీట్స్ (Pothgaal Sweets) ప్రారంభించే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్నట్లు పేర్కొన్నాడు.చదవండి: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు యమ డిమాండ్.. త్వరపడండి సంప్రదాయాలకు పెద్దపీట నాణ్యత, స్వచ్ఛతలకు తోడు కస్టమర్ల నమ్మకానికి ప్రాధాన్యం కల్పిస్తూ పనిచేస్తున్నాం. పండుగలు, వేడుకలకు వినియోగించే స్వీట్లను అంతే పవిత్రతతో అందిస్తున్నాం. ఆ నమ్మకమే వంద కోట్ల వ్యాపారానికి నాంది వేస్తుంది. ఎయిర్పోర్టులు, విదేశాల్లో బ్రాంచ్లు ఓపెన్ చేస్తాం. వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. – దొంతినేని బాలకృష్ణ, పోతుగల్ స్వీట్స్ యజమాని -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోనస్ బొనాంజా!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటాదారులకు బోనస్ షేర్ల జారీ సహా.. ప్రత్యేక మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు ప్రతిపాదించింది. ఈ నెల 19న(శనివారం) నిర్వహించనున్న సమావేశంలో బోర్డు ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక (ఏప్రిల్–జూన్) ఫలితాలను సైతం శనివారం సమావేశంలో బ్యాంక్ ప్రకటించనుంది. కాగా.. గతేడాది(2024–25)కి ప్రచురించిన వార్షిక నివేదికలో పరిశ్రమకు అనుగుణంగా ఈ ఏడాది రుణాల్లో వృద్ధి నమోదుకానున్నట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు.రుణ రేట్లను తగ్గించిన ఐవోబీ ప్రభుత్వరంగ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును (ఎంసీఎల్ఆర్) 10 బేసిస్ పాయింట్ల (0.10 శాతం) మేర తగ్గించినట్టు ప్రకటించింది. అన్ని రకాల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రుణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.జూలై 15 నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. సవరణ అనంతరం ఓవర్నైట్ కాల వ్యవధి ఎంసీఎల్ఆర్ 8.15 శాతం, ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.40%, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.80 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతానికి దిగొచ్చాయి. ఆటో, వ్యక్తిగత తదితర కన్జ్యూమర్ రుణాలకు ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు అమలు చేస్తుంటాయి. -
కొత్త టెక్నాలజీతో ఫ్యాన్లు ఆవిష్కరణ
ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ బీఎల్డీసీ టెక్నాలజీతో నడిచే వీ-గార్డ్ కొత్త ఎయిర్ విజ్ సిరీస్ సీలింగ్ ఫ్యాన్లను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటిలో స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. హైస్పీడ్ ఎయిర్ ఫ్లోతో కేవలం 35 వాట్ల విద్యుత్ వినియోగంతో ఇవి పనిచేస్తాయని చెప్పింది. 4/8 గంటల ఆటో-ఆఫ్ టైమర్తో రిమోట్ ఆపరేట్ సదుపాయం ఉందని పేర్కొంది.ఎయిర్ విజ్ సిరీస్లో భాగంగా విభిన్న వేరియంట్లను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఎయిర్విజ్ లైట్, ఎయిర్విజ్ ప్రైమ్, ఎయిర్విజ్ ప్లస్, ఎయిర్విజ్ ఎన్లను ఆవిష్కరించింది. వేరియంట్ను అనుసరించి ప్రత్యేక ఫీచర్లు ఉన్నట్లు చెప్పింది. వీటిని వీ-గార్డ్స్ రూర్కీ ఫెసిలిటీలో రూపొందిస్తున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: రూ.19,500 విలువైన సబ్స్క్రిప్షన్ ఉచితం!ఈ సందర్భంగా వీ-గార్డ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిథున్ చిట్టిలపల్లి మాట్లాడుతూ..‘ఎయిర్ విజ్ బీఎల్డీసీ(బ్రష్ లెస్ డైరెక్ట్ కరెంట్-ఏసీ మోటార్లను ఉపయోగించే సంప్రదాయ ఫ్యాన్ల మాదిరిగా కాకుండా, బీఎల్డీసీ ఫ్యాన్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ ద్వారా నియంత్రించబడే శాశ్వత మాగ్నెట్ మోటార్ను ఉపయోగిస్తాయి) ఫ్యాన్ను ఆవిష్కరించడం సంస్థ ప్రయాణంలో కీలక మైలురాయిని సూచిస్తుంది. వృద్ధి, ఇన్నోవేషన్పరంగా ఫ్యాన్ కేటగిరీ మా వ్యాపారానికి చాలా ముఖ్యం. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా బీఎల్డీసీ సాంకేతికత చాలా అవసరం’ అన్నారు. -
జియో బ్లాక్ రాక్ నుంచి ఐదు కొత్త ఫండ్స్
జియో బ్లార్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల ఎన్ఎఫ్వోలను చేపట్టేందుకు సెబీ అనుమతి మంజూరు చేసింది. జియో బ్లాక్రాక్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్రాక్ నిఫ్టీ 8–13 జీ–సెక్ ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్రాక్ నిఫ్టీ స్మాల్క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్రాక్ నిఫ్టీనెక్ట్స్ 50 ఇండెక్స్ ఫండ్, జియో బ్లాక్రాక్ నిఫ్టీ మిడ్క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్కు అనుమతి లభించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఐవీఎఫ్ హాస్పటల్వీటిల్లో నాలుగు ఈక్విటీ ఆధారిత ఇండెక్స్ పథకాలు కాగా, ఒక్కటి డెట్ ఆధారిత ఇండెక్స్ ఫండ్. జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ మొదటిసారి 3 డెట్ ఫండ్స్ ఎన్ఎఫ్వోల (లిక్విడ్ ఫండ్, ఓవర్నైట్ ఫండ్, మనీ మార్కెట్ ఫండ్) రూపంలో రూ.17,800 కోట్లను సమీకరించినట్టు ఈ నెల 7న ప్రకటించడం తెలిసిందే. -
కొలువుల పండుగ!
ముంబై: ఈసారి పండుగ సీజన్లో కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోనున్నాయి. దీంతో 2025 ద్వితీయార్థంలో 2.16 లక్షల పైచిలుకు గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే కొలువులు 15–20 శాతం పెరగనున్నాయి. రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్ఎస్ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య, ట్రావెల్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయి. వర్క్ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివిధ వేదికల్లో తమ క్లయింట్లు పోస్ట్ చేసే ఖాళీలు, పరిశ్రమ నివేదికలు మొదలైన డేటా ఆధారంగా అడెకో ఇండియా దీన్ని రూపొందించింది. రాఖీ, దసరా, దీపావళిలాంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఉద్దేశంతో నియామకాలు పుంజుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. సాధారణం కంటే ఈసారి పండుగ సీజన్ మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను కాస్తంత ముందుగానే మొదలుపెట్టాయని వివరించింది. వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడటం, సానుకూల వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక పరిస్థితులపై ఆశావహ అంచనాలు నెలకొనడం, సీజనల్ అమ్మకాల విషయంలో కంపెనీలు దూకుడుగా ప్రచారం చేస్తుండటం వంటి అంశాలు ఈసారి హైరింగ్కి దన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది. ‘ఈ పండుగ సీజన్లో డిమాండ్ చాలా వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా పరిశ్రమ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. గతంలో కంపెనీలు సంఖ్యాపరంగా ఎంత మందిని తీసుకున్నాం అనేదే చూసేవి. కానీ ఇప్పుడు, అభ్యర్థ్ధులు ఎంత త్వరగా ఉద్యోగంలో చేరగలరు, ఎంత సన్నద్ధంగా ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో పరిస్థితులకు ఎంత వేగంగా సర్దుకోగలరులాంటి అంశాలపై కూడా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్ దీపేశ్ గుప్తా తెలిపారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → హైదరాబాద్తో పాటు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెలాంటి పెద్ద నగరాల్లో సీజనల్ హైరింగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే అవకాశాలు 19% అధికం. → లక్నో, జైపూర్, కోయంబత్తూర్, నాగ్పూర్, భువనేశ్వర్, మైసూరు, వారణాసిలాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా డిమాండ్ 42% పెరిగింది. విజయవాడ, కాన్పూర్, కొచ్చిలాంటి వర్ధమాన హబ్లలోనూ హైరింగ్ అంచనాలు మెరుగ్గా న్నాయి. → మెట్రో మార్కెట్లలో వేతనాలు 12–15%, వర్ధ మాన నగరాల్లో 18–22% స్థాయిలో పెరగవచ్చు. → స్వల్పకాలిక ఈ ఏడాది సీజనల్ హైరింగ్లో మహిళల వాటా 23 శాతం పెరగనుంది. → పండుగ సీజన్లో డిమాండ్ భారీగా ఉన్న సమయాల్లో కంపెనీలు లాస్ట్–మైల్ కార్యకలాపాలను (కస్టమర్ల ఇంటి దగ్గరకే ఉత్పత్తులను చేర్చడం) కూడా పటిష్టపర్చుకోనుండటంతో లాజిస్టిక్స్, డెలివరీల్లో హైరింగ్ 30–35% ఎగబాకనుంది. → బీఎఫ్ఎస్ఐ రంగాన్ని తీసుకుంటే .. క్రెడిట్ కార్డుల అమ్మకాలు, పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) ఇన్స్టాలేషన్ల కోసం (ముఖ్యంగా ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో) కంపెనీలు పెద్ద స్థాయిలో నియామకాలు చేపడుతున్నాయి. ఈ విభాగంలో డిమాండ్ 30 శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. → హాస్పిటాలిటీ, ట్రావెల్ సెగ్మెంట్లలో రిక్రూట్మెంట్ డిమాండ్ 20–25% ఉండొచ్చు. → మొత్తం సీజనల్ ఉద్యోగాల కల్పనలో 35–40% వాటాతో రిటైల్, ఈ–కామర్స్ విభాగాల ఆధిపత్యం కొనసాగనుంది. → డిజిటల్పై పట్టు, బహుభాషా సామర్థ్యాలు, కస్టమర్లను హ్యాండిల్ చేయగలిగే నైపుణ్యాలకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నా యి. ఇన్–స్టోర్ సేల్స్, క్రెడిట్ కార్డ్ ప్రమోషన్లు, డెలివరీ ఉద్యోగాల కోసం ఈ నైపుణ్యాలను చూస్తున్నాయి. -
ఉపాధి కల్పించేలా రూ.200 కోట్లు పెట్టుబడి
సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ దేశీయంగా యువతకు చేయూతనివ్వనుంది. ఇందుకు సీఎస్ఆర్ విభాగం ఇన్ఫోసిస్ ఫౌండేషన్.. తాజాగా ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్కు తెరతీసింది. తద్వారా 2030కల్లా 5 లక్షల మంది ఉద్యోగార్ధులకు అర్థవంతమైన ఉపాధిని కల్పించేందుకు దారి చూపనుంది.ఇదీ చదవండి: డాలీ చాయ్వాలా ఫ్రాంచైజీలకు 1600 దరఖాస్తులుఇందుకు తొలి దశలో రూ.200 కోట్లు వెచ్చించనుంది. గ్రాడ్యుయేట్లు, అండర్గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించడంపై దృష్టి సారించనుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్(స్టెమ్), నాన్స్టెమ్ రంగాలలో యువతకు మద్దతివ్వనుంది. నైపుణ్య పెంపు కార్యక్రమాలపై దృష్టి పెట్టడం దేశీయంగా అతిపెద్ద అవకాశమని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మాణీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
డాలీ చాయ్వాలా ఫ్రాంచైజీలకు 1600 దరఖాస్తులు
పక్కవీధిలోని చిన్న కొట్టులో చాయ్ అమ్ముకునే వ్యక్తి క్రమంగా ఎదుగుతూ, అందరూ ఆదరించేలా చాయ్ తయారు చేస్తూ.. దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ఏర్పాటు చేసే స్థాయికి వెళ్తే.. ఆహా అనాల్సిందే కదా. నాగ్పూర్కు చెందిన డాలీ బతుకుతెరువు కోసం చిన్న కొట్టులో చాయ్ అమ్ముతుండేవాడు. ఒక్కసారి తన చాయ్ తాగినవారు మళ్లీ తాగాలనిపించేలా తయారు చేయడం తన ప్రత్యేకత. దాంతో నగరంలోని చాలా ప్రదేశాల నుంచి తన టీస్టాల్ వద్దకు కస్టమర్లు వచ్చేవారు. క్రమంగా నాగ్పూర్లో డాలీ చాలా ఫేమస్ అయ్యారు.ఒకనొక సందర్భంలో డాలీ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్కు తన చాయ్ రుచి చూపించే అవకాశం కూడా వచ్చింది. దాంతో డాలీ చాయ్వాలా మరింత ఫేమస్ అయ్యారు. ఇటీవల డాలీ చాయ్వాలా ‘డాలీ కీ తప్రి’ పేరుతో దేశవ్యాప్తంగా ఫ్రాంచైజీలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దాంతో ఏకంగా రెండు రోజుల్లో 1,600కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందుకోసం ప్రత్యేకంగా ధరలు కూడా నిర్ణయించారు. కార్ట్ స్టాల్ కోసం రూ.4.5 లక్షలు-రూ.6 లక్షలు, స్టోర్ మోడల్ రూ.20 లక్షలు-రూ.22లక్షలు, రూ.ఫ్లాగ్షిప్ కేఫ్ రూ.39 లక్షలు-రూ.43 లక్షలు వరకు ఫ్రాంచైజీ ధరలున్నాయి.ఒక వీడియోలో డాలీ తన విజయం గురించి మాట్లాడుతూ..‘నాకు పాఠశాలకు వెళ్లే అవకాశం రాలేదు. కానీ నేనెప్పుడూ అవకాశాలను వదులుకోలేదు. చాయ్తో ప్రత్యేక ఐడెంటిటీని సంపాదించుకున్నాను. నాతో పాటు ఇతరులు ఎదగాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఫ్రాంచైజీ ప్రకటనలో భాగంగా డాలీ తన ఇన్స్టాగ్రామ్లో ‘ఇది భారతదేశపు మొదటి వైరల్ స్ట్రీట్ బ్రాండ్. ప్రస్తుతం ఇది నిజమైన అభిరుచి ఉన్న వ్యక్తులను ఒక వ్యాపార అవకాశం’ అని రాసుకొచ్చారు.ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ‘బర్గర్లు తింటారా అని అడిగే స్థాయి నుంచి వాటిని విక్రయించే స్థాయికి చేరారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకొకరు వార్నింగ్ ఇస్తూ ‘ఏ ఫ్రాంచైజీ తీసుకోకండి’ అంటూ రిప్లై ఇచ్చాడు. -
గగనతల రారాజులు
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జాతీయ భద్రతకు మూలస్తంభంగా నిలుస్తోంది. నిత్యం గగనతలాన్ని కాపాడుతూ, దేశ రక్షణకు దోహదం చేస్తోంది. ముష్కర మూకలను ముద్దాడుతోన్న పాకిస్థాన్కు ఆపరేషన్ సింధూర్ సమయంలో చుక్కలు చూపించిన భారత వీరుల్లో ఐఏఎఫ్ ఆఫీసర్లు కీలకపాత్ర పోషించారు. యుద్ధంలోనే కాకుండా ఐఏఎఫ్ అధికారులు ఇతర సమయాల్లోనూ చాలానే విధులు నిర్వర్తిస్తారు. ఉద్యోగంలో చేరి ఉన్నతస్థాయిలో పనిచేస్తున్నవారిపై మరింత బాధ్యతలుంటాయి. అయితే ఐఏఎఫ్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగంగా ఉన్న ఫ్లయింగ్ ఆఫీసర్ ఎలాంటి విధులు నిర్వర్తిస్తారు..ఎలాంటి అధికారులున్నాయి.. ఏయే సవాళ్లున్నాయో వివరంగా తెలుసుకుందాం.ఫ్లయింగ్ ఆఫీసర్ఫ్లయింగ్ ఆఫీసర్ అనేది ఐఏఎఫ్లో ఎంట్రీ లెవల్ కమిషన్డ్ ఆఫీసర్ ర్యాంక్. ఇది ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ లేదా ఇండియన్ నేవీలో సబ్ లెఫ్టినెంట్కు సమానం. దేశవ్యాప్తంగా రిక్రూట్ అయిన ఫ్లయింగ్ ఆఫీసర్లకు సాధారణంగా హైదరాబాద్లోని దుండిగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) లేదా ఇతర సంస్థల్లో కఠినమైన శిక్షణ అందిస్తారు. రిక్రూట్ అయిన తర్వాత ఫ్లయింగ్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ లేదా గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ వంటి ఐఏఎఫ్ శాఖల్లో వారి ప్రతిభ ఆధారంగా పని చేయాలి. ఫ్లయింగ్ బ్రాంచ్లోని ఫ్లయింగ్ ఆఫీసర్లు ఆపరేషనల్ రోల్స్లో కీలకంగా వ్యవహరిస్తారు.భారత వైమానిక దళంలో ఫ్లయింగ్ ఆఫీసర్ విధులు1. ఆపరేషనల్ ఫ్లయింగ్ డ్యూటీలుఫ్లయింగ్ బ్రాంచ్లోని ఫ్లయింగ్ ఆఫీసర్లకు వారి స్పెషలైజేషన్ను బట్టి యుద్ధ విమానాలు, రవాణా విమానాలు లేదా హెలికాప్టర్లతో సహా అధునాతన విమానాలను ఆపరేట్ చేయడం, వాటిని నిర్వహించాల్సి ఉంటుంది.యుద్ధ కార్యకలాపాలు: సుఖోయ్ ఎస్ యూ-30 ఎంకేఐ, రాఫెల్ లేదా తేజస్ వంటి ఫైటర్ స్క్వాడ్రన్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ యుద్ధ మిషన్లలో పాల్గొంటారు. వ్యూహాత్మక విన్యాసాలను అమలు చేయడం, కచ్చితమైన దాడులను నిర్ధారించడం, సంఘర్షణలు లేదా విన్యాసాల సమయంలో వైమానిక ఆధిపత్యాన్ని నిర్వహించడానికి వారు బాధ్యత వహిస్తారు.రవాణా, లాజిస్టిక్స్: రవాణా స్క్వాడ్రన్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు సీ-130జే సూపర్ హెర్క్యులస్ లేదా ఐఎల్ -76 వంటి విమానాలను నడుపుతారు. దళాల రవాణా, విపత్తు సమయంలో, ఎయిర్ డ్రాప్స్, మారుమూల ప్రాంతాలకు సరఫరా మిషన్లను నిర్వహిస్తారు. తరచుగా సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సిబ్బంది, సామగ్రిని సకాలంలో సురక్షితంగా డెలివరీ చేయాల్సి ఉంటుంది.హెలికాఫ్టర్ ఆపరేషన్స్: హెలికాప్టర్ యూనిట్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు ఎంఐ-17, చినూక్ లేదా ధృవ్ వంటి విమానాలను నడుపుతారు. సెర్చ్ అండ్ రెస్క్యూ, క్యాజువాలిటీ తరలింపు, దళాల ప్రవేశం, విపత్తు సమయంలో వెంటనే ప్రతిస్పందించాలి.మిషన్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్: ఫ్లయింగ్ ఆఫీసర్లు మిషన్ లక్ష్యాలు, వాతావరణ పరిస్థితులు, ఇంటెలిజెన్స్ నివేదికలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్రీ-ఫ్లైట్ ప్లానింగ్లో పాల్గొంటారు. వారు గ్రౌండ్ సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇతర యూనిట్లతో సమన్వయం చేసుకుని మిషన్లను నిరాటంకంగా అమలు చేయాలి.శిక్షణ, వ్యాయామాలు: ఫ్లయింగ్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా శిక్షణ, వ్యాయామాల్లో పాల్గొనాలి. (ఉదా. వ్యాయామం గగన్ శక్తి లేదా రెడ్ ఫ్లాగ్ వంటి మల్డిలెవల్ వ్యాయామాలు). వీటివల్ల వారి ఎగిరే నైపుణ్యాలు, సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యం మెరుగు పడుతుంది.2. నాయకత్వ బాధ్యతలుకమిషన్డ్ ఆఫీసర్లుగా ఫ్లయింగ్ అధికారులు జూనియర్ స్థాయిలో కూడా కొన్నిసార్లు తమ బృందాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది.స్క్వాడ్రన్ విధులు: ఒక స్క్వాడ్రన్లో ఫ్లయింగ్ ఆఫీసర్లు స్క్వాడ్రన్ లీడర్లు లేదా వింగ్ కమాండర్లు వంటి సీనియర్ అధికారుల కింద పనిచేయాలి. ఈ సమయంలో ఎయిర్మెన్, టెక్నీషియన్లు లేదా గ్రౌండ్ క్రూ బృందాలకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. తమ యూనిట్లోని సభ్యులకు క్రమశిక్షణ, నైతిక స్థైర్యాన్ని నింపాలి.ఫ్లైట్ కమాండ్: మిషన్ల సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్ సంక్లిష్టమైన విన్యాసాలు చేయాలి. ఇతర పైలట్లతో సమన్వయం చేస్తూ సెక్షన్ లీడర్ లేదా వింగ్ మ్యాన్గా నాయకత్వం వహించాలి. దీనికి క్షణాల్లో నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అవసరం.మెంటార్షిప్: ఫ్లయింగ్ ఆఫీసర్లు జూనియర్ ఎయిర్ మెన్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్లకు మార్గనిర్దేశం చేస్తారు. ప్రొఫెషనలిజం, టీమ్ వర్క్ సంస్కృతిని పెంపొందిస్తారు.3. అడ్మినిస్ట్రేటివ్, లాజిస్టిక్ బాధ్యతలుఆపరేషనల్ పాత్రలకు మించి, ఫ్లయింగ్ ఆఫీసర్లు తమ యూనిట్లు సజావుగా పనిచేసేలా చూడాలి. అందుకు అడ్మినిస్ట్రేటివ్ విధులను నిర్వహిస్తారు.డాక్యుమెంటేషన్, రిపోర్టింగ్: మిషన్ లాగ్లు, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ రిపోర్టులు, పనితీరు మదింపులతో సహా విమాన కార్యకలాపాల రికార్డులను నిర్వహిస్తారు. ఆపరేషనల్ అనాలిసిస్, సేఫ్టీ ఆడిట్లకు కచ్చితమైన డాక్యుమెంటేషన్ కీలకం.గ్రౌండ్ క్రూలతో సమన్వయం: ఫ్లయింగ్ ఆఫీసర్లు సాంకేతిక బృందాలతో సంప్రదింపులు జరిపి విమాన మిషన్ సిద్ధంగా ఉండేలా చూస్తారు. నిత్యం వాటి పరిస్థితిని తనిఖీ చేస్తారు. నిర్వహణ షెడ్యూళ్లను సమన్వయం చేస్తారు. సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు.శిక్షణ పర్యవేక్షణ: శిక్షణ యూనిట్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు క్యాడెట్లు లేదా కొత్త పైలట్లకు సూచనలు ఇవ్వడంలో, సిమ్యులేటర్ సెషన్లను పర్యవేక్షించడంలో, ప్రాథమిక విమాన శిక్షణలో సహాయపడుతారు. ట్రైనీలు ఐఏఎఫ్ ప్రమాణాలు, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించేలా చూస్తారు.4. టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీటెక్నికల్ బ్రాంచ్: టెక్నికల్ బ్రాంచ్ (ఏరోనాటికల్ ఇంజినీరింగ్ - ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్)లో ఫ్లయింగ్ ఆఫీసర్లు విమానాలు, వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషనల్ సంసిద్ధతను పర్యవేక్షిస్తారు. సమస్యలను పరిష్కరించడానికి, విడిభాగాలను నిర్వహించడానికి, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి టెక్నీషియన్లతో కలిసి పనిచేస్తారు.గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్: అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ లేదా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి పాత్రల్లో ఫ్లయింగ్ ఆఫీసర్లు ఎయిర్బేస్ కార్యకలాపాలు, సిబ్బంది సంక్షేమం లేదా గగనతల సమన్వయాన్ని నిర్వహించాలి. ఉదాహరణకు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లోని ఫ్లయింగ్ ఆఫీసర్ సురక్షితమైన టేకాఫ్లు, ల్యాండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలి.5. అత్యవసర సేవలువిపత్తు నిర్వహణ: వరదలు, భూకంపాలు లేదా తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో రవాణా లేదా హెలికాప్టర్ స్క్వాడ్రన్లలో ఫ్లయింగ్ ఆఫీసర్లు సహాయక సామాగ్రిని అందిస్తారు. ప్రమాద స్థలాల నుంచి పౌరులను ఖాళీ చేయిస్తారు. గ్రౌండ్ ఆపరేషన్లకు మద్దతు ఇస్తారు.సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్ఏఆర్): హెలికాప్టర్ ఫ్లయింగ్ ఆఫీసర్లు హిమాలయాల్లో ఎత్తైన రెస్క్యూలు లేదా హిందూ మహాసముద్రంపై సముద్ర రెస్క్యూ వంటి సవాలుతో కూడిన వాతావరణంలో ఎస్ఏఆర్ మిషన్లను నిర్వహిస్తారు.వైద్య తరలింపు: ఎమర్జెన్సీ సమయాల్లో పౌరులను వైద్య సౌకర్యాలకు తరలించడానికి సహాయపడతారు.ఫ్లయింగ్ ఆఫీసర్ అధికారాలు1. కమాండ్ అథారిటీఫ్లయింగ్ ఆఫీసర్లు తమ అధీనంలోని ఎయిర్ మెన్, నాన్ కమిషన్డ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. గ్రౌండ్ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం, మిషన్ పనులను సమన్వయం చేయడం, ఐఏఎఫ్ ప్రోటోకాల్స్ పాటించేలా చూడటం ఇందులో భాగం.ఆపరేషనల్ సందర్భాల్లో వారు తమ మిషన్ సంక్షిప్త పరిధిలో విమాన మార్గాలను మార్చడం లేదా బెదిరింపులకు ప్రతిస్పందించడం వంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చు.2. క్రమశిక్షణ అధికారాలుప్రవర్తనా ఉల్లంఘనలు లేదా ఆదేశాలను పాటించడంలో విఫలం కావడం వంటి వాటికి ప్రతిచర్యగా ఫ్లయింగ్ ఆఫీసర్లు సబార్డినేట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. తీవ్రమైన ఉల్లంఘనలను వైమానిక దళ చట్టం, 1950 ప్రకారం తదుపరి చర్యల కోసం సీనియర్ అధికారులకు నివేదిస్తారు.3. డెసిషన్ మేకింగ్మిషన్ల సమయంలో ఫ్లయింగ్ ఆఫీసర్లు లక్ష్యాలను చేధించడం, భద్రతా ఆందోళనల కారణంగా మిషన్లను నిలిపివేయడం లేదా ఇతర యూనిట్లతో సమన్వయం చేయడం వంటి రియల్ టైమ్ నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటారు. ఈ నిర్ణయాలు మిషన్ లక్ష్యాలు, ఐఏఎఫ్ ప్రోటోకాల్స్ ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి.4. సున్నిత సమాచారంమిషన్ ప్లాన్స్, ఇంటెలిజెన్స్ రిపోర్టులు, టెక్నికల్ డేటాతో సహా సున్నితమైన సమాచారాన్ని ఫ్లయింగ్ ఆఫీసర్లకు అప్పగిస్తారు. అధికారిక రహస్యాల చట్టం, 1923, ఐఏఎఫ్ భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం ఈ సమాచారాన్ని సంరక్షించే బాధ్యత వారిదే.ఇదీ చదవండి: దిగొస్తున్న బంగారం ధరలుఫ్లయింగ్ ఆఫీసర్లు ఎదుర్కొంటున్న సవాళ్లుఫ్లయింగ్ ఆఫీసర్ పాత్రకు శారీరక దృఢత్వం, మానసిక స్థితి, సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం.ఒత్తిడి: యుద్ధం లేదా ప్రతికూల పరిస్థితుల్లో అధునాతన విమానాలను నడపడం వల్ల ఒత్తిడిలో కచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకోవాలి.సుదీర్ఘ పని గంటలు: ఫ్లయింగ్ ఆఫీసర్లు అవసరమైనప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయాలి. రిమోట్ లేదా ఫార్వర్డ్ ప్రాంతాల్లో గడపాల్సి ఉంటుంది.నిరంతర అభ్యాసం: విమానయాన సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో నిత్యం ఫ్లయింగ్ ఆఫీసర్లు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. వాని నైపుణ్యాలను అప్డేట్ చేస్తుండాలి. -
టెస్లా కారు వచ్చేసింది..
ముంబై: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా తాజాగా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. అలాగే, మధ్య స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ ’వై’ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఈ షోరూంను ప్రారంభించారు. టెస్లా భారత్లోనే పరిశోధనలు, తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా ఎక్స్పీరియన్స్ సెంటర్లు, సర్వీస్, చార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు టెస్లా ఏపీఏసీ (ఏషియా పసిఫిక్) రీజియన్ చీఫ్ ఇసాబెల్ ఫాన్ తెలిపారు. ముంబై, ఢిల్లీలో 4 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జర్మన్ కార్లతో పోటీ.. దేశీ మార్కెట్లో మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడిలాంటి జర్మన్ ఎలక్ట్రిక్ లగ్జరీ కార్లతో టెస్లా మోడల్ వై పోటీపడనుంది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల కార్ల ధర రూ. 30 లక్షల లోపే ఉంటోంది. దేశీయంగా ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్ ప్రస్తుతం కార్ల దిగుమతులపై 70–100 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. వీటిని తగ్గించాలని కోరుతున్న టెస్లా, దేశంలో ముందుగా తమ కార్లను అమ్ముకునేందుకు, సర్విస్ చేసేందుకు అనుమతిస్తే, అమ్మకాలను బట్టి తయారీ చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తామంటూ టెస్లా చెబుతోంది. కానీ, ఏ ఒక్క కంపెనీకో ప్రయోజనం చేకూర్చేలా విధానాలు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో భారత్లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తామనే హామీ ఇచ్చే కంపెనీలు 15 శాతం సుంకానికే ఏటా 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది.రెండు వేరియంట్లు..మోడల్ వై రెండు వేరియంట్స్లో లభిస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 500 కి.మీ. రేంజిని (మైలేజీ) ఇచ్చే రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ బేస్ ధర రూ. 59.89 లక్షలుగా ఉంటుంది. 622 కి.మీ. రేంజినిచ్చే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలుగా ఉంటుంది. 2025 మూడో త్రైమాసికం లేదా నాలుగో త్రైమాసికం నుుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.దీన్ని కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా చైనాలోని తమ ప్లాంటు నుంచి టెస్లా దిగుమతి చేసుకుని, ఇక్కడ విక్రయిస్తుంది. ముందుగా ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్లో డెలివరీలు, రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. టెస్లా డిజైన్ స్టూడియో ద్వారా వాహనం లోపల, వెలుపల, అలాగే ఫీచర్లను కూడా కస్టమైజ్ చేసుకోవచ్చని పేర్కొంది. భారత్లో టెస్లా వాహనాలకు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్, ఎకో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు బీమా కవరేజీని అందిస్తాయి.ధరలు ఇలా.. (కంపెనీ వెబ్సైట్ ప్రకారం..) ⇒ మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 59.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్రోడ్ ధర రూ. 61,07,190.⇒ మోడల్ వై లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 67.89 లక్షలు (ముంబై ఎక్స్–షోరూం), ఆన్రోడ్ ధర రూ. 69,15,190.⇒ బుకింగ్ అమౌంట్ రూ. 22,220గా (నాన్–రిఫండబుల్) ఉంటుంది. తుది ధ్రువీకరణ కోసం ఏడు రోజుల్లోగా మరో రూ. 3 లక్షలు చెల్లించాలి. ⇒ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (ఎఫ్ఎస్డీ) ఆప్షన్ కోసం అదనంగా రూ. 6 లక్షలు.⇒ అమెరికాలో నగదు రూపంలో చెల్లిస్తే లాంగ్ రేంజ్ రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 37,490 డాలర్లుగా (సుమారు రూ. 32.24 లక్షలు) ఉంది.ప్రత్యేకతలు.. ⇒ గంటకు 0 – 100 కి.మీ. వేగం 5.6 సెకన్లలో⇒ వెనుక కూర్చునే వారి కోసం ఎనిమిది అంగుళాల స్క్రీన్, 9 స్పీకర్లు⇒ టాప్ స్పీడ్ గంటకు 201 కి.మీ.⇒ ఫాస్ట్ చార్జర్లతో 15 నిమిషాల్లో 267 కి.మీ. చార్జింగ్⇒ వెలుపల ఎనిమిది కెమెరాలు⇒ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్⇒ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్⇒ రెండు వేరియంట్లు, ఆరు రంగుల్లో లభ్యం ⇒ వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, వైర్లెస్ చార్జర్ -
ఓలా ఎలక్ట్రిక్, టాటా టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాలు
ద్విచక్ర ఈవీల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. త్రైమాసికవారీగా ఏప్రిల్–జూన్(క్యూ1)లో మొత్తం ఆదాయం 36 శాతం ఎగసి రూ. 828 కోట్లను తాకింది. గతేడాది(2024–25) చివరి త్రైమాసికం(జననవరి–మార్చి)లో కేవలం రూ. 611 కోట్ల టర్నోవర్ నమోదైంది. ఈ కాలంలో 33 శాతం వృద్ధితో 68,192 వాహనాలను డెలివరీ చేసింది. గత క్యూ4లో 51,375 యూనిట్లను డెలివరీ చేసింది. ఆటో బిజినెస్ జూన్లో సానుకూల నిర్వహణ లాభం(ఇబిటా)స్థాయికి చేరినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు బలపడిన స్థూల మార్జిన్లు దోహదపడినట్లు వెల్లడించింది.ప్రాజెక్ట్ లక్ష్యనిర్వహణ సామర్థ్యాలను భారీగా మెరుగుపరచినట్లు పేర్కొంది. దీంతో నెలవారీ ఆటో నిర్వహణ వ్యయాలు రూ. 178 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు తగ్గినట్లు వివరించింది. కన్సాలిడేటెడ్ నిర్వహణ వ్యయాలు ప్రస్తుతం నెలకు రూ. 150 కోట్లు చొప్పున నమోదవుతున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది 3,25,000–3,75,000 వాహనాలు విక్రయించగలమని అంచనా వేసింది. తద్వారా రూ. 4,200–4,700 కోట్ల ఆదాయం సాధించనున్నట్లు అభిప్రాయపడింది. రెండో త్రైమాసికం(జులై–సెపె్టంబర్) నుంచి సానుకూల ఇబిటాను కొనసాగించే వీలున్నట్లు తెలియజేసింది. కొత్తగా విడుదల చేసిన జెన్ 3 స్కూటర్లు క్యూ1 విక్రయాలలో 80 శాతం వాటా ఆక్రమించినట్లు వెల్లడించింది. రోడ్స్టెర్ ఎక్స్ మోటార్సైకిళ్లు దేశవ్యాప్తంగా 200 స్టోర్లలో అందుబాటులోకిరాగా.. రానున్న పండుగల సీజన్లో అమ్మకాలు పుంజుకోనున్నట్లు ఆశిస్తోంది.టాటా టెక్నాలజీస్ లాభం ప్లస్క్యూ1లో రూ. 170 కోట్లుసాఫ్ట్వేర్ సేవల కంపెనీ టాటా టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ.170 కోట్లను అధిగమించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.162 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా నీరసించి రూ.1,244 కోట్లకు పరిమితమైంది. గత క్యూ1లో రూ.1,269 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,072 కోట్ల నుంచి రూ. 1,080 కోట్లకు నామమాత్రంగా పెరిగాయి. క్యూ1ను అప్రమత్తంగా ప్రారంభించినప్పటికీ క్లయింట్లు కంపెనీపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సీఈవో, ఎండీ వారెన్ హారిస్ పేర్కొన్నారు. వెరసి దీర్ఘకాలిక కట్టుబాట్లయిన ప్రొడక్ట్ ఇన్నోవేషన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ను కొనసాగించనున్నట్లు తెలియజేశారు. దీంతో ఆరు వ్యూహాత్మక డీల్స్ కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్, పీఎల్ఎమ్ సేవలకు వోల్వో కార్స్ వ్యూహాత్మక సరఫరాదారుగా ఎంపిక చేసుకున్నట్లు పేర్కొన్నారు. -
మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు
ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్)లో పని చేసేందుకు మెటా కళ్లు చెదిరిపోయే ప్యాకేజీలను ప్రకటిస్తోంది. యాపిల్, ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైండ్, ఆంత్రోపిక్..వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రపంచంలోని టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకులను ఆకర్షించడమే లక్ష్యంగా రూ.800 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల పరిహార ప్యాకేజీలను అందిస్తోంది.ఇటీవల మెటాలో చేరిన యాపిల్కు చెందిన రుమింగ్ పాంగ్కు రూ.1,600 కోట్లు (సుమారు 200 మిలియన్ డాలర్లు) పరిహార ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మెటా మాజీ ఓపెన్ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సాల్కు రూ.800 కోట్లు (100 మిలియన్ డాలర్లు) ఆఫర్ చేసినట్లు తెలిసింది. కంపెనీ ‘ఓ-సిరీస్’ మోడళ్లను సృష్టించడంలో బన్సాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మెటా ఈ ప్యాకేజీలను ధ్రువీకరించనప్పటికీ వేతనం, పరిహార బోనస్లు, స్టాక్ గ్రాంట్లు కలిపి కొన్ని కంపెనీల సీఈఓలు సంపాదించే వేతనంతో సమానంగా, అంతకుమించి ఉన్నాయని తెలుస్తుంది.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు చెక్ పెట్టేలా 5 జాగ్రత్తలుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు ఎంత ప్యాకేజీ చెల్లించేందుకైనా వెనుకాడడం లేదని సమాచారం. -
లక్షల మందిని ఊచకోత కోసి ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
ఈస్టిండియా కంపెనీ గుర్తుందా? ‘భారతదేశాన్ని 200 సంవత్సరాలు పాలించిన కంపెనీని ఎలా మరిచిపోగలం..’ అని అంటారు కదూ. ప్రస్తుతం ఈ సంస్థ ఒక భారతీయుడి అధీనంలో ఉందని చాలా కొద్ది మందికే తెలిసుంటుంది. ఈస్టిండియా కంపెనీకి ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాణిజ్య సంస్థగా పేరుంది. భారతదేశంపై బ్రిటిష్ సామ్రాజ్య పాలన కీలక ఏజెంట్గా ఈ కంపెనీ వ్యవహరించేది. కానీ ఇప్పుడు ఒక భారతీయ వ్యాపారవేత్త యాజమాన్యంలో ఉంది. అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.ఈస్టిండియా కంపెనీని క్వీన్ ఎలిజబెత్ 1600లో స్థాపించారు. ఈ కంపెనీని మొదట్లో సుగంధ ద్రవ్యాలు, పట్టు, పత్తి, ఇతర వస్తువులను దేశంలోని తూర్పు ప్రాంతాల నుంచి వర్తకం చేసేందుకు ప్రారంభించారు. కాలక్రమేణా ఇది ఒక వాణిజ్య సంస్థగా మారి, తర్వాతి కాలంలో సైనిక, పరిపాలనా శక్తిగా అభివృద్ధి చెందింది. చివరికి భారతదేశంలోని చాలా ప్రాంతాలను అన్యాయంగా తన అధీనంలోకి తీసుకుంది. 1857 తిరుగుబాటు తరువాత, 1874లో బ్రిటిష్ క్రౌన్ కంపెనీని రద్దు చేశారు. భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణ నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలు ముమ్మరంగా సాగేప్పుడు దాని సొంత ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. సొంతంగా కరెన్సీని ముద్రించింది. లక్షలాది మందిని దోపిడీ చేసింది.ఇదీ చదవండి: ఊగిసలాడుతోన్న పసిడి ధరలు..21వ శతాబ్దంలో యూకేలోని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త సంజీవ్ మెహతా ఈస్టిండియా కంపెనీ బ్రాండ్ను పునరుద్ధరించారు. మెహతా 2005లో ఈస్టిండియా కంపెనీ పేరుపై ట్రేడ్ హక్కులను పొందాడు. అప్పటి నుంచి దాని చారిత్రక మూలాలకు కట్టుబడి లగ్జరీ బ్రాండ్గా తీర్చిదిద్దాడు. మెహతా నాయకత్వంలో ఈస్టిండియా కంపెనీ లగ్జరీ టీలు, కాఫీలు, చాక్లెట్లు, మసాలా దినుసులు, ఆహార పదార్థాలను విక్రయించే హైఎండ్ బ్రాండ్గా పునర్నిర్మించారు. లండన్లోని మేఫేర్లో ఫ్లాగ్షిప్ స్టోర్ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రపంచ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. -
నేపాల్లో రిలయన్స్ సాఫ్ట్డ్రింక్స్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ ‘కాంపా కోలా’ను నేపాల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇందుకోసం కంపెనీ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్), నేపాల్కి చెందిన చౌదరి గ్రూప్తో (సీజీ) ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫుడ్, బెవరేజెస్ విభాగంలో క్యాంపా ఉత్పత్తుల తయారీ, దేశవ్యాప్తంగా పంపిణీకి సీజీ తోడ్పడుతుంది.కాంపా పోర్ట్ఫోలియో కింద తొలుత కాంపా కోలా, కాంపా లెమన్, కాంపా ఆరెంజ్, కాంపా ఎనర్జీ గోల్డ్ బూస్ట్, కాంపా ఎనర్జీ బెర్రీ కిక్ ఉత్పత్తులను ప్రవేశపెడతారు. ప్రాంతీయంగా మరింత వృద్ధి సాధించే దిశగా దీర్ఘకాలిక విజన్తో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆర్సీపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేతన్ మోదీ తెలిపారు. తమ బెవరేజ్ పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని సీజీ గ్రూప్ ఎండీ నిర్వాణ చౌదరి చెప్పారు. ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?2022లో కాంపా బ్రాండ్ను రిలయన్స్ కొనుగోలు చేసింది. 2023లో దాన్ని దేశీ మార్కెట్లో సరికొత్తగా ప్రవేశపెట్టింది. అటు సీజీ గ్రూప్ అంతర్జాతీయంగా 200 పైగా కంపెనీలు, 260 పైచిలుకు బ్రాండ్లను నిర్వహిస్తూ నేపాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. భారత్ సహా పలు దేశాల్లో అమ్ముడయ్యే ‘వై వై’ బ్రాండ్ ఇన్స్టంట్ నూడుల్స్ ఈ సంస్థకు చెందినవే. -
హెచ్సీఎల్ టెక్ లాభం డౌన్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 3,843 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 4,257 కోట్లు ఆర్జించింది. అధిక వ్యయాలు, క్లయింట్ దివాలా లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 30,349 కోట్లను తాకింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు రికార్డ్ డేట్ జూలై 18కాగా.. 28కల్లా చెల్లించనుంది. ఈ కాలంలో 1,984 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించింది. అయితే త్రైమాసికవారీగా మొత్తం ఉద్యోగుల సంఖ్య 269 తగ్గి 2,23,151కు చేరింది. 3–5 శాతం వృద్ధిపూర్తి ఏడాదికి ఆదాయంలో 3–5 శాతం వృద్ధి సాధించగలమని హెచ్సీఎల్ టెక్నాలజీస్ తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. ఉద్యోగులు, ఇతర అంశాలలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ పేర్కొన్నారు. ఏఐ విభాగంలో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణకు తెరతీసినట్లు తెలియజేశారు. గైడెన్స్ను సాధించే బాటలో భారత్కు వెలుపలగల ప్రాంతాలలో కేంద్రాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఉద్యోగులను తగ్గించుకోవడం చేపట్టనున్నట్లు వివరించారు. తద్వారా మార్జిన్లను 18–19 శాతానికి పెంచుకోనున్నట్లు తెలియజేశారు. క్యూ1లో నిర్వహణ లాభ మార్జిన్లు 16.3 శాతానికి పరిమితమైనట్లు వెల్లడించారు. యుటిలైజేషన్ తగ్గడం, జెన్ఏఐ, జీటీఎం పెట్టుబడులు ప్రభావం చూపినట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో హెచ్సీఎల్ టెక్ షేరు బీఎస్ఈలో 1 శాతం నష్టంతో రూ. 1,620 వద్ద ముగిసింది. -
ఎకానమీకి జీసీసీల దన్ను
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గణనీయంగా తోడ్పడనున్నాయి. 2030 నాటికి వీటితో ఎకానమీకి 200 బిలియన్ డాలర్ల మేర ప్రయోజనం చేకూరనుంది. అలాగే మరిన్ని ఉద్యోగాల కల్పనకు కూడా ఇవి తోడ్పడనున్నాయి. సీఐఐ–జీసీసీ బిజినెస్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. 2024లో సగటున వారానికొక జీసీసీ చొప్పున ఏర్పాటైందని వివరించారు. ఫార్చూన్ 500 కంపెనీల్లో 50 శాతం సంస్థలు భారత్లో తమ సెంటర్లను నెలకొల్పాయని పేర్కొన్నారు. గత అయిదేళ్లుగా పరిశ్రమ ఏటా 11 శాతం చొప్పున వృద్ధి చెందిందన్నారు. వీటిలో దేశీయంగా సుమారు 21.6 లక్షల మంది ప్రొఫెషనల్స్ పని చేస్తుండగా 2030 నాటికి ఈ సంఖ్య 28 లక్షలకు చేరనుందని మంత్రి చెప్పారు. భారత జీసీసీ రంగం స్థూలంగా 68 బిలియన్ డాలర్ల విలువను (జీవీఏ) ఎకానమీకి జోడించిందని, 2030 నాటికి ఇది 150–200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపారు. వ్యయాలపరంగా అమెరికా, బ్రిటన్, ఆ్రస్టేలియాతో పోలిస్తే మన దగ్గర నిపుణుల సేవలు దాదాపు 30–50 శాతం తక్కువకే లభిస్తున్నాయని పేర్కొన్నారు. పాలసీలను క్రమబద్దీకరించాలి.. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) భారత్ హబ్గా ఎదగాలంటే జాతీయ స్థాయిలో వాటికి సంబంధించిన పాలసీలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. జీసీసీలు అత్యధికంగా ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలను అధ్యయనం చేసి, వాటిని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. చాలా రాష్ట్రాల్లో నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని, పెద్ద ఎత్తున జీసీసీలు ఏర్పాటైతే తక్కువ వ్యయాలతోనే సేవలందించడంలో అంతర్జాతీయంగా పోటీపడే వీలుంటుందని వివరించారు. భారత్లో సుమారు 1,800 జీసీసీలు ఉన్నాయి. బహుళ జాతి సంస్థలు (ఎంఎన్సీ) తమ వ్యాపార లావాదేవీల నిర్వహణ కోసం వీటిని ఏర్పాటు చేశాయి. స్టార్టప్ వ్యవస్థ కూడా వీటి విస్తరణకు దోహదపడింది. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ జీసీసీల ఏర్పాటును ప్రోత్సహించే దిశగా రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసే విధానాన్ని రూపొందించడంపై కేంత్రం దృష్టి పెడుతోంది. -
జేన్ స్ట్రీట్ నుంచి రూ. 4,844 కోట్లు
న్యూఢిల్లీ: యూఎస్ హెడ్జ్ ఫండ్ జేన్ స్ట్రీట్ తాజాగా సెబీ పేరున ఎస్క్రో ఖాతాలో దాదాపు రూ. 4,844 కోట్లు డిపాజిట్ చేసింది. దీంతో సంస్థపై విధించిన ఆంక్షలు ఎత్తివేయవలసిందిగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని అభ్యరి్థంచింది. మార్కెట్ మ్యానిప్యులేషన్ ద్వారా భారీ ఆర్జనకు తెరతీసిందన్న ఆరోపణలతో జేన్ స్ట్రీట్పై సెబీ కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా రూ. 4,843.57 కోట్లు జమ చేయవలసిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జేన్స్ స్ట్రీట్ అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు సెబీ పేర్కొంది. ఎఫ్అండ్వో, నగదు విభాగాలలో పొజిషన్లు తీసుకోవడం ద్వారా జేన్ స్ట్రీట్ ఇండెక్సులను మ్యానిప్యులేట్ చేసిందని, తద్వారా భారీగా సంపాదించిందని ఈ నెల 3న జారీ చేసిన తాత్కాలిక ఆదేశాలలో సెబీ పేర్కొంది. 2023 జనవరి– 2025 మే నెల మధ్య రూ. 36,671 కోట్లు ఆర్జించినట్లు సెబీ దర్యాప్తులో వెల్లడైంది. ఫలితంగా హెడ్జ్ ఫండ్ను మార్కెట్ కార్యకలాపాల నుంచి దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. -
మల్టిపుల్స్ చేతికి వీఐపీ
న్యూఢిల్లీ: లగేజీ, ప్రయాణ సంబంధ వస్తువుల తయారీ దిగ్గజం వీఐపీ ఇండస్ట్రీస్లో ప్రమోటర్లు ప్రధాన వాటా విక్రయించనున్నారు. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు 32 శాతంవరకూ వాటాను ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మల్టిపుల్స్కు అమ్మివేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ అంశాన్ని రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. దీంతో వీఐపీ ఇండస్ట్రీస్ వాటాదారులకు సెబీ నిబంధనల ప్రకారం మల్టిపుల్స్ కన్సార్షియం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. పబ్లిక్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా(3.7 కోట్ల షేర్లు) కొనుగోలుకి షేరుకి రూ. 388 ధరలో ఆఫర్ను ప్రకటించింది. ఇందుకు వాటాదారులు పూర్తిస్థాయిలో స్పందిస్తే రూ. 1,438 కోట్లవరకూ మల్టిపుల్స్ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కాగా.. ఓపెన్ ఆఫర్ శుక్రవారం ముగింపు ధర రూ. 456తో పోలిస్తే 15 శాతం తక్కువకావడం గమనార్హం! గత ఏడాది కాలంలో కంపెనీ షేరు 2024 సెపె్టంబర్ 24న రూ. 590 వద్ద గరిష్టాన్ని తాకగా.. 2025 ఏప్రిల్ 7న రూ. 249 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. 2025 మార్చికల్లా ప్రమోటర్లు, ప్రమోటర్ సంస్థ 51.73 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వాటా కొనుగోలుకి సెబీ, సీసీఐ అనుమతులు లభించవలసి ఉంది. ఈ లావాదేవీ తదుపరి కంపెనీ నియంత్రణ మల్టిపుల్స్ పీఈకి బదిలీ కానుంది. దిలీప్ పిరమల్, కుటుంబ సభ్యులు వాటాదారులుగా కొనసాగనున్నారు. దిలీప్ పిరమల్ కంపెనీకి చైర్మన్ ఎమిరిటస్గా వ్యవహరించనున్న ట్లు వీఐపీ ఇండస్ట్రీస్ పేర్కొంది. మల్టిపుల్స్ పీఈ ఫండ్స్తోపాటు.. సమ్విభాగ్ సెక్యూరిటీస్, మిథున్ పాదమ్ సాచేటి, సిద్ధార్థ సాచేటి, ప్రాఫిటెక్స్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ కన్సార్షియం వీఐపీ ఇండస్ట్రీస్ను సొంతం చేసుకోనుంది. ఆహ్వానిస్తున్నాం.. కంపెనీలో వ్యూహాత్మక భాగస్వామికానున్న మల్టిపుల్స్ కన్సార్షియంకు ఆహ్వానం పలుకుతున్నట్లు వీఐపీ చైర్మన్ దిలీప్ పిరమల్ పేర్కొన్నారు. కంపెనీకున్న పటిష్ట బ్రాండ్ విలువ పునరుద్ధరణలో ఇది కీలక ముందడుగుగా వ్యాఖ్యానించారు. దీంతో ఇటీవల కొన్నేళ్లుగా సవాళ్లు ఎదుర్కొంటున్న కంపెనీ దేశీ లగేజీ మార్కెట్లో తిరిగి బలపడనున్నట్లు అభిప్రాయపడ్డారు. అత్యంత పటిష్ట కార్యకలాపాలు కలిగిన వీఐపీ యాజమాన్య మారి్పడిపై ఉద్వేగంగా ఉన్నట్లు మల్టిపుల్స్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో రేణుకా రామ్నాథ్ వ్యాఖ్యానించారు. కంపెనీ బ్రాండు విలువను మరింత పెంచడంతోపాటు.. తదుపరి దశ వృద్ధికి కృషి చేయనున్నట్లు తెలియజేశారు. వీఐపీ సంగతిదీ.. ముంబై కేంద్రంగా 1971లో ఏర్పాటైన వీఐపీ ఇండస్ట్రీస్ లగేజీ తయారీకి ప్రపంచంలోనే రెండో పెద్ద కంపెనీగా నిలు స్తోంది. ఆసియాలోకెల్లా అతి పెద్ద కంపెనీకాగా.. శామ్సోనైట్, సఫారీ ఇండస్ట్రీస్తో దేశీయంగా పోటీ పడుతోంది. వీఐపీ ఇండస్ట్రీస్ మార్కెట్ విలు వ రూ. 6,482 కోట్లుకాగా.. అరిస్ట్రోకాట్, వీఐపీ, కార్ల్టన్, స్కైబ్యాగ్స్, క్యాప్రీస్ బ్రాండ్లను కలిగి ఉంది. 2024కల్లా బ్రాండెడ్ లగేజీ మార్కెట్లో 50 శాతం మార్కెట్ వాటాను పొందింది. అయితే ప్రత్యర్థి కంపెనీలతో పోటీ పెరగడంతో మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. గతేడాది (2024–25) వీఐపీ ఇండస్ట్రీస్ ఆదా యం రూ. 2,170 కోట్లకు చేరింది. ఈ వార్తల నేపథ్యంలో వీఐపీ ఇండస్ట్రీస్ షేరు బీఎస్ఈలో 6 శాతం జంప్చేసి రూ. 482 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 487–431 మధ్య ఊగిసలాడింది. -
మరో 2,400 మంది ఉద్యోగాలు కట్!
గత వారమే ఒరెగాన్లో 500 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన చిప్ మేకర్ ఇంటెల్ మళ్లీ భారీగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. ది ఒరెగాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటెల్ ఒరెగాన్ స్టేట్లో దాదాపు 2,400 ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తోంది. దీంతో ఈ నెలలో మొత్తం తొలగింపుల సంఖ్య 2,892కు చేరుకుంటుంది. యునైటెడ్ స్టేట్స్ అంతటా రాబోయే రోజుల్లో దాదాపు 4,000 మంది ఇంటెల్ కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోతారని భావిస్తున్నారు. కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కంపెనీ వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరుగుతున్నాయి.ఇంటెల్ కార్యకలాపాలను సరళతరం చేయాలని, వ్యయాన్ని తగ్గించాలని యోచిస్తోంది. ఒకప్పుడు సెమీకండక్టర్ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించి ఇటీవల ప్రత్యర్థుల కంటే వెనుకబడిపోవడంతో సీఈఓపై ఒత్తిడి ఎక్కువైందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో లేఆఫ్స్పై దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. ఒరెగాన్ రాష్ట్రంలో ఇంటెల్ కార్యాలయంలో సుమారు 20,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. తాజా తొలగింపులు స్థానిక ఉద్యోగుల్లో 12 శాతం మందిపై ప్రభావం చూపనున్నాయి.ఇదీ చదవండి: ఇంటర్నెట్ స్పీడ్ పెంచి జపాన్ ప్రపంచ రికార్డుప్రభావిత ఉద్యోగుల్లో చిప్ ప్రొడక్ట్ డిజైనర్లు, క్లౌడ్ సాఫ్ట్వేర్ నిపుణులు, ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు ఉన్నారు. కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను కూడా ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగాల కోతతో చిప్ తయారీలో కీలకంగా వ్యవహరించే ఇంటెల్ అంతర్గత ఫౌండ్రీ విభాగం తీవ్రంగా దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఇటీవల ఇంటెల్ కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్లోని ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేసింది. సాఫ్ట్వేర్ నిర్వచించిన ప్లాట్ఫామ్లపై దృష్టి సారించిన కంపెనీ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్లోని తన ఆటోమోటివ్ చిప్ యూనిట్ను మూసివేసింది. ఆ డివిజన్లో చాలా మంది ఉద్యోగులను కూడా తొలగించే అవకాశం ఉంది. ఉద్యోగ కోతలకు ముందస్తు పదవీ విరమణ ప్యాకేజీలు(ఎల్ఆర్ఎస్) అందించడం లేదు. దీనికి బదులుగా ఇంటెల్ తొమ్మిది వారాల వేతనం, ఇతర ప్రయోజనాలతో పాటు 60 రోజులు లేదా నాలుగు వారాల నోటీసును అందిస్తోంది. -
మారికో లక్ష్యం.. ఐదేళ్లలో రెట్టింపు ఆదాయం
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ మారికో వచ్చే ఐదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోనుంది. 2030 నాటికి రూ.20,000 కోట్లకు చేరుకోవాలన్నది తమ లక్ష్యమని మారికో చైర్మన్ హర్ష్ మరివాలా ప్రకటించారు. సఫోలా, పారాచ్యూట్, లివాన్ తదితర ప్రముఖ బ్రాండ్లను కలిగిన మారికో ఆదాయం 2024–25లో రూ.10,000 కోట్లుగా ఉండడం గమనార్హం.మారికో బ్రాండ్లు, ఆవిష్కరణల బలానికి ఇది నిద్శనమంటూ కంపెనీ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. కంపెనీ తదుపరి మార్పు దశలో ఉందన్నారు. భిన్న ప్రాంతాల ప్రజల మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తీసుకురానున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సౌగత్ గుప్తా తెలిపారు.అంతర్జాతీయంగా విశ్వసనీయమైన డిజిటల్ ఎఫ్ఎంసీజీ బ్రాండ్గా అవతరించడమే తమ లక్ష్యమన్నారు. మధ్య కాలాలానికి 25 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేస్తామన్న విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. 2019–20 అమ్మకాల నుంచి ఎనిమిది రెట్ల వృద్ధికి చేరుకుంటామన్నారు. తమ పోర్ట్ఫోలియోని దూకుడుగా విస్తరిస్తామని ప్రకటించారు. -
దేశీ ఫుట్వేర్ రంగంపై విదేశీ కన్ను
దేశీ నాన్లెదర్ ఫుట్వేర్ రంగంలో పెట్టుబడులు చేపట్టేందుకు విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు లెదర్ ఎగుమతుల మండలి(సీఎల్ఈ) చైర్మన్ ఆర్కే జలాన్ పేర్కొన్నారు. ప్రధానంగా తైవాన్, వియత్నాం కంపెనీలు ముందున్నట్లు తెలియజేశారు. అయితే ఇందుకు ప్రభుత్వ మద్దతు కీలకంగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. తైవాన్, వియత్నాం దేశాల సంస్థలు చైనా తదితర దేశాల నుంచి షూ సోల్స్, మౌల్డ్స్, మెషీనరీ, ఫ్యాబ్రిక్స్ తదితర ప్రొడక్టులను దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.వెరసి ఈ రెండు దేశాల కంపెనీలు భారత్లో పెట్టుబడులకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలియజేశారు. ఆయా సంస్థలకు మద్దతిస్తే తయారీకి అవసరమయ్యే నాన్లెదర్ సంబంధ ఫుట్వేర్ ప్రొడక్టులను సులభంగా దిగుమతి చేసుకోగలుగుతాయని వివరించారు. భారత్ నుంచి పటిష్టస్థాయిలో ఎగుమతులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 7 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.గతేడాది(2024–25) 5.75 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నమోదైనట్లు ప్రస్తావించారు. వీటిలో యూఎస్కు అత్యధికంగా 95.7 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని, వీటి వాటా 20 శాతమని తెలియజేశారు. తదుపరి 11 శాతం వాటాతో యూకే, జర్మనీ నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 18 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా తయారీని ప్రోత్సహిస్తే ఎగుమతులు పుంజుకోవడంతోపాటు.. మరింత ఉద్యోగ కల్పనకు వీలుంటుందని వివరించారు. -
ఔట్ పేషెంట్ ప్లాన్.. నో టెన్షన్!
అనారోగ్యంతో డాక్టర్ దగ్గరకెళ్తే వ్యాధి నిర్ధారణ పరీక్షల తర్వాతే పరిష్కారం సూచిస్తుంటారు. కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు, మందులకు కలిపి ఎంతలేదన్నా రూ.2,000–5,000 మధ్య ఖర్చు చేయాల్సిందే. నలుగురు లేదా ఐదుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదిలో ఇలా వైద్యుల వద్దకు ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో ఊహించలేం. ఈ రూపంలో ఎంత ఖర్చు ఎదురవుతుందో అంచనా వేయలేం. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉన్నా కానీ, కేవలం హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలకే (ఇన్ పేషెంట్ కవర్) అధిక శాతం పాలసీలు కవరేజీ అమలు చేస్తుంటాయి. జీనవశైలి వ్యాధులు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు పెరిగిపోయిన తరుణంలో.. ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (ఓపీడీ) కవరేజీకి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇది ఉంటే ఊహించని ఖర్చును కొంత వరకు తట్టుకోవచ్చు. ఓపీడీ ప్లాన్లలో సదుపాయాలు, వీటి కోసం ఎంత ఖర్చవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ)లో చేసే ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా సగటు ద్రవ్యోల్బణం మించి వైద్యుల కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్ చార్జీలు పెరుగుతున్నాయి. 2023–24 ఆరి్థక సంవత్సరంలో ఓపీడీపై దేశ ప్రజలు చేసిన ఖర్చు 37.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని (రూ.3.20 లక్షల కోట్లు సుమారు) ‘ఇండియా ఇన్సూర్టెక్ అసోసియేషన్’ అంచనా వేసింది. ఈ ఖర్చులో రిటైల్ ఓపీడీ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించింది కేవలం 0.1 శాతమే. అంటే దాదాపు 99.9 శాతం మంది ఓపీడీ కవరేజీకి దూరంగా ఉన్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా వాటిల్లో ఓపీడీ కవరేజీ ఒక సదుపాయంగా ఉండదు. ఓపీడీకి పెరుగుతున్న ప్రాధాన్యం నేపథ్యంలో బీమా కంపెనీలు ఇప్పుడు ఈ కవరేజీని సైతం ఇన్పేషెంట్ కవర్తోపాటు ఆఫర్ చేస్తున్నాయి. ఓపీడీ ప్లాన్లలో కవరేజీ.. ఓపీడీ కవరేజీ ఇన్బిల్ట్గా కలిగిన హెల్త్ ప్లాన్లు కొన్నే ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీలు ఓపీడీ కవర్ను యాడాన్ కింద అందిస్తున్నాయి. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం లేకుండా.. వైద్యుల వద్దకు వెళ్లి సమస్యల గురించి చెప్పి, తీసుకుని వెళ్లిపోయే చికిత్సా సలహాలు ఓపీడీ కిందకు వస్తాయి. ‘‘ఓపీడీ కవర్ కింద ఔషధాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యుల కన్సల్టేషన్ చార్జీ (డాక్టర్ ఫీజు)లను బీమా సంస్థలు చెల్లిస్తాయి. రెగ్యుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో పాలసీదారు హాస్పిటల్ పాలైతే తప్పించి వీటికి పరిహారం రాదు’’ అని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ పార్థాని ఘోష్ తెలిపారు. కాకపోతే ఇలా వైద్యుల ఫీజులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్స్కు చెల్లింపుల పరంగా ఓపీడీ కవర్లో కొన్ని పరిమితులు ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా నగదు రహిత విధానంలో నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ ఓపీడీ చెల్లింపులకు బీమా సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. బీమా సంస్థలకు ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. కనుక వీటికి అయ్యే వ్యయాలు తక్కువగా ఉంటాయి.నెట్వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుని రీయింబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్నా బీమా సంస్థలు అనుమతిస్తుంటాయి. కానీ, నాన్నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో ఓపీడీ చెల్లింపులకు కొన్ని బీమా సంస్థలు అంగీకరించడం లేదు. ఇందులో మోసాల రిస్క్ ఉంటుందని, రీయింబర్స్మెంట్కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కొన్ని బీమా సంస్థలు ఓపీడీ కవరేజీని పూర్తిగా నెట్వర్క్ ఆస్పత్రులకే పరిమితం చేస్తున్నాయి. ప్రీమియం.. పరిమితులు → ఐసీఐసీఐ లాంబార్డ్ ‘ఎలివేట్’ అన్నది ఓపీడీ రైడర్. 35 ఏళ్ల వ్యక్తి రూ.10,000 వార్షిక కవరేజీకి చెల్లించాల్సిన ప్రీమియం రూ.4,980. నగదు రహిత విధానంలో ఈ →పనిచేస్తుంది. ఎలాంటి ఉప పరిమితుల్లేవు. → బజాజ్ అలియాంజ్ ‘హెల్త్ ప్రైమ్’ రూ.15,000 కవరేజీకి రూ.2,062 ప్రీమియంను (35 ఏళ్ల వ్యక్తికి) వసూలు చేస్తోంది. → నివా బూపా ‘అక్యూట్ బెస్ట్ కేర్’ ప్లాన్ సైతం నగదు రహిత, రీయింబర్స్మెంట్ విధానంలో కవరేజీని ఆఫర్ చేస్తోంది. రూ.10,000 కవరేజీకి రూ.4,801 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. → నివా బూపా వెల్ కన్సల్ట్ ఓపీడీ ప్లాన్ 20 శాతం కోపేమెంట్ను రీయింబర్స్మెంట్కు అమలు చేస్తోంది. → స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఓపీడీ కవర్ను.. ప్రమాదాలకు సంబంధించి చికిత్సలకు నగదు రహిత, రీయింబర్స్మెంట్ క్లెయిమ్లను అనుమతిస్తోంది. ఈ ప్లాన్ రూ.25,000 కవరేజీకి రూ.4,802 ప్రీమియం వసూలు చేస్తోంది. ‘‘సంప్రదాయంగా చూస్తే ఓపీడీ ప్లాన్లలో డాక్టర్ కన్సల్టేషన్, డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ బిల్లుల పరంగా ఉప పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు ఓపీడీ సమ్ ఇన్సూర్డ్ రూ.20,000 ఉండొచ్చు. అయినప్పటికీ, ఫార్మసీ (ఔషధాలు)కి సంబంధించి రూ.5,000 ఉప పరిమితిగా ఉండొచ్చు. అయితే కవరేజీని తమ అవసరాల మేరకు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా ఉప పరిమితుల్లేని ప్లాన్లను సైతం బీమా సంస్థలు తీసుకొస్తున్నాయి’’ అని పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. ఓపీడీ కవర్ తీసుకునే ముందు ఉప పరిమితుల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. తమకు అప్పటికే జీవనశైలి వ్యాధులు ఉంటే, వాటికి సైతం చెల్లింపులు చేసే విధంగా చూసుకోవాలి. కొన్ని ఓపీడీ ప్లాన్లలో ఏడాదిలో వైద్యుల కన్సల్టేషన్లు గరిష్టంగా ఇన్ని పర్యాయాలు మాత్రమే అన్న పరిమితులు కూడా ఉంటున్నాయి. కొన్ని బీమా సంస్థలు నెట్వర్క్ ఆస్పత్రులు కాకుండా వేరే చోటు తీసుకునే చికిత్సలకు చెల్లింపులు చేయడం లేదు.ఇతర ప్లాన్లు బీమా కంపెనీల భాగస్వామ్యంతో కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రత్యేక ఓపీడీ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇందులో లివ్లాంగ్ ఇన్సూరెన్స్ ఒకటి. దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థల తరఫున ఓపీడీ కవర్ సేవలను ఆఫర్ చేస్తోంది. రూ.15,000 కవరేజీకి రూ.5,500, రూ.16,000 కవరేజీకి రూ.6,000, రూ.28,800 కవరేజీకి రూ.11,599 ప్రీమియం కింద వసూలు చేస్తోంది. ఈ తరహా సంస్థల ఓపీడీ ప్లాన్లలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. ఎన్నో ఉచిత ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నాయి. లివ్లాంగ్ ‘ఎల్డర్కేర్’ ఓపీడీ ప్లాన్ కోసం 66 ఏళ్ల గీత ఏడాదికి రూ.12,000 ప్రీమియం చెల్లిస్తోంది. ఇందులో ఔషధాలు, డయాగ్నోస్టిక్స్ చార్జీలకు ఏడాదిలో గరిష్ట చెల్లింపులు రూ.3,000కు పరిమితం. అయినప్పటికీ 83 ప్యారామీటర్లతో కూడిన ఫుల్బాడీ చెకప్, వైద్యులు, పోషకాహార నిపుణులతో అపరిమిత కన్సల్టేషన్లు, ఏడాదిలో ఆరు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్లను ఉచితంగా ఆఫర్ చేస్తున్నట్టు ఆమె చెప్పారు. అంతేకాదు ఏడాదిలో రెండు ఉచిత అంబులెన్స్ సరీ్వసులను సైతం వినియోగించుకునే సదుపాయం ఇందులో ఉంది. ‘ఈవెన్ హెల్త్కేర్’ కంపెనీ సైతం మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో కలసి ఓపీడీ ఇన్సూరెన్స్ను అందిస్తోంది. కాకపోతే దీన్ని విడిగా రైడర్ కింద కాకుండా.. ఇండెమ్నిటీ కవర్కు యాడాన్గా ఆఫర్ చేస్తోంది. రూ.10 లక్షల వరకు ఓపీడీ కవర్ తీసుకోవచ్చు. ప్రీమియం కూడా 35 ఏళ్లలోపు వారికి ఏడాదికి రూ.4,500, 36–49 ఏళ్లలోపు వారికి రూ.10,000, 50 ఏళ్లు మించిన వారికి రూ.19,000 చార్జ్ తీసుకుంటోంది. ఓపీడీలో క్లెయిమ్స్ ఎక్కువ. అందుకే ప్రీమియం కూడా ఎక్కువే. ‘ఓపీడీ కవర్లో ప్రతి రూ.100 రక్షణ కోసం చెల్లించే ప్రీమియం రూ.50 వరకు ఉంటుంది. ఈ మేరకు పొదుపు చేసుకోవచ్చు’ అని సెక్యూర్నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా తెలిపారు. ఉచిత హెల్త్ స్క్రీనింగ్, చెకప్ల ద్వారా ఇవి వ్యాధి నివారణను ప్రోత్సహిస్తాయని చెప్పారు. ఓపీడీ రక్షణ ఉంటే.. ఎన్నిసార్లు వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా నిశ్చింతగా ఉండొచ్చన్నారు.పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్ కొన్ని బీమా సంస్థలు ప్రైవేటు కంపెనీల ఉద్యోగులకు ఓపీడీ కవరేజీని గ్రూప్ ప్లాన్ కింద ఆఫర్ చేస్తున్నాయి. నోయిడాకు చెందిన అన్మోల్ ఓ ఆరి్థక సేవల కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిచేసే సంస్థ నుంచి తనకు, తన తల్లిదండ్రులకు కలిపి ఓపీడీ ప్లాన్ తీసుకున్నాడు. ఏడాదికి కవరేజీ రూ.21,000 కాగా, రూ.11,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. అన్మోల్కు 10 శాతం, అతడి తల్లిదండ్రులకు 20 శాతం కో–పే షరతు ప్లాన్లో భాగంగా ఉంది. అంటే ప్రతీ బిల్లులోనూ ఈ మేరకు అన్మోల్ సొంతంగా చెల్లించుకోవాలి. అయినప్పటికీ ఏటా రూ.18,000 విలువైన ఓపీడీ ప్రయోజనాలను తాను పొందుతున్నట్టు తెలిపాడు. అంటే ప్రీమియం చెల్లింపులు పోను అతడికి నికర మిగులు రూ.7,000గా ఉందని అర్థమవుతోంది. కొన్ని సంస్థలు అయితే ఉచితంగానే తమ ఉద్యోగులకు ఓపీడీ కవర్ను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని ఓపీడీ ప్లాన్లు కళ్లు, దంత సంబంధిత చికిత్సలకు సైతం కవరేజీనిస్తున్నాయి. ఇలా చేస్తే మెరుగు.. → ఓపీడీ కవర్లో భాగంగా వచ్చే ఉచిత హెల్త్ చెకప్లు, టెలీ కన్సల్టేషన్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. → నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత విధానంలో సులభంగా సేవలు పొందొచ్చు. రీయింబర్స్మెంట్ విధానంలో అయితే అన్ని బిల్లులను జాగ్రత్తపరిచి క్లెయిమ్ దాఖలు చేయాల్సి వస్తుంది. నగదు రహిత విధానంలో అయితే ఈ ప్రహసనం తప్పించొచ్చు. → ఉప పరిమితులను జాగ్రత్తగా గమనిస్తూ, గరిష్ట పరిమితి మేరకు ఉపయోగించుకోవాలి. → ఓపీడీ కవర్ను రెన్యువల్ సమయంలో సమీక్షించుకోవాలి. కవరేజీ చాలకపోయినా.. ప్లాన్ ఆఫర్ చేస్తున్న ప్రయోజనాలు, ఉప పరిమితులు అంత అనుకూలంగా అనిపించకపోయినా మెరుగైన ప్లాన్కు అప్గ్రేడ్ కావాలి. ఓపీడీ ప్లాన్ తీసుకోవచ్చా..? తరచూ వైద్యుల సలహాలు, చికిత్సల కోసం వెళ్లే వారికి ఓపీడీ ప్లాన్లు ఉపయోగకరం. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు వీటిని తీసుకోవచ్చు. ‘‘ఆరోగ్యవంతులైన వ్యక్తులకు సైతం ఓపీడీ కవర్ ప్రయోజకరమే. ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా అనారోగ్యాలను తొలి దశలోనే గుర్తించొచ్చు’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, బిజినెస్ హెడ్ ఆశిష్ యాదవ్ సూచించారు. బీమా సంస్థ ఆఫర్ చేసే నగదు రహిత ఆస్పత్రుల నెట్వర్క్ను కూడా చూడాలి. ఓపీడీ ప్లాన్లలో తమకు నచ్చిన వైద్య నిపుణుడి వద్దకు కాకుండా, బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోని వైద్యుల సేవలకు పరిమితం కావాల్సి వస్తుంది. కనుక నెట్వర్క్ జాబితాలో పేరున్న హాస్పిటల్స్ ఉన్నాయేమో పరిశీలించాలి. రీయింబర్స్మెంట్ విధానంలో షరతులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. అసలు షరతుల్లేని లేదా పరిమిత షరతులతో మెరుగైన ప్రయోజనాలను ఆఫర్ చేసే ఓపీడీ ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు. పనిచేసే సంస్థ నుంచి ఓపీడీ ప్లాన్కు అవకాశం ఉంటే అదే తీసుకోవడం మేలు. తమ అవసరాలకు సరితూగే ఓపీడీ ప్లాన్ను ఎంపిక చేసుకోవడం అన్నింటికంటే ప్రధానమైనది. వివిధ సంస్థలు ఆఫర్ చేస్తున్న ఓపీడీ ప్లాన్లు, వాటిల్లోని సదుపాయాలు, నెట్వర్క్ ఆస్పత్రుల జాబితాను పోల్చి చూడాలి. మెరుగైన చెల్లింపుల చరిత్రతో సహేతుక ప్రీమియంతో ఉన్న ప్లాన్ను ఎంపిక చేసుకోవచ్చు. -
ఉద్యోగం చేసేందుకు ఈ కంపెనీ మంచి చోటు
ఉద్యోగం చేసేందుకు భారత్లో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా ఆర్థిక సేవల దిగ్గజం మెట్లైఫ్కు ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’ ఇండియా గుర్తింపు లభించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం మీద 100 టాప్ కంపెనీల జాబితాలో ఆరో స్థానం, బీమా రంగంలో అగ్రస్థానాన్ని కంపెనీ దక్కించుకుంది.ప్రతి ఒక్కరు ఎదిగేందుకు, అత్యుత్తమంగా రాణించేందుకు తోడ్పాటునిచ్చే సంస్కృతిని తమ సంస్థలో అమలు చేస్తున్నామని, దానికి ఈ గుర్తింపు లభించడం సంతోషకరమైన విషయమని మెట్లైఫ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆశీష్ శ్రీవాస్తవ తెలిపారు. ఉద్యోగుల అభిప్రాయాలు, సిబ్బంది విషయంలో కంపెనీ పాటించే విధానాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఈ జాబితాను రూపొందిస్తుంది.ఫిలిం స్కూల్స్ విద్యార్థులకు స్క్రీన్ అకాడెమీ ఫెలోషిప్లు ఫిలిం ఇనిస్టిట్యూట్స్లోని ప్రతిభావంతులైన పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఫెలోషిప్లను అందించే దిశగా స్క్రీన్ అకాడెమీ ఏర్పాటైంది. లోధా ఫౌండేషన్కి చెందిన అభిషేక్ లోధా వితరణతో స్క్రీన్, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేశాయి.ఫిలిం ఇనిస్టిట్యూట్స్ నామినేట్ చేసిన, ఆర్థిక వనరులు అంతగాలేని విద్యార్థులకు స్క్రీన్ అకాడెమీ వార్షికంగా ఫెలోషిప్లు అందిస్తుంది. రసూల్ పోకుట్టి, గునీత్ మోంగా లాంటి ప్రముఖులు మెంటార్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం పుణెలోని ఎఫ్టీఐఐ, కోల్కతాలోని సత్యజిత్ రే ఫిలిం అండ్ టీవీ ఇనిస్టిట్యూట్, ముంబైలోని విజ్లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్తో అకాడెమీ జట్టు కట్టగా, ఇతర ఇనిస్టిట్యూట్స్కి కూడా దీన్ని విస్తరించనున్నారు. -
హైదరాబాద్లో ‘ఉత్తరప్రదేశ్’ రోడ్షో
పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ‘ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో’ (యూపీఐటీఎస్) 2025 కోసం హైదరాబాద్లో తాజాగా రోడ్ షో నిర్వహించింది. ఈ మెగా ఈవెంట్పై అవగాహన, ఆకర్షణ పెంచడానికి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో రోడ్ షో చేపట్టింది.తొలుత ఢిల్లీతో మొదలు పెట్టిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తర్వాత హైదరాబాద్లో ఈ రోడ్ షో నిర్వహించింది. నగరంలో జరిగిన కార్యక్రమంలో 150 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలు, ఎగుమతిదారులు, సోర్సింగ్ కన్సల్టెంట్లు, వాణిజ్య సంస్థలు పాల్గొన్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్ పో సెంటర్ అండ్ మార్ట్ లో సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న యూపీఐటీఎస్ 2025కు ఊపును పెంచడమే లక్ష్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఈ సందర్బంగా నగరంలోని టీసీసీఐలో జరిగిన కార్యక్రమంలో యూపీ ఎంఎస్ఎంఈ క్యాబినెట్ మంత్రి రాకేష్ సచన్, ఆ రాష్ట్ర పరిశ్రమల అడిషనల్ కమిషనర్ రాజ్ కమల్ యాదవ్, టీసీసీఐ అధ్యక్షుడు సురేష్ కుమార్ సింఘాల్, ఐఈఎంఎల్ సీఈవో సుదీప్ సర్కార్ తదితరులు ప్రసంగించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లలో ఒకటైన ఇండియా ఎక్స్పోజిషన్ మార్ట్ లిమిటెడ్ (ఐఈఎంఎల్) సహకారంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యూపీఐటీఎస్ 2025ను నిర్వహిస్తోంది. బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ లలో రోడ్ షోలు ప్లాన్ చేస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏం చేసింది.. ఆర్బీఐ చర్యలెందుకు?
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. రూ .4.88 లక్షలు జరిమానా విధించినట్లు ప్రకటించింది. తన క్లయింట్కు టర్మ్ లోన్ మంజూరు చేసేటప్పుడు 'మాస్టర్ డైరెక్షన్ - ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా' నిబంధనలను విస్మరించిందని, అందుకు గానూ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) సెక్షన్ 11 (3) నిబంధనల ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.నిబంధనల ఉల్లంఘనలపై నిఆర్బీఐ షోకాజ్ నోటీసు జారీ చేయగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చిందని, మౌఖిక సమర్పణలు కూడా చేసిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. కేసు వాస్తవాలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పందనను పరిగణనలోకి తీసుకుని జరిమానా విధించాలని ఆర్బీఐ నిర్ణయించింది.శ్రీరామ్ ఫైనాన్స్కూ జరిమానా డిజిటల్ లెండింగ్ సంబంధిత నిబంధనలను పాటించనందుకు బ్యాంకింగేతర ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్బీఎఫ్సీ) అయిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్పైనా రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. ఆర్బీఐ జారీ చేసిన "రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (డిజిటల్ లెండింగ్) ఆదేశాలు, 2025" లోని కొన్ని నిబంధనలను పాటించనందుకు ఆర్బీఐ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్పై రూ .2.70 లక్షల జరిమానా విధించింది.2024 మార్చి 31 నాటికి శ్రీరామ్ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్బీఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఆర్బీఐ ఆదేశాలను పాటించకపోవడం, సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కంపెనీకి నోటీసులు జారీ చేసినట్లు బ్యాంక్ తెలిపింది.రుణగ్రహీతలు నేరుగా రుణ చెల్లింపులను కంపెనీ ఖాతాలో జమ చేయడానికి బదులుగా థర్డ్ పార్టీ ఖాతా ద్వారా రుణ చెల్లింపులను కంపెనీ మళ్లించిందని ఆర్బీఐ తన తనిఖీలో గుర్తించింది. దీంతో శ్రీరామ్ ఫైనాన్స్కు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. -
పదికాలాలపాటు పచ్చగా అనంత్-రాధికల వివాహం
పెళ్లిచేస్తే పదికాలాలపాటు అందరూ మాట్లాడుకునేలా ఉండాలని బహుశా రిలయన్ అధినేత ముఖేశ్-నీతా అంబానీ అనుకున్నారేమో.. వారి చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ల వివాహం జరిగి ఏడాది అవుతున్నా ప్రపంచంలో ఎక్కడోమూల దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆ వివాహంలోని ఏర్పాట్లు, అతిథులు, పుష్పక విమానాలు, పారిజాతాలు, పంచభక్ష పరమాణ్ణాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, కెంపులు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పట్టుపీతాంబరాలు..ఇలా కొన్నేమిటి ఎన్నో విషయాల గురించి ముచ్చటిస్తున్నారు. ఈ రోజు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా..ముఖేష్ అంబానీ– నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని విరెన్ మర్చంట్–శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్తో జులై 12, 2024న అంగరంగ వైభవంగా ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్లో జరిపించారు. ఈ వేడుకలకు దేశ, విదేశాల అతిథులను విమానాలు మోసుకొచ్చాయి. తర్వాతి రోజు ‘శుభ్ ఆశీర్వాద్’ పేరుతో వేడుక. ఆ మరుసటి రోజు ‘మంగళ్ ఉత్సవ్’ పేరున భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.పెళ్లికి ముందు రెండుసార్లు ఈ జంట అంగరంగ వైభవంగా ప్రీవెడ్డింగ్ వేడుకలు నిర్వహించుకుంది. ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు దాదాపు 4500 కిలోమీటర్లు క్రూయిజ్లో ప్రయాణిస్తూ రెండోసారి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. అంతకుముందు ఈ జంట జామ్నగర్లో తమ మొదటి ప్రీవెడ్డింగ్ వేడుకలను పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా అంబానీ కుంటుంబం 50 పేద జంటలకు సామూహిక వివాహాలను జరిపించింది. అందుకు అవసరమైన పూర్తి ఖర్చులను భరించింది. వివాహాల అనంతరం కొత్త జంటలకు అవసరమయ్యే ఇంటి సామగ్రిని అందించింది.ఇదీ చదవండి: ఈ-ట్రక్కు కొంటే రూ.9.6 లక్షలు డిస్కౌంట్!వివాహానికి హాజరైన ప్రముఖుల్లో కొందరు..వైదిక హిందూ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఆధ్యాత్మిక గురువులు, మత పెద్దలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, క్రికెటర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఇన్ఫ్లుయెన్సర్లు.. ఇలా ఎన్నో విభాగాలకు చెందిన అగ్రజులు హాజరయ్యారు.ఆధ్యాత్మిక గురువులు..స్వామి సదానంద సరస్వతి, శంకరాచార్య, ద్వారకాస్వామి అవిముక్తేశ్వర, సరస్వతి, శంకరాచార్య, జోషిమఠ్గౌరంగ్ దాస్ ప్రభు, డివిజనల్ డైరెక్టర్, ఇస్కాన్గుర్ గోపాల్ దాస్, మాంక్, ఇస్కాన్రాధానాథ్ స్వామి, ఇస్కాన్ పాలకమండలి సభ్యుడురమేష్ భాయ్ ఓజాగౌతమ్ భాయ్ ఓజాదేవప్రసాద్ మహరాజ్విజుబెన్ రజని, శ్రీ ఆనందబావ సేవా సంస్థశ్రీ బాలక్ యోగేశ్వర్ దాస్ జీ మహరాజ్, బద్రీనాథ్ ధామ్చిదానంద్ సరస్వతి, పర్మార్త్ నికేతన్ ఆశ్రమంశ్రీ నమ్రముని మహరాజ్, జైన్ ముని, ప్రసాదం వ్యవస్థాపకులుధీరేంద్ర కుమార్ గార్గ్, గురు, బాగేశ్వర్ ధామ్బాబా రాందేవ్, యోగా గురువు తదితరులు.వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులుజాన్ కెర్రీ (అమెరికా పొలిటీషియన్)టోనీ బ్లెయిర్ (మాజీ ప్రధాని, యూకే)బోరిస్ జాన్సన్ (బ్రిటన్ మాజీ ప్రధాని)మాటియో రెంజీ (ఇటలీ మాజీ ప్రధాని)సెబాస్టియన్ కుర్జ్ (ఆస్ట్రియా మాజీ ప్రధాని)స్టీఫెన్ హార్పర్, కెనడా మాజీ ప్రధానికార్ల్ బిల్డ్ (స్వీడన్ మాజీ ప్రధాని)మహ్మద్ నషీద్ (మాల్దీవుల మాజీ అధ్యక్షుడు)సామియా సులుహు హసన్ (అధ్యక్షుడు, టాంజానియా) తదితరులు.గ్లోబల్ బిజినెస్ లీడర్లుఅమీన్ నాజర్ (ప్రెసిడెంట్ & సీఈఓ, ఆరామ్కో)హెచ్.ఇ. ఖల్దూన్ అల్ ముబారక్, సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్, ముబదాలాముర్రే ఆచింక్లోస్ (సీఈఓ, బీపీ)రాబర్ట్ డడ్లీ (మాజీ సీఈఓ - బీపీ, బోర్డు మెంబర్ - ఆరామ్కో)మార్క్ టక్కర్ (హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ పీఎల్సీ)బెర్నార్డ్ లూనీ (మాజీ సీఈఓ, బీపీ)శంతను నారాయణ్ (సీఈఓ, అడోబ్)మైఖేల్ గ్రిమ్స్ (మేనేజింగ్ డైరెక్టర్, మోర్గాన్ స్టాన్లీ)ఇగోర్ సెచిన్, సీఈఓ, రోస్ నెఫ్ట్జే లీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్దిల్హాన్ పిళ్లై (టెమాసెక్ హోల్డింగ్స్ సీఈఓ) తదితరులు. -
వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్
వాణిజ్య బీమా విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ప్రైవేట్ రంగ జ్యూరిక్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ అలోక్ అగర్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీన్ని సరికొత్తగా ఆవిష్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థకు సంబంధించి మొత్తం బీమా వ్యాపారంలో సుమారు 3 శాతంగా ఉన్న ఈ విభాగం వాటాను వచ్చే 2–3 సంవత్సరాల్లో 15–20 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి బడా కార్పొరేట్లు, స్పెషలైజ్డ్ పరిశ్రమల వరకు వివిధ రంగాలకు అనువైన పథకాలను అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో ఇప్పటికే ఓ కార్యాలయం ఉండగా త్వరలో వైజాగ్లో కూడా ఒకటి ప్రారంభిస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీమాను విస్తరించేలా స్వల్ప ప్రీమియం, ఒక మోస్తరు సమ్ ఇన్సూర్డ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వాహన బీమా పాలసీల విక్రయాలు రెండు దశాబ్దాల పాటు సుమారు 13–17 శాతం వరకు వృద్ధి చెందినప్పటికీ, వాహన విక్రయాలు కొంత నెమ్మదించడం వంటి అంశాల కారణంగా గతేడాది ఆరు శాతానికి పరిమితం అయ్యాయని చెప్పారు. ఇవి క్రమంగా మళ్లీ పుంజుకోగలవని చెప్పారు. -
ఎల్ఐసీలో మరింత వాటా అమ్మకం
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)లో ప్రభుత్వం మరికొంత వాటా విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు డిజిన్వెస్ట్మెంట్ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎల్ఐసీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. 2022 మే నెలలో పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించిన సంగతి తెలిసిందే. తద్వారా షేరుకీ రూ. 949 ధరలో రూ. 21,000 కోట్లు సమీకరించింది. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం 2027 మే 16కల్లా ఎల్ఐసీలో పబ్లిక్కు కనీసం 10 శాతం వాటాను కలి్పంచవలసి ఉంది. దీంతో ఎల్ఐసీలో ప్రభుత్వం కనీసం 6.5 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం వాటా విక్రయానికి తెరతీయవచ్చని పేర్కొన్నాయి. అయితే ఎంత వాటా.. ఎప్పుడు ఎలా విక్రయించాలనే అంశాలపై డిజిన్వెస్ట్మెంట్ శాఖ ప్రణాళికలు ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలియజేశాయి. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే వీలున్నట్లు వివరించాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయిన పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 5.85 లక్షల కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో ఎల్ఐసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 927 వద్ద ముగిసింది. -
జీ ప్రమోటర్లకు వాటాదారుల చెక్
న్యూఢిల్లీ: మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)లో ప్రమోటర్ల వాటా పెంపు ప్రతిపాదనను తాజాగా వాటాదారులు తిరస్కరించారు. పూర్తిస్థాయిలో మార్పిడి చేసుకునే వారంట్ల జారీ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలు జీల్లో రూ. 2,237 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతిపాదించాయి. దీంతో ప్రిఫరెన్షియల్ పద్ధతిలో కంపెనీలో వాటాను 18.4 శాతానికి పెంచుకునేందుకు ప్రతిపాదించాయి. అయితే ఇందుకు వాటాదారులు అనుమతించనట్లు కంపెనీ తెలియజేసింది. ప్రత్యేక రిజల్యూషన్ ద్వారా చేపట్టిన ప్రతిపాదనకు 59.51 శాతం వాటాదారులు అనుకూలత వ్యక్తం చేసినప్పటికీ 40.48 శాతం వ్యతిరేకించినట్లు వెల్లడించింది. ప్రత్యేక రిజల్యూషన్ చేపడితే కనీసం 75 శాతంమంది వాటాదారుల నుంచి అనుమతి పొందవలసి ఉంటుందని వివరించింది. గత నెలలో ప్రతిపాదన గత నెలలో జీల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్ల జారీ ద్వారా రూ. 2,237.44 కోట్ల సమీకరణ ప్రణాళికలు ప్రకటించింది. తద్వారా ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడే వీలుంది. ఇందుకు అనుగుణంగా కంపెనీ బోర్డు పూర్తిగా మార్పిడికి వీలయ్యే 16.95 కోట్ల వారంట్ల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆలి్టలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్ తదితర ప్రమోటర్ సంస్థలకు వారంట్లను జారీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా.. కంపెనీలో అతిపెద్ద వాటాదారు సంస్థ నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ జీల్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రాక్సీ అడ్వయిజరీ సంస్థ గ్లాస్ లెవిస్ సైతం సానుకూలంగా ఓటు చేయమని వాటాదారులకు సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.ప్రమోటర్ల వాటా పెంపునకు వాటాదారుల తిరస్కరణ వార్తలతో జీల్ షేరు బీఎస్ఈలో 3.2 శాతం క్షీణించి రూ. 137 వద్ద ముగిసింది. -
క్విక్ కామర్స్లో పోటాపోటీ
న్యూఢిల్లీ: దేశీ క్విక్ కామర్స్ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఆధిపత్యం నడుస్తుండగా తాజాగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ నౌ కూడా రంగంలోకి దిగింది. అమెజాన్ నౌ పేరిట బెంగళూరు తర్వాత ఢిల్లీలో కూడా నిర్దిష్ట పిన్కోడ్లలో 10 మినిట్స్ డెలివరీ సర్వీసులు ప్రారంభించింది. ఆయా పిన్–కోడ్లలోని యూజర్లకు యాప్లో ఇప్పుడు అమెజాన్ నౌ అనే ట్యాబ్ను అందుబాటులోకి తెచి్చంది. నిత్యావసరాలు, పండ్లు..కూరగాయలు, పర్సనల్ కేర్, సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, వైర్లెస్ యాక్సెసరీలు, చిన్న గృహోపకరణాలు మొదలైన వాటిని ఈ సర్వీస్ కింద అమెజాన్ అందిస్తోంది. డెలివరీ ఉచితంగా పొందాలంటే ప్రైమ్ యూజర్లకు కనీస కొనుగోలు విలువ రూ. 99గా, నాన్–ప్రైమ్ యూజర్లకు రూ. 199గా ఉంటుంది. స్మార్ట్ఫోన్ల దన్ను..: డేటా చార్జీలు తక్కువగా ఉండటం, స్మార్ట్ఫోన్ల వినియోగం గణనీయంగా పెరగడం, యువ జనాభా ఎక్కువగా ఉండటం వంటి అంశాలు దేశీయంగా క్విక్ కామర్స్కి దన్నుగా ఉంటున్నాయి. ఫ్లిప్కార్ట్, బెయిన్ అండ్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2024లో ఈ–గాస్రరీ ఆర్డర్లలో మూడింట రెండొంతుల వాటా, ఈ–రిటైల్ వ్యయాల్లో పదో వంతు వాటా క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలదే ఉంది. దేశీయంగా కొనుగోళ్ల విధానాల్లో క్యూకామ్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్న తీరును ఇది సూచిస్తోందని నివేదిక పేర్కొంది. కొనుగోళ్లకు సంబంధించి ఇది దాదాపు ప్రధాన మాధ్యమంగా మారిపోతుండటంతో ఫ్లిప్కార్ట్, అమెజాన్లాంటి సంస్థలు కూడా తప్పనిసరిగా రంగంలోకి దిగుతున్నాయి. రూ. 64,000 కోట్ల ఆర్డర్లు.. 2024–25లో భారతీయులు బ్లింకిట్, ఇన్స్టామార్ట్లాంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫాంల ద్వారా రూ. 64,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తులకు ఆర్డరిచి్చనట్లు అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 30,000 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) రూ. 2 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ కెర్ఎడ్జ్ రేటింగ్స్ విభాగం ఒక నివేదికలో అంచనా వేసింది. మరోవైపు 2024లో 6.1 బిలియన్ డాలర్లుగా ఉన్న క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి ఏకంగా 40 బిలియన్ డాలర్లకు చేరవచ్చని డేటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ మరో రిపోర్టులో అంచనా వేసింది. -
అమెజాన్లోనే కొంటున్నారా? అమ్మో జాగ్రత్త!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ప్రస్తుతం ప్రైమ్ డే సేల్ 2025 నడుస్తోంది. జూలై 12-14 వరకు అమ్మకాలు జరుగుతుండగా దీనికి సంబంధించిన హడావుడి నాలుగు రోజుల ముందు హడావుడి ప్రారంభమైంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 కోసం ఓ వైపు కొనుగోలుదారులు సిద్ధమవుతుండగా, ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు కూడా వినియోగదారులను మోసం చేసేపనిలో పడ్డారు.అమెజాన్ లానే 1000 సైట్లుమెరుపు డీల్స్, డిస్కౌంట్ల కోసం లక్షలాది మంది లాగిన్ అవుతారని భావిస్తున్న నేపథ్యంలో ఈ షాపింగ్ ఉత్సుకత ఆన్లైన్ మోసాలకు తెరలేపుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెక్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం, అమెజాన్ను పోలిన 1,000 కొత్త వెబ్సైట్లు 2025 జూన్లో నమోదయ్యాయి. వీటిలో 87% అనుమానాస్పదమైనవి లేదా పూర్తిగా హానికరమైనవిగా గుర్తించారు. ఈ సారూప్య డొమైన్లు చిన్న అక్షర తేడాలు లేదా ".టాప్" లేదా ".ఆన్వైన్" వంటి అసాధారణ ఎక్స్టెన్షన్లను కలిగి ఉంటాయి. ఇలా వినియోగదారులను నమ్మించి మోసగించడానికే వీటిని రూపొందించినట్లు కనిపిస్తోంది.వినియోగదారులను మోసగించడానికి స్కామర్లు సాధారణంగా రెండు ప్రధాన ట్రిక్స్పై ఆధారపడతారు. అవి ఒకటి నకిలీ వెబ్సైట్లు, రెండోది ఫిషింగ్ ఈమెయిల్స్. అమెజాన్ చెక్అవుట్ లేదా లాగిన్ పేజీలను అనుకరించడానికి నకిలీ డొమైన్లు సృష్టిస్తున్నారు. అవి మొదటి చూసినప్పుడు అసలైన వెబ్సైట్ల లాగానే అనిపిస్తాయి. దీంతో వీటి ద్వారా కొనగోళ్లకు ప్రయత్నిస్తే మొత్తానికి మోసం వస్తుంది. పాస్వర్డ్లు, ఇతర వివరాలు కూడా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.ఇక మరో మార్గంలో "రీఫండ్ డ్యూ" లేదా "అకౌంట్ ప్రాబ్లమ్" వంటి విషయాలతో ఫిషింగ్ ఈమెయిల్స్ ఉన్నాయి. ఈ సందేశాలు మామూలుగా అమెజాన్ సపోర్ట్ టీమ్ నుండే వచ్చినట్లు అనిపిస్తాయి. అక్కడ కనిపించిన లింక్లను క్లిక్ చేస్తే స్కామ్ వెబ్సైట్లకు దారితీసే అవకాశం ఉంది. ప్రైమ్ డే సందర్భంగా కొనుగోలుదారులు హడావుడిగా ఉంటారని సైబర్ నేరగాళ్లకు తెలుసు. వారు మీ అత్యవసరతను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు.కొన్ని జాగ్రత్తలుసురక్షితంగా ఉండటానికి నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఇవి సాధారణమైనవే కానీ శక్తివంతమైనవి. అవి..అధికారిక అమెజాన్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే షాపింగ్ చేయండిమీ ఖాతాను అప్డేట్ చేయమని లేదా రీఫండ్ క్లెయిమ్ చేయమని కోరే ఈమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి.ఆకర్షణీయంగా అనిపించే ఫ్లాష్ డీల్స్ జోలికి పోవద్దు.టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయండి.మీ సాఫ్ట్వేర్, బ్రౌజర్లను అప్డేట్ చేసుకోండి. -
తెలంగాణ కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులు
హైదరాబాద్: తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల కోసం ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు ఆర్సెలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్ఎస్ ఇండియా) వెల్లడించింది. ఆప్టిగల్ ప్రైమ్, ఆప్టిగల్ పినకిల్ వీటిలో ఉన్నట్లు వివరించింది.తుప్పు నుంచి మూడు రెట్లు అధిక రక్షణ కల్పించేలా ఇవి ఆరు వేరియంట్స్లో ఉంటాయి. దేశీయంగా, ముఖ్యంగా దక్షిణాదిన కలర్ కోటెడ్ ఉక్కు ఉత్పత్తుల విభాగంలో గణనీయంగా మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ డైరెక్టర్ రంజన్ ధర్ తెలిపారు. జాతీయ స్థాయిలో ఈ మార్కెట్ 3.4 మిలియన్ టన్నులుగా ఉండగా, దక్షిణాది మార్కెట్ వాటా సుమారు 0.6 మిలియన్ టన్నులుగా ఉంటుందని పేర్కొన్నారు.హైదరాబాద్ కంపెనీకి ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డీప్టెక్ ఆవిష్కరణలతో పంటల సంరక్షణ ఉత్పత్తులపై కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేషన్ లీడర్షిప్ అవార్డ్ పురస్కారం లభించినట్లు ఏటీజీసీ బయోటెక్ సంస్థ వెల్లడించింది. అగ్రికల్చర్ టుడే నిర్వహించిన 16వ అగ్రికల్చర్ లీడర్షిప్ సదస్సులో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ దీన్ని ప్రదానం చేసినట్లు వివరించింది.తమ సంస్థకు 26 పేటెంట్లు, 50కి పైగా ఉత్పత్తులు ఉన్నట్లు కంపెనీ చైర్మన్ మార్కండేయ గోరంట్ల, ఈడీ వీబీ రెడ్డి తెలిపారు. బియ్యం, పత్తి తదితర పంటల్లో ఫెరోమోన్ టెక్నాలజీని విస్తరించడంలో తమ కంపెనీని కేస్ స్టడీగా పరిగణించవచ్చని 2024లో ప్రపంచ ఆర్థిక ఫోరం సైతం సూచించినట్లు పేర్కొన్నారు.ఎన్ఎండీసీ గనులకు 5 స్టార్ రేటింగ్మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీకి చెందిన గనులకు ప్రతిష్టాత్మక 5 స్టార్ రేటింగ్ లభించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను చత్తీస్గఢ్లోని మూడు ఇనుప ఖనిజ గనులకు, కర్ణాటకలోని ఒక గనికి ఇది లభించినట్లు సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. పర్యావరణ అనుకూల విధంగా మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించడంలో తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని ముఖర్జీ చెప్పారు. కేంద్ర గనుల శాఖ, ఐబీఎం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ పురస్కారాన్ని అందించారు. -
అమెరికాలో అపర కుబేరులు మనవాళ్లే..
విదేశాల్లో పుట్టి అమెరికాలో అపర కుబేరులుగా ఎదిగినవాళ్లలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్ 2025 ర్యాంకింగ్స్లో 12 మంది భారత సంతతి బిలియనీర్లు చోటు దక్కించుకోవడంతో అత్యధిక మంది విదేశీ అమెరికన్ కుబేరులకు జన్మస్థానంగా భారత్ నిలిచింది. 2022లో కేవలం ఏడుగురు భారత సంతతి బిలియనీర్లు ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగారు.అమెరికాలో విదేశీ సంతతి సంపన్నుల తాజా జాబితాలో భారత్.. ఇజ్రాయెల్, తైవాన్లను అధిగమించింది. ఈ రెండు దేశాలకు చెందినవారు చెరో 11 మంది ఈ జాబితాలో ఉన్నారు. స్వయం కృషితో ఎదిగిన ఈ భారత సంతతి కుబేరులు.. విదేశాలలో జన్మించిన యూఎస్ బిలియనీర్ల మొత్తం 1.3 ట్రిలియన్ డాలర్ల సంపదలో గణనీయ వాటాను అందిస్తున్నారు.ఆల్ఫాబెట్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి కొత్తవారు ఇటీవల ఈ జాబితాలో చేరినప్పటికీ అంతగా గుర్తింపు లేని దిగ్గజాలతో పోలిస్తే వారు ఆశ్చర్యకరంగా తక్కువ ర్యాంకులో ఉన్నారు. సైబర్ సెక్యూరిటీ దిగ్గజం జెడ్ స్కేలర్ వ్యవస్థాపకుడు జే చౌదరి 17.9 బిలియన్ డాలర్ల సంపదతో భారత సంతతి అమెరికన్ బిలియనీర్లలో అగ్రస్థానంలో ఉన్నారు. విద్యుత్తు, నీరు లేని మారుమూల హిమాలయ గ్రామం పనోహ్ లో జన్మించిన చౌదరి గ్రాడ్యుయేట్ చదువుల కోసం 1980లో తొలిసారి అమెరికా వెళ్లారు.భారత సంతతి అపర కుబేరులు వీళ్లే..జే చౌదరి (17.9 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (జెడ్ స్కేలర్)వినోద్ ఖోస్లా (9.2 బిలియన్ డాలర్లు) - సన్ మైక్రో సిస్టమ్స్, వెంచర్ క్యాపిటల్రాకేష్ గంగ్వాల్ (6.6 బిలియన్ డాలర్లు) - ఎయిర్లైన్స్ (ఇండిగో సహ వ్యవస్థాపకుడు)రోమేష్ టి.వాధ్వానీ (5.0 బిలియన్ డాలర్లు) - సాఫ్ట్వేర్ - సింఫనీ టెక్నాలజీ గ్రూప్రాజీవ్ జైన్ (4.8 బిలియన్ డాలర్లు) - ఫైనాన్స్ (జీక్యూజీ పార్టనర్స్ చైర్మన్)కవితార్క్ రామ్ శ్రీరామ్ (3.0 బిలియన్ డాలర్లు) - గూగుల్, వెంచర్ క్యాపిటల్రాజ్ సర్దానా (2.0 బిలియన్ డాలర్లు) - టెక్నాలజీ సేవలు (ఐటీ సంస్థ టీసీజీఐ)డేవిడ్ పాల్ (1.5 బిలియన్ డాలర్లు) - వైద్య పరికరాలు (వెల్క్వెస్ట్ / న్యూరోసిగ్మా)నికేష్ అరోరా (1.4 బిలియన్ డాలర్లు) - సైబర్ సెక్యూరిటీ (పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ)ఫోర్బ్స్ తాజా డేటా ఆధారంగా అమెరికాలోని అత్యంత ధనవంతులైన భారత సంతతి బిలియనీర్లు వీరే. టెక్ దిగ్గజాలు సుందర్ పిచాయ్ (1.1 బిలియన్ డాలర్లు), సత్య నాదెళ్ల (1.1 బిలియన్ డాలర్లు) 10, 11వ స్థానాల్లో నిలిచారు. -
యూపీఐతో చెల్లింపుల్లో మనమే సూపర్ఫాస్ట్
యూపీఐ దన్నుతో, మిగతా ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్లో చెల్లింపుల విధానం అత్యంత వేగవంతంగా ఉంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తెలిపింది. 2016లో ప్రవేశపెట్టిన యూపీఐ విధానం చాలా వేగంగా వినియోగంలోకి వచ్చిందని ఫిన్టెక్ నోట్లో పేర్కొంది. అదే సమయంలో నగదుకు ప్రత్యామ్నాయాలైన డెబిట్, క్రెడిట్ కార్డుల్లాంటి ఇతరత్రా సాధనాల వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించింది.ప్రస్తుతం యూపీఐ ప్రతి నెలా 1,800 కోట్ల లావాదేవీలు ప్రాసెస్ చేస్తోందని ఐఎంఎఫ్ పేర్కొంది. వివిధ పేమెంట్ ప్రొవైడర్స్ సేవలు ఉపయోగించుకునే యూజర్ల మధ్య నిరాటంకంగా చెల్లింపు లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు క్లోజ్డ్ లూప్ సిస్టమ్లతో పోలిస్తే యూపీఐలాంటి ఇంటర్ఆపరబుల్ పేమెంట్ సిస్టమ్లు సమర్ధవంతంగా ఉంటాయని తెలిపింది. అయితే, ఇది మరింత వినియోగంలోకి వచ్చే కొద్దీ ప్రైవేట్ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి కూడా దారి తీయొచ్చని, అలాంటిది జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అదుర్స్
ప్రముఖ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ జూన్లో రూ.5,313 కోట్లు ప్రీమియం ఆదాయాన్ని సమకూర్చుకుంది. క్రితం ఏడాది ఇదే నెలలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.60 శాతం పెరిగింది. ప్రైవేటు జీవిత బీమా సంస్థలతో పోల్చి చూసినా 12 శాతం పెరిగినట్టు ఎల్ఐసీ ప్రకటించింది. జూన్లో 25 ప్రైవేటు జీవిత బీమా సంస్థలు సంయుక్తంగా వసూలు చేసిన ఇండివిడ్యువల్ పాలసీల ప్రీమియం ఆదాయం రూ.8,408 కోట్లుగా ఉంది.ఈ ఏడాది జూన్లో ఎల్ఐసీ 12.49 లక్షల కొత్త పాలసీలను జారీ చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇలా జారీ చేసిన కొత్త పాలసీలు 14.65 లక్షలుగా ఉండడం గమనార్హం. ఇందులో వ్యక్తులకు సంబంధించిన పాలసీలు 12.48 లక్షలగా ఉంటే, గ్రూప్ పాలసీలు 1,290గా ఉన్నాయి. ఎల్ఐసీకి గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం జూన్ నెలలో రూ.22,087 కోట్లుగా ఉంది.గతేడాది జూన్ కంటే 7 శాతం తక్కువ. ప్రైవేటు జీవిత బీమా కంపెనీల గ్రూప్ ప్రీమియం ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి రూ.5,315 కోట్లుగా ఉంది. ఎల్ఐసీ మొత్తం ప్రీమియం (ఇండివిడ్యువల్, గ్రూప్ కలసి) ఆదాయం జూన్ నెలలో 3.43 శాతం తక్కువగా రూ.27,395 కోట్లుగా నమోదైంది. ప్రైవేటు కంపెనీల మొత్తం ప్రీమియం ఆదాయం సైతం 2.45 శాతం తగ్గి రూ.13,722 కోట్లకు పరిమితమైంది. -
రూ.5.6 లక్షల కోట్ల కంపెనీకి కొత్త సీఈవో.. ఎవరీ ప్రియా నాయర్?
హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రియా నాయర్ నియమితులయ్యారు. ఆగస్టు 1 నుండి బాధ్యతలు స్వీకరించనున్నట్లు హెచ్యూఎల్ ప్రకటించింది. ఐదేళ్ల కాలానికి ఆమె నియామకానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.ప్రస్తుతం యూనిలీవర్ లో బ్యూటీ అండ్ వెల్ బీయింగ్ విభాగానికి బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ సేవలందిస్తున్న నాయర్ ప్రపంచ మార్కెట్లలో 13 బిలియన్ యూరోల పోర్ట్ ఫోలియోను పర్యవేక్షిస్తున్నారు. జూలై 31న పదవి నుండి వైదొలగనున్న రోహిత్ జావా స్థానంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. 2023లో హెచ్యూఎల్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టిన జావా.. యూనిలీవర్లో 37 ఏళ్ల విశిష్ట కెరీర్ను ముగించి బోర్డుతో పరస్పర ఒప్పందం తర్వాత వైదొలగుతున్నారు.ఎన్నో బ్రాండ్లు..దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రియా నాయర్ హెచ్యూఎల్ లో అనేక ప్రముఖ పదవులను నిర్వహించారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ హోమ్ కేర్ అలాగే బ్యూటీ & పర్సనల్ కేర్ కూడా ఉన్నాయి. అక్కడ ఆమె డవ్, రిన్, కంఫర్ట్ వంటి ఫ్లాగ్ షిప్ బ్రాండ్ల వృద్ధికి నాయకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ అండ్ బ్రాండ్ పరివర్తన వ్యూహాలను నడిపిస్తూ, బ్యూటీ & వెల్బీయింగ్ విభాగానికి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా కూడా పనిచేశారు.ఇక నాయర్ విద్యార్హతల విషయానికి వస్తే.. సిడెన్హామ్ కాలేజీ నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆమె పుణెలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశారు. హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూయేషన్ రూ.5.6 లక్షల కోట్లుగా ఉంది.హెచ్యూఎల్ గ్లోబల్ సీఎంఓగా నాయర్ సాధించిన విజయాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది. ఆమె సోషల్-ఫస్ట్ మార్కెటింగ్ విధానాలను రూపొందించిందని, ప్రభావశీల-ఆధారిత ఆవిష్కరణలను విస్తరించిందని చెప్పుకొచ్చింది. యువ, డిజిటల్ అవగాహన ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి యూనిలీవర్ బ్యూటీ బ్రాండ్లను పునర్నిర్మించే లక్ష్యంతో గ్లోబల్ ప్రచారాలను ప్రారంభించిందని పేర్కొంది. -
టీసీఎస్ ఫలితాలు: అంచనాలకు అటూ ఇటు..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1FY26) ఫలితాలను వెల్లడించింది. నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి రూ.12,760 కోట్లకు చేరుకుంది. లాభం అంచనాలను మించి వచ్చింది. టీసీఎస్ ఏప్రిల్-జూన్ నికర లాభం వృద్ధి స్వల్పంగా 1.9 శాతంతో రూ.12,263 కోట్లకు పరిమితమతుందని విశ్లేషకుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.ఇక ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.63,437 కోట్లకు చేరుకుందని భారత అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ తెలిపింది. ఇది బ్లూమ్బర్గ్ ఏకాభిప్రాయ అంచనా రూ.64,636 కోట్ల కంటే తక్కువ.డివిడెంట్ ప్రకటనరూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.11 మధ్యంతర డివిడెండ్ ను టీసీఎస్ ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ ను 2025 ఆగస్టు 4వ తేదీ కంపెనీ ఈక్విటీ వాటాదారులకు చెల్లిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. డివిడెండ్ చెల్లింపు కోసం లబ్ధిదారులను నోట్ చేసుకోవడానికి సంస్థ జూలై 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది.కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు వరుసగా పెరిగాయి. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈబీఐటీ మార్జిన్ 30 బేసిస్ పాయింట్లు పెరిగి 24.5 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయ స్థూల ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు డిమాండ్ క్షీణతకు కారణమయ్యాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె.కృతివాసన్ తెలిపారు.2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొత్తగా 6,071 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. దీంతో మొత్తం టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 2025 జూన్ 30 నాటికి 6,13,069కి చేరింది. కంపెనీ ఐటీ సేవల అట్రిషన్ రేటు (గత పన్నెండు నెలల ప్రాతిపదికన) తొలి త్రైమాసికంలో 13.8 శాతానికి పెరిగింది. 2024 డిసెంబర్ త్రైమాసికంలో అట్రిషన్ 13 శాతంగా ఉండేది. టీసీఎస్ కు టాలెంట్ డెవలప్ మెంట్ కీలకమని చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. టీసీఎస్ ఇప్పుడు 1,14,000 మంది హై ఆర్డర్ ఏఐ స్కిల్స్ ఉన్నవారు ఉండటం సంతోషకరమన్నారు.ఆదాయ ప్రకటనకు ముందు టీసీఎస్ షేరు ధర 0.4 శాతం లాభంతో రూ.3,397.1 వద్ద ముగిసింది. -
‘మెటాలో పని.. క్యాన్సర్ అంత ప్రమాదం’
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సూపర్ ఇంటలిజెన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.ది ఇన్ఫర్మేషన్లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైట్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు. -
రైల్వే పరికరాల తయారీపై టాటా, స్కోడా దృష్టి
ఆటో విడిభాగాల దేశీ కంపెనీ టాటా ఆటోకాంప్ తాజాగా యూరోపియన్ దిగ్గజం స్కోడా గ్రూప్తో చేతులు కలిపింది. తద్వారా రైల్వే రంగ పరికరాల తయారీకి వీలుగా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. జేవీ దేశీయంగా రైల్వే ప్రొపల్షన్ సిస్టమ్స్, కంపోనెంట్స్ తయారు చేయనుంది. దీంతో భారత్కు మల్టీ మిలియన్ యూరో పెట్టుబడులు లభించనున్నాయి.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్తాజా భాగస్వామ్యం వృద్ధిలో ఉన్న దేశీ రైల్వే, మొబిలిటీ మార్కెట్లకు మద్దతివ్వనున్నట్లు టాటా ఆటోకాంప్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూరోపియన్ దిగ్గజం స్కోడా గ్రూప్ ప్రధానంగా ప్రజా రవాణాకు వినియోగించే వాహన విడిభాగాల తయారీలో పేరొందింది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల సిస్టమ్స్, విడిభాగాల మార్కెట్లో టాటా ఆటోకాంప్ పటిష్ట వాటాను కలిగి ఉంది. జేవీ ప్రధానంగా మీడియం, హైస్పీడ్ ప్రాంతీయ రైళ్లు, మెట్రోలు, లైట్ రైల్ వాహనాల తయారీలో వినియోగించే కన్వెర్టర్లు, డ్రైవ్స్, ఆగ్జిలరీ కన్వెర్టర్లు తదితరాలను రూపొందించనుంది. -
ఐపీవోకు ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ) పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను యూకే ప్రమోటర్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్స్ విక్రయానికి ఉంచనుంది. కొత్తగా ఈక్విటీ జారీ లేకపోవడంతో ఐపీవో నిధులు ప్రమోటర్లకు చేరనున్నాయి. ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ అనుబంధ సంస్థ ఇది. ఈ భాగస్వామ్య సంస్థలో ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 51 శాతంకాగా.. ప్రుడెన్షియల్ కార్పొరేషన్కు 49 శాతం వాటా ఉంది. కాగా.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో 2 శాతం అదనపు వాటా కొనుగోలుకి బోర్డు అనుమతించినట్లు మాతృ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. తద్వారా సంస్థలో మెజారిటీ వాటాను నిలుపుకోనున్నట్లు తెలియజేసింది. ఐపీవో ద్వారా దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఐదో అసెట్ మేనేజ్మెంట్ సంస్థగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిలవనుంది.బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 0.7 శాతం నష్టంతో రూ. 1432 వద్ద ముగిసింది. -
ఇండిగో వెంచర్స్కు పెట్టుబడులు
ముంబై: విమానయాన దిగ్గజం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ విభాగం ఇండిగో వెంచర్స్ తొలి ఫండ్ ద్వారా రూ. 450 కోట్లు సమీకరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతితో గతేడాది ఆగస్ట్లో రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యంగా తొలిసారి ఫండ్కు తెరతీసింది. తొలి దశలో రూ. 450 కోట్లు సమకూర్చుకున్నట్లు ఇండిగో వెంచర్స్ తెలియజేసింది. కాగా.. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఏరోస్పేస్ స్టార్టప్ జే ఏరోస్పేస్లో తొలి పెట్టుబడికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. నిధులను అడ్వాన్స్డ్ డిజిటల్ తయారీ మౌలికసదుపాయాలు, ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపు(ప్రొడక్షన్ ఆప్టమైజేషన్), సరఫరా చైన్ వ్యవస్థలను ఏకంచేసే ప్లాట్ఫామ్స్ అభివృద్ధి, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ నిపుణులను ఆకట్టుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ఇండిగో వెంచర్స్ వివరించింది. విమానయానం, తత్సంబంధిత రంగాలలో స్టార్టప్లకు ప్రాథమిక దశలో పెట్టుబడులను సమకూర్చేందుకు ఇండిగో వెంచర్స్ ఫండ్కు తెరతీసింది. బీఎస్ఈలో ఇండిగో షేరు 0.8 శాతం బలపడి రూ. 5,847 వద్ద ముగిసింది. -
అదానీ ఎంటర్ప్రైజెస్కు నిధులు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ బాండ్ల జారీ విజయవంతమైంది. బాండ్ల ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తి సబ్ర్స్కిప్షన్ లభించింది. వెరసి మారి్పడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. బుధవారం(9న) ప్రారంభమైన ఎన్సీడీ ఇష్యూ ఈ నెల 22న ముగియనుంది. అయితే అధిక స్పందన కారణంగా గడువుకంటే ముందుగానే ముగించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నిర్ధారిత(ఫిక్స్డ్) వడ్డీ రేటుతో ఇన్వెస్టర్లకు బాండ్లను(ఎన్సీడీలు) జారీ చేయడం ద్వారా కంపెనీలు నిధులు సమీకరించే సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ దిగ్గజం అదానీ ఎంటర్ప్రైజెస్ తాజాగా 9.3 శాతం వార్షిక వడ్డీతో ఎన్సీడీలను ఆఫర్ చేసింది. ఇష్యూకి మధ్యాహా్ననికల్లా రూ. 1,400 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు స్టాక్ ఎక్సే్ఛంజీల డేటా వెల్లడించింది. ముందుగా వచ్చినవారికి ముందుగా పద్ధతిలో కంపెనీ బాండ్ల ఇష్యూని చేపట్టడం గమనార్హం! ఇది రెండో ఇష్యూకాగా.. కంపెనీ ఇంతక్రితం గతేడాది సెప్టెంబర్లోనూ రూ. 800 కోట్ల విలువైన ఎన్సీడీలను జారీ చేసింది. రూ. 500 కోట్ల ప్రాథమిక విలువతో ప్రస్తుత ఆఫరింగ్ను చేపట్టింది. అధిక స్పందన లభిస్తే మరో రూ. 500 కోట్ల విలువైన బాండ్ల జారీకి వీలుగా గ్రీన్షూ ఆప్షన్తో ఇష్యూకి తెరతీసింది. ఒక్కో ఎన్సీడీ ముఖవిలువ రూ. 1,000కాగా.. ఇన్వెస్టర్లు కనీసం 10 బాండ్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధుల్లో కనీసం 75 శాతాన్ని రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఎన్సీడీలను 24, 36, 60 నెలల గడువుతో జారీ చేస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు బీఎస్ఈలో స్వల్ప నష్టంతో రూ. 2,582 వద్ద ముగిసింది. -
డీల్స్ డీలా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగిపోతుండటం, పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో విలీనాలు, కొనుగోళ్లు (ఎంఅండ్ఏ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) డీల్స్పై ప్రభావం పడింది. లావాదేవీలు ఏకంగా 48 శాతం పడిపోయాయి. 17 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పరిమాణంపరంగా 2025 తొలి త్రైమాసికంతో పోల్చి చూస్తే రెండో త్రైమాసికంలో ఎంఅండ్ఏ, పీఈ డీల్స్ 13 శాతం క్షీణించి 582కి పరిమితమయ్యాయి. 2023 రెండో క్వార్టర్ తర్వాత త్రైమాసికాలవారీగా డీల్ విలువ ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే ప్రథమం. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, అనిశ్చితి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న బంగారం ధరలు మొదలైన భౌగోళికరాజకీయాంశాల వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. అయితే, మందగమనంలోనూ ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు నిలకడగా వస్తుండటం, కొత్త యూనికార్న్లు ఆవిర్భవిస్తుండటం మొదలైనవి సానుకూలాంశాలని గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ (గ్రోత్) శాంతి విజేత తెలిపారు. మౌలిక సదుపాయాలు, బ్యాంకింగ్లాంటి రంగాలపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనపరుస్తున్నారని వివరించారు. నివేదికలో మరిన్ని విశేషాలు.. → జూన్ త్రైమాసికంలో 5.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 197 ఎంఅండ్ఏ లావాదేవీలు నమోదయ్యాయి. 2023 క్యూ2 తర్వాత ఇది కనిష్ట స్థాయి. తాజా క్యూ2లో బిలియన్ డాలర్ డీల్ ఒకే ఒక్కటి (యస్ బ్యాంక్లో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 1.57 బిలియన్ డాలర్ల పెట్టుబడి) నమోదైంది. 2025 క్యూ1లో ఇలాంటి డీల్స్ నాలుగు ఉన్నాయి. → పీఈ కార్యకలాపాలు, గత త్రైమాసికంతో పోలిస్తే తగ్గినప్పటికీ 2022 నాలుగో త్రైమాసికం తర్వాత అత్యధిక స్థాయిలో 7.5 బిలియన్ డాలర్ల విలువ చేసే 357 డీల్స్ నమోదయ్యాయి. → క్యూ2లో పబ్లిక్ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణ పెద్దగా జరగలేదు. వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఐపీవో కార్యకలాపాలు నెమ్మదించాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీలు 12 ఐపీవోల ద్వారా 1.9 బిలియన్ డాలర్లు సమీకరించాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే డీల్స్ పరిమాణం 25 శాతం, విలువ 26 శాతం తగ్గింది. → అయితే, జూన్లో పరిస్థితులు కాస్త మెరుగుపడుతున్న సంకేతాలు కనిపించాయి. నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ఐపీవోలు, నిధుల సమీకరణ విషయంలో జూన్ రెండో స్థానంలో నిల్చింది. లీలా హోటల్స్ (407 మిలియన్ డాలర్లు), ఏథర్ ఎనర్జీ (343 మిలియన్ డాలర్లు), ఏజిస్ వొప్యాక్ టెరి్మనల్స్ (326 మిలియన్ డాలర్లు) లాంటి పెద్ద లిస్టింగ్లు నమోదయ్యాయి. → దాదాపు క్రితం త్రైమాసికం తరహాలోనే క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్కి (క్యూఐపీ) సంబంధించి 2.2 బిలియన్ డాలర్ల విలువ చేసే 16 ఇష్యూలు నమోదయ్యాయి. -
వేదాంత గ్రూప్ ఓ పేకమేడ..!
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ను హిండెన్బర్గ్ రీసెర్చ్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా తాజాగా మరో దిగ్గజం వేదాంత గ్రూప్ను ఇంకో అమెరికన్ షార్ట్సెల్లింగ్ సంస్థ వైస్రాయ్ రీసెర్చ్ టార్గెట్ చేసింది. వేదాంత గ్రూప్ అనేది భారీ అప్పులు, కొల్లగొట్టిన ఆస్తులు, కల్పిత అకౌంటింగ్ గాధలతో కట్టిన ఓ పేకమేడలాంటిది అని ఓ సంచలన నివేదికలో ఆరోపించింది. హోల్డింగ్ కంపెనీ అయిన వేదాంత రిసోర్సెస్ (వీఆర్ఎల్), భారత అనుబంధ సంస్థను పారసైట్లాగా భ్రష్టు పట్టిస్తోందని 85 పేజీల రిపోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘వేదాంత రిసోర్సెస్ ఓ పారసైట్లాంటి హోల్డింగ్ కంపెనీ. అదొక పోంజీ స్కీము నడిపిస్తోంది. దానికంటూ చెప్పుకోతగ్గ కార్యకలాపాలేమీ లేవు. భారతీయ విభాగం వేదాంత లిమిటెడ్ను (వీఈడీఎల్) కొల్లగొడుతూ బతికేస్తోంది‘ అని వీఆర్ఎల్ బాండ్లలో షార్ట్ పొజిషన్లు తీసుకున్న వైస్రాయ్ రీసెర్చ్ పేర్కొంది. మాతృ సంస్థకు డివిడెండ్ల రూపంలో వేల కోట్లు సమర్పించుకున్నాక వీఈడీఎల్ దగ్గర నగదు నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోయాయని, ఎక్కడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని తెలిపింది. ఇంతగా నిధులు వస్తున్నప్పటికీ, వీఆర్ఎల్ వడ్డీ వ్యయాలు వార్షికంగా 200 మిలియన్ డాలర్ల మేర పెరిగినట్లు వివరించింది. కంపెనీ 9–11 శాతం వడ్డీ రేటుతో బాండ్లను ఇష్యూ చేయగా, వడ్డీ భారాన్ని చూస్తుంటే ఏకంగా 15.8 శాతం స్థాయిలో కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఇదంతా చూస్తుంటే ఓ స్థాయిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు ఉందని వివరించింది. వేరే ఖర్చులను వడ్డీల రూపంలో మోసపూరితంగా చూపిస్తుండటం, సిసలైన రుణభారం తెలియకుండా అధిక వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలను తీర్చేస్తుండటం, లేదా రుణ రేట్లు .. షరతులను సరిగ్గా వెల్లడించకపోవడంలాంటివి కారణాలుగా ఉండొచ్చని పేర్కొంది. నిరాధార ఆరోపణలు: వేదాంత గ్రూప్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వేదాంత లిమిటెడ్ చైర్మన్ అనిల్ అగర్వాల్ పాల్గొనడానికి ఒక రోజు ముందు ఈ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపోర్టును బైటపెట్టిన సమయం చూస్తే, వైస్రాయ్ రీసెర్చ్ తీరు సందేహాలకు తావిచ్చేదిగా ఉందని వేదాంత గ్రూప్ పేర్కొంది. ఇదంతా నిరాధార ఆరోపణలు, వారికి అనువైన సమాచారాన్ని ఉపయోగించుకుని చేస్తున్న విషపూరిత ప్రచారమని తెలిపింది. వివరణ కోసం వైస్రాయ్ రీసెర్చ్ తమను కనీసం సంప్రదించకుండానే రిపోర్ట్ తయారైందని పేర్కొంది. అయితే, దీనికి వైస్రాయ్ రీసెర్చ్ కౌంటర్ ఇచ్చింది. తమ రిపోర్టును వేదాంత గ్రూప్ తోసిపుచ్చలేదని, ప్రశ్నలేవైనా ఉంటే సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. వైస్రాయ్ రీసెర్చ్ రిపోర్ట్ దెబ్బతో వేదాంత షేర్లు బుధవారం బీఎస్ఈలో 6 శాతం పడిపోయింది. తర్వాత కొంత కోలుకుని 3.4 శాతం నష్టంతో రూ. 440.80 వద్ద క్లోజయ్యింది. -
రూల్స్ పాటించాల్సిందే.. ఈ-కామర్స్ సంస్థలకు హెచ్చరిక
ఆహార భద్రత ప్రొటోకాల్స్ను పాటించడంలో విఫలమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఈ–కామర్స్ సంస్థలను నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. ఉల్లంఘనల విషయంలో కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ–కామర్స్ ప్లాట్ఫాంలకు చెందిన 70 మందికి పైగా ప్రతినిధులతో సమావేశమైన సందర్భంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో జి.కమల వర్ధనరావు ఈ విషయాలు తెలిపారు.ఈ–కామర్స్ సంస్థలన్నీ వినియోగదారులకు ఇచ్చే ప్రతి రసీదు, ఇన్వాయిస్లలో తమ ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు/రిజిస్ట్రేషన్ నంబర్లను స్పష్టంగా ముద్రించాలని ఆయన ఆదేశించారు. గిడ్డంగులు, స్టోరేజ్ కేంద్రాల్లో పరిశుభ్రత, ఆహార భద్రత ప్రొటోకాల్స్ పాటించాలని రావు సూచించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. -
ఎన్విడియా.. ఎన్ని వందల లక్షల కోట్లయ్యా!!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంటూ ఎన్విడియా కార్పొరేషన్ చరిత్ర సృష్టించింది. 4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ .342 లక్షల కోట్లు) మార్కెట్ విలువను చేరుకున్న మొదటి పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీగా నిలిచింది. అత్యాధునిక ఏఐ ప్రాసెసర్లకు డిమాండ్ పెరగడంతో షేరు ధర 164 డాలర్లను దాటడంతో బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఈ మైలురాయిని సాధించింది.ఈ వాల్యుయేషన్ తో మైక్రోసాఫ్ట్ (3.75 ట్రిలియన్ డాలర్లు), యాపిల్ (3.19 ట్రిలియన్ డాలర్లు)లను అధిగమించి ఎన్విడియా ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. 2023 జూన్లో తొలిసారి ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన ఈ చిప్ తయారీ కంపెనీ తర్వాత ఒక్క ఏడాదిలోనే తన మార్కెట్ వ్యాల్యూను ఏకంగా మూడు రెట్లు పెంచుకుంది. అలా 3 ట్రిలియన్ డాలర్ల కంపెనీల సరసన నిలిచిన ఎన్విడియా వేగంగా 4 ట్రిలియన్ డాలర్ల మార్క్నూ దాటేసి టాప్ కంపెనీగా నిలిచింది.తోడైన కృత్రిమ మేధ విప్లవంగ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల (జీపీయూ)ల్లో ఎన్విడియా ఆధిపత్యం ఏఐ మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా నిలిచింది. జనరేటివ్ ఏఐ మోడల్స్ నుంచి అటానమస్ వెహికల్స్, డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్స్ వరకు అన్నింటికీ ఈ కంపెనీ తయారు చేసిన చిప్స్ను వినియోగిస్తున్నారు. 2025 మొదటి త్రైమాసికంలో ఎన్విడియా 70% ఆదాయ పెరుగుదలను నమోదు చేసింది. 44 బిలియన్ డాలర్లను దాటింది. ఇది విశ్లేషకుల అంచనాలను అధిగమించింది. యాక్సిలరేటెడ్ కంప్యూటింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిమాండ్ విపరీతంగా ఉందని, మనం కొత్త పారిశ్రామిక యుగ ఆవిర్భావాన్ని చూస్తున్నామని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ చెబుతున్నారు.ప్రపంచ మార్కెట్లపై ప్రభావంఎన్విడియా ఇప్పుడు ఎస్ అండ్ పీ 500 లో 7.3% వాటాను కలిగి ఉంది. ఇది వారసత్వ టెక్ దిగ్గజాలను అధిగమించింది. దీని పెరుగుదల పెట్టుబడి పోర్ట్ఫక్షలియోలు, టెక్ రంగ డైనమిక్స్ను పునర్నిర్వచించింది.ఓ వైపు ఎగుమతి ఆంక్షలు, పెరుగుతున్న పోటీ ఉన్నప్పటికీ, ఎన్విడియా వృద్ధి "స్థితిస్థాపకంగా, అంతర్జాతీయంగా" ఉందని విశ్లేషకులు అంటున్నారు.ఇండియన్ బడ్డెట్కు 10 రెట్లుఎన్విడియా మార్కెట్ విలువ 4 ట్రిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ .342.66 లక్షల కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి అగ్రశ్రేణి భారతీయ సంస్థల మార్కెట్ విలువను కలిపినా దీని కంటే తక్కువే. ఇది కేంద్ర బడ్జెట్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. -
ఈపీఎఫ్వో ఈఎల్ఐ స్కీమ్కు పటిష్ట వ్యవస్థ
ఉపాధి కల్పన లక్ష్యాల్లో భాగంగా ప్రకటించిన రూ.1.07 లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్ఐ) స్కీమ్ అమలు కోసం డిజిటల్ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్వో నిర్వహించే సామాజిక భద్రత స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది. ఇటు ఉద్యోగులు, అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన (ఏబీఆర్వై) అమల్లో అవినీతి, ఫేక్ క్లెయిమ్ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మళ్లీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగయోగ్యత, సామాజిక భద్రతను పెంపొందించడం ఈఎల్ఐ స్కీము ప్రధాన ఉద్దేశం. దీనితో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం (రూ.15,000 వరకు) ఈ స్కీము కింద లభిస్తుంది. అదనంగా ఉద్యోగాలను కల్పించనందుకు అటు వ్యాపార సంస్థలకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. తయారీ రంగానికి మరో రెండేళ్లు అదనంగా ప్రయోజనాలు అందుతాయి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది. -
అమెరికన్ సంస్థల్లో హైదరాబాద్ కంపెనీ విలీనం
హైదరాబాదీ ఏజెంటిక్ ఏఐ సంస్థ కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా అమెరికాకు చెందిన కోనాఏఐ, డీక్యూబ్ డేటా సైన్సెస్లో విలీనమైంది. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ఈ వ్యూహాత్మక విలీనం దోహదపడగలదని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్ఏఐ ఆధారిత సర్వీసెస్ యాజ్ సాఫ్ట్వేర్ విభాగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇకపై కోవాసెంట్కి అనిల్ కోనా సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తారు. కోనాఏఐ, డీక్యూబ్ వ్యవస్థాపకుడు అయిన అనిల్కి ఫోరెన్సిక్ అనలిటిక్స్.. సైబర్ సెక్యూరిటీలో అపార అనుభవం ఉంది. -
క్యాప్జెమిని చేతికి డబ్ల్యూఎన్ఎస్
సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్వేస్ నెలకొల్పిన డబ్ల్యూఎన్ఎస్ చివరికి ఫ్రెంచ్ దిగ్గజం క్యాప్జెమిని చేతికి చిక్కింది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) సంస్థ డబ్ల్యూఎన్ఎస్ను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్జెమిని సొంతం చేసుకోనుంది. బీపీఎం రంగంలో భారీ డీల్కు తెరతీస్తూ టెక్నాలజీ సేవల గ్లోబల్ దిగ్గజం క్యాప్జెమిని.. డబ్ల్యూఎన్ఎస్ను కొనుగోలు చేస్తోంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఇది గురువారం ముగింపు(ఎన్వైఎస్ఈ) ధరతో పోలిస్తే 17 శాతం అధికంకాగా.. నెల రోజుల సగటు ధరతో చూస్తే 27 శాతం ప్రీమియం చెల్లిస్తోంది. ఇందుకు నగదు రూపేణా మొత్తం 3.3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. వెరసి బీపీఎం విభాగంలో అతిపెద్ద డీల్స్లో ఒకటిగా ఇది నిలవనుంది. తాజా డీల్కు రెండు సంస్థల బోర్డులు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు క్యాప్జెమిని వెల్లడించింది. రెండు కంపెనీలూ భారత్లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. తాజా కొనుగోలుతో తమ క్లయింట్లకు బిజినెస్, టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్ కార్యకలాపాలను క్యాప్జెమిని.. మరింత సమర్థవంతంగా సమకూర్చగలుగుతుంది. సంప్రదాయ బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల నుంచి ఆధునిక ఏఐ ఆధారిత మేథో కార్యకలాపాలను క్యాప్జెమిని అందించగలుగుతుంది.ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్డబ్ల్యూఎన్ఎస్ నేపథ్యమిదీ...1999లో బ్రిటిష్ ఎయిర్వేస్ ముంబైలో సొంత అవసరాల కోసం డబ్ల్యూఎన్ఎస్ను నెలకొలి్పంది. పుణేలో డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేసింది. 2002లో వార్బర్గ్ పింకస్ 40 కోట్ల డాలర్లకు మెజారిటీ వాటా కొనుగోలు చేసి కంపెనీ పేరును డబ్ల్యూఎన్ఎస్గా మార్చింది. 2006లో ఎన్వైఎస్ఈలో లిస్ట్ చేసింది. 2013లో వార్బర్గ్ పింకస్ 19.2 కోట్ల డాలర్లకు డబ్ల్యూఎన్ఎస్ను విక్రయించింది. కంపెనీ ప్రధానంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్తోపాటు.. డేటా అనలిటిక్స్ సర్వీసులు అందిస్తోంది. 2025లో 1.27 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. -
భారతి సిమెంట్కు ఎస్డీఎఫ్ 5 స్టార్ రేటింగ్
సుస్థిర అభివృద్ధి ఫ్రేమ్వర్క్ (ఎస్డీఎఫ్) కింద 2023–24 ఏడాదికి గాను భారతి సిమెంట్ సున్నపు గనికి వరుసగా ఆరో ఏడాది కేంద్ర గనుల శాఖ నుంచి 5 స్టార్ రేటింగ్ దక్కింది.జైపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా కంపెనీ సీఎంవో ఎం సాయి రమేశ్, హెడ్ (మైన్స్) కె. సుధాకర్ పురస్కార పత్రాలను అందుకున్నారు. -
మళ్లీ మొబైల్ బిల్లుల మోత!
టెలికం యూజర్లు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలు మరో విడత చార్జీల వడ్డనకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 10–12 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యస్తంగాను, అధిక మొత్తంలోను చెల్లించే వర్గాలు టార్గెట్గా ఈ పెంపు ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది జూలైలోనే బేస్ ప్లాన్లను 11–23 శాతం పెంచేసినందున, ఈసారి వాటి జోలికెళ్లకుండా డేటా అ్రస్తాన్ని వాడుకోవాలనే యోచనలో కంపెనీలు ఉన్నట్లు పేర్కొన్నాయి. బేస్ ప్లాన్లను మళ్లీ పెంచితే యూజర్లు.. ప్రత్యర్థి కంపెనీకి మారిపోయే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం.కాబట్టి ఈసారి డేటా ప్రయోజనాలను తగ్గించేసి, మరింత ఖరీదైన ప్లాన్ల వైపు మళ్లించేలా ఈ విడత పెంపు ఉండబోతోందని సంబంధిత వర్గాలు వివరించాయి. డేటా వినియోగం, డేటా స్పీడ్ లేదా డేటాను అత్యధికంగా వినియోగించే వేళలకు వర్తించే విధంగా ఈ పెంపు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. టారిఫ్ల స్వరూపం మారాల్సిన అవసరం ఉందంటూ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టాప్ మేనేజ్మెంట్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చార్జీల పెంపు వార్తలకు ఊతమిస్తున్నాయి. అందరికీ ఒకే రకం టారిఫ్ను వర్తింపచేయడమనేది సరి కాదంటూ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఇటువినియోగదారులు, అటు కస్టమర్లు బండిల్డ్ ప్లాన్లకు అప్గ్రేడ్ కావడం వల్ల దేశీ టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి 2025–27 ఆర్థిక సంవత్సరాల్లో రెండంకెల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు బీఎన్పీ పారిబా ఒక నివేదికలో తెలిపింది. యాక్టివ్ యూజర్ల వృద్ధి.. మే నెలలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 29 నెలల గరిష్టమైన 74 లక్షలకు ఎగియడంతో మొత్తం యాక్టివ్ యూజర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. దీనితో వరుసగా అయిదు నెలల పాటు కొత్త యూజర్ల సంఖ్య పెరిగినట్లయింది. మే నెలలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొత్త యూజర్ల సంఖ్య 55 లక్షలు పెరిగింది. దీంతో జియో యాక్టివ్ యూజర్ల సంఖ్య 150 బేసిస్ పాయింట్లు (సుమారు 1.5 శాతం) పెరిగి, పరిశ్రమవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ యూజర్లలో వాటా 53 శాతానికి చేరింది. అటు భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 13 లక్షలు పెరిగింది.మొత్తం యాక్టివ్ యూజర్లలో ఎయిర్టెల్ వాటా 36 శాతానికి పెరిగింది. రాబోయే రోజుల్లో 5జీ సేవల విస్తరణ, వినియోగం ఆధారంగా కొత్త కనెక్షన్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జియోలాంటి టాప్ ఆపరేటర్ల యూజర్లు పెరగడమనేది భవిష్యత్తులో టారిఫ్ల పెంపునకు సానుకూల పరిస్థితులున్నట్లుగా కనిపిస్తోందని బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ పేర్కొంది. వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గిపోయే కొద్దీ ఎయిర్టెల్, జియోల మా ర్కెట్ వాటా మరింతగా పెరుగుతుందని తెలిపింది. – సాక్షి, బిజినెస్డెస్క్ -
వయసు 34.. 10 ఏళ్లు ఉద్యోగం.. రూ.4 కోట్లు సంపద
మారుమూల గ్రామంలో పుట్టిన ఓ టెక్కీ చదువు పూర్తయిన తర్వాత 10 ఏళ్లు ఉద్యోగం చేసి తన 34వ ఏట ఏకంగా రూ.4 కోట్ల కార్పస్ సృష్టించాడు. ఈమేరకు ఆయన అనుసరించిన ఆర్థిక విధానాలు, క్రమశిక్షణ గురించి తెలుపుతూ రెడ్డిట్లో వివరాలు పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్గా మారింది.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పోస్ట్ ‘ఆర్/నోయిడా’ అనే రెడ్డిట్ కమ్యూనిటీలో వెలసింది. అందులో ‘ఈ రోజు నాకు 34 ఏళ్లు. వ్యక్తిగతంగా నేను రూ.4 కోట్లు పొదుపు చేశాను. ఎలాంటి ఆర్థిక వారసత్వం లేదు. లాటరీలు లేవు. పదేళ్లు నిరంతర కృషి, సహనం, క్రమశిక్షణతో కూడిన జీవనంతోనే ఇది సాధ్యమైంది. నేను ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగాను. హిందీ మీడియం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. మా నాన్న రోజువారీ కూలీ. నిత్యం కుటుంబ పోషణకు సరిపడా మాత్రమే సంపాదించేవాడు. ఆ సమయంలో తాను ఎలాగోలా నాకు కొన్ని పుస్తకాలు కొని, ఎన్నో మంచి విషయాలు పంచుకున్నాడు. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ.. నా వల్ల ప్రజలు మా నాన్నను గుర్తించినరోజే తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఆ వాక్యం నా మనసులోనే ఉండిపోయింది’ అన్నారు.‘ఆకలి ఎలా ఉంటుందో నాకు ఇంకా గుర్తుంది. నేను అనుకోకుండా కంప్యూటర్లోని కొన్ని టెక్నాలజీలను కనుగొన్నాను. నేను వాటితో ప్రేమలో పడ్డాను. నెమ్మదిగా అవి నా చుట్టూ ఉన్న జీవితాన్ని మార్చడం ప్రారంభించాయి. దాంతో టెక్నాలజీ రంగంలో మంచి ఉద్యోగం వచ్చింది. చిత్తశుద్ధితో పనిచేశాను. అనవసర ఖర్చులను తగ్గించాను. తెలివిగా పొదుపు చేశాను. చివరికి పార్ట్ టైమ్గా ట్రేడింగ్ ప్రారంభించాను. నాకు గురువు లేడు. నా తప్పుల నుంచి, యూట్యూబ్లో ఉచిత కంటెంట్ ద్వారా, కొన్ని పుస్తకాల నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని చెప్పారు.ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్ఎందుకు చెబుతున్నారంటే..‘ఎక్కడో ఒక చిన్న గ్రామంలో లేదా ఏదో పట్టణంలో ఎవరైనా నిస్సహాయతతో ఉండవచ్చు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వ్యక్తి.. తమ ఇంగ్లిష్ బాగోలేదని నమ్మే వ్యక్తి.. కలలు కేవలం ధనవంతుల కోసమే అనుకునే వ్యక్తులు ఉండవచ్చు. నేను ఆర్థికంగా సాధించగలిగింది.. మీరూ సాధిస్తారు. మీరు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. పెద్ద డిగ్రీలు వద్దు. కానీ, జీవితంగా ఎదగాలంటే పట్టుదల, గెలుస్తామనే తపన, మీపై నమ్మకం ఉండాలి’ అన్నారు. -
రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్
ఉద్యోగులు మెషీన్లా పనిచేయాలని కొన్ని కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నాయి. అయితే తీరికలేకుండా నిర్ణీత పని గంటల కంటే ఎక్కువసేపు వర్క్ చేయించే కొన్ని కంపెనీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తన కంపెనీలో ఉద్యోగులు రోజుకు 12 గంటలు, వారానికి ఆరు రోజులు, చాలాసార్లు ఆదివారాల్లోనూ పనిచేస్తారని బహిరంగంగా చెప్పడం కార్పొరేట్ పని వాతావరణంపై ఆందోళనలు కలిగిస్తుంది.మొబైల్ గేమింగ్ స్టార్టప్ మాటిక్స్ప్లే సహ వ్యవస్థాపకుడు మోహన్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. ‘మాకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ కార్యకలాపాలుంటాయి. వారానికి 6 రోజులపాటు కఠినమైన ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయి. అయినా మా టీమ్లో 10 కంటే ఎక్కువ మంది ఆదివారాల్లో కూడా పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘ప్రజలు ఈ విధానాన్ని విమర్శిస్తారు. కానీ వాస్తవం ఏంటంటే భారత్లో ప్రపంచస్థాయి ఉత్పత్తులను తయారు చేయాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి. జాబ్ మైండ్సెట్ నుంచి బిల్డ్ మైండ్సెట్ను పెంపొందించుకోవాలి’ అని చెప్పారు.ఈ పోస్ట్పై ఆన్లైన్లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది సంస్థ మొదటి నుంచి ఉత్పత్తిని నిర్మించే నిబద్ధతను ప్రశంసించారు. మరికొందరు బర్న్అవుట్, వర్క్-లైఫ్ సమతుల్యతపై ఆందోళన, పని దోపిడీ అని తెలిపారు. ఈ నేపథ్యంలో కుమార్ తన పాత పోస్టును డిలీట్ చేసి ‘బాయ్స్, కూల్, ఉదయం 10:00 గంటలకు ఎవరూ లోపలికి రారు. మేము ఆఫీసులో కలిసి పేకాట ఆడతాం. నెట్ఫ్లిక్స్ చూస్తాం. మేమందరం కెరియర్ మొదటి నుంచి నిర్మించుకుంటున్నాం. ఇక్కడ ఎవరూ కష్టంగా ఉద్యోగం చేయడం లేదు. సీనియర్లు, జూనియర్లు కలిసి ఒక ప్రాజెక్టులో పని చేస్తున్నాం. అది నూటికి నూరు శాతం ఫలితాలు ఇస్తుంది. కార్పొరేట్ కార్యాలయాల్లో మీరు ఊహించలేని ఒక రకమైన సరదా మా ఆఫీసులో ఉంది’ అని చెప్పారు.Guys, chill, no one comes in at 10:00 am. We play poker and watch Netflix together in the office.We’re all fresh out of college, building our careers and lives from scratch.No one’s just doing a job here, we’re all seniors and juniors working together on a project, giving it… https://t.co/ESWZ9BsqeN— Mohan is building @matiks_play (@themohment) July 6, 2025ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంహిందుస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కుమార్ మాట్లాడుతూ.. కంపెనీ తన ఉద్యోగులను సిబ్బందిగా చూడదని, సంస్థ మిషన్లో వ్యవస్థాపక సభ్యులుగా పరిగణిస్తుందని చెప్పారు. జీతభత్యాల కోసమో, మనుగడ కోసమో తాము పనిచేయడం లేదన్నారు. చాలామందికి ఈ మనస్తత్వం ఉండదు. నిజంగా కష్టపడేవారికి ఇది ఒక ఉద్యోగంలా అనిపించదని చెప్పారు. తమ కలను వెంటాడుతున్నట్టు తోస్తుందని తెలిపారు. -
హైదరాబాద్లో ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభం
గ్లోబల్ స్పోర్ట్స్, గేమింగ్ లీడర్గా ఉన్న ఎంటైన్ సంస్థకు చెందిన టెక్నాలజీ విభాగం ఐవీ అధికారికంగా ఎంటైన్ ఇండియాగా రీబ్రాండ్ అయి హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ క్యాంపస్ను ప్రారంభించినట్లు తెలిపింది. కొత్త హైదరాబాద్ క్యాంపస్ ఎంటైన్ అంతర్జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారనుందని కంపెనీ పేర్కొంది.ఈ సంస్థలో పని చేసేందుకు హైబ్రిడ్ రోల్స్లో 3,400 మంది హైస్కిల్డ్ ప్రొఫెషనల్స్కు చోటు కల్పించేలా ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ఫెసిలిటీని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఎంటైన్ హైదరాబాద్ క్యాంపస్ ద్వారా గ్లోబల్ టెక్ సేవల్లో 85% పైగా సర్వీసులు అందించడానికి దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇందులో సేవలందించే అడ్వాన్స్డ్ డొమైన్లు కింది విధంగా ఉన్నాయి.కృత్రిమ మేధప్లాట్ ఫాం ఇంజినీరింగ్రియల్ టైమ్ ట్రేడింగ్ సిస్టమ్స్గ్లోబల్ సస్టెయినబిలిటీ లక్ష్యాలకు అనుగుణంగా హైదరాబాద్ క్యాంపస్లోని సదుపాయాలు..స్మార్ట్ లైటింగ్ వ్యవస్థలుఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లుపర్యావరణహిత నిర్మాణ సామగ్రిఇదీ చదవండి: ట్రంప్ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపుఈ రీబ్రాండ్ వ్యూహాత్మక ప్రాముఖ్యతపై ఎంటైన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంతిల్ అన్బగన్ మాట్లాడుతూ..‘ఎంటైన్ ఇండియా ద్వారా హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ భవిష్యత్తును ఇక్కడి నుంచి శక్తివంతం చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. ఎంటైన్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సాటీ బెన్స్ మాట్లాడుతూ..‘తదుపరి తరం వినోద వేదికలను నిర్మించాలనే మా ఆశయానికి భారతదేశం కేంద్రబిందువుగా మారింది. హైదరాబాద్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయడం ఆ దిశగా కంపెనీ వేసిన సాహసోపేతమైన ముందడుగు’ అని అన్నారు. -
ఆకాశ ఎయిర్తో జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ ఏరో టెక్నిక్ వెల్లడించింది. దీని కింద ఆకాశ ఎయిర్కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు తమ అధునాతన ఎంఆర్వో కేంద్రంలో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్) మెయింటెనెన్స్ సేవలు అందించనున్నట్లు వివరించింది. ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. తమ సాంకేతిక నైపుణ్యాలు, నిర్వహణ సామర్థ్యాలపై విమానయాన సంస్థలకు గల నమ్మకానికి ఈ డీల్ నిదర్శనమని జీఎంఆర్ ఏరో టెక్నిక్ ప్రెసిడెంట్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. దేశీయంగా ఎంఆర్వో వ్యవస్థ అభివృద్ధి చెందడంలో మద్దతిచ్చేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆకాశ ఎయిర్ సహ–వ్యవస్థాపకుడు బెల్సన్ కొటిన్హో పేర్కొన్నారు. -
ల్యాబ్ వజ్రం.. జిగేల్!
కోట్ల కొద్దీ సంవత్సరాలుగా రసాయనిక చర్యలకు గురై, ఎక్కడో భూమి లోతుల్లో నిక్షిప్తమై అత్యంత అరుదుగా లభించే వజ్రాలు.. ఇప్పుడు ప్రయోగశాలల్లో కూడా తయారవుతున్నాయి. సహజమైన వజ్రాలకు చౌక ప్రత్యామ్నాయమైన ఈ వజ్రాలను ల్యాబ్ గ్రోన్ డైమండ్లుగా (ఎల్జీడీ) పిలుచుకుంటున్నారు. సహజ వజ్రాల ధరలు పెరుగుతుండటంతో, బడ్జెట్ గురించి ఆలోచించే వర్గాల్లోనూ, యువతలోనూ ఈ ఎల్జీడీలకు ఆదరణ పెరుగుతోంది. ల్యాబ్లలో తయారు చేసే ఈ వజ్రాల ధర, సహజ డైమండ్లతో పోలిస్తే దాదాపు 70–90 శాతం తక్కువగా ఉండటంతో పాటు పర్యావరణ అనుకూలమైన విధానంలో తయారు చేస్తుండటం కూడా ఇందుకు కారణాలు. ఫార్చూన్ బిజినెస్ ఇన్సైట్స్ ప్రకారం అంతర్జాతీయంగా ఈ మార్కెట్ 2024లో సుమారు 26 బిలియన్ డాలర్లుగా ఉండగా 2032 నాటికి 75 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ నేపథ్యంలో డైమండ్ కటింగ్, పాలిషింగ్కి పేరొందిన భారత్ ఇప్పుడు ఎల్జీడీ రంగంలో కూడా కీలకంగా మారుతోంది. దేశీయంగా ఏటా 8–10 శాతం పెరుగు తున్న రత్నాభరణాల మార్కెట్ దాదాపు 80–85 బిలియన్ డాలర్లుగా ఉండగా ఇందులో సహజ వజ్రాభరణాల వాటా సుమారు 10 శాతంగా ఉంటోంది. గతేడాది ఎల్జీడీల మార్కెట్ 600–700 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా. ఇలా ఎల్జీడీల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండటంతో పలు దిగ్గజ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నాయి. ఉదాహరణకు ట్రెంట్ ఇటీవలే తమ ఎల్జీడీ బ్రాండ్ ‘పోమ్’తో మార్కెట్లోకి ఎంట్రీ ఇచి్చంది. సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా ఎల్జీడీ మార్కెట్లోకి ప్రవేశించడంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సెనెస్ ఫ్యాషన్ అనే అనుబంధ సంస్థ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్తో పాటు పర్ఫ్యూమ్లు, లెదర్ యాక్సెసరీల్లాంటి లగ్జరీ ఐటమ్స్పైనా దృష్టి పెడుతోంది. ఇలా ఎల్జీడీలకు ఆదరణ పెరగడం ఒక కోణం అయితే ఇవి మిగతా సెగ్మెంట్లకు పోటీ కావడం మరో కోణంగా మారుతోంది. ఎల్జీడీలతో వివాహ ఆభరణాల సెగ్మెంట్కి వచ్చే నష్టమేమీ పెద్దగా లేకపోయినా.. రోజువారీ ఉపయోగించుకునేందుకు కొనుగోలు చేసే ఆభరణాలకు ఇవి పోటీగా మారొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో దాదాపు రూ. 150 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఎల్జీడీలకు గత కొన్నాళ్లు గా డిమాండ్ పెరుగుతోంది. దీంతో లైమ్లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, లాదియా తదితర సంస్థలు కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం సుమారు రూ. 100–150 కోట్ల వరకు మార్కెట్ ఉంటుందని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టోర్స్ ఉన్న లైమ్లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ సంస్థ ఇన్వెస్టర్ నిపుణ్ గోయల్ తెలిపారు. ఇది ఏటా 15–17 శాతం వరకు వృద్ధి చెందుతోందని చెప్పారు. ఎక్కువగా 18–30 ఏళ్లు, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారు వీటిపై మక్కువ చూపిస్తున్నట్లు వివరించారు. సాధారణంగా రూ. 20–25 వేల వరకు సగటు ధర ఉండే రింగులు, పెండెంట్లు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోందని పేర్కొన్నారు. తమ స్టోర్లు ఒక్కొక్కటి ప్రతి నెలా సుమారు రూ. 20–25 లక్షల వరకు సేల్స్ సాధిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కూడా గణనీయంగా వృద్ధి చెందుతోందని వివరించారు. అక్కడి వినియోగ ధోరణులను పరిశీలిస్తే పొరుగు రాష్ట్రాన్ని కూడా త్వరలోనే అధిగమించే అవకాశం ఉందన్నారు. సిసలైన డైమండ్తో పోలిస్తే ఎల్జీడీలు దాదాపు పదో వంతుకే లభిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఉదాహరణకు సిసలైన డైమండ్ ఖరీదు రూ. 9 లక్షలుగా ఉంటే ఎల్జీడీ దాదాపు రూ. 1 లక్షకే లభిస్తుందని వివరించారు. ఎల్జీడీల కు ఎక్సే్చంజ్ ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు చెప్పా రు. ఇలా అందుబాటు ధరలో లభిస్తుండటం, పర్యావరణహితమైనవి కావడంలాంటివి ఎల్జీడీలకు సంబంధించి ఆకర్షణీయమైన అంశాలుగా ఉంటున్నాయి. ఆదరణ ఎందుకంటే .. → గనుల్లో నుంచి తవ్వి తీసే సహజ వజ్రాల కన్నా పర్యావరణానికి అనుకూలమైన, నైతికంగా తయారు చేసే ప్రత్యామ్నాయాలుగా ఎల్జీడీలు ఆదరణ పొందుతున్నాయి. → కొంత ఖర్చు చేయతగిన విధంగా ఆదాయాలు, విలువైన డైమండ్లపై పెట్టుబడి మీద అవగాహన పెరుగుతుండటం. → వినియోగదారుల్లో, ముఖ్యంగా యువత అభిరుచి మారుతుండటం, ఎల్జీడీలతో మరింత కస్టమైజ్డ్ జ్యుయలరీ డిజైన్లను తయారు చేసేందుకు వీలుండటం. → సహజమైన డైమండ్లతో పోలిస్తే అత్యంత తక్కువ వ్యయాలకే, చాలా తక్కువ సమయంలోనే ఉత్పత్తి చేయడం వల్ల నాణ్యమైన ప్రత్యామ్నాయ వజ్రాలు చౌకగా లభ్యమవుతుండటం → ప్రభుత్వం కూడా వీటి తయారీని ప్రోత్సహించే దిశగా ఎల్జీడీ సీడ్స్పై కస్టమ్స్ సుంకాలను అయిదు శాతం నుంచి సున్నా స్థాయికి తగ్గించింది. ఏమిటీ ఎల్జీడీలు.. → కార్బన్తో కూడుకున్న సహజసిద్ధమైన వజ్రాలను గనుల నుంచి వెలికితీస్తా రు. డైమండ్ సీడ్ను ఉపయోగించి ఎల్జీడీలను హై–ప్రెజర్, హై టెంపరేచర్ (హెచ్పీహెచ్టీ), కెమికల్ వేపర్ డిపాజిషన్ (సీవీడీ) అనే పద్ధతుల్లో ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. ఇవి అచ్చంగా సహజమైన డైమండ్లలాగే ఉంటాయి. ఒరిజినల్ డైమండ్ని, వీటిని పక్కపక్కన పెడితే పలు సందర్భాల్లో నిపుణులు సైతం ప్రత్యేక పరికరాలు లేకుండా వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. → సహజమైన రఫ్ డైమండ్ల సరఫరా ప్రస్తుతం సుమా రు ఏటా 125 మిలియన్ క్యారట్లుగా ఉండగా 2050 నాటికి 14 మిలియన్ క్యారట్లకు పడిపోతుందని అంచనా. మరోవైపు డిమాండ్ మాత్రం 292 మిలియన్ క్యారట్లకు పెరుగుతుందని అంచనా. → మన దగ్గర సూరత్, ముంబై ప్రధాన ఎల్జీడీ హబ్లుగా ఉంటున్నాయి. ఎల్జీడీ ఉత్పత్తిలో దాదాపు 98 శాతం వాటా వీటిదే ఉంటోంది. → డైమండ్ విలువను నిర్దేశించేవి 4 ఇలు. కలర్ (రంగు), క్లారిటీ (స్వచ్ఛత), కట్, క్యారట్ బరువు. ఈ అన్ని ప్రమాణాల్లోనూ సహజ వజ్రాలకు ఎల్జీడీలు గట్టి పోటీనిస్తున్నాయి. మలినాలు లేని, అత్యంత స్వచ్ఛమైన ‘టైప్ 2ఏ’ రకం డైమండ్ల తరహా వజ్రాలను కూడా తయారు చేస్తున్నారు. 2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్కు 7.5 క్యారట్ల ఎల్జీడీని బహూకరించారు. ఇది అత్యంత స్వచ్ఛమైనదిగా భావించే టైప్ 2ఏ కోవకు చెందిన వజ్రం. ఇలాంటివి ఎంత అరుదైనవంటే.. గనుల్లో నుంచి వెలికి తీసే వజ్రాల్లో 1–2 శాతం మాత్రమే ఈ కోవకి చెందినవై ఉంటాయి. → సహజమైన వజ్రాలు ఏర్పడటానికి 100 కోట్ల నుంచి 330 కోట్ల సంవత్సరాలు పట్టగా, ఎల్జీడీలను ల్యాబొరేటరీల్లో కేవలం 2 వారాల నుంచి 10 వారాల్లోనే తయారు చేయొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక్క రూపాయి జీతం.. ఐటీ కంపెనీ ఫౌండర్ ఆనందం
జీవితంలో ఎవరైనా విజయం సాధించారనడానికి సంపాదించిన సంపద, బిరుదులు, పేరు ప్రఖ్యాతులతో కొలిచే ప్రపంచంలో, నిజమైన సంపద బ్యాంకు బ్యాలెన్స్లకు మించి ఉంటుందని గుర్తు చేశారు ప్రముఖ ఐటీ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చి. తనకు వార్షిక జీతం ఒక్క రూపాయి వచ్చిందని, అది తన జీవితంలో వెలకట్టలేని సంపదంటూ ఆ చెక్కును సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) లో పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారాయన.ఈ చెక్కు ఆయన ఏదైనా కంపెనీకో.. స్టార్టప్ కు అందించిన సేవలకు వచ్చింది కాదు. ఇన్స్టిట్యూషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం ఒడిశా ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఇది ఆయన చివరి జీతం. ఈ పాత్రలో సుబ్రతో బాగ్చి ఎనిమిదేళ్లు పనిచేశారు. ఇందుకు ఆయన ఎటువంటి ఆర్థిక ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఏడాదికి కేవలం ఒక్క రూపాయిని సింబాలిక్ వేతనంగా స్వీకరించారు."ఈ ఒక్క జన్మలో నేనెప్పుడూ వదులుకోలేని అతి పెద్ద సంపద ఏమిటంటే?" అంటూ తన సేవా ప్రయాణాన్ని బాగ్చి వివరించారు. "నేను ప్రభుత్వంతో చేసినందుకు నాకు ఏడాదికి రూ .1 జీతం. ఎనిమిదేళ్లకు 8 చెక్కులు వచ్చాయి. ఇదే నా చివరి జీతం" అంటూ తన ‘ఎక్స్’ పోస్ట్లో భావోద్వేగంతో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ఎంతో మందిని హత్తుకుంటోంది. అభినందనలు కురిపిస్తోంది.సేవతోనే సంతృప్తిప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐటీ, కన్సల్టింగ్ సంస్థ మైండ్ ట్రీ సహ వ్యవస్థాపకుడిగా బాగ్చీకి మంచి పేరుంది. ఆయన నాయకత్వం, దార్శనికత, దాతృత్వానికి ప్రశంసలు దక్కాయి. ఎన్ని వేల కోట్లు సంపాదించినా బాగ్చీ సామాజిక సేవలోనే సంతృప్తిని వెతుక్కున్నారు. సుబ్రతో బాగ్చీ తన సతీమణి సుస్మితతో కలిసి క్యాన్సర్ సంరక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి సేవా కార్యక్రమాల కోసం వందల కోట్ల రూపాయలను దానమిచ్చారు. ఇప్పుడాయన ఈ చిన్న చెక్కునే తన జీవితానికి అపురూపంగా భావిస్తున్నారంటే ఇదే సేవలో తనకున్న సంతృప్తికి నిదర్శనం.What is the biggest wealth in this one life that I would never ever part with? Well, for every year of the work I did with the government, the deal was, they pay me Rs 1. For the 8 years out there, I got 8 cheques & this one here was my last salary drawn 🙏 pic.twitter.com/nVx2EZWv7K— Subroto Bagchi (@skilledinodisha) July 5, 2025 -
ఏఐ ఉండగా ఉద్యోగాలొస్తాయా?
సాంకేతిక పరిశ్రమలో పెరుగుతున్న కృత్రిమమేధ కోడింగ్ భవిష్యత్తుపై సందేహాలు కలిగిస్తోంది. ‘ఏఐ ఇప్పటికే తన కోడ్ను తానే వేగంగా, తక్కువ ఖర్చుతో, మరింత నాణ్యతతో రాయగలుగుతోంది. అలాంటప్పుడు పిల్లలకు ఈ నైపుణ్యం నేర్పించాల్సిన అవసరం ఏమిటి?’ అనే ఆందోళన ప్రస్తుతం తల్లిదండ్రుల్లో అధికమవుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో టెక్ విద్య కోసం పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు తల్లిదండ్రులు అపారమైన సమయం, డబ్బు, శ్రమ, భావోద్వేగాలను పెట్టుబడిగా పెడుతున్నారు. ఇది కేవలం విద్యగా మాత్రమే కాకుండా ఉన్నత జీవనానికి నాందిగా చూస్తున్నారు.తల్లిదండ్రుల్లో భయంఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఏఐ వాడకం పెరుగుతోంది. దాంతో తల్లిదండ్రుల్లో భయం పేరుకుపోతోంది. పిల్లల చదువు పూర్తయి ఉద్యోగాలు చేసే సమయానికి వారు ప్రస్తుతం నేర్చుకునే నైపుణ్యాలకు అప్పటి మార్కట్లో గిరాకీ ఉంటుందా?అనే సందేహం కలుగుతోంది. దానికి సమాధానం సంక్లిష్టమైనది. కానీ నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏటా భారతదేశంలో సుమారు 15 లక్షల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాపొంది బయటకు వస్తున్నారు. కానీ 2025 నాటికి, వారిలో కేవలం 10% మందికే అర్థవంతమైన ఉద్యోగాలు దక్కుతున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి.ఊహాత్మక సంక్షోభమే..అంతేకాకుండా, గ్రాడ్యుయేట్లలో సగానికి పైగా, పోస్ట్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 40% మంది నిరుద్యోగులుగా ఉన్నారు. దీనికి కోడింగ్ డిమాండ్ లేకపోవడం కారణమేమీ కాదు. మనం బోధిస్తున్న కోడింగ్ విధానం, ముఖ్యంగా ఆలోచనా సరళి మార్కెట్కు తగిన విధంగా లేదు. ఇది కంటెంట్ సంక్షోభం కాదు, ఊహాత్మక సంక్షోభమే. మళ్లీ ఒక్కసారి వెనక్కి వెళదాం. కాలిక్యులేటర్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు గణితం బోధించటం ఆపామా? గూగుల్ వచ్చినప్పుడు రాయడం నేర్పించటం మానామా? కాదుకదా. మనం బోధించే విధానాన్ని మార్చుకున్నాం. పఠనం కాకుండా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాం. కోడింగ్లో కూడా ఇదే మార్పు అవసరం అవుతుంది.కోడింగ్ కనుమరుగవ్వదు..భవిష్యత్తులో సరైన ప్రశ్నలు అడగడం, మానవులకు అనుగుణంగా ఉండేలా కోడింగ్ రూపొందించడం, బాధ్యతాయుతంగా మెలగడం, మెషీన్ వ్యవస్థలు ఎక్కడ తక్కువ పడుతున్నాయో అర్థం చేసుకోవడం ముఖ్యమవుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ, ఎన్విరాన్మెంట్, డిజైన్, గవర్నన్స్, సాహిత్యం ఇంకా అనేక రంగాల్లో విస్తరించనుంది. కోడింగ్ కనుమరుగవ్వదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోదు..అయితే భవిష్యత్తులో రాబోయే కోడింగ్ కేవలం సూచనలను అనుసరించే వారికే పరిమితం కాదు. ఇది విమర్శనాత్మకంగా ఆలోచించే, త్వరగా స్వీకరించే, సృజనాత్మకంగా రూపొందించే వ్యవస్థలకు విస్తరిస్తుంది. కాబట్టి ప్రస్తుతం అనుసరిస్తున్న లెర్నింగ్ విధానాలు, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం అనే లక్ష్యాలు ఇకపై సరిపోవు.విద్య ఉపాధి సాధనం కాదు..ఇంజినీరింగ్ డిగ్రీ వల్ల పిల్లలకు ఉద్యోగం రాకపోవచ్చనే తల్లిదండ్రుల ఆందోళన తప్పేమీ లేదు. కానీ అందుకు పరిష్కారం కోడింగ్ను వదిలేయడం కాదు. విజయాన్ని నిర్వచించే సంకుచిత ప్రమాణాల నుంచి బయటపడటమే అసలు పరిష్కారం. విద్యను కేవలం ఉపాధి సాధనంగా పరిగణించే దశ దాటిపోయింది. ఇప్పుడు అంచనాలను పెంచాల్సిన సమయం వచ్చింది. ‘ఎలా?’ అని మాత్రమే కాదు, ‘ఎందుకు?’ అని కూడా ప్రశ్నించే ధోరణి, ఆసక్తిని పిల్లల్లో పెంపొందించాలి. కోడింగ్ను సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, మనస్తత్వశాస్త్రం లేదా భాషాశాస్త్రంతో కలిపి అన్వేషించాలనుకుంటే వారికి ప్రోత్సాహం అందించాలి. భవిష్యత్తులో వీటికి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంటుంది.‘ఇంటెలిజెన్స్’ అంటే..‘ఇంటెలిజెన్స్’ అంటే ఫార్ములాలను జ్ఞాపకం చేసుకోవడం, పరీక్షలు పాస్ అవడం కాదు. ఇవి పిల్లల తెలివితేటలకు సూచికలు కావు. కేవలం క్రమశిక్షణకు సంకేతాలు మాత్రమే. అయితే, నిజమైన మేధస్సు అనేది వివరణాత్మకమైనది. ఇది మనం నేర్చుకునే అంశాలను లోతుగా ఆలోచించమని, మెషీన్లు చేయలేని పనులను పూర్తి చేయాలని తెలుపుతుంది. ఇప్పటికే ఏఐ తెలిసిన అంశాలను క్షణ్లాలో ముందుంచుతుంది. క్రియేటివిటీతో ఎవరికీ తెలియని కొత్త అంశాలను అన్వేషించేలా నైపుణ్యాలు మలుచుకోవాలి. క్రియేటివిటీతో తెలియని సమస్యలకు అసలైన పరిష్కారాలు కనుగొనాలి. ఇప్పటివరకు ఎవ్వరూ రూపొందించని దాన్ని డిజైన్ చేయాలి.ఇతర దేశాల్లో ఇలా..జర్మనీలోని ఆర్డబ్ల్యూటీహెచ్ ఆచెన్ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ను భాషాశాస్త్రం, మీడియా అధ్యయనాలతో మిళితం చేస్తోంది. ఫిన్లాండ్లోని హెల్సింకి విశ్వవిద్యాలయం విద్యార్థులకు డేటా సైన్స్ను తత్వశాస్త్రం(ఫిలాసఫీ)తో కలిపి అభ్యసించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. స్వీడన్, డెన్మార్క్లో ఏఐ ప్రోగ్రాముల్లో విభిన్న మార్పులు చేస్తున్నారు. ఇవి కేవలం ప్రయోగాత్మక ఆలోచనలు కావు. ఇవే భవిష్యత్తు విద్యా మోడళ్లకు మార్గదర్శకాలు.భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలి..భారతదేశానికి ఇదో గొప్ప అవకాశం. అవుట్సోర్స్ కోడింగ్ సర్వీసులు అందించేలా ఎదిగేందుకు మార్గం ఉంది. లేదా రాబోయే కాలానికి సిద్ధంగా ఉన్న మేధావులను పెంపొందించే ప్రయోగశాలగా మారవచ్చు. అందుకోసం పిల్లల్లో పటిష్ట నైపుణ్యాలను పెంపొందించాలి. ఏఐ యుగంలో లోతుగా ఆలోచించగలిగే, నిర్మాణాత్మకంగా క్రియేటివిటీ కలిగిన వారే విజయం సాధిస్తారు. పిల్లలు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.కరుణ్ తాడేపల్లి, సీఈఓ బైటెక్సెల్(హైదరాబాద్లోని స్టార్టప్ సంస్థ). -
ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. పెరుగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విస్తరణ నేపథ్యంలో సుమారు 50,000 మందిని భర్తీ చేసుకోనున్నాయి. ఇందులో 21,000 మంది ఆఫీసర్ స్థాయి వారు కాగా, మిగిలిన వారు క్లర్క్ తదితర ఉద్యోగాలకు సంబంధించి ఉండనున్నారు. ప్రభుత్వరంగంలో 12 బ్యాంకులు ఉండగా, ఒక్క ఎస్బీఐనే 20,000 మందికి అవకాశం కల్పించనుంది. ఇందులో భాగంగా ఎస్బీఐ ఇప్పటికే 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను నియమించుకుంది. అలాగే, 13,455 మంది జూనియర్ అసోసియేట్స్ భర్తీని సైతం చేపట్టింది. శాఖల స్థాయిలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు తాజా నియామకాలు చేపట్టినట్టు ఎస్బీఐ ప్రకటించడం గమనార్హం. 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని శాఖల స్థాయిలో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంది. ఎస్బీఐలో మొత్తం ఉద్యోగులు 2025 మార్చి చివరికి 2,36,226 మంది ఉన్నారు. ఇందులో 1,15,066 మంది ఆఫీసర్ ర్యాంకుల్లోని వారే. ఉద్యోగుల వలసలను 2 శాతంలోపునకు పరిమితం చేసేందుకు ఎస్బీఐ చర్యలు తీసుకుంటుండడం గమనార్హం. ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పీఎన్బీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో రూ.5,500 మందిని కొత్తగా నియమించుకోనుంది. ఈ ఏడాది మార్చి నాటికి పీఎన్బీ వ్యాప్తంగా 1,02,746 మంది ఉద్యోగులున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.4,000 మందిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియమించుకోనుంది. సబ్సిడరీల బలోపేతంపై దృష్టి.. సబ్సిడరీల కార్యకలాపాలను మరింత విస్తరించి, వాటిని స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో లిస్ట్ చేయడం ద్వారా రాబడులు పెంచుకోవడంపై దృష్టి సారించాలని ప్రభుత్వరంగ బ్యాంక్లను కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఆదేశించడం గమనార్హం. అవసరాలకు అనుగుణంగా సబ్సిడరీ సంస్థల్లో బ్యాంక్లు అదనపు పెట్టుబడులు పెడతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యకలాపాల విస్తరణతో సబ్సిడరీల్లోనూ నియామకాలు పెరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. -
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..
ప్రముఖ బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పక్కా బిజినెస్మ్యాన్గా మారిపోయారు. సినీ పరిశ్రమపై తనకు విరక్తి పెరిగిందని, అందుకే తన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టానని ఆయన చెబుతున్నారు. రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఈ నటుడు ఇప్పుడు తన ప్రధాన జీవనాధారాన్ని పూర్తిగా బిజినెస్ వైపు మళ్లించారు.తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 కంపెనీలకు ఒక్క ఏడాదిలోనే 1 బిలియన్ డాలర్లు (రూ.8,500 కోట్లు) సమీకరించినట్లు తెలిపారు. వీటిలో రెండు కంపెనీలు ఐపీవోకి కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని వివేక్ ఓ తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన నెట్వర్త్ రూ.1,200 కోట్లు ఉంటుందని అంచనా.భూమి మొదటి వ్యాపారంఇటీవల సీఎన్బీసీ టీవీ-18 ఇంటర్వ్యూలో మాట్లాడిన వివేక్ తన వ్యాపార సంగతులను పంచుకున్నారు. తన తండ్రి సురేష్ ఒబెరాయ్ వ్యాపారవేత్త కావడంతో తాను కూడా చిన్న వయసు నుంచే వ్యాపారం వైపు మొగ్గు చూపానని చెప్పారు. ‘ఇన్వెస్టర్ అయిన ఆయన (తండ్రి) ఎప్పుడూ భూములు కూడబెడుతూ కొనడం, అమ్మడం చేసేవారు. అలా డబ్బు సంపాదించేవారు. భూమి నాకు పరిచయమైన మొదటి వ్యాపారం. నాకు తొమ్మిది పదేళ్ల వయసున్నప్పుడు అకస్మాత్తుగా ఇన్వెంటరీతో వచ్చేవాడు. ఒక సంవత్సరం పెర్ ఫ్యూమ్స్, మరో ఏడాది ఎలక్ట్రానిక్స్... వాటిని నా బ్యాక్ ప్యాక్ లో నింపుకుని ఇంటింటికీ వెళ్లేవాన్ని. చివరిలో నా 'లెక్కలు' అడుగేవారు. లాభం మాత్రం నాకిచ్చి మిగిలింది తీసుకునేవారు' అని వివేక్ గుర్తు చేసుకున్నారు.సినిమాల్లో లోపించిందదే..కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమలో గడిపిన వికేక్ ఒబెరాయ్ ఇంకా తాను మొదలుపెట్టిన చోటే ఉన్నానని గ్రహించారు. "అది (సినీ పరిశ్రమలో ఉండటం) నాకు నచ్చలేదు. అది ఎదుగుదల కాదు. నేను అక్కడ ఉండటం, కొంతమంది వ్యక్తులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. కానీ ఇది ఎదుగుదలకు తోడ్పడాలి. ఎవరైనా ప్రతిభ ఉన్నవారిని దగ్గరకు తీసి వారి ఎదుగుదలకు సహకారం అందించాలి. అక్కడ లోపించిందదే" అని చెప్పుకొచ్చిన వివేక్ నిరాశగా తల కొట్టుకుంటూ అక్కడే ఉండటం కన్నా వ్యాపారం వైపు రావాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.పెట్టుబడుల విషయంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులకూ తాను వెనుకాడనని చెప్పిన వికేక్ ఒబెరాయ్.. ‘గత ఏడాదిలోనే నా కంపెనీలకు 1 బిలియన్ డాలర్లకు పైగా సమీకరించగలిగాం. ఇది గణనీయమైన మొత్తం. అయినా అదేం సమస్య కాదు. అయితే ఆ నిధులను ఎక్కడ పెట్టాలి.. ఎలా ఆ వృద్ధి చేయాలన్నది తెలియాలి. అందుకు మార్వాడీ మనస్తత్వం అలవర్చుకోవాలి" అంటూ సూచించారు. బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు అంతర్జాతీయ చిత్రాలను 'కాపీ' చేసినా వాటికి 'దేశీ మసాలా' తగిలిస్తున్నామంటూ చెబుతుంటారు. "మరి దీన్ని వ్యాపారంలో ఎందుకు చేయకూడదు?" అంటూ ప్రశ్నిస్తున్నారు. -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక సూచనలు
ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్)రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఆర్ఐ) ప్లాట్ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్లో వర్గీకరిస్తుందని పేర్కొంది.ఆర్బీఐ ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని వివరించింది.డాట్లో భాగమైన డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (డీఐయూ) ఈ ఏడాది మే నెలలో ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఐని ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫోన్పే, పేటీఎ మొదలైన దిగ్గజ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, నేషనల్ సైబర్క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్, డాట్కు చెందిన చక్షు ప్లాట్ఫాంలతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే డేటా ఆధారంగా ఎఫ్ఆర్ఐ పని చేస్తుంది. బ్యాంకుల మెరుగైన పనితీరుతో పరపతి మెరుగుగడిచిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్లు మెరుగైన పనితీరు నమోదు చేయడం వాటి పరపతి ప్రొఫైల్కు, భవిష్యత్ వృద్ధికి అనుకూలమని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. నాలుగేళ్లలో తక్కువ రుణ వృద్ధి నమోదు అయినప్పటికీ.. మెరుగైన ఆస్తుల నాణ్యత, పటిష్టమైన నగదు నిల్వలు, స్థిరమైన లాభాలను చూపించినట్టు పేర్కొంది.‘‘ఇక ముందూ స్థిరమైన పనితీరు కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, మిగులు నిల్వలతో నష్టాలను సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం ఉండడం, గత సైకిల్తో పోల్చితే ఆర్థిక షాక్లను తట్టుకుని నిలబడే సామర్థ్యం.. ఇవన్నీ రేటెడ్ బ్యాంకుల స్టాండలోన్ రుణ పరపతికి సానుకూలం’’అని ఫిచ్ రేటింగ్స్ వివరించింది.2025–26లో రుణ పరపతి పరంగా బ్యాంక్లు స్థిరమైన పనితీరు చూపిస్తాయని పేర్కొంది. 2024–25లో ప్రభుత్వ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల లాభాన్ని నమోదు చేయడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.1.41 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం ఎక్కువ. -
పాకిస్థాన్లో మైక్రోసాఫ్ట్ కార్యాలయం మూసివేత
ప్రపంచ టాప్ టెక్ కంపెనీలో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్ కార్యాలయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లో తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశంలో 25 సంవత్సరాలుగా సర్వీసులు అందిస్తున్న కంపెనీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా తన సర్వీసులను ముగించినట్లయింది. కంపెనీ గ్లోబల్ వర్క్ఫోర్స్ తగ్గింపు వ్యూహంలో భాగంగా పాకిస్థాన్లో ఈమేరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఇప్పటికే స్థానికంగా ఉన్న క్లయింట్లకు క్షేత్రస్థాయిలో సర్వీసులు అందించేందుకు కంపెనీ ప్రాంతీయ కేంద్రాలు, అధీకృత రీసెల్లర్ల ద్వారా రిమోట్ సేవలు అందిస్తామని పేర్కొంది. ప్రస్తుత కస్టమర్ ఒప్పందాలు, సేవలు ప్రభావితం కాకుండా కొనసాగుతాయని తెలిపింది. ఆయా కంపెనీలకు నిత్యం మద్దతుగా నిలుస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. పాకిస్థాన్లో కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల స్థానికంగా కేవలం కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే ప్రభావితం చెందినప్పటికీ అక్కడి వ్యాపార, సాంకేతిక వర్గాల్లో ఆందోళనలు మొదలయ్యాయి.భారతదేశంలో మాదిరిగా కాకుండా మైక్రోసాఫ్ట్ పాకిస్థాన్లో అభివృద్ధి లేదా ఇంజినీరింగ్ సర్వీసులు స్థాపించేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. కేవలం అక్కడి యూనిట్ ద్వారా తన ప్రోడక్ట్లను ఇతర కంపెనీలతో అనుసంధానం చేసేందుకు, అమ్మకాల కార్యకలాపాలకే పరిమితం చేసింది. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాల కోతకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇటీవల మొత్తంగా కంపెనీలో పని చేస్తున్న 9,000 పైగా ఉద్యోగాలను తగ్గించింది. ఈ విస్తృత సంస్థాగత పునర్నిర్మాణమే సంస్థ పాకిస్థాన్ నుంచి నిష్క్రమించేందుకు కారణమని ఆ దేశ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాస్తవానికి మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పాక్ లైసెన్సింగ్, కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వంటి ప్రధాన విధులను కొన్ని సంవత్సరాలుగా ఐర్లాండ్లోని తన యూరోపియన్ హబ్కు మారుస్తోంది.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురుఅంతర్జాతీయంగా చాలాదేశాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదానికి సంబంధించి వ్యతిరేకత ఉంది. స్థానికంగా పేదరికం పెరుగుతోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఏటా దారుణంగా క్షీణిస్తోంది. దాంతో చాలా కంపెనీలు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీ ఇలా మొత్తంగా తన కార్యాలయాన్ని షట్డౌన్ చేయడం అక్కడి టెక్ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. -
ఆట బొమ్మల ఉత్పత్తికి ప్రోత్సాహం.. త్వరలో కొత్త పథకం
పరిశ్రమతో సంప్రదింపుల అనంతరం దేశంలో ఆట బొమ్మల ఉత్పత్తిని (టాయ్స్) పెంచేందుకు త్వరలోనే ఓ పథకాన్ని ఖరారు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టాయ్స్ తయారీకి, ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు.ప్రభుత్వం తీసుకొచ్చే పథకం ఎగుమతులకు ప్రోత్సాహకాల రూపంలో ఉండదని.. దేశీయంగా తయారీని పెంచేందుకు, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందన్నారు. డిజైన్ సామర్థ్యాలు, నాణ్యతతో కూడిన తయారీ, బ్రాండ్ నిర్మాణానికి మద్దతు రూపంలో ఈ పథకం ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు ఆట బొమ్మల కోసం దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడగా.. ప్రస్తుతం దేశీయంగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు, 153 దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. విధానపరమైన మద్దతు చర్యలు, నాణ్యతా ప్రమాణాల అమలు, స్థానిక తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమైనట్టు వివరించారు.140 కోట్ల జనాభా కలిగిన దేశం కావడంతో తయారీ కార్యకలాపాల విస్తరణతో సహజ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆట బొమ్మల ఎగుమతులను పెంచుకునేందుకు చక్కని బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, బలమైన డిజైన్పై దృష్టి సారించాలని పరిశ్రమకు గోయల్ సూచించారు. వినూత్నమైన ఆట»ొమ్మల నమనాలను అభివృద్ధి చేసిన స్టార్టప్లకు పీఎం ముద్రాయోజన కింద పెద్ద ఎత్తున నిధుల మద్దతు అందించినట్టు చెప్పారు. -
పూర్తిగా మహిళా ఉద్యోగులతో ఇన్సూరెన్స్ బ్రాంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవిత బీమా సంస్థ ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ (ఏబీఎస్ఎల్ఐ) తాజాగా హైదరాబాద్లో పూర్తిగా మహిళా సిబ్బందితో బ్రాంచీని ప్రారంభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ముంబైలో ఈ తరహా ఆల్–ఉమెన్ బ్రాంచీని ప్రారంభించగా, ఇది రెండోదని వివరించింది.దీనితో హైదరాబాద్లో తమ శాఖల సంఖ్య 7కు, దేశవ్యాప్తంగా 433కి చేరిందని కంపెనీ ఎండీ కమలేష్ రావు తెలిపారు. మహిళా అడ్వైజర్లకు సహాయకరంగా ఉండేలా ఈ శాఖలో కిడ్స్ రూమ్లాంటి సదుపాయాలు కూడా ఉంటాయని వివరించారు.ఆదిత్య బిర్లా గ్రూప్ (ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ ద్వారా), కెనడా ఆర్థిక సేవల దిగ్గజం సన్ లైఫ్ ఫైనాన్షియల్ మధ్య జాయింట్ వెంచర్గా 2000 ఆగస్టులో ఆదిత్య బిర్లా లైఫ్ ఇన్సూరెన్స్ ఏర్పాటైంది. 2001 జనవరిలో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థ దేశంలోని టాప్ ప్రైవేట్ జీవిత బీమా కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. -
‘టాటా పవర్’ ఇక చూపిస్తాం..!
టాటా పవర్ అచ్చమైన సోలార్, పవన విద్యుత్ సంస్థ నుంచి పూర్తిస్థాయి హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన రంగ శక్తిగా అవతరిస్తుందని సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అణు విద్యుత్ అభివృద్ధిని సైతం భవిష్యత్తులో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. టాటా పవర్ 106వ వార్షిక వాటాదారుల సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. విద్యుదుత్పాదన, అమలు దశలో కలిపి మొత్తం 25 గిగావాట్ల సామర్థ్యాన్ని కంపెనీ 2024–25లో అధిగమించినట్టు చెప్పారు. ఇందులో 65 శాతం శుద్ధ, పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచే ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ దశను మలుపు తిప్పిన దివంగత గౌరవ చైర్మన్ రతన్ టాటా సేవలను సైతం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.గత ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్ పునరుత్పాదక, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి భూటాన్ డ్రక్తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలోనే తమిళనాడులోని తిరునల్వేలిలో ఏర్పాటు చేసిన 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్ను సంస్థ ప్రారంభించింది. రూ.4,800 కోట్ల విలువ చేసే విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది. -
మెట్రోల్లోనే క్విక్ కామర్స్ జోరు..
క్విక్కామర్స్ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. మెట్రోలకు వెలుపల పట్టణాల్లో లాభదాయకమైన విస్తరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని మార్కెట్ పరిశోధనా సంస్థ రెడ్సీర్ తెలిపింది. క్విక్కామర్స్ సంస్థల స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ)లో నాన్ మెట్రోలు 20 శాతం వాటానే భర్తీ చేస్తున్నట్టు పేర్కొంది. తక్కువ డిమాండ్, డిజిటల్ పరిణతి తక్కువగా ఉండడం, స్థానిక షాపింగ్ అలవాట్లను రెడ్సీర్ నివేదిక ప్రస్తావించింది.2025 మొదటి ఐదు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు క్విక్ కామర్స్ సంస్థల ఆదాయం 150 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. డార్క్ స్టోర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం, వివిధ విభాగాల్లోకి దూకుడుగా ఎంట్రీ ఇవ్వడం, తీవ్రమైన పోటీ ఈ వృద్ధికి నేపథ్యాలుగా వివరించింది. టాప్–10–15 పట్టణాల వెలుపల ఒక్కో డార్క్స్టోర్కు వచ్చే రోజువారీ ఆర్డర్ల తగ్గుదల వేగంగా ఉందని వెల్లడించింది. 1,000 దిగువకు ఆర్డర్లు తగ్గాయని.. టాప్15కు తదుపరి టాప్ 20 పట్టణాల్లో డార్క్ స్టోర్ వారీ ఆర్డర్లు 700 దిగువకు తగ్గినట్టు తెలిపింది.ఇది డిమాండ్ బలహీనతను తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఆన్లైన్ సంస్థల పట్ల నమ్మకం తక్కువగా ఉండడం, డిజిటల్ టెక్నాలజీల పట్ల అవగాహన తక్కువగా ఉండడం ఆర్డర్లు పరిమితంగా ఉండడానికి కారణంగా పేర్కొంది. జనాభా కూడా తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. క్విక్కామర్స్ సంస్థలు ఆఫర్ చేసే వస్తు శ్రేణి స్థానికుల అభిరుచులకు అనుగుణంగా ఉండకపోవడాన్ని పేర్కొంది.దీనికితోడు ఈ ప్రాంతాల్లో స్థానిక రిటైల్ స్టోర్లకు, ప్రజలకు మధ్య ఉండే బలమైన సంబంధాలను ప్రస్తావించింది. దీంతో మెట్రోలతో పోల్చితే నాన్ మెట్రోల్లో ఒక్కో డార్క్స్టోర్ లాభం–నష్టాల్లేని స్థితి రావడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. -
ఏఐ డ్రోన్లకు భారీగా ఆర్డర్లు
ఏఐ ఆధారిత డ్రోన్ సొల్యూషన్స్ కోసం గుజరాత్, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రభుత్వ విభాగాల నుంచి పలు కాంట్రాక్టులు లభించినట్లు డ్రోన్ టెక్నాలజీ సంస్థ గరుడా ఏరోస్పేస్ తెలిపింది. ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్తో ఒప్పందం ప్రకారం వార్షిక సర్వేల నిర్వహణ, గనుల మూసివేత ప్రణాళికల కోసం డిజిటల్ డేటాబేస్లను, సర్వే మ్యాప్లు మొదలైన వాటిని తయారు చేయాల్సి ఉంటుంది.అలాగే గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తమిళనాడుకు చెందిన జియాలజీ, మేనింగ్ డిపార్ట్మెంట్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ టెండర్లను కూడా గరుడ ఏరోస్పేస్ దక్కించుకుంది. అటు ఝార్ఖండ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ నుంచి కూడా కాంట్రాక్టు లభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అగ్నీశ్వర్ జయప్రకాష్ చెప్పారు.తమ డ్రోన్ యాజ్ ఏ సర్వీస్(డాస్) మోడల్ వినియోగం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని, తమ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునేందుకు ఈ కాంట్రాక్టులు తోడ్పడతాయని వివరించారు. -
‘ఆర్కామ్’తో సంబంధం లేదు: అంబానీ కంపెనీలు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా ఎస్బీఐ వర్గీకరించడమనేది తమ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావమూ చూపదని అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్లో (అడాగ్) భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ స్పష్టం చేశాయి. ఆర్కామ్తో తమకెలాంటి వ్యాపార, ఆర్థిక సంబంధాలు లేవని, తమ రెండు సంస్థలు వేర్వేరుగా లిస్టెడ్ కంపెనీలుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని స్టాక్ ఎక్స్ఛేంజీలకు విడివిడిగా తెలిపాయి.ఈ నేపథ్యంలో ఆర్కామ్పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ గవర్నెన్స్, మేనేజ్మెంట్, కార్యకలాపాలు, ఉద్యోగులు, షేర్హోల్డర్లపై ఎలాంటి ప్రభావమూ ఉండదని వివరించాయి. రుణాల మళ్లింపు ఆరోపణలతో ఆర్కామ్ ఖాతాను ఫ్రాడ్ అకౌంటుగా వర్గీకరించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఎస్బీఐ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది. -
‘ఫేస్జిమ్’లో రిలయన్స్కు వాటా
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్(ఆర్ఆర్వీఎల్) తాజాగా యూకే సంస్థ ఫేస్జిమ్లో మైనారిటీ వాటాను సొంతం చేసుకుంది. తద్వారా దేశీయంగా ఫేషియల్ ఫిట్నెస్, స్కిన్కేర్ బ్రాండును ప్రవేశపెట్టనుంది. తాజా పెట్టుబడులతో దేశీయంగా అధిక వృద్ధిలోనున్న సౌందర్యం, వెల్నెస్ విభాగంలో కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. అయితే వాటా కొనుగోలు విలువను వెల్లడించలేదు.ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురుఓమ్నిచానల్ బ్యూటీ రిటైల్ ప్లాట్ఫామ్ ‘టిరా’ ద్వారా ఫేస్జిమ్ను భారత్లో ప్రవేశపెట్టేందుకు తాజా భాగస్వామ్యం వీలు కల్పించనున్నట్లు పేర్కొంది. రానున్న ఐదేళ్లలో ఫేస్జిమ్ను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలియజేసింది. కీలక పట్టణాలలో స్టాండెలోన్ స్టుడియోలు, ఎంపిక చేసిన టిరా స్టోర్ల ద్వారా ఇందుకు అవకాశాలను సృష్టించనున్నట్లు వివరించింది. -
ఏకకాలంలో నాలుగైదు ఉద్యోగాలు.. తీరా దొరికాక..
ఏకకాలంలో నాలుగైదు అమెరికా స్టార్టప్ల్లో ఉద్యోగం చేస్తూ వార్తల్లో నిలిచిన అమెరికాకు చెందిన భారతీయ టెక్ ప్రొఫెషనల్ సోహమ్ పరేఖ్ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించిన ఆయన అందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ఆర్థిక ఒత్తిళ్ల వల్లే తాను ఒకేసారి రిమోట్గా నాలుగైదు కంపెనీల్లో పని చేయాల్సి వచ్చిందన్నారు. అందుకు అత్యాశ కారణం కాదని తెలిపారు.బహుళ ఉద్యోగాలు.. అంగీకరించిన పరేఖ్టీబీపీఎన్ షోలో పాల్గొన్న పరేఖ్ను తనపై వస్తున్న ఆరోపణలు నిజమేనా అని ప్రశ్నించగా ఆయన వాటిని అంగీకరించారు. ‘నేను ఒకేసారి పలు కంపెనీల్లో పనిచేశాను. కొందరివల్ల అదికాస్తా వైరల్గా మారింది. ఈ ప్రక్రియలో నా ఉద్యోగ స్థితిగతులను తప్పుగా చూపించారు. వ్యక్తిగత లాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారని పలువురు ఆరోపించారు. కానీ నేను లాభాపేక్షతో అలా చేయలేదు. ఆర్థిక ఒత్తిళ్లతోనే అలా బహుళ కంపెనీల్లో పని చేయాల్సి వచ్చింది’ అన్నారు.గర్వపడటం లేదు‘వారానికి 140 గంటలు పనిచేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ నా అవసరాన్ని బట్టి అలా చేయవలసి వచ్చింది’ అని వివరించారు. వృత్తిపరంగా మనుగడ, ఆర్థిక స్థిరత్వమే కీలకమని భావించి క్లిష్ట సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మీరు చట్టాలను ఉల్లంఘించారని విశ్వసిస్తున్నారా అని అడిగినప్పుడు, పరేఖ్ అందుకు పూర్తి బాధ్యత స్వీకరిస్తానని చెప్పారు. ‘నేను చేసిన పనికి గర్వపడటం లేదు. ఇది సమర్థించే విషయం కాదు’ అని అన్నారు. పలు ఉద్యోగాలు చేస్తూ జూనియర్ డెవలపర్లను ఉపయోగించుకున్నారనే ఆరోపణలను ఆయన ఖండించారు. అందులో నిజం లేదన్నారు.సోహమ్ పరేఖ్ ఎవరు?ముంబైకి చెందిన పరేఖ్ ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లాలని భావించాడు. కానీ ఆర్థిక సమస్యల వల్ల తాను వెళ్లడం ఆలస్యం అయింది. చివరకు 2020లో అమెరికాకు వెళ్లాడు. అతను 2020లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తరువాత 2022లో జార్జియా టెక్ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! మళ్లీ కరుగుతోన్న బంగారు కొండ..విశ్లేషణ సంస్థ మిక్స్ పానెల్ సహ వ్యవస్థాపకుడు సుహైల్ దోషి అమెరికా స్టార్టప్ కంపెనీలను సోహమ్ పరేఖ్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆయన వెలుగులోకి వచ్చాడు. పరేఖ్ ఒకేసారి నాలుగైదు స్టార్టప్ల్లో పనిచేస్తున్నారని చెప్పారు. విమర్శలు వస్తున్నప్పటికీ పరేఖ్ ఈ వ్యవహారంతో పాఠాలు నేర్చుకున్నానని, ఆ తప్పులు పునరావృతం చేసే ఆలోచన లేదని చెప్పాడు. -
ఐపీవోకు మీషో రెడీ
ఫ్యాషన్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల ఈకామర్స్ కంపెనీ మీషో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సాఫ్ట్బ్యాంక్కు పెట్టుబడులున్న కంపెనీ గోప్యతా విధానంలో ముందస్తు ఫైలింగ్ను చేపట్టినట్లు తెలుస్తోంది. గత నెల 25న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఐపీవోకు ప్రాస్పెక్టస్ దాఖలుపై నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. లిస్టింగ్ ద్వారా కనీసం రూ. 4,250 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి.స్టాక్బ్రోకర్గా వన్ మొబిక్విక్సెబీ నుంచి గ్రీన్సిగ్నల్స్టాక్ బ్రోకర్, క్లియరింగ్ సభ్యులుగా వ్యవహరించేందుకు పూర్తి అనుబంధ సంస్థ మొబిక్విక్ సెక్యూరిటీస్ బ్రోకింగ్ (ఎంఎస్బీపీఎల్)కు అనుమతి లభించినట్లు మాతృ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. 2025 జులై1న సెబీ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలియజేసింది. వెరసి ఎంఎస్బీపీఎల్ దేశీ స్టాక్ బ్రోకర్గా కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు, క్లియరింగ్, ఈక్విటీ లావాదేవీల సెటిల్మెంట్లు చేపట్టనున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదుతాజా లైసెన్స్ కారణంగా క్యాపిటల్ మార్కెట్లో సంపద పంపిణీ(వెల్త్ డి్రస్టిబ్యూషన్) విభాగంలో సేవలు మరింత విస్తరించేందుకు వీలుంటుందని తెలియజేసింది. తద్వారా సమీకృత ఫిన్టెక్ సంస్థగా అవతరించనున్నట్లు పేర్కొంది. మొబిక్విక్ గ్రూప్ అనుబంధ సంస్థ జాక్ ఈపేమెంట్ సర్వీసెస్(జాక్పే).. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా సేవలందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. -
ఎలక్ట్రానిక్ కంపెనీల హవా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సరీ్వసెస్ (ఈఎంఎస్) రంగం దుమ్మురేపుతోంది. వ్యవస్థాగత వృద్ధికి పలు అంశాలు తోడవడంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. చైనాయేతర తయారీ తదితర అంశాలతో ఏర్పడుతున్న డిమాండ్ ఈ రంగానికి బలాన్నిస్తోంది. దీంతో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లో హవా చూపుతున్న ఈఎంఎస్ దిగ్గజాలు మరింత స్పీడందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మేకిన్ ఇండియాతో తయారీకి దన్నుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, చైనాయేతర దేశాలలో తయారీ యూనిట్ల ఏర్పాటుపై గ్లోబల్ దిగ్గజాల దృష్టి దేశీయంగా ఈఎంఎస్ కంపెనీలకు జోష్నిస్తోంది. దీనికితోడు కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండ్రస్టియల్, ఎనర్జీ, డిఫెన్స్, మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుంచి పటిష్ట డిమాండ్ వీటికి జత కలుస్తోంది. వెరసి ఈఎంఎస్ రంగంలోని పలు లిస్టెడ్ కంపెనీలు కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటు దేశీ డిమాండుకుతోడు అటు ఎగుమతులు సైతం పుంజుకోవడం కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. నిజానికి ఈ రంగంలో మార్జిన్లు తక్కువకావడంతో అధిక అమ్మకాల పరిమాణమే కంపెనీలకు లబ్ధిని చేకూరుస్తుంది. అయినప్పటికీ కొద్ది నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తోంది. భారీ అంచనాలు దేశీయంగా ఈఎంఎస్ రంగం 2022–23 నుంచి 2027–28 కాలంలో వార్షికంగా 25 శాతం వృద్ధి సాధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 2027–28కల్లా రూ. 27.7 లక్షల కోట్లను తాకగలదని అంచనా వేశాయి. ఈ రంగం విలువ 2022లో రూ. 8.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం వేసిన అంచనాలివి. కాగా.. ప్రభుత్వం స్థానిక తయారీకి దన్నునిస్తూ ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది. తద్వారా గ్లోబల్ దిగ్గజాలను దేశీయంగా తయారీకి ఆహ్వానిస్తోంది. దేశీయంగా పటిష్టస్థాయిలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలు అందుబాటులో ఉండటానికితోడు.. నైపుణ్యంగల మానవవనరులు చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా ఈఎంఎస్ రంగానికి భారత్ భారీ మార్కెట్ కూడా. అధిక శాతం కంపెనీలు బీటూబీ కస్టమర్లపైనే దృష్టిపెడుతున్నాయి.కీలక రంగాల దన్ను అధిక మార్జిన్లకు వీలున్న ఏరోస్పేస్, ఇండ్రస్టియల్స్, ఆటోమోటివ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆర్డర్లు లభిస్తుండటంతో లిస్టెడ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడుతోంది. ఇందుకు దేశీ కంపెనీలు సంక్లిష్ట ప్రొడక్టుల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దేశీయంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విస్తృతి తక్కువగా ఉండటం, వినియోగంపై వెచి్చంచగల ఆదాయాలు పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. తయారీలో స్థానికతకు ప్రాధాన్యత, అధిక విలువగల ప్రొడక్టుల తయారీలో నైపుణ్యం వంటి అంశాలతో లిస్టెడ్ దిగ్గజాలు దేశీయంగా ఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో పోటీపడే తయారీ కేంద్రంగా భారత్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలపడుతున్న ఆర్డర్ల బుక్ లిస్టెడ్ దిగ్గజాలకు బూస్ట్నిస్తోంది. దిగ్గజాల దూకుడు దేశీ లిస్టెడ్ దిగ్గజాలలో డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అవలాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జీఎస్, సైయెంట్ డీఎల్ఎం, డేటా ప్యాటర్న్స్ ఇండియా తదితరాలున్నాయి. వీటిలో డిక్సన్, అంబర్ను మినహాయిస్తే మొత్తం ఆర్డర్ బుక్ విలువ గతేడాదికల్లా(2024–25) వార్షికంగా 23 శాతం పురోభివృద్ధిని సాధించింది. రూ. 16,300 కోట్లకు చేరింది. ఇక గతేడాది లిస్టెడ్ దిగ్గజాల మొత్తం ఆదాయం వార్షికంగా 84 శాతం జంప్చేసి రూ. 58,600 కోట్లను తాకింది. ఆదాయంలో డిక్సన్ 2 రెట్లు దూసుకెళ్లగా.. కేన్స్ 51 శాతం, అంబర్ 48 శాతం చొప్పున జంప్చేశాయి. ఇతర సంస్థల ఆదాయం సగటున 20 శాతానికిపైగా ఎగసింది. మొత్తం నిర్వహణ లాభం 73 శాతం పురోగమించి రూ. 3,500 కోట్లను తాకింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ ప్రారంభించింది.అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ కమలేష్ రావు తెలిపారు.గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్ 10వ స్థానంలో ఉంది. -
హెచ్ఎంఏ అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్ఎంఏ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కార్యవర్గ సమావేశంలో అల్వాల దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈయన ఈరైడ్ విద్యుత్ వాహనాల సంస్థ వ్యవస్థాపకుడు.శరత్ చంద్ర మారోజును ఉపాధ్యక్షుడిగా, వాసుదేవన్ను కార్యదర్శిగా కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త మేనేజ్మెంట్ కమిటీలో ఇంకా సిండిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శరత్ చంద్ర మారోజు, ఈక్విటాస్ బ్యాంక్ జాతీయ అధిపతి వాసుదేవన్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ వ్యవస్థపకులు, సీఈఓ చేతనా జైన్, స్టెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకులు వి.శ్రీనివాసరావు, సిటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకర వెంకట కృష్ణ ప్రసాద్ ఉన్నారు.ఈ సందర్భంగా హెచ్ఎంఏ నూతనాధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, “వివిధ పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై మేం ప్రధానంగా దృష్టిపెడతాం. అదే సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఆంత్రప్రెన్యూర్లుగా లేదా కార్పొరేట్ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) 1964 నుంచి నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ. సరికొత్త యాజమాన్య విధానాలపై యువ మేనేజర్లు, వృత్తినిపుణులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుంది. -
భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్కాన్పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది. -
‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.‘భారత్లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.కమిటీ ఏర్పాటు..హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.భాజపా రాజకీయ లబ్ధి కోసం..కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రంసిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి. -
‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రుణ ఖాతాను ‘ఫ్రాడ్’ అకౌంట్గా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించనుంది. అలాగే రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చే నివేదికలో సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది. జూన్ 23వ తేదీతో ఎస్బీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆర్కామ్ తెలిపింది. దీని ప్రకారం ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31,580 కోట్ల రుణం తీసుకున్నాయి.ఆర్కామ్కి పంపిన లేఖ ప్రకారం.. రుణంగా తీసుకున్న నిధులను సంక్లిష్టమైన విధంగా వివిధ గ్రూప్ సంస్థలు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ పేర్కొంది. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసుకి కంపెనీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్కామ్ ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాలని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు వివరించింది. ‘ఫ్రాడ్’గా మారిస్తే..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఏదైనా ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించినప్పటి నుంచి 21 రోజుల్లోగా ఆ విషయాన్ని ఆర్బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీఐ/ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మోసం చేసిన రుణగ్రహీతపై (ప్రమోటర్ డైరెక్టర్, ఇతరత్రా హోల్టైమ్ డైరెక్టర్లు సహా) కఠినచర్యలు ఉంటాయి. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన అయిదేళ్ల వరకు మరే ఇతర బ్యాంకులు, డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు తీసుకోవడానికి ఉండదు.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఆర్కామ్ స్పందన ఇదే..ఎస్బీఐ నిర్ణయంపై ఆర్కామ్ స్పందించింది. తమ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడమనేది ఆర్బీఐ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 2న బ్యాంకుకు ఆర్కామ్ లాయర్లు ఈ మేరకు లేఖ రాశారు. ఆరోపణలపై వ్యక్తిగతంగా వివరణనిచ్చేందుకు అనిల్ అంబానీకి కనీసం అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎస్బీఐ నిర్ణయం తీసుకోవడం షాక్కు గురి చేసిందని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆర్కామ్లోని ఇతర నాన్–ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసును విత్డ్రా చేసుకున్న ఎస్బీఐ, అంబానీ కూడా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే అయినప్పటికీ ఆయన్ను మాత్రం వేరుగా చేసి చూడటం సరికాదని లాయర్లు వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన దాదాపు ఏడాది వరకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ వివరణ సంతృప్తికరంగానే ఉందని భావించినట్లు తెలిపారు. -
యస్ బ్యాంక్లో వాటాపై సీసీఐకి దరఖాస్తు
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్లో 20 శాతం వాటా కొనుగోలుకి క్లియరెన్స్ను కోరుతూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) దరఖాస్తు చేసింది. యస్ బ్యాంక్లో 20 శాతం వాటా విక్రయించేందుకు గత నెలలో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)తోపాటు ఇతర 7 బ్యాంకింగ్ సంస్థలు నిర్ణయించాయి. రూ.13,483 కోట్ల విలువలో వాటా విక్రయానికి ప్రతిపాదించాయి.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’దీని ప్రకారం యస్ బ్యాంక్లో వాటా మూలధనంతోపాటు.. ఓటింగ్ హక్కులను సైతం ఎస్ఎంబీసీ సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఈ డీల్ రికార్డ్ సృష్టించనుంది. జపాన్లో రెండో పెద్ద బ్యాంకింగ్ గ్రూప్ అయిన సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్ఎంఎఫ్జీ)నకు సొంత అనుబంధ సంస్థగా ఎస్ఎంబీసీ వ్యవహరిస్తోంది. -
మైక్రోసాఫ్ట్లో మరిన్ని ఉద్యోగాలు కట్..
రెడ్మండ్ (అమెరికా): టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరిన్ని వేల మంది ఉద్యోగులను తీసివేసేందుకు కంపెనీ ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను పంపించే ప్రక్రియ ప్రారంభించింది. ఎంత మందిని తీసివేస్తున్నదీ కంపెనీ నిర్దిష్టంగా వెల్లడించనప్పటికీ, దాదాపు 9000 మందికి నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్వాసనల తర్వాత గతేడాదితో పోలిస్తే సిబ్బంది సంఖ్య సుమారు 4 శాతం తగ్గుతుందని అంచనా. -
బీమా పథకాల మిస్–సెల్లింగ్ వద్దు..
న్యూఢిల్లీ: కస్టమర్లకు ఒక పాలసీ గురించి చెప్పి మరో పాలసీని అంటగట్టే (మిస్–సెల్లింగ్) ధోరణులను నివారించడంపై బ్యాంకులు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎ నాగరాజు సూచించారు. ఇన్సూరెన్స్ అనేది చాలా సున్నితమైన ఆర్థిక సాధనమని, కస్టమర్లకు విక్రయించే ముందు, దాని గురించి క్షుణ్నంగా వివరించాలని పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటలీకి చెందిన జనరాలి గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగరాజు ఈ విషయాలు తెలిపారు. మిస్–సెల్లింగ్ వల్ల కస్టమర్లకు ప్రీమియంల భారం పెరిగిపోతుందని, ఫలితంగా పాలసీదారులు తమ పాలసీని మళ్లీ పురుద్ధరించుకోరని ఆయన పేర్కొన్నారు. ప్రీమియంలు అధికంగా ఉన్నా కూడా బీమా కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడరు కాబట్టి ప్రీమియంలు సహేతుకంగా ఉండేలా కంపెనీలు చూసుకోవాలని నాగరాజు సూచించారు. కస్టమర్ల క్లెయిమ్లు సకాలంలో, సముచితంగా ప్రాసెస్ అయ్యేలా బీమా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 24.91 శాతం, ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 25.18 శాతం వాటాల కొనుగోలు పూర్తి చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. -
తెలంగాణలో పీవీఆర్ ఐనాక్స్ విస్తరణ
న్యూఢిల్లీ: సినిమా ఎగ్జిబిటర్ పీవీఆర్ ఐనాక్స్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ వారంలో హైదరాబాద్లో కొత్తగా నాలుగు స్క్రీన్ల ప్రాపర్టీని ప్రారంభించనుంది. దీనితో రాష్ట్రంలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 110కి చేరుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 26 స్క్రీన్లను జోడించనున్నట్లు వివరించారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మార్కెట్ తమకు అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 200 స్క్రీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం రూ. 400 కోట్ల వరకు వెచి్చంచనున్నట్లు ఆయన వివరించారు. ప్రధానంగా దక్షిణాదిపై, చిన్న నగరాలు, పట్టణాలపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 100 వరకు స్క్రీన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా, ఇప్పటికే 20 ప్రారంభించామన్నారు. 100 స్క్రీన్ల లక్ష్యంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, హుబ్లి సహా దక్షిణాదిలోని వివిధ నగరాల్లో 40 స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని సంజీవ్ కుమార్ వివరించారు. అలాగే సిలిగురి, జబల్పూర్, లేహ్, గ్యాంగ్టక్ వంటి చిన్న పట్టణాల్లో కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. కొత్తగా 200 స్క్రీన్ల రాకతో రెండేళ్లలో మొత్తం స్క్రీన్ల సంఖ్య దాదాపు 2,000కు చేరుతుందని సంజీవ్ కుమార్ తెలిపారు. -
వొడాఫోన్ను పీఎస్యూగా మార్చే ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ టెలికం రంగంలో కనీసం 4 కంపెనీలు సేవలందించేలా చూడాల్సి ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఒక ఆంగ్ల చానల్కు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన దేశీ టెలికం రంగంలోని పలు అంశాలపై మాట్లాడారు. రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐ)లో ప్రభుత్వం మరింత ఈక్విటీ వాటాను తీసుకోదని తేల్చి చెప్పారు. వీఐను ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)గా మార్చబోమని స్పష్టతనిచ్చారు. టెలికం కంపెనీలలో ప్రభుత్వ వాటా 49 శాతానికి మించడానికి అనుమతించబోమని తెలియజేశారు. ఇటీవల వీఐ ఈక్విటీ మారి్పడి అవకాశాలను అన్వేíÙస్తున్న నేపథ్యంలో సిందియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. ప్రతీ టెలికం కంపెనీకి బకాయిలను ఈక్విటీ మార్పు చేయాలని కోరే హక్కు ఉన్నట్లు వెల్లడించారు. అయితే అన్ని కంపెనీలకూ ఒకే నిబంధనలు వర్తించవని, ఆయా కంపెనీల పరిస్థితులకు అనుగుణంగా టెలికం శాఖ(డాట్)తోపాటు.. ఆర్థిక శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని వివరించారు. భారతీ టెలికం ఈ హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై డాట్ పరిశీలన, విశ్లేషణ పూర్తయితే ఒక నిర్ణయాన్ని తీసుకోగలమని తెలియజేశారు. పోటీ ఉండాలి టెలికంలోనే కాకుండా ఏ రంగంలో అయినా రెండే కంపెనీలు ఆధిపత్యం వహించడం మంచి పరిణా మం కాదని సిందియా పేర్కొన్నారు. దేశీయంగా మొబైల్ టెలికం విభాగంలో పోటీ పరిస్థితులు కొనసాగాలని తెలియజేశారు. పోటీ నివారణ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మొబైల్ టెలికం రంగంలో 4 కంపెనీలు సర్వీసులందిస్తున్న దేశాలు తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. టెలికం పెట్టుబడి వ్యయాలలో దేశీ కంపెనీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క భారత్లో మాత్రమే పెట్టుబడులపై మంచి రిటర్నులు లభిస్తున్నట్లు తెలియజేశారు. ఇది లాభదాయకతపై ఆయా కంపెనీలు, యాజమాన్యాల నిర్ణయాలను బట్టి ఉంటుందని వివరించారు. శాటిలైట్ సేవలు శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్ ధరల నిర్ణయంపై టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) సన్నాహాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా పలు సంస్థలు, వాటాదారులతో చర్చలు, సూచనలు తదితరాలకు తెరతీసినట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా తగిన సిఫారసులతోకూడిన నివేదికను దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు. ట్రాయ్ సలహాలు అమలు చేసేందుకు రెండు నెలలు పట్టవచ్చని పేర్కొన్నారు. -
అనిల్ అంబానీకి ఎస్బీఐ ‘ఫ్రాడ్’ ట్యాగ్.. ఒకప్పుడు బిలియనీర్.. ఇప్పుడు మోసగాడా?
సాక్షి,ఢిల్లీ: అన్న ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించగా.. తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో వ్యాపార రంగంలో తన అద్భుతమైన తెలివితేటలు, సామర్ధ్యంతో ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న అనిల్ అంబానీ ఇప్పుడు బ్యాంకుల్ని మోసం చేసిన మోసగాళ్ల జాబితాలో చేరినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీకి ఎస్బీఐ షాకిచ్చింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ ఎత్తున రుణాలిచ్చింది. ఆ రుణాల్ని రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్కాం) నిబంధనలకు విరుద్ధంగా నిధుల్ని మళ్లించినట్లు గుర్తించింది. ఫలితంగా బ్యాంకుల్ని మోసం చేసిన సంస్థల జాబితాలో రిలయన్స్ కమ్యూనికేషన్తో పాటు ఆ సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును సైతం చేర్చింది. ఎస్బీఐ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది. The State Bank of India (SBI) has decided to classify the loan account of beleaguered telecom firm Reliance Communications as "fraud" and to report the name of its erstwhile director — Anil Ambani — to the Reserve Bank of India (RBI). . . #anilambani #sbin #loan #kchol #VXON pic.twitter.com/DzW9lvLwrU— THE BHARAT INTEL 🪖 (@thebharatintel) July 2, 2025ఈ నేపథ్యంలో, ఎస్బీఐ జూన్ 23న కంపెనీకి లేఖ రాసింది. సంస్థ ఖాతాల్ని ‘ఫ్రాడ్’గా గుర్తిస్తున్నట్లు సమాచారం అందించింది. అనిల్ అంబానీ పేరును కూడా చేర్చినట్లు ఆర్బీఐకి నివేదించింది. అయితే, అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు ఈ నిర్ణయంపై స్పందించారు. తాము సమర్పించిన వివరణలకు ఎస్బీఐ సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విషయంలో అనిల్ అంబానీ సంస్థలకు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్ని సైతం ఎస్బీఐ సంప్రదించనుంది. ఇప్పటికే కెనరా బ్యాంక్ కూడా ఆర్కామ్ అకౌంట్లను ఫ్రాడ్గా గుర్తించింది.కాగా, బ్యాంకులు ఏదైనా సంస్థకు రుణాలిచ్చి.. వాటిని చెల్లించే క్రమంలో లేదంటే ఇతర అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వాటిని ఫ్రాడ్ జాబితాలో చేర్చుతాయి. ఆ జాబితాలో పేరుంటే సదరు సంస్థలకు 5 సంవత్సరాల పాటు కొత్త రుణాలు ఇవ్వకూడదు. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే నిబంధన. తాజాగా ఆర్కామ్ విషయంలో సైతం ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం ఇతరు బ్యాంకులు తీసుకునేలా సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. -
మస్క్ కంపెనీలో ఉద్యోగం కావాలా?
ఎలాన్ మస్క్కు చెందిన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. బ్యాకెండ్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, డేటా సైంటిస్టులు, లీగల్ ఎక్స్పర్ట్లు.. వంటి ఉద్యోగాల కోసం ఎక్స్ఏఐ తన ఎక్స్ ఖాతాలో ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పాలో ఆల్టో, శాన్ ఫ్రాన్సిస్కో, మెంఫిస్లోని కార్యాలయాల్లో విస్తృత శ్రేణి ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తోంది. కొన్ని పోస్టులు రిమోట్ దరఖాస్తుదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ ‘ఎక్స్ మనీ’ని అభివృద్ధి చేయడానికి చురుకుగా పనిచేస్తున్నట్లు ఎక్స్ఏఐ తెలిపింది.ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు గతంలో తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇప్పటికే ‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ గతంలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ర్యాపిడో.. ఓలా.. ఉబర్.. ఛార్జీలు పెంపు?వేతనాలు ఇలా..ఎక్స్ఏఐలో చేరే ఉద్యోగులకు ఏటా 2,20,000 డాలర్ల (సుమారు రూ.1.9 కోట్లు) నుంచి 4,40,000 డాలర్ల (సుమారు రూ.3.7 కోట్లు) వరకు పారితోషికం ఆఫర్ చేసింది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ వంటి రంగాల్లో బలమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం ఉన్న ఇంజినీర్లకు కంపెనీ మరింత చెల్లిస్తుందని ఎక్స్ఏఐ తెలిపింది. -
ర్యాపిడో.. ఓలా.. ఉబర్.. ఛార్జీలు పెంపు?
ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందించే సంస్థలు పీక్ అవర్స్లో తమ ఛార్జీలను గరిష్ఠంగా 2 రెట్లు వరకు పెంచుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జులై 1న జారీ చేసిన మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలు (ఎంవీఏజీ) 2025లో పేర్కొంది. ఇప్పటివరకు ఈ సర్జ్ ప్రైసింగ్ గరిష్ఠ పరిమితి 1.5 రెట్లు వరకు ఉండేది. దీన్ని తాజాగా 0.5 రెట్లు పెంచింది.రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కంపెనీల కార్యకలాపాల కోసం అధిక డిమాండ్ ఉన్న సమయంలో ప్లాట్ఫామ్లకు సౌలభ్యాన్ని ఇవ్వడమే సవరించిన ఛార్జీల లక్ష్యంగా కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎంవీఏజీ 2025 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ల ద్వారా ప్రయాణాలకు రవాణాయేతర (ప్రైవేట్) మోటారు సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని కట్టడి చేయడం, హైపర్ లోకల్ డెలివరీకి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు రవాణాయేతర మోటారు సైకిళ్లను వివిధ అగ్రిగేటర్ల ద్వారా అనుమతిస్తుంది. ఎంవీఏజీ 2025 మార్గదర్శకాల్లోని క్లాజ్ 23 ప్రకారం కంపెనీల నుంచి రోజువారీ, వారంవారీగా లేదా 15 రోజులకు ఒకసారి ఫీజు వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది.ఇదీ చదవండి: 11 మంది టాప్ ఎక్స్పర్ట్లతో మెటా కొత్త ల్యాబ్వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాపిడో, ఉబర్ వంటి బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. ఈ నిబంధనను ‘వికసిత్ భారత్’ వైపు సాగే ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. మౌలికసదుపాయాలు అంతగాలేని వెనుకబడిన ప్రాంతాల్లో సరసమైన రవాణాను విస్తరించడానికి ఈ మార్గదర్శకాలు సహాయపడుతాయని రాపిడో తెలిపింది. సవరించిన మార్గదర్శకాలపట్ల ఉబర్ హర్షం వ్యక్తం చేసింది.కొత్త మార్గదర్శకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు..సర్జ్ ప్రైసింగ్ పరిమితి పెంపు: అధిక డిమాండ్ ఉన్న కాలంలో బేస్ ఛార్జీలను 1.5 రెట్ల నుంచి 2 రెట్లు పెంచారు.పీక్ అవర్స్ కాని సమయంలో..: బేస్ ఛార్జీలో కనీసం 50% ఫేర్ ఉండాలి.డెడ్ మైలేజ్ ఛార్జీలు: పికప్ దూరం 3 కిలోమీటర్ల కంటే ఎక్కవగా ఉన్నప్పుడు మాత్రమే విధించాలి.రద్దు జరిమానాలు: డ్రైవర్ కారణం లేకుండా రైడ్ క్యాన్సిల్ చేస్తే రూ.100 లేదా 10% ఛార్జీ (ఏది తక్కువైతే అది) విధిస్తారు. స్వయంగా క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు కూడా ఇదే వర్తిస్తుంది.డ్రైవర్ సంక్షేమం: రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.భద్రతా చర్యలు: రైడ్ వాహనాలకు స్టేట్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించిన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు ఉండాలి. -
ఐటీలో వృద్ధి అంతంతే
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–3 శాతం వృద్ధికి (డాలర్ మారకంలో) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఐటీ సేవల రంగానికి స్థిరమైన అవుట్లుక్ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. పరిశ్రమలో 60 శాతం ఆదాయం వాటా కలిగిన 15 ప్రముఖ ఐటీ కంపెనీలను విశ్లేషించి ఇక్రా ఈ వివరాలు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం ఆదాయంలో 2.9 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. అమెరికా టారిఫ్ల విధింపుతో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు కీలక మార్కెట్లలో కంపెనీల ఐటీ బడ్జెట్లపై ప్రభావం చూపిస్తాయని ఇక్రా తెలిపింది.ఇటీవలి త్రైమాసికాల్లో కంపెనీల నిర్వహణ ఆదాయం కొంత కోలుకున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకోకపోవచ్చని పేర్కొంది. అమెరికా టారిఫ్లనే ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘భారత ఐటీ సేవల ఆదాయంలో 80–90 శాతం వాటాతో యూఎస్, యూరప్ కీలక మార్కెట్లుగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వృద్ధి 2024–25లో మోస్తరుగా మారింది. తుది త్రైమాసికంలో కొంత క్షీణత కనిపించింది. 2025–26 మొదటి త్రైమాసికం అంచనాలపై అప్రమత్తత నెలకొంది. అమెరికా టారిఫ్లపై ఏర్పడిన అనిశ్చితులు ఐటీ వ్యయాలను నియంత్రిస్తున్నాయి. ఇది పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా వివరించింది. నియామకాలూ తక్కువే.. డిమాండ్ మెరుగుపడేంత వరకు ఐటీ రంగంలో నియామకాలు తక్కువగానే ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. ఏఐ, జెనరేటివ్ ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీలను కంపెనీలు అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో.. నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం భవిష్యత్ నియామకాలను ప్రభావిం చేస్తుందనిని తెలిపింది. యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత ఐటీ సేవల రంగానికి వచ్చే ప్రయోజనాలను ప్రస్తావించింది. ఇందులో బ్రిటన్లో పనిచేసే తాత్కాలిక బారత ఐటీ ఉద్యోగులకు మూడేళ్ల పాటు సామాజిక భద్రతా ప్రయోజలను అందించే నిబంధన ఉండడాన్ని సానుకూలంగా పేర్కొంది. -
ఐపీవో బాటలో హీరో మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హీరో మోటార్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 237 కోట్లు ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ ప్లాంటు విస్తరణకు అవసరమైన మెషీనరీ, పరికరాల కొనుగోళ్లకు వెచ్చించనుంది.మరికొన్ని నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇంతక్రితం కంపెనీ 2024 ఆగస్ట్లోనూ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడింది. రూ. 900 కోట్ల సమీకరణకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే అక్టోబర్లో ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత ఇంజినీర్డ్ పవర్ట్రెయిన్ సొల్యూషన్లు రూపొందిస్తోంది. దేశ, విదేశీ ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజాలకు కంపెనీ ప్రొడక్టులు సమకూర్చుతోంది. క్లయింట్లలో భారత్సహా యూఎస్, యూరప్, దక్షిణాసియా ప్రాంత దిగ్గజాలున్నాయి.వీటిలో బీఎండబ్ల్యూ ఏజీ, డుకాటి మోటార్ హోల్డింగ్ ఎస్పీఏ, హమ్మింగ్బర్డ్ ఈవీ, ఎన్వియోలో ఇంటర్నేషనల్ ఇంక్, ఫార్ములా మోటార్స్పోర్ట్ తదితరాలు చేరాయి. భారత్, యూకే, థాయ్లాండ్లలో ఆరు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,064 కోట్లను అధిగమించింది. నికర లాభం రూ. 17 కోట్లుగా నమోదైంది. లిస్టింగ్కు స్కైవేస్ ఎయిర్ సర్విసెస్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు వైమానిక రవాణా ఫార్వార్డింగ్, లాజిస్టిక్స్ కంపెనీ స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 32.92 మిలియన్ ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 13.33 మిలియన్ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 217 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 130 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 1984లో ఏర్పాటైన కంపెనీ కస్టమ్ హౌస్ ఏజెంట్గా కార్యకలాపాలు ప్రారంభించి తదుపరి సర్విసులను విస్తరించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,289 కోట్ల ఆదాయం, రూ. 34.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
జేఎస్డబ్ల్యూ నిధుల సమీకరణ
ముంబై: డ్యూలక్స్ బ్రాండ్ పెయింట్ల దిగ్గజం అక్సో నోబెల్ ఇండియా కొనుగోలుకి జేఎస్డబ్ల్యూ పెయింట్స్ నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లతోపాటు.. పీఈ దిగ్గజాలు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వెల్లడించింది. మరికొన్ని నిధులను రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ ఎండీ పార్ధ్ జిందాల్ తెలియజేశారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ గ్రూప్ కంపెనీ అంతర్గత వనరులు, ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను పీఈ సంస్థలు అందించనున్నట్లు పేర్కొన్నారు.ఐదేళ్ల క్రితమే ప్రస్థానం ప్రారంభించిన జేఎస్డబ్ల్యూ పెయింట్స్ తాజాగా డచ్ దిగ్గజం అక్సో నోబెల్.. ఇండియా బిజినెస్ను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. డీల్ పూర్తయితే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ దేశీయంగా డెకొరేటివ్ పెయింట్ల విభాగంలో మూడో పెద్ద కంపెనీగా అవతరించనుంది. రానున్న మూడేళ్లలో టర్నోవర్ రూ. 7,500 కోట్లకు చేరనున్నట్లు అంచనా.కాగా.. భారత్ నుంచి పూర్తిగా వైదొలగడంలేదని అక్సో నోబెల్ సీఈవో గ్రెగ్ పౌక్స్ గిలామీ తెలియజేశారు. పౌడర్ కోటింగ్స్ బిజినెస్, ఆర్అండ్డీ కంపెనీ చేతిలోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు. అయితే జేఎస్డబ్ల్యూకి సాంకేతిక భాగస్వామిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లైసెన్సింగ్, రాయల్టీ ఒప్పందంకింద 4.5 శాతం అందుకోనున్నట్లు తెలియజేశారు. -
టెస్లా షేర్లు భారీగా కుదేలు
ఒకప్పుడు ఉమ్మడి ఆకాంక్షలతో పరస్పర సహకారంతో కలిసి ప్రయాణం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సమీకరణాలు పూర్తిగా మారాయి. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం రాజేసుకుంది. ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభనకు తెరతీసినట్లయింది. తాజాగా మస్క్ కంపెనీలకు అందిస్తున్న సబ్సిడీల్లో కోత విధిస్తే పరిస్థితి ఏమిటని ట్రంప్ ఎద్దేవ చేశారు. దానికి ప్రతిస్పందనగా అన్నీ రాయితీలు కట్ చేయడంటూ మస్క్ బదులిచ్చారు. ఇద్దరిమధ్య పెరుగుతున్న వ్యతిరేకతతో టెస్లా షేర్లు ఒక్క రోజులోనే 5 శాతంకు పైగా క్షీణించాయి.ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ ‘ఆర్థిక నిర్లక్ష్యానికి చిహ్నం’గా అభివర్ణించారు. ప్రస్తుతానికి ఈ బిల్లు యూఎస్ సెనేట్లో ఆమోదం పొందింది. 51–49 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించారు. కానీ ప్రతినిధుల సభలో ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లు అమెరికా ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మారుస్తుందని ట్రంప్ వాదిస్తుంటే.. కొంతమందికి భారీ పన్ను ఉపశమనం కలిగించేలా, మరికొందరికి ఖర్చులు పెరిగేలా, వలసలపై కఠిన వైఖరి ఉండేలా నిర్ణయాలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.‘నేను ఈవీ మాండేట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎలాన్ మస్క్కు చాలాకాలం ముందే తెలుసు. ఇది నా రాజకీయ ప్రచారంలోనూ కీలకంగా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ కారును సొంతం చేసుకోవాలని బలవంతం చేయకూడదు. సబ్సిడీలు లేకుండా మస్క్ బహుశా తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అని ట్రంప్ అన్నారు. దాంతోపాటు టెస్లా, స్పేస్ఎక్స్ వంటి మస్క్ వెంచర్లు ప్రభుత్వ నిధులపై ఎంతగా ఆధారపడుతున్నాయో డోజ్ దర్యాప్తు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.BREAKING: Trump implies DOGE may look at Elon Musk’s subsidies: pic.twitter.com/FE9lXj0Ebq— unusual_whales (@unusual_whales) July 1, 2025ఇదీ చదవండి: డియర్ స్టాఫ్.. ఆరోగ్యం జాగ్రత్త!మస్క్ స్పందన ఇలా..ట్రంప్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మస్క్ తన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించాలని కోరారు. ‘నేను నిజంగా చెబుతున్నా.. అన్ని రాయితీలను కట్ చేయండి’ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. -
డియర్ స్టాఫ్.. ఆరోగ్యం జాగ్రత్త!
ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ‘ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఈమెయిళ్లు పంపుతోంది. పని గంటలకు మించి వర్క్ చేయకూడదని చెబుతూ వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై దృష్టి సారించాలని పేర్కొంటోంది. రిమోట్గా పని చేస్తోన్న కంపెనీ ఉద్యోగులు తప్పకుండా రెగ్యులర్ షెడ్యూల్స్మేరకే వర్క్ చేయాలని కోరుతోంది. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపుతోంది. కంపెనీకి చెందిన టూల్స్లో తమ ఉద్యోగులు గడిపే సమయాన్ని సైతం ట్రాక్ చేస్తూ రిమైండర్ పంపుతుంది.ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ హెచ్ఆర్ బృందం వారానికి ఐదు రోజులు, రోజుకు సగటున 9.15 పని గంటలు మించిన ఉద్యోగులకు హెల్త్ రిమైండర్ ఈమెయిల్స్ పంపుతోంది. ఈ ఈమెయిల్స్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడాన్ని హైలైట్ చేస్తున్నాయి. రిమోట్గా పనిచేసేటప్పుడు నిర్ణీత పని గంటలను అధిగమించకుండా చూసుకోవాలని తెలిపింది. ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించాలని ఈమెయిల్స్లో స్పష్టమైన రిమైండర్ ఉన్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు.వృత్తిపరంగా చాలా అవసరం..వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వృత్తిపరమైన ప్రభావానికి కూడా ఇది చాలా అవసరమని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని, పనిఒత్తిడి ఉంటే వెంటనే తెలియజేయాలని, ఉద్యోగులు తమను తాము రిఫ్రెష్ కావడానికి వీలు కల్పించుకోవాలని తెలిపింది.ఇదీ చదవండి: ‘సూపర్ యాప్’లో అన్ని రైల్వే సేవలుగతంలో వారానికి 70 గంటలపాటు పని చేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కంపెనీలో ఇలా వర్క్-లైఫ్ బ్యాలెన్స్కు సంబంధించిన ఈమెయిళ్లు పంపడం ఉద్యోగుల్లో ఊరటనిస్తుంది. హైబ్రిడ్ వర్క్ మోడల్తోపాటు ఉద్యోగుల ఆరోగ్యంపట్ల కంపెనీ తీరును ఇవి హైలైట్ చేస్తున్నాయి. -
‘సూపర్ యాప్’లో అన్ని రైల్వే సేవలు
భారతీయ రైల్వే ‘రైల్ వన్(Railone)’ పేరుతో సూపర్యాప్ను ప్రారంభించినట్లు తెలిపింది. గత ఏడాదే వెల్లడించినట్లుగానే ఐఆర్సీటీసీ వినియోగదారులకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్.. వంటి ఎన్నో సర్వీసులను పొందవచ్చని తెలిపింది. ఈ యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి.. అందులో ఏయే సర్వీసులున్నాయో కింద తెలుసుకుందాం.ఈ యాప్లో అందుబాటులోకి వచ్చిన సేవలన్నీ ప్రస్తుతం ఆన్లైన్లో, విభిన్న యాప్ల ద్వారా వేర్వేరుగా ఉన్నాయి. తాజాగా వాటన్నింటినీ ఒకే యాప్ పరిధిలోకి తీసుకొచ్చేలా కొత్త యాప్ను ప్రారంభించారు. దీన్ని ఐఆర్సీటీసీ ‘సూపర్ యాప్’గా పరిగణిస్తుంది. ఇప్పటికే ఈ యాప్ను కొన్ని రోజులుగా వివిధ దశల్లో రైల్వేశాఖ పరీక్షించింది. ఈ యాప్ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది.ఇన్స్టాల్ చేసుకోండిలా..గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ సూపర్ యాప్ ‘Railone’ను డౌన్లోడ్ చేయాలి.యాప్ వినియోగదారుల లొకేషన్ను డిఫాల్డ్గా రీడ్ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి.యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అనే ఆప్షన్లు వస్తాయి.కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేస్తే రైల్ కనెక్ట్, యూటీఎస్ అని రెండు ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్ కనెక్ట్ యాప్లో లాగిన్ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్ కావొచ్చు. లేదంటే కొత్తంగా వివరాలు ఎంటర్ చేసి సైనప్ చేయాల్సి ఉంటుంది.సైనప్ కోసం మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయాల్సి.మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్, యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.ఓటీపీ, ఎంపిన్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్ వెరిఫికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ లేదా డివైజ్ లాగిన్ వివరాలు ఇవ్వాలి.ఇదీ చదవండి: ‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’రైల్వన్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. -
‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీల పనితీరును మార్చబోతోందని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఏఐ వాడకం పెరుగుతుండడంతో నిర్ణీత విభాగాల్లో తక్కువ మంది అవసరం అవుతారని చెప్పారు. సీఎన్బీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో పోలిస్తే ఏఐ సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహిస్తుందని అంగీకరించారు.ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉపాధి అవకాశాలకు తెరతీస్తుందని జాస్సీ చెప్పారు. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేషన్ అవుతున్నప్పటికీ కృత్రిమ మేధ అభివృద్ధి, రోబోటిక్స్, మానవ నైపుణ్యాలు, ఆవిష్కరణలు అవసరమయ్యే ఇతర రంగాల్లో మరిన్ని మానవ వనరులు కావాలన్నారు.ఇదీ చదవండి: వస్తు సేవల పన్ను విజయాల పరంపరఇతర కంపెనీల తీరిది..సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏఐ తమ కంపెనీలో 30 నుంచి 50 శాతం పనులు చేస్తోందని వెల్లడించారు. షాపిఫై, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు ఏఐని తమ రోజువారీ పనిలో భాగం చేసుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్లో పెద్ద ఎత్తున కృత్రిమ మేధను వినియోగిస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరించింది. -
అపోలో ఫార్మసీ వ్యాపారంలో విభజన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమ్నీచానల్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను విడదీసి, లిస్ట్ చేసే ప్రతిపాదనకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (ఏహెచ్ఈఎల్) బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన స్కీము ప్రకారం లిస్టింగ్కు 18–21 నెలల వ్యవధి పట్టనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఆమ్నీచానల్ ఫార్మా, డిజిటల్ హెల్త్ వ్యాపారాన్ని కొత్త సంస్థగా విడగొడతారు. తర్వాత హెల్త్కేర్ విభాగం అపోలో హెల్త్కో (ఏహెచ్ఎల్), హోల్సేల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కీమెడ్ను కొత్త సంస్థలో విలీనం చేస్తారు. ఈ ప్రక్రియతో దేశీయంగా దిగ్గజ ఆమ్నీచానల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ హెల్త్ ప్లాట్ఫాం ఏర్పడుతుందని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 25,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని పేర్కొంది. స్కీము ప్రకారం కొత్త సంస్థ, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్కు దరఖాస్తు చేసుకుంటుంది. ఏహెచ్ఈల్ షేర్హోల్డర్ల వద్ద ఉన్న ప్రతి 100 షేర్లకు గాను కొత్త కంపెనీకి చెందిన 195.2 షేర్లు లభిస్తాయి. అత్యంత నాణ్యమైన హెల్త్కేర్ సేవలను కోట్ల మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ మోడల్ ఉపయోగపడుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. -
అత్యంత కుబేరులున్న నగరాల జాబితా విడుదల
ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నగరంలో 759 బిలియన్ డాలర్ల సంపదతో 123 మంది బిలియనీర్లు టాప్లో ఉన్నారు. 2021లో బీజింగ్ ఆధిక్యం సాధించడం మినహా గత 12 ఏళ్లుగా న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంటోంది. ఈ శత కోటీశ్వరుల్లో ఎక్కువ మంది ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాల్లో సేవలందిస్తున్నారు.నివేదికలోని వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 3,028 మంది బిలియనీర్లలో నాలుగో వంతు మంది ఆరు దేశాల్లోని కేవలం 10 నగరాల్లోనే నివసిస్తున్నారు. మెరుగైన బిజినెస్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కారణంగా ఈ నగరాలు సంపదను ఆకర్షిస్తూనే ఉన్నాయి.భారత్లో ముంబయి..మొత్తం మీద అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న టాప్ దేశాల్లో భారత్ లేనప్పటికీ, ముంబయి ఈ కేటగిరీలో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 349 బిలియన్ డాలర్ల సంపద కలిగిన 67 మంది బిలియనీర్లతో ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన మెట్రో నగరాల కంటే అత్యంత సంపన్నులు కలిగిన భారతీయ నగరంగా నిలిచింది. అయితే ఈ ఏడాది ముంబయి స్థానం నాలుగు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. ఇద్దరు బిలియనీర్లు ఇందులో నుంచి నిష్క్రమించడమే ఇందుకు కారణం.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ముంబయి, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. 2025లో ముంబైలో కొత్తగా ఆరుగురు బిలియనీర్లు చేరారు. వీరిలో నలుగురు దోషి కుటుంబానికి చెందినవారున్నారు. వీరేన్, కిరీట్, పంకజ్, హితేష్ దోషి వారి కంపెనీ ‘వారీ ఇండస్ట్రీస్’ గత ఏడాది అక్టోబర్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. దాంతో సంపద అమాంతం పెరిగిపోయింది.ఇదీ చదవండి: భారత్-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా? -
అమెజాన్లో అసలేం జరుగుతుందో చూస్తారా?
ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఏ ఉత్పత్తయినా, విక్రేత దగ్గర్నుంచి మన ఇంటి వరకు చేరడం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్లోని తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్సీ) సందర్శించే అవకాశాన్ని కల్పించనుంది.ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (క్యూ4) నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులోని తమ ఎఫ్సీల్లో ఉచిత టూర్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. నిత్యం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను నిల్వ చేయడం, కస్టమర్ల ఆర్డర్ల ప్రాసెసింగ్, రవాణా మొదలైన ప్రక్రియలను ఈ సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఈ గైడెడ్ టూర్లు వారానికి మూడు సార్లు చొప్పున, ఒక్కోటి 45–60 నిమిషాల పాటు ఉంటాయి. ఒక్కో టూర్లో 20 మంది పాల్గొనవచ్చు.టోక్యోలో జరిగిన ’డెలివరింగ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో అమెజాన్ ఈ విషయాలు తెలిపింది. ఈ టూర్లపై ఆసక్తి గల వారు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు త్వరలో వీలు కల్పించనున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా–ఆ్రస్టేలియా ఆపరేషన్స్) అభినవ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అమెజాన్కు బెంగళూరులో 20 లక్షల ఘనపుటడుగుల స్టోరేజ్ స్పేస్తో అతి పెద్ద ఎఫ్సీ ఉంది.ఇక ఉత్తరాదిలోనే అతి పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్, ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది. ఇది 4,50,000 చ.అ.ల్లో, సుమారు ఎనిమిది ఫుట్బాల్ మైదానాలంత పెద్దగా ఉంటుంది. 2014 నుంచి అంతర్జాతీయంగా అమెరికా, కెనడా, తదితర దేశాల్లోని 35 లొకేషన్లలో ఇరవై లక్షల మంది పైగా సందర్శకులు అమెజాన్ ఎఫ్సీలను సందర్శించారు.