breaking news
Corporate
-
ఐపీవోకు మీషో రెడీ
ఫ్యాషన్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ ప్రొడక్టుల ఈకామర్స్ కంపెనీ మీషో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. సాఫ్ట్బ్యాంక్కు పెట్టుబడులున్న కంపెనీ గోప్యతా విధానంలో ముందస్తు ఫైలింగ్ను చేపట్టినట్లు తెలుస్తోంది. గత నెల 25న అసాధారణ సమావేశం(ఈజీఎం)లో ఐపీవోకు ప్రాస్పెక్టస్ దాఖలుపై నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. లిస్టింగ్ ద్వారా కనీసం రూ. 4,250 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి.స్టాక్బ్రోకర్గా వన్ మొబిక్విక్సెబీ నుంచి గ్రీన్సిగ్నల్స్టాక్ బ్రోకర్, క్లియరింగ్ సభ్యులుగా వ్యవహరించేందుకు పూర్తి అనుబంధ సంస్థ మొబిక్విక్ సెక్యూరిటీస్ బ్రోకింగ్ (ఎంఎస్బీపీఎల్)కు అనుమతి లభించినట్లు మాతృ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తాజాగా వెల్లడించింది. ఇందుకు నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. 2025 జులై1న సెబీ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయినట్లు తెలియజేసింది. వెరసి ఎంఎస్బీపీఎల్ దేశీ స్టాక్ బ్రోకర్గా కొనుగోళ్లు, అమ్మకాలు, లావాదేవీలు, క్లియరింగ్, ఈక్విటీ లావాదేవీల సెటిల్మెంట్లు చేపట్టనున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదుతాజా లైసెన్స్ కారణంగా క్యాపిటల్ మార్కెట్లో సంపద పంపిణీ(వెల్త్ డి్రస్టిబ్యూషన్) విభాగంలో సేవలు మరింత విస్తరించేందుకు వీలుంటుందని తెలియజేసింది. తద్వారా సమీకృత ఫిన్టెక్ సంస్థగా అవతరించనున్నట్లు పేర్కొంది. మొబిక్విక్ గ్రూప్ అనుబంధ సంస్థ జాక్ ఈపేమెంట్ సర్వీసెస్(జాక్పే).. ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్గా సేవలందించేందుకు ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్బీఐ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. -
ఎలక్ట్రానిక్ కంపెనీల హవా
గత కొంతకాలంగా ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సరీ్వసెస్ (ఈఎంఎస్) రంగం దుమ్మురేపుతోంది. వ్యవస్థాగత వృద్ధికి పలు అంశాలు తోడవడంతో ఈ రంగంలోని కంపెనీలు భారీ లాభాలతో పరుగులు తీస్తున్నాయి. చైనాయేతర తయారీ తదితర అంశాలతో ఏర్పడుతున్న డిమాండ్ ఈ రంగానికి బలాన్నిస్తోంది. దీంతో ఇటీవల దేశీ స్టాక్ మార్కెట్లో హవా చూపుతున్న ఈఎంఎస్ దిగ్గజాలు మరింత స్పీడందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మేకిన్ ఇండియాతో తయారీకి దన్నుగా నిలుస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, చైనాయేతర దేశాలలో తయారీ యూనిట్ల ఏర్పాటుపై గ్లోబల్ దిగ్గజాల దృష్టి దేశీయంగా ఈఎంఎస్ కంపెనీలకు జోష్నిస్తోంది. దీనికితోడు కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, ఇండ్రస్టియల్, ఎనర్జీ, డిఫెన్స్, మెడికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల నుంచి పటిష్ట డిమాండ్ వీటికి జత కలుస్తోంది. వెరసి ఈఎంఎస్ రంగంలోని పలు లిస్టెడ్ కంపెనీలు కొద్ది నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఇటు దేశీ డిమాండుకుతోడు అటు ఎగుమతులు సైతం పుంజుకోవడం కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తోంది. నిజానికి ఈ రంగంలో మార్జిన్లు తక్కువకావడంతో అధిక అమ్మకాల పరిమాణమే కంపెనీలకు లబ్ధిని చేకూరుస్తుంది. అయినప్పటికీ కొద్ది నెలలుగా ఈ రంగం వెలుగులో నిలుస్తోంది. భారీ అంచనాలు దేశీయంగా ఈఎంఎస్ రంగం 2022–23 నుంచి 2027–28 కాలంలో వార్షికంగా 25 శాతం వృద్ధి సాధించనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో 2027–28కల్లా రూ. 27.7 లక్షల కోట్లను తాకగలదని అంచనా వేశాయి. ఈ రంగం విలువ 2022లో రూ. 8.4 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ గణాంకాల ప్రకారం వేసిన అంచనాలివి. కాగా.. ప్రభుత్వం స్థానిక తయారీకి దన్నునిస్తూ ప్రోత్సాహకాలతో కూడిన పథకాలను ప్రవేశపెడుతోంది. తద్వారా గ్లోబల్ దిగ్గజాలను దేశీయంగా తయారీకి ఆహ్వానిస్తోంది. దేశీయంగా పటిష్టస్థాయిలో ఇంజనీరింగ్, డిజైన్ సామర్థ్యాలు అందుబాటులో ఉండటానికితోడు.. నైపుణ్యంగల మానవవనరులు చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా ఈఎంఎస్ రంగానికి భారత్ భారీ మార్కెట్ కూడా. అధిక శాతం కంపెనీలు బీటూబీ కస్టమర్లపైనే దృష్టిపెడుతున్నాయి.కీలక రంగాల దన్ను అధిక మార్జిన్లకు వీలున్న ఏరోస్పేస్, ఇండ్రస్టియల్స్, ఆటోమోటివ్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆర్డర్లు లభిస్తుండటంతో లిస్టెడ్ కంపెనీల లాభదాయకత మెరుగుపడుతోంది. ఇందుకు దేశీ కంపెనీలు సంక్లిష్ట ప్రొడక్టుల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. దేశీయంగా కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విస్తృతి తక్కువగా ఉండటం, వినియోగంపై వెచి్చంచగల ఆదాయాలు పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. తయారీలో స్థానికతకు ప్రాధాన్యత, అధిక విలువగల ప్రొడక్టుల తయారీలో నైపుణ్యం వంటి అంశాలతో లిస్టెడ్ దిగ్గజాలు దేశీయంగా ఈఎంఎస్ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. ఫలితంగా ప్రపంచస్థాయిలో పోటీపడే తయారీ కేంద్రంగా భారత్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బలపడుతున్న ఆర్డర్ల బుక్ లిస్టెడ్ దిగ్గజాలకు బూస్ట్నిస్తోంది. దిగ్గజాల దూకుడు దేశీ లిస్టెడ్ దిగ్గజాలలో డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీస్, అంబర్ ఎంటర్ప్రైజెస్, అవలాన్ టెక్నాలజీస్, సిర్మా ఎస్జీఎస్, సైయెంట్ డీఎల్ఎం, డేటా ప్యాటర్న్స్ ఇండియా తదితరాలున్నాయి. వీటిలో డిక్సన్, అంబర్ను మినహాయిస్తే మొత్తం ఆర్డర్ బుక్ విలువ గతేడాదికల్లా(2024–25) వార్షికంగా 23 శాతం పురోభివృద్ధిని సాధించింది. రూ. 16,300 కోట్లకు చేరింది. ఇక గతేడాది లిస్టెడ్ దిగ్గజాల మొత్తం ఆదాయం వార్షికంగా 84 శాతం జంప్చేసి రూ. 58,600 కోట్లను తాకింది. ఆదాయంలో డిక్సన్ 2 రెట్లు దూసుకెళ్లగా.. కేన్స్ 51 శాతం, అంబర్ 48 శాతం చొప్పున జంప్చేశాయి. ఇతర సంస్థల ఆదాయం సగటున 20 శాతానికిపైగా ఎగసింది. మొత్తం నిర్వహణ లాభం 73 శాతం పురోగమించి రూ. 3,500 కోట్లను తాకింది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ముంబై: బీమాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించే దిశగా జీవిత బీమా కంపెనీలు చేతులు కలిపాయి. రూ.450 కోట్లతో మూడేళ్ల పాటు పలు మాధ్యమాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. సబ్సే పెహలే లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో ప్రచారాన్ని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ ప్రారంభించింది.అన్ని జీవిత బీమా కంపెనీలు తమ ప్రీమియం ఆదాయానికి అనుగుణంగా ఈ ప్రచారం కోసం నిధులు అందించనున్నాయి. ‘ఏటా రూ.150–160 కోట్ల వరకు ఖర్చు చేస్తాం. మూడేళ్ల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సరిపడా ఖర్చును సమకూర్చేందుకు ఇప్పటికే హామీ లభించింది’ అని ఇన్సూరెన్స్ అవేర్నెస్ కమిటీ చైర్మన్ కమలేష్ రావు తెలిపారు.గత కొన్ని సంవత్సరాల్లో బీమా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కంపెనీలు ఈ నిర్ణయానికి రావడం గమనార్హం. 2022–23లో జీవిత బీమా విస్తరణ జీడీపీలో 4% కాగా, 2023–24లో 3.7%కి, గత ఆర్థిక సంవత్సరంలో 3.2%కి తగ్గుతూ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బీమా విస్తరణలో భారత్ 10వ స్థానంలో ఉంది. -
హెచ్ఎంఏ అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 సంవత్సరానికి హెచ్ఎంఏ తన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. కార్యవర్గ సమావేశంలో అల్వాల దేవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈయన ఈరైడ్ విద్యుత్ వాహనాల సంస్థ వ్యవస్థాపకుడు.శరత్ చంద్ర మారోజును ఉపాధ్యక్షుడిగా, వాసుదేవన్ను కార్యదర్శిగా కార్యవర్గం ఎన్నుకుంది. కొత్త మేనేజ్మెంట్ కమిటీలో ఇంకా సిండిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శరత్ చంద్ర మారోజు, ఈక్విటాస్ బ్యాంక్ జాతీయ అధిపతి వాసుదేవన్, ధ్రుమతారు కన్సల్టెంట్స్ వ్యవస్థపకులు, సీఈఓ చేతనా జైన్, స్టెల్త్ స్టార్టప్ వ్యవస్థాపకులు వి.శ్రీనివాసరావు, సిటో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకర వెంకట కృష్ణ ప్రసాద్ ఉన్నారు.ఈ సందర్భంగా హెచ్ఎంఏ నూతనాధ్యక్షుడు అల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, “వివిధ పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై మేం ప్రధానంగా దృష్టిపెడతాం. అదే సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను కూడా పెంపొందిస్తాం. వాళ్లను ఆంత్రప్రెన్యూర్లుగా లేదా కార్పొరేట్ ఉద్యోగాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) 1964 నుంచి నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ. సరికొత్త యాజమాన్య విధానాలపై యువ మేనేజర్లు, వృత్తినిపుణులు, విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతుంది. -
భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్కాన్పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది. -
‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’
కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఆకస్మిక గుండె మరణాల పెరుగుదలకు కొవిడ్-19 వ్యాక్సిన్లతో సంబంధం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలను బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలు అవాస్తవమని, వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపారు.‘భారత్లో అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్లను అత్యవసర వినియోగ ఆథరైజేషన్ ఫ్రేమ్వర్క్ కింద అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన ప్రోటోకాల్స్ను అనుసరించి ఆమోదించారు. ఈ వ్యాక్సిన్లు హడావుడిగా ఆమోదించారని తెలపడం సరికాదు. ఇది ప్రజల్లో తప్పుడు సమాచారానికి దోహదం చేస్తుంది. ఈ వ్యాక్సిన్లు లక్షల మంది ప్రాణాలను కాపాడాయి. అన్ని వ్యాక్సిన్ల మాదిరిగానే చాలా తక్కువ సంఖ్యలో కొందరిలో దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. నిందలు మోపడం కంటే వ్యాక్సిన్ల అభివృద్ధి వెనుక ఉన్న సైన్స్, డేటా-ఆధారిత ప్రక్రియలను గుర్తించడం చాలా ముఖ్యం’ అని ఆమె తన ఎక్స్ ఖాతాలో రాశారు.కమిటీ ఏర్పాటు..హసన్ జిల్లాలో గత నెలలోనే 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. పిల్లలు, యువకులు, అమాయకుల మరణాలకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, వారి కుటుంబాల ఆందోళనలను తాము పంచుకుంటామని సిద్ధరామయ్య సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లను హడావుడిగా ఆమోదించి ప్రజలకు పంపిణీ చేయడం కూడా ఈ మరణాలకు ఒక కారణం కావొచ్చని చెప్పారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు సూచించాయని తెలిపారు.భాజపా రాజకీయ లబ్ధి కోసం..కర్ణాటక వ్యాప్తంగా యువతలో ఆకస్మిక మరణాలకు గల కారణాలు, కొవిడ్-19 వ్యాక్సిన్లతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాలను అధ్యయనం చేసే బాధ్యతను ఫిబ్రవరిలో ఇదే నిపుణుల కమిటీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు. గుండె సంబంధ వ్యాధిగ్రస్తులపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఆరోగ్య సమస్యలను భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు.COVID-19 vaccines developed in India were approved under the Emergency Use Authorisation framework, following rigorous protocols aligned with global standards for safety and efficacy. To suggest that these vaccines were ‘hastily’ approved is factually incorrect and contributes to… https://t.co/uMEcMXzBV0— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 3, 2025ఇదీ చదవండి: ‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదు: కేంద్రంసిద్ధరామయ్య వాదనలకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని అత్యున్నత ప్రజారోగ్య పరిశోధనా సంస్థలకు చెందిన ముఖ్య అధికారులతో కలిసి కొవిడ్-19 వ్యాక్సిన్లకు, హసన్ జిల్లాలో చోటుచేసుకుంటున్న మరణాలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) సంయుక్త వివరణలో ప్రస్తుత విశ్లేషణలు కొవిడ్కు ముందు, కొవిడ్ అనంతరం సంభవించిన గుండె సంబంధిత మరణాల మధ్య పెద్ద తేడాలు గుర్తించలేదని తెలిపాయి. -
‘ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎస్బీఐ తీరు’
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రుణ ఖాతాను ‘ఫ్రాడ్’ అకౌంట్గా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించనుంది. అలాగే రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చే నివేదికలో సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది. జూన్ 23వ తేదీతో ఎస్బీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆర్కామ్ తెలిపింది. దీని ప్రకారం ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31,580 కోట్ల రుణం తీసుకున్నాయి.ఆర్కామ్కి పంపిన లేఖ ప్రకారం.. రుణంగా తీసుకున్న నిధులను సంక్లిష్టమైన విధంగా వివిధ గ్రూప్ సంస్థలు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ పేర్కొంది. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసుకి కంపెనీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్కామ్ ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాలని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు వివరించింది. ‘ఫ్రాడ్’గా మారిస్తే..ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఏదైనా ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించినప్పటి నుంచి 21 రోజుల్లోగా ఆ విషయాన్ని ఆర్బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీఐ/ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మోసం చేసిన రుణగ్రహీతపై (ప్రమోటర్ డైరెక్టర్, ఇతరత్రా హోల్టైమ్ డైరెక్టర్లు సహా) కఠినచర్యలు ఉంటాయి. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన అయిదేళ్ల వరకు మరే ఇతర బ్యాంకులు, డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వ రంగ ఎన్బీఎఫ్సీల నుంచి రుణాలు తీసుకోవడానికి ఉండదు.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఆర్కామ్ స్పందన ఇదే..ఎస్బీఐ నిర్ణయంపై ఆర్కామ్ స్పందించింది. తమ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడమనేది ఆర్బీఐ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 2న బ్యాంకుకు ఆర్కామ్ లాయర్లు ఈ మేరకు లేఖ రాశారు. ఆరోపణలపై వ్యక్తిగతంగా వివరణనిచ్చేందుకు అనిల్ అంబానీకి కనీసం అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎస్బీఐ నిర్ణయం తీసుకోవడం షాక్కు గురి చేసిందని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆర్కామ్లోని ఇతర నాన్–ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసును విత్డ్రా చేసుకున్న ఎస్బీఐ, అంబానీ కూడా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే అయినప్పటికీ ఆయన్ను మాత్రం వేరుగా చేసి చూడటం సరికాదని లాయర్లు వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన దాదాపు ఏడాది వరకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ వివరణ సంతృప్తికరంగానే ఉందని భావించినట్లు తెలిపారు. -
యస్ బ్యాంక్లో వాటాపై సీసీఐకి దరఖాస్తు
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్లో 20 శాతం వాటా కొనుగోలుకి క్లియరెన్స్ను కోరుతూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ)కు జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) దరఖాస్తు చేసింది. యస్ బ్యాంక్లో 20 శాతం వాటా విక్రయించేందుకు గత నెలలో పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)తోపాటు ఇతర 7 బ్యాంకింగ్ సంస్థలు నిర్ణయించాయి. రూ.13,483 కోట్ల విలువలో వాటా విక్రయానికి ప్రతిపాదించాయి.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’దీని ప్రకారం యస్ బ్యాంక్లో వాటా మూలధనంతోపాటు.. ఓటింగ్ హక్కులను సైతం ఎస్ఎంబీసీ సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిగా ఈ డీల్ రికార్డ్ సృష్టించనుంది. జపాన్లో రెండో పెద్ద బ్యాంకింగ్ గ్రూప్ అయిన సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్ఎంఎఫ్జీ)నకు సొంత అనుబంధ సంస్థగా ఎస్ఎంబీసీ వ్యవహరిస్తోంది. -
మైక్రోసాఫ్ట్లో మరిన్ని ఉద్యోగాలు కట్..
రెడ్మండ్ (అమెరికా): టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరిన్ని వేల మంది ఉద్యోగులను తీసివేసేందుకు కంపెనీ ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఉద్వాసనకు గురయ్యే ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను పంపించే ప్రక్రియ ప్రారంభించింది. ఎంత మందిని తీసివేస్తున్నదీ కంపెనీ నిర్దిష్టంగా వెల్లడించనప్పటికీ, దాదాపు 9000 మందికి నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్వాసనల తర్వాత గతేడాదితో పోలిస్తే సిబ్బంది సంఖ్య సుమారు 4 శాతం తగ్గుతుందని అంచనా. -
బీమా పథకాల మిస్–సెల్లింగ్ వద్దు..
న్యూఢిల్లీ: కస్టమర్లకు ఒక పాలసీ గురించి చెప్పి మరో పాలసీని అంటగట్టే (మిస్–సెల్లింగ్) ధోరణులను నివారించడంపై బ్యాంకులు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి ఎ నాగరాజు సూచించారు. ఇన్సూరెన్స్ అనేది చాలా సున్నితమైన ఆర్థిక సాధనమని, కస్టమర్లకు విక్రయించే ముందు, దాని గురించి క్షుణ్నంగా వివరించాలని పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇటలీకి చెందిన జనరాలి గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగరాజు ఈ విషయాలు తెలిపారు. మిస్–సెల్లింగ్ వల్ల కస్టమర్లకు ప్రీమియంల భారం పెరిగిపోతుందని, ఫలితంగా పాలసీదారులు తమ పాలసీని మళ్లీ పురుద్ధరించుకోరని ఆయన పేర్కొన్నారు. ప్రీమియంలు అధికంగా ఉన్నా కూడా బీమా కొనుగోలు చేయడానికి ప్రజలు ఇష్టపడరు కాబట్టి ప్రీమియంలు సహేతుకంగా ఉండేలా కంపెనీలు చూసుకోవాలని నాగరాజు సూచించారు. కస్టమర్ల క్లెయిమ్లు సకాలంలో, సముచితంగా ప్రాసెస్ అయ్యేలా బీమా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు, ఫ్యూచర్ జనరాలీ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 24.91 శాతం, ఫ్యూచర్ జనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో 25.18 శాతం వాటాల కొనుగోలు పూర్తి చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. -
తెలంగాణలో పీవీఆర్ ఐనాక్స్ విస్తరణ
న్యూఢిల్లీ: సినిమా ఎగ్జిబిటర్ పీవీఆర్ ఐనాక్స్ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ వారంలో హైదరాబాద్లో కొత్తగా నాలుగు స్క్రీన్ల ప్రాపర్టీని ప్రారంభించనుంది. దీనితో రాష్ట్రంలో మొత్తం స్క్రీన్ల సంఖ్య 110కి చేరుతుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 26 స్క్రీన్లను జోడించనున్నట్లు వివరించారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మార్కెట్ తమకు అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 200 స్క్రీన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం రూ. 400 కోట్ల వరకు వెచి్చంచనున్నట్లు ఆయన వివరించారు. ప్రధానంగా దక్షిణాదిపై, చిన్న నగరాలు, పట్టణాలపై ఫోకస్ పెట్టనున్నట్లు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 100 వరకు స్క్రీన్స్ ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా, ఇప్పటికే 20 ప్రారంభించామన్నారు. 100 స్క్రీన్ల లక్ష్యంలో భాగంగా హైదరాబాద్, బెంగళూరు, హుబ్లి సహా దక్షిణాదిలోని వివిధ నగరాల్లో 40 స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని సంజీవ్ కుమార్ వివరించారు. అలాగే సిలిగురి, జబల్పూర్, లేహ్, గ్యాంగ్టక్ వంటి చిన్న పట్టణాల్లో కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. కొత్తగా 200 స్క్రీన్ల రాకతో రెండేళ్లలో మొత్తం స్క్రీన్ల సంఖ్య దాదాపు 2,000కు చేరుతుందని సంజీవ్ కుమార్ తెలిపారు. -
వొడాఫోన్ను పీఎస్యూగా మార్చే ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ: దేశీ మొబైల్ టెలికం రంగంలో కనీసం 4 కంపెనీలు సేవలందించేలా చూడాల్సి ఉందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సిందియా పేర్కొన్నారు. ఒక ఆంగ్ల చానల్కు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన దేశీ టెలికం రంగంలోని పలు అంశాలపై మాట్లాడారు. రుణ భారంతో సవాళ్లు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా(వీఐ)లో ప్రభుత్వం మరింత ఈక్విటీ వాటాను తీసుకోదని తేల్చి చెప్పారు. వీఐను ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్యూ)గా మార్చబోమని స్పష్టతనిచ్చారు. టెలికం కంపెనీలలో ప్రభుత్వ వాటా 49 శాతానికి మించడానికి అనుమతించబోమని తెలియజేశారు. ఇటీవల వీఐ ఈక్విటీ మారి్పడి అవకాశాలను అన్వేíÙస్తున్న నేపథ్యంలో సిందియా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా.. ప్రతీ టెలికం కంపెనీకి బకాయిలను ఈక్విటీ మార్పు చేయాలని కోరే హక్కు ఉన్నట్లు వెల్లడించారు. అయితే అన్ని కంపెనీలకూ ఒకే నిబంధనలు వర్తించవని, ఆయా కంపెనీల పరిస్థితులకు అనుగుణంగా టెలికం శాఖ(డాట్)తోపాటు.. ఆర్థిక శాఖ సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని వివరించారు. భారతీ టెలికం ఈ హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై డాట్ పరిశీలన, విశ్లేషణ పూర్తయితే ఒక నిర్ణయాన్ని తీసుకోగలమని తెలియజేశారు. పోటీ ఉండాలి టెలికంలోనే కాకుండా ఏ రంగంలో అయినా రెండే కంపెనీలు ఆధిపత్యం వహించడం మంచి పరిణా మం కాదని సిందియా పేర్కొన్నారు. దేశీయంగా మొబైల్ టెలికం విభాగంలో పోటీ పరిస్థితులు కొనసాగాలని తెలియజేశారు. పోటీ నివారణ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మొబైల్ టెలికం రంగంలో 4 కంపెనీలు సర్వీసులందిస్తున్న దేశాలు తక్కువగానే ఉన్నట్లు వెల్లడించారు. టెలికం పెట్టుబడి వ్యయాలలో దేశీ కంపెనీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క భారత్లో మాత్రమే పెట్టుబడులపై మంచి రిటర్నులు లభిస్తున్నట్లు తెలియజేశారు. ఇది లాభదాయకతపై ఆయా కంపెనీలు, యాజమాన్యాల నిర్ణయాలను బట్టి ఉంటుందని వివరించారు. శాటిలైట్ సేవలు శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం స్పెక్ట్రమ్ ధరల నిర్ణయంపై టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) సన్నాహాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా పలు సంస్థలు, వాటాదారులతో చర్చలు, సూచనలు తదితరాలకు తెరతీసినట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా తగిన సిఫారసులతోకూడిన నివేదికను దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు. ట్రాయ్ సలహాలు అమలు చేసేందుకు రెండు నెలలు పట్టవచ్చని పేర్కొన్నారు. -
అనిల్ అంబానీకి ఎస్బీఐ ‘ఫ్రాడ్’ ట్యాగ్.. ఒకప్పుడు బిలియనీర్.. ఇప్పుడు మోసగాడా?
సాక్షి,ఢిల్లీ: అన్న ముఖేష్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించగా.. తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో వ్యాపార రంగంలో తన అద్భుతమైన తెలివితేటలు, సామర్ధ్యంతో ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న అనిల్ అంబానీ ఇప్పుడు బ్యాంకుల్ని మోసం చేసిన మోసగాళ్ల జాబితాలో చేరినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి.ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీకి ఎస్బీఐ షాకిచ్చింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ ఎత్తున రుణాలిచ్చింది. ఆ రుణాల్ని రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్కాం) నిబంధనలకు విరుద్ధంగా నిధుల్ని మళ్లించినట్లు గుర్తించింది. ఫలితంగా బ్యాంకుల్ని మోసం చేసిన సంస్థల జాబితాలో రిలయన్స్ కమ్యూనికేషన్తో పాటు ఆ సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును సైతం చేర్చింది. ఎస్బీఐ స్టాక్ ఎక్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్కి ఇచ్చిన రుణాల్లో నిబంధనల ఉల్లంఘన, నిధుల దుర్వినియోగం వంటి అంశాలు కనిపించాయని పేర్కొంది. మొత్తం రూ.31,580 కోట్ల రుణాల్లో సుమారు రూ.13,667 కోట్లు ఇతర రుణాల చెల్లింపులకు, రూ.12,692 కోట్లు సంబంధిత సంస్థలకు మళ్లించారని తెలిపింది. The State Bank of India (SBI) has decided to classify the loan account of beleaguered telecom firm Reliance Communications as "fraud" and to report the name of its erstwhile director — Anil Ambani — to the Reserve Bank of India (RBI). . . #anilambani #sbin #loan #kchol #VXON pic.twitter.com/DzW9lvLwrU— THE BHARAT INTEL 🪖 (@thebharatintel) July 2, 2025ఈ నేపథ్యంలో, ఎస్బీఐ జూన్ 23న కంపెనీకి లేఖ రాసింది. సంస్థ ఖాతాల్ని ‘ఫ్రాడ్’గా గుర్తిస్తున్నట్లు సమాచారం అందించింది. అనిల్ అంబానీ పేరును కూడా చేర్చినట్లు ఆర్బీఐకి నివేదించింది. అయితే, అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు ఈ నిర్ణయంపై స్పందించారు. తాము సమర్పించిన వివరణలకు ఎస్బీఐ సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విషయంలో అనిల్ అంబానీ సంస్థలకు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్ని సైతం ఎస్బీఐ సంప్రదించనుంది. ఇప్పటికే కెనరా బ్యాంక్ కూడా ఆర్కామ్ అకౌంట్లను ఫ్రాడ్గా గుర్తించింది.కాగా, బ్యాంకులు ఏదైనా సంస్థకు రుణాలిచ్చి.. వాటిని చెల్లించే క్రమంలో లేదంటే ఇతర అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వాటిని ఫ్రాడ్ జాబితాలో చేర్చుతాయి. ఆ జాబితాలో పేరుంటే సదరు సంస్థలకు 5 సంవత్సరాల పాటు కొత్త రుణాలు ఇవ్వకూడదు. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే నిబంధన. తాజాగా ఆర్కామ్ విషయంలో సైతం ఎస్బీఐ తీసుకున్న నిర్ణయం ఇతరు బ్యాంకులు తీసుకునేలా సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. -
మస్క్ కంపెనీలో ఉద్యోగం కావాలా?
ఎలాన్ మస్క్కు చెందిన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. బ్యాకెండ్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, డేటా సైంటిస్టులు, లీగల్ ఎక్స్పర్ట్లు.. వంటి ఉద్యోగాల కోసం ఎక్స్ఏఐ తన ఎక్స్ ఖాతాలో ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పాలో ఆల్టో, శాన్ ఫ్రాన్సిస్కో, మెంఫిస్లోని కార్యాలయాల్లో విస్తృత శ్రేణి ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తోంది. కొన్ని పోస్టులు రిమోట్ దరఖాస్తుదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ ‘ఎక్స్ మనీ’ని అభివృద్ధి చేయడానికి చురుకుగా పనిచేస్తున్నట్లు ఎక్స్ఏఐ తెలిపింది.ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు గతంలో తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇప్పటికే ‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ గతంలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ర్యాపిడో.. ఓలా.. ఉబర్.. ఛార్జీలు పెంపు?వేతనాలు ఇలా..ఎక్స్ఏఐలో చేరే ఉద్యోగులకు ఏటా 2,20,000 డాలర్ల (సుమారు రూ.1.9 కోట్లు) నుంచి 4,40,000 డాలర్ల (సుమారు రూ.3.7 కోట్లు) వరకు పారితోషికం ఆఫర్ చేసింది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ వంటి రంగాల్లో బలమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం ఉన్న ఇంజినీర్లకు కంపెనీ మరింత చెల్లిస్తుందని ఎక్స్ఏఐ తెలిపింది. -
ర్యాపిడో.. ఓలా.. ఉబర్.. ఛార్జీలు పెంపు?
ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు అందించే సంస్థలు పీక్ అవర్స్లో తమ ఛార్జీలను గరిష్ఠంగా 2 రెట్లు వరకు పెంచుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జులై 1న జారీ చేసిన మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలు (ఎంవీఏజీ) 2025లో పేర్కొంది. ఇప్పటివరకు ఈ సర్జ్ ప్రైసింగ్ గరిష్ఠ పరిమితి 1.5 రెట్లు వరకు ఉండేది. దీన్ని తాజాగా 0.5 రెట్లు పెంచింది.రాబోయే మూడు నెలల్లో కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కంపెనీల కార్యకలాపాల కోసం అధిక డిమాండ్ ఉన్న సమయంలో ప్లాట్ఫామ్లకు సౌలభ్యాన్ని ఇవ్వడమే సవరించిన ఛార్జీల లక్ష్యంగా కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎంవీఏజీ 2025 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి లోబడి ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ల ద్వారా ప్రయాణాలకు రవాణాయేతర (ప్రైవేట్) మోటారు సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని కట్టడి చేయడం, హైపర్ లోకల్ డెలివరీకి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు రవాణాయేతర మోటారు సైకిళ్లను వివిధ అగ్రిగేటర్ల ద్వారా అనుమతిస్తుంది. ఎంవీఏజీ 2025 మార్గదర్శకాల్లోని క్లాజ్ 23 ప్రకారం కంపెనీల నుంచి రోజువారీ, వారంవారీగా లేదా 15 రోజులకు ఒకసారి ఫీజు వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది.ఇదీ చదవండి: 11 మంది టాప్ ఎక్స్పర్ట్లతో మెటా కొత్త ల్యాబ్వివిధ రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాపిడో, ఉబర్ వంటి బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు ఈ చర్యను స్వాగతిస్తున్నారు. ఈ నిబంధనను ‘వికసిత్ భారత్’ వైపు సాగే ప్రయాణంలో ఒక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. మౌలికసదుపాయాలు అంతగాలేని వెనుకబడిన ప్రాంతాల్లో సరసమైన రవాణాను విస్తరించడానికి ఈ మార్గదర్శకాలు సహాయపడుతాయని రాపిడో తెలిపింది. సవరించిన మార్గదర్శకాలపట్ల ఉబర్ హర్షం వ్యక్తం చేసింది.కొత్త మార్గదర్శకాల్లోని కొన్ని ముఖ్యాంశాలు..సర్జ్ ప్రైసింగ్ పరిమితి పెంపు: అధిక డిమాండ్ ఉన్న కాలంలో బేస్ ఛార్జీలను 1.5 రెట్ల నుంచి 2 రెట్లు పెంచారు.పీక్ అవర్స్ కాని సమయంలో..: బేస్ ఛార్జీలో కనీసం 50% ఫేర్ ఉండాలి.డెడ్ మైలేజ్ ఛార్జీలు: పికప్ దూరం 3 కిలోమీటర్ల కంటే ఎక్కవగా ఉన్నప్పుడు మాత్రమే విధించాలి.రద్దు జరిమానాలు: డ్రైవర్ కారణం లేకుండా రైడ్ క్యాన్సిల్ చేస్తే రూ.100 లేదా 10% ఛార్జీ (ఏది తక్కువైతే అది) విధిస్తారు. స్వయంగా క్యాన్సిల్ చేసుకునే ప్రయాణికులకు కూడా ఇదే వర్తిస్తుంది.డ్రైవర్ సంక్షేమం: రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.భద్రతా చర్యలు: రైడ్ వాహనాలకు స్టేట్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించిన లొకేషన్ ట్రాకింగ్ పరికరాలు ఉండాలి. -
ఐటీలో వృద్ధి అంతంతే
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2–3 శాతం వృద్ధికి (డాలర్ మారకంలో) పరిమితం అవుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. ఐటీ సేవల రంగానికి స్థిరమైన అవుట్లుక్ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. పరిశ్రమలో 60 శాతం ఆదాయం వాటా కలిగిన 15 ప్రముఖ ఐటీ కంపెనీలను విశ్లేషించి ఇక్రా ఈ వివరాలు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం ఆదాయంలో 2.9 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. అమెరికా టారిఫ్ల విధింపుతో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు కీలక మార్కెట్లలో కంపెనీల ఐటీ బడ్జెట్లపై ప్రభావం చూపిస్తాయని ఇక్రా తెలిపింది.ఇటీవలి త్రైమాసికాల్లో కంపెనీల నిర్వహణ ఆదాయం కొంత కోలుకున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోతగ్గ స్థాయిలో పుంజుకోకపోవచ్చని పేర్కొంది. అమెరికా టారిఫ్లనే ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘భారత ఐటీ సేవల ఆదాయంలో 80–90 శాతం వాటాతో యూఎస్, యూరప్ కీలక మార్కెట్లుగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో వృద్ధి 2024–25లో మోస్తరుగా మారింది. తుది త్రైమాసికంలో కొంత క్షీణత కనిపించింది. 2025–26 మొదటి త్రైమాసికం అంచనాలపై అప్రమత్తత నెలకొంది. అమెరికా టారిఫ్లపై ఏర్పడిన అనిశ్చితులు ఐటీ వ్యయాలను నియంత్రిస్తున్నాయి. ఇది పరిశ్రమ పనితీరుపై ప్రభావం చూపించనుంది’’అని ఇక్రా వివరించింది. నియామకాలూ తక్కువే.. డిమాండ్ మెరుగుపడేంత వరకు ఐటీ రంగంలో నియామకాలు తక్కువగానే ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. ఏఐ, జెనరేటివ్ ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీలను కంపెనీలు అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో.. నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం భవిష్యత్ నియామకాలను ప్రభావిం చేస్తుందనిని తెలిపింది. యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత ఐటీ సేవల రంగానికి వచ్చే ప్రయోజనాలను ప్రస్తావించింది. ఇందులో బ్రిటన్లో పనిచేసే తాత్కాలిక బారత ఐటీ ఉద్యోగులకు మూడేళ్ల పాటు సామాజిక భద్రతా ప్రయోజలను అందించే నిబంధన ఉండడాన్ని సానుకూలంగా పేర్కొంది. -
ఐపీవో బాటలో హీరో మోటార్స్
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ కంపెనీ హీరో మోటార్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 285 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 237 కోట్లు ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ ప్లాంటు విస్తరణకు అవసరమైన మెషీనరీ, పరికరాల కొనుగోళ్లకు వెచ్చించనుంది.మరికొన్ని నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఇంతక్రితం కంపెనీ 2024 ఆగస్ట్లోనూ పబ్లిక్ ఇష్యూకి సిద్ధపడింది. రూ. 900 కోట్ల సమీకరణకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే అక్టోబర్లో ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. కంపెనీ ప్రధానంగా అత్యున్నత ఇంజినీర్డ్ పవర్ట్రెయిన్ సొల్యూషన్లు రూపొందిస్తోంది. దేశ, విదేశీ ఆటోమోటివ్ టెక్నాలజీ దిగ్గజాలకు కంపెనీ ప్రొడక్టులు సమకూర్చుతోంది. క్లయింట్లలో భారత్సహా యూఎస్, యూరప్, దక్షిణాసియా ప్రాంత దిగ్గజాలున్నాయి.వీటిలో బీఎండబ్ల్యూ ఏజీ, డుకాటి మోటార్ హోల్డింగ్ ఎస్పీఏ, హమ్మింగ్బర్డ్ ఈవీ, ఎన్వియోలో ఇంటర్నేషనల్ ఇంక్, ఫార్ములా మోటార్స్పోర్ట్ తదితరాలు చేరాయి. భారత్, యూకే, థాయ్లాండ్లలో ఆరు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,064 కోట్లను అధిగమించింది. నికర లాభం రూ. 17 కోట్లుగా నమోదైంది. లిస్టింగ్కు స్కైవేస్ ఎయిర్ సర్విసెస్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు వైమానిక రవాణా ఫార్వార్డింగ్, లాజిస్టిక్స్ కంపెనీ స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు అనుమతించమంటూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా 32.92 మిలియన్ ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 13.33 మిలియన్ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 217 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 130 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 1984లో ఏర్పాటైన కంపెనీ కస్టమ్ హౌస్ ఏజెంట్గా కార్యకలాపాలు ప్రారంభించి తదుపరి సర్విసులను విస్తరించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,289 కోట్ల ఆదాయం, రూ. 34.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
జేఎస్డబ్ల్యూ నిధుల సమీకరణ
ముంబై: డ్యూలక్స్ బ్రాండ్ పెయింట్ల దిగ్గజం అక్సో నోబెల్ ఇండియా కొనుగోలుకి జేఎస్డబ్ల్యూ పెయింట్స్ నిధుల సమీకరణకు తెరతీసింది. దీనిలో భాగంగా కంపెనీ ప్రమోటర్లతోపాటు.. పీఈ దిగ్గజాలు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు వెల్లడించింది. మరికొన్ని నిధులను రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ ఎండీ పార్ధ్ జిందాల్ తెలియజేశారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ గ్రూప్ కంపెనీ అంతర్గత వనరులు, ప్రమోటర్ల పెట్టుబడుల ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను పీఈ సంస్థలు అందించనున్నట్లు పేర్కొన్నారు.ఐదేళ్ల క్రితమే ప్రస్థానం ప్రారంభించిన జేఎస్డబ్ల్యూ పెయింట్స్ తాజాగా డచ్ దిగ్గజం అక్సో నోబెల్.. ఇండియా బిజినెస్ను కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. డీల్ పూర్తయితే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ దేశీయంగా డెకొరేటివ్ పెయింట్ల విభాగంలో మూడో పెద్ద కంపెనీగా అవతరించనుంది. రానున్న మూడేళ్లలో టర్నోవర్ రూ. 7,500 కోట్లకు చేరనున్నట్లు అంచనా.కాగా.. భారత్ నుంచి పూర్తిగా వైదొలగడంలేదని అక్సో నోబెల్ సీఈవో గ్రెగ్ పౌక్స్ గిలామీ తెలియజేశారు. పౌడర్ కోటింగ్స్ బిజినెస్, ఆర్అండ్డీ కంపెనీ చేతిలోనే కొనసాగనున్నట్లు వెల్లడించారు. అయితే జేఎస్డబ్ల్యూకి సాంకేతిక భాగస్వామిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లైసెన్సింగ్, రాయల్టీ ఒప్పందంకింద 4.5 శాతం అందుకోనున్నట్లు తెలియజేశారు. -
టెస్లా షేర్లు భారీగా కుదేలు
ఒకప్పుడు ఉమ్మడి ఆకాంక్షలతో పరస్పర సహకారంతో కలిసి ప్రయాణం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సమీకరణాలు పూర్తిగా మారాయి. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం రాజేసుకుంది. ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభనకు తెరతీసినట్లయింది. తాజాగా మస్క్ కంపెనీలకు అందిస్తున్న సబ్సిడీల్లో కోత విధిస్తే పరిస్థితి ఏమిటని ట్రంప్ ఎద్దేవ చేశారు. దానికి ప్రతిస్పందనగా అన్నీ రాయితీలు కట్ చేయడంటూ మస్క్ బదులిచ్చారు. ఇద్దరిమధ్య పెరుగుతున్న వ్యతిరేకతతో టెస్లా షేర్లు ఒక్క రోజులోనే 5 శాతంకు పైగా క్షీణించాయి.ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ ‘ఆర్థిక నిర్లక్ష్యానికి చిహ్నం’గా అభివర్ణించారు. ప్రస్తుతానికి ఈ బిల్లు యూఎస్ సెనేట్లో ఆమోదం పొందింది. 51–49 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించారు. కానీ ప్రతినిధుల సభలో ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లు అమెరికా ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మారుస్తుందని ట్రంప్ వాదిస్తుంటే.. కొంతమందికి భారీ పన్ను ఉపశమనం కలిగించేలా, మరికొందరికి ఖర్చులు పెరిగేలా, వలసలపై కఠిన వైఖరి ఉండేలా నిర్ణయాలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.‘నేను ఈవీ మాండేట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎలాన్ మస్క్కు చాలాకాలం ముందే తెలుసు. ఇది నా రాజకీయ ప్రచారంలోనూ కీలకంగా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ కారును సొంతం చేసుకోవాలని బలవంతం చేయకూడదు. సబ్సిడీలు లేకుండా మస్క్ బహుశా తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అని ట్రంప్ అన్నారు. దాంతోపాటు టెస్లా, స్పేస్ఎక్స్ వంటి మస్క్ వెంచర్లు ప్రభుత్వ నిధులపై ఎంతగా ఆధారపడుతున్నాయో డోజ్ దర్యాప్తు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.BREAKING: Trump implies DOGE may look at Elon Musk’s subsidies: pic.twitter.com/FE9lXj0Ebq— unusual_whales (@unusual_whales) July 1, 2025ఇదీ చదవండి: డియర్ స్టాఫ్.. ఆరోగ్యం జాగ్రత్త!మస్క్ స్పందన ఇలా..ట్రంప్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మస్క్ తన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించాలని కోరారు. ‘నేను నిజంగా చెబుతున్నా.. అన్ని రాయితీలను కట్ చేయండి’ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. -
డియర్ స్టాఫ్.. ఆరోగ్యం జాగ్రత్త!
ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ‘ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఈమెయిళ్లు పంపుతోంది. పని గంటలకు మించి వర్క్ చేయకూడదని చెబుతూ వర్క్-లైఫ్ బ్యాలెన్స్పై దృష్టి సారించాలని పేర్కొంటోంది. రిమోట్గా పని చేస్తోన్న కంపెనీ ఉద్యోగులు తప్పకుండా రెగ్యులర్ షెడ్యూల్స్మేరకే వర్క్ చేయాలని కోరుతోంది. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపుతోంది. కంపెనీకి చెందిన టూల్స్లో తమ ఉద్యోగులు గడిపే సమయాన్ని సైతం ట్రాక్ చేస్తూ రిమైండర్ పంపుతుంది.ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ హెచ్ఆర్ బృందం వారానికి ఐదు రోజులు, రోజుకు సగటున 9.15 పని గంటలు మించిన ఉద్యోగులకు హెల్త్ రిమైండర్ ఈమెయిల్స్ పంపుతోంది. ఈ ఈమెయిల్స్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడాన్ని హైలైట్ చేస్తున్నాయి. రిమోట్గా పనిచేసేటప్పుడు నిర్ణీత పని గంటలను అధిగమించకుండా చూసుకోవాలని తెలిపింది. ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించాలని ఈమెయిల్స్లో స్పష్టమైన రిమైండర్ ఉన్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు.వృత్తిపరంగా చాలా అవసరం..వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వృత్తిపరమైన ప్రభావానికి కూడా ఇది చాలా అవసరమని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని, పనిఒత్తిడి ఉంటే వెంటనే తెలియజేయాలని, ఉద్యోగులు తమను తాము రిఫ్రెష్ కావడానికి వీలు కల్పించుకోవాలని తెలిపింది.ఇదీ చదవండి: ‘సూపర్ యాప్’లో అన్ని రైల్వే సేవలుగతంలో వారానికి 70 గంటలపాటు పని చేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కంపెనీలో ఇలా వర్క్-లైఫ్ బ్యాలెన్స్కు సంబంధించిన ఈమెయిళ్లు పంపడం ఉద్యోగుల్లో ఊరటనిస్తుంది. హైబ్రిడ్ వర్క్ మోడల్తోపాటు ఉద్యోగుల ఆరోగ్యంపట్ల కంపెనీ తీరును ఇవి హైలైట్ చేస్తున్నాయి. -
‘సూపర్ యాప్’లో అన్ని రైల్వే సేవలు
భారతీయ రైల్వే ‘రైల్ వన్(Railone)’ పేరుతో సూపర్యాప్ను ప్రారంభించినట్లు తెలిపింది. గత ఏడాదే వెల్లడించినట్లుగానే ఐఆర్సీటీసీ వినియోగదారులకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, పీఎన్ఆర్ స్టేటస్.. వంటి ఎన్నో సర్వీసులను పొందవచ్చని తెలిపింది. ఈ యాప్ను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి.. అందులో ఏయే సర్వీసులున్నాయో కింద తెలుసుకుందాం.ఈ యాప్లో అందుబాటులోకి వచ్చిన సేవలన్నీ ప్రస్తుతం ఆన్లైన్లో, విభిన్న యాప్ల ద్వారా వేర్వేరుగా ఉన్నాయి. తాజాగా వాటన్నింటినీ ఒకే యాప్ పరిధిలోకి తీసుకొచ్చేలా కొత్త యాప్ను ప్రారంభించారు. దీన్ని ఐఆర్సీటీసీ ‘సూపర్ యాప్’గా పరిగణిస్తుంది. ఇప్పటికే ఈ యాప్ను కొన్ని రోజులుగా వివిధ దశల్లో రైల్వేశాఖ పరీక్షించింది. ఈ యాప్ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేసింది.ఇన్స్టాల్ చేసుకోండిలా..గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ ద్వారా ఈ సూపర్ యాప్ ‘Railone’ను డౌన్లోడ్ చేయాలి.యాప్ వినియోగదారుల లొకేషన్ను డిఫాల్డ్గా రీడ్ చేయడానికి అనుమతులు కోరుతుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి.యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత లాగిన్, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్, గెస్ట్ అనే ఆప్షన్లు వస్తాయి.కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేస్తే రైల్ కనెక్ట్, యూటీఎస్ అని రెండు ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. గతంలో ఇప్పటికే రైల్ కనెక్ట్ యాప్లో లాగిన్ వివరాలు ఉంటే ఆయా వివరాలతో Railoneలో లాగిన్ కావొచ్చు. లేదంటే కొత్తంగా వివరాలు ఎంటర్ చేసి సైనప్ చేయాల్సి ఉంటుంది.సైనప్ కోసం మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ చేయాల్సి.మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, ఈ-మెయిల్, యూజర్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చు.ఓటీపీ, ఎంపిన్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత 2ప్యాక్టర్ వెరిఫికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ లేదా డివైజ్ లాగిన్ వివరాలు ఇవ్వాలి.ఇదీ చదవండి: ‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’రైల్వన్ యాప్ ద్వారా లభించే సేవలుటికెట్ బుకింగ్: ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.ప్లాట్ఫామ్ & పార్శిల్ బుకింగ్: వినియోగదారులు ప్లాట్ఫామ్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పార్శిల్ డెలివరీకి సంబంధించిన సేవలను బుక్ చేసుకోవచ్చు.రైలు & పీఎన్ఆర్ స్టేటస్: ట్రైన్ షెడ్యూల్, పీఎన్ఆర్ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు.ఫుడ్ ఆర్డర్: రైలులో ప్రయాణించే సమయంలో.. ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.రైల్ మదద్: ఫిర్యాదులు దాఖలు చేయడానికి మరియు సహాయం పొందడానికి ఒక హెల్ప్డెస్క్ మాదిరిగా కూడా ఉపయోగపడుతుంది. -
‘ఉద్యోగాలకు ఏఐ ముప్పు తప్పదు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కంపెనీల పనితీరును మార్చబోతోందని అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ తెలిపారు. దీని ఫలితంగా చాలామంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఏఐ వాడకం పెరుగుతుండడంతో నిర్ణీత విభాగాల్లో తక్కువ మంది అవసరం అవుతారని చెప్పారు. సీఎన్బీసీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో జాస్సీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో సంస్థల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులతో పోలిస్తే ఏఐ సమర్థవంతంగా ఆయా పనులు నిర్వహిస్తుందని అంగీకరించారు.ఈ వ్యాఖ్యలు ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతున్నప్పటికీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉపాధి అవకాశాలకు తెరతీస్తుందని జాస్సీ చెప్పారు. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేషన్ అవుతున్నప్పటికీ కృత్రిమ మేధ అభివృద్ధి, రోబోటిక్స్, మానవ నైపుణ్యాలు, ఆవిష్కరణలు అవసరమయ్యే ఇతర రంగాల్లో మరిన్ని మానవ వనరులు కావాలన్నారు.ఇదీ చదవండి: వస్తు సేవల పన్ను విజయాల పరంపరఇతర కంపెనీల తీరిది..సేల్స్ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏఐ తమ కంపెనీలో 30 నుంచి 50 శాతం పనులు చేస్తోందని వెల్లడించారు. షాపిఫై, మైక్రోసాఫ్ట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు ఏఐని తమ రోజువారీ పనిలో భాగం చేసుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. అమెజాన్లో పెద్ద ఎత్తున కృత్రిమ మేధను వినియోగిస్తున్నందున రాబోయే సంవత్సరాల్లో తమ ఉద్యోగులు తగ్గిపోయే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరించింది. -
అపోలో ఫార్మసీ వ్యాపారంలో విభజన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమ్నీచానల్ ఫార్మసీ, డిజిటల్ హెల్త్ వ్యాపారాలను విడదీసి, లిస్ట్ చేసే ప్రతిపాదనకు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (ఏహెచ్ఈఎల్) బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన స్కీము ప్రకారం లిస్టింగ్కు 18–21 నెలల వ్యవధి పట్టనుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఆమ్నీచానల్ ఫార్మా, డిజిటల్ హెల్త్ వ్యాపారాన్ని కొత్త సంస్థగా విడగొడతారు. తర్వాత హెల్త్కేర్ విభాగం అపోలో హెల్త్కో (ఏహెచ్ఎల్), హోల్సేల్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్ కీమెడ్ను కొత్త సంస్థలో విలీనం చేస్తారు. ఈ ప్రక్రియతో దేశీయంగా దిగ్గజ ఆమ్నీచానల్ ఫార్మసీ డిస్ట్రిబ్యూషన్, డిజిటల్ హెల్త్ ప్లాట్ఫాం ఏర్పడుతుందని అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఇది 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 25,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలదని పేర్కొంది. స్కీము ప్రకారం కొత్త సంస్థ, స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్కు దరఖాస్తు చేసుకుంటుంది. ఏహెచ్ఈల్ షేర్హోల్డర్ల వద్ద ఉన్న ప్రతి 100 షేర్లకు గాను కొత్త కంపెనీకి చెందిన 195.2 షేర్లు లభిస్తాయి. అత్యంత నాణ్యమైన హెల్త్కేర్ సేవలను కోట్ల మందికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ మోడల్ ఉపయోగపడుతుందని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. -
అత్యంత కుబేరులున్న నగరాల జాబితా విడుదల
ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం అత్యధిక ధనవంతులు ఉన్న నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ నగరంలో 759 బిలియన్ డాలర్ల సంపదతో 123 మంది బిలియనీర్లు టాప్లో ఉన్నారు. 2021లో బీజింగ్ ఆధిక్యం సాధించడం మినహా గత 12 ఏళ్లుగా న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంటోంది. ఈ శత కోటీశ్వరుల్లో ఎక్కువ మంది ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాల్లో సేవలందిస్తున్నారు.నివేదికలోని వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 3,028 మంది బిలియనీర్లలో నాలుగో వంతు మంది ఆరు దేశాల్లోని కేవలం 10 నగరాల్లోనే నివసిస్తున్నారు. మెరుగైన బిజినెస్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కారణంగా ఈ నగరాలు సంపదను ఆకర్షిస్తూనే ఉన్నాయి.భారత్లో ముంబయి..మొత్తం మీద అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న టాప్ దేశాల్లో భారత్ లేనప్పటికీ, ముంబయి ఈ కేటగిరీలో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 349 బిలియన్ డాలర్ల సంపద కలిగిన 67 మంది బిలియనీర్లతో ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ, బెంగళూరు వంటి ఇతర ప్రధాన మెట్రో నగరాల కంటే అత్యంత సంపన్నులు కలిగిన భారతీయ నగరంగా నిలిచింది. అయితే ఈ ఏడాది ముంబయి స్థానం నాలుగు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది. ఇద్దరు బిలియనీర్లు ఇందులో నుంచి నిష్క్రమించడమే ఇందుకు కారణం.రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 92.5 బిలియన్ డాలర్ల సంపదతో ముంబయి, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. 2025లో ముంబైలో కొత్తగా ఆరుగురు బిలియనీర్లు చేరారు. వీరిలో నలుగురు దోషి కుటుంబానికి చెందినవారున్నారు. వీరేన్, కిరీట్, పంకజ్, హితేష్ దోషి వారి కంపెనీ ‘వారీ ఇండస్ట్రీస్’ గత ఏడాది అక్టోబర్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. దాంతో సంపద అమాంతం పెరిగిపోయింది.ఇదీ చదవండి: భారత్-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా? -
అమెజాన్లో అసలేం జరుగుతుందో చూస్తారా?
ఆన్లైన్లో కొనుగోలు చేసిన ఏ ఉత్పత్తయినా, విక్రేత దగ్గర్నుంచి మన ఇంటి వరకు చేరడం వెనుక బోలెడంత తతంగం ఉంటుంది. ఆ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, భారత్లోని తమ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్సీ) సందర్శించే అవకాశాన్ని కల్పించనుంది.ఈ ఏడాది నాలుగో త్రైమాసికం (క్యూ4) నుంచి ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరులోని తమ ఎఫ్సీల్లో ఉచిత టూర్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. నిత్యం లక్షల సంఖ్యలో ఉత్పత్తులను నిల్వ చేయడం, కస్టమర్ల ఆర్డర్ల ప్రాసెసింగ్, రవాణా మొదలైన ప్రక్రియలను ఈ సందర్భంగా ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఈ గైడెడ్ టూర్లు వారానికి మూడు సార్లు చొప్పున, ఒక్కోటి 45–60 నిమిషాల పాటు ఉంటాయి. ఒక్కో టూర్లో 20 మంది పాల్గొనవచ్చు.టోక్యోలో జరిగిన ’డెలివరింగ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో అమెజాన్ ఈ విషయాలు తెలిపింది. ఈ టూర్లపై ఆసక్తి గల వారు ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు త్వరలో వీలు కల్పించనున్నట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా–ఆ్రస్టేలియా ఆపరేషన్స్) అభినవ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అమెజాన్కు బెంగళూరులో 20 లక్షల ఘనపుటడుగుల స్టోరేజ్ స్పేస్తో అతి పెద్ద ఎఫ్సీ ఉంది.ఇక ఉత్తరాదిలోనే అతి పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్, ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంది. ఇది 4,50,000 చ.అ.ల్లో, సుమారు ఎనిమిది ఫుట్బాల్ మైదానాలంత పెద్దగా ఉంటుంది. 2014 నుంచి అంతర్జాతీయంగా అమెరికా, కెనడా, తదితర దేశాల్లోని 35 లొకేషన్లలో ఇరవై లక్షల మంది పైగా సందర్శకులు అమెజాన్ ఎఫ్సీలను సందర్శించారు. -
అనిల్ అంబానీ మరో భారీ అడుగు..
సుమారు రూ. 20,000 కోట్ల భారతీయ డిఫెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) మార్కెట్లో విస్తరణపై రిలయన్స్ డిఫెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన కోస్టల్ మెకానిక్స్తో చేతులు కలిపింది. భారతీయ సాయుధ బలగాలకు అవసరమైన ఎంఆర్వో, అప్గ్రేడ్, లైఫ్సైకిల్ సపోర్ట్ సొల్యూషన్స్ను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ మాతృ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది.100కు పైగా జాగ్వార్ ఫైటర్ విమానాలు, 100 పైచిలుకు మిగ్–29 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లు, అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు, ఎల్–70 ఎయిర్ డిఫెన్స్ గన్లు మొదలైన వాటి ఆధునీకరణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వివరించింది. డీల్ ప్రకారం భారత్తో పాటు ఎగుమతి మార్కెట్లలోని క్లయింట్లకు సేవలు అందించేందుకు రిలయన్స్ డిఫెన్స్, కోస్టల్ మెకానిక్స్ కలిసి మహారాష్ట్రలో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తాయి.దీనితో సాయుధ బలగాలు ఉపయోగించే గగనతల, భూతల డిఫెన్స్ ప్లాట్ఫాంల నిర్వహణ, అప్గ్రేడ్ సర్వీసులను అందించనున్నట్లు రిలయన్స్ ఇన్ఫ్రా పేర్కొంది. 1975లో ఏర్పాటైన కోస్టల్ మెకానిక్స్కు అమెరికా ఎయిర్ఫోర్స్, ఆరీ్మకి కీలక పరికరాలను సరఫరా చేస్తోంది. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ .58.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,665కు దిగొచ్చింది.అంతకుముందు జూన్లోనూ చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్లపై రూ .24 తగ్గింపును ప్రకటించాయి. దాంతో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ .1,723.50 గా ఉండేది. ఏప్రిల్లో దీని ధర రూ.1,762గా ఉంది. ఫిబ్రవరిలో స్వల్పంగా రూ.7 తగ్గగా, మార్చిలో రూ.6 పెరిగింది.19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.58.50 తగ్గించడం చిన్న వ్యాపారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులు తమ రోజువారీ కార్యకలాపాలకు ఈ గ్యాస్ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడతారు.అయితే, గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. సమీక్షకు పిలుపునిచ్చినప్పటికీ 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు ధృవీకరించాయి.నగరంకొత్త ధర (రూ.)మునుపటి ధర (రూ.)ఢిల్లీ1,6651,723.50ముంబై1,6161,674.50కోల్ కతా1,7691,826చెన్నై1,823.501,881బెంగళూరు1,796—నోయిడా1,747.50—హైదరాబాదు1,798.501,857 -
ఈ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఏయూ ఎస్ఎఫ్బీ) తెలిపింది. దీని ప్రకారం ఎల్ఐసీ టర్మ్ పాలసీలు, ఎండోమెంట్ ప్లాన్లు, హోల్ లైఫ్ పాలసీలు మొదలైన వాటిని తమ శాఖల్లో విక్రయించనున్నట్లు పేర్కొంది.21 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో తమకు 2,456 పైగా బ్యాంకింగ్ టచ్పాయింట్లు ఉన్నట్లు బ్యాంక్ ఈడీ ఉత్తమ్ టిబ్రెవాల్ తెలిపారు. ఈ ఒప్పందంతో ఓవైపు బ్యాంకింగ్, బీమా, దీర్ఘకాలిక ఆర్థిక ప్లానింగ్ సొల్యూషన్స్ అన్నింటినీ ఒకే దగ్గర అందించే సంస్థగా తమ బ్యాంక్ స్థానం పటిష్టమవుతుందని మరోవైపు గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఎల్ఐసీ పాలసీల విస్తృతి మరింతగా పెరుగుతుందని వివరించారు. బ్యాంకింగ్, భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను ఒకే ప్లాట్ఫామ్ కింద సమీకృతం చేస్తూ, పూర్తి-స్పెక్ట్రమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్గా మారడానికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సాగిస్తున్న ప్రయాణంలో ఈ సహకారం ఒక మైలురాయిని సూచిస్తుంది. ఎల్ఐసీకి కూడా ఈ భాగస్వామ్యం విశ్వసనీయమైన, కస్టమర్-సెంట్రిక్ బ్యాంకింగ్ భాగస్వామి ద్వారా విస్తృత పరిధిని అందిస్తుంది.సంజయ్ అగర్వాల్ 1996లో స్థాపించిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భారతదేశంలో అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుగా పనిచేస్తుంది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ 1.13 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించింది. బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ .1.57 లక్షల కోట్లు. 'ఎఎ /స్టేబుల్' క్రెడిట్ రేటింగ్ ఈ బ్యాంకుకు ఉంది. -
పెరిగిన రైలు ఛార్జీలు..
దేశవ్యాప్తంగా రైలు ఛార్జీలు జూలై 1 నుంచి పెరుగుతున్నాయి. ఈ మేరకు సుదూర రైళ్లలో జూలై 1 నుంచి రైలు ఛార్జీలు పెంచనున్నట్లు భారతీయ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే బోర్డు నోటిఫికేషన్ ప్రకారం కిలోమీటర్కు గరిష్టంగా 2 పైసలు చొప్పున ఛార్జీల పెంపు ఉంటుంది. నాన్ ఏసీ బోగీల్లో కిలోమీటర్కు ఒక పైసా, ఏసీ బోగీల్లో కిలోమీటర్కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. సబర్బన్ రైళ్లు, 500 కిలోమీటర్ల వరకు సాధారణ సెకండ్ క్లాస్ ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.రైలు ఛార్జీలు ఎంత పెరుగుతాయంటే..రైలు రకం ఛార్జీల పెంపు..సెకండ్ క్లాస్ ఆర్డినరీ501-1500 కిలోమీటర్లకు రూ.5 పెంపుసెకండ్ క్లాస్ ఆర్డినరీ1501-2500 కిలోమీటర్లకు రూ.10 పెంపుసెకండ్ క్లాస్ ఆర్డినరీ2501-3000 కిలోమీటర్లకు రూ.15 పెంపుస్లీపర్ క్లాస్ జనరల్కిలో మీటరుకు అర పైసాఫస్ట్ క్లాస్ ఆర్డినరీకిలో మీటరుకు అర పైసాసెకండ్ క్లాస్ (మెయిల్/ఎక్స్ప్రెస్)కిలో మీటరుకు ఒక పైసాస్లీపర్ క్లాస్ (మెయిల్/ఎక్స్ప్రెస్)కిలో మీటరుకు ఒక పైసాఫస్ట్ క్లాస్ (మెయిల్/ఎక్స్ప్రెస్)కిలో మీటరుకు ఒక పైసాఎసి చైర్ కారుకిలో మీటరుకు రెండు పైసలుఎసి-3 టైర్/3ఈకిలో మీటరుకు రెండు పైసలుఏసీ-2 టైర్కిలో మీటరుకు రెండు పైసలుఏసీ ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏకిలో మీటరుకు రెండు పైసలురాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, ఏసీ విస్టాడోమ్ కోచ్, తదితర రైళ్లకు కూడా పైన పేర్కొన్న ప్రకారం ఛార్జీల పెంపు వర్తిస్తుంది. భారతీయ రైల్వే రైలు ఛార్జీలను పెంచడం 2022 తర్వాత ఇదే తొలిసారి. రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ సర్ఛార్జ్ వంటి ఇతర ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయని భారతీయ రైల్వే తెలిపింది. మంత్లీ సీజన్ టికెట్స్ , సబర్బన్ రైలు ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు.రిజర్వేషన్ చార్టుల్లో మార్పులు..రైలు ఛార్జీలను పెంచడంతో పాటు, సుదూర రైళ్ల రిజర్వేషన్ చార్ట్లను బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు సిద్ధం చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. గతంలో రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్టులు తయారు చేసేవారు.తత్కాల్ బుకింగ్స్ లో మార్పులు?తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ను రైల్వే శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ ధృవీకరణ పూర్తి చేసిన ప్రయాణికులు మాత్రమే జూలై 1 నుండి ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా జూలై నెలాఖరు నుంచి తత్కాల్ బుకింగ్స్ కోసం ఓటీపీ ఆధారిత అథెంటికేషన్ను కూడా అమలు చేయనున్నారు. -
గ్రీన్కోలో వాటా కొనుగోలు చేసిన ఏఎం గ్రీన్
హైదరాబాద్కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ ఏఎం గ్రీన్ బీవీ (ఏఎంజీ) తన అనుబంధ సంస్థ ఏఎంజీ పవర్ బీవీ ద్వారా ఓరిక్స్ కార్పొరేషన్ నుంచి గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్లో 17.5 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. 2025 జూలై ముగింపు తరువాత గ్రీన్కోలో ఏఎం గ్రీన్ సుమారు 25% వాటా కలిగి ఉంటుంది. 10 గిగావాట్ల కార్యాచరణ ఆస్తులున్న పునరుత్పాదక ఇంధన అగ్రగామి అయిన గ్రీన్కో 2030 నాటికి 100 గిగావాట్ల నిల్వ సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియా, ఎస్ఏఎఫ్, ఇతర సుస్థిర సాంకేతిక పరిజ్ఞానానికి దీర్ఘకాలిక బహిర్గతం కోసం ఏఎంజీ లక్స్ జారీ చేసిన కన్వర్టబుల్ నోట్స్లో ఓరిక్స్ కూడా పెట్టుబడులు పెట్టనుంది. కాకినాడలో ఏర్పాటు చేస్తున్న 1 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రం, యూనిపర్, యారా, చెంపోలిస్ టెక్నాలజీ ఆధారిత బయో2ఎక్స్ ప్లాట్ఫామ్ వంటి సంస్థలతో భాగస్వామ్యం డీకార్బనైజేషన్, గ్రీన్ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్కు గ్రీన్కో కట్టుబడి ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. ఏఎం గ్రీన్, గ్రీన్కో కలిసి ప్రపంచంలోని అత్యంత ఇంటిగ్రేటెడ్ పవర్-టు-ఎక్స్ వ్యవస్థలలో ఒకదానికి మార్గదర్శకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది ప్రపంచ ఇంధన పరివర్తనను వేగవంతం చేస్తుంది. -
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్.. ప్రయాణికులకు ఊరట!
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీల విషయంలో ప్రయాణికులకు ఊరట కలగనుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు లేదా క్యాన్సిల్ చేసినప్పుడు ప్రయాణికులకు ఛార్జీలను రీఫండ్ చేసేటప్పుడు కోత విధించే 'క్లరికేజ్' (క్లరికల్ ఛార్జీలు)ను తగ్గించడం లేదా మాఫీ చేసే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది.ప్రస్తుతం రిజర్వ్డ్ ఏసీ, నాన్ ఏసీ టికెట్లకు రూ.60, అన్రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ టికెట్లకు రూ.30 వాటిని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు క్లరికల్ ఛార్జీల కింద మినిహాయించుకుని మిగిలిన మొత్తం రీఫండ్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా క్యాన్సిల్ చేసిన టికెట్లతో సహా అన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నప్పుడూ ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.దీనిపై ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు సమాచారం. రైల్వే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటే టికెట్ క్యాన్సిల్చేసుకునే ప్రయాణికులకు ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ఉన్న ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇందులో వారి ప్రమేయం ఏ మాత్రం ఉండకపోయినా చార్జీలు పూర్తిగా రీఫండ్ కాకుండా క్లరికేజ్ రూపంలో రైల్వే కోత విధిస్తోంది.ఇటీవలి సంవత్సరాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు కౌంటర్ల నుండి కాకుండా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడంతో టికెటింగ్ కోసం రైల్వే నిర్వహణ ఖర్చులు తగ్గాయని, దీన్ని పరిగణనలోకి తీసుకొని ఛార్జీలను తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రైల్వే వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు రైల్వేకు చెందిన టికెటింగ్ అండ్ క్యాటరింగ్ విభాగమైన ఐఆర్టీసీ ఏసీ టికెట్లపై రూ.30, నాన్ ఏసీ టికెట్లపై రూ.15 కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తోంది. కానీ టికెట్ క్యాన్సిల్ అయినప్పుడు క్లరికేజ్ ఆదాయం మొత్తం రైల్వేకు వెళ్తోంది. -
అనంత్ అంబానీ జీతం ఎంతో తెలుసా..?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్)కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మే 1, 2025 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వేతన వివరాలను కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. మానవ వనరులు, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ (హెచ్ఆర్ఎన్ఆర్) కమిటీ వార్షిక సవరణలకు లోబడి ఆయన వేతనం ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది.అలవెన్స్లు ఇలా..బేస్ శాలరీ + ఇతర పరిహారం: ఏడాదికి రూ.10-20 కోట్లుప్రాఫిట్ లింక్డ్ కమిషన్: ఆర్ఐఎల్ వార్షిక నికర లాభం పనితీరుతో నేరుగా ముడిపడి ఉంటుంది.ఇతర బెనిఫిట్స్: వసతి లేదా ఇంటి అద్దె భత్యం చెల్లిస్తారు.యుటిలిటీ ఖర్చులు: గ్యాస్, విద్యుత్, వాటర్.. వంటి యుటిలిటీ ఖర్చులు సంస్థే భరిస్తోంది.అనంత్ అంబానీ, తనపై ఆధారపడిన కుటుంబానికి ప్రయాణ రాయితీలు కల్పిస్తుంది.జీవిత భాగస్వామి, సహాయకులతో సహా ప్రయాణం, భోజనం, వసతి కోసం పూర్తి కవరేజీ అందిస్తుంది.కంపెనీ అందించే వాహనాలు, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు అదనం.వ్యక్తిగత, కుటుంబ భద్రత కోసం సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేస్తుంది.ఇదీ చదవండి: దిగొస్తున్న బంగారం ధరలు.. పుత్తడి ప్రియుల్లో ఆశలుఇంతకీ ఆయన ఏం చేస్తారంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తును రూపొందించడంలో అనంత్ అంబానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. కంపెనీ ఎనర్జీ, సస్టెయినబిలిటీ విభాగాల్లో పని చేస్తున్నారు. మే 1, 2025 నాటికి అతను ఆర్ఐఎల్ బోర్డులో హోల్ టైమ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ఆయన భారీ స్థాయి ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణను ఆయన సమీక్షిస్తున్నారు. వినైల్ చెయిన్, స్పెషాలిటీ పాలిస్టర్లు, కొత్త ఎనర్జీ గిగాఫ్యాక్టరీలు, ఆయిల్ టు కెమికల్ (ఓ2సీ) ఆపరేషన్స్(క్రూడ్ సోర్సింగ్, రిఫైనరీ ఆపరేషన్స్..) వంటి విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలు, సర్క్యులర్ మెటీరియల్స్ వ్యాపారాల వైపు ఆర్ఐఎల్ను ఆయన నడిపిస్తున్నారు. రిలయన్స్ 2035 నాటికి నెట్ కార్బన్ జీరో కంపెనీగా మారడానికి ప్రయత్నిస్తోంది. -
ఐఓసీని వెనక్కి నెట్టి రిలయన్స్ దేశంలోనే నం.1..?
డైవర్సిఫైడ్ దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్.. రష్యా చమురు దిగ్గజం పీజేఎస్సీ రాస్నెఫ్ట్ ఆయిల్ కంపెనీ మధ్య డీల్ కుదరనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రాస్నెఫ్ట్ దేశీ యూనిట్ నయారా ఎనర్జీలో 49.13 శాతం వాటాను రిలయన్స్కు విక్రయించనుంది. దేశీయంగా నయారా ఎనర్జీ 20 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల చమురు రిఫైనరీతోపాటు.. 6,750 పెట్రోల్ పంపులను నిర్వహిస్తోంది. నయారా కొనుగోలుకి రాస్నెఫ్ట్తో రిలయన్స్ ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలుఈ కొనుగోలు పూర్తయితే చమురు రంగ పీఎస్యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)ను వెనక్కి నెట్టి అతిపెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. అటు చమురు శుద్ధిసహా ఇటు పెట్రోల్ బంకుల నిర్వహణలో నంబర్ వన్ ర్యాంకును పొందనుంది. అయితే తొలి దశ చర్చలు మాత్రమే జరుగుతున్న నేపథ్యంలో డీల్పై అంచనాలకు రాలేమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై రెండు సంస్థల నుంచి తగిన సమాచారం లభించలేనట్లు తెలియజేశాయి. 2017లో రాస్నెఫ్ట్.. 12.9 బిలియన్ డాలర్లకు ఎస్సార్ ఆయిల్ను కొనుగోలు చేసింది. తదుపరి ఎస్సార్ ఆయిల్ పేరును నయారా ఎనర్జీగా మార్పు చేసింది. -
ఫార్మా రంగంలో రెండో పెద్ద కంపెనీగా టొరెంట్
దేశీయంగా ఔషధ రంగంలో మరో భారీ డీల్కు తెరలేచింది. ప్రయివేట్ రంగ దిగ్గజం టొరెంట్ ఫార్మాస్యూటికల్స్.. దేశీ కంపెనీ జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ను కొనుగోలు చేస్తోంది. తద్వారా దేశీ ఫార్మా రంగంలో రెండో పెద్ద కంపెనీగా అవతరించనుంది. జేబీ కెమ్ ప్రమోటర్ల నుంచి 46.39 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టొరెంట్ ఫార్మా పేర్కొంది. ఇందుకు మొత్తం రూ.19,500 కోట్లు వెచ్చించనుంది.ఈ డీల్లో భాగంగా తొలుత ప్రమోటర్, పీఈ దిగ్గజం కేకేఆర్ నుంచి 46.39% వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.11,917 కోట్లు చెల్లించనుంది. అంతేకాకుండా జేబీ కెమ్లో కొంతమంది ఉద్యోగుల నుంచి షేరుకి రూ.1,600 ధరలో 2.8 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనుంది. ఇందుకు రూ. 719 కోట్లు వెచ్చిస్తుంది. తద్వారా 49.19% వాటా చేజిక్కించుకోనుంది. ఆపై నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారులకు షేరుకి రూ. 1,639 ధరలో 26% వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. ఇందుకు దాదాపు రూ. 6,843 కోట్లు కేటాయించనుంది. శుక్రవారం ముగింపు ధర రూ.1,799తో పోలిస్తే ఓపెన్ ఆఫర్ ధర 9% తక్కువకావడం గమనార్హం! దేశీ ఫార్మా రంగంలో టొరెంట్ పార్మా, జేబీ కెమికల్స్ డీల్ రెండో పెద్ద లావాదేవీగా నమోదుకానుంది. ఇంతక్రితం 2015లో సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మరో దేశీ దిగ్గజం ర్యాన్బ్యాక్సీ ల్యాబొరేటరీస్ను కొనుగోలు చేసిన డీల్ అతిపెద్ద లావాదేవీగా నిలుస్తోంది.ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు100: 51 నిష్పత్తిలో: నియంత్రిత వాటా కొనుగోలు తదుపరి జేబీ కెమికల్స్ను టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ విలీనం చేసుకోనుంది. ఇందుకు 100: 51 విలీన నిష్పత్తిని సైతం టొరెంట్ ఫార్మా ప్రకటించింది. జేబీ కెమ్ వాటాదారుల వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 51 టొరెంట్ ఫార్మా షేర్లను కేటాయించనుంది. తాజా డీల్ కారణంగా క్రానిక్ విభాగంలో సుప్రసిద్ధ జేబీ కేమ్ బ్రాండ్లను టొరెంట్ పొందగలుగుతుంది. -
ఈ కంపెనీ ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక ఉండవ్..
జపాన్కు చెందిన ప్రముఖ అప్లయెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పానాసోనిక్ నుంచి ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు ఇక రావు. వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారతదేశంలోని రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి పానాసోనిక్ నిష్క్రమించింది. ఈ సెగ్మెంట్లు రెండూ భారత్లో పానాసోనిక్కు నష్టాల్లో ఉన్న వ్యాపారాలు. ఇక్కడ మార్కెట్లో స్థానం సంపాదించడానికి కష్టపడుతున్నాయి.మార్కెట్ రీసెర్చ్ సంస్థ జీఎఫ్కే గణాంకాల ప్రకారం.. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ విభాగాలలో పానాసోనిక్ చాలా తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. వాషింగ్ మెషీన్లలో దీని వాటా 1.8 శాతం, రిఫ్రిజిరేటర్లలో 0.8 శాతంగా ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో పానాసోనిక్ గత ఆరేళ్లుగా అమ్మకాల్లో నష్టాలను చవిచూస్తోంది.రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ విభాగాల నుండి నిష్క్రమిస్తున్నప్పటికీ డీలర్ల వద్ద ఇప్పటికే ఉన్న ఆయా ఉపకరణాల అమ్మకాలకు సహకరిస్తామని, విడిభాగాలు, వారంటీ కవరేజీతో సహా పూర్తి కస్టమర్ సేవను అందిస్తూనే ఉంటామని పానాసోనిక్ తెలిపింది.స్తబ్దత నుంచి బయటపడేందుకు, భవిష్యత్తులో బలమైన, పునరుద్ధరించిన వృద్ధి కోసం పానాసోనిక్ గ్రూప్ను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న వ్యాపారాల నుంచి నిష్క్రమించాలని యోచిస్తున్నట్లు ఈ ఏడాది మేలో పానాసోనిక్ గ్రూప్ సీఈఓ యుకీ కుసుమి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పానాసోనిక్ ఇండియా ఆదాయం సుమారు రూ .11,500 కోట్లు. -
94 ఏళ్ల వయసులో రూ.50వేల కోట్ల విరాళం..
విజయవంతమైన గొప్ప ఇన్వెస్టర్, సంపాదనలో తిరుగులేని శక్తి అని బెర్క్షైర్ హాత్వే సీఈఓ వారెన్ బఫెట్ గురించి గొప్పగా చెబుతారు. అయితే దాతృత్వంలోనూ తనకు సాటి లేరని చాటుతున్నారు బఫెట్. తాజాగా 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50 వేల కోట్లు) విలువైన కంపెనీ షేర్లను ఐదు ప్రధాన స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారాయన.ఇప్పుడు 94 ఏళ్ల బఫెట్ మొత్తం 9.43 మిలియన్ల బెర్క్షైర్ షేర్లను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్కు విరాళంగా ఇచ్చారు. తన దివంగత భార్య పేరు మీద ఉన్న సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్ కు 9,43,384 షేర్లను ఇచ్చారు. అంతేకాకుండా తన ముగ్గురు పిల్లల నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థలు హోవార్డ్ జి బఫెట్ ఫౌండేషన్, షెర్వుడ్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్లకు 6,60,366 షేర్లను విరాళంగా ఇచ్చారు.బఫెట్ ఇదివరకే ఇలాంటి భారీ విరాళాలను అందించారు. గత జూన్లో 5.3 బిలియన్ డాలర్లు, అంతకు ముందు నవంబర్లో 1.14 బిలియన్ డాలర్లు విరాళమిచ్చారు. ఈ తాజా విరాళం తర్వాత కూడా బఫెట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. విరాళానికి ముందు ఆయన నికర సంపద (అంచనా) 152 బిలియన్ డాలర్. ఫోర్బ్స్ ప్రకారం బఫెట్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ విరాళం తర్వాత ఆరో స్థానానికి తగ్గే అవకాశం ఉంది. విరాళాలు ఇస్తున్నప్పటికీ, ఆయన ఇప్పటికీ బెర్క్షైర్ హాత్వేలో 13.8% వాటాను కలిగి ఉన్నారు. తన వాటాలను విక్రయించే యోచన లేదని బఫెట్ ఇదివరకే పేర్కొన్నారు.వారెన్ బఫెట్ 1965 నుండి బెర్క్షైర్ హాత్వేకు నాయకత్వం వహిస్తున్నారు. దానిని ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన సంస్థలలో ఒకటిగా మార్చారు. తెలివైన పెట్టుబడి సలహాలకు ప్రసిద్ది చెందిన బఫెట్ కొటేషన్లలో "అద్భుతమైన ధరతో మామూలు కంపెనీని కొనడం కంటే అద్భుతమైన కంపెనీని మామూలు ధరకు కొనడం గొప్ప" అనే ప్రసిద్ధమైంది. తన సంపద ఎలా వినియోగించాలన్నది కూడా బఫెట్ ముందే ప్లాన్ చేసుకున్నారు. తాను మరణించిన తర్వాత మిగిలిన సంపదలో 99.5 శాతాన్ని కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సంస్థలకు అందేలా గత ఏడాది తన వీలునామాను అప్డేట్ చేశారు. -
బంగారం భారీ రేట్లు.. డిమాండ్లో మార్పులు
బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో వివిధ సెగ్మెంట్లలో డిమాండ్లో మార్పులు కనిపించవచ్చని బ్రాండెడ్ ఆభరణాల తయారీ దిగ్గజం టైటాన్ తమ 2024–25 వార్షిక నివేదికలో పేర్కొంది. భౌగోళిక–రాజకీయ అంశాలు, స్థూల ఆర్థిక అనిశ్చితుల వల్ల పసిడి రేట్లు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని వివరించింది.రిటైల్ విస్తరణ, కొత్త కలెక్షన్లు, మార్కెటింగ్పై మరింతగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యతనివ్వడాన్ని కొనసాగిస్తామని టైటాన్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి రేట్లు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ జ్యవెలరీ డివిజన్ ఆరోగ్యకరంగా 20 శాతం, సేమ్–స్టోర్ అమ్మకాల వృద్ధి 14 శాతం మేర నమోదైందని వివరించింది. తనిష్క్ సబ్–బ్రాండ్ అయిన మీయా రూ. 1,000 కోట్ల మార్కును దాటగా, క్యారట్లెన్ విభాగం ఆదాయం 30 శాతం పెరిగిందని పేర్కొంది. -
ఐపీవో స్ట్రీట్ ...లిస్టింగ్కు కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తుండటంతో గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు క్యూ కడుతున్నాయి. వచ్చే వారం పలు దిగ్గజాలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానుండగా.. మరిన్ని కంపెనీలు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.. రూ. 5,000 కోట్లకు రెడీ గత డిసెంబర్లో గోప్యతా విధాన పబ్లిక్ ఇష్యూ బాట పట్టిన విద్యా సంబంధ రుణాలందించే క్రెడిలా ఫిన్ సర్వీసెస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ డాక్యుమెంట్లు అందించింది. గత నెలలో అనుమతి పొందిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధపడుతోంది. ఇష్యూలో భాగంగా రూ. 3,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 1,050 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 600 కోట్ల సమీకరణపై కంపెనీ కన్నేసింది. దీంతో ఐపీవోలో ఇష్యూ పరిమాణం ఆ మేర తగ్గే అవకాశముంది. 2006లో ఏర్పాటైన కంపెనీ నిధులను భవిష్యత్లో బిజినెస్ వృద్ధికి అవసరమయ్యే మూలధన పటిష్టతకు వినియోగించనుంది. విద్యా సంబంధ రుణాలపై అధికంగా దృష్టిసారించే ఎన్బీఎఫ్సీలో హెచ్డీఎఫ్సీ 2009లో ఇన్వెస్ట్ చేసింది. 2010 నుంచి హెచ్డీఎఫ్సీకి అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోంది. అయితే 2023లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో మాతృ సంస్థ విలీనంకావడంతో ఈక్యూటీ, క్రిస్క్యాపిటల్ గ్రూప్లు ఉమ్మడిగా 2024 మార్చిలో 90 శాతం వాటాను కొనుగోలు చేశాయి. రూ. 1,500 కోట్లకు సై పునరుత్పాక ఇంధన రంగంలో కార్యకలాపాలు కలిగిన రేజన్ సోలార్ స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్కు వీలుగా సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా గుజరాత్ కంపెనీ రూ. 1,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా రూ. 300 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇది జరిగితే ఐపీవో పరిమాణం తగ్గనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 1,265 కోట్లు సొంత అనుబంధ సంస్థ రేజన్ ఎనర్జీపై వెచి్చంచనుంది. తద్వారా 3.5 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఏర్పాటవుతున్న సంస్థకు ఆర్థికంగా దన్నునివ్వనుంది. సోలార్ ఫొటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీలో కార్యకలాపాలు విస్తరించిన రేజన్ సోలార్ 2017లో ప్రారంభమైంది. 2025 మార్చికల్లా 6 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా, కేపీఐ గ్రీన్ ఎనర్జీ, మైక్రోటెక్ ఇంటర్నేషనల్, అక్మే క్లీన్టెక్ సొల్యూషన్స్, వీగార్డ్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీలకు సేవలందిస్తోంది. గతేడాది (కేలండర్ 2024)లో రూ. 1,957 కోట్ల ఆదాయం, రూ. 239 కోట్ల నికర లాభం ఆర్జించింది. వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ హోమ్ అండ్ ఫరీ్నíÙంగ్స్ కంపెనీ వేక్ఫిట్ ఇన్నోవేషన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో రూ. 468 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా 5.84 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 2016లో ఏర్పాటైన కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 145 కోట్లు ప్రస్తుత స్టోర్ల లీజ్తోపాటు, లైసెన్స్ ఫీజు చెల్లింపులకు వినియోగించనుంది. మరో రూ. 82 కోట్లు 117 కోకో రెగ్యులర్ స్టోర్లతోపాటు ఒక జుంబో స్టోర్ ఏర్పాటుకు, రూ. 15 కోట్లు కొత్త పరికరాలు, మెషీనరీ కొనుగోలుకీ వెచి్చంచనుంది. ఈ బాటలో రూ. 108 కోట్లు మార్కెటింగ్, ఇతర వ్యయాలకు కేటాయించనుంది. 2023–24లో రూ. 986 కోట్లకుపైగా ఆదాయం సాధించింది. సుదీప్ ఫార్మా ఐపీవో బాట ఔషధ రంగ కంపెనీ సుదీప్ ఫార్మా పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా ప్రమోటర్లు 1,00,76,492 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 76 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. గుజరాత్లోని నందెసారి యూనిట్లో ఉత్పత్తికి వీలుగా మెషీనరీ కొనుగోలుకి నిధులు వినియోగించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. 1989లో ఏర్పాటైన వడోదర సంస్థ సుదీప్ ఫార్మా ప్రధానంగా ఫార్మాస్యూటికల్, ఫుడ్ అంట్ న్యూట్రిషన్లో కార్యకలాపాలు విస్తరించింది. కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ విభాగంలో 100 రకాల ప్రొడక్టులను రూపొందిస్తోంది. ఫార్మా, ఫుడ్, న్యూట్రిషన్ పరిశ్రమల్లో వీటిని వినియోగిస్తారు. వడోదరలోగల మూడు యూనిట్ల ద్వారా మొత్తం 65,579 మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ క్లయింట్ల జాబితాలో ఫార్మా రంగ దిగ్గజాలు ఫైజర్, ఇన్టాస్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, మెర్క్ గ్రూప్, క్యాడిలా ఫార్మా, మైక్రో ల్యాబ్స్తోపాటు ఫ్రెంచ్ దిగ్గజం గ్రూప్ దానోన్ చేరింది. గత క్యాలండర్ ఏడాది(2024)లో ఆదాయం రూ. 344 కోట్లను అధిగమించగా, దాదాపు రూ. 95 కోట్ల నికర లాభం ఆర్జించింది.రూ. 2,500 కోట్లపై చూపు దిగ్గజాలు టీపీజీ, ఫ్లిప్కార్ట్, మిరాయ్ అసెట్స్ తదితరాలకు పెట్టుబడులున్న ఈకామర్స్ కంపెనీ షాడోఫ్యాక్స్ వచ్చే వారం సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం తద్వారా రూ. 2,500 కోట్లవరకూ సమకూర్చుకునేందుకు ప్రణాళికలు వేసింది. ఇందుకు కొత్తగా ఈక్విటీ జారీతోపాటు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను సామర్థ్య విస్తరణ, వృద్ధి, నెట్వర్క్పై వినియోగించనుంది. 2015లో ఏర్పాటైన కంపెనీ ఫిబ్రవరిలో సుమారు రూ. 6,000 కోట్ల విలువలో నిధులను సమీకరించింది. -
ఉద్యోగాలు పెరగాలంటే.. ఎన్సీఏఈఆర్ కీలక సూచన
కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే రంగాల్లో ఉపాధిని పెంచేందుకు నైపుణ్య కల్పనపై పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక మేధో సంస్థ ఎన్సీఏఈఆర్ సూచించింది. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో, 2030 నాటికి 13 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. వివిధ రంగాల మధ్య అంతర్గత అనుసంధానత కల్పించడం ఉపాధి కల్పనపై ఎన్నో అంచల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.దీనివల్ల 200 శాతం మేర ఉపాధి అవకాశాలను పెంచొచ్చని సూచించింది. తయారీ రంగంలో కార్మికులపై ఆధారపడిన ఉత్పత్తి 44.1 శాతంగా ఉంటుందని.. సేవల్లో కార్మికుల ఆధారితమైనవి 54.2 శాతంగా ఉంటాయని వివరించింది. తయారీ, సేవల పరి మాణాన్ని పెంచడం ద్వారా ఈ రంగాల్లో కార్మికులకు మరింత ఉపాధి కల్పించొచ్చని సూచించింది. 2030 నాటికి భారత్లో 63% ఉద్యోగులకు నైపుణ్యాల పెంపు అవసరం ఉంటుందని అంచనా. పన్నులు తగ్గించాలి.. కార్మికులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం అధిక మూలధన వ్యయాలు చేయాలని, పన్నులు తగ్గించాలని ఎన్సీఏఈఆర్ నివేదిక సూచించింది. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అత్యుత్తమ ప్రమాణాలను అందిపుచ్చుకోవాలంటూ.. కార్మికులకు శిక్షణ, నైపుణ్య కల్పనపై జాతీయ ప్రమాణాల కార్యాచరణను అమలు చేయాలని పేర్కొంది. భారత్లో తయారీని పెంచేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎల్ఐ పథకాన్ని ప్రస్తావించింది. అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీని పెంచడంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి పెట్టిందంటూ.. ఇందుకు అధిక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.పీఎల్ఐ పథకం కింద ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్లో అధిక ఉపాధి అవకాశాల కల్పన జరిగినట్టు చెప్పింది. బడ్జెట్లో పీఎల్ఐకి చేసిన కేటాయింపులు, వాస్తవ ఉపాధి కల్పన సామర్థ్యం మధ్య అంతరం ఉన్నట్టు పేర్కొంది. కార్మికుల నైపుణ్యం పెంపునకు వీలుగా ఉత్పాదకత, నాణ్యత గణనీయంగా పెంచాల్సి ఉంటుందని తెలిపింది. సాఫ్ట్ స్కిల్స్, డిజిటల్ విజ్ఞానం, ఐసీటీ నైపుణ్యాలను శిక్షణ కార్యక్రమాల్లో భాగం చేయాలని ఈ నివేదిక సూచించింది. శిక్షణ నాణ్యత పెంచడం, సంఘటిత రంగంలో కార్మికుల సంఖ్యను ఇతోధికం చేయడం ద్వారా అధిక ఉపాధి కల్పన లక్ష్యాలను సాధించొచ్చని అభిప్రాయపడింది. -
హైదరాబాద్లో ఎన్హెచ్ఆర్డీ నెట్వర్క్ కార్యాలయం
హైదరాబాద్: నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీఎన్) హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో తన అత్యాధునిక కార్యాలయాన్ని శనివారం ప్రారంభించింది. ఇది దేశవ్యాప్తంగా మానవ వనరుల అభివృద్ధి విషయంలో మరింత ముందుకు వెళ్లడం, ఎక్స్లెన్స్, సృజనాత్మకత, సుస్థిరాభివృద్ధి దిశగా తన కృషిని చాటడంలో ఎన్హెచ్ఆర్డీఎన్ నిబద్ధతకు ఒక నిదర్శనం.నాయకత్వం, అభివృద్ధి, వృత్తిగత సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఇది ఒక కేంద్ర కార్యాలయంగా రూపొందుతుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం ప్రారంభించిన ఈ కలల ప్రాజెక్టు సూచిస్తోంది. అందరికీ ఉపయోగపడే ప్రాంతం, చర్చలకు ప్రోత్సాహం, నిరంతర అభ్యాసం, వివిధ రంగాల్లోని హెచ్ఆర్ నిపుణుల మధ్య పరస్పర విధానాల మార్పిడి లాంటి వాటన్నింటికీ ఇది ఒక చక్కటి వేదికగా నిలిచేలా అద్భుతంగా ఈ భవనాన్ని తీర్చిదిద్దారు.దేశంలో బలమైన మానవ పెట్టుబడి పునాది వేయడానికి తమ సమిష్టి కృషికి నిదర్శనంగా ఈ కొత్త కేంద్రం నిలుస్తుందని ఎన్హెచ్ఆర్డీఎన్ హైదరాబాద్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ విపుల్ సింగ్ అన్నారు. హెచ్ఆర్ వృత్తినిపుణులకు ఇది ఒక డైనమిక్ వ్యవస్థను అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మారుతున్న పని వాతావరణం నేపథ్యంలో ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పంచుకోవడం, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యంత కీలకమని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న హెచ్ఆర్ నిపుణులు వృత్తిపరంగా ఎదిగేందుకు తాము గణనీయంగా కృషిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ కొత్త భవనం వల్ల కలిగే విస్తృత ప్రభావం గురించి ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయాధ్యక్షుడు ప్రేమ్ సింగ్ ఇలా వివరించారు. "నైపుణ్యాలు, నాయకత్వాలను పోషించాలన్న ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయ నిబద్ధతను ఈ హైదరాబాద్ కార్యాలయ ప్రారంభం ప్రతిబింబిస్తుంది. హెచ్ఆర్ వృత్తి నిపుణులకు సాధికారత కల్పించడంలో ఈ కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. తద్వారా ఇది వివిధ సంస్థలను, దేశవ్యాప్తంగా సమాజాన్ని కూడా బలోపేతం చేస్తుంది" అని చెప్పారు.ఎన్హెచ్ఆర్డీఎన్ భవన ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్డీఎన్ మాజీ అధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు , ఇంకా పలువురు విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఫిజిక్స్వాలా డిజిటల్ యూనివర్సిటీ
గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో సీఎస్సీ అకాడమీతో (సీఎస్సీఏ)తో ఎడ్యుకేషన్ కంపెనీ ఫిజిక్స్వాలా చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది అక్రెడిటెడ్ ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రాంలు, సర్టిఫికేషన్లు అందిస్తుంది.బోధన కోసం కేంద్ర ఐటీ శాఖలో భాగమైన కామన్ సర్వీసెస్ సెంటర్లు (సీఎస్సీ) డిజిటల్ లెర్నింగ్ సెంటర్లుగా పని చేస్తాయి. అలాగే, ఫిజిక్స్వాలా సంస్థ ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానాల్లో కూడా అందిస్తుంది. సైబర్సెక్యూరిటీ, కృత్రిమ మేథ వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణనివ్వడం, సమిష్టిగా కోర్సులు .. సర్టిఫికెట్ ప్రోగ్రాంలను రూపొందించడం మొదలైనవి ఈ భాగస్వామ్య లక్ష్యంగా ఉంటాయి. -
పాలు అమ్మాడు.. రూ.పదివేల కోట్లు సంపాదించాడు
పేదరికంలో పుట్టిన ఓ బాలుడు ముక్కపచ్చలారని వయసులో ఉదయాన్నే లేచి పాలు పోసి గడియారం తొమ్మిది కొట్టిందటే ఠంచనుగా బ్యాగ్ భుజాన వేసుకొని స్కూల్ వెళ్లి చదుకునేవాడు. తాను ఉంటున్న ప్రాంతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా దాదాపు రోజూ 7-8 కిలోమీటర్ల దూరం నడిచేవాడు. పండగల తోటి స్నేహితులు సరదాగా గుడుపుతుంటే తాను మాత్రం బాణసంచా విక్రయిస్తూ కుటుంబ పోషణలో భాగమయ్యేవాడు. విధి తన కష్టాలను గుర్తించింది. ఓ అవకాశం కల్పించింది. దాంతో ప్రస్తుతం తాను దాదాపు రూ.10,790 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు.రిజ్వాన్ సాజన్ ముంబయిలోని ఘట్కోపర్లో పేద కుటుంబంలో జన్మించారు. ఓ స్టీల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న తన తండ్రి నెలకు రూ.7,000 సంపాదించేవాడు. రిజ్వాన్ తండ్రికి నలుగురు సంతానం. కుటుంబ పోషణకు ఆయన సంపాదన ఏమాత్రమూ సరిపోయేది కాదు. ఎలాగోలా నెట్టుకొచ్చేవారు. ఉన్నట్టుండి కుటుంబ పెద్ద, రిజ్వాన్ తండ్రి అకాల మరణం చెందారు. ఆ సమయంలో రిజ్వాన్కు ఏమి పాలుపోలేదు. కుంటుంబ భారం అంతా తనపై పడింది. ఏదోఒక పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. తాను ఉంటున్న ప్రాంతంలో పాలు పోయడం ప్రారంభించాడు. నిత్యం 7 నుంచి 8 కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణించేవాడు. స్కూల్ ఫీజు కట్టలేక మధ్యలోనే బడి మానేశాడు. పండగ రోజుల్లో వీధుల్లో బాణసంచా విక్రయించేవాడు.మేనమామ సాయం1981లో తన మేనమామ సాయంతో రిజ్వాన్ పని కోసం కువైట్ వెళ్లారు. అక్కడ ఒక సాధారణ భవన నిర్మాణ సామగ్రి దుకాణంలో ట్రయినీ సేల్స్ మ్యాన్గా చేరారు. నెలకు అప్పటి లెక్కల ప్రకారం..రూ.18,000 వచ్చేవి. క్రమంగా ఉద్యోగంలో ఎదుగుతూ ఒక దశాబ్దంలో సేల్స్ మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. కానీ విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 1990లో గల్ఫ్ యుద్ధం కారణంగా కువైట్ నుంచి రావాల్సిన పరిస్థితి ఎదురైంది.దుబాయ్లో..కువైట్ నుంచి దుబాయ్ వచ్చిన రిజ్వాన్ ఒక బ్రోకరేజ్ సంస్థలో చేరారు. నిర్మాణ సామగ్రిలో నిరుపయోగం అవుతున్న కొన్ని వస్తువులకు సంబంధించిన అంశాలను గుర్తించారు. 1993లో కొంత పెట్టుబడితో సొంతంగా డాన్యూబ్ పేరుగో రియిల్ఎస్టేట్ వెంచర్ను స్థాపించారు. క్రమంగా ఎదిగి దాన్ని 1.3 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,790 కోట్లు) వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ఈ కంపెనీ కింది రంగాల్లో సేవలందిస్తోంది.బిల్డింగ్ మెటీరియల్స్రియల్ ఎస్టేట్, లగ్జరీ టవర్స్హోమ్ అలంకరణమిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుఇదీ చదవండి: వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్దాతృత్వ కార్యక్రమాలురిజ్వాన్ సాజన్ దాతృత్వ కార్యక్రమాల్లోనూ ముందుంటున్నారు. డాన్యూబ్ వెల్ఫేర్ సెంటర్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, మెంటల్ కౌన్సెలింగ్, ఆర్థిక అక్షరాస్యత వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. భారత్, యూఏఈల్లోని నిరుపేద పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నారు. పాఠశాలల మౌలికసదుపాయాలకు నిధులు సమకూరుస్తున్నారు. అల్పాదాయ కుటుంబాలకు ముఖ్యంగా క్రిటికల్ ఇల్నెస్ ఉన్న పిల్లలకు వైద్య చికిత్సలకు సాయం చేస్తున్నారు. -
వడ్డీరేట్లు సవరించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) వడ్డీ రేట్లను మరోసారి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 25, 2025 నుంచి బ్యాంక్ రూ.3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై సింగిల్ ఎఫ్డీ కాలపరిమితిపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. 2025 జూన్ 10న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించింది. అందుకు అనుగుణంగా బ్యాంకు కూడా తన కస్టమర్లకు వడ్డీ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఏ ఎఫ్డీ ప్రభావితం అవుతుందంటే..హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 నెలల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై వడ్డీ రేటును 18 నెలలకు తగ్గించింది. గతంలో ఈ రేటు సాధారణ కస్టమర్లకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతంగా ఉండేది. ఇప్పుడు సాధారణ కస్టమర్లకు 6.35 శాతం, సీనియర్లకు 6.85 శాతంగా ఉంది. బ్యాంక్ సాధారణ ప్రజలకు (18 నెలల నుంచి 21 నెలల కంటే తక్కువ కాలపరిమితి ఉంటే) 2.75% నుంచి 6.60% వరకు, సీనియర్ సిటిజన్లకు రూ .3 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు 3.25% నుంచి 7.10% వరకు ఎఫ్డీ రేట్లను అందిస్తుంది.ముందస్తు ఉపసంహరణకు జరిమానాఎఫ్డీని ముందుగా నిర్ణయించిన కాలపరిమితి కంటే ముందుగానే విత్డ్రా చేస్తే బ్యాంక్ జరిమానా వసూలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిబంధనల ప్రకారం మెచ్యూరిటీకి ముందే ఎఫ్డీని ఉపసంహరించుకుంటే మీ డబ్బు బ్యాంకులో ఉన్న కాలానికి వర్తించే రేటు కంటే 1% తక్కువగా పొందుతారు.ఇదీ చదవండి: విదేశీ వర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ జట్టుసేవింగ్స్ ఖాతా రేట్లు ఇలా..ఎఫ్డీ రేటు తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును తగ్గించింది. జూన్ 24, 2025 నుంచి పొదుపు రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గింది. అంటే అన్ని సంవత్సరానికి 2.75% నుంచి 2.50%కి వడ్డీరేట్లను చేర్చింది. పొదుపు ఖాతా వడ్డీని రోజువారీగా లెక్కించి ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు.రికరింగ్ డిపాజిట్లపై ఇలా..బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) వడ్డీ రేట్లు డిపాజిట్ వ్యవధిని బట్టి సాధారణ కస్టమర్లకు 4.25% నుంచి 6.60%, సీనియర్ సిటిజన్లకు 4.75% నుంచి 7.10% మధ్య ఉంటాయి. ఈ రేట్లు 2025 జూన్ 10 నుంచి అమల్లో ఉన్నాయి. -
విదేశీ వర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ జట్టు
తక్కువ ఫీజుతో విదేశాల్లో వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చే దిశగా ఉజ్బెకిస్తాన్కి చెందిన జార్మెడ్ యూనివర్సిటీతో అపోలో మెడ్స్కిల్స్ చేతులు కలిపింది. దీనితో ట్యూషన్ ఫీజు, హాస్టల్, ఆహారం మొదలైనవన్నీ కలిపి రూ.32 లక్షలకి ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సును చదివే వీలుంటుందని అపోలో మెడ్స్కిల్స్ సీఈవో శ్రీనివాస రావు పులిజాల శుక్రవారమిక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు.ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లోనూ డిజిటల్ చెల్లింపులుఈ భాగస్వామ్య ఒప్పందం కింద మన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణమైన పాఠ్యాంశాలను, ఇంగ్లీషులో బోధించేలా భారతీయ అధ్యాపకులను అపోలో మెడ్స్కిల్స్ సమకూరుస్తుంది. అలాగే అక్కడ విద్యాభ్యాసం తర్వాత, భారత్లో లేదా అమెరికా, బ్రిటన్లో లైసెన్సింగ్ పరీక్షల కోసం కూడా శిక్షణ కల్పిస్తున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. డాక్టర్ చదువు కోసం ఏటా లక్ష మంది వరకు విద్యార్థులు విదేశాల బాట పడుతున్న నేపథ్యంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
అదానీ గ్రూప్ విలువ జూమ్..
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా అదానీ గ్రూప్ నిల్చింది. 2025కి గాను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ రిపోర్టు ప్రకారం అదానీ బ్రాండ్ విలువ 2024లో 3.55 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజాగా 2.91 బిలియన్ డాలర్లు పెరిగి 6.46 బిలియన్ డాలర్లకు ఎగిసింది. ఓవరాల్గా గతేడాది 16వ స్థానంలో ఉండగా ఈసారి 13వ ర్యాంకుకు చేరింది. 82 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో అదానీ గ్రూప్ అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ బ్రాండుగా నిల్చిందని రిపోర్ట్ పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. → ఇండియా 100 జాబితాలోని మొత్తం సంస్థల బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లు.→ అత్యంత విలువైన భారతీయ బ్రాండుగా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానంలో నిల్చింది. బ్రాండ్ విలువ 10 శాతం వృద్ధి చెంది 31.6 బిలియన్ డాలర్లకు చేరింది. → 15 శాతం బ్రాండ్ విలువ (16.3 బిలియన్ డాలర్లు) వృద్ధితో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ జాబితాలో అత్యంత విలువైన రెండో భారతీయ బ్రాండుగా నిల్చింది.→ హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ 14.2 బిలియన్ డాలర్లకు చేరడంతో ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో నిల్చింది. ఎల్ఐసీ (13.6 బిలియన్ డాలర్లు) నాలుగో ర్యాంకు, హెచ్సీఎల్టెక్ (బ్రాండ్ విలువ 17 శాతం అప్, 8.9 బిలియన్ డాలర్లు) ఒక ర్యాంకు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరింది. ఎల్అండ్టీ గ్రూప్ (7.4 బిలియన్ డాలర్లు) తొమ్మిదో స్థానంలో, మహీంద్రా గ్రూప్ (7.2 బిలియన్ డాలర్లు) 10వ స్థానంలో నిల్చాయి. → అత్యంత పటిష్టమైన భారతీయ బ్రాండుగా తాజ్ హోటల్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని కాపాడుకుంది. -
జేఎస్డబ్ల్యూ పెయింట్స్ చేతికి డ్యూలక్స్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దేశీ గ్రూప్ జేఎస్డబ్ల్యూ తాజాగా డచ్ పెయింట్ల దేశీ దిగ్గజం అక్సో నోబెల్ ఇండియాను సొంతం చేసుకోనుంది. సజ్జన్ జిందాల్ గ్రూప్ కంపెనీ జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఇందుకు డ్యూలక్స్ బ్రాండ్ మాతృ సంస్థ అక్సో నోబెల్ ఎన్వీతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా అక్సో నోబెల్ ఇండియాలో 74.76% వాటా కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ. 8,986 కోట్లుకాగా.. అక్సో నోబెల్ దేశీయంగా లిస్టెడ్ కంపెనీకావడంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 25 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. ఇందుకు షేరుకి రూ. 3,417.77 ధరలో మరో రూ. 3,929 కోట్లు వెచి్చంచనుంది. వెరసి డ్యూలక్స్ పెయింట్ల బిజినెస్ను రూ. 12,915 కోట్లకు చేజిక్కించుకోనుంది. 2019లోనే పెయింట్ల బిజినెస్లోకి ప్రవేశించిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ తాజా కొనుగోలుతో దేశీయంగా పెయింట్ల రంగంలో నాలుగో పెద్ద కంపెనీగా అవతరించనుంది. ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్తో పాటు, కన్సాయ్ నెరోలాక్ తొలి మూడు ర్యాంకులలో నిలుస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశీ సంస్థ చేతిలో ఉన్న లిక్విడ్ పెయింట్స్, కోటింగ్స్ విభాగం జేఎస్డబ్ల్యూ సొంతం కానుండగా.. పౌడర్ కోటింగ్స్ బిజినెస్, ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ మాత్రం పూర్తిస్థాయిలో అక్సో నోబెల్ చేతిలో మిగలనున్నాయి. ఈ అంశాన్ని డచ్ దిగ్గజం అక్సో నోబెల్ వెల్లడించింది. పోటీ తీవ్రతరం పెయింట్ల రంగంలో ఇప్పటికే దేశీయంగా ఏషియన్, బెర్జర్ పెయింట్స్సహా.. కన్సాయ్ నెరోలాక్, అక్సో నోబెల్, ఇండిగో, షాలిమార్, నిప్పన్ కార్యకలాపాలు విస్తరించగా.. గత 5–6 ఏళ్లలో మరిన్ని కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. జేఎస్డబ్ల్యూ పెయింట్స్తోపాటు.. ఒపస్ బ్రాండుతో ఆదిత్య బిర్లా గ్రూప్, పిడిలైట్(హరీషా), ఆస్ట్రల్ పైప్స్(జెమ్), జేకే సిమెంట్స్(ఆక్రో) సైతం పోటీకి సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్సో నోబెల్ ఇండియా విక్రయం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశీ డెకొరేటివ్ బిజినెస్లో ప్రధానంగా పోటీ తీవ్రతరమవుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏబీ గ్రూప్ రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో ఒపస్ను తీసుకువచి్చన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. పెయింట్లు, కోటింగ్స్ బిజినెస్ దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్నట్లు జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఎండీ పార్ధ్ జిందాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలలో జేఎస్డబ్ల్యూ ఒకటని తెలియజేశారు. షేరు తీరిలా...తాజా వార్తల నేపథ్యంలో అక్సో నోబెల్ ఇండియా షేరు బీఎస్ఈలో 7 శాతం జంప్చేసి రూ. 3,415 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,533 వద్ద గరిష్టాన్ని తాకింది. 2025లో డీల్స్ జోరు.. జేఎస్డబ్ల్యూ పెయింట్స్, డ్యూలక్స్ డీల్ 2025లో నమోదైన అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలవనుంది. గత నెలలో జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్ప్ రూ. 13,483 కోట్లకు దేశీ సంస్థ యస్ బ్యాంక్లో 20 శాతం వాటాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతక్రితం మార్చిలో బజాజ్ అలియెంజ్ లైఫ్తోపాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో జర్మన్ భాగస్వామి అలియెంజ్కున్న 26 శాతం వాటాను బజాజ్ గ్రూప్(బజాజ్ ఫిన్సర్వ్) మొత్తం రూ. 24,180 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది అతిపెద్ద డీల్కాగా.. ఈ ఫిబ్రవరిలో అయానా రెన్యువబుల్ పవర్ కొనుగోలుకి రూ. 19,500 కోట్ల ఓఎన్జీసీ, ఎన్టీపీసీ గ్రీన్ డీల్ రెండో ర్యాంకులో నిలుస్తోంది. హల్దీరామ్స్లో 10 శాతం వాటా కొనుగోలుకి సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమాసెక్ ఈ మార్చిలో రూ. 8,600 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటితో పోలిస్తే జేఎస్డబ్ల్యూ పెయింట్స్– అక్సో నోబెల్ డీల్ ఈ ఏడాది నమోదైన అతి పెద్ద డీల్స్లో ఒకటిగా నిలవనుంది. -
బ్యాంకు సెలవులు.. జూలైలో ఇదిగో ఈ రోజుల్లోనే..
ప్రాంతీయ సెలవులు, వారాంతపు మూసివేతల కారణంగా 2025 జూలైలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన క్యాలెండర్ ప్రకారం సెలవుల జాబితాను విడుదల చేసింది. జూలైలో దేశవ్యాప్త ప్రభుత్వ సెలవులు లేవు. అయితే అన్ని ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలతో పాటు కొన్ని రాష్ట్రాలకు సెలవులు ఉంటాయి.బ్యాంకుల సెలవుల జాబితా ప్రతి నెలా భిన్నంగా ఉంటుంది. వివిధ ప్రాంతాలను బట్టి ఆర్బీఐ ఈ జాబితాను జారీ చేస్తుంది. మీకు కూడా వచ్చే నెలలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, సెలవుల జాబితాను చూసి మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. జూలైలో ప్రాంతీయ పండుగలు, సందర్భాల కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు వేర్వేరు రోజులు సెలవులు ఉంటాయి. రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ఈ సెలవులు మారుతూ ఉంటాయి.జూలైలో బ్యాంకు సెలవులుజూలై 3 (గురువారం) - త్రిపురలోని అగర్తలాలో ఖర్చి పూజజూలై 5 (శనివారం) - జమ్మూ కశ్మీర్ లో గురు హరోబింద్ జీ జయంతిజూలై 6 - ఆదివారంజూలై 12 - రెండో శనివారంజూలై 13- ఆదివారంజూలై 14 (సోమవారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో బెహ్ దేంఖ్లామ్ ఫెస్టివల్జూలై 16 (బుధవారం) - ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో హరేలా ఫెస్టివల్జూలై 17 (గురువారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో యు తిరోత్ సింగ్ వర్ధంతిజూలై 19 (శనివారం) - త్రిపురలోని అగర్తలాలో కేర్ పూజజూలై 20 - ఆదివారంజూలై 26 - నాలుగో శనివారంజూలై 27 - ఆదివారంజూలై 28 (సోమవారం) - సిక్కింలోని గ్యాంగ్టక్లో ద్రుక్పా త్షె-జీఈ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. ఆ రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు తెరిచే ఉంటాయి. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అన్ని సెలవు దినాల్లోనూ కొనసాగుతాయి. అయితే చెక్ క్లియరెన్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీల్లో స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉంది. -
ఒక్క రూపాయి క్యాండీ.. రూ.750 కోట్ల బ్రాండ్..
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ క్యాండీ ఉత్పత్తి ’పల్స్’ రూ. 1,000 కోట్ల బ్రాండుగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు దేశీ ఎఫ్ఎంసీజీ సంస్థ ధరమ్పాల్ సత్యపాల్ గ్రూప్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఒక్కోటి రూ. 1 ఖరీదు చేసే ఈ క్యాండీలు గత ఆర్థిక సంవత్సరంలో 750 కోట్ల యూనిట్లు అమ్ముడవడం ద్వారా రూ. 750 కోట్ల అమ్మకాల మార్కును సాధించినట్లు వివరించారు.హార్డ్–బాయిల్డ్ క్యాండీ విభాగంలో 19 శాతం మార్కెట్ వాటాతో తాము అగ్రగామిగా ఉన్నామని, గత మూడళ్లుగా ఏటా 15% వృద్ధి సాధిస్తున్నా మని కుమార్ చెప్పారు. దేశీయంగా ఈ మార్కెట్ పరిమాణం సుమారు రూ. 4,000 కోట్లుగా ఉంది. 2015లో పల్స్ క్యాండీని ప్రవేశపెట్టారు. ఈ ఉత్పత్తి దాని ప్రారంభ రోజుల్లో సోషల్ మీడియా బజ్, యూజర్-జనరేటెడ్ కంటెంట్ నుండి కూడా ప్రయోజనం పొందిందని కంపెనీ పేర్కొంది. సెలబ్రిటీ పోస్టులు, వైరల్ యూజర్ రివ్యూలు పల్స్ క్యాండీ తక్కువ మార్కెటింగ్ ఖర్చుతో కల్ట్ హోదాను సాధించడానికి సహాయపడ్డాయి. దీంతో అనతి కాలంలోనే డీఎస్ గ్రూప్ పల్స్ లైనప్ ను విస్తరించింది. లాంచ్ అయినప్పటి నుండి సుమారు 5,000 కోట్ల పల్స్ క్యాండీలు అమ్ముడయ్యాయి. ప్రారంభంలో కచ్చా ఆమ్ (పచ్చి మామిడి) ఫ్లేవర్ క్యాండీలు ఉండగా జామ, ఆరెంజ్, పైనాపిల్, లిచీ వేరియంట్లు తర్వాత వచ్చాయి. -
సిబిల్ సరిగా లేదని ఎస్బీఐ ఉద్యోగం రద్దు
సిబిల్ స్కోర్ సరిగాలేని కారణంగా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టులో ఉన్న ఓ అభ్యర్థి నియామకాన్ని రద్దు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు సమర్థించింది. నియామకానికి సంబంధించిన అన్ని పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ అభ్యర్థి గతంలో చేసిన క్రమరహిత చెల్లింపులు, సిబిల్ స్కోర్ను పరిగణించి రిక్రూట్మెంట్ రద్దు చేశారు.ఎస్బీఐ తన నియామకాన్ని రద్దు చేసినందుకు మాద్రాస్ హైకోర్టులో ఆ అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశాడు. దాన్ని పరిశీలించిన మద్రాస్ హైకోర్లు ఎస్బీఐ చర్యలను సమర్థించింది. నియామక నోటిఫికేషన్లో స్పష్టంగా సిబిల్ స్కోర్, గత ఆర్థిక లావాదేవీల గురించి ఎస్బీఐ తెలిపిందని పేర్కొంది. జస్టిస్ ఎన్.మాలా ఈ కేసులో తీర్పు చెబుతూ ప్రజాధనంతో ముడిపడి ఉన్న ఉద్యోగాలకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం అన్నారు. ఎస్బీఐ రిక్రూట్మెంట్ క్లాజ్ (క్లాజ్ 1(ఈ)) ప్రకారం సిబిల్ లేదా ఇతర ఏజెన్సీల నుంచి నెగెటివ్ క్రెడిట్ హిస్టరీ లేదా ప్రతికూల రిపోర్టులు ఉన్న అభ్యర్థులు అనర్హులని చెప్పారు. నియామకానికి ముందే బకాయిలు చెల్లించినట్లు అభ్యర్థి పేర్కొన్నప్పటికీ క్లీన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ అనేది కేవలం రుణ క్లియరెన్స్ మాత్రమే కాదని, దాన్ని నియామకాల్లో బెంచ్ మార్క్గా పరిగణిస్తారని కోర్టు నొక్కి చెప్పింది.ఇదీ చదవండి: పిక్సెల్ స్మార్ట్పోన్ల నిషేధంసిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలుక్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్ను తగ్గిస్తుంది.మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు. -
ఒకే వేదికపై భారతీయ పాటలు, కళలు, వంటలు..మరెన్నో
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లుఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివివైజేషన్ టు నేషన్’ ఈవెంట్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. ఈ ఈవెంట్కు సంబంధించిన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by NMACC India Weekend (@nmacc.indiaweekend) -
అందులో అమ్మారు.. ఇందులో కొన్నారు!
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా పీబీ ఫిన్టెక్లో కంపెనీ సహవ్యవస్థాపకులు యాషిష్ దహియా, అలోక్ బన్సల్ 1.09 శాతం వాటాను షేరుకి రూ. 1,821.5 సగటు ధరలో విక్రయించారు. ఇన్సూర్టెక్.. పాలసీబజార్, ఫిన్టెక్ ప్లాట్ఫామ్ పైసాబజార్ మాతృ సంస్థలో 50.5 లక్షల షేర్లను అమ్మివేయడం ద్వారా రూ. 920 కోట్లు సమకూర్చుకున్నారు. ఎన్ఎస్ఈ బల్్కడీల్ వివరా ల ప్రకారం సీఈవో దహియా 0.74 శాతం వాటాకు సమానమైన 34 లక్షల షేర్లు. వైస్చైర్మన్ బన్సల్ 0.36 శాతం వాటాకు సమానమైన 16.5 లక్షల షేర్లు విక్రయించారు. తాజా లావాదేవీల తదుపరి పీబీ ఫిన్టెక్లో దహియా వాటా 4.31 శాతం నుంచి 3.57 శాతానికి, బన్సల్ వాటా 1.4 శాతం నుంచి 1.04 శాతానికి క్షీణించింది. కాగా.. ఈ వాటాలను దేశీ ఎంఎఫ్, బీమా రంగ సంస్థలతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సొంతం చేసుకున్నాయి. ఈ జాబితాలో టాటా ఎంఎఫ్, ఎడిల్వీజ్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్సహా సిటీగ్రూప్ గ్లోబల్, గోల్డ్మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీ ఏషియా సింగపూర్, సొసైటీ జనరాలి తదితరాలు చేరాయి.ఇదీ చదవండి: దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లుడెల్హివరీలో వాటా కొనుగోలుజాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా లాజిస్టిక్స్ సర్వీసులందించే డెల్హివరీలో దేశ, విదేశీ దిగ్గజాలు వాటా కొనుగోలు చేశాయి. ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాల ప్రకారం 1.6 శాతం వాటాకు సమానమైన 1.19 కోట్ల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నాయి. ఇందుకు షేరుకి రూ. 387 సగటు ధరలో రూ. 461 కోట్లు వెచి్చంచాయి. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో మోర్గాన్ స్టాన్లీ, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ సింగపూర్, విరిడియన్ ఏఎంతోపాటు.. ఎంఎఫ్ సంస్థలు హెచ్డీఎఫ్ సీ, యాక్సిస్, టాటాతదితరాలు చేరాయి. అనుబంధ సంస్థలు నెక్సస్ అపార్చునిటీ ఫండ్, నెక్సస్ వెంచర్స్–3తో వీసీ కంపెనీ నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తాజాగా డెల్హివరీలో వాటా విక్రయించింది. 2025 మార్చికల్లా డెల్హివరీలో 5.88 % వాటాను నెక్సస్ వెంచర్స్–3 కలిగి ఉంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
దేశంలో అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్లు
భారత్లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యంత విలువైన బ్రాండ్ వివరాలను ‘బ్రాండ్ ఫైనాన్స్’ నివేదిక తెలియజేసింది. దేశంలో టాటా గ్రూప్ (బ్రాండ్ విలువ 10 శాతం పెరిగి 31.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది) మరోసారి అత్యంత విలువైన బ్రాండ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పునరుత్పాదక రంగాల్లో టాటా గ్రూప్ వ్యూహాత్మక పెట్టుబడులతో దేశంలో వేగంగా విస్తరిస్తోందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది.దేశంలోని టాప్ 10 అత్యంత విలువైన బ్రాండ్లు మొత్తంగా బ్రాండ్ విలువలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. బలమైన దేశీయ డిమాండ్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం అంచనా వేసిన జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 7 శాతం మధ్య ఉందని పేర్కొంది.ఇదీ చదవండి: సెకనుకు మూడు వాహనాలు డెలివరీబ్రాండ్ ఫైనాన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిమోన్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ.. ‘మేక్ ఇన్ ఇండియా పిలుపును భారత్ నూతన శక్తితో స్వీకరిస్తోంది. తయారీ, ఆర్థిక సేవలు, వినోదం, వైద్యం, ఆతిథ్యం ఇలా ఏ రంగంలోనైనా భారత్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. దేశ ఆర్థిక పురోగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక విస్తరణ తన అగ్రశ్రేణి బ్రాండ్లను గ్లోబల్ లీడర్లుగా మారుస్తున్నాయి’ అన్నారు. -
నెస్లే బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: సుప్రసిద్ధ మ్యాగీ, నెస్కెఫే, కిట్కాట్ బ్రాండ్ల ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా కంపెనీ చరిత్రలోనే తొలిసారి బోనస్ షేర్లకు తెరతీసింది. దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాక కంపెనీ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఉచితంగా షేర్లను జారీ చేయనుంది. బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. వెరసి వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని బోనస్గా కేటాయించనుంది. అయితే ఇందుకు రికార్డ్ డేట్ను తదుపరి ప్రకటించనున్నట్లు తెలియజేసింది. నెస్లే ఇండియా ఇంతక్రితం 2024 జనవరిలో షేర్ల ముఖ విలువను విభజించింది. రూ. 10 ముఖ విలువను రూ. 1 ముఖ విలువకు కుదించింది. తదుపరి కంపెనీ ఈ నెల 19న తొలిసారి బోనస్ షేర్ల అంశాన్ని ప్రతిపాదించింది. 26న నిర్వహించనున్న సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం)లో డైరెక్టర్ల బోర్డు బోనస్ షేర్ల ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో గురువారం(26న) బోనస్ షేర్ల జారీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు కంపెనీ చైర్మన్, ఎండీగా పదవీ విరమణ చేయనున్న సురేష్ నారాయణ్ వెల్లడించారు. అంతేకాకుండా ప్రతీ షేరుకీ రూ. 10 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందుకు జూలై 4 రికార్డ్ డేట్గా కంపెనీ ప్రకటించింది. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 7న షేరుకి రూ. 14.25 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. కాగా.. బోనస్ షేర్లతో వాటాదారులందరూ ప్రధానంగా 5 షేర్ల కంటే తక్కువగల 1.6 లక్షలమంది చిన్న ఇన్వెస్టర్లు లబ్ధి్ద పొందనున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు. బోనస్ వార్తల నేపథ్యంలో నెస్లే ఇండియా షేరు 1% బలపడి రూ. 2,430 వద్ద ముగిసింది. మ్యాగీ సంక్షోభం 2015లో అమ్మకాలపై నిషేధ సంక్షోభాన్ని ఎదుర్కొన్న మ్యాగీ తదుపరి దశలో మరింత బలపడింది. ప్రస్తుతం మొత్తం అమ్మకాలలో 7 శాతం వాటాను మ్యాగీ ఆక్రమిస్తున్నట్లు కంపెనీకి దశాబ్ద కాలం సేవలందించిన నారాయణ్ వెల్లడించారు. మ్యాగీ సంక్షోభం తరువాత నెస్లే ఇండియా ఎండీగా 2015 ఆగస్ట్ 1న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలో కంపెనీ వివిధ కేటగిరీలలో 150 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. ఈకామర్స్ చానళ్ల ద్వారా 8 శాతం అమ్మకాలు నమోదవుతున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలలో నెస్లే ఇండియా వాటా అత్యధికంకావడం గమనార్హం! -
ఆర్ఐఎల్ @ రూ. 20 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ మరోసారి రూ. 20 లక్షల కోట్ల కీలక మైలురాయిని అధిగమించింది. షేరు ధర తాజాగా 2 శాతం పుంజుకుని రూ. 1,495కు చేరడంతో బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 37,838 కోట్లు బలపడింది. వెరసి బ్లూచిప్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 20,23,375 కోట్లను అధిగమించింది. ప్రధాన ఇండెక్సులలో అధిక వెయిటేజీ గల కంపెనీ షేరు లాభపడటంతో మార్కెట్లకు సైతం జోష్వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం గతేడాది(2024) ఫిబ్రవరి 13న రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి దేశీ దిగ్గజంగా రిలయన్స్ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఆర్ఐఎల్ తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ రూ. 15,51,219 కోట్ల మార్కెట్ విలువతో రెండో స్థానాన్ని పొందింది. ఈ బాటలో మార్కెట్ విలువ ద్వారా ఇతర బ్లూచిప్ కంపెనీలు టీసీఎస్(రూ. 12,45,219 కోట్లు), భారతీ ఎయిర్టెల్(రూ. 12,45,219 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ. 10,27,839 కోట్లు) తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేరు ఇప్పటివరకూ 23 శాతం జంప్చేయడం విశేషం! -
ఇంటెల్లో ఉద్యోగాల కోత ప్రారంభం
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా కాలిఫోర్నియాలో ఉద్యోగుల తొలగింపు ప్రారంభించారు. శాంటా క్లారా ప్రధాన కార్యాలయంలో ఉన్న 107 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇంటెల్ పేర్కొంది. 30 రోజుల్లో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినప్పుడు నోటిఫికేషన్ జారీ చేసేలా కాలిఫోర్నియా వార్న్ చట్టం నిర్దేషిస్తుంది. దీని ప్రకారం కంపెనీ సమర్పించిన ఫైలింగ్లో ఉద్యోగాల కోతలు ప్రారంభం కానున్నాయని తెలిసింది.జర్మనీలోని మ్యూనిచ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆటోమోటివ్ చిప్ వ్యాపారాన్ని కూడా ఇంటెల్ మూసివేయనుంది. దాంతో ఇంటెల్ ఎక్స్పర్ట్ జాక్ వీస్ట్ నేతృత్వంలోని ఈ యూనిట్ ఉద్యోగుల్లో చాలా మంది కొలువులు కోల్పోయే అవకాశం ఉంది. బాధిత ఉద్యోగులకు 60 రోజుల నోటీసు లేదా నాలుగు వారాల నోటీసుతో పాటు తొమ్మిది వారాల పరిహారం, ఇతర వేతన ప్రయోజనాలను అందిస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు, జులై మధ్యలో ఇంటెల్ కాలిఫోర్నియాలోని గ్లోబల్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను ప్రభావితం చేసే చర్యలు తీసుకోబోతుందని అధికారులు తెలిపారు. అప్పుడు కంపెనీ తన ఉద్యోగుల్లో మరో 20 శాతం మందిని తొలగిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపుతాజాగా ప్రకటించిన ఉద్యోగ కోతల్లో ఇంటెల్ చిప్ అభివృద్ధికి కీలకమైన పలు ఇంజినీరింగ్ ఉద్యోగులను తొలగించడం గమనార్హం. వీరిలో ఫిజికల్ డిజైన్ ఇంజినీర్లు, లాజిక్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్పెషలిస్టులు, క్లౌడ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్లు ఉన్నారు. ఇంజినీరింగ్ మేనేజర్లు, బిజినెస్ లీడ్లు, ఐటీ వైస్ ప్రెసిడెంట్ వంటి అనేక సీనియర్ లీడర్షిప్ రోల్స్లో సేవలందిస్తున్న వారున్నారు. శాంటా క్లారా సైట్లోని ఉద్యోగులు సీపీయూ, జీపీయూ డిజైన్ ప్రాజెక్టుల్లో పనిచేస్తారని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ప్రధాన టెక్ కంపెనీల్లో 2025లో ఇప్పటివరకు 62,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని లేఆఫ్స్.ఎఫ్వైఐ తెలిపింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రధాన సంస్థలు వ్యయాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. -
దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపు
దేశంలో సంపద పెరుగుతోంది. సంపన్నులు రెట్టింపవుతన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక ప్రకారం.. 2024-2029 మధ్య అంటే ఐదేళ్లలో మిలియనీర్ల జనాభా 55 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతం కంటే రెట్టింపు.2023-2024 మధ్య కాలంలో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగిందని, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) సగటు 7.3 శాతం దాటిందని బీసీజీ తెలిపింది. ఉత్తర అమెరికా (4%), పశ్చిమ ఐరోపా (5%) లను మించి ఎఆసియా-పసిఫిక్ ప్రాంతం 2029 నాటికి వార్షికంగా 9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు. తొలి తరం మొదటిసారి సంపద సృష్టికర్తలు, ముఖ్యంగా మిలీనియల్ (యువ) పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను పునర్నిస్తున్నారని పేర్కొన్నారు.బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1% పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బీసీజీ గ్లోబల్ నివేదిక తెలిపింది. విలువైన క్లయింట్ల గుర్తింపు, ప్రాధాన్యంలో సంస్థలకు సహకారం అందిస్తూ ఉత్పాదక ఏఐ (GenAI) సంపద ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని వివరించింది. ఈ ఉత్పాదక ఏఐని త్వరగా అందిపుచ్చుకున్నవారు ఐదు రెట్లు అధికంగా పురోగమిస్తున్నారని వివరించింది. -
యూనియన్ బ్యాంక్ ఈడీకి ఊహించని షాక్..
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పంకజ్ ద్వివేదికి ఊహించని అనుభవం ఎదురైంది. జనరల్ మేనేజర్గా ఆయన హోదాను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక సేవల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్వపు హోదాలో జనరల్ మేనేజర్గా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్కు పంపించింది.ఢిల్లీ హైకోర్టులో ద్వివేదికి వ్యతిరేకంగా కేసు పెండింగ్లో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యూనియన్ బ్యాంక్ ఈడీగా ద్వివేది నియామకాన్ని సవాలు చూస్తే ఢిల్లీ హైకోర్టులో గతేడాది ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.విజిలెన్స్ క్లియరెన్స్ లేకుండా ఈడీగా నియమించడం నిబంధనల ఉల్లంఘనంటూ పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విజిలెన్స్ విభాగం ఆమోదం లేకుండా నియామకం ఎలా చేశారని ప్రశ్నిస్తూ.. 2024 ఆగస్ట్లో కేంద్రం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. -
1.41 కోట్ల మంది విమానమెక్కారు..
దేశీ విమానయాన రంగంలో ప్రయాణికుల సంఖ్య మే నెలలో 1.89 శాతం పెరిగి 1.41 కోట్లకు చేరినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. 2024 మే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 1.38 కోట్లుగా ఉంది. 64 శాతం మార్కెట్ వాటా ఇండిగో చేతుల్లోనే ఉంది. ఈ సంస్థ విమానాల్లో 93.09 లక్షల మంది ప్రయాణించారు.ఆ తర్వాత 37.22 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించడం ద్వారా 26.5 శాతం మార్కెట్ వాటా ఎయిర్ ఇండియా గ్రూపు సొంతం చేసుకుంది. ఇక ఆకాశ ఎయిర్ విమానాల్లో 7.48 లక్షల మంది, స్పైస్జెట్ విమానాల్లో 3.40 లక్షల మంది చొప్పున మే నెలలో ప్రయాణించారు. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 5.3 శాతంగా ఉంటే, స్పైస్ జెట్ మార్కెట్ వాటా 2.4 శాతానికి పరిమితమైంది.ఆరు ప్రధాన విమానాశ్రయాల నుంచి (హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా) 84 శాతం సరీ్వసులకు సకాలంలో సేవలు అందించి ఇండిగో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 79.7 శాతంతో ఎయిర్ ఇండియా గ్రూపు ద్వితీయ స్థానంలో ఉంది. -
జాక్పాట్ కొట్టిన అనిల్ అంబానీ.. రూ. 600 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ డిఫెన్స్ తాజాగా జర్మనీ రక్షణ రంగ సంస్థ రైన్మెటల్ వాఫే మ్యునిషన్ జీఎంబీహెచ్ నుంచి రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకుంది. హైటెక్ కమ్యూనికేషన్ విభాగంలో ఇది అతిపెద్ద ఎగుమతి కాంట్రాక్ట్గా కంపెనీ పేర్కొంది.తాజా ఆర్డర్ గ్లోబల్ డిఫెన్స్, యుద్ధసామగ్రి విభాగంలో కంపెనీకి కీలక మైలురాయిగా అభివర్ణించింది. తద్వారా అంతర్జాతీయస్థాయిలో రక్షణ, యుద్ధసామగ్రి సరఫరా చైన్లో విశ్వసనీయ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ మరింత పటిష్టపడినట్లు తెలియజేసింది.రెండు సంస్థల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దీర్ఘకాలిక సహకారానికి కట్టుబాటుగా పేర్కొంది. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా లక్ష్యాలకు మద్దతుగా దేశీ రక్షణ తయారీ సామర్థ్యాలను పటిష్టపరచనున్నట్లు వివరించింది.👉 ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనందీంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు దూసుకెళ్లాయి. జూన్ 25న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్లు 5 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకాయి. మార్కెట్లు ముగిసే సమయానికి షేరు విలువ రూ. 404.65 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీ అనుబంధ సంస్థే రిలయన్స్ డిఫెన్స్. -
ఎయిరిండియాలో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్..
న్యూఢిల్లీ: నష్టాలతో నడుస్తున్న విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో ప్రమోటర్ సంస్థలు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 9,558 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. వీటిలో ఒక్క చివరి నెల(మార్చి)లోనే రూ. 4,306 కోట్లు అందించాయి. 2022 జనవరి మొదలు టాటా గ్రూప్ ఎయిరిండియాను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐదేళ్లలో సరికొత్త మార్పులకు తెరతీసే(ట్రాన్స్ఫార్మేషన్) ప్రణాళికలను అమలు చేస్తోంది.2024 నవంబర్లో రెండు సంస్థల భాగస్వామ్య కంపెనీ విస్తారాను ఎయిరిండియాలో విలీనం చేశాయి. తద్వారా ఎయిరిండియాలో సింగపూర్ సంస్థ 25.1 శాతం వాటా దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా మూలధన వ్యయాలకుగాను ప్రమోటర్ సంస్థలు గతేడాది రూ. 9,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రయివేట్ రంగ విమానయాన దిగ్గజానికి టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ ఎయిర్లైన్స్ రూ. 6,333 కోట్లు చొప్పున అందించినట్లు వెల్లడించారు. నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు వర్కింగ్ క్యాపిటల్, వృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా సమకూర్చినట్లు తెలియజేశారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం ఈ మార్చిలో టాటా సన్స్ రూ. 3,225 కోట్లు, సింగపూర్ సంస్థ రూ. 1,081 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మార్చి పెట్టుబడులకు ముందు ఎయిరిండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ దాదాపు రూ. 5,253 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కాగా.. 2024 డిసెంబర్31తో ముగిసిన 9 నెలల కాలంలో ఎయిరిండియా గ్రూప్ అనుకోని పద్దులకు ముందు రూ. 8,033 కోట్ల నష్టాలు ప్రకటించింది. ఇదే కాలంలో ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం రూ. 56,367 కోట్ల ఆదాయం సాధించింది. -
5జీ యూజర్లు @ 98 కోట్లు..!
న్యూఢిల్లీ: భారత్లో 5జీ టెలికం యూజర్లు (చందాదారులు) 2030 నాటికి 98 కోట్లకు చేరుకుంటారని, అప్పటికి 4జీ చందాదారుల సంఖ్య 60 శాతం తగ్గి 23 కోట్లకు పరిమితం అవుతుందని టెలికం గేర్ల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. ‘‘2024 చివరికి 5జీ చందాదారులు 29 కోట్లకు పెరిగారు. మొత్తం మొబైల్ సబ్్రస్కిప్షన్లలో 24 శాతంగా ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 98 కోట్లకు చేరుకుంటుంది. మొత్తం చందాదారుల్లో 5జీ యూజర్లు 75 శాతానికి పెరుగుతారు’’అని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ వెల్లడించింది. 2024లో ఒక్కో స్మార్ట్ ఫోన్ ద్వారా 32జీబీ డేటా వినియోగంతో భారత్ ప్రపంచంలో డేటా రద్దీ పరంగా మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపింది. 2030 నాటికి ఒక్కో స్మార్ట్ఫోన్ డేటా వినియోగం 66జీబీకి పెరుగుతుందని అంచనా వేసింది. ఇందుకు అనుగుణంగా బలమైన 5జీ నెట్వర్క్ అవసరం ఉంటుందని పేర్కొంది. వేగంగా 5జీ స్మార్ట్ఫోన్లకు యూజర్లు మారుతుండడం, డేటా వినియోగానికి డిమాండ్ పెరుగుతున్నట్టు వివరించింది. ‘‘బ్రాడ్బ్యాండ్ అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్డబ్ల్యూఏ) విస్తరణ దిశగా సరీ్వస్ ప్రొవైడర్లను ఈ డిమాండ్ నడిపిస్తుంది. భారత్లో అందుబాటులో ఉన్న 5జీ మిడ్బ్యాండ్ స్పెక్ట్రమ్.. సామర్థ్యం, నెట్వర్క్ విస్తరణ అవసరాలకు సరిపోతుంది. ఇది యూజర్ అనుభవం పెరిగేందుకు వీలు కలి్పస్తుంది’’అని ఎరిక్సన్ నివేదిక వివరించింది. -
పీఎల్ఐ ప్రోత్సాహకాలు... రూ.21,534 కోట్లు
న్యూఢిల్లీ: భారత్లో తయారీని ప్రోత్సాహించేందుకు కేంద్రం తలపెట్టిన ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోంది. దీని కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 12 రంగాలకు రూ.21,534 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలు కూడా ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో సరఫరా వ్యవస్థ నుంచి సమస్యలు ఏర్పడడంతో.. భారత్లో తయారీని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో కేంద్రంలోని మోదీ సర్కారు 2021లో పీఎల్ఐ పథకాన్ని 14 రంగాల కోసం ప్రకటించింది. రూ.1.97 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటి వరకు 12 రంగాలకు కలిపి రూ.21,534 కోట్ల ప్రోత్సాహకం విడుదల చేసినట్టు కేంద్ర వాణిజ్య శాఖ తాజాగా ప్రకటించింది. ఎల్రక్టానిక్స్ తయారీ, ఐటీ హార్డ్వేర్, బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాలు, ఫార్మా, టెలికం, ఆహార ప్రాసెసింగ్, వైట్ గూడ్స్ (ఏసీలు తదితర), ఆటోమొబైల్స్, స్పెషాలిటీ స్టీల్, టెక్స్టైల్స్, డ్రోన్స్ తయారీకి కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించడం గమనార్హం. ఈ తరహా పథకాల పనితీరును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తాజాగా సమీక్షించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి పెట్టుబడులు, ప్రోత్సాహకాలతో తమ పరిధిలో కార్యాచరణ రూపొందించాలని వివిధ శాఖలను కోరారు. 12 లక్షల మందికి ఉపాధి పీఎల్ఐ పథకం కింద ఇప్పటి వరకు రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు వాణిజ్య శాఖ తెలిపింది. వీటి ద్వారా రూ.16.5 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా నమోదు కాగా, 12 లక్షల మందికి పైగా ఈ ఏడాది మార్చి నాటికి ఉపాధి (ప్రత్యక్ష, పరోక్ష) లభించినట్టు పేర్కొంది. ఫార్మా రంగానికి సంబంధించి పీఎల్ఐ పురోగతిని సమీక్షించగా, ఈ రంగంలో రూ.2.66 లక్షల కోట్ల ఉత్పత్తి అదనంగా సాధ్యమైనట్టు, ఇందులో రూ.1.70 లక్షల కోట్ల ఎగుమతులు మొదటి మూడేళ్లలో నమోదైనట్టు వాణిజ్య శాఖ గుర్తించింది. మొత్తం మీద ఫార్మా రంగంలో దేశీయంగా విలువ జోడింపు 2025 మార్చి నాటికి 83.70 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. బల్క్ డ్రగ్ విభాగంలో మన దేశం నికర దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా మారింది. 2021–22 నాటికి నికర బల్్కడ్రగ్ దిగుమతులు రూ.1,930 కోట్లుగా ఉంటే, 2025 మార్చి నాటికి రూ.2,280 కోట్ల నికర ఎగుమతులు పీఎల్ఐ కింద నమోదయ్యాయి. మ్యాన్ మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) టెక్స్టైల్స్ ఎగుమతులు 6 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వీటి ఎగుమతులు 5.7 బిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం. -
అంబానీ.. అదానీ ఇంధన బంధం!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మరో భారీ వ్యాపార వెంచర్ కోసం చేతులు కలిపారు. ఒకరి ఇంధన రిటైల్ నెట్వర్క్లో మరొకరి ఇంధనాలను విక్రయించుకునేందుకు వీలుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం అదానీ టోటల్ గ్యాస్ (ఏటీజీఎల్) సీఎన్జీ రిటైల్ ఔట్లెట్స్లో జియో–బీపీ తమ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను విక్రయిస్తుంది. అలాగే, జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో ఏటీజీఎల్ తమ సీఎన్జీ పంపులను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతమున్న, భవిష్యత్లో రాబోయే ఔట్లెట్స్ అన్నింటికీ ఈ ఒప్పందం వర్తిస్తుందని ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. జియో–బీపీ అనేది అంబానీకి చెందిన జియో, బ్రిటన్ సంస్థ బీపీ మధ్య జాయింట్ వెంచర్. ఇక, ఏటీజీఎల్ అనేది అదానీ గ్రూప్, ఫ్రాన్స్కి చెందిన టోటల్ ఎనర్జీస్ కలిసి ఏర్పాటు చేసిన జేవీ సంస్థ. జియో–బీపీకి దేశవ్యాప్తంగా 1,972 పెట్రోల్ బంకులు ఉండగా, ఏటీజీఎల్కి 659 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. ఇరు సంస్థల పటిష్టమైన నెట్వర్క్ను ఉపయోగించుకుని కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని జియో–బీపీ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. ఈ డీల్ ద్వారా ఔట్లెట్స్లో అత్యంత నాణ్యమైన, వివిధ రకాల ఇంధనాలను అందించాలనేది తమ ఉమ్మడి లక్ష్యమని ఏటీజీఎల్ ఈడీ సురేష్ పి. మంగ్లానీ చెప్పారు. పీఎస్యూలకు పోటీ..: ప్రస్తుతం ఇంధనాల రిటైలింగ్ విభాగంలో ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ఆధిపత్యం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 97,366 పెట్రోల్ బంకులు ఉండగా మూడు పీఎస్యూలకు (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్)) ఏకంగా 90% వాటా ఉంది. సిటీ గ్యాస్ పంపిణీ వ్యాపారంలో కూడా అవి ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ, అంబానీ చేతులు కలపడం వల్ల వాటి ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏటీజీఎల్ సంస్థ గృహాలు, పరిశ్రమలు, వాహనదారులు, ఇతరత్రా కస్టమర్లకు గ్యాస్ను, ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సదుపాయాలు మొదలైనవి అందిస్తోంది. మరోవైపు, జియో–బీపీ ఇంధనాల రిటైలింగ్తో పాటు పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలు, కనీ్వనియెన్స్ స్టోర్స్ మొదలైన విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఓ పవర్ ప్రాజెక్టులో.. ఇరువురు కుబేరులు వ్యాపార అవసరాలరీత్యా జట్టు కట్టడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గతేడాది మార్చిలో మధ్యప్రదేశ్లోని ఓ విద్యుత్ ప్రాజెక్టు కోసం ఇద్దరూ చేతులు కలిపారు. అదానీ పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ 26 శాతం వాటా కొనుగోలు చేసింది.పోటాపోటీ.. గుజరాత్కే చెందిన అంబానీ, అదానీ ఇద్దరికీ బడా వ్యాపార సామ్రాజ్యాలు ఉన్న సంగతి తెలిసిందే. ఆసియాలోనే నంబర్ వన్ సంపన్నులుగా నిలవడంలో గత కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య పోటీ నడుస్తోంది. అంబానీ ఓవైపు ఆయిల్, గ్యాస్, రిటైల్, టెలికం తదితర రంగాల్లో విస్తరించగా అదానీ మరోవైపు నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, బొగ్గు, మైనింగ్ తదితర మౌలిక సదుపాయాల రంగాల్లో విస్తరించారు. పర్యావరణహిత ఇంధనాల ప్రాజెక్టులను మినహాయిస్తే ఇద్దరూ ఒకరి రంగంలోకి మరొకరు అడుగుపెట్టలేదు. అదానీ మెగా రెన్యువబుల్ ఎనర్జీ పార్క్లు, సోలార్ మాడ్యూల్స్ .. విండ్ టర్బైన్ల తయారీపై దృష్టి పెట్టారు. అటు అంబానీకి చెందిన రిలయన్స్ గుజరాత్లోని జామ్నగర్లో నాలుగు గిగాఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తోంది. ఇక 2014 నుంచి సీఎన్బీసీ–టీవీ18, సీఎన్ఎన్–న్యూస్18, కలర్స్లాంటి టీవీ చానళ్ల ద్వారా అంబానీ మీడియా రంగంలో కార్యకలాపాలు సాగిస్తుండగా.. ఎన్డీటీవీ కొనుగోలు ద్వారా అదానీ కూడా ఇటీవలే ఈ విభాగంలోకి ప్రవేశించారు. -
నా జీవితంలో అతిపెద్ద రిస్క్.. జియో: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: జియో రూపంలో టెలికం రంగంలోకి రీఎంట్రీ చేయడమనేది తన జీవితంలో తీసుకున్న అతి పెద్ద రిస్క్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అభివర్ణించారు. అత్యంత అధునాతనమైన డిజిటల్ టెక్నాలజీకి భారత్లో పరిస్థితులు ఇంకా అనువుగా లేవని, ఈ వెంచర్ ఆర్థికంగా విఫలమవుతుందని విశ్లేషకులు హెచ్చరించినప్పటికీ వెనక్కి తగ్గలేదని ఆయన చెప్పారు. ఒకవేళ విశ్లేషకులు చెప్పినది నిజంగానే జరిగినా కూడా, దేశాన్ని డిజిటల్ బాట పట్టించడంలో జియో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ఆ మాత్రం రిస్కు తీసుకోవడంలో తప్పు లేదనిపించిందని మెకిన్సే అండ్ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘మేము ఎప్పుడూ పెద్ద రిస్క్ లే తీసుకున్నాం. మాకు భారీ స్థాయి ముఖ్యం. మేము ఇప్పటి వరకు తీసుకున్న అతి పెద్ద రిస్కు జియోనే. అప్పట్లో మా సొంత డబ్బును ఇన్వెస్ట్ చేశాం. నేను మెజారిటీ వాటాదారుగా ఉన్నాను. 4జీ మొబైల్ నెట్వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కోట్ల కొద్దీ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో ఈ టెక్నాలజీకి భారత్లో అనువైన పరిస్థితులు లేవని, డబ్బంతా వృథా అవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మా కంపెనీ బోర్డుకు నేను ఒక్కటే చెప్పాను. ఇదంతా మన సొంత డబ్బు. మహా అయితే దీనిపై మనకు పెద్దగా ఆదాయం రాకపోవచ్చు. ఫర్వాలేదు. దీనితో దేశాన్ని డిజిటలైజ్ చేయొచ్చు. భారత్ను సంపూర్ణంగా మార్చివేయొచ్చు. ఆ విధంగా దేశం కోసం రిలయన్స్ ఒక గొప్ప మేలు చేసినట్లవుతుంది. అత్యుత్తమ విరాళం ఇచ్చినట్లవుతుంది అన్నాను‘ అని అంబానీ పేర్కొన్నారు. 2016లో ప్రారంభమైన జియో.. నేడు 47 కోట్ల మంది యూజర్లతో, 5జీ, క్లౌడ్, ఏఐ సర్వీసుల్లోనూ కార్యకలాపాలతో టెలికంలో అగ్రస్థానంలో ఉంది. ఇంకా ఏమన్నారంటే.. → ప్రపంచం ప్రతి అయిదేళ్లకో లేదా పదేళ్లకో మారిపోతూ ఉంటుంది. మనం బిజినెస్ స్కూల్లో నేర్చుకున్న దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మేము అలాంటి పరిస్థితులకు సవాలు విసిరాం. రిలయన్స్ 1960లలో ఒకలాగా, 70ల్లో ఆ తర్వాత 2000.. 2020లలో మరోలాగా మారింది. ఇప్పుడు పూర్తి భిన్నం. → రిస్క్ మేనేజ్మెంట్ విషయానికొస్తే.. ఒకవేళ పరిస్థితులు ఘోరంగా దిగజారితే బైటపడగలమా అనేది ఆలోచించాలి. ఏం చేసినా సరే మా ఉద్యోగుల కళ్లలోకి చూసి నిజాయితీ గా మాట్లాడగలిగేలా ఉండాలని 30..40 ఏళ్ల క్రి తం నేను వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం పెట్టుకున్నాను. ఈ సంస్థాగత సంస్కృతే ఎంతæ పెద్ద రిస్క్ ల నుంచైనా కాపాడగలిగే బీమా. → డీప్–టెక్, అధునాతన తయారీ కంపెనీగా ఎదగాలనేది రిలయన్స్ లక్ష్యం. మన దగ్గర సరైన టాలెంట్, సరైన లక్ష్యం అంటూ ఉంటే ఎక్కడికి వెళ్లాలి, కోరుకున్నది ఎలా సాధించాలనేది ఏదో విధంగా కనుక్కుంటాం. అది రిలయన్స్ డీఎన్ఏలోనే ఉంది. నాన్నకు మాటిచ్చాను.. ఇంటర్వ్యూ సందర్భంగా ముకేశ్ అంబానీ తన తండ్రి ధీరుభాయ్ అంబానీని గుర్తు చేసుకున్నారు. ‘రిలయన్స్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఈ సంస్థ చిరకాలం ఉండాలి. నా తర్వాత, నీ తర్వాత కూడా రిలయన్స్ కొనసాగేలా నువ్వు చూడాలి అని నాన్న చెప్పారు. మా తదనంతరం కూడా రిలయన్స్ ఉంటుందని నేను ఆయనకు మాట ఇచ్చాను. 2027లో రిలయన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటుంది. కానీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత కూడా రిలయన్స్ భారతదేశానికి, మానవాళికి సేవ చేయడాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అది కచ్చితంగా జరుగుతుందని గాఢంగా నమ్ముతున్నాను‘ అని ముకేశ్ అంబానీ చెప్పారు. -
జియోస్టార్ రిపోర్ట్: అహో ఐపీఎల్.. అన్నీ ‘ఫస్ట్’లే..
టాటా ఐపీఎల్ 2025 లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సీజన్లలో ఒకటిగా నిలిచింది, అనేక రికార్డులు, పరిశ్రమ ఫస్ట్లతో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పింది. మీడియా పార్ట్నర్స్ ఆసియా (ఎంపీఏ) భాగస్వామ్యంతో ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించిన ఏపీఓఎస్ సదస్సులో జియోస్టార్ ‘టాటా ఐపీఎల్ 2025: ఎ ఇయర్ ఆఫ్ ఫస్ట్స్’ రిపోర్ట్ను విడుదల చేసింది.'ఐపీఎల్ 2025 సీజన్ క్రీడలు, కథనాలు, అనుభవాలు పంచుకోవడం మధ్య గీతలను చెరిపివేసింది. ఇది కేవలం మ్యాచ్లను ప్రసారం చేయడం మాత్రమే కాదు - సృజనాత్మకత, సంస్కృతి, వాణిజ్యం, అభిమానుల కనెక్షన్లతో కలిసిపోయింది" అని జియోస్టార్ స్పోర్ట్స్ అండ్ లైవ్ ఎక్స్పీరియన్స్ సీఈఓ సంజోగ్ గుప్తా అన్నారు.నివేదిక ముఖ్యాంశాలుజియోస్టార్ నెట్వర్క్లో టాటా ఐపీఎల్ 2025 మొత్తం 1.19 బిలియన్ల మొత్తం రీచ్ను నమోదు చేసింది. ఇందులో టీవీలో 537 మిలియన్లు. డిజిటల్లో 652 మిలియన్లు.స్టార్ స్పోర్ట్స్లో ఐపీఎల్ వీక్షకుల్లో 47 శాతం మంది మహిళలే ఉన్నారు.ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను 426 మిలియన్ల మంది వీక్షించారు. (టీవీలో 189 మిలియన్లు, డిజిటల్ లో 237 మిలియన్లు)జియో హాట్స్టార్ 300 మిలియన్ల సబ్స్క్రైబర్లకు చేరుకుంది. ఆండ్రాయిడ్ లో 1.04 బిలియన్ యాప్ డౌన్ లోడ్ లుకనెక్టెడ్ టీవీలో 235 మిలియన్ల రీచ్. మొబైల్ ఫోన్ల ద్వారా 41.7 కోట్ల మంది రీచ్ అయ్యారు.టోర్నమెంట్ వీక్షణ సమయం 514 బిలియన్ నిమిషాలు; స్టార్ స్పోర్ట్స్ హెచ్డీలో 129 మిలియన్ల మంది వీక్షించారు. 840 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్.వీక్షకుల్లో 30 శాతం మంది మాక్స్ వ్యూ 3.0ను ఉపయోగించగా, ప్రాంతీయ భాషా ఫీడ్ వార్షిక వృద్ధిని చూసింది: హిందీ: 31 శాతం; తెలుగు: 87 శాతం; తమిళం: 52 శాతం.మొబైల్లో 44 శాతం మంది ఐపీఎల్ వీక్షకులు 'జీతో ధన్ ధనా ధన్' గేమ్ థ్రిల్ను అనుభవించారు.జియోస్టార్లో 425 కుపైగా ప్రకటనకర్తలు వచ్చారు. 40 ప్రత్యేక కేటగిరీల్లో 270+ నూతన ప్రకటనకర్తలే. మార్కెట్ లీడర్ల నుండి ఛాలెంజర్స్ వరకు 9 కేటగిరీలలో 32 బ్రాండ్లు నీల్సన్ థర్డ్ పార్టీ మెజర్మెంట్ను ఉపయోగించాయి.16:9లో మల్టీ క్యామ్, 360°/ వీఆర్ స్ట్రీమింగ్, మ్యాక్స్ వ్యూ 3.0, కనెక్టెడ్ టీవీలో వాయిస్-అసిస్టెడ్ సెర్చ్, ప్రకటనల రహిత ఫాస్ట్ చానెల్స్, ఏఐ ఆధారిత మ్యాచ్ హైలైట్స్ వంటి సరికొత్త టెక్నాలజీలను ఈ సీజన్లో వినియోగించారు. -
ముంబై ఎయిర్పోర్ట్ కోసం అదానీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,600 కోట్లు) సమీకరించింది. నిధులను ముంబై ఎయిర్పోర్ట్ రుణాల రీఫైనాన్సింగ్కు వినియోగించనుంది. న్యూయార్క్ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అధ్యక్షతన మెట్లైఫ్ ఇంక్, బ్లాక్రాక్ ఇంక్, ఎఫ్డబ్ల్యూడీ ఇన్సూరెన్స్ నిధులు సమకూర్చాయి.ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్) కోసం 2022లో సమీకరించిన రుణాల రీఫైనాన్స్కు నిధులు వెచ్చించనున్నట్లు అదానీ గ్రూప్ సంస్థ అదానీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ఎంఐఏఎల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ వాటా 74 శాతంకాగా.. భారత ఎయిర్పోర్ట్స్ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. దేశీయంగా రెండో పెద్ద ఎయిర్పోర్ట్ను నిర్వహిస్తున్న కంపెనీ 2029 జులైలో గడువుతీరే 75 కోట్ల డాలర్ల విలువైన నోట్లను జారీ చేసింది. వీటికి అదనంగా 25 కోట్ల డాలర్ల నోట్లను జారీ చేసే వీలుతో నిధుల సమీకరణ చేపట్టింది.తద్వారా బిలియన్ డాలర్లను సమకూర్చుకుంది. దీంతో ఎంఐఏఎల్ అభివృద్ధి, ఆధునీకరణ, సామర్థ్య విస్తరణకు ఆర్థిక వెసులుబాటు లభించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. తాజాగా జారీ చేసిన బాండ్లు 6.9 శాతం కూపన్రేటుతో నాలుగేళ్ల కాలానికి గడువు తీరనున్నాయి. ఎయిర్పోర్ట్ మౌలికసదుపాయాల రంగంలో తొలి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ప్రయివేట్ బాండ్ల జారీని చేపట్టినట్లు కంపెనీ పేర్కొంది. -
కొత్త ఇన్సూరెన్స్ పథకం.. మంచి బెనిఫిట్స్తో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ కొత్తగా గెలాక్సీ మార్వెల్ పేరిట పాలసీని ప్రవేశపెట్టింది. తొలిసారి క్లెయిమ్ చేసేంతవరకు లేదా 55 ఏళ్లు వచ్చేంత వరకు ఒకే ప్రీమియంను కొనసాగించడం, 71 కన్జూమబుల్స్కు కవరేజీ, అపరిమిత స్థాయిలో 100 శాతం సమ్ ఇన్సూర్డ్ను రిస్టోర్ చేయడం, ప్రీమియం వెయివర్, ఔట్పేషంట్ బెనిఫిట్స్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.తమ పాలసీల విక్రయం కోసం పాలసీబజార్తో చేతులు కలిపినట్లు కంపెనీ ఎండీ జీ. శ్రీనివాసన్ తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభించిన గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4,730 పైగా పాలసీదార్లకు బీమా భద్రత కల్పించామని, రెండురాష్ట్రాల్లో 1893 మంది పైగా ఏజంట్లతో పటిష్టమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు. -
విశాఖలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్
ఐటీ సర్వీసులు అందించే ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ తన భారత కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రూ.1,583 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక టెక్నాలజీ క్యాంపస్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. వైజాగ్లోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో 22 ఎకరాల్లో మూడు దశల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్యాంపస్ ద్వారా 8,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపింది.2026లో 800 మంది అసోసియేట్లకు వసతి కల్పించేలా తాత్కాలిక కేంద్రం ద్వారా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. 2029 ప్రారంభంలో పూర్తి స్థాయి క్యాంపస్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. విశాఖపట్నం ప్రతిభకు, మౌలిక సదుపాయాలకు ప్రత్యేకంగా నిలుస్తున్నట్లు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ తెలిపారు. దేశంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో సంస్థ విస్తరించాలనే లక్ష్యానికి అనుగుణంగా వైజాగ్లో క్యాంపస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ డిజిటల్ ఎకానమీని మరింత వేగవంతం చేస్తుందని, అదే సమయంలో భవిష్యత్తులో శ్రామిక శక్తికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను పెంచుతుందని ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఆదాయపన్ను విధిస్తున్న దేశంభారతదేశం అంతటా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా కాగ్నిజెంట్ ఇప్పటికే భువనేశ్వర్, ఇండోర్లో కొత్త కేంద్రాలను, గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో ఫైనాన్స్ హబ్ను ఏర్పాటు చేసిందని కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 70 శాతానికి పైగా కంపెనీ శ్రామిక శక్తి భారత్లో ఉన్నందున కాగ్నిజెంట్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. -
భారత్ నుంచి మరిన్ని కొనుగోళ్లు
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ 2027 నాటికి భారత్ నుంచి కొనుగోళ్ల పరిమాణాన్ని ఏటా 10 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించేందుకు స్థానిక సరఫరాదార్లతో కలిసి క్రియాశీలకంగా పని చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన కంపెనీ సీఈవో డగ్ మెక్మిలన్ ఈ విషయాలు తెలిపారు.ఈ సందర్భంగా తమ వాల్మార్ట్ వృద్ధి కార్యక్రమం కింద శిక్షణ కల్పించిన కొందరు విక్రేతలను ఆయన కలిశారు. తమ ఈ–కామర్స్ విభాగం ఫ్లిప్కార్ట్, డిజిటల్ చెల్లింపుల యాప్ ఫోన్పే లాంటి వ్యాపారాల నుంచి కొత్త ఆవిష్కరణలు, మరింత మంది కస్టమర్లకు సర్వీసులు అందించడం, విక్రేతలను పెంచుకోవడం తదితర అంశాలకు సంబంధించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నామని మెక్మిలన్ వివరించారు. భారత్తో తమకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉందని ఆయన చెప్పారు.ఇదీ చదవండి: త్వరలోనే యూఎస్, ఈయూలతో వాణిజ్య ఒప్పందాలుగత దశాబ్ద కాలంలో భారత మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందిందని, వచ్చే దశాబ్ద కాలం కూడా ఇదే జోరు కొనసాగబోతోందని ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ వృద్ధి ప్రోగ్రాం కింద ఒక లక్ష పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చేరువ కానున్నట్లు వాల్మార్ట్ ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రోగ్రాం ద్వారా వాల్మార్ట్ భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపార నైపుణ్యాల్లో శిక్షణ, మార్కెట్ యాక్సెస్ విషయంలో సహాయ, సహకారాలు అందిస్తోంది. భారతీయ తయారీదార్లు అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాల్లోని వాల్మార్ట్ స్టోర్స్కి ఎగుమతులు చేసేందుకు వీలు కల్పించేలా 2002లో బెంగళూరులో వాల్మార్ట్ గ్లోబల్ తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. -
రూ.86 కోట్ల బైబ్యాక్ పూర్తి చేసిన సాస్ యూనికార్న్
సాఫ్ట్వేర్-యాస్-ఏ-సర్వీస్ (సాస్) యూనికార్న్ డార్విన్బాక్స్ రూ.86 కోట్ల ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈసాప్) బైబ్యాక్ను పూర్తి చేసినట్లు తెలిపింది. భారత్, ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా, మిడిల్ఈస్ట్లో సర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీకి చెందిన 11 కార్యాలయాల్లోని 350 మందికి పైగా ఉద్యోగులు ఈ బైబ్యాక్ ద్వారా లబ్ధి పొందినట్లు కంపెనీ పేర్కొంది. తాజాగా సమకూర్చుకున్న రూ.86 కోట్ల బైబ్యాక్ గడిచిన నాలుగేళ్ల కాలంలో మూడోది కావడం గమనార్హం.ఈ సందర్భంగా డార్విన్బాక్స్ సహ వ్యవస్థాపకులు చైతన్య పెద్ది మాట్లాడుతూ..‘డార్విన్బాక్స్లో ప్రతిభ కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. కంపెనీతోపాటు వారూ ఎదిగేలా చూడటం మా ఉద్దేశం. సంపద సృష్టిలోనూ సంస్థతోపాటు ఉద్యోగులు ఎదిగేందుకు చర్యలు చేపడుతున్నాం. కంపెనీ మెరుగైన పనితీరుతో మంచి భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడటానికి పరిశ్రమకు చెందిన కొంతమంది మేధావులు మాతో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దూసుకుపోయేందుకు కంపెనీ ఆర్ అండ్ డీ సామర్థ్యాలను రెట్టింపు చేస్తోంది. ఈ ప్రయాణంలో మరికొందరు ప్రతిభావంతులను ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. మార్చి 2025లో కంపెనీ తన సాంకేతికతను బలోపేతం చేయడానికి, అంతర్జాతీయంగా విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి పార్ట్నర్స్ గ్రూప్, కేకేఆర్ నుంచి నిధులు సేకరించింది. ఆ నిధుల సేకరణలో భాగంగా 140 మిలియన్ డాలర్ల(సుమారు రూ.120 కోట్లు)ను సమకూర్చుకుంది.కంపెనీ ఎంసీపీ (మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్) సర్వర్తో సహా బహుళ ఏఐ ఉత్పత్తులను ప్రారంభించినట్లు తెలిపింది. ఇది ఏదైనా అనుకూలమైన ఏఐ ఏజెంట్కు సదరు ప్లాట్ఫామ్లో హెచ్ఆర్ డేటా, వర్క్ ఫ్లోలతో సురక్షితంగా సంభాషించడానికి వీలు కల్పిస్తుంది. ‘డార్విన్ బాక్స్ సెన్స్’ అనే జెనరేటివ్ ఏఐ ఇంజిన్ను కూడా విడుదల చేసినట్లు చెప్పింది. ఇది 40 ఎంబెడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది. గత ఏడాదిలో 10 ప్రాంతాల్లో మల్టీ కంట్రీ పేరోల్ సొల్యూషన్స్ను అందించినట్లు పేర్కొంది. ‘కంపెనీ విలువను పెంచేవారికి తగిన భాగస్వామ్యం ఉండాలని సంస్థ విశ్వసిస్తోంది. నూతన ఆవిష్కరణలు, అంతర్జాతీయ స్థాయిలో వృద్ధిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నా అందుకు సమానంగా ఉద్యోగులకూ అర్థవంతమైన ఫలాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం. ఉద్యోగులు సంస్థను తమదిగా భావించే సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు జయంత్ పాలేటి అన్నారు.ఇదీ చదవండి: మీపేరుపై ఇంకేమైనా సిమ్కార్డులున్నాయా?2015లో స్థాపించబడిన పీక్ ఎక్స్వీ, లైట్స్పీడ్ వంటి కంపెనీల నియామకాలు, ఆన్బోర్డింగ్, ఉద్యోగుల హాజరు నిర్వహణతో సహా వారి హెచ్ఆర్ అవసరాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. స్టార్ బక్స్, మెక్ డొనాల్డ్స్, ఆక్సా, సిగ్నా, వీవర్క్, ఎయిర్ టెల్, వేదాంత వంటి బ్రాండ్లతో సహా 1,000 సంస్థలకు ఇది సేవలు అందిస్తుంది. -
పైప్లైన్ కోసం రూ.844 కోట్లు పెట్టుబడి!
పెరుగుతున్న ఇంధన డిమాండ్కి తగ్గట్లుగా సరఫరా సామర్థ్యాలను పెంచుకునే దిశగా రూ.844 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ గెయిల్ ఇండియా వెల్లడించింది. దహేజ్–ఉరన్–దభోల్–పాన్వెల్ సహజ వాయువు పైప్లైన్పై ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుతం దీని సామర్థ్యం రోజుకు 19.9 మిలియన్ ఘనపు మీటర్లుగా (ఎంసీఎండీ) ఉండగా వచ్చే మూడేళ్లలో దీన్ని 22.5 ఎంసీఎండీకి పెంచుకోనున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు గెయిల్ తెలియజేసింది.ఇదీ చదవండి: రేర్ ఎర్త్ మెటల్స్పై ఆంక్షలతో ఉపాధికి దెబ్బమరోవైపు, 1,702 కిలోమీటర్ల ముంబై–నాగ్పూర్–ఝర్సుగూడ పైప్లైన్ ప్రాజెక్టును పూర్తి చేసే గడువు తేదీని ఈ ఏడాది జూన్ 30 నుంచి సెప్టెంబర్ 30కి పెంచినట్లు వివరించింది. దీనికి అదనంగా రూ. 411.12 కోట్లు అవసరమవుతాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం ముందుగా అంచనా వేసిన రూ.7,844.25 కోట్ల కన్నా అధికంగా రూ.8,255.37 కోట్లకు చేరుతుందని గెయిల్ పేర్కొంది. అటు 774 కిలోమీటర్ల శ్రీకాకుళం–అంగుల్ పైప్లైన్ ప్రాజెక్టు గడువును కూడా 2025 జూన్ నుంచి డిసెంబర్కి సవరించినట్లు వివరించింది. అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం కారణంగా పైప్లైన్ పనుల పురోగతిపై ప్రభావం పడినట్లు పేర్కొంది. -
డిక్సన్ టెక్నాలజీస్లో వాటా విక్రయం
ఎల్రక్టానిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) ప్రమోటర్ సునీల్ వాచని కంపెనీలో 2.77 శాతం వాటా విక్రయించారు. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 13,301.47 సగటు ధరలో 16.7 లక్షల షేర్లను అమ్మివేశారు. తద్వారా రూ. 2,221 కోట్లకుపైగా అందుకున్నారు. బీఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం కంపెనీ చైర్పర్శన్ సునీల్ వాటా దీంతో డిక్సన్లో 5.34 శాతం నుంచి 2.57 శాతానికి క్షీణించింది. మొత్తం ప్రమోటర్ల వాటా 32.27 శాతం నుంచి 29.5 శాతానికి దిగివచ్చింది.మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్ రెండు దశలలో 2.39 శాతం వాటాకు సమానమైన 14.45 లక్షల డిక్సన్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 13,308 సగటు ధరలో ఇందుకు రూ. 1,924 కోట్లు వెచ్చించింది. ఈ లావాదేవీ తదుపరి డిక్సన్ టెక్నాలజీస్లో మోతీలాల్ ఎంఎఫ్ వాటా 2.24 శాతం నుంచి 4.63 శాతానికి ఎగసింది. ఇతర కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ నికర లాభం రూ. 97 కోట్ల నుంచి రూ. 465 కోట్లకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు జాగ్రత్తలు..ఇందుకు కన్సాలిడేటెడ్ ఆదాయం రెట్టింపునకుపైగా జంప్చేసి రూ. 10,293 కోట్లకు చేరడం సహకరించింది. 2023–24లో రూ. 4,658 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. పూర్తి ఏడాదికి(2024–25) ఆదాయం రూ. 17,691 కోట్ల నుంచి రూ. 38,860 కోట్లకు బలపడగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 375 కోట్ల నుంచి రూ. 1,233 కోట్లకు ఎగసింది. -
కోల్గేట్ ఇండియా నుంచి కొత్త బ్రాండ్లు
న్యూఢిల్లీ: కోల్గేట్ (పామోలివ్) ఇండియా భారత మార్కెట్లో తన పోర్ట్ఫోలియో, వ్యాపార విస్తరణపై బలమైన అంచనాలతో ఉంది. సంస్థ అంతర్జాతీయ పోర్ట్ఫోలియో నుంచి మరిన్ని బ్రాండ్లను భారత్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో ప్రభా నరసింహన్ ప్రకటించారు. కోల్గేట్, పామోలివ్ బ్రాండ్లపై ఈ సంస్థ నోటి సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తుండడం తెలిసిందే. మరిన్ని బ్రాండ్లను తీసుకురావడంపై మాతృ సంస్థతో చర్చిస్తున్నట్టు నరసింహన్ తెలిపారు. ప్రస్తుత బ్రాండ్లతోపాటు కొత్త బ్రాండ్ల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. పామోలివ్ బ్రాండ్పై ప్రీమియం బాడీ వాష్, హ్యాండ్ వాష్ విక్రయిస్తుండగా, ఏటా ఈ విభాగం 20–30 శాతం కాంపౌండెడ్ వృద్ధి నమోదు చేయగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సంస్థ భవిష్యత్ ప్రణాళికల గురించి ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. పామోలివ్ బ్రాండ్పై మరిన్ని విభాగాల్లో ఉత్పత్తులను ఆవిష్కరించడం గురించి ప్రశ్నించగా.. అంతర్జాతీయంగా తమ పోర్ట్ఫోలియోలో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయని వివరిస్తూ.. మరిన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టడంపైనే తాము దృష్టి సారించినట్టు ఆమె చెప్పారు. ఇక్కడి వినియోగదారుల అవసరాలకు సరిపోలే ఉత్పత్తులను తీసుకువస్తామని ప్రకటించారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే కోల్గేట్ పామోలివ్ 88 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ ఆదాయంలో 4–5 శాతం భారత్ నుంచే వస్తోంది. భారత మార్కెట్ ఎంతో కీలకం 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మార్కెట్.. కోల్గేట్ పోమోలివ్ అంతర్జాతీయ వృద్ధికి కీలకమని ప్రభా నరసింహన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత్ వాటా మరింత పెరుగుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కోల్గేట్కు అంతర్జాతీయంగా టాప్–5 మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. వచ్చే కొన్నేళ్లలో భారత్లో మధ్యతరగతి ప్రజలు గణనీయంగా పెరగనుండడం తమకు అద్భుతమైన అవకాశాలను తెచి్చపెడుతుందన్న సంస్థ అంతర్జాతీయ సీఈవో ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ చానళ్లపై మరిన్ని డిజిటల్ ఫస్ట్ బ్రాండ్లను ఆవిష్కరించనున్నట్టు ప్రభా నరసింహన్ తెలిపారు. కోల్గేట్ పర్పుల్, మ్యాక్స్ ఫ్రెష్ సెన్సోరీస్ శ్రేణి, మౌత్ వాష్లను కోల్గేట్ ఇటీవల విడుదల చేయడం గమనార్హం. మరిన్ని ఉత్పత్తులు విడుదల ప్రణాళికతో ఉన్నట్టు ఆమె చెప్పారు. అయితే సంప్రదాయ కిరాణా స్టోర్లు తమ వ్యాపార వృద్ధికి కీలకమని పేర్కొన్నారు. క్విక్కామర్స్ ఛానళ్లకు అనుకూలంగా ఆన్లైన్లో అధిక డిస్కౌంట్లు ఇస్తుండడంతో కోల్గేట్ పోమోలివ్ ఇండియా ఉత్పత్తులను మహారాష్ట్రలో బహిష్కరించాలంటూ అఖిల భారత ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల పంపిణీదారుల సంఘం ఇటీవలి ఇచి్చన పిలుపుపై స్పందిస్తూ.. అన్ని ఛానళ్లూ వృద్ధి చెందేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు అభిప్రాయపడ్డారు.వినియోగం పుంజుకుంటుంది.. ఈ ఏడాది చివరికి పట్టణ వినియోగం పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రభా నరసింహన్ వ్యక్తం చేశారు. గ్రామీణ వినియోగ మార్కెట్ బలంగా ఉందంటూ, అదే వృద్ధి ఇకముందూ కొనసాగుతుందన్నారు. ‘‘కోల్గేట్ ఉత్పత్తులకు పట్టణ మార్కెట్ ఎంతో కీలకంగా ఉంది. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులకు తోడు, ఇటీవలి ప్రభుత్వం ప్రకటించిన చర్యలు పట్టణ వినియోగానికి మద్దతుగా నిలుస్తాయి. జనాభాతో పోల్చి చూస్తే గ్రామీణ మార్కెట్ పరిమాణం ఎంతో చిన్నగా ఉంది. తగిన నోటి సంరక్షణ ఉత్పత్తులతో మరిన్ని అవకాశాలను సొంతం చేసుకోగలం’’అని వివరించారు. మాస్ మార్కెట్తోపాటు ప్రీమియం విభాగాలపై తమ దృష్టి కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
ఫోన్పే ఐపీవో సన్నాహాలు షురూ
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ గ్రూప్ ఫిన్టెక్ కంపెనీ ఫోనేపే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో నిర్వహణకు కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీ మోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీలను నియమించుకున్నట్లు పేర్కొన్నాయి. కాగా.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు జనరల్ అట్లాంటిక్, వాల్మార్ట్, రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్, టైగర్ గ్లోబల్ నుంచి ఫోన్పే 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లు) విలువలో ఈ పెట్టుబడులు సమకూర్చుకోవడం గమనార్హం! అంతక్రితం 2022లో సింగపూర్ నుంచి భారత్కు బదిలీకావడానికి వీలుగా దేశీ ప్రభుత్వానికి పన్నుల రూపేణా ఫోన్పే బిలియన్ డాలర్లు(రూ. 8,000 కోట్లు) చెల్లించిన సంగతి తెలిసిందే. 2016లో ఏర్పాటైన కంపెనీ ఇప్పటివరకూ రూ. 18,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకుంది. 2023–24లో ఆదా యం 74 శాతం జంప్చేసి రూ. 5,064 కోట్లను తాకింది. ఇసాప్ వ్యయాలను మినహాయిస్తే రూ. 197 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) రూ. 738 కోట్ల నష్టం ప్రకటించింది. -
తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్ ఇంజిన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జోహో కార్పొరేషన్లో భాగమైన ఎంటర్ప్రైజ్ ఐటీ మేనేజ్మెంట్ ఉత్పత్తుల సంస్థ మేనేజ్ఇంజిన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరించడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంటలో, తెలంగాణలోని హైదరాబాద్లో రెండు కార్యాలయాలు ఉన్నట్లు సంస్థ ఏఐ సెక్యూరిటీ హెడ్ సుజాత ఎస్ అయ్యర్ తెలిపారు. రేణిగుంటలో 1,000 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు వివరించారు. హైదరాబాద్ డిజిటల్ హబ్గా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రాంతీయంగా సంస్థలకు పటిష్టమైన ఏఐ ఆధారిత ఐటీ, సైబర్సెక్యూరిటీ సొల్యూషన్స్ను అందిస్తున్నట్లు వివరించారు. వివిధ రంగాల కంపెనీల అవసరాలను బట్టి ఉపయోగపడే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్ను (ఎల్ఎల్ఎం) రూపొందించడంపై కసరత్తు చేస్తున్నామన్నారు. తమకు ప్రస్తుతం భారత్ మూడో అతి పెద్ద మార్కెట్గా ఉంటోందని, త్వరలో రెండో పెద్ద మార్కెట్ కాబోతోందని సుజాత చెప్పారు. గత ఐదేళ్లుగా మేనేజ్ఇంజిన్ క్లౌడ్ సర్వీసుల విభాగం వార్షికంగా 70 శాతం వృద్ధి చెందుతోందని తెలిపారు. కస్టమర్లపరంగా చూస్తే దేశీ మార్కెట్లో బీఎఫ్ఎస్ఐ, తయారీ, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు చెందిన 7,500 మంది క్లయింట్లు ఉన్నారని సుజాత తెలిపారు. -
ఆన్లైన్ ఫార్మసీలకు చెక్!
ఇటీవలి కాలంలో ఆన్లైన్ ఫార్మసీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికే టాటా 1ఎంజీ, ఫార్మ్ఈజీ, నెట్మెడ్స్లాంటి దిగ్గజ ప్లాట్ఫాంలు వేగంగా విస్తరిస్తుండటంతో పాటు కొత్తగా మరిన్ని పుట్టుకొస్తున్నాయి. పేమెంట్ సేవల సంస్థ ఫోన్పేకి చెందిన పిన్కోడ్ ఈ మధ్య బెంగళూరు, పుణే, ముంబైలో 10 నిమిషాల్లోనే ఔషధాల డెలివరీ సరీ్వసును ప్రారంభించింది. ఇక ప్రైవేట్ ఫార్మసీ చెయిన్ దవా ఇండియా సంస్థ పుణేలో 60 నిమిషాల్లో డెలివరీ సేవలు అందిస్తోంది. అటు ఓటీపీ వెంచర్స్ నుంచి 2.4 మిలియన్ డాలర్లు సమీకరించిన జీల్యాబ్ ఫార్మసీ కూడా ఢిల్లీ–ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో 60 నిమిషాల్లో ఔషధాలు అందిస్తోంది. వీటిలో కొన్ని ప్లాట్ఫాంలు కస్టమర్లను సమీపంలోని మెడికల్ స్టోర్స్తో అనుసంధానం చేస్తుండగా, మరికొన్ని తమ డార్క్ స్టోర్స్ (గిడ్డంగులు) ద్వారా వినియోగదారులకు నేరుగా ఔషధాలను అందిస్తున్నాయి. ఔషధాలతో పాటు మెడికల్ పరికరాలు, ఇతరత్రా అధిక మార్జిన్ ఉండే ఉత్పత్తులు మొదలైనవి విక్రయిస్తున్నాయి. అయితే, సదరు సంస్థలు సత్వరం ఔషధాలను అందిస్తున్నప్పటికీ కొన్ని విమర్శలూ ఎదుర్కొంటున్నాయి. ఔషధాల ప్రిస్కిప్షన్, ఆర్డర్ ఇచ్చిన వారి వయస్సు మొదలైన వివరాలను ఈ–ఫార్మసీలు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఇవి మరింతగా పెరిగాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ఫార్మసీల నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నాయి.హోమ్ డెలివరీని నిలిపివేయాలి: ఏఐవోసీడీ ఇంటివద్దకే ఔషధాల సరఫరా సేవలను తక్షణం నిలిపివేయాలంటూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) డిమాండ్ చేస్తోంది. కోవిడ్ సమయంలో అత్యవసర వేళల్లో పేషెంట్ల సౌకర్యార్థం ఈ సరీ్వసులను ప్రవేశపెట్టారని, ప్రస్తుతం అటువంటి అత్యవసర పరిస్థితుల్లేవని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో పేర్కొంది. ఏఐవోసీడీలో ప్రస్తుతం 12.4 లక్షల మంది కెమిస్టులు, డ్రగ్గిస్టులు సభ్యులుగా ఉన్నారు. క్రిసిల్ నివేదిక ప్రకారం దేశీయంగా మొత్తం రిటైల్ ఫార్మసీ మార్కెట్ 2.4 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో అసంఘటిత విభాగం వాటా 85 శాతంగా ఉంది. ఆన్లైన్ ఫార్మసీల వాటా 3–5 శాతంగా ఉంది. కొన్ని సంపన్న దేశాల్లో ఇది 22–25 శాతం ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.కొత్త చట్టంపై ప్రభుత్వం కసరత్తు.. సత్వరం ఔషధాలను అందిస్తున్న ఈ–ఫార్మసీల నియంత్రణకు ప్రస్తుతం నిర్దిష్ట చట్టం అంటూ లేదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలు ఆన్లైన్ ఫార్మసీలకు నిర్దిష్టంగా చట్టబద్ధత కల్పించకపోవడం, స్పష్టత లోపించడం వల్ల, ప్రస్తుత నిబంధనల స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాస్తవానికి ఔషధాల ఆన్లైన్ అమ్మకాలను కూడా చేరుస్తూ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945ని మార్చేలా 2018లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముసాయిదా సవరణలను ప్రతిపాదించింది. వీటిపై తమకేవైనా అభ్యంతరాలు, సలహాలు ఉంటే తెలియజేయాలంటూ ఓ నోటిఫికేషన్లో సంబంధిత వర్గాలను కోరింది. అయితే, ఈ నోటిఫికేషన్ను కెమిస్టుల సమాఖ్య సుప్రీం కోర్టులో సవాలు చేసింది. 2018 డిసెంబర్లో లైసెన్సు లేని ఆన్లైన్ ఫార్మసీలు ఔషధాలను విక్రయించడంపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బ్యాంకులకు ఈ వారం వరుస సెలవులు
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. చివరి వారంలో అడుగు పెట్టేశాం. అయితే బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. జూన్ 23 నుంచి 29 వరకు బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, జాతీయ సంఘటనలు, మతపరమైన పండుగలు, ప్రాంతీయ ఆచారాలు, పరిపాలనా పరిగణనల ఆధారంగా ఈ సెలవులను నిర్ణయిస్తుంది.ఈ వారంలో బ్యాంకులకు ప్రాంతీయ సెలవులు, వారాంతపు సెలవులతో సహా 3 సెలవులు ఉన్నాయి. జూన్ 27న ఒడిశాలో రథయాత్ర / కాంగ్ జరుగుతుంది. ఈ పండుగను పురస్కరించుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు మూసివేస్తున్నారు. దీంతోపాటు జూన్ 28న నాల్గవ శనివారం, జూన్ 29న ఆదివారం కావడంతో ఎలాగూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. దీంతో ఒడిశాలోని కస్టమర్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రత్యక్షంగా బ్యాంకు శాఖల సేవలు అందుబాటులో ఉండవు. ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..జూన్ 27 శుక్రవారం: రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) - ఒడిశా, మణిపూర్ లలో బ్యాంకులకు సెలవుజూన్ 28 శనివారం: నాలుగో శనివారం - దేశం అంతటా బ్యాంకులకు సెలవుజూన్ 29 ఆదివారం: వీక్లీ ఆఫ్ - దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేత.జూన్ 30 సోమవారం: రెమ్నా ని - మిజోరంలో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వరుస సెలవుల నేపథ్యంలో ప్రత్యక్షంగా బ్యాంకు శాఖలలో పనులు ఉన్నవారు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తేదీల్లో భౌతిక శాఖలు మూసివేసినప్పటికీ, చాలా బ్యాంకింగ్ సేవలు డిజిటల్ మార్గాల ద్వారా నిరాటంకంగా కొనసాగుతాయి. నగదు ఉపసంహరణ కోసం వినియోగదారులు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్స్, మొబైల్ యాప్లు, యూపీఐ సేవలు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్లు, ఇతర సాధనాలకు సంబంధించిన లావాదేవీలు మాత్రం ఈ అధికారిక సెలవు దినాల్లో జరగవు. -
8.49 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోకి ఏప్రిల్ నెలలో 19.14 లక్షల మంది చేరారు. ఈ ఏడాది మార్చి నెలలో చేరికతో పోల్చితే 31 శాతం, 2024 ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 1 శాతం వృద్ధి నమోదైంది. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది.ఏప్రిల్లో కొత్త సభ్యుల చేరిక 8.49 లక్షలుగా ఉంది. మార్చి నెలలో కొత్త సభ్యుల చేరిక కంటే 12.49 శాతం ఎక్కువ. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. ఇందులో మహిళా సభ్యులు 2.45 లక్షల మంది ఉన్నారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 17.63 శాతం పెరిగారు. కొత్త సభ్యుల్లో 57 శాతం మేర అంటే, 4.89 లక్షల మంది వయసు 18–25 ఏళ్ల మధ్య ఉంది.మహిళా సభ్యుల నికర చేరిక మాత్రం మార్చి నెలతో పోల్చి చూస్తే 35 శాతం అధికంగా 3.95 లక్షలుగా ఉంది. ఏప్రిల్లో సుమారుగా 15.77 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరో సంస్థలో చేరారు. మార్చి నెలతో పోల్చి చూస్తే 19 శాతం పెరిగింది. నికర చేరికలో అత్యధికంగా 21 శాతం సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు. -
అమెజాన్ డయాగ్నోస్టిక్స్ సేవలు
అమెజాన్ ఇండియా డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించింది. ఇంటి నుంచే కస్టమర్లు ‘అమెజాన్ డయాగ్నోస్టిక్స్’ ద్వారా తమకు కావాల్సిన ల్యాబ్ టెస్ట్లను బుక్ చేసుకోవచ్చని, డిజిటల్ రిపోర్ట్లను అమెజాన్ యాప్ నుంచి పొందొచ్చని ప్రకటించింది. ఆరంజ్ హెల్త్ ల్యాబ్స్ సహకారంతో ఈ సేవలను తొలుత హైదరాబాద్తోపాటు బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై పరిధిలో 450 పిన్కోడ్ల వ్యాప్తంగా అందిస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: స్టార్ రేటింగ్ 4 నుంచి 3కు.. ఇప్పుడేం చేయాలి?వినియోగదారులు నేరుగా అమెజాన్ యాప్ ద్వారా పరీక్షలను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన 60 నిమిషాల్లో సదరు మెడికల్ సిబ్బంది ఇంటికి వచ్చి టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించుకుంటారు. నమూనాలు సేకరించిన తర్వాత గరిష్టంగా 6 గంటల్లో ఫలితాలకు సంబంధించిన డిజిటల్ ల్యాబ్ రిపోర్టులుగా అందజేస్తారు. మొత్తం 800 వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా ప్రకటించింది. దీంతో కలిపి ప్రస్తుత ఫార్మసీ, క్లినిక్ సేవలను అమెజాన్ మెడికల్తో అనుసంధానించింది. -
నియామకాలపై భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం!
ముంబై: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపించనున్నట్టు స్టాఫింగ్ సొల్యూషన్స్ అందించే జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక తెలిపింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ ఉద్యోగులు తమ కంపెనీలు నియామకాలు నిలిపివేయొచ్చని లేదా తగ్గించుకోవచ్చని చెప్పారు. 2006 మంది ఉద్యోగులను ఈ ఏడాది మే 12 నుంచి జూన్ 6 మధ్య సర్వే చేసి వివరాలు విడుదల చేసింది. → సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తమ కంపెనీలు మొత్తంగా నియామకాలను నిలిపివేయొచ్చని లేదా నియామకాలు తగ్గించుకోవచ్చని చెప్పారు. → కాంట్రాక్టు ఉద్యోగులు, ఫ్రీలాన్సర్ల నియామకం దిశగా తమ కంపెనీలు అడుగులు వేస్తున్నట్టు 15 శాతం మంది చెప్పారు. → తమ వేతనాల పెంపు, బోనస్లు, ప్రోత్సాహకాలపై భౌగోళిక అస్థిరతలు ప్రభావం చూపించొచ్చని 36 శాతం మంది అభిప్రాయపడ్డారు. → 21 శాతం మంది పని భారం పెరగనుందని ఆందోళన చెందారు. → అంతర్జాతీయ వ్యాపారం, పర్యటనలపై ప్రభావం పడుతుందని 22% మంది చెప్పారు. → బృంద ధైర్యం, విశ్వాసంపై ప్రభావం పడుతుందని 21 శాతం అభిప్రాయపడ్డారు. → భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల తాము ఎంతో ఆందోళన చెందుతున్నామని, దీని తాలూకూ ఆరంభ హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నట్టు 30 శాతం మంది చెప్పారు. -
తప్పుడు టికెట్ ఇచ్చి తిప్పలు పెడతారా? ఎయిర్లైన్కు జరిమానా
ప్రయాణికుడికి తప్పుడు విమాన టికెట్ ఇచ్చి ఇబ్బందులకు గురి చేసిన ఎయిర్లైన్ సంస్థ స్పైస్ జెట్కు వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. స్పైస్ జెట్ తప్పుడు టికెట్లు జారీ చేయడంతో ఓ సీనియర్ సిటిజన్ ఆర్థికంగా, మానసికంగా నష్టపోయాడని, ఆ ప్రయాణికుడికి రూ.25,000 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.ముంబై (సబర్బన్) జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జూన్ 17న జారీ చేసిన ఉత్తర్వులలో ప్రయాణికుడిని "మానసిక వేధింపులకు" గురిచేసిన సంఘటనలో "లోపభూయిష్టమైన సేవ, నిర్లక్ష్య ప్రవర్తన"కు స్పైస్ జెట్ను వినియోగదారుల కమిషన్ దోషిగా పేర్కొంది.వివరాల్లోకి వెళ్తే.. ఘట్కోపర్ ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్ 2020 డిసెంబర్ 5న ముంబై నుండి దర్భంగాకు స్పైస్ జెట్లో రానూపోనూ టికెట్లను బుక్ చేసుకున్నారు. ముంబై-దర్భంగా ప్రయాణం పూర్తి కాగా, ప్రతికూల వాతావరణం కారణంగా తిరుగు ప్రయాణాన్ని విమానయాన సంస్థ రద్దు చేసింది. 2020 డిసెంబర్ 8న ముంబైలో పీహెచ్డీ ఆన్లైన్ పరీక్షకు హాజరు కావాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికుడు కోరగా అదే రోజు పాట్నా నుంచి కోల్కతాకు, అక్కడి నుంచి ముంబైకి ప్రయాణించేందుకు స్పైస్జెట్ ప్రత్యామ్నాయ టికెట్ అందించింది.అయితే తీరా పాట్నాకు చేరుకున్న తర్వాత ఆ టికెట్లు తప్పుగా ఉన్నాయని విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. దీంతో ప్రయాణికుడు మరుసటి రోజు ఉదయం తన సొంత ఖర్చులతో మరో విమానాన్ని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ఆయనకు మానసిక వేదనతోపాటు ఆర్థిక నష్టాన్ని కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైకి ఆలస్యంగా రావడం వల్ల ఆయన పరీక్షకు కూడా రాయలేకపోయారు.ఇదంతా విమానయాన సంస్థ సేవల్లో లోపం, నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ సదరు వ్యక్తి వినియోగదారుల ప్యానెల్ ను ఆశ్రయించారు. రూ.14,577 ఛార్జీ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.2 లక్షలు, లిటిగేషన్ ఖర్చు కింద రూ.25 వేలు స్పైస్ జెట్ నుంచి ఇప్పించాలని కోరారు.అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రద్దు జరిగిందని, దీనికి తమ బాధ్యత పరిమితమని స్పైస్ జెట్ వాదించింది. అదనపు ఛార్జీలు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, బుకింగ్ ఏజెన్సీ ద్వారా ఫిర్యాదుదారుడికి పూర్తి టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించామని ఎయిర్లైన్స్ పేర్కొంది.దీనిపై వినియోగదారుల కమిషన్ స్పందిస్తూ విమానాల రద్దు విమానయాన సంస్థ నియంత్రణకు అతీతమైనదని అంగీకరిస్తూనే ఫిర్యాదుదారుకి తప్పుడు టికెట్లు జారీ చేసిన నిర్లక్ష్య చర్య నుంచి విమానయాన సంస్థ తప్పించుకోజాలదని స్పష్టం చేసింది. ప్రయాణికుడికి మానసిక వేదనకు పరిహారంగా రూ .25,000, లిటిగేషన్ ఖర్చు కోసం రూ .5,000 చెల్లించాలని కమిషన్ విమానయాన సంస్థను ఆదేశించింది. -
కార్పొరేట్ యోగా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. దేశీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, ఎండీలు ‘యోగా డే’ను జరుపుకున్నారు. ప్రతిరోజూ యోగా సాధనతో సత్యాన్ని అన్వేషిస్తున్నాను. శ్వాసపై నియంత్రణతో భావోద్వేగాలపై పట్టు సాధింవచ్చు. యోగా మార్గం పూర్తి క్రమశిక్షణతో కూడుకున్నది. స్వీయ ఆవిష్కరణకు దిక్సూచి లాంటిది’’ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ సంగీతా రెడ్డి అన్నారు. ‘‘యోగా ద్వారా పది నిమిషాల ఉచ్ఛా్వస నిశ్వాసాలతో, పరుగులు పెడుతున్న ప్రపంచంలోనూ ప్రశాంతతను పొందవచ్చు’’ అని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు లభించిన అమూల్యమైన బహుమతి యోగా. ఇది క్రమశిక్షణ, సాధన, జీవన మార్గం’’ అని జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ తెలిపారు. యోగా గురువు రామ్దేవ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
హెచ్డీఎఫ్సీ కొనుగోలుకు ఐసీఐసీఐ బ్యాంకు ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కొన్నాళ్ల క్రితం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ను కొనుగోలుపై ఆసక్తి చూపింది. అందుకోసం ఆఫర్ కూడా ఇచ్చింది. కానీ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ చందా కొచర్తో నిర్వహించిన చర్చాగోష్టి సందర్భంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మాజీ చైర్మన్, సీనియర్ బ్యాంకర్ దీపక్ పరేఖ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘ఐసీఐసీఐతోనే హెచ్డీఎఫ్సీ ప్రారంభమైంది. అలాంటప్పుడు సొంతింటికి తిరిగి రావచ్చు కదా, అని ఒకసారి మీరు ఆఫర్ ఇచ్చిన సంగతి నాకు గుర్తుంది. కానీ దాన్ని నేను తిరస్కరించాను. అది సముచితం కాదని చెప్పాను‘ అని పరేఖ్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత నియంత్రణ నిబంధనల ఒత్తిడి కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో సంస్థను విలీనం చేశామని, ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ తమకు కొంత తోడ్పాటు అందించిందని ఆయన చెప్పారు. విలీనమనేది సంస్థకు మేలు చేసేది కాగా, భారీ స్థాయి బ్యాంకులు ఉండటమనేది దేశానికే మంచి చేస్తుందని పరేఖ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ భారతీయ బ్యాంకులు ఇతర సంస్థల కొనుగోళ్ల ద్వారా మరింత బలోపేతం కావడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. 44 ఏళ్ల చరిత్ర గల హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థ రివర్స్ మెర్జర్ ద్వారా అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రివర్స్ మెర్జర్కి ముందు దాన్ని కొనుగోలు చేసేందుకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతిపాదన చేసింది. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఏర్పాటుకు ఐసీఐసీఐ బ్యాంక్ మాతృ సంస్థ ఐసీఐసీఐ లిమిటెడ్ ఆర్థికంగా తోడ్పాటు అందించింది. -
కోడింగ్ పోరులో కంపెనీలు..
సాంకేతికత పెరిగే కొద్దీ కృత్రిమ మేథ (ఏఐ) రంగంలో కొత్త రకం యుద్ధాలు మొదలవుతున్నాయి. పైథాన్, రస్ట్లాంటి ప్రోగ్రామింగ్ ల్యాంగ్వేజ్లతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాటాల కోసం అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు, అంకుర సంస్థలు ఒకదానితో మరొకటి పోటీపడుతూ కత్తులు దూసుకుంటున్నాయి. ఏఐ టెక్ దిగ్గజాలు ఇటీవలే పోటాపోటీగా కొత్త సాధనాలను ఆవిష్కరించాయి. గూగుల్ తమ గోడింగ్ ఏజెంట్ జ్యూల్స్ను, మైక్రోసాఫ్ట్ గిట్హబ్ ఏఐ ఏజెంటును, కోడింగ్ స్టార్టప్ విండ్సర్్ఫను 3 బిలియన్ డాలర్లతో కొన్న ఊపులో ఓపెన్ఏఐ సంస్థ కోడెక్స్ను ప్రవేశపెట్టాయి. వీటన్నింటి లక్ష్యం ఏమిటంటే, కోడింగ్ రాయడంలో డెవలపర్లకు సహాయం చేయడం, బగ్లను ఫిక్స్ చేయడం, అలాగే కర్సర్, లవబుల్, బోల్ట్లాంటి స్టార్టప్లతో నేరుగా పోటీపడటం. డెవలపర్లు, అంకుర సంస్థలు ఈ పరిణామాలపై పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. జెన్ఏఐ రేసుతో ముందుగా ప్రభావం పడేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగమేనని పరిశీలకులు చెబుతున్నారు. కంపెనీలు ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం కోడింగ్ టూల్స్ను విరివిగా ఉపయోగిస్తుండటం ఇందుకు నిదర్శనమంటున్నారు. టూల్స్ వాడకం ఒక్కటే ఆప్షన్.. ఏఐ టూల్స్ను ఉపయోగించడాన్ని నేర్చుకోవడం తప్ప ప్రస్తుతం వేరే ఆప్షన్ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో ఇప్పటికే కోడింగ్ 30 శాతం ఏఐ ద్వారానే జరుగుతోంది. అటు ఇన్మొబీ సంస్థ కోడింగ్లో దాదాపు 50 శాతం ఏఐతోనే జరుగుతోంది. దీన్ని 80 శాతానికి పెంచుకునే ప్రయత్నాల్లో కంపెనీ ఉంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం మార్కెట్స్అండ్మార్కెట్స్ గణాంకాల ప్రకారం ఏఐ కోడింగ్ టూల్ మార్కెట్ ఏటా 28 శాతం వృద్ధి చెందుతూ 2028 నాటికి 12.6 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఉత్పాదకత పెరగడంపరంగా ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉండటం, మార్కెటింగ్ .. సేల్స్లాంటి నాన్–టెక్నికల్ టీమ్లు కూడా ఉపయోగించడానికి సులువుగా ఉండటం వంటి అంశాల కారణంగా కోడింగ్ టూల్స్ వినియోగం పెరుగుతోంది. దీంతో ఈ విభాగంపై భారీగా ఇన్వెస్ట్ చేసిన టెక్ దిగ్గజాలకు ఆదాయార్జనకు ఇదొక కొత్త మార్గంగా నిలుస్తోంది. కొత్త ఆదాయ మార్గం.. ఫౌండేషనల్ మోడల్స్పై కోట్ల కొద్దీ డాలర్లు కుమ్మరించిన కంపెనీలు ఇప్పుడు వాటిపై రాబడులు అందుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని ఎల్ఎల్ఎం ఎవాల్యుయేషన్ ప్లాట్ఫాం అయిన నోవియం వర్గాలు తెలిపాయి. ఎల్ఎల్ఎంలకు కోడ్ జనరేట్ చేయడమనేది ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోందని వివరించాయి. కర్సర్ అనే సంస్థ గత రెండేళ్లుగా ఏటా 300 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలను ఆర్జిస్తోందని పేర్కొన్నాయి. ఇక బోల్ట్, లవబుల్లాంటి సంస్థలు కూడా ఊహించని స్థాయిలో ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. తమ ఇంజినీర్ల ఉత్పాదకత కనీసం 10–20 శాతమైన పెరుగుతుందంటే ఈ టూల్స్పై ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం కోడింగ్ ఆటోమేషన్ అనేది ప్రస్తుతం హాట్ సెక్టార్గా మారిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టెక్నికల్యేతర నేపథ్యాలున్న వారు కూడా సులభంగా, సరళంగా వెబ్సైట్లు, చాట్బాట్లను రూపొందించడానికి ఇది ఉపయోగపడుతోందని వివరించాయి. సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏఐ టూల్స్ను మిగతా అవసరాల కోసం పెద్దగా ఉపయోగించకపోయినా ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి.సవాళ్లూ ఉన్నాయి.. కోడింగ్ పని 70 శాతం వేగవంతమవడానికి ఏఐ టూల్స్ ఉపయోగపడుతున్నాయి. కోడింగ్ చేయడానికి టూల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నప్పటికీ, వీటితో సవాళ్లు కూడా ఉన్నాయని నిపుణులు తెలిపారు. పని వేగవంతమవుతోంది కాబట్టి ఏఐని ఉపయోగించి ప్రతి ఒక్కరూ కోడింగ్ చేసేయొచ్చనే అపోహలు ఉంటున్నాయని పేర్కొన్నారు. 70 శాతం పూర్తయితే సరిపోదు, దాన్ని 100 శాతం వరకు తీసుకెళ్లేందుకు నిపుణుల అవసరం అవుతుందని వివరించారు. అంతేగాదు, కోడింగ్ టూల్స్ వినియోగం పెరిగే కొద్దీ రివ్యూ చేయాల్సిన కోడ్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. తమ కస్టమర్లపై ప్రభావం పడకుండా రివ్యూ ప్రక్రియలను కూడా కంపెనీలు ఆటోమేట్ చేస్తున్నాయి. తాము ఏకకాలంలో వివిధ సిస్టమ్లను అభివృద్ధి చేస్తూనే, వాటి అమలు తీరుతెన్నులను కూడా పర్యవేక్షించే ప్రయత్నాల్లో ఉన్నామని ఇన్మొబి వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు తప్పొప్పులను పరీక్షించుకుంటూ ముందుకెళ్తుండటం వల్ల తమ దగ్గర కోడింగ్లో ఏఐ వినియోగం ప్రస్తుతానికి యాభై శాతం స్థాయిలోనే ఉందని వివరించాయి. -
రూ.43 వేల కోట్ల పడవపై పెళ్లి...
ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడి ప్రతి కదలికా వార్తే.. విశేషమే. మరి ఆయన పెళ్లి చేసుకుంటుంటే... ఆర్భాటం కాకుండా ఉంటుందా? అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, కాబోయే భార్య లారెన్ శాంచెజ్ పెళ్లి చేసుకుంటున్నారు. ఇటలీలోని చారిత్రక వెనిస్ నగరంలో మూడు రోజులపాటు వివాహ వేడుక జరగనుంది.61 ఏళ్ల బెజోస్, 55 ఏళ్ల సాంచెజ్ లకు ఇదివరకే వేరొకరితో వివాహాలు జరిగి పిల్లలు ఉన్నారు. జెఫ్ బెజోస్ తాజా వివాహం జూన్ 24 నుండి 26 వరకు జరుగుతుందని వెనిస్ మేయర్ ప్రతినిధి ఒకరు సీఎన్ఎన్తో చెప్పారు. శాన్ జార్జియో మాగియోర్ ద్వీపంలో జరిగే ఈ వేడుకకు సుమారు 200 మంది అతిథులు హాజరుకానున్నారు.ఈ మెగా వెడ్డింగ్ తీసుకురానున్న టూరిస్ట్ ట్రాఫిక్ పై స్థానికులు నిరసన వ్యక్తం చేస్తుండగా, అధికార యంత్రాంగం వైఖరి మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటాలియన్ దినపత్రిక ఇల్ గాజెట్టినో ప్రకారం, వెనిస్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ మోరిస్ సెరాన్ దీని కోసం గట్టిగా ప్రయత్నించారు. వేడుక కోసం డోల్స్ అండ్ గబ్బానాకు చెందిన డిజైనర్ డొమెనికో డోల్స్ ను కూడా రంగంలోకి దింపారు. గత శతాబ్దంలో ఇప్పటికే 5.9 అంగుళాలు మునిగిపోయిన వెనిస్ నగరం వేడుకకు వచ్చే జనంతో మరింత ఒత్తిడి ఎదురవుతుందన్నది స్థానికుల ఆందోళన.విలాసవంతమైన నావపై..వెనీషియన్ సరస్సులో లంగరు వేయనున్న బెజోస్కు చెందిన 500 మిలియన్ డాలర్ల (సుమారు రూ.43 వేల కోట్లు) సూపర్ యాచ్ (విలాస నౌక) కోరులో అసలు వేడుక జరుగుతుందని భావిస్తున్నారు. దీంతోపాటు అబియోనా అనే మరో సహాయక నౌక కూడా ఉంటుంది. వెనిస్ అంతటా పలు ప్రాంతాలు వివాహ కార్యక్రమాలకు నేపథ్యంగా పనిచేస్తాయి. కాక్టెయిల్ రిసెప్షన్లు, వేడుకలు గ్రాండ్ కెనాల్ పై ఉన్న 15 వ శతాబ్దపు ప్యాలెస్ పాలాజ్జో పిసాని మోరెట్టా, పునరుజ్జీవన కళాఖండమైన స్కూలా గ్రాండే డెల్లా మిసెరికోర్డియా, అడ్రియాటిక్ సముద్రం నుండి వెనిస్ మడుగును వేరుచేసే ద్వీపమైన లిడోలోని ఐకానిక్ హోటల్ ఎక్సెల్సియర్ వద్ద జరుగుతాయని భావిస్తున్నారు.గెస్ట్ లిస్ట్ లో ఎవరెవరున్నారంటే..పూర్తి జాబితా గోప్యంగా ఉన్నప్పటికీ, ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రముఖులు, వ్యాపార, రాజకీయ అధి నాయకులు ఇందులో ఉంటారని భావిస్తున్నారు. ఆహ్వాన జాబితాలో బ్రిటీష్ నటుడు ఓర్లాండో బ్లూమ్, అతని కాబోయే భార్య కేటీ పెర్రీతో పాటు మిక్ జాగర్, కిమ్ కర్దాషియాన్, క్రిస్ జెన్నర్, ఓప్రా విన్ఫ్రే, ఈవా లాంగోరియా, లియోనార్డో డికాప్రియో ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్ దిగ్గజాలు బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. వీరు బస చేసేందుకు అత్యంత విలాసవంతమైన హోటళ్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.భారీగా పెళ్లి ఖర్చువెనిస్ లో బెజోస్, సాంచెజ్ల వివాహానికి భారీగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. టెలిగ్రాఫ్ నివేదించిన ఒక వివరణాత్మక అంచనా ప్రకారం.. ఈ వివాహానికి ఖర్చు సుమారు 16 మిలియన్ డాలర్లు (రూ.132 కోట్లు) కావచ్చు. పూల ఏర్పాట్లు, వేదిక అలంకరణ కోసం 1 మిలియన్ డాలర్లు, వెడ్డింగ్ ప్లానింగ్ సేవలకు 3 మిలియన్ డాలర్లు, చారిత్రాత్మక ప్రదేశాల అద్దెకు 2 మిలియన్ డాలర్లు, క్యాటరింగ్ కోసం మరో 1 మిలియన్ డాలర్లు, సాంచెజ్ వార్డ్ రోబ్ కోసం 1.5 మిలియన్ డాలర్లు కేటాయించారు. ప్రఖ్యాత అమెరికన్ సింగర్ లేడీ గాగా ప్రదర్శన ఉంటుందని భావిస్తున్నారు. -
దేశీయ కళలకు జీవం పోసేలా ఎన్ఎంఏసీసీ భారీ ఈవెంట్
భారతీయ కళలు ఉట్టిపడేలా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) ఇండియా వీకెండ్ను న్యూయార్క్ నగరంలోని లింకన్ సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు నీతా అంబానీ తెలిపారు. ఈ వేడుక 2025 సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు జరగనుందని చెప్పారు. ఈమేరకు ‘ఎన్ఎంఏసీసీ.ఇండియావికెండ్’ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వివరాలు వెల్లడించారు. భారతీయ కళల వారసత్వం, సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ఫ్యాషన్, వంటకాలు.. వంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఇందులో ఉండనున్నాయని తెలిపారు.ఇదీ చదవండి: 61 లక్షల యూజర్లను కాపాడిన ఎయిర్టెల్ View this post on Instagram A post shared by NMACC India Weekend (@nmacc.indiaweekend)ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివివైజేషన్ టు నేషన్’ ఈవెంట్లో భాగంగా సాంప్రదాయ నృత్యాలు ఉంటాయని నీతా అంబానీ తెలిపారు. దాంతోపాటు ఈ హైప్రొఫైల్ ఈవెంట్ సెలబ్రిటీల ఫ్యాషన్ షో, దేశ హస్తకళలు, సమకాలీన డిజైన్లకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. క్రీస్తుపూర్వం 5000 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు దేశీయ పరిణామాలను తెలియజేసేలా నాటకాలుంటాయని చెప్పారు. ప్రదర్శనలు, దృశ్యాలు, కథల ద్వారా ఈ ఈవెంట్ చరిత్రకు జీవం పోస్తుందని నీతా అంబానీ చెప్పారు. -
నాన్న చెప్పిన ఒక్క మాటతో రూ.1,200 కోట్లు సంపాదన
ప్రముఖ నటుడు, పారిశ్రామికవేత్త వివేక్ ఒబెరాయ్ సంపద ఫోర్బ్స్ ఇండియా ప్రకారం దాదాపు రూ.1,200 కోట్లుగా ఉంది. ‘సాథియా’, ‘మస్తీ’, ‘రక్తచరిత్ర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు సినిమాల్లో తక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ వెళ్లి ఫుల్ టైమ్ ఆంత్రప్రెన్యూర్గా మారారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపార సామ్రాజ్య పునాదికి దారితీసిన అంశాల గురించి, తండ్రి సురేష్ ఒబెరాయ్ చిన్నతనం నుంచే తనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఎలా నేర్పించారో చెప్పారు.దుబాయ్ ప్రాపర్టీ ఇన్సైడర్ పాడ్కాస్ట్లో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. ‘వ్యాపార మెలకువలు నేర్చుకునే తొలినాళ్లలో నాలో ఆర్థిక అవగాహన పెంపొందించిన ఘనత నా తండ్రికే దక్కుతుంది. అతను ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చి నేను దాన్ని ఎలా విక్రయించబోతున్నాననే దానిపై వ్యాపార ప్రణాళికను రూపొందించమని అడిగేవారు. దాంతో నేను 10 ఏళ్ల వయసు నుంచే వ్యాపారంలోని సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాను. సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నా తండ్రి ఒక విషయం స్పష్టంగా చెప్పారు. తాను ధనవంతుడినని.. మేము కాదనే చెబుతుండేవారు. మేము ఎలా ఉండాలో నిర్ణయించుకోమన్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల వయసులో రిటైర్ అవ్వొచ్చు.. ఆర్థిక సూత్రం ఇదే..‘ఈ కఠినమైన ప్రేమతో కూడిన విధానం టీనేజ్ నుంచే నన్ను తోటివారి కంటే భిన్నంగా ఆలోచించేలా చేసింది. చాలా మంది టీనేజర్లు స్కూళ్లలోని పాఠాలు నేర్చుకుంటుంటే.. నేను మాత్రం మార్కెట్, వ్యాపారం, స్టాక్స్.. వంటి ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన పెంచుకున్నాను. దాంతో నా మొదటి కంపెనీ కోసం 3 మిలియన్ డాలర్లు కూడబెట్టగలిగాను. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. తర్వాతి కాలంలో నా పెట్టుబడిదారుల కోసం చాలా డబ్బు సంపాదించాను. నా 23 ఏళ్ల వయసులో ఆ కంపెనీని విక్రయించాను. తర్వాత ఇతర కంపెనీలను కొనుగోలు చేశాను. ప్రస్తుతం తొమ్మిది సంస్థలను భారత స్టాక్ మార్కెట్లోకి తీసుకెళ్లగలిగాను. మరో నాలుగు కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయాలని యోచిస్తున్నాను’ అని తెలిపారు. -
ఎయిరిండియాకు డ్రీమ్లైనర్ క్రాష్ సెగ
న్యూఢిల్లీ: గతవారం బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా బుకింగ్స్, చార్జీలు పడిపోయాయి. దేశ, విదేశీ రూట్లలో బుకింగ్స్ 20 శాతం పడిపోగా, చార్జీలు సైతం సగటున 8–15 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూన్ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్కి బైల్దేరిన కాస్సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ తగ్గడాన్ని గమనించామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రెసిడెంట్ రవి గోసాయి తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ 18–22 శాతం, దేశీయంగా 10–12 శాతం మేర తగ్గినట్లు వివరించారు. అయితే, ఇదంతా తాత్కాలికమే కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఇండిగో, ఆకాశతో నేరుగా పోటీ ఉన్న దేశీ రూట్లలో ఎయిరిండియా టికెట్ల చార్జీలు 8–12 శాతం తగ్గినట్లు గోసాయి చెప్పారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో చార్జీలు 10–15 శాతం క్షీణించినట్లు వివరించారు. పలువురు ప్రయాణికులు ఎయిరిండియా ఫ్లయిట్స్లో ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్, హై–ఎండ్ లీజర్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సంస్థలకు మళ్లినట్లు వివరించారు. గత వారం రోజులుగా అంతర్జాతీయ రూట్లలో క్యాన్సిలేషన్లు 15–18 శాతం, దేశీ రూట్లలో 8–10 శాతం స్థాయిలో ఉన్నట్లు గోసాయి చెప్పారు. అయితే, ఎయిరిండియా విమానాలు అంతర్జాతీయ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లుగా నియంత్రణ సంస్థలు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారొచ్చని వివరించారు. మరోవైపు, ఎయిరిండియా ఫ్లయిట్స్ బుకింగ్స్ 15–20 శాతం వరకు, చార్జీలు కొన్ని రూట్లలో 10 శాతం వరకు తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా చెప్పారు. -
ఫైనాన్షియల్ సెక్టార్పై మస్క్ కన్ను
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ యూజర్లు ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు. -
రచ్చకెక్కిన కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం
సన్టీవీ ఛైర్మన్ కళానిధి మారన్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఆయన సోదరుడు దయానిధి మారన్ కళానిధితోపాటు మరో ఏడుగురికి లీగల్ నోటీసులు పంపించడంతో పరిస్థితులు తీవ్రంగా పరిణమించాయి. కళానిధి మారన్ తన వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళానిధిపై చర్యలు తీసుకోవాలని దయానిది కోరారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్కు కూడా నోటీసులు అందాయి.కళానిధి మారన్ సారధ్యం వహిస్తున్న సన్ గ్రూప్ ఆధ్వర్యంలో టెలివిజన్, రేడియో, ప్రింట్, సినిమా, క్రీడా విభాగాల్లో వ్యాపారాలున్నాయి. కళానిధితో సంబంధం ఉన్న కీలక కంపెనీలు, వెంచర్ల జాబితా కింది విధంగా ఉంది.మీడియా, ఎంటర్టైన్మెంట్సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ - 37 టీవీ ఛానళ్లు నిర్వహిస్తోంది.సన్ పిక్చర్స్ - చిత్ర నిర్మాణ సంస్థ.సన్ డైరెక్ట్ - డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) శాటిలైట్ టీవీ సర్వీస్.సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ - కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ.కేఏఎల్ పబ్లికేషన్స్ / కుంగుమమ్ పబ్లికేషన్స్ - కుంగుమమ్ తమిళ పత్రికను ప్రచురిస్తుంది.కేఏఎల్ కేబుల్స్ - కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.కేఏఎల్ రేడియో / సౌత్ఏషియా ఎఫ్ఎమ్ - సూర్యన్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ వంటి బ్రాండ్ల ద్వారా 69 ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను నిర్వహిస్తుంది.ఇదీ చదవండి: గూగుల్, ఫేస్బుక్, టెలిగ్రామ్.. పాస్వర్డ్లు లీక్ప్రింట్ మీడియాదినకరన్ - ఈ గ్రూపునకు చెందిన ప్రముఖ తమిళ దినపత్రిక.క్రీడలుసన్ రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ.సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ - దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జట్టు.గతంలోని వెంచర్స్పైస్ జెట్ - మారన్ 2010 నుంచి 2015 వరకు కేఏఎల్ ఎయిర్ వేస్ ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగా అందులో నుంచి నిష్క్రమించారు. -
ఐఐటీలకు ధీటుగా ఎల్పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ
భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్మార్క్ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్పీయూ)లో ఇటీవలి ఫ్లేస్మెంట్ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్పీయూ ప్లేస్మెంట్ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్మెంట్ డ్రైవ్తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్తో భారీ ఎల్పీయూ ప్లేస్మెంట్ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్పీయూ తాజా ప్లేస్మెంట్ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్మెంట్ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్కు ప్రపంచ ఖ్యాతిఎల్పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్మెంట్ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్పీయూ ఎందుకంటే?ఎల్పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్మెంట్ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్ ప్లేస్మెంట్ ట్రెయినింగ్ పొందుతారు.‘ఎల్పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్మెంట్ ల్యాండ్ స్కేప్లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి. -
వీర్య దానంతో పుట్టినవారికి ఆస్తిలో సమాన వాటా
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తన మొత్తం సంపద దాదాపు 17 బిలియన్ డాలర్లను తన 100 మందికి పైగా పిల్లలకు పంచాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదు.. ఈ పిల్లలందరూ తన వీర్యదానం వల్ల పుట్టిన సంతానం కావడం విశేషం. ఫ్రెంచ్ మ్యాగజైన్ లీ పాయింట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల దురోవ్ తాను కనీసం 106 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అని చెప్పారు. వీరిలో ఆరుగురు వేర్వేరు తన భాగస్వాములతో సహజంగా గర్భం దాల్చగా, మిగిలిన 100 మందికి పైగా పిల్లలు 12 దేశాల్లో జన్మించారని చెప్పారు.‘నా పిల్లల్లో కొందరు సహజంగా గర్భం దాల్చి పుట్టినవారున్నారు. చాలామంది నా స్పెర్మ్ దానం వల్ల పుట్టినవారున్నారు. వారంతా నా బిడ్డలే. అందరికీ నా ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి’ అని చెప్పారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్, ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం దురోవ్ నికర విలువ 13.9 బిలియన్ డాలర్ల నుంచి 17.1 బిలియన్ డాలర్ల మధ్య ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఒక్కో బిడ్డకు సుమారు 131 మిలియన్ డాలర్ల నుంచి 161 మిలియన్ డాలర్ల వరకు వారసత్వంగా లభిస్తుంది. అయితే తన పిల్లలకు సమాన హక్కులు ప్రకటించినట్లు ఉన్న ఇంటర్వ్యూ తేదీ(జూన్ 19, 2025) నుంచి 30 సంవత్సరాల వరకు తన ఆస్తిపై హక్కు ఉండదని చెప్పారు. ముప్పై ఏళ్ల తర్వాతే తమకు హక్కులుంటాయన్నారు. వారు స్వతంత్రంగా ఎదగడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దురోవ్ వివరించారు. వారు సాధారణ ప్రజల మాదిరిగా జీవించాలని, ఒంటరిగా తమను తాము నిర్మించుకోవాలని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్! తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..దురోవ్ను ఇటీవల ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై వచ్చిన అనేక ఆరోపణల్లో ప్రధానంగా టెలిగ్రామ్ను మనీలాండరింగ్, పిల్లలపై లైంగిక వేధింపులు.. వంటి వాటికి వినియోగిస్తున్నారనే వాదనలున్నాయి. రష్యాలో జన్మించిన పారిశ్రామికవేత్త దురోవ్కు ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండింటిలోనూ పౌరసత్వం ఉంది. నిర్దిష్ట అనుమతులు లేకుండా ఫ్రాన్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదని నిషేధం విధించారు. -
టర్కీ సంస్థ నిర్వహణలో ఎయిరిండియా ఫ్లైట్?
అహ్మదాబాద్లో 270 మందిని బలిగొన్న ఎయిరిండియా ఏఐ-171 డ్రీమ్లైనర్ ప్రమాదానికి టర్కిష్ ఎయిర్లైన్స్ మెయింటెనెన్స్ సెంటర్తో సంబంధం ఉందన్న ఊహాగానాలను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఖండించారు. టైమ్స్ నెట్ వర్క్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లీట్లోని 33 బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల్లో ఏదీ టర్కీ సంస్థ నిర్వహణలో లేదని స్పష్టం చేశారు.‘ఎయిరిండియా ఆధ్వర్యంలోని 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఏ ఒక్కటీ టర్కిష్ సంస్థ నిర్వహణలో లేదు. వాటిలో చాలా వరకు ఏఈఎస్ఎల్, సింగపూర్లోని ఎస్ఐఏ ఇంజినీరింగ్ నిర్వహణలో ఉన్నాయి. బోయింగ్ 777 విమానాల్లో కొన్నింటిని మాత్రమే టర్కిష్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఆయా కాంట్రాక్టులు కూడా సమీక్షలో ఉన్నాయి’ అని చెప్పారు. ప్రస్తుతం ప్రమాద సంఘటనపై జరుగుతున్న దర్యాప్తునకు సంబంధించి కొందరు విజిల్ బ్లోయర్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖరన్ ఈ వాదనలను ‘ఊహాజనితమైనవి’గా అభివర్ణించారు. ఘటనపై మరింత స్పష్టత వచ్చేందుకు విమాన డేటా, కాక్ పిట్ వాయిస్ రికార్డర్లు, బ్లాక్ బాక్స్ నివేదికల కోసం వేచి ఉండాలని తెలిపారు.‘యూట్యూబ్, మీడియా ఛానల్స్, సోషల్ మీడియా ఇలా చాలా మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ డేటాతో నిజం తేలుతుంది. దాని కోసం వేచిచూడాలి తప్పా ఓ నిర్ణయానికి రాకూడదు’ అని అన్నారు. ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. ‘ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. వారిలో ఎవరినీ ఓదార్చడానికి నాకు మాటలు లేవు. టాటా యాజమాన్యంలోని విమానయాన సంస్థలో జరిగిన ఈ ప్రమాదం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాను. ఈ సమయంలో మేము వారికి తోడుగా ఉండడం తప్పా వారి లోటును తీర్చలేం. వారికి అన్ని విధాలుగా తోడుంటాం. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, కొడుకును కోల్పోయిన వారిని ఓదార్చడం చాలా కష్టం’ అని అన్నారు.ఇదీ చదవండి: వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధంఈ ఘోర ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది. గుజరాత్ ప్రతినిధి, పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) కార్యదర్శి, ఎంహెచ్ఏ అదనపు కార్యదర్శితో కూడిన ఉన్నత స్థాయి కమిటీని దర్యాప్తులో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసింది. -
వేలాది ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
ప్రముఖ ఐటీ సర్వీస్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రధానంగా తన సేల్స్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వేలాది ఉద్యోగాలను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో కంపెనీ పునర్నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జులై ప్రారంభంలో ఉద్యోగాల్లో కోతలను ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు.ఇప్పటికే మైక్రోసాఫ్ట్ మే నెలలో 6,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. తర్వాత కొన్ని వారాలకు 300కి పైగా తొలగించింది. ఈ ఏడాది మూడో అతిపెద్ద ఉద్యోగుల తగ్గింపునకు సంస్థ సిద్ధమవుతోంది. గతంలో ప్రకటించిన లేఆఫ్స్ ద్వారా ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్లు ప్రభావితం అయ్యారు. ఈసారి భిన్నంగా మైక్రోసాఫ్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగ కోతలను విధించే అవకాశం ఉంది. జూన్ 2024 నాటికి కంపెనీ మొత్తం 2,28,000 మంది ఉద్యోగుల్లో 45,000 మంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు.ఇదీ చదవండి: కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపుప్రత్యేకంగా సేల్స్ విభాగంతో సంబంధం లేకుండా చిన్న, మధ్య తరహా కస్టమర్లకు ఎక్కువ సాఫ్ట్వేర్ సర్వీసులను అమ్మేందుకు థర్డ్ పార్టీ సంస్థలను వాడుకునేలా కంపెనీ ఏప్రిల్లో ప్రణాళికలు ప్రకటించింది. దాంతో ఈ విభాగంలో కోతలకు పూనుకుంటున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. కృత్రిమ మేధ పెట్టుబడుల నిర్వహణ టెక్ కంపెనీలకు సవాలుగా మరుతుంది. దాంతో ఇలా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డేటా సెంటర్ వ్యయం కోసం మైక్రోసాఫ్ట్ సుమారు 80 బిలియన్ డాలర్లు కేటాయించింది. -
కొనుగోళ్ల వైపు ‘టాటా’ చూపు
ఎఫ్ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను అన్వేషిస్తోంది. ఓవైపు సొంతంగా కార్యకలాపాలు విస్తరిస్తూనే టాటా గ్రూప్ కంపెనీ కొంతకాలంగా పలు సంస్థలను సొంతం చేసుకుంటోంది. ఏడాది క్రితం క్యాపిటల్ ఫుడ్స్తోపాటు, ఆర్గానిక్ ఇండియాను రూ.7,000 కోట్ల సంయుక్త విలువలో కొనుగోలు చేసింది. మార్కెట్లో కంపెనీ ఎల్లవేళలా ఇతర సంస్థల కొనుగోలుకి సిద్ధంగా ఉంటుందని టాటా కన్జూమర్ డైరెక్టర్ పీబీ బాలాజీ పేర్కొన్నారు.కంపెనీ పోర్ట్ ఫోలియోకు సరిపోయే సంస్థ తగిన ధరలో దొరికితే వదిలిపెట్టబోమని బాలాజీ తెలియజేశారు. అయితే సొంతంగా కార్యకలాపాలు విస్తరించడానికే తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఐదేళ్ల క్రితం ఆవిర్భవించిన కంపెనీ ప్రధానంగా ఫుడ్ విభాగంలో కొనుగోళ్లకు తెరతీసింది. ఈ బాటలో బెంగళూరు సంస్థ కొట్టారం ఆగ్రో ఫుడ్స్ను సైతం చేజిక్కించుకుంది. ఇదీ చదవండి: మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలుఅత్యంత గరిష్టాలకు చేరిన టీ ధరలు ఇటీవల నిలకడను సంతరించుకుంటున్నట్లు వాటాదారుల వార్షిక సమావేశంలో బాలాజీ పేర్కొన్నారు. వెరసి ఇకపై కంపెనీ మార్జిన్లు, లాభదాయకత మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది తేయాకు దిగుబడి గతేడాదిని మించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కాఫీ ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈ ఏడాది సాధారణ స్థితికి చేరవచ్చని అంచనా వేశారు. -
మూడేళ్లలో లక్ష ఎంఎస్ఎంఈలు
అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ భారత్లో మరిన్ని చిన్న, మధ్య తరహా సంస్థలతో (ఎంఎస్ఎంఈ) కలిసి పని చేసే ప్రణాళికల్లో ఉంది. తమ ‘వృద్ధి’ ప్రోగ్రాం కింద వచ్చే మూడేళ్లలో భారత్లో తమ సరఫరా వ్యవస్థలో మరో లక్ష ఎంఎస్ఎంఈలను భాగం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం చిన్న సంస్థల కార్యకలాపాల విస్తరణకు తోడ్పడే ఐడియాస్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్ (ఐ2ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వాల్మార్ట్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేసన్ ఫ్రెమ్స్టాడ్ తెలిపారు.ఇప్పటికే ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ మార్కెట్ప్లేస్ల ద్వారా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో చిన్న సంస్థలను అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. వృద్ధి ప్రోగ్రాం ద్వారా కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఎంఎస్ఎంఈలకు అవసరమయ్యే నైపుణ్యాల్లో వాల్మార్ట్ మార్గదర్శకత్వం వహిస్తోంది. 2019లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 70,000 ఎంఎస్ఎంఈలకు శిక్షణనిచ్చినట్లు ఫ్రెమ్స్టాడ్ వివరించారు. ఇదీ చదవండి: ‘రేర్ ఎర్త్’ రీసైక్లింగ్పై రూ.100 కోట్ల పెట్టుబడులువృద్ధి ప్రోగ్రాం విజయవంతం కావడంతో మెక్సికో, అమెరికాలో కూడా వాల్మార్ట్ ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గత 25 ఏళ్లుగా భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న వాల్మార్ట్ రెండు దశాబ్దాల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆహారోత్పత్తులు, ఫార్మా, సైకిళ్లు మొదలైనవి కొనుగోలు చేసింది. -
‘రేర్ ఎర్త్’ రీసైక్లింగ్పై రూ.100 కోట్ల పెట్టుబడులు
రేర్ ఎర్త్ లోహాల (ఆర్ఈఈ) రీసైక్లింగ్ సామర్థ్యాలను వచ్చే ఏడాది, రెండేళ్ల వ్యవధిలో 30,000 టన్నులకు పెంచుకోవాలని ఈ–వేస్ట్ రీసైక్లింగ్ కంపెనీ అటెరో నిర్దేశించుకుంది. ఇందుకోసం రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు సంస్థ సీఈవో నితిన్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి 300 టన్నుల సామర్థ్యం ఉంది. ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్, ఇతర టెక్నాలజీ ఉత్పత్తుల తయారీలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కీలకంగా ఉంటాయి. నియోడైమియం, ప్రసియోడైమియం, డిస్ప్రోజియంలాంటి అరుదైన ఖనిజాల వెలికితీతపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు గుప్తా వివరించారు.ఇదీ చదవండి: బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తుకీలకమైన ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడకుండా భారత్ స్వయం సమృద్ధి సాధించాలనేది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఆర్ఈఈ మార్కెట్ 2029 నాటికి ఆర్ఈఈ మార్కెట్ ఏటా 12.6 శాతం వార్షిక వృద్ధితో 10.9 బిలియన్ డాలర్లకు చేరుతుందని, ఆర్ఈఈ మ్యాగ్నెట్ల మార్కెట్ 2033 నాటికి 30.3 బిలియన్ డాలర్ల స్థాయిని దాటొచ్చని అంచనాలు నెలకొన్నాయి. అటెరోకి 46 గ్లోబల్ పేటెంట్లు ఉన్నాయి. అమెరికా, యూరప్లో కార్యకలాపాలను విస్తరించే యోచనలో ఉంది. -
దేశీ విస్తరణపై అమెజాన్ దృష్టి
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ దేశీ కార్యకలాపాలను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు ఈ కేలండర్ ఏడాది(2025)లో రూ. 2,000 కోట్లు కేటాయించనుంది. ప్రధానంగా నెట్వర్క్ విస్తరణ, అప్గ్రేడ్పై పెట్టుబడులు వెచి్చంచనుంది. తద్వారా ఆధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలు, ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఒక ప్రకటనలో అమెజాన్ పేర్కొంది. అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లు, బ్రాడ్బ్యాండ్ విస్తరణ, డిజిటల్ చెల్లింపులకుతోడు, వినియోగ వ్యయాలు పెరుగుతుండటం వంటి సానుకూలతల నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలను మరింత అప్గ్రేడ్ చేసేందుకు ప్రణాళికలు వేసింది. ఇటీవల కొన్నేళ్లుగా అమెజాన్సహా, రిటైల్ రంగ దిగ్గజం వాల్మార్ట్ సంస్థ ఫ్లిప్కార్ట్ తదితర ఆన్లైన్ సంస్థలు దేశీయంగా ఈబిజినెస్ను పరుగుపెట్టిస్తున్న సంగతి తెలిసిందే. కోట్లకొద్దీ పెట్టుబడులను వెచి్చంచడం ద్వారా దేశీయంగా ఈకామర్స్ మార్కెట్ను భారీగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2030కల్లా ఈకామర్స్ మార్కెట్ 21 శాతం వార్షిక వృద్ధితో 325 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా.. తాజా పెట్టుబడులతో అమెజాన్ దేశవ్యాప్తంగా అవకాశమున్న పిన్కోడ్లకు సరీ్వసులను విస్తరించాలని భావిస్తోంది. ఇందుకు కొత్త ప్రాంతాలలో వేర్హౌస్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్నవాటిని ఆధునీకరించడం, డెలివరీ నెట్వర్క్ను వేగవంతం చేయడం తదితర సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. -
డ్రీమ్ఫోక్స్కి బ్యాంకులు గుడ్బై?
ముంబై: గతేడాది పలు ఎయిర్పోర్టుల్లో కస్టమర్లు లాంజ్ సర్వీసులను పొందడంలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ట్రావెల్, లైఫ్స్టయిల్ సర్వీసుల అగ్రిగేటర్ డ్రీమ్ఫోక్స్తో ఒప్పందం నుంచి తప్పుకోవాలని పలు బ్యాంకులు, కార్డ్ నెట్వర్క్లు భావిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మాస్టర్కార్డ్ మొదలైనవి ఉన్నాయి. మరిన్ని బ్యాంకులు వాటి బాటలో నడిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లిస్టెడ్ కంపెనీ అయిన డ్రీమ్ఫోక్స్ దేశీయంగా దిగ్గజ ఎయిర్పోర్ట్ లాంజ్ ఆపరేటర్లలో ఒకటిగా కార్యకలాపాలు సాగిస్తోంది. గతేడాది సెపె్టంబర్ 22న సర్వీసుల్లో అంతరాయం కారణంగా పలు విమానాశ్రయాల్లో లాంజ్ని ఉపయోగించుకోలేక బ్యాంకులు, కార్డ్ నెట్వర్క్లకు చెందిన వేల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. 34 ఎయిర్పోర్టుల్లోని 49 లాంజ్ సర్వీసులు అకస్మాత్తుగా నిలి్చపోయాయి. -
9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్
భారత ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సిబుల్ స్టాఫ్(సంస్థలకు అనుకూలంగా అవసరం మేరకే నియమకం అయ్యే ఉద్యోగులు) విధానం కీలకంగా మారుతోంది. సంస్థలు ఈ ఫ్లెక్సీ స్టాఫ్ను ప్రధాన శ్రామిక శక్తిగా స్వీకరించడంతో ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్న గిగ్ ఎకానమీలో 2030 నాటికి 9 లక్షల మంది నిపుణులు చేరుతారని ఒక నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ ఐటీ / ఐటీఈఎస్ రంగంలో 3,90,000 ఫ్లెక్సీ స్టాఫ్ ఉన్నారు. ఇది ఈ రంగంలోని మొత్తం 5.8 మిలియన్ల నిపుణుల్లో 7 శాతం అని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్నెట్ నివేదికలో తెలిపింది. ‘ది రైజ్ ఆఫ్ ఫ్లెక్సీ స్టాఫింగ్: అవుట్లుక్ ఫర్ ఇండియా ఐటీ / ఐటీఈఎస్ టాలెంట్ ల్యాండ్ స్కేప్’ పేరుతో రిపోర్ట్ తయారు చేసింది.2030 నాటికి ఈ ఫ్లెక్సీ స్టాఫ్ రెండింతలు పెరిగి 9,00,000కు చేరుకుంటుందని, 15 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)తో వృద్ధి చెందుతుందని నివేదిక అంచనా వేసింది. రియల్ టైమ్ హైరింగ్ డేటా, మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఆధారంగా కెరియర్నెట్ ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ గ్లోబల్ ఆఫ్షోరింగ్ హబ్ కావడంతో ఐటీ/ ఐటీఈఎస్ సెక్టార్లో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ యాక్సిలరేషన్, ప్రపంచ ఆర్థిక మార్పుల మధ్య ఫ్లెక్సీ స్టాఫింగ్ నియామకం పెరుగుతుందని, స్పెషలైజేషన్, స్కేలబిలిటీకి మద్దతు ఇచ్చేందుకు ఈ నమూనాను చాలా కంపెనీలు అనుసరిస్తున్నట్లు కెరియర్నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు.ఇదీ చదవండి: పీఎస్యూల డీలిస్టింగ్ సరళతరంఐటీ/ఐటీఈఎస్ శ్రామిక శక్తిలో 25 శాతంతో ఫ్లెక్సీ స్టాఫ్ నియామల్లో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ 15 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై సహా ఇతర ప్రధాన నగరాలు మొత్తం వాటాలో సుమారు 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్లెక్సీ ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
హిందుస్తాన్ జింక్లో వాటా విక్రయించిన దిగ్గజ కంపెనీ
అనిల్ అగర్వాల్ గ్రూప్ దిగ్గజం వేదాంతా తాజాగా మైనింగ్ దిగ్గజం హిందుస్తాన్ జింక్లో మైనారిటీ వాటా విక్రయించింది. బుక్బిల్డ్ పద్ధతిలో సంస్థాగత ఇన్వెస్టర్లకు హిందుస్తాన్ జింక్లో 1.6 శాతం వాటాకు సమానమైన 66.7 మిలియన్ షేర్లను అమ్మినట్లు వేదాంతా పేర్కొంది. డీల్ విలువను రూ.3,028 కోట్లుగా వెల్లడించింది. కంపెనీ వ్యూహాత్మక కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకున్న విశ్వాసాన్ని తాజా లావాదేవీ ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది.ప్రస్తుత ఏడాది(2025–26)కి కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు అంగీకరించినట్లు మరో ప్రకటనలో స్టాక్ ఎక్స్ఛేంజీలకు వేదాంతా సమాచారమిచ్చింది. ఇందుకు ఈ నెల 24(మంగళవారం) రికార్డ్ డేట్గా ప్రకటించింది. కాగా.. వేదాంతా వివిధ బిజినెస్ విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలు అమలు చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా సమీకరించిన నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడం ద్వారా బ్యాలన్స్ షీట్ పటిష్టతకు వినియోగించే వీలుంది. తద్వారా ఆర్థిక సౌలభ్యతతోపాటు.. స్వతంత్ర కంపెనీలుగా ఏర్పాటుకానున్న వివిధ బిజినెస్ల వృద్ధి ప్రణాళికలకు మద్దతు లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’ఈ ఏడాది సెప్టెంబర్లోగా విభిన్న బిజినెస్లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. విడదీత తదుపరి వేదాంతా అల్యూమినియం, వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంతా పవర్, వేదాంతా స్టీల్ అండ్ ఫెర్రస్ మెటీరియల్స్, వేదాంతా బేస్ మెటల్స్, వేదాంతా లిమిటెడ్ పేరుతో ఆరు సంస్థలుగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది. -
‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’
మోసాలతో సంక్షోభం బారిన పడిన ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఆర్థిక నివేదికల పూర్తిస్థాయి పరిశీలనకు, ఆడిట్ పరమైన లోపాలు ఉన్నాయా? అన్నది నిర్ధారించేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత మండలి ఐసీఏఐ ప్రకటించింది. ఇప్పటికే ఐసీఏఐకు చెందిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ రివ్యూ బోర్డ్ (ఎఫ్ఆర్ఆర్బీ) ఈ రెండు సంస్థల ఆర్థిక నివేదికల సమీక్షను ప్రారంభించిందని, ఇందులో గుర్తించిన వాస్తవాల ఆధారంగా, అవసరమైతే ఆడిటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: భారత ఆటబొమ్మల నాణ్యత భేష్‘ఖాతాల్లో అసలు ఏమి జరిగిందన్నది తెలుసుకోవడానికి కనీసం ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువే సమయం తీసుకోవచ్చు’ అని ఐసీఏఐ ప్రెసిడెంట్ చరణ్జిత్ సింగ్ నందా తెలిపారు. ఇండస్ఇండ్ బ్యాంక్, జెన్సోల్ ఇంజినీరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో వాస్తవాలు, పారదర్శకత లేదని ఎఫ్ఆర్ఆర్బీ గుర్తించినట్టయితే, అప్పుడు ఐసీఏఐ క్రమశిక్షణ చర్యల కమిటీ ముందుకు ఈ అంశం వెళుతుందని చెప్పారు. జెన్సోల్ ఇంజినీరింగ్ ఖాతాల నుంచి నిధులు మళ్లించినట్టు సెబీ దర్యాప్తులో వెల్లడి కావడం తెలిసిందే. ఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్ పోర్ట్ఫోలియోలో రూ.1,979 కోట్ల మేర ఖాతాల్లో లోపాలున్నట్టు, స్వయంగా బ్యాంకు వెల్లడించడం గమనార్హం. -
హైదరాబాదీ సంస్థకు డీబీఎస్ ఫౌండేషన్ అవార్డు
వృద్ధులకు సంరక్షణ సేవలు అందించే హైదరాబాదీ సంస్థ లైఫ్ సర్కిల్ హెల్త్ సర్వీసెస్కు (ఇండియా) డీబీఎస్ ఫౌండేషన్ ఇంపాక్ట్ బియాండ్ అవార్డు దక్కింది. దీనితో సంస్థకు సుమారు రూ. 3 కోట్ల గ్రాంట్ ఫండింగ్ లభించింది. ఈ తరహా సేవలకు గణనీయంగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సంస్థ సీఈవో అనంత్ కుమార్ తెలిపారు. లైఫ్ సర్కిల్ వృద్ధులకు ప్రొఫెషనల్గా సర్వీసులను అందించడమే కాకుండా సంరక్షకులకు శిక్షణతో పాటు జీవనోపాధి కూడా కల్పిస్తోందని డీబీఎస్ ఫౌండేషన్ హెడ్ కరెన్ నిగుయి చెప్పారు. వంద దరఖాస్తులు రాగా సింగపూర్, చైనా, హాంకాంగ్, భారత్కి చెందిన మొత్తం నాలుగు సంస్థలు విజేతలుగా నిల్చియి. వాటిలో లైఫ్ సర్కిల్ కూడా ఒకటి. ఇప్పటివరకు 5,000 మంది సంరక్షకులకు ప్లేస్మెంట్ కల్పించింది.అనుబంధ సంస్థగా జియో పేమెంట్స్ఎస్బీఐ వాటా జియో ఫైనాన్షియల్ చేతికిజియో పేమెంట్స్ బ్యాంక్లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ)కు గల మొత్తం 17.8 శాతం వాటాను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 104.54 కోట్లు వెచ్చించినట్లు జియో ఫైనాన్షియల్ తాజాగా వెల్లడించింది. దీంతో జియో పేమెంట్స్ బ్యాంక్ పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించినట్లు పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ అనుమతి తదుపరి ఎస్బీఐ నుంచి 7,90,80,000 ఈక్విటీ షేర్లను రూ. 104.54 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. -
ఏసీ అమ్మకాల్లో వృద్ధి అంతంతే..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూమ్ ఏసీల విక్రయాలు 10–15 శాతమే పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అధిక డిమాండ్ ఉండే జూన్లో ఉత్తర, పశ్చిమ భారత్లో వేడి వాతావరణం నెలకొనగా, మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కంపెనీలు తమ అంచనాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏసీల అమ్మకాలకు వేసవి సీజన్ ఎంతో కీలకం. అధిక శాతం అమ్మకాలు ఈ సీజన్లోనే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది వేసవిలో మధ్యంతర వర్షాలు ఈ రంగం ఆశలపై నీళ్లు చల్లింది. జూన్లో ఉత్తరాది అంతటా వేడి వాతావరణం నెలకొనడం ఒక్కటి విక్రయాలకు కాస్తంత మద్దతునిచ్చే అంశం. నిజానికి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫిబ్రవరి, మార్చిలోనే రూమ్ ఏసీల అమ్మకాలకు అధికంగా నమోదు కావడం గమనార్హం. దీంతో గతేడాది సీజన్తో పోలి్చతే ఈ ఏడాది 25 శాతం అధిక అమ్మకాలపై కంపెనీలు అంచనాలు వేసుకున్నాయి. తర్వాత మారిన వాతావరణ పరిస్థితులతో ఈ అంచనాలు నిజం కాలేదు. ‘‘25–30 శాతం మేర అమ్మకాల వృద్ధిని ఆశించాం. కానీ, అనుకున్న స్థాయిలో అమ్మకాలు సాధించలేదు. ఈ వేసవి నిరాశపరిచిందనడంలో సందేహం లేదు. కానీ, వ్యాపారంలో ఇదొక భాగమే. ఈ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే’’అని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది ఆర్ఏసీ విక్రయాలు 10–15% వృద్ధికి పరిమితం కావొచ్చని చెప్పారు. జూన్ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయంటూ భారత వాతావరణ శాఖ గత వారం అంచనాలు వెల్లడించడం గమనార్హం. సెపె్టంబర్ క్వార్టర్లో పుంజుకోవచ్చు.. ప్రస్తుత జూన్ త్రైమాసికం రూమ్ ఏసీ రంగానికి అనుకూలంగా లేదని.. సెపె్టంబర్ త్రైమాసికంలో విక్రయాలు పుంజుకోవచ్చని త్యాగరాజన్ పేర్కొన్నారు. పండుగల సందర్భంగా డిమాండ్ పెరగొచ్చన్నారు. ఎనర్జీ లేబుళ్లు మారుతుండడం, డిస్కౌంట్ ఆఫర్లతో గత నిల్వలను తగ్గించుకోగలమన్నారు. ఇంధన ఆదా లేబుళ్లను మార్చే ముందు ముందస్తు కొనుగోళ్లు పెరగడం సహజమేనన్నారు. 2024 అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు గత రెండు నెలల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి సైతం తెలిపారు. కనుక జూన్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చని, గతేడాది మాదిరిగా 25 శాతం వృద్ధిని సాధించడం సవాలుగా పేర్కొన్నారు. వేసవిలో అమ్మకాలు గరిష్టంగా ఉండే సమయంలో వర్షాలు దెబ్బతీసినట్టు చెప్పారు. ఏప్రిల్, మే నెలలో అమ్మకాల వృద్ధిని కోల్పోవడంతో, మిగిలిన ఏడాదిలో కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాదిలో వేడి వాతావరణంతో ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయంటూ, ఇదొక్కటే సానుకూలతగా పేర్కొన్నారు. జూన్లో కాస్త మెరుగు.. హైయర్ అప్లయన్సెస్ ఇండియా మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు మెరుగైన వృద్ధిని సొంతం చేసుకుంది. గతేడాదితో పోలి్చతే రూమ్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు సంస్థ ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ వెల్లడించారు. ‘‘ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకు సానుకూలంగా లేవు. 10–15 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. జూన్లో తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి. ఫిబ్రవరి, మార్చిలోనే ప్రణాళిక మేరకు ముందస్తు కొనుగోళ్లు జరిగాయి’’అని వివరించారు. కానీ, ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లు.. ఉష్ణోగ్రతలు పెరగకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా జూన్లో గత పది రోజులుగా ఉత్తరాది ప్రాంతంలో అమ్మకాలు పెరిగినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో మిగిలిన కాలానికి పరిశ్రమ అంచనాలు తగ్గించుకున్నట్టు సతీష్ తెలిపారు. గతేడాది స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చంటూ.. అమ్మకాలు 10–15 శాతం వృద్ధికి పరిమితం కావొచ్చన్నారు. -
రెడిట్ ప్రచారకర్తగా సచిన్ టెండుల్కర్
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫాం రెడిట్కు ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. ఇకపై తన రెడిట్ ప్రొఫైల్ ద్వారా తన అభిప్రాయాలు, మ్యాచ్ల విశ్లేషణ, ఎక్స్క్లూజివ్ కంటెంట్ను ఆయన షేర్ చేస్తారు. అలాగే భారత్తో పాటు ఇతరత్రా మార్కెట్ల కోసం రూపొందించే కొత్త మార్కెటింగ్ ప్రచార ప్రకటనల్లో ఆయన కనిపిస్తారని కంపెనీ వివరించింది. వివిధ వర్గాలందరినీ ఒక చోటికి చేర్చే రెడిట్తో జట్టు కట్టడం సంతోషకరమైన విషయమని టెండుల్కర్ తెలిపారు. శ్రేష్టమైన క్రికెట్కు టెండుల్కర్ పేరు పర్యాయపదమని రెడిట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గేశ్ కౌశిక్ వివరించారు. తమ ప్లాట్ఫాంలో క్రీడలపై ఆసక్తి వార్షికంగా 30 శాతం పెరగడంతో స్పోర్ట్స్ కంటెంట్కి మరింత ప్రాధాన్యం ఇవ్వడం మీద రెడిట్ దృష్టి పెడుతోంది. ఈ మధ్యే ఇటాలియన్ ఫుట్బాల్ లీగ్ సిరీ ఏ, గతేడాది ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ, ఎంఎల్బీ తదితర అమెరికన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
ప్యారిస్ ఎయిర్షోలో రఘు వంశీ టర్బోజెట్ ఇంజిన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యారిస్లో జరుగుతున్న 55వ అంతర్జాతీయ ఎయిర్షోలో హైదరాబాద్ సంస్థ రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్ తమ 40 కేజీఎఫ్ మైక్రో టర్బోజెట్ ఇంజిన్ను ఆవిష్కరించింది. దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించినట్లు సంస్థ ఎండీ వంశీ వికాస్ తెలిపారు. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ), క్రూయిజ్ మిసైల్స్ కోసం తయారు చేసిన ఈ ఇంజిన్ను డీఆర్డీవో అధికారుల సమక్షంలో విజయవంతంగా పరీక్షించినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్లోని హార్డ్వేర్ పార్క్లో ఏర్పాటు చేస్తున్న 2,50,000 చ.అ. తయారీ ప్లాంటు 2026 ప్రారంభం నాటికి అందుబాటులోకి రావచ్చన్నారు. -
మేక్మైట్రిప్ భారీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: షేర్లు, మార్పిడికి వీలయ్యే బాండ్ల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్ల(రూ. 21,500 కోట్లు)కుపైగా సమీకరించనున్నట్లు ట్రావెల్ బుకింగ్ సర్వీసుల దిగ్గజం మేక్మైట్రిప్ తాజాగా తెలియజేసింది. నిధులను చైనా సంస్థ ట్రిప్.కామ్ గ్రూప్ వాటా కొనుగోలుకి వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ట్రిప్.కామ్ గతంలో కొనుగోలు చేసిన క్లాస్ బీ షేర్లను సొంతం చేసుకునేందుకు పెట్టుబడులను వినియోగించనున్నట్లు నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ పేర్కొంది. గత నెలలో పాకిస్తాన్పై చేపట్టిన మిలిటరీ చర్యల తదుపరి చైనా, టర్కీ తదితర దేశాల నుంచి బిజినెస్లను తగ్గించుకోవాలని దేశీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో మేక్మైట్రిప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. మేక్మైట్రిప్లో చైనా సంస్థలకు యాజమాన్య హక్కులున్నట్లు ప్రత్యర్ధి కంపెనీ ఈజ్మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ గత నెలలో ఆరోపించిన విషయం విదితమే. -
భారత్లో ఫాల్కన్ జెట్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారత్లో ఫాల్కన్ 2000 బిజినెస్ ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాలను తయారు చేసేందుకు ఫ్రాన్స్ ఏరోస్పేస్ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్తో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (ఆర్ఏఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విమానాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే ప్రథమం. ప్యారిస్ ఎయిర్షో సందర్భంగా ఇరు సంస్థలు ఈ విషయం ప్రకటించాయి. హై ఎండ్ బిజినెస్ జెట్స్ తయారీకి భారత్ వ్యూహాత్మక కేంద్రంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో ‘ఫాల్కన్ 2000 జెట్స్’ కోసం అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయనున్నాయి. దీంతో బిజినెస్ జెట్స్ను తయారు చేయడంలో అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్ సరసన భారత్ కూడా చేరుతుంది. మేకిన్ ఇండియా నినాదానికి తమ మద్దతును తెలియజేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని డసాల్ట్ ఏవియేషన్ చైర్మన్ ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. రిలయన్స్ గ్రూప్ ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయని గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అనిల్ డి. అంబానీ పేర్కొన్నారు. జంట ఇంజిన్లుండే ఈ విమానాల్లో 8–10 మంది వరకు ప్రయాణించవచ్చు. 2028 నాటికి తొలి మేడిన్ ఇండియా ఫాల్కన్ 2000 విమానం డెలివర్ కానుంది. డసాల్ట్ ఏవియేషన్ గత వందేళ్లలో 90 పైగా దేశాలకు 10,000 మిలిటరీ, పౌర విమానాలను సరఫరా చేసింది. 2017లో డసాల్ట్ ఏవియేషన్, రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ (డీఆర్ఏఎల్) జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేశాయి. 2019లో ఫాల్కన్ 2000 ముందు భాగా న్ని ఉత్పత్తి చేసినప్పటి నుంచి 100కు పైగా కీలకమైన సబ్–సెక్షన్లను ఈ జేవీ తయారు చేస్తోంది. అంతర్జాతీయంగా ఫాల్కన్ జెట్స్ తయారీలో కీలకంగా ఎదిగింది. -
ఐటీలో తాత్కాలిక ఉద్యోగులు ఐదేళ్లలో డబుల్!
ముంబై: ఐటీ, ఐటీఈఎస్ రంగంలో తాత్కాలిక ఉద్యోగులకు (ఫ్లెక్సీ వర్క్ఫోర్స్) డిమాండ్ క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో 3,90,000 మంది ఫ్లెక్సీ వర్క్ఫోర్స్ ఉండగా.. వీరి సంఖ్య 2030 నాటికి 9 లక్షలకు చేరుకుంటుందని కెరీర్నెట్ నివేదిక వెల్లడించింది. ఏటా వీరి సంఖ్య 15 శాతం చొప్పున పెరగనుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఐటీ రంగం 58 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తుంటే.. వీరిలో 7 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ రంగంలో పెరుగుతున్న ఫ్లెక్సీ స్టాఫింగ్ పేరుతో కెరీర్నెట్ ఒక నివేదిక విడుదల చేసింది. నియామకాల డేటా, మార్కెట్ పరిశోధన, పరిశ్రమలో ధోరణులను విశ్లేíÙంచి ఈ వివరాలు ప్రకటించింది. ‘భారత్ ప్రపంచ ఆఫ్షోర్ హబ్గా మారుతోంది. కనుక ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరగనుంది. డిజిటల్ టెక్నాలజీలకు మళ్లడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పుల నేపథ్యంలో వేగం, ప్రత్యేకత, విస్తరణ అవసరాలకు మద్దతుగా ఫ్లెక్సీ స్టాఫింగ్ నమూనాను కంపెనీలు అనుసరిస్తున్నాయి’ అని కెరీర్నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలబ్ శుక్లా తెలిపారు.కెరీర్లో పురోగతికి దారి.. నిపుణులకు వృత్తిలో ఎదుగుదల, నైపుణ్యాల అభివృద్ధి, పని–వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యాన్ని ఫ్లెక్సీ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని చెబుతూ.. మిలీనియల్స్, జెనరేషన్ జెడ్ నిపుణులకు ఇవి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్క్ఫోర్స్కు బెంగళూరు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఈ రంగంలోని మొత్తం తాత్కాలిక సిబ్బందిలో 25 శాతం మంది ఈ నగరంలోనే ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ 15 శాతం మంది ఫ్లెక్సీ వర్క్ఫోర్స్కు ఉపాధి కలి్పస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే, చెన్నై ఒక్కోటీ 10 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ తాత్కాలిక ఉద్యోగుల సిబ్బందిలో వృద్ధి నమోదవుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలోని ఫ్లెక్సీ వర్క్ఫోర్స్లో 20 శాతం మేర ఈ నగరాల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. నిపుణుల లభ్యతకు, తక్కువ వ్యయాలతో కూడిన వ్యాపార నమూనాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
జియో బ్లాక్రాక్ కొత్త ప్లాట్ఫామ్ ‘అలాదీన్’
జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ‘అలాదీన్’ ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. దీంతో బ్లాక్రాక్కు చెందిన పెట్టుబడుల విశ్లేషణ, రిస్క్ నిర్వహణ ప్లాట్ఫామ్ మొదటిసారి భారత ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది.‘‘పెట్టుబడులు ఇక ఎంతో సులభం. జియో ఫైనాన్షియల్, బ్లాక్రాక్ సంయుక్తంగా ఇదే నమ్మకాన్ని ఇన్వెస్టర్ల ముందుకు తీసుకొచ్చాయి. జియో డిజిటల్ ఫస్ట్ విధానానికి, బ్లాక్రాక్ సంస్థకు అంతర్జాతీయంగా పెట్టుబడుల్లో ఉన్న నైపుణ్యం కలగలసి ఇన్వెస్టర్లకు అనుకూలమైన సొల్యూషన్లను అందించనున్నాం’’అని జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్ ప్లాట్ఫామ్పై ట్వీట్ చేసింది.ఇది ఆరంభం మాత్రమేనంటూ.. అందరికీ అందుబాటు ధరలకే పెట్టుబడుల సేవలను అందించనున్నట్టు పేర్కొంది. జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్ఎస్ఎల్), యూఎస్ ఆధారిత బ్లాక్ రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్. -
జాబ్లో చేరకుండానే రూ.25 లక్షలు..
ఆఫర్ లెటర్ అనేది ఉద్యోగ ఎంపికలో కీలక దశ. స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయి ఆఫర్ లెటర్ చేతికొచ్చేసిందంటే ఇక ఉద్యోగం ఖరారైపోయిందని అభ్యర్థులు ఆనందంగా భావిస్తారు. కానీ ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతమూ ఇవ్వకుండా వేధిస్తున్న కంపెనీని కోర్టుకు లాగి సరిగ్గా బుద్ధి చెప్పాడో అభ్యర్థి..ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకోని అబుదాబిలోని ఓ కంపెనీపై స్థానిక కోర్టు తగిన చర్యలు తీసుకుంది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం.. సదరు బాధిత ఉద్యోగికి 'బకాయి వేతనం'గా 1,10,400 దిర్హమ్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.25 లక్షలు చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది. 2024 నవంబర్ 11 నుంచి 2025 ఏప్రిల్ 7 వరకు తన వేతనాన్ని యజమానులు నిలిపివేశారని ఆరోపిస్తూ సదరు ఉద్యోగి కంపెనీపై దావా వేశారు.👉 సాఫ్ట్వేర్ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!ఆఫర్ లెటర్ ప్రకారం.. ఉద్యోగితో ఆ కంపెనీ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. 7,200 దిర్హమ్ల బేసిక్ వేతనం, నెలకు 24,000 దిర్హమ్ల ప్యాకేజీ ఇస్తామని ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ నిబంధనల్లో పేర్కొంది. కానీ అతని జాయినింగ్ తేదీని కంపెనీ ఆలస్యం చేస్తూ వచ్చింది. ఉద్యోగంలో చేర్చుకోకుండా, జీతం కూడా ఇవ్వకపోవడంతో సదరు ఉద్యోగి కంపెనీని కోర్టుకు లాగాడు.కోర్టు ఏం చెప్పిందంటే..వేతన నివేదిక, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్, కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సమర్పించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఉద్యోగి విధుల్లో చేరిక జాప్యానికి కంపెనీ యాజమాన్యమే కారణమని స్పష్టమైందని కోర్టు పేర్కొంది. కార్మిక చట్టాల ప్రకారం సకాలంలో వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని స్పష్టం చేసింది. బాధిత ఉద్యోగికి రూ.1,10,400 (సుమారు రూ.25 లక్షల వరకు) వేతనం చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.మరోవైపు, సదరు ఉద్యోగి సెలవుపై వెళ్లాడని, విధులకు హాజరు కాకపోవడం వల్ల అతను పూర్తి వేతనానికి అర్హుడు కాదని కంపెనీ వాదించింది. అయితే ఉద్యోగి విధులకు గైర్హాజరయ్యాడన్నదానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, అతని విధుల్లో చేరిక జాప్యం పూర్తిగా కంపెనీ తప్పిదమేనని కోర్టు తేల్చిచెప్పింది. కాగా తాను ఎనిమిది రోజులు మాత్రమే సెలవు తీసుకున్నట్లు ఉద్యోగి చెప్పడంతో ఈ మేరకు అతని జీతంలో మినహాయించారు. -
ఓలా డ్రైవర్లకు జీరో కమీషన్
దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న ఈ కార్యక్రమం ఆటోలు, బైకులు, క్యాబ్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ అవుతుందని పేర్కొంది. రైడ్ పరిమాణం లేదా ఆదాయంపై ఎటువంటి పరిమితులను ఉండవని పేర్కొంది.కొత్త ప్రోగ్రామ్లో భాగంగా డ్రైవర్లు ఈ ప్రణాళికను ఎంచుకోవచ్చని చెప్పింది. కమీషన్ రూపంలో ఓలాకు వెళ్లే ఛార్జీలను ఎటువంటి మినహాయింపులు లేకుండా డ్రైవర్లు ఆ మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు నెలవారీ సబ్స్క్రిప్షన్ పొందాలని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ను ఉపయోగించుకునే డ్రైవర్లు 30 రోజుల పాటు రోజుకు రూ.67 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే నెలకు రూ.2,010 అవుతుంది.ఇదీ చదవండి: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రంఈ ఫీచర్తో డ్రైవర్లు జీరో కమీషన్ క్లెయిమ్ చేసుకునే ఛార్జీలపై ఎలాంటి పరిమితులు లేవని, తమ ఛార్జీల మొత్తాన్ని క్లెయిమ్ చేసేటప్పుడు వాహనం ఎంపికపై కంపెనీ ఎలాంటి ఆంక్షలు విధించదని తెలిపింది. ఈ ఫీచర్ ఓలా ఆటో, ఓలా బైక్స్, ఓలా క్యాబ్స్కు అందుబాటులో ఉంది. ‘కమీషన్లను తొలగించడం వల్ల డ్రైవర్ భాగస్వాములకు మరింత అవకాశాలు లభిస్తాయి’ అని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పు వల్ల డ్రైవర్ ఆదాయం ఏటా రూ.1,36,000 పెరుగుతుందని, ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 30 శాతం అధికమని చెప్పింది. -
ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపద
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ రూ.3.59 లక్షల కోట్ల చొప్పున నికర విలువతో ఇండియాలో సంపద సృష్టికర్తల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. క్రిసిల్ సహకారంతో 360 వన్ వెల్త్ దేశంలోని వివిధ రంగాల్లో సేవలిందిస్తున్న అత్యంత సంపన్నుల జాబితాను తయారు చేసింది.ఈ సమగ్ర జాబితాలో కనీసం రూ.500 కోట్ల నికర విలువ కలిగిన 2,013 మంది ఉన్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, వారసులు, పెట్టుబడిదారులు, వృత్తి నిపుణులు చోటు సంపాదించుకున్నారు. వీరి సంపద దాదాపు రూ.100 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. 161 మంది వ్యక్తులు రూ.10,000 కోట్లకు మించి, 169 మంది వ్యక్తులు రూ.5,000-రూ.10,000 కోట్ల మధ్య సంపద కలిగి ఉన్నారని ఈ అధ్యయనం తెలిపింది.ఇదీ చదవండి: ఐదు రెట్లు పెరిగిన ఉత్పాదకతమహిళా పారిశ్రామికవేత్తల్లో ఇషా అంబానీ రూ.3.58 లక్షల కోట్లతో అత్యంత ధనిక వ్యాపార యజమానిగా నిలిచారు. వ్యాపారాలను స్థాపించిన లేదా అధిక విలువ జోడించేందుకు గణనీయమైన పాత్ర పోషించిన 72 మంది మహిళా నాయకులను కూడా ఈ నివేదిక గుర్తించింది. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ సంస్థల ఆధిపత్యాన్ని ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. మొత్తం ప్రమోటర్ సంపదలో రిలయన్స్, టాటా, అదానీ గ్రూపుల వాటా 24 శాతంగా ఉంది. దేశంలోని టాప్ 50 వ్యాపార సంస్థలు 360 ఐటీ వెల్త్ క్రియేటర్స్ జాబితాలో ఉన్న కంపెనీల మొత్తం సంపదలో 59 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ప్రైజెస్ మాత్రమే ఇందులో 12% వాటాను కలిగి ఉన్నాయి.అంబానీల ప్రభావంటెలికాం, రిటైల్, ఎనర్జీ, డిజిటల్ సర్వీసెస్.. వంటి కీలక రంగాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుస్థిర నాయకత్వాన్ని అంబానీ కుటుంబం కొనసాగిస్తోంది. భారతదేశ డిజిటల్ విప్లవానికి జియో నాయకత్వం వహించడం, రిలయన్స్ రిటైల్ దూకుడుగా విస్తరించడంతో అంబానీ కుటుంబం ఆర్థిక సామ్రాజ్యం రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. -
తమ కంపెనీలో తామే వాటాలు కొంటున్నారు!
బ్రాడ్క్యాస్టింగ్ రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్)కు ప్రమోటర్లు పెట్టుబడులు సమకూర్చనున్నారు. తద్వారా తమ వాటాను పెంచుకోనున్నారు. ప్రమోటర్ గ్రూప్ సంస్థల నుంచి రూ. 2,237 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు జీల్ తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.4 శాతానికి బలపడనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో పూర్తిగా మారి్పడికి వీలయ్యే 16.95 కోట్లకుపైగా వారంట్లను జారీ చేసేందుకు బోర్డు అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రిఫరెన్షియల్ పద్ధతిలో ఆల్టిలిస్ టెక్నాలజీస్, సన్బ్రైట్ మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు వారంట్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ప్రమోటర్ల నుంచి అందుకోనున్న పెట్టుబడుల ద్వారా కంపెనీ ప్రధాన బిజినెస్ విభాగాలలో మరింత పటిష్టంకానున్నట్లు పేర్కొంది. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాలలో వృద్ధి అవకాశాలను అన్వేషించనున్నట్లు తెలియజేసింది.ఒక్కో వారంట్కు రూ.132 ధరలో..ఒక్కో వారంట్కు రూ. 132 ధర చొప్పున ప్రమోటర్లకు 16,95,03,400 వారంట్లను జీల్ జారీ చేయనుంది. తద్వారా నగదు రూపేణా రూ. 2,237.44 కోట్లు లభించనుండగా.. కంపెనీలో ప్రమోటర్ల వాటా 18.39 శాతానికి చేరనున్నట్లు జీల్ వివరించింది. కాగా.. సెబీ మార్గదర్శకాల ప్రకారం వారంట్ను రూ. 128.58 ధరలో కేటాయించవలసి ఉన్నప్పటికీ బోర్డు రూ. 3.42 ధర అధికంగా నిర్ణయించింది. ఇందుకు ప్రమోటర్లు సైతం అంగీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇష్యూ ధరలో ప్రమోటర్లు ముందస్తుంగా 25 శాతం(రూ. 33) ధర చెల్లించనున్నారు. వారంట్లను అలాట్మెంట్ నుంచి గరిష్టంగా 18 నెలల్లోగా ప్రమోటర్లు షేర్లుగా మార్పిడి చేసుకునేందుకు వీలుంటుంది. ఇదీ చదవండి: హోండా ‘ఎక్స్ఎల్...’ ధర రూ.10,99,990ఒక్కో వారంట్కు రూ. 99(75 శాతం) చొప్పున చెల్లించడం ద్వారా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 3.99 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. దేశీ మీడియా బిజినెస్(సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా)ను జీల్తో విలీనం చేసే ప్రతిపాదనను గతేడాది సోనీ గ్రూప్ విరమించుకున్న నేపథ్యంలో ప్రమోటర్ల పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
కార్డీలియా క్రూయిజెస్ ఐపీవో బాట...
న్యూఢిల్లీ: లగ్జరీ క్రూయిజ్ల నిర్వాహక కంపెనీ వాటర్వేస్ లీజర్ టూరిజం పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 727 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులలో దాదాపు రూ. 553 కోట్లను డిపాజిట్ లేదా అడ్వాన్స్డ్ లీజ్ రెంటల్కు చెల్లించనుంది. అనుబంధ సంస్థ బేక్రూయిజ్ షిప్పింగ్ అండ్ లీజింగ్(ఐఎఫ్ఎస్సీ) ప్రయివేట్ లిమిటెడ్కు నెలవారీ లీజు చెల్లింపులకు సైతం వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.కార్డీలియా క్రూయిజెస్ బ్రాండుతో ప్రస్తుతం వాటర్వేస్ లీజర్ ఎంవీ ఎంప్రెస్ క్రూయిజ్ వెస్సల్ను నిర్వహిస్తోంది. నార్వేజియన్ స్కై, నార్వేజియన్ సన్ అనే మరో రెండు క్రూయిజ్ల నిర్వహణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. ఒక్కో క్రూయిజ్ షిప్ ద్వారా సుమారు 2,000 మంది అతిథులకు సేవలు అందించనుంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహిస్తున్న ఎంప్రెస్ క్రూయిజ్ ప్రధానంగా ముంబై, గోవా, కొచ్చి, చెన్నై, లక్షద్వీప్, విశాఖపట్టణం, పుదుచ్చేరిలకు సేవలందిస్తోంది.శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నాకు సైతం సర్వీసులు నిర్వహించడంతోపాటు.. ఇటీవలే ఆగ్నేయాసియాకు కూడా సేవలు విస్తరించింది. తొలిసారి ఫుకెట్ (థాయ్లాండ్), సింగపూర్, కౌలాలంపూర్ (మలేసియా) తదితర ప్రాంతాలకూ జూలైలో సర్వీసులను మొదలు పెడుతోంది. 2024 డిసెంబర్31తో ముగిసిన తొలి 9 నెలల్లో రూ. 409 కోట్ల ఆదాయం, రూ. 139 కోట్ల నికర లాభం ఆర్జించింది.చదవండి: అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గడంతో.. -
త్వరలో వందలో 20 మంది ఉద్యోగుల తొలగింపు
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ఇప్పటికే చాలా మందికి లేఆఫ్స్ ప్రకటించిన ఇంటెల్ కంపెనీ జులైలో మరింత మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈసారి తొలగింపులు సంస్థ ఫ్యాక్టరీ కార్మికులు 15 నుంచి 20 శాతం మందిని ప్రభావితం చేస్తాయని తెలుస్తోంది. కొత్త సీఈఓ లిప్-బు టాన్ మార్చిలో బాధ్యతలు స్వీకరించిన తరువాత సంస్థ త్వరలో భారీగా శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని చూస్తుంది. రాబోయే కోతలు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇంటెల్ ఫౌండ్రీ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతున్నారు.నిర్ణయం బాధాకరమైనా తప్పదుకంపెనీ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం ఇంటెల్లో కొత్త విడత తొలగింపులు జులై మధ్యలో ప్రారంభమై నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉంది. ఇంటెల్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చీఫ్ నాగ చంద్రశేఖరన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ నిర్ణయం చాలా బాధాకరమైనది. కానీ పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అవసరం’ అని చెప్పారు.జాగ్రత్తగా, గౌరవంతో..ఉద్యోగుల తగ్గింపు శాతంపై ఇంటెల్ నేరుగా వ్యాఖ్యానించనప్పటికీ ఉద్యోగులను ‘జాగ్రత్తగా, గౌరవంతో’ చూస్తామని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు మెరుగ్గా స్పందించడానికి ఇంజినీరింగ్ బృందాలను శక్తివంతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు ఉన్నాయని తెలిపింది. గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఇంటెల్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. పీసీ, డేటా సెంటర్ మార్కెట్లలో పెరుగుతున్న పోటీ వల్ల కంపెనీ కాస్త వెనుకబడుతుందనే వాదనలున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదనే అభిప్రాయాలున్నాయి. ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఒరెగాన్లో 3,000 మంది ఉన్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకు సారథులతో త్వరలో మంత్రి భేటీగట్టిదెబ్బ..రాబోయే తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ కర్మాగారాలపై ప్రభావం చూపనుండగా, సుమారు 20,000 మంది కార్మికులున్న ఒరెగాన్లో గట్టిదెబ్బ పడే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రాధాన్యతలు, నైపుణ్య మదింపుల ఆధారంగా కోతలకు సిద్ధం కావాలని కంపెనీ ఇప్పటికే విభాగాలను నోటిఫై చేసింది. ఉన్నత యాజమాన్యం అందించిన చట్రంలోనే తొలగింపులను అమలు చేసే విచక్షణాధికారాన్ని ఆయా విభాగాధిపతులకు ఇచ్చినట్లు తెలిసింది. -
పాత బంగారానికి 2 క్యారెట్ల అదనపు విలువ
పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని బంగారు ఆభరణాల రిటైల్ బ్రాండ్ తనిష్క్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తమ పాత బంగారానికి గరిష్టంగా 2 క్యారెట్ల అదనపు విలువ పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ పరిమిత కాల ఆఫర్ జూన్ 30, 2025 వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.ఆఫర్ ఎలా పనిచేస్తుందంటే..పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే కస్టమర్లు కొత్త ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు అదనపు క్యారెట్ విలువను పొందేలా ఈ ఆఫర్ను డిజైన్ చేశారు. ప్లేయిన్ జ్యువెలరీ లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 1 క్యారెట్ అదనంగా పొందవచ్చు. అదే వజ్రాలతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు పాత బంగారం విలువపై 2 క్యారెట్లను అదనంగా పొందేందుకు ఈ ఆఫర్ ద్వారా వీలు కల్పిస్తున్నారు.ఇదీ చదవండి: తగ్గిన ఇంధన వాడకంకస్టమర్ల పాత బంగారం 20 క్యారెట్లు ఉండి దాన్ని ఎక్స్ఛేంజ్ ఇచ్చి తిరిగి కొత్త బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే పాత దాన్ని 21 క్యారెట్లుగా లెక్కిస్తారు. అదే వజ్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు 22 క్యారెట్లుగా విలువ కడుతారు. బంగారం ధరలు పెరుగుతున్నందున ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా తనిష్క్ ప్రీమియం డిజైన్లను పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదా వ్యక్తిగతంగా తమ ఆభరణాలు కొత్త డిజైన్లలోకి మార్చుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. -
తత్కాల్ కొత్త రూల్ తెలుసు కదా.. ఆధార్ లింక్ చేశారా మరి!?
తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో భారతీయ రైల్వే కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. జూలై 1 నుంచి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) యాప్, వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది.ఆన్లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో ఏఐ బోట్లు, ఏజెంట్ల బెడదను నివారించేందుకు తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తత్కాల్ అనేది ఇండియన్ రైల్వే ఫాస్ట్ ట్రాక్ టికెట్ బుకింగ్ వ్యవస్థ. దీని ద్వారా అప్పటికప్పుడు ప్రయాణానికి ఒక రోజు ముందు తక్కువ సమయంలో రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.👉ఇది చదవలేదా? వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయంఇండియన్ రైల్వే అమలు చేస్తున్న కొత్త రూల్ ప్రకారం.. ఆన్లైన్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే.. ఐఆర్సీటీసీ అకౌంట్కు యూజర్ ఆధార్ లింక్ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం కావాల్సినవి యాక్టివ్ ఐఆర్సీటీసీ అకౌంట్, ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, ఓటీపీ వెరిఫికేషన్ కోసం మొబైల్ ఫోన్.ఆధార్ లింక్ చేసుకోండిలా..ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ ( www.irctc.co.in )లోకి లాగిన్ అవ్వాలి.'మై అకౌంట్'పై క్లిక్ చేసి 'అథెంటికేట్ యూజర్' ఎంచుకోండి.మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేయండి.'వెరిఫై డీటెయిల్స్ అండ్ రిసీవ్ ఓటీపీ'పై క్లిక్ చేయాలి.మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి.సమ్మతి బాక్సును టిక్ చేసి 'సబ్మిట్' నొక్కండి.మీ ఆధార్ విజయవంతంగా లింక్ అయిన తర్వాత ధ్రువీకరణ కన్పిస్తుంది. -
విప్రోలో మళ్లీ చేతులు మారిన ప్రమోటర్ల వాటాలు
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో 1.72 శాతం చేతులు మారింది. స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సమాచారం ప్రకారం 1.72 శాతం వాటాకు సమానమైన 18.05 కోట్ల ఈక్విటీ షేర్లను అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ విక్రయించింది. వీటిని షేరుకి రూ. 259 సగటు ధరలో ప్రమోటర్ గ్రూప్నకు చెందిన ప్రజీమ్ ట్రేడర్స్, జాష్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 4,675 కోట్లుకాగా.. సోమవారం(9న) సైతం అజీమ్ ప్రేమ్జీ ట్రస్ట్ 1.93 శాతం వాటాకు సమానమైన 20.23 కోట్ల షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. వీటిని షేరుకి రూ. 250 సగటు ధరలో ప్రేమ్జీ ఇన్వెస్ట్కు చెందిన ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, హర్షమ్ ట్రేడర్స్ అండ్ ప్రజీమ్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి.డీల్ విలువ రూ. 5,057 కోట్లుకాగా.. గతేడాది నవంబర్లో ప్రజీమ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ద్వారా ప్రేమ్జీ ఇన్వెస్ట్ 1.6 శాతం వాటాకు సమానమైన 8.49 కోట్ల విప్రో షేర్లను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 4,757 కోట్లు వెచ్చించింది. అయితే వీటిని ప్రజీమ్, జాష్ ట్రేడర్స్ వీటిని విక్రయించడం గమనార్హం! -
సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రుల జోరు
దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ చెయిన్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఏటా 24 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ మార్కెట్ పరిమాణం 9 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది 4 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 20 శాతం పైగా ఎబిటా మార్జిన్లు, 30 శాతం పైగా ఆర్వోసీఈలు (పెట్టుబడిపై రాబడులు), రెండేళ్ల వ్యవధిలోనే బ్రేక్–ఈవెన్ సాధించే అవకాశాలు మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. ఎవెండస్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంలో ఈ సెగ్మెంట్ .. భారీ స్థాయిలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. సుమారు 3.7 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. హాస్పిటల్స్లోకి వచి్చన మొత్తం పెట్టుబడుల్లో ఇది సుమారు 35 శాతం. ఇలా వచి్చన పెట్టుబడుల్లో దాదాపు 70 శాతం భాగం ఐవీఎఫ్, ఐకేర్, తల్లి..బిడ్డ సంరక్షణ, డయాలిసిస్, ఆంకాలజీ వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు దోహదపడ్డాయి. గత మూడేళ్లుగా దంత సంరక్షణ, యూరాలజీ/నెఫ్రాలజీ, స్కిన్..హెయిర్ కేర్ వంటి స్పెషాలిటీ విభాగాల్లోని ప్రముఖ సంస్థల్లోకి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య భారీగా వ్యత్యాసం నెలకొనడం ఇందుకు కారణం.కన్సాలిడేషన్కి అవకాశం.. న్యూఢిల్లీ: నివేదిక ప్రకారం తక్కువ స్థాయి పెట్టుబడి, నిర్దిష్టమైన సేవలకు పరిమితం కావడం తదితర అంశాల వల్ల ఈ విభాగం ఇటు ఇన్వెస్టర్లకు, అటు వ్యవస్థాపకులకు ఆకర్షణీయంగా ఉంటోంది. ఇక ఈ స్పెషాలిటీల్లో అగ్రగాములుగా ఉంటున్న సంస్థలు అధిక వృద్ధి సాధన కోసం ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం కాస్త పెద్ద మొత్తాన్నే వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పరిశ్రమలో కన్సాలిడేషన్ చోటు చేసుకునే అవకాశాలను ఇది సూచిస్తోంది.మార్కెట్ క్యాప్ పెరుగుదల.. అగ్ర శ్రేణి సంస్థలు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ మార్కెట్ వైపు చూస్తున్నాయి. దీనితో మరిన్ని కంపెనీలు స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ బాట పట్టనున్నాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ లిస్టెడ్ సింగిల్ స్పెషాలిటీ చెయిన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతమున్న 3.9 బిలియన్ డాలర్ల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం వంటి అంశాల వల్ల దేశీయంగా సింగిల్ స్పెషాలిటీ హెల్త్కేర్ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పేషంట్ ఎక్స్పీరియన్స్ను మెరుగుపర్చగలిగే సామర్థ్యాలు, సమర్ధవంతంగా కార్యకలాపాలను విస్తరించగలిగే వీలు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే అవకాశం ఉండటం వల్ల ఈ విభాగం ఆకర్షణీయంగా ఉంటోందని ఎవెండస్ క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చెయిన్లు .. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమవుతున్నాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్లలో అంతరాలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ఆ ప్రాంతాల్లో వృద్ధికి అవకాశం ఉందని గుప్తా చెప్పారు. క్రిత దశాబ్ద కాలంలో ఏ విధంగానైతే మలీ్ట–స్పెషాలిటీ విభాగం విస్తరించిందో అదే విధంగా పబ్లిక్ మార్కెట్లలో ఈ హాస్పిటల్స్ చెయిన్స్ లిస్టింగ్ సందడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు పటిష్టమైన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సంపన్న దేశాల్లో ఈ తరహా మోడల్స్ విజయవంతమయ్యాయని గుప్తా చెప్పారు. -
ఆఫీస్ స్పేస్కి అమెరికన్ సంస్థల దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి. ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సరీ్వసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు. -
ఎస్బీఐలో హోమ్లోన్లు.. గుడ్న్యూస్
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఎస్బీఐ కూడా రుణ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్ల కోత జూన్ 15 నుంచి అమలులోకి వస్తుందని, ప్రస్తుత రెపో లింక్డ్ రుణాలు, కొత్త రుణగ్రహీతలకు వర్తిస్తుందని ఎస్బీఐ పేర్కొంది.వారం రోజుల క్రితం ఆర్బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ పాలసీ రెపో రేటులో సగం శాతం తగ్గింపునకు అనుగుణంగా ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్), గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఈ తగ్గింపు తర్వాత ఈబీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గింది.రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యుకో బ్యాంక్ వంటివి ఇప్పటికే రుణ రేట్లను తగ్గించాయి. ఎందుకంటే రెపో రేటుతో లింక్ అయిన లేదా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లింక్డ్ రుణాలుగా పిలిచే, ఫ్లోటింగ్ రేట్లలో ఉన్న రుణాలకు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గించిన వెంటనే కాకపోయినా, వచ్చే నెల మొదటి రోజు నాటికి రెపో తగ్గింపును ప్రస్తుత రుణగ్రహీతలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. -
ఐపీవోకి వస్తోన్న సోలార్ కంపెనీ
న్యూఢిల్లీ: సోలార్ ప్యానెళ్ల తయారీ సంస్థ రేజాన్ సోలార్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతోంది. రూ. 1,500 కోట్ల సమీకరణకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ని సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ ఇప్పటికే పలు దిగ్గజ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను నియమించుకుంది.తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కార్యకలాపాల విస్తరణకు కంపెనీ వినియోగించుకోనున్నట్లు సమాచారం. 2017లో ఏర్పాటైన రేజాన్ సోలార్ దేశీయంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న సోలార్ పీవీ మాడ్యుల్స్ తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. సంస్థవెబ్సైట్ ప్రకారం గుజరాత్లోని కారంజ్, సావా ప్లాంట్లలో 6,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని సాధించింది. కంపెనీ ఇటీవల మార్చిలో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 138 కోట్లు సమీకరించింది. -
పిజ్జా కంపెనీలో రూ. 1801 కోట్ల షేర్లు అమ్మేసిన ప్రమోటర్లు
జూబిలెంట్ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్లు గణనీయంగా వాటాలు విక్రయించారు. జూబిలెంట్ ఫుడ్వర్క్స్ (జేఎఫ్ఎల్), జూబిలెంట్ ఇన్గ్రేవియా, జూబిలెంట్ ఫార్మోవాలో రూ. 1,801 కోట్ల విలువ చేసే వాటాలను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా అమ్మేశారు.ఎన్ఎస్ఈలోని బ్లాక్ డీల్స్ డేటా ప్రకారం జూబిలెంట్ ఫుడ్వర్క్స్ ప్రమోటర్ అయిన జూబిలెంట్ కన్జూమర్ 1.06 కోట్ల ఈక్విటీ షేర్లను (1.61 శాతం వాటా) విక్రయించింది. అలాగే, జూబిలెంట్ ఇన్గ్రేవియా ప్రమోటింగ్ సంస్థలు (జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్, శ్యామ్ సుందర్ భార్తియా ఫ్యామిలీ ట్రస్ట్) 98.65 లక్షల షేర్లు (6.2 శాతం వాటా) విక్రయించాయి.అలాగే జూబిలెంట్ ఫార్మోవా ప్రమోటర్ సంస్థలు జూబిలెంట్ ఎన్ప్రో, నికిత రిసోర్సెస్ 32.86 లక్షల షేర్లను (2.06 శాతం వాటా) విక్రయించాయి. ఈ షేర్లను సగటున రూ. 662–1,060.37 రేటుకు అమ్మడంతో మొత్తం అన్ని లావాదేవీల విలువ కలిపి రూ. 1,800.98 కోట్లుగా నమోదైంది. -
సన్ ఫార్మాకు కొత్త ఎండీ.. టాప్ మేనేజ్మెంట్లో మార్పులు
ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా టాప్ మేనేజ్మెంట్లో మార్పులు, చేర్పులు చేపట్టింది. ఇందులో భాగంగా కీర్తి గనోర్కర్ కంపెనీ ఎండీగా పదోన్నతి పొందారు. దిలీప్ సంఘ్వీ స్థానంలో సెప్టెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సంఘ్వీ కొనసాగుతారు.నార్త్ అమెరికా విభాగం ప్రెసిడెంట్, సీఈవో అభయ్ గాంధీ తప్పుకోనుండటంతో ఆయన స్థానంలో రిచర్డ్ ఆస్క్రాఫ్ట్ చేరతారని కంపెనీ తెలిపింది. ఎంబీఏ, కెమికల్ ఇంజినీర్ అయిన గనోర్కర్ 1996 నుంచి సన్ ఫార్మాలో వివిధ విభాగాల్లో పని చేశారు. 2019 జూన్ నుంచి సన్ ఫార్మా భారత విభాగానికి గనోర్కర్ నేతృత్వం వహిస్తున్నారు.ఆయన సారథ్యంలో వ్యాపారం, మార్కెట్ వాటా నిలకడగా పెరిగిందని సంస్థ వివరించింది. స్పెషాలిటీ విభాగాలు, జపాన్.. యూరప్ మార్కెట్లలోకి కూడా సన్ ఫార్మా విస్తరించడంలో గనోర్కర్ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. -
ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!
బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో డెవలపర్ ఉద్యోగం కోసం 14 రౌండ్ల ఇంటర్వ్యూ క్లియర్ చేశానని ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. విప్రో క్యాంపస్లో ఉన్న ఫొటోలతో పాటు కంపెనీ లోగోను చూపిస్తూ అంతరా మండల్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లో వివరాలు షేర్ చేశారు.ధ్రువీకరణ కోసం ఇన్స్టాగ్రామ్లో ఆమె తన ఆఫీస్ ఐడీ కార్డు కూడా పోస్ట్ చేశారు. ఉద్యోగం కోసం ఏకంగా 14 రౌండ్ల ఇంటర్వ్యూ పూర్తి చేసి కొలువు దక్కించుకున్నట్లు ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి చివరకు విప్రోలో డెవలపర్ పొజిషన్కు ఎంపికయ్యాను. మీ నిద్రలో వచ్చేవి కలలు కావు.. మిమ్మల్ని నిద్రపోనివ్వనివే అసలైన కలలు’ అని ఆమె రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Antara Mandal (@_antara.mandal)ఇదీ చదవండి: డబ్బు సంపాదనకు ‘స్మార్ట్’ సూచనఅయితే సామాజిక మాధ్యామాల్లో ఈ పోస్ట్పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క ఉద్యోగం కోసం ఇన్ని రౌండ్లు ఇంటర్వ్యూ చేయడంపై చాలా మంది వినియోగదారులు విమర్శించారు. కొందరు ఇందుకు భిన్నంగా రిప్లై ఇచ్చారు. ‘14 రౌండ్ల ఇంటర్వ్యూ? అది కూడా డెవలపర్ రోల్ కోసమే.. చాలా ఫన్నీ యార్’ అని ఒక యూజర్ స్పందించారు. -
ఎస్బీఐలో 505 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం
భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా 505 మంది ప్రొబేషనరీ ఆఫీసర్లను కొత్తగా నియమించుకున్నట్టు ప్రకటించింది. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్లో పరిశ్రమలోనే ఇదొక పెద్ద నియామకంగా పేర్కొంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు, కార్పొరేట్ రుణాలు, అగ్రి బిజినెస్, వెల్త్ మేనేజ్మెంట్, ట్రెజరీ కార్యకలపాలు, నియంత్రణలు, నిబంధనల అమలు తదితర విభాగాల్లో వీరు సేవలు అందించనున్నట్టు వెల్లడించింది.ఇదీ చదవండి: మోతీలాల్ ఓస్వాల్పై సెబీ జరిమానాబ్యాంకులో అత్యున్నత స్థాయి ఉద్యోగం వరకు ఎదిగే అవకాశాలను ఎస్బీఐ వీరికి అందిస్తుందని తెలిపింది. 13,455 జూనియర్ అసోసియేట్లను సైతం నియమించుకున్నట్టు ఎస్బీఐ రెండు రోజుల క్రితమే ప్రకటించింది. వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 18,000 మంది నియామకం చేపట్టినట్టు.. ఇందులో 13,500 మంది వరకు క్లరికల్ ఉద్యోగులు అని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి సైతం తెలిపారు. -
మళ్లీ కొలువుల కళకళ!
ముంబై: ఉద్యోగ నియామకాలు మే నెలలో సానుకూలంగా నమోదయ్యాయి. ఎనిమిది నెలల వరుస క్షీణత తర్వాత మే నెలలో 8.9 శాతం నియామకాలు పెరిగినట్టు (పోస్టింగ్లు) జాబ్సైట్ ఇండీడ్ ప్రకటించింది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్లోనే అధిక నియామకాలు కొనసాగుతున్నట్టు స్పష్టం చేసింది. మరింత సంఘటిత ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ మారుతుండడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. భారత్లో ఉద్యోగ నియామకాలు కరోనా ముందు సంవత్సరం (2019) కంటే 80 శాతం అధికంగా ఉన్నట్టు, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎంతో మెరుగని వెల్లడించింది. ముఖ్యంగా యూకే, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్లో ఉద్యోగ నియామకాలు ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువగా ఉండడాన్ని తన నివేదికలో ఇండీడ్ ప్రస్తావించింది. వీటితో పోల్చి చూసినప్పుడు భారత్లో నియామకాలు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. భారత్ మార్పు దిశగా ప్రయాణిస్తుండడంతో ఇటీవలి సంవత్సరాల్లో సంఘటిత రంగంలో మరిన్ని ఉద్యోగ కల్పనలకు దారితీస్తున్నట్టు విశ్లేíÙంచింది. ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ స్థాయిలో సంఘటితం వైపు అడుగులు వేయడం లేదని తెలిపింది. ఈ విభాగాల్లో అధిక నియామకాలు.. చిన్నారుల సంరక్షణ విభాగంలో 27 శాతం, వ్యక్తిగత సంరక్షణ, గృహ ఆరోగ్యంలో 25 శాతం, విద్యా రంగంలో 24 శాతం, తయారీలో 22 శాతం చొప్పున మే నెలలో నియామకాలు పెరిగాయి. అదే సమయంలో డెంటల్ రంగలో 10.2 శాతం, వ్యవసాయం, ఫారెస్ట్రీలో 8.6 శాతం, కమ్యూనిటీ, సామాజిక సేవల్లో 6.8 శాతం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 4.2 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. మే నెలలో 1.5 శాతం ఉద్యోగ ప్రకటనల్లో కంపెనీలు జెనరేటివ్ ఏఐ అవసరాన్ని ప్రస్తావించాయి. ముఖ్యంగా డేటా అనలైటిక్స్ ఉద్యోగాల్లో 12.5 శాతం వాటికిర, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో 3.6 శాతం, సైంటిఫిక్ రీసెర్చ్లో 3.1 శాతం మేర జెనరేటివ్ ఏఐ పరిజ్ఞానాన్ని అవసరాన్ని పేర్కొన్నాయి. -
ఫలితాలతోపాటే వేగంగా వార్షిక నివేదికలు
ముంబై: కంపెనీలు ఆర్థిక ఫలితాల వెల్లడికి, వార్షిక నివేదికల విడుదలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్ల విశ్వాసం ఇనుమడిస్తుందని కంపెనీ సీఎఫ్వోలకు సూచించింది. ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్వోలు మరింత లోతుగా సంప్రదింపులు నిర్వహించాలని, తద్వారా మరింత సహకారంతో ఆర్థిక ఫలితాల వెల్లడికి చర్యలు తీసుకోవాలని సెబీ హోల్టైమ్ సభ్యుడు అనంత నారాయణ్ కోరారు. సీఎఫ్వోలకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా విశ్వాసం నిలబెట్టడంలో సీఎఫ్వోలు పోషిస్తున్న ప్రాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ప్రస్తుతం వార్షిక ఫలితాలు, వార్షిక నివేదికల వెల్లడికి మధ్య అంతరం 70 నుంచి 140 రోజుల వరకు ఉంటోంది. ఖాతాలు, అంతర్గత నియంత్రణలు, కంపెనీ ఆడిటర్ రిపోర్ట్ గురించి మరింత లోతైన వివరాలతో కూడిన వార్షిక నివేదిక మరింత సమాచారయుక్తంగా ఉంటుంది. ఈ జాప్యాన్ని తగ్గిస్తే ఇన్వెస్టర్లకు పారదర్శకత పెరుగుతుంది’’అని అనంత నారాయణ్ పేర్కొన్నారు. -
జేఏఎల్ దివాలా పరిష్కార ప్రణాళికకు డెడ్లైన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న జైప్రకాష్ అసోసియేట్స్ (జేఏఎల్) పరిష్కార ప్రణాళిక దాఖలుకు ఆఖరు తేదీని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జూన్ 24కి పొడిగించాయి. బిడ్డర్ల విజ్ఞప్తి కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆఖరు తేదీ పొడిగింపును రుణదాతల కమిటీ (సీవోసీ) ఆమోదించినట్లు జేఏఎల్ తెలిపింది. వాస్తవానికి ఈ గడువు జూన్ 9తో ముగియాలి. అయితే, పలువురు బిడ్డర్లు పరిష్కార ప్రణాళికను సమరి్పంచేందుకు మరింత గడువు కావాలని కోరడంతో సీవోసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వివరించింది. సుమారు 25 కంపెనీలు జేఏఎల్ను దక్కించుకోవడంపై ఆసక్తిగా ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, వేదాంత, పతంజలి ఆయుర్వేద, జీఎంఆర్ బిజినెస్ అండ్ కన్సల్టెన్సీ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్, సిమెంట్ తయారీ, ఆతిథ్యం తదితర రంగాల్లో జేఏఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. రుణాల చెల్లింపులో డిఫాల్ట్ కావడంతో 2024 జూన్ 3న కంపెనీపై దివాలా పరిష్కార ప్రక్రియ కింద జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ చేపట్టింది. కంపెనీకి మొత్తం రూ. 57,185 కోట్ల మేర రుణభారం ఉంది. -
ప్రపంచ టాప్ 20 ధనవంతుల జాబితాలో అంబానీ, అదానీకి చోటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో తన సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా ఉన్న ఈ సూచీలో ముఖేశ్ అంబానీ 17వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఈ ఇండెక్స్లో టాప్లో టెస్లా సీఈఓ ఎలాన్మస్క్, తర్వాతి స్థానాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్బెజోస్ నిలిచారు.బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ 500 అత్యంత ధనవంతులు జాబితాలో ఇండియా నుంచి ముఖేశ్ అంబానీ(17వ స్థానం), గౌతమ్ అదానీ(20వ స్థానం), శివ్నాడార్(41వ స్థానం), షాపూర్ మిస్త్రీ(52వ స్థానం), సావిత్రి జిందాల్(59వ స్థానం), అజిమ్ప్రేమ్జీ(69వ స్థానం), సునిల్మిట్టల్(73 స్థానం), దిలీప్ సంఘ్వీ(79వ స్థానం), లక్ష్మీ మిట్టల్(86వ స్థానం)లు 100 స్థానాల్లోపు నిలిచారు.ఇదీ చదవండి: అగ్గి తగిలినా బుగ్గి కాని ‘బ్లాక్బాక్స్’ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల జాబితా.. -
సోనా కామ్స్టర్ ఛైర్మన్ మృతి
ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సుంజయ్ కపూర్(53) జూన్ 12, 2025న యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపట్ల పరిశ్రమ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. సోనా బీఎల్డబ్ల్యూ కామ్స్టర్ సంస్థ(ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,073 కోట్లు)కు ఛైర్మన్గా ఆటోమోటివ్ రంగంపై సుంజయ్ కపూర్ చెరగని ముద్ర వేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కాంపోనెంట్స్, డ్రైవ్లైన్ సిస్టమ్స్లో కీలక సంస్థగా సోనా కామ్స్టర్ను తీర్చిదిద్దారు. ఆయన తన నాయకత్వంతో కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.గ్లోబల్గా విస్తరణసంజయ్ కపూర్ 2015లో తన తండ్రి సురీందర్ కపూర్ నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత సుంజయ్ వ్యూహాత్మకంగా సోనా కామ్స్టర్ సర్వీసులను అంతర్జాతీయంగా విస్తరించారు. ట్రాక్షన్ మోటార్లు, స్టార్టర్ మోటార్లు, అధునాతన డ్రైవ్లైన్ సొల్యూషన్లలో కంపెనీ స్థానాన్ని బలోపేతం చేశారు. అతని దూరదృష్టితో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కాంపోనెంట్స్ తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో సంస్థ ప్రపంచ ఆటోమొబైల్ ఎకోసిస్టమ్లో ఒక ముఖ్యమైన సరఫరాదారుగా మారింది.తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలుసంజయ్ నాయకత్వంలో సోనా కామ్స్టార్ దేశ ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా గొలుసును బలోపేతం చేయడమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా అంతటా ప్రధాన ఆటోమోటివ్ తయారీదారులకు కీలక భాగస్వామిగా మారింది. సుస్థిరత, సాంకేతిక పురోగతి పట్ల ఆయన నిబద్ధత తదుపరి తరం మొబిలిటీ పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: ప్చ్.. బంగారం తులం లకారం.. హ్యాట్రిక్!పరిశ్రమ నాయకత్వానికి సహకారంభారత ఆటో కాంపోనెంట్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) అధ్యక్షుడిగా పని చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మాన్యుఫాక్చరింగ్ కౌన్సిల్కు అధ్యక్షత వహించారు. సృజనాత్మకత, స్థానికీకరణ, ఎగుమతి వృద్ధిని ప్రోత్సహించడంపై దృష్టి సారించారు. తయారీదారులు, సరఫరాదారులకు ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చేలా పని చేశారు. -
భారత ఫార్మా సంస్థలు ఉత్పత్తులను కాపీ కొట్టవు
బెర్న్: భారత ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు స్విప్ కంపెనీల ఉత్పత్తులను కాపీ కొడతాయన్న ఆరోపణలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఖండించారు. ఇది ఎంతో కాలంగా నెలకొన్న అపోహ అని స్పష్టం చేశారు. మేధో సంపత్తి హక్కులను (ఐపీఆర్) భారత్ గౌరవిస్తుందే కానీ.. ఇతరుల నుంచి టెక్నాలజీని ఎప్పుడూ చోరీ చేయదన్నారు. తమ ట్రేడ్మార్క్లు లేదా పేటెంటెడ్ లేదా కాపీ రైట్ టెక్నాలజీని భారత కంపెనీలు చట్టవిరుద్ధంగా కాపీ చేశాయన్న దానికి స్విప్ కంపెనీలు ఒక్క నిదర్శనం కూడా చూపించలేకపోయినట్టు చెప్పారు. ఈ విషయంలో ఒక్క కంపెనీ కూడా ఏ ఒక్క ఘటనను తమ దృష్టికి తీసుకురాలేదన్నారు. పేటెంట్లలో స్వల్ప మార్పులను భారత్ అనుమతించబోదన్నారు. దురదృష్టవశాత్తూ కొన్ని కంపెనీలు కొన్ని సవరణలతో అదనపు మేథో హక్కును సొంపాదిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత పేటెంట్ చట్టంలోని సెక్షన్ 3(డీ) కింద అప్పటికే ఉన్న పెటెంటెడ్ ఔషధాల కంటే మరింత ప్రభావవంతమైనవని నిరూపితమైనే కొత్త వాటికి అనుమతులకు అవకాశం కల్పిస్తుండడం గమనార్హం. ఈ నిబంధనలను సవరించాలని కొన్ని బహుళజాతి కంపెనీలు లోగడ కోరినప్పటికీ భారత్ తోసిపుచి్చంది. ఐపీఆర్ ప్రక్రియలను భారత్ మరింత మెరుగుపరుస్తోందని, దీంతో నిబంధనల అమలు భారం తగ్గి, వేగంగా అనుమతులు లభిస్తాయని మంత్రి చెప్పారు. -
ట్రూజెట్ మళ్లీ వస్తోంది..
న్యూఢిల్లీ: దాదాపు మూడేళ్ల క్రితం ఆర్థిక సంక్షోభంతో కార్యకలాపాలు నిలిపివేసిన ట్రూజెట్ (గతంలో టర్బో మేఘా ఎయిర్వేస్) మళ్లీ సర్వీసులను ప్రారంభించడంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇన్వెస్టర్ల దన్నుతో బ్రాండ్ను పునరుద్ధరించేందుకు అనుమతుల కోసం పౌర విమానయాన శాఖను సంప్రదించినట్లు కంపెనీ ఎండీ ఉమేశ్ వంకాయలపాటి తెలిపినట్లు వార్తా కథనం వెలువడింది. సుదీర్ఘ చర్చల అనంతరం కేంద్రం తమకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) జారీ చేసినట్లు ఆయన వివరించారు. ఇక పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)లో ఎయిర్ ఆపరేటర్స్ పర్మిట్ను (ఏవోపీ) రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని ఉమేశ్ తెలిపారు. ఇందుకోసం సుమారు 180 రోజుల వరకుసమయం పట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రాథమికంగా రూ. 200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 600 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ఆయన చెప్పారు. 2015–2022 మధ్య కాలంలో ప్రాంతీయ రూట్లలో చౌక విమానయాన సేవలందించే సంస్థగా, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ట్రూజెట్ కార్యకలాపాలు సాగించింది. అయితే, కోవిడ్ అనంతర ప్రతికూల ప్రభావాలతో, ఆర్థిక సంక్షోభం తలెత్తి 2022 ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు నిలిపివేసింది. హబ్గా వైజాగ్.. ఏవోపీ వచ్చాక ఎయిర్బస్ ఏ320 విమానంతో నవంబర్ నుంచి కార్యకలాపాలను పునఃప్రారంభించే యోచనలో ఉన్నట్లు ఉమేశ్ చెప్పారు. వైజాగ్ తమకు హబ్గా ఉంటుందన్నారు. తొలి ఫ్లయిట్ విశాఖ నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్కి నడిపే అవకాశం ఉందని ఉమేశ్ వివరించారు. ఏ320 విమానాలతో పాటు ప్రాంతీయ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ఉడాన్ స్కీము కింద సర్వీసులు నడిపేందుకు ఏటీఆర్ టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్లను కూడా తీసుకునే ప్రణాళికలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఏటీఆర్లకు లక్నో విమానాశ్రయం బేస్గా ఉంటుందన్నారు. -
పాలసీ బజార్లో సీనియర్ సిటెజెన్స్కు ప్రత్యేక సర్వీస్
సీనియర్ సిటిజన్లకు వారి ఆరోగ్య సంరక్షణ, బీమా ప్రయాణంలో ప్రతి దశలో సహకారం అందించేందుకు ఉద్దేశించిన 'సారథి' అనే ప్రత్యేక వృద్ధుల సంరక్షణ సేవలను పాలసీబజార్ ప్రవేశపెట్టింది. పాలసీబజార్ బీమా భాగస్వాముల ద్వారా ఈ సారథి సర్వీస్ లభిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్లకు సరైన బీమా ప్రణాళికలను ఎంచుకోవడానికి సహాయపడుతుంది. క్లెయిమ్ సహాయాన్ని అందిస్తుంది. కొనసాగుతున్న, వ్యక్తిగతీకరించిన ఫాలో-అప్లను అందిస్తుంది.ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు నివసిస్తుంటారు. అలాంటి వినియోగదారులు కూడా మరో నగరంలో నివసిస్తున్న వృద్ధులైన తమ తల్లిదండ్రుల కోసం పాలసీ బజార్ ‘సారథి’ ద్వారా ఆరోగ్య బీమాను కొనుగోలు చేయవచ్చు. ఆన్-గ్రౌండ్ ఎమర్జెన్సీ సపోర్ట్ను వారికి అందించవచ్చు.2050 నాటికి భారత్ లో వృద్ధుల సంఖ్య 31.9 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఈ పెరుగుతున్న విభాగానికి ప్రతిస్పందనగా, సారథి ఈ కింది సేవలు అందిస్తుంది.పాలసీలను సరళంగా వివరించడానికి శిక్షణ పొందిన సలహాదారులువృద్ధుల సంరక్షణలో శిక్షణ పొందిన ఎగ్జిక్యూటివ్ లతో సీనియర్ల కోసం హెల్ప్ లైన్ఆసుపత్రులతో సమన్వయం, అంబులెన్స్ మద్దతుతో సహా సహాయాన్ని క్లెయిమ్ చేస్తుంది.హోమ్ హెల్త్ కేర్, డయాగ్నస్టిక్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో సేవలుకాల్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా పునరుద్ధరణలు, ప్రీమియం రిమైండర్లు, చెక్-ఇన్లలో సహాయం కోసం ప్రతి సారథి వినియోగదారుడికి 24/7 రిలేషన్షిప్ మేనేజర్ను కేటాయింపుడాక్యుమెంట్ల డోర్ డెలివరీ, డిజిటల్ క్లెయిమ్ సబ్మిషన్లకు సహకారం. -
టాటా గ్రూపునకు మాయని మచ్చ..
టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలి వందల కొద్దీ ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే, ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిరిండియా పునరుద్ధరణపై నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోనుంది.బాధిత కుటుంబాలకు రూ .1 కోటి నష్టపరిహారంప్రమాదం తర్వాత, టాటా గ్రూప్ ప్రతి బాధిత కుటుంబానికి రూ .1 కోటి నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని వాగ్దానం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, ఎయిర్ ఇండియా భద్రతా ప్రోటోకాల్స్ను సమీక్షించడంలో టాటా గ్రూప్ నిబద్ధతను చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నొక్కి చెప్పారు.టాటా గ్రూప్.. వందల ఏళ్ల చరిత్రటాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద సమ్మేళనంగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది.జేఆర్డీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాఎయిర్ ఇండియాను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్ లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత ప్రభుత్వం ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు, పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది.దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో 2.2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఎయిరిండియాను తిరిగి పొందింది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేసింది.ఫ్లీట్ విస్తరణ..నవీకరణలు - ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్బస్, బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను ఇచ్చింది. తరువాత 2024 డిసెంబర్ లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునీకరించడానికి 400 మిలియన్ డాలర్ల రెట్రోఫిట్ ప్రోగ్రామ్ ప్రారంభించబడింది.మెగా విలీనం - 2024 నవంబర్లో టాటా ఎయిర్ ఇండియాను విస్తారా, ఎయిర్ ఇండియా ఎస్ప్రెస్తో విలీనం చేసింది. ఇది 30 శాతం దేశీయ మార్కెట్ వాటాతో భారతదేశపు అతిపెద్ద విమానయాన సమూహాన్ని ఏర్పాటు చేసింది.ఆపరేషనల్ పునరుద్ధరణ - టాటా Vihaan.AI ప్రవేశపెట్టింది. ఇది ఫ్లీట్ ఆధునీకరణ, టెక్నాలజీ అప్ గ్రేడ్ లు, కస్టమర్ సర్వీస్ మెరుగుదలలపై దృష్టి సారించే పంచవర్ష పరివర్తన ప్రణాళిక.మార్గ విస్తరణ - ఎయిర్ ఇండియా ఇప్పుడు 191 విమానాలను నడుపుతోంది. 43 దేశీయ, 41 అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. వీటిలో ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు నాన్ స్టాప్ సర్వీసులు ఉన్నాయి. -
ఊహించని ఘోరం.. విమానప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై పలువురు వ్యాపార ప్రముఖులు స్పందించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ తదితరులు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అహ్మదాబాద్-లండన్ గాట్విక్ ఎయిరిండియా విమానం 171 ఈ రోజు ఘోర ప్రమాదానికి గురైందని నేను తీవ్ర విచారంతో ధ్రువీకరిస్తున్నాను. ఈ వినాశకరమైన సంఘటనతో ప్రభావితమైన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో, మా ప్రాథమిక దృష్టి బాధితులందరికీ, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపై ఉంది. సంఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయపడటానికి, ప్రభావితులకు అవసరమైన మద్దతు, సహకారం అందించడానికి మేము మా శక్తి మేరకు కృషి చేస్తున్నాము" అని పేర్కొన్నారు.అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఘటనపై స్పందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. "ఎయిరిండియా ఫ్లైట్ 171 దుర్ఘటనతో మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఊహించని నష్టాన్ని చవిచూసిన బాధిత కుటుంబాల వైపు మా హృదయాలు ద్రవిస్తున్నాయి. అధికారులందరితో కలిసి పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తున్నాం" అని రాసుకొచ్చారు.👉ఇదీ చదవండి: విమానం క్రాష్ దెబ్బకు బోయింగ్ షేర్లూ క్రాష్పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అహ్మదాబాద్-లండన్ విమానం కూలిన విషాద ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను. నా ఆలోచనలు, ప్రార్థనలు విమానంలో ఉన్న వారు, ప్రభావిత ప్రాంత నివాసితుల వైపే ఉన్నాయి. ప్రతి ఒక్కరి భద్రత,సత్వర అత్యవసర ప్రతిస్పందన కోసం ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఘటన జరిగిన వెంటనే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.Deeply shocked and saddened by the tragic #planecrash of the #AirIndia Ahmedabad-London flight during take off in Ahmedabad having 242 passengers on board. My thoughts and prayers are with all those on board and the residents in the affected area. Wishing for everyone's safety… pic.twitter.com/KjTlFfo1Bn— Parimal Nathwani (@mpparimal) June 12, 2025We are shocked and deeply saddened by the tragedy of Air India Flight 171. Our hearts go out to the families who have suffered an unimaginable loss. We are working closely with all authorities and extending full support to the families on the ground. 🙏🏽— Gautam Adani (@gautam_adani) June 12, 2025 -
సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్.. ఇప్పుడు ఫుడ్డెలివరీ బాయ్..
మనం రోజూ ఎంతో మంది చిరు ఉద్యోగులను చూస్తుంటాం. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ సిబ్బందిగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి వారిని కొంత మంది చిన్నచూపు చూస్తారు. కానీ వారి నేపథ్యాలు తెలిస్తే పశ్చాత్తాపడక తప్పదు. అలాంటి వారిలో ఒకరే పద్మనాభన్.బెంగళూరుకు చెందిన నితిన్ కుమార్ ఫుడ్ కోసం స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ అతని ఇంటి ముంగిటకు వచ్చినప్పుడు, తాను ఆహారాన్ని మాత్రమే ఆశించగా అతన్ని లోతుగా కదిలించే కథ పరిచయమైంది. కేవలం బతడం కోసమే కాకుండా ఒకప్పుడు తాను నడుపుతున్న వ్యాపారాన్ని పునరుద్ధరించుకునేందుకు ఫుడ్ డెలివరీలు చేస్తున్న పద్మనాభన్ అనే ఎంట్రప్రెన్యూర్ పరిచయమయ్యారు. ఆయన కథనే నితిన్ కుమార్ ‘ఎక్స్’లో షేర్ చేశారు."ఇదితో నా స్విగ్గీ డెలివరీ పార్టనర్ ఇది నాకు అప్పగించారు" అంటూ పోస్ట్ను ప్రారంభించిన నితిన్ కుమార్ దానికి ఓ రెజ్యుమ్ మొదటి పేజీ చిత్రాన్ని జతచేశారు. ‘డెలివర్డ్ విత్ కర్, బట్ విత్ కోడ్’ అని రెజ్యుమ్పై క్యాప్షన్ ఉంది. డెలివరీ పార్ట్నర్ పద్మనాభన్దే ఆ రెజ్యుమ్. అందులో "19+ సంవత్సరాల అనుభవం ఉన్న ఫుల్-స్టాక్ డెవలపర్" అని ఆయన వృత్తిపరమైన సమాచారం ఉంది.పద్మనాభన్ ఒకప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని నడిపారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉండేవారు. కానీ ఆయనిప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తున్నారు. అయితే తాను ఈ పని చేస్తున్నది "మనుగడ కోసం మాత్రమే కాదు, (తన వ్యాపారాన్ని) మొదటి నుండి నిర్మించడానికి" ఆయన రెజ్యూమ్ హైలైట్ చేస్తోంది.👉ఇదీ చదవండి: అప్పుడు రూ.1.25 లక్షల జీతం.. ఇప్పుడు ఫుడ్ డెలివరీ ఉద్యోగం..డెలివరీ బాయ్కు బదులుగా మరేదైనా మంచి ఉద్యోగం ఇప్పించమంటావా అని అడిగితే.. ‘వద్దు, నా వ్యాపారాన్ని తిరిగి ట్రాక్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను‘ అంటూ పద్మనాభన్ బదులిచ్చాడని నితిన్ కుమార్ పేర్కొన్నారు. కాగా పద్మనాభన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2018లో తమిళనాడులో తన సంస్థను స్థాపించాడు. టెక్కీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చేశారు. -
కొత్త వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్, జీఎస్కే భాగస్వామ్యం
వ్యాక్సిన్ ఆవిష్కరణలో గ్లోబల్ లీడర్గా ఉన్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) జీఎస్కే పీఎల్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తున్న తీవ్రమైన బ్యాక్టీరియల్ డయేరియా అయిన షిగెల్లోసిస్ను పరిష్కరించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని ఇరు సంస్థలు తెలిపాయి.డయేరియా వ్యాధికి కారణం అవుతున్న షిగెల్లా అనే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. దాని తీవ్రత, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్ఆర్-మందులను తట్టుకునే స్వభావం)పై ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే షిగెల్లాను కట్టడి చేసేందుకు ఇప్పటివరకు లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు. క్లినికల్ ట్రయల్స్, రెగ్యులేటరీ అనుమతుల ద్వారా ఈ బ్యాక్టీరియాకు విరుగుడుగా ‘ఆల్ట్సాన్ఫ్లెక్స్ 1-2-3’ను అభివృద్ధి చేయడానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్), జీఎస్కే పీఎల్సీ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.వ్యాక్సిన్ అభివృద్ధికి జీఎంఎంఏ టెక్నాలజీజనరలైజ్డ్ మాడ్యూల్స్ ఫర్ మెంబ్రేన్ యాంటిజెన్స్ (జీఎంఎంఏ) టెక్నాలజీని ఈ వ్యాక్సిన్ కోసం ఉపయోగిస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్యాక్టీరియా బాహ్య పొరలను ఉపయోగించే వినూత్న విధానం. ఈ చౌకైన తయారీ ప్రక్రియ ద్వారా టీకాను మరింత తక్కువ ధరల్లో అందించవచ్చని తెలిపింది.క్లినికల్ ట్రయల్స్..యూరప్లో మొదటి దశ ట్రయల్స్ అనుకూలంగా వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది. ఆఫ్రికాలో రెండో దశ ట్రయల్స్లో 9 నెలల చిన్నారులపై ఎలాంటి భద్రతా సమస్యలు కనిపించలేదని పేర్కొంది. వ్యాక్సిన్ రోగనిరోధక శక్తి లక్ష్యాలను చేరుకున్నట్లు 2024 నుంచి మధ్యంతర ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నట్లు చెప్పింది. త్వరలో ఈ వ్యాక్సిన్ను వినియోగదారులకు అందిస్తామని ధీమా వ్యక్తం చేసింది.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్రోటావైరస్, టైఫాయిడ్, పోలియో, కలరా, సాల్మొనెల్లా వంటి డయేరియా వ్యాధి వ్యాక్సిన్లలో కంపెనీ నాయకత్వాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు. యాంటీమైక్రోబయల్ నిరోధకతను ఎదుర్కోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పేద జనాభాకు సరసమైన ధరలకు వ్యాక్సిన్ అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ తయారీకి జీఎస్కేతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ప్రపంచ ఆరోగ్యంపట్ల సంస్థ నిబద్ధతను హైలైట్ చేస్తుందని చెప్పారు. -
‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్
ప్రముఖ కంపెనీ, సరిపడే అనుభవం, నైపుణ్యాలు ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు జీతాలు రూ.లక్షల్లో ఉంటాయని తెలిసిందే కదా. అయితే పెరుగుతున్న జీవనశైలి, ఖర్చులకుతోడు బెంగళూరు వంటి లివింగ్ కాస్ట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ జీతం ఏమాత్రం సరిపోదని కొందరు అభిప్రాయపడుతున్నారు.అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగంలో బెంగళూరులో నివసిస్తున్నవారికి సంవత్సరానికి రూ.50 లక్షలు (ఎల్పీఏ) సరిపోతుందా.. అని సామాజిక మాధ్యమాల వేదికగా టెకీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కొందరికి రూ.50 లక్షలు ఇస్తున్నా దాని విలువ సగానికి తగ్గి రూ.25 లక్షలకు సమానమైందా? అంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ధ్రువీకరించాలని కోరుతున్నారు. అవికాస్తా వైరల్గా మారుతున్నాయి.ఇదీ చదవండి: ‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’సౌరవ్ దత్తా అనే టెకీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ..‘బెంగళూరు ఐటీ పరిశ్రమలో చాలా మంది రూ.50 ఎల్పీఏ సంపాదిస్తున్నారని విన్నాను. వారు పెరిగిన సీటీసీ లేదా రూ.50 ఎల్పీఏ రూ.25 ఎల్పీఏతో సమానమని చెబుతున్నారు. కొంతమంది టెక్కీలు ధ్రువీకరించగలరా?’ అని కోరారు. అందుకు ప్రతిస్పందనగా నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. రూ.50 ఎల్పీఏ కూడా నగరంలోని హై కాస్ట్ టెక్ వాతావరణంలో సరిపోదని కొందరు పేర్కొన్నారు. ‘రూ.50 ఎల్పీఏ ప్రస్తుతం రూ.10 ఎల్పీఏతోనే సమానం. చాలా మంది రూ.1 కోటి కంటే ఎక్కువే సంపాదిస్తున్నారు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బెంగళూరులో రూ.1 కోటి కంటే ఎక్కువ సంపాదించకపోతే సమయం వృథా అని మరొకరు కామెంట్ చేశారు. సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్లిపోవడమే బెటర్ అని సూచించారు. -
‘పాడిందేపాట ఎన్నిసార్లు పాడుతారు?’
భారత ఆర్థిక వృద్ధిని బహిరంగంగా విమర్శించినందుకు హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఇటీవల తాను పోస్ట్ చేసిన వివరాలు వైరల్గా మారాయి. దాంతో భారత్ వృద్ధికి కట్టుబడి ఉన్నవారు ఈయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.భాటియా తన ఎక్స్లో ఖాతాలో ‘భారత్లో 41.5 కోట్ల మంది ప్రజలు రోజుకు 3.10 డాలర్ల(రూ.250)తో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. అందుకు సిగ్గు పడాల్సిందిపోయి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గుగా వుంది’ అంటూ పోస్ట్ చేశారు. జపాన్ను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానానికి ఎగబాకుతున్నట్లు వచ్చిన వార్తలకు స్పందించిన భాటియా ఈమేరకు ఎక్స్లో వ్యాఖ్యలు చేశారు.భాటియా వ్యాఖ్యలను రాజకీయ, వృత్తిపరమైన నేపథ్యాలకు అతీతంగా భారతీయ వినియోగదారులు విస్తృతంగా ఖండించారు. భాటియా పోస్ట్లోని వివరాలు అవుట్డేటెడ్గా కొందరు కామెంట్ చేశారు. ఆయన తన మాటలను భారత రాజకీయ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారా లేక సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారా అని పలువురు యూజర్లు ప్రశ్నించారు. దీనిపై ఓ యూజర్ స్పందిస్తూ.. మరొకరు ‘మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు. భారత్ ప్రస్తుతం ఇంటున్న స్థానం నుంచి ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిపోయి ప్రతిసారి ఇదే పాట పడుతున్నారు. సిగ్గుగా ఉంది’ అని పోస్ట్ చేశారు.Instead of hanging your head in shame that 415 million people in India survive on $3.10/day, you brag about being the world’s 4th largest economy. Shame on you.— Sabeer Bhatia (@sabeer) June 10, 2025ఇదీ చదవండి: మెరుగైన సేవలకు ఎస్బీఐ ప్రాధాన్యం‘1997 డిసెంబర్లో హాట్మెయిల్ను 400 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అప్పటి నుంచి మీరు ఎన్ని కోట్లు సంపాదించారు? జీరో.. మీ ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మీరు ఎక్స్ ద్వారా ఉపన్యాసాలు ఇస్తున్నారు’ అని ఒక యూజర్ పోస్ట్ చేశారు. ‘నా ఆలోచనా విధానాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మీలాంటి వారు దూషణలకు దిగుతారు. బలహీన మనస్తత్వం, అభద్రతా భావం’ అంటూ భాటియా స్పందించారు. మరో యూజర్ ‘నువ్వొక అసమర్థుడివి. 36-37 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎందుకు గొప్పలు చెప్పుకుంటుంది’ అని ప్రశ్నించారు. దీనిపై భాటియా స్పందిస్తూ.. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా అమెరికా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని స్పష్టం చేశారు. -
జియో బ్లాక్రాక్ అడ్వైజరీ సేవలకు అనుమతి
జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (పెట్టుబడి సలహా) సేవలు అందించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతోపాటు స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈ నుంచి అనుమతి లభించినట్టు ప్రకటించింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అమెరికాకు చెందిన బ్లాక్రాక్ 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్.ఇదీ చదవండి: జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధిమార్క్ పిల్గ్రెమ్ను ఎండీ, సీఈవోగా నియమించినట్టు జియో బ్లాక్రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాలు కోరుకుంటున్న నేపథ్యంలో తమ జాయింట్ వెంచర్ సంస్థ ప్రపంచస్థాయి సలహా సేవలు అందించనుందని జేఎఫ్ఎస్ఎల్ ఎండీ, సీఈవో హితేష్ సేతియా తెలిపారు. మరోవైపు జియో బ్లాక్రాక్ అస్సెట్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ మ్యూచువల్ ఫండ్స్ సేవలు అందించేందుకు గత నెల 27న సెబీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. -
జీవిత బీమా ప్రీమియంలో మెరుగైన వృద్ధి
జీవిత బీమా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో మెరుగైన వృద్ధిని చూశాయి. న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల ద్వారా) 10.8 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.30,463 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది మే నెలలో ఇది రూ.27,034 కోట్లుగా ఉంది.ఇక ఏప్రిల్, మే నెలల్లో కలిపి న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.52,427 కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.47,293 కోట్లుగా ఉంది. మొదటిసారి బీమా పాలసీల విక్రయంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించడం ఈ వృద్ధికి దారితీసింది. ఇదీ చదవండి: యువతకు సత్య నాదెళ్ల సూచనఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల రూపంలో ఆదాయం 5.21 శాతం పెరిగి మే నెలలో రూ.3,525 కోట్లుగా ఉంది. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం మే నెలలో 10.27 శాతం పెరిగి రూ.18,405 కోట్లకు చేరుకుంది. మే నెలలో ఎల్ఐసీ గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.79 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.66 శాతం పెరిగింది. -
క్విక్ రెస్టారెంట్లకు ధరల సెగ
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దెబ్బతో క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) మార్జిన్లపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ మందగించడంతో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ క్యూఎస్ఆర్ కంపెనీలు రేట్లను పెంచాలంటే వెనుకాడుతున్నాయి. స్టోర్ల విస్తరణ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, అదే సమయంలో ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. బీఎన్పీ పారిబా రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిస్కౌంట్లను నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నప్పటికీ సగటు రోజువారీ అమ్మకాలు తగ్గడంతో క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. స్టోర్లను ఎడాపెడా వేగంగా విస్తరించడం, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం తదితర అంశాల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం పడుతోందని వివరించింది. ఇక, ఫుడ్ డెలివరీ సంస్థల విషయానికొస్తే స్విగ్గీ, జొమాటోలాంటి అగ్రిగేటర్ల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. భారీ స్థాయిలో ఎదిగిన ఈ రెండు సంస్థలు.. క్యూఎస్ఆర్ చెయిన్ల కన్నా చిన్నవైన రెస్టారెంట్లను కస్టమర్లకు మరింత చేరువ చేశాయి. దీంతో లిస్టెడ్ క్యూఎస్ఆర్ కంపెనీలకు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇది సరిపోదన్నట్లు ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు తమ సొంత డార్క్ కిచెన్ బ్రాండ్లను (బిస్ట్రో, స్నాక్ మొదలైనవి) ప్రారంభించి, ప్రత్యేక యాప్ల ద్వారా 10–15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలతో గత నాలుగేళ్లుగా చూస్తే ఫుడ్ డెలివరీ సంస్థల మార్జిన్లు పెరుగుతుండగా, క్యూఎస్ఆర్ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని నివేదిక వివరించింది. సామర్థ్యాలు పెంచుకోవాలి.. జూబిలెంట్ ఫుడ్స్లాంటి క్యూఎస్ఆర్ కంపెనీలు ముడి సరుకుల ధరలపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, డిమాండ్ బలహీనంగా ఉండటంతో ధరలను పెంచేందుకు ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం.. ఫుడ్ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్యూఎస్ఆర్ చెయిన్ల అమ్మకాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. లిస్టెడ్ క్యూఎస్ఆర్ చెయిన్ల మొత్తం అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగ్గా, 2025 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితమయ్యాయి. అదే ఫుడ్ డెలివరీ సంస్థల స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంగా నమోదైంది. దేశీ క్యూఎస్ఆర్ మార్కెట్లో పోటీపడాలంటే ప్రస్తుత సంస్థలు తమ మార్కెట్ వాటాను కాపాడుకోవాలంటే వినూత్నమైన విధంగా వేగం, మెనూ, డెలివరీ సామరŠాధ్యలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదాయ పన్ను రేట్ల సవరణలు, ఇతరత్రా సానుకూల పరిణామాలతో డిమాండ్ మళ్లీ పుంజుకోగలదని క్యూఎస్ఆర్ సంస్థలు ఆశిస్తున్నాయి. -
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్బర్గ్ నివేదిక తెలిపింది.తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.Worth it https://t.co/fQk2ULx7jh— Elon Musk (@elonmusk) June 11, 2025 -
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) లావాదేవీలపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేటు) వసూలు చేస్తారంటూ వచ్చిన ఊహాగానాలు, వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవి అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.భారీ స్థాయి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆన్లైన్లో పలు కథనాలు వచ్చాయి. ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఖర్చులను నిర్వహించడంలో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మద్దతుగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, అందులో భాగంగానే రూ.3,000 పైబడిన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ ప్రవేశపెట్టే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని పేర్కొన్నాయి.మర్చంట్ డిస్కౌంట్ రేటు అంటే..మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) అనేది డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేయడానికి వ్యాపారులు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే రుసుము. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డిజిటల్ వాలెట్ చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దేశంలో ప్రస్తుతం ఎండీఆర్ రేట్లు చిన్న వ్యాపారులకు (టర్నోవర్ రూ.20 లక్షల వరకు) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.40% (ప్రతి లావాదేవీకి రూ.200కు పరిమితం)గా ఉంది. క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.30% (ప్రతి లావాదేవీకి రూ.200 పరిమితి)గా ఉంది. పెద్ద వ్యాపారులు (టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే) ఫిజికల్ పీఓఎస్, ఆన్లైన్ లావాదేవీలపై 0.90% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి), క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలపై 0.80% (ప్రతి లావాదేవీకి రూ.1,000 పరిమితి) ఛార్జీలున్నాయి.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ మే నెలలో 1868 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. అనేక అంతరాయాలు వచ్చినప్పటికీ ఏప్రిల్లో 1789 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతకు ముందు మార్చిలో 1830 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఏప్రిల్లో రూ.23.95 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరగగా మే నెలలో రూ.25.14 లక్షల కోట్లకు పెరిగాయని ఎన్పీసీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.Speculation and claims that the MDR will be charged on UPI transactions are completely false, baseless, and misleading. Such baseless and sensation-creating speculations cause needless uncertainty, fear and suspicion among our citizens.The Government remains fully committed…— Ministry of Finance (@FinMinIndia) June 11, 2025 -
రైల్వే తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి..
రైల్వే తత్కాల్ టికెట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. కేవలం ఆధార్ ధ్రువీకరణ ఉన్న వ్యక్తులే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. 'ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికెట్ బుకింగ్ అవకాశం కల్పించాలి అని రైల్వే శాఖ తన సర్క్యులర్ లో పేర్కొంది.జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఆరు నెలల్లో 2.5 కోట్ల అనుమానాస్పద ఐఆర్సీటీసీ ఐడీ (IRCTC ID)లను బ్లాక్ చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. టికెట్ బుకింగ్ కోసం బాట్ సాఫ్ట్వేర్లను ఉపయోగించినందుకు ఆయా ఐడీలను బ్లాక్ చేశారు. ఈ అనధికార ఐడీలను ఏరివేయడానికి వ్యక్తిగత వినియోగదారులకు తత్కాల్ ఈ-టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ధ్రువీకరణను తప్పనిసరి చేశారు. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లు, అధీకృత ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుందని సర్క్యులర్లో పేర్కొన్నారు.ఏజెంట్లకు షాక్..దీంతో పాటు ఆథరైజ్డ్ ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్కు తొలి 30 నిమిషాల పాటు అవకాశం ఇవ్వబోమని స్పష్టంచేసింది. అంటే ఏసీ తరగతులకు 10.30 గంటల తర్వాత, నాన్ ఏసీ కోచ్లకు 11.30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లకు టికెట్ బుకింగ్కు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్ లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ బుకింగ్లను నిలిపివేయడానికి గానూ రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.👉ఇదీ చదవండి: వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం -
వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై రైల్వే కీలక నిర్ణయం
రైలు ప్రయాణం అంటే చివరి వరకూ టెన్షనే.. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకైతే తమ టికెట్లు కన్ఫర్మ్ అవుతాయా లేదా అన్నది రైలు బయలుదేరేంత వరకూ గందరగోళమే. ఈ తికమకను తొలగించడానికి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరేందుకు 24 గంటల ముందే తుది చార్టును సిద్ధం చేయాలని నిర్ణయించింది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మే 21న బికనీర్ పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చింది. చివరి నిమిషంలో గందరగోళాన్ని తగ్గించడానికి ముందుగానే చార్ట్ ను సిద్ధం చేయాలని స్థానిక రైల్వే అధికారులు సూచించారు. ఇప్పటివరకూ రైలు బయలుదేరడానికి 2.3 గంటల నుండి 4 గంటల ముందు మాత్రమే తుది చార్ట్ తయారు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో అనిశ్చితి నెలకొంది.👉ఇదీ చదవండి: తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరితుది చార్ట్ను 24 గంటల ముందే అందుబాటులోకి తేవాలన్న ఆలోచనకు మంత్రి వెంటనే ఆమోదం తెలపడంతో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. బికనీర్ డివిజన్లో జూన్ 6 నుంచి ప్రయోగాత్మకంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ ట్రయల్ ప్రారంభ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రయాణికులు మెరుగైన స్పష్టతను చూశారు. టికెట్ కన్ఫర్మ్ కాని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ సమయం లభించింది. బికనీర్ ట్రయల్ విజయవంతమైన తరువాత, భారతీయ రైల్వే ఇప్పుడు ఈ విధానాన్ని ఇతర అధిక ట్రాఫిక్ మార్గాలకు విస్తరించాలని యోచిస్తోంది. -
అంబానీ ఫ్యామిలీ సందడి.. ఆటపాటలతో హంగామా
ఎప్పుడూ వ్యాపారాలపరంగా వార్తల్లో నిలిచే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబం.. తాజాగా ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులతోపాటు కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతాతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్, శ్లోకాల స్నేహితుడిదే ఈ వివాహ వేడుక.కొడుకు, కోడళ్ల స్నేహితుడి పెళ్లి వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవడమే కాదు.. అందరూ హుషారుగా డ్యాన్స్లు వేశారు. శ్లోకా అయితే మైక్ పట్టుకొని పాటలు పాడేసింది. ఇక ఆకాష్ కూడా సరదాగా వెడ్డింగ్ గేమ్ లో పాల్గొంటూ వరుడితో కలిసి నేలపై కూర్చొని డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఇలా ఆ కుటుంబం చేసిన అల్లరి, హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.👉ఇది చదివారా? అనిల్ అంబానీకి భారీ ఉపశమనంస్కూల్ ఫ్రెండ్స్ అయిన ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా చాలా ఏళ్ల సుదీర్ఘ స్నేహం తరువాత 2019లో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు 2018లో ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆకాశ్ ప్రస్తుతం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) చైర్మన్గా ఉండగా, శ్లోకా దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరికి పృథ్వీ, వేద అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. View this post on Instagram A post shared by The Wedding Anchor Junaid Arif Currimbhoy (@theweddinganchor)