breaking news
Corporate
-
ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా
ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరం. ఇది రాజకీయాలకు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రం కూడా. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఎక్కువ మంది ధనవంతులు నివసిస్తున్న నగరాల్లో కూడా ఢిల్లీ స్థానం సంపాదించుకుంది. ఈ కథనంలో ఢిల్లీలోని అత్యంత ధనవంతులు ఎవరు?, వారి నెట్వర్త్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.➤శివ్ నాడార్: 40.2 బిలియన్ డాలర్లు➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 30.7 బిలియన్ డాలర్లు➤రవి జైపురియా: 17.3 బిలియన్ డాలర్లు➤బర్మన్ కుటుంబం: 10.4 బిలియన్ డాలర్లు➤కపిల్ & రాహుల్ భాటియా: 10.1 బిలియన్ డాలర్లు➤వినోద్, అనిల్ రాయ్ గుప్తా & కుటుంబం: 9.5 బిలియన్ డాలర్లు➤వివేక్ చాంద్ సెహగల్ & కుటుంబం: 8.9 బిలియన్ డాలర్లు➤విక్రమ్ లాల్ & కుటుంబం: 8.8 బిలియన్ డాలర్లు➤కులదీప్ సింగ్ & గుర్బచన్ సింగ్ ధింగ్రా: 7.5 బిలియన్ డాలర్లు➤రమేష్, రాజీవ్ జునేజా & కుటుంబం: 7 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?పైన వెల్లడించిన లిస్టులో ఉన్న ప్రముఖులు ఢిల్లీలో మాత్రమే కాదు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. వీరందరూ పారిశ్రామిక రంగంలో తమదైన ముద్రవేసి, ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2025 ఆగస్టులో ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు రూ. 5725 కోట్లు అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. దేశ ఆర్ధిక వృద్ధికి ఢిల్లీ ఎంత ముఖ్యమైన నగరమో అర్థం చేసుకోవచ్చు. -
ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..
వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడానికి.. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తరువాత ఆల్టో ధర రూ.40000 నుంచి రూ. 50,000 & వ్యాగన్ ఆర్ ధరలు రూ.60,000 నుంచి రూ. 67,000 వరకు తగ్గే అవకాశం ఉందని మారుతి సుజుకి చైర్మన్ 'ఆర్ సీ భార్గవ' పేర్కొన్నారు.కార్లను 18 శాతం జీఎస్టీ స్లాబులో చేర్చడం వల్ల ప్యాసింజర్ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతుంది. వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు అన్నే కూడా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కౌన్సిల్ చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?కౌన్సిల్ నిర్ణయం ఆటోమేకర్ల రవాణా ఖర్చులు.. డీలర్ మార్జిన్లపై ప్రభావం చూపదని పరిగణనలోకి తీసుకుంటే కార్ల ధరలు 9 శాతం తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్ల మార్కెట్ ఈ సంవత్సరం 10 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు భార్గవ తెలిపారు. కాగా రూ. 20 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు 5 శాతం స్లాబులో ఉన్నాయి. -
జియో ఫైనాన్షియల్కు భారీగా నిధులు
విస్తరణకు వీలుగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు తాజాగా రూ. 3,956 కోట్ల పెట్టుబడులు సమకూర్చాయి. ఒక్కో వారంట్కు రూ. 316.5 ధరలో కంపెనీ బోర్డు 50 కోట్ల వారంట్లను జారీ చేసింది. వెరసి ప్రమోటర్ సంస్థలు సిక్కా పోర్ట్స్ అండ్ టెర్మినల్స్, జామ్నగర్ యుటిలిటీస్ అండ్ పవర్కు 25 కోట్లు చొప్పున వారంట్లను అందుకున్నాయి.తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. జియో ఫైనాన్షియల్ రూ. 3,956 కోట్లు అందుకుంది. ఈ ఏడాది జూలైలో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు మార్పిడికివీలయ్యే వారంట్ల జారీకి కంపెనీ బోర్డు అంగీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 15,825 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు వేసింది.ప్రమోటర్లుగా ముకేశ్ అంబానీ కుటుంబంతోపాటు.. ఇతర సంస్థలు ప్రస్తుతం కంపెనీలో ఉమ్మడిగా 47.12 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు జంప్ చేసింది. -
అమెజాన్ ప్రైమ్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్ నిలిపివేత
అమెజాన్ ఇప్పటివరకు కొనసాగిస్తున్న అకౌంట్ షేరింగ్ ప్రోగ్రామ్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అక్టోబర్ 1, 2025 నుంచి అధికారికంగా ప్రైమ్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఇది వినియోగదారులు తాము ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రైమ్ ప్రయోజనాలను ఎవరితోనైనా పంచుకోవడానికి అనుమతించే దీర్ఘకాలిక ఫీచర్. అయితే ఈ ప్రోగ్రామ్ స్థానంలో ఒకే కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తులు మాత్రమే ప్రైమ్ ప్రయోజనాలను పంచుకునేలా కొత్త ప్రోగ్రామ్(అమెజాన్ హౌజ్హోల్డ్)ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది.కొత్త మార్పు తర్వాత ప్రైమ్ ప్రయోజనాలను పంచుకోవాలంటే సభ్యులందరూ ఒకే చిరునామాలో నివసించాలి. దాంతోపాటు ప్రైమ్ సభ్యుడికి కొన్ని ప్రయోజనాలుంటాయి.తనతోపాటు 20 ఏళ్లు నిండిన ఒకరిని మాత్రమే చేర్చుకోవచ్చు.నలుగురు టీనేజర్ల వరకు (ఏప్రిల్ 7, 2025 లోపు చేర్చినట్లయితే మాత్రమే) యాడ్ చేసుకోవచ్చు.నలుగురు పిల్లల వరకు ‘కిండిల్ ఫ్రీటైమ్’ (పూర్తి ప్రైమ్ ప్రయోజనాలను పొందలేరు)వంటి ఫీచర్లను అందించవచ్చు.ప్రైమ్ సభ్యులు వినియోగించుకునే కొన్ని సదుపాయాలను అమెజాన్ హౌజ్హోల్డ్లోనూ కొనసాగించనున్నారు. అవి..ఉచిత రెండు రోజుల డెలివరీప్రైమ్ డే డీల్స్ప్రైమ్ వీడియో (ప్రకటనలతో)అమెజాన్ మ్యూజిక్ (యాడ్-ఫ్రీ షఫుల్ మోడ్ మాత్రమే)ఎంపిక చేసిన గ్యాస్ స్టేషన్లలో డిస్కౌంట్లుఈబుక్, ఆడియోబుక్, కొన్ని అప్లికేషన్లు వాడేందుకు అవకాశం.ప్రత్యేక ఆఫర్దీర్ఘకాలిక వినియోగదారుల కోసం అమెజాన్ ప్రత్యేక లాయల్టీ డిస్కౌండ్ను అందిస్తోంది. 2009-2015 మధ్య ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న ఎవరైనా కేవలం 14.99 డాలర్లకు(సుమారు రూ.1270) 12 నెలలపాటు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్కు అర్హత కలిగిన సభ్యులకు దీన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈమెయిల్ అందుతుందని పేర్కొంది. లేదా ఇప్పటికే ఉన్న ప్రైమ్ మెంబర్ షిప్ కింద అకౌంట్ సెట్టింగ్లను తనిఖీ చేయవచ్చని చెప్పింది.ఎందుకీ మార్పులు?అమెజాన్ షేరింగ్ విధానాన్ని కఠినతరం చేయడం ద్వారా ఎక్కువ మంది భాగస్వామ్య వినియోగదారులను చెల్లింపు చందాదారులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ-కామర్స్, స్ట్రీమింగ్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సభ్యులకు అందిస్తున్న ప్రయోజనాల్లో మార్పులు చేయాలని చూస్తుంది.ఇదీ చదవండి: దేశీయ అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఇండిగో -
బిగ్ దివాలీ గిఫ్ట్.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట
దేశంలో జీఎస్టీ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తూ సెప్టెంబర్ 22 నుండి 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేట్ల వ్యవస్థకు మారాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ వ్యాపార దిగ్గజాలు స్వాగతించారు. రాధికా గుప్తా, హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ చర్యను పౌరులకు "పెద్ద దీపావళి బహుమతి" గా అభివర్ణించారు. 'ప్రతి భారతీయుడికి బిగ్ దీవాలీ గిఫ్ట్. రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ ముడి ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. చౌకైన కిరాణా సరుకులు, ఆరోగ్య సంరక్షణలో ఉపశమనం, సరసమైన విద్య, రైతులకు మద్దతు" అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ సంస్కరణ జీవనాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం అనే ద్వంద్వ ప్రయోజనాలతో "నెక్ట్స్-జనరేషన్ జీఎస్టీ" దిశగా ఒక అడుగు అని అన్నారు.ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా ‘ఎక్స్’ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. "చాలా క్లిష్టమైన సమయంలో చాలా ప్రగతిశీలమైన చర్య, ఇది డిమాండ్, సెంటిమెంట్ రెండింటినీ పెంచడానికి సహాయపడుతుంది! ప్రపంచం మనల్ని ఒక మూలకు నెట్టినప్పుడు, మరింత గట్టిగా పోరాడటానికి మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి" అని రాసుకొచ్చారు.మరిన్ని సంస్కరణలు ప్లీజ్...మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మనం ఇప్పుడు యుద్ధంలో చేరాం. మరింత వేగవంతమైన సంస్కరణలు వినియోగాన్ని, పెట్టుబడులను వెలికితీసేందుకు ఖచ్చితమైన మార్గం. ఇవి ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాయి. ప్రపంచంలో భారతదేశ స్వరాన్ని పెంచుతాయి. కానీ స్వామి వివేకానందుని ప్రసిద్ధ ఉపదేశాన్ని గుర్తు చేసుకుందాం: 'లేవండి, మేల్కొనండి. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపవద్దు'. కాబట్టి, మరిన్ని సంస్కరణలు, ప్లీజ్...’ అంటూ పోస్ట్ చేశారు.చదవండి: జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్నిత్యావసరాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతమున్న 12 శాతం, 28 శాతం కేటగిరీలను విలీనం చేస్తూ రేట్లను రెండు శ్లాబులుగా హేతుబద్ధీకరించాలని 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. Big Diwali gift 🎁 for every Indian!GST on daily essentials, healthcare, education & farming inputs slashed.🛒 Cheaper groceries💊 Relief in healthcare📚 Affordable education🚜 Support for farmersNext-gen GST = ease of living + boost to economy.— Harsh Goenka (@hvgoenka) September 3, 2025Extremely progressive step at a very critical time that should help boost both demand and sentiment! When the world pushes us into a corner, we push ourselves to fight back harder. pic.twitter.com/DnU7k5tTgq— Radhika Gupta (@iRadhikaGupta) September 3, 2025We have now joined the battle…More and faster reforms are the surest way to unleash consumption and investment.Those, in turn, will expand the economy and amplify India’s voice in the world.But let’s remember the famous exhortation of Swami Vivekananda:“Arise, awake, and… https://t.co/rDoRtjsCw1— anand mahindra (@anandmahindra) September 3, 2025 -
దేశీయ అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఇండిగో
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం 43 విదేశీ నగరాలకు విమానాలు నడుపుతూ ఈ ఘనత దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఎయిరిండియా(స్టాండలోన్-ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను మినహాయిస్తే) 42 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.14 ఏళ్ల క్రితం దిల్లీ-దుబాయ్ మధ్య ఒకే విమానంతో అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇండిగో విమానయాన సంస్థకు ఈ ఘనత ఓ మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ అధికారులు చెప్పారు. ఆసియా, మిడిల్ఈస్ట్, యూరప్ అంతటా కొత్త మార్కెట్లలో దూకుడుగా విస్తరించాలన్న ఇండిగో వ్యూహానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నట్లు తెలిపారు.గతంలో ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిరిండియా ఇటీవల తనకుతాను విధించుకున్న ‘సేఫ్టీ పాజ్’, కొన్ని ప్రాంతాల్లో విమానాల రద్దు కారణంగా అంతర్జాతీయ సేవల్లో అంతరాయం నెలకొంది. ఇది ఇండిగోను ముందుంచేలా చేసిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాఉండగా, ఇండిగో 2025 చివరి నాటికి లండన్, కోపెన్ హాగన్, సీమ్ రీప్తో సహా అనేక కొత్త మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ అంతర్జాతీయ విమాన కార్యకలాపాల్లో ఇండిగో సుమారు 30% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్యను 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 40%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా? -
ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘పీఈ’ పాగా
గత ఐదేళ్లుగా దేశ ఆరోగ్య పరిరక్షణ (హెల్త్కేర్) రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్లోబల్ పీఈ సంస్థలు దేశీ ఆసుపత్రుల చైన్లో భారీ పెట్టుబడులకు తెరతీస్తున్నాయి. ఫలితంగా ప్రయివేట్ రంగంలోని పలు ఆసుపత్రుల పగ్గాలు టెమాసెక్, బ్లాక్స్టోన్ తదితర పీఈ దిగ్గజాల చేతికి చిక్కుతున్నాయి. వివరాలు చూద్దాం..దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రుల రంగంలో ప్రపంచ ప్రయివేట్ ఈక్విటీ (పీఈ) దిగ్గజాల ఆధిపత్యానికి తెరలేచింది. గత కొన్నేళ్లుగా టెమాసెక్ హోల్డింగ్స్, బ్లాక్స్టోన్, సీవీసీ క్యాపిటల్, కేకేఆర్ తదితర గ్లోబల్ దిగ్గజాలు పలు ప్రయివేట్ ఆసుపత్రుల చైన్లను దేశీయంగా సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. మరికొన్నింటిలో మైనారిటీ వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వెచ్చిస్తున్నాయి. ఫలితంగా సహ్యాద్రి, మణిపాల్, కేర్, స్టెర్లింగ్ తదితర సుప్రసిద్ధ ఆసుపత్రులు పీఈ సంస్థల పరమవుతున్నాయి. వెరసి 80 బిలియన్ డాలర్ల విలువైన దేశీ హెల్త్కేర్ రంగంలో కన్సాలిడేషన్కు దారి చూపుతున్నాయి. గతంలో పబ్లిక్ సంస్థలు, కుటుంబ ట్రస్ట్ల నిర్వహణలో కార్యకలాపాలు కొనసాగించిన పలు ఆసుపత్రులు ప్రస్తుతం పీఈ దిగ్గజాల కనుసన్నలలో సర్వీసులు అందిస్తున్నాయి. తద్వారా దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులు కుటుంబ యాజమాన్య పరిస్థితుల నుంచి పీఈ సంస్థల నిర్వహణలోకి చేరుతున్నాయి. కోవిడ్–19 తదుపరి కరోనా మహమ్మారి తదుపరి దేశీ హెల్త్కేర్ రంగంపై గ్లోబల్ పీఈ దిగ్గజాలకు ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సింగపూర్ సంస్థ టెమాసెక్, యూఎస్ సంస్థ టీపీజీ, కేకేఆర్ భారీ పెట్టుబడులకు తెరతీశాయి. మణిపాల్, మ్యాక్స్ హాస్పిటల్ చైన్లో వాటాలు కొనుగోలు చేశాయి. నిజానికి 2007లోనే హైదరాబాద్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్లో యూకే సంస్థ ఎపాక్స్ పార్ట్నర్స్ పెట్టుబడులు చేపట్టింది. అయితే సాధారణంగా హెల్త్కేర్ రంగంలో మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో పీఈ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతాయని మ్యాక్స్ హెల్త్కేర్ సీఎండీ అభయ్ సోయి పేర్కొన్నారు. ఈ కాలంలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తాయని, మౌలిక సదుపాయాల వృద్ధికి వీలుంటుందని తెలియజేశారు. తదుపరి కార్పొరేట్స్ లేదా యాజమాన్య వ్యక్తులకు నిర్వహణను అప్పగిస్తాయని వివరించారు. 2019లో కేకేఆర్తో కలిసి మ్యాక్స్ హెల్త్కేర్లో నియంత్రిత వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడుల దన్ను పీఈ సంస్థల కారణంగా వృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సుపరిపాలన, నిర్వహణ సామర్థ్యం, సర్వీసులలో నాణ్యత మెరుగుపడతాయని గ్రాంట్ థార్న్టన్ భారత్ నిపుణులు భానుప్రకాష్ కల్మాత్ ఎస్జే పేర్కొన్నారు. ఆసుపత్రుల విస్తరణకూ వీలు చిక్కుతుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశీ హెల్త్కేర్ రంగంలో సుమారు 20 పీఈ దిగ్గజాలు యాక్టివ్గా ఉన్నట్లు తెలియజేశారు. ఏ ఇతర రంగంతో పోల్చినా ఇది అధికమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ హాస్పిటల్ చైన్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ఆర్వోఐ) మెరుగుపడినట్లు క్వాడ్రా క్యాపిటల్ పార్ట్నర్ సునీల్ ఠాకూర్ పేర్కొన్నారు. సమర్ధ వినియోగం, బెడ్లపై పెరిగిన ఆదాయం, ఉత్తమ వ్యయ నియంత్రణ ఇందుకు దోహదపడినట్లు వివరించారు. విస్తరణకు వీలు తొలి దశలో దేశీయంగా ఆసుపత్రులను ప్రభుత్వాలు లేదా కుటుంబ యాజమాన్య నిర్వహణలో సేవలు అందిస్తుండేవి. తదుపరి దశలో ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఊపిరిపోసుకుంటూ వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం యూఎస్ తరహాలో పీఈ దిగ్గజాల హవా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. యూఎస్లో ప్రయివేట్గా లేదా సంస్థాగత నిర్వహణలో హెల్త్ సర్వీసులు సమకూర్చుతుంటాయని తెలియజేశాయి. అయితే యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ పేరుతో ప్రభుత్వ అజమాయిషీలోనే హెల్త్కేర్ రంగ నిర్వహణ ఉంటుందని వెల్లడించాయి. కాగా.. గత కొన్నేళ్లలో దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులను పీఈ దిగ్గజాలు హస్తగతం చేసుకుంటూ వచ్చినట్లు పీడబ్ల్యూసీ ఇండియా అడ్వయిజరీ నిపుణులు సుజయ్ శెట్టి పేర్కొన్నారు. దీంతో మరింత మందికి ఆరోగ్య పరిరక్షణా సేవలు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా తగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వృత్తి నైపుణ్యం వంటి సానుకూలతలకు దారి ఏర్పడనున్నట్లు వివరించారు. దేశీయంగా ఆదాయాలతోపాటు.. లైఫ్స్టైల్తరహా వ్యాధులు పెరగడం, ఆరోగ్య పరిరక్షణపట్ల మెరుగైన అవగాహన వంటి అంశాలు హెల్త్కేర్ సర్వీసులకు డిమాండును పెంచుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దేశీయంగా ఆసుపత్రులలో తగినన్ని పడకలు, క్రిటికల్ కేర్ సేవల కొరత ఉన్నట్లు వెల్లడించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
యాక్సిస్ మాక్స్ లైఫ్, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యం
యాక్సిస్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. టైర్ 1 నగరాలను దాటి గ్రామీణ భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ మార్కెట్లలో అందుబాటు ఖర్చుతో జీవిత బీమా పరిష్కారాలను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.ఈ భాగస్వామ్యం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 650 బ్యాంకింగ్ అవుట్లెట్ల బలమైన నెట్వర్క్ను, పోస్టాఫీసుల ద్వారా 1.64 లక్షలకు పైగా యాక్సెస్ పాయింట్లను ఉపయోగించుకుని, టైర్ 3, టైర్ 4 , గ్రామీణ మార్కెట్లలోని కస్టమర్లకు అవసరాల ఆధారిత జీవిత బీమా పరిష్కారాల సమగ్ర సూట్ను అందిస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక చేరిక లక్ష్యాలకు, '2047 నాటికి అందరికీ బీమా' సాధించాలనే ఐఆర్డీఏఐ దార్శనికతకు మద్దతు ఇస్తుంది.జీవిత బీమాను మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా మారుస్తూ, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ దాని ప్రధాన స్మార్ట్ వెల్త్ అడ్వాంటేజ్ గ్యారెంటీ ప్లాన్ (SWAG), స్మార్ట్ వైబ్ ప్లాన్, వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో సహా వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తుంది. యువ కస్టమర్ల కోసం తక్షణ ఆదాయం, పూర్తి జీవిత ఆదాయ ఎంపికల నుండి అవసరమైన రక్షణ, సమకాలీన పొదుపు లింక్డ్ సొల్యూషన్ల వరకు విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి వీటిని రూపొందించింది. -
పేదలకు ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ సేవలు
హైదరాబాద్: ఫ్లిప్కార్ట్ గ్రూప్ స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ సహకారంతో, ఇటీవల ఆదిలాబాద్ (తెలంగాణ), బెంగళూరు, ముంబైలలోని పేద వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రుతుక్రమ పరిశుభ్రత విద్య, ఆర్థిక అక్షరాస్యత శిక్షణపై దృష్టి సారించిన ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలైంది.ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం ద్వారా 9,700 మందికి పైగా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరింది. మరో 26,000 మందికి పైగా సాకుకూల ప్రభావం కలిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సంప్రదింపులు, వ్యాధులపై అవగాహన సెషన్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందులు అందించే సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. కౌమారదశలో ఉన్న బాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రక్తహీనత పరీక్షలు, రుతుక్రమ పరిశుభ్రత వర్క్షాప్లు, శానిటరీ ఉత్పత్తుల పంపిణీ వంటివి చేపట్టారు. అలాగే టీనేజర్లకు ఆర్థిక అక్షరాస్యత తరగతులు నిర్వహించారు.“ప్రజలు సమగ్ర జ్ఞానం, అవసరమైన వనరులతో సాధికారత పొందినప్పుడు స్థిరమైన మార్పు పుడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం” అని ఫ్లిప్కార్ట్ కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ సారా గిడియన్ అన్నారు. “సమగ్ర అభివృద్ధి అనేది పేద వర్గాలు పురోగతి చెందినప్పుడే సాధ్యమవుతుంది” అని స్మైల్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ సంతను మిశ్రా అభిప్రాయపడ్డారు. -
టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు
దేశంలోని ప్రముఖ టెక్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. టెక్నాలజీ రంగం పుంజుకుంటున్న నేపథ్యంలో కంపెనీ తన ఉద్యోగుల్లో ఎక్కువ మందికి 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వేతన పెంపును ప్రకటించింది. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా వేతన పెంపు విషయంలో గతంలో జాప్యం జరిగినప్పటికీ మధ్య, దిగువ స్థాయి ఉద్యోగుల్లో 80% మందికి ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని కంపెనీ హామీ ఇచ్చింది.అస్థిరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ దిద్దుబాట్లను హైలైట్ చేస్తూ టీసీఎస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. ఆ సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సతమతమవుతున్న ఐటీ రంగం అంతటా ఆందోళనలు రేకెత్తాయి. కానీ ప్రస్తుతం కంపెనీ పంథా మార్చుకొని పెంపుపై పునరాలోచించినట్లు తెలుస్తుంది. వేతన పెంపు అంశంపై ఓ సీనియర్ ఉద్యోగి మాట్లాడుతూ..‘ఉద్యోగుల ఎదుగుదలకు అనుగుణంగానే ఈ వేతన పెంపు ఉంది. నైపుణ్యం మెరుగుపరుచుకోవడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడంపై మేము దృష్టి పెట్టాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు 20 శాతం పెంపు -
జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు 20 శాతం పెంపు
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? మీరు జొమాటో ద్వారా చేసే ఆర్డర్లపై గతంలో కంటే కాస్త ఎక్కువగా బిల్లు రావడం గమనిస్తున్నారా? అందుకు కంపెనీ వసూలు చేస్తున్న ప్లాట్ఫామ్ ఫీజు కారణం. జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును గతంలో కంటే 20% పెంచింది. సెప్టెంబర్ 2, 2025 నుంచి అన్ని నగరాల్లో ప్రతి ఆర్డర్పై ఈ ఫీజును రూ.10 నుంచి రూ.12కు పెంచింది.డెలివరీ ఫీజులు, పన్నులు, రెస్టారెంట్ ధరలు కాకుండా జొమాటో ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ప్లాట్ఫామ్ ఫీజును ఏప్రిల్ 2023లో మొదటిసారి ప్రవేశపెట్టింది. అయితే ప్రాథమికంగా ఇది రూ.2గా ఉండేది. క్రమంగా జనవరి 2024లో రూ.4కు, అక్టోబర్ 2024లో ఏకంగా రూ.10, ఇప్పుడు దాన్ని రూ.12కు పెంచేసింది.ఇప్పుడే పెంపు ఎందుకు?మార్కెట్ నిపుణులు అంచనాల ప్రకారం.. ఈ సమయంలోనే ప్లాటఫామ్ ఫీజును పెంచేందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా ఫుడ్ డెలివరీ వాల్యూమ్స్ గణనీయంగా పెరిగే పండుగ సీజన్కు ముందు ధరలు పెంచితే ఆదాయం పెరుగుతుందని భావించి ఉండవచ్చని చెబుతున్నారు. రోజుకు 2.3–2.5 మిలియన్ల ఆర్డర్లు వస్తుండటంతో ఒక్కో ఆర్డర్పై రూ.2 పెరిగినా త్రైమాసిక ఆదాయంలో అదనంగా రూ.45 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ఫీజు పెంపుపై జొమాటో ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..‘ప్లాట్ఫామ్ విస్తరణలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగం’ అని తెలిపారు.Either @zomato thinks that the consumer is stupid or they just don't care anymore. In the past year Iv seen the #PlatformFee increase upto Rs 10 and now its gone up by Rs 2 again bringing it to a total of Rs12. The same order in zomato and @Swiggy has a difference almost Rs 25!! pic.twitter.com/5kemNUZ8Ow— Tarunima Varma (@ForeverFilmy) September 1, 2025ఇదే బాటలో స్విగ్గీ..అధికమవుతున్న నిర్వహణ ఖర్చుల మధ్య లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ఈమేరకు ప్లాట్ఫామ్ ఫీజులు పెంచుతున్నాయి. జొమాటో పోటీ కంపెనీ స్విగ్గీ ఎంపిక చేసిన మార్కెట్లలో ప్లాట్ఫామ్ ఫీజును రూ.14 వరకు విధిస్తుంది. ఇదీ చదవండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం -
ఏఐతో ఉద్యోగాలు పోతాయా?
కృత్రిమ మేధ(ఏఐ)తో గణనీయంగా ప్రయోజనాలు ఉంటాయని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. లేటెస్ట్ ఏఐ, చాట్జీపీటీ వెర్షన్లను ఉపయోగించాలని తన కార్యాలయంలోని సిబ్బందికి కూడా తాను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని పరిశ్రమ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.ఏఐలాంటి టెక్నాలజీలతో ఉద్యోగాలు పోతాయనే వారి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐని అనైతికంగా ఉపయోగిస్తే తలెత్తే సమస్యలను అరికట్టడానికి మానవ జోక్యం తప్పనిసరిగా అవసరమవుతుంది కాబట్టి, ఆ విధంగా ఉద్యోగాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. కాబట్టి దీన్నొక గొప్ప అవకాశంగా పరిగణించి, అందిపుచ్చుకోవాలని ఆయన వివరించారు.ఏఐని అనైతికంగా ఉపయోగించడం వల్ల స్వల్పకాలికంగా కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ దీర్ఘకాలికంగా భారత్కి ఇది మేలే చేస్తుందన్నారు. డేటా, డాక్యుమెంట్ల భద్రత రీత్యా చాట్జీపీటీ, డీప్సీక్లాంటి టూల్స్ను ఆఫీస్ కంప్యూటర్లు, డివైజ్లలో డౌన్లోడ్ చేయొద్దని ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులకు ఆదేశించింది. అయితే, ఈ కొత్త టెక్నాలజీతో ఒనగూరే ప్రయోజనాలరీత్యా దీని వినియోగంపై ప్రభుత్వ విభాగాల్లో నిషేధమేమీ లేదంటూ మార్చిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. కానీ భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించారు.ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు -
టాటా క్యాపిటల్ రోడ్షోలు షురూ
ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయంగా ప్రధాన ఫైనాన్షియల్ కేంద్రాలలో ఇన్వెస్టర్ రోడ్షోలకు తెరతీసింది. తద్వారా ఈ నెల 22న ప్రారంభంకానున్న ఐపీవోకు దారిని ఏర్పాటు చేసుకుంటోంది. నిజానికి ఆగస్ట్లోనే ప్రారంభించిన రోడ్షోలకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పటిష్ట ప్రతిస్పందన లభిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.హాంకాంగ్, సింగపూర్, లండన్, న్యూయార్క్సహా దేశీయంగా కీలక నగరాలలో సీనియర్ మేనేజ్మెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. కంపెనీకిగల డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, పటిష్ట ఫైనాన్షియల్స్, డిజిటల్ ఫస్ట్ వృద్ధి వ్యూహాలను రోడ్షోలలో ప్రదర్శిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో కంపెనీ విలువ 18 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేసినప్పుడు 11 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేసిన సంగతి తెలిసిందే.ఐపీవో వివరాలివీఐపీవోలో భాగంగా టాటా క్యాపిటల్ మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా టాటా గ్రూప్ దిగ్గజం 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెప్టెంబర్లో అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ ఆదాయం రూ. 7,692 కోట్లకు చేరగా.. రూ. 1,041 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
భారత్లో నౌకల తయారీపై మిత్సుయి ఓఎస్కే చర్చలు
జపాన్ షిప్పింగ్ దిగ్గజం మిత్సుయి ఓఎస్కే లైనర్స్ (ఎంవోఎల్) భారత్లో నౌకల తయారీకి సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే త్వరలో రైల్వే లాజిస్టిక్స్ విభాగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఎంవోఎల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెప్టెన్ ఆనంద్ జయరామన్ ఈ విషయాలు తెలిపారు.141 ఏళ్ల చరిత్ర గల ఎంవోఎల్ ప్రస్తుతం భారత్లో నాలుగో అతి పెద్ద షిప్ఓనర్గా కార్యకలాపాలు సాగిస్తోందని, రెండో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన వివరించారు. కొచ్చిన్ షిప్యార్డ్కి త్వరలో మధ్య స్థాయి షిప్ ట్యాంకర్ల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్లు జయరామన్ చెప్పారు. మరోవైపు, భారత్లో 3–4 స్టార్టప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే యోచనలో ఎంవోఎల్ ఉన్నట్లు ఆయన వివరించారు. భారీగా పెట్టుబడులు అవసరమయ్యే నౌకల నిర్మాణ మార్కెట్లో ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం ఉండగా, భారత్ వాటా ఒక్క శాతం లోపే ఉంది.ఇదీ చదవండి: ఐపీవోలకు కంపెనీల క్యూ..! -
మెర్క్తో టాటా ఎలక్ట్రానిక్స్ జత
సెమీకండక్టర్ మెటీరియల్ టెక్నాలజీ దిగ్గజం మెర్క్ ఎల్రక్టానిక్స్తో టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా గుజరాత్లోని ధోలెరాలో ఏర్పాటు చేస్తున్న చిప్ ప్లాంటుకి అవసరమైన పూర్తిస్థాయి ప్రొడక్టులు, సర్విసులను ఔట్సోర్సింగ్ చేసుకోనుంది. దీనిలో భాగంగా హైప్యూరిటీ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ గ్యాస్, కెమికల్ డెలివరీ సిస్టమ్స్ తదితరాలను సమకూర్చుకోనుంది. 2025 సెమీకాన్ ఇండియా సదస్సు సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. -
ఐఆర్డీఏఐ చైర్మన్గా అజయ్సేత్
బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) కొత్త చైర్మన్గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి 'అజయ్ సేత్' సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సేత్ కేంద్ర ఆర్థిక శాఖలో నాలుగేళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఈ ఏడాది జూన్లోనే పదవీ విరమణ చేశారు.స్వల్ప విరామంతో ఆయన్ని కీలకమైన ఐఆర్డీఏఐ చైర్మన్ బాధ్యతల్లో కేంద్రం కూర్చోబెట్టడం గమనార్హం. బీమా రంగంలో ఆరోగ్యకరమైన పోటీకి, అందరికీ బీమా సేవల విస్తృతికి, ఉత్తమ ప్రమాణాల అమలుకు, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఐఆర్డీఏఐ కృషి చేస్తుంటుంది. -
10వ తరగతి చదివాడు.. రూ.కోటి కూడబెట్టాడు
అనుకున్నది సాధించాలంటే సంకల్పం, దీక్ష అవసరం. ఈ రోజుల్లో లక్షలు జీతాలు తీసుకునేవారు కూడా మంత్ ఎండ్ వచ్చే సరికి.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే కేవలం 10వ తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదా చేసి.. అందరిచేతా ఔరా అనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.జేబులో రూ. 5000రెడ్దిట్ పోస్టులో వైరల్ అవుతున్న ఓకే పోస్టులో.. తాను దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామం నుంచి ఉండేవాడు. స్వయంగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న తరువాత 2000 సంవత్సరంలో బెంగళూరుకు వచ్చాడు. అప్పుడు అతని వయసు 27 ఏళ్లు. ఆ సమయంలో అతని జేబులో ఉన్న డబ్బు రూ. 5000 మాత్రమే. తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పుకున్నాడు. అతని మొదటి జీతం రూ. 4200 మాత్రమే. చివరగా తీసుకున్న జీతం రూ. 63,000 అని పేర్కొన్నాడు.బెంగళూరు శివార్లలో రూ. 6500లకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందులో అతడు, అతని భార్య, కూతురు మాత్రమే ఉంటారు. వీరి నెలవారీ ఖర్చులు రూ. 25000. గత 25 ఏళ్లలో అతడు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇల్లు మారాడు. అయితే అతడు ఎప్పుడు అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదని వివరించాడు.2024లో పర్సనల్ ఫైనాన్స్.. ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుని అందులో పెట్టుబడి పెట్టడం నేర్చుకున్నాడు. ఇది తన బిడ్డ కోసం దాస్తున్నట్లు పేర్కొన్నాడు. అదృష్టవశాత్తూ వారికి ఎప్పుడూ పెద్ద అనారోగ్యం గానీ.. కష్టాలు గానీ రాలేదని చెప్పాడు.క్రెడిట్ కార్డ్ లేదువివిధ బ్యాంకుల్లో 1 కోటి రూపాయలు. 10,000 రూపాయలు డిపాజిట్లు. ఈక్విటీలో రూ. 65 వేల రూపాయలు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లేదు. 2015 ప్రాంతంలో ఒక స్కూటర్ ఉండేది. చూపు తక్కువగా ఉండటం వల్ల దానిని సరిగ్గా నడపలేకపోవడంతో అమ్మేశాడు. ప్రతిచోటకు నడిచే వెళ్తాడు. ఇప్పటికీ ఒక గుక్క నీరు కూడా తాగకుండా ఐదు కిలోమీటర్లు నడవగలను/జాగింగ్ చేయగలనని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికరాసిన లేదా ప్రింట్ చేసిన రచనలకు ప్రూఫ్ రీడింగ్ పని మాత్రమే చేసేవాడిని. అది తప్పా నేను వేరే ఏ పనీ చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే నా కూతురు చదువు పూర్తయిన తరువాత, పని చేయడం ప్రారంభించాను. నేను ఇప్పటి వరకు కూడబెట్టిన డబ్బుకు కుమార్తె డబ్బు రూ. 2 లక్షలు కలిశాయని చెప్పాడు.నా అనుభవం నుంచే నేను చాలా నేర్చుకున్నాను. విద్య, తెలివితేటలు, ఆరోగ్యం, సమయం అనేవి ఒక వ్యక్తికి పెద్ద ఆస్తులు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా అవసరం అని ఆ వ్యక్తి చెబుతాడు. విలాసాలకు పోకుండా జీవితం గడిపితే ఎవరైనా డబ్బు కూడబెట్టవచ్చు అని చెబుతాడు. -
ఓవైపు జీతాలు పెంపు.. మరోవైపు లేఆప్స్..
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) 2025 సెప్టెంబర్ 1 నుంచి తన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రారంభించింది. మెజారిటీ సిబ్బందికి 4.5 నుంచి 7 శాతం వరకు జీతాలను పెంచినట్లు తెలుస్తోంది. అత్యుత్తమ పనితీరును కనపరించినవారికి 10 శాతం పెంచినట్లు సమాచారం. ఇంక్రిమెంట్ లెటర్లను కంపెనీ ఉద్యోగులకు అందించే ప్రక్రియను కూడా మొదలుపెట్టేసింది.ఈ ఏడాది టీసీఎస్ తన ఉద్యోగులలో దాదాపు 80% మందికి ఇంక్రిమెంట్లు అమలు చేయనున్నట్లు గత నెలలోనే వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఆర్ధిక అనిశ్చితులు, సవాలుతో కూడిన వ్యాపార వాతావరణం కారణంగా కొంత ఆలస్యమైంది.ఉద్యోగుల తొలగింపుటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని టీసీఎస్ వెల్లడించింది. ఉద్యోగులలో 2 శాతం.. అంటే సుమారు 12000 మందిని తొలగించే అవకాశం ఉంది. ఇది టెక్ రంగంలో ఆందోళనలు రేకెత్తించింది. ఇలాంటి సమయంలోనే కంపెనీ జీతాలను పెంచి వారికి కొంత ఉపశమనం కల్పించింది. ఉద్యోగులను తొలగించే దిశలో ఇతర టెక్ దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐ కారణంగా భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగులు.. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ డైమండ్.. ఈ శతాబ్దం దీనికే!.. నరేంద్ర మోదీ -
ఇండియాలో 600 మాత్రమే!.. అమెరికా బ్రాండ్కు బుకింగ్స్..
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ.. టెస్లా జూలై మధ్యలో భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ కేవలం 600 కార్లకు మాత్రమే ఆర్డర్లు పొందింది. అయితే కంపెనీ ఈ ఏడాది 350 నుంచి 500 కార్లను మాత్రమే ఇండియాలో విక్రయించాలని చూస్తోంది. టెస్లా మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో షాంఘై నుంచి రానుంది.టెస్లా కంపెనీ ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్ నగరాల్లో మాత్రమే తమ మొదటి డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించనుంది. ఇప్పటికే సంస్థ దేశంలో రెండు డీలర్షిప్లను ప్రారంభించింది. ఛార్జింగ్ స్టేటన్స్ కూడా ఏర్పాటు చేయడంలో టెస్లా నిమగ్నమై ఉంది.టెస్లా మోడల్ వైటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుస్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
ఏఐ ఇన్సూరెన్స్ టూల్స్ను ప్రారంభించిన హైదరాబాద్ కంపెనీ
బీమా రంగాన్ని ఆధునీకరించే దిశగా హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ ఫోరేసాఫ్ట్, అమెరికాకు చెందిన ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్తో చేతులు కలిపింది. బీమా కంపెనీలు, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత ఆటోమేషన్ టూల్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫోరేసాఫ్ట్ తెలిపింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో రిస్క్ తగ్గించడం, మోసాలను గుర్తించేందుకు ఈ ఏఐ టూల్స్ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చూకూరుస్తాయని పేర్కొంది.ఆరోగ్య బీమా క్లెయిమ్ దాఖలు చేయడం నుంచి ప్రమాదాన్ని నివేదించడం లేదా కొత్తగా క్లెయిమ్ కవరేజీ కోసం దరఖాస్తు చేయడం వరకు వినియోగదారులు ఈ ఏఐ టూల్స్ ద్వారా బీమా సంస్థలతో చర్చించే అవకాశం ఉందని ఫోరేసాఫ్ట్ తెలిపింది. ప్రధానంగా కింది అంశాలపై మెరుగైన సర్వీసులు పొందవచ్చని చెప్పింది.వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్: ప్రమాదం జరిగిన వెంటనే ఏఐ సిస్టమ్లు ప్రారంభ క్లెయిమ్ అప్లికేషన్ను ఆటోమేట్ చేస్తాయి. మాన్యువల్ పేపర్ వర్క్ను తగ్గిస్తాయి. దాంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.స్మార్ట్ రిస్క్ అసెస్మెంట్: కృత్రిమ మేధ ఇంజిన్లు నిర్మాణాత్మక డేటా (వినియోగదారుల వైద్య చరిత్ర వంటివి)ను విశ్లేషించి ఆ సమాచారాన్ని మదింపు చేస్తాయి.ఫ్రాడ్ డిటెక్షన్: ఏఐ టూల్స్లోని ఇంటిగ్రేటెడ్ ఫ్రాడ్ డిటెక్షన్ మాడ్యూల్స్ అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే పర్యవేక్షిస్తాయి. నిజమైన పాలసీదారులను రక్షిస్తాయి.ఈ సందర్భంగా ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్ ప్రెసిడెంట్ మృదుల మునగాల మాట్లాడుతూ..‘ఈ ఏఐ టూల్స్ వల్ల మోసపూరిత క్లెయిమ్లను కట్టడి చేస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చు’ అని చెప్పారు. ఫోరేసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు బాబు వజ్జా మాట్లాడుతూ..‘ఇన్సూరెన్స్ కంపెనీల పునరుద్ధరణకు తోడుగా తదుపరి తరం ఏఐ సర్వీసులు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మరింత స్మార్ట్గా, వేగంగా, పారదర్శకంగా బీమాను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.ఈ ఒప్పందంలో భాగంగా ఇరుకంపెనీలు ఇన్సూరెన్స్ ఏఐలో నిరంతర ఆర్ అండ్ డీకి మద్దతుగా హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా, మిడిల్ఈస్ట్లో పైలట్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఇంజినీరింగ్, సర్వీస్ డెలివరీలో 100 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని ఫోరేసాఫ్ట్ యోచిస్తోంది.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..
టెక్ కంపెనీల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లేఆఫ్స్కు బలవుతున్నారు. ఒకే కంపెనీలో 25 ఏళ్లు పని చేసిన 57 ఏళ్ల ఓ వ్యక్తికి లేఆఫ్ ప్రకటించడంతో ఇందుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లు సంస్థలో పని చేసిన ఆ ఉద్యోగి ఊహించని షాక్కు గురైనట్లు రెడిట్ పోస్ట్లో చెప్పుకొచ్చారు.రెడిట్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘నా వయసు 57 ఏళ్లు. ఒకే కంపెనీలో గత 25 ఏళ్లుగా వివిధ స్థాయుల్లో పనిచేస్తూ ప్రస్తుతం హైరింగ్ మేనేజర్గా ఉన్నాను. నా రిటైర్మెంట్కు ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. కంపెనీ సడెన్గా నాకు లేఆఫ్ ఇస్తున్నట్లు చెప్పింది. ఇది నాకు ఊహించని షాక్. సంస్థ 30 రోజుల నోటీసు పీరియడ్ విధించింది. నన్ను 2-3 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగిగా పరిగణిస్తున్నట్లు అనిపించింది. చాలా వింతగా అనిపిస్తుంది’ అని రాసుకొచ్చారు.ఆ ఉద్యోగి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ను అప్డేట్ చేశాడు. రెజ్యూమెను కస్టమైజ్ చేశాడు. తన పనికి తగినట్లు కాకపోయినా నెలకు రూ.80వేలు–రూ.1లక్ష వేతనం ఉన్న ఉద్యోగం కోసం చూస్తున్నట్లు చెప్పాడు. అతని ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని, తక్కువ ఖర్చులతో తన భార్య ఇంటి వ్యవహారాలను చూసుకుంటోందని తెలిపారు. దీనిపై రెడ్డిట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇప్పుడు ఇదే ఆనవాయితీ..’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘సుదీర్ఘ పదవి విరామం కోసం మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండండి’ అని మరొకరు రిప్లై ఇచ్చారు.ఇదీ చదవండి: లేఆఫ్స్కు వ్యతిరేకమంటూ 4000 మంది ఉద్యోగాల కోత -
లేఆఫ్స్కు వ్యతిరేకమంటూ 4000 మందికి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతుండడంతో ఉద్యోగాలను ఆటోమేట్ చేస్తూ చాలా కంపెనీలు భారీగా లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఇటీవల సేల్స్ఫోర్స్ కంపెనీలో ఏఐ వినియోగం పెరిగిన నేపథ్యంలో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఇటీవల లోగాన్ బార్ట్లెట్ పాడ్కాస్ట్లో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ బెనియోఫ్ ఈ లేఆఫ్స్ను ధ్రువీకరించారు. కంపెనీలోని ఉద్యోగులను 9,000 నుంచి 5,000కు తగ్గించినట్లు చెప్పారు.ఉద్యోగుల తొలగింపుపై బెనియోఫ్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగింది. క్లౌడ్ సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తున్న మా కంపెనీ సపోర్ట్ డివిజన్లో దాదాపు 45 శాతం ఉద్యోగాల కోతలు అనివార్యం అయ్యాయి. దాంతో ఈ విభాగంలో గతంలో 9వేల మంది ఉన్న ఉద్యోగులను 5 వేలకు తగ్గించాం. 100 మిలియన్ లీడ్స్ను ఏఐ పరిష్కరిస్తోంది. మానవ శక్తి అవసరం తగ్గింది’ అని చెప్పారు. కంపెనీ అదనపు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు, లీగల్ అడ్వైజర్లను నియమించుకోదని బెనియోఫ్ జులైలో చెప్పారు. కానీ కంపెనీ వినియోగదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని స్వీకరించడంలో సహాయపడటానికి సేల్స్ సిబ్బందిని చేర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సేల్స్ఫోర్స్లో జనవరి 2025 నాటికి అన్ని డివిజన్లలో 76,453 మందిని నియమించింది. ఇటీవల 4,000 మందికి లేఆఫ్స్ ప్రకటించడంతో మొత్తం శ్రామిక శక్తిలో ఇది సుమారు 5% ప్రాతినిధ్యం వహించినట్లయింది.అయితే జులై 2025లో ఓ కార్యక్రమంలో బెనియోఫ్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ సామూహిక నిరుద్యోగానికి దారితీయదని చెప్పడం గమనార్హం. కార్మికుల స్థానాన్ని భర్తీ చేయడానికి బదులుగా కృత్రిమ మేధ వాడకం పెరుగుతుందన్నారు. లేఆఫ్స్కు సంబంధించి రెండు నెలల క్రితం బెనియోఫ్ ఆంత్రోపిక్కు చెందిన డారియో అమోడి వంటి ఏఐ స్టార్టప్ సీఈఓలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఉద్యోగ కోతల పట్ల నిరసన వ్యక్తం చేశారు. అలాంటిది తన కంపెనీలోనే ఇలా 4000 మందికి లేఆఫ్స్ ప్రకటించడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే.. -
ఆగస్టులో హైరింగ్ 3 శాతం అప్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో దేశీయంగా వైట్–కాలర్ జాబ్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 3 శాతం వృద్ధి చెందింది. ప్రదానంగా ఐటీయేతర రంగాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్నట్లు నౌకరీ జాబ్స్పీక్ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్స్, మేనేజర్లు, అడ్మిని్రస్టేషన్ ఉద్యోగాలను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదిక ప్రకారం ఆగస్టులో అత్యధికంగా 24 శాతం హైరింగ్తో బీమా రంగం అగ్రస్థానంలో నిలి్చంది. ఆతిథ్య (22 శాతం), రియల్ ఎస్టేట్ (18 శాతం) రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీపీవో/ఐటీఈఎస్ (17 శాతం), విద్య (16 శాతం), ఆయిల్..గ్యాస్ (7 శాతం), రిటైల్ (3 శాతం), ఎఫ్ఎంసీజీ (2 శాతం) రంగాల్లో కూడా సానుకూల హైరింగ్ నమోదైంది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. → కొత్త టెక్నాలజీల్లో నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో ఏఐ/ఎంఎల్ ఉద్యోగాలకు హైరింగ్ 54 శాతం ఎగిసింది. అయితే, ఓవరాల్గా ఐటీ/సాఫ్ట్వేర్ సరీ్వసుల రంగంలో నియామకాలు 6 శాతం తగ్గాయి. → బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసుల విభాగంలో హైరింగ్ 11 శాతం, టెలికం/ఐఎస్పీలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. → ఫ్రెషర్ల (0–3 ఏళ్ల అనుభవం) రిక్రూట్మెంట్ 7 శాతం పెరిగింది. ఆతిథ్య, రియల్ ఎస్టేట్, విద్య తదితర ఐటీయేతర రంగాల్లో డిమాండ్ ఇందుకు తోడ్పడింది. → ఓవరాల్గా 10 శాతం హైరింగ్ వృద్ధితో నియామకాలకు సంబంధించి హైదరాబాద్ టాప్ మెట్రో సిటీగా నిలి్చంది. యూనికార్న్లలో (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) రిక్రూట్మెంట్ 45 శాతం ఎగిసింది. -
టారిఫ్ల ప్రభావం.. ఎదుర్కొనేందుకు పరిష్కారం
అమెరికా విధించిన 50% టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. ‘అధిక ఉపాధి కల్పిస్తున్న కొన్ని పరిశ్రమలు అమెరికాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. ఈ ప్రభావం ఎంతన్నది ప్రభుత్వం మదిస్తోంది. తగిన పరిష్కారాల కోసం కృషి చేస్తోంది’ అని చెప్పారు. -
ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎవరంటే.. అందరూ 'ఎలాన్ మస్క్' అని చెబుతారు. అయన ఏం చదువుకున్నారు అంటే మాత్రం.. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ప్రపంచంలోని ఐదుమంది అత్యంత ధనవంతులు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.ఎలాన్ మస్క్టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల సీఈఓ అయిన ఎలాన్ మస్క్.. తన ప్రాధమిక విద్యను దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని పాఠశాలల్లో పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ చదివారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో.. పీహెచ్డీ చేయడానికి చేరినప్పటికీ అది పూర్తి చేయలేదని సమాచారం.లారీ ఎల్లిసన్ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ ఈయనను అత్యంత తెలివైన వ్యక్తిగా ప్రశంసించారు. ఎల్లిసన్ చికాగో యూనివర్సిటీలో చదివారు, కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ తరువాత డిగ్రీ పూర్తి చేయడానికి 'ఇల్లినాయిస్ యూనివర్సిటీ అట్ అర్బనా-షాంపెయిన్'లో చేరారు. కానీ అదే సమయంలో ఆయన తల్లి మరణించడంతో.. డిగ్రీ పూర్తిచేయకుండా ఆపేశారు.మార్క్ జుకర్బర్గ్ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల సమ్మేళనమైన మెటాకు సీఈఓ అయిన.. మార్క్ జుకర్బర్గ్, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ & సైకాలజీ చదివాడు. కానీ ఫేస్బుక్ను ప్రారంభించిన తరువాత.. డిగ్రీ పూర్తి చేయలేదు.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికజెఫ్ బెజోస్వరల్డ్ టాప్ 10 కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్.. అమెజాన్ వ్యవస్థాపకులు. ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫిజిక్స్ చదవాలనుకున్నారు. కానీ కంప్యూటర్ల పట్ల తనకున్న ఆసక్తితో అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు.లారీ పేజ్గూగుల్ కో-ఫౌండర్ అయిన లారీ పేజ్.. ప్రపంచంలోనే ఐదవ ధనవంతుడు. ఈయన మిచిగాన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్.. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్టాన్ఫర్డ్లోని పీహెచ్డీ రీసెర్చ్ సమయంలోనే లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ కలిసి గూగుల్ సర్చ్ ఆల్గోరిథం అభివృద్ధి చేశారు. -
కనీవినీ ఎరుగని డీల్స్.. ఫెస్టివల్ సేల్స్: ఎప్పుడంటే..
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ 'ఫెస్టివల్ సేల్స్' ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తాయి.అమెజాన్ ఫెస్టివల్ సేల్ తేదీని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది నవరాత్రి & దీపావళి పండుగ సీజన్లో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎప్పటిలాగానే.. ప్రైమ్ సభ్యులకు సేల్ ప్రారంభమయ్యే 24 గంటల ముందు యాక్సెస్ లభిస్తుంది.బ్లాక్బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, టాప్ 100 డీల్స్ వంటి అనేక రకాల సదుపాయాలను అమెజాన్ అందించనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతో పాటు ఈఎంఐ లావాదేవీలతో సహా ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.ఇదీ చదవండి: ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్టైమ్ రికార్డ్ఇక ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025కి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ల్యాప్టాప్లు, టీవీలు, స్పీకర్లు, కెమెరాలు మొదలైనవాటి మీద.. అద్భుతమైన డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సేల్ తేదీకి సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ సేల్ ప్రారంభమవ్వనికి ముందే ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు షాపింగ్ చేయడానికి యాక్సెస్ లభిస్తుంది. -
కొత్తవారికే కోటిన్నర జీతం.. కానీ ఒక్కటే కండీషన్..
ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు భారీగా కోటిన్నర జీతమిస్తానంటున్నారు అమెరికాకు చెందిన భారత సంతతి పారిశ్రామికవేత్త దక్ష్ గుప్తా. కానీ ఆయన పెట్టిన కండీషన్ ఒక్కటే. అదేంటంటే తన స్టార్టప్లో ఉద్యోగంలోకి చేరేవాళ్లు వారానికి ఆరు రోజులు, రోజుకు 12-14 గంటలు (9-9-6 rule) పనిచేయాలి.శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ప్రారంభించిన గ్రెప్టైల్ అనే స్టార్టప్ లో పలు ఉద్యోగావకాశాలను దక్ష్ గుప్తా ఇటీవల ప్రకటించారు. ఆయన ప్రకటించిన జీతం బాగానే ఉన్నా రోజుకు అన్నేసి గంటలు పనిచేయాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా 14 గంటల పని అభిప్రాయంపై ఆయన వెనక్కి తగ్గడం లేదు.సిలికాన్ వ్యాలీలో చాలా మంది ప్రొఫెషనల్స్ వారానికి ఆరు రోజులు.. రోజుకు 12 గంటల షిఫ్టులను ఇష్టపూర్వకంగా చేస్తున్నారని గ్రెప్టైల్ ఫౌండర్ దక్ష్ గుప్తా వాదిస్తూనే ఉన్నారు. ఇప్పటి యువతరం వినోదం కంటే క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారని ‘శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్’ వార్తా సంస్థతో జరిగిన సంభాషణలో పేర్కొన్నారు. తన కంపెనీలో జరుగుతున్న పనుల వేగాన్ని ఆయన ఇదివరకే రాకెట్ ప్రయోగంతో పోల్చారు.ఎంట్రీ లెవల్లో, గ్రెప్టైల్లోని ఉద్యోగులు సంవత్సరానికి 140,000 నుండి 180,000 డాలర్లు (సుమారు రూ .1.2–1.5 కోట్లు) మధ్య బేస్ వేతనం పొందవచ్చు. అదనంగా 130,000 నుంంచి 180,000 డాలర్ల విలువైన ఈక్విటీలను పొందవచ్చు. అదే ఏడేళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్కు అయితే బేస్ వేతనం ఏడాదికి 2,40,000 డాలర్ల నుంచి 2,70,000 డాలర్ల వరకు ఉంటుంది.అయితే అన్నీ ఫుల్ టైమ్ ఆఫీసు ఉద్యోగాలు. అంటే రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశమే ఉండదు. తప్పనిసరిగా ఆఫీస్కు వచ్చే పనిచేయాలి. ఇక కాంప్లిమెంటరీ మీల్స్, ట్రాన్స్స్పోర్ట్ ఫెసిలిటీస్, హెల్త్కేర్ కవర్, 401కే కాంట్రిబ్యూషన్ మ్యాచ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. -
ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్టైమ్ రికార్డ్
దేశంలో యూపీఐ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. నేడు ఏ చిన్న వస్తువు కొనాలన్నా.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టులో మాత్రమే 20 బిలియన్ లావాదేవీలు దాటినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.ఆగస్టులో జరిగిన మొత్తం లావాదేవీలు (20.01 బిలియన్స్).. జులై (19.47 బిలియన్స్) కంటే 2.8 శాతం ఎక్కువ. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. విలువ పరంగా ఆగస్టులో యూపీఐ లావాదేవీలు రూ. 24.85 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 24 శాతం ఎక్కువ అని డేటా చెబుతోంది.సగటున రోజువారీ లావాదేవీల సంఖ్య 645 మిలియన్లకు పెరిగింది. NPCI డేటా ప్రకారం రోజువారీ లావాదేవీ విలువ రూ. 80,177 కోట్లు కావడం గమనార్హం. ఆగస్టు 2న UPI ఒకే రోజులో 700 మిలియన్ లావాదేవీలను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ పెరుగుదల నమోదైంది.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికజూన్లో UPI ద్వారా రూ.24.04 లక్షల కోట్ల విలువైన 18.40 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత నెలలో ఇది 19.47 బిలియన్ లావాదేవీలకు పెరిగింది, ఇది జూన్తో పోలిస్తే 5.8 శాతం పెరుగుదల, లావాదేవీ విలువ రూ.25.08 లక్షల కోట్లకు పెరిగింది. ఇలా ప్రతి నెలా యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. -
వారెన్ బఫెట్ పంచ సూత్రాలు..
జీవితంలో ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్చుకొని, తన జీవన శైలితో మరెన్నో పాఠాలు నేర్పిస్తున్న బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్ ఇటీవల 94 ఏళ్లు పూర్తి చేసుకొని 95వ వసంతంలోకి ప్రవేశించారు. ఆయన పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని ఆర్థిక సూత్రాలను కింద తెలియజేశాం.బఫెట్ పంచ సూత్రాలుపెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి.నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి.పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది.వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి.ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది.ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్.. -
బ్యాంకులో 14 ఏళ్లు ఎక్స్పీరియన్స్.. రోడ్డుపై బిచ్చగాడిలా..
పైన ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తికి బ్యాంకింగ్ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉందట. కానీ ప్రస్తుతం నిలువ నీడ లేకుండా, చేతిలో చిల్ల గవ్వ లేకుండా రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్నాడు. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇది జాబ్ మార్కెట్, సామాజిక పరిస్థితులపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న ఆ వ్యక్తి ఫొటోలను షేర్ చేస్తూ, ఒక రెడ్డిటర్ ఇలా రాసుకొచ్చారు..‘ఈ వ్యక్తిని ఒక ప్రముఖ బెంగళూరు సిగ్నల్ వద్ద చూశాను. ఆయనను చూస్తే ఎంతో హృదయవిదారకంగా ఉంది. ఇది సమాజ వైఫల్యమా లేక వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను.’రెడ్డిటర్ షేర్ చేసిన ఫొటోల్లో మొదటి దాంట్లో ఆ వ్యక్తిని రోడ్డు పక్కన ఫుట్పాత్పై బిచ్చగాడిలా కనిపించారు. రెండో ఫొటోలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న నోట్ను చూపించారు. అందులో 'నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, దయచేసి సహాయం చేయండి. నాకు బ్యాంకింగ్ లో 14 ఏళ్ల అనుభవం ఉంది’ అని రాసిఉంది.ఈ పోస్ట్పై రెడ్డిటర్స్ మధ్య చర్చ సాగింది. బెంగళూరు వంటి నగరంలో నిరుద్యోగం ఏంటి అని కొందరు ప్రశ్నించారు. అయితే అతని శారీరక వైకల్యం ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 'శారీరకంగా సామర్థ్యం ఉంటే డెలివరీ లేదా డ్రైవింగ్ వంటి ఏదో ఒక పని చేసుకోవచ్చని చాలా మంది చెబుతుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉంటే, మానసికంగా విచ్ఛిన్నమై, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. -
రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం!
భారతదేశంలో పెరుగుతున్న ప్రైవేట్ విద్య ఖర్చులు పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు అధిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో వార్షిక పాఠశాల ఫీజులు ఏటా విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యను వ్యాపారంగా చూడకూడదనే నియమాన్ని పక్కనపెట్టి చాలా విద్యాసంస్థల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజులు పెంచుతున్నాయి. భారీగా సంపాదన ఉన్న కొద్దిమందికే నాణ్యమైన విద్య పరిమితం అవుతోందా అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనికి ఉదాహరణగా బెంగళూరులో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఓ ప్రముఖ అంతర్జాతీయ పాఠశాల ఫీజుల వ్యవహారం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.బెంగళూరులోని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నట్లు చెబుతున్న ఓ పాఠశాల అధికారిక డాక్యుమెంట్లో అన్ని గ్రేడ్లలో విపరీతమైన ఫీజులున్నట్లు వెల్లడైంది. గ్రేడ్ 1లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులు ఏడాదికి రూ.7.35 లక్షలు, 11, 12 తరగతులకు ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు చెల్లించాలనేలా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. రూ.లక్ష వన్ టైమ్, నాన్ రిఫండబుల్ అడ్మిషన్ ఫీజు కింద చెల్లించాలని స్కూల్ యాజమాన్యం డాక్యుమెంట్లు పేర్కొన్నట్లు చెప్పాయి.It's a free market. Pricing is upto individuals. It's customer choice to pick what they want. All is right in this theory, like most of the theories. Look at the fee structure of one of the good schools in Bengaluru. This is unaffordable even for an IT couple earning a combined… pic.twitter.com/1AvDEQRMyz— D.Muthukrishnan (@dmuthuk) August 31, 2025ఫైనాన్షియల్ ప్లానర్ డి.ముత్తుకృష్ణన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన పోస్ట్లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మంచి వేతనం ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఇలాంటి ఖర్చులను నిర్వహించగలరా అని ప్రశ్నించారు. రూ.50 లక్షల ప్రీ ట్యాక్స్ ఆదాయం ఉన్న ఐటీ దంపతులు కూడా ఈ పాఠశాలలో ఇద్దరు పిల్లల ఫీజులు భరించడం కష్టమని ముత్తుకృష్ణన్ అన్నారు.నెటిజన్ల కామెంట్స్..ఈ పోస్ట్పై నెటిజన్లు స్పందిస్తున్నారు. విద్యా ఖర్చులు ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చేస్తున్నాయని కొందరు తెలిపారు. చాలా మంది దంపతులు పిల్లలను కనడానికి ఎందుకు సంకోచిస్తున్నారో ఇలాంటి ఖర్చుల వల్లే అర్థం అవుతుందని ఒకరు కామెంట్ చేశారు. అయితే ఇంటర్నేషన్ సిలబస్, కేంబ్రిడ్జ్ వంటి అంతర్జాతీయ పాఠ్యాంశాలు, ఆధునిక మౌలిక సదుపాయాల వల్లే ఇలాంటి ఫీజులున్నట్లు కొందరు సమర్థించారు. బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సామాజిక ధోరణులే ఇంత అధిక ఫీజులకు కారణమని ఆరోపించారు.ఇదీ చదవండి: తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఏ ప్రాంతంలో ఎంతంటే.. -
టాటా క్యాపిటల్ ఐపీవో 22న
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లుగా నమోదుకానున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది. 2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెపె్టంబర్లో అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
ఏఎఫ్డీతో ఎస్బీఐ ఒప్పందం: ఎందుకంటే?
పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలందించే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ‘ఏజెన్సీ ఫ్రాంకైస్ డి డెవలప్మెంట్’(ఏఎఫ్డీ)తో 100 మిలియన్ యూరోల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాలుష్యకారక ఉద్గారాలను, గ్లోబల్ వార్మింగ్ను, వాతావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించే దిశగా ఈ నిధులను వినియోగించనున్నట్లు పేర్కొంది. 2030 నాటికి మొత్తం రుణాల పోర్ట్ఫోలియోలో గ్రీన్ ఫైనాన్సింగ్ విభాగం వాటాను 7.5–10 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యానికి ఇది దోహదపడుతుందని ఎస్బీఐ తెలిపింది. -
పేషెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కొత్త కోర్సు
ముంబయి: పేషెంట్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ లో ‘బాండింగ్’ పేరుతో కొత్త ట్రైనింగ్ మాడ్యూల్ ను ప్రారంభించినట్లు ఎగ్జిక్యూటివ్ కోచింగ్ సంస్థ ఓరియల్ అకాడమీ ప్రకటించింది. హెల్త్ కేర్, మెడికల్, పారామెడికల్, హాస్పిటల్ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కోసం ఈ కోర్సును రూపొందించారు.ఆసుపత్రులు అధునాతన వైద్య సంరక్షణ, రోగనిర్ధారణను అందిస్తున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ రోగులతో అర్ధవంతంగా మెలగడంలో కష్టపడుతున్నారు. ఈ అంతరాన్ని పూడ్చడానికి, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎదుర్కొంటున్న వాస్తవ ప్రపంచ సవాళ్ల చుట్టూ రూపొందించిన ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ ‘బాండింగ్’ను ఓరియల్ అకాడమీ ప్రవేశపెట్టింది.‘సమర్థత, సహానుభూతి, రోగి-మొదటి ప్రాధాన్యతగా సేవ సంస్కృతిని పెంపొందించడం ఈ కోర్సు లక్ష్యం. బలమైన సాఫ్ట్ స్కిల్స్ ను పెంపొందించుకోవడం ద్వారా, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. రోగులు, సిబ్బందికి సానుకూల అనుభవాలను సృష్టించవచ్చు" అని ఓరియల్ అకాడమీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఖలీద్ జమాల్ పేర్కొన్నారు. -
రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం..
వ్యాపార ప్రణాళికల్లో భాగంగా వచ్చే అయిదేళ్లలో రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ అర్విందర్ సింగ్ సాహ్నీ తెలిపారు. చమురు శుద్ధి, ఇంధన మార్కెటింగ్ విస్తరణతో పాటు పెట్రో కెమికల్స్, రెన్యూవల్ ఎనర్జీ వ్యాపారాలు చేపట్టేందుకు ఈ పెట్టుబడులు వినియోగిస్తామన్నారు.ప్రస్తుతం కంపెనీ రిఫైనింగ్ వార్షిక సామర్థ్యం 80.75 మిలియన్ టన్నులుగా ఉందని షేర్హోల్డర్ల సమావేశంలో ఆయన చెప్పారు. అర్విందర్ సింగ్ సాహ్నీ మాట్లాడుతూ, ‘‘పెట్టుబడుల ద్వారా మేము దేశీయ ఇంధన అవసరాలను స్వయం సమృద్ధిగా తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాం. పెట్రో కెమికల్స్ విభాగంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.అలాగే, రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఐఓసీ కీలక ప్రాజెక్టులను ప్రారంభించనుందని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పవర్, బయోఎనర్జీ వంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సంస్థ కట్టుబడి ఉందని వివరించారు. -
దేశంలో తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ.. ఎక్కడంటే..
దేశీయంగా తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నోయిడాలో ప్రారంభించారు. అమెరికాకు చెందిన మెటీరియల్ టెక్నాలజీ సంస్థ కార్నింగ్తో కలిసి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమికంగా రూ. 70 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్లాంటు వార్షిక స్థాపిత సామర్థ్యం 2.5 కోట్ల యూనిట్లుగా ఉంటుంది. దీనితో 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ఎల్రక్టానిక్స్ తయారీ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు కీలకంగా ఉంటాయి కాబట్టి రీసెర్చ్ బృందం పరిమాణాన్ని 40 నుంచి 400 మంది సిబ్బందికి పెంచుకునే అవకాశాన్ని పరిశీలించాలని ఆప్టిమస్కి వైష్ణవ్ సూచించారు. వచ్చే ఏడాది వ్యవధిలో రెండో దశ కింద అదనంగా రూ. 800 కోట్ల పెట్టుబడులతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 కోట్లకు పెంచుకోనున్నట్లు ఆప్టిమస్ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా తెలిపారు.దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 16,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైనోటెక్ బ్రాండ్ పేరిట మేడిన్ ఇండియా టెంపర్డ్ గ్లాస్లను సెప్టెంబర్ నుంచి విక్రయించనున్నట్లు గుప్తా తెలిపారు. అపరిమిత రిప్లేస్మెంట్తో ఏడాది వారంటీ అందించనున్నట్లు వివరించారు. -
ఏఐ టెక్నాలజీ మోసానికి సాధనమవుతోంది: శిఖా గోయెల్
ఐఎస్ఏసీఏ హైదరాబాద్ ఛాప్టర్ 25 సంవత్సరాల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నెన్స్, సైబర్సెక్యూరిటీ, ప్రైవసీ నిపుణులను ప్రోత్సహిస్తూ తమ 25వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సు థీమ్: "ట్రస్ట్ ఏఐసీఎస్ - 2025: ఏఐ ఇంటిగ్రేట్స్ గవర్నెన్స్, సైబర్సెక్యూరిటీ, అండ్ ప్రైవసీ" అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది''.ఈ సదస్సును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ శిఖా గోయెల్ ప్రారంభించారు. వారితో పాటు ఐఎస్ఏసీఏ హైదరాబాద్ బోర్డు సభ్యులు, ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సదస్సు కోసం 400 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది చాప్టర్ చరిత్రలోనే అత్యధికం. 2024లో జరిగిన సదస్సు విజయం ఈసారి కూడా కొనసాగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఐఎస్ఏసీఏ ఒక ముఖ్యమైన నిపుణుల సమూహంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.ఈ సమావేశం గురించి శిఖా మాట్లాడుతూ.. "ISACA హైదరాబాద్ 25 సంవత్సరాల వేడుకలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతిరోజూ కొత్త సైబర్ నేరాలను నివేదిస్తూ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించిన సాంకేతికత ఇప్పుడు మోసానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతోంది. నేడు అన్ని ప్రధాన రంగాలలో ఏఐ విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఏఐ వ్యవస్థలను రక్షించడం మరియు జవాబుదారీతనం అనేది ఈ సమయంలో అత్యవసరం. ఏఐని సరిగ్గా, నైతికంగా ఉపయోగించాలనుకుంటే ISACA వంటి వృత్తిపరమైన సంస్థలు చాలా అవసరమని అన్నారు. -
ప్రీ-నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలు!.. అవాక్కవుతున్న నెటిజన్లు
భారతదేశంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో స్కూల్ ఫీజులు భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ప్రీ-నర్సరీ ఫీజు లక్షల్లో ఉంటుందని ఎప్పుడైనా విన్నారా?.. అయితే ఇప్పుడు తెలుసుకోండి. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.రెడ్డిట్ వినియోగదారు చేసిన పోస్టులో.. బెంగళూరులో చిన్న పిల్లల ప్రీ-నర్సరీ ఫీజు ఏకంగా రూ.1.85 లక్షలు అని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5,000, వినియోగ వస్తువుల కోసం రూ.28,240 (దీనిని రెండు విడతలుగా విభజించారు). జూన్ నుంచి నవంబర్ కాలానికి ఫీజు రూ.91,200, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం రూ.60,800 అని ఉండటం ఇక్కడ గమనించవచ్చు.బెంగళూరులో ప్రీ-స్కూల్ ఫీజు ఇంత మొత్తంలో వసూలు చేయడం సమంజసమేనా? మీ అభిప్రాయం ఏమిటి? ప్రీ-స్కూల్ ఖర్చు ఎంత? నాకు అర్థం కావడం లేదు. ఏది సరైనదో తెలుసుకోవడానికి మీరు నాకు సహాయం చేయగలరా? అని రెడ్దిట్ యూజర్ నెటిజన్లను అడిగారు.ఇదీ చదవండి: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని స్కూల్స్ ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఒకరు అన్నారు. నా సోదరి నా మేనకోడలికి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల చెల్లించిందని, దాంతో పోలిస్తే మీ ఫీజు తక్కువే అని మరొకరు అన్నారు. ఫీజులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా మాయా ఏబీసీడీలు, 123లు నేర్పిస్తున్నారేమో నాకు అర్థం కావడం లేదని ఇంకొకరు అన్నారు. -
భారతీయ కుబేరులు.. కోట్ల విలువైన ప్రైవేట్ జెట్లు
మిలినీయర్ అంటే.. వారు ఎలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లగ్జరీ వాహనాల నుంచి విశాలమైన భవనాల వరకు.. విలాసవంతగా ఉండేలా చూసుకుంటారు. కొంతమంది ధనవంతులు మరింత ప్రత్యేకంగా ఉండటం కోసం ఖరీదైన ప్రైవేట్ జెట్లను ఉపయోగిస్తారు. ఈ కథనంలో ప్రముఖ భారతీయుల అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ల గురించి తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ - బోయింగ్ 737 మ్యాక్స్9బోయింగ్ 737 మ్యాక్స్9 అనేది భారతదేశంలోని ఖరీదైన విమానాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ జెట్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. బోయింగ్ 737 మ్యాక్స్9 ఎగిరే ప్యాలెస్ లాంటిది. దీని లోపల మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ వంటివన్నీ ఉన్నాయి. 19 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ ప్రైవేట్ జెట్ ధర రూ. 1000 కోట్ల కంటే ఎక్కువని సమాచారం.విజయ్ మాల్యా - ఎయిర్బస్ ఏ319భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా కూడా ఖరీదైన ప్రైవేట్ జెట్ కలిగి ఉండేవారు. 2012 నుంచి ఆర్థిక కుంభకోణాలు.. వివాదాలలో చిక్కుకున్న మాల్యా, ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు సమాచారం. ఈయన వద్ద ప్రస్తుతం ఈ జెట్ లేదని తెలుస్తోంది. కానీ ఇది 18 మంది ప్రయాణికులు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక బార్, డైనింగ్ ఏరియా, బెడ్రూమ్ వంటివి కలిగిన ఈ జెట్ ధర రూ. 700 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.అమితాబ్ బచ్చన్ - బాంబార్డియర్ ఛాలెంజర్ 300బాలీవుడ్ నటుడు.. కౌన్ బనేగా కరోడ్పతి హోస్ట్ అమితాబ్ బచ్చన్ వద్ద 'బాంబార్డియర్ ఛాలెంజర్ 300' ఉంది. ఈ జెట్ విశాలమైన క్యాబిన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. దీని ధర రూ. 220 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.రతన్ టాటా - డస్సాల్ట్ ఫాల్కన్ 2000టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'రతన్ టాటా' డస్సాల్ట్ ఫాల్కన్ 2000 విమానం ఉపయోగించేవారు. ఇందులో విలాసవంతమైన సదుపాయాలు అందుబాటులో ఉండేవి. ఈ జెట్ ధర రూ. 300 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.అదార్ పూనవాలా - గల్ఫ్స్ట్రీమ్ G550సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవాలా.. వద్ద గల్ఫ్స్ట్రీమ్ G550 అనే ఖరీదైన విమానం ఉంది. దీని విలువ రూ. 500 కోట్ల కంటే ఎక్కువే. ఇది చాలా స్టైలిష్ జెట్. అదార్ పూనవాలా తన అభిరుచికి తగిన విధంగా దీనిని నిర్మించుకున్నారు. -
పేటీఎం యూపీఐ ఆగిపోతుందా?: గూగుల్ ప్లే అలర్ట్పై కంపెనీ రెస్పాన్స్
పేటీఎం యూపీఐ ఇకపై అందుబాటులో ఉండదని గూగుల్ ప్లే నుంచి వచ్చిన నోటిఫికేషన్ వినియోగదారులలో భయాందోళనలను సృష్టించింది. ఆగస్టు 31 నుంచి యూపీఐ సర్వీసులు నిలిచిపోతాయని గూగుల్ ప్లే హెచ్చరికను జారీ చేసింది. దీనిపై కంపెనీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది.విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని కంపెనీ.. పేటీఎం యూపీఐ సేవలు మూతపడే దశలో ఉన్నాయని వస్తున్న నివేదికలు తప్పుదారి పట్టించేవని స్పష్టం చేసింది. యూజర్లు పేటీఎంలో యూపీఐ చెల్లింపులు చేసినప్పుడు ఎటువంటి అంతరాయం ఉండదు. వినియోగదారులకు.. వ్యాపార లావాదేవీలు రెండూ సజావుగా జరుగుతాయి అని కంపెనీ తెలిపింది.నిజానికి ఇటీవల వచ్చిన నోటిఫికేషన్ యూట్యూబ్ ప్రీమియం లేదా గూగుల్ వన్ స్టోర్ వంటి పునరావృత చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే.. ఒక యూజర్ యూట్యూబ్ ప్రీమియం లేదా గూగుల్ వన్ స్టోరేజ్ ప్లాట్ఫామ్లకు పేటీఎమ్ యూపీఐ చేస్తున్నట్లయితే.. అలాంటి వారు.. తమ పాత @paytm హ్యాండిల్ను.. బ్యాంక్కి లింక్ చేసిన కొత్త హ్యాండిల్కి (@pthdfc, @ptaxis, @ptyes, @ptsbi) మార్చవలసి ఉంటుంది.ఉదాహరణకు మీ యూపీఐ ఐడీ rajesh@paytm అయితే.. అది ఇప్పుడు rajesh@pthdfc లేదా rajesh@ptsbi అవుతుంది. అంటే బ్యాంకు పేరు కూడా చివరి వస్తుందన్నమాట. దీనివల్ల లావాదేవీలకు ఎటువంటి ఆటంకం కలగదు.ఈ అప్డేట్ ఎందుకంటే?నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా పనిచేయడానికి పేటీఎంకు అనుమతి ఇచ్చిన తర్వాత, కొత్త UPI హ్యాండిల్స్కు మారడంలో భాగంగా ఈ అప్డేట్ జరిగింది. ముఖ్యంగా.. కొత్త నిబంధనల ప్రకారం సబ్స్క్రిప్షన్ బిల్లింగ్ సజావుగా సాగడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.Paytm UPI continues to work at Google Play ✅ All your regular payments continue to work as usual.You only need to update your UPI handle for recurring payments (like subscriptions). Change it from @paytm to new handles like @pthdfc, @ptaxis, @ptyes or @ptsbi.For example, if…— Paytm (@Paytm) August 29, 2025 -
రూ .303 కోట్ల బోనస్ ప్రకటన.. ఈ టాటా కంపెనీ ఉద్యోగులకు శుభవార్త
టాటా గ్రూప్ సంస్థ టాటా స్టీల్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జంషెడ్పూర్లోని వర్కర్స్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ .303.13 కోట్ల బోనస్ను ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు టాటా స్టీల్ తెలిపింది.ఇందులో ట్యూబ్స్ యూనిట్ సహా జంషెడ్పూర్ డివిజన్లకు రూ.152.44 కోట్లు కేటాయించడంతో 11,446 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కంపెనీ తెలిపింది. టాటా వర్కర్స్ యూనియన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, 2024-25 సంవత్సరానికి వార్షిక బోనస్ కింద వర్తించే అన్ని డివిజన్లు, యూనిట్లకు చెందిన అర్హులైన ఉద్యోగులకు మొత్తం రూ .303.13 కోట్లు చెల్లించనున్నట్లు టాటా స్టీల్ ఒక ప్రకటనలో పేర్కొంది.2024-25 సంవత్సరానికి గానూ చెల్లించాల్సిన కనీస బోనస్ (పూర్తి హాజరు వద్ద) రూ .39,004, గరిష్ట బోనస్ (వాస్తవ హాజరు వద్ద) రూ .3,92,213 ఉంటుందని కంపెనీ తెలిపింది. బోనస్ చెల్లింపు (సవరణ) చట్టం, 2015 లో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ జీతాలు / వేతనాలు స్టీల్ కంపెనీలోని తమ ఉద్యోగులలో ఎక్కువ మంది పొందుతున్నందున, వారు ఈ చట్టం ప్రకారం బోనస్ పొందడానికి అర్హులు కాదని వివరించింది.అయితే తమ పాత సంప్రదాయాలను గౌరవిస్తూ యూనియన్ కేటగిరీలోని ఉద్యోగులందరికీ బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అత్రయీ సన్యాల్, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లు యాజమాన్యం తరఫున మెమోరాండం ఆఫ్ సెటిల్మెంట్లపై సంతకాలు చేశారు. -
కళ్లుచెదిరే అద్భుతం.. ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇటీవలే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియతుడైన అనంత్ అంబానీ తాజాగా జరిగిన ఆర్ఐఎల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అరంగేట్రం చేశారు. తొలి ప్రసంగంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. జామ్నగర్ లో నిర్మిస్తున్న ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్ పురోగతిని తెలియజేస్తూ కళ్లు చెదిరే విషయాలను వెల్లడించారు.టెస్లా ఫ్యాక్టరీకి 4 రెట్లు.. వంద ఈఫిల్ టవర్ల ఉక్కు..ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణ విస్తీర్ణం పరంగా టెస్లా గిగాఫ్యాక్టరీ కంటే నాలుగు రెట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్ 44 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని అనంత్ అంబానీ తెలిపారు. అంతే కాదు, ఈ కాంప్లెక్స్ 3.4 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 100 ఈఫిల్ టవర్లకు సమానమైన సుమారు 7 లక్షల టన్నుల ఉక్కును నిల్వ చేయగలదని ఆయన ప్రకటించారు.లక్ష కిలోమీటర్ల కేబుల్..అనంత్ ప్రకటించిన గిగా ఎనర్జీ కాంప్లెక్స్ లో చంద్రుడి వద్దకు వెళ్లిరావడానికి ఎంత దూరం ఉంటుందో అంత అంటే దాదాపు లక్ష కిలోమీటర్ల కేబుల్ కూడా ఉంటుంన్నారు. అనంత్ అంబానీ ప్రకారం.. గిగా ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణానికి విస్తృతమైన నిర్మాణ ఆటోమేషన్ మద్దతుతో 50,000 మందికి పైగా కార్మికులు రికార్డు వేగంతో పనిచేస్తున్నారు.కొత్త ప్రాజెక్టులవే.. అనంత్ అంబానీ తన ప్రసంగంలో రూ.75,000 కోట్లకు పైగా విలువైన కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ ప్రాజెక్టులలో నాగోథానేలో 1.2 మెట్రిక్ టన్నుల పీవీసీ ప్లాంట్, దహేజ్లో 2 మిలియన్ పీటీఏ సౌకర్యం, పాల్ఘర్లో 1 మిలియన్ టన్నుల స్పెషాలిటీ పాలిస్టర్ సౌకర్యం ఉన్నాయి. తమ హజీరా కార్బన్ ఫైబర్ ఫెసిలిటీ ప్రపంచంలోని మూడు అతిపెద్ద, ఏరోసాప్స్, డిఫెన్స్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్లో ఒకటిగా ఉంటుందని అనంత్ అంబానీ వెల్లడించారు. అలాగే జామ్ నగర్ లో స్వయంప్రతిపత్తి కలిగిన రిఫైనరీని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. -
హిటాచీ ఎనర్జీ రూ.300 కోట్ల పెట్టుబడులు
హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.300 కోట్ల తాజా పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. తద్వారా మైసూరులో ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేషన్ మెటీరియల్ తయారీ సామర్థ్యాలను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపింది. 2024 అక్టోబర్లో ప్రకటించినట్టు భారత్లో మొత్తం రూ.2,000 కోట్ల పెట్టుబడుల్లో ఇది భాగమని పేర్కొంది.తాజా పెట్టబడులతో ట్రాన్స్ఫార్మర్ గ్రేడ్ ప్రెస్బోర్డుల సరఫరాను పెంచుకోనున్నట్టు తెలిపింది. భారత్లో పెరుగుతున్న గ్రిడ్, రెన్యువబుల్ ఎనర్జీ అవసరాలకు మద్దతుగా నిలవడం పట్ల గర్విస్తున్నామని హిటాచీ ఎనర్జీ ఇండియా ఎండీ, సీఈవో ఎన్ వేణు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, వాటి విడిభాగాలకు సంబంధించి భారత్లో, అంతర్జాతీయంగానూ డిమాండ్–సరఫరా మధ్య ఎంతో అంతరం ఉన్నట్టు చెప్పారు.ఈ డిమాండ్ అవసరాలను తీర్చేందుకు వీలుగా విస్తరణ చేపట్టినట్టు తెలిపారు. 2027 సంవత్సరం మధ్య నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, భారత్తోపాటు యూఏఈ, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ, ఇండోనేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా మార్కెట్లకు సరఫరాను పెంచుకోవచ్చని చెప్పారు. -
కేంద్రానికి రూ.7,324 కోట్లు చెల్లించిన ఎల్ఐసీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి రూ.7,324 కోట్లను డివిడెండ్ కింద ఎల్ఐసీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తానికి చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అందజేసినట్టు ప్రకటించింది.ఆగస్ట్ 26న జరిగిన వార్షిక సమావేశంలో డివిడెండ్ పంపిణీకి వాటాదారులు ఆమోదం తెలిపినట్టు వెల్లడించింది. ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ 2025 మార్చి చివరి నాటికి రూ.56.23 లక్షల కోట్లకు చేరుకుందని.. జీవిత బీమా మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్నట్టు తెలిపింది. -
జియో లిస్టింగ్ వచ్చే ఏడాదే..!
వచ్చే ఏడాది(2026) ద్వితీయార్ధంలోగా జియో ప్లాట్ఫామ్స్ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ కంపెనీ 48వ ఏజీఎంలో ప్రకటించారు. ఏఐ సంబంధిత భారీ మౌలికసదుపాయాలతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరున కొత్త జేవీకి తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో భాగస్వామ్యానికి చేతులు కలిపినట్లు వెల్లడించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఏఐ, ప్రతి చోటా ఏఐ విజన్ను ప్రకటించారు. రిలయన్స్తో కలసి జామ్నగర్ క్లౌడ్ రీజన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీఎంలో వర్చువల్గా పాలుపంచుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్బర్గ్ సైతం రిలయన్స్తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సంస్థ ఓపెన్ సోర్స్ లామా మోడళ్లను జేవీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. దేశీ సంస్థలకు ఈ జేవీ గేమ్ చేంజర్గా నిలవనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. రూ. 855 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మెటాతో జేవీకి తెరతీయనున్నారు. జేవీలో ఆర్ఐఎల్కు 70 శాతం, మెటాకు 30 శాతం వాటా లభించనుంది.జియో ప్లాట్ఫామ్స్ ఆర్ఐఎల్కు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న జియో ప్లాట్ఫామ్స్లో ఎంతమేర వాటా విక్రయించేదీ ముకేశ్ వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థలో ఆర్ఐఎల్కు 66.3 శాతం వాటా ఉంది. మెటా(ఫేస్బుక్) వాటా 10 శాతంకాగా.. గూగుల్ 7.7 శాతం వాటా కలిగి ఉంది. మిగిలిన 16 శాతం వాటా పీఈ దిగ్గజాల చేతిలో ఉంది. ఐపీవోలో 10 శాతం వాటా ఆఫర్ చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ విలువను 136–154 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ స్థాయిలో విలువ నమోదైతే ప్రపంచంలోనే ఆరో పెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. ఆవిర్భవించిన దశాబ్ద కాలంలో దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిన జియో వినియోగదారుల సంఖ్య 50 కోట్లను దాటినట్లు సంస్థ చీఫ్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. → జియోఫ్రేమ్స్ పేరుతో జియో స్మార్ట్గ్లాస్లోకి ప్రవేశించింది. చేతులు వినియోగించకుండా కాల్స్, మ్యూజిక్, వీడియో రికార్డింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ తదితరాలను వివిధ భాషలతో నిర్వహించవచ్చు.→ వాల్ట్ డిస్నీ ఇండియా విలీనంతో ఏర్పాటైన జియోహాట్స్టార్ రెండో పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. 34% టీవీ మార్కెట్ వాటా దీని సొంతం.రిలయన్స్ రిటైల్.. 40,000 కోట్లు ఆసియాలోకెల్లా అతిపెద్ద ఏకీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రిలయన్స్ రిటైల్ రూ. 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వీటిలో ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, సస్టెయినబుల్ టెక్నాలజీలు వినియోగించనున్నట్లు సంస్థ ఈడీ ఈషా అంబానీ పేర్కొన్నారు. మూడేళ్లలో వార్షికంగా ఆదాయంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ బిజినెస్(ఆర్సీపీఎల్)ను 8 రెట్లు పెంచే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఆదా యాన్ని రూ. లక్ష కోట్లకు చేర్చాలని ఆశిస్తోంది.ఓ2సీ... భారీ విస్తరణఆయిల్ 2 కెమికల్స్ విభాగంలో కొత్త ప్రాజెక్టులపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. ఏజీఎంలో తొలిసారి ప్రసంగించారు. 2035కల్లా నికర కర్బన రహిత లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. మొబిలిటీ విభాగంలో జియో–బీపీ ఇంధన రిటైల్ నెట్వర్క్ను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీ చార్జింగ్, బ్యాటరీల స్వాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా పెంచుతున్నట్లు అనంత్ తెలియజేశారు. n న్యూ ఎనర్జీ విభాగం రానున్న 5–7 ఏళ్లలో ఓ2సీ బిజినెస్ను అధిగమించనున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 2028 కల్లా రెట్టింపు ఇబిటాను సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. 2026 కల్లా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు వేసింది. 2032 కల్లా 3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యంపై కంపెనీ కన్నేసింది. -
సోదరిని చూడటానికి వెళ్లి గూగుల్ సీఈఓతో.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే
గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ను కలుసుకోవడం కొంత కష్టమే. అపాయింట్మెంట్, టైమ్ వంటి అనేక రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే అనుకోకుండా పిచాయ్ను కలుసుకుంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేరు. అలాంటి అనుభవమే ఓ యువకునికి ఎదురైంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో నా సోదరిని.. చూడటానికి వెళ్ళినప్పుడు, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ను కలుసుకున్నారు. ఆ అనుభూతిని మరపురానిది అని ఆకాష్ అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టును దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. సుందర్ పిచాయ్ ని చూస్తున్నావా.. ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడివి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు సుందర్ పిచాయ్ అద్భుతమైన వ్యక్తి అని అన్నారు.visited my sister @Google HQ today and ran into the head honcho himself! mr @sundarpichai it was a pleasure, do check out @tryramp 🤝 pic.twitter.com/e0ns2MwdEI— Akash (@akashtronaut) August 27, 2025 -
ఏడేళ్లలో మహిళల ఉపాధిరేటు రెట్టింపు: కార్మిక శాఖ
మహిళల ఉపాధి రేటు గత 7ఏళ్లలో దాదాపు రెట్టింపైనట్లు కార్మిక శాఖ తాజాగా పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2017 - 18లో స్త్రీల ఉపాధి రేటు 22 శాతంకాగా.. 2023–24కల్లా 40.3 శాతానికి ఎగసింది. మరోపక్క ఇదే కాలంలో నిరుద్యోగ రేటు 5.6 శాతం నుంచి 3.2 శాతానికి దిగివచ్చింది. 2047కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 70 శాతానికి చేరుకోవడం కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది.నియమితకాల శ్రామిక శక్తి సర్వే(పీఎల్ఎఫ్ఎస్) గణాంకాల ప్రకారం గత 7ఏళ్లలో మహిళా ఉపాధి రేటు(డబ్ల్యూపీఆర్) దాదాపు రెట్టింపైంది. వెరసి భారత్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ప్రస్తావించదగిన స్థాయిలో బలపడింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ రేటు(యూఆర్) సైతం 2017–18లో నమోదైన 5.6 శాతం నుంచి 2023 - 24కల్లా 3.2 శాతానికి వెనకడుగు వేసింది. ఇది స్త్రీలకు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలను ప్రతిబింబిస్తున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది.గ్రామాలలో ఇది మరింత అధికంగా బదిలీ అయినట్లు వెల్లడించింది. పట్టణాలలో ఉపాధి రేటు 43 శాతంకాగా.. గ్రామీణంలో మహిళా ఉద్యోగుల రేటు 96 శాతం జంప్చేసినట్లు తెలియజేసింది. 2025 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దేశీ గ్రాడ్యుయేట్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 శాతంమందికి ఈ ఏడాది ఉపాధి లభించనున్నట్లు పేర్కొంది. 2024లో ఇది 51.2 శాతంగా నమోదైంది. -
2000 బెడ్లతో మెడికల్ సిటీ.. నీతా అంబానీ కీలక ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్.. ముంబై నడిబొడ్డున 2,000 పడకల అత్యాధునిక మెడికల్ సిటీ నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని 'నీతా అంబానీ' రిలయన్స్ ఫౌండేషన్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.సంస్థ నిర్మిస్తున్న మెడికల్ సిటీ, కేవలం మరో హాస్పిటల్ మాత్రమే కాదు. ఇది భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు కొత్త మార్గదర్శి. ఇక్కడ ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్, లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ వంటివాటితో పాటు.. ప్రపంచంలోని కొంతమంది అత్యుత్తమ వైద్యులు ఉంటారని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.భవిష్యత్ తరాల ఆరోగ్య సంరక్షణ కోసం, నిపుణులను పెంపొందించడమే లక్ష్యంగా.. ఈ మెడికల్ సిటీలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉంటుందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇది మన దేశానికి గర్వకారణమవుతుందని, ప్రపంచమే మనవైపు చూస్తుందని అన్నారు. ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల సేవలను గుర్తుచేసుకుంటున్న సందర్భంగా నీతా అమ్బనీ ఈ ప్రకటన చేశారు.ఇదీ చదవండి: జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీభారతదేశంలోని అగ్రశ్రేణి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన 'సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్' ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా రోగులకు సేవలందించింది. ఇందులో కూడా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి వాటికోసం జీవన్ అనే కొత్త విభాగం ప్రారంభించనున్నట్లు.. లేటెస్ట్ పీడియాట్రిక్ ఆంకాలజీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నీతా అంబానీ వివరించారు.కోస్టల్ రోడ్డు గార్డెన్లుముంబైవాసులను పకృతికి దగ్గర చేసే మరో ఆసక్తికర అభివృద్ధి కార్యక్రమాన్ని నీతా అంబానీ ప్రకటించారు. నగరంలో కోస్టల్ రోడ్డు గార్డెన్లు తీర్చిదిద్దే కార్యక్రమాన్ని రిలయన్స్ ఫౌండేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సముద్ర తీర రోడ్ల చెంతన సుమారు 130 ఎకరాల్లో పచ్చని, ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యాన వనాలు, వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. 48th #RILAGM | Nita Ambani, Founder Chairperson, Reliance Foundation, addresses the Annual General Meeting. - Reached 87 m people across India through Reliance Foundation in 15 years- New 2,000-bed medical city in Mumbai- Touched the lives of 23 m children- Sir HN Reliance… pic.twitter.com/GEyfsRMfHC— CNBC-TV18 (@CNBCTV18News) August 29, 2025 -
జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీ
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. 2026 ప్రథమార్థంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం దాఖలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' ప్రకటించారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు.2026 ప్రథమార్థం నాటికి జియోను లిస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది అన్ని పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయమైన అవకాశంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని ముకేశ్ అంబానీ అన్నారు. అంతే కాకుండా జియో ఇప్పుడు విదేశాలలో కూడా తన కార్యకలాపాలను విస్తరించి.. సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేస్తుందని ఆయన ప్రకటించారు.50 కోట్ల యూజర్లురిలయన్స్ జియో ఇప్పటికి 500 మిలియన్స్ లేదా 50 కోట్ల యూజర్లను కలిగి ఉంది. మరో వారంలో జియో ప్రారంభమైన 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది జియో ఫ్యామిలీ సాధించిన విషయం. ఇది చాలా గర్వంగా ఉందని ముకేష్ అంబానీ అన్నారు. జియో తన సేవలను దేశంలో విస్తృతంగా అందిస్తోంది. నేడు లక్షలాది మంది భారతీయులు ఈ సేవలను పొందుతున్నారని వెల్లడించారు.VIDEO | Reliance Industries Chairman and MD Mukesh Ambani addresses the 48th Annual General Meeting. He says, "Today, it is my proud privilege to announce that Jio is making all arrangements to file for its IPO. We are aiming to list Jio by the first-half of 2026, subject to all… pic.twitter.com/eyw5PI6qMh— Press Trust of India (@PTI_News) August 29, 2025 -
కష్టపడి కార్పొరేట్ టైకూన్గా ఎదిగిన 34 ఏళ్ల యువకుడు
జీవితంలో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామన్నది ముఖ్యం కాదు. ఎక్కడికి చేరతామన్నదే మన విలువను నిర్ణయిస్తుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, విద్యార్థి దశ నుంచే కష్టపడుతూ, మూడు విభిన్న రంగాల్లో.. సాఫ్ట్వేర్, ఆటోమొబైల్, మీడియాలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ముండ్రు ఫణీంద్ర. ఈయన కథ కేవలం వ్యాపార విజయమే కాదు, పట్టుదలతో కలల్ని సాకారం చేసుకున్న ఒక నిజ జీవిత ఉదంతం. జీవితంలో సాధించాలన్న తపన, సాధించేవరకు ఆగని కృషి; ఈ రెండు గుణాలే తనను నేడు విశిష్టమైన వ్యక్తిని చేశాయి.1990 సెప్టెంబర్ 19న జన్మించిన ఫణీంద్ర, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, విద్య పట్ల గౌరవం వంటి విలువలను అలవాటు చేసుకున్నారు. తండ్రి ముండ్రు అబ్రహం నిబద్ధత, తల్లి ముండ్రు మణి సహనం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. సోదరి మాతంగి రమ్యావిద్యాసాగర్ ఎల్లప్పుడూ అండగా నిలిచి, ప్రతి అడుగులో ప్రోత్సాహం అందించారు. ఈ కుటుంబ బంధమే ఆయన ప్రతి విజయానికి పునాది. ఫణీంద్ర చిన్నప్పటి నుంచే కేవలం చదువు మీదే కాకుండా, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి, ఏ పని చేసినా నాణ్యతతో చేయాలనే పట్టుదల ఆయన విజయసుత్రాలు. ఈ విలువలు, ఆయన తల్లిదండ్రులు నేర్పిన జీవన సూత్రాలు, ఆయన ప్రతి నిర్ణయంలో ప్రతిఫలించాయి.బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సమయం నుంచే ఫణీంద్ర స్వతంత్రంగా పనిచేయడం మొదలుపెట్టారు. గూగుల్ ఆఫ్లైన్ అసైన్మెంట్లు చేసి, టెక్నాలజీ ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. ఆ సమయంలోనే దేశ, విదేశాల కస్టమర్ల కోసం అనేక వెబ్సైట్లు డిజైన్ చేసి, సాంకేతిక నైపుణ్యాలలోనూ పట్టు సాధించారు. చదువుతో పాటు చేసిన ఈ ప్రాజెక్టులు ఆయనలో విశ్వాసాన్ని పెంచి, పెద్ద స్థాయి ప్రాజెక్టులను తీసుకునే ధైర్యాన్ని ఇచ్చాయి.దాదాపు పదకొండు సంవత్సరాల కృషి, వ్యూహాత్మక ఆలోచన, నిరంతర శ్రమతో ‘దెనిసా టెక్ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ కస్టమర్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, సమయానికి వినూత్న పరిష్కారాలు అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పారదర్శక విధానాలు, నాణ్యతకు ప్రాధాన్యత, సమయపాలనలో రాజీపడని ధోరణి ఈ సంస్థ విజయానికి కారణమయ్యాయి. ఫణీంద్ర నాయకత్వంతో పాటు నాణ్యతతో కూడిన ప్రమాణాలు, బృందంపై నమ్మకం, సృజనాత్మకతకు ప్రోత్సాహం; కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. టెక్నాలజీ రంగంలో విజయాలను అందుకున్న తర్వాత, ఆటోమొబైల్ రంగంలో కూడా అడుగుపెట్టారు. తన భార్య స్రవంతితో కలిసి అబిగైల్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. తమ కుమార్తె పేరుతోనే కంపెనీకి పేరు పెట్టడం ద్వారా వ్యాపారానికి కుటుంబ అనుబంధాన్ని జోడించారు. కస్టమర్ విశ్వాసం, పారదర్శక సేవలు, నాణ్యత.. ఇవే అబిగైల్ విజయానికి ప్రధానమైన మూలాలు.ఫణీంద్ర భార్య స్రవంతి వ్యాపార నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతూ, ప్రతి సందర్భంలో అండగా నిలిచారు. పిల్లలు అబిగైల్, మాల్విన్ అబ్రహం ఆయన ప్రతీ విజయానికి ప్రేరణ. వ్యాపారాల్లో ఎప్పుడూ మార్పులు, పోటీలు, అనిశ్చితి సహజం. ఫణీంద్ర ఈ సవాళ్లను వెనుకడుగు వేయడానికి కారణంగా కాకుండా, కొత్త అవకాశాలుగా మలచుకున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రారంభ దశలో నమ్మకం సంపాదించడం, క్లయింట్లను దీర్ఘకాలంలో ఉండేలా చేయడం పెద్ద సవాల్. కానీ, ప్రతి ప్రాజెక్ట్ను సమయానికి, నాణ్యతతో పూర్తి చేయడం ద్వారా ఆ సవాలును అధిగమించారు. అందుకే క్రమంగా అంతర్జాతీయ క్లయింట్ల వరకు ఈ సంస్థ పరిధి విస్తరించింది.ఫణీంద్ర భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో తన వ్యాపార పరిధిని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సొల్యూషన్లపై దృష్టి సారించడం, ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీసింగ్, కస్టమైజేషన్ విభాగాలను ప్రవేశపెట్టడం ఆయన ప్రణాళికలో ఉన్నాయి. అలాగే, సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, చిన్న వ్యాపారాలకు డిజిటల్ టూల్స్ అందించడం, పర్యావరణ స్నేహపూర్వక వ్యాపార మోడల్స్ను రూపొందించడం ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగం.ముండ్రు ఫణీంద్ర జీవన ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు, అది ఒక స్పష్టమైన సందేశం కూడా. పట్టుదల, కృషి, నిజాయితీ, స్పష్టమైన దిశ ఉంటే ఏ కల అయినా నిజం కావచ్చని ఆయన నిరూపించారు. విద్యార్థి దశలోనే అనుభవాన్ని సంపాదించడం నుంచి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలను స్థాపించడం వరకు, ఆయన ప్రతి అడుగూ ప్రణాళికాబద్ధంగానే కాక, విలువలతో నిండినదే. తన కుటుంబం మద్దతుతో, తన సొంత శ్రమతో, విభిన్న రంగాలలో సుస్థిర స్థానం సంపాదించడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా తన వ్యాపారాలను నడపడం ఆయన ప్రత్యేకత. తరతరాలకు ప్రేరణగా నిలిచే ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ‘స్వప్నాలను కేవలం చూడకండి, వాటిని సాధించడానికి శ్రమించండి’ అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. -
నెట్వర్క్ విస్తరణలో అమెజాన్
పండుగ సీజన్ డిమాండ్కి తగ్గట్లు సర్వీసులు అందించే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన నెట్వర్క్ను మరింతగా విస్తరించింది. కొత్తగా 12 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు (స్మార్ట్ గిడ్డంగులు), ఆరు సార్టింగ్ సెంటర్లను ప్రారంభించింది. దీనితో దాదాపు ఒలింపిక్ గేమ్స్ స్థాయి 100 స్విమ్మింగ్ పూల్స్కి సమానమైన 86 లక్షల ఘనపుటడుగుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. వైజాగ్, కృష్ణగిరి తదితర అయిదు నగరాల్లో తొలిసారిగా ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించింది.ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖత్రివేండ్రం, రాజ్పురా తదితర ఆరు ప్రాంతాల్లో సోర్ట్ సెంటర్లను నెలకొల్పినట్లు తెలిపింది. కొనుగోలుదారులకు మరింత వేగంగా ఉత్పత్తులను అందించడానికి విక్రేతలకు ఇవి ఉపయోగపడతాయని వివరించింది. వీటితో ఫుల్ఫిల్మెంట్, సోర్టేషన్ అసోసియేట్స్, టీమ్ లీడ్స్, ప్రాసెస్ అసిస్టెంట్స్లాంటి వేల కొద్దీ ఫుల్టైమ్, పార్ట్టైమ్ ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని అమెజాన్ పేర్కొంది. -
ఎయిర్లైన్స్.. నష్టాలు డబుల్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వివాదాలు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశీ విమానయాన రంగం నష్టాలు రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ. 5,500 కోట్ల స్థాయిలో ఉండగా ఈసారి రూ. 9,500–10,500 కోట్ల స్థాయిలో ఉండొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నమోదైన రూ. 21,600 కోట్లు, రూ. 17,900 కోట్లతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని వివరించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 4–6 శాతం వృద్ధితో 17.2–17.6 కోట్లుగా నమోదు కావచ్చని ఇక్రా తెలిపింది.ఇది గతంలో వేసిన 7–10 శాతం అంచనాల కన్నా తక్కువ కావడం గమనార్హం. ‘ఒకవైపు విమానాల డెలివరీలు పెరుగుతున్న తరుణంలో ప్యాసింజర్ల రద్దీ తగ్గడం వల్ల భారతీయ ఏవియేషన్ పరిశ్రమ నష్టాలు 2025 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 5,500 కోట్లతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగి రూ. 9,500 – 10,500 కోట్లకు చేరే అవకాశం ఉంది‘ అని ఇక్రా వివరించింది.సీమాంతర ఉద్రిక్తతలతో సర్విసుల్లో అంతరాయాలు, ఫ్లయిట్ల రద్దు, ఎయిరిండియా విమాన దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణాలపై సందిగ్ధతలు తదితర అంశాల వల్ల తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 4.4 శాతానికి పరిమితమైనట్లు తెలిపింది. అలాగే, రాబడులు కూడా 4–5 శాతం తగ్గాయని వివరించింది. సుదీర్ఘ కాలం పాటు వర్షాలు కొనసాగడంతో జూలై–ఆగస్టులో కూడా విమాన ప్రయాణాలపై ప్రభావం పడి ఉంటుందని, ఇక అమెరికా టారిఫ్లతో తలెత్తే వాణిజ్య ఉద్రిక్తతలు సైతం రాబోయే త్రైమాసికాల్లో వ్యాపార సెంటిమెంట్లను దెబ్బతీసి, ప్రయాణాలపై పునరాలోచనలో పడే పరిస్థితి ఏర్పడవచ్చని ఇక్రా తెలిపింది. జూలైలో తగ్గిన ప్రయాణికులు.. దేశీయంగా జూలైలో విమాన ప్రయాణికుల రద్దీ 2.94 శాతం క్షీణించి 1.26 కోట్లకు పరిమితమైంది. గతేడాది జూలైలో 1.29 కోట్ల మంది దేశీ రూట్లలో ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం జనవరి–జూలై మధ్య కాలంలో ప్రయాణికుల సంఖ్య 9.77 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 9.23 కోట్లతో పోలిస్తే 5.9 శాతం పెరిగింది. జూలైలో ఎయిరిండియా గ్రూప్ మార్కెట్ వాటా 26.2 శాతంగా, ఇండిగో 65.2%, ఆకాశ ఎయిర్ 5.5 శాతం, స్పైస్జెట్ వాటా 2 శాతంగా ఉంది. ఇండిగో అత్యధికంగా 82.15 లక్షల మందిని, ఎయిరిండియా గ్రూప్ 33.08 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. -
ఇండియా బుల్లెట్ రైలు: రెడీ అవుతున్న స్టేషన్లు చూస్తారా?
దేశంలో బుల్లెట్ రైలు పరుగులకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రారంభానికి ఇంక ఒక్క అడుగు దూరంలోనే ఉందని, స్టేషన్లు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని పేర్కొంటూ భారతీయ రైల్వే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాటి ఫొటోలను షేర్ చేసింది.ముంబై-అహ్మదాబాద్ కారిడార్కు సంబంధించి గుజరాత్లోని బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు దాదాపు పూర్తయ్యాయని ‘ఎక్స్’లో ఇండియన్ రైల్వేస్ పోస్ట్ చేసింది. ఆధునిక డిజైన్, సాంస్కృతిక గుర్తింపు, అంతరాయం లేని కనెక్టివిటీ, పర్యావరణ అనుకూల లక్షణాలతో, స్టేషన్లు ప్రయాణికుల సౌకర్యాన్ని పునర్నిర్వచిస్తాయని, ప్రయాణంలో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేస్తాయని పేర్కొంది.ఎన్ని స్టేషన్లు, ఎక్కడెక్కడ?ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. అవి ముంబై (బాంద్రా-కుర్లా కాంప్లెక్స్), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి.వీటిలో నాలుగు స్టేషన్లు మహారాష్ట్ర (ముంబై, థానే, విరార్, బోయిసర్), ఎనిమిది గుజరాత్ (సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి)లో ఉన్నాయి.ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో గుజరాత్ లో 348 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ గుండా 4 కిలోమీటర్లు వెళుతుంది.బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలుబుల్లెట్ రైలు గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్లు, మొత్తం ప్రయాణానికి 2 గంటల 7 నిమిషాలు పడుతుందని భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జపనీస్ షింకన్ సేన్ ట్రాక్ సిస్టమ్ ఆధారంగా జె-స్లాబ్ ట్రాక్ సిస్టమ్ ఉంటుంది. ప్రాంతాల వారీగా చూస్తే, కారిడార్లో ఏడు పర్వత సొరంగాలు (మహారాష్ట్రలో ఆరు, గుజరాత్లో ఒకటి), 24 నదీ వంతెనలు (20 గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి) ఉన్నాయి. The #BulletTrain stations on the Mumbai–Ahmedabad corridor in Gujarat are nearing completion. With modern design, cultural identity, seamless connectivity and eco-friendly features, the stations will redefine passenger comfort and set new benchmarks in travel. pic.twitter.com/2olttW6Mnb— Ministry of Railways (@RailMinIndia) August 28, 2025 -
వాటర్ ప్యూరిఫయర్స్పై జీఎస్టీ తగ్గించండి: ఆర్థికశాఖకు వినతి
న్యూఢిల్లీ: నీటి శుద్ధి యంత్రాలు (water purifiers), వాటి ఫిల్టర్లు, సంబంధిత సేవలపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని వాటర్ క్వాలిటీ ఇండియా అసోసియేషన్ (WQIA) కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. నీటి శుద్ధి యంత్రాలను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశమని ఆ లేఖలో పేర్కొంది. సురక్షితమైన తాగునీటిని విలాసవంతమైన వస్తువుగా కాకుండా నిత్యావసర వస్తువుగా పరిగణించాలని కోరింది.లేఖలోని ప్రధాన అంశాలునీటి శుద్ధి యంత్రాలపై 18% జీఎస్టీ విధించడం వల్ల అవి ఎయిర్ కండిషనర్లు, కార్ల మాదిరిగా అధిక పన్ను పరిధిలోకి వస్తున్నాయి. అయితే, ఇవి ప్రజల ఆరోగ్యానికి అత్యంత అవసరం అని వాటర్ క్వాలిటీ ఇండియా అసోసియేషన్ వాదించింది.దేశంలో ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించే కుటుంబాల శాతం కేవలం 6% మాత్రమే ఉందని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది దాదాపు 20%గా ఉందని గుర్తు చేసింది. అధిక జీఎస్టీ రేటు తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు వీటిని కొనేందుకు అడ్డంకిగా మారిందని తెలిపింది.20 లీటర్ల వాటర్ జార్లపై ప్రస్తుతం 12% జీఎస్టీ ఉన్నప్పటికీ, అది 5%కి తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో నీటి శుద్ధి యంత్రాలపై పన్ను 18% వద్దే ఉండటం విధానపరమైన వైరుధ్యాన్ని సృష్టిస్తుందని అసోసియేషన్ పేర్కొంది. -
హైదరాబాద్లో ఇంటర్నెట్ అంతరాయం.. సెల్యులార్ ఆపరేటర్ల ఆగ్రహం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది కొనసాగిస్తున్న, చట్టవిరుద్ధమైన ఫైబర్ కోతలను సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఖండించింది. ఆగస్టు 22న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ ఈ చర్యలు కొనసాగుతున్నాయని అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.నగరంలోని బంజారాహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, కొండాపూర్, హబ్సిగూడ, చంపాపేట్, మణికొండ, సికింద్రాబాద్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో ఫైబర్ కోతలు ఎక్కువగా నమోదవుతున్నాయని, దీంతో టెలికాం ఫైబర్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సీఓఏఐ తెలిపింది.గత కొన్ని రోజులుగా ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన కనెక్టివిటీపై ప్రభావం చూపుతోందని తెలిపింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆగస్టు 25న టీజీఎస్ పీడీసీఎల్ కు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించినప్పటికీ, మళ్లీ ఫైబర్ కోతలతో ఈ ఉత్తర్వును స్పష్టంగా ఉల్లంఘిస్తూనే ఉందని సీఓఏఐ ఆక్రోశించింది.టెలికమ్యూనికేషన్స్ యాక్సెస్ అనేది కేవలం ఒక సేవ మాత్రమే కాదని, ఇది నేటి డిజిటల్ యుగంలో ప్రాథమిక హక్కు, జీవనాధారమని సీఓఏఐ తెలిపింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి, కీలకమైన టెలికాం మౌలిక సదుపాయాల రక్షణను నిర్ధారించడానికి, ఈ పునరావృత ఉల్లంఘనలకు పాల్పడినవారిని చట్ట ప్రకారం బాధ్యులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ ప్రకటనలో కోరింది. -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.నిషేధానికి కారణంఅమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.ఆందోళలో వ్యాపార వర్గాలుయూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.Let me remind the US once again - we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.I urge every… pic.twitter.com/PhBsVNSJHe— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025 -
ఎస్బీఐ–ఫ్లిప్కార్ట్ కొత్త క్రెడిట్ కార్డ్.. క్యాష్బ్యాక్ల కోసం..
ఎస్బీఐ కార్డ్ సంస్థ ఫ్లిప్కార్ట్తో కలసి ఒక కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, ఎస్బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ సమక్షంలో ‘ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్’ను ఆవిష్కరించినట్టు ఎస్బీఐ కార్డ్ ప్రకటించింది.షాపింగ్పై క్యాష్బ్యాక్ ప్రయోజనాలతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. ఈ కార్డుతో మింత్రాపై కొనుగోళ్లు చేస్తే 7.5 శాతం, ఫ్లిప్కార్ట్, షాప్సి, క్లియర్ట్రిప్పై చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఎస్బీఐ కార్డ్ తెలిపింది.రివార్డులను తిరిగి ఫ్లిప్కార్ట్పై కొనుగోళ్లకు, ట్రావెల్ బుకింగ్లకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఫ్లిప్కార్ట్ యాప్, ఎస్బీఐ కార్డ్ డాట్ కామ్ నుంచి ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అదనపు ప్రయోజనాలురూ.1,250 విలువైన వెల్కమ్ బెనిఫిట్స్ (ఇ-గిఫ్ట్ కార్డులు, Cleartrip వౌచర్లు).రూ.3.5 లక్షల వార్షిక ఖర్చుతో రిన్యూవల్ ఫీజు రివర్సల్.1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ (రూ.400 వరకు/స్టేట్మెంట్ సైకిల్). -
సెంచురీ పల్ప్పై సీసీఐకి ఐటీసీ దరఖాస్తు
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ తాజాగా ఆదిత్య బిర్లా రియల్టీ(ఏబీఆర్ఈఎల్) నుంచి పల్ప్, పేపర్ బిజినెస్ కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్ను ఆశ్రయించింది. తద్వారా రూ.3,498 కోట్ల విలువైన ఈ డీల్పై అనుమతిని కోరింది. 1984లో ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఏబీఆర్ఈఎల్ నెలకొల్పిన సెంచురీ పల్ప్ అండ్ పేపర్ బిజినెస్ను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ప్రస్తుతం వార్షికంగా 4.8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దేశీ పేపర్ పరిశ్రమలో సుప్రసిద్ధ కంపెనీగా సెంచురీ పల్ప్ అవతరించింది. అయితే ప్రతిపాదిత కొనుగోలు కారణంగా పోటీకి సంబంధించి ఎలాంటి ఆందోళనలు తలెత్తబోవని ఐటీసీ పేర్కొంది.ఇదీ చదవండి: మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?దేశీ పేపర్ మార్కెట్లలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో తాజా డీల్ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని సీసీఐకు వివరించింది. కాగా.. పల్ప్, పేపర్ బిజినెస్ను స్లంప్ సేల్ ప్రాతిపదికన ఐటీసీకి విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు ఈ ఏడాది మార్చిలో ఏబీఆర్ఈఎల్ తెలియజేసింది. ఇందుకు నగదు రూపేణా ఐటీసీ రూ. 3,498 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. తద్వారా తమకు కీలకమైన రియల్టీ విభాగంపై దృష్టిసారించనున్నట్లు పేర్కొంది. 2020–24 మధ్యకాలంలో రూ, 4,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించిన పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ విభాగం ఇకపైనా ఇదే రీతిలో కొనసాగనున్నట్లు ఐటీసీ ఇటీవల అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
అదానీ–జేపీ డీల్కు సీసీఐ సై
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా అదానీ గ్రూప్ను అనుమతించింది. దీంతో ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న జేపీని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ వేసిన బిడ్ గెలుపొందే వీలుంది. తద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లేదా అదానీ గ్రూప్లోని ఏ ఇతర సంస్థ అయినా జేపీలో 100 శాతం వాటా కొనుగోలుకి అనుమతించింది. వెరసి అదానీ గ్రూప్ సంస్థలు జేపీని సొంతం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనలమేరకు ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళిక దాఖలుకు సీసీఐ అనుమతి తప్పనిసరి. కాగా.. జేపీ దివాలా పరిష్కార ప్రణాళికను ప్రస్తుతం రుణదాతల కమిటీ(సీవోసీ) సమీక్షిస్తోంది. సీసీఐ అనుమతి తదుపరి మాత్రమే దివాలా పరిష్కార ప్రణాళికను సీవోసీ సమీక్షించి అంగీకరిస్తుంది. కాగా.. జేపీ కొనుగోలుకి అదానీ గ్రూప్తోపాటు.. దాల్మియా భారత్ ప్రతిపాదనను సైతం తాజాగా సీసీఐ అనుమతించింది. వేదాంతా గ్రూప్, జిందాల్ పవర్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ తదితర సంస్థలు సైతం జేపీ కొనుగోలుకి వీలుగా సీసీఐను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2024 జూన్3న జేపీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్సీఎల్టీ అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఇందుకు కారణంకాగా.. రుణదాతలకు రూ. 57,185 కోట్లు బకాయిపడటం గమనార్హం! -
వొడాఫోన్ ఐడియాకు ఉపశమనంపై స్పష్టత
రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించే యోచన చేయడంలేదని టెలికం శాఖ స్పష్టం చేసింది. కంపెనీ స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) బకాయిలపై ప్రస్తుతం తమవద్ద ఎలాంటి ప్రణాళికలు లేదా ఆలోచనలు లేవని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.‘ఇటీవల కంపెనీకున్న భారీ రుణ భారాన్ని ఈక్విటీగా మార్పు చేసుకున్నాం. ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇది చేపట్టాం. ప్రభుత్వం చేయదలచినదంతా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం వీటిపై ఎలాంటి సమాలోచనలూ చేయడంలేదు’ అంటూ స్పష్టతనిచ్చారు. స్పెక్ట్రమ్ వేలం బకాయిలకుగాను మార్చిలో ప్రభుత్వం రూ. 36,950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోవడం ద్వారా వొడాఫోన్ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇంతక్రితం 2023లోనూ ప్రభుత్వం రూ. 16,000 కోట్ల బకాయిలకుగాను వొడాఫోన్ ఐడియాలో 33 శాతం వాటాను అందుకోవడం గమనార్హం! 2025 జూన్కల్లా కంపెనీ ఏజీఆర్ లయబిలిటీ రూ.75,000 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
అమెజాన్ కొత్తగా మరో 40 ఆశ్రయ్ కేంద్రాలు
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా తమ ఆశ్రయ్ ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. ప్రభుత్వ రంగ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)తో కలిసి మరో 40 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య 13 నగరాలవ్యాప్తంగా 65కి చేరింది. 2025 ఆఖరు నాటికి ఇలాంటి 100 సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు అమెజాన్ ఆపరేషన్స్ డైరెక్టర్ (ఇండియా) సలీం మెమన్ తెలిపారు.పెట్రోల్ బంకులు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఈ సెంటర్స్.. అమెజాన్ సొంత నెట్వర్క్లోని వారితో పాటు ఈ–కామర్స్, లాజిస్టిక్స్ వ్యవస్థలోని ఇతరత్రా డెలివరీ అసోసియేట్స్ కూడా కాసేపు సేద తీరేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఎయిర్ కండీషన్డ్ సీటింగ్, తాగు నీరు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, వాష్రూమ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మొదలైనవి ఉంటాయి. ఉదయం 9 గం.ల నుంచి రాత్రి 9 గం.ల వరకు, ఏడాదిపాడవునా, వారానికి ఏడు రోజులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ మార్పులతో ఇబ్బందిపడే డెలివరీ అసోసియేట్స్ ప్రతి విజిట్లో అరగంట సేపు దీన్ని ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు -
భారత్లో రూ.70 వేలకోట్ల పెట్టుబడి!.. సుజుకి మోటార్ ప్రెసిడెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్లోని హన్సల్పూర్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడంతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఒనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి.. కంపెనీకి చెందిన ఇతర కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.మారుతి సుజుకి ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం తర్వాత.. సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో మాట్లాడుతూ.. జపాన్ తయారీదారు రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో భారతదేశంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా.. భారతదేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. భారతదేశంతో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. భారతదేశం దార్శినికతకు మద్దతు ఇవ్వడానికి.. వికసిత్ భారత్కు దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నామని తోషిహిరో సుజుకి అన్నారు.సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తన ప్రసంగంలో.. కొత్తగా ప్రారంభించిన గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారుతుందని, భారతదేశంలోని వినియోగదారులకు సేవలందిస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు!.. ఈ-విటారా ప్రారంభించిన మోదీఈ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన మొదటి వాహనం మారుతి సుజుకి ఇ-విటారా, ఇది బ్రాండ్ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం కూడా. ఈ ఎలక్ట్రిక్ కారును జపాన్.. యూరప్తో సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మొట్టమొదటి లిథియం-అయాన్ బ్యాటరీ.. ఎలక్ట్రోడ్ స్థాయి స్థానికీకరణతో కూడిన సెల్ ఉత్పత్తి ప్రారంభాన్ని కూడా తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. -
కేవలం రూ. 181కే.. హోమ్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ సంస్థ ఫోన్పే కొత్తగా గృహ బీమా పాలసీలను ప్రకటించింది. అగ్ని, వరదలు, భూకంపాలు సహా 20 రిస్కులకు కవరేజీ అందించేలా పాలసీలను ప్రకటించింది. రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 కోట్ల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు.ప్రీమియంలు కవరేజీని బట్టి వార్షికంగా రూ. 181 నుంచి (జీఎస్టీ కూడా కలిపి) ప్రారంభమవుతాయి. గృహ రుణాలకు సంబంధించి ఈ పాలసీలకు అన్ని బ్యాంకులు, రుణ సంస్థల్లో ఆమోదయోగ్యత ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫోన్పే యాప్ ద్వారా యూజర్లు దీన్ని పొందవచ్చు. -
సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్
ముంబై: టారిఫ్ పరమైన అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ తరుణంలో పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు బ్యాంక్లు, కార్పొరేట్లు కలసి రావాలని పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.అమెరికా - భారత్ వాణిజ్య ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులు అంతిమంగా ఒక నిర్ణయానికి దారితీస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు టారిఫ్ల కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం పరిమితం అవుతుందన్నారు. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్లు విధించగా, ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో టెక్స్టైల్స్, రొయ్యలపై అధిక ప్రభావం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అవసరమైతే రంగాల వారీ ఆర్థిక చేయూతకు అవకాశం ఉంటుందని మల్హోత్రా సంకేతం ఇచ్చారు.పరపతి విధానంలో భాంగా ద్రవ్యోల్బణంతోపాటు వృద్ధి క్రమాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. ‘‘క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. భౌగోళిక రాజకీయ, టారిఫ్ పరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. కనుక ఆర్థిక విస్తరణ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్లు, కార్పొరేట్ బ్యాలన్స్ షీట్లు మెరుగ్గా ఉన్నాయి. కనుక అవి పరస్పర సహకారంతో పెట్టుబడుల సైకిల్ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ కీలక తరుణంలో ఇది ఎంతో అవసరం’’అని పేర్కొన్నారు. రుణ వృద్ధికి చర్యలు..ధరల స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం వృద్ధికి అడ్డుకావని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బ్యాంకుల రుణ వృద్ధి మూడేళ్ల కనిష్టానికి తగ్గిన తరుణంలో.. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆర్బీఐ నియత్రణలోని సంస్థల వ్యాపార సులభతర నిర్వహణను పెంచడంపైనా దృష్టి పెట్టినట్టు చెబుతూ, దీనివల్ల వ్యయాలు తగ్గుతాయన్నారు. ఆర్బీఐ ఎన్నో వివరాలు కోరుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయని చెబుతూ.. అడిగిన సమాచారం విషయంలో భాగస్వాములు సహకరించాలని కోరారు. దీనివల్ల మెరుగైన నియంత్రణలకు అవకాశం ఉంటుందన్నారు. త్వరలోనే బాసెల్-3 నిబంధనలను అమల్లోకి తెస్తామని చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడం, చిన్న వ్యాపారులకూ రుణ సాయం చేరువ చేయడం, కస్టమర్ సేవల నాణ్యతను పెంచడం తమ ప్రాధాన్యతలుగా చెప్పారు. -
ఫ్లిప్కార్ట్ బ్లాక్ మెంబర్షిప్: ఏడాది ఫ్రీ యూట్యూబ్..
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఓ కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. 'ఫ్లిప్కార్ట్ బ్లాక్' పేరుతో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వినియోగదారులు ఫ్లిప్కార్ట్ బ్లాక్ను రూ.1,499 వార్షిక రుసుముతో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ ముందస్తు తగ్గింపును అందిస్తూ.. ఈ నెలాఖరు లోపల రూ. 990 చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇందులో భాగంగానే వినియోగదారులు ఏడాదిపాటు ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ పొందవచ్చు. దీనిద్వారా యాడ్స్ లేకుండా వీడియోలు చూడవచ్చు. ఒక సబ్స్క్రిప్షన్ ఒక యూట్యూబ్ అకౌంటుకు మాత్రమే పనిచేస్తుంది.ఫ్లిప్కార్ట్ వీఐపీ స్థానంలో ఫ్లిప్కార్ట్ బ్లాక్ రానుంది. ఫ్లిప్కార్ట్ వీఐపీ అనేది సంవత్సరానికి రూ. 799 ఖరీదు చేసే ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్. ఇది ఫ్లిప్కార్ట్ బ్లాక్ మాదిరిగా కాకుండా.. ప్రత్యేకమైన ఆఫర్లను లేదా యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ను అందించలేదు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలుఫ్లిప్కార్ట్ బ్లాక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు.. సభ్యత్వంతో ప్రతి ఆర్డర్పై రూ. 100 వరకు 5 శాతం సూపర్కాయిన్స్ క్యాష్బ్యాక్ పొందుతారు, అలాగే నెలకు 800 సూపర్కాయిన్ల వరకు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సూపర్కాయిన్లను రూపాయికి సమానమైన డిస్కౌంట్లుగా లేదా ఆర్డర్లపై క్యాష్బ్యాక్గా రీడీమ్ చేసుకోవచ్చు. -
కంపెనీల కొనుగోళ్లకూ బ్యాంక్ నిధులు!.. ఎస్బీఐ చైర్మన్
ముంబై: లిస్టెడ్ కంపెనీలు చేపట్టే విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) లావాదేవీలకు కూడా నిధులు సమకూర్చడంపై బ్యాంకులు దృష్టి పెడుతున్నాయి. దీనికి అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంకును దేశీ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) సూత్రప్రాయంగా అభ్యర్తించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయం తెలిపారు.వినియోగాన్ని పెంచేందుకు ఓవైపు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరోపక్క ప్రయివేట్ రంగం సైతం సామర్థ్య విస్తరణపై పెట్టుబడులకు ఉపక్రమించాలని సూచించారు. సాధారణంగా బలవంతపు టేకోవర్లకు తోడ్పడకూడదనే ఉద్దేశమే, ఎంఅండ్ఏ ఫండింగ్కి బ్యాంకులను దూరంగా ఉంచడానికి కారణమని పేర్కొన్నారు.అయితే.. అత్యంత పారదర్శకంగా, వాటాదారుల అనుమతితో లిస్టెడ్ కంపెనీలు చేపట్టే కొనుగోళ్లకైనా నిధులు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ ఆర్బీఐకు విన్నవించనున్నట్లు తెలియజేశారు. దీనితో బలవంతపు టేకోవర్లకు ఫండింగ్ చేసే సందర్భాలు తగ్గుతాయని పేర్కొన్నారు. భారత వాణిజ్య సమాఖ్య, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన 2025 ఎఫ్ఐబీఏసీ సందర్భంగా శెట్టి పలు అంశాలపై స్పందించారు.పెట్టుబడి వ్యయాలు ఇలా..దేశీ కార్పొరేట్ రంగం అంతర్గత వనరులు, ఈక్విటీ, రుణ మార్కెట్ల ద్వారా ప్రస్తుతం పెట్టుబడి వ్యయాలను సమకూర్చుకుంటున్నట్లు ఎస్బీఐ చీఫ్ శెట్టి తెలియజేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగం పుంజుకోనుందన్న అంచనాలతో కంపెనీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే నిలకడైన డిమాండ్ వాతావరణం కనిపించినప్పుడు మాత్రమే పెట్టుబడి వ్యయాలు పుంజుకుంటాయని అత్యధికులు చెబుతున్నట్లు ప్రస్తావించారు.జీఎస్టీ రేట్లలో వ్యవస్థాగత సంస్కరణలు, రూ. 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు తదితర పలు చర్యలకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి డిమాండ్ మళ్లీ భారీస్థాయిలో పుంజుకుంటే కార్పొరేట్లకు పెట్టుబడి వ్యయాలు లేదా తగిన ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. సామర్థ్య విస్తరణవైపు కంపెనీలు ఇప్పటికిప్పుడు దృష్టి పెడితే అటు క్యాపిటల్ మార్కెట్లు, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రుణ మార్కెట్లు కచ్చితంగా మద్దతిస్తాయని వివరించారు.కస్టమర్ సర్వీసుల పెంపు, సైబర్ సెక్యూరిటీ పటిష్టత, మరింత ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కు దేశీ బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల(ఎంఎస్ఎంఈలు)కు రుణాలందించడంపై ఇటీవల బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ - జూన్(క్యూ1)లో వీటికి 19 శాతం అధికంగా రూ. 5.28 లక్షల కోట్ల రుణాలందించినట్లు వెల్లడించారు. -
గూగుల్ యూటర్న్.. ఇంటర్యూ విధానంలో మార్పు!
ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్'.. ఇంటర్యూ విధానంలో మార్పు తీసుకురావడానికి సిద్దమైంది. మళ్ళీ పేస్ టు పేస్ ఇంటర్వ్యూలను నిర్వహించాలని పేర్కొంది. వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా మోసాలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే ముఖాముఖి ఉద్యోగ ఇంటర్వ్యూలను తిరిగి అమలు చేయనున్నట్లు సీఈఓ 'సుందర్ పిచాయ్' వెల్లడించారు.వర్చువల్ విధానంలో ఇంటర్యూలు నిర్వహిస్తుంటే కొందరు అభ్యర్థులు ఏఐను ఉపయోగించి మోసం చేస్తున్నారు. దీనివల్ల నైపుణ్యం ఉన్నవారు ఉద్యోగం తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక సమావేశంలో.. ఏఐ వినియోగం పెరుగుతున్నందున వర్చువల్ ఇంటర్వ్యూలు సమంజసం కాదని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కాబట్టి అభ్యర్థులు ఇకపై తప్పకుండా ఒక రౌండ్ పేస్ టు పేస్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని పిచాయ్ పేర్కొన్నారు.పిచాయ్ స్పందిస్తూ హైబ్రిడ్ విధానాన్ని సమర్థించారు. మనమందరం హైబ్రిడ్ పద్ధతిలో పని చేస్తున్నాము, కాబట్టి.. ఇంటర్వ్యూలలో కొంత భాగాన్ని స్వయంగా నిర్వహించడం గురించి ఆలోచించాలి. ఇది అభ్యర్థులకు గూగుల్ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని నేను భావిస్తున్నానని అన్నారు.ఇదీ చదవండి: కోర్టుకెక్కిన మస్క్ కంపెనీ: యాపిల్, ఓపెన్ఏఐ దావా..వర్చువల్ విధానం ద్వారా.. ఇంటర్యూలను షెడ్యూల్ చేయడం సులభం. అంతే కాకుండా శ్రమ, వ్యయం కూడా తగ్గుతాయి. కోవిడ్ తరువాత ఈ విధానం వల్ల మోసాలు జరుగుతున్నట్లు తెలిసింది. కాబట్టి పద్దతిని తప్పకుండా మార్కకోవాల్సిన అవసరం ఉంది. -
ఫ్లిప్కార్ట్లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల 1.5 లక్షల సీజన్ ఉద్యోగాలను ప్రకటించిన తరువాత.. ఫ్లిప్కార్ట్ 2.2 లక్షల కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగాలను ప్రకటించింది. తమ కస్టమర్లకు సరైన సమయంలో ఉత్పత్తులను అందించడంలో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో ఈ కామర్స్ సంస్థలు సీజనల్ ఉద్యోగాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ తమ సేవలను అందించడానికి ఫ్లిప్కార్ట్ సన్నద్ధమైంది. ముఖ్యంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఎక్కువమంది యువతకు ఉపాధి కల్పించడంపై కంపెనీ ద్రుష్టి పెట్టింది.ఉద్యోగ నియామకాలు.. ప్రధానంగా సప్లైచైన్, లాజిస్టిక్, లాస్ట్ మైల్ డెలివరీ వంటి విభాగాల్లో ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఉద్యోగాలను మహిళలు, దివ్యాంగులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పండుగ సీజన్.. అమెజాన్లో 1.5 లక్షల ఉద్యోగాలు -
టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!
ప్రముఖ టెక్ దిగ్గజం తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫీసులను ప్రారంభిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డి హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఫీనిక్స్ సెంటారస్లో 2.65 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇక్కడ 3, 4వ అంతస్తులలో ఆఫీస్ ఉంటుంది.టేబుల్స్పేస్ టెక్నాలజీస్తో ఒప్పందం ఐదు సంవత్సరాలు కాగా.. నెల అద్దె రూ. 5.4 కోట్ల చొప్పున చెల్లిస్తుంది. ఇది 2025 జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ స్టాక్ వెల్లడించింది. ఈ ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా టెక్ దిగ్గజం రూ.92.94 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.లీజు పత్రాల ప్రకారం.. మొత్తం చెల్లింపు చదరపు అడుగుకు రూ.67 బేస్ అద్దెతో పాటు.. నిర్వహణ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు, మూలధన ఖర్చులు, నిర్వహణ రుసుములు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది అద్దె 4.8 శాతం పెరుగుతుంది. కాగా కంపెనీ ఐదేళ్ల కాలానికి రూ.42.15 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది.ఇదీ చదవండి: భారత్లో మొదటి ఆఫీస్: ఓపెన్ఏఐలో జాబ్స్హైదరాబాద్లో ఇతర భారీ ఆఫీస్ డీల్స్హైదరాబాద్లోని ఇతర భారీ డీల్స్ విషయానికి వస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024లో 10.18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీని అద్దె నెలకు రూ. 4.3 కోట్లుగా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 2024లో, ఫేస్బుక్ తన హైదరాబాద్ ఆఫీస్ స్థలం కోసం లీజును రెన్యువల్ చేసింది. ఇది మొత్తం 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని అద్దె నెలకు రూ.2.8 కోట్లు. -
భారత్లో మొదటి ఆఫీస్: ఓపెన్ఏఐలో జాబ్స్
ఓపెన్ఏఐ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించడంలో భాగంగా.. భారతదేశంలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పుడు జాబ్స్ కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మూడు ఉద్యోగాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.ఓపెన్ఏఐలో జాబ్స్అకౌంట్ డైరెక్టర్, డిజిటల్ నేటివ్స్అకౌంట్ డైరెక్టర్, లార్జ్ ఎంటర్ప్రైస్అకౌంట్ డైరెక్టర్, స్ట్రాటజీస్ఈ ఉద్యోగాలు ఢిల్లీ, ముంబై లేదా బెంగళూరులో ఉండవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఓపెన్ఏఐ కెరీర్ పేజీలో అప్లై చేసుకోవచ్చు.మా మొదటి ఆఫీస్ ప్రారభించడం, దీనికోసం స్థానికంగా ఒక టీమ్ ఏర్పాటు చేసుకోవడం అనేది.. లేటెస్ట్ ఏఐను మరింత అందుబాటులోకి తీసుకురావడం. భారతదేశంలో ఏఐను నిర్మించడానికి మా నిబద్దతతో మొదటి అడుగు అని.. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా.. సెప్టెంబర్లో భారతదేశాన్ని సందర్శించడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని అన్నారు.ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తాభారతదేశంలో ఆఫీస్ ప్రారభించడం అనేది.. ప్రభుత్వ ఇండియాఏఐ మిషన్కు ఓపెన్ఏఐ మద్దతులో భాగం. కంపెనీ ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, విద్యావేత్తలు, డెవలపర్లు, నిపుణులకు మెరుగైన సేవలందించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ప్రారంభించి మరింత అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ సిద్ధమైంది. -
ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు క్యాష్లెస్ సేవలు బంద్
నగదు రహిత పాలసీపై బీమా కంపెనీలు, ఆస్పత్రుల మధ్య వివాదం పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా ఆసుపత్రులు రెండు బీమా కంపెనీల క్యాష్లెస్ ట్రీట్మెంట్ సదుపాయాన్ని సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో బజాజ్ అలియాంజ్, కేర్ హెల్త్ ఉన్నాయి.ఆస్పత్రుల సంస్థ అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీఐ) ఈ విషయాన్ని వెల్లడించింది. చికిత్స వ్యయం నిరంతరం పెరుగుతోందని, కానీ సంబంధిత బీమా కంపెనీలు చికిత్స ఖర్చుల రేట్లు (పరిమితులు) మాత్రం పెంచడం లేదని, ఏహెచ్పీఐ చెబుతోంది.అంతే కాకుండా ఆయా కంపెనీలు చెల్లింపుల్లో జాప్యం చేస్తూ అనవసరమైన పత్రాలు అడుగుతున్నాయని ఆస్పత్రుల వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పాలసీ సంబంధిత చెల్లింపుల్లో అనేక సమస్యలు తలెత్తడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.ఏహెచ్పీఐ పిలుపు మేరకు సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా 15 వేల ఆసుపత్రులు నగదు రహిత చికిత్స అందించేందుకు నిరాకరించాయి. మరోవైపు రోగుల నగదు రహిత బిల్లు చెల్లింపునకు సంబంధించిన సమస్యలపై చర్చించాలని కేర్ హెల్త్ కు ఏహెచ్ పీఐ నోటీసులు జారీ చేసింది. లేదంటే సెప్టెంబర్ 1 నుంచి నగదు రహిత వైద్యం పూర్తిగా నిలిచిపోతుంది.వివాదానికి ప్రధాన కారణంబజాజ్ అలియాంజ్ పాత కాంట్రాక్ట్ రేట్లను పెంచడానికి నిరాకరించిందని ఆస్పత్రులు ఆరోపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం, చికిత్స ఖర్చుల రేట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. కానీ కంపెనీ దీనికి సిద్ధంగా లేదు. దీనికి భిన్నంగా ఎలాంటి కారణం చెప్పకుండా రోగిని అడ్మిట్ చేసుకున్నప్పుడు మందులు, పరీక్షలు, హాస్పిటల్ రూమ్ ఛార్జీలను తగ్గించడం ప్రారంభించింది.అంతేకాకుండా రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత తుది బిల్లును ఆమోదించే సమయాన్ని కూడా పెంచడంతో రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తోంది. అయితే ఈ ఆరోపణలపై రెండు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆస్పత్రుల్లో క్యాష్లెస్ సేవలు నిలిచిపోతే ఈ సంస్థల నుండి ఆరోగ్య బీమా తీసుకున్న రోగులు ఆసుపత్రి బిల్లును స్వయంగా తమ జేబుల నుంచి చెల్లించి ఆ తర్వాత బీమా కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.రెండు కంపెనీలు ఎలాంటి కారణం లేకుండా చికిత్స ఖర్చులకు సంబంధించిన బిల్లులను తగ్గిస్తున్నాయని ఏహెచ్పీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ గ్యానీ తెలిపారు. రోగిని డిశ్చార్జ్ చేసిన ఆరు నుంచి ఏడు గంటల తర్వాత బిల్లు ఆమోదిస్తున్నారని పేర్కొన్నారు. చర్చల కోసం ఇరు బీమా కంపెనీలకు తమ వైపు నుంచి ఈమెయిల్ పంపామని, అంశంపై బుధవారం కేర్ హెల్త్, గురువారం బజాజ్ అలియాంజ్ ప్రతినిధులతో సమావేశం కానున్నట్లు చెప్పారు. పరిష్కారం లభించకపోతే నగదు రహిత సదుపాయాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. -
ఇన్స్టాలో స్క్రోల్ చేసేవారికి జాబ్!
ఎక్కడైనా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలంటే రాత పరీక్షలు & ఇంటర్వ్యూలు వంటివి ఉంటాయి. కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఎక్కువ సమయం గడిపే వాళ్ళకే ఉద్యోగం అంటూ.. మాంక్ ఎంటర్టైన్మెంట్ కో ఫౌండర్, సీఈఓ 'విరాజ్ శేత్' పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.విరాజ్ శేత్ ఇటీవలి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో "డూమ్-స్క్రోలర్" కోసం, అంటే సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపే వ్యక్తి కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థి రోజుకు కనీసం ఆరు గంటలు ఇన్స్టా, యూట్యూబ్లో స్క్రోలింగ్ చేస్తుండాలి. (డూమ్-స్క్రోలర్లు అంటే.. ఫోన్ స్క్రీన్ స్కోల్ చేస్తూ ఉండేవారు).నైపుణ్యాల విషయానికి వస్తే.. హిందీ, ఇంగ్లీష్ భాషలలో పట్టు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై మంచి పట్టును కలిగి ఉండాలి. క్రియేటర్ కల్చర్ మీద ఆసక్తి ఉండాలని విరాజ్ శేత్ వెల్లడించారు. ఎక్సెల్ ఉపయోగించడం కూడా బాగా తెలుసుండాలని చెప్పారు. ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం ముంబై అని, ఇది ఫుల్ టైమ్ జాబ్ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తాప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్స్టాలో ఎక్కువ టైమ్ కేటాయించేవారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయా అంటూ కొందరు ఆశ్చర్య పోతున్నారు. సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం చెడు వ్యసనం కాదని మా అమ్మతో చెబుతాను, అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు నేను 19 గంటలు సమయం కేటాయిస్తాను, ఇది సరిపోతుందా అని అన్నారు. -
భారత్లో క్యాన్సర్ ఔషధాలు ప్రారంభించిన జీఎస్కే
భారతదేశంలో తన ఆంకాలజీ ఔషధాలను ప్రారంభిస్తున్నట్లు జీఎస్కే కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారతీయ మహిళల్లో పెరుగుతున్న ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్లను పరిష్కరించడానికి జెంపెర్లి (డోస్టార్లిమాబ్), జెజులా (నిరాపారిబ్)లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది.జెంపెర్లి.. ఇమ్యునోథెరపీడీఎంఎంఆర్ / ఎంఎస్ఐ-హెచ్ అధునాతన ఎండోమెట్రియల్ క్యాన్సర్ చికిత్స కోసం భారతదేశంలో మొదటగా ఆమోదించబడిన పీడీ-1 ఇమ్యునోథెరపీగా గుర్తించబడింది. ఇది గార్నెట్ ట్రయల్ ఆధారంగా 45.5% ప్రతిస్పందన రేటు నమోదు చేసింది. 24 నెలల వరకు స్థిరమైన ప్రయోజనాలను చూపించినట్లు కంపెనీ తెలిపింది. ఇది క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.జెజులా.. అండాశయ క్యాన్సర్ ఔషధంఇది బయోమార్కర్ విధానాల్లో మోనోథెరపీ నిర్వహణ కోసం భారతదేశంలో ఆమోదించబడిన ఏకైక రోజువారీ పీఏఆర్పీ ఇన్హిబిటర్ చికిత్స. అధిక-ప్రమాదం ఉన్న రోగుల్లో ఉపశమనాన్ని అందించడానికి ప్రైమా ట్రయల్లో మెరుగైన ఫలితాలు అందించింది.ఇదీ చదవండి: యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?2045 నాటికి భారతదేశంలో ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ కేసులు వరుసగా 78%, 69% పెరుగుతాయని అంచనా. మహిళల క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన రోగులకు జీఎస్కే అందిస్తున్న చికిత్సలు ఎంతో తోడ్పడుతాయని కంపెనీ పేర్కొంది. రోగులకు సహాయం అందించేందుకు జీఎస్కే ‘ఫీనిక్స్’ అనే పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. భారత్లో ఈ చికిత్సలు కీలకంగా మారుతాయని జీఎస్కే ఇండియా ఎండీ భూషణ్ అక్షికర్ అన్నారు. జెంపెర్లి, జెజులా గైనకాలజికల్ క్యాన్సర్ చికిత్సకు ఎంతో తోడ్పడుతాయని చెప్పారు. -
టీసీఎస్ లేఆఫ్స్.. కార్మిక సంఘాలు నిరసన
భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత నెలలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఉద్యోగులు, ఇతర కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కంపెనీ తీసుకున్న నిర్ణయంపై సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) మద్దతుతో యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ (యూఐటీఈ) ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి.టీసీఎస్ కంపెనీ మిడ్ లెవల్, సీనియర్ ప్రొఫెషనల్స్ను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ లేఆఫ్స్ కంపెనీ అవసరానికి బదులు లాభాపేక్షతోనే జరుగుతున్నట్లు యూఐటీఈ చెబుతోంది. సీనియర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అక్రమ తొలగింపులను ప్రోత్సహించడం ఉద్యోగ భద్రతపై దాడిగా అభివర్ణిస్తుంది. ఈమేరకు చెన్నైలోని టీసీఎస్ కార్యాలయం ముందు ఉద్యోగులు, కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన చేశాయి. ఉద్యోగాల తొలగింపును ఆపడానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి.ఇదీ చదవండి: జీవిత బీమాపై ఈ అపోహలొద్దు..టీసీఎస్ ఈ లేఆఫ్స్ వ్యవహారంపై స్పందిస్తూ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రయాణంలో భాగంగా కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు తప్పవని చెప్పింది. ఇది కంపెనీలోని శ్రామిక శక్తిలో సుమారు 2 శాతం మందిని ప్రభావితం చేస్తుంది. క్లయింట్ల సర్వీస్ డెలివరీపై ఎలాంటి ప్రభావం పడకుండా చూసుకోవడానికి తగిన జాగ్రత్తలు వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సంస్థను వీడుతున్న ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు, అవుట్ ప్లేస్మెంట్, కౌన్సిలింగ్, సపోర్ట్ అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. -
రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఈ చిన్న రూల్తో జాగ్రత్త!
పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. అప్పుడే అందరూ ప్రయాణాలు ప్లాన్ చేసుకునే పనిలో ఉంటారు. ఎక్కువ మంది రైలు ప్రయాణాలను ఎంచుకుంటారు. ఇందులో టికెట్ బుకింగ్ అనేది మొదటి పని. అయితే ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసేటప్పుడు తమ బోర్డింగ్, డెస్టినేషన్ పాయింట్లను నమోదు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా మంది ప్రయాణికులు తాము రైలు ఎక్కే స్టేషన్ను పొరపాటుగా నమోదు చేస్తుంటారు. అలాంటి వారు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాల్సి ఉంటుంది.ఉదాహరణకు, గోదావరి ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు వెళ్లాలనుకునే ప్రయాణికులు అనుకోకుండా హైదరాబాద్ దక్కన్కి బదులుగా సికింద్రాబాద్ నుండి ప్రయాణాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో హైదరాబాద్ దక్కన్ స్టేషన్ నుంచి రైలు ఎక్కేందుకు ప్రయాణికులను అనుమతించకపోవచ్చు.బోర్డింగ్ స్టేషన్ రూల్స్ మార్పుభారతీయ రైల్వే ప్రకారం, ప్రయాణికులు ఏదైనా మార్పులు చేయడానికి ముందు బోర్డింగ్ స్టేషన్ మార్పులకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవాలి.రైలు బయలుదేరిన 24 గంటల్లో బోర్డింగ్ స్టేషన్ మారితే, సాధారణ పరిస్థితుల్లో రీఫండ్ అనుమతించరు. అయితే, రైలు రద్దు, కోచ్ అటాచ్ చేయకపోవడం, రైలును మూడు గంటలకు మించి ఆలస్యంగా నడపడం వంటి అసాధారణ పరిస్థితుల్లో సాధారణ రీఫండ్ నిబంధనలు వర్తిస్తాయి.ప్రయాణికులు బోర్డింగ్ స్టేషన్ను మార్చినట్లయితే, వారు అసలు బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు ఎక్కే అన్ని హక్కులను కోల్పోతారు. ప్రయాణానికి సరైన అధికారం లేకుండా ప్రయాణిస్తే ఒరిజినల్ బోర్డింగ్ స్టేషన్ నుంచి మారిన బోర్డింగ్ స్టేషన్ వరకు ప్రయాణికులు పెనాల్టీతో పాటు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.ఒకసారి టికెట్ సీజ్ చేస్తే బోర్డింగ్ స్టేషన్ మార్పును అనుమతించరు.వికల్ప్ ఆప్షన్ ఉన్న పీఎన్ఆర్కు బోర్డింగ్ స్టేషన్ మార్పునుకు అవకాశం ఉండదు.ఐ-టికెట్కు ఆన్ లైన్ బోర్డింగ్ స్టేషన్ మార్పు ఉండదు.కరెంట్ బుకింగ్ టికెట్కు బోర్డింగ్ స్టేషన్ మార్పు వీలు కాదు.బుకింగ్ సమయంలో బోర్డింగ్ స్టేషన్ను ఇదివరకే మార్చినట్లయితే, "బుక్డ్ టికెట్ హిస్టరీ" విభాగానికి వెళ్లి మరొకసారి బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవచ్చు. -
అమెరికాలో ఇండియా సరుకులు.. చుక్కలు చూపిస్తున్నాయ్..
అమెరికాలో భారతీయ తినుబండారాలు, నిత్యావసర సరుకుల ధరలు అక్కడి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్లో తక్కువ ధరకు లభించే అవే వస్తువులు అమెరికాలో పదుల రెట్లు అధికంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఓ స్టోర్లో ఏ వస్తువుల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తూ ఓ భారతీయ యువకుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అమెరికాలోని డల్లాస్లో ఉన్న ఓ వాల్మార్ట్ స్టోర్లో అందుబాటులో ఉన్న భారతీయ ఆహార ఉత్పత్తులను, వాటి ధరలను చూపిస్తూ రజత్ అనే ఓ భారతీయుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. రాయల్ లెంటిల్స్, హల్దీరామ్ స్నాక్స్, పార్లే బిస్కెట్లు, వివిధ మసాలా దినుసులు, సాస్లు వంటి ప్రసిద్ధ వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో రజత్ వివరించారు.డల్లాస్లో భారతీయులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. అందుకే ఆ స్టోర్లో భారతీయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుతారని రజత్ చెప్పారు. పప్పు, నామ్కీన్, బిస్కెట్ల వంటి వస్తువుల ధరలు 4 డాలర్ల నుండి 4.5 డాలర్ల వరకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ వీడియో చూసిన యూజర్లు వస్తువుల ధరలు చూసి నోరెళ్లబెట్టారు. ఇండియాలో వాటి ధరలు.. అమెరికాలోని ఆ స్టోర్లో వాటి రేట్లు తెలుసుకుని వామ్మో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. ఓ యూజరైతే ‘హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు 4 డాలర్లా? అంటే రూ.320. అది ఇండియాలో రూ.20 లకే వస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Rajat and Shilpa (@ouramericandream.vlogs) -
అనిల్ అంబానీ ‘డబుల్ ఫ్రాడ్’! మీద పడిన మరో బ్యాంక్
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని చిక్కులు వెంటాడుతున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను "ఫ్రాడ్"గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించిన కొన్ని రోజులకే తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా ప్రమోటర్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించింది.రుణాలను దారి మళ్లించారని, మంజూరు నిబంధనలను ఉల్లంఘించారని, అంబానీతో పాటు కంపెనీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల పేర్లను తన నోటీసులో పేర్కొన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో బ్యాంక్ పేర్కొంది. కాగా 2025 ఆగస్టు 22న ప్రభుత్వ రంగ సంస్థ బీఓఐ నుంచి తమకు లేఖ అందిందని ఆర్కామ్ అదే రోజున తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, అనిల్ ధీరూభాయ్ అంబానీ, మంజరి ఆషిక్ కక్కర్ ల రుణ ఖాతాలను రూ .724.78 కోట్లకు మోసంగా ట్యాగ్ చేసినట్లు బ్యాంక్ తన నోటీసులో పేర్కొంది.తమ అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం లిమిటెడ్ (ఆర్టీఎల్)కు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లేఖ వచ్చిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఫైలింగ్లో వెల్లడించింది. దీని ప్రకారం.. ఆర్టీఎల్, గ్రేస్ థామస్ (ఆర్టీఎల్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత కంపెనీ డైరెక్టర్), మరికొందరి రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా వర్గీకరించాలని బ్యాంక్ నిర్ణయించింది.బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. ఒక రుణ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించిన తర్వాత, క్రిమినల్ చర్యల కోసం దానిని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపాలి. రుణగ్రహీత వచ్చే ఐదేళ్ల వరకు బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థల నుండి కొత్త రుణాలు తీసుకోకుండా నిషేధం ఉంటుంది.ఇప్పటికే ఎస్బీఐ..రుణ నిబంధనలను ఉల్లంఘించి ఆర్ కామ్ బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ గత జూన్ లో స్టేట్ ఎస్బీఐ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు ఆర్కామ్కు సంబంధించిన కార్యాలయాలతో పాటు అనిల్ అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీ అక్రమాలకు పాల్పడ్డారని, రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని ఎస్బీఐ పేర్కొనడంతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ ధృవీకరించింది. అయితే ఈ ఆరోపణలను అనిల్ అంబానీ తన ప్రతినిధి ద్వారా ఖండించారు.ఇదీ చదవండి: అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు! -
పదేళ్లలో వేలకొద్దీ కిలోల బంగారం సీజ్.. ఆర్థిక శాఖ లెక్కలు చూస్తే..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గత పదేళ్లలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. 2015–16 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772.34 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.ఇందుకు సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అత్యధికంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం.. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 వరకు దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్న కేసుల సంఖ్య 35,888కి చేరింది. మొత్తం 31,772.34 కిలోల బంగారం సీజ్ చేశారు. 2015–16లో 2,815 కేసులు నమోదు కాగా, 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016–17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గినా, 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017–18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2018–19లో కేసులు 5,092కి పెరిగి, 4,292.29 కిలోల బంగారం సీజ్ చేశారు.2019–20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2020–21లో కేసుల సంఖ్య 2,034కి తగ్గి, 1,944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021–22లో 2,236 కేసులతో 2,172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2022–23లో కేసులు 4,619కి పెరిగి, 4,342.85 కిలోల బంగారం సీజ్ చేశారు. అత్యధికంగా 2023–24లో 6,599 కేసులు నమోదు కాగా, 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024–25లో కేసుల సంఖ్య 3,005గా ఉండగా, 2,600.40 కిలోల బంగారం స్వాధీనం చేశారు.ఈ గణాంకాలు చూస్తే, కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, బంగారం స్వాధీనం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. ఇది అక్రమ రవాణా మార్గాల్లో మార్పులు, తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్ వాటా విక్రయం.. కొత్త అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) ముగిసేలోగా ఐడీబీఐ బ్యాంక్లో వాటా విక్రయాన్ని పూర్తి చేసే వీలున్నట్లు దీపమ్ కార్యదర్శి అర్నుష్ చావ్లా పేర్కొన్నారు. అర్హతగల బిడ్డర్లు సాధ్యాసాధ్యాల పరిశీలనను దాదాపు పూర్తిచేసిన నేపథ్యంలో తాజా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా చావ్లా విలేకరులతో ఈ అంశాలను ప్రస్తావించారు.ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్లు సమీకరించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే రూ. 20,000 కోట్లు సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. అర్హతకలిగి ఆసక్తి ప్రదర్శించిన పార్టీలు ఇప్పటికే బ్యాంక్పై ఒక అవగాహనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ప్రశ్నలకూ జవాబులు సైతం లభించినట్లు తెలియజేశారు. బ్యాంక్కు సంబంధించిన అన్ని గణాంకాలు లేదా వివరాలను సమగ్రంగా అందించినట్లు తెలియజేశారు.ఐడీబీఐ బ్యాంక్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీకి 95 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా దీనిలో 60.72 శాతం వాటాను ఎల్ఐసీ విక్రయించనుంది. ఇక ఎల్ఐసీలో కొంతమేర ప్రభుత్వ వాటా విక్రయ అంశంపై దీపమ్తోపాటు.. మర్చంట్ బ్యాంకర్లు, ఎల్ఐసీ ఉమ్మడిగా అంతర్మంత్రిత్వ గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
బయోఫార్మా రంగంలో భారత్: 2030 నాటికి..
అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలకు సంబంధించి అత్యంత వేగంగా ఎదుగుతున్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రెసిడెంట్ టోనీ యాక్సియారిటో తెలిపారు. దేశీయంగా 2024లో 8.1 బిలియన్ డాలర్లుగా ఉన్న బయోఫార్మా రంగం 2030 నాటికి 15.9 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందనుందని బయోఫార్మా సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.ఈ నేపథ్యంలో తాము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్లోని జీనోమ్ వేలీలో తలపెట్టిన బయోప్రాసెస్ డిజైన్ సెంటర్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఈ ఏడాది ఆఖరు నాటికి అందుబాటులోకి వస్తాయని టోనీ చెప్పారు. భారత బయోఫార్మా పరిశ్రమ ప్రస్తుతం అధునాతన టెక్నాలజీలు, నిపుణులపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఇవి తోడ్పడగలవని ఆయన వివరించారు. -
పండుగ సీజన్.. అమెజాన్లో 1.5 లక్షల ఉద్యోగాలు
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, దీపావళి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఏకంగా 1.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను ప్రకటించింది. పండుగ సీజన్లో తమ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఈ భారీ నియామకాలను చేపడుతోంది.ఢిల్లీ, ముంబై వంటి మెట్రోల నగరాలూ.. రాంచీ, కోయంబత్తూర్ వంటి చిన్న పట్టణాల వరకు సుమారు 400 కంటే ఎక్కువ నగరాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇందులో వేలాదిమంది మహిళలకు, 2000 కంటే కంటే ఎక్కువ దివ్యాంగులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం.అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సార్టింగ్ సెంటర్లు.. భారతదేశం అంతటా లాస్ట్ మైల్ డెలివరీ నెట్వర్క్లలో ప్రత్యక్ష & పరోక్ష ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇండియా స్పష్టం చేసింది. గత కొన్ని నెలలుగా, అమెజాన్ భారతదేశంలోని తన కార్యకలాపాల నెట్వర్క్లో రూ. 2000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా టైర్-2, టైర్-3 నగరాల్లో ఐదు కొత్త ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, 30 కొత్త డెలివరీ స్టేషన్లను ప్రారంభించింది.ఇదీ చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంక్స్ -
బంగారం విలువపై 90 శాతం లోన్
ప్రైవేటు రంగంలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ ‘ఎస్ఐబీ గోల్డ్ ఎక్స్ప్రెస్’ పేరుతో కొత్త బంగారం రుణ పథకాన్ని ప్రారంభించింది. బంగారం విలువపై 90% వరకు రుణాన్ని ఈ పథకం కింద పొందొచ్చు. రూ.25,000 నుంచి రూ.25 లక్షల వరకు రుణం, గరిష్టంగా మూడేళ్ల కాలానికి తీసుకోవచ్చు.ఎంఎస్ఎంఈలు, నాన్ ఎంఎస్ఎంఈలు, చిన్న సంస్థలు తమ వ్యా పార విస్తరణ, మూలధన అవసరాల కోసం రుణాలు తీసుకోవచ్చని సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఎలాంటి రహస్య చార్జీల్లేకుండా, పారదర్శకంగా ఈ రుణ పథకం ఉంటుందని తెలిపింది. మొత్తం ప్రక్రియ డిజిటల్గా పూర్తవుతుందని, మొదటిసారి రుణం తీసుకునే వారు కూడా అర్హులేనని పేర్కొంది.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా.. -
మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్?: ఎలాన్ మస్క్ ప్లాన్ ఇదేనా..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎప్పుడూ.. కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు తాజాగా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే 'మాక్రోహార్డ్' (Macrohard) పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎక్స్ఏఐ(xAI)లో చేరి.. మాక్రోహార్డ్ అనే పూర్తిగా ఏఐ సాఫ్ట్వేర్ కంపెనీని నిర్మించడంలో సహాయం చేయండి. ఇది సాధారణ పేరు, కానీ ఈ ప్రాజెక్ట్ వాస్తవమైనది. మైక్రోసాఫ్ట్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు స్వయంగా ఎటువంటి ఫిజికల్ హార్డ్వేర్ను తయారు చేయలేదు. కానీ వాటిని పూర్తిగా ఏఐతో సృష్టించడం సాధ్యమవుతుంది'' అని మస్క్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఆగస్టు 1న యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్మార్క్ కార్యాలయంలో 'మాక్రోహార్డ్' పేటెంట్ కోసం మస్క్ xAI దాఖలు చేసింది. ఇది పూర్తిగా ఏఐ ద్వారానే పనిచేస్తుంది. ఇందులో కృత్రిమ మేధస్సును ఉపయోగించి వీడియో గేమ్లను రూపొందించడం, కోడింగ్, రన్నింగ్, గేమ్స్ కోసం డౌన్లోడ్ చేయగల కంప్యూటర్ సాఫ్ట్వేర్ మొదలైనవి ఉన్నాయి.గత నెలలో Xలో ఒక పోస్ట్లో.. ''xAI లేటెస్ట్ AI సాఫ్ట్వేర్ కంపెనీ, వందలాది ప్రత్యేక కోడింగ్ మరియు ఇమేజ్ / వీడియో జనరేషన్ /అండర్స్టాండింగ్ ఏజెంట్లు అన్నీ కలిసి పనిచేస్తాయి. ఫలితం అద్భుతంగా వచ్చే వరకు వర్చువల్ మెషీన్లలో సాఫ్ట్వేర్తో పరస్పర చర్య చేసే మానవులను అనుకరిస్తాయి" అని మస్క్ అన్నారుఇదీ చదవండి: కొత్త కారు కొనే ప్లాన్ ఉందా?: భవిష్యత్తుకు ఎలాంటి మోడల్ బెస్ట్గత కొన్ని సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ సంస్థను మస్క్ సందర్భం వచ్చినప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ను నాశనం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్కు పోటీగా మాక్రోహార్డ్ తీసుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది.Join @xAI and help build a purely AI software company called Macrohard. It’s a tongue-in-cheek name, but the project is very real!In principle, given that software companies like Microsoft do not themselves manufacture any physical hardware, it should be possible to simulate…— Elon Musk (@elonmusk) August 22, 2025 -
భారత్ కీలక నిర్ణయం.. ఆ దేశానికి పోస్టల్ సేవలు బంద్
భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలాఖరులో అమల్లోకి రానున్న అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో మార్పులను ఉటంకిస్తూ ఆగస్టు 25 నుంచి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ తాజాగా ప్రకటించింది. అనేక వస్తువులపై సుంకం మినహాయింపును అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూలై 30న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నం.14324 ద్వారా 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు డ్యూటీ-ఫ్రీ మినహాయింపు తొలగించారు. ట్రంప్ ఇటీవల భారత్పై 25 శాతం సుంకం విధించడంతో పాటు రష్యా చమురు కొనుగోలుకు అదనంగా 25 శాతం జరిమానా విధించడంతో మొత్తం టారిఫ్ భారం 50 శాతానికి పెరిగింది. ఈ పరిణామాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి పోస్టల్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.ఆగస్టు 29 నుంచి అమెరికాకు తరలించే అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు వాటి విలువతో సంబంధం లేకుండా, దేశ-నిర్దిష్ట అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం (ఐఈఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయని తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే 100 డాలర్ల వరకు విలువైన గిఫ్ట్ ఐటమ్స్ కు మాత్రం మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది.ఎయిర్ క్యారియర్లు తమకు అవసరమైన విధానాలు లేకపోవడంతో ఆగస్టు 25 తర్వాత పార్సిళ్లు తీసుకోలేమని భారత అధికారులకు తెలియజేశారు. దీంతో భారత పోస్టల్ శాఖ ఇప్పుడు లెటర్లు/డాక్యుమెంట్లు, 100 డాలర్ల వరకూ విలువైన గిఫ్ట్ ఐటెమ్స్ మాత్రమే స్వీకరిస్తుంది. ఇప్పటికే బుక్ చేసిన బట్వాడాకు వీలులేని వస్తువులకు రిఫండ్ పొందవచ్చని పోస్టల్ శాఖ తెలియజేసింది. -
మొన్న ఈడీ.. నేడు సీబీఐ: చిక్కుల్లో అనిల్ అంబానీ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించిన.. బ్యాంకు మోసం కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM), దాని ప్రమోటర్ డైరెక్టర్ 'అనిల్ అంబానీ'కి సంబంధించిన స్థలాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) శనివారం దాడులు నిర్వహించింది. ముంబైలోని ఆర్కామ్తో సహా ఆయనకు సంబంధం ఉన్న ఆరు ప్రదేశాలలో ఈ సోదాలు జరిగాయి.బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి?.. రుణాలు మళ్లించబడ్డాయో, లేదో నిర్ధారించడానికి కీలకమైన పత్రాలు, డిజిటల్ ఆధారాలను సేకరించడం కోసం సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఎస్బీఐకి రూ. 2,000 కోట్లకు పైగా నష్టం కలిగించినందుకు ఆర్కామ్పై కూడా ఏజెన్సీ కేసు నమోదు చేసింది.అనీల్ అంబానీ, ఆర్కామ్ మోసానికి పాల్పడినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ 13న ప్రకటించింది. జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు ఒక నివేదికను పంపింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఒక బ్యాంకు ఒక ఖాతాను మోసపూరితంగా వర్గీకరించిన తరువాత.. ఆ విషయాన్ని రుణదాత 21 రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలియజేయాలి.ఆర్కామ్లో ఎస్బీఐ క్రెడిట్ ఎక్స్పోజర్లో ఆగస్టు 26, 2016 నుంచి అమలులోకి వచ్చే వడ్డీ, ఖర్చులతో పాటు రూ. 786.52 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారెంటీతో పాటు.. రూ. 2,227.64 కోట్ల ఫండ్ బేస్డ్ ప్రిన్సిపల్ బకాయిలు ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత నెలలో లోక్సభకు తెలిపారు. కాగా ఇప్పటికే అనిల్ అంబానీ కంపెనీలపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు నిర్వహించింది.ఇదీ చదవండి: ఎవరూ తప్పించుకోలేరు.. ఏకంగా 8 కోట్ల ట్రాఫిక్ చలాన్లు! -
‘పశు వ్యవసాయ రంగంలో వ్యూహాత్మక విధానాలు అవసరం’
భారత పశు వ్యవసాయ రంగాన్ని పరిరక్షించడానికి వ్యూహాత్మక విధానాలు అవసరమని కాంపౌండ్ లైవ్స్టాక్ ఫీడ్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎల్ఎఫ్ఎంఏ) ఛైర్మన్ డాక్టర్ దివ్యకుమార్ గులాటీ అన్నారు. సీఎల్ఎఫ్ఎంఏ 58వ వార్షిక సాధారణ సమావేశం, 66వ జాతీయ సింపోజియం హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.‘ప్రస్తుత ఆహారోత్పత్తి ఖర్చుతో మొక్కజొన్న పంటలో సుస్థిరత సాధ్యం కాదు. దిగుబడి పెంచేందుకు చేసే ఫీడ్ ఫార్ములేషన్లు నియంత్రణ, నిబంధనలకు కట్టుబడి ఉంటాయి. ఉన్న పంటలో ఉత్పాదకతను పెంచడానికి ప్రభుత్వ మద్దతుతో ఆర్ అండ్ డీ, మౌలిక సదుపాయాల నవీకరణలు అవసరం. రైతు కేంద్రీకృత విధానాలు రూపొందించాలి. ఈ మేరకు చర్యలు తీసుకోకపోతే దాణాకు సంబంధించి భారత్ నికర దిగుమతిదారుగా మారే ప్రమాదం ఉంది’ అని గులాటీ తెలిపారు.పశుపోషణ వ్యవసాయ జీడీపీలో దాదాపు మూడింట ఒక వంతు దోహదం చేస్తుంది. పౌల్ట్రీ, డెయిరీ, ఆక్వాకల్చర్ రైతుల సమ్మిళిత ప్రాతినిధ్యాన్ని సీఎల్ఎఫ్ఎంఏ పిలుపునిచ్చింది. పశువుల కోసం ఎగుమతి ఆధారిత జోన్లు ఏర్పాటు చేయాలని సమావేశంలో చర్చించారు. భారతదేశం ఏటా 60 మిలియన్ మెట్రిక్ టన్నుల జంతు దాణాను ఉత్పత్తి చేస్తుంది. పౌల్ట్రీ ఫీడ్ మాత్రమే 22 మిలియన్ మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను వినియోగిస్తుంది. ఇది జాతీయ మొక్కజొన్న ఉత్పత్తిలో 50% కంటే ఎక్కువ. పెరుగుతున్న ఇథనాల్ అవసరాలు మొక్కజొన్నను దాణాకు దూరం చేస్తోంది. ఇది కోళ్ల మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది. పౌల్ట్రీలో 8-10% వార్షిక పెరుగుదలతో దాణా కొరత దిగుమతి అధికమవుతోంది. ఇది ధరల అస్థిరతకు దారితీస్తుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి, బయోసెక్యూరిటీ ప్రమాదాలు సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలుగా ఉన్నాయి.ఇదీ చదవండి: ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్! -
రూ.1 లక్షతో రూ.100 కోట్లు సంపాదించిన నటుడు.. ఎలాగంటే..
బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్ దంపతులు 15 సంవత్సరాల్లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఏకంగా రూ.100 కోట్ల కార్పస్ను క్రియేట్ చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. పెట్టుబడి పెట్టేందుకు చాలామందే ఆసక్తి చూపిస్తారు. కానీ సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని వీరు నిరూపించారు. వ్యాపార చతురతతో జాకీష్రాఫ్ గతంలో తీసుకున్న ఒక్క నిర్ణయంతో పెద్ద మొత్తంలో కార్పస్ జనరేట్ అయింది. అసలు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారు.. ఎలా అంతమొత్తంలో సంపద సృష్టించారో తెలుసుకుందాం.1995లో భారత్ తీసుకున్న ఆర్థిక సరళీకృత నిర్ణయాలవల్ల చాలా అంతర్జాతీయ కంపెనీలు దేశంలోకి ప్రవేశించాయి. అందులో భాగంగా సోనీ ఎంటర్టైన్మెంట్ కూడా తన టీవీ ఛానెల్ను భారతదేశంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో జాకీష్రాఫ్, అయేషా ష్రాఫ్తో కలిసి ఏడుగురు సభ్యుల బృందంతో కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు వ్యూహాత్మక భాగస్వాములుగా మారారు. కొత్త కంపెనీ కదా ఇందులో పెట్టుబడి పెడితే రాబడి ఎలా ఉంటుందోననే అనుమానాలకు తావు లేకుండా తాము నమ్మిన వ్యాపారానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ సమయంలో టెలివిజన్ బిజినెస్కు ప్రజలు ఆసక్తి చూపుతారనే స్ట్రాటజీతో ముందుకెళ్లారు. క్రమంగా కంపెనీ ఎదిగి తాము అప్పట్లో ఇన్వెస్ట్ చేసిన రూ.1లక్ష 15 ఏళ్ల తర్వాత రూ.100 కోట్లు అయినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలుఎందులో పెట్టుబడి పెట్టినా సరైన టైమింగ్, ఇన్వెస్ట్ చేసే వ్యాపారంపై నమ్మకం, స్ట్రాటజీ ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని గమనించాలి. -
లార్డ్ స్వరాజ్పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్లో అత్యంత సంపన్న ఏషియన్గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో నిపుణుల కొరత
బీఎఫ్ఎస్ఐ రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) వేగంగా విస్తరిస్తుండడంతో నిపుణులకు తీవ్ర కొరత నెలకొన్నట్టు క్వెస్కార్ప్ తెలిపింది. అంతేకాదు, నైపుణ్యాల్లో అంతరంతోపాటు మానవ వనరులపై అధిక వ్యయాలు చేయాల్సి వస్తున్నట్టు తెలిపింది. భారత్లో బీఎఫ్ఎస్ఐ జీసీసీల విలువ 2023లో 40–41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2032 నాటికి 125–135 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) డేటా నిపుణులకు కొరత ఉందని.. నైపుణ్యాల్లోనూ 42 శాతం మేర అంతరం ఉన్నట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు మానవ వనరుల పరంగా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశీయంగా బీఎఫ్ఎస్ఐ రంగానికి సంబంధించి 190 జీసీసీలు ఉండగా, ఇవి 5,40,000 మందికి ఉపాధి కలి్పస్తున్నట్టు వెల్లడించింది. కేవలం బ్యాంక్ ఆఫీస్లుగా కాకుండా, ఆవిష్కరణలకు కేంద్రాలుగా జీసీసీలు మారినట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలు అధిక విలువ కలిగిన ఆవిష్కరణలకు కేంద్రాలుగా ఉన్నప్పటికీ.. టైర్–2 పట్టణాలు మెరుగైన వసతులు, తక్కువ వ్యయాలతో జీసీసీలకు ఆకర్షణీయంగా మారినట్టు పేర్కొంది. బీఎఫ్ఎస్ఐ జీసీసీ రంగం భవిష్యత్తు అన్నది.. అవి ఎంత వేగంగా ఆవిష్కరణలను అందించగలవన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది. -
బీఎఫ్ఎస్ఐలో 2.5 లక్షల కొత్త ఉద్యోగాలు
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ) సేవలకు డిమాండ్ బలంగా పెరుగుతోంది. దీంతో ఈ రంగంలోని కంపెనీలు మెట్రోలకే పరిమితం కాకుండా టైర్ 2, 3 పట్టణాల్లోనూ (ద్వితీయ, తృతీయ శ్రేణి) తమ సేవలను విస్తరిస్తున్నట్టు మానవ వనరుల సేవలు అందించే అడెకో ఇండియా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.7% మేర ఈ రంగం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2030 నాటికి ఈ రంగంలో 2.5 లక్షల కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాల్లో 48% టైర్ 2, 3 పట్టణాల్లోనే ఉంటున్నట్టు వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నియామకాలు 27 శాతం పెరిగినట్టు తెలిపింది. స్థానిక భాషపై పట్టు, అమ్మకాల్లో అనుభవం కలిగిన వారు ఇతరులతో పోల్చితే 2.5 రెట్లు అధికంగా ఎంపికయ్యే అవకాశాలు కలిగి ఉన్నట్టు.. 10–15% అధిక వేత నం వీరికి లభిస్తున్నట్టు వెల్లడించింది. గృహ పొదుపులు సంప్రదాయ సాధనాల నుంచి మార్కె ట్ ఆధారిత సాధనాలైన మ్యూచువల్ ఫండ్స్, యులి ప్లు, పెన్షన్ ఉత్పత్తుల వైపు మళ్లుతుండడం బీఎఫ్ఎస్ఐ సేవలకు డిమాండ్ను పెంచుతున్నట్టు తెలిపింది. ఈ రంగాల వారికి డిమాండ్.. బ్యాంక్లు సేల్స్, రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్లు, డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్లు, క్రెడిట్ రిస్క్ అనలిస్టుల నియామకాలను పెంచినట్టు అడెకో ఇండియా నివేదిక వెల్లడించింది. బీమా సంస్థలు, సంపద నిర్వహణ సంస్థలు ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, డిజిటల్ అండర్రైటర్లు, క్లెయిమ్స్ అటోమేషన్ స్పెషలిస్టుల నియామకాలకు ప్రాధాన్యం పెంచినట్టు తెలిపింది. ఇందోర్, కోయింబత్తూర్, నాగర్పూర్, గువహటిలో 15–18 శాతం, సూరత్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ పట్టణాల్లో నియామకాలు 11–13 శాతం పెరిగినట్టు పేర్కొంది. సేవలకు డిమాండ్ పెరుగుతుండడంతో 78 శాతం బీమా కంపెనీలు అదనపు నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించినట్టు తెలిపింది. ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడులపై అవగాహన అన్నది మెట్రోలకు వెలుపల కూడా విస్తరిస్తోందని.. దీంతో స్థానిక నిపుణులకు డిమాండ్ పెరుగుతున్నట్టు తెలిపింది. 100కు పైగా క్లయింట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా అడెకో ఇండియా ఈ వివరాలను విడుదల చేసింది. -
భారత్ – బ్రిటన్ మధ్య స్నేహ వారధి.. పాల్
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం స్వరాజ్ పాల్ పంజాబ్లోని జలంధర్లో 1931 ఫిబ్రవరి 18న జన్మించారు. ఆయన తండ్రి ప్యారేలాల్ స్థానికంగా చిన్నపాటి ఉక్కు ఫౌండ్రీని నడిపేవారు. స్వరాజ్ పాల్ 1949లో పంజాబ్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీలో (ఎంఐటీ) మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్ చేశారు. స్వదేశానికి తిరిగొచ్చాక కుటుంబ వ్యాపారమైన ఏపీజే సురేంద్ర గ్రూప్లో చేరారు. అయితే, ల్యూకేమియాతో బాధపడుతున్న కుమార్తె అంబికాకు మెరుగైన వైద్యచికిత్స కోసం 1966లో ఆయన బ్రిటన్కి వెళ్లారు. కానీ, దురదృష్టవశాత్తూ నాలుగేళ్లకే కుమార్తె కన్ను మూయడంతో విషాదంలో మునిగిపోయిన పాల్.. ఆ తర్వాత ఆమె పేరిట అంబికా పాల్ ఫౌండేషన్ అనే చారిటబుల్ ట్రస్టును ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా బాలల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల కోసం మిలియన్ల కొద్దీ పౌండ్లను విరాళంగా ఇచ్చారు. 1968లో లండన్ ప్రధాన కేంద్రంగా కపారో గ్రూప్నకు స్వరాజ్ పాల్ శ్రీకారం చుట్టారు. తర్వాత రోజుల్లో అది బ్రిటన్లోనే అతి పెద్ద స్టీల్ కన్వర్షన్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపార దిగజాల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం బ్రిటన్, భారత్, అమెరికా, కెనడా తదితర దేశాల్లో ఏటా 1 బిలియన్ డాలర్ల ఆదాయంతో కార్యకలాపాలు సాగిస్తోంది. లెజెండ్.. లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) మృతిపై ఇరు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బ్రిటన్–భారత్ మధ్య వారధిగా వ్యవహరించిన పాల్ తనకు స్ఫూర్తిప్రదాత అని కోబ్రా బీర్ వ్యవస్థాపకుడు లార్డ్ కరణ్ బిలిమోరియా తెలిపారు. విద్య, వ్యాపారం, రాజకీయాలు ఇలా అన్ని రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. వోల్వర్హ్యాంప్టన్ యూనివర్సిటీ చాన్సలర్గా వర్సిటీ అభివృద్ధిలో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారని విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చెయిర్ ఏంజెలా స్పెన్స్ పేర్కొన్నారు. బ్రిటన్లోని అనేక మంది భారతీయులకు మార్గదర్శిగా నిల్చిన ‘లెజెండ్’ అని పాల్ను సన్ మార్క్ వ్యవస్థాపకుడు లార్డ్ రామీ రేంజర్ అభివర్ణించారు. భారత్–బ్రిటన్ను మరింత చేరువ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆయన చెరగని ముద్ర వేశారని లండన్లోని భారత హైకమిషన్ ప్రధాని మోదీ సోషల్ మీడియా వ్యాఖ్యలను రీపోస్ట్ చేసింది. ఆయన విదేశాల్లో భారత్కి గొంతుకగా నిల్చారని హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామి పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి.. భారత్–బ్రిటన్ మధ్య సంబంధాలను పటిష్టం చేసే దిశగా 1975లో ఇండో–బ్రిటీష్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన లార్డ్ పాల్ దానికి సుదీర్ఘకాలం చైర్మన్గా వ్యవహరించారు. పాల్ సేవలకు గుర్తింపుగా 1978లో బ్రిటన్ రాణి ఆయనకు నైట్హుడ్ ప్రదానం చేశారు. 1983లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ (Padma Bhushan) పురస్కారంతో ఆయన్ను సత్కరించింది. పలు సంవత్సరాలుగా బ్రిటన్లో అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన పేరు క్రమం తప్పకుండా ఉంటోంది. 2 బిలియన్ పౌండ్ల సంపదతో ఈ ఏడాది సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో ఆయన 81వ స్థానంలో నిల్చారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోతున్నప్పటికీ ఇటీవలి వరకు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్కి తప్పకుండా హాజరయ్యారు. 2008లో హౌస్ ఆఫ్ లార్డ్స్ డిప్యుటీ స్పీకర్గా పాల్ వ్యవహరించారు. తద్వారా భారత నేపథ్యంతో, ఆ బాధ్యత చేపట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించారు. 2000 నుంచి 2005 వరకు ఇండియా–యూకే రౌండ్ టేబుల్కి కో–చెయిర్గా వ్యవహరించారు. 2009లో బ్రిటన్ మోనార్క్కి సలహా మండలి అయిన ప్రీవీ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఆయన నియమితులయ్యారు. మరోవైపు, వ్యక్తిగత జీవితంలో ఆయన్ను విషాదాలు వెన్నాడాయి. 2015లో కపారో గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్న కుమారుడు అంగద్ పాల్, 2022లో ఆయన భార్య అరుణ మరణించారు. దీనితో వారి స్మారకార్థం తలపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన మరింత సంపద, సమయం వెచ్చించారు. భార్య మరణానంతరం అంబికా పాల్ ఫౌండేషన్ పేరును అరుణ అండ్ అంబికా పాల్ ఫౌండేషన్గా మార్చారు. 2023 ఫిబ్రవరిలో లండన్లోని చారిత్రక ఇండియన్ జింఖానా క్లబ్లో లేడీ అరుణ స్వరాజ్ పాల్ హాల్ని ప్రారంభించారు. -
రూ. 24తో ఐటీఆర్ ఫైలింగ్.. జియోఫైనాన్స్ బంపరాఫర్
2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో, జియోఫైనాన్స్ ఓ సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ. 24తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వ్యక్తిగత పన్ను చెల్లించేవారు.. ఇప్పుడు రూ.24 ప్లాన్తోనే ఐటీ రిటర్న్ దాఖలు చేయవచ్చు. దీనికోసం కంపెనీ జియో ఫైనాన్ యాప్ ద్వారా.. కొత్త ట్యాక్స్ ప్లానింగ్, ఫైలింగ్ ఫీచర్ వంటివి వాటిని తీసుకొచ్చింది. ట్యాక్స్ పేయర్లు.. ఈ యాప్ ద్వారా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే, కొన్ని మినహాయింపులు కూడా పొందవచ్చని సమాచారం.కేవలం రూ. 24 ప్లాన్ ద్వారా అందరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చా? అనేది చాలామందికి తలెత్తిని ప్రశ్న. ఇది రూ. 5 లక్షల వరకు ఆదాయం.. ఒకే ఫారం-16 ఉన్న జీతం పొందే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుందని జియో ఫైనాన్స్ స్పష్టం చేసింది. ఇందులో ట్యాక్స్ పేయర్ స్వయంగా ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే బిజినెస్ ఆదాయం, క్యాపిటల్ గెయిన్స్, విదేశీ పెట్టుబడులు వంటి కాంప్లెక్స్ ట్యాక్సులు ఉన్నవారికి ఈ రూ. 24ప్లాన్ పనిచేయదు. దీనికోసం నిపుణుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారికోసం జియో ఫైనాన్స్ రూ. 999 ప్లాన్ అందిస్తోంది.ఇతర ప్లాట్ఫామ్లలో బేస్ ప్లాన్ ధరలు➤టాక్స్2విన్: బేసిక్ ప్లాన్ రూ.49, సీఏ సహాయంతో రూ. 1,274 నుంచి రూ. 7,968➤మైట్రీటర్న్: సెల్ఫ్-ఫైలింగ్ రూ.199, సీఏ సహాయంతో రూ.1,000 నుంచి రూ. 6,000➤టాక్స్ మేనేజర్: రూ. 500 నుంచి ప్రారంభమవుతుంది, సీఏ సహాయంతో రూ. 5,000 వరకు➤క్లియర్ టాక్స్: బేసిక్ రూ. 2,540, లక్స్ అడ్వైజరీ ప్లాన్ రూ. 25,000➤టాక్స్బడ్డీ (డైరెక్ట్): సెల్ఫ్-ఫైలింగ్ రూ. 699, కాంప్లెక్స్ ఫైలింగ్స్ రూ. 2,999ఇదీ చదవండి: స్టార్లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్: సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇలాపైన పేర్కొన్న ధరలతో పోలిస్తే.. జియో ఫైనాన్స్ అందించే రూ. 24 ప్లాన్ చాలా తక్కువ అని స్పష్టమవుతుంది. అయితే ట్యాక్స్ పేయర్లు ధరను మాత్రమే చూడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చౌక ప్లన్స్ సాధారణంగా ప్రొఫెషనల్ మార్గదర్శకత్వాన్ని అందించవు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని.. ప్లాన్స్ ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. -
గేమ్ ఓవర్: ఈ ఆన్లైన్ గేమ్స్ అన్నీ బంద్
ఆన్లైన్ గేమ్లపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడంతో.. పార్లమెంటు దీనిపై కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత.. డ్రీమ్11, విన్జోతో సహా అనేక గేమింగ్ ప్లాట్ఫామ్లు తమ కార్యకలాపాలను నిలిపివేసాయి.పోకర్బాజీని నిర్వహిస్తున్న దాని అనుబంధ సంస్థ మూన్షైన్ టెక్నాలజీస్ ఆన్లైన్ గేమ్లను అందించడం ఆపివేసిందని నజారా టెక్ శుక్రవారం తెలిపింది. ఈ జాబితాలో విన్జో, మొబైల్ ప్రీమియర్ లీగ్, జూపీ కూడా ఉన్నాయి. డ్రీమ్ 11లో కూడా క్యాష్ గేమ్లను నిలిపివేసింది.బెంగళూరుకు చెందిన గేమ్స్క్రాఫ్ట్ టెక్నాలజీస్ నిర్వహిస్తున్న ప్రముఖ రమ్మీ ప్లాట్ఫామ్.. రమ్మీకల్చర్ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే బాటలో ఒపీనియన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ప్రోబో అడుగులు వేస్తూ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏ23 రమ్మీ.. ఏ23 పోకర్లను నిర్వహించే హెడ్ డిజిటల్ వర్క్స్.. అన్ని ఆన్లైన్ మనీ గేమ్లను నిలిపివేసింది.ఇదీ చదవండి: 9K గోల్డ్ గురించి తెలుసా?: రేటు ఇంత తక్కువా..ఆన్లైన్ గేమ్లను నిషేధించే బిల్లును ఎవరైనా ఉల్లంగిస్తే.. మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండూ కూడా విధించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా.. నిబంధనలను ఉల్లంఘించి ప్రకటనలు ఇచ్చేవారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం కూడా ఈ నిబంధనల్లో ఉంది. -
అనన్య పాండే హోస్ట్గా 'ది స్టైల్ ఎడిట్': నలుగురికే అవకాశం!
బాలీవుడ్ నటి అనన్య పాండే న్యూఢిల్లీలో నాలుగు గంటల ఫ్యాషన్ అండ్ గ్లో-అప్ సెషన్ను నిర్వహించనున్నారు. 'ది స్టైల్ ఎడిట్' పేరుతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో.. సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్, హెయిర్స్టైలిస్ట్ ఆంచల్ మోర్వానీ, మేకప్ ఆర్టిస్ట్ రిద్దిమా శర్మ, ఫోటోగ్రాఫర్ రాహుల్ ఝంగియాని వంటి ఆమె ప్రొఫెషనల్ బృందం ఉంటుంది. ఈ సెషన్ న్యూఢిల్లీలోని ఎయిర్బీఎన్బీ ప్రాపర్టీలో జరుగుతుంది. దీనికోసం బుకింగ్స్ 2025 ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యాయి.ది స్టైల్ ఎడిట్ కార్యక్రమంలో పాల్గొనాలకునేవారు.. ఆగస్టు 21, 2025న airbnb.com/ananyaలో భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల తరువాత బుక్ చేసుకోవచ్చు. దీనికోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెషన్కు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందులో పాల్గొనేవారే.. ఢిల్లీకి రావడానికి, తిరిగి వెళ్ళడానికి అయ్యే మొత్తం ఖర్చులను భరించుకోవాల్సి ఉంటుంది.నేను క్యూరేట్ చేసి హోస్ట్ చేసిన "అనన్యస్ స్టైల్ ఎడిట్" ద్వారా నా గ్లిట్జ్.. గ్లామర్ ప్రపంచంలోకి అతిథులను స్వాగతించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఒక నటిగా నా వ్యక్తిత్వంలో ఫ్యాషన్, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ అతిథులతో పంచుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని కోసం నేను వేచి ఉన్నాను, అని అనన్య పాండే అన్నారు.జెన్ జెడ్ కల్చర్ ఐకాన్ను అనన్య పాండేతో కలిసి పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన వ్యక్తులు హోస్ట్ చేసిన అసాధారణ అనుభవాలను దీని ద్వారా అందిస్తున్నాము. దీనికి అనన్య స్టైల్ ఎడిట్ ఒక ఉదాహరణ. ఈ సెషన్లో పాల్గొనేవారు మరపురాని అనుభవాలను పొందవచ్చు అని ఇండియా అండ్ ఆగ్నేయాసియా ఎయిర్బీఎన్బీ హెడ్ అమన్ప్రీత్ బజాజ్ అన్నారు. -
వీసీలు, పీఈలకు గేమింగ్ షాక్
న్యూఢిల్లీ: రియల్ మనీ గేమ్స్పై నిషేధం విధించడం గేమింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన పలు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు షాకింగ్ పరిణామంగా మారింది. దీనితో అవి భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. టైగర్ గ్లోబల్, కలారి క్యాపిటల్, బేస్ పార్ట్నర్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. డ్రీమ్11, నజారా టెక్నాలజీస్, జూపీ, మొబైల్ ప్రీమియర్ లీగ్, గేమ్స్ 24్ఠ7 లాంటి అయిదు బడా గేమింగ్ కంపెనీలు, వెంచర్ ఫండ్స్ నుంచి దాదాపు 2.4 బిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు సమీకరించాయి. దేశీయంగా అతి పెద్ద ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫాంలలో ఒకటైన డ్రీమ్11లో టెన్సెంట్, కలారి క్యాపిటల్, అల్ఫా వేవ్ గ్లోబల్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి 2014 నుంచి దాదాపు 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. పరిశ్రమ వర్గాల డేటా ప్రకారం కలారీ క్యాపిటల్ 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని వాటాలను విక్రయించి పాక్షికంగా తప్పుకుంది. మరోవైపు, మొబైల్ ప్రీమియర్ లీగ్ దాదాపు 396 మిలియన్ డాలర్లు సమీకరించింది. పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్ టైమ్స్ ఇంటర్నెట్, గూగుల్ వెంచర్స్లాంటివి ఇన్వెస్ట్ చేశాయి. అటు నజారా టెక్నాలజీస్ 14 విడతల్లో 128 మిలియన్ డాలర్లు పెట్టుబడులు దక్కించుకుంది. వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, సెకోయా క్యాపిటల్, సీడ్ఫండ్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. గేమ్స్ 24్ఠ7 సంస్థ ఆరు విడతల్లో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, రైన్, మలబార్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి 108 మిలియన్ డాలర్లు సమీకరించింది. జూపీలో వెస్ట్క్యాప్, జెడ్47, ఏజే క్యాపిటల్ పార్ట్నర్స్ తదితర ఇన్వెస్టర్లు 122 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టాయి. పెయిడ్ గేమ్స్ నిలిపివేత.. కొత్త బిల్లుకు అనుగుణంగా తాము పెయిడ్ గేమ్స్ను నిలిపివేస్తున్నామని జూపీ తెలిపింది. అయితే, లూడో సుప్రీమ్, లూడో టర్బో, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, ట్రంప్ కార్డ్ మానియాలాంటి ఉచిత గేమ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది. ఇక ఎంపీఎల్, విన్జో, నజారా టెక్నాలజీస్ ఇన్వెస్ట్ చేసిన మూన్షైన్ టెక్నాలజీస్ (పోకర్బాజీ) కూడా రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపాయి. మూన్షైన్ టెక్నాలజీస్లో నజారా టెక్నాలజీస్కి 46.07 శాతం వాటాలు ఉన్నాయి. విన్జో పోర్ట్ఫోలియోలో రమ్మీ, సాలిటైర్, ఫ్యాంటసీ క్రికెట్, పోకర్లాంటి 100 పైగా రియల్ మనీ గేమ్స్ ఉన్నాయి. ఎంపీఎల్కి ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 12 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ యూజర్లలో భారత్కి దాదాపు 20 శాతం, గ్లోబల్ గేమింగ్ యాప్ డౌన్లోడ్స్లో 15.1 శాతం వాటా ఉంది. మన దేశంలో 1,800 పైగా గేమింగ్ స్టార్టప్లు ఉన్నాయి. ఇక, రియల్ మనీ గేమ్స్ నిలిపివేతతో నజారా టెక్నాలజీస్ షేరు వరుసగా మూడు రోజుల్లో దాదాపు 18 శాతం పతనమైంది. శుక్రవారం నాడు గేమింగ్, హాస్పిటాలిటీ సంస్థ డెల్టా కార్ప్ 3.50 శాతం, ఆన్మొబైల్ గ్లోబల్ దాదాపు 3 శాతం క్షీణించాయి. ఐపీఎల్పైనా ఎఫెక్ట్.. రియల్ మనీ గేమింగ్స్పై నిషేధం అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పైనా భారీగా ప్రభావం చూపనుంది. డ్రీమ్11, మై11సర్కిల్లాంటి సంస్థలు ఐపీఎల్కి బడా స్పాన్సర్లుగా ఉండటమే ఇందుకు కారణం. 2025 ఐపీఎల్కి వచి్చన మొత్తం ప్రకటనల ఆదాయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ స్పాన్సర్లు వాటా సుమారు రూ. 2,000 కోట్లు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. డిజిటల్ అడ్వరై్టజింగ్పై గేమింగ్ కంపెనీలు అత్యధికంగా ఖర్చు చేస్తుంటాయి కనుక ఐపీఎల్తో పాటు ఇతరత్రా ఆటల ప్రసార హక్కులకు పలికే రేటుపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. ఆన్లైన్ గేమింగ్పై నిషేధంతో అడ్వర్టైజింగ్ పరిశ్రమ ఆదాయంపై సుమారు 10–15 శాతం ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఆందోళనలో పరిశ్రమ.. స్కిల్ గేమ్స్కి రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ గేమింగ్ మీద నిషేధం విధించడం ఆశ్చర్యకరమని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం సరికాదని డ్రీమ్11 వర్గాలు పేర్కొన్నాయి. దేశీయంగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ పరిశ్రమ ప్రస్తుతం 1.82 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా 2030 నాటికి ఏకంగా 5.05 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలు నెలకొన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డాయి. పెద్ద సంఖ్యలో దీనిపై ఆధారపడిన వారి ఉపాధి, స్పోర్ట్స్లో ఆవిష్కరణలు, అత్యధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలకు నిషేధంతో విఘాతం కలుగుతుందని వివరించాయి. -
బైక్ ట్యాక్సీ సేవలు పునరుద్ధరణ
కర్ణాటక హైకోర్టు బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దాంతో రాపిడో, ఉబర్, ఓలా వంటి ఆన్లైన్ రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్లు రాష్ట్రంలో తమ బైక్ ట్యాక్సీ సేవలను తిరిగి ప్రారంభించాయి. నెలరోజుల్లోగా బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో బైక్ ట్యాక్సీ సేవలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉబర్, ఓలా, రాపిడో వంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్లు అందించే బైక్ ట్యాక్సీపై నిషేధం విధిస్తూ 2025 జూన్ 16న రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్టం 1988 ప్రకారం బైక్ ట్యాక్సీ సేవలు చట్టవిరుద్ధమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ హైకోర్టు ఉత్తర్వులను రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్లు సవాలు చేశాయి.నిషేధాన్ని ఎత్తివేసిన కోర్టురాపిడో, ఓలా, ఉబర్ సంస్థల అప్పీలును జస్టిస్ విభూ బఖ్రూ, జస్టిస్ సీఎం జోషిలతో కూడిన ధర్మాసనం విచారించింది. బైక్ ట్యాక్సీలు చట్టబద్ధమైన వ్యాపారమని, వీటిపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. బైక్ ట్యాక్సీలపై నిషేధం ఏకపక్షం, అసమంజసం, ఆర్టికల్ 14, 19(1)(జి)లను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బైక్ ట్యాక్సీ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇచ్చింది.బైక్ ట్యాక్సీల అవసరంటెక్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో రోడ్డు మౌలిక సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అంతే కాదు, ప్రజా రవాణా వసతులు ఆశించినమేరకు లేకపోవడం వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడం సవాలుగా మారుతుంది. ఇలాంటి సమయంలో బైక్ ట్యాక్సీ సర్వీసులు ఎంతో ఉపయోగపడుతున్నాయనే వాదనలున్నాయి. ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. అభివృద్ధి చెందుతున్న చాలా నగరాలకు బైక్ సర్వీసులు అవసరం అవుతున్నట్లు కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఇవాళ, రేపు హెచ్డీఎఫ్సీ సర్వీసుల్లో అంతరాయం -
‘నేనో యాక్సిడెంటల్ సీఈఓ’.. దాతృత్వంలో పెద్దమనుసు
సంపాదనలో విరాళం చేయాలంటే, అది మంచి కార్యం అయితే రూ.వందలు, రూ.వేలు మహా అయితే రూ.లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడుతుంటారు. అలాంటిది సంపాదించిన మొత్తంలో 99 శాతం విరాళంగా ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించారు. సంపాదనలో 99 శాతం విరాళంగా ఇస్తానని చెప్పి అమెరికాలో పేరు మోసిన కంపెనీకి సీఈఓగా ఉన్న జూడీ ఫాల్కనర్(82) వార్తల్లో నిలిచారు. యూఎస్లో హెల్త్ కేర్ సంస్థల్లో ఒకటైన ఎపిక్ సిస్టమ్స్ కంపెనీని స్థాపించి ఆమె బిలియనీర్గా ఎదిగారు. తన 7.8 బిలియన్ డాలర్ల సంపదలో 99 శాతం విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ‘ఆరోగ్య సంరక్షణలో అత్యంత శక్తివంతమైన మహిళ’గా పిలువబడే ఫాల్కనర్ వ్యాపారాన్ని, దాతృత్వాన్ని విస్తరిస్తున్నారు.1979లో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఫాల్కనర్ ఎపిక్ సిస్టమ్స్ను స్థాపించారు. సాంకేతికత ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచాలనే లక్ష్యంతో కంపెనీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 325 మిలియన్లకు పైగా రోగులకు ఈ సంస్థ సర్వీసులు అందిస్తోంది. ఫాల్కనర్ తాను ఎప్పుడూ టెక్ మొఘల్ అవ్వాలని అనుకోలేదని గతంలో పలుమార్లు చెప్పారు. ఫాల్కనర్ తనను తాను ‘యాక్సిడెంటల్ సీఈఓ’గా అభివర్ణించుకున్నారు. తాను ప్రొఫెషనల్ ఎంబీఏ చదవలేదని చెప్పుకొచ్చారు.ఇదీ చదవండి: భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరందాతృత్వ కార్యక్రమాలు..బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్, వారెన్ బఫెట్ ప్రారంభించిన గివింగ్ ప్లెడ్జ్ దాతృత్య కార్యక్రమంలో చేరి తన 7.8 బిలియన్ డాలర్ల సంపదలో 99% విరాళంగా ఇస్తానని చెప్పారు. ఫాల్కనర్ తన నాన్-ఓటింగ్ ఎపిక్ షేర్లను తిరిగి కంపెనీకి విక్రయిస్తున్నారు. దాని ద్వారా సమకూరుతున్న మొత్తాన్ని తన దాతృత్వ సంస్థ ‘రూట్స్ అండ్ వింగ్స్’కు మళ్లిస్తున్నారు. ఇది అల్ప ఆదాయ కుటుంబాలకు ఆరోగ్యం, విద్యపై దృష్టి సారించిన లాభాపేక్షలేని ఇతర సంస్థలకు మద్దతు ఇస్తుంది. 2020లో ఈ ఫౌండేషన్ 115 సంస్థలకు 15 మిలియన్ డాలర్లు ఇచ్చింది. 2023 నాటికి ఇది 305 గ్రూపులతో 67 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2027 నాటికి ఏటా 100 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. -
ర్యాపిడోకి భారీ జరిమానా.. కొంప ముంచిన యాడ్స్
తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అనుచిత వ్యాపార విధానాలకు గాను రైడ్ సేవల సంస్థ ర్యాపిడోకి వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సీసీపీఏ రూ. 10 లక్షల జరిమానా విధించింది. ‘5 నిమిషాల్లో ఆటో లేదా రూ. 50 పొందండి ‘ ఆఫర్ కింద పరిహారం లభించని కస్టమర్లకు రీయింబర్స్ చేయాలని కూడా ఆదేశించింది.దీనితో పాటు ‘గ్యారంటీడ్ ఆటో‘ ఆఫర్ ప్రకటనలను కూడా పరిశీలించిన సీసీపీఏ, ఇవి వినియోగదారులను తప్పుదోవ పట్టించే తప్పుడు అడ్వర్టైజ్మెంట్లుగా నిర్ధారించింది. హామీ ఇచ్చినట్లుగా రూ. 50 డబ్బు రూపంలో కాకుండా రూ. 50 వరకు విలువ చేసే ర్యాపిడో కాయిన్ల రూపంలో లభిస్తాయన్న విషయాన్ని చాలా చిన్నని, చదవడానికి అనువుగా లేని ఫాంట్లలో కంపెనీ డిస్ప్లే చేసిందని సీసీపీఏ విచారణలో తేలింది.పైపెచ్చు ఆ మొత్తాన్ని బైక్ రైడ్స్ కోసమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడు రోజుల వ్యవధిలో ఉపయోగించుకోకపోతే కాలపరిమితి తీరిపోతుంది. అంతేగాకుండా ఈ హామీ బాధ్యతను కంపెనీ తన మీద పెట్టుకోకుండా వ్యక్తిగత డ్రైవర్ల మీదకు నెట్టేసినట్లు విచారణలో తేలింది. నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్ డేటా ప్రకారం 2024 జూన్ నుంచి 2025 జూలై మధ్య కాలంలో ర్యాపిడోపై ఫిర్యాదులు 1,224కి ఎగిశాయి. అంతక్రితం 14 నెలల వ్యవధిలో 575 కంప్లైట్లు నమోదయ్యాయి. -
కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు: లిస్ట్ ఇదిగో..
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఒకటి. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించి.. గత దశాబ్దంలో 93.6% వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ ధనవంతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ కథనంలో కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు ఎవరు?, వారి నికర విలువ (ఫోర్బ్స్ ప్రకారం) ఎంత అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలో టాప్ 10 ధనవంతులు➤అజీమ్ ప్రేమ్జీ - విప్రో వ్యవస్థాపకులు: 11.7 బిలియన్ డాలర్లు➤నారాయణ మూర్తి - ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు: 4.4 బిలియన్ డాలర్లు➤ఇర్ఫాన్ రజాక్ - ప్రెస్టీజ్ గ్రూప్ : 1.7 బిలియన్ డాలర్లు➤కిరణ్ మజుందార్-షా - బయోకాన్ వ్యవస్థాపకులు: 3.4 బిలియన్ డాలర్లు➤నిఖిల్ కామత్ - జెరోధా & ట్రూ బీకాన్ సహవ్యవస్థాపకులు: 2.5 బిలియన్ డాలర్లు➤క్రిస్ గోపాలకృష్ణన్ - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3.5 బిలియన్ డాలర్లు➤రంజన్ పాయ్ - మణిపాల్ మెడికల్ & ఎడ్యుకేషన్ గ్రూప్: 2.8 బిలియన్ డాలర్లు➤రాజేష్ మెహతా - రాజేష్ ఎక్స్పోర్ట్స్ వ్యవస్థాపకులు: 1.57 బిలియన్ డాలర్లు➤నందన్ నీలేకని - ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు: 3 బిలియన్ డాలర్లు➤విజయ్ సంకేశ్వర్ - వీఆర్ఎల్ గ్రూప్ వ్యవస్థాపకులు: రూ. 10,000 కోట్లు కంటే ఎక్కువఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే? -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ఆమోదం తెలిపింది. ఓ వైపు విపక్షాలు చర్చకు పట్టుబట్టినా ఉభయ సభల్లో ఎలాంటి చర్చలేకుండానే ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందింది. నిన్నటి పార్లమెంట్ సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.ఏమిటీ బిల్లు? అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు. ఆన్లైన్ గేమ్ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు. నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే. మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్లను నిర్వహించినా దోషులే అవుతారు. ఈ బిల్లు ప్రకారం.. ఆన్లైన్ గేమ్ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ–స్పోర్ట్స్కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్లైన్ గేమ్లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. -
రెండేళ్లకే మస్క్ కంపెనీ వీడిన 16 ఏళ్ల కుర్రాడు
పద్నాలుగేళ్ల వయసులోనే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరిన 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi) గురించి పలు సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కైరాన్.. మస్క్ కంపెనీ విడిచిపెట్టి న్యూయార్క్లోని సిటాడెల్ సెక్యూరిటీస్లో గ్లోబల్ ట్రేడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్గా చేరనున్నాడు.స్పేస్ఎక్స్లో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, కొత్త సవాళ్లను స్వీకరించడానికి.. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త కంపెనీలో చేరుతున్నట్లు కైరాన్ క్వాజీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిటాడెల్ సెక్యూరిటీస్ నాకు ఎంతగానో ఆసక్తికరమైన పనిని అప్పగిస్తూ పూర్తిగా కొత్త డొమైన్ను కూడా అందించిందని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకితొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్షిప్ పొందిన కైరాన్ క్వాజీ.. 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్గా నాలుగు నెలలు పనిచేశాడు. ఆ తరువాత స్పేస్ఎక్స్లో పనిచేయడమే ఉద్దేశ్యంగా అడుగులు వేసి, అనుకున్నది సాధించాడు. -
జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన సీఈఓ
సాధారణంగా కొన్ని సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇస్తే చాలు అనుకుంటాయి. అయితే కొన్ని కంపెనీలు జీతాలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. కంపెనీ లాభాలను పొందినప్పుడు.. ఉత్తమ పనితీరును కనపరిచిన ఉద్యోగులకు కార్లు, బైకులు వంటివి గిఫ్ట్స్ ఇస్తుంటారు. ఇటీవల కేరళకు చెందిన ఒక కంపెనీ సీఈఓ.. జనరల్ మేనేజర్కు ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కేరళకు చెందిన MyG చైర్మన్ అండ్ ఎండీ ఏకే షాజీ.. తన జనరల్ మేనేజర్కు రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 బైక్ గిఫ్ట్ ఇచ్చాడు. జనరల్ మేనేజర్ కంపెనీ డీలర్షిప్ నుంచి బైకును తీసుకున్నాడు. సీఈఓ కొత్త బైక్ గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషించారు. బైక్ తీసుకునే సమయంలో వేగంగా వెళ్ళవద్దు, బాధ్యతాయుతంగా బైక్ రైడ్ చేయాలని సూచించారు.జనరల్ మేనేజర్ అపెక్స్ గ్రే కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650 తీసుకున్నాడు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.46 లక్షలు. కాలికట్లో ఆన్ రోడ్ ధర రూ. 4.41 లక్షలు.ఇదీ చదవండి: భారత్లో అమెరికన్ బ్రాండ్ బైక్ లాంచ్: ధర ఎంతంటే?రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650కాంటినెంటల్ జీటీ 650 అనేది 650 సీసీ విభాగంలో ఎంతోమందికి నచ్చిన బైక్. ఇది 648 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 47 హార్స్ పవర్, 52 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మంచి డిజైన్, రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. View this post on Instagram A post shared by BLUEMOUNTAINAUTOS-ROYALENFIELD (@bluemountain_autos) -
ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు
పునరుత్పాదక ఇంధనం అభివృద్ధిపై పెట్టుబడులు పెరుగుతున్నా, సాంప్రదాయక ఇంధన వనరులకు డిమాండ్ తగ్గట్లేదు. ఇది ప్రపంచ చమురు, గ్యాస్ రంగం అపారమైన ఆర్థిక, వ్యూహాత్మక వృద్ధిని సూచిస్తోంది. ఆగస్టు 2025 నాటికి పరిశ్రమలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని సౌదీ ఆరామ్కో 1.55 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే టాప్లో నిలిచింది. భారత్కు చెందిన ఓఎన్జీసీ 34.33 బిలియన్ డాలర్లతో 45వ స్థానంలో ఉంది. మార్కెట్ విలువ పరంగా చమురు వాణిజ్యానికి సంబంధించి ప్రపంచంలోనే టాప్ కంపెనీల గురించి కింద తెలియజేశాం.పైసమాచారం కంపెనీస్మార్కెట్క్యాప్.కామ్(ఆగస్టు 20, 2025 నాటికి) లోనిది. నిత్యం మార్కెట్ వ్యాల్యూయేషన్లను అనుసరించి క్యాపిటల్ మారుతుంటుందని గమనించాలి.భారత్ స్థానం ఇదే..ఏ భారతీయ కంపెనీ కూడా గ్లోబల్ టాప్ 10లో చోటు దక్కించుకోనప్పటికీ, భారతదేశపు అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓన్జీసీ) 34.33 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటల్తో ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది.ఇదీ చదవండి: రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!టాప్ 100లో ఉన్న భారతీయ కంపెనీలు..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)- 56వ స్థానంభారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)- 68వ స్థానంగెయిల్ (ఇండియా) లిమిటెడ్ - 79వ స్థానంహిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)- 95వ స్థానం -
ఈపీఎఫ్వో ‘కొత్త’ రికార్డ్..
ఉద్యోగుల భవిష్య నిధి.. ఈపీఎఫ్వోకు జూన్లో నికరంగా 21.89 లక్షలమంది సభ్యులు కొత్తగా జత కలిశారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా 13.5 శాతం వృద్ధి నమోదైంది. నెలవారీగా చూస్తే ఈ సంఖ్య 9.15 శాతం బలపడింది. కార్మిక శాఖ వెల్లడించిన ప్రొవిజనల్ గణాంకాలివి. వీటి ప్రకారం 2018 ఏప్రిల్లో ఈపీఎఫ్వో పేరోల్ గణాంకాల విడుదల ప్రారంభించాక గరిష్టస్థాయిలో సభ్యులు జత కలడం గమనార్హం!ఉద్యోగ అవకాశాలు పుంజుకోవడం, ఉద్యోగ లబ్దిపై అవగాహన పెరగడానికితోడు ఈపీఎఫ్వో ప్రభావవంత కార్యక్రమాలు ఇందుకు దోహదపడినట్లు కార్మిక శాఖ పేర్కొంది. కాగా.. 2025 జూన్లో 10.62 లక్షలమంది కొత్త సబ్ర్స్కయిబర్లు ఎన్రోల్ అయ్యారు. 2025 మేతో పోలిస్తే 12.7 శాతం అధికంకాగా.. వార్షికంగా 3.6 శాతం వృద్ధి ఇది. వీరిలో 18–25 మధ్య వయసు కలిగినవారి సంఖ్య 6.39 లక్షలమంది. అంటే 60 శాతానికిపైగా వాటా వీరిదే.ఈ గ్రూపులో నికర పేరోల్ జమలు 9.72 లక్షలుగా నమోదైంది. ఇంతక్రితం వైదొలగినవారు సుమారు 16.93 లక్షలమంది 2025 జూన్లో ఈపీఎఫ్వోకు జత కలిశారు. ఈ కాలంలో 3.02 లక్షలమంది మహిళలు ఈపీఎఫ్వో కొత్త సబ్స్కయిబర్లుగా చేరారు. 2025 మే నెలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. నికర పేరోల్ జమల్లో మహిళల సంఖ్య 4.72 లక్షలుగా నమోదైంది. రాష్ట్రాలవారీగా పేరోల్ గణాంకాలు చూస్తే 20 శాతంతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితరాలు 5 శాతం చొప్పున వాటా ఆక్రమించాయి.ఇదీ చదవండి: ఉమాంగ్ యాప్లో యూఏఎన్.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్ -
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీకి గుడ్బై!
న్యూఢిల్లీ: వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపునివ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనిపై దాదాపు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయి. బీమాపై వివిధ రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన 13 సభ్యుల బృందం (జీవోఎం) ఈ ప్రతిపాదనపై చర్చించింది. జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలు కంపెనీలకు కాకుండా కస్టమర్లకు బదిలీ అయ్యేలా తగు విధానాన్ని రూపొందించాలని జీఎస్టీ కౌన్సిల్ను కోరినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.వ్యక్తిగత బీమా పాలసీలకు జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వడం వల్ల ఏటా రూ. 9,700 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనాలు ఉన్నాయని వివరించారు. మంత్రుల అభిప్రాయాలు, అభ్యంతరాలను పొందుపర్చిన నివేదికను జీఎస్టీ కౌన్సిల్కి సమర్పించనున్నట్లు బీమాపై జీవోఎం కన్వీనరు, బిహార్ డిప్యుటీ సీఎం సామ్రాట్ చౌదరి తెలిపారు. అక్టోబర్ ఆఖరు నాటికి జీవోఎం తుది నివేదిక సమర్పించనుంది. ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తోంది. 2023–24లో కేంద్రం, రాష్ట్రాలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ. 8,263 కోట్లు, హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంపై రూ. 1,484 కోట్లు జీఎస్టీ రూపంలో సమీకరించాయి. -
లక్షల ఉద్యోగాలకు ముప్పు!!
న్యూఢిల్లీ: రియల్ మనీ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం విధించే బిల్లుపై పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల లక్షల కొద్దీ ఉద్యోగాలు, వేల కోట్ల పెట్టుబడులకు విఘాతం ఏర్పడుతుందని తెలిపాయి. కోట్ల మంది యూజర్లు చట్టవిరుద్ధమైన విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫాంల వైపు మళ్లే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ఈ బిల్లు విషయంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేశాయి. యూజర్లు, పరిశ్రమను పరిరక్షిస్తూ బాధ్యతాయుతమైన గేమింగ్కి తోడ్పడే పరిష్కార మార్గాలపై చర్చించేందుకు, తమ అభిప్రాయాలను కూడా తెలిపేందుకు సమావేశమయ్యే అవకాశం కల్పించాలని కోరాయి.ఆలిండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) ఈ నెల 19న సంయుక్తంగా ఆయనకు లేఖ రాశాయి. దీని ప్రకారం .. దాదాపు రూ. 2 లక్షల కోట్ల వేల్యుయేషన్, రూ. 31,000 కోట్ల వార్షికాదాయంతో ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఏటా రూ. 20,000 కోట్ల ఆదాయం సమకూరుస్తోంది.20 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2028 నాటికి పరిశ్రమ రెట్టింపు స్థాయికి చేరనుంది. 2022 జూన్ వరకు పరిశ్రమలోకి రూ. 25,000 కోట్ల వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. దేశీయంగా 2020లో 36 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమర్స్ సంఖ్య 2024 నాటికి 50 కోట్లకు చేరింది. వేల కొద్దీ స్టార్టప్లు, యువ ఇంజనీర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. యూజర్లకు కూడా హాని.. చట్టబద్ధమైన, పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమపై గంపగుత్తగా నిషేధం విధించడం వల్ల దేశీ యూజర్లకు, పౌరులకు పెను హాని జరుగుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నిషేధం వల్ల పెట్టుబడులు నిల్చిపోయి, ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింటుందని.. 400 పైగా కంపెనీలు మూతబడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. డిజిటల్ ఆవిష్కర్తగా భారత్ స్థానం కూడా బలహీనపడుతుందని వివరించాయి. ‘ఈ బిల్లు ఆమోదం పొందితే యూజర్లు, పౌరులకు తీవ్ర హాని జరుగుతుంది. నియంత్రణల పరిధిలో కార్యకలాపాలు సాగిస్తున్న, బాధ్యతాయుత దేశీ ప్లాట్ఫాంలను మూయించి, కోట్ల మంది ప్లేయర్లను చట్టవిరుద్ధ మట్కా నెట్వర్క్లు, ఆఫ్షోర్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, రాత్రికి రాత్రి పారిపోయే మోసపూరిత ఆపరేటర్ల వైపు మళ్లించినట్లవుతుంది‘ అని పేర్కొన్నాయి. ప్రజలకు రూ. 20 వేల కోట్ల నష్టం: ప్రభుత్వ అంచనాలు ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ వల్ల, ఏటా 45 కోట్ల మంది దాదాపు రూ. 20,000 కోట్లు నష్టపోతున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. సమాజానికి ఇది పెను సమస్యగా మారిందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని కోల్పోయినా సరే ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే రియల్ మనీ గేమింగ్ని నిషేధించాలన్న నిర్ణయం తీసుకుందని వివరించాయి.గత మూడున్నరేళ్లుగా పరిశ్రమను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, రియల్ మనీ గేమింగ్ సంస్థలు వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొన్నాయి. అయితే, ఆన్లైన్ గేమ్స్ అన్నింటిపైనా నిషేధం ఉండదని .. ఈస్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ని ప్రమోట్ చేసేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయని ఒక అధికారి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్, స్కీములు మొదలైనవి ఉంటాయని వివరించారు. దీనితో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు వస్తా యని పేర్కొన్నారు. -
Gen Z: ఉదయం ఉద్యోగంలో చేరి.. మధ్యాహ్నానికే ‘గుడ్బై’!
ఢిల్లీ: వామ్మో..నేను బతుకుంటే.. బలుసాకైనా అమ్ముకుని బతికేస్తా.. కానీ మీ కంపెనీలో మాత్రం ఉద్యోగం చేయను బాబోయ్ అంటూ ఓ వ్యక్తి ఉద్యోగంలో చేరిన మొదటి రోజే..లంచ్ టైంలో జాబ్కు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటన కార్పొరేట్ కంపెనీల్లో టాక్సిక్ వర్క్ కల్చర్కు అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్గా మారింది.ఆ ట్వీట్ సారాశం ఏంటంటే?. నా స్నేహితుడు ఢిల్లీకి చెందిన స్టార్టప్లో చేరాడు. చేరిన తొలిరోజు లంచ్ టైం వరకు పనిచేశాడు. లంచ్ టైం తర్వాత తన ల్యాప్ట్యాప్ను కూడా డెస్క్పై వదిలేసి బయటకు వెళ్లిపోయాడు. ఆఫీస్ నుంచి వెళ్లిన తర్వాత..సదరు కంపెనీ ప్రతినిధులు ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. మా ఫ్రెండ్ వాటికి రిప్లయి ఇవ్వలేదు.కానీ చివరికి కంపెనీ హెచ్ఆర్ నుంచి ఫోన్ రావడంతో రిప్లయి ఇవ్వక తప్పలేదు. హెచ్ఆర్తో బతుకుంటే బులుసాకైనా అమ్ముకుంటా కానీ మీ కంపెనీలో నేను పని చేయనని తేల్చి చెప్పాడు’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు.ఆ ట్వీట్పై నెటిజన్లు పాజిటీవ్గా స్పందిస్తున్నారు. చేరిన తొలిరోజే ఉద్యోగానికి రిజైన్ చేసిన వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. స్టార్టప్ కల్చర్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కావాలంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సబబే. ఇది ఆశ్చర్యకరం కాదు. స్టార్టప్ కల్చర్ కొన్నిసార్లు తట్టుకోలేని విధంగా ఉంటుంది.మొదటి రోజే వర్క్ ప్లేస్ సరిగా అనిపించకపోతే,వెళ్లిపోవడం మంచిదే’అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. చాలా మంది ప్లాన్ చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రమే అమలు చేస్తారు’అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఈ సంఘటన జెన్జీ వర్క్ కల్చర్కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోందని మానసిక నిపుణులు చెబుతున్నారు. జెన్జీకి వర్క్ కల్చర్ బాగుండాలి. అంటే పనిచేసే కార్యాలయం తమ మనసుకు అనుగుణంగా ఉంటే ఫర్లేదు. లేదుంటే మానసిక ప్రశాంతను చెడగొట్టుకుని పనిచేకపోవడం ఇష్టం ఉండదు. అందుకే వెంటే రాజీనామా చేస్తారు. A friend told me about this guy who joined a startup here in Delhi. On his very first day, he left his laptop on his desk during lunch and just never came back. He ignored everyone’s calls initially but later picked up HR’s, and just said he cannot work there 😭— Poan Sapdi (@Poan__Sapdi) August 19, 2025 -
లైఫ్ సైన్సెస్లో తెలంగాణ ఘనత
హైదరాబాద్: ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఆధిపత్యాన్ని చాటుతూ గడిచిన ఏడాదిలోనే రూ.54,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలో టాప్ 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో స్థానం సంపాదించుకుంది. ఇలా ఘనత చాటిన భారతదేశం నుంచి ఏకైక నగరంగా నిలిచింది.ఈ పెట్టుబడులు ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, సెల్ & జీన్ థెరపీ, మెడికల్ డివైసెస్, వ్యాక్సిన్లు, డిజిటల్ హెల్త్ వంటి విభాగాల్లో వచ్చాయి. ఈ పెట్టుబడులు 2 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించే వీలుంది. ఈ క్రమంలో లైఫ్ సైన్సెస్ రంగంలో పురోగతిపై తాజాగా జరిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ బోర్డు సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు.ఇన్నోవేషన్ ఆధారిత లైఫ్ సైన్సెస్ కు తెలంగాణ ప్రపంచ కేంద్రంగా అవతరించిందని, ప్రస్తుతం 2000 లైఫ్ సైన్సెస్ కంపెనీలకు నిలయంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టాప్ 7 గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా హైదరాబాద్ ఆవిర్భవించడం తెలంగాణ ప్రగతిశీల విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు, టాలెంట్ రిచ్ ఎకోసిస్టమ్ ప్రత్యక్ష ఫలితం అన్నారు. ప్రతిపాదిత లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ గా ప్రపంచస్థాయి స్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. -
లగేజ్తో రైలు ఎక్కుతున్నారా? ఇక కొత్త రూల్స్
ఇండియన్ రైల్వే ప్రయాణికుల లగేజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైళ్లలో సామానుపై ఉన్న నిబంధనలు సడలింపుగా ఉండటంతో, ప్రయాణికులు అధిక బరువు, పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులతో ప్రయాణిస్తున్నారు. ఇది రైలు బోర్డింగ్ సమయంలో రద్దీ పెరగడానికి, ప్రయాణికుల అసౌకర్యానికి, భద్రతా సమస్యలకు దారితీస్తోంది.ఈ నేపథ్యంలో, విమానాశ్రయాల్లో అమలవుతున్న తరహాలోనే, రైల్వే కొన్ని ప్రధాన స్టేషన్లలో సామానుపై పరిమితులు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాగ్రాజ్, మిర్జాపూర్, కాన్పూర్, అలీగఢ్ జంక్షన్ స్టేషన్లలో తొలుత ఈ నిబంధలను అమలు చేయనున్నారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు తమ సామానును ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ల ద్వారా తూకం చేయించాల్సి ఉంటుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే, అదనపు చార్జీలు విధిస్తారు. పరిమాణం ఎక్కువగా ఉండి బరువు తక్కువగా ఉన్న బ్యాగులపై కూడా ప్రత్యేక ఫార్ములా ద్వారా చార్జీలు లెక్కించనున్నారు. ఉచిత సామాను పరిమితి ప్రయాణ తరగతిని బట్టి మారుతుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే ‘ఎల్’ స్కేల్పై 1.5 రెట్లు చార్జీలు విధిస్తారు. కనీస చార్జీ రూ.30, కనీస బరువు 10 కిలోలు, కనీస దూరం 50 కిలోమీటర్లు. 5–12 ఏళ్ల పిల్లలకు ఉచిత లగేజీ పరిమితిలో సగం, గరిష్టంగా 50 కేజీల వరకూ అనుమతి ఉంటుంది. పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులు, బోర్డింగ్ స్పేస్ను ఆక్రమించేలా ఉంటే జరిమానా విధిస్తారు. స్కూటర్లు, సైకిళ్లు వంటి వస్తువులకు ఉచిత పరిమితి వర్తించదు.ప్రయాణ తరగతుల వారీగా ఉచిత సామాను పరిమితిప్రయాణ తరగతిగరిష్ట పరిమితిఉచిత పరిమితిఅదనపు ఛార్జీతో అనుమతించేదిఏసీ ఫస్ట్ క్లాస్150 కిలోలు70 కిలోలు15 కిలోలుఏసీ 2-టయర్ / ఫస్ట్ క్లాస్100 కిలోలు50 కిలోలు10 కిలోలుఏసీ 3-టయర్ / చైర్ కార్40 కిలోలు40 కిలోలు10 కిలోలుస్లీపర్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)80 కిలోలు40 కిలోలు10 కిలోలుసెకండ్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)70 కిలోలు35 కిలోలు10 కిలోలురైళ్లలో లగేజీ పరిమితికి సంబంధించి నిబంధనలు ఇదివరకే ఉన్నాయని, అయితే వాటి అమలు విషయంలో రైల్వే కఠినంగా వ్యవహరించేది కాదని అధికారులు చెబుతున్నారు. “లగేజీ నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. వాటి అమలును పర్యవేక్షించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చాం” అని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ తగ్గించటం, బోర్డింగ్ సౌలభ్యం పెంచటం, రైళ్లలో భద్రత మెరుగుపరచటం ఈ చర్యల లక్ష్యంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది -
ఆ ఫీచర్ బంద్: గూగుల్ పే, ఫోన్పే.. యాప్లలో కీలక మార్పు
యూపీఐ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 ‘పేమెంట్ రిక్వెస్ట్’ ఫీచర్ను నిలిపివేయాలని నిర్ణయించింది. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి యూపీఐ యాప్లలో ఈ మార్పు అమలులోకి రానుంది.మోసాల వెనుక ఉన్న మెకానిజం‘పేమెంట్ రిక్వెస్ట్’ అనే ఫీచర్ను మోసగాళ్లు దుర్వినియోగం చేస్తూ, డబ్బు పంపుతున్నట్టు చూపించి, వినియోగదారుల నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఓఎల్ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో వాడుక వస్తువుల కొనుగోలు సందర్భాల్లో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వినియోగదారులు డబ్బు వస్తుందనుకుని, రిక్వెస్ట్ను అంగీకరించడం వల్ల వారి ఖాతాల్లోని డబ్బు మోసగాళ్లకు చేరుతోంది.యాప్లు అప్డేట్ చేసుకోవాలి..ఎన్పీసీఐ ఆదేశాల మేరకు, అక్టోబర్ 2 నుంచి ఈ ఫీచర్ను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగా యూపీఐ యాప్లు తమ సిస్టమ్లను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచే దిశగా కీలక అడుగులుగా ఎన్పీసీఐ భావిస్తోంది.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది -
రైతుకు చేదోడుగా మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్
పంటసాగులో రైతన్నకు కలుపు సవాలుగా మారుతున్న నేపథ్యంలో ఈ సమస్యను కట్టడి చేసేందుకు కొన్ని కంపెనీలు కలుపు మందులు తయారు చేస్తున్నాయి. పంటపోలాల్లో కలుపు తొలగించేందుకు కూలీల ఖర్చులు పెరుగుతున్న తరుణంలో గోద్రేజ్ కంపెనీ అశితాకా పేరుతో కలుపు మందును ఆవిష్కరించింది. ఇది మొక్కజొన్న సాగులో పంట నష్టం వాటిల్లకుండా కలుపు నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని గోద్రేజ్ ఆగ్రోవెట్ సీఈఓ(క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్) ఎన్కే రాజావేలు తెలిపారు.‘మొక్కజొన్న పంటలో గడ్డి, పెద్ద ఆకులతో ఉన్న కలుపు మొక్కలను నివారించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు 2-4 ఆకుల వచ్చిన దశలో ఉన్నప్పుడు మరింత సమర్థంగా పని చేస్తుంది. ఈ మందును నేరుగా పంటపై స్ప్రే చేసుకోవచ్చు. నిబంధనలకు తగినట్లు తగిన మోతాదులో దీన్ని ఉపయోగించి కలుపు నివారించుకోవచ్చు. స్ప్రే చేసే క్రమంలో గాలికి పంటపై మందు పడినా మొక్కజొన్నకు నష్టం జరగదు. ఎక్కువకాలం జీవించి, తిరిగి పెరిగే కలుపు జాతులపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. 400 ఎంఎల్ సర్ఫక్టెంట్తోపాటు 50 ఎంఎల్ అశితాకా కలిపి ఎకరాకు పిచికారి చేసుకోవాలి’ అని రాజావేలు చెప్పారు.వర్షాభావ ప్రాంతాల్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే రైతుల ఆదాయాన్ని స్థిరంగా వృద్ధి చెందించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని కంపెనీ జీఎం(మార్కెటింగ్) అనిల్ చౌబే తెలిపారు. దేశవ్యాప్తంగా మొక్కజొన్న అధికంగా పండించే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ముందుగా ఈ ప్రొడక్ట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో దీన్ని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.ఇదీ చదవండి: టాప్ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్ -
టాప్ కంపెనీలో 2,800 ఉద్యోగాలు కట్
కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఒరాకిల్ కార్పొరేషన్ భారతదేశంలోని శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. దేశంలోని కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 10% మందిని తొలగించాలని నిర్ణయించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పుణె, నోయిడా, కోల్కతా వంటి కీలక ప్రాంత్రాల్లో సుమారు 28,824 మంది ఉద్యోగులు ఒరాకిల్లో పని చేస్తున్నారు. వీరిపై ప్రభావంపడే అవకాశం ఉంది.కంపెనీ ప్రకటించిన లేఆఫ్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ సేవలు, కస్టమర్ బేస్పై నిమగ్నమైన బృందాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని క్యాంపస్ల్లో ఈ తొలగింపులు ఆకస్మికంగా ఉన్నాయని, తొలగింపు ప్యాకేజీలు లేదా అంతర్గత పునర్విభజన ఎంపికల ఊసే లేదని చెబుతున్నారు. యాజమాన్యం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే ఊహించని విధంగా నోటీసులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఈ-కామర్స్, టెక్ స్టార్టప్ల్లో ఫ్రెషర్లకు అవకాశాలుగత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్టైమ్ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్బ్యాంక్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు. -
ఈ-కామర్స్, టెక్ స్టార్టప్ల్లో ఫ్రెషర్లకు అవకాశాలు
ఈ–కామర్స్, టెక్నాలజీ స్టార్టప్ల్లో ఫ్రెషర్లకు అవకాశాలు తలుపుతట్టనున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో (జులై–డిసెంబర్) ప్రెషర్లను అధికంగా నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. టీమ్లీజ్ ఎడ్టెక్ నిర్వహించిన ‘కెరీర్ అవుటులుక్ రిపోర్ట్’ సర్వేలో.. ఈ–కామర్స్, టెక్ స్టార్టప్ల్లో 88 శాతం కంపెనీలు నియామకాల ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేశాయి. వీటి తర్వాత రిటైల్ రంగంలో 87 శాతం, తయారీ రంగంలో 82 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూల ధోరణితో ఉన్నాయి.యువ నిపుణులకు ఉన్న బలమైన డిమాండ్ను ఇది సూచిస్తున్నట్టు టీమ్లీజ్ తెలిపింది. ఈ కామర్స్, టెక్నాలజీ రంగాల్లో చురుకైన వృద్ధి ఫ్రెషర్లకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్షిప్ కార్యక్రమాలు పెరుగుతుండడం, ప్రత్యక్ష, నైపుణ్య ఆధారిత అధ్యయన మార్గాల డిమాండ్ను తెలియజేస్తున్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. వివిధ రంగాల్లోని 1,065 కంపెనీలను మే నుంచి జులై మధ్య ప్రశ్నించి ఈ వివరాలను టీమ్లీజ్ ఎడ్టెక్ విడుదల చేసింది.అయితే, ఫ్రెషర్ల నియామక ఉద్దేశం కంపెనీల్లో బలంగానే ఉన్నప్పటికీ.. క్రితం ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంతో పోల్చి చూస్తే కాస్తంత తగ్గడం గమనార్హం. 2024 ద్వితీయ ఆరు నెలల్లో 74 శాతంగా ఉంటే, ఈ ఏడాది ద్వితీయ ఆరు నెలలకు ఇది 70 శాతంగా ఉంది. ఏఐ రాకతో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు, కీలక విభాగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను కాపాడుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అధిక వృద్ధి రంగాల్లో అవకాశాలుఅధిక వృద్ధిని నమోదు చేస్తున్న రంగాల్లో ఫ్రెషర్లకు అవకాశాలు బలంగానే ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ నివేదిక తెలిపింది. డిగ్రీ అప్రెంటిస్ షిప్లకు తయారీలో 37 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 29 శాతం, ఐటీలో 18 శాతం చొప్పున డిమాండ్ ఉన్నట్టు వెల్లడించింది. బెంగళూరులోని కంపెనీల్లో 37 శాతం, చెన్నైలో 30 శాతం, పుణెలో 26 శాతం చొప్పున కంపెనీలు అప్రెంటిస్షిప్ల నియామకాలకు సానుకూలంగా ఉన్నాయి. పెద్ద సంస్థలతో పోల్చి చూసినప్పుడు చిన్న కంపెనీలు ఫ్రెషర్ల నియామకంపై అధిక ఆసక్తితో ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ -
అల్ట్రాటెక్ 200 ఎంటీపీఏ సామర్థ్యం
అల్ట్రాటెక్ సిమెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 200 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎంటీపీఏ) సామర్థ్యాన్ని అధిగమిస్తుందని కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. దీంతో చైనా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ విక్రయ కంపెనీగా అవతరిస్తుందన్నారు. కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో జీడీపీ 7.4 వృద్ధి రేటు సాధించడం వెనుక నిర్మాణరంగం, తయారీ రంగం కీలక పాత్ర ఉన్నట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5 శాతం వృద్ధి రేటుతో ప్రపంచంలో వేగంగా ప్రగతి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్నట్టు గుర్తు చేశారు. ఇక ముందూ బలమైన వృద్ధిని కొనసాగిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇందులో 16.3 ఎంటీపీఏ సామర్థ్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోగా, ఇండియా సిమెంట్స్, కేశోరామ్ సిమెంట్స్ కొనుగోళ్ల రూపంలో 26.3 ఎంటీపీఏ సామర్థ్యం సమకూర్చుకున్నట్టు కుమార మంగళం బిర్లా తెలిపారు. దీంతో 2025 మార్చి నాటికి మొత్తం సామ ర్థ్యం 188.8 ఎంటీపీఏకు చేరుకున్నట్టు చెప్పారు. ఇక ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 3.5 ఎంటీపీఏ గ్రే సిమెంట్ సామర్థ్యం తోడు కావడంతో ఇది 192.26 ఎంటీపీఏకు చేరుకున్నట్టు తెలిపారు. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖనిర్మాణ రంగం నుంచి డిమాండ్గతిశక్తి తదితర మౌలిక రంగ ప్రాజెక్టులు, ఇళ్ల పథకాలకు ప్రభుత్వం అధిక కేటాయింపులు చేస్తుండడంతో నిర్మాణ రంగం బలమైన పనితీరు చూపించనున్నట్టు కుమార మంగళం తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 34 ఇంటెగ్రేడెడ్ యూనిట్లు, 30 గ్రైండింగ్ యూనిట్లు, 9 బల్క్ టెర్మినళ్లు ఉన్నాయని వివరిస్తూ.. ఈ స్థాయి సామర్థ్యంతో దేశ డిమాండ్ అవసరాలను తీర్చగలమని చెప్పారు. -
ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖ
రియల్ మనీ గేమ్స్పై నిషేధం విధించే విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ఆన్లైన్ గేమింగ్ సంస్థలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈమేరకు లేఖ రాయడం గమనార్హం. ఇప్పటికే ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లులో ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించడానికి ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేశారు.ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్), ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్), ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) సంయుక్తంగా కేంద్రం హోం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో ఆసక్తికర అంశాలు తెలిపారు. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ విభాగం ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీని సృష్టిస్తుందని చెప్పారు. ‘భారతదేశపు డిజిటల్ గేమింగ్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది యువ పారిశ్రామికవేత్తలు, డెవలపర్లు, నిపుణులు కొత్త ఆన్లైన్ గేమింగ్ బిల్లు వల్ల తీవ్రంగా ప్రభావితం చెందుతారు. ఇందులోని నిషేధ నియమాలు చట్టబద్ధమైన, ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమను దెబ్బ తీస్తుంది’ అని తెలిపారు.ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ.2 లక్షల కోట్లకు పైగా ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ను, రూ.31,000 కోట్ల వార్షిక ఆదాయం, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తోందని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. 20 శాతం సీఏజీఆర్తో వృద్ధి చెందుతున్న ఈ రంగం 2028 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా. భారతదేశంలో ఆన్లైన్ గేమర్లు 2020లో 36 కోట్ల నుంచి 2024లో 50 కోట్లకు పెరిగారు. జూన్ 2022 వరకు రూ.25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆ రంగం ఆకర్షించింది. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గేమింగ్, టెక్నాలజీ, డిజిటల్ ఎంటర్టైన్మెంట్లో ప్రపంచానికి నాయకత్వం వహించే అవకాశం భారత్కు ఉందని, నిషేధానికి బదులు ప్రగతిశీల నియంత్రణను అవలంబించాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్!ఈ-స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమింగ్తో సహా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించడానికి, కొన్ని అంశాల్లో నియంత్రించడానికి, వ్యూహాత్మక అభివృద్ధి, నిరంతర పర్యవేక్షణ కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య స్పష్టమైన విభజన సూచించేలా బిల్లును రూపొందించారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్నవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు. -
ఎయిరిండియాకు ఐవోసీ హరిత ఇంధనం
విమానయాన దిగ్గజం ఎయిరిండియాకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) పర్యావరణహిత ఏవియేషన్ ఇంధనం (ఎస్ఏఎఫ్) సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వాడేసిన వంట నూనె నుంచి ఎస్ఏఎఫ్ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఐవోసీ చైర్మన్ అరవిందర్ సింగ్ సాహ్ని తెలిపారు.ఇదీ చదవండి: భారత్పై టారిఫ్ల ప్రభావం అంతంతే!పానిపట్లోని రిఫైనరీలో ఏటా 35,000 టన్నుల హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఐటీసీ, హల్దీరామ్స్ లాంటి హోటళ్లు, రెస్టారెంట్ చెయిన్స్ నుంచి నూనెను సమీకరించనున్నట్లు పేర్కొన్నారు. విమాన రవాణా వల్ల వచ్చే ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోలియంయేతర ముడివనరుల నుంచి ప్రత్యామ్నాయ ఇంధనమైన ఎస్ఏఎఫ్ను తయారు చేస్తారు. లభ్యతను బట్టి సాధారణంగా వినియోగించే విమాన ఇంధనం (ఏటీఎఫ్)లో 50 శాతం వరకు దీన్ని కలపవచ్చు. -
ఏఐ స్టార్టప్లకు వీసీ నిధుల బూస్ట్!
దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రవేశించే ప్రాథమికస్థాయి కంపెనీలకు వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు పెట్టుబడులు అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఏఐ అభివృద్ధి వ్యవస్థ (ఎకోసిస్టమ్)లో ఇటీవల పలు కొత్తతరహా స్టార్టప్లు ఊపిరి పోసుకుంటున్న నేపథ్యంలో వీసీ నిధులకు ప్రాధాన్యత ఏర్పడింది. వివరాలు చూద్దాం.. –సాక్షి, బిజినెస్ డెస్క్ప్రధానంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలపర్ టూల్స్ విభాగాలలోని దేశీ కంపెనీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీసీ సంస్థలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న సంస్థల జాబితాలో వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్, ఎలివేషన్ క్యాపిటల్, యాక్సెల్, లైట్స్పీడ్, ప్రోజస్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తదితరాలు చేరాయి. దీంతో ఏఐలో మౌలిక, డెవలపర్ విభాగాలపై దృష్టిపెట్టిన కంపెనీలు ఎంటర్ప్రైజ్లుగా అభివృద్ధి చెందేందుకు వీసీ నిధులు తోడ్పాటునివ్వనున్నాయి. వెరసి ఎజెంటిక్ ప్లాట్ఫామ్స్కు జోష్ లభించనుంది. తద్వారా స్వతంత్ర ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి వీలు చిక్కనుంది.అంటే వివిధ టాస్్కలను స్వతంత్రంగా నిర్వహించగల సామర్థ్యమున్న సాఫ్ట్వేర్ ఆధారిత టూల్స్ ఊపిరిపోసుకోనున్నాయి. ఇవి సంబంధిత ఆర్గనైజేషన్లలో క్లిష్టతరహా పనులను చక్కబెట్టడంతోపాటు.. విభిన్న వ్యవస్థలతో సమీకృతంకాగలవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వీటికి ప్రత్యేకించిన సర్విసులను పూర్తి చేయడంపై ఆయా ప్లాట్ఫామ్స్ దృష్టిపెడతాయని తెలియజేశాయి. ఒకే టాస్్కకు పరిమితమయ్యే సంప్రదాయ ఏఐ టూల్స్తో పోలిస్తే వీటి పరిధి విస్తారంగా ఉంటుందని వివరించాయి. పలు కార్యకలాపాలను ఆటోమేషన్తో అనుసంధానించవచ్చని తెలియజేశాయి. కొత్త తరహా టూల్స్ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ (డెవ్ఆప్స్) ఆటోమేషన్, భారీస్థాయి ఎడాప్షన్ ప్లాట్ఫామ్స్పై దృష్టిపెట్టిన స్టార్టప్లకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫలితంగా ఆయా స్టార్టప్లలో పెట్టుబడులకు వీసీ సంస్థలు ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆధునిక, సరికొత్త మోడళ్లు ఊపిరిపోసుకున్న ప్రతిసారీ ప్లాట్ఫామ్స్ మారిపోతుంటాయని ఎలివేషన్ క్యాపిటల్ ఏఐ పార్ట్నర్ కృష్ణ మెహ్రా తెలియజేశారు.దీంతో పూర్తిస్థాయిలో సరికొత్త అవకాశాలకు తెరలేస్తుంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భాలు(సైకిల్స్) ఆయా స్టార్టప్ల వ్యవస్థాపకులకు అవకాశాలను కల్పిస్తాయని, తద్వారా ప్రపంచస్థాయిలో పోటీపడగల సంస్థలుగా తీర్చిదిద్దేందుకు వీలు చిక్కుతుందని వివరించారు. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025) జనవరి నుంచి జూలైవరకూ దేశీ జెన్ఏఐ స్టార్టప్లు 52.4 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,600 కోట్లు) అందుకున్నట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.పెట్టుబడుల తీరిదీ..సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎలివేషన్ క్యాపిటల్ గత రెండేళ్లలో 15–20 ఏఐ పెట్టుబడులను చేపట్టడం గమనార్హం! ఇక ఎంటర్ప్రైజెస్లు కనెక్ట్ అయ్యేందుకు, తమ సాఫ్ట్వేర్ టూల్స్ను క్రమబద్ధీకరించుకునేందుకు సహకరించే యూనిఫై యాప్స్ వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 2–2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 200 కోట్లు) సమీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2023లో ఏర్పాటైన ఈ సంస్థలో ఎలివేషన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. అప్లికేషన్ల బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయింగ్ చేపట్టే ఎమర్జెంట్ ఏఐ.. లైట్స్పీడ్ వెంచర్ తదితర సంస్థల నుంచి 2 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది.కేవలం రెండు నెలల్లోనే ఈ సంస్థ కోటి డాలర్ల(రూ.87 కోట్లు) వార్షిక రికరింగ్ టర్నోవర్ సాధించడం విశేషం! ఈ బాటలో లైట్స్పీడ్ తదితర సంస్థల నుంచి ఎజెంటిక్ స్టార్టప్.. కంపోజియో 2.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఎంటర్ప్రైజ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ ఆటోమేట్ చేసే రీఫోల్డ్ ఏఐ.. ఎనియాక్ వెంచర్స్, టైడల్ వెంచర్స్ తదితరాల నుంచి 6.5 మిలియన్ డాలర్లు(రూ.56 కోట్లు) సీడ్ఫండ్గా అందుకుంది. ప్రోజస్,యాక్సెల్, ఎక్సీడ్ వెంచర్స్ నుంచి సాఫ్ట్వేర్ ప్రొడక్టివిటీ ప్లాట్ఫామ్.. కోడ్కర్మ 2.5 మి. డాలర్లు(రూ.21 కోట్లు) పొందింది. -
టెక్నాలజీలో కెరీర్ కోసం.. టెక్బీ ప్రోగ్రామ్
ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అయిన HCLTech.. హైదరాబాద్లోని హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం టెక్బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ను అందించాలని & వారికి టెక్నాలజీ పరిశ్రమలో కెరీర్లను నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాలని యోచిస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.టెక్బీ అనేది ప్రత్యేకంగా హైస్కూల్ గ్రాడ్యుయేట్ల కోసం రూపొందించిన ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోగలరు. ఇది టెక్నాలజీలో ప్రపంచ కెరీర్లకు పునాదులు వేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది.టెక్బీ గ్రాడ్యుయేట్లు ఇప్పటికే ఏఐ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన రంగాలలో తమ సహకారాన్ని అందిస్తున్నారు. HCLTech ఫార్చ్యూన్ 500 క్లయింట్లకు సేవలు అందిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!టెక్బీ అనేది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల కంటే ముఖ్యమైంది. ఇది టెక్ రంగంలో కెరీర్లను నిర్మించుకోవడానికి సహకరిస్తుందని.. HCLTech సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బరామన్ అన్నారు. బిట్స్ పిలానీ. ఐఐటీ గువహతి, శాస్త్ర యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, ఐఐఐటీ కొట్టాయం, ఐఐఎం సిర్మౌర్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ కార్యక్రమం యువతకు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని పెంపొందిస్తుంది. -
ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?
దేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో ఒకటైన ఉత్తరప్రదేశ్.. చరిత్ర, సంస్కృతికి నిదర్శనం. ఎంతోమంది గొప్ప రాజకీయంగా నాయకులను అందించిన.. ఈ రాష్ట్రం దేశానికి కొంతమంది సంపన్న వ్యవస్థాపకులు కూడా అందించింది. ఈ కథనంలో యూపీలో అత్యంత ధనవంతులు, వారి నికర విలువ (అంచనా) గురించి తెలుసుకుందాం.➤మురళీధర్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 14,000 కోట్లు➤బిమల్ జ్ఞాన్చందాని - ఘాడి డిటర్జెంట్: రూ. 9,000 కోట్లు➤విజయ్ శేఖర్ శర్మ - పేటీఎం: రూ. 8,000 కోట్లు➤దినేష్ చంద్ర అగర్వాల్ - ఇండియామార్ట్: రూ. 5,400 కోట్లు➤అలఖ్ పాండే - ఫిజిక్స్ వాలా: రూ. 4,500 కోట్లు➤ప్రదీప్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ. 4,400 కోట్లు➤చక్రేష్ కుమార్ జైన్ - పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ.4,400 కోట్లు➤యశ్వర్ధన్ అగర్వాల్ - ప్రియాగోల్డ్ బిస్కెట్స్: రూ. 4,200 కోట్లుఇదీ చదవండి: యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత -
అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు వివిధ రంగాలలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆంక్షల కారణంగా సుమారు 3,00,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా.అమెరికా విధించిన సుంకాల ప్రభావం చాలా వరకు వస్త్ర పరిశ్రమ, రత్నాల పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రంగాల్లో పనిచేస్తున్న లక్షలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ఎగుమతులు తగ్గినప్పటికీ.. దేశంలో డిమాండ్ ఉంటుందని, అమెరికా సుంకాలు భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపవని మరికొందరు చెబుతున్నారు.వస్త్ర, రత్నాల రంగాలను పక్కన పెడితే.. ఐటీ సర్వీస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా అమెరికా సుంకాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఆటో విడిభాల సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని జీనియస్ హెచ్ఆర్టెక్ వ్యవస్థాపకులు & సీఎండీ ఆర్పీ యాదవ్ అన్నారు.భారతదేశం వస్త్రాలను, రత్నాభరణాలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అయితే టారీఫ్స్ పెరగడం వల్ల ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారింది. సుంకాలు పెరగడం వల్ల.. ధరలు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే మన దేశం ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవడం ద్వారా.. నష్టాన్ని ఆపవచ్చు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?అమెరికాకు భారతదేశం ఎగుమతులు 87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది జీడీపీలో కేవలం 2.2 శాతం మాత్రమే. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక పరిశ్రమలు ప్రస్తుతానికి ప్రభావితం కాలేదు. భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించగలదని టీమ్లీజ్ సర్వీసెస్లో ఎస్వీపీ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ పేర్కొన్నారు. -
యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత
సాధారణంగా ఎక్కువమంది తక్కువ ధరలో.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లనే ఎంచుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే రిలయన్స్ జియో మాత్రం రోజుకు 1జీబీ డేటా ఇస్తున్న రూ. 249 ప్లాన్ను నిలిపివేసింది.ఆగస్టు 18 నుంచి జియో తన ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ. 249 (రోజుకి 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ)ను నిలిపివేసింది. కాబట్టి ఇప్పుడు వినియోగదారులు రూ. 299 ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ రోజుకి 1.5 జీబీ డేటా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులే.ఇప్పటి వరకు రూ. 249తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు.. ఇకపై మరో 50 రూపాయలు వెచ్చించి రూ. 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ ద్వారా రోజుకి 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక అవుతుంది.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఇది కాకుండా రూ. 189 ప్లాన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా 2జీబీ డేటా, 300 ఎస్ఎమ్ఎస్లు, 28 రోజులపాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. డేటా అవసరం లేదు అనుకున్న యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కంపెనీ 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్ తిరిగి ఎప్పుడు ప్రవేశపెడుతుంది? అనే వివరాలు వెల్లడికాలేదు. బహుశా ఈ ప్లాన్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది. -
‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’
అమెరికాలో 14 ఏళ్లు పనిచేసి న్యూయార్క్ నుంచి చెన్నైకి వచ్చిన ఓ వ్యక్తి స్టార్టప్ సంస్థ ప్రారంభించినట్లు తెలిపిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. యూఎస్ నుంచి ఇండియా వచ్చే సమయంలో తన తన బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.90,000 మాత్రమే ఉన్నాయని లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ఎలాంటి ఆర్థిక భరోసా లేకుండా 11 నెలల చిన్నారితో యూఎస్ నుంచి భారత్ వస్తున్న తనను తన భార్య ఓ పిచ్చిడిలా చూసినట్లు చెప్పుకొచ్చారు. వివేక్ తిరువేంగడం చేసిన ఈ పోస్ట్కాస్తా వైరల్గా మారింది.‘యూఎస్ నుంచి భారత్ రావాలని నిర్ణయించుకొని 2020 డిసెంబర్ 23న న్యూయార్క్ నుంచి చెన్నైకి వన్-వే ఫ్లైట్ టిక్కెట్ తీసుకున్నాను. ఆ సమయంలో నా బ్యాంకు ఖాతాలో రూ.90,000 ఉన్నాయి. 11 నెలల చిన్నారిని, నా భార్యను తీసుకొని విమానం ఎక్కాను. నా భార్య నన్నో పిచ్చోడిలా చూసింది. ఇండియా వచ్చేది మరో కంపెనీలో చేరడానికో.. మంచి వేతనం కోసం పని చేసేందుకో కాదు. స్టార్టప్ కంపెనీ పెట్టాలని భావించాను. కొవిడ్ సమయంలో అది అంత సులువు కాదు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. జాబ్ లేదు, ఆఫీస్ లేదు, ఇన్వెస్టర్లు లేరు. కేవలం ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ఉన్నాయి’ అని తిరువేంగడం ఉన్నారు.‘వర్కింగ్ ప్రొఫెషనల్స్ లక్ష్యంగా ఫిట్నెస్ కంపెనీని ప్రారంభించాలనుకున్నాను. కానీ కరోనా ప్రభావం కారణంగా ఇంకొంత కాలం వెయిట్ చేయమని కొందరు సలహా ఇచ్చారు. వారి మాటలు పట్టించుకోకుండా వెంటనే సంస్థను మొదలు పెట్టాను. ఐదేళ్ల తర్వాత చూస్తే నా కంపెనీలో 750+ ఉద్యోగులున్నారు. ఆరుగురితో కూడిన ప్రత్యేక బృందం కంపెనీని నడుపుతోంది’ అని చెప్పారు. ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘14 ఏళ్లుగా అమెరికాలో ఉంటే కేవలం రూ.90వేలు మాత్రమే మిగిలాయా? ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా?’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘ఎలాంటి సేఫ్టీ లేకుండా ఇలాంటి సాహసం చేయడం నిజంగా భయంకరమైన విషయం’ అని మరొకరు చెప్పారు.ఇదీ చదవండి: పేరుకుపోతోన్న ‘వీఐ’ అప్పుల కుప్పజీవితంలో ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించి ముందుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అందరికీ ఇలా విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అందుకే సాహసోపేత నిర్ణయం తీసుకునేముందు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని చెబుతున్నారు. ఏదైనా అత్యవసర సమయాల్లో కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే లైఫ్స్టైల్కు అవసరమయ్యేలా కనీసం ఏడాదిపాటు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ను క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. -
పేరుకుపోతోన్న ‘వీఐ’ అప్పుల కుప్ప
బ్యాంకులు వంటి సంప్రదాయ రుణదాతల నుంచి కొత్త రుణాలు పొందడంలో అడ్డంకులు ఎదురవుతుండటంతో వొడాఫోన్ ఐడియా (వీఐ) బ్యాంకింగేతర వనరుల ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)కు సంబంధించిన బకాయిలు పెరుగుతున్నాయి. కంపెనీ మొత్తం రుణాలు రూ.2 లక్షల కోట్లకుపైగా పేరుకుపోవడంతో వీఐ ఈమేరకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ బ్యాంకులతో రుణాలపై చర్చలు నిలిచిపోవడంతో వీఐ మూలధన వ్యయం (కాపెక్స్) ప్రణాళికలను కొనసాగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.నాన్ బ్యాంక్ ఫండింగ్వీఐ ఏజీఆర్ బకాయిల భారం రూ.75,000 కోట్లకు చేరడంతో కంపెనీ ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు నెలకొన్నాయి. ఏజీఆర్ రుణాల పరిష్కారంపై మరింత స్పష్టత వచ్చే వరకు బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. దాంతో సంప్రదాయ ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణకు బదులుగా బ్యాంకింగేతర సంస్థల్లో రుణాల కోసం ప్రయత్నిస్తోంది. రూ.50,000-రూ.55,000 కోట్ల కాపెక్స్ కోసం ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్, ఇతర నాన్ బ్యాంకింగ్ రుణదాతల నుంచి నిధులను కోరుతోంది. దేశంలోని 17 సర్కిళ్లలో 5జీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు సమకూర్చడంపై కంపెనీ దృష్టి సారించింది.ముందస్తు చర్చల్లో కొన్ని కంపెనీలుడేవిడ్సన్ కెంప్నర్, ఓక్ట్రీ, వెర్డే పార్ట్నర్స్ వంటి సంస్థలు వీఐకి స్వల్పకాలిక రుణాన్ని అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే సంప్రదాయ బ్యాంకుల నుంచి వీఐ కోరిన రూ.25,000 కోట్లతో పోలిస్తే ఈ సంస్థలు తక్కువ మొత్తాన్ని అందించే అవకాశం ఉంది. కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,440 కోట్లు ఖర్చు చేసింది. తన నెట్వర్క్ విస్తరణ, 5జీ రోల్అవుట్ను కొనసాగించడానికి సెప్టెంబర్ 2025 నాటికి మరో రూ.5,000–రూ.6,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: యూపీఐ వినియోగంలో టాప్లో ఉన్న రాష్ట్రం ఇదే..ఏజీఆర్ బకాయిలపై ప్రభుత్వం జోక్యంఅపరిష్కృతంగా ఉన్న ఏజీఆర్ బకాయిల సమస్య వీఐ ఆర్థిక వృద్ధికి అవరోధంగా మారింది. 2026 మార్చి లోపు ఏజీఆర్ బకాయిలను పరిష్కరించాలని కంపెనీ భారత ప్రభుత్వాన్ని కోరింది. అప్పులను తగ్గించి, బ్యాంకుల నుంచి కొత్త మూలధనాన్ని సమీకరించేందుకు వీలు కల్పించేలా ప్రభుత్వ సహకారంపై కంపెనీ ఆశలు పెట్టుకుంది. -
ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్
ఉద్యోగులు ఆదివారాల్లోనూ పనిచేయాలని సూచిస్తూ లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ కొంతకాలం కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇటీవల వివరణ ఇచ్చారు. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా మందకొడిగా సాగుతున్న ప్రాజెక్టు పురోగతిపై అంతర్గతంగా చర్చించామన్నారు. అందులో భాగంగా అనధికారిక సంభాషణ సందర్భంగా సుబ్రమణ్యన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించారు.‘అప్పుడు ఉన్న పర్థితులు భిన్నంగా ఉన్నాయి. కంపెనీతో బిజినెస్ చేస్తున్న ఐదారుగురు క్లయింట్లతోపాటు కొందరు హైప్రొఫైల్ క్లయింట్లు నాతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఉత్పాదకతకు సంబంధించి ఫోన్ చేశారు. మా పురోగతి గురించి ఈమెయిల్స్ పంపారు. నాతోపాటు టీమ్ ప్రమేయం ఉన్నప్పటికీ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదు. ఆ సందర్భంలో అనధికారికంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. కానీ దీన్ని తప్పకుండా పాటించాలనేలా మాత్రం చెప్పలేదు. ఈ అనధికారిక సంభాషణ సమయంలో రికార్డ్ చేయొద్దనే నియమాలున్నాయి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఊపిరి పీల్చుకున్న పసిడి ప్రియులు..ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో, ఉద్యోగ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. తన భార్య కూడా తన పేరుకు భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సుబ్రమణ్యన్ చెప్పారు. ‘ఈ సంఘటన నా మనసును ఉంతో కలచివేసింది. ఏదేమైనా విషయం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకోలేను. ఎల్ అండ్ టీలో పనితీరే కీలకం’ అని అన్నారు. -
నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ
ప్రీమియంలను చెల్లించకుండా నిలిపివేసిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇది ఆగస్టు 18న ప్రారంభమై అక్టోబర్ 17 వరకు ఉంటుంది. దీని కింద ఆలస్య రుసుములపై మినహాయింపులు కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.నాన్–లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై ఇది 30 శాతం వరకు ఉంటుంది. గరిష్టంగా రూ.5,000 వరకు మినహాయింపు పొందవచ్చు. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపై లేట్ ఫీజులపై 100 శాతం మినహాయింపు ఉంటుంది. స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ కింద తొలిసారిగా ప్రీమియంను నిలిపివేసిన తేదీ నుంచి అయిదేళ్ల లోపు వ్యవధి వరకు పాలసీలను, నిర్దిష్ట షరతులకు లోబడి పునరుద్ధరించుకోవచ్చు. పరిస్థితులు అనుకూలించక ప్రీమియంలను సకాలంలో చెల్లించలేకపోయిన వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఇంటెల్ రహస్య పత్రాలు దొంగలించి మైక్రోసాఫ్ట్లో.. -
ఒక్క మెయిల్.. గుండెపోటు వచ్చినంత పనైంది!
ఉద్యోగం చేస్తున్నవారిలో చాలామంది కోరుకునేది.. వాళ్ళను కంపెనీ నుంచి తొలగించకూడదనే. అయితే అనుకోకుండా జాబ్ నుంచి తీసేస్తున్నట్లు మెయిల్ వస్తే?, గుండె ఆగినంత పని అయిపోతుంది. ఇలాంటి సంఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?..టెర్మినేషన్ అనే సబ్జెక్ట్ లైన్తో.. హెచ్ఆర్ నుంచి కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ మెయిల్ అందింది. ఈ మెయిల్ చూడగానే దాదాపు ఉద్యోగులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఉద్యోగం నుంచి తొలగించేసారమో భయపడ్డారు. అయితే ''భద్రతా ఉల్లంఘనల కారణంగా ఇద్దరు ఉద్యోగులను తొలగించినట్లు'' ఆ మెయిల్ సారాంశం. చదివిన తరువాత ఊపిరి పీల్చుకున్నారు.మెయిల్ చూడగానే.. గుండెపోటు వచ్చినంత పనైందని కొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. వారికి వచ్చిన మెయిల్ ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి ఇలాంటి మెయిల్స్.. కోవిడ్ సమయంలో చాలామంది అందుకున్నారు. అప్పటి నుంచి ఇలాంటి మెసేజస్ వస్తే.. ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టేస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఉద్యోగులు మెయిల్ చూడగానే భయపడినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? -
టెక్ దిగ్గజం కొత్త రూల్.. జనవరి నుంచే అమలు!
ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన.. మైక్రోసాఫ్ట్ తన హైబ్రిడ్ పని నియమాలను మరింత కఠినతరం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఉద్యోగులు ఎక్కువ సమయం ఆఫీసులో ఉండాలని.. వారానికి మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని చెబుతోంది. ఈ రూల్ జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఉద్యోగులు ఆఫీసుకు రప్పించడానికి.. మైక్రోసాఫ్ట్ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కంపెనీ సెప్టెంబర్లో విడుదల చేసే అవకాశం ఉంది. 2020 చివర నుంచి సౌకర్యవంతమైన పని జీవితాన్ని అందించిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు కొంత కఠినంగా వ్యవహరిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు: సుందర్ పిచాయ్వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ అమలు చేసిన తరువాత చాలామంది ఇంటి నుంచి పనిచేయడానికే అలవాటు పడిపోయారు. అయితే ఈ విధానానికి స్వస్తి చెప్పడానికి కంపెనీ తగిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలనే కొత్త విధానం అమలు చేయడానికి సంకల్పించింది. చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిపోవడం చేత.. మళ్ళీ ఆఫీసులకు రావాలంటే కొంత కష్టంగానే భావిస్తారు. -
ఇంటెల్ రహస్య పత్రాలు దొంగలించి మైక్రోసాఫ్ట్లో..
చట్టవిరుద్ధంగా కంపెనీ రహస్య పత్రాలను దొంగలించి మైక్రోసాఫ్ట్తో పంచుకున్న ఇంటెల్ మాజీ ఇంజినీర్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు 34,000 డాలర్ల(సుమారు రూ.29 లక్షలు)కు పైగా జరిమానా విధించించారు. ఇంటెల్లో ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంజినీర్గా దాదాపు పదేళ్లు పనిచేసిన వరుణ్ గుప్తాకు ఇటీవల ఈమేరకు శిక్ష ఖరారు చేశారు. ఈ దుష్ప్రవర్తన కారణంగా మైక్రోసాఫ్ట్ కూడా వరుణ్ను పదవి నుంచి తొలగించింది.అసిస్టెంట్ యూఎస్ అటార్నీ విలియం నరస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుప్తా ఇంటెల్ కంపెనీకి 2020లో రాజీనామా చేయడానికి ముందు సంస్థ కేటాయించిన కంప్యూటర్ నుంచి వేలాది రహస్య ఫైళ్లను వ్యక్తిగత హార్డ్ డ్రైవ్కు బదిలీ చేసుకున్నాడు. తర్వాత కంప్యూటర్ ప్రాసెసర్లతో కూడిన ఒప్పందంతో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగంలో చేరాడు. ఇంటెల్లో దొంగలించిన ఫైళ్లను కొంత కాలానికి మైక్రోసాఫ్ట్లో యాక్సెస్ చేశాడు. గుప్తా యాక్సెస్ చేసిన డాక్యుమెంట్లలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. ఇది ఇంటెల్ ధరల వ్యూహాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: చదువుతో ఆర్థిక అక్షరాస్యత వస్తుందా?ఈ కారణంగా మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం కోల్పోవడంతోపాటు ఇంటెక్ కంపెనీకి జరిమానాగా 34,000 డాలర్లు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. గుప్తా తన చర్యలకు విచారం వ్యక్తం చేస్తూ..తాను తీసుకున్న చెడు నిర్ణయంతో చాలా కోల్పోయానని చెప్పాడు. ఇంటెల్, మైక్రోసాఫ్ట్తోపాటు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాడు. పని చేస్తున్న సంస్థను ఎంతో గౌరవించాలని, తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష తప్పదని ఈ వార్తపై కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు భారీగా పెరిగిపోయాయి. మంచి లాభాల్లో నడుస్తున్న, దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీకి అప్పులేంటి అనుకుంటున్నారా? కంపెనీ ఎంత లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ వ్యాపారాలను విస్తరించడానికి అప్పులు అవసరమవుతాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ రంగాల్లో దూకుడుగా పెట్టుబడులను కొనసాగిస్తోంది. అందుకే అప్పులు పెరిగాయి.ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీ మొత్తం అప్పు రూ.3.47 లక్షల కోట్లు కాగా, నికర రుణం రూ.1.17 లక్షల కోట్లు. గతేడాది అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అప్పు రూ.3.24 లక్షల కోట్లు. బలమైన ఆర్థిక స్థితిని కొనసాగిస్తూనే వ్యాపారాలను పెంచుకునేందుకు భారీ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,31,107 కోట్ల మూలధన వ్యయాన్ని చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఈ మొత్తం రూ.1,31,769 కోట్లుగా ఉంది. వార్షిక నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం పెట్టుబడులలో ఎక్కువ భాగం క్రూడాయిల్ నుంచి కెమికల్స్ తయారు చేసే కొత్త ఓ2సీ ప్రాజెక్టులు, రిటైల్ స్టోర్ల ఏర్పాటు, డిజిటల్ సర్వీసుల పెంపు, నూతన ఇంధన వెంచర్లను అభివృద్ధి వైపు మళ్లించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇక ఆదాయం విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,57,163 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతక్రితం ఏడాది రూ.5,74,956 కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం తక్కువ. కంపెనీ ఎబిటా గత ఏడాది రూ.86,393 కోట్ల నుంచి 14.2 శాతం క్షీణించి రూ.74,163 కోట్లకు పరిమితమైంది. -
భారత్లో యాపిల్ రూ.1010 కోట్ల ఆఫీస్..
టెక్ దిగ్గజం యాపిల్ ఇండియా తన దేశీయ కార్యకలాపాలను విస్తరించే దిశగా భారీ అడుగు వేసింది. బెంగుళూరులోని వసంత్నగర్లో ఉన్న ఎంబసీ జెనిత్ భవనంలో 2.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజ్కు తీసుకుంది. ఈ డడీల్ విలువ సుమారు రూ.1,010 కోట్లు కాగా, ఇదే ఇప్పటివరకు యాపిల్ ఇండియాలో తీసుకున్న అతిపెద్ద కార్యాలయ స్థలం.డీల్లోని కీలక అంశాలుఎంబసీ గ్రూప్కు చెందిన సంస్థ మాక్ చార్ల్స్ (ఇండియా) లిమిటెడ్ నుంచి యాపిల్ ఈ స్థలాన్ని లీజ్కు తీసుకుంది. 5వ అంతస్తు నుండి 13వ అంతస్తు వరకూ మొత్తం 2.7 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని యాపిల్ తీసుకుంది. ఇందుకు నెలకు రూ.6.315 కోట్లు (చదరపు అడుగుకు రూ.235) చొప్పున అద్దె చెల్లించనుంది. ఈ లీజ్ కాల వ్యవధి 10 సంవత్సరాలు. ఏటా 4.5 శాతం చెప్పున అద్దె పెరుగుతుంది. ఇందుకోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.31.57 కోట్లుగా డీల్లో రాసుకున్నారు.ఇంకా విస్తరించే యోచనఎంబసీ జెనిత్ భవనంలో 5 నుండి 13వ అంతస్తు వరకు లీజుకు తీసుకున్న యాపిల్ సంస్థ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ నుండి 4వ అంతస్తు వరకు అదనంగా 1.21 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కూడా అద్దెకు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఇది జరిగితే, మొత్తం కార్యాలయ విస్తీర్ణం 4 లక్షల చదరపు అడుగులకు చేరుతుంది.భారత్లో వ్యూహాత్మక ప్రాధాన్యతయాపిల్ ఈ విస్తరణతో భారతదేశంలో తన ఉనికిని మరింత పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా ఐఫోన్ ఉత్పత్తిని పెంచనున్నట్లు ఇప్పటికే యాపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బెంగుళూరు, పుణేలో రిటైల్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా భారత టెక్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో కీలక పాత్ర పోషించాలని యాపిల్ భావిస్తున్నట్లుగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. యాపిల్ ఇప్పటికే 2021లో ప్రెస్టిజ్ మిన్స్క్ స్క్వేర్లో 1.16 లక్షల చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది, 2023లో అక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: నగరం నలువైపులా భారీ లేఅవుట్లు.. కొత్త వెంచర్లు.. -
గూగుల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు: సుందర్ పిచాయ్
ఒకప్పుడు ఇంటర్వ్యూ అంటే.. ముఖాముఖి నిర్వహించేవాళ్ళు. టెక్నాలజీ పెరిగిన తరువాత వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు చేయడం మొదలైంది. ఈ విధానం ద్వారా ఇంటర్వ్యూలు జరిపితే.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వర్చువల్ విధానంలో జరిగే ఇంటర్యూలపై గూగుల్ సీఈఓ కీలక వ్యాఖ్యలు చేశారు.వర్చువల్ విధానంలో ఇంటర్యూలు నిర్వహిస్తుంటే అభ్యర్థులు కొందరు మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నివారించడానికే గూగుల్ కంపెనీలో మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు 'సుందర్ పిచాయ్' పేర్కొన్నారు. ఏఐ వినియోగం పెరుగుతున్నందున వర్చువల్ ఇంటర్వ్యూలు సమంజసం కాదని కంపెనీలోని ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా.. ఇంటర్యూలను షెడ్యూల్ చేయడం సులభం. అంతే కాకుండా శ్రమ, వ్యయం కూడా తగ్గుతాయి. అయితే కొందరు మోసం చేయడం మొదలు పెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ఇంటర్వ్యూ చేయదలచిన అభ్యర్థిని, కనీసం ఒక్కసారైనా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో భారీగా బయటపడ్డ బంగారు నిక్షేపాలుప్రస్తుతం ఈ సమస్య ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో గూగుల్ మాత్రమే కాకుండా.. అమెజాన్, ఆంత్రోపిక్ , సిస్కో, మెకిన్సే వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే.. కంపెనీలన్నీ వర్చువల్ ఇంటర్వ్యూ విధానానికి మెల్లగా చరమగీతం పాడేసి, మళ్ళీ వ్యక్తిగత ఇంటర్వ్యూలకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. -
'ఇండియాలో ధరలు ఇలా ఉన్నాయ్': ఎన్ఆర్ఐ షాక్
కెనడాలో పాలు రూ.396, బ్రెడ్ రూ.230 అని ఇప్పటికే చదువుకున్నాం. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కూడా ఒక కప్పు టీ తాగడానికి రూ.1000 ఖర్చు చేశానని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. దుబాయ్కు చెందిన భారతీయ ట్రావెల్ వ్లాగర్ & రేడియో ప్రెజెంటర్ 'పరీక్షిత్ బలోచి'.. ఇండియాలో పెరుగుతున్న జీవన వ్యయం గురించి వెల్లడించడం చూడవచ్చు. ముంబైలోని ఒక హోటల్లో ఒక కప్పు టీ తాగడానికి తనకు రూ. 1,000 ఖర్చైన విషయాన్ని వెల్లడించాడు.వస్తువుల ధరలు కొంత తక్కువ ఉంటాయని.. అప్పుడప్పుడు భారతదేశానికి వస్తూ ఉంటానని బలోచి చెప్పాడు. ఎన్నారైలు బలమైన విదేశీ కరెన్సీల నుంచి ప్రయోజనం పొందుతారు. ఇండియాకు వచ్చి విదేశీ కరెన్సీలతో.. ఖర్చులు చేస్తూ ఉంటారు. అయితే ఇకపై భారతదేశంలో అది సాధ్యం కాదని అన్నారు. తాను దిర్హామ్లలో సంపాదిస్తున్న ఎన్ఆర్ఐ అయినప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యానని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: పిల్లలు కనడానికి సిద్దమవుతున్న రోబోలు!ముంబై వంటి నగరాల్లో జీవన విధానం, జీవన వ్యయం అన్నీ మారాయి. ప్రస్తుతం ముంబై దుబాయ్ మాదిరిగా ఖరీదైనదిగా అనిపిస్తోందని పరీక్షిత్ బలోచి అన్నాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత నేను మాత్రమే 'గరీబ్' అనిపించిందని వ్యాఖ్యానించాడు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Parikshit Balochi | RJ | Emcee | Travel | Lifestyle | Dubai (@parikshitbalochi) -
రైలు టికెట్లు రయ్మని బుక్ అయ్యేలా.. కొత్త అప్గ్రేడ్ వస్తోంది
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది. పండుగ కాలాల్లో, ప్రత్యేక రైళ్ల సమయంలో, లేదా జనరల్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఆలస్యం, సాంకేతిక సమస్యలు తగ్గనున్నాయి.కొత్త పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా నిమిషానికి 1 లక్ష టికెట్లు బుక్ చేయగల సామర్థ్యం కలుగుతుంది. పీఆర్ఎస్కు ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉంది. ఈ అప్గ్రేడ్లో భాగంగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్, మెరుగైన నెట్వర్క్, భద్రతా వ్యవస్థలు, ఆధునిక హార్డ్వేర్ అమలు చేయబోతున్నారు.ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి రైల్వే శాఖ రైల్వన్ (RailOne) అనే కొత్త సూపర్ యాప్ను కూడా ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్, పీఎస్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డర్, ఫీడ్బ్యాక్ వంటి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. రైల్వన్ యాప్లో సింగిల్ సైన్-ఆన్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా బయోమెట్రిక్ లేదా ఎంపిన్ ద్వారా లాగిన్ చేయవచ్చు. పలు ప్రాంతీయ భాషల మద్దతుతో, ఈ యాప్ గ్రామీణ, ప్రాంతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిస్తోంది.అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) పరిమితిని కూడా రైల్వే శాఖ ఇదివరకే తగ్గించింది. అప్పటివరకు ప్రయాణానికి 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, నవంబర్ 1, 2024 నుంచి దీన్ని 60 రోజులకు పరిమితం చేసింది. ఇక దీపావళి, ఛఠ్ పూజా వంటి పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు, రైల్వే శాఖ ఫెస్టివల్ రౌండప్ ట్రిప్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అక్టోబర్ 13–26, నవంబర్ 17–డిసెంబర్ 1 మధ్య రిటర్న్ టికెట్లపై 20% డిస్కౌంట్ అందిస్తోంది. -
మస్క్ తొలగించిన సీఈవో.. మళ్లీ ‘ప్యారలల్’గా దూసుకొచ్చాడు!
ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ మళ్లీ టెక్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన స్థాపించిన కొత్త ఏఐ స్టార్టప్ ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ ఇటీవలే 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.250 కోట్లు) పెట్టుబడులను సమీకరించింది. ఖోస్లా వెంచర్స్, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ వంటి ప్రముఖ వెంచర్ క్యాపిటల్స్ ఈ సంస్థలో పెట్టుబడి పెట్టాయి.ఏఐకి బ్రౌజర్ ఇచ్చినట్లే!ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ ఒక క్లౌడ్-బేస్డ్ ఏఐ రీసెర్చ్ ప్లాట్ఫారమ్. ఇది ఏఐ మోడల్స్కు రియల్ టైమ్ వెబ్ డేటాను యాక్సెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కల్పిస్తుంది. సాధారణంగా AIలు ట్రైనింగ్ డేటాపై ఆధారపడతాయి. కానీ లైవ్ వెబ్ సమాచారం చదవడం, నిజమైన సమాచారం గుర్తించడం, సమాధానాలపై విశ్వాస స్థాయిని అంచనా వేయడం వంటివి ప్యారలల్ ప్రత్యేకతలు.మానవుల కంటే మెరుగైన అన్వేషణఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన అల్ట్రా8ఎక్స్ (Ultra8x) అనే రీసెర్చ్ ఇంజిన్ 30 నిమిషాల పాటు లోతైన వెబ్ అన్వేషణ చేయగలదు. ఇది ఓపెన్ఏఐ జీపీటీ-5 (OpenAI GPT-5)తో సహా మానవ రీసెర్చర్ల కంటే 10 శాతం మెరుగైన పనితీరును చూపిందని సంస్థ పేర్కొంది. ట్విట్టర్ నుంచి టెక్ రీ-ఎంట్రీ2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత, సీఈవో పదవిలో ఉన్న పరాగ్ అగర్వాల్ను ఎలాన్ మస్క్ తొలగించారు. ఆ తర్వాత పరాగ్ పాలో ఆల్టోలోని కాఫీ షాపుల్లో రీసెర్చ్ పేపర్లు చదువుతూ, కోడ్ రాస్తూ గడిపారు. హెల్త్కేర్ ఏఐ స్టార్టప్ ఆలోచించినా, చివరికి ఏఐకి రియల్ టైమ్ వెబ్ డేటాను విశ్వసనీయంగా అందించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టారు.మస్క్తో రూ.420 కోట్ల సెవరెన్స్ వివాదంపరాగ్ అగర్వాల్ ఇంకా 50 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.420 కోట్లు) సెవరెన్స్ పేమెంట్ కోసం మస్క్తో కోర్టులో పోరాటం చేస్తున్నారు. మస్క్ “ఫర్ కాస్” అనే కారణంతో చెల్లింపును నిలిపివేశాడు. -
బంగారాన్ని మించిపోయిన సిగరెట్లు!
సాక్షి, సిటీబ్యూరో: విదేశాల నుంచి అక్రమ రవాణా అవుతున్న బంగారానికి సంబంధించి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 2023–24 ఆర్థిక సంవత్సరంలో 240 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి 132.4 కేజీల పసిడి స్వాధీనం చేసుకున్నారు. 2024–25 నాటికి కేసుల సంఖ్య 133కి, సీజ్ చేసిన బంగారం 42.5 కేజీలకు తగ్గిపోయింది. కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీని 15 నుంచి ఆరు శాతానికి తగ్గిండచమే దీనికి కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో సిగరెట్ల అక్రమ రవాణా మాత్రం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా ఆ దేశాల నుంచే.. దుబాయ్ హవాలా రాకెట్లతో పాటు ఇప్పుడు బంగారం అక్రమ రవాణాకూ కేంద్రంగా మారిపోయింది. దీంతో పాటు జెద్దా, మస్కట్, కువైట్, బహ్రేన్ నుంచి స్మగ్లింగ్ అవుతుంటుంది. ఆయా దేశాల్లో ఆదాయపు పన్ను విధానం లేకపోవడంతో మనీలాండరింగ్ అనేదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడ నుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపే స్మగ్లర్లు దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకు వస్తుంటారు. గరిష్టంగా ఏడు శాతం తక్కువ రేటు.. ప్రస్తుతం నగరంలో 24 క్యారెట్ల బంగారం కేజీ రూ.కోటి వరకు పలుకుతోంది. ఆయా దేశాల్లో దీని ఖరీదు ఐదు నుంచి ఏడు శాతం తక్కువగా ఉంటుంది. కేజీ బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి సూత్రధారులు రూ.7 లక్షల వరకు ఖర్చు చేస్తారు. గతంలో విదేశాల నుంచి తీసుకువచ్చే బంగారంపై 15 శాతం ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆరు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విదేశాల నుంచి అక్రమ రవాణా చేసి తీసుకువచ్చినా, నేరుగా తీసుకువచ్చినా వచ్చే లాభంలో పెద్ద తేడా లేకపోవడంతో స్మగ్లింగ్ గణనీయంగా తగ్గింది. సిగరెట్లకు భారీగా పెరిగిన డిమాండ్.. బంగారం, ఎల్రక్టానిక్ వస్తువులు, మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. అయితే సిగరెట్లు కూడా పెద్ద సంఖ్యలో స్మగ్లింగ్ అవుతున్నాయి. 2023–24లో కేవలం 54 కేసులు నమోదు కాగా... గత ఆర్థిక సంవత్సరానికి ఈ సంఖ్య 175కు చేరింది. హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.👉 ఇదీ చదవండి: ‘బంగారు’ దేశం.. వంద రూపాయలకే తులం! -
ఒకే స్కూల్కు రూ.300 కోట్లు విరాళం ఇచ్చిన సీఈఓలు
విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల అభివృద్ధి కోసం రూ.వందలు, రూ.వేలు, రూ.లక్షల్లో.. విరాళం ఇవ్వడం సహజంగా చూస్తూంటాం. కానీ తమను అంతటివారిని చేసిన బడి కోసం ఏకంగా రూ.300 కోట్లు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా, ఫెయిర్ ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ ఛైర్మన్ ప్రేమ్ వత్స. ఇంతకీ వారు విరాళం ఇచ్చిన, వారు చదివిన పాఠశాల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్).హెచ్పీఎస్లోని మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, ఉన్న సదుపాయాలను మరింత విస్తరించడానికి ఈ విరాళం ప్రకటించారు. ఈ సహకారం పూర్వ విద్యార్థుల నేతృత్వంలో భారతదేశంలోని అతిపెద్ద విద్యా విరాళాల్లో ఒకటిగా నిలిచింది. క్రెడాయ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పో సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విరాళానికి సంబంధించిన వివరాలు పంచుకుంటూ సదరు సీఈఓలను ప్రశంసించారు. తాము చదువుకున్న నగరానికి, పాఠశాలకు తిరిగి సాయం చేయాలనుకుంటున్నట్లు సీఎం చెప్పారు.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబనఈ నిధులను కొత్త అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి, ఇప్పటికే ఉన్న కొన్ని తరగతి గదులను పునరుద్ధరించడానికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రణాళిక పాఠశాల విస్తృత విజన్ 2050కు అనుగుణంగా ఉందని చెప్పారు. ఈ శతాబ్దం మధ్య కాలం నాటికి హెచ్పీఎస్ను ప్రపంచంలోని టాప్-10 పాఠశాలల్లో ఒకటిగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈమేరకు రెండు సంవత్సరాల క్రితం జరిగిన శతాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రూ.150 కోట్లతో రూపొందించిన విజన్ 2050 బ్లూప్రింట్లో అకడమిక్ అప్గ్రేడ్స్, గ్లోబల్ పార్టనర్షిప్స్, స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి. 1923లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ను స్థాపించారు. -
అడ్డగోలుగా డ్రోన్ల రిజిస్ట్రేషన్..
నిబంధనలను విరుద్ధంగా రిజిస్టర్ అయిన వేలాది డ్రోన్లు, వాటి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు భారత విమానయాన భద్రతా నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డ్రోన్ రిజిస్ట్రేషన్లపై విస్తృత సమీక్ష చేపట్టింది. దిగుమతి నిషేధాలు, తప్పనిసరి నిబంధనలను పాటించకుండా చాలా డ్రోన్లు రిజిస్టర్ అయ్యాయని నివేదికలు వెల్లడైన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ప్రధానంగా చైనా సంస్థలకు చెందిన డ్రోన్లు దేశీయంగా తప్పుడు కారణాలతో నమోదయ్యాయనే వాదనలున్నట్లు తెలిపింది.2021 నుంచి దిగుమతిలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ 8,700కి పైగా చైనా డ్రోన్లు భారతదేశంలో నమోదయ్యాయని జులై 29న ఓ వార్తా సంస్థ కోరిక మేరకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. డ్రోన్ అనుమతులు పొందడానికి తప్పుడు డిక్లరేషన్లను ఉపయోగించే సంస్థలు అధికారిక రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్లైన డిజిటల్ స్కై, ఈ-జీసీఏలను దుర్వినియోగం చేస్తున్నాయని డీజీసీఏ ఇటీవల జారీ చేసిన నోటీసులో పేర్కొంది. కొంతమంది ఆపరేటర్లు తప్పుడు కేటగిరీల కింద యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లను (యూఐఎన్) జనరేట్ చేసేటప్పుడు సర్టిఫికేషన్ ప్రక్రియను దాటవేయడంతో తీవ్రమైన ఉల్లంఘనలు జరుగుతున్నట్లు నోటీసు ఎత్తిచూపింది.ముఖ్యంగా చాలా మంది దరఖాస్తుదారులు కఠినమైన కమర్షియల్ నిబంధనలను పాటించకుండా ఉండడానికి తమ డ్రోన్లను ‘మోడల్ ఆర్పీఏఎస్’ సబ్కేటగిరీ కింద తప్పుగా వర్గీకరించారు. ఇవి విద్య, పరిశోధన, పరీక్ష లేదా వినోద ఉపయోగం కోసం ఉద్దేశించినవి. కానీ వాటిని ఇతర అవసరాల కోసం వాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది నిబంధనల ఉల్లంఘనేనని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి దుర్వినియోగం పౌర విమానయాన వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని అంటున్నారు.ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబనడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి అవసరమైన దిగుమతి అనుమతులు లేకుండానే పలు డ్రోన్లను విదేశాల్లో తయారు చేసి భారత్లోకి తీసుకువచ్చినట్లు డీజీసీఏ వెల్లడించింది. 2022 డీజీఎఫ్టీ నోటిఫికేషన్ ప్రకారం రక్షణ, పరిశోధన, అభివృద్ధి, భద్రతకు సంబంధించిన ప్రయోజనాలు మినహా డ్రోన్ల దిగుమతులు నిషిద్ధం. కొనుగోలు ఇన్వాయిస్లు, దిగుమతి అనుమతులు, డ్రోన్ ఛాయాచిత్రాలు వంటి మద్దతు పత్రాలతో పాటు లిఖితపూర్వక వివరణ ఇవ్వడానికి బాధిత డ్రోన్ కంపెనీలకు ఏవియేషన్ రెగ్యులేటర్ సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ను సమర్థించడంలో విఫలమైతే యూఐఎన్లను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుంది. వాటితోపాటు చట్టపరమైన చర్యలు ఉంటాయి. -
గ్రామీణ మార్కెట్లలో ఎఫ్ఎంసీజీ అమ్మకాల జోరు..
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ అమ్మకాలు పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో మెరుగ్గా ఉన్నట్టు డేటా విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు 4.6 శాతం పెరగ్గా.. దీనికి రెట్టింపు స్థాయిలో 8.4 శాతం మేర గ్రామీణ మార్కెట్లలో వృద్ధి నమోదైనట్టు తన తాజా నివేదికలో తెలిపింది. వరుసగా ఆరో త్రైమాసికంలో అమ్మకాల వృద్ధి (పరిణామం పరంగా) పట్టణాల కంటే గ్రామీణ మార్కెట్లలో అధికంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే మాత్రం జూన్ క్వార్టర్లో గ్రామీణ – పట్టణ ప్రాంతాల మధ్య వృద్ధి పరమైన అంతరం తగ్గినట్టు వెల్లడించింది. మొత్తం మీద జూన్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల్లో (విలువ పరంగా) 13.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. పట్టణాల్లో స్థిరమైన వినియోగానికి తోడు, గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకున్న వినియోగం ఇందుకు మద్దతుగా నిలిచాయి. అమ్మకాల్లో 6%, ధరల పెంపు రూపంలో 7.4% చొప్పున వృద్ధిని సాధించినట్టు, చిన్న ప్యాకెట్లకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తున్నట్టు నీల్సన్ఐక్యూ నివేదిక తెలిపింది. చిన్న పట్టణాల్లో అమ్మకాలు పుంజుకుంటున్నట్టు పేర్కొంది. -
32 ఏళ్లుగా అలాగే బతుకుతున్నాం: ఆకాశ్ అంబానీ
దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబమైన ముఖేష్ అంబానీ కుటుంబం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎన్ని కోట్లున్నా ఆయన కుటుంబంలోని ప్రతిఒక్కరూ అంతే హుందాతనాన్ని ప్రదర్శిస్తారు. తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాన్ని అందిపుచ్చుకున్న ఆకాశ్ అంబానీ.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా ఆ సంస్థను విజవంతంగా నడిపిస్తున్నారు.ప్రతిఒక్కరికీ తమ జీవితంలో ఎవరోఒకరు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తనకు ప్రేరణ ఎవరని అడిగితే ఆకాశ్ అంబానీ మొదట పేర్కొన్నది కార్పొరేట్ ఐకాన్లు లేదా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ కాదు.. తమ తల్లిదండ్రులేనని గర్వంగా చెబుతారు. ఆమధ్య ముంబై టెక్ వీక్ లో మాట్లాడిన సందర్భంగా గట్టి బంధం ఉన్న కుటుంబంలో పెరగడం తన పని నైతికతను, ఏకాగ్రతను ఎలా తీర్చిదిద్దిందో వివరించారు. నిస్సందేహంగా, మేము పెరిగిన కుటుంబమే అతిపెద్ద ప్రేరణ అని ఆయన అన్నారు. 32 ఏళ్లుగా తామంతా ఒకే గొడుగు కింద జీవిస్తున్నామని, ముఖ్యంగా తన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి ఎప్పటికీ ఉంటుందని అన్నారు.ఇప్పటికీ తల్లిదండ్రుల నుంచి రోజువారీ క్రమశిక్షణ, వ్యక్తిగత నిబద్ధతను గమనిస్తుంటానంటారు ఆకాశ్. ముఖేష్ అంబానీ ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటల వరకు తనకు వచ్చే ప్రతి ఈమెయిల్ నూ చదివి క్లియర్ చేస్తారని, ఆ పని ఆయన నలబై ఏళ్లుగా చేస్తున్నారని, ఇక్కడి నుంచే తనకు స్ఫూర్తి వచ్చిందని ఆకాశ్ వివరించారు. ఇక తన తల్లి నీతా అంబానీ నుంచి ఏకాగ్రతతో కూడిన అంకితభావాన్ని ప్రేరణ పొందతానన్నారు. -
మరోసారి ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గీ: ఈసారి ఎంతంటే?
పండుగ సీజన్లో ఆర్డర్ల సంఖ్య పెరగడంతో.. ప్రముఖ ఫుడ్ డెలివరీ మేజర్ 'స్విగ్గీ' ప్రతి ఫుడ్ డెలివరీ ఆర్డర్పై వసూలు చేసే ప్లాట్ఫామ్ ఫీజును రూ.14కి పెంచింది. ప్రతి ఆర్డర్ను మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు.. దాని లాభాలను పెంచుకోవడం కోసం కంపెనీ గతంలో వసూలు చేస్తున్న రూ.12 ఫీజును రూ. 14లకు పెంచింది. అంటే తాజాగా రెండు రూపాయలు పెంచిందన్నమాట.యూనిట్ ఎకనామిక్స్ను మెరుగుపరచుకోవడానికి స్విగ్గీ.. ఏప్రిల్ 2023లో ప్లాట్ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి.. అదనపు ఖర్చులు ఉన్నప్పటికీ ఆర్డర్ వాల్యూమ్లపై ఎటువంటి ప్రభావం చూపకపోవడంతో కంపెనీ ప్లాట్ఫామ్ ఫీజును క్రమంగా పెంచింది. ప్రతి ఆర్డర్పై రూ.2 పెరుగుదల వినియోగదారులపై పెద్దగా భారం చూపకపోయినా.. స్విగ్గీ వంటి కంపెనీల ఆర్థికస్థితి మెరుగుపడటంతో దోహదపడుతుంది.ఇదీ చదవండి: దేశీయ దిగ్గజం హవా.. ఒకేసారి నాలుగు కొత్త కార్లు -
టీజీఐసీ నుంచి 18 మందికి ప్రత్యేక ఐడీ కార్డులు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) 18 మంది ఆవిష్కర్తలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా వీరికి ఇన్నోవేటర్ ఐడీ కార్డులను అందించారు. ఇన్నోవేటర్లు అంకుర సంస్థల ద్వారా సమాజంపై చూపిన ప్రభావాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి, టీజీఐసీ సీఈఓ మీరాజ్ ఫాహీమ్ హాజరయ్యారు.సృజనాత్మక ఆలోచనల ద్వారా స్టార్టప్లను స్థాపించిన 18 మంది గ్రామీణ ఇన్నోవేటర్లను ఎంపిక చేశారు. వారి ఉమ్మడి ప్రయత్నాల ద్వారా మొత్తం రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు టీజీఐసీ తెలిపింది. వారి ప్రయాణంలో టీజీఐసీ కీలక పాత్ర పోషించి, వారి కార్యకలాపాలను విస్తరించడానికి రూ.1.75 కోట్లకు పైగా నిధులు సమకూర్చింది. వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించింది. దీన్ని సాధారణ గుర్తింపు కార్డుగా కాకుండా, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వీరికి ప్రాధాన్యత లభిస్తుంది. అంతేకాక ఈ కార్డుల ద్వారా సంభావ్య పెట్టుబడిదారులు, సహకారులు, కస్టమర్లను పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వారు తమ మార్కెట్ను విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: వేగంగా వాణిజ్య ఒప్పందాలుఈ సందర్భంగా టీజీఐసీ సీఈఓ మీరాజ్ ఫాహీమ్ మాట్లాడుతూ.. ‘ఇన్నోవేటర్లను ప్రోత్సహించడమే టీజీఐసీ లక్ష్యం. ఈ ఐడీ కార్డులు వారి సామర్థ్యంపై నమ్మకాన్ని, కొత్త అవకాశాలను పెంచుతాయి’ అని చెప్పారు. -
బ్లూకాలర్ ఉద్యోగాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్ హవా
బ్లూకాలర్ ఉద్యోగాల్లో (శ్రమ ఆధారిత కార్మిక, నైపుణ్య పనులు) మిలీనియల్స్ (30–45 ఏళ్ల వయసు వారు), జెనరేషన్ జెడ్ (30 ఏళ్లలోపు) ఎక్కువగా పోటీపడుతున్నారు. 2024, 2025 సంవత్సరాల్లో ఈ విభాగంలో ఉద్యోగాలకు వచ్చిన దరఖాస్తుల్లో 65 శాతం మేర మిలీనియల్స్, జెన్–జెడ్ నుంచే ఉండడం గమనార్హం. ఇందులోనూ 20–23 వయసు వారి నుంచే అధికంగా ఉన్నాయి. ఈ వయసు విభాగంలో ఉద్యోగ దరఖాస్తులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 51 శాతం పెరిగాయి. ఈ వివరాలను బ్లూ, గ్రే కాలర్ జాబ్ ప్లాట్ఫామ్ అయిన వర్క్ఇండియా వెల్లడించింది.యువత నుంచి (తాజా గ్రాడ్యుయేట్లు) బ్లూకాలర్ ఉద్యోగాలకు దరఖాస్తులు 85.5% పెరిగాయని, చిన్న వయసులోనే ఉద్యోగాల్లో చేరాలన్న ఆసక్తికి ఇది నిదర్శనమని పేర్కొంది. 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారి నుంచి కూడా ఉద్యోగ దరఖాస్తుల్లో 37 శాతం వృద్ధి కనిపించింది. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు వర్క్ ఇండియా ప్లాట్ఫామ్పై 111.71 మిలియన్ ఉద్యోగార్థుల డేటాను విశ్లేషించి ఈ నివేదికను సంస్థ విడుదల చేసింది. చదువుతో సంబంధం లేకుండా వివిధ వర్గాల వారి నుంచి ఉద్యోగాల నిర్వహణ పట్ల ఆకాంక్షలు, సన్నద్ధత పెరుగుతున్నట్టు పేర్కొంది.మధ్య వయసులో మహిళలు డ్రాప్!కెరీర్ ఆరంభంలో ఉన్న యువతీ, యువకులు ఉద్యోగాలకు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకుంటున్నట్టు వర్క్ఇండియా నివేదిక వెల్లడించింది. 27–29 ఏళ్ల వయసు మహిళల నుంచి ఉద్యోగ దరఖాస్తులు స్తబ్దుగా ఉన్నట్టు తెలిపింది. కానీ, ఇదే వయసు పురుషుల నుంచి మాత్రం దరఖాస్తులు పెరుగుతున్నట్టు పేర్కొంది. దీన్ని బట్టి ఈ వయసు మహిళలు కెరీర్ నుంచి మధ్యలోనే వైదొలగడం లేదంటే అవరోధాలను ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై దృష్టి సారించాలని సూచించింది. ఉద్యోగాల కోసం అవసరమైతే వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సైతం యువత సుముఖత చూపిస్తున్నట్టు తెలిపింది. ఇక బ్లూకాలర్కు అదనంగా టైపిస్ట్, డేటా ఎంట్రీ, సేల్స్, హెచ్ఆర్, తయారీ ఉద్యోగ విభాగాలు సైతం అధిక వృద్ధిని చూస్తున్నట్టు వివరించింది. టైర్4 పట్టణాల నుంచి ఉద్యోగ దరఖాస్తులు 55 శాతం వరకు పెరిగినట్టు తెలిపింది.ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం -
నోయల్ నియామకానికి టాటా సన్స్ షేర్హోల్డర్లు ఓకే
నోయల్ ఎన్ టాటాను డైరెక్టరుగా నియమించడం సహా ఆరు కీలక తీర్మానాలకు టాటా సన్స్ షేర్హోల్డర్లు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కూడా మద్దతు తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రతన్ టాటా మరణం తర్వాత 2024 అక్టోబర్ 22 నుంచి నోయెల్ టాటా అదనపు డైరెక్టరుగా నియమితులయ్యారు.మరోవైపు, వర్చువల్గా నిర్వహించిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో టాటా సన్స్ డైరెక్టరుగా టీవీఎస్ మోటర్స్ గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్ నియామకానికి కూడా ఆమోదం లభించినట్లు వివరించాయి. టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కి 66 శాతం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్నకు 18.4 శాతం వాటాలు ఉన్నాయి. అంతా ఊహించినట్లే రతన్ టాటా అనంతరం టాటా ట్రస్ట్స్ పగ్గాలు తన సోదరుడు నోయెల్ టాటా (68) చేతికి లభించాయి. టాటా ట్రస్ట్స్తో పాటు అందులో భాగమైన మిగతా ట్రస్ట్లన్నింటికి కూడా చైర్మన్గా ట్రస్టీలు గతంలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం -
అనిల్ అంబానీకి భారీ విజయం
చాలా ఏళ్ల తర్వాత అనిల్ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డ్ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది.రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు‘ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఏమిటీ వివాదం?రిలయన్స్ ఇన్ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.ఆర్ఇన్ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్ఫ్రా ప్రతిస్పందనను కోరింది.విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్ఇన్ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది. -
రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ
మన దేశంలో అత్యంత చవకైన ప్రజారవాణా అంటే రైల్వేలే! సుదూర ప్రాంతాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్తాయి. ప్రయాణికుల కోసం రైలు సర్వీసులను కూడా ఏటా పెంచుతూ వస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తోంది.ఉదాహరణకు ప్యాసింజర్ రైళ్లు అందిస్తున్న సేవ విలువ రూ.100 అనుకుంటే, టిక్కెట్టు ధర రూ.55 మాత్రమే. మిగతా 45% సబ్సిడీ రైల్వే శాఖే భరిస్తోంది. మరోపక్క రైలు ప్రయాణాల్లో భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది.కొన్ని గణాంకాలు2019–20లో దేశంలో రోజుకు సగటున నడిచిన ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,169.2024–25లో ఈ ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,940.2025–26లో... 2025 జూలై వరకు ప్రారంభమైన కొత్త రైలు సర్వీసులు 86దేశంలో 2025 ఆగస్ట్ 7 నాటికి నడుస్తున్న వందేభారత్ రైళ్లు 1442023–24లో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 60,466 కోట్లురైలు ప్రయాణాలు, స్టేషన్లలో భద్రతకు సంబంధించి 2023–24లో రైల్వే శాఖ చేసిన వ్యయం రూ. 1,14,022 కోట్లు -
స్టాక్ మార్కెట్లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!
జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు. -
అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం: ఇండిగో
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిన వెంటనే చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇండిగో సిద్ధమవుతోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కొవిడ్-19 పరిణామాల కారణంగా 2020 ప్రారంభంలో నిలిపివేసిన చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆంక్షలకు ముందు ఈ సంస్థ న్యూఢిల్లీ నుంచి చెంగ్డూ, కోల్కతా-గ్వాంగ్ జౌ మధ్య రోజువారీ సర్వీసులను నడిపేది.ద్వైపాక్షిక ఒప్పందంపై ఆశలు..ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పునరుద్ధరించడానికి భారత్, చైనాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, అధికారిక అనుమతులు ఇంకా ఖరారు కాలేదు. ప్రత్యక్ష సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గాలను అన్వేషించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. కొవిడ్-19కు ముందు తాము చైనాకు విమానాలు నడిపేవారమని, ప్రభుత్వం ఒక ఒప్పందానికి వస్తే వాటిని పునప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్బర్స్ చెప్పారు. 2020 ప్రారంభం నుంచి భారతదేశం-చైనా మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ లేదు. ఆ ఏడాది చివర్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది దౌత్య, ఆర్థిక సంబంధాలపై ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం భారతదేశం-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుంచి చైనాకు వెళ్లాల్సి ఉంటుంది.ప్రధాన సమస్యప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భారత విమానయాన సంస్థలపై చైనా విధించిన విమాన ఛార్జీల నిబంధనల అంశం ప్రాధానమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తూ, అధిక ధరల స్వేచ్ఛ కోసం భారత్ ఒత్తిడి తెస్తోంది. చైనాలో తమ గత నిర్వహణ అనుభవాలపై భారత ప్రభుత్వం విమానయాన సంస్థల నుంచి ఫీడ్బ్యాక్ కోరిందని సీనియర్ అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వంఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే భారత విమానయాన మార్కెట్లోకి చైనీస్ చౌక ధరల విమానయాన సంస్థల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇది ద్వైపాక్షిక పర్యాటకం, వ్యాపార ప్రయాణాన్ని పెంచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ఐదేళ్ల విరామం తర్వాత ఇటీవల చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. -
మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వం
అమెరికా బహుళజాతి సంస్థ ఒరాకిల్ తన క్లౌడ్ యూనిట్లో ఉద్యోగాలను తొలగిస్తోందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మేరకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. తమ కొలువులు కోల్పోయామని కొందరు ఉద్యోగులు సైతం చెప్పినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్ ఇచ్చారో మాత్రం తెలియరాలేదు. ఈ విషయంపై కంపెనీ అధికారులు స్పందిస్తూ ఈ లేఆఫ్స్ పూర్తిగా పనితీరుపై ఆధారపడినవేనని చెప్పారు.వ్యూహాత్మక మార్పులు, పునర్వ్యవస్థీకరణలు, ఉద్యోగుల పనితీరు కారణంగా తమ సిబ్బంది సంఖ్యలో మార్పులు చేస్తామని ఒరాకిల్ జూన్ ఫైలింగ్లోనే చెప్పింది. చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు విభిన్న కారణాలతో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు, పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడానికి మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్, మెటా ప్లాట్ఫామ్స్ వంటి కంపెనీలు కూడా కృత్రిమ మేధ అభివృద్ధికి ఎక్కువ ఖర్చు చేస్తుండడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?గత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్టైమ్ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్బ్యాంక్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు. -
భారత మార్కెట్పై మరింత ఫోకస్
బెంగళూరు: దీర్ఘకాలికంగా తమ వ్యాపార వృద్ధికి భారత మార్కెట్ గణనీయంగా దోహదపడుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి మార్కెట్పై మరింతగా దృష్టి పెడుతోంది. భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ సమీర్ కుమార్ ఈ విషయాలు వెల్లడించారు. భారత్లో తమ కార్యకలాపాలకు సంబంధించి మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకునేందుకు అమెజాన్ ఈ ఏడాది రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ కార్యకలాపాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని కుమార్ చెప్పారు. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ పెరగడానికి మరింతగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇక్కడ యూజర్లు ఆన్లైన్లో ఉత్పత్తులు కొంటున్నారు. వీడియోలను వీక్షిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పెరిగేందుకు ఇంకా భారీగా అవకాశాలున్నాయి. దాదాపు వంద కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కానీ 10 కోట్ల మంది మాత్రమే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము మరో 20 కోట్ల మందికి చేరువ కావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని కుమార్ చెప్పారు. ఎకానమీ పెరిగే కొద్దీ వినియోగం కూడా పెరుగుతుందన్నారు. చిన్న పట్టణాల్లో అవకాశాలు.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఆన్లైన్ షాపింగ్ చేసే వారు పెరుగుతున్నారని కుమార్ చెప్పారు. ఇటీవల ముగిసిన ప్రైమ్ డే గణాంకాలు చూస్తే కొత్త, పాత ప్రైమ్ కస్టమర్లలో 70 శాతం మంది చిన్న పట్టణాల నుంచే ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో, ఈ ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్ పెరిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ చెప్పారు. వారు ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు, మెరుగైన డీల్స్ను .. వేగవంతమైన డెలివరీలను పొందేందుకు అనువైన పరిస్థితులు కలి్పంచడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. క్విక్ కామర్స్కి మంచి స్పందన.. ఇటీవల బెంగళూరు, ఢిల్లీలో ప్రవేశపెట్టిన క్విక్ కామర్స్ కార్యకలాపాలకు విశేష స్పందన లభిస్తోందని కుమార్ చెప్పారు. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. పోటీపై స్పందిస్తూ, మార్కెట్లో ఎన్ని సంస్థలున్నా అంతిమంగా కస్టమర్లకు ఎంత మెరుగ్గా సరీ్వసులు అందిస్తున్నామనే అంశమే కీలకంగా ఉంటుందని కుమార్ చెప్పారు. -
కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్పై సెబీ వేటు
న్యూఢిల్లీ: కంపెనీ ఖాతాలను వండి వార్చడం, నిధుల మళ్లింపు చర్యలకు పాల్పడిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, మరో నలుగురిపై సెబీ కఠిన చర్యలకు దిగింది. ఐదేళ్ల పాటు సెక్యూరిటీల మార్కెట్లలోకి ప్రవేశించకుండా వీరిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి పదవులూ చేపట్టకుండా నిషేధించింది. అలాగే రూ.120 కోట్ల పెనాల్టీని విధించింది. కపిల్, ధీరజ్తోపాటు డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ వాధ్వాన్, మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సారంగ్ వాధ్వాన్, మాజీ జాయింట్ ఎండీ, సీఈవో హర్షిల్ మెహతా, మాజీ సీఎఫ్వో సంతోష్ శర్మపై ఈ చర్యలు ప్రకటించింది. 181 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. 2006 నుంచి డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, కీలక పదవుల్లో ఉన్న వారు మోసపూరితంగా కంపెనీ నిధులను ప్రమోటర్లకు చెందిన ‘బాంద్రా బుక్ ఎంటిటీస్’(బీబీఈలు)కు బదిలీ చేసినట్టు.. 2019 మార్చి 31 నాటికి బీబీఈలకు డీహెచ్ఎఫ్ఎల్ మంజూరు చేసిన రుణాలు రూ.14,040 కోట్లకు చేరినట్టు సెబీ తేల్చింది. ఎలాంటి వ్యాపారం, ఆస్తుల్లేని ప్రమోటర్ల సంస్థలకు పెద్ద ఎత్తున అన్సెక్యూర్డ్ రుణాలను మంజూరు చేశారని.. ఇందుకు ఎలాంటి ముందస్తు మదింపు విధానాలను అనుసరించలేదని గుర్తించింది. పైగా వీటిని రిలేటెడ్ పార్టీ లావాదేవీలుగా కాకుండా రిటైల్ హౌసింగ్ రుణాలుగా పేర్కొన్నట్టు తేలింది. ఆయా సంస్థలు (బీఈఈలు) రుణాలపై వడ్డీ చెల్లించకపోయినప్పటికీ.. కల్పిత వడ్డీ ఆదాయాన్ని చూపిస్తూ 2007–08 నుంచి 2015–16 మధ్య కాలంలో నష్టాలకు బదులు లాభాలు పెరుగుతున్నట్టు చూపించారని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 39 బీఈఈలకు ఇచ్చిన రూ.5,662 కోట్ల రుణాల్లో.. 40 శాతాన్ని ప్రమోటర్లకు చెందిన సంస్థలకు తిరిగి మళ్లించినట్టు తేలి్చంది.