breaking news
Corporate
-
ఇండియన్ ఆయిల్ డైరెక్టర్గా సౌమిత్ర పి శ్రీవాస్తవ
ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ డైరెక్టర్గా.. సౌమిత్ర పి శ్రీవాస్తవ (Saumitra P Srivastava) బాధ్యతలు స్వీకరించారు. కంపెనీలో సుమారు 30ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈయన.. ఐఐటీ రూర్కెలా నుంచి సివిల్ ఇంజినీరింగ్, ముంబైలోని ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ఎల్పీజీ వ్యాపార విభాగంలో నాలుగేళ్ల పనిచేశారు. ఆ తరువాత ఇండియన్ ఆయిల్ సంస్థలో చేరిన.. సౌమిత్ర పి శ్రీవాస్తవ సేల్స్ విభాగంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో వ్యాపార విస్తరణకు కీలకంగా మారారు. ఈయనకు ముంబై, ఢిల్లీ డివిజన్ కార్యాలయాలను నడిపిన అనుభవం కూడా ఉంది. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా సేల్స్ విభాగంలో పనిచేశారు. మహారాష్ట్ర, గోవా హెడ్ ఆఫ్ స్టేట్గా పనిచేసిన సమయంలో.. ప్రధాన ఉత్పత్తులు, వ్యాపారాలను ఈయన విజయవంతంగా నిర్వహించారు. -
టిమ్ కుక్ తరువాత యాపిల్ సీఈఓ ఎవరు?
టిమ్ కుక్ (Tim Cook)కు వచ్చే ఏడాదికి 65 ఏళ్లు నిండుతాయి. 2011లో యాపిల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ఈయన కంపెనీ నుంచి నిష్క్రమించిన తరువాత.. అతని స్థానంలో ఎవరు రావచ్చనే దానిపై ఇప్పటికే చర్చ మొదలైపోయింది. టెక్ ప్రపంచంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న పెద్ద ప్రశ్న ఇదే!.గత కొన్ని సంవత్సరాలుగా.. యాపిల్ కంపెనీ నుంచి ఎంతోమంది ఉన్నత స్థాయి ఉద్యోగులు వైదొలిగారు. ఈ జాబితాలో డిజైన్ చీఫ్ జోనీ ఐవ్, రిటైల్ హెడ్ ఏంజెలా అహ్రెండ్ట్స్, సీఎఫ్ఓ లూకా మాస్ట్రీ, సీఓఓ జెఫ్ విలియమ్స్ ఉన్నారు. వీరు కంపెనీ నుంచి వైదొలిగినప్పుడు ఇంత పెద్ద చర్చ జరగలేదు. కానీ టిమ్ కుక్ నిష్క్రమణ తప్పకుండా చర్చనీయాంశమే. ఎందుకంటే.. ఆయన స్థానాన్ని పొందే వ్యక్తి యాపిక్ సంస్థలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతటి వ్యక్తి 'జాన్ టర్నస్' అని వినిపిస్తోంది.జాన్ టర్నస్.. యాపిల్ కంపెనీలో హార్డ్వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన దాదాపు 24 సంవత్సరాలుగా యాపిల్లో ఉంటూ.. కీలక పదవులను చేపట్టారు. ఈయన వ్యూహాలు కూడా హార్డ్వేర్ పాత్రకు మించి ఉంటాయి. ప్రస్తుతం ఈయన వయసు 50 ఏళ్లు. యాపిల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పుడు టిక్ కుక్ వయసు 50 సంవత్సరాలే.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?జాన్ టర్నస్కు టిమ్ కుక్ దగ్గర మంచి పేరు ఉంది. ఈయన యాపిల్ మొట్టమొదటి కొత్త ఐఫోన్ ఫారమ్ ఫ్యాక్టర్ అయిన ఐఫోన్ ఎయిర్ను పరిచయం చేశారు. ఈయన ఐఫోన్ 17 లాంచ్ సందర్భంగా లండన్లోని యాపిల్ రీజెంట్ స్ట్రీట్ స్టోర్లో కస్టమర్లను కూడా పలకరించారు. ఇలాంటి కారణాల వల్ల కుక్ స్వయంగా అతన్ని ఎక్కువగా విశ్వసిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతాయి. అయితే సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగే అంశం గురించి టిమ్ కుక్ ఇప్పటివరకు ఎలాంటి ప్రస్తావన చేయలేదు. -
హైదరాబాద్లో ప్రారంభమైన రీఫర్ రైలు సర్వీస్
ఇండియా ఫార్మాస్యూటికల్ లాజిస్టిక్స్ను ప్రోత్సహించడంలో భాగంగా.. డీపీ వరల్డ్, హైదరాబాద్లో మొట్టమొదటి స్పెషల్ రీఫర్ రైలు (Reefer Rail)ను ప్రారంభించింది. తిమ్మాపూర్ (Thimmapur) నుంచి నవా షెవా (Nhava Sheva) మధ్య దీని సేవలను అందిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద తరలించాల్సిన వస్తువులను.. ఈ రీఫర్ రైలు ద్వారా సరఫరా చేస్తారు. ఫార్మా ఎగుమతులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.వారానికి ఒకసారి మాత్రమే ప్రయాణించే ఈ రైలులో 43 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లు ఉంటాయి. ఇది నెలకు నాలుగుసార్లు ప్రయాణిస్తుంది. స్పెషల్ ట్రైన్ ప్రారంభించడం వల్ల.. 43 ట్రక్కుల అవసరం తగ్గడం మాత్రమే కాకుండా.. రోడ్డుపై రద్దీ కూడా కొంత తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు కూడా 70 శాతం వరకు తగ్గుతాయి.ప్రతి కంటైనర్ ఖచ్చితమైన ఉష్ణోగ్రతను కలిగి ఉండటం కోసం.. కావలసిన ఏర్పాట్లను చేశారు. సాంకేతిక నిపుణులు దీనిని పర్యక్షిస్తూ ఉంటారు. కాబట్టి దీని ద్వారా వస్తువులను సురక్షితంగా గమ్యం చేర్చవచ్చు. -
ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?
రిలయన్స్ చైర్మన్ 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరులలో ఒకరు. ఈయన సంపద కొన్ని చిన్న దేశాల జీడీపీ(GDP)ల కంటే ఎక్కువ. ఇంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు తన పర్సులో ఎంత డబ్బు పెట్టుకుంటారో బహుశా ఎవరికీ తెలిసి ఉండదు. అయితే దీనికి అంబానీ సమాధానం ఇచ్చారు.ముకేశ్ అంబానీ ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇందులో భాగంగానే.. వీరు ఖరీదైన ఇంట్లో నివసించడం, అత్యంత లగ్జరీ కార్లను తమ రోజువారీ వినియోగిస్తుండటం వంటివి జరుగుతున్నాయి. నీతా అంబానీ, ఆమె కుమార్తె ఇషా కూడా విలువైన ఆభరణాలు ధరించడం.. అనంత్ అంబానీ బ్రాండెడ్ గడియారాలు ధరించిన సన్నివేశాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ముఖేష్ అంబానీ మాత్రం.. ఎక్కువగా సాధారణ దుస్తులు ధరించి, ఫార్మల్ ప్యాంటుతో కనిపిస్తారు.డబ్బు ఒక వనరు మాత్రమేముకేశ్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు, డబ్బు కేవలం ఒక వనరు మాత్రమే అని వెల్లడించారు. నేను ఎప్పుడూ పర్సులో నగదు లేదా క్రెడిట్ కార్డులను తీసుకెళ్లనని స్వయంగా వెల్లడించారు. అయితే బిల్లులు చెల్లించడానికి ఎల్లప్పుడూ నాతో ఎవరైనా ఉంటారని పేర్కొన్నారు. తాను స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా ఎప్పుడూ తనతో డబ్బు తీసుకెళ్లలేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: మస్క్ ట్వీట్: నెట్ఫ్లిక్స్కు రూ.2 లక్షల కోట్ల నష్టం!బిరుదులు ఇష్టం ఉండదుమీడియా లేదా ఏదైనా ప్రత్యేక వార్తాపత్రిక తనను ఏదైనా బిరుదుతో సత్కరించడం తనకు ఇష్టం ఉండదని ముఖేష్ అంబానీ వెల్లడించారు. ప్రపంచ ధనవంతులలో ఒకరైన ఈయన.. తన వ్యక్తిగత జీవితంలో చాలా నిశ్చింతగా ఉండటానికి ఇష్టపడతారని వీటిని బట్టి చూస్తే అర్థమవుతుంది. అతను సరళమైన జీవనశైలిని ఆస్వాదిస్తాఋ, ఉదయాన్నే నిద్రలేవడం.. ఎక్కడికీ వెళ్ళే ముందు తన తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. -
కొత్త రకాల వీసాలను ప్రకటించిన యూఏఈ
ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి, పర్యాటకాన్ని పెంచడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించింది. రెసిడెన్సీ వ్యవస్థలోనూ మార్పులు చేసింది. వీటిలో ఏఐ, ఎంటర్టైన్మెంట్, ఈవెంట్, క్రూయిజ్ టూరిజం కోసం నాలుగు కొత్త వీసా (New Visa) కేటగిరీలు ఉన్నాయి.అంతే కాకుండా, వ్యాపార, ట్రక్ డ్రైవర్ వీసాలకు సంబంధించి కూడా మార్పులు చేశారు. మానవతా సహాయం, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు, నివాసితుల బంధువులు, స్నేహితులకు కూడా రెసిడెన్సీ అవకాశం కల్పిస్తున్నారు.నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలు ఇవే..ఏఐ స్పెషలిస్ట్ వీసా: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని నిపుణుల కోసం ఉద్దేశించినది. ఇందు కోసం టెక్ ఫోకస్డ్ కంపెనీ నుంచి స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది. ఒకటి లేదా ఎక్కువ ఎంట్రీలకు అనుమతి ఉంటుంది.ఎంటర్టైన్మెంట్ వీసా: కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ సెక్టార్ లోని వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వీసా ఇది. విశ్రాంతి లేదా ప్రదర్శన నిమిత్తం వచ్చే ప్రముఖులకు దీన్ని కేటాయిస్తారు.ఈవెంట్ వీసా: పండుగలు, ఎగ్జిబిషన్లు, కాన్ఫరెన్సులకు హాజరయ్యేవారికి ఈ ఈవెంట్ వీసాలు జారీ చేస్తారు. అయితే వీటిని ఈవెంట్ నిర్వాహకులచే స్పాన్సర్ చేయాలి.క్రూయిజ్ టూరిజం వీసా: క్రూయిజ్ ట్రావెలర్లకు మల్టిపుల్ ఎంట్రీ వీసా ఇది. లైసెన్స్ పొందిన మారిటైమ్ సంస్థల ద్వారా స్పాన్సర్ చేస్తారు.రెసిడెన్సీ, ఇతర వీసా అప్డేట్లుహ్యుమానిటేరియన్ రెసిడెన్స్ పర్మిట్: సంక్షోభ పరిస్థితుల నుంచి వచ్చే వ్యక్తులకు ఒక సంవత్సరం పునరుద్ధరించతగిన వీసా.స్నేహితులు, బంధువుల కోసం విజిట్ వీసా: నివాసితులు తమ బంధువులకు దీన్ని స్పాన్సర్ చేయవచ్చు.ట్రక్ డ్రైవర్ వీసా: లాజిస్టిక్స్ లో కార్మిక కొరతను పరిష్కరించే వీసా. లైసెన్స్ పొందిన కంపెనీల ద్వారా స్పాన్సర్ షిప్ అవసరం అవుతుంది.వితంతువులు, విడాకులకు రెసిడెన్సీ: నిర్వచించిన పరిస్థితులలో ఒక సంవత్సరం పునరుద్ధరణ అనుమతి.బిజినెస్ ఎక్స్ ప్లోరేషన్ వీసా: బిజినెస్ ప్రారంభించేందుకు వచ్చే ఆర్థిక సాల్వెన్సీ రుజువు ఉన్న వ్యాపారవేత్తలకు జారీ చేస్తారు. -
హైదరాబాద్లో ఎలి లిల్లీ తయారీ కేంద్రం ఏర్పాటు
గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Company) భారతదేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించడానికి 1 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణలోని హైదరాబాద్లో మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ హబ్ను ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం భారతదేశం అంతటా కంపెనీ కాంట్రాక్ట్ తయారీ నెట్వర్క్ను పర్యవేక్షిస్తుంది.ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులను ప్రశంసించారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భవించడానికి సంకేతమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమైన మౌలిక సదుపాయాలు, సులభతర వ్యాపారం (Ease of Doing Business) వంటి అంశాలు ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి కీలకం అవుతున్నట్లు చెప్పారు.కంపెనీ ఏర్పాటు చేయబోయే అత్యాధునిక సదుపాయంలో ఇంజినీర్లు, రసాయన శాస్త్రవేత్తలు, ఇతర శాస్త్రవేత్తలు, నిపుణుల కోసం తక్షణమే నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్లో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు బలాన్ని ఇస్తూ వినూత్న ఔషధాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా లిల్లీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాట్రిక్ జాన్సన్ మాట్లాడుతూ..‘మా గ్లోబల్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్రంగా భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. లిల్లీ డయాబెటిస్, ఊబకాయం, అల్జీమర్స్, క్యాన్సర్.. వంటి వాటికి ఔషధాలు తయారు చేస్తోంది. గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రంగా కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తోంది.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
దేశం విడిచిన కుబేరులు.. కారణాలు..
భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ముందుంది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% జీడీపీ వృద్ధిని సాధించింది. తయారీ, సేవల రంగాల్లో బలంగా ఉంది. అయితే దేశ సంపదకు మూలమైనవారు.. కంపెనీల వ్యవస్థాపకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు మాత్రం దేశాన్ని విడిచి వెళ్తున్నారు. తమ సంస్థలు భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్నా తాము విదేశాల్లో స్థిరపడేందుకే ఆసక్తి చూపుతున్నారు. అందుకు కొన్ని కారణాలను కోటక్-ఈవై సర్వే వెల్లడించింది.భారతదేశం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుంటే దాని సంపద సృష్టికర్తలు ఎందుకు నిష్క్రమిస్తున్నారనే దానిపై కోటక్ ఈవై నివేదిక రూపొందించింది. భారతీయ ధనవంతులు విదేశాలకు వలస వెళ్లడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలిపింది.మెరుగైన జీవన నాణ్యత, మౌలిక సదుపాయాలుప్రపంచంలోని 50 అత్యంత కలుషితమైన నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి. ఇది సంపన్న కుటుంబాలను సింగపూర్, ఆస్ట్రేలియా, యూరప్ వంటి సురక్షితమైన, సుసంపన్నమైన జీవన వాతావరణానికి ప్రేరేపించేలా చేస్తుంది.ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థలుభారతదేశం జీడీపీలో ప్రజారోగ్యం కోసం కేవలం 2.1%, విద్య కోసం 2.9% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచ ప్రమాణాలైన 6% కంటే చాలా తక్కువ. దీని కారణంగా ధనవంతులు మెరుగైన ప్రైవేట్ సేవలు, ప్రపంచ స్థాయి విద్య కోసం యూఎస్ఏ, యూకే లేదా కెనడా వైపు మొగ్గు చూపుతున్నారు.స్నేహపూర్వక పన్ను విధానాలు..భారత్లో 42.74% అధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను ఉంది. దుబాయ్లో సున్నా పన్ను. పోర్చుగల్లో పదేళ్ల పన్ను మినహాయింపులు ఆకర్షణీయంగా తోస్తున్నాయి. అంతేకాకుండా భారతదేశంలో 52 మిలియన్లకు పైగా కోర్టు కేసులు పెండింగ్లో ఉండటం వలన పౌర వివాదాలు దశాబ్దాల పాటు సాగుతున్నాయి. ఇది వ్యాపారవేత్తలకు ఆమోదయోగ్యం కాని జాప్యాన్ని సూచిస్తుంది.విదేశాల్లోని భారతీయులుపేరుస్థూల విలువ (రూ.కోట్లలో)ప్రస్తుత ప్రదేశంగోపీచంద్ హిందూజా & ఫ్యామిలీ1,85,310లండన్లక్ష్మీ మిట్టల్1,75,390లండన్జే చౌదరి1,46,470శాన్ జోస్, అమెరికాఅనిల్ అగర్వాల్1,11,400లండన్షాపూర్ పల్లోంజీ మిస్త్రీ, కుటుంబం88,650మొనాకోప్రకాష్ లోహియా87,700లండన్వివేక్ చాంద్ సెహగల్57,060మెల్బోర్న్జయశ్రీ ఉల్లాల్50,170శాన్ ఫ్రాన్సిస్కోయూసఫ్ అలీ, ఎం.ఎ.46,300అబుదాబిరాకేష్ గంగ్వాల్42,790మయామి, అమెరికా నీరవ్ మోదీ (యూకే), మెహుల్ చోక్సీ (ఆంటిగ్వా) వంటివారు పరారీలో ఉన్నారు. ఈ వజ్రాల వ్యాపారులు అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.దేశీయ పెట్టుబడుల బలహీనతలిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS-దేశం నుంచి విదేశాలకు వెళ్లే డబ్బు) కింద విదేశీ చెల్లింపులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 27.14 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు సంవత్సరం కంటే 38% పెరిగింది. ఈ మూలధనం విదేశీ రియల్ ఎస్టేట్, రెసిడెన్సీ కార్యక్రమాలకు మళ్లించబడుతుంది. ఇది దేశీయ వృద్ధికి ఉపయోగపడదు. దీనికి విరుద్ధంగా భారతదేశంలోకి ఎఫ్డీఐ 2022-23లో 84.8 బిలియన్ డాలర్ల నుంచి 71 బిలియన్ డాలర్లకు తగ్గింది.2023లో 6,500 మంది మిలియనీర్లు భారతదేశాన్ని విడిచిపెట్టారని హెన్లీ & పార్టనర్స్ నివేదించింది. 2025 నాటికి ఈ సంఖ్య సంవత్సరానికి 8,000కి పెరగవచ్చని గతంలో అంచనా వేసింది. ఇది ప్రతిభతోపాటు సంపదను కోల్పోవడాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు -
అదానీ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు
టాప్ బిలియనీర్ గౌతమ్ అదానీకి (Gautam Adani) ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్పై రెండు వేర్వేరు డిమాండ్ నోటీసుల్లో మొత్తం రూ .23.07 కోట్లు జరిమానాలు విధించింది. వీటిని అదానీ గ్రూప్ కంపెనీ అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయాలని యోచిస్తోంది.ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) జారీ చేసిన డిమాండ్ నోటీసుల్లో 2015-16 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయానికి సంబంధించిన తప్పుడు వివరాలను అందించడం"పై రూ .14.22 కోట్ల జరిమానా విధించగా, 2018-19 అసెస్మెంట్ సంవత్సరానికి "ఆదాయాన్ని తక్కువగా నివేదించడం"పై మరో రూ .8.85 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.సవాలు చేస్తాం.."నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు అప్పీళ్లు దాఖలు చేయడం ద్వారా కంపెనీ రెండు ఉత్తర్వులను సవాలు చేస్తుంది. దీంతోపాటు సమాంతరంగా, సంబంధిత ఉత్తర్వుల ప్రకారం లేవనెత్తిన జరిమానా డిమాండ్లపై స్టే కోరుతుంది" అని ఏసీసీ రెగ్యులేటర్ ఫైలింగ్స్లో తెలిపింది. ఈ రెండు డిమాండ్ నోటీసులను అక్టోబర్ 1న స్వీకరించినట్లు చెప్పిన కంపెనీ.. ఈ జరిమానాలు సంస్థ ఆర్థిక కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపవని తెలిపింది.అదానీ సిమెంట్ గురించి..అదానీ సిమెంట్.. అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థ. ఇది కంపెనీలో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్లో అదానీ గ్రూప్ స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ గ్రూప్ నుండి అంబుజా సిమెంట్స్ దాని అనుబంధ సంస్థ ఏసీసీ లిమిటెడ్ను 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. -
ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు! -
మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు!
వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన కథనం వైరల్గా మారింది. రిక్రూట్మెంట్ సమయంలో పూర్తిస్థాయి వర్క్ ఫ్రం హోం అని చెప్పిన కంపెనీ సడెన్గా ఫిజికల్గా ఆఫీస్కు రావాలని ఆదేశించినట్లు అందులో రాసుకొచ్చారు. అయితే మేనేజర్ కావాలనే ఇలా తనను వేదిస్తున్నట్లు చెప్పారు. తాను ఉంటున్న ప్రాంతం ఆఫీస్కు 300 కి.మీ ఉండడంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.‘రిక్రూట్మెంట్ సమయంలో పర్మనెంట్ వర్క్ ఫ్రం హోం అన్నారు. నేను కంపెనీలో చేరి ఇప్పటికి ఏడాది గడిచిపోయింది. నేను ప్రస్తుతం ఉంటున్న ప్రాంతం మా ఆఫీస్కు 300 కి.మీ. ఇప్పటివరకు ప్రతి రెండు నెలలకు ఒకసారి ఆఫీస్కు రమ్మనారు. కానీ ఇప్పడు నన్ను మేనేజర్ కావాలనే ప్రతివారం రమ్మంటున్నాడు. టీమ్ బిల్డింగ్, ఆఫీస్ సంస్కృతిని సంరక్షించడం అనేవి కారణంగా చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై మేనేజర్తో మాట్లాడినా లాభం లేకుండా పోయింది. ఇది స్నేహపూర్వకమైన వృత్తిపరమైన సంబంధాన్ని ఘర్షణకు, ఒత్తిడికి తావిస్తుంది. మేనేజర్ ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయి యాజమాన్యాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాను. అదేసమయంలో కెరియర్ అవకాశాలు, టీమ్ రిలేషన్స్ దెబ్బతింటాయేమోనని ఆలోచలున్నాయి’ అని పోస్ట్లో తెలిపారు.రెడిట్ ప్లాట్ఫామ్లో వెలసిన ఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఉద్యోగి పట్ల సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అనివార్య సమస్య అని పేర్కొన్నారు. ‘టీమ్ బిల్డింగ్’ లేదా ‘ఆఫీస్ సంస్కృతి’ని సంరక్షించడం అనే సాకుతో చాలామంది ఇలా ఉద్యోగులను ఇబ్బందిపెడుతున్నట్లు కొందరు చెప్పారు. కొంతమంది మేనేజర్లు తాము రిమోట్గా పని చేస్తూనే కింది సిబ్బందిని కార్యాలయానికి రావాలని బలవంతం చేస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: పెళ్లి నిధిని ఎలా సమకూర్చుకోవాలి? -
రెనోలో 3000 మంది బయటకు!: కారణం ఇదే..
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ తొలగింపులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.రెనాల్ట్ కంపెనీ.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం మీద సంస్థ తన మొత్తం ఉద్యోగులలో 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలగింపులు సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాలలో కూడా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.రెనాల్ట్ కంపెనీ 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 98,636 మంది సిబ్బందిని నియమించింది. ''ఆటోమోటివ్ మార్కెట్లోని అనిశ్చితులు.. పోటీ వాతావరణం దృష్ట్యా, మా కార్యకలాపాలను సరళీకృతం చేయడానికి తగిన మార్గాలను పరిశీలిస్తున్నాము. ఇందులో భాగమని లేఆఫ్స్ కూడా చేయడానికి చూస్తున్నట్లు'' రెనాల్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?రెనాల్ట్ జూలై ఆర్థిక నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 11.2 బిలియన్ యూరోల (13 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసింది. ఇందులో భాగస్వామి నిస్సాన్పై కూడా 9.3 బిలియన్ యూరోల నష్టం ఉంది. కంపెనీ నికర ఆదాయం కూడా 461 మిలియన్ యూరోలకు తగ్గిపోయింది. ఖర్చులు పెరగడం.. పెరుగుతున్న పోటీ వాతావరణం నుంచి ఉత్పన్నమయ్యే వాణిజ్య ఒత్తిళ్లు ఈ తగ్గుదలకు కారణమని సమాచారం. -
డీమార్ట్ ఆదాయం జంప్.. 3 నెలల్లో ఎన్ని వేల కోట్లు వచ్చాయంటే..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్మార్ట్స్ ఆదాయం రూ. 16,219 కోట్లుగా (స్టాండెలోన్) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన రూ. 14,050 కోట్లతో పోలిస్తే 15 శాతం పెరిగింది. త్రైమాసికాలవారీగా క్యూ1లో నమోదైన రూ. 15,932 కోట్లతో పోలిస్తే 1.8 శాతం వృద్ధి చెందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో కంపెనీ పేర్కొంది.2025 సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం స్టోర్స్ సంఖ్య 432గా ఉంది. స్టాండెలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలను ఆమోదించేందుకు అక్టోబర్ 11న కంపెనీ బోర్డు మసావేశం కానుంది. ఆంధ్రపద్రేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో డీమార్ట్కి కార్యకలాపాలు ఉన్నాయి. -
హైదరాబాద్లో హార్ట్ఫోర్డ్ టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్: అమెరికాకు చెందిన బీమా సేవల సంస్థ ది హార్ట్ఫోర్డ్ తాజాగా హైదరాబాద్లో తమ ఇండియా టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. కొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా అధునాతన వర్క్స్టేషన్లు, శిక్షణా సదుపాయాలు మొదలైన ప్రత్యేకతలతో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. డిజిటల్, కృత్రిమ మేథ సామర్థ్యాలను పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల తెలిపారు.సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా హైదరాబాద్ పేరొందిన నేపథ్యంలో నగరాన్ని ఎంచుకున్నట్లు చీఫ్ డేటా, ఏఐ, ఆపరేషన్స్ ఆఫీసర్ జెఫ్ హాకిన్స్ తెలిపారు. దాదాపు 200 ఏళ్ల పైగా చరిత్ర గల ది హార్ట్ఫోర్డ్కి ప్రపంచవ్యాప్తంగా 19 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలోని హార్ట్ఫోర్డ్, షికాగో తదితర ప్రాంతాల్లో టెక్నాలజీ కేంద్రాలు ఉన్నాయి. -
జొమాటో డెలివరీ సిబ్బందికి హెచ్డీఎఫ్సీ పెన్షన్
న్యూఢిల్లీ: జొమాటో, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మధ్య భాగస్వా మ్యం కుదిరింది. జొమాటో డెలివరీ భాగస్వాములకు ‘ఎన్పీఎస్ ప్లాట్ఫామ్ వర్కర్స్మోడల్’ను హెచ్డీఎఫ్సీ పెన్షన్ ఆఫర్ చేయనుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రారంభించారు.‘‘ప్లాట్ఫామ్ ప్రారంభించిన 72 గంటల్లోనే 30,000 మందికి పైగా డెలివరీ భాగస్వాములు శాశ్వత రిటైర్మెంట్ ఖాతా నంబర్లను (ప్రాన్) తీసుకున్నారు. లక్ష మందికి పైగా డెలివరీ భాగస్వాములకు ఎన్పీఎస్ సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని జొమాటో ప్రకటించింది. -
లిస్టింగ్ బాటలో మరిన్ని కంపెనీలు
ఈ ఏడాది ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నప్పటికీ మరోవైపు ప్రైమరీ మార్కెట్లు మాత్రం చెలరేగిపోతున్నాయి. ఈ నెలలోనూ (అక్టోబర్) సెకండరీ మార్కెట్లను ఓవర్టేక్ చేయనున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి హైదరాబాద్ కంపెనీలు విరూపాక్ష ఆర్గానిక్స్, ఆర్వీ ఇంజినీరింగ్ ఇటీవలే ప్రాస్పెక్టస్లు దాఖలు చేయగా.. అదే బాటలో మరో 5 కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. ఈ జాబితాలో రన్వాల్ డెవలపర్స్, లాల్బాబా ఇంజినీరింగ్, స్టెరిలైట్ ఎలక్ట్రిక్, సీజే డార్సిల్ లాజిస్టిక్స్, జెరాయ్ ఫిట్నెస్ చేరాయి. 2025లో ఇప్పటివరకూ మెయిన్బోర్డులో 77 కంపెనీలు లిస్ట్కాగా.. ఈ నెలలో టాటా ఇన్వెస్ట్మెంట్, ఎల్జీ ఎల్రక్టానిక్స్ తదితర దిగ్గజాల ఐపీవోలకు తెరలేవనుంది. రూ. 2,000 కోట్లపై కన్ను రియల్టీ రంగ కంపెనీ రన్వాల్ డెవలపర్స్ ఐపీవో ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ముంబై కంపెనీ రూ. 1,700 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్ సందీప్ సుభాష్ రన్వాల్ మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ సహా అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 1988లో ఏర్పాటైన కంపెనీ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, పుణె నగరాల్లో రిటైల్, వాణిజ్య ప్రాపరీ్టలను నిర్వహిస్తోంది. 1,500 కోట్ల సమీకరణ .. రూ.1,500 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో సెబీకి స్టెరిలైట్ ఎలక్ట్రిక్ ఐపీవో పత్రాలను దాఖలు చేసింది. కార్యకలాపాల విస్తరణ, రుణ భారం తగ్గింపు లక్ష్యాలతో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందులో భాగంగా 77.9 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇంతే పరిమాణంలో షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్లు ట్విన్ స్టార్ ఓవర్సీస్తోపాటు కైలాష్ చంద్ర మహేశ్వరి, జాకబ్ జాన్, రామ్గురు రాధాకృష్ణన్ షేర్లను విక్రయించనున్నారు. సెపె్టంబర్ 20 నాటికి కంపెనీకి రూ.600 కోట్ల రుణ భారం ఉంది. ఐపీవోలో సమీకరించే నిధుల్లో రుణ చెల్లింపులకు రూ.350 కోట్లు వినియోగించాలన్న ప్రణాళికతో ఉంది. మిగిలిన నిధులను విస్తరణ కార్యకలాపాలకు వెచి్చంచనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కార్యకలాపాలు నిర్వహించే లాల్బాబా ఇంజనీరింగ్ ఐపీవోలో భాగంగా తాజా షేర్ల జారీ రూపంలో రూ.630 కోట్ల నిధులను, ప్రమోటర్ల వాటాల విక్రయ రూపంలో మరో రూ.370 కోట్లను సమీకరించనుంది. తాజా షేర్ల జారీ రూపంలో సమకూరే నిధుల నుంచి రూ.271 కోట్లను మూలధన వ్యయాల కోసం వెచ్చించనుంది. హల్దియా ప్లాంట్ విస్తరణకు కేటాయించనుంది. రూ.209 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించుకోనుంది. లాల్బాబా ఇంజనీరింగ్ సంస్థ సీమ్లెస్ ట్యూబులు, ప్రెసిషన్ ఫోర్జింగ్స్, ఇంటెగ్రేటెడ్ రైల్ స్టిస్టమ్స్ తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సీజే డార్సిల్స్ లాజిస్టిక్స్ సమగ్ర లాజిస్టిక్స్ సరీ్వసుల సంస్థ సీజే డార్సిల్ లాజిస్టిక్స్ భారత్తో పాటు అంతర్జాతీయంగా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సరుకు రవాణా, వేర్హౌసింగ్ తదితర సేవలను అందిస్తోంది. సెబీకి సమరి్పంచిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ 2.64 కోట్ల వరకు షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రమోటర్లు 99.05 లక్షల షేర్లను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కొత్త యంత్రపరికరాల కొనుగోలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించుకోనుంది.జెరాయ్ ఫిట్నెస్ జిమ్ ఎక్విప్మెంట్ సరఫరా చేసే జెరాయ్ ఫిట్నెస్ ప్రమోటర్లు 43.92 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ విధానంలో విక్రయించనున్నారు. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి కంపెనీకి ఐపీవో ద్వారా నిధులేమీ లభించవు. దేశ, విదేశాల్లో కమర్షియల్ జిమ్లు, హోటళ్లు, కార్పొరేషన్లు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు జెరాయ్ ఎక్విప్మెంట్ను అందిస్తోంది. జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ్రస్టేలియా, సెర్బియా, స్వీడన్ తదితర దేశాలకు కూడా ఎగుమతులు చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 ఎక్స్క్లూజివ్ షోరూమ్లు ఉన్నాయి. -
పండక్కి సెలవు తీసుకుంటే.. జాబ్ నుంచి తీసేశారు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులను చూస్తుంటే.. ప్రైవేట్ జాబ్స్ ఎప్పుడు, ఎందుకు, ఎలా పోతున్నాయో కూడా అర్థం కానీ పరిస్థితి కనిపిస్తోంది. దుర్గా పూజకు.. అనుమతితో సెలవు తీసుకున్నందుకు ఉద్యోగం నుంచి తీసేశారంటూ.. ఒక టెకీ రెడ్దిట్ వేదికగా పోస్ట్ చేశారు.దుర్గా పూజకు సెలవు తీసుకున్నందుకు తొలగించారు.. అనే శీర్షికతో వైరల్ అయిన రెడ్డిట్ పోస్ట్లో ఒక టెకీ తన అనుభవాన్ని వెల్లడించారు. నేను సెలవు తీసుకుంటానని మూడు వారాల ముందే మేనేజర్కు సమాచారం ఇచ్చాను. కంపెనీ సీఈఓ నుంచి కూడా అనుమతి పొందాను. కానీ హెచ్ఆర్ నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టెర్మినేషన్ మెయిల్లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా సెలవు తీసుకున్న కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.గత కొన్ని రోజులుగా కంపెనీ కోసం ఎంతో కష్టపడి పనిచేసాను. పనిగంటలు పొడిగించినప్పుడు కూడా వర్క్ చేసాను. అనుమతితో సెలవు తీసుకున్నప్పటికీ.. నన్ను కంపెనీ నుంచి తొలగించారు. నాకు చాలా బాధగా ఉంది. కంపెనీ వాళ్ళు నాకు రిలీవింగ్, ఎక్స్పీరియన్స్ లెటర్, పే స్లిప్స్ వంటివి ఇస్తారా లేదా అనే సందేహం కూడా ఉంది. ఈ పరిస్థితిలో ఏమి చేయాలో నాకు సలహా ఇవ్వండి అని పోస్ట్ చేశారు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు ఆ కంపెనీలోనే ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులో ఎదుర్కొనేవారు' అని ఒకరు వెల్లడించగా.. ''వినడానికి బాధగా ఉంది, మీరు ఏదో చిన్న స్టార్టప్లో పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది, అలాంటి సంస్థల్లో.. ఇలాంటివి చాలా సాధారణం'' అని ఇంకొకరు అన్నారు. -
ఈపీఎఫ్ఓ కాంటెస్ట్: ట్యాగ్ చెప్పు.. క్యాష్ పట్టు!
భారత ప్రభుత్వ కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO), MyGov సహకారంతో, EPFO కోసం ఒక ట్యాగ్లైన్ కాంటెస్ట్ ప్రారంభించింది. సంస్థ ఆశయాలు, విధులకు అద్దం పట్టేలా (ఈపీఎఫ్ఓకు సూటయ్యే విధంగా) ఓ మంచి ట్యాగ్లైన్ అందించాలని ప్రజలకు సూచించింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఈ కాంటెస్ట్ 2025 అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది.వచ్చిన మొత్తం ట్యాగ్లైన్లలో మూడు ఉత్తమమైన వాటిని ఎంపిక చేయడం జరుగుతుంది. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగే ఈపీఎఫ్ఓ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కావడానికి కూడా వారికి ఆహ్వానం లభిస్తుంది.నగదు బహుమతిమొదటి బహుమతి: రూ. 21,000రెండవ బహుమతి: రూ. 11,000మూడవ బహుమతి: రూ. 5,100తప్పకుండా పాటించాల్సిన షరతులు➤ఈ పోటీలో పాల్గొనేవారు భారతీయ పౌరులై ఉండాలి. ➤ట్యాగ్లైన్ హిందీలోనే ఉండాలి.➤ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే.. అంటే ఒక ట్యాగ్లైన్ మాత్రమే ఇవ్వాలి. ➤ఈ ట్యాగ్లైన్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత, దార్శనికతకు అద్దం పట్టేలా ఉండాలి.➤ఏఐ కంటెంట్ ఉపయోగించకూడదు.Be the voice of trust & security!Join the EPFO Tagline Contest & craft a line that echoes financial safety & social empowerment.👉 https://t.co/86rKW27zrS #EPFO #FinancialSecurity #MyGovContest@LabourMinistry pic.twitter.com/4en8gQljTt— MyGovIndia (@mygovindia) October 3, 2025 -
షాపింగ్ మాల్స్ విస్తరణ: రిటైల్ కేంద్రాలకు అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: సంస్థాగత పెట్టుబడులు ద్వితీయ శ్రేణి పట్టణాలకు శరవేగంగా విస్తరిస్తున్నాయి. పట్టణీకరణ, అధిక జనాభా, కొనుగోలు శక్తి పెరుగుతుండటంతో వ్యవస్థీకృత రిటైల్ కేంద్రాలకు అవకాశాలు లభిస్తున్నాయి. మారుతున్న వినియోదారుల అభిరుచులతో ప్రపంచ బ్రాండ్లు విస్తరణపై దృష్టిసారిస్తున్నాయి.చంఢీఘడ్, ఇండోర్, సూరత్, భువనేశ్వర్, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు నెక్సస్(బ్లాక్ స్టోన్), డీఎల్ఎఫ్, ఫీనిక్స్ మిల్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, లేక్షోర్, రహేజా గ్రూప్, పసిఫిక్ వంటి సంస్థాగత దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు వచ్చే 3–5 ఏళ్లలో 4.25 కోట్ల చ.అ. కంటే ఎక్కువ విస్తీర్ణంలో కొత్తగా 45 షాపింగ్ మాల్స్ను అందుబాటులోకి తీసుకురానున్నాయి.ప్రస్తుతం ఈ ఏడు సంస్థలకు సమష్టిగా 3.4 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 58 మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో గ్రేడ్-ఏ, బీ, సీ కేటగిరీ మాల్స్ అన్నీ కలిపి 650 షాపింగ్ మాల్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. ఇండియాలో 11 కోట్ల చ.అ. నాణ్యమైన రిటైల్ స్పేస్ ఉంది. అమెరికాలో 70 కోట్ల చ.అ., చైనాలో 40 కోట్ల చ.అ. రిటైల్ స్థలం అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో అధిక శాతం స్థలం సంస్థాగత నిర్మాణ సంస్థల యాజమాన్యంలోనే ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. -
వయసు 31.. సంపద రూ.21 వేలకోట్లు! ఎలా సాధ్యమైంది?
భారతదేశపు అతి పిన్న వయసున్న బిలియనీర్గా అరవింద్ శ్రీనివాస్(31)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. చెన్నైలో జన్మించిన ఈయన పెర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడిగా, ఆ సంస్థ సీఈఓగా ఉన్నారు. దాంతోపాటు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.21,190 కోట్ల (సుమారు $2.5 బిలియన్లు) నికర విలువతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.తమిళనాడులోని చెన్నైలో పెరిగిన అరవింద్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మెషిన్ లెర్నింగ్, ఏఐ పట్ల అభిరుచి పెంచుకున్నారు. తన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ సంపాదించారు. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ తన నైపుణ్యాలను ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన ఏఐ సంస్థలతో కలిసి మెరుగుపరుచుకున్నారు. ఈ క్రమంలో OpenAI, గూగుల్, డీప్ మైండ్ల్లో పనిచేశారు. ఇక్కడ అతను అత్యాధునిక ఏఐ నమూనాలు, ఎల్ఎల్ఎం(లార్జ్ ల్యాంగ్వేజీ మోడల్స్)పై అనుభవం సాధించారు. ఇది అతని సొంత కంపెనీ స్థాపనకు కీలకంగా మారింది.పెర్ప్లెక్సిటీ ఏఐ2022లో శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్వినిస్క్తో కలిసి పెర్ప్లెక్సిటీ ఏఐను స్థాపించారు. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్ కాదు. ఇది ఒక ఇంటెరాక్షన్ ఏఐ సెర్చ్ ఇంజిన్. ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి వేగవంతమైన మార్గంగా దీన్ని శ్రీనివాస్ అభివర్ణించారు. మార్కెట్లో తన పోటీదారులకు బలమైన ప్రత్యామ్నాయంగా పెర్ప్లెక్సిటీ నిలుస్తుంది. సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల మాదిరిగా హైపర్లింక్ల జాబితాను అందించడానికి బదులుగా పెర్ప్లెక్సిటీ ప్రత్యక్ష, ఇంటెరాక్షన్ సమాధానాలను అందిస్తుంది. ఇది మరింత కచ్చితమైన ప్రతిస్పందనలను రూపొందించడానికి జనరేటివ్ ఏఐను రియల్టైమ్ వెబ్ డేటాతో విలీనం చేస్తుంది. ఈ కంపెనీకి సిలికాన్ వ్యాలీలో గుర్తింపు లభించింది. ఈ స్టార్టప్కు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్తో సహా అగ్రశ్రేణి పెట్టుబడిదారుల నుంచి నిధులు సమకూరాయి.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
సెలవుల్లేవ్.. వారంలో 7 రోజులు పని!
భారతదేశంలో మారుతి సుజుకి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. దీంతో కంపెనీ సెప్టెంబర్ నెలలో తమ ఉత్పత్తిని 26 శాతం పెంచింది. వాహనాల ఉత్పత్తి పెరగడం వల్ల.. కొనుగోలుదారులకు సకాలంలో డెలివరీలు జరిగాయి. ఈ తరుణంలో ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధిని సాధించడానికి.. ప్రొడక్షన్ టీమ్ ఆదివారాలు & సెలవు దినాలలో పని చేయాలని మారుతి సుజుకి మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ తెలిపారు.నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో మారుతి సుజుకి దాదాపు 1,65,000 వాహనాలను డెలివరీ చేసింది. ఈ అమ్మకాలు గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 27.5 శాతం ఎక్కువ. త్వరలో డెలివరీలు రెండు లక్షలకు చేరుకుంటుందని చెబుతున్నారు. కంపెనీ సేల్స్ పెరగడానికి జీఎస్టీ 2.0 కూడా సహకరించింది. గత పదేళ్లలో ఇంతటి వృద్ధి (బుకింగ్స్ & డెలివరీలు) ఎప్పుడూ చూడలేదని కూడా పార్థో బెనర్జీ అన్నారు.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?డిమాండుకు తగ్గ డెలివరీలు చేయడానికి.. మారుతి సుజుకి గత నెలలో 12,318 యూనిట్ల ఆల్టో & ఎస్ ప్రెస్సో మోడళ్లను ఉత్పత్తి చేసింది. బాలెనో, సెలెరియో, డిజైర్ & స్విఫ్ట్ వంటి కాంపాక్ట్ మోడళ్ల ఉత్పత్తి సెప్టెంబర్లో 93,301 యూనిట్లు. బ్రెజ్జా, ఎర్టిగా & ఫ్రాంక్స్ వంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి 79,496 యూనిట్లకు చేరుకుంది. ఈకో ఉత్పత్తి కూడా 13,201 యూనిట్లకు పెరిగింది. మొత్తం మీద కంపెనీ ఈ ఏడాది అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. -
ఈ–స్పోర్ట్స్ కోసం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ప్రతిపాదన
ఈ–స్పోర్ట్స్, డిజిటల్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించేందుకు, రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ)పై నిషేధం అమలుకు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాను (ఓజీఏఐ) ఏర్పాటు చేసేలా కేంద్రం ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీనికి ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) సారథ్యం వహిస్తుంది. సమాచార–ప్రసార శాఖ, యూత్ అఫైర్స్ తదితర శాఖల సమన్వయంతో ఇది పనిచేస్తుంది.ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ (పీఆర్వోజీ) చట్టం 2025 కింద కేంద్రం ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ఆవిష్కరించింది. వీటిపై అక్టోబర్ 31లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. ముసాయిదా ప్రకారం ఓజీఏఐకి మెయిటీలోని అదనపు కార్యదర్శి స్థాయి అధికారి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇది దేశీయంగా చట్టబద్ధంగా ఆడతగిన ఈ–స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ఆమోదిస్తుంది.అలాగే పీఆర్వోజీ చట్టాన్ని ఉల్లంఘించే గేమ్స్, స్పోర్ట్స్ను రద్దు కూడా చేయగలదు. ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసులు ఆఫర్ చేసే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 కోటి వరకు జరిమానా లేదా రెండింటినీ కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఆన్లైన్ మనీ గేమ్స్పై ప్రకటనలు ఇస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.ఇదీ చదవండి: సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత? -
యూఏఈకి ఉచిత వీసాలు.. అబుదాబి కంపెనీ ఆఫర్
మోర్తాడ్(బాల్కొండ): గల్ఫ్లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు అబుదాబిలోని ఏడీఎన్హెచ్ కంపెనీ (Abu Dhabi company) తెలంగాణలోని జీటీఎం సంస్థ ద్వారా ఉచితంగా వీసాలను (free visa) జారీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పలుమార్లు అనేకమందికి ఉచితంగా వీసాలు ఇచ్చిన ఈ సంస్థ..మరోసారి ఉచిత వీసాల జారీ కి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ ఏడీఎన్హెచ్ కంపెనీ క్లీనింగ్, క్యాటరింగ్ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిస్తోంది. ఈనెల 10న జగిత్యాలలో, 11న నిజామాబాద్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉన్న యువకులకు అర్హత వయస్సు 21 నుంచి 38 ఏళ్ల వరకూ ఉండొచ్చని జీటీఎం సంస్థ చైర్మన్ చీటి సతీష్రావు ‘సాక్షి’తో చెప్పారు.బేసిక్ ఇంగ్లిష్ వచ్చి ఉండాలని, పచ్చబొట్టు కనబడకుండా ఉండాలని తెలిపారు. ఒరిజినల్ పాస్పోర్టుతో జగిత్యాల లేదా నిజామాబాద్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. ఎంపికైన వారికి రూ. 23 వేల వరకూ వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్టు వెల్లడించారు. ఎవరికీ నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం కోసం అభ్యర్థులు జీటీఎం సంస్థ నిజామాబాద్ (8686860999), ఆర్మూర్ (8332062299), జగిత్యాల (8332042299), సిరిసిల్ల (9347661522) నంబర్లలో సంప్రదించాలని సతీష్రావు సూచించారు. -
డీ2సీలోనే ఎఫ్ఎంసీజీ కొనుగోళ్లు
గత ఐదేళ్లలో దేశీయంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ప్రధానంగా డైరెక్ట్టు కన్జూమర్(డీ2సీ) విభాగంలోని కంపెనీలనే కొనుగోలు చేసినట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇతర సంస్థల కొనుగోళ్లలో ముప్పావువంతు డీ2సీ సంస్థలేనని తెలియజేసింది. తద్వారా ఎఫ్ఎంసీజీ రంగంలోని దిగ్గజాలు వృద్ధికి ఊతమివ్వడంతోపాటు.. ప్రీమియం విభాగాలలో విస్తరణకు దారి ఏర్పరచుకున్నట్లు తెలియజేసింది. దీంతోపాటు విస్తరణ, లాభదాయకతల్లో టార్గెట్ సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.ఈ జాబితాలో హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) ఇటీవల అప్రైజింగ్ సైన్స్ ప్రయివేట్(మినిమలిస్ట్)ను రూ. 2,706 కోట్లకు సొంతం చేసుకోగా.. సాతియా న్యూట్రాస్యూటికల్స్(ప్లిక్స్)ను రూ. 380 కోట్లకు మారికో కొనుగోలు చేసింది. హీలియోస్ లైఫ్స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను రూ. 272 కోట్లు వెచి్చంచి ఇమామీ టేకోవర్ చేయగా.. స్ప్రౌట్లైఫ్ ఫుడ్స్(యోగా బార్)ను రూ. 225 కోట్లకు ఐటీసీ చేజిక్కించుకుంది. ఈ అధ్యయనానికి 82 ఎఫ్ఎంసీజీ కంపెనీలను, 58 డీ2సీ సంస్థలను పరిగణనలోకి తీసుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
వంట గదుల్లో నలభీములు!
ముంబైలోని చిన్న వంటగదిలో 29 ఏళ్ల జస్టిన్ వారంలో ఒక రాత్రి తన ఎయిర్ ఫ్రయర్లో స్వీట్ పోటాటో వెజెస్ వేయిస్తూ, సలాడ్ సిద్ధం చేస్తుంటాడు. వంట అనేది అతనికి విసుగెత్తించే పనికాదు, రిలాక్స్ అవడానికి, స్నేహితులను ఎంటర్టైన్ చేయడానికి, కొత్త రుచులను అన్వేíÙంచడానికి అదో మార్గం. జస్టిన్ ఇప్పుడు భారతదేశ నగరాల్లో పెరుగుతున్న ఒక వర్గానికి ప్రతినిధి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పురుషులు స్టైలిష్ గాడ్జెట్లు, ఆధునిక కుక్వేర్తో వంటింట్లోకి అడుగుపెడుతున్నారు. ఇది మారుతున్న అలవాట్లకే కాదు వాణిజ్యపరంగా కూడా ఒక విప్లవం. దృక్పథం మారుతోంది...ఆన్లైన్లో వంటింటి సామాను కొనేవారిలో ఇపుడు 30% మంది పురుషులే ఉంటున్నారు ఐదారేళ్ల క్రితం ఇది చాలా తక్కువ శాతం మాత్రమే. ఇంట్లో వంటగది ఎలా ఉండాలి, కుకింగ్ త్వరగా అయేందుకు ఏమేం వస్తువులు కొనాలి అనే నిర్ణయాన్నిఇపుడు అనేక ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకుంటున్నారని స్టాల్ కిచెన్స్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు.వంటింటి సామ్రాజ్యానికి ఇప్పటికీ మహిళలే మహారాణులైనా పురుషుల వాటాకూడా క్రమంగా పెరుగుతోందని వండర్ చెఫ్ వ్యవస్థాపకుడు రవి సక్సేనా స్పష్టంచేశారు. 70% వారానికోసారి...ఆన్లైన్ కొనుగోళ్ల ఆల్గరిథమ్ను పరిశీలిస్తే వంటింటి సామాను కొనే పురుషులు రెండు రకాలని తెలుస్తోంది. మొదటిరకం.. స్వతంత్రంగా జీవించే యువకులు వీరు రోజువారీ వాడుకకు పనికివచ్చే, నాన్–టాక్సిక్ కుక్వేర్, ఒకటి రెండు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఇక రెండో రకం ప్యాషనేట్ కుక్స్ (బిజీ ప్రొఫెషనల్స్) వీరు ప్రతిరోజూ వంట చేయకపోయినా, ప్రీమియం సెట్లు కొనుగోలు చేసి సంప్రదాయ కుటుంబ వంటకాలతోపాటు రెస్టారెంట్లో లభించే రుచులను వంటింట్లో తయారుచేసేందుకు ప్రయతి్నస్తారు. కుక్వేర్ కొనే పురుషుల్లో 70% మంది కనీసం వారానికి ఒకసారి వాటిని వాడతారు. వీరు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులు, పూర్తి సెట్లను కొనడానికి ఇష్టపడతారు. వీరి సగటు ఆర్డర్ విలువ ఇతరులతో పోలిస్తే 12% ఎక్కువని ఎంబర్ కుక్వేర్ సీఈఓ సిద్ధార్థ్ గడోదియా చెప్పారు. పురుషులకు బాగా నచ్చేవి, ఎక్కువగా కొనే కిచెన్ ఉత్పత్తులు మలీ్ట–ఫంక్షనల్ పరికరాలు (కలపడం, ముద్ద చేయడం, కట్ చేయడం, ఆవిరి వేయడం, వండడం ఇలా ఆల్ రౌండర్ టైపువి. స్టీలు పెనాలు, మూకుళ్లు ఉంటాయని గడోదియా తెలిపారు. మొత్తానికి, పురుషులు వంటింట్లోకి అడుగుపెట్టడం వల్ల కుక్వేర్ మార్కెట్కి కొత్త కళ వచి్చంది.పురుషులు వంటగదిలోకి రావడానికి కారణాలు→ ఆరోగ్యంపై శ్రద్ధ (తక్కువ నూనె, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించడం) → ఫ్లెక్సిబుల్ వర్క్ ప్యాటర్న్స్ (హోమ్ ఆఫీస్, వర్క్–లైఫ్ బ్యాలెన్స్) → సోషల్ మీడియాలో నోరూరిస్తూ లభించే సులభమైన రెసిపీలు -
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. కలిసొచ్చిన నవరాత్రి: అమ్మకాల్లో అరుదైన రికార్డ్!
భారతదేశంలో ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో వాహన విక్రయాలు కొంత పెరుగుతాయి. అయితే ఈ సారి మాత్రం వెహికల్ సేల్స్ ఊహకందని రీతిలో గణనీయంగా పెరిగాయి. దీనికి కారణం మోదీ ప్రభుత్వం అమలుచేసిన జీఎస్టీ 2.0 అని తెలుస్తోంది. కొత్త జీఎస్టీ సంస్కరణల కారణంగా.. కార్లు, బైకులు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సేల్స్ భారీగా పెరిగాయి.ఆటోమొబైల్ రంగంఏ రంగం ఎలా ఉన్నా.. ఆటోమొబైల్ రంగానికి మాత్రం పండుగ సీజన్ బాగా కలిసొచ్చింది. మారుతి సుజుకి నవరాత్రి అమ్మకాలు.. గత సంవత్సరం కంటే రెట్టింపు అయ్యాయి. నవరాత్రి మొదటి ఎనిమిది రోజుల్లో 1.65 లక్షల వాహనాలను కంపెనీ డెలివరీ చేసింది. మొదటి రోజు 30,000 కార్లను డెలివరీ చేసి అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సంస్థ మొత్తం బుకింగ్లు 1.50 లక్షలుగా నివేదించింది. ఈ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంటుందని కంపెనీ భావిస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ 85,000 వాహనాలను విక్రయించింది. దీన్నిబట్టి చూస్తే.. మారుతి సుజుకి సేల్స్ ఏ స్థాయిలో పెరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది.ఇక దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఫెస్టివల్ సీజన్లో 60 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఎక్స్యూవీ700, స్కార్పియో ఎన్ వంటి కార్లను ఎక్కువ సంఖ్యలో విక్రయించింది. ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, టియాగో వంటి మోడళ్లకు డిమాండ్ పెరగడంతో టాటా మోటార్స్ 50,000 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ క్రెటా, వెన్యూలకు డిమాండ్ పెరగడంతో..ఈ ఎస్యూవీల వాటా మొత్తం అమ్మకాలలో 72 శాతానికి పైగా పెరిగింది.ఇక టూ వీలర్స్ విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ ముందు వరుసలో నిలిచింది. అంటే ఈ బ్రాండ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. కంపెనీ షోరూమ్ల వద్ద రద్దీ ఈ నవరాత్రిలో రెట్టింపు అయ్యింది. కమ్యూటర్ విభాగంలోని బైకుల సేల్స్ గణనీయంగా పెరిగాయి. బజాజ్ ఆటో కూడా బలమైన అమ్మకాలను నమోదు చేసింది.ఎలక్ట్రానిక్స్ రంగంఆటోమొబైల్ రంగం పక్కన పెడితే.. ఎలక్ట్రానిక్స్ రంగం కూడా మంచి పురోగతిని సాధించింది. హైయర్ అమ్మకాలు 85 శాతం పెరిగాయి. ఈ కంపెనీ తన దీపావళి స్టాక్ అయిన.. 85 ఇంచెస్, 100 ఇంచెస్ టీవీలను దాదాపుగా విక్రయించేసింది. అంతే కాకుండా ఈ సంస్థ రోజుకు 300-350 యూనిట్ల 65 ఇంచెస్ టీవీలను సేల్ చేసింది.ఇదీ చదవండి: గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?భారతదేశంలోని అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్ రిటైల్ అమ్మకాలు.. గత సంవత్సరం నవరాత్రి కంటే 20-25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ వంటి సేల్స్ అమాంతం పెరిగాయి. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ 'విజయ్ సేల్స్' అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందాయి. -
రాడిసన్ బ్లూ ప్లాజాకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు
బంజారా హిల్స్లో రాడిసన్ బ్లూ ప్లాజా, క్లాసిఫైడ్ హోటల్స్ - 5 స్టార్ కేటగిరీ కింద.. తెలంగాణ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు 2025 పొందింది. హైదరాబాద్లో జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ అవార్డును అందుకుంది.టూరిజం ఎక్సలెన్స్ అవార్డును.. రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ తరపున సౌత్ ఇండియా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ జోషి, రాడిసన్ బ్లూ ప్లాజా బంజారా హిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజర్షి భట్టాచార్జీ అందుకున్నారు. ఆతిథ్యంలో అత్యుత్తమ ప్రతిభ, అత్యుత్తమ సేవా నాణ్యత ఈ అవార్డు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోవడం మాకు ఎంతో గౌరవంగా ఉందని జోషి పేర్కొన్నారు. -
నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!
కార్పొరేట్ ఉద్యోగాలు నీటిమీద బుడగలాగా మారిపోయాయి. ఎప్పుడు జాబ్ పోతుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు. దీనికి కారణం కొన్ని కంపెనీల ప్రవర్తనే. ఇటీవల ఒక కంపెనీ నాలుగు నిముషాల మీటింగ్ తరువాత.. లేఆఫ్స్ అంటూ షాక్ ఇచ్చింది. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాకు చెందిన ఒక కంపెనీలో.. రిమోట్గా పనిచేస్తున్న ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్లో తనకు ఎదురైన ఆకస్మిక & షాకింగ్ లేఆఫ్ అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. నేను ఉదయం 9 గంటలకు లాగిన్ అయ్యాను. 11 గంటలకు కంపెనీ సీఓఓ భారతదేశానికి చెందిన ఉద్యోగులతో మీటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మీటింగ్ కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే సాగింది.నాలుగు నిమిషాల మీటింగ్లోనే.. ఉద్యోగులను తొలగిస్తున్నట్లు, మీటింగ్ పూర్తైన తరువాత మెయిల్స్ అందుతాయని చెప్పాడు. తొలగింపులు పనితీరుకు సంబంధించినవి కాదని, అంతర్గత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఇది విన్న నేను ఒక్కసారిగా షాక్కు గురయ్యాను.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుఉద్యోగులను ఎక్కువగా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం ఏమిటంటే.. ముందస్తు సరైన సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం. అక్టోబర్ నెల పూర్తి జీతం నెలాఖరులోగా చెల్లిస్తామని, పెండింగ్లో ఉన్న సెలవులను నగదుగా మారుస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని ఉద్యోగి పేర్కొన్నారు. నేను ఉద్యోగం కోల్పోవడం ఇదే మొదటిసారి, ఇది నిజంగా బాధాకరం వెల్లడించారు. -
పండుగ వేళ.. ‘కొత్త రకం’ బంగారానికి డిమాండ్..
దేశంలో కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చారిత్రక గరిష్టాలను తాకాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్తో రూపాయి బలహీనపడటం, అస్థిర అంతర్జాతీయ పరిస్థితులు.. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులను పసిడి వైపు నెట్టివేశాయి. దాని ధరను మరింత పెంచేశాయి.అయితే పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్లకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనడం చాలా కష్టంగా మారింది. ఫలితంగా, వినియోగదారులు ఇప్పుడు మరింత తక్కువ క్యారెట్ ఆభరణాల వైపు మళ్లుతున్నారు. 9 క్యారెట్లు, 14 క్యారెట్లు, 18 క్యారెట్ల ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.బంగారం సెంటిమెంట్..నిశ్చింతైన పెట్టుబడిగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగానూ ఇళ్లలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లి సీజన్ తో పాటు దసరా, దీపావళి వంటి పండుగలను బంగారం కొనడానికి అత్యంత శుభ సమయాలుగా పరిగణిస్తారు. కానీ ధరలు కొత్త గరిష్టాలను తాకడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో దుకాణదారులు సంప్రదాయం, స్థోమత రెండింటినీ సమతుల్యం చేస్తూ తక్కువ క్యారెట్ పసిడి ఆభరణాలను కొనుగోలుదారులకు అందుబాటు తీసుకొచ్చారు.ప్రభుత్వ మద్దతు22 క్యారెట్ల బంగారం మాదిరిగానే 9 క్యారెట్, 14 క్యారెట్ల బంగారానికి కూడా హాల్ మార్కింగ్ ను అనుమతించాలని ప్రభుత్వం తీసుకున్న చర్య కొనుగోలుదారుల విశ్వాసాన్ని పెంచింది. తక్కువ క్యారెట్ల ఆభరణాలను ఎంచుకున్నప్పుడు కూడా వినియోగదారులు నాణ్యత గురించి భరోసా పొందుతారు.ఎవరు కొంటున్నారు..?పాత కొనుగోలుదారులు ఇప్పటికీ దీర్ఘకాలిక విలువ కోసం 22 క్యారెట్ల ఆభరణాలను ఇష్టపడుతున్నారు. యువ వినియోగదారులు తక్కువ క్యారెట్లలో తేలికపాటి, అధునాతన ఆభరణాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మార్పు రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో ఆభరణాల పోకడలను పునర్నిర్వచించే అవకాశం ఉంది. సంప్రదాయాన్ని స్థోమత, ఫ్యాషన్తో మిళితం చేస్తుంది. -
టాటా సన్స్ ఐపీవో గడువు మిస్..
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసిన గడువు ముగియడంతో తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ అంశంపై స్పందించారు. రిజిస్ట్రేషన్ రద్దయ్యేవరకూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకునే వీలున్నట్లు తెలియజేశారు.టాటా సన్స్సహా.. కొన్ని సంస్థలను ఆర్బీఐ ఈ ఏడాది సెప్టెంబర్ 30లోగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్కు ఆదేశించింది. అయితే డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ కీలక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ(సీఐసీ) రిజిస్ట్రేషన్ను అప్పగించేందుకు గతేడాది ఆర్బీఐకు దరఖాస్తు చేసింది.తద్వారా తప్పనిసరి లిస్టింగ్ను తప్పించుకుకోనుంది. కాగా.. ఆర్బీఐ ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీలుగా గుర్తింపు పొందిన 15 సంస్థలను సెపె్టంబర్ 30లోగా ఐపీవో చేపట్టమంటూ ఆదేశించింది.టాటా సన్స్మినహా మిగిలిన కంపెనీలు నిబంధనలను పాటించాయి. కంపెనీ లిస్టయితే 18 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ లబ్ది పొందనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఇదే జరిగితే.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మస్క్!
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk).. దాదాపు అర ట్రిలియన్ డాలర్ల నికర విలువను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ట్రాకర్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి.. ఇప్పుడు 500.1 బిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నారు. ఈయన నికర విలువ ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ కంటే 150 బిలియన్ డాలర్లు ఎక్కువ.దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలాన్ మస్క్.. సంపద అతని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla)తో ముడిపడి ఉంది. సెప్టెంబర్ 15 నాటికి అతను 12.4 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం 3:30 గంటల నాటికి టెస్లా షేర్లు దాదాపు 4 శాతం పెరిగాయి. దీంతో మస్క్ సంపదకు 9.3 బిలియన్ డాలర్లు యాడ్ అయ్యాయి. ఇలా కంపెనీ స్టాక్ వాల్యూ ఎప్పటికప్పుడూ పెరుగుతూ ఉండటం వల్ల.. మస్క్ సంపద కూడా పెరుగుతూనే ఉంది.డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. మస్క్ టెస్లా షేర్స్ భారీగా పెరిగాయి. కాగా కంపెనీ ఇప్పుడు ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ, స్పేస్ఎక్స్ కంపెనీలను కూడా విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మస్క్ సంపదను మరింత పెంచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ పాస్పోర్ట్తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరికపిచ్బుక్ డేటా ప్రకారం, ఎక్స్ఏఐ జూలై నాటికి 75 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. అదే సమయంలో స్పేస్ఎక్స్ విలువ 400 బిలియన్ డాలర్లు (బ్లూమ్బెర్గ్ ప్రకారం). మస్క్ సంపద ఇదే వృద్ధి రేటుతో కొనసాగితే.. 2023 మార్చి నాటికి ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ కాగలరని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. -
అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలు
సోషల్ మీడియాలో నెలల తరబడి తన ఉద్యోగ అన్వేషణ గురించి.. వివరించిన భారతీయ మహిళ 'అనన్య జోషి' తగిన ఉద్యోగం పొందలేకపోయింది. దీంతో అమెరికా (America) విడిచిపెట్టాల్సి వచ్చింది. సెప్టెంబర్ 29న ఆమె అమెరికా విడిచిపెట్టే సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి 2024లో బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన అనన్య జోషి.. F-1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా బయోటెక్ స్టార్టప్లో ఉద్యోగంలో చేరింది. అయితే కొన్ని రోజుల తరువాత ఆమె ఉద్యోగం కోల్పోయింది. అయితే స్టూడెంట్ వీసాతో చదువు పూర్తి చేసుకున్న తరువాత.. ఎఫ్-1 వీసా(F-1 Visa)తో ఉద్యోగంలో చేరింది. ఎఫ్-1 వీసా కలిగి ఉన్న వ్యక్తులు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల సమయంలో మరో ఉద్యోగాన్ని పొందాలి. లేకుంటే దేశం వీడి బయటకు వచేయాలి.ఇదీ చదవండి: బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుఉద్యోగం కోల్పోయిన అనన్య.. నెల రోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసినప్పటికీ.. చివరికి నిరాశే మిగిలింది. చేసేదేమీ లేక అమెరికా విడిచిపెట్టాల్సి వచ్చింది. అమెరికా నుంచి వచ్చే సమయంలో.. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ప్రయాణంలో నేను చాలా కష్టతరమైన అడుగు వేసాను. ఐ లవ్ యూ అమెరికా అంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Ananya 🐬 | Relatable Adult Life (@ananyastruggles) -
మళ్లీ ముకేశ్ నంబర్ వన్!
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశంలోకెల్లా ధనవంతుడిగా నిలిచారు. 2025 ఎం3ఎం హురున్ ఇండియా బిలియనీర్ జాబితా ప్రకారం అంబానీ సంపద 6 శాతం క్షీణించి రూ. 9.55 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ 2025లో దేశీయంగా అపర కుబేరుడిగా అవతరించారు. దీంతో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ రూ. 8.14 లక్షల కోట్ల సంపదతో దేశీ బిలియనీర్లలో రెండో ర్యాంకుకు పరిమితమయ్యారు. గతేడాది అదానీ సంపద 95 శాతం జంప్చేసి రూ. 11.6 లక్షల కోట్లను తాకడంతో అంబానీని అధిగమిస్తూ టాప్ చెయిర్ను పొందిన సంగతి తెలిసిందే. నిజానికి యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు పతనమైనప్పటికీ తిరిగి నష్టాలు రికవర్ అయ్యాయి. కాగా.. తొలిసారి హెచ్సీఎల్ గ్రూప్ రోష్నీ నాడార్ మల్హోత్రా టాప్–3లో చోటు సాధించారు. రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో మూడో ర్యాంకులో నిలవగా.. సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం రూ. 2.46 లక్షల కోట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఈ బాటలో కుమార మంగళం బిర్లా రూ. 2.32 లక్షల కోట్ల సంపదతో ఐదో ర్యాంకులో నిలిచారు. నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం సంపద 43 శాతం జంప్చేసి రూ. 2.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నారు. దేశ జీడీపీలో హురున్ జాబితాలో చోటుచేసుకున్న బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ. 167 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. జాబితాలో రూ. 1,000 కోట్ల సంపదతో 1,687 మంది వ్యక్తులు స్థానం పొందగా.. ఈ సంఖ్య 284 పెరిగింది. వీరిలో 148 కొత్తగా చోటు సాధించారు. గత రెండేళ్లుగా భారత్లో ప్రతీ వారం ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నట్లు హురున్ పేర్కొంది. దీంతో జాబితాలో చోటు పొందినవారిద్వారా ప్రస్తుతం రోజుకి రూ. 1,991 కోట్ల సంపద జమవుతున్నట్లు తెలియజేసింది. కాగా.. పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్లతో జాబితాలో స్థానాన్ని పొందారు. తద్వారా యువ బిలియనీర్గా నిలిచారు. యువ బిలియనీర్లలో ఓయో వ్యవస్థాపకుడు 31 ఏళ్ల రితేష్ అగర్వాల్ సైతం రూ. 14,400 కోట్ల నెట్వర్త్తో పిన్నవయస్కుడిగా జాబితాలో చోటు సాధించారు.జెప్టో వ్యవస్థాపకులకు చోటుహురున్ తాజా జాబితాలో ఈకామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో సహవ్యవస్థాపకులు 23 ఏళ్ల ఆదిత్ పాలిచా, 22 ఏళ్ల కైవల్య వోహ్రా చోటు సంపాదించారు. బిలియనీర్లలో పిన్న వయసు్కలు(జెన్ జెడ్)గా నిలిచారు. 2021లో ఏర్పాటైన జెప్టో వేగంగా వృద్ధి చెందడంతో వోహ్రా సంపద రూ. 4,480 కోట్లకు చేరగా, పాలిచా నెట్వర్త్ రూ. 5,380 కోట్లను తాకింది. కంపెనీ విలువ 5.9 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 1,140 కోట్ల సంపదతో ఎస్జీ ఫిన్సర్వ్ వ్యవస్థాపకుడు రోహన్ గుప్తా, ఆయన కుటుంబం సైతం చోటు సాధించారు. -
ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు
దసరా, దీపావళి పండుగల సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. “ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్” పేరుతో ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గింపు జీఎస్టీ ధరలపై అందిస్తోంది. అగ్రగామి బ్యాంక్ కార్డులపై అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్, జియో మార్ట్ డిజిటల్ స్టోర్స్, ఆన్లైన్ (www.reliancedigital.in)లో రూ.15000 వరకు సత్వర డిస్కౌంట్ కల్పిస్తోంది.కస్టమర్లు పేపర్ ఫైనాన్స్ ఎంచుకుంటే రూ.30,000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీంతో పెద్ద విలువ గల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం సులభం అవుతుంది. రిలయన్స్ డిజిటల్ వారి ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ అక్టోబర్ 25 వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయి. రిలయన్స్ డిజిటల్ లో లభించే కొన్ని డీల్స్ ఇవీ...• తోషిబా 65 ఇంచ్ క్యూ ఎల్ఈడీ రూ. 45,990 లకే.• ఐఫోన్ 16ఈ ప్రారంభ ధర రూ.44,990• 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ప్రారంభ ధర రూ.17,990• రిఫ్రిజిరేటర్ కొంటే రూ.8,990 వరకు విలువ గల ఫ్రీబీస్.• డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.18,990• సెమీ- ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ధరలో టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రారంభ ధర రూ. 10,990• చిన్న డొమెస్టిక్ వస్తువులు 1 కొంటే 5% తగ్గింపు, 2 కొంటే 10% తగ్గింపు, 3 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులపై 15% తగ్గింపు• పర్సనల్ ఆడియో, స్మార్ట్ వాచీలు, టాబ్లెట్స్, ఇతర టెక్ యాక్సెసరీస్ పై 5% తగ్గింపు. -
చేతులు కలిపిన ఎల్ఐసీ, ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)తో బ్యాంకెష్యూరెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకు వెల్లడించింది. దీనితో ఎల్ఐసీ టర్మ్ ప్లాన్లు, ఎండోమెంట్ పాలసీలు మొదలైన పథకాలను బ్యాంకు శాఖలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ కస్టమర్లకు అందించేందుకు వీలవుతుందని వివరించింది.ఎల్ఐసీకి చెందిన 3,600 పైగా శాఖలు, శాటిలైట్ ఆఫీసులతో పాటు తమ 2,000 పైగా టచ్పాయింట్ల విస్తృత నెట్వర్క్తో దేశవ్యాప్తంగా జీవిత బీమా లభ్యతను మరింతగా పెంచవచ్చని ఆర్బీఎల్ తెలిపింది. -
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 బిలియనీర్లు.. కళ్లు చెదిరే విషయాలు
2025లో భారతదేశంలో బిలియనీర్ల సంఖ్య 358కి పెరిగింది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 తాజా నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే 24మంది కొత్త బిలియనీర్లు జాబితాలో చేరారు. 13 ఏళ్ల క్రితం హురున్లిస్ట్ మొదలైనప్పటి నుండి భారతదేశ బిలియనీర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగి 350కి చేరుకుంది. ఈ జాబితాలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలుM3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లిస్టలో చోటు సంపాదించుకున్న వారు ధనవంతులు రోజుకు 1,991 కోట్ల సంపదను ఆర్జించారు.2025లో టాప్ 10 మంది మొత్తం సంపద జాబితాలోని మిగిలిన జాబితాలో 28 శాతానికి సమానం. ఒక్క ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీ సంపదే మొత్తం సంపదలో 12శాతం ఉందని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. రూ.9.55 లక్షల కోట్ల (USD 105 బిలియన్లు) సంపదతో, ముఖేష్ అంబానీ & కుటుంబం అత్యంత ధనవంతులైన భారతీయుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ & కుటుంబం రూ.8.15 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉంది.M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 సంచిత సంపద INR 167 లక్షల కోట్లు. ఇది వార్షిక ప్రాతికపదికన ఇది 5 శాతం పెరుగుదల. ఇది స్పెయిన్ GDP కంటే ఎక్కువ . భారతదేశ GDPలో దాదాపు సగానికి సమానం.సుంకాల ఎదురుదెబ్బ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో M3M హురున్ ఇండియా రిచ్ లిస్టర్ల సగటు సంపద 10,320 కోట్ల 9,850 కోట్లకు తగ్గింది.నీరాజ్ బజాజ్ & కుటుంబం సంపద రూ. 2.33 లక్షల కోట్లు పెరిగి, నాలుగు స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకుంది.మరో విధంగా చెప్పాలంటే, బజాజ్ గ్రూప్కు చెందిన నీరాజ్ బజాజ్ & కుటుంబం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు, 69,875 కోట్లు పెరిగి వారి సంపద 2.33 లక్షల కోట్లకు చేరుకుంది.చెన్నైలో జన్మించిన పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్, INR 21,190 కోట్ల సంపదతో 2025 M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో బిలియనీర్గా అరంగేట్రం చేశారు. జాబితాలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ కూడా ఆయనే.రోష్ని నాడార్ మల్హోత్రా & కుటుంబం రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో టాప్ 3లో అడుగుపెట్టారు, భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలిచారు. రోష్ని నాడార్ టాప్ 10లో అతి పిన్న వయస్కురాలు కూడా.జాబితాలో ఉన్న పద్దెనిమిది మంది లక్ష కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు. గత సంవత్సరం కంటే ఆరుగురు ఎక్కువ. పదేళ్ల క్రితం దశాబ్దం ఇద్దరు మాత్రమే ఉన్నారు.హురున్ ఇండియా యునికార్న్ & ఫ్యూచర్ యునికార్న్ లిస్ట్ 2025 నుండి అరవై ఐదు మంది యునికార్న్ వ్యవస్థాపకులు—13 మంది గజెల్( Gazelle founders) వ్యవస్థాపకులు , 5 మంది చీతా వ్యవస్థాపకులు (Cheetah founders)M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో చోటు సంపాదించారు. -
అంబానీ Vs అదానీ: తాజా కుబేరుడెవరు?
దేశంలో అత్యంత ధనవంతుడి హోదా ముఖేష్ అంబానీ(Mukesh Ambani), గౌతమ్ అదానీల మధ్య దోబూచులాడుతూ ఉంటుంది. ఇప్పటికే భారతదేశ అపర కుబేరుడిగా ఉన్న ముఖేష్ అంబానీ తాజా ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లోనూ టాప్లో నిలిచి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో ఎం3ఎం ఇండియా ప్రచురించిన ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List 2025) 14వ ఎడిషన్ ప్రకారం.. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ .9.55 లక్షల కోట్ల నికర సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.8.15 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(Gautam Adani), ఆయన కుటుంబం తర్వాతి స్థానాల్లో ఉన్నారు.తొలిసారిగా రోష్ని నాడార్ మల్హోత్రా, ఆమె కుటుంబం రూ .2.84 లక్షల కోట్లు సంపదతో భారతదేశపు అత్యంత ధనిక మహిళగా ఖ్యాతి సంపాదించారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంఖ్య ఇప్పుడు 350 దాటింది. ఇది 13 సంవత్సరాల క్రితం జాబితా ప్రారంభమైనప్పటి నుండి ఆరు రెట్లు పెరిగింది. వారి మొత్తం సంపద రూ.167 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు సగం.ఇదీ చదవండి: దేశపు అత్యంత యువ బిలియనీర్.. ఈ చెన్నై కుర్రాడు -
దేశపు అత్యంత యువ బిలియనీర్.. ఈ చెన్నై కుర్రాడు
పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) ఎం3ఎం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో (M3M Hurun India Rich List 2025) అతి పిన్న వయస్కుడైన బిలియనీర్గా చరిత్ర సృష్టించారు. చెన్నైకి చెందిన 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ 21,190 కోట్ల వ్యక్తిగత సంపదతో రిచ్ లిస్ట్లో అరంగేట్రం చేశారు. డీప్-టెక్, ఏఐ (AI)-ఆధారిత ఆవిష్కరణలలో భారతదేశం ఎంత వేగంగా ఎదుగుతోందన్న దానికి ఇది ప్రతిబింబం.ప్రపంచ దిగ్గజాలకు పోటీగా ఉన్న ఏఐ-ఆధారిత సెర్చ్ ఇంజిన్ అయిన పెర్ప్లెక్సిటీ అరవింద్ శ్రీనివాస్కు ప్రపంచస్థాయి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఆయన్ను దేశపు అత్యంత ఉత్తేజకరమైన కొత్త-యుగ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా చేసింది. జెప్టోకు చెందిన కైవల్యా వోహ్రా (22), ఆదిత్ పాలిచా (23) సహా ఇతర యువ పారిశ్రామికవేత్తలతో పాటు ఆయన ఈ జాబితాలో ఉన్నారు.భారతదేశంలో ఇప్పుడు 358 మంది బిలియనీర్లు ఉన్నారని నివేదిక చూపిస్తుంది. ఇందులో రికార్డు స్థాయిలో 1,687 మంది 1,000 కోట్ల రూపాయల సంపదను దాటినవారు ఉన్నారు. ఆ 358 మంది బిలియనీర్ల మొత్తం సంపద 167 లక్షల కోట్ల రూపాయలు. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు సగం. గడిచిన రెండేళ్లలో దేశంలోని ధనవంతులు సగటున రోజుకు 1,991 కోట్ల రూపాయల సంపదను పెంచుకున్నారు. దేశంలో ప్రతి వారం ఒక కొత్త బిలియనీర్ తయారవుతున్నారు. -
అంబానీ, అదానీ తరువాత.. మరోసారి టాప్లో రోష్నీ నాడార్
ప్రముఖ టెక్ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ (HCL) చైర్పర్సన్ రోష్ని నాదర్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ధనవంతులైన వ్యాపారవేత్తగా మరోసారి తన ఘనతను చాటుకున్నారు. భారతదేశంలో అత్యంత ధనవంతు రాలైన మహిళగా చరిత్ర సృష్టించారు. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025లో రూ.2.84 లక్షల కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. తద్వారా భారతదేశ సంపదలో పెరుగుతున్న కొత్త తరం మహిళా నాయకుల ప్రతిభను చాటి చెప్పారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 (Hurun Rich List) ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉన్నారు, రోష్ని నాదర్ మల్హోత్రా అత్యంత ధనవంతురాలైన మహిళగా ఎంపికయ్యారు. హురున్ ప్రకారం రిలయన్స్ అధినేతముఖేష్ అంబానీ మరోసారి తన టాప్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అంబానీ ఫ్యామిలీ భారతదేశంలో అత్యంత ధనవంతుడిగ ఆనిలిచారు. మొత్తం ఆస్తి .రూ.9.55 కోట్లు. ఇక రూ. రూ.8.15 లక్షల కోట్ల కోట్ల సంపదతో అదానీ గౌతమ్ అదానీని అధిగమించారు.భారతదేశంలోని సంపన్న వర్గం గణనీయంగా పెరిగింది. దేశం ఇప్పుడు 350 మందికి పైగా బిలియనీర్లు ఉండగా. ఈజాబితా ప్రకారం గత 13 ఏళ్లుగా వీరి సంఖ్య గణనీనయంగా పెరుగుతూ వస్తోంది. జాబితా వీరి మొత్తం సంపద మొత్తం రూ.167 లక్షల కోట్లు.ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు సగం.కాగా హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ కుమార్తె రోష్ని నాడార్ మల్హోత్రా. ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్. HCL గ్రూప్లో అధిక వాటాను స్వీకరించిన తర్వాత భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు రోష్నీ. -
అదానీ ఎయిర్పోర్ట్స్కి డిజిటల్ సొల్యూషన్స్ దన్ను
ప్రయాణికులు, భాగస్వాములకు మరింత మెరుగైన అనుభూతిని అందించే దిశగా తమ విమానాశ్రయాల్లో డిజిటల్ సొల్యూషన్స్ను విస్తృతంగా వినియోగించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థ అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ (ఏఏహెచ్ఎల్) తెలిపింది. డిజిటల్ వ్యూహంలో భాగంగా ఏవియో, అదానీ వన్యాప్, ఎయిర్పోర్ట్ ఇన్ ఏ బాక్స్ లాంటి స్మార్ట్ ప్లాట్ఫాంలను ఉపయోగించనున్నట్లు వివరించింది.కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకోవడంలో ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, గ్రౌండ్ హ్యాండ్లర్స్, సర్వీస్ ప్రొవైడర్లకు ఏవియో సహాయపడుతుంది. మరోవైపు, ఎయిర్పోర్ట్ సర్వీసున్నింటినీ ఒకే చోట అందించే డిజిటల్ ప్లాట్ఫాం అదానీ వన్యాప్ ఉపయోగపడుతుంది. దేశంలో తొలిసారిగా ఆయా విమానాశ్రయాల్లో ప్రత్యేకమైన సర్వీసులను, అదానీ రివార్డ్స్ లాయల్టీ ప్రోగ్రాం ప్రయోజనాలను పొందవచ్చు.ఎయిర్పోర్ట్ ఇన్ ఏ బాక్స్ ప్లాట్ఫాం ప్రస్తుత కార్యకలాపాల కోసం మౌలిక సదుపాయాలను పటిష్టపర్చుకోవడంతో పాటు భవిష్యత్ విస్తరణ అవసరాల్లోనూ సహాయకరంగా ఉంటుంది. అదానీ గ్రూప్నకు చెందిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెలలోనే ప్రారంభించనున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఏఏహెచ్ఎల్కి ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి, జైపూర్, లక్నో విమానాశ్రయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే.. -
నిధుల వేటలో 4 కంపెనీలు
సెప్టెంబర్లో సందడే సందడిగా సాగిన ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. దిగ్గజాలు టాటా క్యాపిటల్, వియ్వర్క్ ఇండియా, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానుండగా.. మరో 4 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి 2 కంపెనీలు తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్ కంపెనీలు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, విరూపాక్ష ఆర్గానిక్స్ చేరాయి. మరోపక్క సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిస్టింగ్కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో గోప్యతా మార్గంలో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు అప్డేటెడ్గా ఏక్వస్ మరోసారి సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. షేర్ల జారీ, ఆఫర్.. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇన్ఫ్రా కన్సల్టెన్సీ సేవల సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 202.5 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 67.5 లక్షల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 76 కోట్లను రుణాల చెల్లింపునకు, దేశీ అనుబంధ సంస్థ ఎస్ఆర్ఏ ఓఎస్ఎస్లో రూ. 21.9 కోట్లు, విదేశీ అనుబంధ సంస్థలైన ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్లో రూ. 34.8 కోట్లు, బ్రిటన్ సంస్థ ఆర్వీ అసోసియేట్స్లో రూ. 20.8 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, డెడికేటెడ్ ఫ్రైట్ రైల్ కారిడార్ మొదలైన ప్రాజెక్టులకు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ సేవలు అందించింది. ఫార్మా రంగ కంపెనీ ఫార్మాస్యూటికల్ రంగ హైదరాబాద్ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న నిధులలో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణపై వెచి్చంచనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఆర్అండ్డీ ఆధారిత ఫార్మా కంపెనీ విరూపాక్ష ప్రధానంగా ఏఐపీలు, ఇంటరీ్మడియేట్స్ను తయారు చేస్తోంది. 2025 మార్చి31కల్లా 54 ప్రొడక్టుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 811 కోట్ల ఆదాయం, రూ. 78 కోట్ల నికర లాభం ఆర్జించింది. హైదరాబాద్లో నాలుగు, కర్ణాటకలోని హమ్నాబాద్లో రెండు చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. లారస్, న్యూలాండ్, దివీస్ ల్యాబ్స్, ఆర్తి డ్రగ్స్ తదితరాలను ప్రత్యర్ధి సంస్థలుగా భావించవచ్చు.సాస్ సేవలతో.. సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోకు సెబీ అనుమతించింది. జూన్లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.83 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, రూ. 152 కోట్లు ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ డెవలప్మెంట్కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లకు వినియోగించనుంది. కంపెనీ గతంలో 2021 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ అనుమతి లభించకపోవడం గమనార్హం! కంపెనీ ఏఐ ఆధారిత క్లౌడ్లో భాగమైన సాఫ్ట్వేర్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) రూ. 598 కోట్ల ఆదాయం, రూ. 13 కోట్ల నికర లాభం ఆర్జించింది.లిస్టింగ్కు ఏక్వస్ రెడీ కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, ఏరోస్పేస్ పరికరాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దీంతో ఐపీవో చేపట్టేందుకు వీలు చిక్కనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 720 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.17 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థలు ఏరోస్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, ఏక్వస్ కన్జూమర్ ప్రొడక్ట్స్ రుణ చెల్లింపులకు, మెషీనరీ, ఎక్విప్మెంట్ కొనుగోలుకి వెచ్చించనుంది. అంతేకాకుండా ఇతర సంస్థల కొనుగోళ్లకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వినియోగించనుంది. కంపెనీ గోప్యతా మార్గంలో సెబీకి జూన్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీంతో ఐపీవోకు వీలుగా మరోసారి అప్డేటెడ్ పత్రాలు అందించింది. కంపెనీలో అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్తోపాటు.. కాటమారన్, స్పర్ట గ్రూప్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ క్లయింట్లలో బోయింగ్, బోయింగ్, బంబార్డియర్, జీకేఎన్ ఏరోస్పేస్, హనీవెల్, ఈటన్ తదితర దిగ్గజాలున్నాయి. -
డ్రైవర్ అవసరం లేని ఆటో: ధర ఎంతో తెలుసా?
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీదారు ఒమేగా సీకి మొబిలిటీ (OSM).. భారతదేశంలో తన మొట్టమొదటి అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాను లాంచ్ చేసింది. కంపెనీ దీనికి 'స్వయంగతి' అని పేరు పెట్టింది. ఇది ప్యాసింజర్ వెర్షన్, కార్గో వెర్షన్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ.4 లక్షలు, రూ. 4.15 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఒమేగా సీకి మొబిలిటీ.. ఈ సరికొత్త అటానమస్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు వెంటనే ప్రారంభమవుతాయి. ఇది 10.3 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 120 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే దీనికి కావలసిన ఛార్జింగ్ సదుపాయాల గురించి ఎలక్ట్రిక్ వాహన తయారీదారు ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు.స్వయంగతి ఒమేగా సీకి.. ఏఐ స్వయంప్రతిపత్తి వ్యవస్థను పొందుతుంది. ఈ సెటప్లో లి-డార్ టెక్నాలజీ, జీపీఎస్, ఆరు మీటర్ల వరకు అడ్డంకి గుర్తింపు, మల్టీ సెన్సార్ నావిగేషన్, రిమోట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ డ్రైవర్ అవసరం లేకుండానే.. ప్రీ-మ్యాప్ చేసిన మార్గాలను నావిగేట్ చేయడానికి వీలు కల్పిస్తాయి. కంపెనీ ఈ ఆటో రిక్షాను ఇప్పటికే టెస్ట్ చేసింది. రెండో దశలో కూడా టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.విమానాశ్రయాలు, టెక్ పార్కులు, గేటెడ్ కమ్యూనిటీలు, పారిశ్రామిక ప్రాంతాలు, స్మార్ట్ సిటీలలో ఈ ఎలక్ట్రిక్ రిక్షాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ ఈ ఆటో రిక్షాను లాంచ్ చేసింది. ఒమేగా సీకి మొబిలిటీ రాబోయే రెండు సంవత్సరాలలో 1,500 అటానమస్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) తన ఉద్యోగులలో సుమారు 2 శాతం లేదా 12,000 ఉద్యోగాలను తగ్గించుకోవడానికి ప్రణాళిక వేసినట్లు రెండు నెలల క్రితమే ప్రకటించింది. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే.. టీసీఎస్ తన ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.కంపెనీలో ఏం జరుగుతోందనే విషయాన్ని.. ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో వెల్లడించారు. మూడు రోజుల క్రితం నన్ను మీటింగ్ రూమ్కు పిలిచి, రాజీనామా చేయాలని చెప్పారు. కానీ నేను దాన్ని తిరస్కరించాను. అయితే నాలో భయం మొదలైంది. టీసీఎస్ నేను ఉద్యోగం చేస్తున్న మొదటి కంపెనీ. కాబట్టి నేను కోల్పోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ రాజీనామా చేయకపోతే.. టెర్మినేషన్ తరువాత బ్యాడ్ రివ్యూ ఇస్తామని కూడా బెదిరించారు. మీకు నచ్చినట్లు చేయండి, రాజీనామా మాత్రం చేయనని చెప్పేశాను. నాలో భయం, బాధ ఉన్నప్పటికీ.. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.మరో ఉద్యోగి కూడా తన అనుభవాన్ని షేర్ చేశారు. నన్ను రాజీనామా చేయమని ఒక ప్యానెల్ ఎదురుచూస్తోంది. నేను రోజూ సక్రంగా పని చేస్తున్నాను. అంతే కాకుండా.. ప్రతి కాల్, మెసేజ్, మెయిల్స్ వంటి వాటికి స్పందిస్తున్నాను. నా కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నేను ఒక్కడినే అని, నా ఉద్యోగం పోతే నా పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందని పేర్కొన్నాను. కానీ ఒకదానికొకటి లింక్ చేయవద్దని హెచ్ఆర్ చెప్పారు. ఇప్పుడు నేను జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటున్నానని ఆ ఉద్యోగి వెల్లడించారు.ఉద్యోగులను తొలగిస్తున్న వేళ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన నగరాల్లో IT & ITES ఉద్యోగుల సంఘం (UNITE) ప్రదర్శనలు నిర్వహించింది. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు దాదాపు 30,000 మందిని ప్రభావితం చేస్తాయని ఆరోపించింది . అయితే, టీసీఎస్ ఈ వాదనను తిరస్కరించింది. ఈ తగ్గింపు దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 2 శాతం లేదా దాదాపు 12,000 మందికి పరిమితం అని పేర్కొంది.ఇదీ చదవండి: మాంద్యం ఎఫెక్ట్: భారీ లేఆప్స్ ప్రకటించిన లుఫ్తాన్ససెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) మద్దతుతో దేశంలో నిరసనలు జరిగాయి. UNITE నాయకులు TCS తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తొలగింపుల సంఖ్య వెల్లడించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు. కాగా టీసీఎస్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 6,00,000 కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం. -
పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం!
దేశవ్యాప్తంగా పండుగ సీజన్లో రిటైలర్లు ఆకర్షణీయ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుండడంతో ఏటా వాణిజ్యం పెరుగుతోంది. ఇది ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో మరీ అధికంగా ఉంటుంది. వస్తువులపై రాయితీలు, మార్కెటింగ్, వినియోగదారుల సెంటిమెంట్ కలగలిసి ఆర్డర్ వాల్యూమ్లు పండుగ సీజన్లో అధికమవుతుంటాయి. అయితే ఇటీవలకాలంలో రిటైలర్ల వద్ద ఆర్డర్లు, ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని డెలివరీ చేసే గిగ్ కార్మికుల కొరత భారీగా ఉందని కొందరు చెబుతున్నారు.గిగ్ వర్కర్ల సంక్షోభంపండుగ సమయంలో భారీగా వస్తున్న ఆర్డర్లను నిర్వహించడానికి ఈ-కామర్స్, క్విక్-కామర్స్ కంపెనీలు గిగ్ కార్మికులపై అధికంగా ఆధారపడతాయి. ఈ గిగ్ వర్కర్లు గిడ్డంగులు, డార్క్ స్టోర్ల నుంచి వస్తువుల తుది డెలివరీ వరకు కీలక విభాగాల్లో పనిచేస్తారు. ఆన్లైన్ షాపింగ్ చెయిన్లో వీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే, ఈ ఏడాది కార్మిక కొరత మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉందని స్టాఫింగ్ ఏజెన్సీలు తెలుపుతున్నాయి. వస్తువుల పంపిణీ కేంద్రాలుగా పనిచేసే డార్క్ స్టోర్లు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి. గిడ్డంగులు అసాధారణంగా అధిక అట్రిషన్ రేట్లను (పని మానేసే వారి సంఖ్య) ఎదుర్కొంటున్నాయి. డెలివరీ కార్గో విమానాల సంఖ్య కూడా తగ్గిపోయింది.కార్మికుల కొరతకు కారణాలుతాత్కాలిక సిబ్బందికి మార్కెట్లో డిమాండ్ సంవత్సరానికి 15-20% పెరిగింది. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో వీరి అవసరం అధికమైంది. దాంతో మార్కెట్లో అధిక రాబడి వస్తున్న విభాగాల్లోకి వీరు మారుతున్నారు. గిగ్ పాత్రల్లో ముఖ్యంగా డెలివరీలో నెలకు 35-40% అట్రిషన్ రేట్లు కనిపిస్తున్నాయి. కార్మికులు తరచుగా స్వల్ప వేతన పెంపు కోసం ఇతర ప్లాట్ఫామ్ల్లోకి మారుతున్నారు. సీజన్ తర్వాత వీరు పూర్తిగా ఈ ఫీల్డ్ వదిలేసి నిర్మాణం వంటి ఇతర పనుల కోసం వెళుతున్నారు. తర్వాతి సీజన్లో తిరిగి వస్తున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.గిగ్ కార్మికులకు సరైన రక్షణ వ్యవస్థలు లేకపోవడం, దీర్ఘకాలిక ఒప్పందాలు కరవవ్వడం, కనీస కెరియర్ పురోగతి వంటివి లోపించడం కూడా వీరి సంఖ్య తగ్గడానికి కారణమవుతుంది. భారతదేశ గిగ్ ఆర్థిక వ్యవస్థలోని లోతైన నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించడంలో కంపెనీలు, ప్రభుత్వ యాంత్రాగాలు విఫలమవుతున్నాయి.టైర్-2, టైర్-3 మార్కెట్ల పెరుగుదలఇండోర్, కొచ్చి, భువనేశ్వర్, నాగ్పూర్ వంటి నగరాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇవి గిగ్ నియామకంలో 30-40% పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో టాలెంట్ పూల్ పరిమితంగా ఉండటం వల్ల కార్మికులను ఆకర్షించడం కంపెనీలకు సవాలుగా మారుతోంది.తాత్కాలిక పరిష్కారాలుతక్షణ అవసరాలను పూరించడానికి ఈ-కామర్స్ సంస్థలు డిజిటల్ ఫ్లెక్సి-హైరింగ్ ప్లాట్ఫారమ్లు, స్టాఫింగ్ ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. కళాశాల విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నవారు, పట్టణ వలసదారులతో సహా సాంప్రదాయేతర కార్మిక వర్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే, కొత్తగా క్విక్-కామర్స్ రంగంలోకి వస్తున్న కంపెనీలతో వీరికి డిమాండ్ పెరుతోంది.ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్ -
మార్చి నుంచి మార్కెట్ల అప్ట్రెండ్
దేశ ఈక్విటీ మార్కెట్లలో మరికొన్ని త్రైమాసికాల పాటు ఆటుపోట్లు కొనసాగుతాయని జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐవో) రిషి కోహ్లి పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి స్థిరమైన అప్ట్రెండ్లో కొనసాగొచ్చని అంచనా వేశారు. ఆర్థిక మూలాలు, స్థూల ఆర్థిక, సైక్లికల్ అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయిస్తాయన్నారు. జూన్ త్రైమాసికం ఫలితాలు వివిధ రంగాల మధ్య అసహజంగా ఉన్నాయంటూ, రానున్న నెలల్లో ఇవి స్థిరపడతాయని చెప్పారు.అంతర్జాతీయ అస్సెట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన బ్లాక్రాక్తో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏర్పాటు చేసిన 50:50 జాయింట్ వెంచర్ కంపెనీయే జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్. ఇటీవలే ఈ సంస్థ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ను ప్రారంభించడం గమనార్హం. ఈ పథకం కింద సమీకరించే పెట్టుబడుల్లో అధిక శాతాన్ని లార్జ్క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయనున్నట్టు రిషి కోహ్లీ తెలిపారు.బ్లాక్రాక్కు చెందిన సిస్టమ్యాటిక్ యాక్టివ్ ఈక్విటీస్ ప్లాట్ఫామ్ ఆధారితంగా ఈ పథకం పెట్టుబడులు పెట్టనుంది. డేటా విశ్లేషణ, నిపుణుల పరిశీలనతో పోర్ట్ఫోలియోను నిర్మించనుంది. ‘ఫ్లెక్సీక్యాప్ మా మొదటి యాక్టివ్ ఫండ్. చురుకైన, భిన్నమైన, తక్కువ వ్యయాలతో కూడిన పరిష్కారాలు అందించడమే మా లక్ష్యం. అన్ని మార్కెట్ సైకిల్స్లో రిస్క్ నియంత్రణ దృష్టిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించాలన్న లక్ష్యం పెట్టుకున్నాం’ అని వివరించారు.ఇదీ చదవండి: జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్ -
జొమాటోలో ‘హెల్దీ మోడ్’ ఫీచర్
యూజర్లు పౌష్టికాహారాన్ని అన్వేషించడానికి, ఆర్డర్ చేయడానికి వీలుగా ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో తమ యాప్లో కొత్తగా ‘హెల్దీ మోడ్’ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి గురుగ్రామ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉందని, త్వరలో మిగతా మార్కెట్లలోనూ ప్రవేశపెడతామని కంపెనీ తెలిపింది.మెట్రో నగరాల్లోని 18–45 ఏళ్ల వారు ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. భాగస్వామ్య రెస్టారెంట్లు ఇచ్చే వివరాలను బట్టి ఒక్కో వంటకానికి ‘కనిష్టం’ నుంచి ‘సూపర్’ వరకు ‘హెల్దీ స్కోరు’ ఉంటుందని జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. ఈ ఫీచరులో మార్పులు, చేర్పులకు సంబంధించి తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని యూజర్లను కోరారు.ఇదీ చదవండి: ఆర్బీఐ రూటెటు..? -
మహీంద్ర వర్సిటీ, అపోలో హెల్త్కేర్ అకాడెమీ జట్టు
అలైడ్ హెల్త్ సైన్సెస్లో బ్యాచిలర్స్ కోర్సు ప్రారంభించే దిశగా హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీ, అపోలో హెల్త్కేర్ అకాడెమీ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. డిమాండ్ అధికంగా ఉన్న అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ మొదలైన స్పెషలైజేషన్స్పై ఈ కోర్సు ప్రధానంగా దృష్టి పెడుతుంది.బోధనకు సంబంధించి మహీంద్రా వర్సిటీకి చెందిన ఆధునిక మౌలిక సదుపాయాలు, క్లినికల్ నైపుణ్యాల్లో అపోలో హెల్త్కేర్ అకాడెమీ అనుభవంతో విద్యార్థులు ప్రయోజనం పొందవచ్చని ఇరు సంస్థలు తెలిపాయి. ఆఖరు సంవత్సరంలో ఇంటర్న్షిప్తో పాటు అపోలో హాస్పిటల్స్, భాగస్వామ్య నెట్వర్క్లలో ప్లేస్మెంట్పరంగా కూడా మద్దతు లభిస్తుంది.ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి -
వచ్చే ఏడాది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్
ఈపీసీ కాంట్రాక్టర్ సంస్థ టీకేఐఎల్ ఇండస్ట్రీస్(గతంలో థిస్సెన్క్రుప్ ఇండస్ట్రీస్ ఇండియా) వచ్చే ఏడాదిలో దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా స్విట్జర్లాండ్ కంపెనీ సోహైటెక్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టీకేఐఎల్ ఇండస్ట్రీస్ ఎండీ, సీఈవో వివేక్ భాటియా తాజాగా వెల్లడించారు. సోహైటెక్తో భాగస్వామ్యంతో దేశీయంగా గ్రీన్ హైడ్రోజన్ విభాగంలో అత్యంత ఆధునిక ఇన్నొవేటివ్ సొల్యూషన్లను అందించనున్నట్లు తెలియజేశారు.ఇందుకు ప్రొప్రయిటరీ ఆర్టిఫిషియల్ ఫొటొసింథసిస్(ఫొటొఎలక్ట్రోలిసిస్) టెక్నాలజీని వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సౌర(సోలార్), పవన(విండ్) తదితర పునరుత్పాదక ఇంధనాల నుంచి గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేయనున్నట్లు వివరించారు. వీటిని పలు పరిశ్రమలలో వినియోగించేందుకు వీలుంటుందని తెలియజేశారు. తాజా సాంకేతికతతో రానున్న 12 నెలల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటును నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈపీసీ సంస్థగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు ఏర్పాటుకు స్టీల్, ఆయిల్ మార్కెటింగ్ తదితర రంగాలలోని కంపెనీలతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి -
ఐఐపీకి మైనింగ్ దన్ను
న్యూఢిల్లీ: ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4 శాతం వృద్ధి నమోదు చేసింది. మైనింగ్ రంగం 6 శాతం మెరుగుపడటం ఇందుకు తోడ్పడిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. గతేడాది ఆగస్టులో ఐఐపీ వృద్ధి దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉండగా, మైనింగ్ రంగం 4.3 శాతం క్షీణత నమోదు చేసింది. తాజాగా సూచీలో నాలుగింట మూడొంతుల వాటా ఉండే తయారీ రంగం వృద్ధి 1.2 శాతం నుంచి 3.8 శాతానికి పెరిగింది.విద్యుదుత్పత్తి 3.7 శాతం క్షీణత నుంచి బైటపడి 4.1 శాతం వృద్ధిని నమోదు చేసింది. మరోవైపు, జూలై ఐఐపీ వృద్ధి గణాంకాలను ముందుగా అంచనా వేసిన 3.5 శాతం నుంచి 4.3 శాతానికి ఎన్ఎస్వో సవరించింది.ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్టు మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 4.3 శాతం నుంచి 2.8 శాతానికి నెమ్మదించింది. రాబోయే రోజులలో జీఎస్టీ క్రమబద్ధీకరణతో పండుగ సీజన్లో వినియోగం పుంజుకుంటుందని, నిల్వలన్నీ అమ్ముడైపోతే, సెపె్టంబర్–అక్టోబర్లో తయారీ రంగ ఉత్పత్తి మెరుగుపడటానికి దోహదపడగలదని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
ఎలక్ట్రిక్ వాహనాల్లో సౌండ్ అలర్ట్ సిస్టం!
న్యూఢిల్లీ: పాదచారులు, వాహనదార్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాహనాల్లో ఎకూస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టం (ఏవీఏఎస్)ను అమలు చేయాలని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ ప్రతిపాదించింది. 2026 అక్టోబర్ తర్వాత కొత్తగా తయారు చేసే అన్ని ఎలక్ట్రిక్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాల్లో దీన్ని తప్పనిసరిగా అమర్చాలని ఒక ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది.అలాగే ప్రస్తుత మోడల్స్ విషయంలో అక్టోబర్ 1 నాటికి ఎం, ఎన్ కేటగిరీ వాహనాల్లో ఏవీఏఎస్ను అమర్చాలని ప్రతిపాదించింది. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్లు, బస్సులను కేటగిరీ ఎం వాహనాలుగా, విద్యుత్ గూడ్స్.. ట్రక్కులను కేటగిరీ ఎన్ వాహనాలుగా పరిగణిస్తారు. దాదాపు నిశ్శబ్దంగా పరుగులు తీసే ఎలక్ట్రిక్ వాహనం ఉనికి గురించి పాదచారులు, ఇతరత్రా వాహనదారులను అలర్ట్ చేసేందుకు, ఇంజిన్ శబ్దాన్ని వెలువరించేలా ఈ సిస్టం ఉంటుంది. అమెరికా, జపాన్తో పాటు కొన్ని యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే హైబ్రిడ్ వాహనాల్లో ఏవీఏఎస్ని తప్పనిసరి చేశాయి. -
టాటా క్యాపిటల్ మెగా ఆఫర్!
న్యూఢిల్లీ: అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి రూ. 310–326 ధరల శ్రేణి ప్రకటించింది. అక్టోబర్ 6న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 15,512 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి 2025లో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. ఐపీవోలో భాగంగా టాటా గ్రూప్ దిగ్గజం 21 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది.అంతేకాకుండా మరో 23 కోట్ల షేర్లను ప్రమోటర్ టాటా సన్స్ ఆఫర్ చేయనుంది. వీటికి జతగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్సీ) సైతం 3.58 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ధర ప్రకారం లిస్టింగ్లో కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.38 లక్షల కోట్లుగా నమోదయ్యే వీలుంది. అక్టోబర్ 8న ముగియనున్న ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు 3న షేర్లను ఆఫర్ చేయనుంది. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది.ఈక్విటీ జారీ నిధులను రుణాల విడుదలతోపాటు భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. దేశీ ఫైనాన్షియల్ రంగంలోనే టాటా క్యాపిటల్ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నమోదుకానుంది. 2023 నవంబర్లో టాటా గ్రూప్ నుంచి టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, రెండేళ్ల తదుపరి తిరిగి మరో దిగ్గజం ఇదే బాట పట్టడం గమనార్హం! ఫైనాన్షియల్ సరీ్వసులతో టాటా గ్రూప్లోని ఫైనాన్షియల్ సరీ్వసుల విభాగం టాటా క్యాపిటల్ తొలుత ఈ ఏడాది ఏప్రిల్లో ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి గోప్యతా మార్గంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. జూలైలో సెబీ అనుమతి పొందింది. ఆర్బీఐ నుంచి అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందిన సంస్థ అప్పటినుంచి మూడేళ్లలోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కావలసి ఉంది. 2022 సెపె్టంబర్లో టాటా క్యాపిటల్కు ఈ గుర్తింపు లభించింది.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీవో ద్వారా ఈ ఏడాది జూన్లో రూ. 12,500 కోట్లు సమీకరించడం తెలిసిందే. బజాజ్ ఫైనాన్స్ 2024 సెప్టెంబర్లోనే లిస్టయ్యింది. 2007లో కార్యకలాపాలు ప్రారంభించిన టాటా క్యాపిటల్ ఆదాయం గతేడాది (2024 –25) రూ. 18,175 కోట్ల నుంచి రూ. 28,313 కోట్లకు జంప్చేసింది. నికర లాభం రూ. 3,327 కోట్ల నుంచి రూ. 3,655 కోట్లకు ఎగసింది.మార్కెట్ను మించుతూ టాటా క్యాపిటల్ మార్కెట్ వృద్ధి (11%)ని మించుతూ 17–18% పురో గతి సాధిస్తోంది. నూతన ప్రొడక్టులను ఆవిష్కరిస్తూ మార్కెట్ వృద్ధికంటే వేగంగా ఎదుగుతోంది. డిజిటల్ సాంకేతికతలపై గత 4–5 ఏళ్లలో రూ. 2,000 కోట్లు వెచ్చించాం.– రాజీవ్ సబర్వాల్, టాటా క్యాపిటల్ ఎండీ, సీఈవోవియ్వర్క్ @ రూ. 615648 ⇒అక్టోబర్ 3–7 మధ్య ఐపీవో ⇒రూ. 3,000 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: కోవర్కింగ్ కార్యాలయ నిర్వాహక కంపెనీ వియ్వర్క్ ఇండియా పబ్లిక్ ఇష్యూకి రూ. 615–648 ధరల శ్రేణి నిర్ణయించింది. అక్టోబర్ 3న ప్రారంభంకానున్న ఇష్యూలో భాగంగా మొత్తం 4.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఎంబసీ బిల్డ్కాన్ ఎల్ఎల్పీతోపాటు ప్రస్తుత ఇన్వెస్టర్ సంస్థ 1 ఏరియల్ వే టెనెంట్(వియ్వర్క్ గ్లోబల్లో భాగం) షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఐపీవో ధర ప్రకారం కంపెనీ లిస్టింగ్లో రూ. 8,685 కోట్ల మార్కెట్ విలువను సాధించే వీలుంది. ఇష్యూ అక్టోబర్ 7న ముగియనుంది. -
మాంద్యం ఎఫెక్ట్: భారీ లేఆప్స్ ప్రకటించిన లుఫ్తాన్స
ప్రపంచ వ్యాప్తంగా లేఆప్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దిగ్గజ సంస్థలు సైతం ఉద్యోగులను తగ్గించుకోవడానికి చూస్తున్నాయి. ఈ తరుణంలో జర్మన్ ఎయిర్లైన్ గ్రూప్ లుఫ్తాన్స (Lufthansa) కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి 4000 ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది.లుఫ్తాన్స తొలగించనున్న ఉద్యోగులలో ఎక్కువ భాగం.. జర్మనీలే ఉన్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించి కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల కోతలు ప్రధానంగా పైలట్లు, క్యాబిన్ సిబ్బంది లేదా గ్రౌండ్ స్టాఫ్ మొదలైనవారు ఉన్నారు. జర్మనీ రెండో సంవత్సరం ఆర్థిక మాంద్యం ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది.లుఫ్తాన్స కంపెనీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,03,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దీని నెట్వర్క్లో యూరోవింగ్స్, ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్, స్విస్, బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ మాత్రమే కాకుండా.. ఇటలీకి చెందిన కొత్త ఫ్లాగ్షిప్ క్యారియర్గా ఇటీవల కొనుగోలు చేసిన ఐటీఏ ఎయిర్వేస్ కూడా ఉన్నాయి.ఉద్యోగులను తొలగించనున్న కంపెనీల జాబితాలో జర్మన్ దిగ్గజం లుఫ్తాన్స మాత్రమే కాకుండా.. పారిశ్రామిక ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీ బాష్ కూడా ఉంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 13,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది. ఇది దాని ఉద్యోగులలో మూడు శాతానికి సమానం. -
ఐఎన్ఎస్సీఓ చేతికి హెచ్ఎన్జీఐఎల్
న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకున్న హిందుస్తాన్ నేషనల్ గ్లాస్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ(HNGIL)ను దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా చేజిక్కించుకున్నట్లు ఉగాండాకు.. చెందిన మధ్వాని గ్రూప్ కంపెనీ ఇండిపెండెంట్ షుగర్ కార్పొరేషన్ (INSCO) లిమిటెడ్ తెలిపింది.కొత్తగా ఏర్పడిన హెచ్ఎన్జీఐఎల్ బోర్డు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ కొనుగోలు ప్రక్రియ పారిశ్రామికవేత్తలు కమ్లేష్ మాధ్వాని, శ్రై మాధ్వాని నేతృత్వంలో జరిగింది. సెర్బరస్ క్యాపిటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఆర్థిక మద్దతు లభించిందని ఐఎన్ఎస్సీఓ ప్రకటన ద్వారా తెలిపింది.దాదాపు రూ.2,250 కోట్ల ఈ రిజల్యూషన్ ప్రణాళికకు ఆగస్టు 14న ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. తదుపరి ఆర్బీఐ, సీసీఐ నుంచి అనుమతులు లభించాయి. మొత్తం 45 రోజుల్లో విలీన ప్రక్రియ పూర్తి అయినట్లు ఐఎన్ఎస్సీఓ పేర్కొంది. -
‘బై నౌ-పే లేటర్’ బంద్.. ఆర్బీఐ ఆదేశాలు
బెంగళూరుకు చెందిన బై-నౌ-పే-లేటర్ (BNPL) సంస్థ సింపుల్ (Simpl) తక్షణమే తన చెల్లింపు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆర్బీఐ (RBI)ఆదేశించింది. ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ సంస్థ సుమారు 26,000 మంది వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుని ‘బై-నౌ-పే-లేటర్’ పేరుతో రుణ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ప్రకారం, స్పష్టమైన అనుమతి లేకుండా ఏ కంపెనీ కూడా అటువంటి వ్యవస్థను ఆపరేట్ చేయడానికి వీల్లేదని ఆర్బీఐ చెబుతోంది.డిజిటల్ క్రెడిట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ‘బై-నౌ-పే-లేటర్’ స్కీములు ఇటీవల బాగా విస్తరించాయి. తక్షణ క్రెడిట్ లైన్లతో వినియోగదారులను, వ్యాపారులను ఈ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. అసురక్షిత రుణాలు, బలహీనమైన పర్యవేక్షణ, పేలవమైన వినియోగదారుల రక్షణ వంటి ఆందోళనలతో ఆర్బీఐ 2022లోనే బీఎన్పీఎల్ సంస్థలను అప్పు తీసుకున్న డబ్బుతో ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలను టాప్ అప్ చేయకుండా నిలిపివేసింది.వన్ సిగ్మా టెక్నాలజీస్ నిర్వహిస్తున్న సింపుల్ గతంలో భారత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), విదేశీ మారక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి వచ్చింది. 100 శాతం ఆటోమేటిక్ ఎఫ్డీఐ ఆమోదానికి అర్హత కలిగిన ఐటీ సర్వీసెస్ గా తన వ్యాపారాన్ని వర్గీకరించడం ద్వారా కంపెనీకి రూ .913 కోట్లు తెచ్చుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. -
లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా.. రేపే..
అమెరికాలో లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రాజీనామా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)పాలనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ రాజీనామా కార్యక్రమంలో భాగంగా లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారందరూ ఆ రోజున రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్హౌస్ ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇవే కావడం గమనార్హం.కాగా చెప్పినట్లు రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలలపాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ ఎనిమిది నెలల కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వానికి 14.8 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా 28 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్.. -
చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్..
తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరికొత్త వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టింది. చైనా కోసం గాడిదలను పెంచుతోంది. ఇందుకోసం చైనా కంపెనీ జింగ్యింగ్ పెట్టుబడులతో పెషావర్లో 37 మిలియన్ డాలర్లతో భారీ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ఏటా 80 వేల గాడిదలను చైనాకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.చైనాలో గాడిద మాంసానికి, ఎముకలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెలకు 10 వేల గాడిదలను ప్రాసెస్ చేసి, మాంసం ఎగుమతులు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ఆహార భద్రత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే స్థానికంగా మాత్రం గాడిద మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుందట.చైనాకు గాడిద మాంసాన్ని ఎగుమతి చేసేందుకు పెషావర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో 40 ప్రత్యేక పొలాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి
పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో తమదైన ముద్ర వేయాలని స్టార్టప్ కంపెనీలు ఎన్నో ఆశలతో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. అయితే ఆయా సంస్థల వ్యవస్థాపకులకు కొత్త ఆవిష్కరణలు, వృద్ధిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా రూపాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు వారికి ఊహించని నియంత్రణ మార్పులు, ఆర్థిక సంక్షోభాలు, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు ఎదురొవ్వొచ్చు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడే ఎదుగుతున్న సంస్థల మనుగడకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. అయినప్పటికీ కొన్ని తెలివైన, ఆచరణాత్మక చర్యలను తీసుకోవడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.నష్టాలను గుర్తించడం, వ్యూహాత్మకంగా వ్యవహరించడంఅవాంతరాలకు సిద్ధంగా, ముందు జాగ్రత్తగా ఉండటమే రక్షణలో మొదటి అడుగు. స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయగల అన్ని నియంత్రణ, సామాజిక, చట్టపరమైన, భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అధిక ప్రాధాన్యతల జాబితా చేర్చాలి. వీటి వల్ల సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి స్పష్టమైన ఉపశమన చర్యలను అభివృద్ధి చేసుకోవాలి. అందుకోసం భవిష్యత్తులో రాబోయే మార్పులను ముందుగా ఊహించడానికి, దానిపై అవగాహన పొందడానికి పరిశ్రమ సంస్థలు, వాణిజ్య సంఘాలతో మమేకం కావాలి.ఆదాయ మార్గాలను వైవిధ్యపరచడంఏదైనా ఒక ఉత్పత్తిపైనా, సేవలు లేదా భౌగోళిక ప్రాంతంపై అధికంగా ఆధారపడటం ప్రమాదకరం. ఆయా విభాగాల్లో అనుకోని విపత్తులు వస్తే మొత్తం సంస్థ పతనం కావచ్చు. కాబట్టి వైవిధ్యం తప్పనిసరి. ప్రధాన ఆదాయ మార్గం దెబ్బతిన్నప్పుడు, ఇతర ఉత్పత్తులు లేదా సేవలు వృద్ధిని కొనసాగించడానికి సహాయపడతాయి. కంపెనీ విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా ఒక ప్రాంతంలో ఏర్పడిన ఆర్థిక లేదా రాజకీయ అస్థిరత ప్రభావం తగ్గుతుంది.క్యాష్ మేనేజ్మెంట్ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు రాబడులను తగ్గించవచ్చు. ఈ లోటును పూడ్చడానికి తగినంత నగదు నిల్వలు ఉండటం చాలా ముఖ్యం. ఆకస్మిక ఆదాయ నష్టాలను పూడ్చడానికి కనీసం 3-6 నెలల నిర్వహణ ఖర్చులకుగాను నగదు నిల్వలు (క్యాష్ బఫర్) ఉంచుకోవాలి.చురుకైన బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం..సంక్షోభ సమయాల్లో వేగంగా, కచ్చితత్వంతో పని చేసే నైపుణ్యాలు కలిగినవారు అవసరం. కొత్త పరిస్థితులను త్వరగా స్వీకరించే వ్యక్తులను పనిలో నియమించుకోవాలి.ఇదీ చదవండి: స్విస్ వాచ్లు, చాక్లెట్లు, సైకిళ్ల ధరలు తగ్గింపు -
బ్యాంకులకు వరుస సెలవులు: వారం రోజులు క్లోజ్!
నవరాత్రి, దుర్గా పూజ, గాంధీ జయంతి వంటి పండుగల కారణంగా భారతదేశంలోని బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో జాతీయ, ప్రాంతీయ పండుగలు మాత్రమే కాకుండా.. ఆదివారం ఉన్నాయి. ప్రాంతీయ వేడుకల కారణంగా భారతదేశంలోని బ్యాంకు సెలవులు.. రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి.బ్యాంకు సెలవుల జాబితాసెప్టెంబర్ 29: దుర్గా పూజ ఏడవ రోజు మహా సప్తమి సందర్భంగా అగర్తల, కోల్కతా, గౌహతిలో బ్యాంకులకు సెలవుసెప్టెంబర్ 30: దుర్గా పూజ, నవరాత్రి ఎనిమిదవ రోజును పురస్కరించుకుని, మహా అష్టమి/దుర్గా అష్టమి కోసం అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్కతా, పాట్నా, రాంచీతో సహా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.అక్టోబర్ 1: త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, మేఘాలయ, కేరళతో సహా అనేక రాష్ట్రాల్లో దసరా, ఆయుధ పూజ & దుర్గా పూజల కారణంగా బ్యాంకులకు సెలవు.అక్టోబరు 2: మహాత్మా గాంధీ జయంతి, దసరా, విజయ దశమి, దుర్గాపూజ కారణంగా భారతదేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 3-4: దుర్గా పూజ (దసైన్) వేడుకల కారణంగా సిక్కింలో బ్యాంకులకు హాలిడే.అక్టోబర్ 5: ఆదివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.బ్యాంకింగ్ సేవలుపై ప్రభావం ఉంటుందా?బ్యాంకులకు సెలవు అయినప్పటికీ.. బ్యాంకింగ్ సేవలుపై ఎటువంటి ప్రభావం ఉండదు. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా.. -
ఆటలోనే కాదు.. సంపదలోనూ తిలక్వర్మ భేష్
భారత్ నిన్న జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో ఘన విజయ సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్లో 69 పరుగులు చేసి టైటిల్ గెలిచేందుకు కృషి చేశారు. క్రీడా రంగంలో ఆయన విజయాలు ఎంతగానో ప్రశంసించదగినవి. అదే సమయంలో బిజినెస్ కోణంలో కూడా ఆయన ఎదుగుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ లైఫ్స్టైల్, కార్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల గురించి తెలుసుకుందాం.లగ్జరీ కార్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు..తిలక్ వర్మ వద్ద మెర్సిడెజ్ జెంజ్ ఎక్స్-క్లాస్ మోడల్ ఉంది. దీని ధర సుమారు రూ.1.7 కోట్లుగా ఉంది. దాంతోపాటు బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కూడా ఉంది. దీని ధర దాదాపు రూ.1.8 కోట్లు. ఇటీవల తన తల్లిదండ్రులకు మహీంద్రా థార్ మోడల్ కారును బహుమతిగా ఇచ్చిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్ట్ల ద్వారా ఈయన నెలవారీ ఆదాయం రూ.20–25 లక్షలుగా ఉందని అంచనా. 2025 ఐపీఎల్ వేలంలో రూ.8 కోట్లు సమకూరాయి. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ.40–50 లక్షలుగా ఉంది. ఇన్స్టాగ్రామ్లో(Instagram) ఈయనకు 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.ఇదీ చదవండి: స్విస్ వాచ్లు, చాక్లెట్లు, సైకిళ్ల ధరలు తగ్గింపుఎండార్స్ చేస్తున్న బ్రాండ్లు (2025)బిగ్బాస్కెట్బాంబే షర్ట్ కంపెనీబూస్ట్ ఎనర్జీ -
యురేనియం అన్వేషణకు ఎన్టీపీసీ ఒప్పందం
ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ(NTPC) విదేశాల్లో యురేనియం గనులను గుర్తించడానికి కన్సల్టెంట్ను నియమించుకోవాలని యోచిస్తోంది. దీని ద్వారా తన భవిష్యత్ అణు ప్రాజెక్టుల కోసం యురేనియం వనరులను స్థిరీకరించుకోవడానికి ముందుకు సాగుతోంది. ఈమేరకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.ఈ ఒప్పందంలో భాగంలో నియమించుకునే కన్సల్టెంట్ సంభావ్య ప్రదేశాలపై సలహా ఇస్తారు. యురేనియం నిల్వల(uranium mines)పై మార్గనిర్దేశం చేయడానికి రిజర్వ్ పరిమాణాలు, లాజిస్టిక్స్ ఖర్చులు వంటి అంశాలను అంచనా వేస్తారు. ప్రస్తుతం ఎన్టీపీసీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)తో జాయింట్ వెంచర్ ద్వారా రాజస్థాన్లో రూ.42,000 కోట్ల అణు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఎన్టీపీసీకి 49% వాటా, ఎన్పీసీఐఎల్ 51% వాటా కలిగి ఉంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 4x700 మెగావాట్ల మహి బన్స్వారా రాజస్థాన్ అణు విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీన్ని అణుశక్తి విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (అశ్విని)తో కలిసి అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ మాట్లాడుతూ వివిధ అణు సాంకేతిక ప్రొవైడర్లు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అదనపు అణు ప్రాజెక్టులను స్వతంత్రంగా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ విభాగంలో కంపెనీ తన ఉనికిని విస్తరించడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
ఫుడ్ ప్రాసెసింగ్లో పెట్టుబడుల జోరు
మన ఫుడ్ ప్రాసెసింగ్(food processing) రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ నెల 25–28 మధ్య జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో దేశ, విదేశాలకు చెందిన 26 సంస్థలు రూ.1,02 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సదస్సును కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించింది.‘నాలుగు రోజుల సదస్సులో దేశీ దిగ్గజాలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా పెట్టుబడులకు ముందుకొచ్చాయి. 26 అవగాహన ఒప్పందాలు (MoU) కుదిరాయి. వీటి విలువ రూ.1,02,047 కోట్లు. దేశీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా ఇది నిలిచింది’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీల జాబితాలో కోకాకోలా సిస్టమ్స్, రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్, అమూల్, ఫెయిర్ ఎక్స్పోర్ట్స్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, నెస్లే ఇండియా, కారŠల్స్బర్గ్ ఇండియా పతంజలి ఫుడ్స్, గోద్రెజ్ ఆగ్రోవెట్, హాల్దిరామ్ స్నాక్స్ ఫుడ్ వంటివి ఉన్నాయి.రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖతో రూ.40,000 కోట్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాగా, ఈ పెట్టుబడులతో 64,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించడంతో పాటు 10 లక్షల మందికి పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ పేర్కొంది.ఇదీ చదవండి: మరో పావు శాతం రేట్ల కోత ఉంటుందా? -
'రూ.45 లక్షల వేతనం.. అందుకే వదిలేసా'
కొంతమంది ఎక్కువ జీతం కోసం పనిచేస్తే.. మరికొందరు ఉన్న జీతంతోనే సర్దుకుంటారు. గురుగ్రామ్కు చెందిన ఒక టెక్నీషియన్ ఇటీవల రెడ్డిట్లో చేసిన పోస్ట్.. జీతం కంటే పని - జీవిత సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి చర్చకు దారితీసింది.నాకు రెండు ఆఫర్లు వచ్చాయి, ఒకటి ఏడాదికి 38 లక్షల ప్యాకేజీ. మరొకటి సంవత్సరానికి 45 లక్షల ప్యాకేజీతో భారతదేశంలోని అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి అని వినియోగదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే నేను నా ప్రస్తుత స్థానం గుర్గావ్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ (బెంగళూరులో) పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో నేను ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాను. కానీ ఇప్పుడు తప్పు చేశానేమో అనే భావన గలుగుతోంది. నేను డబ్బును ఎంచుకోవాలా లేదా స్థిరత్వాన్ని ఎంచుకోవాలా? అని అన్నారు.రెడ్దిట్ తూజార్ తన కెరీర్ గురించి కూడా వెల్లడించారు. తాను ప్రారంభంలో రూ. 3.8 లక్షల ప్యాకేజితో ఉద్యోగంలో చేరినట్లు, ఆ తరువాత మూడు ఉద్యోగాలు మార్చినట్లు, దీని ఫలితంగా తన ప్రస్తుత వార్షిక జీతం పెరిగిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ను సమర్థించను: గూగుల్ మాజీ సీఈఓఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎక్కువ మంది.. టెక్నీషియన్ ఉద్యోగాన్ని వదులుకోవడం గురించి చింతించవద్దని.. మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని చెప్పారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించాలని ఇంకొకరు అన్నారు. మీ జీతం పెరిగిన తరువాత.. పని సంస్కృతి & మీ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుందనే విషయాన్ని గమనించాలని ఇంకొకరు అన్నారు. -
ఎయిర్ ఇండియా బంపరాఫర్: రూ. 1200కే ఫ్లైట్ టికెట్!
చాలామంది ఇప్పటికి కూడా ఒక్కసారైనా విమాన ప్రయాణం చేసి ఉండరు. అలాంటి వారికోసం.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 'పేడే సేల్' కింద ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగానే.. దేశీయ విమాన ఛార్జీల ప్రారంభ ధర రూ.1200 కాగా, అంతర్జాతీయ టికెట్స్ ధర రూ. 3724 నుంచి ప్రారంభమవుతాయి.ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ‘పేడే సేల్’ కోసం బుకింగ్లు అక్టోబర్ 1, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 30, 2025 వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక ఛార్జీల కోసం వినియోగదారులు 'FLYAIX' ప్రోమో కోడ్ ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై డీఎఫ్ఎస్ఏ ఆంక్షలుఎయిర్లైన్ మొబైల్ యాప్లో చేసిన అన్ని బుకింగ్లపై ఎయిర్లైన్ జీరో కన్వీనియన్స్ ఫీజులను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలతో.. చెక్ ఇన్ బ్యాగేజిపై తగ్గింపులు లభిస్తాయి. దేశీయ విమానాలలో 15 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీకి రూ.1,500, అంతర్జాతీయ విమానాలలో 20 కేజీల చెక్ ఇన్ బ్యాగేజీకి రూ. 2500 వసూలు చేస్తారు. ఇది సాధారణ ధరల కంటే చాలా తక్కువ.💸 PayDay just got better! ✈️Grab Xpress Lite fares starting from ₹1200 on domestic routes and ₹3724 on international routes.📅 Book by 1 Oct and travel from 12 Oct till 30 Nov 2025.Book our PayDay deals from 28 Sep across all channels, and unlock early access with… pic.twitter.com/MdVaIUkI0m— Air India Express (@AirIndiaX) September 26, 2025 -
భారీ రీకాల్: 3.3 లక్షల బీఎండబ్ల్యూ కార్లు వెనక్కి!
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ప్రపంచవ్యాప్తంగా.. సుమారు 3,31,000 వాహనాలకు రీకాల్ ప్రకటించింది. ఇంజిన్ స్టార్టర్ మోటారులో లోపం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.స్టార్టర్లలోని లోపం కారణంగా.. ఇంజిన్లో మంటలు చెలరేగే అవకాశం ఉంది. దీనిని పరిష్కరించడానికి రీకాల్ అవసరమని బీఎండబ్ల్యూ ఇంజనీర్లు చెబుతున్నారు. అనుకోని ప్రమాదం జరిగితే కంపెనీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. కాగా లోపభూయిష్ట బ్రేకింగ్ వ్యవస్థల కారణంగా గత సంవత్సరం కూడా కంపెనీ ఇలాంటి రీకాల్ జారీ చేయాల్సి వచ్చింది.ఇదీ చదవండి: భారత్లో స్వీడిష్ బ్రాండ్ కారు లాంచ్: ధర ఎంతంటే?ఈ సమస్య 2015 నుంచి 2021 మధ్య తయారైన బీఎండబ్ల్యూ చాలా మోడల్స్లో తలెత్తింది. తత్పలితంగా కంపెనీ అమెరికాలో 1,95,000 వాహనాలను, జర్మనీలో మరో 1,36,000 వాహనాలను మరమ్మతు చేయాల్సి ఉంది. అయితే ఈ సమస్య ఇండియాలోని కార్లలో కూడా తెలెత్తుతుందా? లేదా అనేది అధికారికంగా వెలువడలేదు. అయితే కంపెనీ ఈ సమస్యను ఉచితంగానే పరిష్కరిస్తుంది. -
'వెండి కాయిన్స్ ఆర్డర్ చేస్తే.. నూడుల్స్ వచ్చాయి'
డెలివరీ యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత దాదాపు షాపుకు వెళ్లి కొనుగోలు చేసేవారి సంఖ్య బాగా తగ్గింది. కొత్తిమీర దగ్గర నుంచి బంగారం వరకు ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసే సమయంలో కొన్ని సార్లు మోసపోతున్నారు. పెట్టే ఆర్డర్ ఒకటైతే.. వచ్చే డెలివరీ ఇంకొకటి అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''వెండి కాయిన్స్ ఆర్డర్ చేశాను. కానీ నాకు మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయి. అంతే కాకుండా నాకు వచ్చిన డెలివరీలో ఒక పౌచ్ కూడా ఉంది. దానికి సీల్ చేసి ఉంది. డెలివరీ భాగస్వామి ఆ సీల్ ఓపెన్ చేయలేనని అన్నారు. మొత్తం ఆర్డర్ తీసుకోండి లేదా క్యాన్సిల్ చేయండి.. అని డెలివరీ బాయ్ నాకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు. 40 నిమిషాల తరువాత నేను పౌచ్ ఓపెన్ చేసాను. అందులో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. కానీ 999 ప్యూర్ సిల్వర్ కాదు. అవి 925 స్టెర్లింగ్ సిల్వర్'' అని వినీత్ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో స్విగ్గీ హర్రర్ స్టోరీ అని పోస్ట్ చేశారు.Update, 2nd order now delivered Except 2 coins, everything else is 999.@SwiggyInstamart - help me with the 2 coins which were 925 🪙 https://t.co/bieocsn6C9— Vineeth K (@DealsDhamaka) September 27, 2025నాకు వచ్చిన డెలివరీలో మ్యాగీ నూడుల్స్, హల్దిరామ్ ప్యాకెట్లను డెలివరీ ఏజెంట్నే తీసుకోమన్నాను. నేను వాటిని ఆర్డర్ చేయలేదు. కాబట్టి అవి నాకు వద్దని వినీత్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్విగ్గీ కూడా స్పందించింది.వినీత్ మరో ట్వీట్ చేస్తూ.. ఈ సారి స్విగ్గీ నాకు స్వచ్ఛమైన వెండి నాణేలను డెలివరీ చేసిందని, దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఆర్డర్ ఐడీని షేర్ చేయమని స్విగ్గీ కోరింది. వినీత్ తన ఆర్డర్ ఐడీ షేర్ చేశారు. సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినందుకు.. కావలసిన వివరాలను అందించినందుకు స్విగ్గీ వినియోగదారుకు ధన్యవాదాలు తెలిపింది.Thank you for bringing this to our attention and for the details, Vineeth. We would like to run a quick check. Please bear with us.^Sneha B— Swiggy Cares (@SwiggyCares) September 27, 2025 -
కేపీఐ గ్రీన్కు ఎస్బీఐ నిధులు.. రూ. 3,200 కోట్లకు ఓకే
పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ నుంచి ఫైనాన్స్ సౌకర్యాన్ని పొందినట్లు పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ కేపీఐ గ్రీన్ ఎనర్జీ తాజాగా వెల్లడించింది. దీంతో ఎస్బీఐ నుంచి రూ. 3,200 కోట్ల రుణాన్ని అందుకోనున్నట్లు తెలియజేసింది. సోలార్, హైబ్రిడ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ ప్రాజెక్టులకు ఎస్బీఐ రుణాలు సమకూర్చనున్నట్లు తెలియజేసింది.వీటిని గుజరాత్లో మొత్తం 1జీడబ్ల్యూపీ సామర్థ్యంతో ఏర్పాటు చేయనుంది. రెండు వ్యూహాత్మక పాజెక్టులకు ఈ రుణ సౌకర్యాలు మద్దతివ్వనున్నట్లు పేర్కొంది. 250 మెగావాట్ల(ఏసీ), 350 ఎండబ్ల్యూపీ(డీసీ) సోలార్ పవర్ ప్రాజెక్టుతోపాటు.. 370 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు వీటిలో ఉన్నాయి. -
కేంద్రానికి ఎన్టీపీసీ రూ. 3,248 కోట్ల డివిడెండ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2024–25) గాను ప్రభుత్వ రంగ ఎన్టీపీసీ సంస్థ, కేంద్రానికి రూ. 3,248 కోట్ల తుది డివిడెండును అందించింది. కంపెనీ సీఎండీ, డైరెక్టర్లు కలిసి ఈ మేరకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్కి పేమెంట్ అడ్వైజ్ను అందజేశారు.ఇప్పటికే ఇచ్చిన రూ. 2,424 కోట్ల తాత్కాలిక తొలి డివిడెండు, రూ. 2,424 కోట్ల రెండో తాత్కాలిక డివిడెండుకు ఇది అదనమని కంపెనీ తెలిపింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై రూ. 8.35 చొప్పున మొత్తం రూ. 8,096 కోట్ల డివిడెండ్ ఇచ్చినట్లయిందని వివరించింది. అలాగే వరుసగా 32వ ఏడాది కూడా చెల్లించినట్లయిందని పేర్కొంది. -
కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆంక్షలు
హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు.. దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) షాకిచ్చింది. హెచ్డీఎఫ్సీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) బ్రాంచ్.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడపై నిషేధం విధించింది.దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు సెప్టెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. తరువాత నోటీసులు అందేవరకు ఈ ఆర్డర్ అమలులోనే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు కొత్త ఆర్ధిక ఉత్పత్తులకు సంబంధించిన సలహాలు ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్ డీల్స్, క్రెడిట్ సంబంధిత సలహాలు ఇవ్వడం, కస్టడీ సర్వీస్ వంటి పలు ఆర్థిక సేవలను నిలిపివేయాలి. అంతే కాకుండా కొత్త ఆర్ధిక ప్రచారాల్లో కూడా బ్యాంక్ పాల్గొనకూడదు. అయితే ఇప్పటికే ఉన్న బ్యాంక్ కస్టమర్లు.. తమ సేవలను యధావిధిగా పొందవచ్చు.దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు పాటించడానికి బ్యాంక్ సిద్దమైంది. అంతే కాకుండా ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవడానికి.. డీఎఫ్ఎస్ఏతో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నామని హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇదీ చదవండి: అక్టోబర్లో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..సెప్టెంబర్ 23 నాటికి, దాని డీఐఎఫ్సీ బ్రాంచ్లో జాయింట్ హోల్డర్లతో సహా 1,489 మంది కస్టమర్లు ఉన్నారని హెచ్డీఎఫ్సీ తెలిపింది. అయితే దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్.. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు లేదా ఆర్థిక స్థితిపై అటువంటి ప్రభావం చూపదని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. అంతే కాకుండా బ్రాంచ్ కస్టమర్ల నిరంతర సేవలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. -
అక్టోబర్లో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 2025 నెలలో బ్యాంక్ సెలవులకు (Bank Holidays) సంబంధించిన జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ ప్రకారం.. వచ్చే నెలలో దేశంలోని వివిధ బ్యాంకులకు చాలా రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొన్ని నేషనల్ హాలిడేయ్ కాగా.. మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. మొత్తం సెలవుల జాబితా విషయానికి వస్తే..అక్టోబర్ సెలవుల జాబితా➤అక్టోబర్ 1, బుధవారం: మహా నవమి (ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 2, గురువారం: గాంధీ జయంతి / విజయ దశమి (దేశంలోని అని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 5 ఆదివారం: దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు➤అక్టోబర్ 6, సోమవారం: లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 7, మంగళవారం: మహర్షి వాల్మీకి జయంతి (హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 11, శనివారం:(రెండవ శనివారం కారణగం దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 12, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 19, ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 20, సోమవారం: దీపావళి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 21, మంగళవారం: గోవర్ధన్ పూజ / లక్ష్మీ పూజ (మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, మణిపూర్, జమ్మూ, శ్రీనగర్ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 22, బుధవారం: బలిపాడ్యమి (గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, సిక్కింలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 26 ఆదివారం: (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 27 సోమవారం: చత్ పూజ (పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 31 శుక్రవారం: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (గుజరాత్లోని బ్యాంకులకు సెలవు)అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
యూకేలోని భారతీయ సంపన్నులు.. వీరే!
ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు స్థిరపడి ఉన్నారు. ఇందులో యూకే కూడా ఒకటి. ఈ దేశంలో బ్యాంకింగ్, స్టీల్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాల్లో విజయవంతమైన కెరీర్లను నిర్మించుకున్న భారత సంతతికి చెందిన బిలియనీర్లు ఉన్నారు. వీరి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.గోపి హిందూజా & కుటుంబంయూకేలో అత్యంత సంపన్నులైన భారతీయ సంతతికి చెందిన బిలియనీర్లలో.. గోపి హిందూజా, అతని కుటుంబం ఒకటి. వీరి నికర విలువ 35.3 బిలియన్ పౌండ్స్ (రూ. 33.68 లక్షల కోట్లు). హిందూజా గ్రూప్.. బ్యాంకింగ్, మీడియా, ఇంధన రంగాలలో దూసుకెళ్తోంది. సంపాదన మాత్రమే కాకుండా.. దాతృత్వ కార్యక్రమాలను చేస్తున్నారు.డేవిడ్ & సైమన్ రూబెన్భారతీయ మూలాలున్న డేవిడ్ & సైమన్ రూబెన్.. యూకేలోని రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ధి చెందారు. వీరు తెలివైన ప్రణాళికలతో.. ఎప్పటికప్పుడు వీరి వ్యాపారాలను విస్తరించుకుంటూ వేకుతున్నారు. వీరి నికర విలువ 26.9 బిలియన్ పౌండ్స్ (సుమారు రూ. 3.19 లక్షల కోట్లు).లక్ష్మీ మిట్టల్ & కుటుంబంలక్ష్మీ మిట్టల్ గురించి తెలియని భారతీయులు చాలా తక్కువమంది ఉంటారు. ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కంపెనీ అయిన ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్. ఉక్కు & రియల్ ఎస్టేట్ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన కుటుంబం నెట్వర్త్ 15.4 బిలియన్ పౌండ్స్.అనిల్ అగర్వాల్వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడిగా పేరుపొందిన.. అనిల్ అగర్వాల్ మైనింగ్, మెటల్స్ ద్వారా బాగా సంపాదించారు. వీరు అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వేదాంత ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం,పర్యావరణం రంగాల్లో సేవలు అందిస్తున్నారు. వీరి నికర విలువ 7.5 బిలియన్ పౌండ్స్.ప్రకాష్ లోహియాఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకుడైన ప్రకాష్ లోహియా.. ఆసియా, ఆఫ్రికా, యూరప్లో మొదలైన దేశాల్లో అతిపెద్ద పాలిస్టర్ & సంబంధిత ఉత్పత్తుల ఉత్పత్తిదారులలో ఒకరుగా ఉన్నారు. వీరి నికర విలువ 6.02 బిలియన్ పౌండ్స్. లోహియాకు పాలిస్టర్, ప్యాకేజింగ్, పేట్రోకెమికల్స్, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి.మోసిన్ & జుబెర్ ఇస్సాలాంక్షైర్లోని ఒకే పెట్రోల్ బంక్ నుంచి ప్రపంచ రిటైల్ సామ్రాజ్యంగా మారిన మొహ్సిన్ మరియు జుబెర్ ఇస్సా యూకేలోని ధనవంతుల జాబితాలో ఒకరు. ఈజీ గ్రూప్ సహ వ్యవస్థాపకులులైన వీరు.. సూపర్ మార్కెట్ దిగ్గజం అస్డా యజమానులు కూడా. వీరి నికర విలువ 6 బిలియన్ పౌండ్స్ (సుమారు రూ. 710 కోట్ల కంటే ఎక్కువ).నవీన్ & వర్ష ఇంజనీర్నవీన్ & వర్ష ఇంజనీర్ యూకే వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో ప్రముఖ భారతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకులు. వీరి నికర విలువ 3.45 బిలియన్ పౌండ్స్. వ్యాపారవేత్తలుగా మాత్రమే కాకుండా.. పర్యావరణ, పారిశ్రామిక సేవలలో మార్గదర్శకులుగా కూడా వారికి గుర్తింపు లభించింది.ఇదీ చదవండి: ఊహకందని చరిత్ర: గూగుల్కు ఆ పేరు వచ్చిందిలా..ది అరోరా బ్రదర్స్సైమన్, బాబీ, రాబిన్ అరోరాల మొత్తం నికర విలువ 2.1 బిలియన్ పౌండ్స్. వీరి వ్యాపార ప్రయాణం 2004లో ప్రారంభమైంది. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార ప్రపంచంలో ఎదగడమే కాకుండా.. యూకేలోని అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో కూడా ఒకరుగా నిలిచారు.లార్డ్ స్వరాజ్ పాల్లార్డ్ స్వరాజ్ పాల్ యూకేలో ఉన్న ఒక గ్లోబల్ స్టీల్ & ఇంజనీరింగ్ కంపెనీ అయిన కాపారో గ్రూప్ వ్యవస్థాపకులు. ఈయన యూకేలో మాత్రమే కాకుండా.. ఇండియా, అమెరికా వంటి దేశాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం.. 2025 లో ఈయన నికర విలువ 1.025 బిలియన్ పౌండ్స్ అని అంచనా. -
ఆ ఆస్పత్రుల్లో క్యాస్లెస్ క్లెయిమ్లు బంద్
దేశవ్యాప్తంగా ఉన్న మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ లో క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయాన్ని టాటా ఏఐజీ (Tata AIG) జనరల్ ఇన్సూరెన్స్ నిలిపివేసింది. దీనికి ముందు స్టార్ హెల్త్, నివా బుపా ఇప్పటికే మ్యాక్స్ ఆసుపత్రులలో నగదు రహిత క్లెయిమ్ సెటిల్మెంట్లను ఉపసంహరించుకున్నాయి.తమ మధ్య కుదిరిన రెండేళ్ల ఒప్పందం కొనసాగుతుండగానే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ టారిఫ్ల తగ్గింపునకు డిమాండ్ చేసిందని మ్యాక్స్ హెల్త్ కేర్ (Max Hospitals) ఆస్పత్రుల యాజమాన్యం ఆరోపిస్తోంది. "మ్యాక్స్ హెల్త్ కేర్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ చర్చలు జరిపి 2025 జనవరి 16 నుండి 2027 జనవరి 15 వరకు అమలులోకి వచ్చే రెండేళ్ల టారిఫ్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే, 2025 జూలైలో టాటా ఏఐజీ అకస్మాత్తుగా సమావేశాన్ని కోరి రేట్ల తగ్గింపును డిమాండ్ చేసింది" అని మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రతినిధి తెలిపారు."వారు ఏకపక్షంగా టారిఫ్ల తగ్గింపును ప్రతిపాదించారు. నగదు రహిత సేవలను నిలిపివేస్తామని బెదిరించారు. మేము దానికి అంగీకరించకపోవడంతో మా ఆసుపత్రులలో నగదు రహిత సేవలను 2025 సెప్టెంబర్ 10 నుండి నిలిపివేశారు" అని మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రతినిధి వివరించారు.ముందస్తు చెల్లింపులు అవసరం లేదుఅయితే రోగులపై ప్రభావాన్ని తగ్గించడానికి, బీమా సంస్థలతో రీయింబర్స్మెంట్లను దాఖలు చేయడంలో వారికి సహాయపడటానికి ఎక్స్ ప్రెస్ డెస్క్ను ఏర్పాటు చేసినట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ తెలిపింది. తద్వారా రోగులు మ్యాక్స్ ఆసుపత్రులలో ముందస్తు చెల్లింపులు చేయవలసిన అవసరం లేదంటోంది.ఈ దశలో, ఈ విషయంపై టాటా ఏఐజీతో ఎలాంటి చర్చలు జరపడం లేదని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. టాటా ఏఐజీతో టారిఫ్ వివాదం లేదని, ఛార్జీలలో అదనపు తగ్గింపు ఆచరణీయం కాదని హెల్త్కేర్ ప్రొవైడర్ పేర్కొంది. ఇది రోగి భద్రత, సంరక్షణ నాణ్యత రెండింటినీ రాజీ పడేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.మ్యాక్స్ ఆస్పత్రుల్లో నివా బుపా (Niva Bupa) , స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (Star Health) సంస్థలు ఇప్పటికే క్యాస్ లెస్ క్లెయిమ్ సదుపాయాలను ఇప్పటికే నిలిపివేయగా ఇప్పుడు టాటా ఏఐజీ కూడా వాటితో చేరింది. గత మేలో మ్యాక్స్తో ఒప్పందం ముగిసిన తరువాత టారిఫ్ చర్చల సమయంలో ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైందని పేర్కొంటూ నివా బుపా 2025 ఆగస్టు 16 నుండి దేశం అంతటా అన్ని మాక్స్ ఆసుపత్రులలో తమ నగదు రహిత క్లెయిమ్లను నిలిపివేసింది. మరోవైపు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (CARE Health Insurance) కూడా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని మ్యాక్స్ ఆసుపత్రులలో నగదు రహిత క్లెయిమ్ సెటిల్మెంట్ను నిలిపివేసింది.ఇదీ చదవండి: పీఎఫ్ విత్డ్రా డబ్బు దేనికి వాడుతున్నారు? ఈపీఎఫ్వో వార్నింగ్! -
లిసా మొనాకోను వెంటనే తొలగించండి: డొనాల్డ్ ట్రంప్
మైక్రోసాఫ్ట్ కంపెనీలో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న లిసా మొనాకో (Lisa Monaco)ను వెంటనే తొలగించాలని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) అమెరికా ప్రభుత్వంతో కలిగి ఉన్న ప్రధాన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆమె అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని అన్నారు.''లిసా మొనాకోకు మైక్రోసాఫ్ట్లో అత్యంత సున్నితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని.. ఆ రకమైన యాక్సెస్ కలిగి ఉండటం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ పేర్కొన్నారు.మొనాకో చేసిన అనేక తప్పుడు చర్యల కారణంగా, అమెరికా ప్రభుత్వం ఇటీవల ఆమెకు ఉన్న అన్ని భద్రతా అనుమతులను తొలగించింది. అంతే కాకుండా జాతీయ భద్రతా నిఘాకు సంబంధించిన అన్ని అవకాశాలను తొలగించడం, అన్ని ఫెడరల్ ప్రాపర్టీల నుంచి ఆమెను నిషేధించింది. మైక్రోసాఫ్ట్ వెంటనే లిసా మొనాకో ఉద్యోగాన్ని రద్దు చేయాలని నా అభిప్రాయం'' అని ట్రంప్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో పోస్ట్ చేశారు. దీనిపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు.ఇదీ చదవండి: 'ఉద్యోగ భద్రత ఒక జోక్': రాబర్ట్ కియోసాకిఎవరీ లిసా మొనాకో?ఈ ఏడాది జూలైలో లిసా మొనాకో మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అఫైర్స్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె గతంలో 2021 నుంచి జనవరి 2025 వరకు నాలుగు సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ అటార్నీ జనరల్గా పనిచేశారు. 2013 నుంచి 2017 వరకు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశారు. మొనాకో.. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, 2011లో జాతీయ భద్రతకు అసిస్టెంట్ అటార్నీ జనరల్గా తన కెరీర్ను ప్రారంభించి, రెండేళ్లు ఆ పదవిలో పనిచేశారు. -
వారసత్వ ప్రదేశాలకు యువతరం ఓటు
యువతరం (18–24 ఏళ్లు) చారిత్రక ప్రాశస్త్యం, గొప్ప వారసత్వం కలిగిన ప్రదేశాలను చూసి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియం వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆతిథ్య సేవల సంస్థ నూర్మహల్ ప్యాలెస్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. సంప్రదాయ పర్యాటక ప్రదేశాల కంటే గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవం కలిగిన ప్రదేశాలను చూడడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, జైపూర్, కర్నాల్, కోల్కతాలో 2,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను నూర్మహల్ ప్యాలెస్ విడుదల చేసింది. గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలిగిన ప్రాపర్టీల్లో బస చేయాలని అనుకుంటున్నట్టు సర్వేలో 53 శాతం మంది చెప్పారు. వినూత్నమైన చరిత్ర, నిర్మాణ నైపుణ్యం (ఆర్కిటెక్చర్), వ్యక్తిగత సేవలకు ప్రాధాన్యం దృష్ట్యా తాము ఖరీదైన వారసత్వ ప్రాపర్టీలను ఎంపిక చేసుకుంటున్నట్టు వారు చెప్పారు. ‘‘యువత కేవలం లగ్జరీనే కోరుకోవడం లేదు. చారిత్రక వైభవంతో అనుసంధానాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తూనే.. చరిత్ర, సంస్కృతితో అనుసంధానమయ్యే అనుభవాన్ని అందించడం పట్ల గర్విస్తున్నాం’’అని నూర్మహల్ ప్యాలస్ ఈడీ రూప్ ప్రతాప్ చౌదరి తెలిపారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ -
కొత్త శాఖల్లేవు.. స్థిరీకరణకు ప్రాధాన్యం
భారత్లో ప్రస్తుతమున్న 100 శాఖలకు అదనంగా కార్యకలాపాల విస్తరణ యోచన లేదని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా సీఈవో పీడీ సింగ్ ప్రకటించారు. పలు విదేశీ బ్యాంకులు భారత్లో తమ కార్యకలాపాల స్థిరీకరణకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో.. స్టాండర్డ్ చార్టర్ట్ బ్యాంక్ మాత్రం పెద్ద శాఖల రూపంలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందన్నారు. తద్వారా కస్టమర్ల అవసరాలను సంతృప్తికర స్థాయిలో తీర్చగలమని చెప్పారు. కోల్కతా, చెన్నైలో పెద్ద శాఖలను తెరవడాన్ని ప్రస్తావించారు.ప్రియారిటీ బ్యాంకింగ్ సెంటర్లు ప్రస్తుతం ఏడు ఉండగా, వీటిని 21కి పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఒకే కస్టమర్కు ఒకటికి మించిన ఉత్పత్తులు, సేవలను అందించనున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ కార్యకలాపాలకు మద్దతుగా చెన్నై, బెంగళూరులో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను (జీసీసీలు) స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నిర్వహిస్తూ, 24వేల మందికి ఉపాధి కల్పిస్తుండడం గమనార్హం. ఇవి మరింత వృద్ధి చెందనున్నట్టు సింగ్ చెప్పారు. ఫారెక్స్ సెటిల్మెంట్లలో తమకు 8 శాతం వాటా ఉందన్నారు. రూపాయి ఇన్వాయిసింగ్కు డిమాండ్ పెరుగుతోందని.. మధ్య ప్రాచ్యంలో వాణిజ్యానికి రూపాయి మారకంలో చెల్లింపుల అమలు విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ రుణాల్లో 10 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ -
ఈఎస్ఐసీ కిందకు 20.36 లక్షల మంది
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) నిర్వహించే సామాజిక భద్రతా పథకం (ఈఎస్ఐ) కిందకు జూలైలో కొత్తగా 20.36 లక్షల మంది సభ్యులు చేరారు. ఈ ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. జూన్లో సభ్యుల చేరిక 19,37,314గా ఉంది. కార్మిక శాఖ ఈ వివరాలను విడుదల చేసింది.31,146 సంస్థలు కొత్తగా ఈఎస్ఐ పథకం కింద నమోదు చేసుకున్నాయి.మొత్తం 20.36 లక్షల సభ్యుల్లో 9.85 లక్షల మంది (48 శాతం) వయసు 25 ఏళ్లలోపే ఉంది.నికర మహిళా సభ్యుల చేరిక 4.33 లక్షలుగా ఉంది.ఈఎస్ఐ పథకం కింద 88 మంది ట్రాన్స్జెండర్లు సైతం పేర్లను నమోదు చేసుకున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ -
మన ఫార్మాపై ప్రభావం ఉండదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1 నుంచి వంద శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయంతో మన కంపెనీలపై తక్షణ ప్రభావం పడే అవకాశమేమీ ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ నిబంధన కేవలం పేటెంట్, బ్రాండెడ్ ఉత్పత్తులకే తప్ప జనరిక్ ఔషధాలకు కాదని వివరించాయి. చౌకైన, అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తూ అంతర్జాతీయంగా ఔషధాల సరఫరా వ్యవస్థకి భారత్ మూలస్తంభంగా నిలుస్తోందని, 47 శాతం అమెరికా ఔషధ అవసరాలను తీరుస్తోందని ఫార్మా ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. టారిఫ్ల ప్రభావం మన మీద ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ‘మనం చాలా మటుకు జనరిక్స్నే అందిస్తున్నందున పేటెంట్, బ్రాండెడ్ ఫార్మా దిగుమతులపై ప్రతిపాదిత 100 శాతం టారిఫ్లు భారత ఎగుమతులపై తక్షణ ప్రభావమేమీ చూపకపోవచ్చు. అంతేగాకుండా పలు బడా భారతీయ కంపెనీలు ఇప్పటికే అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తయారీ ప్లాంట్లు లేదా రీప్యాకేజింగ్ యూనిటను నిర్వహించడంతో పాటు ఇతర సంస్థల కొనుగోలు అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాయి‘ అని నమిత్ జోషి వివరించారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) కూడా మన ఫార్మాపై అమెరికా టారిఫ్ల తక్షణ ప్రభావమేమీ ఉండదని తెలిపింది. ఐపీఏ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా తదితర 23 దేశీ దిగ్గజాలకు ఐపీఏలో సభ్యత్వం ఉంది. వీటికి ఔషధ ఎగుమతుల్లో దాదాపు 80 శాతం, దేశీ మార్కెట్లో సుమారు 64 శాతం వాటా ఉంది. కొత్త అవకాశాలపై ఇన్వెస్ట్ చేయాలి .. రాబోయే రోజుల్లో బల్క్ డ్రగ్స్, ఏపీఐలకు (యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్) సంబంధించిన వ్యయాలను మరింతగా తగ్గించుకుంటే ఇతర సరఫరాదారుల కన్నా భారత్ వైపే అమెరికా మరింతగా మొగ్గు చూపడానికి అవకాశం ఉందని జోషి చెప్పారు. అలాగే సంక్లిష్టమైన జనరిక్స్, పెప్టైడ్స్, బయోసిమిలర్స్ మొదలైన విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. అమెరికాకు తమ ఎగుమతులు పెద్దగా లేనందున టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండదని ఎమ్క్యూర్ ఫార్మా తెలిపింది. భారత ఫార్మా కంపెనీల జనరిక్ ఔషధాల సరఫరాతో 2022లో అమెరికా హెల్త్కేర్ వ్యవస్థకు 219 బిలియన్ డాలర్లు, 2013–2022 మధ్య కాలంలో 1.3 లక్షల కోట్ల డాలర్ల మేర ఆదా అయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే అయిదేళ్లలో మరో 1.3 లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతుందనే అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నాయి. ఫార్మెక్సిల్ గణాంకాల ప్రకారం 2024–25లో అమెరికాకు భారత ఫార్మా ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనరిక్స్ మన బలం.. భారత్ బలం జనరిక్ ఔషధాలని, వీటికి టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్నందున భారత్పై ప్రభావం ఉండదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వీపీ దీపక్ జోత్వానీ తెలిపారు. అయితే, అమెరికా వెలుపల ఉంటూ, ఆ దేశానికి ఎగుమతి చేసే బ్రాండెడ్ డ్రగ్ కంపెనీలతో కొన్ని భారతీయ ఫార్మా సంస్థలకు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి సదరు కంపెనీలకు యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ)లాంటివి సరఫరా చేసే మన కంపెనీలపై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అటు ప్రధానంగా జనరిక్స్నే ఎగుమతి చేస్తుంది కాబట్టి భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్ ఉండదని, కాకపోతే ఈ పరిణామం, భవిష్యత్తులో దేశీయంగా ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సవాళ్లు ఎదురు కావొచ్చని సూచిస్తోందని ఫౌండేషన్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ వ్యవస్థాపకుడు రాహుల్ అహ్లువాలియా చెప్పారు. ఈ నేపథ్యంలో మన కంపెనీలకు పెద్ద మార్కెట్లు అందుబాటులోకి వచ్చే దిశగా అమెరికా, యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అటు అమెరికా వినియోగదారులపై టారిఫ్ల భారం మరీ ఎక్కువగా ఉండకుండా కొన్ని కేటగిరీలను మినహాయిస్తూ, తదుపరి చర్యలు ఉండొచ్చని అడ్వైజరీ సేవల సంస్థ ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ హెడ్ లూయీసీ లూ తెలిపారు. -
టాటా స్టోర్లలో ఫెస్టివల్ ఆఫర్స్: అక్టోబర్ 23 వరకు
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్, టాటా గ్రూప్నకు చెందిన క్రోమా.. దసరా, ధంతేరాస్, దీపావళి, భాయ్ దూజ్ సందర్భంగా ప్రత్యేక డీల్లతో పండుగ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ అక్టోబర్ 23 వరకు కొనసాగుతున్నాయి.వినియోగదారులు స్మార్ట్ఫోన్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్లు మొదలైనవి కొనుగోలు చేయడంతో డిస్కౌంట్స్, క్యాష్బ్యాక్, ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ పొందవచ్చు. కొత్త జీఎస్టీ అమలులోకి రావడంతో.. టీవీలు, ఏసీలపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆఫర్స్ ఎంచుకునే బ్రాండ్, స్టోర్, నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
డిజిటల్ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలు
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2ఎఫ్ఏ) కింద ఎస్ఎంఎస్ ఆధారత ఓటీపీకి అదనంగా మరిన్ని మార్గాలకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. పాస్వర్డ్, ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీ, పాస్ఫ్రేజ్, పిన్, కార్డ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టోకెన్, ఫింగర్ప్రింట్ లేదా ఇతర బయోమెట్రిక్స్ (ఆధార్ ఆధారిత) ఆథెంటికేషన్కు వీలు కల్పించింది.వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2ఎఫ్ఏ తప్పనిసరి అంటూ, ఇకపైనా ఎస్ఎంఎస్ ఓటీపీని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఎస్ఎంఎస్ ఓటీపీకి అదనంగా ఇతర ప్రత్యామ్యాయ ఆథెంటికేషన్ కోసం చెల్లింపుల వ్యవస్థలను అప్గ్రెడేషన్ చేసుకోవాలంటూ 2024 ఫిబ్రవరిలోనే ఆర్బీఐ కోరడం గమనార్హం. -
వర్క్ ఫ్రమ్ హోమ్ను సమర్థించను: గూగుల్ మాజీ సీఈఓ
మాజీ గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ (Eric Schmidt).. రిమోట్ అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ మీద మరోసారి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్క్ ఆమోదయోగ్యం అయినప్పటికీ.. సాంకేతిక రంగంలో ఇది కుదరదు. ఇది పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు.వర్క్ ఫ్రమ్ హోమ్ గురించివర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అనేది ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. కొత్తగా నేర్చుకునే తత్వాన్ని నాశనం చేస్తుంది. ఆఫీసులో సహోద్యుగుల నుంచి చాలావరకు నేర్చుకోవచ్చు. కాబట్టి నేను 'వర్క్ ఫ్రమ్ హోమ్'ను సమర్ధించనని ఎరిక్ స్మిత్.. ఆల్-ఇన్ పాడ్కాస్ట్లో పేర్కొన్నారు.గత ఏడాది కంపెనీ రిమోట్ వర్క్ కల్చర్ కారణంగా.. చిన్న ఏఐ స్టార్టప్ల కంటే వెనుకబడిందని స్మిత్ అన్నారు. ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. నా కెరీర్ తొలినాళ్లలో సన్ మైక్రోసిస్టమ్స్లోని సహోద్యోగులు వాదించడాన్ని వినడం ద్వారా చాలా నేర్చుకున్నానని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికాలో అందమైన నగరం: ఇన్స్టాలో ఇదే టాప్..అమెరికా, చైనా టెక్ పరిశ్రమ పోటీలను స్మిత్ హైలైట్ చేశారు. ఇక్కడ 996 పని సంస్కృతి ఉందని అన్నారు. ఈ దేశాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నారు. చైనాలో ఇటువంటి అధిక పని గంటలకు వ్యతిరేకంగా చట్టాలు ఉన్నప్పటికీ, చాలా కంపెనీలు.. ఉద్యోగులు ఇప్పటికీ ఈ కఠినమైన షెడ్యూల్కు కట్టుబడి ఉన్నారని, ఇది యూఎస్ వ్యాపారాలకు గణనీయమైన పోటీ ఒత్తిడిని సృష్టిస్తుందని ఎరిక్ ష్మిత్ పేర్కొన్నారు. -
మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి కుమార్తె అంటే వెంటనే గుర్తొచ్చేది.. ఆమె విలాసాలు, లగ్జరీ కార్లు, హంగులు, ఆర్భాటాలు, పార్టీలు.. కానీ అలాంటివేవీ లేకుండా ముగ్గురు స్నేహితులతో ఓ చిన్న అపార్ట్మెంట్లో కాలం వెళ్లదీస్తున్నారు వివియన్ జెన్నా విల్సన్. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్మస్క్ కుమార్తె జెన్నా విల్సన్(జేవియర్ మస్క్) ఇటీవల న్యూయార్క్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఇంటర్వ్యూలో జెన్నా విల్సన్(21) తెలిపిన వివరాల ప్రకారం..‘నా వద్ద వందలు, వేల డాలర్లు లేవు. లాస్ ఏంజిల్స్లోని ఒక షేరింగ్ అపార్ట్మెంట్లో ముగ్గురు రూమ్మేట్స్తో ఉంటున్నాను. ఈ పరిస్థితులను నేను భరించగలను. నాకు జన్మనిచ్చిన తండ్రితో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండటానికి ఇష్టపడను’ అని చెప్పుకొచ్చారు. విల్సన్ 16 ఏళ్ల వయస్సులో ట్రాన్స్జెండర్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. 2022లో చట్టబద్ధంగా తన పేరును, జెండర్ను మార్చుకుంది. ఈ సందర్భంగా కోర్టు ద్వారా తన తండ్రితో బహిరంగంగా సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి కుటుంబానికి దూరంగానే ఉంటోంది.ఎవరి సాయం అవసరం లేదు..కోర్టు ద్వారా తండ్రి, కుటుంబం నుంచి విడిపోతున్న సమయంలో మస్క్ నుంచి లభించే ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని ఆమె తిరస్కరించారు. తనను తాను పోషించుకోవడానికి సరళంగా జీవించేందుకు ఎవరి సహాయం అవసరం లేదని తేల్చిచెప్పారు. మస్క్ భార్యలకు పుట్టినవారిలో వివియన్ తొలి సంతానం.ఇదీ చదవండి: సమస్యగా కాదు... సదవకాశంగా చూద్దాం! -
ధోని ఇన్వెస్ట్ చేసిన కంపెనీకి ఎన్ఎస్ఈ ఓకే
సుప్రసిద్ధ క్రికెటర్ ఎంఎస్ ధోని, ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా, క్యామ్స్ వ్యవస్థాపకుడు వి.శంకర్కు పెట్టుబడులున్న ఫిన్బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ తాజాగా సూత్రప్రాయ అంగీకారాన్ని తెలియజేసింది. ఫైనాన్స్ బుద్ధ బ్రాండుతో రుణ సౌకర్యాలకు దారిచూపే కంపెనీ.. ఎస్ఎంఈ విభాగంలో నిధుల సమీకరణ చేపట్టనుంది.దీని ద్వారా ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ఫిజిటల్ రుణాల సంస్థ లిస్ట్కానుంది. ఐపీవోలో భాగంగా రూ.10 ముఖ విలువగల 50.48 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, అనుబంధ సంస్థ ఎల్టీసీవీ క్రెడిట్లో పెట్టుబడులు, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ కార్యకలాపాలతోపాటు.. రుణ చెల్లింపులకు వినియోగించనుంది. ఫిన్బడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ను 2012లో వివేక్ భాటియా, పార్థ్ పాండే, పరాగ్ అగర్వాల్ ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
అమెజాన్లో జీఎస్టీ బచత్ ఉత్సవ్
‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’లో భాగంగా అమెజాన్(Amazon) ‘గ్రేట్ సేవింగ్స్ సెలబ్రేషన్ జీఎస్టీ బచత్ ఉత్సవ్(GST Bachat Utsav)’కు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవ్లో నెటిజన్లు 50 నుంచి 80 % డిస్కౌంట్తో ఆధునిక ఎల్రక్టానిక్స్ వస్తువులు, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, హెల్త్కేర్, నిత్యావసరాలను జీఎస్టీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయొచ్చు.లక్షకు పైగా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే లేటర్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ప్రైమ్ సభ్యులకు గరిష్టంగా 5% వరకు ఖచి్చతమైన క్యాష్బ్యాక్ లభించనుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% డిస్కౌంట్, అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత క్యాష్బాక్ పొందవచ్చు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
కంపెనీల నాయకత్వంలో అతివలకు అందలం
భారతీయ కంపెనీల్లో నాయకత్వ హోదాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తాజాగా మొత్తం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లలో వారి ప్రాతినిధ్యం 20 శాతానికి చేరింది. భారత్లో మహిళలు ఉద్యోగం చేసేందుకు అత్యుత్తమ కంపెనీలపై వర్క్ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థ అవతార్, టాలెంట్ సర్వీసెస్ సంస్థ సెరామౌంట్ నిర్వహించిన 10వ విడత అధ్యయనంలో ఇది వెల్లడైంది.ఈ అధ్యయనం ప్రకారం అత్యుత్తమ కంపెనీల్లో మహిళల ఉద్యోగుల వాటా 35.7 శాతం స్థాయిలో స్థిరంగా ఉంది. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రొఫెషనల్ సర్వీసుల రంగం (44.6 శాతం) ముందంజలో ఉంది. ఐటీఈఎస్ (41.7 శాతం), ఫార్మా (25 శాతం), ఎఫ్ఎంసీజీ (23 శాతం), తయారీ (12 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహిళల అట్రిషన్ రేటు (ఉద్యోగం నుంచి తప్పుకోవడం) పురుషులతో దాదాపు సమానంగా 20 శాతం స్థాయిలో ఉంది. మెరుగైన ఉద్యోగావకాశాలు దక్కించుకోవడమే మహిళలు, పురుషుల అట్రిషన్కి ప్రధాన కారణంగా ఉంటోంది.అయితే, మహిళల విషయానికొస్తే పిల్లల సంరక్షణకంటే ఎక్కువగా ఆరోగ్యపరమైన సమస్యలే ఉద్యోగం నుంచి తప్పుకోవడానికి మరో కీలక కారణంగా నిలుస్తోంది. 2016లో కంపెనీల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 25 శాతంగా ఉండగా ప్రస్తుతం 35.7 శాతానికి పెరగడం, నాయకత్వ హోదాల్లో మహిళల వాటా 13 శాతం నుంచి 20 శాతానికి చేరడం మంచి పరిణామమని అవతార్ వ్యవస్థాపకురాలు సౌందర్య రాజేశ్ తెలిపారు. ఈ అధ్యయనానికి దేశవ్యాప్తంగా 365 కంపెనీల నుంచి దరఖాస్తులు రాగా 125 కంపెనీలకు జాబితాలో చోటు దక్కింది. ఆటోమోటివ్, కెమికల్స్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), మీడియా, ఫార్మా తదితర రంగ సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు టాప్ 10 బెస్ట్ కంపెనీలు..మహిళలకు టాప్ 10 కంపెనీల జాబితాలో యాక్సెంచర్ సొల్యూషన్స్, ఏఎక్స్ఏ ఎక్స్ఎల్ ఇండియా బిజినెస్ సరీ్వసెస్, కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ వేదాంత, ఈవై, కేపీఎంజీ ఇండియా, మాస్టర్కార్డ్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా, టెక్ మహీంద్రా, విప్రో సంస్థలు (అక్షర క్రమంలో) ఉన్నాయి. -
భారత్లో సౌర వెలుగులు
న్యూఢిల్లీ: భారత్లో సౌర విద్యుదుత్పత్తికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (ఎన్ఐఎస్ఈ) ఒక నివేదికలో పేర్కొంది. నిరుపయోగంగా ఉన్న 27,571 చ.కి.మీ. బంజరు భూముల్లో ప్యానెళ్లను ఏర్పాటు చేయడం (గ్రౌండ్ మౌంటెడ్ సోలార్) ద్వారా 3,343 జీడబ్ల్యూపీ మేర సోలార్ విద్యుదుత్పత్తి చేసే ఆస్కారం ఉంటుందని తెలిపింది. సముచిత స్థాయిలో సూర్యరశ్మి లభించినప్పుడు సౌర ప్యానెళ్లు గరిష్టంగా చేసే విద్యుదుత్పత్తిని జీడబ్ల్యూపీ (గిగావాట్స్ పీక్)గా వ్యవహరిస్తారు. 2014లో నిర్వహించిన అధ్యయనంలో 748.98 జీడబ్ల్యూపీ మేర గ్రౌండ్–మౌంటెడ్ సోలార్ పవర్కు అవకాశాలు ఉంటాయని అంచనా వేశారు.సోలార్ ప్రోడక్టులపై పరిశోధనలు నిర్వహించడం, అభివృద్ధి చేయడం, పరికరాల టెస్టింగ్..సరి్టఫికేషన్ మొదలైన వాటి కోసం ఏర్పాటైన ఎన్ఐఎస్ఈ, కేంద్ర పునరుత్పాదక శక్తి శాఖలో భాగంగా ఉంది. కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో పేర్కొన్న వివరాలను బట్టి చూస్తే ప్రస్తుతం అన్ని వనరుల స్థాపిత సామర్థ్యానికి ఎనిమిది రెట్లు అధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు అవకాశం కనిపిస్తోందని ఆయన చెప్పారు. దేశంలో పుష్కలంగా సౌర వనరులు ఉన్నాయని పేర్కొన్నారు.చివరిసారిగా 2014లో అధ్యయనం నిర్వహించినప్పటి నుంచి సోలార్ పవర్ రంగంలో పరిస్థితులు చాలా మారిపోయాయని చెప్పారు. ఫొటోవొల్టెయిక్ సామర్థ్యాలు మెరుగుపడ్డాయని, వ్యయాలు గణనీయంగా తగ్గాయని మంత్రి చెప్పారు. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజయేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని నిర్దేశించుకోగా దేశీ పరిశ్రమ దన్నుతో ఇప్పటికే సగం లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్తుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్న అపోహలను ఈ నివేదిక తొలగిస్తుందన్నారు. అత్యధికంగా రాజస్తాన్లో అవకాశం.. ఎన్ఐఎస్ఈ తాజా నివేదిక ప్రకారం, రాజస్తాన్, గుజరాత్లోని ఎడారి ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాల్లో గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పీవీల ఏర్పాటుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. రాజస్తాన్లో అత్యధికంగా 828.78 జీడబ్ల్యూపీ, ఆ తర్వాత మహారాష్ట్రలో 486.68 జీడబ్ల్యూపీ, మధ్యప్రదేశ్లో 318.97 జీడబ్ల్యూపీ, ఆంధ్రప్రదేశ్లో 299.31 జీడబ్ల్యూపీ, గుజరాత్లో 243.22 జీడబ్ల్యూపీ మేర సౌర విద్యుదుత్పత్తికి ఆస్కారం ఉంది. సుమారు 4,12,458.37 చ.కి.మీ. మేర బంజరు భూమి ఉండగా, అందులో సుమారు 6.69 శాతం స్థాయిలో 27,571.39 చ.కి.మీ. భూమిని ఇందుకు ఉపయోగించుకోవచ్చని నివేదిక తెలిపింది. ఏ రాష్ట్రంలోనైనా నిరుపయోగ భూమిలో 10 శాతానికి మించి సోలార్ అవసరాల కోసం వినియోగించరాదన్న నిబంధనలకు అనుగుణంగా ఇది ఉంటుందని పేర్కొంది. నివేదికలో మరిన్ని విశేషాలు.. ∙ప్రాంతాలవారీగా చూస్తే దేశవ్యాప్తంగా మొత్తం గ్రౌండ్ మౌంటెడ్ సోలార్లో పశి్చమ రాష్ట్రాల వాటా 45 శాతంగా ఉండొచ్చు. పశి్చమ రాష్ట్రాల్లో అత్యధికంగా సూర్య రశ్మి సోకే, నిరుపయోగ భూమి చాలా ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, (299.31 జీడబ్ల్యూపీ), కర్ణాటక (223.28 జీడబ్ల్యూపీ), తమిళనాడు (204.77 జీడబ్ల్యూపీ), తెలంగాణ (140.45 జీడబ్ల్యూపీ సామర్థ్యం)లో కూడా ఒక మోస్తరు స్థాయిలో ఉన్న బంజరుభూములు ఉపయోగపడతాయి.నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ఈశాన్య, హిమాలయ ప్రాంత రాష్ట్రాల్లో ఎక్కువగా సూర్యరశ్మి లేకపోవడం, కఠినతరమైన పర్వత ప్రాంతాలు, అత్యధికంగా అడవులు, ఎక్కువగా బంజరు భూములు అందుబాటులో లేకపోవడం వంటి అంశాల వల్ల గ్రౌండ్ మౌంటెడ్ సోలార్కు ఆస్కారం తక్కువగా ఉంటుంది. ∙సానుకూల పునరుత్పాదక విద్యుత్ పాలసీలు, పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఈ ఏడాది జనవరిలో భారత్లో స్థాపిత సోలార్ సామర్థ్యం 100 గిగావాట్ల పైకి చేరింది. 2014లో ఇది కేవలం 2.82 గిగావాట్లుగా ఉండేది. -
భారత్లో జేబీటీ మారెల్ గ్లోబల్ ప్రొడక్షన్ సెంటర్
ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ దిగ్గజం జేబీటీ మారెల్ భారత్లో తమ గ్లోబల్ ప్రొడక్షన్ సెంటర్ (జీపీసీ)ని ఏర్పాటు చేసింది. పుణెలో ప్రారంభించిన ఈ సెంటర్ .. భారత్, ఆసియా పసిఫిక్ మార్కెట్లలోని తమ కార్యకలాపాలకు అవసరమైన సొల్యూషన్స్ను అందిస్తుందని సంస్థ తెలిపింది.ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు, పర్యావరణహితమైన ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలకు ఉపయోగపడే అధునాతన ప్రక్రియలను రూపొందించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఈవీపీ అగస్టో రిజొలొ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. తయారీ జీడీపీలో సుమారు 12 శాతం వాటాతో, 80 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. -
పేటీఎం మనీపై జియో బ్లాక్రాక్ ఫండ్
పేటీఎం మనీ తన ప్లాట్ఫామ్పై సిస్టమ్యాటిక్ యాక్టివ్ ఈక్విటీ (ఎస్ఏఈ) ఫండ్ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇది దేశంలోనే మొదటిగా పేర్కొంది. జియో బ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్తో కలసి జియో బ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపింది.జియో బ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ బ్లాక్రాక్ ఎస్ఏఈ విధానం ఆధారంగా పెట్టుబడులు పెడుతుంది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 23న ప్రారంభం కాగా, అక్టోబర్ 7న ముగుస్తుంది. పేటీఎం మనీ యాప్పై ఎక్స్క్లూజివ్గా ఇది అందుబాటులో ఉంటుందని.. ఇన్వెస్టర్లు కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.ఎలాంటి కమీషన్ తీసుకోవడం లేదని తెలిపింది. జియో బ్లాక్రాక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ లార్జ్, మిడ్, స్మాల్క్యాప్ విభాగంలో 1,000 కంపెనీలను.. డేటా విశ్లేషణ ఆధారంగా ఎంపిక చేసి పెట్టుబడులు పెడుతుంది. పరిశ్రమలోనే అతి తక్కువగా 0.50 శాతం ఎక్స్పెన్స్ రేషియోని ఈ ఫండ్లో వసూలు చేస్తుండడం గమనార్హం. -
చేతులు మారిన కంపెనీలు.. వందల కోట్ల డీల్స్
మెడికల్ పరికరాల తయారీ కంపెనీ పాలీ మెడిక్యూర్ ఇటాలియన్ కంపెనీ సిటీఫ్ గ్రూప్ను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 3.1 కోట్ల యూరోల(రూ. 324 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో సిటీఫ్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సిటీఫ్ ఎస్ఆర్ఎల్సహా.. యూఎస్ఏ, మెక్సికోలలోని అనుబంధ సంస్థలను సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది.వెరసి మెడిస్ట్రీమ్ ఎస్ఏ(గ్రూప్)లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. సిటీఫ్ ప్రధానంగా ఆర్థోపెడిక్ సంబంధిత పరికరాల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 25 దేశాలలో ప్రొడక్టులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆర్థోపెడిక్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది.బజాజ్ ఎలక్ట్రికల్స్ చేతికి మర్ఫీ రిచర్డ్స్హోమ్ అప్లయెన్సెస్ తయారీ దిగ్గజం బజాజ్ ఎలక్ట్రికల్స్.. భారత్ సహా పొరుగు దేశాలలో మర్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ మేథో సంపత్తి(ఐపీ) హక్కులను సొంతం చేసుకోనుంది. ఐర్లాండ్ కంపెనీ గ్లెన్ డింప్లెక్స్ గ్రూప్ సంస్థ గ్లెన్ ఎలక్ట్రిక్ నుంచి ఐపీ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు బజాజ్ ఎలక్ట్రికల్స్ తాజాగా పేర్కొంది.ఇందుకు రూ. 146 కోట్లు వెచ్చించేందుకు కంపెనీ బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో భారత్తోపాటు.. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులలో మార్ఫీ రిచర్డ్స్ బ్రాండ్ హక్కులను పొందనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇంతక్రితం 2022 మార్చిలో మర్ఫీ రిచర్డ్స్తో ట్రేడ్మార్క్ ఒప్పందాన్ని మరో 15ఏళ్లకు పొడిగించింది. 2022 జూలై1 నుంచి అమల్లోకి వచ్చేలా ఒప్పందం కుదిరింది. -
ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్
ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థ కో ఫౌండర్, సీఈవో శామ్ ఆల్ట్మన్ (Sam Altman) ఖరీదైన తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. హవాయిలోని బిగ్ ఐలాండ్లోని తన సముద్ర తీర భవనాన్ని విక్రయిస్తున్నట్లు ఫోర్బ్స్ నివేదించింది. అసాధారణమైన అధునాతమైన భద్రతా ఫీచర్లు కలిగి ఉన్న ఈ భవనాన్ని రెండు వారాల క్రితం అమ్మకానికి పెట్టినట్టు సమాచారం.10 బెడ్రూమ్ల ఈ ఎస్టేట్ రూ. 434.63 కోట్ల విలువ చేస్తుంది. అమ్మకాన్ని నిర్వహిస్తున్న సోథెబీ ఏజెంట్ బ్రియాన్ ఆక్సెల్రోడ్ దీనిని "నా కెరీర్లో నేను చూసిన అత్యంత అద్భుతమైన ఆస్తి" అని అభివర్ణించారు. ఆ ఆస్తి బిగ్ సర్ఫ్ LLC కింద నమోదు చేయబడిందని పబ్లిక్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ సంస్థ గతంలో ఆల్ట్మాన్ శాన్ ఫ్రాన్సిస్కో నివాసానికి అనుసంధానించబడి ఉంది. ప్రస్తుతం అతని నాపా వ్యాలీ రాంచ్, వెంచర్ క్యాపిటల్ కార్యకలాపాలకు అనుసంధానించబడి ఉంది.చదవండి: సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు2011లో నిర్మించిన ఈ ఎస్టేట్లో ఐదు బెడ్రూమ్ల గెస్ట్హౌస్, 10 బాత్రూమ్లు, ఒక ప్రైవేట్ బీచ్, ఒక సినిమా థియేటర్ ఉన్నాయి. తాజావార్తలపై లిస్టెడ్ మేనేజర్ఆల్ట్మన్ కజిన్ జెన్నిఫర్ సెరాల్టా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అటు OpenAI కూడా ఇంకా నిర్ధారించ లేదు.ఆల్ట్మన్ 2021లో హవాయి ఎస్టేట్ను సుమారు రూ. 381.41కోట్ల కొనుగోలు చేశాడు. అదే సమయంలో తన శాన్ ఫ్రాన్సిస్కో ఇంటిని 27 మిలియన్ డాలర్లకు, 950 ఎకరాల నాపా రాంచ్ను 16 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ఫోర్బ్స్ ప్రకారం ఆల్ట్మన్ నికర ఆస్తుల విలువ రూ. 17,739.90 కోట్లుగా అంచనా. ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ -
అమెరికా పొమ్మంటే.. ఆ 25 ఐటీ హబ్స్ రమ్మంటాయ్
ప్రపంచ సాంకేతిక రంగం అసాధారణ వేగంతో విస్తరిస్తోంది. నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. అయితే దశాబ్దాలుగా.. అమెరికా భారతీయ సాంకేతిక నిపుణులకు ప్రధాన గమ్యస్థానంగా ఉండడంతో, మనవాళ్ల ఆలోచనలు అమెరికాను దాటి వెళ్లలేదు. అయితే, పెరుగుతున్న వీసా పరిమితులు మాత్రమే కాదు, అమెరికన్ నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయాల వల్ల కూడా గత కొంతకాలంగా చాలా మంది భారతీయ నిపుణులు కెరీర్ కోసం అమెరికాను దాటి ఇతర నగరాల వైపు చూడటం ప్రారంభించారు.కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ టాప్ టాలెంట్ లొకేషన్స్ 2025 నివేదిక ప్రకారం.. యూరప్, ఆసియా ఇతర ప్రాంతాలలోని అనేక నగరాలు తమను తాము ప్రపంచ ఐటీ కేంద్రాలుగా వేగంగా మలచుకుంటున్నాయి. ఈ గమ్యస్థానాలు కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ అభివృద్ధిలో ప్రపంచ స్థాయి కెరీర్లకు వేదికలను అందించడమే కాకుండా, మెరుగైన జీవనశైలికి కూడా హామీ ఇస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ వెలుపల కెరీర్ అవకాశాలను అన్వేషిస్తున్న వారి కోసం కొలియర్స్ నివేదిక అందించిన 25 ఐటీ కేంద్రాల జాబితా ప్రకారం, అవి ఏవేవి అంటే..లండన్ (యునైటెడ్ కింగ్డమ్)బలమైన వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అభివృద్ధి చెందుతున్న ఏఐ పర్యావరణ వ్యవస్థ మద్దతుతో లండన్ యూరప్ కి ఒక ప్రబల ఆర్థిక సాంకేతిక శక్తి కేంద్రంగా ఉండి ఐటీ కెరీర్లో అమెరికాకు ప్రత్యామ్నాయంగా మారింది.బీజింగ్ (చైనా)ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో బలమైన పట్టు ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రధాన ఆవిష్కరణ కేంద్రం.బెంగళూరు (భారతదేశం)తరచుగా భారతదేశ సిలికాన్ వ్యాలీ అని పిలువబడే బెంగళూరు, ఐటీ సేవలు, స్టార్టప్లు గ్లోబల్ ఆర్ అండ్ డి లో దేశాన్ని ముందుండి నడిపిస్తూనే ఉంది.పారిస్ (ఫ్రాన్స్)బహుళజాతి కంపెనీలు వినూత్న స్టార్టప్ల శక్తివంతమైన మిశ్రమంతో, పారిస్ సాంకేతిక ప్రతిభకు అగ్రగామిగా యూరోపియన్ కేంద్రంగా ఉంది.డబ్లిన్ (ఐర్లాండ్)బలమైన స్టార్టప్ వ్యవస్థ ప్రతిభ సమూహంతో యూరప్ సాంకేతిక రంగానికి చిరునామాగా డబ్లిన్ ఉద్భవించింది.టోక్యో (జపాన్)రోబోటిక్స్, ఆటోమేషన్ ఏఐ లకు ప్రసిద్ధి చెందిన టోక్యో ఆసియా ఖండపు హైటెక్ ఆవిష్కరణల రాజధానిగా ఎదుగుతోంది.మ్యూనిచ్ (జర్మనీ)అధునాతన ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఐటీ సాంకేతికత ఆధారిత పరిశ్రమలలో లోతైన పరిశోధనలకు ప్రసిద్ధి చెందింది.స్టాక్హోమ్ (స్వీడన్)ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్టప్లకు నిలయం, స్టాక్హోమ్ వ్యవస్థాపకత ఆవిష్కరణలకు కేరాఫ్గా వృద్ధి చెందుతోంది.షాంఘై (చైనా)ఈ-కామర్స్, ఫిన్టెక్ కృత్రిమ మేధస్సులలో సామర్ధ్యాలతో వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.బెర్లిన్ (జర్మనీ)డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రసిద్ధి చెందిన బెర్లిన్, యువ ఆవిష్కర్తలకు ఒక సరికొత్త అయస్కాంతంగా మారింది.సియోల్ (దక్షిణ కొరియా)ఎలక్ట్రానిక్స్, 5జీ, ఏఐ స్వీకరణలో అగ్రగామిగా ఉన్న సియోల్, డిజిటల్ సరిహద్దులను విస్తరిస్తూ దూసుకుపోతోంది.షెన్జెన్ (చైనా)ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఎకోసిస్టమ్లో కీలకమైన నగరం, ప్రపంచ డిజిటల్ సేవల విస్తరణకు గణనీయంగా దోహదపడుతోంది.టొరంటో (కెనడా)ఏఐ పరిశోధన టెక్ స్టార్టప్లకు కేంద్రంగా ఉన్న టొరంటో పెట్టుబడి ప్రపంచ ప్రతిభ రెండింటినీ ఆకర్షిస్తుంది.బుకారెస్ట్ (రొమేనియా)విస్తరిస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో తూర్పు ఐరోపాలో ఐటీ అవుట్సోర్సింగ్కు నిఖార్సైన గమ్యస్థానం.మాడ్రిడ్ (స్పెయిన్)ఫిన్టెక్, టెలికాం డిజిటల్ సేవలలో బలమైన మాడ్రిడ్, యూరోపియన్ ఐటీ హబ్గా క్రమంగా దినదినాభివృద్ధి చెందుతోంది.ఆమ్స్టర్ డామ్ (నెదర్లాండ్స్)ఫిన్టెక్ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్ధ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ నగరం డిజిటల్ వాణిజ్యానికి కూడా ఒక కేంద్రం.హైదరాబాద్ (ఇండియా)అనేక ఆర్ అండ్ డి కేంద్రాలకు నిలయం, హైదరాబాద్ భారతదేశ ఐటీ విస్తరణకు మూలస్తంభంగా వేగంగా ఎదుగుతోంది.పూణే (ఇండియా)అభివద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థతో, పూణే అంతర్జాతీయ గుర్తింపు పొందుతోంది.హాంగ్జౌ (చైనా)ఇ–కామర్స్ డిజిటల్ ఆవిష్కరణలలో ప్రముఖ నగరం, హాంగ్జౌ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను శిఖరాగ్రంలో నిలుపుతోంది.ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ)బ్యాంకింగ్ రంగానికి బలమైన సంబంధాలతో యూరప్ ఖండపు ఫిన్టెక్ సైబర్ సెక్యూరిటీ హబ్గా గుర్తింపు పొందింది.మెక్సికో నగరం (మెక్సికో)లాటిన్ అమెరికాలో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, అవుట్సోర్సింగ్ హబ్, భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)బ్లాక్చెయిన్, ఫిన్టెక్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన జ్యూరిచ్ ఆవిష్కరణ స్థిరత్వం రెండింటినీ అందిస్తుంది.వార్సా (పోలాండ్)తూర్పు ఐరోపాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ సేవల కేంద్రం, యువ నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి మద్దతుతో విస్తరిస్తోంది.గ్వాంగ్జౌ( చైనా)ఆవిష్కరణలను తయారు చేయడం డిజిటల్ సేవలను విస్తరించడంపై దృష్టి సారించిన చైనా నగరం.రోమ్ (ఇటలీ)ఇయు సాంకేతిక కార్యక్రమాల బలమైన అండతో యూరప్లో డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న నగరం. -
వేల కోట్ల అధిపతులు.. ఎంపీలో టాప్ 5 ధనవంతులు వీళ్లే..
దేశంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రధాన వ్యాపార సంస్థలకు హాట్స్పాట్గా అవతరించింది. అనేక పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రవ్యాప్తంగా తమ ఉనికిని స్థాపించాయి. అంతేకాకుండా అనేక మంది ప్రముఖ వ్యాపారవేత్తలు, అత్యంత సంపన్నులకు కేంద్రంగా కూడా మధ్య ప్రదేశ్ నిలిచింది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. మధ్యప్రదేశ్లోని టాప్ 5 అత్యంత ధనవంతులెవరో (richest people) ఇప్పుడు చూద్దాం..వినోద్ అగర్వాల్హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. మధ్యప్రదేశ్లో అత్యంత ధనవంతుడు వినోద్ అగర్వాల్. ఈయన అగర్వాల్ కోల్ కంపెనీ యజమాని. బొగ్గు వ్యాపారంలో మంచి పేరును సంపాదించుకున్నారు. ఇండోర్కు చెందిన వినోద్ మొత్తం సంపద సుమారు రూ. 7,100 కోట్లు.దిలీప్ సూర్యవంశీమధ్యప్రదేశ్లో రెండవ అత్యంత ధనవంతుడు దిలీప్ సూర్యవంశీ. దిలీప్ బిల్డ్కాన్ వ్యవస్థాపకుడైన దిలీప్ భోపాల్కు చెందినవారు. దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్కు ఛైర్మన్, ఎండీగా ఉన్న ఈయన సంపద దాదాపు 3,800 కోట్లు. ఈయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో 44 ఏళ్లుగా ఉన్నారు.శ్యామ్సుందర్ మూంద్రాఉజాస్ ఎనర్జీ యజమాని అయిన శ్యామ్సుందర్ మూంద్రా మూడవ స్థానంలో ఉన్నారు. ఇండోర్కు చెందిన శ్యామ్సుందర్ నెట్వర్త్ దాదాపు 3,500 కోట్లని అంచనా. సౌరశక్తి రంగంలో పనిచేస్తున్న ఉజాస్ ఎనర్జీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మధ్యప్రదేశ్ను గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు తీసుకెళ్లడంలో మూంద్రా కంపెనీ గణనీయమైన పాత్ర పోషించింది.దినేష్ పాటిదార్ఇండోర్కు చెందిన దినేష్ పాటిదార్ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దినేష్ శక్తి పంప్స్ యజమాని. ఆయన మొత్తం సంపద దాదాపు రూ. 3,400 కోట్లు. దినేష్ కంపెనీ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందింది.సుధీర్ అగర్వాల్ఐదవ స్థానంలో భోపాల్కు చెందిన సుధీర్ అగర్వాల్ ఉన్నారు. ఆయన సాగర్ మ్యానుఫ్యాక్చరర్స్ యజమాని. ఆయన సంపద దాదాపు 2,500 కోట్లు ఉంటుందని అంచనా. ఆయన వస్త్ర పరిశ్రమలో ప్రముఖ పేరు, సాగర్ గ్రూప్ విద్య, ఆరోగ్యం, పరిశ్రమ రంగాలలో గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు! -
తక్షణ ఉపశమన చర్యలు అవసరం
అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లు తమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటూ, ఈ తరుణంలో తక్షణ ఉపశమన చర్యలను ప్రకటించాలంటూ రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (GJEPC) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman)ను కోరింది. బుధవారం మంత్రితో జీజేఈపీసీ ప్రతినిధులు సమావేశమై తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.అమెరికాతో వాణిజ్య సంప్రదింపులను తిరిగి ప్రారంభించడం ప్రోత్సాహకరమంటూనే.. పరిశ్రమ నిలదొక్కుకోవడానికి తక్షణ ఉపశమన చర్యలు ప్రకటించాల్సిన అవసరాన్ని జీజేఈపీసీ ప్రతినిధి బృందం ప్రస్తావించింది. చర్చలు ఫలవంతం అయ్యేందుకు సమయం పడుతుందని, ఈ లోపు ఉపాధి అవకాశాలు కోల్పోకుండా చూసేందుకు మద్దతు చర్యలు అవసరమని గుర్తు చేసింది.‘ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లోని యూనిట్లు రివర్స్ జాబ్ వర్క్ (ఎగుమతుల కోసం కాకుండా దేశీ తయారీదారులు, రిటైలర్ల కోసం ఉత్పత్తి చేయడం) చేపట్టేందుకు, దేశీ టారిఫ్ల కింద విక్రయాలకు అనుమతించాలని కోరాం. రుణాలపై మార టోరియం, మూలధన రుణాలపై వడ్డీ రాయితీ అందించడం వల్ల ఆర్థిక భారం తగ్గుతుందని తెలి యజేశాం’అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. ఈ చర్యలతో ఉద్యోగాలను, ఎగుమతిదారుల పోటీతత్వాన్ని కాపాడుకోవచ్చన్నారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
రూ.450 కోట్ల ప్రీమియం లక్ష్యం
టీవీఎస్ గ్రూప్ వేణు శ్రీనివాసన్, ఇన్సూరెన్స్ వెటరన్ వి.జగన్నాథన్ ఏర్పాటు చేసిన గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ 2027 మార్చి నాటికి రూ.450 కోట్ల ప్రీమియం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.40 కోట్ల ప్రీమియం ఆదాయం నమోదు చేశామని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లుగా ఉండొచ్చని కంపెనీ ఎండీ, సీఈవో జి.శ్రీనివాసన్ ప్రకటించారు.‘పూర్తి రక్షణతో కూడిన మంచి ఉత్పత్తులను ఆఫర్ చేస్తూ, సులభతర క్లెయిమ్లు, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడం ద్వారా మార్కెట్ విస్తరణపై దృష్టి పెట్టాం. దేశంలో ఆరోగ్య సంరక్షణకు చేసే వ్యయంలో సగం మేర ఔట్ పేషెంట్ రూపంలోనే (ఓపీడీ) ఉంటోంది. కనుక గెలాక్సీ ఓపీడీ కవర్ ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు వీలుగా రూపొందించాం. నాలుగేళ్లలో బ్రేక్ఈవెన్ (లాభ, నష్టాల్లోని స్థితి)కు రావాలన్న లక్ష్యంతో ఉన్నాం’అని చెప్పారు.గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రస్తుతం ఎనిమిది పాలసీలను, రెండు రైడర్లను ఆఫర్ చేస్తుండగా, మొదటి ఏడాది 700 క్లెయిమ్లను పరిష్కరించినట్టు తెలిపారు. ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. క్లెయిమ్ పరిష్కారాలు సులభతరంగా ఉండేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్టు, ఇప్పటి వరకు 1.2 లక్షల మందికి కవరేజీ ఇచి్చనట్టు చెప్పారు. జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల కస్టమర్లకు భారం తగ్గుతుందని, బీమా సంస్థలు తమ వంతుగా కొంత భారం భరించనున్నట్టు శ్రీనివాసన్ తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల పరిధిలో 6,000 నెట్వర్క్ ఆస్పత్రులతో గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తోంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
కార్పొరేట్లకూ దసరా జోష్!
కోల్కతా: దసరా నవరాత్రి వేడుకలను కంపెనీలు మార్కెటింగ్ మంత్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ సందర్భంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ, వినియోగదారులకు మరింత దగ్గరయ్యే దిశగా మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దుర్గా పూజలను పెద్ద ఎత్తున నిర్వహించే పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాల్లో థీమ్డ్ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాయి. టీపొడి, వ్యక్తిగత సంరక్షణ నుంచి ఫ్యాషన్, పాదరక్షలు, లైటింగ్, సాంకేతికత వరకు.. బ్రాండ్లు వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు ఆవిష్కరణలకు సంప్రదాయాన్ని జోడిస్తున్నాయి. పండుగల రోజుల్లో షాపింగ్కు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తుంటారు. అందులోనూ దసరా రోజుల్లో ఖరీదైన కొనుగోళ్లు ఎక్కువగా నమోవుతుంటాయి. ఈ సమయంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో విక్రయాలను పెంచుకోవడమే కాకుండా, వినియోగదారులతో దీర్ఘకాల భావోద్వేగ బంధాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీలు చూస్తుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘‘పండుగ కార్యక్రమాలు బ్రాండ్ల నిర్మాణానికి కీలకం. వినియోగదారుల సెంటిమెంట్ గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో వారితో అనుబంధానికి వీలు కలి్పస్తాయి’’అని పర్సనల్కేర్ బ్రాండ్ జోయ్ సీఎంవో పౌలోమీ రాయ్ తెలిపారు. మింత్రా జబాంగ్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్రీమియం ఎతి్నక్ వేర్ లేబుల్ ‘సౌరాగ్య’ను మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీతో కలసి రూపొందించింది. సౌరవ్ విజన్ అయిన అసలైన బెంగాలీ ఫ్యాషన్ ఈ భాగస్వామ్యానికి మూలమని మింత్రా అధికార ప్రతినిధి చెప్పారు. దీంతో సౌరవ్ గంగూలీ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టయిందన్నారు. ఇమామీ గోధుమ పిండి దసరా ముందు గోధుమ పిండి బ్రాండ్ను విడుదల చేయడం ద్వారా ఇమామీ ఆగ్రోటెక్ స్టేపుల్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. తన చెక్కీ ఫ్రెష్ ఆటా పిండితో రూపొందించిన దుర్గామాత విగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. పశి్చమబెంగాల్ కళ, సంస్కృతిని ప్రతిబింబిస్తూ టాటా టీ కంపెనీ టాటా టీ గోల్డ్ బ్రాండ్ ప్రచారాన్ని చేపట్టింది. ఐదుగురు బెంగాలీ కళాకారులు రూపొందించిన డిజైన్లతో లిమిటెడ్ ఎడిషన్ టాటా టీ గోల్డ్ను విడుదల చేసింది. ఈ డిజైన్లు దుర్గా పూజల ప్రత్యేకతను చాటనున్నాయి. ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్ సైతం దసరా సందర్భంగా తన ఫారŠూచ్యన్ బ్రాండ్ను మరింత బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. సంప్రదాయ వేడుకలు, సంబరాల్లో పాలు పంచుకునేందుకు పండుగలు అవకాశం కలి్పస్తాయని కంపెనీ సేల్స్ జాయింట్ ప్రెసిడెంట్ ముకేశ్ మిశ్రా తెలిపారు. కొత్త ఉత్పత్తులు, ప్రచారాలతో తమ విక్రయాలు పెంచుకోవడమే కాకుండా, వినియోదారులకు చేరువ అయ్యేందుకు ఈ సీజన్ను ఒక చక్కని అవకాశంగా భావిస్తూ ముందుకు వెళుతున్నాయి. -
ఫోన్పే ఐపీవో బాట
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో నిర్వహణ కోసం కంపెనీ కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేపీమోర్గాన్ చేజ్, సిటీగ్రూప్, మోర్గాన్ స్టాన్లీని ఎంపిక చేసుకున్నట్లు జూన్లో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా.. గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ గ్రూప్ సంస్థ 2023లో ఇన్వెస్టర్ల నుంచి 85 కోట్ల డాలర్లు(రూ. 7,021 కోట్లు) సమీకరించింది. 12 బిలియన్ డాలర్ల(రూ. లక్ష కోట్లు) విలువలో జనరల్ అట్లాంటిక్, వాల్మార్ట్, రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ తదితరాలు ఫోన్పేలో ఇన్వెస్ట్ చేశాయి. ఐపీవో ద్వారా రూ. 12,000 కోట్లు సమీకరించే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది(2024–25) కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గి రూ. 1,727 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ. 1,996 కోట్లుగా నమోదయ్యాయి. టోఫ్లర్ వివరాల ప్రకారం మొత్తం ఆదాయం 40 శాతంపైగా జంప్చేసి రూ. 7,115 కోట్లను తాకింది. డిజిటల్ పేమెంట్ సొల్యూషన్లతోపాటు కంపెనీ ఇన్సూరెన్స్, రుణాలు, వెల్త్ మేనేజ్మెంట్ తదితర సర్వీసులు సైతం అందిస్తోంది. ఇటీవల కాలంలో గ్రో, ఫిజిక్స్వాలా, షాడోఫాక్స్ టెక్నాలజీస్, షిప్రాకెట్, బోట్, టాటా క్యాపిటల్ సైతం గోప్యతా మార్గంలోనే సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన విషయం విదితమే. గతేడాది(2024)లో స్విగ్గీ, విశాల్ మెగామార్ట్ ఇదే విధానంలో లిస్టింగ్కు వెళ్లడం గమనార్హం! -
స్పెషలిస్టులకే డిమాండ్..!
ముంబై: దేశీయంగా సెమీకండక్టర్ డిజైన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) నియామకాల ధోరణి నెమ్మదిగా మారుతోంది. భారీ పరిమాణంలో రిక్రూట్మెంట్ చేపట్టకుండా ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల కోసమే హైరింగ్ చేయడం వైపు జీసీసీలు మొగ్గు చూపుతున్నాయి. కెరియర్నెట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో టాప్ 50 సెమీకండక్టర్ డిజైన్ జీసీసీల్లో మొత్తం హైరింగ్ పరిమాణం 22 శాతం క్షీణించింది. ప్రత్యేక విభాగాల్లో విశిష్టమైన నైపుణ్యాలున్న స్పెషలిస్టులకు మాత్రం డిమాండ్ పెరుగుతోంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్లాంటి ప్రభుత్వ కార్యక్రమాలు, విస్తృత సంఖ్యలో ఎంఎస్ఎంఈలు, ఏఐ..క్లౌడ్ సాంకేతికతల్లో ప్రపంచ స్థాయి నైపుణ్యాలున్న ప్రతిభావంతుల లభ్యత, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలు మొదలైనవాటి ఊతంతో సెమీకండక్టర్ డిజైన్లో భారత్ కీలక పాత్ర పోషించనుందని కెరియర్నెట్ సీబీవో నీలభ్ శుక్లా తెలిపారు. మొత్తం హైరింగ్ పరిమాణం నెమ్మదిస్తున్నప్పటికీ, విశిష్టమైన నైపుణ్యాలున్న ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతుండటమనేది.. పరిమాణం కన్నా నాణ్యతకు ప్రాధాన్యం పెరుగుతోందనడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 79 భారీ, మధ్య స్థాయి, స్టార్టప్ సెమీకండక్టర్ డిజైన్ జీసీసీల జాబ్ పోస్టింగ్ డేటా ఆధారంగా కెరియర్నెట్ ఈ నివేదికను రూపొందించింది. వీఎల్ఎస్ఐ నిపుణులకు ప్రాధాన్యం.. సెమీకండక్టర్ డిజైన్ జీసీసీల్లో హైరింగ్కి సంబంధించి వీఎల్ఎస్ఐ నిపుణులకు (48 శాతం) అత్యంత ప్రాధాన్యం ఉంటోంది. ఇక, సిస్టం అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ (35 శాతం), బిజినెస్ ఆపరేషన్స్/ఐటీ సపోర్ట్ (17 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ విభాగాల్లోనూ అంతర్గతంగా డిజిటల్ డిజైనర్లు (15 శాతం), వెరిఫికేషన్ స్పెషలిస్టులు (10 శాతం), సిస్టం సాఫ్ట్వేర్ డెవలపర్లకు (10 శాతం) ప్రాధాన్యం లభిస్తోంది. అలాగే అనలాగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఫర్మ్వేర్ మొదలైన విభాగాల్లోనూ నిపుణులకు డిమాండ్ ఉంటోంది. -
ఐఏఎస్పీ ఉపాధ్యక్షురాలిగా దీపన్వితా చటోపాధ్యాయ
ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్ పార్క్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇన్నోవేషన్ (ఐఏఎస్పీ) ఉపాధ్యక్షురాలిగా దీపన్వితా చటోపాధ్యాయ ఎన్నకయ్యారు. చైనాలోని బీజింగ్లో జరిగిన ఐఏఎస్పీ 42వ ప్రపంచ సదస్సులో ఐకేపీ నాలెడ్జ్ పార్క్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దీపన్వితా చటోపాధ్యాయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.ఐఏఎస్పీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో రెండేళ్ల పదవీకాలానికి దీపన్వితా చటోపాధ్యాయ సేవలందిస్తారు. ఐఏఎస్పీ బోర్డులో 15 దేశాల నుండి 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రపంచ ఆవిష్కరణ వ్యూహాలను రూపొందించడానికి సంవత్సరానికి రెండుసార్లు ఐఏఎస్పీ బోర్డు సమావేశమవుతుంది.భారత ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లో అగ్రగామిగా ఉన్న దీపన్విత హైదరాబాద్లో దేశంలోనే మొట్టమొదటి లైఫ్ సైన్స్ రీసెర్చ్ పార్కును ఏర్పాటు చేశారు. బెంగళూరులో ప్రముఖ హార్డ్ వేర్ ఇంక్యుబేటర్ అయిన ఐకేపీ ఈడెన్ ను ప్రారంభించింది. ఆమె నాయకత్వంలో ఐకేపీ 1850కి పైగా ఇన్నోవేషన్ ప్రాజెక్టులు, స్టార్టప్లకు మద్దతు ఇచ్చింది. -
ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు!
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Tesla CEO Elon Musk) తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడు ఒరాకిల్ (Oracle) వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆయన మొత్తం సంపద 373 బిలియన్ డాలర్లు (సుమారు రూ.31 లక్షల కోట్లు). ఏఐ బూమ్ కారణంగా ఒరాకిల్ స్టాక్ విలువ భారీగా పెరగడంతో గత కొన్ని నెలల్లో ఎల్లిసన్ సంపద వేగంగా ఎగిసింది.లారీ ఎల్లిసన్ ( Larry Ellison) 2010లోనే గివింగ్ ప్లెడ్జ్ తీసుకున్నారు. ఇందులో భాగంగా తన సంపదలో 95 శాతం విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే సాంప్రదాయ సామాజిక సంస్థల ద్వారా కాకుండా తన సొంత నిబంధనలపై సంపదను ఇవ్వడానికి ఇష్టపడతానని చెబుతారు. అలాగే విరాళాలు ఇస్తూ వస్తున్నారు.విరాళం ఎలా ఇవ్వాలనుకుంటున్నారంటే..లారీ ఎల్లిసన్ తన సంపదను ఎలా ఇవ్వాలని యోచిస్తున్నాడో ఫార్చ్యూన్ ఒక నివేదికలో వెల్లడించింది. ఎల్లిసన్ నెట్వర్త్ సెప్టెంబర్ 2025 నాటికి 373 బిలియన్ డాలర్లని అంచనా. టెస్లాలో గణనీయమైన పెట్టుబడితో పాటు ఒరాకిల్లో ఆయనకున్న 41 శాతం వాటా నుంచే ఆయన సంపదలో ఎక్కువ భాగం వచ్చింది.ఎల్లిసన్ తన దాతృత్వ కార్యక్రమాల్ని ప్రధానంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన లాభాపేక్ష లేని సంస్థ ఎల్లిసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (EIT) ద్వారా కొనసాగిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, ఆహార కొరత, వాతావరణ మార్పు, ఏఐ పరిశోధనతో సహా ప్రపంచ సవాళ్లపై ఈ సంస్థ దృష్టి పెడుతుంది. సుమారు 1.3 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ కొత్త మెయిన్ క్యాంపస్ 2027 నాటికి ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ప్రారంభం కానుంది.కొన్నేళ్లుగా ఎల్లిసన్ అనేక భారీ స్థాయి విరాళాలు ఇచ్చారు. క్యాన్సర్ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించడానికి దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి 200 మిలియన్ డాలర్లు, ఎల్లిసన్ మెడికల్ ఫౌండేషన్ కు సుమారు 1 బిలియన్ డాలర్లు ఇచ్చారు.ఇదీ చదవండి: క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్ ఏమన్నారంటే.. -
క్లాసులకు వెళ్తున్న ఇషా అంబానీ.. టీచర్ ఏమన్నారంటే..
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత, భారత అపర సంపన్నుడు ముకేశ్ అంబానీ ( Mukesh Ambani), నీతా అంబానీల (Nita Ambani) ముద్దుల తనయ ఇషా అంబానీ. వీరి నుంచే వ్యాపార పటిమను అలవరచుకున్న ఈమె రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్లోని పలు అనుబంధ విభాగాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె చాలా కాలంగా వీక్లీ క్లాసులకు వెళ్తున్నారు.ఇషా అంబానీ క్లాసులకు వెళ్తున్నది తన కోసం కాదు.. తన ఇద్దరు కవల పిల్లలు కృష్ణ, ఆదియా శక్తి కోసం. పిల్లల మెదడు సంపూర్ణ ఎదుగుదల కోసం వారిని ప్రత్యేక తరగతులకు పంపుతున్నారు. పిల్లలతో తానూ ఓపిగ్గా ఆ తరగతులకు హాజరుతున్నారు. ఈ విషయాన్ని క్లాసులు నిర్వహించే టాకిల్ రైట్ అనే సంస్థ వ్యవస్థాపకురాలు వెల్లడించారు.టికిల్ రైట్ ఫౌండర్ మునీరా సాహెబ్ దత్తానీ మాట్లాడుతూ ఇషా అంబానీ (Isha Ambani).. తన కవలలు ఆరు నెలల వయస్సు నుండి తమ తరగతులకు హాజరవుతున్నారని వెల్లడించారు. పిల్లల కోసం సమయాన్ని కేటాయించి ఇషా చూపుతున్న చొరవను ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా తరగతుల గురించి ఆమె అనుభవాన్ని ఇషా అంబానీ వివరించారు. తనతోపాటు పిల్లలు ఆదియా, కృష్ణ క్లాస్లను ఆస్వాదిస్తారని చెప్పారు.ఇదీ చదవండి: జియో పేమెంట్స్ బ్యాంక్ వినూత్న అకౌంట్ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వ్యాపారాలకు, ఫౌండేషన్కు డైరెక్టర్గా ఉన్న ఇషా అంబానీ, 2018 డిసెంబరులో ఆనంద్ పిరమల్ను వివాహమాడారు. ఈ జంట 2022 నవంబర్ 19న కవలలకు జన్మనిచ్చారు. వీరికి ఆదియా శక్తి, కృష్ణ అని పేర్లు పెట్టారు. వీరికి ఐవీఎఫ్ ద్వారా ఈ పిల్లలు కలిగారు. ఈ విషయాన్ని ఎటువంటి సంకోచం లేకుండా ఇషా అంబానీ చెబుతుంటారు. View this post on Instagram A post shared by Tickle Right | Right Brain (@tickleright) -
భారీ నౌకల తయారీకి ఇన్ఫ్రా హోదా
మేకిన్ ఇండియా నినాదంలో భాగంగా దేశీయంగా భారీ నౌకల తయారీని మరింతగా ప్రోత్సహించే దిశగా ఈ పరిశ్రమకు మౌలిక రంగ హోదాను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇన్ఫ్రాలో భాగమైన రంగాల మాస్టర్ లిస్ట్లో రవాణా, లాజిస్టిక్స్ కేటగిరీలో దీన్ని కూడా చేర్చింది. ఈ మేరకు సెప్టెంబర్ 19న ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం 10,000 పైగా టన్నుల స్థూల టన్నేజ్ ఉండి, భారతీయ ఓనర్షిప్, జెండా గల వాణిజ్య నౌకలకు ఇన్ఫ్రా హోదా లభిస్తుంది. అలాగే దేశీయంగా తయారై, భారతీయ ఓనర్షిప్, ఫ్లాగ్తో 1,500 పైగా స్థూల టన్నేజీ గల వాణిజ్య నౌకలు కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి. ఇన్ఫ్రా హోదా గల పరిశ్రమల్లోని సంస్థలకు .. రుణాల సమీకరణకు సంబంధించి వెసులు బాట్లు లభిస్తాయి. పన్నులపరమైన రాయితీలు మొదలైన ప్రయోజనాలు కూడా ఉంటాయి.ఇదీ చదవండి: భారత్కు యూఏఈ వీసా నిలిపేసిందా? -
జీసీసీల రాజధానిగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంలోనే సుమారు 70కిపైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC)ను ఏర్పాటు కావడం జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసే అంశమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Sridhar Babu) స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటి హెల్త్కేర్ జీసీసీ ‘హెచ్సీఏ హెల్త్కేర్’ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ భారత జీసీసీ రాజధానిగా ఎదుగుతోందని అన్నారు. హాస్పిటాలిటీ రంగంలో మొట్టమొదటి జీసీసీని ఇటీవలే ప్రారంభించామని, తాజాగా హెల్త్కేర్లోనూ మొట్ట మొదటి జీసీసీ ఇక్కడే ఏర్పాటు కావడం ఎంతైనా హర్షణీయమైన అంశమన్నారు.జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ ఎదుగుదల దశాబ్దాల క్రితం బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమల ఏర్పాటుతోనే మొదలైందని మంత్రి అన్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం సుమారు 800 ఫార్మా కంపెనీ (Pharma Companies)లకు కేంద్రంగా నిలిచిందని వివరించారు. ఏపీఐలతోపాటు మందులు, బయలాజిక్స్, స్పెషాలిటీ మెడిసిన్స్, టీకాల తయారీ కేంద్రంగా ఎదిగిందని, ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని, స్కిల్స్ యూనివర్శిటీ ఏర్పాటు అందులో ఒకటి మాత్రమేనని తెలిపారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణలో అపారమైన అనుభవం కలిగిన హెచ్సీఏ హెల్త్ కేర్ హైదరాబాద్లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయడం ప్రభుత్వ సానుకూల విధానాలకు లభించిన మద్దతుగా భావిస్తున్నట్లు తెలిపారు.వైద్యం చౌకగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉండాలన్నది ప్రభుత్వ ప్రయత్నమని, ఈ దిశగా హెచ్సీఏ హెల్త్కేర్ నుంచి ఏ రకమైన సహాయ సహకారాలనైనా తీసుకునేందుకు సిద్ధమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నైపుణ్యంగల మానవ వనరులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఉన్న హైదరాబాద్ భవిష్యత్తులో అంతర్జాతీయ ఆరోగ్య సేవలకు ఒక చుక్కానిలా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.హైదరాబాద్ ఐటీ కారిడార్లోని సత్వా నాలెడ్జ్ పార్క్లో ఏర్పాటైన ఈ జీసీసీ అమెరికా, యూకేల్లోని 192 ఆసుపత్రులు, 2500కు పైచిలుకు ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించనుంది. నాలుగు అంతస్తుల్లో సుమారు 4.28 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జీసీసీపై సుమారు రూ.650 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎమిలీ డంకన్ తెలిపారు. ప్రస్తుతం 1200 మంది ఉద్యోగులు ఇక్కడి నుంచి ఐటీ, ఫైనాన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఏడాదిలోపు ఉద్యోగుల సంఖ్యను మూడు వేలకు చేరుస్తామని తెలిపారు.హెచ్సీఏ హెల్త్కేర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అతుల్ కపూర్ మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు, నాణ్యమైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ జీసీసీ ఉపయోగపడుతుందన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, లైఫ్సైన్సెస్ బోర్డు ఛైర్మన్ శక్తి నాగప్పన్, హెచ్సీఏ హెల్త్ కేర్ ఉన్నతాధికారులు పలువురు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇదీ చదవండి: భారత్కు యూఏఈ వీసా నిలిపేసిందా? -
హెచ్-1బీ వీసా నిపుణులకు మైక్రోసాఫ్ట్ వేతనాలు ఇలా..
హెచ్-1బీ(H1-B) వీసా వార్షిక రుసుమును పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో బహుళజాతి కంపెనీల్లోని ఉద్యోగుల వేతనాలపై చర్చ సాగుతోంది. యూఎస్ కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లోని తమ ఉద్యోగులకు దేశీయంగా ఎంత వేతనాలు ఆఫర్ చేస్తున్నాయనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్(Microsoft) కంపెనీ హెచ్1-బీ వీసాపై ఉన్న తమ నిపుణులకు యూఎస్లో ఎంత పే చేస్తుందో వివరాలు వెల్లడయ్యాయి. అయితే వీటిని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదని గమనించాలి.జాబ్ రోల్ప్రదేశంవేతనం(యూఎస్ డాలర్లలో)సాఫ్ట్ వేర్ ఇంజినీర్రెడ్మండ్2,84,000 వరకుప్రొడక్ట్ మేనేజర్రెడ్మండ్2,50,000 వరకుడేటా సైంటిస్ట్రెడ్మండ్1,21,200 - 1,60,000డేటా సైంటిస్ట్మౌంటైన్ వ్యూ2,74,500 వరకు ఈ వేతనాలు బేస్ శాలరీలు మాత్రమే. కంపెనీ అందించే అలవెన్స్లు వీటికి అదనం.ఉద్యోగి స్థాయిని అనుసరించి వేతన వివరాలు ఇలా..వేతన స్థాయిసగటు వేతనం (USD)గరిష్ట వేతనం (USD)స్థాయి I1,28,8441,77,200స్థాయి II1,53,0102,77,980స్థాయి III1,82,5753,13,500స్థాయి IV2,17,6193,14,000నాన్-ఓఈఎస్1,71,0812,25,294 ఇదీ చదవండి: ట్రయినీల నియామకానికి వ్యతిరేకంగా సమ్మె -
తెలంగాణలో కోకాకోలా కొత్త ప్లాంట్
తెలంగాణ పారిశ్రామిక విభాగంలో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా సాఫ్ట్డ్రింక్స్ తయారీ దిగ్గజం కోకాకోలా(Coca Cola) చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కంపెనీ రూ.2,398 కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో అత్యాధునిక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని చెప్పారు. ఇటీవల పారిశ్రామిక ప్రోత్సాహంపై జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈమేరకు ఆయన ప్రకటన చేశారు.పారిశ్రామిక వృద్ధి ద్వారా అధిక విలువ కలిగిన పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్రంలో ఉపాధిని సృష్టించడానికి తెలంగాణ(Telangana) ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రయత్నంలో ఈ చర్య భాగమన్నారు. అనేక పండ్ల ఆధారిత పానీయాల్లో కీలకంగా ఉన్న మామిడి, నారింజకు స్థిరమైన డిమాండ్ అందించడం ద్వారా కోకాకోలా ఫెసిలిటీ స్థానిక రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ సమావేశంలో ఆమోదించిన మరో రెండు ప్రధాన ప్రతిపాదనలతో పాటు కోకాకోలా భవిష్యత్తులో రూ.3,745 కోట్ల పెట్టుబడిని సూచిస్తుందని, రాష్ట్రంలో 1,500 కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మంత్రి హైలైట్ చేశారు.ఈ సమావేశంలో భాగంగా తోషిబా ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తెలంగాణలో గ్యాస్-ఇన్సులేటెడ్ స్విచ్ గేర్, బుషింగ్స్ కోసం రూ.562 కోట్ల ప్లాంట్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, రక్షణ రంగాలను హైలైట్ చేస్తూ హైదరాబాద్లోని మహేశ్వరంలో రూ.785 కోట్ల విలువైన డ్రోన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని జేఎస్డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ యోచిస్తున్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ట్రయినీల నియామకానికి వ్యతిరేకంగా సమ్మె -
ట్రయినీల నియామకానికి వ్యతిరేకంగా సమ్మె
భారతదేశంలోని ప్రముఖ టైర్ తయారీ కంపెనీల్లో ఒకటైన ఎంఆర్ఎఫ్ లిమిటెడ్లో ట్రయినీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై-తిరువొట్టియూర్ ప్లాంట్లో కొంతమంది కార్మికులు సమ్మె ప్రారంభించారు. ఈ విషయాన్ని బీఎస్ఈకి అందించిన ఫైలింగ్లో ఎంఆర్ఎఫ్ ధ్రువీకరించింది. ట్రయినీలు, ఉద్యోగులకు వార్షిక బీమా ప్రీమియం ముందస్తు చెల్లింపుపై ఫిర్యాదులను పేర్కొంటూ, ప్రభుత్వ పథకాల కింద ట్రెయినీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కార్మికులు సమ్మెకు దిగారు. అయితే ఈ సమ్మె చట్టవిరుద్ధం అని కంపెనీ స్పష్టం చేసింది.ఈ సమ్మెతో వార్షిక వైద్య బీమా ప్రీమియం చెల్లింపు, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ (ఎన్ఏపీఎస్), ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ (పీఎంఐఎస్), నాన్ ముధల్వన్ పథకంతో సహా వివిధ ప్రభుత్వ పథకాల కింద ట్రయినీలను నియమించుకోవాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం చుట్టూ వివాదం ఏర్పడినట్లయింది. తిరువొట్టియూర్ ప్లాంట్లో కార్యకలాపాలు సమ్మెలో భాగం కాని కార్మికుల సహాయంతో పాక్షికంగా కొనసాగుతున్నాయని ఎంఆర్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. వీలైనంత త్వరగా ప్లాంట్లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పెట్టుబడిదారులు, వాటాదారులకు హామీ ఇచ్చింది.సమ్మె వివరాలుఎంఆర్ఎఫ్ విస్తృత తయారీ సముదాయంలో భాగమైన విమ్కో నగర్ యూనిట్లో సుమారు 800 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వార్షిక వైద్య బీమా ప్రీమియం కోసం చెల్లింపు నిర్మాణంపై కార్మికులు ప్రధానంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా ట్రయినీలను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని స్థానంలో సాధారణ కార్మికులను భర్తీ చేయవచ్చని వారు వాదిస్తున్నారు. సీఐటీయూ(సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్) రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సౌందరరాజన్ మాట్లాడుతూ..సమ్మె కారణంగా గత వారం రోజులుగా విమ్కో నగర్ యూనిట్లో ఉత్పత్తి ప్రభావితమైందన్నారు. ప్రీమియం చెల్లింపు సమస్యపై కార్మికులు పరిష్కారం కోరుతున్నారని తెలిపారు. కంపెనీ అనుసరిస్తున్న విధానం అన్యాయమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. బంగారం ధరలు యూటర్న్! -
అవుట్డోర్ ఫొటోగ్రఫీ కోసం కొత్త ఉత్పత్తులు
స్మార్ట్ఫోన్ల నుంచి పోటీ ఉన్నా ప్రఖ్యాత జపనీస్ కెమెరా తయారీ కంపెనీ ఓఎం సిస్టమ్(గతంలో ఒలింపస్) భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అవుట్డోర్ ఫొటోగ్రాఫర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త శ్రేణి ఉత్పత్తులను ప్రారంభించే ప్రణాళికలతో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారత్లో ఫొటోగ్రఫీ మార్కెట్లో తిరిగి తన వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. కంపెనీ తీసుకురాబోయే కెమెరా ఉత్పత్తులు ముఖ్యంగా వన్యప్రాణుల ఫొటోలు, ప్రయాణాలు, కంటెంట్ క్రియేటర్లకు ఎంతో తోడ్పడుతాయని స్పష్టం చేసింది.ఓఎం సిస్టమ్ వేగంగా విస్తరిస్తున్న బహిరంగ ఫొటోగ్రఫీ విభాగంపై దృష్టి సారించింది. అందులో భాగంగా తాజాగా ఓఎం-5 మార్క్ 2 మిర్రర్ లెస్ కెమెరా, ఎం-జుయికో డిజిటల్ ఈడీ 50-200ఎంఎం F2.8 IS PRO లెన్స్తోపాటు, అవుట్డోర్ ఫొటోగ్రఫీ కోసం ప్రీమియం ఇమేజింగ్ ఉత్పత్తులను అందించే దిశగా పని చేస్తున్నట్లు తెలిపింది. ఏపీఏసీ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ హండూ ఒక ప్రకటనలో మాట్లాడుతూ..‘వినియోగదారులకు ఫొటోగ్రఫీ పట్ల లోతైన అభిరుచి ఏర్పడుతున్నప్పడు సహజంగా స్మార్ట్ఫోన్లలోని పరిమితులను అధిగమించి కెమెరాలను ఎంచుకుంటారు. ఓఎం సిస్టమ్ అధునాతన ఆప్టిక్స్, క్లాస్-లీడింగ్ స్టెబిలైజేషన్, వినూత్న డిజైన్లతో ఉత్పత్తులను అందిస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: బిగ్రిలీఫ్.. బంగారం ధరలు యూటర్న్! -
ర్యాపిడోలో స్విగ్గీ వాటా విక్రయం
బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో(Rapido)లోగల వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు ఆన్డిమాండ్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) తాజాగా వెల్లడించింది. ర్యాపిడో మాతృ సంస్థ రోపెన్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్లో వాటా విక్రయం ద్వారా దాదాపు రూ.2,400 కోట్లు అందుకోనున్నట్లు తెలియజేసింది. ర్యాపిడో సైతం ఫుడ్ డెలివరీ(Food Delivery) సేవలలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వాటా విక్రయాన్ని చేపట్టనున్నట్లు జులైలోనే స్విగ్గీ సంకేతమిచ్చింది.దీనిలో భాగంగా 10 ఈక్విటీ షేర్లతోపాటు.. తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే 1,63,990 సిరీస్ డి ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఎంఐహెచ్ ఇన్వెస్ట్మెంట్స్ వన్ బీవీ(నెదర్లాండ్స్)కు విక్రయించనుంది. వీటి విలువ రూ. 1,968 కోట్లుకాగా.. వాటాదారులకు లబ్దిని చేకూర్చేబాటలో పెట్టుబడులను ప్రోజస్ గ్రూప్ సంస్థ ఎంఐహెచ్కు విక్రయించనున్నట్లు స్విగ్గీ తెలియజేసింది. ఈ బాటలో ర్యాపిడోకు చెందిన తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే 35,958 సిరీస్ డి ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను సెబీ వద్ద రిజిస్టరైన వెస్ట్బ్రిడ్జి సంస్థ సేతు ఏఐఎఫ్ ట్రస్ట్కు అమ్మివేయనున్నట్లు పేర్కొంది. ఈ డీల్ విలువ రూ. 431.5 కోట్లుగా వెల్లడించింది. వెరసి ర్యాపిడోలో వాటాను రూ. 2,400 కోట్లకు విక్రయించనుంది. కాగా.. ఇన్స్టామార్ట్ బ్రాండుతో నిర్వహిస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ విభాగాన్ని పరోక్ష సొంత అనుబంధ సంస్థ స్విగ్గీ ఇన్స్టామార్ట్ ప్రయివేట్ లిమిటెడ్కు బదిలీ చేయనున్నట్లు వివరించింది. స్లంప్ సేల్ పద్ధతిన విక్రయాన్ని చేపట్టనున్నట్లు తెలియజేసింది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఎస్బీఐ అంచనా -
ఈ ఏడాది మరో 5 జినోమిక్స్
హెల్త్కేర్ రంగ హైదరాబాద్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరో 5 జినోమిక్స్ ఇన్స్టిట్యూట్స్ను ఏర్పాటు చేయనుంది. ప్రధానంగా తూర్పు, ఉత్తర, మధ్య భారతంలోని టైర్–2, 3 పట్టణాలలో వీటికి తెరతీయనున్నట్లు వెల్లడించింది. తద్వారా జినోమిక్స్ను ప్రధాన క్లినికల్ కేర్తో సమ్మిళితం చేయనున్నట్లు తెలియజేసింది. రానున్న మార్చి31లోగా ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, ఒడిషాలోని భువనేశ్వర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్, ఉత్తరప్రదేశ్లోని లక్నోతోపాటు అస్సామ్లోని గౌహతిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ పిడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అనుపమ్ సిబాల్ పేర్కొన్నారు.ప్రస్తుతం దేశీయంగా 12 అపోలో జినోమిక్స్ ఇన్స్టిట్యూట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో హైదరాబాద్సహా.. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ ఉన్నట్లు వెల్లడించారు. వివిధ వ్యాధులు, వీటి పరిస్థితులను అర్థం చేసుకోవడంలో జినోమిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా సమీకృత జినోమిక్ సర్వీసులను సమకూర్చుతున్నట్లు తెలియజేశారు. తద్వారా వ్యాధుల నిర్ధారణలో కచ్చితత్వం, రోగుల వ్యక్తిగత చికిత్సా ప్రణాళికలో భద్రత, మార్గదర్శకత్వం తదితరాలను అందిస్తున్నట్లు వివరించారు. పునరుత్పత్తి సంబంధిత జినోమిక్స్, అంకాలజీ, అరుదైన జెనెటిక్ వ్యాధులలో జినోమిక్స్ ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నట్లు అనుపమ్ పేర్కొన్నారు. రోగులకు జెనెటిక్ టెస్టింగ్, కౌన్సిలింగ్, వ్యక్తిగత చికిత్స తదితరాలలో సమీకృత సేవలు సమకూర్చుతున్నట్లు తెలియజేశారు. అపోలో జినోమిక్స్ ఇన్స్టిట్యూట్స్ 11,000 జినోమిక్ కన్సల్టేషన్స్ మైలురాయిని చేరినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఎస్బీఐ అంచనా -
సీఆర్పీఎఫ్కు రైఫిల్స్ సరఫరా
కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్పీఎఫ్కు రెండు వందల సీఎస్ఆర్ 338 స్నైపర్ రైఫిళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును ఐకామ్-కారకాల్ దక్కించుకుంది. వీటిని హైదరాబాద్లోని ప్లాంటులో తయారు చేయనుంది. దేశీయంగా తొలిసారిగా ఉత్పత్తి చేసిన ఈ రైఫిల్ను ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో అందించనుంది.భారత్–యూఏఈ రక్షణ రంగ సహకారానికి సంబంధించి ఈ తరహా చిన్న ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ఒక కీలక పరిణామం అని కారకల్ సీఈవో హమద్ అలమెరి తెలిపారు. దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న తమ దీర్ఘకాలిక వ్యూహానికి ఈ కాంట్రాక్టు దోహదపడుతుందని ఐకామ్ టెలీ డైరెక్టర్ సుమంత్ పాతూరు వివరించారు.చిన్న ఆయుధాల తయారీ సాంకేతికత కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్తో మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్కి ఒప్పందం ఉంది. ఇరు సంస్థలు కలిసి ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్లో అధునాతన చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాయి. ఇక్కడి నుంచి కారకాల్ వివిధ ఆయుధాలను ఎగుమతి కూడా చేయనుంది.ఇదీ చదవండి: ‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’ -
రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్
న్యూఢిల్లీ: నాలుగో విడత వరల్డ్ ఫుడ్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సెపె్టంబర్ 25న (రేపు) ప్రారంభించనున్నారు. దేశీయంగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్గా భారత్ను తీర్చిదిద్దడం లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్ను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధాని దిమిత్రీ ప్యాట్రిòÙవ్తో పాటు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గోనున్నారు. న్యూజిలాండ్, సౌదీ అరేబియా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 21 దేశాలు పాల్గొంటున్నాయి. 2023లో నిర్వహించిన ఈవెంట్లో రూ. 33,000 కోట్ల విలువ చేసే అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయి. 2024లో ప్రధానంగా టెక్నాలజీ బదలాయింపు ఒప్పందాలపై దృష్టి పెట్టారు. గత ఎడిషన్ల దన్నుతో ఈసారి మరింత భారీగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు పాశ్వాన్ తెలిపారు. ప్రాసెస్డ్ ఆహారం వల్ల స్థూలకాయం, ఇతరత్రా అనారోగ్యాలు వస్తాయనే అపోహలను పారద్రోలేందుకు ఉద్దేశించిన బుక్లెట్ను ఆవిష్కరించారు. -
గోవా నుంచి జార్జియా వరకు: ఎక్కువమంది సెర్చ్ చేసిన బీచ్లు
పర్యాటకులు ఎక్కువగా.. బీచ్లను సందర్శించడానికి ఇష్టపడుతుంటారు. ఈ ఏడాది కూడా చాలామంది గోవా బీచ్ మొదలు.. లంకావి ఆజ్యూర్ వాటర్స్, కాప్రి తీరప్రాంతాల వరకు దేశీయ, అంతర్జాతీయ బీచ్లపైనే ఎక్కువ ఆసక్తి చూపించారని ఎయిర్బీఎన్బీ వెల్లడించింది.మన దేశంలో ఎక్కువమంది పర్యాటకులు సెర్చ్ చేసిన ప్రదేశాలలో.. గోవా అగ్రస్థానంలో నిలిచింది. కొంతమంది పర్యాటకులు మాత్రం.. నిశ్శబ్ద తీరప్రాంత గ్రామాలు, చేతివృత్తుల అనుభవాలు, క్లాసిక్ బీచ్ల కోసం వెతికారు. గోవా కాకున్నా భారతదేశంలో ఇతర బీచ్ల కోసం వెతికేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం సెర్చ్ చేసిన జాబితాలో ఒడిశాలోని పూరి ముందు వరుసలో నిలిచింది. తీరప్రాంత సౌందర్యం కోసం పుదుచ్చేరిని ఎంపిక చేసుకుంటున్నారు. -
జియో పేమెంట్స్ బ్యాంక్ 'సేవింగ్స్ ప్రో': 6.5 శాతం వడ్డీ!
జియో పేమెంట్స్ బ్యాంక్ ‘సేవింగ్స్ ప్రో’ (Savings Pro) పేరుతో కొత్త సేవింగ్స్ ఖాతాను తీసుకొచ్చింది. ఇందులో మిగులు నిల్వలపై 6.5 శాతం వరకు వడ్డీ రాబడి పొందొచ్చని ప్రకటించింది. ఇందుకోసం కస్టమర్లు నిర్దేశిత మొత్తాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఇది కనీసం రూ.5,000 లేదా అంతకుమించి ఉండొచ్చు. ఖాతాలో మొత్తం బ్యాలన్స్ కస్టమర్లు ఎంపిక చేసిన నిర్ణీత మొత్తం మించినప్పుడు, అదనంగా ఉన్న నిధులు ఓవర్నైట్ ఫండ్స్లో పెట్టుబడులుగా మళ్లుతాయి. ఇలా ఒక ఖాతాదారుడు ఒక రోజులో గరిష్టంగా రూ.1.5 లక్షలను ఓవర్నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ (Invest) చేసుకోవచ్చు.అవసరమైనప్పుడు ఈ పెట్టుబడుల నుంచి 90 శాతాన్ని వెంటనే వెనక్కి తీసుకోవచ్చు. కాకపోతే ఇలా తక్షణం తీసుకునే మొత్తం రూ.50,000గా ఉంటుంది. మిగిలిన మొత్తం 1–2 రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని జియో ఫైనాన్స్ యాప్ నుంచి సులభంగా చేసుకోవచ్చు. జియో పేమెంట్స్ బ్యాంక్ (Jio Payments Bank) ప్రస్తుత ఖాతాదారులు సైతం సేవింగ్స్ ప్రో ఖాతాకు అప్గ్రేడ్ కావొచ్చని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. ఇందులో ఎలాంటి ఎగ్జిట్ లోడ్, ఇతర చార్జీల్లేవని స్పష్టం చేసింది. -
రెండు అమెరికా కంపెనీల నిర్ణయం: సీఈఓలుగా ఇండియన్స్
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని.. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ (H-1B) వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ, ఫీజును లక్ష డాలర్లకు పెంచింది. ఈ తరుణంలోనే రెండు ప్రధాన అమెరికన్ కంపెనీలు తమ సీఈఓలు(CEO)గా భారతీయుల పేర్లను ప్రకటించాయి.అమెరికా టెలికాం దిగ్గజం టీ-మొబైల్ (T-Mobile).. సీఈఓగా 'శ్రీని గోపాలన్' పేరును ప్రకటించింది. ప్రస్తుతం టీ-మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీని.. నవంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఐఐఎం అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి.గోపాలన్.. హిందూస్తాన్ యూనిలీవర్లో మేనేజ్మెంట్ ట్రైనీగా జీవితాన్ని ప్రారంభించి, ఆ తరువాత భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, క్యాపిటల్ వన్, డ్యూష్ టెలికామ్లలో సీనియర్ పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఈయన పనిచేస్తున్న కంపెనీకే (టీ-మొబైల్) సీఈఓగా ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఇదీ చదవండి: ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరికచికాగోకు చెందిన పానీయాల దిగ్గజం.. మోల్సన్ కూర్స్ (Molson Coors) కూడా తన సీఈఓగా రాహుల్ గోయల్ను నియమించింది. అక్టోబర్ 1నుంచి ఈయన కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. కంపెనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గోయల్ అన్నారు. ఈయన మైసూర్లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. భారతదేశంలోని కూర్స్, మోల్సన్ బ్రాండ్లలో మాత్రమే కాకుండా ఈయన కొన్నాళ్లు యూకేలో కూడా పనిచేశారు. -
‘విప్రో క్యాంపస్ నుంచి వాహనాలు అనుమతించండి’
బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ(Traffic Crisis)ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా స్థానికంగా ఉన్న విప్రో క్యాంపస్ ద్వారా పరిమిత వాహనాల రాకపోకలను అనుమతించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ(Azim Premji)ని కోరారు. ఈ చర్య వల్ల రహదారి ప్రక్కనే ఉన్న ప్రాంతాల్లో రద్దీ దాదాపు 30 శాతం తగ్గుతుందని అధికారులు తెలిపారు.ముఖ్యంగా కార్యాలయాల ప్రారంభ, ముగింపు సమయాల్లో దేశవ్యాప్తంగా నగరాల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. బెంగళూరులో అయితే ట్రాఫిక్ సమస్య మరీ ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ట్రాఫిక్ను నియంత్రించేందుకు స్థానికంగా ఉన్న విప్రో క్యాంపస్ నుంచి వాహనాలను అనుమతించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కంపెనీ వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్జీకి లేఖ రాశారు. ప్రజా వాహనాలను విప్రో క్యాంపస్ నుంచి అనుమతిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు గణనీయమైన ఉపశమనం కలుగుతుందని అందులో పేర్కొన్నారు.ఇటీవల లాజిస్టిక్స్ టెక్నాలజీ సంస్థ బ్లాక్ బక్ సహ వ్యవస్థాపకుడు తమ బెల్లందూర్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్లాక్ బక్ సీఈఓ రాజేష్ యాబాజీ సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం..‘రోడ్లపై ట్రాఫిక్, గుంతలు, దుమ్ముతో చాలా ఇబ్బంది కలుగుతుంది. దాంతో బెల్లందూర్లోని కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యల తరువాత నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ అడ్డంకుల గురించి ఆందోళనలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ‘రెయిన్ ఫీజు’పై జీఎస్టీ -
వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ‘రెయిన్ ఫీజు’పై జీఎస్టీ
జోరువానలో బయటకు వెళ్లలేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. జొమాటో, స్విగ్గీ.. వంటి ఆన్లైన్ ఫుడ్ అగ్రిగేటర్ల ఆర్డుర్లు ఇకపై మరింత భారం కాబోతున్నాయి. వర్షం వస్తున్నప్పుడు ఆర్డర్ బుక్ చేస్తే దానిపై రెయిన్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఆ రెయిన్ ఫీజుపై జీఎస్టీ సైతం విధిస్తున్నారు. ఈమేరకు సామాజిక మాధ్యమాల్లో వెలసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది.గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) కౌన్సిల్ తన ఇటీవలి సంస్కరణల్లో స్థానిక ఈ-కామర్స్ డెలివరీ సేవలను సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కిందకు తీసుకువచ్చింది. దాంతో ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ప్లాట్పామ్లు వసూలు చేసే ఫీజులు ప్రభావితం అయ్యాయి. డెలివరీ ఫీజుపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. సవరించిన రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి.సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ప్రకారం.. ‘జీఎస్టీ క్రమబద్ధీకరణ తర్వాత వర్షం కురిపించే ఇంద్ర దేవుడు కూడా జీఎస్టీ పరిధిలోకి వచ్చాడు. నేను చేసిన ఓ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్పై రూ.25 రెయిన్ ఫీజు వసూలు చేస్తూ.. దానిపై 18 శాతం జీఎస్టీ..రూ.4.5 విధించారు. తర్వాత సన్లైట్ కన్వినెయెన్స్ ఫీజు, ఆక్సీజన్ మెయింటనెన్స్ ఫీజు..మనం తీసుకునే శ్వాసపై కూడా ట్యాక్స్ వేస్తారేమో!’ అని అశిష్గుప్తా అనే వ్యక్తి రాసుకొచ్చారు. ఇదికాస్తా వైరల్గా మారింది. దాంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.After historic GST reforms, even Lord Indra has been brought under the tax net.Now when it rains, you get ₹25 Rain Fee + 18% GST = ₹29.50 😂Next up:👉Sunlight Convenience Fee 🌞👉Oxygen Maintenance Charge 💨👉GST on Breathing, Pay as you inhale pic.twitter.com/JdtHfr715G— Ashish Gupta (@AshishGupta325) September 22, 2025ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..నెటిజన్ల స్పందన..1. తర్వాత వారు స్మైలింగ్ ట్యాక్స్ విధిస్తారు.2. డెలివరీ బాయ్స్ అందుకే వర్షంలోనూ యాప్స్ స్విచ్ఆఫ్ చేయడం లేదు. ఇలాంటి సందర్భంలో సర్వీస్ చేస్తే వారికి డబ్బు వస్తుంది కదా.3. రూ.25 ఫీజు తీసుకుంటున్నా డెలివరీ భద్రంగా చేస్తున్నారా? అని కామెంట్ రాశారు. -
‘గ్రీన్’ ఎనర్జీలో 1.5 లక్షల కోట్లు ఆదా
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు, సేవల పన్ను(GST) సంస్కరణలు పునరుత్పాదక ఇంధన(renewable energy) రంగంలో భారీ పొదుపునకు తెరతీయనున్నట్లు మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు. దీంతో 2030కల్లా రెనెవబుల్ ఎనర్జీ రంగంలో రూ.1.5 లక్షల కోట్లవరకూ ఆదాకానున్నట్లు అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు ఇది నవరాత్రి కానుకగా జీఎస్టీ సంస్కరణల అమలు తొలి రోజు నూతన, పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి పేర్కొన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోకూడిన జీఎస్టీ కౌన్సిల్ పన్ను రేట్ల తగ్గింపునకు నిర్ణయించడంతో 2030కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న భారత్ భారీ లక్ష్యానికి మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. సీఐఐ ఇక్కడ నిర్వహించిన 6వ అంతర్జాతీయ ఇంధన సదస్సు సందర్భంగా విలేకరులతో మంత్రి పలు అంశాలపై మాట్లాడారు. చౌకగా రూఫ్టాప్ సోలార్ ప్రధానంగా నవరాత్రి తొలిరోజు రెనెవబుల్స్ పరికరాలపై జీఎస్టీ రేట్లు తగ్గించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు జోషీ చెప్పారు. రెనెవబుల్ పరికరాలపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి దిగివచి్చనట్లు వెల్లడించారు. దీంతో ఇన్వెస్టర్లకు 2030కల్లా రూ. లక్ష కోట్ల నుంచి 1.5 లక్షల కోట్లవరకూ ఆదాకానున్నట్లు తెలియజేశారు. 2030కల్లా భారత్ 300 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ప్రస్తావించారు. దీనిలో భాగంగా 2–3 శాతం వ్యయాలు ఆదా అయినప్పటికీ రూ. 1–1.5 లక్షల కోట్లమేర పెట్టుబడులలో పొదుపునకు వీలుంటుందని వివరించారు. పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా 3 కేడబ్ల్యూ సిస్టమ్ రూఫ్టాప్ సోలార్ రూ. 9,000–10,500మేర చౌక కానున్నట్లు వెల్లడించారు. పీఎం కుసుమ్లో భాగంగా 10 లక్షల సోలార్ పంప్ల ద్వారా రైతులకు రూ. 1,750 కోట్లమేర ఆదాకానున్నట్లు అంచనా వేశారు.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు -
హైదరాబాద్లో వ్యాపార విస్తరణ.. కొత్త కేంద్రం ప్రారంభం
ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన సీడీకే, హైదరాబాద్లోని తమ కార్యాలయానికి అదనంగా 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ఉత్తర అమెరికాలో తమ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి అవసరమైన నైపుణ్యం, సాంకేతికతపై పెట్టుబడి పెట్టడానికి సంస్థకు ఉన్న నిబద్ధతను నొక్కి చెబుతోంది.మాదాపూర్లోని రహేజా మైండ్స్పేస్లో ఉన్న ఈ కేంద్రం, ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు వినియోగదారులకు మరింత సేవలను అందించనుంది. ఇది ఉత్తర అమెరికాలోని R&D, ఇన్నోవేషన్ బృందాలతో కలిసి పనిచేస్తూ.. సమగ్ర విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అత్యాధునిక కార్యాలయం ఉద్యోగుల మధ్య సహకారం, సృజనాత్మకత, శ్రేయస్సును పెంపొందించే విధంగా రూపొందించారు. ఇందులో ఓపెన్ వర్క్స్పేస్లు, అత్యాధునిక సమావేశ గదులు, వినోద ప్రాంతాలు ఉన్నాయి. తద్వారా భారత్ అపారమైన ప్రతిభకు, నిరంతర ఆవిష్కరణలకు ఒక శక్తి కేంద్రమని సీడీకే మరోసారి స్పష్టం చేసింది. -
1.4 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్..
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) దేశవ్యాప్తంగా 1.4 కోట్లకు పైగా ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఇవన్నీ చనిపోయినవారికి సంబంధించిన ఆధార్ నంబర్లు. గుర్తింపు మోసాన్ని నిరోధించడానికి, ప్రభుత్వ ప్రయోజనాలు సరైన చేతుల్లోకి వెళ్లేలా చూడటానికి గత ఏడాది ప్రారంభించిన క్లీన్ అప్ డ్రైవ్ కింద ఈ ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది.సంక్షేమ పథకాల విశ్వసనీయతను కాపాడటానికి, దుర్వినియోగాన్ని నివారించడానికి మృతుల ఆధార్ నంబర్లను (Aadhaar) డీయాక్టివేట్ చేయడం చాలా అవసరమని యూఐడీఏఐ సీఈవో భువనేష్ కుమార్ అన్నారు. నకిలీ క్లెయిమ్లు లేదా గుర్తింపు మోసం ద్వారా ప్రభుత్వ నిధులు స్వాహా కాకుండా ఇది నిర్ధారిస్తుందన్నారు.డిసెంబర్ నాటికి 2 కోట్ల ఆధార్ నంబర్లుఆధార్ క్లీనప్ డ్రైవ్ను 2024 మధ్యలో ప్రారంభించారు. ఇది నిరంతర ప్రక్రియ. వచ్చే డిసెంబర్ నాటికి 2 కోట్ల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని యూఐడీఏఐ లక్ష్యంగా పెట్టుకుందని మరో సీనియర్ అధికారి తెలిపారు. ఆధార్ ప్రక్షాళన కార్యక్రమం కీలకమైనప్పటికీ, సవాళ్లతో నిండి ఉందని, మరణ నమోదుకు ఆధార్ తప్పనిసరి కాకపోవడం అతిపెద్ద అడ్డంకులలో ఒకటి ఆ అధికారి పేర్కొన్నారు.మరణాల డేటాను యూఐడీఏఐ పలు మార్గాల ద్వారా సంగ్రహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) ద్వారా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) రికార్డులను వినియోగించుకుంటోంది. కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, పుదుచ్చేరి, గోవా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి స్వతంత్రంగానూ డేటాను సేకరిస్తోంది. ఆధార్ డేటాను అప్డేట్ చేయడానికి బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అధికారులతో కలిసి పనిచేస్తోంది.ఇదీ చదవండి: జియో పేమెంట్స్ బ్యాంక్ వినూత్న అకౌంట్ -
పని మొదలు పెట్టాలంటే ఏడుపొస్తుంది!
పోటీ ప్రపంచంలో ముందుండాలని అందరూ కోరుకుంటారు. ఓ కంపెనీ తన పోటీ సంస్థకంటే మెరుగ్గా పని చేయాలని కోరుకుంటుంది. అందులో భాగంగా ఉద్యోగులకు ఇస్తున్న లక్ష్యాలను, ఒత్తిడిని పెంచుతుంది. అయితే ప్రస్తుత రోజుల్లో కంపెనీలు ఉద్యోగులను తగ్గిస్తూ, రెవెన్యూ మిగిల్చుకుంటూ ఉన్నవారిపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. దాంతో కొందరు ఉద్యోగులు భారీగా వేతనాలు పుచ్చుకుంటున్నా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈమేరకు ఓ ఉద్యోగి రెడ్డిట్(Reddit)లో చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది.పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నా వయసు 34. ఓ టాప్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్(Software Engineer)గా పని చేస్తున్నాను. సంవత్సరానికి రూ.40 లక్షల సంపాదిస్తున్నాను. కానీ వర్క్కు సంబంధించి మానసికంగా చాలా అలసిపోతున్నాను. పని మొదలు పెట్టాలంటే ఏడుపు వస్తుంది. కంపెనీలో పని ఒత్తడి అధికంగా ఉంది. కెరియర్లో కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకుంటున్నాను. సలహా ఇవ్వగలరు’ అని రాసుకొచ్చారు.దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..‘మీ కంపెనీ అందించిన సెలవులను ఉపయోగించి తాత్కాలిక విరామం తీసుకోండి’ అని ఒకరు తెలిపారు. ‘తిరిగి వేరే కంపెనీల్లో ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. నాన్ టెక్ రోల్స్, స్టార్టప్లు, లేదా ఫ్రీలాన్సింగ్ వైపు చూడవచ్చు’ అని మరొకరు చెప్పారు. మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ తీసుకోండంటూ ఇంకొకరు రిప్లై ఇచ్చారు. టెక్ నిపుణుల్లో పని ధోరణి మారుతుంది. కొంత మంది టెక్కీలు ఇప్పుడు కంపెనీలు ఆఫర్ చేస్తున్న వేతనాల కంటే వర్క్-లైఫ్ సమతుల్యత, మానసిక ఆరోగ్యాన్ని కోరుకుంటున్నారని స్పష్టం అవుతుంది.ఇదీ చదవండి: ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే.. -
అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..!
కొత్త హెచ్-1బి వీసాల (H-1B Visa) ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచిన వేళ మరో ప్రముఖ దేశం యూకే.. కీలక ప్రతిపాదనల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ ఐదు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న లేదా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న వ్యక్తులకు వీసా ఖర్చులను పూర్తిగా మాఫీ చేసే ఎంపికలను స్టార్మర్కు చెందిన "గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్" చర్చిస్తోంది.యూకే (UK)గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి 766 పౌండ్లు ఖర్చు అవుతుంది. నిపుణుల జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా ఇదే రుసుము వర్తిస్తుంది. దీంతో పాటు దరఖాస్తుదారులు 1,035 పౌండ్లు వార్షిక హెల్త్కేర్ సర్ ఛార్జ్ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.2020లో ప్రవేశపెట్టిన ఈ వీసా విధానం.. సైన్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మెడిసిన్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగాల్లో గుర్తింపు పొందినవారికి యూకేలో ఉండే అవకాశం కల్పిస్తుంది.అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వీసా ఫీజు నిర్ణయంతో బ్రిటన్లో సంస్కరణల కోసం ఒత్తిడులు ఊపందుకున్నట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపినట్లుగా నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత? -
‘నేనో మేనేజర్ని.. టీమ్ సభ్యులకంటే జీతం తక్కువ’
టెక్ కంపెనీ ఉద్యోగులకు ప్రస్తుత జాబ్ మార్కెట్ ప్రతికూలంగా మారుతోంది. ఇదే అదనుగా కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు పెంచడంలేదు. కొన్నిసార్లు పదోన్నతి ఇచ్చినా తక్కువ వేతనమే ఆఫర్ చేస్తున్నాయి. ఇటీవల రిపోర్టింగ్ మేనేజర్గా పదోన్నతి పొందిన ఓ టెక్ ఉద్యోగి వేతనం తన టీమ్ సభ్యుల కంటే తక్కువగా ఉందని ఆందోళన చెందాడు. వారి కంటే ఎంతో కష్టపడుతున్నా వేతనం మాత్రం పెంచడంలేదని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అదికాస్తా వైరల్గా మారింది.అంతర్జాతీయంగా టెక్ సంస్థల కస్టమర్లు పెద్దగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపకపోతుండడంతో కంపెనీలు కొత్తగా రిక్రూట్మెంట్ ఆపేస్తున్నాయి. దాంతో ఉన్నవారితోనే ప్రాజెక్ట్లను పూర్తి చేయాలని భావిస్తున్నాయి. ఇదే అదనుగా సంస్థలో అనుభవం ఉన్న ఉద్యోగులకు పదోన్నతులిస్తున్నా అందుకు సమానంగా వేతనాన్ని మాత్రం పెంచడం లేదు.రెడ్డిట్ పోస్ట్లోని వివరాల ప్రకారం..‘నేను ఇటీవల రిపోర్టింగ్ మేనేజర్గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్లో పని చేస్తున్నాను. నాతోపాటు 11 మంది జట్టులో ఉన్నాం. నా సహచరులకు సరాసరి రూ.15 లక్షల ప్యాకేజీ ఉంది. అందులో కొందరు రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు. కానీ నాకు రూ.9 లక్షల ప్యాకేజీ మాత్రమే. జట్టుకు మేనేజర్ స్థాయిలో ఉన్న నాకు సభ్యుల కంటే తక్కువ జీతం ఉంది. నేను వారాంతాల్లోనూ పని చేస్తున్నాను. దాదాపు ప్రతిరోజు అర్థరాత్రి వరకు వర్క్ చేస్తున్నాను. నా కంటే అధిక వేతనం పొందే సహోద్యోగులు సాయంత్రం 6 గంటలకు షట్డౌన్ చేస్తున్నారు. క్లిష్టమైన పనులను తప్పించుకుంటున్నారు. నా జీతం పెంచాలని పలుమార్లు హెచ్ఆర్కు మెయిళ్లు కూడా పంపాను. కానీ ఫలితం లేకపోయింది. భయట అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏం చేయాలో సూచించండి’ అంటూ సలహా కోరాడు.ఈ రెడ్డిట్ పోస్ట్పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీ నైపుణ్యాలు, మార్కెట్ విలువపై దృష్టి పెట్టండి. జీతంపై ఆందోళన వద్దు’ అని ఒకరు చెప్పారు. ‘మరింత ప్రయత్నం చేసి వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వండి’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘హెచ్ఆర్తో చర్చించేప్పుడు సహోద్యోగులతో ప్రత్యక్ష పోలికలు వద్దు’ అని మరొకరు తెలిపారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
టాక్స్ ఆడిట్ కేసులు... త్వరపడండి..!
టాక్స్–ఆడిట్ అవసరం లేని కేసులకు గడువు తేదీ 16.9.2025 తో ముగిసింది. ఆ ప్రహసనం ముగిసిన తరువాత అందరూ ఆడిట్ కేసుల మీద దృష్టి సారిస్తారు. ఒరిజినల్ గడువు తేది 30.9.2025. ముందు నుంచి ఇదే గడువు తేదీ. ఇప్పటి వరకు పొడగించలేదు. పొడిగించమని వినతులు వెళ్లాయి. కానీ కేంద్రం వైఖరి ఎలా ఉంటుందో చెప్పలేము. అటువంటి ఆశలు లేకుండా రంగంలోకి దూకుదాం.టాక్స్ ఆడిట్... అంటే? 44 AB సెక్షన్ ప్రకారం కొంత టర్నోవర్/వసూళ్లు దాటిన అస్సెసీలకు టాక్స్ ఆడిట్ వర్తిస్తుంది. వీరంతా సీఏగా ప్రాక్టీసు చేస్తున్న వారి దగ్గర తమ అకౌంట్లు అన్నింటినీ అడిట్ చేయించాలి. ఈ ఆడిట్లో అకౌంట్స్ బుక్స్ని వైరిఫై చేస్తారు. ఫైనాన్షియల్ ఆడిట్, కాస్ట్ ఆడిట్, స్టాక్ ఆడిట్... ఇలాంటివి కాకుండా కేవలం ఈ చట్టం ప్రకారం చేసేది టాక్స్ ఆడిట్.టాక్స్ ఆడిట్ ఉద్దేశం ఏమిటంటే... 🔹 సరైన, సరిపోయినన్ని అకౌంట్ బుక్స్ నిర్వహణ. 🔹 ఏవైనా తేడాలు, సర్దుబాట్లు, పొరపాట్లు మొదలైవని చెప్పడం 🔹 ఎన్నో మినహాయింపులు ఉన్నాయి. రాయితీలు ఉంటాయి. తగ్గింపులుంటాయి. ఉదాహరణకు ‘తరుగుదల’... ఇటువంటివి కరెక్ట్గా చూపించారా లేదా అనేది చెప్పాలి. 🔹 టీడీఎస్, టీసీఎస్ సరిగ్గా లెక్కించారా? లెక్కించిన దానిని చెల్లించారా? సరైన మొత్తం సకాలంలో చెల్లించారా? 🔹 పెనాల్టీలు, వడ్డీలు మొదలైనవి ఉన్నాయా? ఉంటే కట్టారా? 🔹 అకౌంటింగ్ పాలసీలు... అకౌంటింగ్ పద్దతులు... పద్దతి మారితే కారణం, ఎందుకు మారింది. వాటి విలువెంత? 🔹 కొన్ని అకౌంటింగ్ రేషియోలు... లాభ, నష్టాల శాతం, పెరుగుదల, వ్యత్యాసం ... ఇలా ఈ ఆడిట్ విశ్లేషణాత్మకంగా ఉంటుంది.లాభశాతంలో హెచ్చుతగ్గులకు వివరణ అడిగే అవకాశం ఉంది. డిపార్టుమెంటు వారు అరకొర సిబ్బందితో వారు చేయాల్సిన పనిని ఒక ఆడిట్ రూపంలో వృత్తి నిపుణులకు అంటగట్టారు. ఈ మేరకు బరువు, బాధ్యత వృత్తి నిపుణులదే. అందుకని ఈ ఆడిట్ని సీఏలు ఎంతో జాగ్రత్తగా పూర్తి చేసి సర్టిఫై చేస్తారు. అసెస్సీలు చట్టప్రకారం చేయాల్సిన పనులన్నీ... కాంప్లయన్స్ (COMPLIANCE) అయ్యాయా లేదా సీఏలు చెప్పాలి. క్లయింటు ఆర్థిక వ్యవహారాల్లో లాభ, నష్టాలు, ఆస్తి, అప్పులతో సహా తెలియజేసేది వాటిని విశ్లేషించేది.. ఇలా ఎన్నో విషయాల్లో ఈ పని చేశారా లేదా అని చెప్పే చెక్ లిస్ట్ తనిఖీ జాబితా.చేయాల్సిన పనులు, చేశారా లేదా అని తెలియజేసే పట్టిక. అకౌంటు బుక్స్ జాబితా, వ్యాపారం, వివరాలు, ఆస్తుల వివరణ, అప్పుల విశ్లేషణ, వ్యక్తిగత ఖర్చులు, క్యాపిటల్ ఖర్చులు ఎక్కడ చూపించారు. అన్నీ చట్ట ప్రకారం జరిగాయా లేదా? అని సీఏలు చేత చెక్ చేయించే ప్రక్రియ. కర్త, కర్మ అసెస్సీయే అయినా సంధానకర్త ఆడిటర్. టాక్స్ ఆడిటర్.గడువు తేదీలు రెండు ఈ నెలాఖరు లోపల టాక్స్ ఆడిట్ రిపోర్ట్ని అప్లోడ్ చేయాలి. ఇదొక గడువు తేది. దీని తర్వాత వచ్చే నెల అక్టోబర్ 31 లోపల రిటర్ను చేయవచ్చు. మిగతా వారందరిలా కాకుండా టాక్స్ ఆడిట్ వారికి వెసులుబాటు ఏమిటంటే ఆడిట్ రిపోర్ట్ ఈ నెలాఖరు లోపల వేస్తే ఆదాయపన్ను రిటర్ను వచ్చే నెలలోగా చేయవచ్చు. రెండూ ఒకసారి ఈ నెలలో వేసినా తప్పులేదు. ఆంక్షలూ లేవు. ఏది వేసి ఏది దాఖలు చేయకపోయినా మొత్తం ప్రక్రియ డిఫెక్టివ్ అయిపోతుంది. రిటర్ను వేయనట్లే.పెనాల్టీలు వడ్డీస్తారు అమ్మకాల మీద 0.5%. అరశాతం లేదా రూ.1.50 లక్షలు ఏది తక్కువ అయితే అది పెనాల్టీగా చెల్లించాలి. ఖర్చులను ఒప్పుకోకపోవచ్చు. అంటే పన్ను భారం పెరుగుతుంది. పన్ను పెరగడం వల్ల వడ్డీలు పడతాయి. రిటర్నులను డిఫెక్టివ్గా పరిగణిస్తారు. చట్టపరమైన చర్యలుంటాయి. నష్టాలను రాబోయే సంవత్సరంలో సర్దుబాటుకు ఒప్పుకోరు. ఎక్కువ స్క్రూటినీకి అవకాశం ఇచ్చి వారం అవుతాము. అడిట్కి, తనిఖీకి గురికావచ్చు. ముందు జాగ్రత్త వహించండి. ప్రకృతి వైపరీత్యాలు, మరణం, దీర్ఘకాలిక జబ్బు, లాకౌట్లు, స్ట్రయిక్ ఇలా విపత్కర పరిస్థితుల్లో మాత్రమే పెనాల్టీలు విధించరు. -
తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ 'శ్రీధర్ వెంబు' స్పందించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''విభజన సమయంలో అన్నీ వదిలి భారతదేశానికి ఎలా రావాల్సి వచ్చిందో.. సింధీ స్నేహితుల నుంచి నేను చాలా విషయాలను విన్నాను. వారు తమ జీవితాలను తిరిగి నిర్మించుకున్నారు. సింధీలు భారతదేశంలో బాగానే ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో.. హెచ్1బీ వీసాపై ఉన్న భారతీయుల వంతు వచ్చింది. చెప్పడానికి బాధగా ఉన్నప్పటికీ.. మన దేశానికి తిరిగి వచ్చేయండి. మీ జీవితాలను మళ్లీ పునర్నిర్మించుకోవడానికి ఐదేళ్ల కాలం పట్టవచ్చు. కానీ అది మిమ్మల్ని బలపరుస్తుంది. భయంతో జీవించవద్దు. ధైర్యంగా ముందుకు సాగండి. మీరు బాగానే ఉంటారు'' అని శ్రీధర్ వెంబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.I have heard so many accounts from Sindhi friends about how their families had to leave everything and come to India during partition. They rebuilt their lives and Sindhis have done well in India.I am sad to say this, but for Indians on an H1-B visa in America, this may be that…— Sridhar Vembu (@svembu) September 21, 2025శ్రీధర్ వెంబు పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ''వాస్తవాలు తెలియకుండా భయాన్ని వ్యాపింపజేస్తున్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలో ఉన్న వ్యక్తులకు కొత్త నియమాలు వర్తించవు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త నియమాలు కొత్త హెచ్1బీ దరఖాస్తుదారులకు మాత్రమే'' అని ఒక యూజర్ పేర్కొన్నారు. బెంగాలీలు, పంజాబీల నుంచి మీరు చాలా విషయాలను విని ఉండవచ్చు. కానీ వారు ఇప్పుడు ఉన్న స్థితికి చేరుకోవడానికి దాదాపు మూడు తరాలు పట్టింది. ఇది అంత సులభం కాదని ఇంకొకరు అన్నారు.ఇలాంటి సవాళ్లు అప్పుడప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వదేశానికి తిరిగి వచ్చి, జీవితాలను పునర్నిర్మించుకోవడానికి చాలా కృషి అవసరం. కానీ భారతదేశంలో అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ధైర్యం, పట్టుదలతో, అభివృద్ధి చెందవచ్చని.. మరో యూజర్ శ్రీధర్ వెంబు మాటలతో ఏకీభవించారు. -
‘లక్ష డాలర్ల’ అమెరికా కన్నా లక్షణమైన దేశాలు
అమెరికా తన వర్క్ వీసా విధానంలో విప్లవాత్మక మార్పును ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుండి కంపెనీలు ప్రతి హెచ్-1బి వీసా హోల్డర్కు వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు లక్ష డాలర్లు (రూ.88 లక్షలుపైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరి అమెరికా లాంటి వర్కింగ్కు అనువైన మరో ఐదు దేశాల్లో వర్కింగ్ వీసాల రిజిస్ట్రీషన్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. -
జీఎస్టీ తగ్గింపును కస్టమర్లకు బదలాయించండి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించడంపై దృష్టి పెట్టాలని దేశీ పరిశ్రమకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ సూచించారు. దీని వల్ల పరిశ్రమకు కూడా లబ్ధి చేకూరుతుందన్నారు. మరోవైపు, పరిశ్రమకు లావాదేవీల వ్యయాలను తగ్గించే దిశగా సమగ్ర రాష్ట్ర, నగర లాజిస్టిక్స్ ప్రణాళికలను ఆయన ఆవిష్కరించారు.ఎనిమిది రాష్ట్రాలవ్యాప్తంగా ఇవి అమలవుతాయి. ప్రస్తుత లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు, అంతరాలను గుర్తించడం, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను తగ్గించుకోవడానికి సంబంధించి మార్గదర్శ ప్రణాళికను రూపొందించేందుకు ఈ ప్రణాళిక తోడ్పడుతుంది. అటు వాణిజ్య చర్చల కోసం సెపె్టంబర్ 22న భారత అధికారిక బృందాన్ని తీసుకుని గోయల్ అమెరికా వెళ్లనున్నట్లు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
భారత టెక్ కంపెనీలపై ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాలకు సంబంధించి అమెరికా అదనంగా 1,00,000 డాలర్ల ఫీజు విధించడంపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనితో ఆన్షోర్ ప్రాజెక్టులకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఫలితంగా భారతీయ టెక్నాలజీ సర్వీస్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. అంతే గాకుండా దీని అమలుకు ఒకే ఒక్క రోజు గడువు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, ప్రొఫెషనల్స్, విద్యార్థుల విషయంలో అనిశ్చితి తలెత్తే ప్రమాదం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ, భారతీయ కంపెనీల కోసం హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న భారతీయులపైనా అమెరికా నిర్ణయం ప్రభావం పడుతుందని నాస్కామ్ వివరించింది. వీసా ఫీజులపై ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని, ఇలాంటి మార్పుల వల్ల అమెరికా నవకల్పనల వ్యవస్థపై, అలాగే ఉద్యోగాలపై కూడా ప్రభావాలు పడతాయని పేర్కొంది. వీటికి తగ్గట్లుగా సర్దుబాట్లు చేసుకునేందుకు క్లయింట్లతో కలిసి కంపెనీలు పని చేస్తాయని వివరించింది. ఈ స్థాయి మార్పులు చేసేటప్పుడు వ్యాపారవర్గాలు, వ్యక్తులు ప్రణాళిక వేసుకునేందుకు తగినంత సమయం ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ‘మేము ఎప్పటికప్పుడు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీని వల్ల తలెత్తే ప్రభావాల గురించి పరిశ్రమవర్గాలతో సమాలోచనలు జరుపుతున్నాం‘ అని నాస్కామ్ తెలిపింది. మరోవైపు, ప్రస్తుతం హెచ్1బీ వీసాలు కలిగి ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగులను అత్యవసరంగా అమెరికాకు తిప్పి పంపేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కంపెనీలకు నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ సూచించారు. కృత్రిమ మేథ, ఇతరత్రా టెక్నాలజీలను అభివృద్ధి చేయడం వేగవంతమవుతున్న తరుణంలో ఇలాంటి చర్యల వల్ల వ్యవస్థకు విఘాతం కలుగుతుందని తెలిపారు. నవకల్పనలకు నిపుణులు కీలకం.. కొత్త ఆవిష్కరణలను కనుగొనేందుకు, అమెరికా దీటుగా పోటీపడేందుకు, ఆ దేశ ఎకానమీ అభివృద్ధి చెందేందుకు ప్రతిభావంతులు అవసరమని నాస్కామ్ తెలిపింది. ఏఐతో పాటు ఇతరత్రా సాంకేతికతల్లో అనేక మార్పులు జరుగుతున్న తరుణంలో వారి సేవలు కీలకంగా మారాయని వివరించింది. ప్రస్తుతం హెచ్1బీ వీసా ఫీజులు కంపెనీ స్థాయిని బట్టి సుమారు 2,000–5,000 డాలర్ల వరకు ఉన్నాయి. కొత్తగా విధించిన 1,00,000 డాలర్లు దీనికి అదనం. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడే పేరుతో తలపెట్టిన చేపట్టిన ఈ చర్య, కీలకమైన ప్రతిభావంతుల లభ్యతను దెబ్బతీస్తుందని కార్పొరేట్ న్యాయవాది సీఆర్ సుకుమార్ వ్యాఖ్యానించారు. అమెరికా నిర్ణయాన్ని వీసా కన్సల్టెంట్, ఐటీ వ్యాపారవేత్త దిలీప్ కుమార్ నూనే ’షాకింగ్’గా అభివర్ణించారు. అమెరికాలో సర్వీసులు అందిస్తున్న చాలా మటుకు ఐటీ కంపెనీలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. దీనితో ప్రతిభావంతులను అమెరికాకు రప్పించడం కష్టతరం అవుతుంది కాబట్టి అమెరికన్ కంపెనీలపైనా ప్రభావం పడుతుందన్నారు. అమెరికాలో నియామకాలు పెంచుకుంటున్నాం .. భారత్ కేంద్రంగా పని చేసే కంపెనీలు అమెరికాలో స్థానికుల నియామకాలను పెంచుకోవడం ద్వారా కొన్నాళ్లుగా వీసాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్న సంగతిని నాస్కామ్ గుర్తు చేసింది. ఈ కంపెనీలు హెచ్1బీ ప్రాసెస్లకు సంబంధించి అన్ని నిబంధనలను పాటిస్తున్నాయని, నిర్దేశిత జీతభత్యాలు చెల్లిస్తున్నాయని, స్థానిక ఎకానమీ వృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని, కొత్త ఆవిష్కరణల కోసం విద్యాసంస్థలు, స్టార్టప్లతో కలిసి పని చేస్తున్నాయని పేర్కొంది. ఈ కంపెనీల్లో హెచ్1బీ వీసాలపై పని చేస్తున్న వర్కర్లతో అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదని స్పష్టం చేసింది. ఐటీ కంపెనీల వ్యయాలు పెరుగుతాయ్హెచ్1బీ వీసాల ఫీజు పెంపుతో భారతీయ ఐటీ కంపెనీలకు వ్యయాలపరంగా సవాళ్లు గణనీయంగా పెరుగుతాయి. సమీప భవిష్యత్తులో దీని పరిణామాలు కొంత తీవ్రంగా ఉండొచ్చు. దేశీ ఐటీ కంపెనీలు అమెరికాలో నియామకాలను మరింతగా పెంచుకునేందుకు, గ్లోబల్ డెలివరీ వ్యవస్థను పటి ష్టం చేసుకునేందుకు ఇది దారి తీయొచ్చు. తద్వా రా సవాలును అవకాశంగా మల్చుకోవడానికి ఆస్కారం ఉంది. – బీవీఆర్ మోహన్ రెడ్డి, సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ఆఫ్షోరింగ్ వేగవంతంహెచ్1బీ వీసా ఫీజుల పెంపుతో కొత్త దరఖాస్తులపై ప్రభావం పడుతుంది. దీని ఎఫె క్ట్తో ఓవైపు ప్రతిభావంతులు దొరక్క, మరోవైపు వ్యయాలు పెరిగిపోవడం వల్ల రాబోయే రోజుల్లో కార్యకలాపాల ఆఫ్షోరింగ్ మరింత వేగవంతం అవుతుంది. హెచ్1బీ వీసాలపై భారత ఐటీ కంపెనీలు ఆధారపడటం కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గిపోయింది. డేటా ప్రకారం అమెరికన్ టెక్ దిగ్గజాలే వీటిని ఎక్కువగా తీసుకుంటున్నాయి. కొత్త దరఖాస్తులకు మాత్రమే కొత్త నిబంధన వర్తిస్తుంది కాబట్టి ప్రస్తుతానికైతే దీని ప్రభావం పరిమితమే. అమెరికాలో చౌకగా పని చేసి పెట్టేలా ఉద్యోగులను పంపించేందుకు కంపెనీలు ఈ వీసాలను ఉపయోగించుకుంటున్నాయన్న అభిప్రాయాలన్నీ అపోహలే. హెచ్1బీ వీసాలను వినియోగించుకునే టాప్ 20 కంపెనీలు సగటున 1,00,000 డాలర్ల పైగానే జీతభత్యాలు ఇస్తున్నాయి. – మోహన్దాస్ పాయ్, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వోఅమెరికాకు నష్టం, భారత్కు లాభం హెచ్1బీ వీసా ఫీజులను భారీగా పెంచడం వల్ల అమెరికాలో కొత్త ఆవిష్కరణలపై దెబ్బ పడుతుంది. అయితే, దీని వల్ల భారత్లో నవకల్పనలకు ఊతం లభిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, పుణె, గుర్గావ్ లాంటి నగరాలకు కొత్త ప్రయోగశాలలు, పేటెంట్లు, అంకురాలు వెల్లువెత్తుతాయి. తద్వారా హెచ్1బీ ఫీజులను పెంచడమనేది అమెరికాకు నష్టదాయకం, భారత్కు లాభదాయకంగా మారుతుంది. దీని వల్ల దేశంలోనే అత్యుత్తమ డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు భారతదేశ వృద్ధి గాధలో, వికసిత భారత్ లక్ష్య సాధనలో పాలుపంచుకునే అవకాశం లభించినట్లవుతుంది. – అమితాబ్ కాంత్ , నీతి ఆయోగ్ మాజీ సీఈవో -
ఫ్లిప్కార్ట్ సరికొత్త ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్.. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయన్సెస్తో సహా 26 ఉత్పత్తి విభాగాలలో ఒక వినూత్న ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది. వినియోగదారులకు తక్షణ విలువ, మెరుగైన అప్గ్రేడ్లను అందించడానికి దీన్ని రూపొందించారు. ఇందుకోసం సరికొత్త ఏఐ-ఆధారిత 10-దశల డయాగ్నొస్టిక్ టూల్ ఏర్పాటు చేస్తోంది. ఇది రియల్ టైమ్ , పారదర్శక ఉత్పత్తి విలువలను నిమిషాల్లో అందిస్తుంది.ప్రోగ్రామ్ ముఖ్యాంశాలుక్రాస్-కేటగిరీ ఎక్స్ఛేంజ్: కస్టమర్లు పాత ఫోన్లు, ల్యాప్ టాప్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్లు వంటి వస్తువులను విస్తృత శ్రేణి కొత్త ఉత్పత్తుల కోసం ఎక్స్ఛేంజ్ చేయవచ్చు.రియల్ టైమ్ ఏఐ డయాగ్నస్టిక్స్: పాత ఉత్పత్తుల వేగవంతమైన, ఖచ్చితమైన, పారదర్శక విలువను నిర్ధారిస్తుంది.స్థిరమైన వాణిజ్యం: పనికిరాని గృహ ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల పునర్వినియోగం, రీసైక్లింగ్ ను ప్రోత్సహిస్తుంది. వాటిని "ఇంట్లో కరెన్సీ"గా మారుస్తుంది.టైర్ 2 & 3 సిటీ ఫోకస్: ప్రీమియం ఉత్పత్తులకు అందుబాటును పెంచడం, చిన్న పట్టణాల్లోనూ ప్రీమియం ఉత్పత్తులు కొనే వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది.పండుగ సీజన్ బూస్ట్: రాబోయే షాపింగ్ సీజన్లో కస్టమర్ విలువను పెంచడానికి సమయం.స్థిరమైన వినియోగాన్ని పెంచే తెలివైన, సాంకేతికతతో కూడిన రీకామర్స్ వ్యవస్థను నిర్మించడానికి ఫ్లిప్కార్ట్ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని ఆ సంస్థ సీనియర్ డైరెక్టర్ & రీ-కామర్స్ బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ పేర్కొన్నారు. -
ప్రీమియం హోటల్స్ కోసం ఇక ఓయో ‘చెకిన్’
ప్రీమియం హోటళ్లు, హోమ్స్టే బ్రాండ్లను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఓయో మాతృ సంస్థ ప్రిజం ప్రత్యేకంగా ’చెకిన్’ పేరిట కొత్త విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రీమియం హోటళ్లు, సండే హోటల్స్, క్లబ్హౌస్, పాలెట్, చెక్మైగెస్ట్, డ్యాన్సెంటర్, బెల్విల్లా తదితర బ్రాండ్స్ ఉంటాయి.ఓయో ఏ విధంగానైతే బడ్జెట్ ట్రావెల్కి పర్యాయపదంగా మారిందో చెకిన్ కూడా అదే విధంగా ప్రీమియం హోటళ్లు, హోమ్స్కి గ్లోబల్ బ్రాండ్గా ఉంటుందని ప్రిజం వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తెలిపారు. ప్రాథమికంగా చెకిన్ భారత్లో అందుబాటులో ఉంటుందని, దశలవారీగా రాబోయే నెలల్లో అంతర్జాతీయంగా కూడా ప్రవేశపెడతామని పేర్కొన్నారు.తమ అధ్యయనం ప్రకారం 55 శాతం మంది మరింత నాణ్యమైన, లగ్జరీ అనుభూతిని అందించే హోటళ్లకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైందని ప్రిజం తెలిపింది. -
ఒక్కసారిగా యూఎస్కు విమాన ఛార్జీలు పెంపు
భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా యూఎస్కు రాకపోకలు సాగించే విమాన సర్వీసుల టికెట్ ధరలను ఆయా విమానయాన కంపెనీలు ఉన్నట్టుండి పెంచినట్లు తెలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్.. వంటి కంపెనీలు యూఎస్ నుంచి హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులను వెంటనే అమెరికా రావాలని అడ్వైజరీలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి యూఎస్కు సర్వీసులు నడుపుతున్న విమానయాన కంపెనీలు టికెట్ ధరలను పెంచినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి.యూఎస్ వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగిన కంపెనీ ఉద్యోగులను ఆయా సంస్థలు సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరాయి. దాంతో భారత్ వంటి దేశాల్లో అమెరికా వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. రేపటిలోపు ట్రంప్ విధించిన గడువు ముగుస్తుండడంతో ఉద్యోగులు అత్యవసరంగా యూఎస్కు పయణమవుతున్నారు. ఇదే అదనుగా విమానయాన కంపెనీలు టికెట్ ఫేర్ను పెంచుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్కు రావాలని మైక్రోసాఫ్ట్తోపాటు ఇతర టెక్ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’ -
కంపెనీలు పెట్టుబడులతో ముందుకు రావాలి
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు తాజా పెట్టుబడుల క్రమం ఎంతో అవసరమని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అన్నారు. కనుక తాజా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాలని కోరారు. చాలా కాలంగా ప్రైవేటు మూలధన వ్యయాలు నీరసంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విధంగా పిలుపునివ్వడం గమనార్హం. పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కంపెనీలు బలమైన బ్యాలన్స్ షీట్లతో మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. ఇందుకు ఆర్థిక శాఖ మద్దతు కూడా ఉంటుందని భరోసా ఇచ్చారు.ప్రభుత్వం తన వంతుగా మూలధన వ్యయాలు పెంచడాన్ని, విధానపరమైన సంస్కరణలను గుర్తు చేశారు. నాబ్ఫిడ్ వార్షిక సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. పెట్టుబడులతో కంపెనీలు, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనం పొందుతాయని, విశ్వాసం తిరిగి నెలకొంటుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అనిశి్చతుల్లోనూ చెక్కుచెదరకుండా ఉన్నట్టు చెప్పారు. జూన్ క్వార్టర్లో ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయిలో జీడీపీ వృద్ధి 7.8 శాతం నమోదు కావడాన్ని ప్రస్తావించారు.ఇదీ చదవండి: ‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’ -
‘ఎక్కడున్నా రేపటిలోపు యూఎస్ రావాలి’
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సర్వీసులు అందిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్.. వంటి కంపెనీలు యూఎస్ నుంచి వెళ్లి విదేశాల్లో సర్వీసులు అందిస్తున్న తమ ఉద్యోగులకు అడ్వైజరీలు జారీ చేస్తున్నాయి. యూఎస్ వెలుపల ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాలు కలిగిన తమ ఉద్యోగులను సెప్టెంబర్ 21, 2025లోపు అమెరికాకు తిరిగి రావాలని కోరుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణమని తెలుస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై 1,00,000 అమెరికా డాలర్ల రుసుము విధిస్తూ ఇటీవల కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అమెరికాలోనే ఉద్యోగులు తమ పనిని కొనసాగించాలని కోరుతూ, వెంటనే యూఎస్కు రావాలని మైక్రోసాఫ్ట్తోపాటు ఇతర టెక్ కంపెనీలు తమ సూచిస్తున్నాయి. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపిస్తున్నాయి.ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు చెబుతున్నారు. సాధారణంగా హెచ్1-బీ వీసాలు లాటరీపై ఆధారపడతుంది. అందుకు నామినల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా జారీ అయితే మాత్రం వార్షిక రుసుము పే చేయాలి. ఈ ఫీజునే ట్రంప్ ప్రభుత్వం 1 లక్ష డాలర్లకు పెంచింది. ఇప్పటివరకు ఇది 4,000 డాలర్ల వరకు ఉండేది. ఈ రుసుమును సాధారణంగా కంపెనీలే భరిస్తాయి. దీని పెంపు కంపెనీలకు భారం కానుంది.అమెరికా స్థానికులకు ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ఈ చర్యలు తోడ్పడుతాయని వైట్ హౌస్ పేర్కొంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్తోపాటు ఇతర టెక్ కంపెనీలు కూడా H-1B వీసా నిబంధనలలో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఉద్యోగులకు ఈ సూచనలు జారీ చేస్తున్నాయి. హెచ్-1బీ వీసాపై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో జుకర్బర్గ్ నేతృత్వంలోని టెక్ సంస్థ మెటా సైతం తమ ఉద్యోగులకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ వ్యవహారంపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ..‘అభివృద్ధి చెందుతున్న విధాన మార్పును అంచనా వేస్తున్నందున ఇది ముందు జాగ్రత్త చర్యగా భావించాలి. మా ఉద్యోగుల భద్రతను నిర్ధారించడం అత్యంత ప్రాధాన్యతగా ఉంది’ అన్నారు.ట్రంప్ తీసుకొచ్చిన ఈ నిబంధన సెప్టెంబరు 21 నుంచి వర్తించనుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి హెచ్-1బీ వీసాదారులు ఎవరైనా అమెరికాలోకి ప్రవేశించాలన్నా.. లేదా ప్రవేశించే ప్రయత్నాల్లో భాగంగా ఈ వీసాకు దరఖాస్తు చేసుకున్నా లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
ఇంటర్న్లకు రూ.12.5 లక్షలు వరకు స్టైపెండ్
భారతదేశ ఉద్యోగ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో సేవలందిస్తున్న సంస్థలు ఇంటర్న్లకు భారీ స్టైపెండ్లు ఆఫర్ చేస్తున్నాయి. ఆమ్స్ట్రడమ్ ఆధారిత ఐఎంసీ ట్రేడింగ్ బీవీ తన ఇంటర్న్లకు నెలకు రూ.12.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఇది 2024లో కంపెనీ చెల్లించిన స్టైపెండ్ల కంటే మూడు రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. క్వాడే కంపెనీ తన ఇంటర్న్ల స్టెపెండ్ను నెలకు రూ.7.5 లక్షలకు పెంచింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 50% పెరుగుదలను సూచిస్తుంది.ప్రతిభ కలిగిన వారికి కంపెనీలు ఎంతైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారం ద్వారా తెలుస్తుంది. ఇటీవల కాలంలో మెటా ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటుకు ప్రపంచంలోని టెక్ నిపుణుల కోసం కంపెనీ సెర్చింగ్ ప్రారంభించింది. అందుకు దాదాపు రూ.880 కోట్ల వరకు కూడా ప్రవేశ ప్యాకేజీని అందించేందుకు సిద్ధపడింది. ప్రస్తుతం మెరుగైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులకు ఐఎంసీ ట్రేడింగ్ బీవీ, క్వాడే కంపెనీలు ఇంటర్న్లకు భారీగా స్టైపెండ్ ఇచ్చేందుకు సన్నద్ధం అయ్యాయి. వీటి బాటలోనే మరిన్ని కంపెనీలు నడిచే అవకాశం ఉంది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీకి వ్యాల్యూ యాడ్ చేసే వారికి ఎప్పటికీ జాబ్ మార్కెట్లో గిరాకీ ఉంటుందని దీని ద్వారా తెలుస్తుంది.ముఖ్యంగా క్వాంట్ పరిశోధకులు, ట్రేడింగ్ ఇంజినీర్లు, గణితం, కంప్యూటర్ సైన్స్, డేటా మోడలింగ్లో మెరుగైన నైపుణ్యాలు ఉన్న అల్గోరిథమిక్ డెవలపర్లకు, ఏఐ ప్రాంప్టింగ్ ఇంజినీరింగ్, జెన్ఏఐ ట్రెయినింగ్ ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఎంసీ ట్రేడింగ్ బీవీ, క్వాడే కంపెనీల ఇంటర్న్షిప్లో చాలా మంది ఐఐటీ, బిట్స్ పిలానీ, ఎంఐటీ, ఈటీహెచ్ జ్యూరిచ్ వంటి గ్లోబల్ విశ్వవిద్యాలయాల నుంచి హాజరయ్యారు. ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ చేతికి పవర్ ప్లాంట్
పూర్తి అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ 150 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా టిడోంగ్ పవర్ జనరేషన్లో 100 శాతం వాటా కొనుగోలుకి స్టాట్క్రాఫ్ట్ ఐహెచ్ హోల్డింగ్స్ ఏఎస్తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.సుమారు రూ. 1,728 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాలోగల టిడాండ్ వేలీలో 150 మెగావాట్ల సామర్థ్యంతో టిడోంగ్ పవర్ జల విద్యుత్ ప్లాంటును నిర్మిస్తున్నట్లు తెలియజేసింది. 2026 అక్టోబర్లో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్తో 22 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. మే నెల నుంచి అక్టోబర్వరకూ 75 మెగావాట్లను కిలోవాట్కు రూ. 5.57 టారిఫ్లో ఒప్పందం కుదిరినట్లు తెలియజేసింది. మిగిలిన 75 మెగావాట్లను మర్చంట్ మార్కెట్లో విక్రయించనున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: సహకార బ్యాంకుల్లోనూ ఆధార్ చెల్లింపుల సేవలు -
ఏటా రూ.120 కోట్ల పెట్టుబడులు
ఫ్యాషన్ దుస్తులు తదితర ఉత్పత్తుల విక్రయ సంస్థ లైఫ్స్టయిల్ ఇంటర్నేషనల్ తమ కార్యకలాపాల విస్తరణపై ఏటా రూ. 100–120 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 14 స్టోర్స్ ప్రారంభిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 125 స్టోర్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో 14 ఉన్నాయి. శుక్రవారమిక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ను ప్రారంభించిన సందర్భంగా కంపెనీ సీఈవో దేవ్ అయ్యర్ ఈ విషయాలు తెలిపారు.తమ ఆదాయాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 11–12 శాతం ఉంటుందని ఆయన చెప్పారు. జీఎస్టీలో మార్పులతో ధరలపరంగా 6–8 శాతం మేర ప్రభావం ఉంటుందని అయ్యర్ చెప్పారు. జీఎస్టీ సంస్కరణలతో దేశీయంగా వినియోగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, డిజిటల్, కొత్త స్టోర్స్, ప్రైవేట్ బ్రాండ్లు మొదలైన అయిదు అంశాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యాపారంలో సుమారు ఆరు శాతంగా ఉన్న డిజిటల్ వాటాను వచ్చే ఏడాది, రెండేళ్లలో 10–12 శాతానికి పెంచుకోనున్నామని అయ్యర్ చెప్పారు.గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 5,000 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈసారి రెండంకెల స్థాయి వృద్ధి అంచనా వేస్తున్నామన్నారు. ప్రధానంగా మెట్రోల్లో స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నామని, వచ్చే ఏడాది 10–12 స్టోర్స్ ప్రారంభించనున్నామని అయ్యర్ వివరించారు. పండుగ సీజన్ సందర్భంగా లైఫ్స్టయిల్ ఎక్స్క్లూజివ్ దసరా కలెక్షన్ను సినీ నటి పూజా హెగ్డే ఆవిష్కరించారు.ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్! -
దేశీయంగానే కీలక ఖనిజాల అన్వేషణ
న్యూఢిల్లీ: రాగి సహా కీలక ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేలా, దేశీయంగానే మరింతగా ఉత్పత్తి చేయడంపై ప్రభుత్వ రంగ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హిందుస్తాన్ కాపర్ (హెచ్సీఎల్), ఆయిల్ ఇండియా (ఆయిల్) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా కీలక ఖనిజాల వెలికితీత, ఉత్పత్తికి ఇది ఉపయోగపడనుంది. క్రూడాయిల్ వెలికితీత, ఉత్పత్తి, రవాణాలో ఆయిల్ ఇండియాకు అపార అనుభవం ఉంది. అటు గనుల శాఖలో భాగమైన హెచ్సీఎల్కి కాపర్ తదితర ఉత్పత్తుల మైనింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్లో అనుభవం ఉంది. రాగికి సంబంధించి దేశీయంగా మైనింగ్ లీజులన్నీ కంపెనీకే ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ ఇండియా రైట్స్లాంటి ప్రభుత్వ రంగ సంస్థల తరహాలోనే క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్ బ్లాక్ల కోసం బిడ్డింగ్ చేయనున్నట్లు హిందుస్తాన్ కాపర్ ఇప్పటికే ప్రకటించింది. దేశీ, విదేశీ మార్కెట్లలో కీలక ఖనిజాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు కంపెనీతో, ఇంజనీరింగ్ సంస్థ రైట్స్ ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణహితమైన ఇంధనాల విషయంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ప్రాథమికంగా రూ. 16,300 కోట్లతో జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్ను ప్రకటించింది. ఏడేళ్లలో దీనిపై మొత్తం రూ. 34,300 కోట్లు వెచి్చంచనుంది. రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్లాంటివి, స్వచ్ఛ ఇంధన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు కీలకమైన ముడి వనరులుగా ఉపయోగపడతాయి. -
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్: 10 నిమిషాల్లోనే డెలివరీ
ఈ ఏడాది ఫ్లిప్కార్ట్ తన ప్రముఖ ఉత్సవ సేల్ “ది బిగ్ బిలియన్ డేస్” (TBBD) 2025ను భారతదేశంలోనే వేగవంతమైన షాపింగ్ ఫెస్టివల్గా మార్చుతోంది. దీని ముఖ్య ఆకర్షణగా “ఫ్లిప్కార్ట్ మినిట్స్” పరిచయం అవుతోంది. కేవలం 10 నిమిషాల్లో డోర్డెలివరీ అందించనుంది.దేశవ్యాప్తంగా 19 నగరాలు, 3,000 పిన్కోడ్ల పరిధిలో ఫ్లిప్కార్ట్ మినిట్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైళ్లు, ఎలక్ట్రానిక్స్, కిరాణా, పండ్లు, కూరగాయలు, బ్యూటీ, పర్సనల్ కేర్ వంటి విభాగాల్లో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్, ప్రత్యేక రివార్డులు లభిస్తాయి. తాజా కాయగూరలు రూ.9 నుంచి ప్రారంభమవుతాయి. దేశీ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.స్వీట్స్, హాంపర్స్, లిప్స్టిక్స్ రూ.49 నుంచి, డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్లపై 80% వరకు తగ్గింపులు ఉండబోతున్నాయి. గౌర్మెట్ బ్రాండ్లపై 50% వరకు డిస్కౌంట్లు లభిస్తాయి."ఈ సంవత్సరం మేము వేగం, విలువ, విశ్వసనీయతతో బిగ్ బిలియన్ డేస్ను మరింత వినూత్నంగా మార్చుతున్నాం. మెట్రో నగరాలతో పాటు చిన్న పట్టణాల్లోనూ వినియోగదారులకు వేగంగా సేవలు అందించడమే మా లక్ష్యం” అని ఫ్లిప్కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రీ అన్నారు. -
ఆన్లైన్ ఫుడ్.. ఊహించని షాక్
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ ఫుడ్ లవర్స్కు ఊహించని షాక్ ఇది. జొమాటో, స్విగ్గీ యూజర్లపై అదనపు భారం పడనుంది. ఫుడ్ డెలివరీ చార్జీలు అమాంతం పెరగనున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ మార్పులతో ఫుడ్ డెలివరీలు మరింత భారం కానున్నాయి. జొమాటో, స్విగ్గీ వంటి యాప్లు డెలివరీ ఫీజులపై అదనంగా 18% జీఎస్టీ వర్తింపజేయాల్సి ఉంటుంది.ఫుడ్ ఆర్డర్లపై ప్రస్తుతం ఉన్న 5% జీఎస్టీ కంటే డెలివరీ చార్జీలే అధికం. స్థానిక డెలివరీ సేవలు సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కిందికి వస్తాయని జీఎస్టీ కౌన్సిల్ ధ్రువీకరించింది. పండగల వేళ ఇప్పటికే ఆయా కంపెనీలు ప్లాట్ఫామ్ ఫీజు పెంచి వినియోగదారులపై మోయలేని భారం మోపగా, ఇప్పుడు జీఎస్టీ బాదుడు మొదలుకానుంది. జీఎస్టీ భారాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేస్తారు.రెండు రకాల వసూళ్లు...ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు రెండు రకాల జీఎస్టీ వర్తిస్తుంది. ఒకటి ఆర్డర్ చేసే ఆహారంపై ఉండగా, రెండోది డెలివరీ చార్జీలపై అమలులోకి రానుంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్పై ఉన్న 5 శాతం జీఎస్టీ జనవరి 2022 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్పై ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ, డెలివరీ ఫీజుపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. స్విగ్గీ, జొమాటో వంటి కంపెనీలు ఒకప్పుడు డెలివరీ చార్జీలే వసూలు చేసేవి. కొన్నాళ్లకు ప్లాట్ ఫామ్ ఫీజు విధానాన్ని తెచ్చాయి. మొదట రూ.2 చొప్పున ప్రారంభించి ఇప్పుడు రూ.15 వరకు పెంచాయి.స్విగ్గీ రూ.15.. జొమాటో రూ.12.50..స్విగ్గీలో ఇప్పుడు డెలివరీ చార్జీలు రూ.15 కాగా, జొమాటోలో రూ.12.50గా ఉంది. మ్యాజిక్ పిన్లో రూ.10గా ఉంది. డెలివరీ చార్జీలపై ఇక కొత్తగా విధించే 18 శాతం జీఎస్టీతో జొమాటో వినియోగదారులపై అదనంగా ఒక్కో ఆర్డర్కు రూ.2 చెల్లించాల్సి వస్తుంది. స్విగ్గీలో రూ.2.60 చొప్పున భారం పడనుంది. అదనంగా రూ.5 పైన చెల్లించాల్సి రావచ్చని తెలుస్తోంది.కేంద్రం స్పష్టత...కేంద్ర ఆర్థక మంత్రిత్వ శాఖ ఈ విషయంపై మంగళవారం కీలక ప్రకటన చేసింది. డెలివరీ సర్వీసుల జీఎస్టీ విధింపు అంశంపై క్లారిటీ ఇచ్చింది. లోకల్ డెలివరీలపై జీఎస్టీ 18 శాతంగా ఉంటుందని తెలిపింది. రిజిస్టర్డ్ పర్సన్ నేరుగా లోకల్ డెలివరీ చేస్తే సదరు వ్యక్తి 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక లోకల్ డెలివరీలను మరో వ్యక్తి (రిజిస్టర్ కాని వ్యక్తి) సరఫరా చేస్తే జీఎస్టీ 18 శాతం ఈసీఓ చెల్లించాల్సి ఉంటుంది. ఈసీఓ తరపున రిజిస్టర్డ్ పర్సన్ సరఫరా చేస్తే జీఎస్టీని లోకల్ డెలివరీ సర్వీసెస్ చెల్లించాల్సి ఉంటుంది. -
సీబీఐ చార్జ్షీట్పై స్పందించిన అనిల్ అంబానీ కంపెనీలు
రూ.2,796 కోట్ల బ్యాంకు మోసం కేసులో అనిల్ అంబానీ, ఇతరులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఛార్జిషీట్ తమ కార్యకలాపాలపై లేదా ఆర్థిక పనితీరుపై ఎటువంటి ప్రభావం చూపదని రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిపింది. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (ఆర్సీఎఫ్ఎల్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్హెచ్ఎఫ్ఎల్), యెస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్ కుటుంబానికి సంబంధించిన సంస్థల మధ్య మోసపూరిత లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ ఇటీవల చార్జిషీట్ దాఖలు చేసింది.2022, 2023లో సుప్రీంకోర్టు తీర్పుల తరువాత, ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా నేతృత్వంలోని స్వతంత్ర రుణదాత ఆధారిత ప్రక్రియల ద్వారా ఆర్సీఎఫ్ఎల్, ఆర్హెచ్ఎఫ్ఎల్కు సంబంధించిన సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయని రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండూ వేర్వేరు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ లో తెలిపాయి.ఆర్సీఎఫ్ఎల్, ఆర్హెచ్ఎఫ్ఎల్ బోర్డుల్లో అనిల్ అంబానీ ఎప్పుడూ ఉండలేదని, మూడున్నరేళ్ల క్రితమే రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డుల నుంచి వైదొలిగారని కంపెనీలు తెలిపాయి. తాము ప్రత్యేక లిస్టెడ్ సంస్థలుగా ఉన్నామని, సీబీఐ చర్య తమ నిర్వహణ, పాలన లేదా ఆర్థిక స్థిరత్వంపై ఎటువంటి ప్రభావం చూపదని పేర్కొన్నాయి. -
హైదరాబాద్కు గోదావరి నీరు.. రూ.2,085 కోట్ల కాంట్రాక్టు దక్కించుకున్న రాంకీ
హైదరాబాద్: దేశంలో ప్రముఖ ఇన్ఫ్రా సంస్థలలో ఒకటైన రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) నుండి రూ.2,085 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను దక్కించుకుంది. ఈ ఒప్పందం గోదావరి తాగునీటి సరఫరా పథకం - ఫేజ్ II & ఫేజ్ IIIకి సంబంధించినది. ఇందులో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి సహాయపడటానికి ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లను గోదావరి నీటితో నింపనున్నారు.హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) కింద రాంకీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన మల్లన్నసాగర్ వాటర్ సప్లై లిమిటెడ్ ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండేళ్లలో నిర్మాణాన్ని చేపడుతుంది. పూర్తయిన తరువాత 10 సంవత్సరాల పాటు నిర్వహణను చూసుకుంటుంది."ఈ ప్రాజెక్ట్ పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా స్థిరమైన నీటి మౌలిక సదుపాయాలను నిర్మించాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీతో భాగస్వామ్యం కావడం మాకు గర్వంగా ఉంది" అని రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యంచర్ల రత్నాకర నాగరాజా పేర్కొన్నారు. -
ఇక షాంపూ, సబ్బులు చౌక!
జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తూ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులపై కొత్త రేట్లను తగ్గించాయి. షాంపూలు, సబ్బులు, టూత్పేస్ట్లు, టూత్బ్రష్లు, రేజర్లు, బేబీ డైపర్లు తదితర ఉత్పత్తులకు సంబంధించి కొత్త రేట్లను ప్రకటించాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానుండడం తెలిసిందే. దీంతో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఇమామీ, హెచ్యూఎల్ కొత్త ధరలను తమ పోర్టల్పై ప్రకటించాయి.పీఅండ్జీ విక్స్ యాక్షన్ 500 అడ్వాన్స్డ్ స్ట్రిప్ ధర రూ.5 తగ్గింది. ఇన్హేలర్ ధర సైతం ఇదే స్థాయిలో దిగొచ్చింది. వీటిపై 12 శాతం జీఎస్టీ 5 శాతానికి తగ్గింది. షాంపూలపై జీఎస్టీ 18% నుంచి 5 శాతానికి దిగొచ్చింది. డైపర్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గగా, బేబీ వైప్స్పై 18% నుంచి 5 శాతానికి తగ్గింది. దీంతో పీఅండ్జీ తన ఉత్పత్తులపై ఇంతే మేర రేట్లు తగ్గించింది. -
మహారాష్ట్రలో అత్యంత ధనవంతులు.. అంబానీ తరువాత ఎవరంటే?
భారతదేశంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నరాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఒకటి. అత్యంత ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులకు ఈ రాష్ట్రం నిలయం. 2025లో సంపద విషయంలో మహారాష్ట్ర ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. మొత్తం మీద ఇండియాలోని బిలియనీర్లు ఇప్పుడు 1.1 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది 2019తో పోలిస్తే.. రెట్టింపు కంటే ఎక్కువ. ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా వంటి దిగ్గజాలు ఈ రాష్ట్రానికి చెందినవారే. ఈ కథనంలో మహారాష్ట్రలోని కుబేరులు ఎవరో తెలుసుకుందాం.➤ముఖేష్ అంబానీ: 119.5 బిలియన్ డాలర్లు➤దిలీప్ సంఘ్వీ & ఫ్యామిలీ: 32.4 బిలియన్ డాలర్లు➤రాధాకిషన్ దమాని & ఫ్యామిలీ: 31.5 బిలియన్ డాలర్లు➤కుమార్ మంగళం బిర్లా: 24.8 బిలియన్ డాలర్లు➤సైరస్ పూనవాలా: 24.5 బిలియన్ డాలర్లు➤బజాజ్ ఫ్యామిలీ: 23.4 బిలియన్ డాలర్లు➤షాపూర్ మిస్త్రీ & ఫ్యామిలీ: 20.4 మిలియన్ డాలర్లు -
పోస్టాఫీసుల్లో బీఎస్ఎన్ఎల్ సిమ్లు అమ్మకం
బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఈమేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీని పెంచేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పింది.ఈ ఒప్పందంలో భాగంగా 1.65 లక్షల పోస్టాఫీసుల ద్వారా సిమ్ కార్డు అమ్మకాలు చేయనున్నారు. ఇప్పటికే అస్సాంలో విజయవంతంగా పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించారు. దాంతో ఈ సర్వీసులు భారతదేశం అంతటా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పోస్టాఫీసు బ్రాంచీ బీఎస్ఎన్ఎల్ సిమ్లు అమ్మడంతోపాటు, రీఛార్జ్ సేవల కోసం పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్)గా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించి పోస్టల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.ఇదీ చదవండి: అదానీ స్టాక్స్లో ర్యాలీ.. -
ఐఫోన్ 17 కోసం తన్నుకున్న కస్టమర్లు (వీడియో)
యాపిల్ ఐఫోన్ 17 సేల్స్ ఈ రోజు (సెప్టెంబర్ 19) నుంచి మొదలయ్యాయి. ఉదయం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని యాపిల్ స్టోర్లో కొత్త ఐఫోన్ 17 వేరియంట్లను కొనుగోలు చేయడానికి ఔత్సాహికులు బారులు తీరారు. ఈ సమయంలో ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. గుమికూడిన జనంలో యువకులు కొట్టుకోవడం కనిపిస్తుంది. వారిని వారించడానికి పోలీసులు రావడం కూడా కనిపిస్తుంది. ఓ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో అతనిపై సెక్యూరిటీ చేయిచేసుకోగా.. అవతలి వ్యక్తికూడా సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసాడు. సరైన భద్రత లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటన జరిగిందని పలువురు నెటిజన్లు చెబుతున్నారు.VIDEO | iPhone 17 series launch: A scuffle broke out among a few people amid the rush outside the Apple Store at BKC Jio Centre, Mumbai, prompting security personnel to intervene.Large crowds had gathered as people waited eagerly for the iPhone 17 pre-booking.#iPhone17… pic.twitter.com/cskTiCB7yi— Press Trust of India (@PTI_News) September 19, 2025ఐఫోన్ 17 ధరలుఐఫోన్ 17➤ఐఫోన్ 17 - 256జీబీ: రూ. 82,900➤ఐఫోన్ 17 - 512జీబీ: రూ.1,02,900ఐఫోన్ 17 ప్రో & 17 ప్రో మాక్స్➤ఐఫోన్ 17 ప్రో 256జీబీ: రూ.1,34,900➤ఐఫోన్ 17 ప్రో 512జీబీ: రూ.1,54,900➤ఐఫోన్ 17 ప్రో 1టీబీ: రూ.1,74,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256జీబీ: రూ.1,49,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 512జీబీ: రూ.1,69,900➤ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 1టీబీ: రూ.1,89,900➤ఐఫోన్ 17 ప్రో మాక్స్ 2టీబీ: రూ. 2,29,900ఐఫోన్ 17 ఎయిర్ ➤ఐఫోన్ 17 ఎయిర్ 256జీబీ: రూ.1,19,900➤ఐఫోన్ 17 ఎయిర్ 512జీబీ: రూ.1,39,900➤ఐఫోన్ 17 ఎయిర్ 1టీబీ: రూ.1,59,900 -
అదానీ స్టాక్స్లో ర్యాలీ..
అదానీ గ్రూప్ స్టాక్లు ఈ రోజు మార్కెట్ సెషన్ ప్రారంభం నుంచి భారీగా పుంజుకున్నాయి. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతోపాటు అదానీ పోర్ట్స్, అదానీ పవర్ వంటి గ్రూప్ కంపెనీలపై అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొట్టిపారేయడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.నేటి మార్కెట్ ప్రారంభ సెషన్ నుంచి అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం లాభపడింది.అదానీ ఎంటర్ ప్రైజెస్ 4.3 శాతం లాభపడింది.అదానీ పవర్ 7.4 శాతం పెరిగింది.అదానీ పోర్ట్స్ 2 శాతం పుంజుకుంది.అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4 శాతం చొప్పున పెరిగాయి.జనవరి 2023లో హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ సంస్థలు డబ్బు మళ్లించడానికి మూడు కంపెనీలు - అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్, రెహ్వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ఉపయోగించిందని ఆరోపించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.ఇదీ చదవండి: ఇండియా ఏఐ మిషన్లోకి ఎనిమిది కంపెనీలు -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం: ఉద్యోగులకు రూ.31000 పెంపు!
భారతదేశంలోని అతిపెద్ద వాహన తయారీదారులలో ఒకటైన 'హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్'.. ఉద్యోగులకు వేతనాల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. దీంతో ఉద్యోగుల జీతం రూ. 31వేలు వరకు పెరగనుంది. దీనికి సంబంధించిన ఒప్పందాన్ని యునైటెడ్ యూనియన్ ఆఫ్ హ్యుందాయ్ ఎంప్లాయీస్తో కుదుర్చుకుంది. ఇది మూడేళ్లు అమలులో ఉంటుంది.హ్యుందాయ్ వేతనాల పెంపు మూడేళ్లు (2024-2027) దశలవారీగా అమలు చేయనున్నారు. మొదటి ఏడాది వేతనం 55 శాతం పెరుగుతుంది. రెండో సంవత్సరం 25 శాతం, మూడో ఏడాది 20 శాతం మేర జీతం పెరుగుతుంది. ఇలా మొత్తం మీద మూడేళ్లలో రూ. 31000 పెరుగుతుంది. వేతనాలు మాత్రమే కాకుండా.. కంపెనీ కొన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఇందులో ఇన్సెంటివ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి పని గంటల వివాదం: నెటిజన్లు ఫైర్!కంపెనీ విజయానికి.. ఉద్యోగులే కారణం. సంస్థ, ఉద్యోగుల మధ్య విశ్వాసం, కమ్యూనికేషన్ ద్వారానే ప్రస్తుతం జీతాల పెరుగులకు సంబంధించిన ఒప్పందం సాధ్యమైంది. ఉద్యోగుల సంక్షేమం మా బాధ్యత అని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ పీపుల్ స్ట్రాటజీ ఫంక్షన్ హెడ్ 'యంగ్మ్యుంగ్ పార్క్' పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పెప్సికో గ్లోబల్ సీఈవో భేటీ
న్యూఢిల్లీ: పెప్సికో గ్లోబల్ సీఈవో, చైర్మన్ రామన్ లగుర్తా మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భారత మార్కెట్లో ధీర్ఘకాల వ్యాపార లక్ష్యాలు, పెట్టుబడులు, తయారీ, ఆవిష్కరణలు, పరస్పర అభివృద్ధి అవకాశాలపై మోదీతో చర్చించారు. లగుర్తాతో పాటు కంపెనీ భారత సీఈవో జాగృత్ కొటేచా, గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిరుతిళ్లు(స్నాక్స్) ఆహారోత్పత్తులపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గిన నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జీఎస్టీ తగ్గింపుతో పెప్సికో కీలక బ్రాండులు లేస్, కుర్కురే, చీటోస్, క్వాకర్ ఓట్స్కు లబ్ధి చేకూరనుంది. అయితే శీతలపానియాలపై 40% పన్ను విధించారు. పెప్సికో భారత్ను ‘అత్యంత కీలక మార్కెట్’గా పరిగణిస్తూ అసోంలో ఫుడ్స్ ప్లాంట్, మధ్యప్రదేశ్లో ప్లేవర్ తయారీ కేంద్రం, ఉత్తరప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ ప్లాంట్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. -
ఆ ఆరోపణలు తప్పు.. అదానీకి సెబీ క్లీన్ చిట్
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్నకు, దాని చైర్మన్ గౌతమ్ అదానీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.హిండెన్ బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలతో ఒక నివేదికను వెల్లడించింది. అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను వాడుకుని పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలైన అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లకు నిధులు సమకూర్చడానికి వివిధ అదానీ గ్రూప్ కంపెనీల నుండి నిధులను మళ్లించారని ఆరోపించింది.అయితే అదానీ గ్రూపుపై ఈ అభియోగాలను సెబీ కొట్టేసింది. అదానీ గ్రూప్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన గౌతమ్ అదానీ.. పడిన ప్రతిసారి మరింత గట్టిగా పైకి లేస్తామన్నారు. తమ సంస్థను నష్టపరిచేందుకు కొన్ని వర్గాల మీడియా స్వార్థ ప్రయోజనం కోసం ఆరోపణలు చేసిందని వెల్లడించారు. -
దుబాయ్ లాంటి దేశం.. చాలా తక్కువ ఖర్చుతో వీసా
దుబాయ్ అంటే చాలా మంది భారతీయ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానం. అయితే దుబాయ్ కు ప్రత్యామ్నాయంగా బహ్రెయిన్ దేశాన్ని చూస్తారు. ఇక్కడి వాతావరణం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటుంది. మనామాలో శతాబ్దాల నాటి కోటల పక్కన మెరిసే గాజు టవర్లను చూడవచ్చు. ఉదయం పూట సూక్ లో విక్రయించే ముత్యాలను బేరమాడి కొనుక్కోవచ్చు. మధ్యాహ్నం బీచ్ ఐలండ్లో సేద తీరవచ్చు. సూర్యాస్తమయం సమయంలో అరేబియన్ గల్ఫ్ మెరుపులను చూడవచ్చు. కుటుంబాలతో వచ్చినా, జంటగా వచ్చినా లేదా వ్యాపార పనుల మీద వచ్చినా ఇక్కడి అందాలను ఆస్వాదించవచ్చు.బహ్రెయిన్కు వీసా అవసరమా?అవును.. బహ్రెయిన్ సందర్శనకు వీసా అవసరం. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా బహ్రయిన్లోకి ప్రవేశించలేరు. వీసా పొందడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి ఈ-వీసా (ముందస్తుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి). మరొకటి వీసా ఆన్ అరైవల్ (అర్హత ఉన్నట్లయితే విమానాశ్రయం వద్ద పొందవచ్చు). రెండింటికీ చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, తగినంత నిధులు ఉండాలి. అయితే ఈ వీసాలపై అక్కడ పనిచేసుకోవడానికి మాత్రం అనుమతి ఉండదు.ఆన్ లైన్ వీసా ఫీజులు• 2 వారాల సింగిల్ ఎంట్రీ — 10.000 బెహ్రెయినీ దినార్లు (రూ.2,336)• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 17.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 3,972)• 1 సంవత్సరం మల్టిపుల్ ఎంట్రీ — 45.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 10,515)ఆన్ అరైవల్ వీసా ఫీజులు• 2 వారాల సింగిల్ ఎంట్రీ - 5.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 1,168)• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 12.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 2,804)ఈవీసాకు దరఖాస్తు ఇలా..బహ్రెయిన్ అధికారిక వీసా పోర్టల్ (జాతీయత, పాస్ పోర్ట్ లు, నివాస వ్యవహారాలు)లో అర్హతను సరిచూసుకోండిఆన్ లైన్ దరఖాస్తును పూరించి పత్రాలను అప్ లోడ్ చేయండి. తగిన రుసుము చెల్లించండి.ఆమోదం పొందాక కొన్ని రోజుల్లోనే ఈమెయిల్ ద్వారా అప్రూవల్ వస్తుంది.వీసా ఆన్ అరైవల్అన్ని పత్రాలతో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోండి.వీసా కౌంటర్ వద్దకు వెళ్లి ఫీజు చెల్లించండి.వేలిముద్రలు లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ తనిఖీలు చేయించుకోండి.కస్టమ్స్ క్లియర్ చేసి లగేజీని తీసుకోండి.చాలా ఈవీసాలు ౩ నుండి 5 రోజుల్లో ప్రాసెస్ చేస్తారు. ఆన్-అరైవల్ వీసాలు మాత్రం అదే రోజు మంజూరు చేస్తారు.బహ్రయిన్ సందర్శించడానికి మంచి సమయంబహ్రయిన్ ఎడారి దేశం కాబట్టి ఇక్కడ సమయం ముఖ్యమైనది.డిసెంబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సీజన్. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.జూలై, ఆగస్టు నెలల్లో, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వెళ్లకపోవడం మంచిది.రంజాన్, ఈద్ వ్యాపార సమయాలు హోటల్ రేట్లు, రెస్టారెంట్ షెడ్యూల్ ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. -
డిజిటల్ మార్కెట్ల నియంత్రణ తక్షణావసరం
డిజిటల్ మార్కెట్లలో బడా టెక్ కంపెనీలు, పోటీ సంస్థలను దెబ్బతీసే విధానాలను ఉపయోగించకుండా ముందస్తుగా నివారించేలా ప్రత్యేక విధానాన్ని (ఎక్స్–యాంటీ) రూపొందించడం తక్షణావసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను దేశీ అంకుర సంస్థల వ్యవస్థాపకులు కోరారు. డిజిటల్ పోటీపై తలపెట్టిన మార్కెట్ అధ్యయనం పారదర్శకంగా, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే విధంగా ఉండేలా చూడాలని కోరారు. ఎక్స్–యాంటీ నిబంధనలను వ్యతిరేకిస్తూ గ్లోబల్ టెక్ దిగ్గజాలు దు్రష్పచారం సాగిస్తున్నాయని వివరించారు.పీపుల్ గ్రూప్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, మ్యాట్రిమోనీడాట్కామ్ ఫౌండర్ మురుగవేల్ జానకిరామన్, ట్రూలీమ్యాడ్లీ సహ వ్యవస్థాపకులు స్నేహిల్ ఖనోర్, అమిత్ గుప్తా తదితరులు ఈ మేరకు నిర్మలా సీతారామన్కి లేఖ రాశారు. డిజిటల్ మార్కెట్లలో పోటీని అణగదొక్కేలా వ్యవహరిస్తున్న బిగ్ టెక్ సంస్థల వల్ల స్టార్ట్ వ్యవస్థ నిరంతరం సవాళ్లు ఎదుర్కొంటోందని అందులో పేర్కొన్నారు. ఎక్స్–యాంటీ నిబంధనలను పునఃసమీక్షించడానికి ముందుగా ప్రస్తుత డిజిటల్ కాంపిటీషన్ బిల్లు ముసాయిదాను ఉపసంహరించి, మార్కెట్ను సవివరంగా అధ్యయనం చేయాలన్న ప్రభుత్వ యోచనను తాము స్వాగతిస్తున్నామని స్టార్టప్ల ఫౌండర్లు తెలిపారు. అయితే, ఇది స్వతంత్రంగా, పారదర్శకమైన విధంగా జరిగేలా చూడాలని కోరారు.ఇదీ చదవండి: అంతర్జాతీయంగా ఏఐ నైతిక ప్రమాణాలపై కసరత్తు -
యస్ బ్యాంక్లో ఎస్ఎంబీసీ వాటా జూమ్
పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) నుంచి యస్ బ్యాంక్కు చెందిన 13.18 శాతం వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమొ మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) చేజిక్కింకుకుంది. దీంతో ఎస్ఎంబీసీ నుంచి రూ. 8,889 కోట్లు అందుకున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఫలితంగా యస్ బ్యాంక్లో ఎస్బీఐ వాటా 10.8 శాతానికి దిగివచ్చింది. ఈ డీల్లో భాగంగా ఇతర 7 ప్రయివేట్ బ్యాంకింగ్ సంస్థల నుంచి సైతం మరో 6.82 శాతం వాటాను ఎస్ఎంబీసీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా యస్ బ్యాంక్లో పీఈ దిగ్గజం కార్లయిల్ నుంచి మరో 4.2 శాతం వాటాను ఎస్ఎంబీసీ సొంతం చేసుకోనుంది. ఇందుకు షేరుకి రూ. 21.5 ధరలో(ఎస్బీఐ వాటా విక్రయ ధర)నే కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకున్నట్లు బుధవారం(17న) తెలియజేసింది. ఇందుకు రూ. 2,800 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించింది. వెరసి యస్ బ్యాంక్లో వాటాను జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి ఫైనాన్షియల్ గ్రూప్(ఎస్ఎంఎఫ్జీ)కు చెందిన ఎస్ఎంబీసీ 24.2 శాతానికి పెంచుకోనుంది. తద్వారా యస్ బ్యాంక్లో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ప్రస్తుతం యస్ బ్యాంక్లో కార్లయిల్ గ్రూప్ 4.22 శాతం వాటా కలిగి ఉంది.ఇదీ చదవండి: పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..! -
పండుగ సీజన్పై ‘సోనీ’ ఆశలు..!
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ సంస్థ సోనీ ఇండియా ప్రస్తుత పండుగల సీజన్ పట్ల ఆశావహంగా ఉన్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పెద్ద తెరల టీవీల ధరలు తగ్గుతాయని.. దీంతో విక్రయాలు రెండంకెల మేర వృద్ధి చెందుతాయని (గతేడాది ఇదే సీజన్తో పోల్చి చూస్తే) అంచనా వేస్తున్నట్టు సంస్థ ఎండీ సునీల్ నయ్యర్ ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి టీవీల అమ్మకాలు ఫ్లాట్గా, ఎలాంటి వృద్ధి లేకుండా ఉన్నట్టు చెప్పారు.జీఎస్టీ శ్లాబుల్లో మార్పుల వల్ల వీటి ధరలు 7.5–8 శాతం మేర తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో కొనుగోళ్ల సెంటిమెంట్ మెరుగుపడుతుందన్నారు. పెద్ద సైజు తెరల టీవీల మార్కెట్లో (ప్రీమియం మార్కెట్) సోనీ ప్రముఖ సంస్థగా ఉండడం తెలిసిందే. ఈ విభాగంలో టీవీల ధరలు మోడల్ ఆధారంగా రూ.8,000 నుంచి రూ.70,000 మధ్య తగ్గుతాయని నయ్యర్ ప్రకటించారు. ధరలు తగ్గడంతో కస్టమర్లు పెద్ద సైజు టీవీలు, మెరుగైన టెక్నాలజీ ఫీచర్లతో ఉన్న వాటికి మారతారన్న (అప్గ్రేడ్) ఆశాభావం వ్యక్తం చేశారు. విక్రయాలు 10–15 శాతం వరకు పెరగొచ్చన్నారు. మాకు ప్రయోజనం..జీఎస్టీలో 32 అంగుళాలకు మించిన టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం గమనార్హం. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. 55 అంగుళాలు, అంతకుమించిన సైజు టీవీల మార్కెట్లో కీలకంగా ఉన్న సోనీ ఈ రేటు తగ్గింపుతో ప్రయోజనం పొందుతుందని నయ్యర్ చెప్పారు. ‘‘55, 65, 75, 85, 98 అంగుళాల టీవీలను పెద్ద సంఖ్యలో విక్రయిస్తుంటాం. ఈ టీవీలన్నీ ప్రీమియం, పెద్ద సైజు విభాగం కిందకు వస్తాయి’’అని తెలిపారు. 55 అంగుళాల టీవీ ధర రూ.8,000 వరకు తగ్గుతుందని.. 75 అంగుళాలు అంతకుమించిన సైజు టీవీలపై రూ.19,000–51,000 వరకు, 85 అంగుళాల టీవీలపై రూ.47,000–70,000 వరకు రేట్లు తగ్గుతాయని చెప్పారు. బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపన్ను ప్రయోజనాలతో ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుందని.. దీని ఫలితంగా కెమెరాలు, సౌండ్బార్లు, పార్టీ స్పీకర్లు, హెడ్ఫోన్లు, ప్లే స్టేషన్ ఉత్పత్తుల అమ్మకాలు సైతం పెరుగుతాయని నయ్యర్ అంచనా వేశారు. విక్రయాల్లో సగం వాటా కలిగిన చిన్న పట్టణాలు, గ్రామీణ మార్కెట్లలో సోనీ స్థానం మరింత బలపడుతుందన్నారు. నిలిచిన కొనుగోళ్లుప్రభుత్వం జీఎస్టీపై నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వినియోగదారులు టీవీల కొనుగోళ్లను నిలిపివేసినట్టు నయ్యర్ తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉన్నట్టు చెప్పారు. అందరూ సెప్టెంబర్ 22 కోసం వేచి చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఆ తర్వాత కొనుగోళ్లు ఒక్కసారిగా పెరుగుతాయని అంచనా వేశారు.ఇదీ చదవండి: 5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు -
కస్టమర్లకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు బదిలీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటుపై 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రయోజనాలను కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు పూర్తిగా బదలాయిస్తామని భారతి సిమెంట్ డైరెక్టర్ (మార్కెటింగ్) రవీందర్ రెడ్డి తెలిపారు. సెపె్టంబర్ 22 నుంచి ఎంఆర్పీ తగ్గింపు ధరలు .. తమ ఇన్వాయిస్లలో, సిమెంటు బ్యాగ్లపై ప్రతిఫలిస్తాయని వివరించారు. సిమెంటు ధరలను తగ్గించి, ప్రయోజనాలను బదిలీ చేయాలని ఇప్పటికే తమ డీలర్లకు సూచించినట్లు రవీందర్ రెడ్డి చెప్పారు. లక్షల కొద్దీ గృహ నిర్మాణదారులు, మౌలిక సదుపాయాల డెవలపర్లు, సామాన్యులకు నేరుగా లబ్ధి చేకూర్చేలా జీఎస్టీ సంస్కరణలు చేపట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు తెలిపారు. దీనితో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఎకానమీగా భారత్ ఆవిర్భవించేందుకు తోడ్పడుతుందని రవీందర్ రెడ్డి చెప్పారు. వికాట్ ఫ్రాన్స్ అనుబంధ సంస్థగా భారతి సిమెంట్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
సరే కొనేసుకోండి.. జేపీ కొనుగోలుకి సీసీఐ ఓకే
రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి తాజాగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ను అనుమతించింది. దీంతో దివాలా చట్ట చర్యలలో భాగంగా జేపీని సొంతం చేసుకునేందుకు పీఎన్సీ ఇన్ఫ్రాకు దారి ఏర్పడనుంది. దివాలా పరిష్కారంకింద దాఖలు చేసిన బిడ్ గెలుపొందే వీలుంది.తద్వారా జేపీలో కనీసం 95 శాతం, గరిష్టంగా 100 శాతం వాటా కొనుగోలుకి సీసీఐ.. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ లేదా భవిష్యత్లో పూర్తి అనుబంధ సంస్థగా ఎస్పీవీ ఏర్పాటు ద్వారా జేపీలో వాటాను సొంతం చేసుకునేందుకు అనుమతించింది. వెరసి జేప్రకాష్ అసోసియేట్స్ కొనుగోలుకి పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసినట్లు సీసీఐ తాజాగా ఎక్స్లో పోస్ట్ చేసింది.కాగా.. జేపీ రుణ పరిష్కార ప్రణాళికను ప్రతిపాదించే సంస్థకు సీసీఐ అనుమతి తప్పనిసరంటూ ఐబీసీ నిబంధనల సమీక్ష తదుపరి సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో జేపీ రుణ పరిష్కార ప్రణాళికకు బిడ్ దాఖలు చేసే సంస్థ సీసీఐ నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది.