Corporate
-
అనంత్ బర్త్డే, స్పెషల్ కేక్ అంబానీ ముద్దు వైరల్
Anant Ambani Birthday Celebrations రిలయన్స్ వారసుడు, వ్యాపారవేత్త అనంత్ అంబానీ 31వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఈ రోజు (ఏప్రిల్ 10) బర్త్డే జరుపుకుంటున్నారు. గుజరాత్లోని జామ్నగర్లోని వంతారా యూనివర్సిటీలో తండ్రి ముఖేష్ అంబానీ, భార్య రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అంబానీ కుటుంబం ఒక వేడుకను నిర్వహిస్తే, అది చాలా ఘనంగా ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆహార పంపిణీ కార్యక్రమాలతో ఈ సందర్భాన్ని జరుపుకోగా, అనంత్ స్వయంగా భోజనాలు వడ్డించడం దగ్గర్నించి, ఈ రాజరాజేశ్వర ఆలయ పునరుద్ధరణకు మద్దతు ప్రకటించడం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.వంతారా యూనివర్సిటీఅలాగే తన తన కలల ప్రాజెక్ట్ 'వంతర'కు విస్తరణగా వంతర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయడం మరో విశేషం. తన సన్నిహిత కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్ , తండ్రి ముఖేష్ అంబానీతో కలిసి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?స్పెషల్గా కేక్ముఖ్యంగా ఈ వేడుకలో కేక్ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రత్యేకమైన, పుస్తకం ఆకారంలో ఉన్న పుట్టినరోజు కేక్. ఇందులో అమర్చిన పేజీలపై "వన్యప్రాణులు, జ్ఞానానికి ఒక కొత్త అధ్యాయం," "వన్యప్రాణుల విద్యకు ఒక వారసత్వాన్ని ప్రారంభించడం," , "ప్రకృతి జ్ఞానాన్ని కలిసే చోట" వంటి పదబంధాలు ఉన్నాయి, ఇవి ప్రకృతి పట్ల అనంత్కున్న దార్శనికత , నిబద్ధతకు ప్రతిబింబంగా నిలుస్తుంది అంటున్నారు అభిమానులు. Anant Ambani celebrating his birthday with Ranveer Singh, Mukesh Ambani and Radhika at Vantara University.❤️The way Mukesh Ambani kissed Anant at the end… pure gold.👌🏻And honestly Ranveer is just on another level lately, literally the main character wherever he walks in.🔥 pic.twitter.com/NNzQZjqVRj— Rohan💫 (@rohann__45) April 10, 2026 ఆన్లైన్ వైరల్గా మారిన వీడియో ప్రకారం కేక్ కట్ చేసిన తరువాత ముఖేష్ అంబానీ అనంత్ను ముద్దు పెట్టుకున్న తీరు మరింత హృద్యంగా నిలిచింది. ఈ వేడుకుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సందడి చేశారు. జాహ్నవి కపూర్, రణ్వీర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు వరుణ్ ధావన్, శిఖర్ పహారియా కూడా సరదాగా గడుపుతూ కనిపించారు. అలాగే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రితేష్ దేశ్ముఖ్ , షెహనాజ్ గిల్ ఈ వేడుకలకు హాజరైనట్టు సమాచారం. థఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే! -
స్పెయిన్లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!
ఉన్న ఊరిలో లేదా నగరంలో కాకుండా.. ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే?, తప్పకుండా నివాసం (ఇల్లు) వెతుక్కోవాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అయితే.. ఇంటి అద్దెలకు వేలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే.. వచ్చే జీతంలో ఇంటికోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది. కానీ స్పెయిన్ దేశంలో ఒక చిన్న గ్రామం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా ఇల్లు కూడా ఇస్తామంటోంది స్పెయిన్లోని అరెనిల్లాస్. ఈ గ్రామం స్పెయిన్లోని సొరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 40 మంది మాత్రమే శాశ్వత నివాసం ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్తుండటంతో, ఈ ప్రాంతం 'ఎంప్టీ స్పెయిన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.షరతులుఈ ఆఫర్ ప్రకారం, ఒక కుటుంబానికి పూర్తిగా పునరుద్ధరించిన ఇల్లు ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా కల్పిస్తారు. గ్రామంలో శాశ్వతంగా నివసించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఈ అవకాశానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఆ కుటుంబానికి పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు ఉండాలి. వారు గ్రామంలో పూర్తిగా నివసిస్తూ, గ్రామంలోని బార్ను నిర్వహించాలి. అదేవిధంగా భవనాల నిర్వహణ వంటి మున్సిపల్ పనులు కూడా చేయాలి.100 కంటే ఎక్కువ దరఖాస్తులు!నిజానికి ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఆఫర్ అరెనిల్లాస్ అందించడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటివరకు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అరెనిల్లాస్ గ్రామం పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వసంత కాలంలో సుమారు 24°C వరకు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది.ఇబ్బందులూ ఉంటాయ్!ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో, సొంత వాహనం అవసరం అవుతుంది. సమీప పాఠశాల సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అయితే పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది. ఆరోగ్య సేవలు కూడా ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటాయి.ఇదీ చదవండి: WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్ -
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి దారి దొరికిందా?
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ విక్రయ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇద్దరు కొనుగోలుదారులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్ ధరకంటే తక్కువకు దాఖలు చేసిన బిడ్స్ సవరణను కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్లో వ్యూహాత్మక వాటా విక్రయంపై ప్రస్తుతం సాంకేతిక మదింపు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్, అసెట్ మానిటైజేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ అనిశి్చతుల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. తద్వారా ద్రవ్యపరమైన దన్నుకు దారి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల ప్రయత్నాల తదుపరి ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయ చర్యలు ఫైనాన్షియల్ బిడ్ స్థాయికి చేరిన విషయం విదితమే. వెరసి ప్రభుత్వం మళ్లీ తొలి నుంచీ మొదలుపెట్టేందుకు సిద్ధంగా లేదని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.ఇది బ్యాంక్ విక్రయాన్ని మరింత ఆలస్యం చేసే వీలుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటా 45.48 శాతంకాగా.. పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటా విక్రయించేందుకు 2022 అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికాయి. ప్రేమ్వత్సా సంస్థ ఫెయిర్ఫాక్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలు చేశాయి. బ్యాంక్లో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి. -
భారత్ పెట్రోలియం సీఎండీగా సంజీవ్ ఖన్నా
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కొత్త చైర్మన్, ఎండీగా (సీఎండీ) సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బీపీసీఎల్లోనే రిఫైనరీస్కు ఆయన డైరెక్టర్గా పనిచేశారు. సీఎండీగా జి.కృష్ణకుమార్ పదవీ కాలం 2025 ఏప్రిల్30తో ముగిసింది.అప్పటి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను సైతం ఖన్నాయే చూశారు. పెట్రోలియం శాఖ నుంచి నియామకం సమాచారం రావడంతో సీఎండీ బాధ్యతలను ఖన్నా స్వీకరించినట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు బీపీసీఎల్ సమాచారం ఇచ్చింది. ఆయన నియామకం ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.2029 మే 31 వరకు (పదవీ విరమణ) లేదంటే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతలు చూస్తారని తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లిలో ఖన్నా కెమికల్ ఇంజనీర్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేశారు. -
WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్
కొన్ని కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగం నీటి మీద బుడగ మాదిరిగా అయిపోయింది. ఎప్పుడు జాబ్ పోతుందో?, ఎందుకు పోతుందో? తెలియక చాలామంది ఇప్పటికి కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కోరిన ఉద్యోగిని, బాస్ రెండు నిమిషాల్లోనే తొలగించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గురుగ్రామ్కు చెందిన స్టార్టప్ ఫౌండర్ నిఖిల్ రాణా.. కంపెనీ The 15లో, ఒక ఉద్యోగిని కేవలం రెండు నిమిషాలలో తొలగించేసారు. దీనికి కారణం ఆ ఉద్యోగి ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడమే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.నిఖిల్ రాణా.. ఉద్యోగిని తొలగించడమే కాకుండా, ఆ విషయాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేసారు. అంతే కాకుండా కంపెనీలో ఉద్యోగుల నుంచి తాను ఏమి కోరుకుంటున్నాడనే విషయాన్ని కూడా వెల్లడించారు. నోటిస్ పీరియడ్ అనేది సమయం వృధా అని కూడా పేర్కొన్నారు.''స్వంత బాధ్యత తీసుకునే వ్యక్తులు, ఫౌండర్లపై ఆధారపడగలిగే వ్యక్తులు, ‘హై ఏజెన్సీ’ కలిగిన వ్యక్తులు, సరిగ్గా సమయం కోసం వేచి కూడదు, పనిని పూర్తి చేయగల వ్యక్తులు'' తనకు కావాలని నిఖిల్ రాణా చెప్పారు. నైపుణ్యాలకు ఎవరూ చిల్లిగవ్వ కూడా విలువ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇప్పుడు సాధారణమయ్యాయి అని అన్నారు.నిఖిల్ రాణా తీరుపై చాలామంది విమర్శిస్తున్నారు. సానుభూతి లేకుండా ప్రవర్తించాడని, కేవలం ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినందుకు తక్షణమే తొలగించడం అన్యాయం అని అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఉద్యోగుల నిబద్ధతకు మరింత ఖచ్చితమైన ప్రమాణాలు ఉండాలనేది రాణా ఫీప్రాయమని కొందరు మద్దతు ఇచ్చారు. -
‘హెక్టాకార్న్’గా మారిన రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్ట్అప్ కంపెనీల గ్లోబల్ జాబితాలో 7వ స్థానాన్ని సాధించింది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసిన పరిశోధన ప్రకారం.. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువతో ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అత్యంత విలువైన టాప్ 100 స్టార్టప్ కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అందులో రిలయన్స్ రిటైల్ అత్యున్నత ర్యాంక్ సాధించి, భారతదేశం బలమైన ప్రాతినిధ్యాన్ని చాటింది.రిపోర్ట్ ప్రకారం.. రిలయన్స్ రిటైల్ పోస్ట్ మనీ విలువ 100 బిలియన్ డాలర్లకు మించి ఉంది. దీంతో ఇది ప్రపంచంలో ‘హెక్టాకార్న్’గా పిలవబడే ఏడు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లను ‘హెక్టాకార్న్’ అని అంటారు. టాప్ 7 కంపెనీల్లో రిటైల్ రంగానికి చెందిన ఏకైక సంస్థ రిలయన్స్ రిటైల్ మాత్రమే.ఈ సంస్థకు ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కెకేఆర్, సిల్వర్ లేక్, జీఐసీ, టీపీజీ, ముబాదాలా వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు నిర్ణయించిన కంపెనీ విలువనే ఈ ర్యాంకింగ్కు ప్రధాన ప్రమాణంగా తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఇనిషియేటివ్ పరిశోధన ఆధారంగా, జనవరి 2026 వరకు ఉన్న డేటాతో రూపొందించబడింది.జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్, ఆంత్రోఫిక్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్లో టెక్నాలజీ, ఏఐ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది.ఈ రిపోర్ట్లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా 24 బిలియన్ డాలర్ల విలువతో 27వ స్థానంలో ఉంది. టాటా ఈవీ మొబిలిటీ 9 బిలియన్ డాలర్ల విలువతో 93వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 65 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, కాగా చైనా నుంచి 21 కంపెనీలు ఉన్నాయి. భారత్, బ్రిటన్ నుంచి తలో మూడు కంపెనీలు చోటు సంపాదించాయి. -
4 రోజులే పని.. నచ్చినప్పుడే చేయొచ్చు..
కార్పొరేట్ ప్రపంచంలో 'హస్టిల్ కల్చర్' (నిరంతరం కష్టపడటం) పేరుతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వేళ, యూకేకి చెందిన ఒక పారిశ్రామికవేత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పని గంటల సంఖ్య కంటే, ఇచ్చే 'ఫలితాల'కే (Results-Only) ప్రాధాన్యతనిస్తూ తన సంస్థలో సరికొత్త పని వాతావరణాన్ని సృష్టించారు.ఒక్క మెసేజ్తో మొదలైన చర్చ'స్పైసీ మార్గరిటా' అనే ఎస్ఈఓ (SEO) కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు బెన్ గూడీ, ఇటీవల తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు. తన బృందంలోని ఒక సభ్యుడు, "ఈ రోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఈ పనిని వారాంతంలో పూర్తి చేయనా?" అని అడగడానికి ఇబ్బంది పడటం చూసి బెన్ ఆశ్చర్యపోయారు."నా సంస్థలో ఎవరినైనా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పని చేసుకోవచ్చు. పని పూర్తవుతుందా లేదా అన్నదే ముఖ్యం" అని బెన్ స్పష్టం చేశారు.బర్న్ అవుట్ నేర్పిన పాఠంతానూ గతంలో సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పుడు తీవ్రమైన 'బర్న్ అవుట్' (మానసిక, శారీరక అలసట) అనుభవించానని బెన్ గుర్తు చేసుకున్నారు. కేవలం పై అధికారులను మెప్పించడానికి, ఆఫీసులో ఎక్కువ గంటలు గడపడానికి ప్రయత్నించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత కంపెనీలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు.బెన్ గూడీ కంపెనీలో ప్రత్యేకతలువారానికి 4 రోజుల పని: రీఛార్జ్ అవ్వడానికి తగినంత సమయం.వర్క్ ఫ్రమ్ ఎనీవేర్: ప్రపంచంలో ఎక్కడి నుండైనా పని చేసే వెసులుబాటు.నిర్ణీత గంటలు లేవు: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కూర్చోవాలనే నిబంధన లేదు.అనవసర సమావేశాలకు స్వస్తి: సమయాన్ని వృధా చేసే మీటింగ్స్ను దాటవేసే స్వేచ్ఛ.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లుబెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "చాలా ఆఫీసుల్లో డెస్క్ దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నారనే లెక్కిస్తారు కానీ, ఎంత పని చేశారనేది చూడరు. మీ ఆలోచన చాలా బాగుంది" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "అనుమతి అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారంటే, అది పాత కార్పొరేట్ వ్యవస్థలు వారికి నేర్పిన భయం. దాన్ని పోగొట్టడానికి సమయం పడుతుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు.బెన్ గూడీ నేపథ్యంలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన బెన్ గూడీ, వివిధ రంగాల్లో అనుభవం గడించిన తర్వాత 2024లో 'స్పైసీ మార్గరిటా'ను స్థాపించారు. ప్రస్తుతం ఆయన తన సంస్థలో స్ట్రాటజీ లీడ్గా ఉంటూనే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. -
ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. ఇలాంటి సమయంలో కంపెనీ చీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (CFO)గా హిలరీ మ్యాక్సన్ను భారీ వేతనంతో నియమించింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చకు దారితీసింది.ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ హిలరీ మ్యాక్సన్కు కంపెనీ 9,50,000 డాలర్ల జీతం ఇవ్వనుంది. అదనంగా పనితీరు ఆధారంగా 2.5 మిలియన్ డాలర్ల వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 26 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ (షేర్లు) కూడా సంస్థ అందిస్తుంది. వీటిలో 80 శాతం సమయానికి అనుసంధానమైనవి కాగా, 20 శాతం పనితీరుపై ఆధారపడి ఉంటాయి.మ్యాక్సన్ తన ఈక్విటీని పూర్తిగా స్టాక్ ఆప్షన్ల రూపంలో లేదా స్టాక్ ఆప్షన్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల రూపంలో తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆమెకు 2,50,000 విలువైన రీలోకేషన్ అలవెన్స్ కూడా అందిస్తోంది. ఇవన్నీ కలిగి ఆమె మొత్తం ప్యాకేజీ సుమారు 29.7 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.273 కోట్లు) చేరుకుంటుంది.హిలరీ మ్యాక్సన్ ఒరాకిల్లో చేరడానికి ముందు.. ష్నైడర్ ఎలక్ట్రిక్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఎఫ్ఓగా పనిచేశారు. అంతే కాకుండా ఆమె ఏఈఎస్ కార్పొరేషన్లో 12 సంవత్సరాలు పాటు ఫైనాన్స్, స్ట్రాటజీ మొదలైన విభాగాల్లో పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.కంపెనీ భారీ లేఆఫ్స్ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ భారీ లేఆఫ్ ప్రభావం భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై పడింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం.. కంపెనీ నిర్మాణ మార్పులు, ఖర్చు తగ్గింపు చర్యలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని తెలుస్తోంది. ఈ కోతలు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్సూట్లోని సిబ్బందిని ప్రభావితం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు! -
అనంత్ అంబానీ బర్త్డే స్పెషల్.. గజరాజులకు విందు..
వన్యప్రాణుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను అనంత్ అంబానీ మరోసారి చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలోని హాథీ గావ్లో జరిగాయి. మూగజీవాల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా స్థానిక ‘హాథీ గావ్ వికాస్ సమితి’ ఈ వినూత్న వేడుకను నిర్వహించింది.ఈ వేడుకలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన భారీ ‘ఫ్రూట్ బఫే’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 3,000 కిలోల బరువున్న వివిధ రకాల పండ్లను ఏనుగులకు విందుగా వడ్డించారు. ఈ బఫేలో అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయ, బొప్పాయి, నారింజ వంటి కాలానుగుణ ఫలాలతో పాటు ఏనుగులకు ఇష్టమైన చెరకు, బెల్లం, పచ్చి పశుగ్రాసాన్ని భారీగా సిద్ధం చేశారు. రాజస్థానీ సాంప్రదాయ శైలిలో అలంకరించిన గజరాజులు ఈ విందును ఆస్వాదించాయి.మావత్ కుటుంబాలకు అండగా..వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే మావత్ (ఏనుగుల సంరక్షకులు)లను ఈ సందర్భంగా సమితి గౌరవించింది. ఏనుగుల సంక్షేమం కోసం శ్రమించే వారికి నిత్యావసర వస్తువులతో కూడిన రేషన్ కిట్లు, దుస్తులు, టోపీలు, పాదరక్షలు, రోజువారీ వినియోగ వస్తువులను పంపిణీ చేశారు.అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారాను స్థాపించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన, అనారోగ్యంతో ఉన్న సుమారు 200 జాతులకు చెందిన జంతువులకు వంతారాలో ఆశ్రయం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని ఏనుగుల సంరక్షణకు ఆయన అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల స్ఫూర్తి పొంది ఈ వేడుకను నిర్వహించినట్లు హాథీ గావ్ వికాస్ సమితి అధ్యక్షుడు షఫీక్ బల్లు ఖాన్ తెలిపారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ? -
డిస్నీలో లేఆఫ్స్?
ప్రపంచ వినోద రంగ దిగ్గజం ‘వాల్ట్ డిస్నీ’ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధానంగా కంపెనీలోని మార్కెటింగ్ విభాగంపై ఈ ప్రభావం అధికంగా ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.మార్కెటింగ్ విభాగమే లక్ష్యంగా..డిస్నీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగమని తెలుస్తోంది. కొత్తగా నియమితులైన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ) అసద్ అయాజ్ కంపెనీ మార్కెటింగ్ గ్రూపును ఏకీకృతం చేసే పనిలో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ ఇమాజిన్’ అనే రహస్య కోడ్ పేరుతో వ్యయ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన అయాజ్ సంస్థలోని అన్ని మార్కెటింగ్ కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త చేపట్టబోయే లేఆఫ్స్ డిస్నీ మొత్తం శ్రామిక శక్తిలో 1 శాతం కంటే తక్కువే. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోష్ డి అమారో డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం.స్పందించని డిస్నీ యాజమాన్యంఈ వార్తలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టత కోరగా, డిస్నీ యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఈ నివేదిక బయటకు రావడంతో కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి అందుబాటులోకి రాలేదు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్కి ప్రత్యేక వర్గీకరణ
నిర్వర్తించే విధులను బట్టి బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ని రెండు కేటగిరీలుగా వర్గీకరించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వారికి ఇచ్చే కమీషన్ లేదా రెమ్యూనరేషన్ ఒకే విధంగా ఉండేలా ప్రతిపాదించింది. బ్రాంచ్ ఆథరైజేషన్కి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం మూడు డెలివరీ పాయింట్లను ఆర్బీఐ ప్రతిపాదించింది.ఇందులో బ్యాంక్ శాఖలతో పాటు బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ అవుట్లెట్ (బీసీ–బీవో), బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ టచ్పాయింట్ (బీసీ–బీటీ) ఉన్నాయి. ప్రస్తుతమున్న బిజినెస్ ఫెసిలిటేటర్ల స్థానంలో, బీసీలని నియమించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ నిబంధనల ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు మే 5 నాటికి తమ అభిప్రాయాలను నియంత్రణ సంస్థకి తెలియజేయాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సేవలను విస్తరించే దిశగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు ..రిటైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
డిస్కౌంట్లకన్నా సౌకర్యానికే ఓటు
దేశీయంగా క్విక్ కామర్స్ వినియోగదారులు డిస్కౌంట్ల కన్నా సౌకర్యానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిస్కౌంట్లు తగ్గించినా సరే సదరు ప్లాట్ఫాంలను వినియోగించడాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా వినియోగదారుల ధోరణుల్లో వస్తున్న మార్పులను సూచించేలా గ్రాంట్ థార్న్టన్ భారత్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో 1,600 మంది వినియోగదారులు, 1,000కి పైగా కిరాణా స్టోర్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. దీని ప్రకారం రోజువారీ కొనుగోళ్ల విషయంలో ధర కన్నా వేగం, లభ్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. డిస్కౌంట్లను తగ్గించినా కూడా క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలను వినియోగించడాన్ని కొనసాగిస్తామంటూ 70 శాతం మంది తెలిపారు. సంప్రదాయ రిటైల్ ఫార్మాట్ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడం కాకుండా, నిర్దిష్ట సందర్భాల కోసం మాత్రమే క్విక్ కామర్స్ని ప్రజలు వినియోగిస్తున్నారు. ఆఖరు నిమిషపు, అర్జంట్ ఆర్డర్ల కోసం 45 శాతం మంది వినియోగదారులు వీటిని ఎంచుకుంటున్నారు. ఇక 24 శాతం మంది పాలు, బ్రెడ్లాంటి ప్రతి రోజు అవసరమయ్యే వాటి కోసం ఉపయోగిస్తున్నారు. 19 శాతం మంది అప్పటికప్పుడు తినాలని, తాగాలనిపించే స్నాక్స్, పానీయాల్లాంటి కోసం క్విక్ కామర్స్ ప్లాట్ఫాలంను వినియోగిస్తున్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..గత ఏడాది వ్యవధిలో కిరాణా స్టోర్స్పై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు 51 శాతం మంది తెలిపారు. అయితే, 27 శాతం మంది ఈ విషయంలో చెప్పుకోతగ్గ మార్పేమీ లేదనగా, 13 శాతం మంది మాత్రం ఇప్పుడు వీటిని మరింతగా ఎంచుకుంటున్నట్లు చెప్పారు.మార్జిన్లపరంగా ఒత్తిడి పెరుగుతుండటం, వినియోగదారుల్లో మారుతున్న ధోరణులకు అనుగుణంగా సంప్రదాయ రిటైలర్లు వ్యాపారాన్ని తీర్చిదిద్దుకునేందుకు సుముఖంగా ఉంటున్నారు.40 శాతం మంది కిరాణా రిటైలర్లు, క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలతో జట్టు కట్టడంపై ఆసక్తి వ్యక్తం చేశారు.32 శాతం మంది తమకు ఆసక్తిగా ఉన్నా, ఇలాంటి భాగస్వామ్యాలు ఎలా పని చేస్తాయనేది తెలియడం లేదని పేర్కొన్నారు. తమకు నిర్వహణపరమైన లేదా సాంకేతికపరమైన మద్దతు లభిస్తే తప్పకుండా జట్టు కడతామని 20 శాతం కిరాణా రిటైలర్లు తెలిపారు. ద్వితీయ శ్రేణి, వర్ధమాన పట్టణ మార్కెట్లు రాబోయే రోజుల్లో రిటైల్ రంగ తదుపరి వృద్ధి చోదకాలుగా ఉండనున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్ స్పందన ఇదే!
అమెరికన్ దిగ్గజం, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో భారీ విడత ఉద్యోగ కోతలకు ప్రణాళిక రచిస్తున్నట్లువార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలలో 14 వేల మందిని ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందా? ఈ ఏడాది జనవరిలో 16 వేల మందికి ఉద్వాసన పలకడం, ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30వేలమందిని తొలగించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల్లో భారీ ఆందోళన నెలకొంది. దీనిపై అమెజాన్ ఎలా స్పందించింది?అమెజాన్ వచ్చే మే నెలలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించనుందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అమెజాన్ 2026 మే నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14వేల మందినితొలగించాలని యోచిస్తున్నట్లు బిజినెస్ అవుట్లుక్ తెలిపింది. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, మానవ వనరుల వంటి విభాగాలలో మధ్య-స్థాయి మేనేజర్లు,వైట్-కాలర్ ఉద్యోగులతో సహా కార్పొరేట్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. ఇదీ చదవండి: కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్ చంద్రశేఖర్!అమెజాన్ స్పందనఈ వార్తలపై అమెజాన్ స్పందించింది. ఇవన్నీ పుకార్లే నని కొట్టి పారేసింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ ప్రచారం విశ్వసించవద్దని అమెజాన్ ప్రతినిధి కోరారు. ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి -
38 ఏళ్ల నాటి రికార్డ్.. ఆకాశంలో తపాలా సేవలు
ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి రావడంతో కేవలం సింగిల్ క్లిక్ లో వాట్సాప్ మెసేజెస్ , ఫొటోస్, వీడియోస్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే అవకాశం ఉంది. దేశ, విదేశాలనుంచి కాకుండా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు సైతం టక్కుమని క్లిక్ చేస్తే ఈ-మెయిల్ వెళ్ళిపోతుంది, సెకన్లలో అవతలి వ్యక్తికి సందేశం చేరుతుంది. కానీ, ఒకప్పుడు మారుమూల దీవులకు ఉత్తరం చేరాలంటే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన చేపట్టిన ఒక సాహసోపేత ప్రయోగం 'హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్'. కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..హెలికాప్టర్ పోస్టల్ సేవలు.. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ పోస్టల్ సేవలు 1988, జనవరి 27న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగాధమైన సముద్రం, దట్టమైన అడవులతో కూడిన అండమాన్ నికోబార్ దీవులను ఈ చారిత్రక ఘట్టానికి వేదికగా ఎంచుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ దీవుల మధ్య సాగిన ఈ మొదటి ప్రయాణం తపాలా వ్యవస్థలో ఒక మైలురాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి భారత తపాలా శాఖ, పవన్ హాన్స్ లిమిటెడ్తో జతకట్టింది.మెయిల్ బస్తాలను చేరవేయడానికి శక్తివంతమైన 'డౌఫిన్' హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గతంలో పడవలు లేదా ఇతర మార్గాల ద్వారా ఉత్తరాలు చేరడానికి రెండు మూడు రోజులు పట్టే చోట, హెలికాప్టర్ పుణ్యమా అని గంటల వ్యవధిలోనే సందేశాలు చేరడం ప్రారంభమైంది. ఈ తొలి ప్రయాణాన్ని స్మరిస్తూ విడుదల చేసిన 'ఫస్ట్ డే కవర్లు', ప్రత్యేక స్టాంపులు నేటికీ తపాలా బిళ్ళల సేకరణకర్తలకు నిధి లాంటివి.ఆకాశ మార్గాన తపాలా సేవలు.. ఆకాశ మార్గాన తపాలా సేవలు అందించాలనే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947, అక్టోబర్ 1న అమెరికాలో మొదలైంది. లాస్ ఏంజిల్స్ ఎయిర్వేస్ సహకారంతో 'సికోర్స్కీ ఎస్-51' హెలికాప్టర్ ద్వారా ఈ సేవలు అందించారు. అమెరికా బాటలోనే నడుస్తూ బ్రిటన్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సేవలను ప్రారంభించి ఐరోపాలో రికార్డు సృష్టించింది.సాంకేతికత ఎంత పెరిగినా, ఆనాడు మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ 'గగన విహారం' ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉత్తరం వెనుక ఎన్నో కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఉండేవి.. అలాంటివాటిని ఏమాత్రం చెక్కుచెదరకుండా వారికి అందించిన ఘనత భారత తపాలా శాఖకు దక్కుతుంది. -పసుపులేటి వెంకటేశ్వరరావు. -
BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!
బీఎండబ్ల్యూ (BMW) వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల యువతి డిగ్రీ లేకుండానే ఉద్యోగం సాధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ రోల్ సాధించాలంటే కనీసం డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ, గౌరీ ఎమ్ అనే 19 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేకుండానే, డిజిటల్ స్పేస్లో ఆమెకున్న పర్సనల్ బ్రాండింగ్ పవర్ కారణంగా ఆ సంస్థలో పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.ఎలాంటి డిగ్రీ లేకుండానే ప్రపంచంలోనే ప్రీమియం కార్లు, మోటార్సైకిళ్లను ప్రతిష్టాత్మక కంపెనీ బీఎండబ్ల్యూలో ఉద్యోగం సంపాదించిందంటూ ఒక లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. అకడమిక్ అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం బలమైన వ్యక్తిగత బ్రాండ్ను, సోషల్ మీడియా ఉనికి ద్వారా కంటెంట్ క్రియేటర్ గౌరీ ఎం పూర్తికాల పర్సనల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వివిధ ప్లాట్ఫామ్లలో గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లింక్డ్ఇన్లో 65,000 మందికి పైగా, ఇన్స్టాగ్రామ్లో 35 వేల మందికి పైగా ఉన్నారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.పైగా ఆమె ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకోలేదు, కనీసం కోల్డ్ ఈమెయిల్స్ కూడా పంపలేదు. ఆమె కంటెంట్ చూసి కంపెనీ ప్రతినిధులే స్వయంగా ఆమెను సంప్రదించడం విశేషం."నేను కేవలం 19 ఏళ్ల అమ్మాయిని, నాకున్న వనరులతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ నన్ను గుర్తించి ఉద్యోగం ఆఫర్ చేయడం నమ్మలేకపోతున్నాను" అని ఆమె లింక్డ్ఇన్లో పోస్ట్లో వెల్లడించింది.నెటిజన్ల స్పందన ఈ విషయంలో నెటిజన్లు రెండు రకాలుగా స్పందించారు. ప్రస్తుతకాలంలో కేవలం డిగ్రీల కంటే నైపుణ్యం (Skills) , పర్సనల్ బ్రాండింగ్ ముఖ్యమని, సోషల్ మీడియాను కెరీర్ ఎదుగుదలకు ఎలా వాడుకోవాలో గౌరీ నిరూపించిందని కొందరు ప్రశంసించారు. మరోవైపు ఇలాంటివి అరుదుగా జరుగుతాయి, అన్ని రంగాల్లో డిగ్రీ లేకుండా ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు అంటూ ఉద్యోగార్థులను హెచ్చరించారు. సంప్రదాయ విద్యా విధానం ప్రాముఖ్యతను తక్కువ చేయకూడదని సూచించడం గమనార్హం.ఇదీ చదవండి: షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి -
విమానయాన రంగానికి భారీ ఊరట
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానశ్రయాలలో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 3 నెలల పాటు 25 శాతం తగ్గిస్తూ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్ఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.రంగంలోకి ఏఈఆర్ఏకేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఈఆర్ఏ ఈ తాత్కాలిక తగ్గింపును తక్షణమే అమలులోకి తెచ్చింది. రాబోయే మూడు నెలల వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఛార్జీల తగ్గింపు వల్ల విమానాశ్రయాలకు కలిగే ఆదాయ లోటును భవిష్యత్తులో చేపట్టే టారిఫ్ సమీక్షల ద్వారా సర్దుబాటు చేస్తామని రెగ్యులేటర్ ఏఈఆర్ఏ చేసింది.దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాశ్రయ రుసుములను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ సంస్థలు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్ గగనతలంపై నిషేధం ఉండటంతో భారత విమానాలు ఇప్పటికే చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ‘ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు ఇంధనం, సిబ్బంది వేతనాల తర్వాత విమానాశ్రయ, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఛార్జీలే అధిక ఖర్చులుగా ఉన్నాయి’ అని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలిపింది.మరోవైపు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు విమానయాన రంగ షేర్లకు ఊపునిచ్చాయి. ఇరాన్తో అమెరికా రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన వార్తలతో బుధవారం ట్రేడింగ్లో ఇండిగో షేర్లు లాభపడ్డాయి. యుద్ధం సద్దుమణిగితే ఇంధన ధరలు దిగివస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్లు విమానయాన రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
ఎస్ఈసీ కేసు కొట్టేయండి
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ కమిషన్ (ఎస్ఈసీ) దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ న్యూయార్క్ ఈస్ట్రర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రీమోషన్ లెటర్ను దాఖలు చేశారు. 2021లో అదానీ గ్రూప్ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బాండ్ల జారీ ద్వారా అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించింది.అయితే భారత్లోని వివిధ రాష్ట్రాల్లో అధికారులకు లంచాలు ఇచ్చిన సమాచారాన్ని ఇన్వెస్టర్లకు తెలియనీయకుండా తప్పుదోవ పట్టించారంటూ ఎస్ఈసీ వీరిపై కేసు దాఖలు చేయడం తెలిసిందే. ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయంటూ.. దేశ సరిహద్దులకు అతీతంగా అమెరికా చట్టాన్ని ఈ కేసు అన్వయిస్తోందని తమ న్యాయవాదుల ద్వారా వారు పిటిషన్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్! -
ఎయిరిండియా ప్రయాణికులకు ఏటీఎఫ్ సెగ
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో విమాన ఇంధనం (ఏటీఎఫ్) రేట్లు భారీగా ఎగిసిన నేపథ్యంలో ఎయిరిండియా గ్రూప్ తమ ఫ్లయిట్స్పై ఇంధన సర్చార్జీని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీ ఫ్లయిట్స్పై రూ. 299 నుంచి రూ. 899 వరకు, విదేశీ రూట్లలో 24 డాలర్ల నుంచి 280 డాలర్ల వరకు (కొన్ని రూట్లు మినహాయించి) ఉంటుంది. ఏప్రిల్ 8 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఎయిరిండియా గ్రూప్ పేర్కొంది. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానాలకు కూడా ఇవి వర్తిస్తాయి.బంగ్లాదేశ్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా తదితర రూట్లకు సంబంధించి నియంత్రణ సంస్థ నుంచి వచ్చే అనుమతులను బట్టి నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 27తో ముగిసిన వారాంతంలో బ్యారెల్కి 27.83 డాలర్లుగా ఉన్న ఏటీఎఫ్ మార్చి 27న ముగిసిన వారాంతానికి 81.44 డాలర్లకు ఎగిసినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో సర్చార్జీలను విధించినప్పటికీ ఏటీఎఫ్ వ్యయాలు పూర్తిగా రికవర్ కావని, ఇప్పటికీ సింహభాగం భారాన్ని సంస్థే భరిస్తోందని ఎయిరిండియా పేర్కొంది. ఎయిర్లైన్స్ నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 40–45 శాతం వరకు ఉంటుంది. మరో విమానయాన సంస్థ ఇండిగో ఇప్పటికే ఇంధన సర్చార్జీలను సవరించిన సంగతి తెలిసిందే.సీఈవో విల్సన్ రాజీనామాఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా చేశారు. దీనితో ఆయన స్థానంలో కొత్త వారి నియామకం కోసం కంపెనీ ప్రత్యేక కమిటీని నియమించింది. న్యూజిలాండ్కి చెందిన విల్సన్ గతంలో సింగపూర్ ఎయిర్లైన్స్కి పని చేశారు. 2022లో ఎయిరిండియా పగ్గాలు చేపట్టిన విల్సన్ గత నాలుగేళ్లుగా సీఈవో, ఎండీగా పని చేస్తున్నారు. ‘2026లో తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లు 2024లోనే ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కి విల్సన్ తెలిపారు. అధికార బదలాయింపు ప్రక్రియ సజావుగా సాగేట్లుగా అప్పటి నుంచే కసరత్తు జరుగుతోంది‘ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.వారసుడు ఎంపికయ్యేంత వరకు విల్సన్ ప్రస్తుత హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తారని పేర్కొంది. ‘కోవిడ్ అనంతరం పలు సవాళ్లు ఎదురైనప్పటికీ కంపెనీ వాటిని అధిగమించి, పురోగమించడంలో విల్సన్ కీలకపాత్ర పోషించారు‘ అని చంద్రశేఖరన్ కితాబిచ్చారు. ‘ఎయిర్క్రాఫ్ట్ల డెలివరీలు, సరఫరా వ్యవస్థలో సవాళ్లు, రెండు యుద్ధాలు, ఎయిర్స్పేస్ మూసివేత, ఇంధన ధరల పెంపు, అన్నింటికన్నా ముఖ్యంగా ఒక పెను విషాదం (అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన)లాంటి అసాధారణ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ మీరు సాధించిన విజయాలు ఎంతో గర్వకారణం.కొత్త విమానాల డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో నేను కంపెనీ పగ్గాలను మరొకరికి అప్పగించేందుకు ఇదే సరైన సమయం‘ అని ఉద్యోగులకి ఇచ్చిన సందేశంలో విల్సన్ పేర్కొన్నారు. 2022లో ఎయిరిండియాను ప్రభుత్వం నుంచి టాటాలు కొనుగోలు చేసిన అనంతరం నాలుగు ఎయిర్లైన్స్ని విజయవంతంగా విలీనం చేయడం తదితర అంశాల్లో విల్సన్ కీలక పాత్ర పోషించారు. అయితే, 250 మంది ప్రయాణికులు మరణించిన ఎయిరిండియా విమాన దుర్ఘటన, ఇతరత్రా సందర్భాల్లో భద్రతా ప్రమాణాల లోపాలు తదితర అంశాలపై విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. -
డిపాజిట్ల వేటలో ప్రైవేటు బ్యాంకులు టాప్
ముంబై: డిపాజిట్ల వేటలో ప్రభుత్వరంగ బ్యాంకులతో ప్రైవేటు బ్యాంక్లు గట్టి పోడీ పడుతున్నాయి. జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు అధిక డిపాజిట్లను సమీకరించడం ఇందుకు నిదర్శనం. 2025–26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లలో 12–17 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కానీ, ఇదే కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 2–14 శాతానికి పరిమితమైనట్టు డేటా స్పష్టం చేస్తోంది. సాధారణంగా బ్యాంకులకు కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) డిపాజిట్లు చాలా చౌక రేట్లకే లభిస్తుంటాయి. ఇతర ఆర్థిక సాధనాల్లో ఇంతకుమించి మెరుగైన రాబడులతో కాసా డిపాజిట్లు క్రమంగా తగ్గిపోతుండడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో బ్యాంక్లు సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్ (సీడీ)ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకుంటున్నాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో అధిక వృద్ధి.. ప్రైవేటు బ్యాంకుల్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ డిపాజిట్లలో మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. డిపాజిట్లు 17.2 శాతం పెరిగి రూ.2.84 లక్షల కోట్లకు చేరాయి. ఆ తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ డిపాజిట్లు 14.7 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిపాజిట్లు 14.4 శాతం చొప్పున పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 14.33 శాతం వృద్ధిని నమోదు చేయగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 14 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఇండియా 13.37 శాతం చొప్పున డిపాజిట్లను పెంచుకున్నాయి. మార్చి త్రైమాసికం ముగిసిన తర్వాత కొన్ని బ్యాంక్లు విడుదల చేసిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఈ వ్యత్యాసం కనిపించింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ఇంకా ఈ వివరాలు విడుదల చేయలేదు. రుణాల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల పైచేయి మార్చి త్రైమాసికంలో రుణాల పరంగా ప్రభుత్వరంగ బ్యాంకులు మెరుగైన పనితీరు చూపించాయి. రుణాల్లో 12–22 శాతం వరకు వృద్ధిని సాధించాయి. అదే ప్రైవేటు రంగ బ్యాంకుల్లో రుణ వృద్ధి 12–20 శాతంగానే ఉంది. అత్యధికంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రుణాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో సంస్థ లోన్బుక్ రూ.2.92 లక్షల కోట్లకు చేరింది. యూకో బ్యాంక్ లోన్బుక్ 20 శాతం పెరిగి రూ.2.34 లక్షల కోట్లకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్బుక్ సైతం 18.90 శాతం పెరిగి రూ.3.45 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఇక మార్చి త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకుల నిర్వహణ లాభం (కేటాయింపులకు ముందు) 9.1 శాతం, నికర లాభం 11.9 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా. -
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీకి కంపెనీల క్యూ
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ పట్ల పదుల సంఖ్యలో కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. జేఎస్డబ్ల్యూ గ్రూప్, ఎన్ఎల్సీ ఇండియా, వేదాంత, హిందుస్థాన్ జింక్ సహా 25 కంపెనీలు ప్రభుత్వం నిర్వహించిన బిడ్ ముందస్తు సమావేశంలో (ప్రీ బిడ్) పాల్గొన్నాయి. మంగళవారం (7న) ఈ సమావేశం జరిగింది. దేశీయంగా సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల తయారీని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో రూ.7,280 కోట్ల ప్రోత్సాహకాలతో భారీ పరిశ్రమల శాఖ ఒక పథకాన్ని తీసుకురావడం గమనార్హం.6,000 మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి (ఎంటీపీఏ) సామర్థ్యంతో తయారీ కేంద్రాల ఏర్పాటుకు బిడ్లను ఆహ్వనిస్తూ మార్చి 20న ప్రకటన జారీ చేసింది. గరిష్టంగా ఐదు సంస్థలను బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ప్రతీ సంస్థ 1,200 ఎంటీపీఏ సామర్థ్యంతో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి ఉత్పత్తి సామర్థ్యం 6,000ఎంటీపీఏగా ఉంటుంది. బిడ్డింగ్ తేదీ మే 28 కాగా, సాంకేతిక బిడ్లను మే 29న తెరవనున్నారు.‘‘ఆశావహ బిడ్డర్లకు స్కీమ్ వివరాలు, ముఖ్యమైన నిబంధనలు, బిబ్డింగ్ ప్రక్రియల గురించి వివరణాత్మక ప్రదర్శన ఇచ్చాం. బిడ్డర్లు లేవనెత్తిన సందేహాలను పరిష్కరించాం. ఈ నెల 22 వరకు తమ సందేహాలను ఈ–మెయిల్ ద్వారా తెలియజేయొచ్చని సూచించాం’’అని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. బిడ్డింగ్ ప్రక్రియ ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ఎల్రక్టానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల అవసరం ఎంతో ఉంటుంది. -
మంత్రిత్వ శాఖ ప్రకటన.. రికార్డు స్థాయిలో విండ్ ఎనర్జీ!
దేశంలో పవనవిద్యుత్ (విండ్ ఎనర్జీ) ఉత్పత్తి సామర్థ్యం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 6.05 గిగావాట్ల విండ్ ఎనర్జీ సామర్థ్యం ఏర్పాటైనట్టు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.ఒక ఏడాదిలో ఏర్పాటైన అత్యధిక సామర్థ్యం ఇదని పేర్కొంది. 2016–17లో ఏర్పాటైన 5.5 గిగావాట్ల విండ్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు రికార్డును అధిగమించినట్టు అయింది. దీంతో 2026 మార్చి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లకు చేరుకుంది.ప్రభుత్వ విధానాల్లో పెరిగిన స్పష్టత, పోటీ మార్గంలో టారిఫ్ల నిర్ణయం, సరఫరా నెట్వర్క్ సిద్ధంగా ఉండడం వంటివి కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి పెరడానికి దారితీసినట్టు పునరుత్పాదక ఇంధన శాఖ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటైన విండ్ ఎనర్జీలో ఎక్కువ భాగం కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఉండడం గమనార్హం. -
యస్ బ్యాంక్కు కొత్త సీఈవో
ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కొత్త ఎండీ, సీఈవోగా వినయ్ మురళీధర్ టోన్సే బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లపాటు వినయ్ బ్యాంకు నిర్వహణను చేపట్టనున్నట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 6తో అదనపు పదవీ కాలం ముగియనున్న ప్రశాంత్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించినట్లు తెలియజేసింది. వేతనం తదితరాలకు ఆర్బీఐ ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది.వినయ్ గతంలో పీఎస్యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకు ఎండీగా విధులు నిర్వహించారు. యస్ బ్యాంక్లో గతేడాది జపనీస్ దిగ్గజం సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ 24 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా అతిపెద్ద ఇన్వెస్టర్గా నిలుస్తోంది.బ్యాంకింగ్ రంగంలో మూడున్నర దశాబ్దాలకుపైగా అనుభవమున్న వినయ్ ట్రెజరీ, రిటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్, అంతర్జాతీయ కార్యకలాపాలు, అసెట్ మేనేజ్మెంట్ తదితర విభాగాలలో పనిచేశారు. బెంగళూరుకు చెందిన సెయింట్ జోసెఫ్ కామర్స్ కాలేజ్లో కామర్స్ డిగ్రీ, బెంగళూరు యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా 1988లో కెరీర్ ప్రారంభించారు.Mr. Vinay M. Tonse assumes office as MD & CEO today. YES BANK enters its next phase of growth with a strengthened foundation and a clear strategic direction. Sustained growth, driven by consistency and purpose, remains central to the journey ahead.We extend our best wishes as… pic.twitter.com/mKLrXN8AMl— YES BANK (@YESBANK) April 6, 2026 -
రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!
ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసేటప్పుడు.. ఫ్యాకేజిలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇతర ప్రయోజనాలను అందివ్వడం సర్వసాధారణం. కానీ ఆఫ్రికాకు చెందిన ఒక కంపెనీ మాత్రం 'కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్' వెల్లడించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక అసలు విషయానికి వస్తే.. వ్యాపారవేత్త అమన్ ధత్తర్వాల్తో, ప్రముఖ పాడ్కాస్టర్ కుశాల్ లోధా మాట్లాడుతూ.. ఒక ఆఫ్రికన్ కంపెనీ ప్లేస్మెంట్ల కోసం ఐఐఎంకు వచ్చి రూ.80 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది. కానీ అందులో రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్ కోసం కేటాయించిందని వెల్లడించాడు. అంటే ఆ డబ్బు కిడ్నాపర్ల కోసం అన్నమాట."ఈ సీటీసీ వర్సెస్ చేతికి అందే జీతం అనేది ఒక రకమైన మోసం అని నాకు అనిపిస్తోంది" అని లోధా అన్నారు. "ఈ కంపెనీ ఐఐఎం కలకత్తాకు వచ్చి, సంవత్సరానికి రూ. 80 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసింది. పైగా ఇది ఆఫ్రికాకు చెందిన కంపెనీ. అక్కడ కిడ్నాప్లు చాలా సాధారణమని తెలుస్తోంది. కాబట్టి ఆ రూ. 80 లక్షల వార్షిక వేతనంలో, రూ. 40 లక్షలు జీతం కాగా.. మిగిలిన రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్. అంటే.. కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎప్పుడైనా కిడ్నాప్కు గురైతే.. రూ.40 లక్షలు కిడ్నాపర్లకు చెల్లించి విడిపించుకుంటుందన్న మాట. అయితే లోధా ఆ కంపెనీ పేరును వెల్లడించలేదు.ఇదీ చదవండి: 'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఒకవేళా కిడ్నాపర్లకు రూ.40 లక్షల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే?, ఆ తరువాత సంవత్సరం క్లెయిమ్ చేసుకోవాలా? అని కొందరు పేర్కొన్నారు. ఒకవేలా సన్నిహితులు కూడా ఆ డబ్బుకోసం ఉద్యోగిని కిడ్నాప్ చేయొచ్చు కదా అని ఇంకొందరు అన్నారు. -
కేరళ దేవాలయాలకు అనంత్ అంబానీ భూరి విరాళం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు భారీ విరాళాలు ప్రకటించారు. రాజరాజేశ్వరం, గురువాయూర్ ఆలయాల అభివృద్ధికి, గజరాజుల సంరక్షణకు సంబంధించి మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు.రాజరాజేశ్వరం ఆలయ పునరుద్ధరణకు పెద్దపీటఇటీవల తలపరంబలోని చారిత్రక రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం రూ.12 కోట్ల భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు శతాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న అత్యంత పురాతనమైన, పురావస్తు ప్రాధాన్యత కలిగిన తూర్పు గోపురాన్ని పునరుద్ధరించడానికి ఈ నిధులను ప్రధానంగా వెచ్చించనున్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పడతాయి. తక్షణ విరాళం కింద ఆలయ నిర్వహణ కమిటీకి రూ.3 కోట్ల చెక్కును అందజేశారు.ఏనుగుల సంరక్షణ కోసం..అంతకుముందు, గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించిన అనంత్ అంబానీ స్వామివారికి రూ.3 కోట్ల విరాళాన్ని సమర్పించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా స్ఫూర్తితో గురువాయూర్ ఏనుగుల సంక్షేమం కోసం వినూత్న ప్రణాళికలను ప్రకటించారు.ఏనుగుల కోసం ప్రత్యేకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ఆసుపత్రి నిర్మాణం.ఏనుగులను గొలుసులతో కట్టేయకుండా స్వేచ్ఛగా తిరిగేలా ఆధునిక వసతి గృహాల ఏర్పాటు.ఏనుగులకు గౌరవప్రదమైన, శాస్త్రీయమైన సంరక్షణ అందించడానికి అవసరమైన సాంకేతిక మద్దతు.‘భారతీయ ఆధ్యాత్మిక ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు. అవి విశ్వాసం, కరుణ, ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటిచెప్పే జీవన కేంద్రాలు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూనే మన సంప్రదాయంలో భాగమైన మూగజీవాలకు అత్యుత్తమ వైద్యం, గౌరవం అందించడమే మా లక్ష్యం’ అని అనంత్ అంబానీ అన్నారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
టెక్ ఇండస్ట్రీలో ఏఐ ప్రకంపనలు
గ్లోబల్ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతోంది. 2026 ప్రారంభం నుంచే టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ మంత్రాన్ని జపిస్తుండటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలోకి మళ్లుతున్న పెట్టుబడులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 51,000 మంది నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. నియామకాలు మందగించడం, కేవలం నైపుణ్యం కలిగిన స్వల్ప శ్రామిక శక్తితోనే గరిష్ట ఉత్పాదకత సాధించాలనే లక్ష్యంతో కంపెనీలు అడుగులు వేస్తున్నాయి.రంగంలోకి ఏఐప్రస్తుత సంక్షోభంలో క్లౌడ్ కంప్యూటింగ్, హార్డ్వేర్, గేమింగ్ రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఈ ఏడాది చోటుచేసుకున్న ప్రధాన తొలగింపులు కింది విధంగా ఉన్నాయి.ఒరాకిల్.. టెక్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ డే లేఆఫ్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని తొలగించింది. ఇందులో భారత్కు చెందిన 12,000 మంది ఉండటం గమనార్హం. ఏఐ మౌలిక సదుపాయాల పటిష్టతకే తమ ప్రాధాన్యమని సంస్థ స్పష్టం చేసింది.అమెజాన్.. కొవిడ్ సమయంలో పెరిగిన అదనపు సిబ్బందిని తగ్గించుకునే క్రమంలో సుమారు 16,000 మందికి ఉద్వాసన పలికింది. రోబోటిక్స్ విభాగంలోనూ కోతలు విధించడం ద్వారా కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టింది.డెల్.. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా 11,000 ఉద్యోగాలను తొలగించడంతోపాటు కొత్త నియామకాలపై కఠిన ఆంక్షలు విధించింది.బ్లాక్(Block).. జాక్ డోర్సే నేతృత్వంలోని ఈ సంస్థ 4,000 మందిని తొలగిస్తూ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరగడమే ఇందుకు కారణమని బహిరంగంగా ప్రకటించింది.మెటా, అట్లాసియన్.. మెటా తన రియాలిటీ ల్యాబ్స్లో 10 శాతం సిబ్బందిని తగ్గించగా, అట్లాసియన్ 1,600 మందిని ఇంటికి పంపింది. మారుతున్న ఏఐ నైపుణ్య అవసరాలే ఇందుకు కారణమని అట్లాసియన్ పేర్కొంది.కారణాలేంటి?కంపెనీలు తమ మూలధనాన్ని సాధారణ నిర్వహణ నుంచి ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఎఫిషియన్సీ (సామర్థ్యం) పేరుతో ఖర్చులను తగ్గిస్తున్నాయి. సంప్రదాయ కోడింగ్, సపోర్ట్ ఉద్యోగాల కంటే ఏఐ డెవలప్మెంట్, డేటా సైన్స్ తెలిసిన వారి కోసమే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.మానవ మేధ vs కృత్రిమ మేధఈ లేఆఫ్స్ పరంపర ఉద్యోగ భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది. ఏఐ వల్ల సాధారణ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో ఏఐ నైపుణ్యం కలిగిన వారికి కొత్త అవకాశాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టెక్ రంగం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య కంటే సాంకేతిక సామర్థ్యానికే పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న తొలగింపులు కేవలం ఖర్చు తగ్గింపు మాత్రమే కాదు, అది పరిశ్రమ నిర్మాణంలో వస్తున్న పెను మార్పు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోకపోతే ఈ డిజిటల్ రేసులో వెనుకబడే ప్రమాదం ఉంది’ అని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
ఎయిర్ ఇండియా సీఈఓ రాజీనామా
టాటా గ్రూప్ సారథ్యంలోని ఎయిర్ ఇండియా కంపెనీ సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు. టాటా చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎయిర్ ఇండియాను తిరిగి పట్టాలెక్కించే క్రమంలో కీలక పాత్ర పోషించిన విల్సన్ తన పదవీకాలం ముగియక ముందే తప్పుకోవడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల క్రితం ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా గ్రూప్ సంస్థలో భారీ మార్పులు వస్తాయని ఆశించింది. అయితే, ఊహించిన దానికంటే పరివర్తన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం.ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లు సమాచారం. కొత్త సీఈఓను నియమించే వరకు విల్సన్ తన బాధ్యతల్లో కొనసాగుతారని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం ఆయన తన నోటీసు పీరియడ్లో ఉన్నారు. తన నిష్క్రమణకుగల కారణంపై స్పష్టత రావాల్సి ఉంది. గతేడాది జూన్లో జరిగిన ఏఐ 171 అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వెలువడిన అనంతరం ఆయన పూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉంది.దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగోలో కూడా ఇటీవల మార్పులు చోటుచేసుకున్నాయి. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన రాజీనామాను ప్రకటించగా సంస్థ ఇప్పటికే కంపెనీ చీఫ్ను ప్రకటించింది. ఆయన ఆగస్టు నాటికి బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఎయిర్ ఇండియా విషయంలో టాటా గ్రూప్ కొన్ని నెలల క్రితమే కొత్త సీఈఓ కోసం అన్వేషణ ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు సరైన అభ్యర్థి దొరకలేదు. ఇండిగో తన కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేసుకోగా, ఎయిర్ ఇండియా చీఫ్ కోసం కొందరి పేర్లను పరిశీలిస్తోంది.ఇదీ చదవండి: రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే తీవ్ర పరిణామాలు -
క్యూ4లో ఐటీ డీలా!
ముంబై: భారతీయ ఐటీ సేవల రంగం 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని నిస్తేజంగా ముగించే అవకాశముందని బ్రోకరేజ్ సంస్థల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాలుగో త్రైమాసికంలో (క్యూ4) త్రైమాసికవారీ(సీక్వెన్షియల్) వృద్ధి మందగించవచ్చని భావిస్తున్నారు. అయితే రూపాయి బలహీనత అనుకూలతకావడంతో వార్షిక ప్రాతిపదికన కొంత మెరుగుదల కనిపించవచ్చని పేర్కొంటున్నారు. డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, జనరేటివ్ ఏఐ వల్ల ధరలు నిర్ణయించే విధానంలో మార్పులు, ఒప్పందాలు కుదుర్చుకోవడంపై అనిశ్చితి పెరుగుతోందని వివరించారు. మార్చి త్రైమాసిక ఫలితాల కంటే, ఆర్థిక సంవత్సరం 2026–27 అంచనాలు(గైడెన్స్)పైనే మార్కెట్ దృష్టి కేంద్రీకృతమైనట్లు తెలియజేశారు. ప్రధానంగా వృద్ధి అవకాశాలపై స్పష్టత, ఆదాయంపై ఏఐ ప్రభావాలు, మార్జిన్ల నిలకడకు ప్రాధాన్యమున్నట్లు అభిప్రాయపడ్డారు.వృద్ధి మందగమనం, ఏడాది చివర్లో రికవరీత్రైమాసిక ప్రాతిపదికన (సీక్వెన్షియల్గా) చూస్తే, ఎఫ్వై 26 నాలుగో త్రైమాసికం (క్యూ4) పనితీరు నిరుత్సాహకరంగానే ఉండవచ్చని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. టైర్–1 ఐటీ కంపెనీల వృద్ధి అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది. ‘‘స్థిర మారకపు విలువల ఆధారంగా టైర్–1 కంపెనీల వృద్ధి –1.1 శాతం నుంచి 0.9 శాతం మధ్య ఉండవచ్చు. మధ్యస్థాయి (మిడ్–టైర్) కంపెనీల వృద్ధి –1.8 శాతం నుంచి 3.4 శాతం వరకు ఉండొచ్చు’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అంచనా వేసింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా క్యూ4ను ‘సాధారణ త్రైమాసికం’గానే అభివర్ణించింది. పెద్ద కంపెనీల (లార్జ్ క్యాప్) వృద్ధి –1.0 శాతం నుంచి 1.5 శాతం మధ్య ఉండవచ్చని, మిడ్–క్యాప్ కంపెనీలు మాత్రం మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తాయని పేర్కొంది. మూడో త్రైమాసికం (క్యూ3)తో పోలిస్తే, నాలుగో త్రైమాసికంలో (క్యూ4) సెలవులు లేదా తాత్కాలిక విరామాలు లేకపోవడం కొంత మద్దతు ఇచి్చంది. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్ రంగాలకు ఇది ఉపయోగపడింది. అయితే తక్కువ పని దినాలు, ఐచ్చిక ఖర్చులపై (డి్రస్కిషనరీ స్పెండింగ్) కొనసాగుతున్న అప్రమత్తత వైఖరి కారణంగా ఈ ప్రభావం కొంత మేర తగ్గింది. ఇక నాలుగో త్రైమాసికంలో వృద్ధి ప్రధానంగా డీల్ల విస్తరణ, విలీనాలు/కొనుగోళ్లు వల్లనేనని, డిమాండ్ పెరుగుదల వల్ల కాదని బ్రోకరేజ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.మార్జిన్లకు కరెన్సీ ఆసరాదేశీయ ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికంలో (క్యూ4) మార్జిన్లు స్థిరంగా ఉండే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. రూపాయి బలహీనత కారణంగా కొద్దిపాటి మెరుగుదల కనిపించవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, కోటక్ బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరెన్సీ ప్రభావంతో 35 నుంచి 320 బేసిస్ పాయింట్ల వరకు మార్జిన్ విస్తరణ సాధ్యమని భావిస్తున్నాయి. అయితే ఇది స్థిరమైన వృద్ధి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేతనాల పెంపు, కొత్త డీల్ల ప్రారంభ ఖర్చులు, ఉత్పాదకత ఆధారిత ధరల విధానం మార్జిన్లపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయి. మొత్తం మీద, స్వలకాలంలో రూపాయి బలహీనత మార్జిన్లకు కొంత ఊరటనిచి్చనా, దీర్ఘకాలంలో స్థిరమైన వృద్ధికి నిర్మాణాత్మక మార్పులు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.విలీనాలు–కొనుగోళ్లు, నియామకాల ప్రభావంప్రధాన ఐటీ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో భారీగా విలీనాలు, కొనుగోళ్లు (ఎం–ఏ) చేపట్టాయి. టీసీఎస్ కూడా దశాబ్దం తర్వాత ఈ దిశగా అడుగుపెట్టింది. కృత్రిమ మేధ, డేటా, సెమీకండక్టర్ల వంటి అనుబంధ సామర్థ్యాల కోసం ఈ కొనుగోళ్లు జరిగాయి. అయితే జనరేటివ్ ఏఐ ప్రభావంతో ఈ సామర్థ్యాలపై కూడా డిఫ్లేషన్ ఒత్తిడి ఉండొచ్చని కోటక్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విలీనాలు, కొనుగోళ్లు ఆదాయ వృద్ధిపై ఎలా ప్రభావం చూపుతాయన్నది కీలకం. ఇదే సమయంలో కంపెనీల్లో నియామకాలు మందగించే అవకాశముందని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. టీసీఎస్, హెచ్సీఎల్టెక్, టెక్ మహీంద్రా సంస్థలు ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టాయి. తాజా నియామకాలకు ప్రాధాన్యం పెరుగుతుండగా, మధ్యస్థాయి ఉద్యోగాల నియామకాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.ఏఐ ప్రభావంతో వాల్యుయేషన్లకు కొత్త సవాలుకృత్రిమ మేధ కారణంగా ఏర్పడే ‘ధరల తగ్గుదల’ (డిఫ్లేషన్) అనేది మధ్యకాల ఆందోళన నుంచి ఇప్పుడు ఐటీ రంగం వాల్యుయేషన్లు, భవిష్యత్ అంచనాలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. ‘‘ఈ డిఫ్లేషన్ భయాలతో ఐటీ షేర్లలో గణనీయమైన పతనం చోటుచేసుకుంది. ఐటీ సేవల ఫీజు ఇప్పుడు ‘ఏజెంట్–ఆగ్మెంటెడ్’ (ఏఐ సహాయంతో నిర్ణయించబడే విధంగా) మారుతుండగా, ఒప్పందాల పునరుద్ధరణలు తగ్గింపు ధరలతో జరుగుతున్నాయి’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ‘‘ఏఐ ప్రభావం తక్షణ ఫలితాలకంటే భవిష్యత్ మార్పులపైనే ఆధారపడి ఉంటుంది. ఇక పెట్టుబడిదారుల ప్రధాన ప్రశ్న ఏఐ ప్రభావం ఉంటుందా కాదా అనేది కాదు; కంపెనీలు కొత్త ఏఐ ఒప్పందాల ద్వారా ఈ డిఫ్లేషన్ ప్రభావాన్ని ఎంత త్వరగా తగ్గించగలవన్నదే కీలకం’’ అని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.యుద్ధం ఎఫెక్ట్...ఆర్థిక సంవత్సరం 2026 తొలి మూడు త్రైమాసికాల్లో టీసీఎస్, హెచ్సీఎల్టెక్ వంటి దిగ్గజాలు బలమైన ఆర్డర్బుక్స్తో ఆర్థిక సంవత్సరం 2027 వృద్ధిపై ఆశావహంగా ఉన్నా.., పల్చిమాసియా యుద్ధం తీవ్రతరమవడంతో పరిస్థితి మారింది. భారత ఐటీ కంపెనీలకు కీలకమైన క్లయింట్ సెగ్మెంట్లపై యుద్ధ ప్రభావం పడే అవకాశముంది.యుద్ధ పరిస్థితుల కారణంగా నిర్ణయాలలో జాప్యం, ఏఐ డిఫ్లేషన్ ప్రభావంపై మేనేజ్మెంట్ వ్యాఖ్యలు ముఖ్యమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ఖర్చు తగ్గింపునకు దారి తీసే అవకాశాలు తక్కువేనని కోటక్ అభిప్రాయపడింది. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2027 డిమాండ్పై స్పష్టత ఇంకా అనిల్చితంగానే ఉంది. -
విప్రో రూ. 9,300 కోట్ల డీల్
న్యూఢిల్లీ/సింగపూర్: ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా ఫుడ్, అగ్రి బిజినెస్ల సింగపూర్ దిగ్గజం ఓలమ్ గ్రూప్తో భారీ డీల్ కుదుర్చుకుంది. 8 ఏళ్లపాటు అమల్లో ఉండే ఈ ట్రాన్స్ఫార్మేషన్ కాంట్రాక్టు విలువ బిలియన్ డాలర్లు(సుమారు రూ. 9,300 కోట్లు)కాగా.. దీనిలో భాగంగా ఓలమ్ గ్రూప్నకు చెందిన ఐటీ, డిజిటల్ సర్వీసుల విభాగం మైండ్స్ప్రింట్ పీటీఈను కొనుగోలు చేయనుంది. ఇందుకు 37.5 కోట్ల డాలర్లు(రూ. 3,494 కోట్లు) వెచ్చించనున్నట్లు విప్రో వెల్లడించింది. పీఈ దిగ్గజం టెమాసెక్ మెజారిటీ వాటా కలిగిన ఓలమ్ గ్రూప్ 50 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయంతోపాటు 40,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నట్లు్ల పేర్కొంది. సింగపూర్ కేంద్రంగా 2007లో ఏర్పాటైన మైండ్స్ప్రింట్కు భారత్సహా.. సింగపూర్, యూఎస్, యూకే, పశ్చిమాసియాలో 3,200 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 2025 కేలండర్ ఏడాదిలో 13.56 కోట్ల డాలర్ల కన్సాలిడేటెడ్ ఆదాయం అందుకుంది. ఓలమ్ గ్రూప్తో కుదుర్చుకున్న వ్యూహాత్మక డీల్లో భాగంగా ఎండ్ టు ఎండ్ ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులను అందించనున్నట్లు విప్రో తెలియజేసింది. ఏఐ ఆధారిత కన్సల్టింగ్ సేవలు సమకూర్చనున్నట్లు పేర్కొంది. పూర్తి నగదురూపేణా 2026 జూన్ 30కల్లా మైండ్స్ప్రింట్లో 100 శాతం వాటా కొనుగోలు చేసే వీలున్నట్లు వెల్లడించింది. ఐపీ ఆధారిత సొల్యూషన్లలో మైండ్స్ప్రింట్కున్న డొమైన్ నైపుణ్యాలకు ఏఐతోకూడిన విప్రో కన్సల్టింగ్ ఆధారిత సామర్థ్యాలు జత కలవనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియా పేర్కొన్నారు. ఒప్పందం ప్రకారం విప్రోకు పూర్తి అనుబంధ కంపెనీగా మైండ్స్ప్రింట్ అవతరించనుంది. అయితే సంస్థ ప్రస్తుత సీఈవో సురేష్ సుందరరాజన్ బాధ్యతలను కొనసాగించనున్నారు. బీఎస్ఈలో విప్రో షేరు 1.25% బలపడి రూ. 197 వద్ద ముగిసింది. -
హెల్త్కేర్, ఫార్మాలో.. ఉద్యోగ‘మస్తు’!
ముంబై: ఆరోగ్య సంరక్షణ (హెల్త్కేర్), ఫార్మాస్యూటికల్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. డిమాండ్ పెరుగుతున్న క్రమంలో 2030 నాటికి కొత్తగా 20–25 లక్షల ఉద్యోగాలు రానున్నట్టు అడెకో ఇండియా నివేదిక అంచనా వేసింది. 30–35% సిబ్బందికి కొత్త నైపుణ్యాలపై శిక్షణ అవసరం పడుతుందని తెలిపింది. హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు సామర్థ్య ఆధారిత వృద్ధి దశలోకి అడుగుపెట్టాయని పేర్కొంది. ఆస్పత్రులు, ఆయుష్, హోమ్కేర్, వృద్ధుల సంరక్షణ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, డయాగ్నొస్టిక్స్, టెలి మెడిసిన్, క్లినికల్ పరిశోధన, ప్రజారోగ్యం వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో విస్తరిస్తున్న ఈ రంగం వాటాకు అనుగుణంగా ఈ వృద్ధి ముడిపడి ఉన్నట్టు తెలిపింది. 2022 నాటికి జీడీపీలో హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్ వాటా 3.3%గా ఉంటే.. 2030 నాటికి 5 శాతానికి విస్తరించనున్నట్టు అడెకో నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా క్లినికల్ పరిశోధనలు, డిజిటల్ హెల్త్కు పెరుగుతున్న ప్రాధాన్యత, ఔషధాల అభివృద్ధి, తయారీ కార్యకలాపాల అవుట్సోర్స్కు అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పెరు గుతుండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది. ఇక్కడ డిమాండ్ ఎక్కువ.. డయాగ్నొస్టిక్స్, వ్యాధి నిరోధక ముందస్తు చెకప్లు, టెలిమెడిసిన్ విభాగాల్లో 20–25% మేర ఉపాధి అవకాశాలు పెరగనున్నట్టు ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా టైర్–2, 3 పట్టణాల నుంచి ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. అలాగే, కాంప్లెక్స్ జనరిక్స్, బయోలాజిక్స్, స్పెషాలిటీ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతుండడంతో.. అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ), నియంత్రణ పరమైన విభాగాల్లోనూ ఉద్యోగాలకు 25–30% మేర డిమాండ్ పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనే ఉన్నప్పటికీ.. పుణే, అహ్మదాబాద్, కోయంబత్తూరు వంటి టైర్–2, 3 నగరాల్లో కూడా అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ నగరాల్లో ఆస్పత్రుల నెట్వర్క్ విస్తరణను ప్రస్తావించింది. విదేశాల్లో భారతీయ ఆరోగ్య రంగ నిపుణులకు డిమాండ్ 25–30% పెరగనుందని, ముఖ్యంగా మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, యూకే వంటి ప్రాంతాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. -
'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?
ఓ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. చాలామంది ఉద్యోగులు భయపడతారు, బాధపడతారు. కానీ ఒరాకిల్ కంపెనీ తొలగించిన ఒక ఉద్యోగి మాత్రం ఇందుకు భిన్నం. ఉబెర్ డ్రైవర్గా పనిచేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నా సన్నిహితులలో ఒకరిని ఒరాకిల్ బెంగళూరు సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించింది. అతడు ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి లోను కాకపోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆ విషయాలను వెల్లడించలేదు. జాబ్ కోల్పోయిన తరువాత వెంటనే తన సొంత ఊరైన భువనేశ్వర్కు తిరిగి వచ్చేశాడు.అయితే.. అతనికి రెండు జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో.. ఒక్కొక్కదానిలో రూ.15 లక్షల చొప్పున పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నాడు. ఒకటి అతని తల్లిదండ్రుల పేరు మీద, మరొకటి అతని, అతని భార్య పేరు మీద ఉంది. అతని పిల్లల ఖాతాలో కూడా ఒకటి ఉంది. వీటన్నింటి ద్వారా అతనికి ప్రతి నెలా దాదాపు రూ.28,000 వడ్డీ వస్తుంది.పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్లు కాకుండా.. అతనికి కొన్ని బ్యాంకులలో దాదాపు రూ.30 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వీటి ద్వారా అతనికి నెలకు మరో రూ.15,000 వస్తుంది. అతను ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ వచ్చు, కాబట్టి అతను వెంటనే తనకు వీలైనప్పుడు ఉబెర్ డ్రైవర్గా పనిచేస్తూ మంచి సంపాదన పొందుతున్నాడు.ఇదీ చదవండి: ఆ రైల్వే స్టేషన్కు వెళ్లాలంటే.. పాస్పోర్ట్, వీసా ఉండాల్సిందే!అతనికి ఈఎంఐలు లేవు, ఏ మెట్రో నగర ఫ్లాట్కు లోన్స్ లేవు. అదే సమయంలో, అతను తన తల్లిదండ్రుల సహాయంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రశాంతంగా ప్రణాళిక వేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్సర్లను అనుసరించలేదు, SIPలు చేయలేదు, ఆర్థిక హడావుడికలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా పాత పద్ధతుల మనస్తత్వం, స్థిరమైన ప్రక్రియ, క్రమశిక్షణ.కాబట్టి.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. జాబ్ ఉన్నా.. లేకున్నా మీ ఆర్ధిక క్రమ శిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో సిద్ధంగా ఉండటమే నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం అని నాయక్ సత్య అనే ట్విటర్ యూజర్ ఈ విషయాలు షేర్ చేశారు.One of my close friends was fired from Oracle Bangalore.No panic, no stress, and no crying on social media. He straight away came back to his hometown Bhubaneswar He had postal fixed deposits in two joint accounts ₹15 lakh each. One with his parents, and the other in his…— Nayak Satya (@NayakSatya_SG) April 5, 2026 -
25 లక్షల టన్నుల యూరియా దిగుమతికి రంగం సిద్ధం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారు అయిన భారతదేశం సుమారు 2.5 మిలియన్ (25 లక్షల) టన్నుల యూరియాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.టెండర్ల జారీప్రభుత్వ పక్షాన ఎరువుల కొనుగోళ్లు జరిపే ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) ఇటీవల భారీ అంతర్జాతీయ టెండర్ను జారీ చేసింది. ఈ టెండర్ ద్వారా 1.5 మిలియన్ టన్నుల యూరియాను పశ్చిమ తీర నౌకాశ్రయాల ద్వారా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన మొత్తాన్ని తూర్పు తీర ప్రాంతాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎరువుల రవాణా నౌకలు జూన్ 14వ తేదీ నాటికి సంబంధిత ఓడరేవుల నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. టెండర్ల ఆఫర్ల సమర్పణకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా, ఇవి ఏప్రిల్ 23 వరకు చెల్లుబాటులో ఉంటాయి.భారతదేశ యూరియా ఉత్పత్తి ప్రధానంగా సహజ వాయువుపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా వినియోగించే సహజ వాయువులో మెజారిటీ భాగం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి అవుతోంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల హార్మూజ్ జలసంధి వద్ద రాకపోకలకు ఆటంకం కలగడంతో ఎల్ఎన్జీ కొరత ఏర్పడింది. ఈ ప్రభావంతో గత నెలలో దేశంలోని కొన్ని కీలక ఎరువుల ప్లాంట్లు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.ఖరీఫ్ సన్నద్ధత - నిల్వల వివరాలుజూన్-సెప్టెంబర్ వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల సాగు ప్రారంభం కానుంది. ఈ సీజన్కు దేశవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ టన్నుల ఎరువులు అవసరమని ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత నిల్వ 18 మిలియన్ టన్నులుగా ఉంది. మిగిలిన 21 మిలియన్ టన్నులను దేశీయ ఉత్పత్తి, ప్రస్తుత దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
గేట్స్ ఫౌండేషన్కు వారెన్ బఫెట్ విరాళాల నిలిపివేత?
దాతృత్వానికి చిరునామాగా నిలిచే ప్రపంచ కుబేరుల మధ్య దశాబ్దాల స్నేహం ఇప్పుడు సంక్షోభంలో పడింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ మధ్య ఉన్న అనుబంధం జెఫ్రీ ఎప్స్టీన్ వివాదంతో బీటలు వారుతోంది. ఈ క్రమంలోనే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్కు తాను ఇస్తున్న భారీ విరాళాలను బఫెట్ నిలిపివేసే అవకాశం ఉందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.ఎప్స్టీన్ వ్యవహారంపై బఫెట్ మౌనం?ఇటీవల ఓ మీడియా కార్యక్రమంలో బఫెట్ మాట్లాడుతూ.. ఈ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తాను బిల్ గేట్స్తో మాట్లాడలేదని కుండబద్దలు కొట్టారు. వారిద్దరూ కలిసి గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూనే ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కొనసాగించడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ వివాదంలో భాగంగా దశాబ్దాల నాటి ఫౌండేషన్ కార్యకలాపాలపై విచారణ ఎదుర్కోవాల్సి రావడం, విరాళాలకు సంబంధించి ప్రమాణం చేసి సాక్ష్యాలు చెప్పాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని బఫెట్ స్పష్టం చేశారు. ఫౌండేషన్లో తన పాత్ర కేవలం నిధులు సమకూర్చడానికే పరిమితమని ఆయన గుర్తు చేశారు.విరాళాల కొనసాగింపుపై సందిగ్ధతగేట్స్ ఫౌండేషన్కు ఆర్థిక సహాయం కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు బఫెట్ నేరుగా సమాధానం చెప్పలేదు. ‘వేచి చూద్దాం ఏం జరుగుతుందో’ అని వ్యాఖ్యానిస్తూ ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజా పరిణామాల ద్వారా తనకు తెలియని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆయన అంగీకరించడం గమనార్హం. అయితే, ఎప్స్టీన్ ఆరోపణల్లో బిల్గేట్స్ ప్రత్యక్షంగా పాల్గొన్నారని తాను నమ్మడం లేదని బఫెట్ పేర్కొన్నారు.యాపిల్ వాటాల తగ్గింపుపై వ్యాఖ్యలుఇదే ఇంటర్వ్యూలో బఫెట్ తమ సంస్థ బెర్క్షైర్ హాత్వేకి సంబంధించిన కీలక వ్యాపార నిర్ణయాలను పంచుకున్నారు. యాపిల్ ఇంక్లో తమకున్న భారీ వాటాను ఇప్పటికే తగ్గించామని బఫెట్ అంగీకరించారు. డిసెంబర్ నాటికి ఈ హోల్డింగ్స్ గరిష్ట స్థాయిల నుంచి 75 శాతం మేర తగ్గడం విశేషం. బెర్క్షైర్ హాత్వే సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ బఫెట్ ఇంకా చైర్మన్గా చురుగ్గా పని చేస్తున్నారు. రోజువారీ పెట్టుబడి నిర్ణయాల్లో పాల్గొంటున్నప్పటికీ తుది నిర్ణయాలను మాత్రం కొత్త సీఈఓ గ్రెగ్ అబెల్ తీసుకుంటారని వెల్లడించారు.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. మార్చి నెలలో ఏకంగా 5,500కు పైగా విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్ నెల అంటే భారతీయులకు సెలవుల కాలం. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో చాలామంది విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2025లోనే సుమారు 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ప్రయాణం చేసేవారు కేవలం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుందని భావిస్తే పొరపాటే. యుద్ధ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు పూర్తిగా మారిపోతాయి.సాధారణ సమయాల్లో ఇన్సూరెన్స్ కవరేజీ ఇలా..సాధారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రధానంగా ఐదు అంశాలను కవర్ చేస్తుంది.సామాను కోల్పోవడం: 300 డాలర్ల నుంచి 1,000 డాలర్ల వరకు కవరేజీ.పాస్పోర్ట్ పోగొట్టుకోవడం: 200 నుంచి 300 డాలర్ల వరకు.వైద్య ఖర్చులు: 2,50,000 నుంచి 5,00,000 డాలర్లు వరకు (కనీసం 24 గంటల హాస్పిటలైజేషన్ అవసరం).ప్రమాదాలు: 20,000 నుంచి 30,000 డాలర్ల వరకు.ట్రిప్ క్యాన్సిలేషన్: అనారోగ్యం, వాతావరణం లేదా సాంకేతిక కారణాల వల్ల విమానం రద్దయితే సుమారు 1,000 డాలర్ల వరకు కవరేజీ ఉంటుంది.యుద్ధం వస్తే.. మీ పాలసీ పనిచేయదు!ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఒకవేళ మీ విమానం రద్దు కావడానికి లేదా మీకు గాయాలు కావడానికి యుద్ధం ప్రత్యక్ష కారణమైతే (ఉదాహరణకు: ఎయిర్పోర్టుపై డ్రోన్ దాడులు, రన్వేల మూసివేత, బాంబు దాడులు) ఇన్సూరెన్స్ కంపెనీలు పైసా కూడా చెల్లించవు. మెజారిటీ ఇన్సూరెన్స్ పాలసీల్లో ‘వార్ ఎక్స్క్లూజన్’ క్లాజ్ ఉంటుంది.వైద్య సాయం: యుద్ధం వల్ల కలిగే గాయాలకు (పేలుళ్ల వల్ల వచ్చే శిథిలాలు తగలడం వంటివి) ఇన్సూరెన్స్ వర్తించదు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాల సాయం లేదా సొంత ఖర్చులపైనే ఆధారపడాలి.హోటల్ ఖర్చులు: విమానాలు రద్దయి యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకుపోతే హోటల్ ఖర్చులను ప్రయాణికులే భరించాలి లేదా ఎయిర్లైన్స్ ఇచ్చే వెసులుబాటును వాడుకోవాలి.సురక్షితంగా ప్రయాణించడం ఎలా?ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం. ప్రస్తుతం క్షేమంగా ఉన్న మార్గాలు.. జపాన్, చైనా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా. అమెరికా పశ్చిమ తీరానికి వెళ్లేవారు హాంకాంగ్ మీదుగా వెళ్లడం సురక్షితం. అలాగే యూరప్ వెళ్లే కొన్ని విమానాలు పశ్చిమాసియాను తప్పించుకుంటూ మ్యూనిచ్ వంటి నగరాల మీదుగా నడుస్తున్నాయి.ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండొచ్చు?టాటా ఏఐజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, డిజిట్ వంటి కంపెనీలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. షెంజెన్ దేశాలకు వెళ్లే నలుగురు సభ్యులున్న కుటుంబానికి (ఇద్దరు పిల్లలతో కలిపి) రూ.6,500 నుంచి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నాయి. అమెరికా ట్రిప్ కోసం రూ.10,000 నుంచి రూ.24,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, విదేశీ ప్రయాణానికి వెళ్లేముందు మీ పాలసీలోని నిబంధనలు, మినహాయింపులు, షరతులు క్షుణ్ణంగా చదవాలి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ ఇచ్చే రీఫండ్, రీషెడ్యూల్ ఆప్షన్లపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
టాటా ఆటో కాంప్తో బాష్ జత
ఆటో విడిభాగాల దేశీ కంపెనీ టాటా ఆటోకాంప్ సిస్టమ్స్తో టెక్నాలజీ, సర్వీసుల దిగ్గజం బాష్ లిమిటెడ్ చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నట్లు బాష్ పేర్కొంది. జేవీ ప్రధానంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ అవసరాలకు అనుగుణమైన ఇంజినీరింగ్, తయారీపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది.సమాన వాటాతో పుణేలో ఏర్పాటు చేయనున్న జేవీ అన్ని అనుమతులు లభిస్తే 2026 మధ్యలో కార్యకలాపాలు ప్రారంభించగలదని అంచనా వేసింది. దేశీయంగా ఇంజినీరింగ్, తయారీ, ఈయాక్సిల్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ మోటార్స్ విక్రయాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. భారత్ ప్రపంచంలోనే మూడో పెద్ద ఆటోమోటివ్ మార్కెట్కాగా.. దీంతో దేశీయంగా లభించనున్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని బాష్ లక్ష్యంగా పెట్టుకుంది. -
అందుకేనా 'ఒరాకిల్'లో ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ అమెరికన్ టెక్ దిగ్గజం ఒరాకిల్ వేలాది ఉద్యోగులను తొలగించిన విషయం పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన మరువకముందే.. కంపెనీ విదేశీ ఉద్యోగులను నియమించడానికి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమైంది.యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు సంబంధించిన ఫెడరల్ డేటా ప్రకారం.. ఒరాకిల్ 2025-26 ఆర్థిక సంవత్సరాలలో H-1B కార్మికులను నియమించుకోవడానికి సుమారు 3,126 పిటిషన్లు దాఖలు చేసింది. ఇందులో 2026లో మాత్రమే 436 దరఖాస్తులు ఉన్నాయి.టెక్నాలజీ, రక్షణ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ ఉద్యోగులను కంపెనీ నియమించుకోవచ్చు. అయితే... అంతకంటే ముందు సంస్థలో అదే నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేరని సంస్థ నిరూపించాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ఒరాకిల్ భారీ లేఆఫ్స్ చేపట్టిందని చెబుతున్నారు.ఒరాకిల్ ఉద్యోగుల తొలగింపులు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. చాలామంది ఉద్యోగులు అకస్మాత్తుగా తమ ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీ పంపిన ఈమెయిల్లో సంస్థ అవసరాల దృష్ట్యా మీ ఉద్యోగాన్ని రద్దు చేస్తున్నామని తెలియజేశారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారికి కొంతమేర పరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.ఒరాకిల్ కంపెనీ కంటే ముందు.. అమెజాన్ కూడా 16000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇదే సమయంలో 2675 H-1B పిటిషన్లు దాఖలు చేసింది. దీన్నిబట్టి చూస్తే.. ఇది పెద్ద కంపెనీలు అనుసరిస్తున్న ఒక సాధారణ ధోరణిగా కనిపిస్తోంది. దీనిని అమెరికాలో చాలామంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విదేశీ ఉద్యోగులను ఎక్కువగా నియమించడం వల్ల స్థానిక అమెరికన్ ఉద్యోగులకు అవకాశాలు తగ్గుతున్నాయని వారు భావిస్తున్నారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు: వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే? -
మింత్రా సీఈఓ రాజీనామా!
ఫ్లిప్కార్ట్ యాజమాన్యంలోని ఆన్లైన్ ఫ్యాషన్ ప్లాట్ఫామ్ 'మింత్రా' చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నందితా సిన్హా రాజీనామా చేయనున్నారు. ఆమె స్థానంలో మరొకరిని నియమించేందుకు కంపెనీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని, రాబోయే రోజుల్లో ఒక అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.దాదాపు 13 సంవత్సరాల క్రితం ఫ్లిప్కార్ట్ గ్రూపులో అసోసియేట్ డైరెక్టర్గా చేరిన నందితా సిన్హా.. ఆ తరువాత కాలంలో ఫర్నీచర్, కస్టమర్ ఎంగేజ్మెంట్, హెల్త్ అండ్ బ్యూటీ వంటి టీమ్స్లో పనిచేశారు. మీషోను 2014లో ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసిన తరువాత.. 2022లో నందితా దానికి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈమె రాజీనామా చేయడానికి కారణం ఏమిటనే విషయం వెల్లడికాలేదు.ఫ్లిప్కార్ట్ కంపెనీ ఐపీఓకు వెళ్లడానికి ముందే తన పదవి నుంచి నందితా సిన్హా వైదొలగనున్నారు. తరువాత.. షారన్ పైస్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.ఎవరీ షారన్ పైస్?షారన్ పైస్ గతంలో మింత్రాలో లీడర్షిప్ బాధ్యతలు చేపట్టారు. దదాపు నాలుగు సంవత్సరాలు కంపెనీలో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (సీబీఓ)గా పనిచేశారు. అంతే కాకుండా గత ఏడేళ్ల కాలంలో ఆయన సంస్థలో వివిధ పదవులలో కొనసాగారు. కంపెనీలో చేరడానికి కంటే ముందు.. అంటే 2014లో ప్రాక్టర్, గాంబుల్లో మేనేజర్ పదవుల్లో పనిచేశారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిపాజిట్లలో ‘కొత్త మార్క్’
దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ 2025–26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో తన రుణాలు (అడ్వాన్సులు) 12% పెరిగి రూ.29.6 లక్షల కోట్లకు చేరాయని ప్రకటించింది. గత సంవత్సరం మార్చి 31 నాటికి ఇవి రూ.26.43 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు వార్షిక ప్రాతిపదికన 14.4% పెరిగి రూ. 31.05 లక్షల కోట్లకు చేరాయి.గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో డిపాజిట్లు రూ.27.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ (కాసా) డిపాజిట్లు 12.3 శాతం వృద్ధితో రూ.9.4 లక్షల కోట్ల నుంచి రూ.10.6 లక్షల కోట్లకు పెరిగాయి. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్ ‘పీరియడ్ ఎండ్ టైమ్ డిపాజిట్లు’ సుమారు రూ.20.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇవి 2025 మార్చి 31 నాటికి ఉన్న రూ.17.7 లక్షల కోట్లతో పోలిస్తే సుమారు 15.5% వృద్ధి సాధించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్–టైమ్ చైర్మన్ అతాను చక్రవర్తి మార్చి 18, 2026న ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేసిన తెలిసిందే. గత రెండేళ్లుగా బ్యాంకులో జరిగిన కొన్ని పరిణామాలు, విధానాలు తన వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. మరే ఇతర కారణాలు లేవని కూడా స్పష్టం చేశారు. ఈ లేఖను గవర్నెన్స్, నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ చైర్మన్ హెచ్ కే భన్వాలాకు మార్చి 17న పంపించారు. -
రికార్డ్ సేల్స్: పది లక్షల ఏసీలు అమ్మేశాం..
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2026) తొలి త్రైమాసికం (జనవరి–మార్చి)లో పది లక్షలకు పైగా ఎయిర్ కండీషనర్ల విక్రయాల మార్కును అధిగమించినట్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా తెలిపింది. తద్వారా కేటగిరీలో ’నిర్ణయాత్మక లీడరు’గా నిల్చినట్లు వెల్లడించింది.సీజన్ ప్రారంభానికి ముందే కొత్త బీఈఈ స్టార్ రేటింగ్ ఏసీలను ప్రవేశపెట్టడం, అలాగే ఐసీసీ వరల్డ్ కప్ సందర్భంగా నిర్వహించిన మార్కెటింగ్ క్యాంపెయిన్ మొదలైనవి ఇందుకు తోడ్పడినట్లు కంపెనీ వివరించింది.అయితే, కేటగిరీ లీడరుగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ క్లెయిమ్ చేసుకోవడాన్ని టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ తోసిపుచ్చింది. ఏటా సుమారు 1.2–1.4 కోట్ల యూనిట్ల స్థాయిలో ఉండే రెసిడెన్షియల్ ఎయిర్ కండిషన్ మార్కెట్లో తామే అగ్రగాములమని పేర్కొంది. -
బంధన్ బ్యాంక్లో రుణాలు, డిపాజిట్ల జోరు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగానికి చెందిన బంధన్ బ్యాంకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తన వ్యాపార గణాంకాలను ప్రకటించింది. 2026 మార్చి 31 నాటికి బ్యాంక్ రుణాలు (అడ్వాన్సులు) వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,36,995 కోట్లుగా నమోదయ్యాయి.స్టాక్ ఎక్స్చేంజ్లకు సమర్పించిన తాత్కాలిక (ఆడిట్ చేయని) గణాంకాల ప్రకారం, వరుస త్రైమాసిక ప్రాతిపదికన లోన్ బుక్ 6.2 శాతం పెరిగి రూ.1,54,235 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు వార్షికంగా 10 శాతం పెరిగి రూ.1,66,344 కోట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి రూ.1,51,212 కోట్లుగా ఉండగా, గత త్రైమాసికంతో (రూ.1,56,724 కోట్లు) పోలిస్తే 6.1 శాతం వృద్ధి నమోదైంది.క్యూ4లో కరెంట్ ఖాతా, సేవింగ్ ఖాతా(కాసా) డిపాజిట్లు రూ.48,751 కోట్లుగా నమోదై, వార్షికంగా 2.8 శాతం పెరిగాయి. అయితే కాసా నిష్పత్తి గత ఏడాది 31.37 శాతం నుంచి 29.31 శాతానికి తగ్గింది. రిటైల్ డిపాజిట్లు (కాసాతో సహా) 17.7 శాతం పెరిగి రూ.1,22,547 కోట్లకు చేరాయి. రిటైల్ టర్మ్ డిపాజిట్లు 30.1 శాతం పెరిగి రూ.73,796 కోట్లుగా నమోదయ్యాయి.మొత్తం డిపాజిట్లలో రిటైల్ వాటా 68.88 శాతం నుంచి 73.67 శాతానికి పెరిగింది. బల్క్ డిపాజిట్లు 6.9 శాతం తగ్గి రూ.43,797 కోట్లకు చేరాయి. మార్చి 31 నాటికి బ్యాంక్ లిక్విడిటీ కవరేజ్ రేషియో (ఎల్సీఆర్) సుమారు 131.76 శాతంగా ఉందని తెలిపింది. ఈ గణాంకాలు తాత్కాలికమైనవి, ఆడిట్ చేయనివని బ్యాంక్ స్పష్టం చేసింది. -
చదివిన కాలేజీకే మళ్లీ.. ఎందుకో తెలుసా?
ప్రపంచ ప్రసిద్ధ సాంకేతిక కంపెనీలలో ఒకటి అయిన గూగుల్, దాని మాతృసంస్థ అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ 2026 జూన్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారికంగా వెల్లడించింది.సుందర్ పిచాయ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనే మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేసి 1995లో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అంటే 31ఏళ్ల తరువాత సుందర్ తాను చదివిన కాలేజీకి ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు.సుందర్ పిచాయ్ భారతదేశంలో జన్మించారు. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదివి ఇన్స్టిట్యూట్ సిల్వర్ మెడల్ పొందారు. తరువాత వార్టన్ స్కూల్ నుండి MBA పూర్తి చేసి.. సీబెల్, పాల్మర్ స్కాలర్ అవార్డులు పొందారు.చదువు పూర్తయిన తరువాత గూగుల్ కంపెనీలో చేరి, గూగుల్ టూల్బార్, గూగుల్ క్రోమ్ వంటి ప్రధాన ప్రాజెక్టులలో పనిచేశారు. ఆ తరువాత ఇది క్రోమ్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రౌజర్ అయింది. 2019లో గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ సీఈఓగా నియమితులు అయ్యారు. -
రెండు నెలలే బెంగళూరులో.. ముంబైవాసి ఏమన్నారంటే?
కొత్త నగరానికి వెళ్తే.. తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరికి ఇది ఒక స్వేచ్ఛని, కొత్త అవకాశాలను ఇవ్వడానికి ఒక అవకాశంలా అనిపించినా.. కష్టంగానే ఉంటుందని ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.''బెంగళూరు వచ్చి రెండు నెలలైంది, నాకు ముంబై గుర్తొస్తోంది. అక్కడి మనుషులు గుర్తొస్తున్నారు. ఇక్కడ (బెంగళూరు) ప్రతి చిన్న సంభాషణ ఒక బేరమాడటంలా అనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు, ప్యాకర్లు, అద్దెదారులు అందరితోనూ కొంత కష్టమే. ప్రతి ఒక్కరూ మన నుంచి ఏదో ఒకటి పిండుకోవాలని చూస్తుంటారు. ముంబైలో క్యాబ్ డ్రైవర్ వేడిగా ఉందని చూసి ఏసీ వేసేస్తాడు. ఇక్కడ మాత్రం.. అదొక వ్యక్తిగత సహాయం అన్నట్టు అడగాలి. ఈ ఒక్క విషయం మీకు అన్ని విషయాలు చెబుతుంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించాడు.2 months in Bangalore and I miss Mumbai. I miss the people.Every small interaction here feels like a negotiation. Auto drivers, packers, old tenants. Everyone’s trying to squeeze something out of you.In Mumbai a cab driver sees it’s hot and just turns on the AC. Here you have…— poobesh (@pbshgthm) April 3, 2026ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది ముంబై నివాసి అభిప్రాయాలతో ఏకీభవించగా, మరికొందరు ఇలాంటి అనుభవాలు చాలావరకు వ్యక్తిగతమైనవని అభిప్రాయపడ్డారు.నిజమే! ముంబై చాలా స్వాగతించేదిగా, ఆప్యాయంగా ఉంటుందని ఒక వినియోగదారుడు అనగా, మరొకరు ఇలా అన్నారు.. ముంబైలో ఏ క్యాబ్ డ్రైవర్ అయినా అడగకుండా ఏసీ ఆన్ చేస్తాడా? అని అడిగాడు. నేను బెంగళూరు వాసిని, చాలా నగరాలు తిరిగాను, నేను పూర్తిగా ఈ విషయంలో ముంబై వాసికి సపోర్ట్ చేస్తున్నా.. అని అన్నాడు. -
ఇన్వర్టర్ ఏసీ vs నాన్ ఇన్వర్టర్ ఏసీ
నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి తాపం ఇప్పుడిప్పుడే మొదలవుతుండటంతో ప్రతిఒక్కరూ ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్లోకి వెళ్లగానే వినియోగదారులకు తలెత్తే ప్రధాన ప్రశ్న.. 'ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా? లేక నాన్-ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా..?' అని. తక్కువ ధరలో వస్తుందని కొందరు, విద్యుత్ ఆదా అవుతుందని మరికొందరు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న కీలక తేడాలు, లాభనష్టాలపై ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇన్వర్టర్ ఏసీఇన్వర్టర్ ఏసీ అనేది అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తుంది. గది ఉష్ణోగ్రతను బట్టి ఇందులోని కంప్రెసర్ తన వేగాన్ని వాటంతట అదే సర్దుబాటు చేసుకుంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా నెమ్మదిగా తిరుగుతూ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచు తుంది.నాన్-ఇన్వర్టర్ ఏసీనాన్-ఇన్వర్టర్ ఏసీ అనేది పాత పద్ధతిలో పనిచేస్తుంది. కంప్రెసర్ అయితే పూర్తిగా ఆన్లో ఉంటుంది లేదా పూర్తిగా ఆఫ్లో ఉంటుంది. గది చల్లబడగానే కంప్రెసర్ ఆగిపోవడం, మళ్లీ వేడి పెరగగానే వెంటనే స్టార్ట్ కావడం దీని ప్రత్యేకత. ఏసీ అనగానే సామాన్యుడికి గుర్తొచ్చేది కరెంట్ బిల్లు. ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ పదే పదే ఆన్, ఆఫ్ కానక్కర్లేదు కాబట్టి విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది జేబుకు ఉపశమనాన్ని ఇస్తుంది.అదే నాన్-ఇన్వర్టర్ ఏసీ విషయానికొస్తే.. కంప్రెసర్ ప్రతిసారీ పూర్తి సామర్థ్యంతో స్టార్ట్ కావాల్సి రావడంతో కరెంట్ బిల్లు భారమయ్యే అవకాశం ఉంది. గదిలో ఒకే రకమైన చల్లదనం ఉండాలని కోరుకునే వారికి ఇన్వర్టర్ ఏసీ సరైన ఎంపిక. ఇది ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీలో కంప్రెసర్ ఆగిపోయిన ప్రతిసారీ గదిలో ఉష్ణోగ్రత స్వల్పంగా పెరగడం, మళ్లీ తగ్గడం వంటి మార్పులు గమనించవచ్చు.జీవితకాలం పరంగా రెండూ మెరుగైనవే అయినప్పటికీ, నిర్వహణలో తేడాలున్నాయి. ముఖ్యంగా ఇన్వర్టర్ ఏసీ.. విషయంలో పీసీబీ వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఉంటాయి. ఒకవేళ ఇవి పాడైతే మరమ్మతు ఖర్చు కాస్త ఎక్కువేగానే ఉంటుంది. నాన్-ఇన్వర్టర్ ఏసీ.. దీని టెక్నాలజీ చాలా సరళంగా ఉంటుంది. విడిభాగాలు ఎక్కడైనా సులభంగా దొరుకుతాయి. మెకానిక్ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం ఏసీ వాడాల్సి వస్తే.. కచ్చితంగా ఇన్వర్టర్ ఏసీ వైపు వెళ్లడమే తెలివైన పని అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయం, అప్పుడప్పుడు మాత్రమే వాడే వారైతే నాన్-ఇన్వర్టర్ ఏసీని ఎంచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. - పసుపులేటి. వెంకటేశ్వరరావు. -
షాకిచ్చిన ఒరాకిల్ : గూగుల్లోని ఈ పాలసీ తెలుసా?
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ ప్రకటించిన భారీ లేఆఫ్స్ టెక్ ప్రపంచం ప్రకంపనలు రేపాయి. రేపటినుంచి మీ సేవలు అవసరం లేదు అంటూ కేవలం తెల్లవారుజామున 6 గంటలకు పంపిన ఒకే ఒక్క ఈమెయిల్ టెకీలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఆందోళన ఇలా ఉండగానే మరో భిన్నమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదేమిటంటే..ఒకవైపు ఒరాకిల్ 30వేలమంది ఉద్యోగుల తీసివేత ప్లాన్లతో షాక్ ఇవ్వగా, మరోవైపు గూగుల్ తన ఉద్యోగుల కుటుంబాలకు అందించే 'మరణానంతర ప్రయోజనాల' వివరాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.ఒకవైపు ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో, గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' విశేషంగా నిలిచాయి. వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం గూగుల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగి కుటుంబానికి భారీ ప్రయోజనాలు అందిస్తోంది.గూగుల్ 'డెత్ బెనిఫిట్స్' మరణించిన ఉద్యోగి భాగస్వామికి (Spouse) 10 ఏళ్ల పాటు సగం జీతాన్ని గూగుల్ చెల్లిస్తుంది. అలాగే స్టాక్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఉద్యోగికి రావాల్సిన అన్-వెస్టెడ్ స్టాక్స్ (Unvested Stocks) అన్నీ తక్షణమే కుటుంబానికి అందుతాయి.దీంతోపాటు పిల్లలకు 19 ఏళ్ల వయస్సు వచ్చే వరకు (ఒకవేళ ఫుల్ టైమ్ స్టూడెంట్ అయితే 23 ఏళ్ల వరకు) ప్రతి నెల 1,000 డాలర్లు (సుమారు రూ. 83,000) అందుతాయి. సర్వీస్తో సంబంధం లేకుండా అంటే ఉద్యోగి ఎంత కాలం పనిచేశారనే దానితో సంబంధం లేకుండా కొత్తగా చేరిన వారికైనా, పదేళ్ల అనుభవం ఉన్న వారికైనా ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!మరోవైపు ఈ ప్రయోజనాలపై ఒక సీనియర్ ఇంజనీర్ ఉదాహరణను నెటిజన్లు విశ్లేషించారు. గూగుల్ పాలసీ ప్రకారం, ఒక సీనియర్ ఇంజనీర్ మరణిస్తే ఆ కుటుంబానికి 15 కోట్లకు పైగా అందుతాయి. 2012లో గూగుల్ HP మాజీ చీఫ్ లాస్లో బాక్ రూపొందించిన ఈ విధానం రూపొందించారనీ ఉద్యోగి కుటుంబ భద్రత సంస్థ బాధ్యత అని గూగుల్ నమ్ముతుందని ఆయన వ్యాఖ్యానించారు.10 ఏళ్లలో సుమారు 925,000 డాలర్ల జీతం.లైఫ్ ఇన్సూరెన్స్ కింద 555,000డాలర్లుస్టాక్స్ రూపంలో డాలర్లు 350,000.పిల్లలకు నెలకు వెయ్యి డాలర్లు.మొత్తంగా చూస్తే వెస్టెడ్ స్టాక్స్ కాకుండానే దాదాపు రూ. 15.5 కోట్లు కంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.నెటిజన్ల స్పందన"మా మేనేజర్ శనివారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే ఏదో కొండను తవ్వి తెచ్చినట్లు ఫీల్ అవుతారు. కానీ గూగుల్ తన ఉద్యోగి లేకపోయినా వారి కుటుంబాన్ని కాపాడుతోంది. ఇది కదా లైఫ్ గోల్స్ అనాల్సింది!" అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. నిజంగా గ్రేట్ ఇది.. దీని విలువను లెక్కగట్టేంత వరకు దీన్ని గ్రహించలేరు అని ఒకరు, కంపెనీలు ఈ విధంగా ఇంత దీర్ఘకాలికంగా ఆలోచించడం చాలా అరుదు.” అని మరొకరు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో చరిత్ర : ఎవరీ రినీ సంపత్? -
ఇండక్షన్ హీటర్లపై కేంద్రం ఫోకస్!
పశ్చిమాసియా సంక్షోభంతో ఎల్పీజీ లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇండక్షన్ హీటర్లు, వాటికి అనువుగా ఉండే ఇతరత్రా పాత్రల వాడకాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం ఉత్పత్తిని పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉత్పత్తి కంపెనీలతో శుక్రవారం చర్చలు జరిపింది.కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలో జరిగిన సమావేశంలో విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఇండక్షన్ హీటర్లు, కుక్కర్లలాంటి పాత్రల తయారీని వేగవంతం చేసేందుకు, ఉత్పత్తి పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఇందులో చర్చించినట్లు వివరించారు. ఈ ఉత్పత్తులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, హాట్ కేక్ల్లాగా అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. -
మెటాలో ఆగని కొలువుల కోత.. ఈసారి ఎందరంటే..
సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి పెద్దపీట వేస్తూ కంపెనీలో భారీ పునర్నిర్మాణ చర్యలు చేపడుతున్న నేపథ్యంలో కాలిఫోర్నియాలో సుమారు 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ మేరకు కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ డివిజన్(ఈడీడీ)కు మెటా అధికారిక నివేదికలను సమర్పించింది.కాలిఫోర్నియా విభాగంలో జరుగుతున్న ఈ మార్పుల వల్ల బర్లింగేమ్, సన్నీవేల్ కార్యాలయాల్లోని సిబ్బంది ప్రభావితం కానున్నారు. బర్లింగేమ్లో 124 ఉద్యోగాల తొలగింపు, సన్నీవేల్ 74 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ చెప్పింది. ఈ నిర్ణయం మే నెలాఖరు నుంచి అమలులోకి రానుంది. ఈ లేఆఫ్స్ శాశ్వత ప్రాతిపదికన ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.ఈ ఏడాది ప్రారంభం నుంచి మెటాలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. జనవరి 2026లో మెటావర్స్ ప్రాజెక్ట్ రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో దాదాపు 1,500 మందిని తొలగించారు. మార్చి 2026లో రిక్రూట్మెంట్, సేల్స్, ఆపరేషన్స్ విభాగాల్లో సుమారు 700 మందిపై వేటు పడింది. తాజాగా కాలిఫోర్నియా రీజియన్లో మరో 200 మందికి ఉద్వాసన పలికారు.ఏఐ పెట్టుబడులే ప్రధాన కారణంఈ ఏడాది ఏఐ మౌలిక సదుపాయాల (డేటా సెంటర్లు, సర్వర్లు) కోసం మెటా దాదాపు 115 బిలియన్ డాలర్ల నుంచి 135 బిలియన్ డాలర్ల మధ్య మూలధన వ్యయాన్ని అంచనా వేసింది. సాధారణ పనుల కోసం మానవ వనరుల కంటే ఏఐ సాధనాలపైనే కంపెనీ ఎక్కువగా ఆధారపడుతోంది. ఒకవైపు తొలగింపులు జరుగుతున్నప్పటికీ హై-లెవల్ టెక్నికల్ ఏఐ ఉద్యోగాల కోసం కంపెనీ కొత్త నియామకాలను చేపడుతోంది.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో అసలేం జరుగుతోంది?
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అనూహ్య రాజీనామా నేపథ్యంలో బ్యాంకు వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది. 12 కోట్ల మంది కస్టమర్లు, షేర్హోల్డర్లు, సాధారణ ప్రజానీకానికి కూడా బ్యాంకుపై భరోసా కల్పించేందుకు ఇది అవసరమని పేర్కొంది.మార్చి 31న రాసిన లేఖను ఏఐబీఈఏ గురువారం మీడియాకు విడుదల చేసింది. దేశీ వ్యవస్థలో కీలకమైన సంస్థగా ఆర్బీఐ వర్గీకరించిన బ్యాంకులో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని ఏఐబీఈఏ పేర్కొంది. గవర్నెన్స్ ప్రమాణాలు, నియంత్రణ సంస్థ పర్యవేక్షణ, వ్యవస్థ స్థిరత్వంపై సందేహాలు తలెత్తుతున్నాయని తెలిపింది.ఓ స్వతంత్ర డైరెక్టరు నైతికత అంశాన్ని ప్రస్తావిస్తూ రాజీనామా చేయడం అసాధారణమైన విషయమని, దీనిపై అవసరమైతే సీబీఐ లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్తో తక్షణం విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఏఐబీఈఏ అభిప్రాయపడింది. బ్యాంకులన్నీ ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని, పారదర్శకత విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.తమ దుబాయ్ శాఖ ఏటీ–1 బాండ్లను తప్పుగా విక్రయించిందన్న ఆరోపణలు రావడం, బ్యాంకు పనితీరు సరిగ్గా లేకపోవడంలాంటి అంశాల వల్ల నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్లు అతాను చక్రవర్తి వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పెరిగిన పెట్రో ధరలు.. ఆ దేశంలో కొత్త తరహా లోన్లు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అతలాకుతలమవుతున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..ఫ్రాన్స్లో 'ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు'పెరుగుతున్న ఇంధన భారంతో సతమతమవుతున్న వ్యాపారుల కోసం ‘ఫ్లాష్ ఫ్యూయల్ లోన్లు’ (Flash Fuel Loans) పేరుతో ఒక అత్యవసర రుణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఫ్రాన్స్ శుక్రవారం ప్రకటించింది.లోన్ల ముఖ్య విశేషాలురుణ పరిమితి: అర్హత కలిగిన సంస్థలు 50,000 యూరోల (సుమారు రూ. 53.64 లక్షలు) వరకు రుణం పొందవచ్చు.ప్రధాన లబ్ధిదారులు: రవాణా, వ్యవసాయం, మత్స్య పరిశ్రమలకు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది.వడ్డీ రేటు: మూడేళ్ల కాలపరిమితి గల ఈ రుణాలపై 3.8 శాతం వడ్డీ వసూలు చేస్తారు.త్వరితగతిన నిధులు: పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 'బీపీఐఫ్రాన్స్' (Bpifrance) ద్వారా డిజిటల్ పద్ధతిలో కేవలం ఏడు రోజుల్లోనే రుణ ప్రక్రియ పూర్తి చేసి నిధులు మంజూరు చేస్తారు.ప్రధాని హామీ అమలుఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే ఆర్థిక ఇబ్బందులను అరికడతామని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్ను గత వారం ఇచ్చిన హామీని ఈ పథకం ద్వారా నెరవేర్చారు. యుద్ధ ప్రభావం వల్ల సామాన్యులపై, వ్యాపారాలపై పడుతున్న భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.రిఫైనరీల తీరుపై విచారణకు డిమాండ్మరోవైపు, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులను ఆసరాగా చేసుకుని యూరప్లోని రిఫైనరీలు ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ "దుర్వినియోగం"పై విచారణ జరపాలని కోరుతూ ఫ్రెంచ్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్క్యూర్ యూరోపియన్ కమిషన్కు లేఖ రాశారు.యుద్ధం పేరుతో కంపెనీలు అక్రమంగా లాభాలు గడిస్తున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఇంధన సంక్షోభం నుంచి దేశీయ పరిశ్రమలను కాపాడుకునేందుకు ఫ్రాన్స్ తీసుకున్న ఈ చర్యలు ప్రస్తుతం ఐరోపాలో చర్చనీయాంశంగా మారాయి. -
వేకువజామునే ఈమెయిల్స్.. ఎందుకంటే..
నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం అనేది ఏ సమయానికి ఊడుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా దిగ్గజ టెక్ కంపెనీలైన ఒరాకిల్, గూగుల్, మెటా వంటి సంస్థల్లో ఇటీవలి కాలంలో జరిగిన తొలగింపుల సరళిని గమనిస్తే ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన డిజిటల్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఈమెయిల్స్ తెల్లవారుజామున 6 గంటలకే పంపిస్తున్నాయి. అందుకు కొన్ని కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ఆఫీసు వేళలు ప్రారంభం కాకముందే, అంటే ఉద్యోగులు ఇంకా నిద్రలో నుంచి మంచం దిగకముందే లేదా అప్పుడప్పుడే నిద్రలేస్తున్న సమయంలో ఈ-మెయిల్స్ పంపడం వెనుక కంపెనీలకు ఒక బలమైన వ్యూహం ఉంది.ఉదయాన్నే ఉద్యోగి ఇంకా ఆఫీసుకి రాకముందే సమాచారం ఇవ్వడం వల్ల ఆఫీసు ఫ్లోర్లో అకస్మాత్తుగా గందరగోళం తలెత్తకుండా నిరోధించవచ్చు.వర్కింగ్డే మధ్యలో తొలగింపు ప్రస్తావనలు వస్తే స్లాక్ ఛానెళ్లు లేదా టీమ్ కాల్స్లో ఒకరికొకరు సందేశాలు పంపుకుంటూ తక్షణమే ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే పంపడం ద్వారా ఈ కమ్యూనికేషన్ చైన్ను కంపెనీలు కట్ చేస్తున్నాయి.సాంకేతిక అనుసంధానం కట్కంపెనీల్లో ఉద్యోగం తొలగించిన వారికి సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఇంటర్నల్ టూల్స్, అధికారిక ఈమెయిల్ ఖాతాల నుంచి యాక్సెస్ను రద్దు చేసేందుకు యాజమాన్యాలకు ఉదయం వీలు దొరుకుతుంది. ఈమెయిల్ పంపిన నిమిషాల్లోనే ఆయా సిస్టమ్స్ను షట్-డౌన్ చేయడానికి కంపెనీలకు తెల్లవారుజాము సమయం ఒక ‘సేఫ్ విండో’లా పనిచేస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ స్టేట్మెంట్లను సిద్ధం చేయడం, మిగిలిన టీమ్ మెంబర్లకు గైడ్ లైన్స్ ఇవ్వడం వంటి పనులకు మేనేజ్మెంట్కు కొంత సమయం దొరుకుతుంది.మాయమవుతున్న మానవీయ కోణంకంపెనీల దృష్టిలో ఇది కేవలం రిస్క్ మేనేజ్మెంట్ మాత్రమే కావచ్చు. కానీ ఒక ఉద్యోగి కోణం నుంచి చూస్తే ఇది అత్యంత కఠినమైన చర్య. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేనప్పుడు తన కెరీర్ ముగిసిందని తెలుసుకోవడం మానసికంగా కుంగదీస్తుంది. కొన్ని సంస్థల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రక్రియ సజావుగా సాగాలనే ఆరాటంలో కంపెనీలు మానవ సంబంధాలను మరుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
విదేశీ చేతుల్లోకి ఆర్బీఎల్ బ్యాంక్
న్యూఢిల్లీ: దేశీ ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ను దుబాయ్ దిగ్గజం ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ సొంతం చేసుకోనుంది. ఆర్బీఎల్లో 74 శాతం వాటా కొనుగోలు ప్రతిపాదనకు తాజాగా ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆర్బీఎల్ విదేశీ బ్యాంకుగా అవతరించనుంది.ఏప్రిల్ 1 నుంచి ఏడాదిలోగా ఎమిరేట్స్ ఎన్బీడీ వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. యూఏఈలో రెండో పెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎమిరేట్స్ ఎన్బీడీ 2025 అక్టోబర్లో ఆర్బీఎల్ బ్యాంక్లో 60 శాతం వాటా కొనుగోలుకి ఆసక్తిని ప్రకటించింది. ఇందుకు రూ. 26,853 కోట్లు వెచ్చించనుంది.కాగా.. ఆర్బీఐ అనుమతి కారణంగా మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతోపాటు.. ఆర్బీఎల్ చెల్లించిన మూలధనంలో ఎమిరేట్స్ ఎన్బీడీ కనీసం 51 శాతం వాటాను కొనసాగించవలసి ఉంటుంది. తద్వారా విదేశీ బ్యాంక్ అనుబంధ సంస్థగా ఆర్బీఎల్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఏడాదిలోగా ఆర్బీఎల్ బ్రాంచీలను ఎమిరేట్స్ ఎన్బీడీలో విలీనం చేయవలసి ఉంటుంది. -
వైద్యరంగానికి ‘సహకారి’ కరవు
వైద్యం అంటే కేవలం డాక్టర్లు, మందులు మాత్రమే కాదు; తెర వెనుక ఉండి ప్రాణాలను కాపాడే ‘అలైడ్ హెల్త్కేర్’ నిపుణుల పాత్ర కీలకం. ఆధునిక వైద్య రంగంలో ఒక రోగికి వ్యాధి నిర్ధారణ జరగాలన్నా, క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావాలన్నా లేదా డయాలసిస్ వంటి ప్రాణరక్షక ప్రక్రియలు కొనసాగాలన్నా డాక్టర్లతో పాటు సమానంగా శ్రమించే వారు ‘అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషనల్స్’ (ఏహెచ్పీ). ల్యాబ్ టెక్నీషియన్లు, ఇమేజింగ్ స్పెషలిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది.. ఇలా సుమారు 50కి పైగా విభాగాల్లో పనిచేసే ఈ నిపుణులు ఆరోగ్య వ్యవస్థలో 60 శాతం మేర వాటాను కలిగి ఉన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, వైద్యులు చికిత్సను నిర్ణయిస్తే.. అలైడ్ నిపుణులు ఆ చికిత్సను సహకారం అందిస్తారు.భారీగా మానవ వనరుల కొరతప్రస్తుతం భారతదేశ ఆరోగ్య రంగం తీవ్రమైన నిపుణుల కొరతను ఎదుర్కొంటోంది. గణాంకాల ప్రకారం.. అవసరమైన నిపుణులు 1.09 కోట్లు. అందుబాటులో ఉన్నవారు 27.5 లక్షలు. లోటు 80 లక్షలకు పైగా. ఏటా సుమారు 10 లక్షల మంది అలైడ్ నిపుణుల అవసరం ఉండగా కేవలం 2 లక్షల మంది మాత్రమే విద్యాసంస్థల నుంచి బయటకు వస్తున్నారు. ఈ వ్యత్యాసం వల్ల రోగ నిర్ధారణలో జాప్యం, శస్త్రచికిత్సలు వాయిదాపడి అంతిమంగా రోగి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది.విద్య - ఉపాధిఅలైడ్ హెల్త్కేర్ కోర్సులు పూర్తి చేయడానికి విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడటంతోపాటు భారీగా ఆర్థిక పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అయితే, కెరీర్ ప్రారంభంలో లభించే వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. గ్రామీణ, మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఒక ప్రతిబంధకంగా మారుతోంది. తక్కువ శిక్షణతో ఎక్కువ ఆదాయం వచ్చే ఇతర రంగాల వైపు యువత మొగ్గు చూపడం వల్ల ఈ విభాగంలో నిపుణుల కొరత పెరుగుతోంది.సంస్కరణల దిశగా అడుగులుఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ (ఎన్సీఏహెచ్పీ) చట్టాన్ని’ తీసుకువచ్చింది. కేంద్ర బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించి రాబోయే ఐదేళ్లలో లక్ష మంది కొత్త నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఒకే రకమైన కాంపెటెన్సీ బేస్డ్ సిలబస్ను అమలు చేయనున్నారు.అమలులో ఎదురవుతున్న సవాళ్లుచట్టం తీసుకురావడం ఒక ఎత్తయితే దానిని ఆచరణలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం..చట్టం అమలులోకి వచ్చే లోపు కోర్సుల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్తుపై స్పష్టత అవసరం. పాత పద్ధతిలో చదివిన వారిని కూడా రిజిస్ట్రేషన్కు అనుమతించే విధానం కావాలి.కొత్త నిబంధనల ప్రకారం విద్యా సంస్థల గుర్తింపు పొందే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలి. లేదంటే అడ్మిషన్లు ఆగిపోయి నిపుణుల కొరత మరింత తీవ్రమవుతుంది.అవయవ మార్పిడి, అణు వైద్యం (న్యూక్లియర్ మెడిసిన్) వంటి స్పెషలైజ్డ్ విభాగాల్లో శిక్షణ కేవలం మెట్రో నగరాల్లోని పెద్ద ఆసుపత్రుల్లోనే సాధ్యం. చిన్న పట్టణాల్లోని విద్యాసంస్థలకు స్టాండ్-అలోన్ ల్యాబ్లు, డయాలసిస్ సెంటర్లతో అనుసంధానం అయ్యే వెసులుబాటు కల్పించాలి.అలైడ్ కోర్సులను బోధించడానికి డాక్టర్లను అనుమతించకూడదనే నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం మాస్టర్స్ లేదా పీహెచ్డీ చేసిన అలైడ్ నిపుణులు తక్కువగా ఉన్నందున ప్రారంభ దశలో నిబంధనల్లో కొంత సడలింపు అవసరం.వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం అత్యాధునిక ఆసుపత్రులు ఉంటే సరిపోదు. వాటిని నడిపించే నైపుణ్యం కలిగిన మానవ వనరులు కావాలి. రెగ్యులేటరీ వ్యవస్థ అనేది అడ్డంకిగా మారకుండా సామర్థ్యాన్ని పెంచే ఒక ఉత్ప్రేరకంగా పనిచేయాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో ఆరోగ్య వ్యవస్థ బలోపేతమై ప్రతి పౌరుడికి నాణ్యమైన వైద్యం అందుతుంది.ఇదీ చదవండి: ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు -
పెట్రోలే కాదు.. తాగే నీటిపైనా యుద్ధం ఎఫెక్ట్!
రష్యా-ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కేవలం ఇంధన ధరలనే కాదు, సామాన్యుడు తాగే నీటిని కూడా ఖరీదైనవిగా మారుస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం కలగడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 119 డాలర్లకు చేరడం భారత్లో బాటిల్ వాటర్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.ప్యాకేజింగ్ భారంనీటి ధర పెరగడానికి కారణం నీరు కాదు, ఆ నీటిని నింపే ప్లాస్టిక్ బాటిల్. ప్లాస్టిక్ తయారీకి వాడే PET (పాలిథిలిన్ టెరెఫ్తాలేట్) రెసిన్ గుళికలు ముడి చమురు నుండి తయారవుతాయి. చమురు ధరలు పెరగడంతో, ఈ ముడిపదార్థాల ధరలు గత పక్షం రోజుల్లోనే భారీగా పెరిగాయి.ధరల పెంపుమార్కెట్ లీడర్ బిస్లేరి ఇప్పటికే వాటర్ బాటిళ్ల ధరలను 11 శాతం పెంచింది. 12 లీటర్ బాటిళ్ల బాక్స్ ధర ఏకంగా రూ. 24 పెరిగింది. ప్యాకేజింగ్ ఖర్చులు 70 శాతం పెరగడంతో లీటర్ బాటిల్ ధర రూ. 20కి చేరుకుందని బిస్లేరి సీఈఓ ఏంజెలో జార్జ్ తెలిపారు. PET ప్రిఫార్మ్స్ ధర కిలోకు రూ. 115 నుండి రూ. 180కి పెరగడమే కాకుండా, సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడిందని మహారాష్ట్ర బాటిల్డ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.పరిశ్రమలపై 'చైన్ రియాక్షన్'కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వైభవ్ సరోగి అభిప్రాయం ప్రకారం, ఈ ప్యాకేజింగ్ సెగ కేవలం తాగునీటికే పరిమితం కాదు. PET ప్యాకేజింగ్ను ఎక్కువగా ఉపయోగించే సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ డెలివరీ, ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్ రంగాలు కూడా ప్రభావితం కానున్నాయి.సామాన్యుడిపై నీటి భారంభారతదేశంలో స్వచ్ఛమైన నీటి లభ్యత ఇప్పటికే సవాలుగా మారింది. దేశంలో దాదాపు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం గృహాలు తమ ప్రాథమిక దాహం తీర్చుకోవడానికి బాటిల్ వాటర్ పైనే ఆధారపడుతున్నాయి.కర్మాగారాల మూసివేతపెరిగిన ఖర్చులను భరించలేక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దాదాపు 20 శాతం తయారీ ప్లాంట్లు తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో బాటిల్ వాటర్ ధరలు మరింత భారమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇక మేడిన్ ఇండియా సీసీ కెమెరాలదే రాజ్యం!
న్యూఢిల్లీ: దిగుమతి చేసుకున్న, సర్టిఫై చేయని యూనిట్లపై నిషేధంతో సీసీటీవీ కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించాయి. హిక్విజన్, టీపీ–లింక్లాంటి చైనీస్ సీసీటీవీ కంపెనీలపై దీనితో ప్రభావం పడిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ (ఎస్టీక్యూసీ) నిబంధనల అమలుతో సర్వైలెన్స్ పరిశ్రమ స్వరూపం మారినట్లు సీపీ ప్లస్ బ్రాండ్ సీసీటీవీలను తయారు చేసే ఆదిత్య ఇన్ఫోటెక్ వెల్లడించింది. ఎస్టీక్యూసీ లేని సీసీటీవీ యూనిట్ల విక్రయాన్ని 2025 ఏప్రిల్ 9 నుంచి కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నిషేధించింది. అయితే అప్పటికే దిగుమతి చేసుకున్న ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ఈ ఏడాది మార్చి 31 వరకు వీలు కల్పించింది. దీనితో పలు సంస్థలు దేశీయంగా ఉత్పత్తిపై మరింత దృష్టి సారించాయి. -
సెయిల్ చైర్మన్ రాజీనామా
ప్రభుత్వరంగ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్మన్, ఎండీ అయిన అమరేందు ప్రకాష్ తన పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్ 2 నుంచి ఇది అమల్లోకి వచ్చిన సెయిల్ సమాచారం ఇచ్చింది. కంపెనీ డైరెక్టర్గా ఉన్న కృష్ణ కుమార్సింగ్కు చైర్మన్, ఎండీగా తాత్కాలిక బాధ్యతలను అప్పగించినట్టు.. ఏప్రిల్ 2 నుంచి జూలై 1 వరకు లేదా రెగ్యులర్ నియామకం జరిగే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపింది.అమరేందు ప్రకాష్ తన రాజీనామాకు సంబంధించి నోటీసును జనవరి 2న ఉక్కు శాఖకు సమర్పించారు. అధికారిక అమోదం రావడంతో ఏప్రిల్ 1తో సెయిల్ బోర్డు నుంచి వైదొలగినట్టు సెయిల్ ప్రకటించింది. మరోవైపు సెయిల్ డైరెక్టర్ (ఫైనాన్స్)గా ఉన్న అశోక్ కుమార్పాండాను చైర్మన్, ఎండీ పదవికి ప్రభుత్వరంగ సంస్థల నియామక బోర్డు సిఫారసు చేసింది. -
విషాదంలో అంబానీ కుటుంబం : కన్యాదానం చేసిన నా రెండో అమ్మ!
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ భార్య, మాజీ బాలీవుడ్ నటి టీనా అంబానీ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి జర్నా కన్నుమూశారు. తన సోదరి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న టీనా అంబానీ, సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు.ప్రస్తుతం ఆమె తన సోదరిని కోల్పోయిన బాధలో ఉండటంతో, యావత్ అంబానీ కుటుంబం ఈ విషాదంలో మునిగిపోయింది.టీనా అంబానీ, తన అక్క జర్నా మరణ వార్తను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన సోదరి జ్ఞాపకార్థం ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. జర్నా తనకు కేవలం అక్క కాదు, రెండో తల్లిలాంటిది, తన జీవితంలో ఆమె పాత్ర వెలకట్టలేనిది అంటూ ఆమెను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా తన వివాహ సమయంలో జర్నా స్వయంగా కన్యాదానం చేసి, ఆప్యాయతాను రాగాలతో తనను అత్తవారింటికి పంపించారని భావోద్వేగానికి లోనయ్యారు.ఇదీ చదవండి: రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!ఆమె చాలా ప్రేమగల వ్యక్తిత్వమని, ఆమె తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ సంతోషాన్ని పంచేదని టీనా వర్ణించారు. జర్నా హుందాగా దయగా ఎపుడూ నవ్వుతూ అందరిలోనూ సంతోషాన్ని నింపేవారని సానుకూల శక్తితో అక్కచెల్లెళ్లందరికీ, వారి పిల్లలకు, మనవళ్లకు స్ఫూర్తి అని తన సోదరికి నివాళులర్పించారు. "మా కుటుంబానికి జర్నా ఒక వెలుగు. ఓం శాంతి, నా జియా. నీవు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నీవు పంచిన ప్రేమ తరతరాలకూ గుర్తుండిపోతుంది," అని రాసుకొచ్చారు. టీనా అంబానీ షేర్ చేసిన ఈ పోస్ట్ను చూసి అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ఆమె మనోధైర్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.ఇదీ చదవండి: ఆమెకు 55, అతడికి 25 : రూ 60 కోట్లు, లగ్జరీకార్లు -
నీటి సంరక్షణ కోసం మహా ఉద్యమం
రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం 2026 సందర్భంగా ప్రారంభమైన #Water4Life దేశవ్యాప్త ప్రచారం ద్వారా 33,000కు పైగా స్వచ్ఛంద కార్యకర్తలు, భారతదేశం అంతటా.. నీటి వనరుల సంరక్షణ, పునరుద్ధరణ కోసం కలిసి పనిచేస్తున్నారు.తొలి 10 రోజుల్లోనే, ఈ కార్యక్రమం ద్వారా 912 గ్రామాలలో 1,400కు పైగా జల వనరులను శుబ్రపడిచారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలోని 108 జిల్లాలకు విస్తరించింది. తక్షణ చర్యలైన చెత్త తొలగింపు, నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో పాటు, దీర్ఘకాలికంగా సముదాయం ఆధారిత నీటి నిర్వహణకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.ఈ కార్యక్రమంలో రైతులు, మహిళా సంఘాలు, యువత, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక సంస్థలు మరియు ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే 15 జిల్లాల్లోని 146 గ్రామాలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయి.ఇప్పటివరకు ఈ ప్రచారం ద్వారా 85,000 కిలోలకుపైగా చెత్త సేకరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, చెత్త వేరు చేయడం వంటివి మాత్రమే కాకుండా.. నీటి సహజ ప్రవాహ వ్యవస్థల పునరుద్ధరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రిలయన్స్ ఫౌండేషన్ శిక్షణ ఇచ్చిన 2,500 గ్రామ వాతావరణ ఛాంపియన్లు అవగాహన పెంపు, దీర్ఘకాలిక చర్యలకు కీలక పాత్ర పోషిస్తున్నారు.#Water4Life ప్రచారం.. ఇప్పటికే 91,000కు పైగా గ్రామాల్లో కొనసాగుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు ఆధారంగా ఉంది. ఫౌండేషన్ చేపట్టిన నీటి సంరక్షణ చర్యల ద్వారా ఇప్పటివరకు 2,000 లక్షల ఘన మీటర్లకు పైగా నీటి నిల్వ సాధ్యమై, లక్షలాది మందికి ప్రయోజనం కలిగింది.నీతా అంబానీ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో సాగించే స్థిరమైన ఉద్యమంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సముదాయం భాగస్వామ్యం మరియు సంస్థల సహకారంతో జల వనరుల దీర్ఘకాల సంరక్షణపై దృష్టి కొనసాగుతుంది.#MediaReleaseFrom awareness to action 💧Reliance Foundation has launched #Water4Life, a community-driven sustained movement to clean the nation’s water bodies. Since its launch on World Water Day, the initiative has mobilised 33,000+ volunteers across 1,400+ water bodies in… pic.twitter.com/d0kSEiW4Sk— Reliance Foundation (@ril_foundation) April 2, 2026 -
ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న.. ఈ కాలంలో టెక్నాలజీ రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం.. ఒక పెద్ద సమస్యగా మారింది. కంపెనీలు ఎక్కువగా ఏఐ టూల్స్, ఆటోమేషన్ వంటివాటిపై మొగ్గు చూపుతున్న కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగ టెకీ.. పాతకాలపు విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితుడు నేరుగా కంపెనీలకు వెళ్లి ఉద్యోగం సెర్చ్ చేయమని సూచించడంతో.. దాన్నే ఫాలో అయ్యాడు. తాను ఉంటున్న నగరంలోనే ఏడు కంపెనీలను సందర్శించారు.మొదట రెండు పెద్ద కంపెనీలకు వెళ్లి ఉద్యోగం కోసం అడిగినప్పుడు, అక్కడి సిబ్బంది అతన్ని ఆశ్చర్యంగా చూసి, ఆన్లైన్లో అప్లై చేయమని చెప్పారు. అంతే కాకుండా అసలు వారు పేపర్ రెజ్యూమ్ తీసుకోలేదు. ఇంకో రెండు చిన్న కంపెనీలకు వెళ్లినప్పుడు, ఒక కంపెనీ ఆ జాబ్ పోస్ట్ చాలా కాలం క్రితం పెట్టారని, అది తప్పుగా మళ్లీ కనిపించిందని చెప్పారు. మరొక కంపెనీ అతని రెజ్యూమ్ తీసుకున్నప్పటికీ, ఆన్లైన్లో అప్లై చేయమని సూచించిందని అతడు పేర్కొన్నాడు.మిగిలిన మూడు కంపెనీల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. రెండు కంపెనీలు అసలు అక్కడ లేవు. ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. చివరికి ఒక చోటకి అతను వెళ్లినప్పుడు, అది ఒక పెద్ద గది మాత్రమే ఉండి, అందులో ఇద్దరు వ్యక్తులు ల్యాప్టాప్లతో పని చేస్తూ కనిపించారు. వాళ్లను కంపెనీ గురించి అడిగితే.. వారు అయోమయంగా చూసి అతన్ని వెళ్లమని చెప్పినట్లు వెల్లడించాడు.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!ఉద్యోగం సెర్చ్ చేస్తున్న క్రమంలో అతనికి ఎదురైన అనుభవాన్ని.. అతని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఈ కాలంలో నేరుగా వెళ్లి ఉద్యోగం కోసం అడగడం ఉండదని.. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఆన్లైన్ రిక్రూట్మెంట్ పద్ధతులను అనుసరిస్తున్నాయని చాలామంది చెప్పారు. కొందరు మాత్రం అరుదుగా ఈ విధానం పనిచేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. -
విమాన ప్రయాణికులకు ఇంధన సెగ.. కేంద్రం జోక్యం!
సామాన్యుడి విమాన ప్రయాణంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల ఏవియేషన్ రంగానికి సవాలుగా మారుతోంది. దాంతో ఇటీవల విమానయాన సంస్థలు ఇంధన సర్ఛార్జీలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరల పెరుగుదల, దాని పర్యవసానాలపై విమానయాన సంస్థలతో చర్చలు జరిపేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో దాదాపు 40 శాతం వాటా కేవలం ఇంధనానిదే. అందుకే ఏటీఎఫ్ ధరల్లో స్వల్ప మార్పు వచ్చినా అది టికెట్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇటీవల సవరణల తర్వాత ధరల వ్యత్యాసం ఇలా ఉంది.విభాగంపాత ధర (కిలోలీటరుకు)ప్రస్తుత ధర (కిలోలీటరుకు)ఇంటర్నేషనల్/చార్టర్డ్రూ. 96,638.14రూ. 2,07,341.22 (దాదాపు రెట్టింపు)దేశీయ కార్యకలాపాలు-రూ. 1,04,927.18 ప్రభుత్వం విమానయాన రంగానికి వెసులుబాటు కల్పిస్తూ 25 శాతం వరకు పెంపునకు అనుమతించినప్పటికీ దేశీయ ప్రయాణీకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రభావాన్ని 8.5 శాతానికి పరిమితం చేయాలని భావించింది.ఇండిగో దూకుడు..ప్రభుత్వ అధికారిక ఆదేశాలు రాకముందే దేశీయ దిగ్గజం ఇండిగో ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చేలా ఇంధన సర్ఛార్జీలను సవరించింది. అయితే, గతంలో ఉన్న రూ.425 ఫ్లాట్ ఛార్జీని తొలగించింది. ప్రయాణించే దూరాన్ని బట్టి రూ.275 నుంచి రూ.950 వరకు దేశీయ మార్గాల్లో సర్ఛార్జీని నిర్ణయించింది. దీనివల్ల తక్కువ దూరం ప్రయాణించే వారికి కొంత ఉపశమనం లభించనుంది. అంతర్జాతీయ రూట్లలో ముఖ్యంగా యూరప్ వంటి సుదూర ప్రాంతాలకు ఇంధన సర్ఛార్జీ ఏకంగా రూ.10,000 వరకు పెరగడం గమనార్హం.ప్రభుత్వ జోక్యంధరల పెరుగుదలపై విమానయాన సంస్థల నుంచి కేంద్రం వివరణ కోరుతోంది. ‘ధరల పట్ల సున్నితంగా ఉండే భారతీయ మార్కెట్లో ఇంధన ధరల భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపడం సరైనది కాదు’ అని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రం ఇంకా ఎటువంటి అధికారిక నియంత్రణ ఆదేశాలు జారీ చేయలేదు. కానీ, త్వరలో జరగబోయే చర్చల ద్వారా అదనపు సర్ఛార్జీలను ఉపసంహరించుకోవాలని లేదా కనీసం పునసమీక్షించాలని సంస్థలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
రూ. 37 లక్షలు, ఒరాకిల్ లేఆఫ్ : ఈ టెకీ ప్లాన్ మామూలుగా లేదు!
ఐదంకెల జీతం, కార్పొరేట్ హోదా..ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే అదో గొప్ప స్టేటస్. కానీ ఇపుడు కథ మారిపోయింది. ఏ క్షణాన ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. ప్రముఖ ఐటీ సంస్థ ఒరాకిల్ (Oracle)12 వేల మంది టెకీల ఉద్వాసన కథ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇదేదో తక్కువ పెర్ఫార్మర్కే పరిమితం కాదు..ఎంతో అనుభవం ఉన్నా, నిపుణులకు కూడా ఇది తప్పలేదు. దీంతో ఆయా ఐటీ ఉద్యోగులు తమ బాధలను, భవిష్యత్ ప్రణాళికలను పంచుకోవడం నెట్టింట చర్చకు దారి తీస్తోంది. అలాగే ఆర్థిక స్వేచ్ఛ, కార్పొరేట్ ఒత్తిడిలుని జీవితం వంటి అంశాలపై చర్చలను రేకెత్తించింది.పదేళ్ల పాటు అంకితభావంతో సేవలందిస్తూ, ఏడాదికి రూ. 37 లక్షల వేతనం అందు కున్న వ్యక్తి ఉన్నట్టుండి, లేఆఫ్స్ కారణంగా ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వనేష్ మాలి అనే ఎక్స్ యూజర్ తన స్నేహితుడి ఉదంతాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.దీని ప్రకారం సదరు ఐటీ ఉద్యోగికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయకుండా ఉన్నపళంగా ఉద్యోగం నుండి తొలగించారు. రేపటినుంచి నీ సేవలు అనవసరం అన్న సందేశం వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు అశనిపాతంలా తగిలిన మాట వాస్తవం. ఎందుకంటే.. బోలెడన్ని కమిట్మెంట్స్, ఈఎంఐలు, ఫీజులు లాంటి అవసరాలెన్నో కళ్లముందు మెదులుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆందోళన చెందుతారు. కానీ, మనం చెప్పుకోబోయే టెకీ మాత్రం చాలా ప్రశాంతంగా ఆలోచించాడు. ఎలాంటి నిరాశ లేదా ఆందోళనకు బదులుగా, ప్రశాంతంగా ఈ పెను తుఫానులాంటి పరిస్థితిని స్వీకరించడం విశేషం. "నేను దీనిగురించి అస్సలు బాధపడటం లేదు. నిజానికి నేను సంతోషంగా ఉన్నాను. ఇకపై నేను ఏ ఐటీ కంపెనీలోనూ పని చేయను. నేను వ్యవసాయంపై దృష్టి పెడతాను." అనే నిర్ణయానికి వచ్చేశాడు.వ్యవసాయమే ఎందుకూ అంటేఇదేదో తాత్కాలిక ఆలోచనో, కేవలం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం కాదిది. దీని వెనుక ముందు చూపుతో చాలా తెలివిగా వ్యవహరించిన బలమైన ఆర్థిక ప్రణాళిక ఉంది. గత 10 ఏళ్లుగా సంపాదించిన సొమ్మును తెలివిగా పొదుపు చేశాడు. భవిష్యత్తులో ఉద్యోగం పోయినా అతను ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా తగిన ఆర్థిక భద్రతను కల్పించుకున్నాడు. ఇపుడిక ఎలాంటి దిగులు లేకుండా తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేస్తూ, కుటుంబంతో సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ 'ర్యాట్ రేస్' (Rat Race) అని పిలిచే ఈ కార్పొరేట్ పోటీ ప్రపంచాని దూరంగా, ప్రశాంత జీవనం గడపడమే అతని లక్ష్యం.ఇదీ చదవండి : లాస్ట్ మినిట్ ట్విస్ట్ : వరుడితో కాదు పెళ్లి !ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది దీనిని 'ఆస్పిరేషనల్ మూవ్' (ఆదర్శవంతమైన అడుగు) అని అభివర్ణిస్తున్నారు. లేఆఫ్స్ అనేవి కొన్నిసార్లు మన జీవితాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవడానికి దేవుడు ఇచ్చే అవకాశాలని కొందరు కామెంట్ చేశారు. సొంత రూల్స్తో ర్యాట్ రేస్నుంచి వైదొలగడం అరుదైన ఉదాహరణ అని పేర్కొన్నారు. కార్పొరేట్ జీవితం కంటే వ్యవసాయం, కుటుంబాన్ని ఎంచుకోవడానికి ధైర్యం , దృఢ విశ్వాసం అవసరమని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు జీవితంలో పొదుపు ప్రాముఖ్యత అందర్నీ ఆకట్టుకుంది. ఆకస్మికంగా ఉద్యోగం పోయినా తట్టు కోవాలంటే ఆర్థికంగా ముందుగానే సిద్ధంగా ఉండాలని ఈ ఘటన నిరూపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లక్షల జీతం కన్నా తనవాళ్ల మధ్య మనశ్శాంతిగా జీవించడంతోపాటు, భూమాతను నమ్ముకున్న తీరు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.ఇదీ చదవండి : పెళ్లిలో మద్యం ఇవ్వలేదని రెచ్చిపోయిన గెస్ట్లు, వీడియో వైరల్ -
తీవ్ర అనారోగ్యాలకు ఆర్థిక ముప్పు!
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణపై చర్చ జరుగుతున్న వేళ ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో వైద్య ద్రవ్యోల్బణం సుమారు 11.5% కి చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం కావడంతో సామాన్యుడి ఆర్థిక భద్రతకు సవాలుగా మారింది. ముఖ్యంగా తీవ్రమైన అనారోగ్యాల (క్రిటికల్ ఇల్నెస్) చికిత్సకు అయ్యే ఖర్చుకు, ప్రజల వద్ద ఉన్న బీమా రక్షణకు మధ్య వ్యత్యాసం పెరుగుతోందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ‘ఏయాన్’ హెచ్చరించింది.కారణం ఏమిటి?సాధారణంగా ఆరోగ్య బీమా అంటే కేవలం ఆసుపత్రి ఖర్చులు మాత్రమేనని చాలామంది భావిస్తారు. కానీ, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు లేదా అవయవ మార్పిడి వంటి తీవ్ర సమస్యలు తలెత్తినప్పుడు అసలు సవాళ్లు మొదలవుతాయి. ఏయాన్ ఇండియా హెల్త్ అండ్ వెల్త్ సొల్యూషన్స్ హెడ్ యాష్లే డిసిల్వా తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఈ వైద్య ఖర్చుల వ్యత్యాసం కేవలం హాస్పిటలైజేషన్ ఖర్చులకే పరిమితం కాదు. దీర్ఘకాలిక చికిత్స వల్ల ఉద్యోగానికి లేదా వృత్తికి ఆటంకం కలగవచ్చు. మందులు, డయాగ్నోస్టిక్స్, రికవరీ సమయంలో అయ్యే ఇతర ఖర్చులు అదనపు భారం. ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వంటి ఆధునిక వైద్య పద్ధతులు ప్రాణాలను కాపాడుతున్నప్పటికీ వాటి ఖరీదు సామాన్యుడికి భారంగా మారుతోంది’ అన్నారు.వేతనాలు తక్కువ.. వైద్య ఖర్చులు ఎక్కువ!ఏయాన్ గ్లోబల్ మెడికల్ ట్రెండ్ రేట్స్ నివేదిక ప్రకారం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వైద్య ఖర్చుల పెరుగుదల వేతనాల పెరుగుదల కంటే వేగంగా ఉంది. 2026 వరకు ఈ రెండంకెల ద్రవ్యోల్బణం(11.5 శాతం) ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. భారతదేశంలో సగటున ఒక ఉద్యోగికి తన సంస్థ ద్వారా లభించే బీమా కవరేజీ రూ.3 లక్షలు నుంచి రూ.5 లక్షల మధ్యే ఉంటోంది. అయితే, ఒక తీవ్రమైన వ్యాధికి చికిత్స పొందాలంటే ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదు.గ్లోబల్ మార్కెట్తో పోలిస్తే..చైనా, మలేషియా, థాయిలాండ్ వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారతదేశంలో బీమా రక్షణ పొందినవారి సంఖ్య తక్కువగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సామాజిక భద్రతా వ్యవస్థలు బలంగా ఉండగా, భారత్లో ప్రజలు తమ జేబుల నుంచే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.నిపుణుల సూచనలుపెరుగుతున్న ఈ ఆర్థిక అగాధాన్ని పూడ్చడానికి కేవలం ప్రాథమిక ఆరోగ్య బీమా సరిపోదని బీమా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అందులో.. సాధారణ పాలసీతో పాటు తీవ్రమైన వ్యాధులకు ప్రత్యేక కవరేజీ ఇచ్చే రైడర్లను తీసుకోవడం, కంపెనీ ఇచ్చే బీమాకు అదనంగా ఉద్యోగులే కొంత ప్రీమియం చెల్లించి కవరేజీని పెంచుకోవడం, నివారణా చర్యలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ ద్వారా వ్యాధులు రాకుండా చూసుకోవడం వంటివి ఉన్నాయి.ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ అది ఆర్థికంగా సామాన్యుడిని కుంగదీయకూడదంటే.. బీమా రక్షణ ప్రణాళికలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శారీరక ఆరోగ్యంతో పాటు ఆర్థిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని ఏయాన్ నివేదిక స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!
పశ్చిమాసియాలోని యుద్ధ భయం భారత్లో మందుబాబుల పాలిట శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు మన దేశంలోని మద్యం బాటిళ్ల ధరలను పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి ధరలు పెరగకపోయినా సమీప భవిష్యత్తులో మద్యం మరింత ప్రియం కానుందని కొందరు భావిస్తున్నారు.బాటిళ్ల తయారీకి గ్యాస్ సెగమద్యం తయారీలో ముడిసరుకు కంటే ప్యాకేజింగ్ ఖర్చే ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. దీనికి ప్రధాన కారణం సహజ వాయువు. మద్యం బాటిళ్లు తయారు చేసే గాజు ఫర్నెస్లను(కొలిమి) నిరంతరం మండించాలంటే గ్యాస్ తప్పనిసరి. బీర్ తయారీ ఖర్చులో ప్యాకేజింగ్ వాటా సుమారు 40% కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాలు)లో ఇది 20% వరకు ఉంటుంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సహజ వాయువు దిగుమతిదారు అయిన భారత్ తన అవసరాల కోసం 40% వరకు ఖతార్ పైనే ఆధారపడుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై దెబ్బకొడుతుంది.ధరల పెరుగుదల ఎంత ఉండవచ్చు?ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ (ఐఎండబ్ల్యూఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రాజేష్ చోప్రా అంచనా ప్రకారం, కేవలం గ్యాస్ ధరల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. దీనికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవ్వడంతో కంపెనీలు బ్రాండ్ల వారీగా 10-15% ధరల సవరణ కోరుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లలో ఈ ప్రభావం తక్షణమే కనిపించనుంది.బీర్ కొరత పొంచి ఉందా?వేసవి కాలం బీర్లకు గరిష్ట డిమాండ్ ఉండే సమయం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సరఫరా తగ్గితే వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదు. ‘గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఫలితంగా బాటిళ్ల కొరత ఏర్పడి పీక్ సీజన్లో డిమాండ్కు తగ్గ సరఫరా ఉండకపోవచ్చు’ అని మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్దీప్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుతం పరిశ్రమ ఇప్పటికే 12-13 కోట్ల బాటిళ్ల వార్షిక కొరతను ఎదుర్కొంటోంది. అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.ఇన్వెంటరీయే రక్షణ కవచంప్రస్తుతానికి కొన్ని కంపెనీలు ముందస్తు జాగ్రత్తలతో గండం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. రాడికో ఖైతాన్ కంపెనీకి సొంత పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఇంధన ధరల అస్థిరత నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. అలైడ్ బ్లెండర్స్ తమ వద్ద ఒకటిన్నర నెలలకు సరిపడా గాజు బాటిళ్ల స్టాక్ ఉందని, ఇది తక్షణ షాక్ నుంచి కాపాడుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
బ్యాంకుల మార్జిన్లు డీలా
దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని పెంచేందుకు ఆర్బీఐ తీసుకునే చర్యలతో బ్యాంకుల మార్జిన్లపై ఒత్తిడి పెరగనున్నట్లు గ్లోబల్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. మరోపక్క రూపాయిలో హెచ్చుతగ్గుల నివారణకు తీసుకునే చర్యలతో లిక్విడిటీ ప్రయత్నాలు మందగించవచ్చని తెలియజేసింది. అయితే బ్యాంకుల ప్రత్యక్ష విదేశీ కరెన్సీ రిసు్కలు మాత్రం పరిమితంకానున్నట్లు అభిప్రాయపడింది. ఈ ఆర్థిక సంవత్సరానికి(2026–27) బ్యాంకింగ్ రంగ మార్జిన్లు 0.2–0.3 శాతంమేర క్షీణించవచ్చని తెలియజేసింది. పశ్చిమాసియాలో ఆందోళనలు కొనసాగితే నిధుల సమీకరణ వ్యయాలు పెరిగి ప్రస్తుత అంచనాలు 3.1 శాతానికంటేలోపునకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నిర్వహణా లాభ/రిస్క్ వెయిటెడ్ అసెట్స్(ఆర్డబ్ల్యూఏలు) 0.3–0.4 శాతంమేర నీరసించవచ్చని తెలియజేసింది. ప్రస్తుత అంచనాలు 2.5 శాతంలో క్షీణత కనిపించవచ్చని అభిప్రాయపడింది. డిపాజిట్ వ్యయాలపై..బేస్కేస్ ప్రకారం తగినంత లిక్విడిటీ కారణంగా డిపాజిట్ వ్యయాలు తగ్గనున్నాయి. 2024 నుంచి ఆర్బీఐ కీలక రెపో రేటులో 1.25 శాతం కోత పెట్టినప్పటికీ 2026కల్లా 0.44 శాతమే డిపాజిట్ రేట్లకు బదిలీ అయినట్లు ఫిచ్ ప్రస్తావించింది. డిపాజిట్లను మించుతున్న రుణ వృద్ధి కారణంగా డిపాజిట్ల సమీకరణలో పోటీ పెరిగినట్లు వెల్లడించింది. వెరసి డిపాజిట్ రేట్లలో మరిన్ని సర్దుబాట్లకు అవకాశమున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్లు, ఓపెన్ మార్కెట్ కొనుగోళ్ల ద్వారా ఆర్బీఐ 2024–25 ద్వితీయార్థంలో లిక్విడిటీని నిలకడగా పంప్చేసినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని కొనసాగించేందుకు క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు ఆర్బీఐ సంకేతాలిచ్చినట్లు తెలియజేసింది. అయితే కరెన్సీ ఒత్తిళ్లు కొనసాగితే లిక్విడిటీ చర్యలు పరిమితంకానున్నట్లు పేర్కొంది.పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2026 మార్చి29కల్లా బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ మిగులు డిపాజిట్లలో 0.5 శాతానికి చేరినట్లు వెల్లడించింది. ఫిబ్రవరిలో ఇది 0.8 శాతంకాగా.. రూపాయి సైతం 4.5 శాతం పతనమైనట్లు పేర్కొంది. రూపాయి ఒత్తిళ్లు కొనసాగితే బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ నిలిపేందుకు ఆర్బీఐకున్న అవకాశాలు తగ్గిపోనున్నట్లు వివరించింది. ఇందుకు తీసుకునే చర్యలు బ్యాంకింగ్ వ్యవస్థలో స్థానిక కరెన్సీ లిక్విడిటీని దెబ్బతీస్తుందని తెలియజేసింది. రూపాయి హెచ్చుతగ్గులు దేశీ బ్యాంకులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవని, బ్యాంకింగ్ రంగంలో విదేశీ రుణాలు సైతం 10 శాతానికంటే తక్కువేనని తెలియజేసింది. ఈ బాటలోనే తాజాగా 100 మిలియన్ డాలర్లకుపైన ఫారెక్స్ పొజిషన్లకు తెరవేయమని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించింది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
భారతి ఎయిర్టెల్ రికార్డ్.. 65 కోట్ల యూజర్స్!
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో చందాదారుల సంఖ్య పరంగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా అవతరించింది. ఈ విషయాన్ని కంపెనీ ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ టెలికాం కంపెనీ.. భారతదేశంలో మాత్రమే కాకుండా, ఆఫ్రికా అంతటా బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. GSMA ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం.. ఒక్క ఇండియాలో ఎయిర్టెల్కు 368 మిలియన్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు. ఇందులో ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ద్వారా అనుసంధానించి 13 మిలియన్ల గృహాలు, దాని డిజిటల్ టీవీ సేవలను ఉపయోగించే 15 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.Bharti Airtel, the world’s second largest telecom operator by customer base, has crossed 650 million customers globally.— Bharti Airtel (@airtelnews) April 2, 2026ఆఫ్రికాలో.. ఎయిర్టెల్ ఆఫ్రికా 14 దేశాలలో 179 మిలియన్ల వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ ప్రాంతంలో కంపెనీ హై-స్పీడ్ డేటా, వాయిస్ సేవలు, మొబైల్ మనీ పరిష్కారాలను అందిస్తుండగా, 52 మిలియన్లకు పైగా వినియోగదారులు దీని ఆర్థిక సేవల ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉన్నారు.ఎయిర్టెల్ సాధించిన ఈ విజయాన్ని గురించి కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. 65 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడం ఒక పెద్ద బాధ్యత. కొత్త ఆవిష్కరణలు, విశ్వసనీయమైన సేవల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. టెలికాం పరిశ్రమలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడమే ఎయిర్టెల్ లక్ష్యమని ఆయన తెలిపారు. -
ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!
చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను తొలగిస్తుంటే.. ఇదేబాటలో దిగ్గజ సంస్థ ఒరాకిల్ కూడా అడుగులువేసింది. ఈ ప్రభావం ఏకంగా 30వేలమంది ఎంప్లాయిస్ మీద పడుతుంది. ఇందులో 12000 ఇండియన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు వారికి లభించే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఒరాకిల్ తొలగించిన ఉద్యోగుల జాబితాలో ఇంజినీరింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాలకు చెందినవారు ఉన్నారు. లేఆఫ్స్ ప్రక్రియలో అనేక మంది ఉద్యోగులు ఒక్కసారిగా తమ సిస్టమ్ యాక్సెస్ కోల్పోయి, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా జాబ్ కోల్పోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కొందరు ఉద్యోగులు రెడ్దిట్ ద్వారా వెల్లడించారు. ఇందులోనే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు కూడా వివరించారు.''కంపెనీలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి 15 రోజుల ప్రాథమిక జీతం చెల్లిస్తారు. అదనంగా.. వాడని సెలవుల మొత్తాన్ని నగదుగా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగి తొలగింపు సమయంలో నోటీస్ పీరియడ్కు బదులుగా ఒక నెల జీతం కూడా అందజేస్తారు. ఉద్యోగి అర్హత ఉన్నట్లయితే గ్రాచ్యుటీ కూడా లభిస్తుంది. ఇంకా.. తొలగింపు తేదీ వరకు ఉన్న పెండింగ్ జీతం కూడా పూర్తిగా చెల్లిస్తారు'' అని ఒక ఉద్యోగి పేర్కొన్నారు.కంపెనీ నుండి రెండు నెలల అదనపు ఎక్స్గ్రేషియా (ప్రత్యేక పరిహారం) కూడా లభిస్తుంది. అయితే.. ఈ మొత్తం పొందడానికి ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశాం అనే ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన షరతుగా కనిపిస్తోంది. అలాగే సుమారు రూ.20,000 వరకు ఇన్సూరెన్స్, ఒక నెల గార్డెనింగ్ లీవ్ జీతం లేదా దానికి సమానమైన పరిహారం కూడా ఇవ్వనున్నట్లు మరికొందరు ఉద్యోగులు వెల్లడించారు.ఇదీ చదవండి: ప్రాపర్టీ అమ్మేసిన బాలీవుడ్ నటుడు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే? -
ఇపుడా పని..క్యాబ్ బుక్ చేసినంత ఈజీ : ఆనంద్ మహీంద్ర ట్వీట్
పారిశ్రామిక వేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికర కథనాన్ని సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ, భారతీయులు దాన్ని వినియోగించుకుంటున్నతీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అత్యంత సాంప్రదాయకమైన, స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామంటూ ఆనందాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట సందడిగా మారింది. ఆనంద్ మహీంద్ర తన ట్వీట్లో ఏమన్నారంటే..క్యాబ్ని బుక్ చేసుకున్నంత సులభంగా ఇపుడు కేరళలో కొబ్బరి కాయలను తీసే వ్యక్తిని (Coconut Harvester) పిలిపించుకోవచ్చు. ఒక శిక్షణ పొందిన వృత్తినిపుణుడులా యూనిఫాం ధరించి, అవసరమైన పరికరాలతో సైకిల్పై వచ్చి తన పనిని పూర్తి చేసుకొని వెళ్లిపోతాడు. ఈ ఉదంతంలో తనను బాగా ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే.. ఆ చెట్లు ఎక్కిన యువకుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు అంటూ రాసుకొచ్చారు.అలాగే తన కరీర్ ప్రారంభం నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో గ్రూప్ స్టీల్ బిజినెస్లో పనిచేస్తున్నప్పుడు, ఫర్నేస్ , ఫౌండ్రీ షాపుల్లో పనిచేసే వాళ్లకోసం ఎదురు చూడాల్సి వచ్చేది. వీరిలో చాలా మంది తమ ఇళ్లకు దూరంగా వచ్చినవారే. ముఖ్యంగా వీరంతా బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి ఉపాధి వెతుక్కుంటూ వచ్చేవారు. <In Kerala, apparently you can now call a coconut harvester the same way you book a cab. A uniformed professional arrives on a cycle, equipped, trained, and ready to work.We often speak about India’s services economy in terms of IT exports or global capability centres. But… pic.twitter.com/3MvKRWxdHh— anand mahindra (@anandmahindra) April 2, 2026 భారతదేశ సేవా రంగాన్ని (Services Economy) గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఐటీ ఎగుమతులు లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గురించే చర్చించుకుంటాం. కానీ ఇపుడు పరిస్థితి చాలా మారింది.కానీ మనం మన అత్యంత సాంప్రదాయ, అతి స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. గతంలో భారీ పరిశ్రమలలో మాత్రమే కనిపించిన ఈ ఆశలు, ఆకాంక్షలు.. నేడు సాంకేతికతతో కూడిన సరికొత్త సేవా రంగాలలో కూడా మార్గాలను వెతుక్కుంటున్నాయి మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్లడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారడం, అభివృద్ధి చెందిన అనేది నిజంగా శక్తివంతమైన ఆర్థిక చోదక శక్తి మాత్రమే కాదు, ఇది దేశ సమగ్రతకు (Integration) కూడా ఒక గొప్ప బలం అని అభివర్ణించారు. ఆయా రాష్ట్రాలు ఈ వలస కార్మికులను సాదరంగా ఆహ్వానించినంత కాలం ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుంది! అన్నారు.ఇదీ చదవండి: లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్ స్టోరీ -
ఉత్తర కొరియా కిమ్ ‘దొంగ ప్రయాణం’!
ఉత్తర కొరియా ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురించి సోషల్ మీడియాలో ఒక పాత కథనం ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. చిన్నతనంలో కిమ్ జోంగ్ ఉన్ తన సోదరుడితో కలిసి జపాన్లోని ప్రసిద్ధ 'టోక్యో డిస్నీల్యాండ్'ను సందర్శించడానికి నకిలీ పాస్పోర్ట్ను ఉపయోగించారనే వార్త నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, 1991 మే నెలలో అప్పటికి కేవలం ఎనిమిదేళ్ల వయసున్న కిమ్ జోంగ్ ఉన్, తన సోదరుడు కిమ్ జోంగ్ చుల్తో కలిసి జపాన్లోకి అడుగుపెట్టారు. వీరు తమ గుర్తింపును దాచిపెట్టి, బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఉపయోగించి ఈ ప్రయాణం చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్ 'జోసెఫ్ ప్వాగ్' అనే మారుపేరుతో ఈ పత్రాలను సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.బ్రెజిల్ పాస్పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు?కిమ్ కుటుంబం బ్రెజిలియన్ పాస్పోర్ట్లను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్రెజిల్లో విభిన్న జాతుల ప్రజలు నివసిస్తారు. కాబట్టి, తూర్పు ఆసియా దేశాలకు చెందిన వారు బ్రెజిలియన్ పౌరులుగా చలామణి అవ్వడం సులభం. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా అధికారులకు అనుమానం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.ఈ సోదరులిద్దరితో పాటు దాదాపు 10 మంది ఉత్తర కొరియా అధికారుల బృందం కూడా జపాన్లో పర్యటించినట్లు తెలుస్తోంది. సుమారు వారం రోజుల పాటు జపాన్లో ఉన్న వీరు, టోక్యో డిస్నీల్యాండ్ను పలుమార్లు సందర్శించి అక్కడ గడిపినట్లు యోమియురి షింబున్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు గతంలోనే నివేదించాయి. ఆ సమయంలో జపాన్ భద్రతా అధికారులు వీరిని గుర్తించడంలో విఫలమయ్యారు. వారు దేశం విడిచి వెళ్లిన తర్వాతే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.సవతి సోదరుడికి తప్పని ఇబ్బందులుకిమ్ జోంగ్ ఉన్ ఈ పర్యటనను విజయవంతంగా ముగించినప్పటికీ, 2001లో ఇదే తరహా ప్రయత్నం చేసిన ఆయన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ మాత్రం అడ్డంగా దొరికిపోయారు. డొమినికన్ రిపబ్లిక్ నకిలీ పాస్పోర్ట్తో టోక్యో డిస్నీల్యాండ్కు వెళ్లే ప్రయత్నంలో నరిటా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని దేశం నుండి బహిష్కరించారు.ఈ సంఘటన వల్లనే కిమ్ జోంగ్ నామ్ తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ వద్ద నమ్మకాన్ని కోల్పోయారని, ఫలితంగా ఉత్తర కొరియా తదుపరి వారసుడిగా కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వార్త, ఉత్తర కొరియా పాలకుల వ్యక్తిగత జీవితం, వారి రహస్య పర్యటనలపై మరోసారి చర్చకు దారితీసింది. View this post on Instagram A post shared by im just culture (@imjustculture) -
బిగ్ రిలీఫ్.. ఐటీ శాఖ కీలక నిర్ణయం
పెట్టుబడిదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. 2017 ఏప్రిల్ 1కి ముందు చేసిన పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే ఆదాయానికి జనరల్ యాంటీ అవాయిడెన్స్ రూల్స్ (గార్) వర్తించవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది.సవరించిన ఆదాయపన్ను చట్టం నిబంధనలు, 2026 కింద.. 2017 ఏప్రిల్ 1కు ముందు చేసిన పెట్టుబడులను బదిలీ చేసినప్పుడు వచ్చిన ఆదాయం గార్ పరిధిలోకి రాదని పేర్కొంది. గార్, గ్రాండ్ ఫాదరింగ్కు మధ్య గందరగోళాన్ని తాజా ప్రకటన తొలగిస్తుందని ఏకేఎం గ్లోబల్ పార్ట్నర్, పన్ను నిపుణుడు సందీప్ సెహగల్ పేర్కొన్నారు. పాత పెట్టుబడులకు రక్షణ ఉంటుందని స్పష్టం చేసినట్టు చెప్పారు.గార్ను మొదటగా 2012–13 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. విదేశీ పెట్టుబడిదారులు పన్ను తప్పించుకునే ప్రయత్నాలను అరికట్టడమే దీని లక్ష్యం. అయితే ఈ నిబంధనలపై పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో అమలు ఆలస్యమైంది. చివరకు 2017 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. అదే సమయంలో పాత పెట్టుబడులకు ‘గ్రాండ్ఫాదరింగ్’ రక్షణ కల్పించారు. ‘టైగర్ గ్లోబల్’ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత గార్ అమలుపై సందిగ్ధత ఏర్పడింది.2018లో ఫ్లిప్కార్ట్ షేర్ల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై పన్ను చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీబీడీటీ తాజా నోటిఫికేషన్తో 2017కు ముందు పెట్టుబడులపై లాభాలు భవిష్యత్తులో కూడా గార్కు లోబడవని స్పష్టం చేసింది. మొత్తంగా ఈ నిర్ణయం విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. -
40 పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకం రద్దు!
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న వేళ భారత ప్రభుత్వం దేశీయ పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు కీలక అడుగు వేసింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల దేశీయ పరిశ్రమలు కుదేలు కాకుండా చూసేందుకు 40 రకాల కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం పూర్తిగా మాఫీ చేసింది. ఏప్రిల్ 2, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మినహాయింపు జూన్ 30, 2026 వరకు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.ఎందుకు ఈ నిర్ణయం?ప్రపంచ పెట్రోకెమికల్ మార్కెట్కు పశ్చిమాసియా కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ముడి పదార్థాల లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ప్రభావం నేరుగా భారత తయారీ రంగంపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ‘ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో అవసరమైన ముడి పదార్థాల ధరలను స్థిరీకరించడం ద్వారా దేశీయ తయారీదారులకు రక్షణ కల్పించడమే మా ప్రాథమిక లక్ష్యం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.ప్రయోజనం పొందే రంగాలు, ఉత్పత్తులుఈ సుంకాల మాఫీ ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచే ప్రాథమిక ముడి పదార్థాలు, అధునాతన పాలిమర్లపై దృష్టి సారించింది. అందులో.. మిథనాల్, మోనోథిలిన్ గ్లైకాల్, ఫినాల్, ఎసిటిక్ ఆమ్లం, పాలిథిలిన్, పాలీప్రొపైలిన్, పాలీస్టైరిన్, పీవీసీ, ఎపోక్సీ రెసిన్లు, పాలీకార్బోనేట్లు, పీఈటీ చిప్స్ ఉన్నాయి.లాభపడే పరిశ్రమలుప్లాస్టిక్స్, ప్యాకేజింగ్టెక్స్టైల్ఫార్మాస్యూటికల్స్ఆటోమోటివ్విస్తృత ఆర్థిక వ్యూహంఈ నిర్ణయం పరిశ్రమలకు రాయితీ ఇవ్వడంతోపాటు దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టే ముందస్తు చర్య అని నిపుణులు చెబుతున్నారు. పెట్రోకెమికల్ ఉత్పత్తుల ధరలు పెరిగితే అది నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్నింటి ధరల పెరుగుదలకు దారితీస్తుంది. సుంకాల రద్దు ద్వారా ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోగలుగుతుంది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్ కంపెనీ అధినేత హామీ
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉద్యోగుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు దుబాయ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్ తెరదించారు. తన సంస్థలో పనిచేస్తున్న 6,000 మందికి పైగా ఉద్యోగులకు ఆయన కొండంత అండగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరి ఉద్యోగానికి డోకా లేదని, అందరికీ సకాలంలో వేతనాలు అందుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.కుటుంబంలా అండగా ఉంటాంఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిజ్వాన్ సాజన్ స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "మా 6,000 మందికి పైగా ఉద్యోగులు మమ్మల్ని విశ్వసించి, డానుబే గ్రూప్ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించారు. నేడు వారికి అండగా నిలవడం నా కనీస బాధ్యత. మా గ్రూప్లో ఎటువంటి తొలగింపులు ఉండవు, అందరికీ జీతాలు సకాలంలో అందుతాయి" అని ఆయన ప్రకటించారు.ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది 6,000 మంది ఉద్యోగుల విషయం మాత్రమే కాదు, 6,000 కుటుంబాల జీవనాధారం. మీరు నిజమైన నాయకుడు" అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.హార్డ్వేర్ షాప్ నుంచి బిలియనీర్ స్థాయికి..రిజ్వాన్ సాజన్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1993లో కేవలం కొన్ని వేల దిర్హామ్లతో దుబాయ్లో అడుగుపెట్టిన ఆయన, మొదట ఒక హార్డ్వేర్ దుకాణంలో పనిచేశారు. 1993లోనే 'డానుబే' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో 'డానుబే ప్రాపర్టీస్'ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు. ఆయన సంస్థ నేడు సుమారు 5.13 బిలియన్ దిర్హామ్ల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. దుబాయ్తో పాటు భారత్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, చైనా దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఇటీవల దుబాయ్లో 55 అంతస్తుల వాణిజ్య టవర్ను నిర్మించి, దానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు పెట్టడం విశేషం. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకటించిన "2025 టాప్ 10 అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ లీడర్స్" జాబితాలో రిజ్వాన్ సాజన్ చోటు సంపాదించుకున్నారు. సంక్షోభ సమయాల్లో కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, రిజ్వాన్ సాజన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by Rizwan Sajan (@rizwan.sajan) -
దేశీ ఎయిర్లైన్స్కి ఊరట
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగిసినప్పటికీ విమాన ఇంధనం రేట్లను భారీగా పెంచకుండా దేశీ విమానయాన సంస్థలకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు కొంత ఊరటనిచ్చాయి. వాస్తవానికి రెట్టింపు స్థాయిలో పెంచాల్సినప్పటికీ పెంపును 8.5%కి పరిమితం చేశాయి. అయితే, వాణిజ్య గ్యాస్ సిలిండర్ (ఎల్పీజీ), ప్రీమియం పెట్రోల్ రేట్లను మాత్రం పెంచాయి. తాజా పరిమాణంతో దేశీ ఎయిర్లైన్స్కి ఏటీఎఫ్ ధర ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 8,289 (8.56%) పెరిగి రూ. 1,04,927కి చేరింది. కానీ విదేశీ ఎయిర్లైన్స్, నాన్–శెడ్యూల్డ్, చార్టర్ ఫ్లయిట్స్కి మాత్రం 114.5% ఎగిసింది. రూ.1,10,703 పెరిగి రూ. 2,07,341కి చేరింది. ఇది రూ. 2 లక్షల మార్కు దాటడం ఇదే తొలిసారి. ‘విమాన టికెట్ చార్జీలు భారీగా పెరగకుండా ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు, దేశీ ఎయిర్లైన్స్పై భారాన్ని తగ్గించేందుకు, కీలక తరుణంలో పరిశ్రమలో స్థిరత్వాన్ని తెచ్చేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఎయిర్ కనెక్టివిటీకి ఆటంకాలు ఏర్పడకుండా చూడటం ద్వారా ఎకానమీకి కూడా ప్రయోజనం చేకూర్చగలదు’ అని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏవియేషన్ పరిశ్రమకు, విమాన ప్రయాణికులపై పెను భారం పడకుండా ఈ చర్యలు తోడ్పడతాయని ఇండిగో, స్పైస్జెట్, ఆకాశ ఎయిర్ పేర్కొన్నాయి. సాధారణ పెట్రోల్, వంట గ్యాస్ ధర యథాతథం.. 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు ఢిల్లీలో రూ. 195.50 మేర పెరిగి రూ. 2,078.50కి చేరింది. ప్రీమియం డీజిల్ రేటు లీటరుకు రూ. 1.50 మేర పెరిగి రూ. 92.99కి చేరగా, 100 ఆక్టేన్ పెట్రోల్ ధర రూ. 11 పెరిగి రూ. 160కి చేరింది. సాధారణ, అన్బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్, గృహ వినియోగ వంట గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పుల్లేవు. వంట గ్యాస్ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రతి సిలిండర్పై రూ. 380 మేర ఆదాయ నష్టం వాటిల్లుతోంది’ అని పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ పేర్కొంది.ఇండిగో ఇంధన చార్జీల పెంపు..ఏటీఎఫ్ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఇంధన చార్జీలను రూ. 275–10,000 వరకు పెంచుతున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. తాజాగా ప్రయాణ దూరాన్ని బట్టి దేశీ రూట్లలో ఫ్లయిట్లకు సంబంధించి ఈ పెంపు రూ. 275–950 శ్రేణిలో, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్లో రూ. 900 – 10,000 శ్రేణిలో ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో మార్చి 14 నుంచి ఇండిగో రూ. 425 నుంచి రూ. 2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తోంది. -
చైనా సీసీ కెమెరాలకు చెక్! ఇక కొత్త నిబంధనలు
దేశ భద్రత, సైబర్ రక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. చైనాకు చెందిన పలు కంపెనీల సీసీటీవీ (CCTV) కెమెరాల విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ ఆధారిత కెమెరాల నిఘాను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 1 నుండి మారిన నిబంధనలు ఇవే..ఏప్రిల్ 1 నుండి దేశంలో విక్రయించే ప్రతి ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరా తప్పనిసరిగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన STQC (స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) ఫ్రేమ్వర్క్ నుండి అనుమతి పొందాలి.కంపెనీలు తమ కెమెరాలలో ఉపయోగించే సిస్టమ్-ఆన్-చిప్ (SoC) లేదా ప్రాసెసర్ ఎక్కడ తయారైందో స్పష్టంగా తెలియజేయాలి.ఎన్క్రిప్షన్ టెక్నాలజీ, హార్డ్వేర్ మూలం, ఫర్మ్వేర్ భద్రత మరియు ట్యాంపరింగ్ (ట్యాంపర్ రెసిస్టెన్స్) వంటి అంశాలపై STQC అధికారులు పరీక్షలు నిర్వహిస్తారు.కెమెరా డేటాను ఇతరులు రిమోట్గా యాక్సెస్ చేసే అవకాశం ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే కాకుండా, భారత్లో అసెంబుల్ చేసే పరికరాలు కూడా ఈ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది. క్లియరెన్స్ లేని ఉత్పత్తుల విక్రయం ఇకపై చట్టవిరుద్ధం.ఏ బ్రాండ్లపై ప్రభావం పడుతుంది?భారత సీసీటీవీ మార్కెట్లో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చలాయించిన హిక్ విజన్ (Hikvision), టీపీ-లింక్ (TP-Link), దహువా (Dahua) వంటి ప్రముఖ చైనా కంపెనీలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కొత్త నిబంధనల ప్రకారం వీరు కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.పాత కెమెరాల పరిస్థితి ఏమిటి?ఇప్పటికే ఇళ్లు, కార్యాలయాల్లో వాడుతున్న కెమెరాల విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రస్తుత కెమెరాలను స్వాధీనం చేసుకోదు. పాత కెమెరాలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే, భవిష్యత్తులో ఆయా కంపెనీల నుండి వచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ (మరమ్మతులు) విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.ధరలు పెరుగుతాయా?చైనా కంపెనీలకు ఆంక్షలు ఎదురైనప్పటికీ, భారతీయ బ్రాండ్లు సీపీ ప్లస్ (CP Plus), ప్రమా (Prama), క్యోబో (Kyobo), మ్యాట్రిక్స్ (Matrix), స్పర్ష్ (Sparsh) ఇప్పటికే తమ ఉత్పత్తిని భారీగా పెంచాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో వీటి వాటా 80 శాతానికి చేరుకుంది. అయినప్పటికీ, భద్రతా పరీక్షల కోసం అయ్యే అదనపు ఖర్చు, సరఫరాదారుల సంఖ్య తగ్గడం వల్ల, రానున్న రోజుల్లో ముఖ్యంగా మిడ్, ప్రీమియం రేంజ్ కెమెరాల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఎయిర్టెల్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు
భారతీ ఎయిర్టెల్ తన డేటా సెంటర్ విభాగమైన 'నెక్స్ట్రా' (Nxtra)లో భారీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆల్ఫా వేవ్ గ్లోబల్, కార్లైల్, యాంకోరేజ్ క్యాపిటల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కలిసి సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,300 కోట్లు) నిధులను సమకూర్చనున్నాయి. ఈ పెట్టుబడిలో భారతీ ఎయిర్టెల్ కూడా పాలుపంచుకోనుంది. ఈ నిధుల సేకరణ అనంతరం నెక్స్ట్రా సంస్థ విలువ సుమారు 3.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ఫా వేవ్ గ్లోబల్ 435 మిలియన్ డాలర్లు, కార్లైల్ 240 మిలియన్ డాలర్లు, యాంకోరేజ్ క్యాపిటల్ 35 మిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఎయిర్టెల్ సంస్థే సమకూర్చనుంది. ఈ పెట్టుబడుల తర్వాత కూడా నెక్స్ట్రాలో మెజారిటీ వాటా ఎయిర్టెల్ వద్దే ఉంటుంది. కృత్రిమ మేధ (AI) ఆధారిత డేటా సెంటర్ల విస్తరణే లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు.ప్రస్తుతం నెక్స్ట్రా సంస్థకు దేశవ్యాప్తంగా 300 మెగావాట్ల సామర్థ్యం ఉండగా, రానున్న కొన్నేళ్లలో దీన్ని 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్లో శరవేగంగా పెరుగుతున్న క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, హైపర్స్కేలర్ డిమాండ్ను అందిపుచ్చుకోవడానికి ఈ విస్తరణ దోహదపడనుంది. దేశీయ డేటా సెంటర్ మార్కెట్లో 25 శాతం వాటాను కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.నెక్స్ట్రా ఇప్పటికే పుణెలో అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉండగా, తాజాగా చెన్నై, ముంబై, కోల్కతాలలో ఏఐ-రెడీ (AI-ready) క్యాంపస్లను నిర్మిస్తోంది. గూగుల్తో కలిసి గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా 14 ప్రధాన కోర్ డేటా సెంటర్లు, 120కి పైగా ఎడ్జ్ కేంద్రాలతో నెక్స్ట్రా తన సేవలను అందిస్తోంది. ఈ కొత్త పెట్టుబడులతో భారత్ గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా మారుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
LICకి రూ.3,750 కోట్ల నష్టం.. అనిల్ అంబానీపై కేసు
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని కష్టాలు వీడటం లేదు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ద్వారా ఎల్ఐసీని (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మోసగించినట్లు వచ్చిన ఫిర్యాదుపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తాజా కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలు సమర్పించి సుమారు రూ.3,750 కోట్ల మేర ఎల్ఐసీకి నష్టం కలిగించారనేది ప్రధాన ఆరోపణ.అసలేం జరిగింది?కేసు వివరాల ప్రకారం.. 2009 నుంచి 2012 మధ్య కాలంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCD) జారీకి పూనుకుంది. ఆ సమయంలో కంపెనీ ఆర్థిక స్థితిగతులు, ఆస్తుల భద్రతపై తప్పుడు సమాచారం ఇచ్చి ఎల్ఐసీని నమ్మించారు. దాదాపు రూ.4,500 కోట్ల విలువైన ఎన్సీడీలను కొనుగోలు చేసేలా ఎల్ఐసీని ప్రేరేపించారు. చివరికి ఈ వ్యవహారంలో ఎల్ఐసీకి రూ.3,750 కోట్లకు పైగా నికర నష్టం వాటిల్లింది.ఫోరెన్సిక్ ఆడిట్లో విస్తుపోయే నిజాలుబీడీఓ ఇండియా ఎల్ఎల్పీ (BDO India LLP) 2020లో నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఈ కుంభకోణంలోని లోతుపాతులను బయటపెట్టింది. ఆ నివేదిక ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి సేకరించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించారు. షెల్ కంపెనీలు, అనుబంధ సంస్థల ద్వారా ఇంటర్-కంపెనీ డిపాజిట్ల పేరుతో నిధులను స్వాహా చేశారు. ఉనికిలో లేని అమ్మకాల ఇన్వాయిస్లు, కల్పిత బిల్లులను సృష్టించి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు. సెక్యూరిటీగా చూపిన ఆస్తుల విలువను వాస్తవం కంటే భారీగా పెంచి చూపినట్లు తేలింది. కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై అవినీతి నిరోధక చట్టం కింద అనిల్ అంబానీ, ఆర్కామ్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు అధికారులు తెలిపారు.వరుస కేసులుఅనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు చేయడం ఈ నెలలో ఇది రెండోసారి. మార్చి 8న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఫిర్యాదు మేరకు రూ.1,085 కోట్ల బ్యాంకు మోసం కేసు నమోదైంది. ఇందులో పీఎన్బీకి రూ.621.39 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.463.80 కోట్ల మేర బకాయిలు పడ్డారు. తాజా ఎల్ఐసీ కేసుతో అనిల్ అంబానీ సహా మాజీ డైరెక్టర్ల చుట్టూ చట్టపరమైన ఉచ్చు మరింత బిగుస్తోంది. -
ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన మెరుగుపడినప్పటికీ పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఇంకాస్త అప్రమత్తత అవసరమని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కాంతార్తో కలిసి నిర్వహించిన ఐదో ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐరిస్ 5.0)’ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాదిలో రిటైర్మెంట్ ఇండెక్స్ 2022లో 43 పాయింట్లు ఉండగా 2025 నాటికి అది స్వల్పంగా మారి 45కు చేరింది. అయితే జాతీయ సగటు (44 నుంచి 48కి)తో పోలిస్తే ఈ వృద్ధి నెమ్మదిగానే ఉంది.నివేదికలోని అంశాలు..దక్షిణాది ప్రజలు తమ ఫిట్నెస్పై మునుపటి కంటే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య 37% నుంచి 44%కి పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ.ఆరోగ్య ధీమా: సుమారు 80 శాతం మంది తాము పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.డిజిటల్ హెల్త్: వెల్నెస్ యాప్లను ఉపయోగించడంలో దక్షిణాది వాసులు (18%) జాతీయ సగటు (15%) కంటే ముందున్నారు.బీమా: హెల్త్ చెకప్ల పట్ల ఆసక్తి పెరిగినప్పటికీ ఆరోగ్య బీమా వినియోగం మాత్రం 44% వద్దే నిలిచిపోయింది. ఇది జాతీయ సగటు (50%) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.10 ఏళ్లకే నిధులు ఖాళీ?పదవీ విరమణ ప్రణాళిక అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని 54% మంది భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనుకబడి ఉన్నారు.దేశవ్యాప్తంగా 67% మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెడుతుంటే దక్షిణాదిలో అది కేవలం 61% మాత్రమే ఉంది.రిస్క్ ఉన్నా అధిక లాభాలనిచ్చే ఇన్వెస్ట్మెంట్లలో పెట్టుబడులు కేవలం 33% మాత్రమే ఉండగా, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పద్ధతులపైనే (58%) ఎక్కువగా ఆధారపడుతున్నారు.తమ పొదుపు మొత్తాలు రిటైర్మెంట్ తర్వాత పదేళ్లకు మించి రావని 27% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆస్తులు (39%), ఇతర తక్షణ ఖర్చుల (33%) కారణంగా పదవీ విరమణ పొదుపుపై దృష్టి పెట్టలేకపోతున్నామని సర్వేలో తేలింది.ఒంటరితనం దూరంఆర్థికంగా వెనుకబడటం మినహాయిస్తే కుటుంబ మద్దతు విషయంలో దక్షిణాది వాసులు ధైర్యంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులు అండగా ఉంటారనే నమ్మకం 57 శాతానికి పెరిగింది. గతంలో 75 శాతంగా ఉన్న ఒంటరితనపు భయంతో ఉండేవారు. ప్రస్తుతం ఇది 68 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం.‘ఆరోగ్యం, వెల్నెస్ పట్ల అవగాహన పెరగడం శుభపరిణామం. అయితే ఆలోచనలకు ఆచరణ తోడైనప్పుడే పూర్తిస్థాయి పదవీ విరమణ భద్రత లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికల్లో ఉన్న ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది’ అని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ తల్వార్ అన్నారు. దక్షిణాదిలో ప్రజలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా మారుతున్నప్పటికీ ఆర్థికంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మదుపు చేయడం ద్వారానే సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిణామాలు కేవలం పెట్రోల్ ధరలనో, స్టాక్ మార్కెట్లనో ప్రభావితం చేస్తాయని భావిస్తే పొరపాటే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర పోరు ఇప్పుడు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా దేశంలోని కండోమ్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతీయ రబ్బరు పరిశ్రమ వర్గాల తాజా సమాచారం ప్రకారం, కండోమ్ల తయారీ వ్యయం గణనీయంగా పెరగడమే కాకుండా సరఫరా గొలుసు పూర్తిగా అస్తవ్యస్తమైంది.ఏమిటీ సమస్య?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీదారులలో ఒకటి. అయితే, ఈ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా ఇప్పుడు యుద్ధం కారణంగా సంక్షోభంలో పడింది. కండోమ్ తయారీలో వాడే సింథటిక్ రబ్బరు, ఇతర పెట్రోకెమికల్ అనుబంధ పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఎందుకు ఈ అంతరాయం?కండోమ్ల తయారీలో వాడే పాలిమర్లు, సింథటిక్ రబ్బరు, లూబ్రికెంట్లు ముడి చమురు ఉప ఉత్పత్తులు. యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర పెరగడంతో వీటి తయారీ వ్యయం 30% నుంచి 40% వరకు పెరిగింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా భారత్కు వచ్చే రసాయనాలు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉత్పత్తి కేంద్రాల్లో ముడి పదార్థాల కొరత ఏర్పడింది. ఎర్ర సముద్రం ప్రాంతంలో అస్థిరత వల్ల నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో రావాల్సి వస్తోంది. దీనివల్ల ఫ్రైట్ ఛార్జీలు పెరగడంతోపాటు డెలివరీ సమయం 20 రోజుల నుంచి 40 రోజులకు పెరిగింది.ఎవరు ప్రభావితమవుతున్నారు?దేశంలోని దిగ్గజ కండోమ్ తయారీ సంస్థలు పెరిగిన ఖర్చులను భరించలేక ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను 10% నుంచి 20% వరకు పెంచే యోచనలో ఉన్నాయి. భారత్ నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు జరిగే కండోమ్ ఎగుమతులు మందగించాయి. ఇది దేశీయ విదేశీ మారక నిల్వలపై కూడా ప్రభావం చూపుతుంది. ఉచితంగా పంపిణీ చేసే గర్భనిరోధక సాధనాల కోసం ప్రభుత్వం వెచ్చించే బడ్జెట్ భారం పెరగనుంది.ఎక్కడ ప్రభావం ఎక్కువగా ఉంది?భారతదేశంలో రబ్బరు ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని తయారీ యూనిట్లు ఈ ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సింథటిక్ రబ్బరు కోసం మనం సుమారు 48% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.ఎంత మేర నష్టం?గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల రబ్బరు రసాయనాల దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం, పెరిగిన లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంల వల్ల ఒక్కో కంటైనర్ రవాణా ఖర్చు రెట్టింపు అయ్యింది.ముందున్న సవాళ్లుయుద్ధం మరికొంత కాలం కొనసాగితే కేవలం కండోమ్లే కాకుండా గ్లౌజులు, క్యాథెటర్లు వంటి వైద్య పరికరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారనున్నాయి. గ్లోబల్ సప్లై చైన్ ఎంతటి సున్నితమైనదో ఈ పరిస్థితి అర్థం చేస్తోంది. ఇంధన భద్రతతో పాటు రసాయన ముడి పదార్థాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత -
మొబైల్స్, ఏసీ రేట్లకు రెక్కలు
ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి విలువ క్షీణిస్తుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్లాంటి ప్రతికూల పరిస్థితులతో మొబైల్స్, టీవీల నుంచి ఎయిర్ కండీషనర్ల వరకు అన్నింటి రేట్లకు రెక్కలొస్తున్నాయి. గత నవంబర్–డిసెంబర్ నుంచి స్మార్ట్ఫోన్లు, టీవీల రేట్లు ప్రతి 30–60 రోజులకోసారి పెరుగుతూనే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉత్పత్తి పరిమాణం పెరిగే కొద్దీ, ముడి వస్తువుల వ్యయాలు తగ్గి కంపెనీలు చౌకగా ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తాయి.ఒకవేళ కొన్నాళ్లు పరిస్థితి అటూ ఇటూ అయినా అమ్మకాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడక, అదనపు భారమేదైనా పడితే తామే భరించి, రేట్లను పెంచకుండా జాగ్రత్త పడుతుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో భారాన్ని వినియోగదారులకి బదలాయిస్తున్నాయి. దీనితో ఎంట్రీ లెవెల్ టీవీలు, స్మార్ట్ఫోన్ల ధరలు తిరిగి 6–8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరుకుంటున్నాయి.వేసవి వడగాలి..: ఏసీల్లో పెద్ద ఎత్తున అమ్ముడయ్యే కేటగిరీ ఉత్పత్తులు, ఫ్రిజ్లు,, వాషింగ్ మెషిన్ల ధరలు కూడా ఈ నెల నుంచి భారీగా పెరుగుతున్నాయి. తొలిసారిగా కొనుక్కునే వారు ఎక్కువగా మొగ్గు చూపే 3 స్టార్ 1.5 టన్ను ఏసీల రేట్లు గతేడాది వేసవిలో సుమారు రూ. 32,000–34,000గా ఉండగా ఈ ఏప్రిల్లో రూ. 37,000–40,000కు పెరగనున్నాయి. కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ ఇటీవలే వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు.మరోవైపు, ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ఫోన్ల రేట్లు దీపావళి సమయంలో రూ. 10,000 లోపు ఉండగా, ప్రస్తుతం 13,000–14,000కి చేరాయి. కొన్ని బ్రాండ్స్ అయితే రాబోయే 2–3 నెలల్లో ఈ ఫోన్ల రేట్లు రూ. 20,000కి కూడా చేరొచ్చని చెబుతున్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ రేటు గతేడాది రూ. 6,500 స్థాయిలో ఉంటే, ఇప్పుడు రూ. 8,500గా ఉందని, మే నాటికి రూ. 10,000కు చేరొచ్చనేది పరిశ్రమ వర్గాలు మాట. వివో, ఒప్పో, శాంసంగ్, షావోమీలాంటి బ్రాండ్లు కొన్ని స్మార్ట్ఫోన్ల రేట్లను 10 శాతం వరకు పెంచనున్నట్లు సంకేతాలిచి్చనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మెమొరీ చిప్ల రేట్లు గత 5–6 నెలలుగా పెరగడం, గల్ఫ్ యుద్ధంతో పాటు రూపాయి బలహీనపడటమనేది కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్స్ వైపు చూపు..సాధారణంగా త్రైమాసికాలవారీగా రేట్లను తగ్గించడం, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు ప్రకటించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించేందుకు, తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకపోగా రేట్లు మరో పది శాతం వరకు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనితో డిమాండ్పైనా ప్రభావం పడుతోంది. కొత్త ఫోన్లకు బదులు సెకండ్ హ్యాండ్, రీఫర్బి‹Ù్డ ఫోన్ల వైపు కొందరు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండగా, మరికొందరు పూర్తిగా కొనుగోలు నిర్ణయాన్నే వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 20,000 వరకు ఖరీదు చేసే ఫోన్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసేందుకు మొబైల్ రిటైలర్ల సంఘం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది. -
భారత్లో ఒరాకిల్ 12,000 మందికి ఉద్వాసన
న్యూఢిల్లీ: యూఎస్ ఐటీ దిగ్గజం ఒరాకిల్ తాజాగా దేశీయంగా విధులు నిర్వహిస్తున్న 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాలకు కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెలలో మరింత మందిని ఉద్యోగాల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. దేశీయంగా కంపెనీలో సుమారు 30,000 మంది పనిచేస్తున్నారు.అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఒరాకిల్ నిరాకరించడం గమనార్హం! సిబ్బందికి ఈమెయిల్ ద్వారా ఉద్యోగ కోత వివరాలను ఒరాకిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కనీసం ఏడాదిపాటు సేవలందించిన ఉద్యోగులకు 15 రోజుల వేతనంసహా.. లీవ్ ఎన్క్యా‹Ùమెంట్, అర్హతగలవారికి గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది. -
ఇండిగో కొత్త సీఈఓగా విలియం వాల్ష్
ఇండియాలో అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో కొత్త సీఈఓను ప్రకటించింది. పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేసిన తరువాత కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 'విలియం వాల్ష్' (Willie Walsh)ను నియమించింది.విలియం వాల్ష్ ప్రస్తుతం IATA (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అంతకంటే ముందు బ్రిటిష్ ఎయిర్వేస్, ఐఏజీ వంటి ప్రముఖ కంపెనీలలో సీఈఓగా పనిచేచినట్లు ఇండిగో వెల్లడించింది.ఇండిగో చైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా మాట్లాడుతూ.. విలియం వాల్ష్ ఒక అత్యుత్తమ నాయకుడని, ఆయన నాయకత్వంలో సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న విమానయాన రంగంలో ఇండిగోను మరింత బలోపేతం చేయడానికి ఆయన సరైన ఎంపిక అని చెప్పారు.తన నియామకంపై విలియం వాల్ష్ మాట్లాడుతూ.. ఇండిగోను నడిపించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సంస్థకు బలమైన పునాది, స్పష్టమైన లక్ష్యం, మంచి ప్రతిష్ట ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా.. సంస్థలోని ఉద్యోగుల కృషి, నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని చెప్పారు. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు, సహకారం, స్థిరమైన అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. -
పిల్లల భోజనానికి వాఘ్ బక్రీ చేయూత
అక్షయపాత్ర ఫౌండేషన్కు వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఫౌండేషన్ ప్రత్యేకంగా రూపొందించిన ఎనిమిది ఆహార పంపిణీ వాహనాలను అందించింది. హైదరాబాద్లోని కంది, ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఈ వాహనాలను ప్రారంభించారు. వీటిలో ఐదు తెలంగాణకు, మూడు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఈ వాహనాలు ఉష్ణోగ్రత నియంత్రణ సదుపాయాలతో ఉండి, పాఠశాల పిల్లలకు వేడి, పోషకాహార భోజనం సమయానికి అందేలా సహకరిస్తాయి.ఈ ఎనిమిది వాహనాల కోసం రూ.99 లక్షలు ఖర్చు చేశారు. దీంతో వాఘ్ బక్రీ ఫౌండేషన్ ఇప్పటివరకు మొత్తం 38 వాహనాలను అందించి, సుమారు రూ.5 కోట్లను ఖర్చు చేసింది. ఈ సందర్భంగా వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాస్ దేశాయ్ మాట్లాడుతూ, ‘‘అక్షయపాత్రతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం కావడం గర్వంగా ఉంది. ఈ వాహనాలు దూర ప్రాంతాల్లోని పిల్లలకు పోషకాహార భోజనాన్ని సురక్షితంగా, సమయానికి అందేలా కీలక పాత్ర పోషిస్తాయి. విద్యకు మద్దతు ఇవ్వడంలో పోషకాహారం ముఖ్యమని మేము నమ్ముతున్నాము’’ అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రము ఖ టీవీ యాంకర్ సుమ కనకాల హాజరయ్యారు. వాఘ్ బక్రీ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని ఆమె ప్రశంసించారు. పిల్లల పోషణ, విద్యాభివృద్ధికి ఇది కీలకమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
త్వరలోనే జియో లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్ఎస్) ఈ ఏడాదే లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ సేవలు ఆరంభించనున్నట్టు సంస్థ ఎండీ హితేష్ సేథియా ప్రకటించారు. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) అనుమతులపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఈ సంస్థ ఇటీవలే అలియాంజ్తో కలసి రీఇన్సూరెన్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం గమనార్హం.జీవిత, సాధారణ బీమా వ్యాపారాలు ప్రారంభించేందుకు వీలుగా బృందాలను సిద్ధంచేసే పనిలో ఉన్నట్టు సేథియా చెప్పారు. అన్సెక్యూర్డ్, కన్జ్యూమర్ డ్యురబుల్ రుణాల్లోకి ప్రవేశించే తక్షణ ప్రణాళికేదీ లేదని స్పష్టం చేశారు. లాభదాయకత పెంచుకోవడమే తమకు ప్రస్తుత ప్రాధాన్యతగా పేర్కొన్నారు. రిస్క్, మూలధనం పరంగా తమకు కొన్ని పరిమితులున్నాయని.. ప్రైమ్ కస్టమర్లకు (అధిక విలువ కలిగిన/ప్రీమియం), సెమీ ప్రైమ్ కస్టమర్లకు సెక్యూర్డ్ రుణాలపైనే ప్రస్తుతం కంపెనీ దృష్టి సారించినట్టు చెప్పారు.ఈ వ్యూహంలో భాగంగా కస్టమర్లకు మెరుగైన ఆఫర్లను అందించనున్నట్టు తెలిపారు. కన్జ్యూమర్ డ్యురబుల్స్, అన్ సెక్యూర్డ్ రుణాల్లో రుణ ఎగవేతలు (ఎన్పీఏలు) ఎక్కువగా ఉన్నాయంటూ, గృహ రుణాల్లో ఒకింత ఇదే పరిస్థితి ఉన్నట్టు చెప్పారు. ‘‘మా ఎన్బీఎఫ్సీ వ్యాపారం, లాభదాయకత మా రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగానే ఉన్నాయి. మా కస్టమర్లు, వ్యాపారాలపై మరింత అధ్యయనం అవసరం. తగిన సమయంలో కొత్త రుణ విభాగాల్లోకి ప్రవేశించడంపై పరిశీలన చేస్తాం’’అని సేథియా తెలిపారు. జియో ఫైనాన్స్ కేవలం ఇతర బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలకు సంబంధించి వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులులను ప్రస్తుతం తన జియోఫైనాన్స్ యాప్పై ఆఫర్ చేస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
ఆమె... అమెజాన్
తమ సంస్థకు సంబంధించి అన్ని విభాగాలలో ఏఐ–సాంకేతికతను అనుసరిస్తోంది ప్రముఖ ఇ–కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా. అమెజాన్ ఇండియాలో ఏఐ ఇన్నోవేషన్కు సంబంధించి ముగ్గురు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెజాన్ ఇండియా లీడర్స్ గీతాంజలి భుతాని, పాయల్ గుప్తా, శ్వేత శంకర్ జెన్ ఏఐ ఆధారిత షాపింగ్ ఆవిష్కరణను ముందుకు నడిపిస్తూనే అమెజాన్ విట్, విల్, కెటపల్ట్, అమెజాన్ సహేలి కార్యక్రమాల ద్వారా మహిళలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు.మూడింతలు పెంచేలా...సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన గీతాంజలి భుతాని హై–వాల్యూమ్ సిస్టమ్లను అభివృద్ధి చేసే బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ సిస్టమ్ల ద్వారా జరిగే లావాదేవీలను మూడు రెట్లు పెంచడం ఆమె లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానం, వ్యూహాత్మక ఆలోచన రెండూ అవసరమయ్యే క్లిష్టమైన ఇంజినీరింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు గీతాంజలి, ‘పని విషయంలో ఉత్సాహవంతులైన ఉద్యోగులు ఉంటే అత్యుత్తమ పనితీరును కనబరిచే సాంకేతిక వ్యవస్థలను సులభంగా నిర్మించవచ్చు. ఆవిష్కరణలకు ఎప్పుడూ కొరత ఉండదు. ఉద్యోగులకు వారు ఊహించని అవకాశాలు ఇవ్వడం, విశ్వాసం ఉంచడం ద్వారా వారిలోని సామర్థ్యాన్ని ఎలా వెలికి తీయవచ్చో నేను ప్రత్యక్షంగా చూశాను’ అంటారు గీతాంజలి. అమెజాన్విట్, ఉమెన్ ఇన్ లీడర్షిప్ లాంటి కార్యక్రమాల ద్వారా మహిళా ఇంజినీర్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు గీతాంజలి, వారి కలలు ఎంత కష్టంగా అనిపించినా, వాటిని సాధించేలా ప్రోత్సహిస్తూ వారి కెరీర్ వృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నారు.హైపర్ పర్సనలైజ్డ్అమెజాన్లో సెంట్రల్ షాపింగ్ ఎక్స్పీరియెన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పాయల్ గుప్తా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలకమైన షాపింగ్ అనుభవాలను అందించే, సాంకేతిక పరిష్కారాలను నిర్మించే ఇంజినీరింగ్ బృందాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు. జనరేటివ్ ఏఐని ఉపయోగించి షాపింగ్ను వ్యక్తిగతీకరించిన (హైపర్ పర్సనలైజ్డ్), ఆహ్లాదకరమైన అనుభవంగా మార్చడంపై దృష్టి పెట్టారు పాయల్ గుప్తా.ఏఐ ఆధారిత ఆవిష్కరణలుసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన శ్వేతాశంకర్, వినియోగదారులకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్ఫామ్లను నిర్మించే ‘అమెజాన్ ఇండియా రిటైల్ టెక్నాలజీ’ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అమెజాన్ ఇండియాలో జెన్ ఏఐ కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఏఐ–ఆధారిత ఆవిష్కరణలకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. రియల్–టైమ్ డేటా ప్రాసెసింగ్, అనాలిటిక్స్కు సంబంధించి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. మెరుగైన నిర్ణయాలను తీసుకోవడానికి ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. ‘సిస్టమ్లను నిర్మించడానికి టెక్నాలజీకి మించి ఆలోచించడం అవసరం’ అంటారు శ్వేతా శంకర్. అమెజాన్ సహేలి‘అమెజాన్ సహేలి’ అనేది అమెజాన్ ఇండియా చేపట్టిన మహిళా సాధికారత కార్యక్రమం. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలు, మహిళల నేతృత్వంలోని బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడంలో ‘అమెజాన్ సహేలి’ సహాయపడుతుంది. అమెజాన్లో తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి మహిళలకు శిక్షణ, ఆన్బోర్డింగ్ సహాయం, కేటలాగింగ్ అసిస్టెంట్స్, రాయితీ రుసుము, మార్కెటింగ్ అవకాశాలను అందిస్తుంది. గీతాంజలి భుతాని, శ్వేతా శంకర్, పాయల్ గుప్తాలాంటి లీడర్స్ మహిళా సాధికారత కార్యక్రమం ‘అమెజాన్ సహేలి’కి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ‘ఏటీ-1 బాండ్ల’ సంక్షోభం
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పాలనాపరమైన లోపాలు, నైతిక విలువల వివాదంలో చిక్కుకుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుబాయ్లోని ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) నిబంధనలకు విరుద్ధంగా అడిషనల్ టైర్-1 (ఏటీ-1) బాండ్లను విక్రయించిన వ్యవహారంలో బ్యాంక్ మేనేజ్మెంట్ వైఖరిపై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంలో బ్యాంక్ అనూహ్యంగా ఆలస్యం చేసిందని ఆరోపించారు.ఏటీ-1 బాండ్లు అంటే ఏమిటి?సాధారణ బాండ్లలాగా వీటికి నిర్ణీత గడువు ఉండదు. వీటిని ‘పెర్పెచువల్ బాండ్స్’ అని పిలుస్తారు. అంటే బ్యాంక్ లాభాల్లో ఉన్నంత కాలం వీటికి వడ్డీ (కూపన్) చెల్లిస్తూనే ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లినా లేదా మూతపడే స్థితికి వచ్చినా ఈ బాండ్లలోని పెట్టుబడిని బ్యాంక్ పూర్తిగా రద్దు చేసే అధికారం ఉంటుంది.వీటిని ఎందుకు జారీ చేస్తారు?అంతర్జాతీయ ‘బాసెల్-3’ నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ వద్ద కొంత మేర కనీస మూలధనాన్ని ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో నష్టాలను తట్టుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఈక్విటీ షేర్లను జారీ చేసి కొత్త భాగస్వాములను చేర్చుకోవడం కంటే, బాండ్ల ద్వారా నిధులు సేకరించడం బ్యాంకులకు సులభం. దీనివల్ల బ్యాంక్ యాజమాన్య హక్కులు మారవు.దుబాయ్ బ్రాంచ్లో మిస్-సెల్లింగ్క్రెడిట్ సూయిస్ బ్యాంక్కు చెందిన అత్యంత రిస్క్తో కూడిన ఏటీ-1 బాండ్లను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన దుబాయ్, బహ్రెయిన్ శాఖల ద్వారా ఎన్ఆర్ఐ ఖాతాదారులకు తప్పుగా విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అక్రమ విక్రయాలను గుర్తించిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (డీఎఫ్ఎస్ఏ), బ్యాంక్ బ్రాంచ్పై కఠిన ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 26, 2025 నుంచి కొత్త క్లయింట్లను చేర్చుకోవడం లేదా కొత్త ఆర్థిక సేవలను అందించకుండా నిషేధించింది. అంతర్గత దర్యాప్తు అనంతరం, ఈ నెలలో ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. మరో 12 మంది సిబ్బందిపై వివిధ స్థాయిల్లో జరిమానాలు విధించినట్లు మార్చి 23 నాటి ఎక్స్ఛేంజ్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడైంది.ఎనిమిదేళ్లుగా ఏం చేస్తున్నారు?ఇటీవల అకస్మాత్తుగా రాజీనామా చేసిన చక్రవర్తి బ్యాంక్ తీరును తూర్పారబట్టారు. ‘గత ఎనిమిదేళ్లుగా లోపాలు జరుగుతున్నా బ్యాంక్ మౌనంగా ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు మేల్కొని చర్యలు తీసుకోవడం ఆశ్చర్యకరం. ఇది మొదట్లో కేవలం డాక్యుమెంటేషన్ సమస్యగా భావించినప్పటికీ ఇది బ్యాంక్ ప్రతిష్టకు తీరని నష్టం కలిగించింది’ అని చెప్పారు. బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్ పుననియామకం విషయంలో కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జగదీశన్ నియామక ప్రక్రియ తన పర్యవేక్షణలో కానీ, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) పరిధిలో కానీ జరగలేదని స్పష్టం చేశారు.పెట్టుబడిదారుల్లో ఆందోళనఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి సంస్థ విలువలు, నైతికత అంశాలపై విభేదించి తప్పుకోవడం బ్యాంకింగ్ రంగంలో కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో బ్యాంక్ షేర్ల విలువపై ప్రభావం పడకుండా ఉండేందుకు యాజమాన్యం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అయితే, చక్రవర్తి రాజీనామాకు గల కచ్చితమైన కారణాలను బ్యాంక్ అధికారికంగా వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ అవకతవకలపై ఆర్బీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
4 లక్షల చాక్లెట్లు ట్రక్కుతో సహా మాయం
"హ్యావ్ ఏ బ్రేక్.. హ్యావ్ ఏ కిట్కాట్" అనేది ఆ బ్రాండ్ ఐకానిక్ నినాదం. అయితే, కొంతమంది దొంగలు ఈ స్లోగన్ను మరీ సీరియస్గా తీసుకున్నట్లున్నారు. ఏకంగా 12 టన్నుల కిట్కాట్ చాక్లెట్లతో నిండిన ట్రక్కునే మాయం చేసి, తీపి దొంగతనానికి తెరలేపారు. ఈస్టర్ పండుగ వేళ ఐరోపాలో జరిగిన ఈ భారీ దోపిడీ ఇప్పుడు సంచలనంగా మారింది.ఏం జరిగింది?మార్చి 26న మధ్య ఇటలీలోని ఒక ఫ్యాక్టరీ నుండి పోలాండ్లోని పంపిణీదారులకు బయలుదేరిన ఈ ట్రక్కు మార్గమధ్యలో అదృశ్యమైంది. ఇందులో సుమారు 4,13,793 కిట్కాట్ యూనిట్లు ఉన్నాయి. దీనిపై మాతృ సంస్థ నెస్లే ప్రతినిధులు స్పందిస్తూ.. "వాహనం, లోడ్ జాడ ఇంకా దొరకలేదు" అని ధ్రువీకరించారు.ఫార్ములా వన్ చాక్లెట్లుదొంగిలించిన ఈ స్టాక్లో కిట్కాట్ కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫార్ములా వన్ (F1)'థీమ్ చాక్లెట్లు ఉండటం గమనార్హం. గత ఏడాది F1 అధికారిక భాగస్వామిగా మారిన తర్వాత, రేసు కార్ల ఆకారంలో ఈ ప్రత్యేక వేఫర్ చాక్లెట్లను నెస్లే రూపొందించింది. ఇప్పుడు ఈ ఖరీదైన, పరిమిత ఎడిషన్ చాక్లెట్లన్నీ దొంగల పాలయ్యాయి."మా బ్రాండ్ నినాదాన్ని దొంగలు అక్షరాలా పాటించి, 12 టన్నుల చాక్లెట్లతో విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నేరస్థుల రుచిని మేము అభినందిస్తున్నప్పటికీ, ఇది వ్యాపారాలకు పెద్ద సవాలుగా మారింది" నెస్లే పేర్కొంది.నిఘా నీడలో చాక్లెట్లుఈ దోపిడీపై నెస్లే సంస్థ వినియోగదారులను, రిటైలర్లను అప్రమత్తం చేసింది. ప్రతి ప్యాకేజీపై ఉండే బ్యాచ్ కోడ్ ద్వారా ఉత్పత్తిని ట్రాక్ చేయవచ్చని చెప్పింది. ఎవరైనా అనధికారిక మార్గాల ద్వారా ఈ చాక్లెట్లను విక్రయిస్తుంటే, స్కాన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ దోపిడీ వల్ల మార్కెట్లో కిట్కాట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగదని, వినియోగదారుల భద్రతకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం స్థానిక పోలీసులు, సప్లయి చైన్ భాగస్వాములతో కలిసి ఈ 'తీపి' దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.Regarding recent press coverage pic.twitter.com/Huh4EnFV2J— KITKAT (@KITKAT) March 29, 2026 -
ఫండ్స్ఇండియా ఏయూఎం రూ.25,000 కోట్లు
బెంగళూరు: ఫండ్స్ ఇండియా రూ.25,000 కోట్ల నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) మైలురాయిని అధిగమించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఏయూఎం రూ.20వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు వృద్ధి చెందడందో ఇది సాధ్యపడింది. ముఖ్యంగా ఏడాది కాలంలో నిర్వహణ ఆస్తులు 58 శాతం పెరగ్గా.. మూడేళ్లలోనూ ఏటా 38 శాతం చొప్పున వృద్ధి చెందినట్టు సంస్థ ప్రకటించింది.గత 12 నెలల్లో ఫండ్స్ ఇండియా రూ.2,100 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. సంస్థ నిర్వహణ ఆస్తుల్లో 77 శాతం రిటైల్ ఇన్వెస్టర్లకు చెందినవే. 23 శాతం మేర ధనవంతులకు చెందిన ఆస్తులు ఉన్నాయి. 30 లక్షల యూజర్లకు ఫండ్స్ ఇండియా ప్లాట్ఫామ్ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. సిప్ బుక్ రూ.142 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. -
ఎగుమతులు షురూ.. 75 దేశాలకు సెమాగ్లూటైడ్!
మధుమేహం, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ జనరిక్ వెర్షన్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హెటిరో వెల్లడించింది. ట్రూగ్లిక్స్, రోల్మోడల్, మోటో జీ బ్రాండ్ల పేరుతో వీటిని విక్రయించనున్నట్లు వివరించింది. ఇవి డిస్పోజబుల్ పెన్ డివైజ్ల రూపంలో 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు వివిధ డోసేజీల్లో లభిస్తాయి.75 పైగా దేశాలకు దశలవారీగా వీటిని ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ముందుగా ఆఫ్రికా, ఆసియా, పశ్చిమాసియా దేశాల్లో అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించింది. నియంత్రణ సంస్థ సీడీఎస్సీవో అనుమతులు వచ్చాక దేశీయంగా కూడా దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. వర్ధమాన మార్కెట్లలో అందుబాటు ధరలో నాణ్యమైన జనరిక్ సెమాగ్లూటైడ్ని అందించాలనేది తమ లక్ష్యమని హెటిరో ఎండీ వంశీకృష్ణ బండి తెలిపారు. -
అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ షురూ
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్ఎల్), అలయంజ్ గ్రూప్ జాయింట్ వెంచర్ అయిన అలయంజ్ జియో రీఇన్సూరెన్స్ తాజాగా కార్యకలాపాలు ప్రారంభించింది. దీనికి సోనియా రావల్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు. జేవీ ద్వారా దేశీ బీమా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు సంస్థ ఎండీ హితేష్ సేథియా తెలిపారు.బీమా కంపెనీలకు వినూత్నమైన, పటిష్టమైన రిస్క్ సొల్యూషన్స్ అందించనున్నట్లు అలయంజ్ ఎస్ఈ బోర్డు సభ్యుడు క్రిస్ టౌన్సెండ్ వివరించారు. అంతర్జాతీయంగా సాంకేతిక అనుభవం, దేశీయంగా డిజిటల్, ఆర్థిక వ్యవస్థలపై అవగాహన ఇందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. -
‘ఇథనాల్’ ఇంధనమే ఆదుకుంటోంది..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వ 'ఇథనాల్ మిశ్రమ విధానం' (Ethanol Blending Policy) భారత్కు రక్షణ కవచంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం జేవార్లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, దేశ ఇంధన భద్రతలో రైతుల పాత్రను కొనియాడారు.చమురు దిగుమతులకు అడ్డుకట్ట..ముడి చమురు దిగుమతుల కోసం వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన చెరకు రైతులు కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. "ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోతే, మనం విదేశాల నుండి అదనంగా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రైతులే మన దేశ విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడారు" అని ఆయన పేర్కొన్నారు.భారత్కు అవసరమైన చమురులో దాదాపు 40% పశ్చిమాసియా నుండే అందుతోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరిగినప్పటికీ, ఇథనాల్ వాడకం వల్ల భారత్ ఆ ప్రభావాన్ని తట్టుకోగలుగుతోందని ప్రధాని వివరించారు.వేగంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మోదీ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. నిర్ణయించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని, గడువు కంటే ఐదేళ్ల ముందే గత ఏడాది భారత్ సాధించింది.ఈ క్రమంలో గత ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 (20% ఇథనాల్ మిశ్రమం) సరఫరా అవుతోంది. దీంతో ఇదే ఉత్సాహంతో 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతత్ గత 10 ఏళ్లలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో తెలిపింది. -
గ్రీన్ పోర్ట్ల అభివృద్ధిపై కేంద్రం దృష్టి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా పర్యావరణహిత పోర్టుల (గ్రీన్ పోర్ట్లు) అభివృద్ధి, సముద్ర మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, వాటర్వేస్ శాఖ తెలిపింది. ’మారిటైమ్ ఇండియా విజన్ –2030’, ’హరిత సాగర్’ మార్గదర్శకాల కింద పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది.గ్రీన్ టగ్ ట్రాన్సిషన్ ప్రోగ్రాం ద్వారా డీజిల్ టగ్ల స్థానంలో ఎలక్ట్రిక్ / హైబ్రిడ్ టగ్ల వినియోగం, పోర్టుల్లో పునరుత్పాదక శక్తి వినియోగం పెంపు, పోర్ట్ పరికరాలు, వాహనాలు, రైల్వే ట్రాక్ల విద్యుదీకరణ, జీరో ఎమిషన్ ట్రక్కుల వినియోగం, నౌకలకు తీర ప్రాంతం నుంచే విద్యుత్ సరఫరా చేసే ‘‘వన్షోర్ పవర్ సప్లై’’ వ్యవస్థలు’ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.అలాగే గ్రీన్ హైడ్రోజన్ హబ్లుగా ‘దీన్దయాల్ పోర్ట్ అథారిటీ, పారాదీప్ పోర్ట్ అథారిటీ, వీ.ఓ.చిదంబరనార్ పోర్ట్ అథారిటీ’లను నూతన, పునరుత్పాదక శక్తి శాఖ గుర్తించినట్లు వివరించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2023–24, 2024–25) ప్రధాన పోర్టుల అభివృద్ధికి సుమారు 180 ప్రాజెక్టులు ఆమోదం పొందినట్లు కేంద్రం తెలిపింది.వీటిలో ప్రధానంగా ‘పోర్టుల ఆధునీకరణ, తీర ప్రాంత రవాణా (కోస్టల్ షిప్పింగ్) అభివృద్ధి, గ్రీన్ పోర్టుల రూపకల్పన’ ఉన్నాయి. 2030 నాటికి ‘60% పైగా పునరుత్పాదక శక్తి వినియోగం, 50% పోర్ట్ పరికరాల విద్యుదీకరణ, 20% గ్రీన్ బెల్ట్ విస్తీర్ణం, కర్బన ఉద్గారాల్లో 30% తగ్గింపు (టన్ను కార్గోకు), నీటి వినియోగం 20% తగ్గింపు’ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. -
పునరుత్పాదక విద్యుత్పై ఎల్జీఈ ఇండియా ఫోకస్
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీఈ ఇండియా తమ తయారీ ప్లాంట్లలో పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం రెండు సంస్థలతో దీర్ఘకాలిక సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకుంది. తమ పుణె ప్లాంటుకు 9.89 మెగావాట్స్ పీక్ (ఎండబ్ల్యూపీ) సోలార్ పవర్ కోసం హిందుజా రెన్యువబుల్స్ ఎనర్జీతో, అలాగే గ్రేటర్ నోయిడా ప్లాంటుకి సంబంధించి 11 ఎండబ్ల్యూపీ కోసం సన్ష్యూర్ ఎనర్జీతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలతో మొత్తం మీద ఏటా 50,000 గృహాల అవసరాలకు సరిపడేంతగా 3.2 కోట్ల యూనిట్ల స్వచ్ఛ విద్యుత్ జనరేట్ అవుతుందని సంస్థ వివరించింది. -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్లో సగం సెలవులే!
మార్చి నెల దాదాపు ముగిసింది. ఇక రానున్నది ఏప్రిల్. ఈ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బ్యాంక్ హాలిడేస్ జాబితాను ఈ కథనంలో చూసేద్దాం.ఏప్రిల్ 1: ఆర్థిక సంవత్సర ముగింపు కారణంగా.. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 2: మౌండీ థర్స్ డే (Maundy Thursday) సందర్భంగా కొచ్చి, తిరువనంతపురంలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే సందర్భంగా.. అగర్తలా, చండీగఢ్, గౌహతి, జైపూర్, జమ్మూ, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 5: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 11: రెండవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 12: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 14: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ వంటి పండుగల సందర్భంగా ఐజ్వాల్, భోపాల్, చండీగఢ్, ఇటానగర్, కోహిమా, న్యూఢిల్లీ, రాయ్పూర్, షిల్లాంగ్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సర దినం (నబబర్ష)/బోహాగ్ బిహు/విషు/హిమాచల్ దినం కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కొచ్చి, కోల్కతా, సిమ్లా, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 16: బోహాగ్ బిహు సందర్భంగా గువహటిలో బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 19: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 20: బసవ జయంతి / అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులోని బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలా బ్యాంకులకు సెలవు.ఏప్రిల్ 25: నాల్గవ శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)ఏప్రిల్ 26: ఆదివారం (అన్ని బ్యాంకులకు సెలవు)అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
ఉక్రెయిన్తో సాగుతున్న సుదీర్ఘ యుద్ధం రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెరుగుతున్న యుద్ధ వ్యయం, విస్తరిస్తున్న బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు పుతిన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా తన సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని (Physical Gold) విక్రయించడం ప్రారంభించింది. 'బిఎన్ఈ ఇంటెల్లిన్యూస్' (bne IntelliNews) నివేదిక ఈ సంచలన విషయాలను వెల్లడించింది.నివేదికలోని ముఖ్యాంశాలుభారీగా విక్రయాలు: 2022 నుంచి 2025 మధ్య కాలంలో రష్యా సుమారు 150 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని విక్రయించింది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే మరో 35 బిలియన్ డాలర్ల విలువైన నిల్వలను వదులుకుంది.రికార్డు స్థాయి విక్రయం: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా డేటా ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో 3 లక్షల ఔన్సులు, ఫిబ్రవరిలో 2 లక్షల ఔన్సుల బంగారాన్ని విక్రయించింది. 2002 తర్వాత రెండు నెలల కాలంలో జరిగిన అతిపెద్ద విక్రయం ఇదే కావడం గమనార్హం.లోటు బడ్జెట్ సెగ: 2025 నాటికి రష్యా బడ్జెట్ లోటు జీడీపీలో 2.6 శాతానికి చేరింది. వాస్తవానికి ఇది 0.5% మాత్రమే ఉంటుందని అంచనా వేసినా, యుద్ధ పరిస్థితుల వల్ల అంచనాలు తలకిందులయ్యాయి.వ్యూహం మారింది..గతంలో రష్యా తన బంగారు నిల్వలపై కేవలం ఆర్థిక లావాదేవీలు (Speculative transfers) మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు నేరుగా భౌతిక బంగారాన్ని (Physical Bullion) మార్కెట్లోకి విడుదల చేస్తోంది. దీనివల్ల రష్యా బంగారం నిల్వలు 74.3 మిలియన్ ఔన్సులకు పడిపోయాయి. ఇది గత నాలుగేళ్లలో అత్యల్ప స్థాయి.తగ్గిన చమరు ఆదాయం అమెరికా విధిస్తున్న కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోవడంతో రష్యా ఆదాయం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు రష్యా మొత్తం ఆదాయంలో చమురు, గ్యాస్ వాటా సగభాగం ఉండగా, ఇప్పుడది 20 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటడంతో, ఆ గరిష్ట ధరల వద్ద బంగారాన్ని అమ్మి నగదు సమీకరించుకోవాలని రష్యా భావిస్తోంది.ప్రపంచంలో ఐదో స్థానంవరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, రష్యా వద్ద ఇప్పటికీ 2,000 టన్నులకు పైగా బంగారం ఉంది. ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని కలిగి ఉన్న దేశాల్లో రష్యా 5వ స్థానంలో కొనసాగుతోంది. 2014 (క్రిమియా ఆక్రమణ) నుంచి డాలర్పై ఆధారపడటం తగ్గించుకోవడానికి రష్యా ఈ నిల్వలను పెంచుకుంటూ వచ్చింది.ఆర్థిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంయుద్ధాన్ని కొనసాగించేందుకు రష్యా ప్రభుత్వం వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తోంది. వాటిలో.. నేషనల్ వెల్ఫేర్ ఫండ్: ఇందులో ఉన్న నిధులను యుద్ధ అవసరాలకు వాడుకుంటోంది.పన్నుల పెంపు: వ్యాట్ (VAT) రేట్లను పెంచడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.బాండ్ల జారీ: దేశీయంగా బాండ్లను జారీ చేసి నిధులను సేకరిస్తోంది.ఉక్రెయిన్తో యుద్ధం నాలుగో సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో, రష్యా తన అత్యంత విలువైన 'బంగారు' నిల్వలను విక్రయించడం ప్రారంభించడం ఆ దేశ ఆర్థిక స్థితిపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఆ దేశంలో ఆఫీసులు.. స్వర్గాలు!
భారతదేశంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే.. తెల్లవార్లు కోడింగ్, అర్ధరాత్రి వరకు మీటింగ్స్, వీకెండ్స్లో కూడా ఆఫీస్ కాల్స్. కానీ, అదే వృత్తిలో ఉంటూ స్వీడన్లో స్థిరపడిన ఓ భారతీయ యువతి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. "నిజంగా ఆఫీసులు ఇలా కూడా ఉంటాయా?" అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వైరల్ వీడియోలో ఏముంది?స్వీడన్లో టెక్నాలజీ ప్రొఫెషనల్గా పనిచేస్తున్న స్వాతి అనే యువతి, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సాయంత్రం సరిగ్గా 4:30 గంటల సమయం.. ఆమె పనిచేసే ఆఫీసులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. అందరూ తమ పని ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. నిశ్శబ్దంగా ఉన్న ఆ కార్యాలయాన్ని చూపిస్తూ, అక్కడి పని సంస్కృతి గురించి ఆమె వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.పని కంటే మనిషికే ప్రాధాన్యం!స్వీడన్ కార్యాలయాల్లో అనుసరించే విధానాలు మన దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయని స్వాతి పేర్కొన్నారు. అక్కడ పని గంటల కంటే నాణ్యతకే పెద్దపీట వేస్తారు. ఆఫీసులో ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది కాదు, చేసిన పనిలో ఎంత క్వాలిటీ ఉందన్నదే అక్కడ ముఖ్యం.వ్యక్తిగత సమయం: ఉద్యోగులు ఆలస్యంగా ఉండాలని గానీ, వారాంతాల్లో పనిచేయాలని గానీ అక్కడి కంపెనీలు కోరుకోవు. పని ముగిశాక మిగిలిన సమయం పూర్తిగా వారి వ్యక్తిగత జీవితానికే (Work-Life Balance).కుటుంబానికి ప్రాముఖ్యత: కుటుంబంతో గడపడం, సొంత అభిరుచులను (Hobbies) కొనసాగించడం వల్ల ఉద్యోగులు మానసిక ప్రశాంతతతో ఉంటారని, అది వారి పనితీరును మరింత మెరుగుపరుస్తుందని స్వీడన్ యాజమాన్యాలు నమ్ముతాయి.నెటిజన్ల రియాక్షన్ వైరల్గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "భారతదేశంలో రాత్రి 9 గంటలైనా ఆఫీసు లైట్లు ఆరవు, ఇలాంటి వాతావరణం మాకెప్పుడు వస్తుందో?" అని కొందరు ఆవేదన వ్యక్తం చేయగా.. "అందుకే విదేశాల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి వ్యక్తిగత శ్రేయస్సు (Well-being), వృత్తిపరమైన బాధ్యతల మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ఈ వీడియో మరోసారి పెద్ద చర్చకే దారితీసింది. View this post on Instagram A post shared by LifeWithSwati (@ekduniyaaisibhi) -
పెరగనున్న ఐఫోన్ ధరలు: కారణం ఇదే!
యాపిల్ కంపెనీ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం.. భారతదేశంలో ఐఫోన్ ధరలపై ప్రభావం చూపుతుంది. దీంతో పాత మోడల్స్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 15 కొనాలనుకునే వినియోగదారులకు ఇది కొంత భారంగా మారనుంది.డిమాండ్ జనరేషన్ (DG) సపోర్ట్ అందుబాటులో ఉన్నప్పుడు.. దీని ద్వారా యాపిల్ తన రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లకు కొన్ని రాయితీలు (ఇన్సెంటివ్లు) ఇస్తుంది. ఈ ఇన్సెంటివ్ల వల్ల రిటైలర్లు ఫోన్లను తక్కువ ధరకు అమ్మగలిగేవారు. అంటే.. ఫోన్ అధికారిక ధర (MRP) మారకపోయినా, వినియోగదారులకు తగ్గింపు ధరలో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు కంపెనీ ఈ DG సపోర్ట్ను నిలిపివేయాలని నిర్ణయించింది.కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల.. రిటైలర్లు ఇకపై అంతటి తగ్గింపులు ఇవ్వలేరు. అందువల్ల.. వినియోగదారులు అదే ఫోన్ కొనడానికి సుమారు రూ.5,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా కొంచెం పాత మోడళ్లను.. తక్కువ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి ప్రభావం చూపుతుంది.ఇది మాత్రమే కాకుండా.. యాపిల్ ముందుగా ఇచ్చిన క్యాష్బ్యాక్ ఆఫర్లను కూడా గణనీయంగా తగ్గించింది. గతంలో రూ.6,000 వరకు క్యాష్బ్యాక్ ఇస్తే, ఇప్పుడు అది కేవలం రూ.1,000కు తగ్గింది. దీంతో కొత్త మోడళ్లైన iPhone 17 సిరీస్ కూడా వినియోగదారులకు కొంత ఖరీదైనదిగా అనిపిస్తోంది. అయితే, ఈ DG సపోర్ట్ తొలగింపు కొత్త iPhone 17 మోడళ్లకు వర్తించదు. ఇది ప్రధానంగా పాత మోడళ్లకే పరిమితం.ఇదీ చదవండి: అందరికీ నచ్చిన కారు.. రూ.20 వేలు పెరిగిన ధర! -
నోకియా 14,000 మందికి లేఆఫ్
ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని శాసించిన నోకియా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న పరిస్థితులు, తగ్గుతున్న ఆదాయ వనరుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించగా ఆ ప్రభావం ఇప్పుడు భారత విభాగంపై కూడా పడనుంది.కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం, నోకియా తన భారత కార్యకలాపాల్లో కీలక మార్పులు చేపట్టింది. కంపెనీ తన భారత నాయకత్వ బాధ్యతలను కొత్త వ్యక్తులకు అప్పగించింది. సమర్ మిట్టల్ కంపెనీ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్గా నియమితులయ్యారు. ఈయనకు మునుపటి కంటే ఎక్కువ కార్యాచరణ నియంత్రణ ఇచ్చారు. విభా మెహ్రా, ఇండియా కంట్రీ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిద్దరూ 2026 ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనుండగా ప్రస్తుతం ఇండియాలో కంపెనీ చీఫ్గా ఉన్న తరుణ్ ఛబ్రా పదవి నుంచి తప్పుకున్నారు.ఆదాయంలో భారీ క్షీణతభారత మార్కెట్లో నోకియా పనితీరు గణనీయంగా పడిపోయింది. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం.. 2025 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు 15 శాతం తగ్గి 393 మిలియన్ యూరోలకు (సుమారు రూ.4,290 కోట్లు) పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నికర అమ్మకాలు 463 మిలియన్ యూరోలుగా (సుమారు రూ.5,000 కోట్లు) నమోదయ్యాయి. అమ్మకాల్లో ఈ క్షీణత వల్ల లాభదాయకతను పెంచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపు ఒక్కటే మార్గమని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా 2023లో జరిగిన మొబైల్ నెట్వర్క్లు, క్లౌడ్ సేవల విలీనం వల్ల ఏర్పడిన ‘డూప్లికేషన్’ ఉద్యోగాలను తొలగించడంపై దృష్టి సారించింది.టెలికాం రంగంలో సంక్షోభం?నోకియా మాత్రమే కాదు దాని ప్రధాన ప్రత్యర్థి ఎరిక్సన్ కూడా గత ఏడాది దాదాపు 5,000 మందిని తొలగించింది. టెక్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపగా మెటా కూడా 15,000 మంది తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి జెఫ్రీస్ నిష్క్రమణ
ప్రైవేట్ రంగం బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫ్రీస్ నిష్క్రమించింది. బ్యాంకులో తమ పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్టైమ్ చైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అతాను చక్రవర్తి ఇటీవలే అకస్మాత్తుగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ మూడు కీలక పోర్ట్ఫోలియోల్లో బ్యాంక్ షేర్లను విక్రయించి, ఎక్స్పోజర్ని తగ్గించుకున్నట్లు తాజా గ్రీడ్ అండ్ ఫియర్ నివేదికలో జెఫ్రీస్ వ్యూహకర్త క్రిస్ ఉడ్స్ తెలిపారు.జపాన్ మినహా ఏషియా లాంగ్–ఓన్లీ ఈక్విటీ పోర్ట్ఫోలియో, గ్లోబల్ లాంగ్–ఓన్లీ ఈక్విటీ పోర్ట్ఫోలియో, అమెరికా మినహా ఇంటర్నేషనల్ లాంగ్–ఓన్లీ ఈక్విటీ పోర్ట్ఫోలియో వీటిలో ఉన్నాయి. అయితే, ఈ నిర్ణయం వెనుక కారణాన్ని ఉడ్స్ తెలపలేదు. అన్ని పోర్ట్ఫోలియోల్లోనూ 4 శాతం వెయిటేజ్తో హెచ్ఎస్బీసీని చేర్చింది. జపాన్ మినహా ఏషియా పసిఫిక్ రిలేటివ్–రిటర్న్ పోర్ట్ఫోలియోలో భారత్, ఆ్రస్టేలియా వెయిటేజీని రెండు పర్సంటేజీ పాయింట్లు తగ్గించి తైవాన్ వెయిటేజీని నాలుగు పర్సంటేజీ పాయింట్ల మేర పెంచనున్నట్లు నివేదిక తెలిపింది. తన నైతిక ప్రమాణాలకు, వ్యక్తిగత విలువలకు భంగం కలిగేలా బ్యాంకులో గత రెండేళ్లుగా పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు -
వేసవి ఛాయిస్.. బస్సే బిగ్బాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన చార్జీలు పెరగడం, రైళ్ల రద్దీ తదితర అంశాల నేపథ్యంలో వేసవి సీజన్లో బస్సు ప్రయాణాలకు గణనీయంగా డిమాండ్ పెరగనున్నట్లు అభిబస్ సీవోవో రోహిత్ శర్మ చెప్పారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, తమిళనాడు .. పుదుచ్చేరి మొదలైన చోట్ల ఎన్నికలు జరగనుండటం కూడా ప్రయాణాలకి దోహదపడనున్నట్లు ఆయన చెప్పారు. క్రూడాయిల్ రేట్ల పెరుగుదలతో విమాన ప్రయాణాలు భారంగా మారడమనేది, పరోక్షంగా బస్సు ఆపరేటర్లకు ప్రయోజనం చేకూర్చనుందని పేర్కొన్నారు.సాధారణంగా విమానాలు, రైళ్లు, వ్యక్తిగత వాహనాలతో బస్సుల సెగ్మెంట్ పోటీ పడాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, ఫ్లయిట్ చార్జీలు పెరిగినా, రైల్వే వెయిటింగ్ లిస్టులు పెరిగినా.. బస్సులకు మరింత డిమాండ్ ఏర్పడుతుందన్నారు. పీక్ సీజన్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు 25 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు శర్మ వివరించారు. హైదరాబాద్–విజయవాడలాంటి కీలక రూట్లలో డిమాండ్ ఉంటోందని శర్మ చెప్పారు.పింక్ సీట్ ఆప్షన్లాంటి భద్రతా ఫీచర్ల కారణంగా సోలోగా ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. హోలీ పండుగ వారానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఏకంగా 70 శాతం పెరగ్గా, మహిళల ప్యాసింజర్ల సంఖ్య 80 శాతం పెరిగినట్లు శర్మ వివరించారు. 6.5 లక్షల రూట్లలో 6,200 ఆపరేటర్లకు అగ్రిగేటరుగా వ్యవహరిస్తున్న అభిబస్.. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉంది. ఉబర్తో జట్టు..ఇంటర్సిటీ బస్ టికెట్ బుకింగ్స్ సదుపాయాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఉబర్తో కూడా చేతులు కలిపినట్లు శర్మ చెప్పారు. దీనితో ఉబర్ యాప్ నుంచే నేరుగా పలు ప్రాంతాలకు బస్ టికెట్లను బుక్ చేసుకునే వీలుందని ఆయన వివరించారు. ప్రస్తుతం 17 రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో కలిసి పని చేస్తున్నామన్నారు. టీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ మొదలైనవి వీటిలో ఉన్నాయి.ఇక అష్యూర్డ్ ప్రోగ్రాం కింద బస్సుల జాప్యం, రద్దు లాంటి సేవల నాణ్యత లోపాలకు 150% వరకు రీఫండ్ ఆఫర్ చేస్తున్నామని, ప్రస్తుతం ఈ ప్రోగ్రాంలో సుమారు 360 మంది ఆపరేటర్లు చేరారని శర్మ చెప్పారు. ఆన్లైన్ ట్రావెల్ సంస్థ ఇక్సిగోలో భాగమైన అభిబస్ ప్లాట్ఫాంపై 2026 ఆర్థిక సంవత్సరం క్యూ3లో స్థూల లావాదేవీల విలువ (జీటీవీ) 36% వృద్ధితో రూ. 670.9 కోట్లకు చేరగా, ఆదాయం 47% పెరిగి రూ. 75.5 కోట్లకు చేరింది. ప్రయాణికుల సంఖ్య 33% పెరిగి 67.3 లక్షలకు చేరింది. -
ఇంటీరియో టార్గెట్.. మార్కెట్లో రూ.550 కోట్లు!
దక్షిణాది మార్కెట్లో ఈసారి రూ. 550 కోట్లు, హైదరాబాద్లో రూ. 50 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు ఇంటీరియో బై గోద్రెజ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ నారాయణ్ సర్కార్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్లో సుమారు 9 శాతంగా ఉన్న వాటాను వచ్చే మూడేళ్లలో 14 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కొత్త స్టోర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన చెప్పారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా దాదాపు రూ. 70 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో తమకు 18 షోరూమ్లు, 55 డీలర్లు, 150 రిటైలర్లు ఉన్నట్లు సర్కార్ చెప్పారు. హైదరాబాద్లో స్టోర్స్ సంఖ్య 14కి చేరినట్లు తెలిపారు.పట్టణ ప్రాంతాలతో పాటు కొత్త మార్కెట్లలోను తమ ఉత్పత్తులను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా ఇరు రాష్ట్రాల్లోను 12 కొత్త డీలర్ స్టోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు 100 రిటైలర్లను జోడించుకోవాలని నిర్దేశించుకున్నట్లు సర్కార్ చెప్పారు. టెక్ ఉద్యోగులు, మౌలిక సదుపాయాలు, రెసిడెన్షియల్ ప్రాజెక్టుల వృద్ధితో హైదరాబాద్లో మాడ్యులర్, ఫుల్ హోమ్ సొల్యూషన్స్కి డిమాండ్ నెలకొందని వివరించారు. కర్టెన్లులాంటి సాఫ్ట్ ఫర్నిషింగ్స్ ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. -
బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు
భారతీయ బ్యాంకింగ్ రంగంలో వరుస కుంభకోణాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఇటీవల చండీగఢ్లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ.590 కోట్ల భారీ మోసం మరవకముందే తాజాగా హరియాణాలోని పంచకుల కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్రాంచ్లో రూ.150 కోట్ల మున్సిపల్ నిధులు మాయమవ్వడం చర్చనీయాంశం అయింది. సామాన్యుడి సొమ్ముకు రక్షణ కల్పించాల్సిన బ్యాంకులు వ్యవస్థీకృత నేరాలకు అడ్డాగా మారుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరుగుతోంది?వరుసగా జరుగుతున్న ఈ ఘటనలను పరిశీలిస్తే ఇవి కేవలం సాంకేతిక లోపాలు మాత్రమే కాదని, వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన వైఫల్యాలని అర్థమవుతోంది. ఐడీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంకు ఉదంతాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే.. బ్యాంక్ సిబ్బంది సహకారం లేకుండా ఇంత భారీ స్థాయిలో నిధుల మళ్లింపు సాధ్యం కాదు. ఫోర్జరీ పత్రాలు సృష్టించడం, నకిలీ స్టేట్మెంట్లు ఇవ్వడం వంటివి ఉన్నతాధికారుల కళ్లుగప్పి జరగడం వెనుక బ్యాంక్ లోపలి శక్తుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది.నిఘా వైఫల్యంప్రైవేట్ బ్యాంకుల్లో అంతర్గత ఆడిటింగ్ వ్యవస్థ కేవలం లాభనష్టాల లెక్కలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ రికార్డుల మధ్య వ్యత్యాసాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ప్రభుత్వ సంస్థలు (మున్సిపల్ కార్పొరేషన్లు వంటివి) బల్క్ డిపాజిట్లు చేసినప్పుడు బ్యాంకు మేనేజర్లు ఇచ్చే స్టేట్మెంట్లను గుడ్డిగా నమ్ముతారు. దీనిని ఆసరాగా చేసుకుని షెల్ కంపెనీలకు నిధులు మళ్లించడం సులభతరమవుతోంది.వ్యవస్థ ప్రక్షాళనకు కావాల్సిన కఠిన చర్యలుఇలాంటి స్కామ్లు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం పోలీసు విచారణ సరిపోదు. బ్యాంకింగ్ నిబంధనల్లో సమూల మార్పులు రావాలి.ఏడాదికి ఒకసారి జరిగే ఆడిటింగ్ కాకుండా ప్రతి నెలా ప్రభుత్వ నిధులపై థర్డ్-పార్టీ స్వతంత్ర ఆడిట్ జరగాలి.కస్టమర్లు తమ ఎఫ్డీ స్టేటస్ను బ్యాంక్ పంపే కాగితాల ద్వారా కాకుండా నేరుగా సెంట్రల్ సర్వర్ ద్వారా చెక్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ లేదా ప్రత్యేక పోర్టల్ ఉండాలి.భారీ స్కామ్ జరిగినప్పుడు కేవలం కింది స్థాయి క్లర్కులను మాత్రమే కాకుండా సంబంధిత బ్రాంచ్ మేనేజర్, రీజినల్ మేనేజర్లను కూడా బాధ్యులను చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ సంస్థలు తమ నిధులను ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంచేటప్పుడు ఆయా బ్యాంకుల క్యాపిటల్ అడక్వసీ రేషియో, గత ట్రాక్ రికార్డును కచ్చితంగా పరిశీలించేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలి.ఇదీ చదవండి: సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి! -
మహాదేవ్ యాప్.. రూ.1,700 కోట్ల ఆస్తులు జప్తు!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్ ఆన్లైన్ బుక్’ బెట్టింగ్ సిండికేట్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో అడుగు వేసింది. ఈ అక్రమ బెట్టింగ్ సామ్రాజ్య సూత్రధారులైన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్కు చెందిన సుమారు రూ.1,700 కోట్ల విలువైన విలాసవంతమైన ఆస్తులను అధికారులు తాత్కాలికంగా జప్తు చేశారు.మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 5(1) కింద మార్చి 24న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమ బెట్టింగ్ల ద్వారా సంపాదించిన నేరపూరిత ఆదాయంతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది.బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్లు!జప్తు చేసిన ఆస్తుల్లో దుబాయ్లోని 18 స్థిరాస్తులతో పాటు న్యూఢిల్లీలోని రెండు కీలక ఆస్తులు ఉన్నాయి. విదేశాల్లోని ఆస్తులు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్ హిల్స్ ఎస్టేట్లో అత్యున్నత శ్రేణి విల్లాలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. బిజినెస్ బే, ఎస్ఎల్ఎస్ హోటల్లో ఖరీదైన నివాస సముదాయాలున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫాలో కూడా వీరికి అపార్ట్మెంట్లు ఉండటం గమనార్హం.బినామీ నెట్వర్క్ గుట్టురట్టుతమ యాజమాన్య హక్కులను దాచడానికి మహదేవ్ యాప్కు చెందిన రెండు షెల్ కంపెనీలు బినామీల పేరుతో ఒక పెద్ద నెట్వర్క్ను నడిపినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. దుబాయ్ హిల్స్లోని ‘హిల్స్ వ్యూ’లో ఉన్న విల్లా నంబర్ 36 చంద్రకర్ ప్రధాన నివాసమని గుర్తించారు. దీన్ని ‘పర్ఫెక్ట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ఎల్ఎల్సీ’ పేరుతో కొనుగోలు చేశారు. ఇందులో చంద్రకర్కు 95% వాటా ఉంది. రవి ఉప్పల్ అధీనంలో ఫెయిర్వే రెసిడెన్సీ క్లస్టర్లోని విల్లా నంబర్ 33 ఉన్నట్లు సమాచారం. అతుల్ అగర్వాల్ (విల్లా 50), శుభం సోని (విల్లా 13), విశాల్ రమణి (విల్లా 31) వంటి సన్నిహితుల పేరుతో ఉన్న ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.ఇప్పటివరకు రూ.4,336 కోట్ల ఆస్తులు జప్తుఈ తాజా జప్తుతో కలిపి మహాదేవ్ యాప్ కేసులో ఇప్పటివరకు ఈడీ అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.4,336 కోట్లకు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా చంద్రకర్ కనీసం 35 నుంచి 40 విల్లాలు, అపార్ట్మెంట్లను నియంత్రిస్తున్నారని దర్యాప్తు సంస్థ అంచనా వేస్తోంది. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్, అతుల్ అగర్వాల్, శుభం సోనీలను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించాలని ఈడీ కోర్టును ఆశ్రయించింది. దీని ద్వారా వారి ఆస్తులను పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం కలుగుతుంది.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
వృద్ధి బాటలో హెల్త్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: హెల్త్ ఇన్సూరెన్స్ రంగం విస్తరణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ప్రీమియం ఆదాయం 2024–25 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.1.2 లక్షల కోట్లు దాటింది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల పెరుగుతున్న అవగాహన, వైద్య అత్యవసరాల్లో ఆర్థిక రక్షణ ఉండాలని కోరుకోవడం వృద్ధికి దారితీస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సేవల్లో సామర్థ్యం పెరిగేందుకు, పాలసీదారులకు సకాలంలో సాయం అందించే లక్ష్యంతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నగదు రహిత క్లెయిమ్ల పరిష్కారానికి నిర్దేశిత గడువులను విధించినట్టు పేర్కొంది. నగదు రహిత ముందస్తు అంగీకారం గంటలోపు తెలియజేయాలని.. క్లెయిమ్పై తుది ఆమోదాన్ని మూడు గంటల్లో తెలియజేయాలని నిర్దేశించినట్టు వెల్లడించింది. జాప్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు, రోగులు సకాలంలో వైద్య సేవలు పొందేందుకు ఈ నిబంధనలు సాయపడతాయని తెలిపింది. వయసు మీద పడతుండడం, అధిక రక్షణ, అదనపు సదుపాయాలతో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరుగుతున్నట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. అందుబాటు ధరల్లో ఉండాలి...బీమా ఉత్పత్తుల ప్రీమియంలు అన్ని రిస్క్లను పరిగణనలోకి తీసుకుని, సరైన ధరలపై అందుబాటులో ఉండాలంటూ 2024లో ఐఆర్డీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలను ఆర్థిక శాఖ ప్రస్తావించింది. వీటిని నియమిత యాక్చువరీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని తెలిపింది. 2024–25లో బీమా భరోసా పోర్టల్పై జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి 1,37,361 ఫిర్యాదులు దాఖలయ్యాయని, ఇందులో 93 శాతం అంటే 1,27,755 ఫిర్యాదులు పరిష్కారమైనట్టు వెల్లడించింది. బీమా క్లెయిమ్ తిరస్కరణ, రద్దు అన్నవి పాలసీ నియమ, నిబంధనల పరిధిలోనివిగా పేర్కొంది. బీమా రక్షణను మించడం, కో–పేమెంట్ క్లాజ్, ఉప పరిమితులు, టాపప్ పాలసీల్లో డిడక్టబుల్, రూమ్ రెంట్ పరిమితి మించడం తదితర అంశాలూ క్లెయిమ్ తిరస్కరణ, రద్దుకు సంబంధించి ఉన్నట్టు తెలిపింది. -
ఇన్ఫోసిస్ యూఎస్ షాపింగ్!
న్యూఢిల్లీ: టెక్నాలజీ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ కొనుగోళ్లకు తెరతీసింది. ఆరోగ్యపరిరక్షణ సంబంధ డిజిటల్ సమాచార కంపెనీ ఆప్టిమమ్ హెల్త్కేర్ ఐటీతోపాటు ఇన్సూరెన్స్ కన్సల్టింగ్ టెక్నాలజీ సంస్థ స్ట్రాటస్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఉమ్మడిగా రూ. 5,260 కోట్లు వెచ్చించనుంది. ఆప్టిమమ్ హెల్త్కేర్ను ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 46.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనుంది. అయితే మేనేజ్మెంట్ ప్రోత్సాహకాలు, బోనస్లను మినహాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కొనుగోలు పూర్తికాగలదని అంచనా. ఇందుకు ఫ్లోరిడా(యూఎస్) కంపెనీ ఆప్టిమమ్ హెల్త్కేర్ ఐటీతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. క్లాస్ హెల్త్కేర్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, కన్సల్టింగ్ సేవల కంపెనీ ఆప్టిమమ్ భారీస్థాయి ట్రాన్స్ఫార్మేషన్లో క్లయింట్లకు సేవలు అందించడంలో గుర్తింపు పొందినట్లు పేర్కొంది. వెరసి కంపెనీ హెల్త్కేర్ వృద్ధి వ్యూహాలకు మద్దతు లభించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కంపెనీ టోపజ్ ఏఐ, కోబాల్ట్ క్లౌడ్, క్లౌడ్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రా సర్వీసులను ఆప్టిమమ్ హెల్త్కేర్ ద్వారా ఆరోగ్యపరిరక్షణ సేవలందించే కంపెనీలు వినియోగించుకునేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వివరించారు. స్ట్రాటస్ డీల్ ప్రాపరీ్ట, క్యాజువాలిటీ(పీఅండ్సీ) ఇన్సూరెన్స్ పరిశ్రమలో టెక్నాలజీ సొల్యూషన్లు అందిస్తున్న యూఎస్ కంపెనీ స్ట్రాటస్ కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఇన్ఫోసిస్ తెలియజేసింది. ఇందుకు ముందస్తు, ఆర్జన సంబంధ చెల్లింపులతోకలిపి 9.5 కోట్ల డాలర్ల నగదు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అయితే మేనేజ్మెంట్ ప్రోత్సాహకాలు, బోనస్లనుమినహాయించింది. దీంతో బీమా రంగంలో లీడర్షిప్ను మరింత పటిష్టపరచుకోనున్నట్లు తెలియజేసింది. గ్లోబల్ పీఅండ్సీ ఇన్సూరెన్స్ క్లయింట్లకు మరింత విస్తారంగా ఏఐ ఆధారిత డిజిటల్, డేటా ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. పరిశ్రమ సంబంధ లోతైన పరిజ్ఞానం కలిగి 450 మంది నిపుణుల బృందాన్ని స్ట్రాటస్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. కన్సల్టింగ్ నైపుణ్యాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సామర్థ్యాలు కలిగి ఉన్న టీమ్ను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది. భారత్సహా.. యూఎస్, కెనడాలలో గ్లోబల్ డెలివరీ కార్యకలాపాలు విస్తరించిన స్ట్రాటస్ ఎండ్టుఎండ్ గైడ్వైర్ ఇన్సూరెన్స్సూట్ సామర్థ్యాలను కలిగి ఉన్నట్లు వివరించింది. వీటిలో పాలసీసెంటర్, క్లెయిమ్సెంటర్, బిల్లింగ్సెంటర్, అప్గ్రేడ్స్, అప్లికేషన్ మేనేజ్డ్ సర్వీసులు తదితరాలున్నట్లు పేర్కొంది. -
బ్యాంక్ హాలిడేస్: ఐదు రోజుల్లో నాలుగు రోజులు సెలవు!
మార్చి నెలలో కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇది ఆర్ధిక లావాదేవీలు జరిపేవాళ్లకు కొంత నిరాశను కలిగించింది. ఆర్థిక లావాదేవీల పరంగా ఎంతో కీలకమైన మార్చినెలలో ఇలా వరుస సెలవులు రావడం వల్ల ఏదైనా పెండింగ్ పడే అవకాశం ఉందేమో అని చాలామంది భావిస్తున్నారు.➤మార్చి 27:శ్రీరామనవమి కారణంగా బ్యాంకులకు సెలవు. ప్రత్యేకించి మిజోరం,మహారాష్ట్ర,కర్ణాటక,తమిళనాడు,ఉత్తరాఖాండ్,రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్,చంఢీఘర్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్,ముంబై, నాగ్పూర్,జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బ్యాంకులు పనిచేయవు.➤ మార్చి 28: నాలుగో శనివారం సాధారణ సెలవుదినం కావడంతో, భారతదేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం.➤ మార్చి 29: ఆదివారం సెలవుదినం కావడంతో.. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు క్లోజ్ అవుతాయి.➤ మార్చి 31: మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు పనిచేయవు.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి!
2026 ప్రారంభంలో భారీగా పెరిగిన వెండి, క్రమంగా తగ్గుతూ.. పెరుగుతూ ముందుకు సాగింది. మూడు నెలల కాలంలో ఏకంగా 44 శాతం తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి సమయంలో వెండి కొనాలా?, ఇంకొంత కాలం వేచి చూడాలా? అని చాలామందికి అనుమానం కలిగింది. ఈ కథనంలో మీ అనుమానాలకు సమాధానం చూసేద్దాం.జనవరి 2026లో రూ.4.20 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. నేటికి (మార్చి 26) రూ.2.60 లక్షల వద్దకు చేరింది. అంటే మూడు నెలలు ఇంకా గడవక ముందే సిల్వర్ రేటు రూ.1.60 లక్షలు తగ్గింది. సాధారణంగా.. ధరలు 20 శాతం కంటే తగ్గితే లేదా నష్టపోతే దాన్ని బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు వెండి పరిస్థితి ఇక్కడే ఉందని నిపుణులు చెబుతున్నారు.వెండి ధరలు తగ్గడానికి కారణం?సిల్వర్ ధరలు ఇంతలా తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా డాలర్ విలువ బలపడటం అనే చెప్పాలి. ఇది కాకుండా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల సరఫరా అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉండవచ్చని అంచనాలు కూడా వెండి ధరలు తగ్గడానికి కారణమవుతున్నాయి.నిపుణుల అభిప్రాయంక్రమంగా తగ్గిన వెండి ధరలు మెల్లగా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉన్న ధరలతో పోలిస్తే.. ఇప్పుడున్న ధరలు చాలా తక్కువ. కాబట్టి వెండి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని కొందరు చెబుతున్నారు. ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇంకొంతకాలం వేచి ఉండటం మంచిదని మరికొందరు చెబుతున్నారు.పెట్టుబడిదారులకు సూచనలుబంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమం. అది ఆభరణాలుగా కొనుగోలు చేస్తారా?, బిస్కెట్స్, కడ్డీల రూపంలో కొనుగోలు చేస్తారా అనేది పూర్తిగా మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా పెట్టుబడి అనేది మీ సొంత నిర్ణయం. అవసరమైన నమ్మకమైన నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది! -
హెచ్డీఎఫ్సీపై ఆరోపణలు.. రంగంలోకి న్యాయ సంస్థ
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ అతాను చక్రవర్తి చేసిన ఆరోపణలపై స్వతంత్ర పరిశీలనకుగాను న్యాయ సంస్థలను బ్యాంక్ నియమించింది. వాస్తవాల ఆధారంగా ఆరోపణల నిగ్గు తేల్చేందుకు న్యాయ సంస్థలను నియమించినట్టు బ్యాంక్ అధికార ప్రతినిధి తెలిపారు. దశాబ్దాలుగా బ్యాంక్ పాటిస్తూ వచ్చిన అత్యున్నత పాలనా ప్రమాణాలకు అనుగుణంగా ఈ నియామకం చేసినట్టు చెప్పారు.నైతిక పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ అతాను చక్రవర్తి ఈ నెల 18న అర్ధంతరంగా హెచ్డీఎఫ్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ‘‘గత రెండేళ్లలో బ్యాంక్ పరిధిలో జరుగుతున్న పరిణామాలు, అనుసరిస్తున్న విధానాలను పరిశీలించగా, నా వ్యక్తిగత విలువలు, నైతిక ప్రమాణాలకు అనుగుణంగా లేవు. నా రాజీనామాకు కారణాలు ఇవే’’అని చక్రవర్తి పేర్కొన్నారు. -
‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగమే’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఆదరణ కలిగిన ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) యాజమాన్యం మారిన నేపథ్యంలో ఆ జట్టు వ్యవస్థాపక యజమాని విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సుమారు రూ.16,500 కోట్లకు ఈ ఫ్రాంచైజీ విక్రయించిన తర్వాత మాల్యా తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ‘ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో భాగం’ అని పేర్కొన్నారు.2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు మాల్యా ఈ ఫ్రాంచైజీని రూ.450 కోట్లకు (సుమారు 111.6 మిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు. ఆ సమయంలో తన నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారని ఆయన గుర్తుచేసుకున్నారు. ‘నేను 2008లో ఈ జట్టును కొనుగోలు చేసినప్పుడు చాలా మంది నన్ను చూసి నవ్వుతూ ఇది కేవలం ఒక ‘వానిటీ ప్రాజెక్ట్’(ప్రదర్శన కోసం చేసే ఖర్చు) అని విమర్శించారు. కానీ నా లక్ష్యం స్పష్టంగా ఉంది. రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేయడమే నా ఉద్దేశం. అందుకే జట్టుకు ఆ పేరు పెట్టాను. ఈ రోజు ఆర్సీబీ అత్యంత విలువైన ఫ్రాంచైజీగా నిలవడం గర్వంగా ఉంది’ అని మాల్యా ఎక్స్ (ట్విట్టర్)లో రాశారు.కోహ్లీ ఎంపికే నా విజయం!ప్రపంచ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీని జట్టులోకి తీసుకోవడం తన అత్యుత్తమ నిర్ణయమని మాల్యా అభివర్ణించారు. 18 ఏళ్ల క్రితం ఒక కుర్రాడిగా కోహ్లీని గుర్తించి జట్టులో చేర్చుకున్న జ్ఞాపకాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కోహ్లీతో పాటు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలను జట్టులోకి తీసుకురావడం తన అదృష్టమని పేర్కొన్నారు.I would like to heartily congratulate the new owners of RCB. I wish them the very best and Godspeed with the most valuable IPL franchise. When I bought the franchise in 2008 for INR 450 crores, most people laughed at me and criticised my investment as a vanity project. Behind my…— Vijay Mallya (@TheVijayMallya) March 26, 2026నూతన యాజమాన్యంఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం (టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బ్లాక్ స్టోన్, బోల్ట్ వెంచర్స్) రూ.16,660 కోట్లకు ఆర్సీబీని కైవసం చేసుకుంది. కుమార మంగళం బిర్లా కుమారుడు ఆర్యమన్ విక్రమ్ బిర్లా ఇకపై ఈ ఫ్రాంచైజీకి సారథ్యం వహించనున్నారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ తన ప్రధాన వ్యాపారంపై దృష్టి పెట్టేందుకు ప్రాంఛైజీలోని తన వాటాను విక్రయించినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
గ్యాస్ చార్జీలు వసూలు చేస్తే.. ప్రభుత్వం వార్నింగ్
న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారులపై ఎల్పీజీ ఛార్జీలు, గ్యాస్ సర్చార్జ్, ఫ్యూయల్ కాస్ట్ రికవరీ పేరుతో ఎలాంటి అదనపు చార్జీలు విధించవద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ విభాగం (సీసీపీఏ) ఆదేశించింది. ఈ తరహా అనుచిత వాణిజ్య విధానాలను అనుసరిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం, 2019 కింద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. హోటళ్లు, రెస్టారెంట్ల మెనూల్లో పేర్కొన్న చార్జీలకు అదనంగా పన్నుల వరకే విధించగలరని స్పష్టం చేసింది.అన్ని రకాల తయారీ వ్యయాలు (ముడి సరుకులు, ఎల్పీజీ, విద్యుత్ సహా) మెనూ చార్జీల్లో భాగంగానే ఉండాలని, విడిగా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని పేర్కొంది. తాము ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఉల్లంఘనలను గుర్తిస్తే వినియోగారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దేవవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ పేరుతో అదనపు చార్జీలు తీసుకుంటున్నట్టు తన దృష్టికి రావడంతో సీసీపీఏ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ తరహా చార్జీలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. చార్జీల బాదుడుపై ఫిర్యాదు అదనపు చార్జీలు వసూలుపై వినియోగదారులు ముందుగా హోటల్ను సంప్రదించి వాటిని తొలగించాలని కోరొచ్చని సీసీపీఏ సూచించింది. ఫలితం లేకపోతే 1915కు కాల్ చేసి లేదా ఎన్సీహెచ్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. అలాగే ఈ–జాగృతి పోర్టల్ ద్వారా వినియోగదారుల కమిషన్ ముందు ఫిర్యాదు దాఖలు చేయొచ్చని లేదా జిల్లా కలెక్టర్, సీసీపీఏకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని సూచించింది. -
మెటా లేఆఫ్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు?
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్ఫారమ్స్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. కంపెనీకి చెందిన కీలక విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ నివేదిక ప్రకారం, ఈ లేఆఫ్స్ ప్రధానంగా రియాలిటీ ల్యాబ్స్, సోషల్ మీడియా బృందాలు, రిక్రూట్మెంట్ విభాగాలపై ప్రభావం చూపనున్నాయి.ఖర్చుల నియంత్రణే లక్ష్యం?ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు మెటా చేస్తున్న భారీ పెట్టుబడులే ఈ తొలగింపులకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను మెటా మొత్తం ఖర్చులు 162 బిలియన్ల డాలర్లు నుంచి 169 బిలియన్ డాలర్ల మధ్య ఉంటాయని అంచనా. అగ్రశ్రేణి ఏఐ నిపుణులను ఆకర్షించేందుకు, వారిని నిలుపుకునేందుకు కంపెనీ మిలియన్ల కొద్దీ డాలర్లను వేతనాల రూపంలో వెచ్చిస్తోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గిస్తోంది. దాంతో కేవలం టెక్నికల్ విభాగాలే కాకుండా సేల్స్ విభాగంలోని పరిమిత సంఖ్యలో ఉద్యోగులపై కూడా ఈ ప్రభావం ఉండనుంది.నిజానికి ఈ ఉద్యోగ కోతలు ఆకస్మికమైనవి కావు. ఈ నెల ప్రారంభంలోనే రాయిటర్స్ ఒక నివేదికలో మెటా తన మొత్తం శ్రామిక శక్తిలో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించే ఆలోచనలో ఉందని పేర్కొంది. ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ మేరకు సమాచారం అందిందని, సిబ్బంది తగ్గింపునకు సిద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.ఇతర కంపెనీలు ఇలా..అమెజాన్అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో భారీ మార్పులు చేస్తోంది. 2026 ప్రారంభంలోనే సుమారు 16,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. కంపెనీలో మధ్యస్థాయి మేనేజ్మెంట్ హైరార్కీలను తగ్గించి నిర్ణయాధికారాన్ని వేగవంతం చేయాలని సీఈఓ ఆండీ జస్సీ నిర్ణయించారు. దీనివల్ల బ్యూరోక్రసీ తగ్గి ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం సులభమవుతుందని వారి భావన.మైక్రోసాఫ్ట్మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ (అజూర్), ఏఐ విభాగాలకు పెద్దపీట వేస్తూనే ఇతర విభాగాల్లో కోతలు విధిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పలు విడతల్లో వేలాది మందిని తొలగించింది. డేటా సెంటర్ల నిర్మాణం కోసం మైక్రోసాఫ్ట్ ఏటా దాదాపు 80 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ భారీ పెట్టుబడులను బ్యాలెన్స్ చేయడానికి మార్కెటింగ్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగాలను తగ్గిస్తోంది.గూగుల్గూగుల్ తన అడ్వర్టైజింగ్ సేల్స్, హార్డ్వేర్ విభాగాల్లో మార్పులు చేస్తోంది. ఏఐ సహాయంతో పనులను ఆటోమేట్ చేయడం ద్వారా తక్కువ మందితో ఎక్కువ ఉత్పాదకత సాధించాలని గూగుల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎఫిషియెన్సీ పేరుతో కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తోంది.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం, వెనుకబడిన ప్రాంతాలలో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరించడం లక్ష్యంగా మొత్తం రూ.28,840 కోట్ల వ్యయంతో సవరించిన ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్) పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు క్యాబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..ఇమ్మిగ్రేషన్, వీసా, విదేశీయుల రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదంజాతీయ భద్రత కోసం విదేశీయుల ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుఐవీఎఫ్ఆర్టీ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయల ఖర్చుకు క్యాబినెట్ అనుమతిఉడాన్ 2.0 పథకానికి క్యాబినెట్ ఆమోదంపదేళ్ల వ్యవధిలో 28,840 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న ప్రభుత్వంఈ పథకం కింద కొత్తగా 100 విమానాశ్రయాల అభివృద్ధి200 హెలిపాడ్ ల ఆధునీకరణఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కోసం 2,577 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న ప్రభుత్వం ఎయిర్ లైన్స్ ఆపరేటర్స్ కు వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద 10,043 కోట్ల రూపాయల సహాయం ఈ పథకం కింద కొత్తగా 120 ప్రాంతాలకు పెరుగనున్న ఎయిర్ కనెక్టివిటీపర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్ విధానానికి క్యాబినెట్ ఆమోదం సాంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 52 శాతం విద్యుత్ ఉత్పత్తి -
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియాలో ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.వైరల్ వార్తల్లో ఏముంది?గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్కు అయితే 35 రోజులు గ్యాప్ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.కేంద్రం, ఐవోసీఎల్ వివరణఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్లతో సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.Reports claiming changes in LPG refill booking timelines are incorrect. There is no change in the existing timelines (25 days in urban areas / 45 days in rural areas), and LPG supplies remain adequate across the country. Please rely only on official sources and avoid panic…— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 25, 2026 -
కోటక్ మహీంద్రాలో భారీ కుంభకోణం కలకలం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం మరువకముందేమరో బ్యాంకులో జరిగిన భారీ మోసం కలకలం రేపుతోంది. హర్యానాలో కొటక్ మహీంద్రా బ్యాంక్లో రూ. 160 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ (FD) కుంభకోణం వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయిహర్యానాలోని పంచకుల మునిసిపల్ కార్పొరేషన్, కొటక్ మహీంద్రా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ దాదాపు రూ. 160 కోట్లు. అయితే, ఎఫ్డీల్లో జమ చేసిన నధులు అసలు డిపాజిట్టే కాలేదు. నకిలీ పత్రాలు సృష్టించి ఆ సొమ్మును ఇతర మోసపూరిత ఖాతాలకు మళ్లించారు. ఇందుకోసం హర్యానాకు చెందిన పంచకుల మున్సిపల్ కార్పొరేషన్కు నకిలీ పత్రాలను జారీ చేశారని అధికారులు గుర్తించారు. ఈ భారీ మోసంలో బ్యాంక్ ఉద్యోగులతో పాటు, మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల ప్రమేయం కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.వెలుగులోకి ఎలా వచ్చింది?రూ. 58 కోట్ల విలువైన ఒక FD గడువు ముగిసిన తర్వాత, ఆ మొత్తాన్ని తమ ఖాతాకు బదిలీ చేయాలని కార్పొరేషన్ బ్యాంకును కోరినప్పుడు ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు స్టేట్మెంట్ ప్రకారం బదిలీ పూర్తయినట్లు చూపించినప్పటికీ, ఆ నిధులు కార్పొరేషన్ ఖాతాకు చేరలేదు. ఆరా తీస్తే ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా నకిలీదేనని నిర్ధారణ అయ్యింది.డబ్బు మాయమైపోయిందని తేలింది. ఈ వ్యవహారంలో బ్యాంకు జారీ చేసిన FDలన్నీ నకిలీవని, ఖాతాలో అసలు నిధులే లేవని గుర్తించారు. నకిలీ పత్రాలను ఉపయోగించి బ్యాంకు ఉద్యోగులు చాలాకాలం పాటు ఈ నిధుల దుర్వినియోగాన్ని దాచిపెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.తమ ఎఫ్డీ నిధులను బదిలీ చేయమని బ్యాంకును కోరినప్పుడే ఈ వ్యవహారం బైటపడిందని, పంచకుల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కుమార్ తెలిపారు. ఇదే విషయాన్ని స్టేట్ విజిలెన్స్కు నివేదించారు. బ్యాంక్పై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేయడంతో పాటు, ఆ బ్యాంక్ను ప్రభుత్వ పనుల నుండి తొలగించాలని (de-empanel) హర్యానా ప్రభుత్వాన్ని కోరారు. అటు హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ కుంభకోణంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.కాగా గత నెలలోనే చండీగఢ్లోని ఐడిఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) శాఖలో హర్యానా ప్రభుత్వానికి చెందిన రూ. 590 కోట్ల నిధులు ఇలాగే మాయమయ్యాయి. ఆ కేసులో బ్యాంక్ ఇప్పటికే పూర్తి సొమ్మును ప్రభుత్వానికి తిరిగి చెల్లించింది. ఇప్పుడు కొటక్ మహీంద్రా బ్యాంక్లో కూడా ఇలాంటిదే జరగడం కలకలం రేపుతోంది -
12 శాతం వరకు పెరగనున్న ఏసీల రేట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ వెల్లడించారు. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు. మంగళవారమిక్కడ కంపెనీ ఫ్లాగ్íÙప్ ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సేల్స్ 5% తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు సూద్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఏసీల మార్కెట్లో తమకు 14.2% మార్కెట్ వాటా ఉండగా దీన్ని 14.7 శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. తెలంగాణలో 18.5%, ఆంధ్రప్రదేశ్లో 15.5% మార్కెట్ వాటా ఉందన్నారు. వివిధ ధరల శ్రేణిలో కొత్త ప్రమాణాలకు తగ్గట్లుగా 125 ఉత్పత్తులను ప్రవేశపెట్టినట్లు సంస్థ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ హింగోరాని తెలిపారు. వీటిలో ఇన్వర్టర్, ఫిక్సిడ్, స్పీడ్, విండో ఏసీలతో పాటు ఐకానియా పేరిట ప్రీమియం మోడల్ కూడా ఉన్నట్లు ఆయన వివరించారు. -
గ్యాస్ కొరతకు చెక్.. 20 శాతం పెరిగిన కేటాయింపు!
భారతదేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు లభ్యతను మరింత బలపరచడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. ఇందులో భాగంగానే.. దేశవ్యాప్తంగా కమర్షియల్ LPG సరఫరాను పెంచే నిర్ణయం తీసుకుంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అదనంగా 20% కమర్షియల్ LPG సిలిండర్ల కేటాయింపును ఆమోదించింది. దీంతో మొత్తం కేటాయింపు సగటు నెలవారీ అవసరంలో 50%కి పెరిగింది. ఈ పెంపు వలన వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా మరింత స్థిరంగా, సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది.India is strengthening commercial LPG availability across the country.An additional 20% allocation of commercial LPG cylinders has been approved—taking the total allocation to 50% of the average monthly requirement.IndianOil is working across its extensive nationwide network… pic.twitter.com/zYFkE5qB1d— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 24, 2026ఇకపై హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలు వంటి రంగాలు గ్యాస్ కొరత నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుంది. కాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గ్యాస్ సిలిండర్లను సమయానికి, సులభంగా అందేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయం వల్ల వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను అంతరాయం లేకుండా కొనసాగించగలుగుతాయి. అంతేకాకుండా, వినియోగదారులకు ఆహారం, ఇతర సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తుంది. గ్యాస్ కొరత కారణంగా ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. ధరల స్థిరత్వం కూడా మెరుగుపడే అవకాశం ఉంది. -
రూ.3 లక్షలకి ఆర్డర్ పెడితే.. వాషింగ్ పౌడర్ వచ్చింది!
ఆన్లైన్ షాపింగ్లో లెక్కకు మించిన మోసాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటిదే ఇప్పుడు మరోమారు తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.స్వగత్ నాయక్ అనే వ్యక్తి తన స్టార్టప్ కోసం సుమారు రూ. 2.9 లక్షల విలువ గల హైఎండ్ గ్రాఫిక్స్ కార్డ్ ఆర్డర్ చేశారు. కానీ డెలివరీ వచ్చిన తర్వాత అతను ప్యాకెట్ను ఓపెన్ చేసి చూడగా అందులో గ్రాఫిక్స్ కార్డ్ బదులుగా 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ ఉండటం చూసి షాకయ్యారు.'ఫుల్ఫిల్డ్ బై అమెజాన్' (FBA) పద్ధతిలో డెలివరీ జరిగింది. అంటే దీనిని అమెజాన్ గోదాములో నిల్వ చేసి నేరుగా అక్కడి నుంచే రవాణా చేశారని స్వగత్ వెల్లడించారు. సాధారణంగా ఇలాంటి ఆర్డర్లకు ఎక్కువ నమ్మకం ఉంటుంది, ఎందుకంటే కంపెనీ స్వయంగా స్టోర్ చేసి ఆర్డర్ చేసుకున్నవారికి డెలివరీ చేస్తుంది.డెలివరీ ప్యాకేజింగ్పై అనుమానాస్పద లక్షణాలు కనిపించినట్లు స్వగత్ పేర్కొన్నారు. తయారీదారు పెట్టిన అసలు సీల్ కోసి మళ్లీ టేప్ చేశారు, అలాగే నకిలీ బార్కోడ్ కూడా అతికించారని అన్నారు. అదే విధంగా, ప్యాకెట్పై ఉన్న షిప్పింగ్ లేబుల్లో బరువు 1.56 కేజీలుగా చూపించారు. కానీ ఒక అసలు RTX 5090 గ్రాఫిక్స్ కార్డ్ ప్యాకేజింగ్తో కలిపి సుమారు 3 కిలోల వరకు ఉంటుంది.ఇవన్నీ గమనించిన స్వగత్ నాయక్, ఇది స్పష్టంగా మోసం అని పేర్కొన్నాడు. అతను తన అన్బాక్సింగ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను అమెజాన్ కస్టమర్ సపోర్ట్ను సంప్రదించినప్పటికీ, కేవలం 15 నిమిషాల్లోనే అతని కంప్లైంట్ను మూసివేశారు. ప్రస్తుతం కంపెనీ రీఫండ్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఇది వినియోగదారుల హక్కులు, ఆన్లైన్ షాపింగ్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆన్లైన్ రిటైలర్లతో తమకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలనే పంచుకోగా, మరికొందరు నాయక్ వాదనలను ప్రశ్నిస్తూ, ఆ అన్బాక్సింగ్ వీడియోను మార్ఫింగ్ చేసి ఉండవచ్చని పేర్కొన్నారు.Scammed for ₹2.9L on @AmazonIN. Ordered a GIGABYTE RTX 5090 for our startup, received 1kg of Ghadi detergent. This was "Fulfilled by Amazon" (FBA), meaning it was stored and shipped directly from an Amazon warehouse. @AmazonHelp #AmazonScam #ConsumerRights [more in thread] pic.twitter.com/NfgUL0jmvL— Swagat Nayak (@autocarrrot) March 22, 2026 -
మొన్న జొమాటో.. నేడు స్విగ్గీ: పెరిగిన ప్లాట్ఫామ్ ఫీజు!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీలైన జొమాటో, స్విగ్గీ వినియోగదారులపై మరోసారి భారం మోపాయి. గత వారంలో జొమాటో తన ప్లాట్ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. ఇప్పుడు స్విగ్గీ అదే బాటలో అడుగులు వేస్తూ.. ప్లాట్ఫామ్ ఫీజును ఒక్కో ఆర్డర్పై రూ. 14.99 నుంచి రూ.17.58కి (జీఎస్టీతో కలిపి) పెంచింది. అంటే సంస్థ తాజాగా రూ.2.59 పెంచిందన్నమాట.కొత్తగా పెంచిన ప్లాట్ఫామ్ ఫీజు.. స్విగ్గీ ప్లాట్ఫామ్ను నిర్వహించడానికి మాత్రమే కాకుండా సంస్థ నిర్వహణకు సహాయపడుతుందని కంపెనీ వినియోగదారులకు తెలియజేసింది. ఈ సందేశం ఇప్పుడు చెక్అవుట్ సమయంలో యాప్లో కనిపిస్తుంది.జొమాటో కంపెనీ కూడా గత వారంలో ఒక్కో ఆర్డర్పై ఛార్జీలను రూ. 2.40 పెంచింది. దీంతో ఫీజు రూ. 12.50 నుండి రూ. 14.90కి చేరింది. దీన్నిబట్టి చూస్తే.. పన్నులతో కలిపి, స్విగ్గీ, జొమాటో రెండూ ఇప్పుడు దాదాపు ఒకే రకమైన ధరలను వసూలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ రెండు ప్రత్యర్థులు ఒకరి ధరల వ్యూహాలను మరొకరు అనుకరించే దీర్ఘకాలంగా కొనసాగుతున్న ధోరణి ఇప్పుడు కొనసాగుతోంది.ఫుడ్ డెలివరీ బిల్లులలో ప్లాట్ఫారమ్ ఫీజులు ఒక చిన్న భాగమే అయినా, అవి క్రమంగా పెరుగుతున్నాయి. అవి విడివిడిగా చూస్తే చిన్నవిగా అనిపించినప్పటికీ, తరచుగా వాడే వినియోగదారులు కాలక్రమేణా గణనీయంగా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. సాంకేతిక ఖర్చులు, యాప్ నిర్వహణ మరియు మొత్తం కార్యకలాపాలను భరించడానికి ఈ ఛార్జీలు అవసరమని కంపెనీలు తరచుగా ధరలు పెంచినప్పుడల్లా సమర్ధించుకుంటూనే ఉన్నాయి. -
స్వతంత్ర డైరెక్టర్లు బాధ్యతగా మెలగాలి: సెబీ
కార్పొరేట్ గవర్నెన్స్లో కీలకమైన స్వతంత్ర డైరెక్టర్లు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ గందరగోళం సృష్టించకూడదని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇటీవల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పార్ట్-టైమ్ ఛైర్మన్, స్వతంత్ర డైరెక్టర్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామా నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన సెబీ బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పాండే, కంపెనీలలో మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలను కాపాడటం స్వతంత్ర డైరెక్టర్ల ప్రాథమిక విధి అని గుర్తుచేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే వాటిని లేవనెత్తాలని సూచించారు.గందరగోళానికి తావుండకూడదుఅతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో నైతిక విభేదాల కారణంగా తప్పుకుంటున్నట్లు పేర్కొనడం మార్కెట్లో కలకలం రేపింది. ఈ పరిణామంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు భారీగా పతనమవ్వడమే కాకుండా బ్యాంక్ అంతర్గత పరిపాలనపై పలు అనుమానాలకు దారితీసింది. దీనిపై స్పందిస్తూ ‘సరైన ఆధారాలు, రికార్డులు లేకుండా కేవలం ఊహాగానాలతో కూడిన ఆరోపణలు చేయడం ఎవరికీ తగదు’ అని సెబీ చీఫ్ పేర్కొన్నారు.ఎల్ఓడీఆర్ నిబంధనలే కీలకంలిస్టింగ్ అబ్లిగేషన్స్ అండ్ డిస్క్టోజర్ రిక్వైర్మెంట్స్(ఎల్ఓడీఆర్) నిబంధనలు, కంపెనీల చట్టం కింద స్వతంత్ర డైరెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని పాండే వివరించారు. కంపెనీ పనితీరుపై ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని బోర్డు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఆ అంశాలను బోర్డు సమావేశం మినిట్స్ సమావేశంలో తప్పనిసరిగా నమోదు చేయాలని పట్టుబట్టాలి. అనైతిక ప్రవర్తన, మోసాలు లేదా కంపెనీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వంటి అంశాలను అస్పష్టంగా వదిలేయకుండా, అధికారికంగా రికార్డ్ చేయాలని ఆయన సూచించారు.ఆర్బీఐ క్లీన్ చిట్.. సెబీ నిశిత పరిశీలనహెచ్డీఎఫ్సీ బ్యాంక్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే స్పందించిందని, ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆందోళనకరమైన అంశాలు కనిపించలేదని ఆర్బీఐ వెల్లడించిన విషయాన్ని పాండే ప్రస్తావించారు. అతాను చక్రవర్తి రాజీనామా లేఖలోని అంశాలను సెబీ లోతుగా పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు తాము బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయబోమని, అయితే నియంత్రణ సంస్థగా తన విధులను సెబీ నిర్వర్తిస్తుందని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
26 ఏళ్ల వయసులో కోట్ల డబ్బు: ఖర్చు చేసిన స్టైల్.. నెట్టింట వైరల్!
ఓ 26 ఏళ్ల యువకుని చేతిలో మిలియన్ డాలర్ల డబ్బు ఉంటే.. ఏం చేస్తాడు. లగ్జరీ కారు కొంటాడు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఇంకా అయితే దుబారా ఖర్చు కూడా చేసే అవకాశం ఉంది. కానీ 'అమన్ గోయల్' మాత్రం వీటన్నింటికీ పూర్తిగా విరుద్ధం. తనకు వచ్చిన డబ్బును ఎలా ఖర్చు చేశాడనే విషయాన్ని అతడు వివరంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2021 నవంబర్లో, నేను నా స్టార్టప్ను ఒక పెద్ద కంపెనీకి మిలియన్ డాలర్లకు అమ్మాను. ఇది జరిగినప్పుడు నా వయసు 26 సంవత్సరాలు. ఆ వయసులో చాలా మంది ఆడంబరమైన కార్లు, వాచీలు లేదా ఇతరులను ఆకట్టుకునే జీవనశైలి కోసం విపరీతంగా ఖర్చుపెట్టేవారు. నేను మాత్రం వేరే మార్గాన్ని ఎంచుకున్నాను. సౌకర్యం, సంతోషం, దీర్ఘకాలిక ఆర్థిక స్వేచ్ఛను సమతుల్యం చేసుకుంటూ, ఉద్దేశపూర్వకంగా నా జీవితాన్ని ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించుకున్నానని అమన్ గోయల్ పేర్కొన్నారు.కుటుంబానికి మొదటి ప్రాధాన్యతస్టార్టప్ను అమ్మిన తరువాత.. అదే సంవత్సరం, నేను నా తల్లిదండ్రులను ముంబైలో నాతో పాటు నివసించడానికి తీసుకువచ్చాను. మన సంపదను మనకు అత్యంత ముఖ్యమైనవారితో పంచుకోకపోతే.. దానికి అర్థం లేదని అన్నారు. వారు ఇప్పటికీ నాతోనే నివసిస్తున్నారు, నిజం చెప్పాలంటే, నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం అదే.ఆరోగ్యండబ్బు వచ్చింది కదా అని ఊరికే ఉంటే సరిపోదు. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ద వహించాను. నేను 15 కేజీలకు పైగా బరువు తగ్గాను. దీనికోసం ఒక ఫిట్నెస్ కోచ్ను నియమించుకున్నాను. నేను, నా భార్య కూడా సంవత్సరానికి రెండుసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటాము. మీరు కూడా ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోకపోతే.. రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.ఆహారంనేను బయటి ఆహారం, షుగర్, వేయించిన పదార్థాలను చాలా వరకు తగ్గించాను. ఆరోగ్యం వంటగదిలో మొదలవుతుంది, జిమ్లో కాదు అని అమన్ పేర్కొన్నారు.ఇల్లునేను 2022లో మొత్తం డబ్బు చెల్లించి ఒక ఇల్లు కొన్నాను. ఎలాంటి లోన్స్ తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు. అద్దెకు ఉండటమే తెలివైన పని అని చాలా మంది అంటారు. ఒకరకంగా అది నిజమే కావచ్చు.. కానీ నా తల్లిదండ్రులు స్థిరపడి, సంతోషంగా ఉండటానికి సొంత ఇల్లు అవసరం.అప్గ్రేడ్లు అంటే విపరీతమైన ఖర్చు అని అర్థం కాదు. వాటి అర్థం శాంతి, ఆరోగ్యం. మీరు ప్రేమించే వారితో గడిపే సమయం. మీకు అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చినప్పుడు మీరు కొనవలసిన నిజమైన విలాసాలు ఇవే అని అమన్ తన ట్వీట్ పూర్తి చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు అతని నిర్ణయాలకు ఫిదా అవుతున్నారు.In November 2021, I sold my startup to a larger company for millions of dollars. I was 26 years old when this happened.Most people that age would have splurged on flashy cars, watches, or a lifestyle designed to impress. I went a different way.I chose to upgrade my life with… https://t.co/ign188f5EM pic.twitter.com/dxesoDKSD4— Aman Goel (@amangoeliitb) March 22, 2026 -
ఇంటికొచ్చే గ్యాస్ ఇన్ని రకాలా..?
సామాన్యుడి వంటగదిలో ఎర్రటి గ్యాస్ సిలిండర్ (LPG) కనిపించడం సర్వసాధారణం. కానీ, మారుతున్న కాలంతో పాటు గ్యాస్ వినియోగం తీరు కూడా మారుతోంది. నగరాల్లో వాహనాల కోసం సీఎన్జీ (CNG), ఇళ్లలో పైప్లైన్ ద్వారా వచ్చే పీఎన్జీ (PNG).. ఇలా గ్యాస్ రకాలు వినడానికి ఒకేలా ఉన్నా, వాటి ఉపయోగాలు మాత్రం వేరు. భారతదేశ ఇంధన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నాలుగు రకాల గ్యాస్ల గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం.వంటగదిలో రారాజు.. ఎల్పీజీకోట్లాది భారతీయ కుటుంబాలకు వంటగదిలో గ్యాస్ అంటే మొదట గుర్తొచ్చేది ఎల్పీజీ అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే ప్రోపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమమే ఇది. గ్యాస్ను ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. దీనిని రవాణా చేయడం సులభం కాబట్టి, మారుమూల గ్రామాల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' వంటి పథకాలతో ఇది ఇప్పుడు ప్రతి ఇంటికీ చేరువైంది.సీఎన్జీ.. వాహనాలకు ‘గ్రీన్’ సిగ్నల్కాలుష్యాన్ని తగ్గించడంలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) కీలక పాత్ర పోషిస్తోంది. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా దీనిని వాహనాల్లో వాడుతున్నారు. ఇది ఇతర ఇంధనాల కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. ప్రస్తుతం నగరాల్లో ఆటోలు, బస్సులు, కార్ల కోసం సీఎన్జీ వాడకం విపరీతంగా పెరిగింది. ఇది సహజ వాయువును అధిక పీడనం వద్ద కంప్రెస్ చేయడం ద్వారా తయారవుతుంది.పీఎన్జీ.. సిలిండర్ల గోల లేని వంట గ్యాస్నగరాల్లో ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG). ఇంటికి వాటర్ కనెక్షన్ ఉన్నట్టే, భూగర్భ పైప్లైన్ల ద్వారా నేరుగా వంటగదికి గ్యాస్ వస్తుంది. దీని వల్ల సిలిండర్ అయిపోతుందనే భయం ఉండదు. మీరు ఎంత వాడుకుంటే అంతకే మీటర్ రీడింగ్ ప్రకారం బిల్లు చెల్లించవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు.ఎల్ఎన్జీ.. భారీ పరిశ్రమల ఇంధనంలిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సాధారణంగా మనం నేరుగా వాడేది కాదు. కానీ ఇది దేశీయ ఇంధన సరఫరా గొలుసులో అత్యంత కీలకమైనది. సహజ వాయువును మైనస్ 162°C వద్ద చల్లబరిచి ద్రవంగా మారుస్తారు. ఇలా చేయడం వల్ల దాని పరిమాణం తగ్గి, ఓడల ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం సులభం అవుతుంది. తీర ప్రాంతాలకు చేరుకున్న ఎల్ఎన్జీని తిరిగి గ్యాస్గా మార్చి విద్యుత్ ప్లాంట్లు, భారీ పరిశ్రమలకు పంపిస్తారు. -
జేపీ అసోసియేట్స్ దివాలా కేసు: NCLATను ఆశ్రయించిన వేదాంత
జైప్రకాష్(జేపీ) అసోసియేట్స్ దివాలా పరిష్కార ప్రక్రియపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పును సవాలు చేస్తూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను వేదాంత ఆశ్రయించింది.జేపీ అసోసియేట్స్ ఆస్తులకు రూ.14,535 కోట్లతో అదానీ గ్రూప్ సమర్పించిన బిడ్కు ఎన్సీఎల్టీ ఆమోదం తెలపడం తెలిసిందే. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ ఆస్తుల కోసం అదానీతోపాటు వేదాంత, దాల్మియా భారత్ సైతం పోటీ పడ్డాయి. కానీ, రుణదాతల కమిటీ మాత్రం అదానీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన రూ.14,535 కోట్ల బిడ్కు అంగీకారం తెలిపగా.. దీనికి మార్చి 17న ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. దీన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్లో వేదాంత సవాల్ చేసింది. దీనిపై ఇద్దరు సభ్యుల బెంచ్ సోమవారం విచారణ చేపట్టనుంది. -
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ.. ప్రభుత్వం కొత్త ‘ఆఫర్’
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్లో ప్రధాన వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గాన్ని ఎంచుకునే అవకాశముంది. ప్రస్తుతం బ్యాంక్లో పబ్లిక్కు 5.29 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ నెల మొదట్లో ప్రభుత్వం బ్యాంక్లో 60.72 శాతం వాటా విక్రయానికి బిడ్స్ను ఆహ్వానించింది.అయితే ఇందుకు సరైన స్పందన లభించకపోవడంతో ఓఎఫ్ఎస్ అవకాశాలనుప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ ధర కంటే దిగువన అదికూడా రెండు సంస్థలు మాత్రమే వాటా కొనుగోలుకి ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్లో ప్రభుత్వానికి 45.48 శాతం, బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటా ఉన్న సంగతి తెలిసిందే.పబ్లిక్ వాటా స్వల్పంగా ఉన్న నేపథ్యంలో బ్యాంక్ మార్కెట్ విలువ పరిమితంగానే నమోదవుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పబ్లిక్కు కనీసం 10–15 శాతం వాటా కల్పిస్తే బ్యాంక్ షేరుకి తగిన ధర నమోదయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డాయి. దీంతో ఓఎఫ్ఎస్ ద్వారా వాటా విక్రయానికి తెరతీయనున్నట్లు తెలుస్తోంది. -
రూ. 15వేలు జీతంలో ఆనందం.. రూ. 2.5లక్షల్లో అసంతృప్తి!
జీతం ఎక్కువ వచ్చే జాబ్ చేస్తే.. సంతోషంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అది ఏ మాత్రం నిజం కాదంటూ, వచ్చే జీతానికి సంతోషానికి సంబంధం ఉండదని ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.''నాకు నిజంగా ఆనందం కలిగింది.. నెలకు 15,000 రూపాయల జీతం పొందిన సమయంలోనే. కానీ ఇప్పుడు నెలకు 2.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ, సంతృప్తి తగ్గిపోయింది'' అని ఎక్స్ యూజర్ సాక్షి వెల్లడించారు. ఇది డబ్బు ఎక్కువ కావడం వల్ల కాదు, ఇతరుల జీవన స్థితులతో తనను పోల్చుకోవడం వల్ల ఏర్పడిన అసంతృప్తి అని ఆమె పేర్కొన్నారు.ఉద్యోగం వదిలిన తర్వాత కొన్ని నెలలు జీతం లేకపోవడం వల్ల ప్రారంభంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నా, అది నిజాన్ని గ్రహింపజేసింది. నిజమైన సంతోషం అంటే ఎక్కువ జీతం పొందడంలో కాదు, మనం నిజంగా ఇష్టపడే పని చేయడంలో ఉందని. ఇప్పుడు నేను ఇతరుల గురించి ఆలోచించకుండా పనిచేస్తాను. ఆమె అభిప్రాయం ప్రకారం, “పెద్ద జీతం లేదా తక్కువ జీతం కాదు, జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నావో అనేది ముఖ్యం.At a salary of:15K per month, I was the happiest.150K per month, I felt it was less - I deserved more.250K per month, I felt I was doing well, but after seeing others, it again felt less.I realised it was never about the salary.It was the comparison that created…— Sakshi (@Sakshi50038) March 20, 2026 -
బిడ్డను కోల్పోయిన గర్భిణి.. కంపెనీకి రూ.210 కోట్ల ఫైన్!
మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో.. దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ అమెరికాలోని టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థ.. తమ ఉద్యోగి గర్భంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించలేదు. ఆ తరువాత ఏకంగా రూ.210 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలోని హామిల్టన్ కౌంటీలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థపై భారీ నష్టపరిహారం విధించారు.చెల్సియా వాల్ష్ అనే మహిళ.. గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. 2021 ఫిబ్రవరిలో, ముందస్తుగా ప్రసవం జరగకుండా ఉండేందుకు ఆమె ఒక వైద్య చికిత్స చేయించుకుంది. డాక్టర్లు ఆమెకు ఎక్కువగా కదలకుండా ఉండాలని, బెడ్ రెస్ట్ తీసుకోవాలని.. ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.డాక్టర్ల సలహాను అనుసరించి.. చెల్సియా తన కంపెనీని సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కోరింది. కానీ కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రావాలని లేదా జీతం లేకుండా సెలవు తీసుకోవాలని చెప్పింది. ఇది ఆమెకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని సృష్టించింది.కంపెనీ తన అభ్యర్థనను తిరస్కరించడంతో.. చెల్సియా తన ఆరోగ్యానికి విరుద్ధంగా మూడు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఫిబ్రవరి 24న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిచ్చింది. అయితే అదే రోజు ఆమెకు ముందస్తు ప్రసవం జరిగింది.ఆమె కుమార్తె 'మాగ్నోలియా' కేవలం 21 వారాల గర్భధారణలోనే జన్మించింది. పుట్టినప్పుడు ఆ శిశువు శ్వాస తీసుకుంటూ, గుండె కొట్టుకుంటూ ఉండింది. కానీ ఎంతో బాధాకరంగా, కేవలం ఒక గంటా ముప్పై నిమిషాల్లోనే ఆమె తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇదీ చదవండి: రూ.47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!ఈ ఘటనపై కోర్టులో కేసు పెట్టగా, జ్యూరీ సభ్యులు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తేల్చారు. మొదట 25 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధించినా, 90% బాధ్యత కంపెనీదిగా నిర్ణయించి చివరికి 22.5 మిలియన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చారు. -
ఎల్పీజీ ఏటీఎం వచ్చేసింది.. ఇక ఎనీ టైమ్ గ్యాస్!
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతీయ వంటిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 60% దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో, సరఫరా గొలుసులో అప్పుడప్పుడు అంతరాయాలు కలుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకుని, డెలివరీ బాయ్ కోసం గంటల తరబడి వేచి చూడటం వినియోగదారులకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ పెట్రోలియం (BPCL) వినూత్నమైన 'స్మార్ట్ ఎల్పీజీ వెండింగ్ మెషిన్'ను అందుబాటులోకి తెచ్చింది.ఎక్కడంటే..దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎం ఇప్పుడు గురుగ్రామ్లో ప్రారంభమైంది. గురుగ్రామ్లోని సోహ్నా, సెక్టార్ 33లోని సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో బీపీసీఎల్ ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. 'భారత్ గ్యాస్ ఇన్స్టా ఎల్పీజీ' పేరుతో పిలిచే ఈ ఏటీఎం, సాధారణ నగదు ఏటీఎం తరహాలోనే 24 గంటల పాటు సేవలు అందిస్తుంది. ఫోన్ కాల్స్, బుకింగ్ స్లాట్లతో పనిలేకుండా కేవలం 2-3 నిమిషాల్లోనే నిండు సిలిండర్ను ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఏటీఎంలో సిలిండర్ ఎలా పొందాలంటే..ఈ మెషిన్ ద్వారా గ్యాస్ పొందడం అత్యంత సులభం. దీని పనితీరు ఇలా ఉంటుంది..మొబైల్ నంబర్: మెషిన్ స్క్రీన్పై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.ఓటీపీ వెరిఫికేషన్: మీ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి.క్యూఆర్ కోడ్ స్కాన్: మీ ఖాళీ సిలిండర్పై ఉన్న క్యూఆర్ (QR) కోడ్ లేదా బార్కోడ్ను మెషిన్ స్కానర్ ముందు ఉంచాలి. అది చెల్లుబాటు అవుతుందో లేదో మెషిన్ తనిఖీ చేస్తుంది.ఖాళీ సిలిండర్ డిపాజిట్: ధ్రువీకరణ పూర్తయ్యాక, విండో తెరుచుకుంటుంది. అందులో మీ ఖాళీ సిలిండర్ను ఉంచాలి. మెషిన్ దాని స్వచ్ఛతను, బరువును స్వయంచాలకంగా తనిఖీ చేసి లోపలికి తీసుకుంటుంది.చెల్లింపు: స్క్రీన్పై కనిపించే గ్యాస్ ధరను UPI ద్వారా స్కాన్ చేసి చెల్లించాలి.నిండు సిలిండర్: పేమెంట్ సక్సెస్ అవ్వగానే, పక్కనే ఉన్న డెలివరీ విండో నుండి సీల్ చేసిన నిండు సిలిండర్ బయటకు వస్తుంది.ఏంటీ ఏటీఎం ప్రత్యేకతలు?లైట్ వెయిట్ సిలిండర్లు: ఈ మెషిన్ ద్వారా 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను అందిస్తున్నారు. ఇవి పాత ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికగా ఉంటాయి.స్మార్ట్ అలర్ట్ సిస్టమ్: మెషిన్లో ఒకేసారి 10 సిలిండర్లను లోడ్ చేయవచ్చు. స్టాక్ తగ్గిపోయి, కేవలం రెండు సిలిండర్లు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, మెషిన్ స్వయంచాలకంగా సమీప గ్యాస్ ఏజెన్సీకి రీఫిల్ కోసం అలర్ట్ పంపిస్తుంది.గ్యాస్ సిలిండర్ల డెలివరీలో పారదర్శకత పెంచడానికి మరియు వినియోగదారుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ 'ఎనీ టైమ్ గ్యాస్' విధానం ఎంతగానో దోహదపడనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. -
ఇన్ఫ్రా స్పీడుకు బ్రేకులు.. పడిపోయిన వృద్ధి
న్యూఢిల్లీ: కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్ వృద్ధి ఫిబ్రవరిలో మూడు నెలల కనిష్టానికి నెమ్మదించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి క్షీణించడంతో 2.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఫిబ్రవరిలో ఇది 3.4 శాతంగా నమోదైంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తాజాగా ఫిబ్రవరిలో ఎరువులు, సిమెంటు, విద్యుదుత్పత్తి వరుసగా 3.4 శాతం, 9.3 శాతం, 0.5 శాతం మేర క్షీణించింది.అయితే బొగ్గు, ఉక్కు ఉత్పత్తి మాత్రం మెరుగ్గా నమోదైంది. ఇక ఏప్రిల్–ఫిబ్రవరి మధ్యకాలంలో ఇన్ఫ్రా వృద్ధి 2.9 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 4.4 శాతంగా నమోదైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తలెత్తడానికి ముందు నుంచే కీలక రంగాల వృద్ధి నెమ్మదించిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. -
మినీ రత్న హోదాకు దగ్గర్లో ‘ఫ్యాక్ట్’
కోచి: ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ (ఫ్యాక్ట్) మినీరత్న హోదా పొందేందుకు కావాల్సిన దాదాపు అన్ని ముఖ్యమైన నిబంధనలను పూర్తి చేసిందని కంపెనీ డైరెక్టర్ (మార్కెటింగ్) అనుపమ్ మిశ్రా ప్రకటించారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కొనసాగుతోందని.. ఇది పూర్తయితే హోదా లభిస్తుందన్నారు.ఈ హోదాతో కంపెనీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎరువులు సహా ప్రతీ రంగంలోనూ స్వావలంబన దిశగా దేశం అడుగులు వేస్తోందంటూ.. ఈ దిశగా ఫ్యాక్ట్ తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.‘‘ప్రభుత్వానికి వరుసగా మూడో ఏడాది డివిడెండ్లు చెల్లించాం. వరుసగా ఏడు సంవత్సరాల నుంచి లాభాల్లో కొనసాగుతున్నాం. ఐదేళ్లుగా కంపెనీ నికర విలువ సానుకూల స్థితిలో ఉంది. 2018–19లో కంపెనీ టర్నోవర్ రూ.18,00–1,900 కోట్లుగా ఉంటే.. నేడు రూ.5,000 కోట్లకు పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,000 కోట్లకు చేరింది’’అంటూ సంస్థ సాధించిన పురోగతిని మిశ్రా వివరించారు. -
వ్యాపారాలకు రూ.2వేల కోట్ల ప్రయోజనాలు: అమెజాన్
బెంగళూరు: దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ ప్లాట్ఫాం ద్వారా గతేడాది రూ. 2,000 కోట్ల మేర ప్రయోజనాలు పొందేందుకు దోహదపడినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బిజినెస్ వెల్లడించింది. క్యాష్బ్యాక్ రివార్డులు, బల్క్ డిస్కౌంట్లు, ఎక్స్క్లూజివ్ డీల్స్ రూపంలో అత్యంత చిన్న వ్యాపారాల నుంచి భారీ స్థాయి వ్యాపారాల వరకు వివిధ సంస్థలు లబ్ధి పొందినట్లు వివరించింది.ఐటీ, ఎలక్ట్రానిక్స్పై అదనంగా 5 శాతం మేర, ఆఫీస్లకు అవసరమయ్యే ఉత్పత్తులపై 30 శాతం వరకు బల్క్ డిస్కౌంట్లు ఉంటున్నాయని పేర్కొంది. పారదర్శకత కారణంగా అమెజాన్ బిజినెస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. సూరత్, లూధియానా, కొచ్చి తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా ఉందని సంస్థ వివరించింది. తమ కస్టమర్ బేస్లో ఇలాంటి నగరాల్లోని వ్యాపారాల వాటా ప్రస్తుతం 70 శాతానికి చేరినట్లు అమెజాన్ బిజినెస్ వివరించింది. -
మైక్రోఫైనాన్స్ సంస్థలకు కేంద్రం ఆసరా
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మైక్రోఫైనాన్స్ రంగానికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ’క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్–2.0’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంఎఫ్ఐలకు సుమారు రూ. 20 వేల కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణాల లభ్యత పెరగనుంది. ఫలితంగా అట్టడుగు వర్గాలకు చెందిన సుమారు 36 లక్షల మంది చిన్న తరహా రుణ గ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎంఎఫ్ఐలకు ఇచ్చే రుణాలకు కేంద్రం గ్యారెంటీ కలి్పస్తుంది. సంస్థల పరిమాణాన్ని బట్టి (చిన్న, మధ్య, పెద్ద) ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు 70 శాతం నుంచి 80 శాతం వరకు గ్యారెంటీ కవరేజీ లభిస్తుంది. → సామాన్యులకు వడ్డీ భారం తగ్గించేలా కేంద్రం ఇందులో కీలక నిబంధన చేర్చింది. ఎంఎఫ్ఐలు చిన్న తరహా రుణ గ్రహీతలకు ఇచ్చే వడ్డీ రేటును.. గత ఆరు నెలల సగటు వడ్డీ రేటు కంటే కనీసం 1 శాతం తక్కువకు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి వచ్చే చిన్న రుణ గ్రహీతలందరూ దీనికి అర్హులే. మైక్రోఫైనాన్స్ రంగం నిధుల లేమితో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ఈ స్కీమ్ను తీసుకొచ్చారు. 2026 జూన్ 30 వరకు లేదా రూ.20 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ పూర్తయ్యే వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యారంటీ స్కీమును మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఎంఎఫ్ఐఎన్ స్వాగతించింది. సవాళ్లెదుర్కొంటున్న తమ రంగానికి తోడ్పాటునిచ్చేలా సకాలంలో తీసుకున్న సరైన చర్యగా అభివరి్ణంచింది. → మరోవైపు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎగుమతిదారులకు మరింత మద్దతునిచ్చేలా మ్యుచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (ఎంసీజీఎస్–ఎంఎస్ఎంఈ)లో సవరణలు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సరీ్వసుల రంగాన్ని కూడా ఇందులో చేర్చినట్లు పేర్కొంది. -
సెమాగ్లూటైడ్ జనరిక్స్ వెల్లువ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైప్–2 మధుమేహం, ఊబకాయం నియంత్రణకు ఉపయోగించే సెమాగ్లూటైడ్ ఔషధం పేటెంట్ దేశీయంగా ముగియడంతో దేశీ ఫార్మా దిగ్గజాలు పెద్ద ఎత్తున చౌక జనరిక్ వెర్షన్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. దీనితో వీటి ధరలు గణనీయంగా దిగి వచ్చాయి. జనరిక్ వెర్షన్ను ఆవిష్కరించిన దిగ్గజాల్లో డాక్టర్ రెడ్డీస్, నాట్కో, సన్ ఫార్మా, గ్లెన్మార్క్ మొదలైనవి ఉన్నాయి. ఇన్నోవేటర్ హోదాలో డెన్మార్క్కి చెందిన నోవో నార్డిస్క్ సంస్థ .. సెమాగ్లుటైడ్ మాలిక్యూల్తో తయారు చేసిన ఔషధాన్ని ఒజెంపిక్, వెగోవీ బ్రాండ్స్ పేరిట విక్రయిస్తోంది. నెలకు సరిపడే డోసేజీలకు సంబంధించి వీటి వ్యయాల పరిమాణం .. డోసేజీ, దశను బట్టి రూ. 8,800 నుంచి రూ. 11,175 వరకు ఉంటోంది. తాజాగా జనరిక్ వెర్షన్ల రాకతో ధరలు దాదాపు 80 శాతం వరకు దిగి వచి్చనట్లవుతుంది. మల్టీ–డోస్ వయల్స్, ప్రీ–ఫిల్డ్ పెన్ డివైజ్ల రూపంలో ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ఔషధం ఒకటే అయినప్పటికీ ప్యాకేజింగ్, తయారీ విధానం, సౌకర్యం కారణంగా ప్రీ–ఫిల్డ్ పెన్ల ధర వయల్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది. → డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సంస్థ ఒబెదా బ్రాండ్ పేరిట వారానికి ఒకసారి తీసుకునే సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ని ప్రీ–ఫిల్డ్, డిస్పోజబుల్ పెన్ రూపంలో ప్రవేశపెట్టింది. కనీసం నాలుగు వారాలకు సరిపడేలా 2ఎంజీ, 4 ఎంజీ డోసుల్లో ఇది లభిస్తుంది. నెలవారీ వ్యయం రూ. 4,200గా ఉంటుందని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. దీన్ని ఇతర దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో యూఎస్వీ సంస్థ యుసెమా బ్రాండ్ పేరిట ఇంజెక్షన్ని ఆవిష్కరించింది. → మరోవైపు, నాట్కో ఫార్మా సంస్థ మల్టీ–డోస్ వయల్స్ని సెమానాట్, సెమాఫుల్ పేరిట ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. వీటి నెలవారీ వ్యయం రూ. 1,290–1,750 శ్రేణిలో ఉంటుంది. అలాగే రూ. 4,000 నుంచి రూ. 4,500 వరకు నెలవారీ వ్యయం ఉండే పెన్ డివైజ్ని వచ్చే నెలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఇక సెమాగ్లుటైడ్ జనరిక్ వెర్షన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు నాట్కో ఫార్మాతో ఒప్పందం ఉన్న ఎరిస్ లైఫ్ సైన్సెస్.. దీన్ని ’సండే’ పేరిట ప్రవేశపెట్టింది. అటు టోరెంట్ ఫార్మా సంస్థ సెంబాలిక్, సెమాలిక్స్ బ్రాండ్స్ పేరిట ఆవిష్కరించింది. ఇతర సంస్థల వివరాలిలా.. సన్ ఫార్మా: నావెల్ట్రీట్, సెమాట్రినిటీ బ్రాండ్స్ కింద ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. నావెల్ట్రీట్ 0.25 ఎంజీ నుంచి 2.4 ఎంజీ వరకు అయిదు డోసేజీల్లో లభిస్తుంది. వారంవారీ వ్యయం సుమారు రూ. 900 నుంచి రూ. 2,000 వరకు ఉంటుంది. ఇక సెమాట్రినిటీ వ్యయం రూ. 750 నుంచి రూ. 1,300 వరకు ఉంటుంది. గ్లెన్మార్క్: గ్లిపిక్ పేరిట ఇంజెక్షన్ని ప్రవేశపెట్టింది. వయల్స్ వ్యయం వారంవారీగా రూ. 325 నుంచి రూ. 440 వరకు ఉంటుంది. పెన్ల రూపంలో కూడా ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. జైడస్ లైఫ్సైన్సెస్: సెమాగ్లిన్టీఎం, మాషెమాటీఎం, ఆల్టర్మెట్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిష్కరించింది. సగటున నెలవారీ వ్యయం రూ. 2,200గా ఉంటుంది. ఆల్కెమ్ ల్యాబ్స్: సెమాసైజ్, ఒబీసిమా, హెపాగ్లైడ్ బ్రాండ్స్ పేరిట ఇంజెక్షన్లను ఆవిషఅకరించింది. ప్రీ–ఫిల్డ్ డిస్పోజబుల్ ఇంజెక్షన్ పెన్ నెలకు నాలుగు డోసుల కింద లభిస్తుంది. వారం వారీ వ్యయం సుమారు రూ. 450 నుంచి, నెలవారీ వ్యయం రూ. 1,800 నుంచి ప్రారంభమవుతుంది. రీయూజబుల్ పెన్ రూపంలో కూడా లభిస్తుంది. -
చౌకగా సెమాగ్లూటైడ్.. దిగ్గజ కంపెనీల లాంచ్!
భారతదేశంలో డయాబెటిస్ (షుగర్) చికిత్సలో కొత్త మార్పులకు నాంది పలుకుతూ.. ప్రముఖ ఔషధ సంస్థలు గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, జైడస్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ 'సెమాగ్లూటైడ్' (Semaglutide) ఆధారిత కొత్త మందులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. సెమాగ్లూటైడ్ ఔషధానికి భారతదేశంలో పేటెంట్ గడువు ముగిసిన వెంటనే ఈ కంపెనీలు తక్కువ ధరలతో జనరిక్ వేరియంట్లను విడుదల చేశాయి.టైప్-2 డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) చికిత్సలో కీలకంగా భావించే GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) థెరపీని మరింత చౌకగా, సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ కంపెనీలు ఈ ఉత్పత్తులు ప్రవేశపెట్టాయి. పెరుగుతున్న డయాబెటిస్ భారాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త లాంచ్లు దేశవ్యాప్తంగా రోగులకు మెరుగైన, అందుబాటు వైద్య సేవలను అందించనున్నాయి.మనదేశంలో డయాబెటిస్, ఊబకాయం (ఒబేసిటీ) ప్రస్తుతం అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. GLP-1 ఆధారిత చికిత్సలు ఈ పెరుగుతున్న ప్రజారోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (DCGI) ప్రకారం.. దేశంలో సుమారు 8.9 కోట్ల మంది పెద్దలు డయాబెటిస్తో బాధపడుతున్నారు, ఇది మొత్తం వయోజన జనాభాలో 10.5 శాతంగా ఉంది. ఊబకాయం దాదాపు అన్ని వయసుల వారిలో వేగంగా పెరుగుతోంది. పెద్దల్లో మహిళల్లో ఊబకాయం శాతం 12.6% నుంచి 24.0%కి, పురుషుల్లో 9.3% నుంచి 22.9%కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.సెమాగ్లుటైడ్ వంటి GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) మందులు బరువు తగ్గడంతో కూడా సహాయపడతాయి. ఇవి మెదడుకు కడుపు నిండినట్లు సంకేతాలు పంపి, జీర్ణక్రియను నెమ్మదింపజేసే ఒక సహజ హార్మోన్ను అనుకరించడం ద్వారా పనిచేస్తాయి. తద్వారా తక్కువ తింటారు.. క్రమంగా బరువు తగ్గడం జరుగుతుంది.ఇవి తక్కువ తినడానికి మరియు మరింత సమర్థవంతంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆవిష్కర్త అయిన నోవో నార్డిస్క్, 20 మార్చి 2026న పేటెంట్ ప్రత్యేకతను కోల్పోకముందే, ప్రారంభ మార్కెట్ వాటాను చేజిక్కించుకునే ప్రయత్నంలో, గత సంవత్సరం భారతదేశంలో తన సెమాగ్లుటైడ్ బ్రాండ్లైన వెగోవి మరియు ఓజెంపిక్లను విడుదల చేసింది. -
రూ.47 లక్షల జాబ్ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!
పోటీ ప్రపంచంలో లక్షల జీతం లభించే జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ.. తాను ఎంపికైన ఉద్యోగానికి కావలసిన నైపుణ్యం తన దగ్గర లేదని ఒక టెకీ రూ.47 లక్షల వేతనం లభించే ఉద్యోగాన్ని వదులుకున్నారు. దీనికి సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వనేష్ మాలి అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. తనకు పూణేలో ఒక మంచి కంపెనీలు సీనియర్ ఉద్యోగానికి రూ.47 లక్షల వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొన్నారు. ప్యాకేజీ బాగుంది, కంపెనీ కూడా గొప్పదే, కానీ ఆ పదవికి అవసరమైన నైపుణ్యాలు నాకు ఇంకా పూర్తిగా లేవని.. తాను ప్రస్తుతం ఆ స్థాయిలో పని చేయడానికి సిద్ధంగా లేనని, ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆ ఆఫర్ను అంగీకరించి, ఉద్యోగంలోనే అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవాల్సిందని అన్నారు. కాగా మరికొందరు అతని నిజాయితీని ప్రశంసించారు. అలాంటి జాబ్ ఆఫర్ వదులుకోవడానికి ధైర్యం కావాలని మరికొందరు అన్నారు.Career Update:I recently got a fantastic job offer of Rs. 47 LPA in Pune for a senior role.The package was good and the company was great, but the position demanded skills I don’t fully possess yet.I politely rejected the offer, explaining that I am not ready to deliver at…— Vanesh Mali (@vaneshmali) March 20, 2026 -
ఆయిల్పై అమెరికా అంచనా.. ఇరాన్ క్లారిటీ
అంతర్జాతీయ చమురు విఫణిలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ షాక్ ఇచ్చింది. తమ వద్ద అంతర్జాతీయ సరఫరాకు సరిపడా అదనపు ముడి చమురు నిల్వలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతుందని, తద్వారా ధరలు తగ్గుతాయని అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది.అమెరికా ప్రకటన - ఇరాన్ వివరణమార్చి 20 నాటికి నౌకల్లో లోడ్ చేసిన ముడి చమురుపై అమెరికా ఇటీవల స్వల్పకాలిక ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 19 వరకు అమల్లో ఉండే ఈ మినహాయింపు ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందని, తద్వారా పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేయవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటన ఈ అంచనాలను తలకిందులు చేసింది. "ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి ఇరాన్ వద్ద అదనపు ముడి చమురు లేదా మిగులు నిల్వలు లేవు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యలు కేవలం కొనుగోలుదారులలో భరోసా నింపడానికి, మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తున్నాయి."మంటలు పుట్టిస్తున్న ముడి చమురు ధరలుపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా సాగే రవాణాపై ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 120 డాలర్ల మార్కును తాకింది. ఈ తరుణంలో ఇరాన్ నుండి అదనపు సరఫరా ఉండదని తెలియడంతో మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్బీఐకి ఐటీ శాఖ భారీ ట్యాక్స్ నోటీసు..
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ఆదాయపు పన్ను శాఖ నుండి భారీ నోటీసు అందింది. వడ్డీతో కలిపి మొత్తం రూ. 6,337.5 కోట్ల మేర పన్ను చెల్లించాలని ఐటీ శాఖ డిమాండ్ నోటీసు జారీ చేసింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత ఎస్బీఐ ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.అసలు ఏం జరిగింది?ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 143(3), 144సి(3), 144బి కింద ఐటీ శాఖ మార్చి 19న ఈ ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి (AY24) సంబంధించి నిర్వహించిన స్క్రూటినీ అసెస్మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ పన్ను డిమాండ్ ఉత్పన్నమైందని బ్యాంక్ తెలిపింది. వివిధ అంశాల్లో ఆదాయపు పన్ను శాఖ చేసిన కోతలే (Disallowances) ఈ భారీ మొత్తానికి కారణమని తెలుస్తోంది.సెబీ (SEBI) నిబంధనల ప్రకారం, కంపెనీ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపే ఏవైనా ప్రధాన పరిణామాలు చోటుచేసుకుంటే వాటిని స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ పన్ను డిమాండ్ మొత్తం 'మెటీరియాలిటీ థ్రెషోల్డ్' (నిర్ణీత పరిమితి) కంటే ఎక్కువగా ఉన్నందున, పారదర్శకత, కార్పొరేట్ గవర్నెన్స్లో భాగంగా ఎస్బీఐ ఈ వివరాలను బహిర్గతం చేసింది.ఎస్బీఐ తదుపరి చర్యలుఈ నోటీసుపై ఎస్బీఐ ధీమాగా ఉంది. గడిచిన కొన్నేళ్లుగా ఇలాంటి అంశాలపైనే బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోందని, తాజా నోటీసును కూడా అప్పీలేట్ అధికారుల ముందు సవాలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ పన్ను నోటీసు వల్ల బ్యాంక్ రోజువారీ కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణపై ఎటువంటి ప్రభావం ఉండదని ఎస్బీఐ యాజమాన్యం పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. -
నాడు జుకర్బర్గ్.. నేడు మన సూర్య
ఒకప్పుడు 'ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్' అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్. దాదాపు 18 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును ఇప్పుడు ఒక భారత సంతతి యువకుడు తిరగరాశాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే అపర కుబేరుడిగా అవతరించి, ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు మన సూర్య మిధా.18 ఏళ్ల రికార్డు బ్రేక్గతంలో మార్క్ జుకర్బర్గ్ తన 23వ ఏట బిలియనీర్ హోదాను అందుకుని రికార్డు సృష్టించారు. అయితే, సూర్య మిధా అంతకంటే ఒక ఏడాది ముందే, అంటే 22 ఏళ్లకే 2.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 18,000 కోట్లు) నెట్వర్త్తో జుకర్బర్గ్ను అధిగమించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ సూర్యనే!విజయానికి బాట వేసిన 'మెర్కోర్'సూర్య సాధించిన ఈ అసాధారణ విజయానికి మూలం ఆయన స్థాపించిన 'మెర్కోర్' అనే ఏఐ (AI) స్టార్టప్. 2023లో తన స్నేహితులు బ్రెండన్ ఫుడీ, ఆదర్శ్ హిరేమత్లతో కలిసి ఆయన ఈ సంస్థను ప్రారంభించారు.మెర్కోర్ అనేది ఒక కృత్రిమ మేధ (AI) ఆధారిత రిక్రూట్మెంట్ ప్లాట్ఫారమ్. కంపెనీలకు కావాల్సిన సరైన ప్రతిభావంతులను గుర్తించేందుకు ఇది 'AI అవతార్'లను ఉపయోగిస్తుంది. దరఖాస్తుదారులను నేరుగా ఇంటర్వ్యూ చేయడం ద్వారా నియామక ప్రక్రియను ఈ ప్లాట్ఫారమ్ సులభతరం చేస్తుంది.2025 అక్టోబర్ లో జరిగిన 'సిరీస్-సి' ఫండింగ్లో ఈ సంస్థ ఏకంగా 350 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ప్రస్తుతం ఈ సంస్థలో బ్రెండన్ ఫుడీ సీఈవోగా, ఆదర్శ్ హిరేమత్ సీటీవోగా వ్యవహరిస్తుండగా, సూర్య మిధా బోర్డు ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఢిల్లీ టూ కాలిఫోర్నియా..సూర్య మిధా మూలాలు భారతదేశంలోని ఢిల్లీలో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లి కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. మౌంటైన్ వ్యూలో జన్మించిన సూర్య, జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో విదేశీ వ్యవహారాల అంశంపై విద్యనభ్యసించారు. సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న మక్కువతో, స్నేహితులతో కలిసి ప్రారంభించిన స్టార్టప్ నేడు ఆయనను ప్రపంచ కుబేరుల జాబితాలో నిలబెట్టింది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారుల తొలగింపు
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ వేటు వేసింది. ఎన్నారై (NRI) క్లయింట్లకు 'క్రెడిట్ సూయిస్ AT-1' బాండ్లను తప్పుదోవ పట్టించి విక్రయించినట్లు తేలడంతో బ్యాంక్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరోవైపు బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి ఆకస్మిక రాజీనామాతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు 2.4% మేర పతనమయ్యాయి.వేటు పడిన అధికారులు వీరే..దుబాయ్ బ్రాంచ్ ద్వారా జరిగిన ఈ బాండ్ల విక్రయ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు ఉన్నతాధికారులను బ్యాంక్ విధుల నుంచి తొలగించింది. వారిలో బ్రాంచ్ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ సంపత్ కుమార్, ఈవీపీ (మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా & ఎన్నారై బిజినెస్) హర్ష్ గుప్తా, ఎస్వీపీ స్థాయి అధికారి పాయల్ మంధ్యాన్ ఉన్నారు.అసలేం జరిగింది?జనవరి 2025లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై బ్యాంక్ అంతర్గత విచారణ చేపట్టింది. దుబాయ్, బహ్రెయిన్ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బంది, భారత ఎన్నారై క్లయింట్లను తప్పుదోవ పట్టించి అధిక రిస్క్ ఉన్న AT-1 బాండ్లను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.క్లయింట్ల వద్ద ఉన్న ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లను ఈ బాండ్లలోకి మళ్లించేలా ఒత్తిడి తెచ్చారు. ఈ బాండ్లను సురక్షితమైన 'ఫిక్స్డ్ మెచ్యూరిటీ' ఉత్పత్తులుగా ప్రచారం చేశారు. పెట్టుబడిదారుల నుంచి ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకున్నారని, బాండ్లలోని రిస్క్ అంశాలను వారికి వివరించకుండా దాచిపెట్టారని విచారణలో తేలింది.రెగ్యులేటరీ చర్యలు - భారీ నష్టంక్రెడిట్ సూయిస్ బ్యాంక్ పతనం తర్వాత, యూబీఎస్ (UBS) నేతృత్వంలో జరిగిన బెయిలౌట్ సమయంలో ఈ AT-1 బాండ్ల విలువ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. ఎన్నారైల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా నిషేధం విధించింది.బ్యాంక్ వివరణ"మా యూఏఈ బ్రాంచ్లో క్లయింట్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియలో కొన్ని లోపాలను గుర్తించాం. అంతర్గత విచారణ అనంతరం నిబంధనల ప్రకారం బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం" అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.ఏమిటీ AT-1 బాండ్లు?ఇవి ఈక్విటీ లక్షణాలున్న రుణ సాధనాలు. ఇందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటే లేదా దివాలా తీస్తే, ఈ బాండ్లలో పెట్టిన పెట్టుబడిని తిరిగి చెల్లించాల్సిన అవసరం బ్యాంకులకు ఉండదు. -
టెక్నాలజీలో ముందుకు.. ఆలోచనల్లో వెనక్కి?
టెక్నాలజీతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ ఆలోచనల విషయంలో మాత్రం యువత వెనక్కి వెళ్తోందని తాజా అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. జెన్ జెడ్ యువకుల్లో దాదాపు 31% మంది ‘భార్య ఎల్లప్పుడూ భర్తకు లోబడి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఒక అంతర్జాతీయ సర్వే చెబుతోంది.➤న్యూ గ్లోబల్ సర్వే ప్రకారం 33% మంది యువకులు ముఖ్యమైన నిర్ణయాలలో తమదే తుది నిర్ణయం కావాలని భావిస్తున్నారు. ➤భారతదేశంతో సహా గ్రేట్ బ్రిటన్, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి 29 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. ➤నేటి యువకులు జెండర్ రోల్స్కు సంబంధించి సంప్రదాయ అభిప్రాయాలను కలిగి ఉండే అవకాశం ఉందని తెలియజేస్తోంది న్యూ గ్లోబల్ సర్వే.➤జెన్ జెడ్ యువకులు బేబీ బూమర్ల కంటే వివాహానికి సంబంధించి సంప్రదాయ ఆలోచనలతో ఉన్నారు.➤కెరీర్లో రాణిస్తున్న మహిళలను ఇష్టపడుతున్న యువకులు 41 శాతం మంది ఉన్నారు. జెన్ జడ్ యువకులు తమ భాగస్వామి బాగా సంపాదించాలని కోరుకుంటున్నప్పటికీ తమ అదుపు, ఆజ్ఞలలో ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ➤పిల్లల సంరక్షణ, ఇంటి పనులకు మహిళలే ప్రధాన బాధ్యత వహించాలని అంటున్నారు యువకుల్లో 35 శాతం మంది. ➤బేబీ బూమర్స్ (13%) కంటే ఈతరం యువకులే (31%) రెట్టింపు స్థాయిలో సంప్రదాయ భావాలను కలిగి ఉన్నారు. -
ఫ్లిప్కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా
పబ్లిక్ లిస్టింగ్కు ముందు, ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ (సీఎఫ్ఓ) ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. తదుపరి సీఎఫ్ఓ నియామకం వరకు.. రవి అయ్యర్ ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది.''శ్రీరామ్ నాయకత్వ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటూ.. ఇన్నేళ్లుగా సంస్థ ఆర్థికంగా ముందుకు సాగడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాము'' అని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్లో ఫ్లిప్కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేసింది. -
ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును మరోసారి పెంచింది. ఒక్కో ఆర్డర్కు ప్లాట్ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.చివరిసారిగా ప్లాట్ఫామ్ పీజుల పెంపును కంపెనీ సెప్టెంబర్ 2025లో చేపట్టింది. జొమాటో ఫుడ్ డెలివరీకి.. పోటీదారు అయిన స్విగ్గీ ప్రస్తుతం ఒక్కో ఆర్డర్కు 14.99 రూపాయలు వసూలు చేస్తోంది. ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందిఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ రంగంలో కొత్త పోటీదారులు పుట్టుకొస్తున్నారు. ఇందులో భాగంగానే.. అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన రాపిడో, ఇటీవల బెంగళూరులో 'ఓన్లీ' అనే తన ఫుడ్ డెలివరీ సర్వీస్ను ప్రారంభించింది. డెలివరీ ఫీజు మినహా, కస్టమర్ల నుంచి గానీ, రెస్టారెంట్ల నుండి గానీ ఎలాంటి అదనపు రుసుములను వసూలు చేయబోమని ఆ కంపెనీ తెలిపింది.ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై కంపెనీలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో రాపిడో తీసుకున్న ఈ చర్య ఇప్పటికే ఉన్న సంస్థలపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాగా.. ప్లాట్ఫామ్ ఫీజుల పెంపుకు సంబంధించిన ప్రకటన తరువాత.. ఎటర్నల్ షేర్లు దాదాపు 2% పెరిగి ఒక్కో షేరు రూ. 233 వద్ద ముగిశాయి. -
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
భారత్లో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ .2 పెంచింది. సవరించిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఈ పెంపు వెనుక ఎటువంటి కారణాన్ని పేర్కొననప్పటికీ, కొనసాగుతున్న ఇరాన్-యుఎస్ వివాదం మధ్య ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్స్ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.ఇక హైదరాబాద్లో ఈ ధరలు కనిష్ఠంగా రూ.2.26 మేర పెరిగినట్లు పెట్రోల్ డీలర్స్ చెబుతున్నారు. అయితే.. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని వెల్లడించారు.సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు..సాధారణ పెట్రోల్ వాడే సామాన్యులకు మాత్రం ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది. హెచ్పీసీఎల్ సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాకుండా, చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. "అదనపు సరకు రవాణా ఇప్పటికే మార్గంలో ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దు" అని హెచ్పీసీఎల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేసింది.ఏమిటీ ప్రీమియం పెట్రోల్?ప్రీమియం పెట్రోల్ను ‘హై-ఆక్టేన్ ఫ్యూయల్’ లేదా ‘పవర్ పెట్రోల్’ అని పిలుస్తారు. ఇది సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వాడతారు. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మైలేజీని కూడా పెంచుతుంది. ఈ ధరల పెంపు ప్రధానంగా లగ్జరీ వాహన యజమానులపై, సంపన్న వర్గాలపైనే ప్రభావం చూపనుంది.డీజిల్ ధర కూడా పెంపు హెపీసీఎల్ను అనుసరిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) కూడా బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర.. తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.రవాణా ఛార్జీలు పెరిగే అవకాశంబల్క్ డీజిల్ ధరల పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇది లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు.వచ్చేవారం పెట్రోల్ మోత?పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నా.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ.. వచ్చేవారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే.. -
క్లౌడ్ఫ్లేర్ సీఈఓ హెచ్చరిక!.. 2027 నాటికి..
ఆటోమేటెడ్ ఆన్లైన్ కార్యకలాపాలలో జనరేటివ్ ఏఐ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నందున, 2027 నాటికి ఏఐ-ఆధారిత బాట్ ట్రాఫిక్.. మానవ ఇంటర్నెట్ వినియోగాన్ని మించిపోయే అవకాశం ఉందని క్లౌడ్ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ హెచ్చరించారు. ఆస్టిన్లోని SXSW సదస్సులో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించారు.AI-ఆధారిత ఏజెంట్లు మనుషుల కంటే చాలా ఎక్కువ వెబ్సైట్లను సందర్శించగలవని మాథ్యూ వివరించారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను తనిఖీ చేస్తారు. కానీ ఒక AI వ్యవస్థ సమాచారాన్ని సేకరించడానికి వేలాది పేజీలను స్కాన్ చేయగలదు. ఇది వెబ్ ట్రాఫిక్లో తీవ్రమైన పెరుగుదలకు దారితీస్తుంది. అంతే కాకుండా.. ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.బాట్స్ అంటేబాట్స్ అనేవి స్వయంచాలకంగా పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఇవి మనుషుల సహాయం లేకుండా వెబ్సైట్లు సందర్శించడం, డేటాను సేకరించడం వంటి పనులు చేస్తాయి. గతంలో కూడా బాట్స్ ఉండేవి, కానీ వాటిలో చాలా భాగం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లకు సంబంధించినవి. ఉదాహరణకు గూగుల్ ఉపయోగించే క్రాలర్లు వెబ్సైట్లను స్కాన్ చేసి సమాచారం సేకరించేవి. అలాగే కొన్ని బాట్స్ దుష్ట కార్యకలాపాలకు కూడా ఉపయోగించేవారు.కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరేటివ్ AI రాకతో, బాట్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను మాత్రమే చూస్తాడు. అయితే AI ఆధారిత బాట్ మాత్రం వేలాది వెబ్సైట్లను స్కాన్ చేసి, పూర్తి సమాచారం సేకరిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ అనూహ్యంగా పెరుగుతోంది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!ఈ పెరుగుతున్న ట్రాఫిక్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది. మరిన్ని డేటా సెంటర్లు, శక్తివంతమైన సర్వర్లు అవసరం అవుతున్నాయి. గతంలో COVID-19 సమయంలో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అప్పుడు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫార్మ్లను ఎక్కువగా ఉపయోగించారు. అయితే ఆ పెరుగుదల తాత్కాలికం. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పెరుగుదల మాత్రం నిరంతరంగా కొనసాగుతుందని మాథ్యూ చెప్పారు. -
మహిళల కోసం ఎస్బీఐ సెక్యూరిటీస్ కొత్త ఫీచర్
భారతీయ మహిళలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ సంపద సృష్టిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్బీఐ సెక్యూరిటీస్ తన మొబైల్ అప్లికేషన్లో ‘ఉమెన్స్ మోడ్’ అనే సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. మహిళా పెట్టుబడిదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్లాట్ఫారమ్ ఎకానమీ మార్కెట్లో వారి భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయనుంది.6,000 మంది మహిళల అభిప్రాయాలతో..ఏదో ఒక ఫీచర్ను మొక్కుబడిగా ప్రవేశపెట్టడం కాకుండా క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఎస్బీఐ సెక్యూరిటీస్ విస్తృతమైన కసరత్తు చేసిందని అధికారులు చెప్పారు. సుమారు 6,000 మందికి పైగా మహిళా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ ‘ఉమెన్స్ మోడ్’ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సంక్లిష్టంగా ఉండే పెట్టుబడి ప్రక్రియను సరళతరం చేయడం ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.ఈ ఫీచర్ ప్రత్యేకతలుఈ ఫీచర్తో ఈక్విటీ మార్కెట్లో ఎడ్యుకేషన్, పదవీ విరమణ లేదా సొంత ఇల్లు వంటి వ్యక్తిగత ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. మార్కెట్ జార్గన్ (క్లిష్ట పదజాలం) తగ్గించి సులభమైన రీతిలో సమాచారాన్ని అందిస్తుంది. ఇన్వెస్టర్ల అనుభవం, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగతీకరించిన పెట్టుబడి మార్గాలను సూచిస్తుంది.ఎస్బీఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో భువనేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఇప్పుడు ఆర్థిక నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ‘మహిళల ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కారాలను రూపొందించాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలపై ఉంది. మహిళలకు సాధికారత కల్పించి వారిలో నమ్మకాన్ని నింపే ఉమెన్స్ మోడ్ను ప్రారంభించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ముంబై ఈస్ట్ కమిషనరేట్కు చెందిన సీజీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఏకంగా రూ.769 కోట్ల డిమాండ్ నోటీసులను జారీ చేశారు.డిమాండ్ మొత్తం రూ.384,33,53,972 (సుమారు రూ.384 కోట్లు)గా ఉన్నా పెనాల్టీ రూపంలో పన్ను మొత్తంతో పాటు దానికి సమానమైన జరిమానా, వడ్డీని కూడా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో మొత్తంగా రూ.769 కోట్లు అయింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 లోని సెక్షన్ 74 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.వివాదం నేపథ్యం ఏమిటి?సాధారణంగా బ్యాంకులు తమ వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, ఈ ఉచిత సేవలకు కూడా ప్రతిఫలం ఉంటుందని, దానిపై పన్ను చెల్లించాలని జీఎస్టీ విభాగం వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా షోకాజ్ నోటీసులు అందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ‘గతంలోనూ ఇలాంటి అంశాలపై బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే ప్రస్తుత డిమాండ్ మొత్తం పరిమితిని మించి ఉన్నందున నిబంధనల ప్రకారం దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదిస్తున్నాం’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.తదుపరి కార్యాచరణఈ నోటీసులపై ఐసీఐసీఐ బ్యాంక్ వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత గడువులోగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక వ్యవహారంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
విమాన ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. పారదర్శకతను పెంచడం, ప్రయాణీకుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలను విడుదల చేసింది.ఖర్చు లేకుండా సీట్ల కేటాయింపుప్రస్తుతం చాలా విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ లేదా టికెట్ బుకింగ్ సమయంలో ‘ప్రిఫర్డ్ సీట్’ పేరుతో ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు టికెట్ ధర కంటే ఈ ఫీజుకే ఎక్కువే చెల్లించాల్సి వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి విమానంలో 60 శాతం సీట్లు కచ్చితంగా ఉచిత ఎంపిక కేటగిరీలో ఉండాలి. ఒకే పీఎన్ఆర్పై టికెట్ బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కలిసి కూర్చునేలా విమానయాన సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పక్కపక్క సీట్ల కోసం అదనంగా చెల్లించే అవసరం తప్పుతుంది.బ్యాగేజీపై డీజీసీఏ సూచించిన స్పష్టమైన విధానాలుస్పోర్ట్స్ కిట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు తీసుకెళ్లడంపై స్పష్టమైన, సులభతరమైన నిబంధనలు ఉండాలి.విమానాల్లో పెంపుడు జంతువుల రవాణాపై ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ విమానయాన సంస్థలు తమ వెబ్సైట్లలో కచ్చితమైన పాలసీని ప్రదర్శించాలి.ప్రయాణికుల హక్కులు, విమాన ఆలస్యం లేదా రద్దు సమయంలో లభించే పరిహారం గురించి వెబ్సైట్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.భారత విమానయాన రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్గా ఎదుగుతోంది. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న తరుణంలో ప్రయాణికుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భారీ కుదుపు..
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.అసలేం జరిగింది?మార్చి 17న పంపిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు."నేను బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు. కానీ నా వ్యక్తిగత భావజాలం, సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు ఒకేలా లేవు. అందుకే తప్పుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.ఆర్థిక శాఖ మాజీ బ్యూరోక్రాట్ అయిన చక్రవర్తి, 2021లో బోర్డులో చేరారు. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో విలీనం వంటి కీలక ప్రక్రియలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.మార్కెట్లో ప్రకంపనలుచక్రవర్తి నిష్క్రమణ వార్త బయటకు రాగానే మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ప్రారంభ ట్రేడింగ్లోనే షేరు ధర 9 శాతం మేర పడిపోయి రూ.770 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల పతనం కారణంగా బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50 వందల పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని, క్రితం ముగింపుతో పోలిస్తే 3.8 శాతం నష్టంతో రూ.810.80 వద్ద స్థిరపడింది.రంగంలోకి దిగిన ఆర్బీఐపరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే రంగంలోకి దిగింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ వెటరన్ కేకీ మిస్త్రీని మార్చి 19 నుండి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్గా నియమించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని కేకీ మిస్త్రీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, దాని వద్ద తగినంత మూలధనం, నగదు లభ్యత ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. మేనేజ్మెంట్ తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు -
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) నిధుల మళ్లింపు కేసులో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన రూ.2929.05 కోట్ల బ్యాంకు మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది.నిధుల మళ్లింపుపైనే ప్రధాన దృష్టితెల్లవారుజామునే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని ఆర్కామ్కు కేటాయించిన రుణాల వినియోగంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కంపెనీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే ఆరోపణలున్నాయి. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అనిల్ అంబానీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 19, 20 తేదీల్లో ఆయన దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరు అవుతున్నారు.ముగిసిన ‘జై అన్మోల్’ విచారణఇదే క్రమంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని కూడా సీబీఐ వదిలిపెట్టలేదు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)లో జరిగిన రూ.228.06 కోట్ల ఆర్థిక అవకతవకలపై గత వారం (మార్చి 14, 2026) ఆయన్ను అధికారులు విచారించారు. ‘చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అనిల్ అంబానీ కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ విచారణకు హాజరవుతున్నారు’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి చెప్పారు.ఈ కేసులో మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, రిలయన్స్ గ్రూప్ మాజీ ఉన్నతాధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే జై అన్మోల్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సంస్థ పాలనా విషయాల్లో ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది.గందరగోళానికి తెరదించిన ఆర్బీఐహెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆర్బీఐ, బ్యాంక్ మేనేజ్మెంట్ కోరిన విధంగా పరివర్తన ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పటిష్టతపై ఆర్బీఐ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ ఆర్థిక ప్రమాణాలు, సమర్థవంతమైన మేనేజ్మెంట్ బృందాన్ని కలిగి ఉంది. మా అంచనాల ప్రకారం ఈ బ్యాంక్ నిర్వహణ లేదా పాలనలో ఎటువంటి భౌతిక పరమైన లోపాలు లేవు’ అని ఆర్బీఐ పేర్కొంది.తాత్కాలిక సారథిగా కేకీ మిస్త్రీఅతాను చక్రవర్తి నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేకీ మిస్త్రీని మార్చి 19 నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక పార్ట్-టైమ్ ఛైర్మన్గా నియమించేందుకు ఆర్బీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.కేకీ మిస్త్రీగురువారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో కేకీ మిస్త్రీ మాట్లాడుతూ, బ్యాంక్ పనితీరులో ఎటువంటి లోపాలు లేవని పునరుద్ఘాటించారు. ‘మా అంతర్గత చర్చల్లో కానీ, మా దృష్టికి వచ్చిన అంశాల్లో కానీ ఎటువంటి కార్యాచరణ లోపాలు లేవు. హైలైట్ చేయాల్సిన ప్రత్యేక సమస్యలేవీ ప్రస్తుతానికి లేవు’ అని ఆయన స్పష్టం చేశారు.అతాను చక్రవర్తి నిష్క్రమణ వెనుక..మే 2021లో బోర్డులో చేరిన అతాను చక్రవర్తి మార్చి 17న తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవని ఆయన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు మినహా ఇతర కారణాలేవీ లేవని బ్యాంక్ యాజమాన్యం ధ్రువీకరించింది. చక్రవర్తి హయాంలోనే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో బ్యాంక్ విలీనం వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సిరామిక్ టైల్స్పై యుద్ధం ఎఫెక్ట్
దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధం ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో పరిశ్రమ ఆదాయం 1–2 శాతంస్థాయిలో నీరసించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వరుసగా రెండో ఏడాది ఆదాయంలో క్షీణత నమోదుకానున్నట్లు తెలియజేసింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా సిరామిక్ టైల్స్ ఉత్పత్తి, ఎగుమతులు, సరఫరాలకు విఘాతం కలగనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 53,000 కోట్ల విలువైన దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై యుద్ధం రెండు విధాల ప్రభావం చూపనున్నట్లు వివరించింది.మధ్యప్రాచ్య దేశాలకు లాజిస్టిక్స్పరంగా సవాళ్లు ఎదురవుతుండటంతో సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంకావడంతోపాటు ఎగుమతులు దెబ్బతినే వీలున్నట్లు క్రిసిల్ పేర్కొంది. సిరామిక్ టైల్స్ ఆదాయంలో ప్రధానంగా ఎగుమతులు 40 శాతం వాటా ఆక్రమిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా 15 శాతంగా తెలియజేసింది. హార్ముజ్ ద్వారా జల రవాణాకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ఎగుమతుల ఆదాయం 6–7 శాతం క్షీణించనున్నట్లు అంచనా వేసింది. డెలివరీలు నిలిచిపోవడంతోపాటు.. బీమా వ్యయాలు పెరిగిపోనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు చేపట్టే ఎగుమతి వ్యయాలు సైతం పెరగనున్నట్లు వెల్లడించింది.ఎల్ఎన్జీ సెగతయారీ వ్యయాల్లో 35 శాతం వాటా ఆక్రమించే కీలక ముడిసరుకులు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ), ప్రొపేన్ సరఫరాలు తగ్గడంతో దేశీయంగా పలు సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీల కార్యకలాపాలు మూతపడటం లేదా ఉత్పత్తి నిలిచిపోవడం లేదా ఉత్పత్తిలో భారీ క్షీణతకు అవకాశమున్నట్లు క్రిసిల్ నివేదికలో వివరించింది. ఈ నెల(మార్చి)లో టైల్స్ ఉత్పత్తి దాదాపు నిలిచిపోగా.. దేశీ వినియోగ వ్యయాలు సైతం మందగించనున్నట్లు తెలియజేసింది. ఫలితంగా దేశీ టైల్స్ మార్కెట్ వృద్ధి గతంలో వేసిన 7–8% అంచనాలస్థానే 4–5 శాతానికి పరిమితంకానున్నట్లు పేర్కొంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే కంపెనీల దీర్ఘకాలిక మూసివేతలు, భారీ నష్టాలకు కారణంకావచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలియజేశారు. దీంతో నెలవారీ ఆదాయంలో 7–8 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేశారు. ఈ అంశాలన్నీ కంపెనీల నిర్వహణ లాభదాయకతను 1.3–1.5%మేర దెబ్బతీయవచ్చని నివే దిక పేర్కొంది. వెరసి ఐదేళ్ల కనిష్టం 9.3–9.5%నికి మార్జిన్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సవాళ్ల నుంచి అవకాశాలదాకా.. కెమికల్స్ రంగం బూమ్
దేశీ కెమికల్స్ పరిశ్రమ ఆర్థిక వృద్ధిని మించి పరుగుతీయనున్నట్లు కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ అండ్ కంపెనీ తాజా నివేదికలో పేర్కొంది. దీంతో 2030కల్లా కెమికల్స్ రంగం 230–255 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు అధిక వృద్ధిలో ఉన్న విభాగాలు దోహదం చేయనున్నట్లు ‘ప్రపంచ అవరోధాలమధ్య సవాళ్ల నుంచి అవకాశాలలోకి దేశీ కెమికల్ పరిశ్రమ’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది.ప్రస్తుతం 155–165 బిలియన్ డాలర్లుగా ఉన్న కెమికల్స్ పరిశ్రమ అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైనప్పటికీ వార్షిక ప్రాతిపదికన 8–9 శాతం పురోగతిని సాధించనున్నట్లు అభిప్రాయపడింది. ఈ రంగంలో ప్రధానంగా 8 విభాగాలు అధిక వృద్ధిని అందుకోనున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు– బ్యాటరీలు, రెనెవబుల్స్, కన్స్ట్రక్షన్, ఏరోస్పేస్– డిఫెన్స్, ఆటో విడిభాగాలు, బయో– ఎక్స్, ఈకామర్స్ను ప్రస్తావించింది. ఈ విభాగాలు 16 శాతం వార్షిక వృద్ధితో 2030కల్లా 30–35 బిలియన్ డాలర్ల అదనపు డిమాండుకు తెరతీయనున్నట్లు అంచనా వేసింది. ఈ కాలంలో నిర్మాణ సంబంధ కెమికల్స్ రెట్టింపై 28 బిలియన్ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. ఇందుకు మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది.17 శాతం రిటర్నులుగత దశాబ్ద కాలంలో వార్షిక ప్రాతిపదికన మొత్తం వాటాదారులకు 17 శాతం రాబడిని అందించినట్లు మెకిన్సీ నివేదిక పేర్కొంది. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు, విదేశీ కంపెనీలను అధిగమించినట్లు వెల్లడించింది. అయితే కెమికల్స్ రంగంలో 31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ ప్రధానంగా ఇనార్గానిక్స్(12 బిలియన్ డాలర్లు), పాలిమర్స్(13 బిలియన్ డాలర్లు)లో దిగుమతి ప్రత్యామ్నాయాలకు వీలున్నట్లు వివరించింది. ఇందుకు ఉదాహరణగా స్టైరీన్, ఎసెటిక్ యాసిడ్, పాలియోల్స్ తదితర వేల్యూ చైన్స్లో ప్రపంచస్థాయి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వృద్ధిని అందుకునేందుకు వీలుగా కంపెనీలు అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించవలసి ఉన్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడం, ఇతర సంస్థల కొనుగోళ్లు, పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై వ్యయాల పెంపు, ఏఐ ఆధారిత సామర్థ్యాలను అమలు చేయడం తదితరాలను ప్రస్తావించింది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేందుకు సరఫరా చైన్, బ్యాలన్స్షీట్లను పటిష్టపరచుకోవడంతోపాటు.. విలువ ఆధారిత వృద్ధిపై దృష్టిపెట్టవలసి ఉన్నట్లు తెలియజేసింది. వెరసి కెమికల్స్ పరిశ్రమ నిర్వచనా దశాబ్దంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది. వాటా స్వల్పమేగత దశాబ్ద కాలంలో దేశీ కెమికల్స్ పరిశ్రమ పటిష్ట వృద్ధిని సాధించినప్పటికీ అంతర్జాతీయ కెమికల్స్ వాణిజ్యంలో వాటా 3 శాతమే. చైనా 20 శాతం వాటాను ఆక్రమిస్తుంటే.. యూరోపియన్ యూనియన్ 15 శాతం, యూఎస్ 10 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. దేశీయంగా ఈ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల వాటా 0.9 శాతమేకాగా.. జాతీయ సగటు 2.5 శాతంగా ఉంది. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోర్ట్ఫోలియో క్రమబద్ధీకరణకు తెరలేవడంతోపాటు.. యూరప్లో ఆస్తుల విలువ పునర్నిర్మితమవుతున్న నేపథ్యంలో ఇతర సంస్థల కొనుగోళ్లు, టెక్నాలజీ అందుకునేందుకు దేశీ కంపెనీలకు అవకాశాలున్నట్లు నివేదిక పేర్కొంది. జపాన్, యూఎస్, ఈయూలతో పోలిస్తే దేశీ కంపెనీలు చాల స్వల్ప స్థాయిలో అంటే ఆదాయంలో 0.5 శాతమే ఆర్అండ్డీపై వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ఈ రంగంలో ఆర్అండ్డీ కీలకమని పేర్కొంది. ఏఐ, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ వినియోగంతో ప్రొక్యూర్మెంట్, సరఫరా చైన్ నిర్వహణ తదితరాలలో భారీ పెట్టుబడులు చేపట్టకుండానే ఇబిటాను 8–12 శాతంమేర మెరుగుపరచుకోవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్లైన్స్కి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపునకు సంబంధించి కనీసం 60 శాతం సీట్లపై అదనపు చార్జీలు విధించొద్దని సూచించింది. ప్రస్తుతం 20 శాతం సీట్లను ఉచితంగా బుక్ చేసుకోవడానికి ఉండగా మిగతా సీట్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. ఇక ఒకే పీఎన్ఆర్పై ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఒకే దగ్గర కూర్చునే విధంగా చూడాలని కూడా డీజీసీఏ సూచించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దేశీ రూట్లలోని ఫ్లయిట్స్కి ఇవి వర్తిస్తాయి. ప్యాసింజర్లకు మరింత వెసులుబాటు కలి్పంచేలా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామన్నారు. దేశీ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగి 17.5–18.1 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య సెపె్టంబర్ 2025 నాటికి 162కి చేరింది. దేశ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్–అక్టోబర్ 2025 మధ్య కాలంలో 23.74 కోట్లకు చేరింది. మార్గదర్శకాల ప్రకారం.. → స్పోర్ట్స్ పరికరాలు, సంగీత సాధనాలను పారదర్శకమైన విధంగా, సురక్షితంగా చేర్చాలి. → అలాగే, పెంపుడు జంతువుల విషయంలోను స్పష్టమైన, పారదర్శకమైన విధానాలు ఉండాలి. → ఫ్లయిట్స్ జాప్యం, రద్దు, బోర్డింగ్కి నిరాకరించడం తదితర కేసుల్లో ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనలను కచి్చతంగా పాటించాలి. → ప్రయాణికుల హక్కులను ఎయిర్లైన్స్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, బుకింగ్ ప్లాట్ఫాంలు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో స్పష్టంగా డిస్ప్లే చేయాలి. → ప్రాంతీయ భాషల్లో కూడా ప్రయాణికుల హక్కులను తెలియజేయాలి. -
రైల్వే టికెట్ బుకింగ్లో భారీ మార్పులు.. త్వరలోనే!
దేశంలో రైలు టికెట్ బుకింగ్ వ్యవస్థ త్వరలో మరింత వేగవంతం, సులభతరం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎదురయ్యే ఆలస్యం, సర్వర్ సమస్యలు, లావాదేవీ వైఫల్యాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ అప్గ్రేడ్ పనులు చేపట్టింది.జూన్ నాటికి కొత్త వ్యవస్థ సిద్ధం!అధికారుల ప్రకారం.. అప్గ్రేడ్ చేసిన ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షల బుకింగ్స్ను నిర్వహించగలదు. దీంతో పీక్ టైమ్లో కూడా సాఫీగా టికెట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది.ఎంక్వైరీ సేవల్లోనూ వేగంటికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత తెలుసుకునే ఎంక్వైరీ సేవలు కూడా మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలను నిర్వహిస్తున్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత ఇంకా అధిక సామర్థ్యంతో పని చేయనుంది.సాంకేతిక సమస్యలకు చెక్ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సర్వర్ క్రాష్లు, స్లో స్పీడ్, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొత్త వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ పొందడం సులభమవుతుంది.కొత్త ఫీచర్లుఅప్గ్రేడ్ వ్యవస్థలో పలు కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వివిధ తేదీలలో టికెట్ ధరలను ముందుగానే తెలుసుకునే ఫేర్ క్యాలెండర్, ప్రయాణికుడు స్వయంగా సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. అలాగే బహుభాషా సౌకర్యం కూడా కల్పించనున్నారు.ఆన్లైన్ బుకింగ్కు పెరుగుతున్న ఆదరణప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మాత్రమే కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మార్పులతో ఆన్లైన్ బుకింగ్ మరింత నమ్మదగినదిగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది. మొత్తంగా, ఈ అప్గ్రేడ్తో రైలు ప్రయాణికుల టికెట్ బుకింగ్ అనుభవం పూర్తిగా మారిపోనుంది. -
విమాన ప్రయాణం.. ఇక కొత్త నిబంధనలు
దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సరసమైనదిగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. యాడ్-ఆన్ ఛార్జీల భారం తగ్గించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఉచితంగా సీట్ల కేటాయింపుకొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్ల కేటాయింపును ఉచితంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.ఒకే పీఎన్ఆర్ ఉంటే పక్కపక్కనే సీట్లుఒకే పీఎన్ఆర్పై టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా దంపతులకు విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో విడివిడిగా సీట్లు రావడం, అదనపు చార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాపై విమానయాన సంస్థలు పారదర్శక విధానాలు పాటించాలి. భద్రతా నిబంధనలతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా వీటి నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.రద్దులు, ఆలస్యాలపై కఠిన నియంత్రణవిమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎయిర్లైన్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, బుకింగ్ ప్లాట్ఫామ్లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు.విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్లు’ ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో ఆహారం అందించనున్నారు. ‘ఫ్లైబ్రరీ’ ద్వారా ఉచితంగా పుస్తకాలు చదుకునే అవకాశం కల్పించనున్నారు. అదనంగా ఉచిత వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. -
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది. అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి 1718 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.


