breaking news
Corporate
-
రూ.36 లక్షల జీతం ఇస్తానన్నా నో చెప్పాడు.. ఎందుకంటే?
ఢిల్లీకి చెందిన ఓ వ్యవస్థాపకుడు దుబాయ్లో రూ.36 లక్షల వార్షిక జీతంతో వచ్చిన ఉద్యోగ ఆఫర్ను వదులుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 7 ఏళ్లు గడిచినా ఆ నిర్ణయం పట్ల తనకు ఏమాత్రం పశ్చాత్తాపం లేదని ఆయన తెలిపారు. ఫిన్గ్రోత్ మీడియా వ్యవస్థాపకుడు కనన్ బహల్ తన కెరీర్ జర్నీని ఎక్స్లో ఓ పోస్టు ద్వారా పంచుకున్నారు. విదేశీ ఉద్యోగ ఆఫర్లో పన్ను మినహాయింపు ఉన్న జీతం ఉందని, ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ప్రతిపాదన అని ఆయన తెలిపారు.“7 ఏళ్ల క్రితం దుబాయ్లో రూ.36 లక్షల ఉద్యోగ ఆఫర్ను నేను తిరస్కరించాను. అది పన్ను మినహాయింపు ఉన్న జీతం. ఆ సమయంలో ఐసీఏఐ క్యాంపస్ నియామకాల్లో అదే అత్యధిక ఉద్యోగ ఆఫర్” అని బహల్ తన పోస్టులో రాశారు.ఖర్చులను లెక్కలోకి తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగం తీసుకుని ఉంటే ఏడాదికి దాదాపు రూ.20 లక్షలు ఆదా చేయగలిగేవాడినని ఆయన చెప్పారు. భారత్లో పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని, ఆ సమయంలో ఏడాదికి రూ.12 లక్షలకు మించి జీతం ఇచ్చే ఉద్యోగం తనకు దొరకలేదని తెలిపారు.అయినా ఎందుకు వద్దన్నారు?జీతంలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ బహల్ భారత్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. “నేను దాన్ని తిరస్కరించాను. నా కుటుంబానికి, సంస్కృతికి దగ్గరగా ఉండటం నాకు ఎక్కువ ముఖ్యం” అని ఆయన రాశారు.ఆ నిర్ణయం సరైనదేనని తేలిందని ఆయన తెలిపారు. 7 ఏళ్ల తర్వాత తన పరిస్థితిని గుర్తు చేసుకుంటూ, “ఈ రోజు నాకు ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు” అని పేర్కొన్నారు. భారత్లో తాను నిర్మించుకున్న కెరీర్ దుబాయ్ ఉద్యోగం ద్వారా వచ్చేదానికంటే ఎంతో ఎక్కువ లాభదాయకంగా మారిందని తెలిపారు.అదే పోస్టులో బహల్ జీతంతో పోలికను పక్కనపెట్టి దేశంతో తనకున్న అనుబంధం గురించి, భవిష్యత్తుపై తన నమ్మకం గురించి కూడా మాట్లాడారు. “భారత్ పరిపూర్ణంగా ఉండకపోవచ్చు. కానీ మనం దాన్ని పరిపూర్ణంగా మార్చాలి” అని రాశారు.తన కుటుంబ చరిత్ర గురించి కూడా ఆయన ప్రస్తావించారు. 1947లో తమ పూర్వీకులను హింసకు గురై ఇళ్ల నుంచి వెళ్లగొట్టాక తర్వాత భారత్ వారికి ఆశ్రయం ఇచ్చిందని తెలిపారు. “మన స్వాతంత్య్ర సమరయోధులకు, మాతృభూమి భారత్కు మనమంతా ఎంతో రుణపడి ఉన్నాం” అని బహల్ చెప్పారు. చివరగా “స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! జై హింద్!” అని పేర్కొన్నారు.యూజర్ల స్పందనలుఈ పోస్టుకు భారీగా స్పందనలు వచ్చాయి. దుబాయ్ ఉద్యోగ ఆఫర్ను పక్కనపెట్టి భారత్లోనే ఉండటాన్ని పలువురు ప్రశంసించారు. “చాలా బాగుంది. భారత్ ఎదుగుదలపై నాకు ఎలాంటి సందేహం లేదు. మీలాంటి యువత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి” అని ఓ యూజర్ రాశారు. “గొప్ప పని చేశారు. ఇతరులను కూడా ప్రోత్సహించండి. స్ఫూర్తిదాయకం” అని మరో వ్యక్తి కామెంట్ చేశారు.7 yrs back, I rejected a ₹36 Lakh job offer in Dubai.It was a tax-free salary and it was the highest ICAI campus placement offer at that time.After all expenses, I would've saved ₹20 lakhs.I couldn't find a job in India that paid more than ₹12 lakhs p.a. at that time.I… pic.twitter.com/7PYlraI7nl— Kanan Bahl (@BahlKanan) August 15, 2026 -
అనంత్ అంబానీ ఔదార్యం.. ఇక్బాల్కు కొత్త ఆశలు!
చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఇక్బాల్ జీవితం ఎంతో కష్టంగా మారింది. దాదాపు ఐదేళ్లుగా అతడికి చెరువులో ఉండటమే కొంత ఉపశమనాన్ని ఇచ్చేది. దీంతో సాధారణంగా పిల్లలు గడిపే బాల్యం, కుటుంబంతో ఉండే సమయం అన్నీ అతడికి దూరమయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఇక్బాల్ పరిస్థితి గురించి తెలుసుకున్న తర్వాత అతడి కుటుంబంలోనూ ఆందోళన పెరిగింది.ఇక్బాల్ పరిస్థితి గురించి.. విషయం వెలుగులోకి రావడంతో వైద్య నిపుణుల బృందం అతడి కేసును పరిశీలించింది. అతడికి ఉన్న అనారోగ్య పరిస్థితి, ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు, అవసరమైన చికిత్స వంటి అంశాలను నిపుణులు పరిశీలించారు. ప్రత్యేక వైద్య సేవలు అందిస్తే ఇక్బాల్కు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందని భావించారు.ఈ విషయం తెలిసిన అనంతరం అనంత్ అంబానీ సూచనలతో ఇక్బాల్ను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించే ఏర్పాట్లు చేశారు. అతడిని ఎయిర్లిఫ్ట్ చేసి సర్ హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ వైద్య నిపుణులు అతడి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, అవసరమైన ప్రత్యేక చికిత్స అందించనున్నారు.ఇప్పటివరకు దాదాపు ఐదేళ్ల పాటు చెరువులోనే ఉపశమనం వెతుక్కుంటూ గడిపిన ఇక్బాల్.. ఇప్పుడు దేశంలోని ప్రముఖ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అతడి కుటుంబానికి కూడా ఇది పెద్ద ఊరటనిచ్చే విషయం. ఇక్బాల్కు మెరుగైన వైద్యం అందడంతో అతడి పరిస్థితి మెరుగుపడుతుందని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు.After spending 5 years in a pond seeking relief from his debilitating ailment, young Iqbal's case was reviewed. On Anant Ambani’s instructions, he has now been airlifted to Mumbai’s Reliance Foundation Hospital for specialized treatment — bringing new hope for Iqbal & his family. pic.twitter.com/9CrxaIHpgL— Mradubhashi (@mradubhashi1) August 17, 2026 -
14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
ఐటీ రంగంలో సుదీర్ఘ కరియర్ వదిలేసి పెద్ద సాహసమే చేశాడు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి సొంతూరికి వచ్చి కేవలం తన కోసమే కాకుండా, తన గ్రామస్తులకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన ప్రస్థానం గ్రాండ్ సక్సెస్ అయింది. కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తుండటమే కాదు 24 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఒడిశాకు చెందిన విక్రమ్దేవ్ మహాపాత్ర సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం. ఐటీ రంగంలో 14 ఏళ్ల కరియర్ను వదిలి విక్రమ్దేవ్ మహాపాత్ర సొంతూరైన నబరంగ్పూర్లో 'గంగా భూమి మష్రూమ్స్' పేరిట భారీ వాణిజ్య పుట్టగొడుగుల (Mushroom) ఫారమ్ను ప్రారంభించారు. వ్యాపారంలో మెళకువలను అవగాహన చేసుకొని, విజయవంతంగా పుట్టగొడుగు సాగును, మార్కెటింగ్ను విజయవంతం నిర్వహించారు. ఇప్పుడు కోట్లలో వ్యాపారం చేస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు.'గంగా భూమి మష్రూమ్స్ సక్సెస్ ఎలా సాగిందంటే..'గంగా భూమి మష్రూమ్స్', రోజుకు 500-600 కిలోల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తోంది. అంటే నెలకు 15-18 టన్నులు. నివేదికల ప్రకారం నెలవారీ ఆదాయం రూ. 16-19 లక్షలు కాగా, ఈ వ్యాపారం స్థానికులు 24 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో 18 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉండటం విశేషం. తద్వారా నెలవారీ ఆదాయం రూ. 16-19 లక్షలు (కిలో సగటున రూ. 100-110) ఆర్జిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ. 2.56 కోట్లు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ. 97 లక్షలు 'ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ్ యోజన' కింద లోను తీసుకున్నారు. మొత్తంగా నిర్వహణ ఖర్చులు పోగా, ఈ వ్యాపారం నెలకు రూ. 10 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!బీటెక్ నుండి పుట్టగొడుగుల సాగు వరకువిక్రమ్దేవ్ 2012లో ఒడిశాలోని బిజు పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు.ఆ తర్వాత ఐటీలోకి ప్రవేశించి, డిస్కవర్చర్ సొల్యూషన్స్, మైండ్ట్రీ, సెరోల్ టెక్నాలజీస్ మరియు ఎల్టిఐ మైండ్ట్రీ లాంటి కంపెనీల్లో పనిచేశారు. అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాడ్యూల్ లీడ్, టెక్నికల్ లీడ్, ప్యాకేజీ ఇంప్లిమెంటేషన్లో సీనియర్ స్పెషలిస్ట్ వంటి వివిధ పాత్రలను పోషించారు. టెక్నికల్ లీడ్గా పనిచేసిన అనుభవం, నేర్చుకున్న ప్రాజెక్ట్ ప్లానింగ్, సిస్టమ్స్ మేనేజ్మెంట్ ,లాజిస్టిక్స్ నైపుణ్యాలను వ్యవసాయ రంగంలో ఉపయోగించి ఈ ఫారమ్ను అభివృద్ధి చేశారు. ఇక్కడ పండిన పుట్టగొడుగులను ఏడాది పొడవునా బ్రహ్మపూర్ , భువనేశ్వర్ మార్కెట్లకు నిరంతరాయంగా సరఫరా చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదీ చదవండి: త్విషా శర్మ మృతి కేసులో ట్విస్ట్ : మాజీ జడ్జికి షాక్!ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం -
ఎల్పీజీ e-KYC డెడ్లైన్ పొడిగింపు!
దేశంలో ఎల్పీజీ వినియోగదారులకు తప్పనిసరి చేసిన ఈ-కేవైసీ గడువును.. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు మరో వారం పొడిగించారు. దీంతో ఈ-కేవైసీ పూర్తి చేసుకోలేకపోయిన వారికి అదనపు సమయం లభించింది.ఈ-కేవైసీ కోసం గడువు పెరిగినా.. వినియోగదారుల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ఆధార్ ఆథెంటికేషన్ కోసం గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తున్న వారికి సర్వర్లు డౌన్ అవడం, యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సాధారణంగా.. సులభంగా పూర్తయ్యే ప్రక్రియ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది.గడువు పెంచడం వల్ల ఆగస్టు 16 నాటికి ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుందని భావించినా.. అసలు సమస్య మాత్రం సాంకేతిక వ్యవస్థలోనే ఉందని డీలర్లు చెబుతున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సర్వర్లు లేదా యాప్లు సరిగ్గా పనిచేయకపోతే గ్యాస్ ఏజెన్సీల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నా ఈ-కేవైసీ ప్రక్రియ ముందుకు సాగదు. కొన్ని గంటల పాటు సర్వర్ పనిచేయకపోతే.. ఆ రోజు పూర్తి కావాల్సిన ఈ-కేవైసీలు పెండింగ్లో పడిపోతాయి. దీంతో రోజురోజుకి ఈ-కేవైసీ చేసుకోవాల్సిన వారి క్యూ పెరిగిపోతోంది.దీంతో ఇప్పటికే గంటల సమయం వెచ్చించిన వినియోగదారులకు గడువు పొడిగింపు పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఏజెన్సీకి వెళ్లిన తర్వాత సర్వర్ పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతోంది. ఒకరోజు సర్వర్ సమస్య కారణంగా.. పని పూర్తికాకపోతే మళ్లీ మరో రోజు ఏజెన్సీకి వెళ్లాల్సి వస్తోంది.కాబట్టి ఆగస్టు 23 వరకు గడువు ఉన్నప్పటికీ.. చివరి వరకు వేచి ఉండకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది. అయితే.. వినియోగదారులకు అదనపు సమయం ఇవ్వడంతో పాటు సర్వర్ సామర్థ్యాన్ని పెంచడం, యాప్ల పనితీరును మెరుగుపరచడం, సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించడం కూడా అవసరం. ఎందుకంటే గడువు పెంచడం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు.. ఈ-కేవైసీ ప్రక్రియ సజావుగా జరిగేలా డిజిటల్ వ్యవస్థ పనిచేయడమే అసలు పరిష్కారం.ఇదీ చదవండి: కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు? -
కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు?
ఇంట్లో పొయ్యి వెలిగించేందుకు కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. కొత్తగా ఇల్లు తీసుకున్న వారు, అద్దెకు మారిన కుటుంబాలు, కొత్తగా పెళ్లైన జంటలు గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా.. అనేక ప్రాంతాల్లో అవి పెండింగ్లోనే ఉంటున్నాయి. అలా రోజూ వేలల్లో.. ఇప్పటికే లక్షల్లో పేరుకుపోయాయి. ఇవికాకుండా మరికొన్ని దరఖాస్తులు కూడా సిద్ధంగా ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై నెలకొన్న ఒత్తిడి, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాల ప్రభావంతో ఎల్పీజీ లభ్యతపై అప్రమత్తమైన చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో కొత్త డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా మాత్రం కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.యుద్ధ ప్రభావం.. సరఫరాపై అప్రమత్తతభారత్ ఎల్పీజీ అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారానే తీరుతుంది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా సరఫరా మార్గాల్లో ఇబ్బందులు తలెత్తితే దేశీయంగా కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇటీవల ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి ఎదురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచేందుకు రిఫైనరీలు, చమురు సంస్థలకు ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రిఫైనరీలు, అప్స్ట్రీమ్ సంస్థలు కలిసి రోజుకు గరిష్ఠంగా 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని సిద్ధంగా ఉంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్నగర్ రిఫైనరీకి అత్యధిక ఉత్పత్తి లక్ష్యం కేటాయించినట్లు సమాచారం.ప్రస్తుతం దేశంలో రోజువారీ ఎల్పీజీ వినియోగం సుమారు 90 వేల టన్నులకు పైగా ఉంది. ఇందులో దిగుమతుల వాటా ఎక్కువగా ఉండటంతో.. భవిష్యత్లో సరఫరా అంతరాయాలు రాకుండా కేంద్రం నిల్వలు, ఉత్పత్తిపై దృష్టి పెట్టింది.మరి కొత్త కనెక్షన్లు ఆపడం ఎందుకు?ఇండియన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి సంస్థల డీలర్ల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్ల సరఫరా సాఫీగా కొనసాగించడం ప్రధాన ప్రాధాన్యతగా మారింది. అందుకే కొత్త డొమెస్టిక్ కనెక్షన్లు, డబుల్ బాటిల్ కనెక్షన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఒక కుటుంబానికి ఒకే గ్యాస్ కనెక్షన్ విధానం అమలుపైనా చమురు సంస్థలు దృష్టి పెడుతున్నాయి. ఒకే చిరునామాలో ఉన్న బహుళ కనెక్షన్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.దరఖాస్తులు వెల్లువలా వస్తే పరిస్థితి ఏంటి?కొత్త కనెక్షన్ల కోసం ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఇళ్లు, అపార్ట్మెంట్లు పెరుగుతుండటం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్పీజీ వినియోగం పెరగడంతో దరఖాస్తులు పెండింగ్లో పేరుకుపోయే పరిస్థితి కనిపిస్తోంది. ‘‘సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే పెండింగ్ దరఖాస్తులను దశలవారీగా పరిష్కరించే అవకాశం ఉంది’’ అని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.ఇలా ఇంకెన్నాళ్లు ?కొత్త కనెక్షన్లు పునఃప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. అయితే అంతర్జాతీయ సరఫరా పరిస్థితులు మెరుగుపడి, దేశీయ నిల్వలు స్థిరపడితే కొన్ని వారాల నుంచి ఒకటి రెండు నెలల వ్యవధిలో కొత్త కనెక్షన్ల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది అన్ని ప్రాంతాలకు ఒకేసారి కాకుండా.. సరఫరా పరిస్థితులు, స్థానిక డిమాండ్ ఆధారంగా దశలవారీగా ఉండొచ్చని చెబుతున్నారు.వినియోగదారులకు సూచనలుకొత్త కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు తమ సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు వివరాలు నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిదని చెబుతున్నారు. -
న్యూ ఫండ్ ఆఫర్స్.. రిస్కు తక్కువ, రాబడి ఎక్కువ!
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ ఎనర్జీ ఈటీఎఫ్ పేరిట రెండు న్యూ ఫండ్ ఆఫర్స్ను ప్రకటించింది. ఇవి ఆగస్టు 21 వరకు అందుబాటులో ఉంటాయి. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో కనీసం రూ. 100 నుంచి, ఈటీఎఫ్లో రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. నిఫ్టీ ఎనర్జీ టీఆర్ఐ పనితీరు వీటికి ప్రామాణికంగా ఉంటుంది. దేశీయంగా విద్యుత్ వినియోగం పలు సంపన్న, వర్ధమాన దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగనుండటంతో పునరుత్పాదక విద్యుత్, పంపిణీ మౌలిక సదుపాయాలు, పరికరాలు, కొత్త టెక్నాలజీలు, విద్యుదుత్పత్తి మొదలైన విభాగాలు భారీగా విస్తరించనున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ప్రయోజనాలు పొందేందుకు ఈ 2 ఎన్ఎఫ్వోలు తోడ్పడతాయి. నిఫ్టీ 500 స్టాక్స్ నుంచి ఎనర్జీ థీమ్కి సంబంధించి ఎంపిక చేసిన 40 స్టాక్స్ నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్లో ఉంటాయి. ఏబీఎస్ఎల్ఐ నుంచి ఏపెక్స్ సిఫ్లు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ (ఏబీఎస్ఎల్ఐ) తాజాగా ఏపెక్స్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్, ఏపెక్స్ ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్ పేరిట రెండు స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ను (సిఫ్) ఆవిష్కరించింది. ఇవి ఆగస్టు 24 వరకు అందుబాటులో ఉంటాయి. వీటిలో కనీసం రూ. 10 లక్షల నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్కి నిఫ్టీ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. లిస్టెడ్ ఈక్విటీలతో పాటు పరిమిత స్థాయిలో డెరివేటివ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే వ్యూహంతో దీర్ఘకాలికంగా సంపద వృద్ధికి తోడ్పడటం దీని లక్ష్యంగా ఉంటుంది. ఏపెక్స్ ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్ షార్ట్ ఫండ్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా టాప్ 100 వెలుపల ఉండే సంస్థలు రాబోయే రోజుల్లో మార్కెట్ లీడర్లుగా ఎదిగే అవకాశాలపై ఆధారితమైనదిగా ఉంటుంది. నియంత్రణ సంస్థల పరిధిలో వైవిధ్యమైన సాధనాల్లో భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేయదల్చుకునేవారు, ఫ్యామిలీ ఆఫీసులు మొదలైన వర్గాలకు ఇవి అనువుగా ఉంటాయి. జీరోధా ఫండ్ హౌస్ ఆర్బిట్రేజ్ ఫండ్ పన్నులను ఆదా చేసే విధంగా మిగులు నిధులను మెరుగైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారి కోసం జీరోధా ఆర్బిట్రేజ్ ఫండ్ను జీరోధా ఫండ్ హౌస్ ప్రవేశపెట్టింది. మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ రిస్కులతో, ఈక్విటీ ఫండ్స్కి సంబంధించిన ట్యాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి అధిక ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ తెలిపింది. ఇది ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ (కనీసం 65 శాతం) డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.చదవండి: పెట్రోల్ పాలసీలో ట్విస్ట్! పాత వాహనాలకు E10 పరిష్కారమా?నిర్దిష్ట స్టాక్స్, వాటి డెరివేటివ్ కాంట్రాక్టుల మధ్య తాత్కాలికంగా ఉండే ధరలపరమైన వ్యత్యాసాలను ఉపయోగించుకుని మెరుగైన రాబడులను సాధించడం దీని లక్ష్యం. అలాంటి అవకాశాలు లేనప్పుడు ఈ ఫండ్ తాత్కాలికంగా తన వద్ద ఉన్న నిధులను స్వల్పకాలిక డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. రిస్కు సామర్థ్యాలు తక్కువగా ఉండి, కొద్ది నెలల వ్యవధికి గాను మిగులు నిధులను ఇన్వెస్ట్ చేయదల్చుకునే మదుపరులు దీన్ని పరిశీలించవచ్చు. కనీసం రూ. 5,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. -
బరోడా బీఎన్పీ పారిబా ఎంఎఫ్ సీఈవోగా మధు నాయర్
బరోడా బీఎన్పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీఎన్పీఏఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా మధు నాయర్ నియమితులయ్యారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి డెప్యుటేషన్పై వచ్చిన ఎండీ, సీఈవో సంజయ్ కుమార్ గ్రోవర్ స్థానంలో ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. సంస్థ ఏఏయూఎం రూ. 57,000 కోట్ల పైచిలుకు స్థాయిలో ఉన్న తరుణంలో నాయర్ నియామకం.. ఫండ్ మరింత వేగవంతమైన వృద్ధి సాధించేందుకు దోహదపడగలదని బీబీఎన్పీఏఎం ఈడీ బీనా వహీద్ తెలి పారు. హెచ్ఎస్బీసీ, ఇన్వెస్కో, కోటక్ తదితర సంస్థల్లో నాయర్కి 28 ఏళ్ల అనుభవం ఉంది. -
వీటి ‘హోల్డింగ్’ వ్యూహాత్మకమే!
హోల్డింగ్ కంపెనీల్ని మార్కెట్ పెద్దగా ఇష్టపడదు. ఎందుకంటే సొంతగా పెద్ద వ్యాపారమేదీ ఉండదు. ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టి... వాటిపై వచ్చే డివిడెండ్లే ఆదాయంగా నెట్టుకొస్తూ ఉంటాయి. ఆ వాటాల విలువ పెరిగితే... ఈ కంపెనీల విలువా పెరుగుతుంది. అంతే. కాబట్టే నేరుగా వ్యాపారం చేసే కంపెనీల షేర్లపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మరి సొంతగా మంచి వ్యాపారం చేస్తూనే, ఇతర సంస్థల్లోనూ వాటాలున్న కంపెనీల సంగతేంటి? ఒకవైపు ప్రధాన వ్యాపారం నుంచి ఆదాయం వస్తుంది. మరోవైపు పెట్టుబడులపై డివిడెండ్లూ వస్తాయి. భవిష్యత్తులో ఆ కంపెనీల వాటా విలువ పెరిగితే... అదో అదనపు ప్రయోజనం. వీటన్నిటికీ తోడు... ఇలాంటి కంపెనీలు కొన్నిసార్లు వాటి మొత్తం ఆస్తుల విలువతో పోలిస్తే (బుక్ వేల్యూ) మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తుంటాయి. అంటే.. వ్యాపారమూ ఉంది. పెట్టుబడులూ ఉన్నాయి. భవిష్యత్తులో విలువ అన్లాక్ అయ్యే అవకాశమూ ఉంది. కాబట్టి ఇవి సాధారణ హోల్డింగ్ కంపెనీలు కావు. వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీలు. ఇలాంటి కంపెనీల గురించి వివరించేదే ఈ ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్... ఇన్ఫో ఎడ్జ్... ఈఐడీ ప్యారీ... మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రెజ్ ఇండస్ట్రీస్, లార్సన్ అండ్ టూబ్రో... ఇవన్నీ ఇన్వెస్టర్లకు సుపరిచితమైన కంపెనీలే. విశేషమేంటంటే ఇన్వెస్టర్లు చాలామంది వీటి ప్రధాన వ్యాపారాన్నే చూస్తుంటారు. ఎప్పటికప్పుడు అవి ప్రకటించే ఫలితాలను విశ్లేషిస్తుంటారు. కానీ వీటికి రకరకాల కంపెనీల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి? ఆ కంపెనీల్లో వాటాల విలువ మాటేంటి? ఆ విలువంత ఈ కంపెనీ షేర్లలో ప్రతిఫలిస్తోందా? అనేది పెద్దగా చూడరు. అలా చూసి ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మెరుగైన రాబడులొస్తాయనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ కంపెనీల షేర్లను కొంటే... వాటికి ఇన్వెస్ట్మెంట్లున్న మొత్తం ఎకో సిస్టమ్లో పెట్టుబడి పెట్టినట్లే. కాబట్టి దాని విలువ పెరిగే అవకాశాలూ ఎక్కువే. ఇలాంటి కంపెనీల గురించి వివరంగా చూద్దాం.ది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక హోల్డింగ్ కంపెనీకి అచ్చమైన ఉదాహరణ మురుగప్ప గ్రూప్నకు చెందిన ఈ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే బీఎస్ఏ ఎస్ఎల్ఆర్తో పాటు మోంట్రా, హెర్క్యులిస్ వంటి సైకిళ్లన్నీ ఈ కంపెనీ బ్రాండ్లే. వీటి తయారీతో పాటు లిస్డెట్ కంపెనీలైన సీజీ పవర్, శాంతి గేర్స్లో దీనికి మెజారిటీ వాటాలున్నాయి. శాంతి గేర్స్ను ఈ మధ్యనే డీలిస్ట్ చేశారు కూడా. వీటితో పాటు మోంట్రా ఎలక్ట్రిక్, క్లీన్ మొబిలిటీ, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థల్లో మెజారిటీ వాటాలున్నాయి. సైకిళ్లతో పాటు ఇంజినీరింగ్, మెటల్ ఉత్పత్తులు, మొబిలిటీ, ఈవీ, పారిశ్రామిక పరికరాల తయారీని వంటి వ్యాపారాలను కంపెనీ నేరుగా నిర్వహిస్తోంది కూడా. ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రస్తుతం సీజీ పవర్ మార్కెట్ విలువ ఒక్కటే ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ విలువను దాటేసింది. మరి సీజీ పవర్లో దాదాపు 56 శాతానికి పైగా వాటా కలిగి ఉన్న ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్కు... ఇతర కంపెనీల్లోని వాటాలను, సొంత వ్యాపారాలను జోడిస్తే విలువ పెరుగుతుంది కదా? అంటే హోల్డింగ్ కంపెనీ తరహాలో మార్కెట్ దీనికి తక్కువ విలువే ఇస్తోందని స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ అన్లిస్టెడ్ కంపెనీలు లిస్ట్ అయినా... వాటి విలువ పెరిగినా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ షేరు ధర కూడా పెరుగుతుందనటంలో అతిశయోక్తి లేదు కదా? అందుకే దీన్ని ఇన్వెస్ట్మెంట్కు తగిన వ్యూహాత్మ హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) నౌఖ్రీ, 99 ఏకర్స్, జీవన్సాథీ, శిక్షా వంటి ఇంటర్నెట్ సంస్థలు ఈ కంపెనీ సొంతం. ఇవన్నీ ఆయా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నవే. మంచి ఆదాయాన్ని సాధిస్తున్నవే. ఏఐ వచ్చాక వీటి వ్యాపారాలు కొద్దిమేరకు తగ్గుతున్న మాట వాస్తవమే అయినా... ఏఐలో ఇన్వెస్ట్మెంట్లు చేయటం ద్వారా కంపెనీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది. పైపెచ్చు జొమాటో, పాలసీ బజార్, అడ్డా 247, షాప్ కిరాణాతో సహా బోలెడన్ని స్టార్టప్స్లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. జొమాటో, పాలసీ బజార్లో ఈ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లు ఇప్పటికే బ్లాక్ బస్టర్ ఫలితాలనిచ్చాయి. మిగతా వాటిలోనూ కొన్నింటి విలువ బాగా పెరిగింది. ఒకరకంగా దీన్ని లిస్టెడ్ వెంచర్ క్యాపిటల్ ప్లాట్ఫామ్గా భావించవచ్చు. దాంతోపాటు లాభాలిచ్చే అర్థవంతమైన వ్యాపారాలూ ఉన్నాయి. అందుకే ఈ కంపెనీ షేరు బాగా పెరిగి... ప్రస్తుతం ఏఐ బూమ్లో కొంత కరెక్షన్కు గురైంది. ఈఐడీ ప్యారీ.. తక్కువ ధరకే..? ఈ కంపెనీని చాలామంది షుగర్ తయారీ కంపెనీగానే చూస్తారు. చక్కెర, బెల్లం, న్యూట్రాస్యూటికల్స్, బయో ఉత్పత్తుల్ని విక్రయించే ఈ కంపెనీకి సొంత చక్కెర రిఫైనరీ ఉంది. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. వీటన్నిటినీ మించి... ఎరువుల తయారీలో అగ్రగామి అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్లో ఈ కంపెనీకి దాదాపుగా 56 శాతానికిపైగా వాటా ఉంది. ఆ వాటా విలువ ఒక్కటే దాదాపుగా రూ.35వేల కోట్లు. పైపెచ్చు ఇండియన్ పొటాష్ కంపెనీలో సైతం దాదాపుగా రూ.400 కోట్ల విలువైన వాటాలున్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఈఐడీ ప్యారీ షేరు ధర తక్కువే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈఐడీ ప్యారీ మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపుగా రూ.13వేల కోట్ల దగ్గర్లో ఉంది. మరి కోరమాండల్లో రూ.35వేల కోట్లు, ఇండియన్ పొటాష్ లో రూ.400 కోట్ల పెట్టుబడులతో పోల్చినా ఇది తక్కువే కదా? పైపెచ్చు షుగర్ కంపెనీగా దేశవ్యాప్తంగా చక్కటి వ్యాపారం ఉంది. లాభాలు ఆర్జిస్తోంది. అందుకే వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు ఇలాంటి సంస్థలు మెరుగైనవన్నది నిపుణుల సూచన. మహీంద్రా అండ్ మహీంద్రా... ఎం అండ్ ఎం మాత్రం వీటన్నింటికీ భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే దీనికి హోల్డింగ్ కంపెనీగా రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడులతో పాటు... బలమైన వ్యాపారమూ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సరీ్వసెస్, మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్, మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్, స్వరాజ్ ఇంజిన్స్ లిమిటెడ్, మహీంద్రా లైఫ్స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్, మహీంద్రా ఈపీసీ ఇరిగేషన్ లిమిటెడ్, ఎస్ఎంఎల్ ఇసుజు వంటి లిస్టెడ్ కంపెనీల్లో మెజారిటీ వాటాలు ఎం అండ్ ఎం సొంతం. ఇక టెక్ మహీంద్రా, సీఐఈ ఆటోమోటివ్ ఎగ్జిట్లో మైనారిటీ వాటాలున్నాయి. ఇవికాక చాలా అన్లిస్టెడ్ సంస్థలు దీనికి నూరుశాతం అనుబంధ కంపెనీలుగా ఉన్నాయి. ఈ పెట్టుబడులు, వాటాలను పక్కనబెడితే... ఎం అండ్ ఎం వాహనాల తయారీలో అగ్రగామి. ట్రాక్టర్లలో లీడర్. ఈవీ మొబిలిటీలో కంపెనీ వేగంగా ఎదుగుతోంది. అంటే.. ఒక ఎం అండ్ ఎం షేరు కొంటే దాదాపుగా కంపెనీకి చెందిన గ్రూపు సంస్థలన్నింటినీ హోల్డ్ చేస్తున్నట్లే లెక్క. భవిష్యత్తులో వీటి వాటాల విలువ పెరగటంతో పాటు అన్లిస్టెడ్ కంపెనీలు కూడా లిస్టయితే ఎం అండ్ ఎం విలువ కూడా పెరుగుతుంది కదా!. అందుకే దీన్ని వ్యూహాత్మక ఇన్వెస్ట్మెంట్కు తగిన హోల్డింగ్ కంపెనీగా భావించవచ్చు. లార్సన్ అండ్ టూబ్రో ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో ఇది లీడర్. ఈపీసీ కాంట్రాక్టుల్లో అగ్రగామి. మెట్రో రైళ్లతో సహా భారీ నిర్మాణాల్లో కంపెనీది తిరుగులేని రికార్డు. వీటన్నిటితో పాటు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్, ఫైనాన్స్, ఎల్ అండ్ టీ సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలున్నాయి. ప్రస్తుత విలువను బట్టి చూస్తే ఎల్ అండ్ టీ షేరును దాని వాస్తవ వ్యాపారాన్ని బట్టే విలువ కడుతున్నారన్నది నిపుణుల మాట. మరి దీని వాటాల విలువను కూడా లెక్కిస్తే!!. భవిష్యత్తులో కూడా ఈ విలువలు పెరుగుతూ ఉంటాయి కనక దీన్ని వాచ్లిస్ట్లో పెట్టుకోవచ్చు. ఇవే కాదు. ఇలా విశ్లేషిస్తూ వెళితే చాలా హోల్డింగ్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్కు తగినవిగానే కనిపిస్తాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్ను తీసుకుంటే దీనికి ఓలియో కెమికల్స్, కెమికల్స్ వ్యాపారాలతో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్, గోద్రెజ్ ప్రాపర్టీస్ సహా ఇతర గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కిర్లోస్కర్ ఇండస్ట్రీస్కు సొంత వ్యాపారాలతో పాటు కిర్లోస్కర్ గ్రూపు కంపెనీల్లో వాటాలున్నాయి. కల్యాణి ఇన్వెస్ట్మెంట్స్, మహారాష్ట్ర స్కూటర్స్, కేశోరామ్ ఇండస్ట్రీస్.. వీటన్నిటిదీ ఇదే స్టోరీ. కేశోరామ్ ఎప్పటికప్పుడు తన ఇన్వెస్ట్మెంట్లను అన్లాక్ చేస్తూ షేర్ హోల్డర్ల వాటా విలువ పెంచుతోంది. కాబట్టి ఇవన్నీ వాచ్లిస్ట్లో పెట్టుకోవాల్సినవే. హోల్డింగ్కంపెనీలు తక్కువ ధరకే ఎందుకు వస్తాయంటే... → క్యాపిటల్ గెయిన్స్ పన్నును కూడా మార్కెట్లు పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే ఒక కంపెనీకి వేరొక కంపెనీలో ఉన్న మొత్తం వాటాను విక్రయించేసిందనుకోండి. ఆ వచి్చన సొమ్ముపై దాదాపు 12.5 శాతం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను చెల్లించాలి. అంటే ఆ మేరకు వాటాల విలువను తక్కువగానే చూడాలి కదా!. → హోల్డింగ్ కంపెనీలు తమ వాటాలను విక్రయించటం అంత తేలికకాదు. దాదాపుగా అసాధ్యం కూడా. మరి హోల్డింగ్ చేయటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులున్నపుడు వాటికి పూర్తిగా విలువ కట్టడమెందుకన్నది మార్కెట్ భావన. అందుకే హోల్డింగ్ కంపెనీలు దాదాపుగా వాటి విలువకన్నా 30–40 శాతం తక్కువకే ట్రేడవుతూ ఉంటాయి. → కాబట్టి ఇన్వెస్టర్లు వీటిని విశ్లేషించేటపుడు దానికి లిస్టెడ్ కంపెనీల్లో ఉన్న వాటాల విలువెంత? అన్లిస్టెడ్ సంస్థల్లో ఉన్న వాటాల విలువెంత? సొంతగా అది చేస్తున్న వ్యాపార విలువెంత? అనేది చూడాలి. క్యాష్– ఇన్వెస్ట్మెంట్లు– రుణాలు, హోల్డింగ్ కంపెనీకి మార్స్క్ ఇచ్చే 30–40% డిస్కౌంట్ అన్నీ పరిగణనలోకి తీసుకున్నాకే ఆ కంపెనీ విలువను నిర్ణయించుకోవాలి. అప్పటికీ తక్కువ ఉంటే... దాన్ని తక్షణ ఇన్వెస్ట్మెంట్కు తగ్గట్టుగా చూడొచ్చు. లేనిపక్షంలో భవిష్యత్తులో అన్లాక్ అయ్యే విలువను దృష్టిలో పెట్టుకుని అందులో పెట్టుబడి పెట్టొచ్చు. రమణమూర్తి మంథా -
నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యోగం.. అందుకే వదిలేసా!
ఈ రోజుల్లో కార్పొరేట్ జాబ్ చేసే చాలామంది ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక మహిళ.. తాను ఎందుకు 9-5 ఉద్యోగాన్ని వదిలేసిందో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డిజిటల్ క్రియేటర్ అయిన అర్పిత సాహు, ఇన్స్టాగ్రామ్ వీడియోలో.. చిన్నప్పటి నుంచి బాగా చదవాలి, మంచి డిగ్రీ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా డబ్బు సంపాదిస్తూ బాధ్యతగా జీవించాలి అనే ఆలోచనతోనే ముందుకు సాగింది. కానీ.. కొంతకాలంగా తాను కోరుకునే జీవితం ఇదేనా అనే ప్రశ్న ఆమెను వెంటాడిందట. దీంతో ఇక తన కోసం కొంత సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది.ఉద్యోగం వదిలేయడం అంత ఈజీగా ఏమీ అనిపించలేదని అర్పితా వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక కొంత భయంగా ఉందని, అదే సమయంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాననే ఉత్సాహం కూడా ఉందని తెలిపింది. ఇన్నాళ్లూ ఇతరులు తన నుంచి ఏం ఆశించారో అదే చేస్తూ వచ్చానని, ఇప్పుడు మాత్రం తన మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికి తనకు తానే ఒక అవకాశం ఇచ్చుకున్నానని చెప్పింది.అర్పితా నిర్ణయంపై సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు. కొందరు మాత్రం ఉద్యోగం వదిలేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చని, కెరీర్లో గ్యాప్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఎక్కువ మంది మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తన మానసిక ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తూ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ధైర్యమైన విషయమని పలువురు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Arpita Sahu | Travel • Fitness • Real Talk (@fit_wandererrr) -
వంతారా నుంచి గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలు
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), వంతారా సహకారంతో కచ్లోని బన్ని గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలను తిరిగి సహజ వాతావరణంలోకి విడుదల చేశారు. ఇందులో 5 మగ కృష్ణజింకలు, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. వీటిని జామ్నగర్లోని వంతారా నుంచి బన్నికి తరలించారు.ఈ కృష్ణజింకలను అడవిలోకి వదిలిపెట్టడానికి ముందు.. వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కొంతకాలం క్వారంటైన్లో ఉంచారు. వ్యాధుల విషయంలో పర్యవేక్షణ చేసిన తర్వాత ప్రత్యేక జాగ్రత్తలతో బన్నికి తరలించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ, గుజరాత్ చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ నుంచి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నారు.బన్ని గడ్డి భూముల్లో గతంలో కృష్ణజింకలతో పాటు చింకారా, నీలగాయలు, అడవి పందులు వంటి జంతువులు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కృష్ణజింకలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అక్కడి సహజ ఆహార గొలుసు మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా.. గడ్డి భూముల జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Vantara (@vantara) -
రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పాదక లక్ష్యాలు
దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన 21 రిఫైనరీలు, అప్స్ట్రీమ్ కంపెనీలకు గరిష్ఠ ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మూజ్ జలసంధి గుండా సరఫరా అంతరాయాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశీయంగా అత్యవసర సరఫరా బఫర్ను సిద్ధం చేసేందుకు ఈ నిర్ణయం తోడ్పడనుంది.అన్ని రిఫైనరీలు, అప్స్ట్రీమ్ ప్రాసెసర్ల సంయుక్త ఉత్పాదక సామర్థ్యాన్ని రోజుకు 63,810 టన్నులుగా నిర్దేశించారు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సర దేశీయ ఉత్పత్తి కంటే రెట్టింపు మాత్రమే కాకుండా, దేశ మొత్తం రోజువారీ ఎల్పీజీ వినియోగంలో (సుమారు 91,000 టన్నులు) దాదాపు 70 శాతానికి సమానం.రిలయన్స్కు సింహభాగంగుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పాత రిఫైనరీకి రోజుకు అత్యధికంగా 18,000 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని కేటాయించారు. 18 ప్రభుత్వ రంగ రిఫైనరీలకు కలిపి రోజుకు 31,470 టన్నులు, నయారా ఎనర్జీ వాదినార్ రిఫైనరీకి రోజుకు 4,480 టన్నులు, ఓఎన్జీసీ, గెయిల్ వంటి అప్స్ట్రీమ్ సంస్థలకు రోజుకు 6,460 టన్నులు ఉత్పత్తి లక్ష్యం ఇచ్చారు. ఈ ఉత్పత్తి షెడ్యూల్ను ఏటా జనవరి 1, జులై 1 తేదీల్లో ఏడాదిన రెండుసార్లు సమీక్షిస్తారు.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
భారత్లోని జీసీసీలకు సవాల్
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత్లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల భవిష్యత్తుపై నైపుణ్య లేమి సవాళ్లు ఎదురవుతున్నాయి. అత్యంత కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రంగాల్లో తగిన సామర్థ్యాలు ఉన్న ఉద్యోగులు లభించకపోవడమే ఇందుకు కారణం. భారతదేశంలో ఉన్న జీసీసీల కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించేందుకు లేదా అక్కడ విస్తరించేందుకు గ్లోబల్ హెడ్క్వార్టర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నాయని ‘పీడబ్ల్యూసీ ఇండియా - ఫిక్కీ’ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది.19.3 శాతం విలువకు ముప్పుఎనిమిది విభిన్న పరిశ్రమలకు చెందిన 200 మంది సీనియర్ జీసీసీ ఎగ్జిక్యూటివ్లతో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. 11% జీసీసీ నాయకులు తమ వ్యాపార పరిధిని భారత్తో పోటీపడే ఇతర దేశాలకు బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు. సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు దొరక్కపోతే 2030 నాటికి ఈ రంగం సాధించాల్సిన ఆర్థిక విలువలో దాదాపు 19.3 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.పరిశోధనలోని అంశాలు..నైపుణ్యాల కొరత కారణంగా ఉత్పత్తుల ప్రారంభం, ప్రాజెక్ట్ గడువులు నిలిచిపోతున్నాయని 59% సంస్థలు వెల్లడించాయి.ఏఐ, డిజిటల్ పరివర్తన ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో 54% జీసీసీలు విఫలమవుతున్నాయి.నైపుణ్యం కలిగిన మానవవనరుల లభ్యత తగ్గడంతో కాంట్రాక్టర్లు, వెండర్లపై 56% సంస్థలు ఆధారపడుతున్నాయి. దీనివల్ల బడ్జెట్ను మించి వేతనాల భారం పెరుగుతోంది.ప్రస్తుతం కంపెనీలు తమ ఆపరేటింగ్ బడ్జెట్లో మూడు శాతాన్ని మాత్రమే శిక్షణకు కేటాయిస్తున్నాయి. రాబోయే ఏఐ యుగానికి అనుగుణంగా ఉద్యోగులను సన్నద్ధం చేసేందుకు ఈ బడ్జెట్ను కనీసం 6 శాతానికి పైగా పెంచాలని 94% జీసీసీ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. కేవలం పని పూర్తి చేసే కేంద్రాలుగా కాకుండా అంతర్జాతీయ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే ఇన్ఫ్లూయెన్స్ సెంటర్లుగా భారత్ నిలవాలంటే.. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు సర్టిఫికేషన్ విధానాలు, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్లు, విద్యాసంస్థలతో భాగస్వామ్యాలు కుదరాలి.ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి? -
అందుకే అమెరికా వదిలి వెళ్ళాను!: భారతీయ వ్యాపారవేత్త
చదువుకోవడానికో లేదా ఉద్యోగం చేయడానికో చాలామంది అమెరికా వెళ్లాలనుకుంటారు. కానీ.. అమెరికాలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ భారతీయ వ్యాపారవేత్త యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.సాధారణంగా.. విదేశాలకు వెళ్లాలంటే మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వ్యాపార అవకాశాలు వంటి కారణాలు ఉంటాయి. కానీ.. నంద్ జావియా విషయంలో మాత్రం కారణం పూర్తిగా భిన్నం. ప్రపంచాన్ని చూడాలనే కోరికతో యూరప్కు వెళ్లినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2022లో యూరప్తో పరిచయంనంద్ జావియాకు యూరప్తో మొదటి పరిచయం 2022లో ఏర్పడింది. స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా తొలిసారి స్పెయిన్కు వెళ్లాడు. అప్పటి వరకు యూరప్ను ప్రత్యక్షంగా చూడకపోవడంతో అక్కడి జీవన విధానం, సంస్కృతి, వాతావరణం గురించి తెలియదు. స్పెయిన్ పర్యటన ఆయన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. యూరప్ తనకు ఎంతగానో నచ్చిందని, అక్కడ ఎక్కువ కాలం ఉండాలనే ఆలోచన అప్పుడే మొదలైందని ఆయన చెప్పారు. యూరప్తో పూర్తిగా ప్రేమలో పడిపోయాను అని అన్నారు.ఒక దేశానికే ఎందుకు పరిమితం కావాలి?విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం వెళ్లిన తర్వాత చాలామంది అక్కడే స్థిరపడిపోతారు. కానీ నంద్ జావియా మాత్రం అలా ఆలోచించలేదు. ఒక దేశానికి వెళ్లిన తర్వాత.. ప్రపంచంలో ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయని, ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సంస్కృతి, జీవన విధానం, అనుభవాలు ఉంటాయని ఆయన గుర్తించారు.అవకాశం ఉంటే.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లి కొత్త జీవితాన్ని అనుభవించవచ్చని భావించారు. అందుకే.. స్పెయిన్ తర్వాత యూరప్లోని మరో దేశమైన చెక్ రిపబ్లిక్లోని ప్రాగ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదుఅయితే అమెరికాను వదిలి యూరప్కు వెళ్లడం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని నంద్ జావియా చెప్పారు. దాదాపు నాలుగైదేళ్ల క్రితమే ఏదో ఒక సమయంలో యూరప్కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తర్వాత ఆయన కంపెనీ కూడా క్రమంగా ఎదిగింది. కంపెనీ కార్యకలాపాలను యూరప్లో ఉంటూనే నిర్వహించగల స్థాయికి వ్యాపారం చేరుకుంది. దీంతో తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి సరైన సమయం వచ్చిందని భావించారు.డబ్బు కంటే అనుభవాలకే ప్రాధాన్యంనంద్ జావియా చెప్పిన మాటల్లో ఎక్కువగా ఆకట్టుకునే అంశం ఇదే. యూరప్కు వెళ్లడానికి డబ్బు ప్రధాన కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.తన జీవితంలో ప్రధాన లక్ష్యం మిలియనీర్ కావడం కాదని, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ అక్కడి ప్రజలను, సంస్కృతులను, జీవన విధానాలను తెలుసుకుని ‘గ్లోబల్ సిటిజన్’గా మారడం తన లక్ష్యమని చెప్పారు. అంటే.. ఒకే చోట ఉండి సంపాదించడం కంటే.. ప్రపంచాన్ని చుట్టి చూడటం, కొత్త అనుభవాలు పొందడం తనకు ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు.అమెరికాలో డబ్బు.. యూరప్లో జీవితం?అమెరికా, యూరప్లను పోల్చుతూ నంద్ జావియా చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.మిలియనీర్ కావాలంటే అమెరికా మంచి ప్రదేశం అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. తన జీవిత లక్ష్యం కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదని చెప్పారు. యూరప్లో ఉంటే సంపాదించే విషయంలో కొన్ని అవకాశాలను వదులుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. అయితే దానికి బదులుగా తనకు కావాల్సిన జీవిత అనుభవాలు లభిస్తాయని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Nand Javia | Scaling Human Potential (@nand.javia) -
బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్ కాదు : బొద్దింకలు, ఎలుకలు, బల్లుల కేంద్రాలు
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) క్విక్-కామర్స్ ప్లాట్ఫారమ్స్కు భారీ షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన తనిఖీ డ్రైవ్లో బొద్దింకలు, గడువు ముగిసిన ఆహారం వంటి పలు ఆహార భద్రత, పరిశుభ్రత ఉల్లంఘనలు బయటపడటంతో, బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto), ఇన్స్టామార్ట్ (Instamart) సంస్థలకు చెందిన 14కేంద్రాల (Dark Stores/Warehouses) లైసెన్స్లను ఎఫ్డీఏ నిలిపి వేసింది.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాల గడువు తీరిపోవడం, బొద్దింకలు, ఎలుకలు, బల్లులు ఉండటం వంటి తీవ్రమైన లోపాలను అధికారులు గుర్తించారు. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో, మాల్వానీలోని మార్వే రోడ్డులో ఉన్న బే వ్యూ బిల్డింగ్లోని ఒక బ్లింకిట్ కేంద్రం యొక్క ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సును ఎఫ్డీఏ నిలిపివేసింది.గడువు ముగిసిన ఆహారం కారణంగా జెప్టో కేంద్రంపై సస్పెన్షన్ వేటు వేసింది. <In a major crackdown on quick-commerce storage facilities, the Maharashtra FDA conducted a surprise raid on a Swiggy Instamart dark store located on Hill Road in Bandra West.During the inspection, officials discovered severe hygiene and storage violations, including cockroaches… pic.twitter.com/em18ndLPJ2— Mid Day (@mid_day) August 14, 2026 మొత్తం 86 కేంద్రాలు తనిఖలు చేయగా కోల్డ్ స్టోరేజ్ ఉష్ణోగ్రతలలో తీవ్ర లోపాలు , 40 మంది సిబ్బందికి వైద్య పరీక్షల రికార్డులులేకపోవడం వర్కర్లు హెడ్గేర్, ఆప్రాన్, గ్లౌజులు ధరించకపోవడంలాంటి కనీస నిబంధనల ఉల్లంఘనలను గమనించారు. ఆహార ప్యాకెట్ల పక్కనే ఎలుకల పిండెల (Rodent droppings) కుప్పలు, బల్లుల సంచారం , తుప్పు పట్టిన ర్యాక్లను అధికారులు కనుగొన్నారు. ఇంకా కుప్పలుగా గడువు తీరిన చికెన్తోపాటు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు, తీవ్రమైన బొద్దింకల బెడద, లోపభూయిష్టమైన సీలింగ్ , ఫ్లోరింగ్లను గుర్తించారు. ఈ కేంద్రానికి 74 మార్కులకు గాను కేవలం 34 (46%) మార్కులు మాత్రమే లభించాయి. 60 కేంద్రాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. దాదాపు 14 కేంద్రాల లైసెన్సులను నిలినివేసింది. బ్లింకిట్,జెప్టోకి చెందిన చెరో 5 కేంద్రాలు ఉండగా, ఇన్స్టామార్ట్ కేంద్రాలు రెండు,ఇతరాలు రెండు ఉన్నాయి.గోరేగావ్ ఈస్ట్లోని దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ సిటీలో ఉన్న 'బాలీవుడ్ కేఫ్' పై కూడా FDA దాడులు నిర్వహించింది. అత్యంత పరిశుభ్రత లేని వాతావరణంలో ఈగలు, మురికి డ్రెయిన్లు, తుప్పు పట్టిన పరికరాల మధ్య ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు కనుగొని, ఆహార భద్రతా చట్టం (Section 69) కింద చర్యలు ప్రారంభించారు. ఇదీ చదవండి: సియా కుటుంబానికి మరో షాక్, నేరం రుజువైతే భారీ జరిమానా, జీవిత ఖైదు -
అప్పర్ లేయర్లోనే టాటా సన్స్
ముంబై: ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన అప్పర్లేయర్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీలు)ల జాబితాలో టాటా సన్స్కు మరోసారి చోటిచ్చింది. ఎన్బీఎఫ్సీ రిజి్రస్టేషన్ను వొదులుకునేందుకు టాటా సన్స్ చేసుకున్న దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పటికీ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ హోదాను కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే ఈ అంశం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ డీరిజిస్ట్రేషన్కు అడ్డంకికాబోదని స్పష్టం చేసింది. నిజానికి 2022లో టాటా సన్స్ అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందింది. దీంతో మరింత కఠిన నియంత్రణా సంబంధ నిబంధనలను కంపెనీ పాటించవలసి ఉంటుంది. నియమిత కాలంలో స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్సహా.. కార్పొరేట్ గవర్నెన్స్, కనీస మూలధనం, రిస్కుల నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే కంపెనీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టడంతో ఆర్బీఐ గుర్తింపునుంచి మినహాయింపును కోరుతోంది. దీనిలో భాగంగా ఇన్వెస్ట్మెంట్ కార్యకలాపాలను విడదీయడం, రుణాలను తగ్గించుకోవడం, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్ విభాగాలను పునర్వ్యవస్థీకరించడం తదితరాలను చేపట్టింది. ఇతర ఎన్బీఎఫ్సీలతో పోలిస్తే కంపెనీ ప్రధానంగా టాటా గ్రూప్లో పెట్టుబడుల నిర్వహణతో హోల్డింగ్ దిగ్గజంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. తాజా జాబితా ఇదీ.. ఆర్బీఐ 17 కంపెలతో తాజా జాబితాను విడుదల చేసింది. టాటా సన్స్సహా.. పీఎస్యూలు ఆర్ఈసీ, పీఎఫ్సీ, ఐఆర్ఎఫ్సీ, హడ్కో చేరాయి. ఇంకా ఈ జాబితాలో డిపాజిట్లు స్వీకరించే ఎన్బీఎఫ్సీలు.. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ హౌసింగ్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. డిపాజిట్లు స్వీకరించని ఎన్బీఎఫ్సీ జాబితాలో టాటా క్యాపిటల్, చోళమండలం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, ఎల్అండ్టీ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీబీ ఫైనాన్షియల్, పిరమల్ ఫైనాన్స్కు చోటు లభించింది. కాగా.. ఇంతక్రితం ప్రకటించిన జాబితాలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, సమ్మాన్ క్యాపిటల్కు అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీ గుర్తింపు ఇచ్చినప్పటికీ నిబంధనలు పాటించలేదని ఆర్బీఐ పేర్కొంది. అయితే వీటిని ఈ జాబితాలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. -
ఐదేళ్లుగా వింత ప్రయోగం.. దొంగతనం కాలేదన్న సీఈఓ!
భారత్ అగ్రి వ్యవస్థాపకుడు, సీఈఓ 'సిద్ధార్థ్ డయలాని' బెంగళూరులో చేసిన ఓ చిన్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్యతో కలిసి గత ఐదేళ్లుగా ఆయన ఈ ప్రయోగం చేస్తున్నారట. ఎక్కడికి వెళ్లినా బైక్ను పార్క్ చేసినప్పుడు హెల్మెట్కు ఎలాంటి లాక్ వేయకుండా సీటుపైనో, సైడ్ మిర్రర్పైనో పెట్టి వెళ్తున్నారు. ఆశ్చర్యకరంగా ఇప్పటివరకు ఒక్క హెల్మెట్ కూడా దొంగతనం కాలేదని ఆయన చెప్పడంతో నెట్టింట చర్చ మొదలైంది.బెంగళూరులో ప్రజలు ఒకరినొకరు ఎంతవరకు నమ్మవచ్చో తెలుసుకోవడాని ఈ ప్రయోగం చేస్తున్నట్లు సిద్ధార్థ్ డయలాని పేర్కొన్నారు. దీనికోసం పెద్దగా పెట్టుబడి పెట్టకుండా.. హెల్మెట్ ప్రయోగం స్టార్ట్ చేశారు. ఐదేళ్లుగా హెల్మెట్లు సురక్షితంగా ఉండటంతో.. బెంగళూరు ఒక హై-ట్రస్ట్ సిటీ అని చెప్పవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే.. ఈ ప్రయోగానికి వారు ఒక కండిషన్ కూడా పెట్టుకున్నారు. ఏ రోజు తమ హెల్మెట్ దొంగతనానికి గురవుతుందో.. తరువాత ఆ ప్రాంతానికి వెళ్లడం మానేస్తామని సిద్ధార్థ్ చెప్పారు. అంటే.. ఒక్క హెల్మెట్ పోవడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రజలపై తమ నమ్మకం పోయినట్లే అన్నమాట. ఈ విషయం కొంతమంది నెటిజన్లను ఆకట్టుకుంది. చాలామంది తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.కొందరు సిద్ధార్థ్ డయలాని చేసిన పనిని మెచ్చుకున్నారు. మరికొందరు విమర్శించారు. ''హెల్మెట్ రేటు తక్కువగా ఉండటం వల్ల ఎవరూ పట్టించుకోకపోయి ఉండొచ్చు.. ఖరీదైనది పెట్టి చూడండి, అప్పుడు అసలు విషయం తెలుస్తుంది'' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం బైక్, హెల్మెట్ రెండూ సురక్షితంగా ఉండకపోవచ్చని హెచ్చరించారు. దీంతో బెంగళూరు మొత్తం ఒకేలా ఉండదని, ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు.Me and my wife have been running a social experiment in Bangalore. Whenever we park our two wheeler in any area, we don't lock our helmets. We just keep it on the side mirror or on the seat. It's a low cost experiment to know if Bangalore is a high trust city or not.It has…— Siddharth Dialani (@siddharth_iitm) August 13, 2026 -
‘వ్యాపార స్వాతంత్య్రం’ ఎలా వచ్చిందంటే..
ఒకప్పుడు భారత్లో వ్యాపారం అంటే అనుమతులు, పన్నులు, ప్రభుత్వ నియంత్రణల మధ్య సాగేది. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం పరిశ్రమలపై మరింత నియంత్రణ సాధించింది. 1991 ఆర్థిక సంస్కరణలతో పరిస్థితి పూర్తిగా మారింది. నేడు డిజిటల్ సింగిల్ విండో, డీరెగ్యులేషన్, లేబర్ కోడ్లతో వ్యాపారం ప్రారంభించే విధానం మరో దశలోకి వెళ్లింది.స్వాతంత్యానికి ముందు.. వ్యాపారం అంటే?1947కు ముందు ‘బిజినెస్ ప్రారంభించడానికి ఒకే చట్టం’ అంటూ ఏదీ లేదు. కంపెనీలు, కర్మాగారాలు, గనులు, ఉప్పు, మద్యం, బ్యాంకింగ్, దిగుమతులు-ఎగుమతులకు వేర్వేరు చట్టాలు, నిబంధనలు ఉండేవి. బ్రిటిష్ ఇండియా, సంస్థాన ప్రాంతాల్లోనూ విధానాలు భిన్నంగా ఉండేవి.కంపెనీల ఏర్పాటుకు 19వ శతాబ్దంలోనే చట్టపరమైన వ్యవస్థ మొదలై, చివరకు కంపెనీల చట్టం, 1913 అమల్లోకి వచ్చింది. కంపెనీల ఏర్పాటు, నిర్వహణ, మూసివేతకు ఇది ప్రాతిపదికగా నిలిచింది. అయితే నేటి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో దీన్ని పోల్చలేం. వలస పాలనలో ఆర్థిక విధానాలు ప్రధానంగా బ్రిటిష్ పాలన అవసరాలకు అనుగుణంగా ఉండేవి.ఉప్పుపై ప్రభుత్వ నియంత్రణ ఇందుకు ఉదాహరణ. 1882 ఉప్పు చట్టం ద్వారా ఉప్పు తయారీ, సేకరణ, నిర్వహణపై నియంత్రణ ఉండేది. ప్రజలు స్వయంగా ఉప్పు తయారు చేయడం, విక్రయించడం స్వేచ్ఛగా చేయలేకపోయారు. ఈ పరిస్థితి మహాత్మాగాంధీ నేతృత్వంలోని ఉప్పు సత్యాగ్రహానికి కీలక నేపథ్యంగా మారింది.కర్మాగారం పెట్టాలంటే కార్మిక చట్టాలుపరిశ్రమలపై నియంత్రణతో పాటు కార్మిక చట్టాలు కూడా వచ్చాయి. 1881లో తొలి ఫ్యాక్టరీ చట్టం అమల్లోకి వచ్చింది. పిల్లల పనివేళలు, కొన్ని భద్రతా అంశాలపై పరిమితులు విధించింది. 1891, 1911, 1922, 1934లో చట్టాలు మరింత విస్తరించాయి. పని గంటలు, కార్మిక సంక్షేమం, భద్రత వంటి అంశాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి.1947 తర్వాత.. ప్రభుత్వ ఆధిపత్యంస్వాతంత్య్రం తర్వాత భారత్ స్వయం సమృద్ధి కలిగిన పారిశ్రామిక దేశంగా ఎదగడంపై దృష్టి పెట్టింది. 1948 పారిశ్రామిక విధానంతో పరిశ్రమల్లో ప్రభుత్వ పాత్రకు రూపం వచ్చింది. కొన్ని కీలక రంగాలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి, మరికొన్నింటిలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇచ్చారు. 1951లో వచ్చిన పరిశ్రమల (Development and Regulation) చట్టం ద్వారా కొన్ని పరిశ్రమల స్థాపన, విస్తరణపై కేంద్రానికి లైసెన్సింగ్ అధికారం లభించింది.1956 పారిశ్రామిక విధానంతో ప్రభుత్వ పాత్ర మరింత పెరిగింది. పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి కేటాయించినవి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి అనువైనవి, ప్రైవేటు రంగానికి చెందినవిగా విభజించారు. దీంతో పరిశ్రమ ప్రారంభించడం, ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, విస్తరించడం వంటి వాటికి ప్రభుత్వ అనుమతులు కీలకమయ్యాయి. ఇదే ‘లైసెన్స్ రాజ్’కు బలం చేకూర్చింది.1991.. అతిపెద్ద మలుపు1991 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా మార్చుకుంది. జూలై 24, 1991న ప్రకటించిన కొత్త పారిశ్రామిక విధానంలో చాలా పరిశ్రమలకు లైసెన్సింగ్ను రద్దు చేశారు. వ్యూహాత్మక, భద్రత, పర్యావరణ, ప్రమాదకర ఉత్పత్తులకు సంబంధించిన కొన్ని రంగాలను మాత్రం మినహాయించారు.సామర్థ్య నియంత్రణలు కూడా గణనీయంగా తొలగడంతో కంపెనీలకు ఉత్పత్తి, విస్తరణ నిర్ణయాల్లో స్వేచ్ఛ పెరిగింది. ప్రైవేటు రంగానికి మరిన్ని అవకాశాలు, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. అంటే 1950–80లలో ‘ముందు ప్రభుత్వ అనుమతి.. తర్వాత పెట్టుబడి’ విధానం ఉంటే, 1991 తర్వాత మార్కెట్ ఆధారిత నిర్ణయాలకు ప్రాధాన్యం పెరిగింది.కంపెనీల చట్టంలోనూ మార్పులు1913 కంపెనీల చట్టం స్థానంలో స్వాతంత్య్రం తర్వాత కంపెనీల చట్టం, 1956 వచ్చింది. ఆ తర్వాత పారదర్శకత, పెట్టుబడిదారుల రక్షణ, కార్పొరేట్ పాలనకు ప్రాధాన్యం పెరగడంతో కంపెనీల చట్టం, 2013 అమల్లోకి వచ్చింది.ఇప్పుడు.. డిజిటల్గా వ్యాపారం2026 నాటికి వ్యాపారం ప్రారంభించే విధానం మరింత డిజిటల్గా మారింది. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (NSWS) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరమైన అనుమతులను గుర్తించి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం NSWS 32 కేంద్ర విభాగాల మార్గదర్శకత్వాన్ని, 34 రాష్ట్ర ప్రభుత్వాల అనుమతుల కోసం అప్లికేషన్ సదుపాయాలను అందిస్తోంది. కొత్త ఇండస్ట్రియల్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ఎంట్రాప్రెన్యూర్ మెమొరాండం (IEM) దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇందులోకి మారింది.2025లో మరో కీలక సంస్కరణ2025 నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చాయి. వీటి ద్వారా 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర కోడ్లుగా ఏకీకృతం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగుల భద్రత-ఆరోగ్యానికి సంబంధించిన నిబంధనలను ఒకే విస్తృత చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం వీటి లక్ష్యం.మొత్తంగా చూస్తే.. బ్రిటిష్ కాలంలో పరిమితులు, పన్నులు, ఏకాధికారాల నుంచి స్వాతంత్య్రం తర్వాత ప్రభుత్వ ఆధిపత్యం, ఆపై 1991లో మార్కెట్ సంస్కరణలు.. ఇప్పుడు డిజిటల్ అనుమతులు, సరళీకృత నిబంధనల వరకు భారత్లో వ్యాపార వ్యవస్థ ఎన్నో దశలను దాటింది. -
ఘనంగా రమేష్ హాస్పిటల్స్ వార్షికోత్సవ వేడుకలు!
1988 ఆగస్టు 15న కేవలం ఆరు పడకలతో ప్రత్యేక గుండె వైద్య ఆసుపత్రిగా ప్రారంభమైన రమేష్ హాస్పిటల్స్, 38 ఏళ్ల సేవా ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థగా ఎదిగింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ప్రాంతానికే చేరువ చేయాలనే లక్ష్యంతో సాగిన ఈ ప్రయాణంలో లక్షలాది మంది రోగుల విశ్వాసాన్ని సంస్థ సంపాదించింది.ప్రస్తుతం విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, భీమవరం, తిరువూరు కేంద్రాల ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యం, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, అవయవ మార్పిడి, డిజిటల్ ఆరోగ్య సేవలు, గ్రామీణ వైద్యం, వైద్య విద్య, పరిశోధన వంటి విభాగాల్లో సేవలు అందిస్తోంది. ఈ 38 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న విజయవాడలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బి. సోమరాజు ముఖ్య అతిథిగా హాజరుకాగా, డాక్టర్ కామినేని పట్టాభి రామయ్య, డాక్టర్ సమరం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను రాయితీలతో మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన రమేష్ ప్రీమియం హెల్త్ కార్డును ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం.సి. దాస్ ప్రారంభించారు. -
ఏఐ జగత్తులో టాలెంట్ వార్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త ప్రాభవం అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, ప్రముఖ ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్ను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా రూ.800 కోట్ల (100 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెలువడిన నివేదికలు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక ఏఐ పరిశోధకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అంతర్జాతీయ సాంకేతిక చరిత్రలో అరుదైన ఘట్టం.ఎవరీ త్రపిత్ బన్సల్?త్రపిత్ బన్సల్ విజయం రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు; ఇది దశాబ్దానికి పైగా సాగిన కఠోర సాధన, నాణ్యమైన పరిశోధనల ఫలితం. 2007-2012 మధ్య ఐఐటీ కాన్పూర్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసిన బన్సల్, అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేశారు. తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పట్టా పొందారు.తన పరిశోధనా కాలంలో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్షిప్లు చేస్తూ డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) రంగాల్లో విశేష అనుభవాన్ని గడించారు. 2022లో ఓపెన్ఏఐలో చేరిన బన్సల్.. సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుత్సకెవర్తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఓపెన్ఏఐ అత్యంత సాంకేతిక సంక్లిష్టమైన రీజనింగ్ మోడల్ ‘ఓ1’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ ఏఐ వర్గాల్లో గుర్తింపు పొందారు.మెటా ఎందుకింత భారీ ఆఫర్ ఇచ్చింది?ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ (ఏజీఐ), సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు గూగుల్, మెటా, ఓపెన్ఏఐల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా, తమ 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్'ను బలోపేతం చేసేందుకు అత్యుత్తమ మేధావులను ఆకర్షిస్తోంది. బన్సల్కు ఉన్న మ్యాథమెటికల్ పునాది, అడ్వాన్స్డ్ ఏఐ రీజనింగ్ మోడళ్లపై ఉన్న అసాధారణ పట్టు మెటా వ్యూహాలకు కీలకంగా మారుతాయని కంపెనీ భావిస్తోంది.యువతకు సందేశంకోడింగ్ షార్ట్కట్లు, స్వల్పకాలిక కోర్సులతో కొన్ని విజయాలు సాధించాలనుకునే ఈ డిజిటల్ యుగంలో.. సుదీర్ఘ అధ్యయనం, ప్రాథమిక విజ్ఞానం, నిరంతర పరిశోధన మాత్రమే అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయని త్రపిత్ ప్రయాణం నిరూపిస్తోంది. సబ్జెక్టుపై తిరుగులేని నైపుణ్యం ఉంటే ప్రపంచమే మన కోసం వస్తుందని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
సిరుల సింహాసనంపై అంబానీ సామ్రాజ్యం
భారత ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా నిలుస్తున్న దిగ్గజ కుటుంబ వ్యాపార సంస్థలు సంపద సృష్టిలో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ‘హరూన్ ఇండియా - 2026’ తాజా నివేదిక ప్రకారం దేశంలోని అత్యంత విలువైన బహుళ తరాల (మల్టీజనరేషనల్) కుటుంబ వ్యాపారాల జాబితాలో అంబానీ కుటుంబం తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కుటుంబం రూ.25.83 లక్షల కోట్ల విలువతో దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా మొదటి స్థానంలో నిలిచింది.టాప్-10 సంపన్న కుటుంబ వ్యాపారాలుర్యాంక్వ్యాపార కుటుంబంవిలువ (లక్షల కోట్లలో)1అంబానీ కుటుంబంరూ.25.832కుమార్ మంగళం బిర్లా కుటుంబంరూ.8.143జిందాల్ కుటుంబంరూ.8.024బజాజ్ కుటుంబంరూ.7.705మహీంద్రా కుటుంబంరూ.5.156అనిల్ అగర్వాల్ కుటుంబంరూ.4.457మురుగప్ప కుటుంబంరూ.3.068నాడార్ కుటుంబంరూ.2.919ప్రేమ్జీ కుటుంబంరూ.2.7210ధాని, చోక్సీ, వకీల్ కుటుంబాలురూ.2.48అదానీ గ్రూప్ మినహాయింపునకు కారణమేంటి?ఈ జాబితాలో గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ లేదనే ప్రశ్న సాధారణంగా ఉద్భవిస్తుంది. హరూన్ వర్గీకరణ విధానం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ తరాలుగా పరంపరగా కొనసాగుతున్న వంశపారంపర్య వ్యాపార సంస్థలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. గౌతమ్ అదానీ నిర్మించిన వ్యాపార సామ్రాజ్యాన్ని హరూన్ ‘తొలి తరం వ్యాపారం’గా పరిగణించింది. తొలి తరం వ్యాపార సంస్థల విభాగంలో అదానీ కుటుంబం రూ.19.57 లక్షల కోట్లు అగ్రస్థానంలో నిలిచింది.దేశ కార్పొరేట్ పన్ను వసూళ్లలో దాదాపు 17% వాటాను ఈ కుటుంబ వ్యాపార సంస్థలే అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి. తరాలు మారినా సుపరిపాలన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన నాయకత్వంతో ఈ వ్యాపార సామ్రాజ్యాలు గ్లోబల్ మార్కెట్లో భారత్ను అగ్రపథంలో నిలుపుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. -
12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
ఒక సాదాసీదా దోశ వ్యాపారాన్ని కోట్ల రూపాయల స్థాయికి చేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫుడ్ బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వడ్డించే వంటకాన్ని సరిగ్గా, పరిశుభ్రంగా అందిస్తే వ్యాపారం విజయవంతం కావచ్చని ముంబైలోని బెన్నె దోస రెస్టారెంట్ నిరూపించిందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా అంటున్నారు. బెన్నె దోశ లేదా వెన్న దోశ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తూ దాని సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.ముంబైలోని బాంద్రాలో కేవలం 12 సీట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ‘బెన్నె’ (Benne) దోశ కేఫ్, ప్రస్తుతం రూ. 350 కోట్ల విలువైన బ్రాండ్గా ఎదిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాను ఆకర్షించింది. ప్రముఖ దోశల చైన్ అయిన 'బెన్నె' ఇంత భారీ విజయం సాధించడానికి కారణమని తాను నమ్మే విషయాలను గోయెంకా విశ్లేషించారు. ఒక నిర్దిష్టమైన మెనూ, తెలివైన నిర్వహణ, అందుబాటు ధరలు, అన్నింటికన్నా ముఖ్యంగా, ఆ బ్రాండ్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్ లాంటి అంశాలను ఆయన పేర్కొన్నారు.దావణగెరె-శైలి బెన్నె (వెన్న) దోశ స్పెషల్ : చాలా మందికి అలవాటైన పెద్ద, పలుచని, కరకరలాడే దోశలలా కాకుండా, ఈ కర్ణాటక స్టైల్ దోశ విభిన్నంగా ఉంటుంది. చిన్నగా, లోపల మెత్తగా ఉండి, వెన్నతో నిండుగా ఉంటుంది. ఈ విలక్షణమైన శైలే బెన్నెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.Why has ‘Benne’ succeeded so spectacularly?- One hero product: Davangere-style butter dosa- Small menu, easy to perfect and replicate- Electronic self order + self service creates engagement - Affordable enough to become a habit- Long queues created social media buzz-… pic.twitter.com/VcpMCEX2lB— Harsh Goenka (@hvgoenka) August 9, 2026 అఖిల్ అయ్యర్, శ్రియా నారాయణ్ అనే భార్యాభర్తలు ప్రారంభించిన ఈ స్టార్టప్, దేశంలోని ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్లకు గట్టి పోటీనిస్తోంది. ముంబైలో అథెంటిక్ కర్ణాటక/బెంగళూరు శైలి దావణగెరె బెన్నె దోశ దొరకకపోవడంతో, ఈ రుచిని అందరికీ అందించాలనే ఆశయంతో ఈ జంట స్వయంగా కేఫ్ పెట్టాలనుకున్నారు. 2024 లో ముంబైలోని బాంద్రాలో కేవలం 12 మంది కూర్చునే చిన్న అవుట్లెట్తో ప్రయాణం మొదలైంది. సాంప్రదాయ దక్షిణ భారత శైలి హోటల్ అయిన దానికి వారు 'బటర్' అని పేరు పెట్టారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్ దీని విజయానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, వారు దావణగెరె శైలి వెన్న దోశను తమ కాన్సెప్ట్గా చేసుకోవడమే అంటారు హర్ష గోయెంకా. సాధారణ రెస్టారెంట్లలా వంద రకాల మెనూ కాకుండా, కేవలం 'దావణగెరె స్టైల్ బెన్నె దోశ'పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అంతేకాదు సరైన చట్నీ రుచి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు, సాంప్రదాయ రుచి కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుండి కాస్ట్ ఐరన్ పెనాలను తెప్పించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వ్యాపారం పెరిగేకొద్దీ అదే పద్ధతిని, రుచిని అందించేలా జాగ్రత్త వహించారు. క్విక్-సర్వీస్ రెస్టారెంట్కు, ఆ సరళత మరో పెద్ద ప్రయోజనం. ఫలితం ఈ కేఫ్ రోజుకు 800 పైగా దోసలు విక్రయిస్తూ, నెలకు రూ.1 కోటి రాబడిని అందుకుంటోంది.ఇక బెన్నే ఎలక్ట్రానిక్ సెల్ఫ్-ఆర్డరింగ్, సెల్ఫ్-సర్వీస్ను ఉపయోగిస్తుంది, దీనివల్ల విస్తృతమైన టేబుల్ సర్వీస్ అవసరం తగ్గడమే కాకుండా, కస్టమర్లను కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తుంది. తద్వారా క్యూలో నిల్చునే కష్టాలు లేకుండా, రెస్టారెంట్కు ప్రజలకు త్వరగా సేవ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అయినా ఈ రెస్టారెంట్ వద్ద ఆహార ప్రియులు బారులు తీరిన వైనం ఈ వెన్న దోశ క్రేజ్కు అద్దం పట్టాయి. అంతేనా దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ వంటి సెలబ్రిటీలు రెస్టారెంట్ను సందర్శించడం, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిని మరింత పెంచాయి. ఇపుడీ బెన్నె దోశ ఖ్యాతి ముంబైలో అనేక శాఖలతో పాటు, ఢిల్లీలోని బ్రాంచ్లో కూడా వెలుగొందుతోంది. -
విప్రో తీరుపై ఆగ్రహం.. కేంద్ర మంత్రికి అత్యవసర లేఖ!
దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో ఎంపికైన 200 మందికి పైగా కొత్త ఇంజినీర్లు, విద్యార్థుల ఆన్బోర్డింగ్లో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘నైట్స్’ (NITES - Nascent Information Technology Employees Senate) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది.విప్రో ‘ఎలైట్ హైరింగ్ 2025’ ప్రక్రియ కింద ఎంపికైన 200 మందికి పైగా అభ్యర్థులకు జులై 2025లో ఆఫర్ లెటర్లు, ఆగస్టు 2025లో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అందాయి. మార్చి 2026లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నా నేటికీ అధికారికంగా విధుల్లో చేరే తేదీ కేటాయించలేదు. కంపెనీ హెచ్ఆర్ బృందాలు, సహాయక కేంద్రాలను సంప్రదించినా ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక, ఆర్థిక ఆందోళనకు గురవుతున్నారని నైట్స్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా ఆవేదన వ్యక్తం చేశారు.నైట్స్ ప్రధాన డిమాండ్లుబాధిత అభ్యర్థుల ఆన్బోర్డింగ్కు సంబంధించి సమయ పరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విప్రో ప్రకటించాలి. ఆఫర్ లెటర్లు, ఎల్ఓఐల చెల్లుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాలి. ఒకవేళ ఎంపికను రద్దు చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని అభ్యర్థులకు రాతపూర్వకంగా స్పష్టం చేయాలి.క్యాంపస్ ఎంపికల్లో విప్రో ఉద్యోగం వచ్చిందనే ధీమాతో చాలామంది ఇతర కంపెనీల అవకాశాలను వదులుకున్నారని, ప్రస్తుత జాప్యం వారి కెరీర్ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఐటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని వేధిస్తున్న అనిశ్చితి, క్లయింట్ ప్రాజెక్టుల మందగమనమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై విప్రో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.ఇదీ చదవండి: ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే! -
AI భయం.. జుకర్బర్గ్ గుడ్న్యూస్!
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయా? అనే భయం చాలామందిలో ఉంది. అయితే మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మాత్రం భవిష్యత్తులో ఉద్యోగాలకు కొరత ఉండదని అంటున్నారు.ఏఐ కొన్ని పనులను సులభంగా చేసినప్పటికీ.. అది మనుషులను పూర్తిగా భర్తీ చేయదు. కాబట్టి ఏఐ అనేది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మారుతుందని జుకర్బర్గ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో చిన్న టీమ్లతోనే పెద్ద కంపెనీలను నడిపే పరిస్థితి రావచ్చు. కంపెనీల పరిమాణం తగ్గినా.. కొత్త రకాల వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.అయితే.. అంత్రోఫిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ మాత్రం ఏఐ వల్ల ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల్లో పదేపదే చేయాల్సిన పనులను AI సులభంగా చేయగలదు. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి.. తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకునే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. -
వివాదంలో బిల్గేట్స్ కుమార్తె.. 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదా?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, బిలియనీర్ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ కుమార్తె 'ఫీబీ గేట్స్' వివాదంలో చిక్కుకుంది. ఆమె స్థాపించిన స్టార్టప్ ఫియా (Phia) కుకీ స్టఫింగ్’కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి.ఫీబీ గేట్స్, సోఫియా కియానీ కలిసి ఫియా స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఏఐతో నడిచే డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు డిస్కౌంట్ కూపన్లు వెతకడం, మంచి ధరలు చూపించడం, ఉత్పత్తుల వివరాలు అందించడం దీని పని. అయితే ఇప్పుడు ఈ కంపెనీ 'కుకీ స్టఫింగ్' అనే అనుమానాస్పద మార్కెటింగ్ పద్ధతిని ఉపయోగించిందనే ఆరోపణలు రావడంతో వార్తల్లో నిలిచింది.కుకీ స్టఫింగ్ అంటే ఏంటి?సాధారణంగా మనం ఒక కంపెనీ ఇచ్చిన కూపన్ లేదా లింక్ ద్వారా షాపింగ్ చేస్తే.. ఆ కొనుగోలు ఆ కంపెనీ ద్వారా జరిగిందని గుర్తించడానికి బ్రౌజర్లో ఒక చిన్న ట్రాకింగ్ ఫైల్ను కుకీగా ఉంచుతారు. దీని ద్వారా కంపెనీకి కొంత కమిషన్ వస్తుంది. కానీ.. మనం ఆ కంపెనీ కూపన్ ఉపయోగించకపోయినా.. ఆ లింక్పై క్లిక్ చేయకపోయినా సాఫ్ట్వేర్ మన బ్రౌజర్లో కుకీని పెట్టి, ఆ కొనుగోలు తమ వల్లే జరిగిందని చూపిస్తే దాన్ని 'కుకీ స్టఫింగ్' అంటారు. అంటే.. తాము చేయని అమ్మకానికి కూడా కమిషన్ తీసుకునే ప్రయత్నం అన్నమాట.20 ఏళ్లు జైలు శిక్ష?అమెరికాలో ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉంటాయి. కుకీ స్టఫింగ్ అనేది ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కిందికి వస్తుంది. కాబట్టి నేరం రుజువైతే ఏకంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.అయితే ఈ ఆరోపణలపైనా ఫియా సంస్థ స్పందిస్తూ.. ఈ సమస్యను తాము గుర్తించినట్లు పేర్కొంది. ఇది ఒక సాంకేతిక లోపమని స్పష్టం చేస్తూ.. దీనికి కారణమైన ఫీచర్లను తొలగించమని.. భాగస్వామ్య సంస్థలను నిధులను వెనక్కు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు చెప్పింది.నిజానికి ఈ కుకీ స్టఫింగ్ విషయం వ్యవస్థాపకులు ఏడు నెలలకు ముందే తెలుసని సమాచారం. ఇదే నిజమైతే ఫీబీ గేట్స్ చిక్కుల్లో పడ్డట్టే. అయితే ఈ ఫీచర్లను జులైలో నిలిపివేయడంతో.. కంపెనీ ఆదాయం భారీగా తగ్గిందని తెలుస్తోంది. అంటే ఫియా ఇప్పటికే భారీ లాభాలను గడించినట్లు స్పష్టమవుతోంది.Again, this is called cookie stuffing!On a simple level, it’s automatically injecting affiliate tracking cookies to claim commissions on sales you didn’t drive.It’s typically treated as federal wire fraud in US courts.There’s a possibility of a max penalty of up to 20 years… https://t.co/Oiz6PyJ0Qm— Ariel Givner (@GivnerAriel) August 11, 2026 -
టాటా సన్స్ చైర్మన్ రాజీనామా.. కొత్త బాస్కు బిగ్ సవాల్!
వచ్చే ఐదేళ్లలో దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.11.45 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని టాటా సన్స్ పెద్ద ప్లాన్ వేసుకుంది. కానీ.. చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆకస్మిక రాజీనామాతో ఈ ప్రణాళికపై కొంత అనిశ్చితి ఏర్పడింది. కొత్త నాయకుడు వచ్చే వరకు.. కొన్ని భారీ ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.చంద్రశేఖరన్ దాదాపు పదేళ్ల పాటు టాటా గ్రూప్ను నడిపారు. ఈ సమయంలో ఆయన టాటా భవిష్యత్తు కోసం సెమీకండక్టర్ చిప్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రాజెక్టులు వెంటనే లాభాలు ఇచ్చేవి కావు. అయితే.. వీటికి చాలా డబ్బు, సమయం, టెక్నాలజీ అవసరం. ఇలాంటి సమయంలో చంద్రశేఖరన్ తప్పుకోవడం సంస్థ వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది.చంద్రశేఖరన్ రాజీనామా తరువాత.. నోయెల్ టాటా సంస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రశేఖరన్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నోయెల్ మాత్రం ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు. ఎక్కువ కాలం తర్వాత లాభాలు వచ్చే ప్రాజెక్టుల కంటే, పెట్టిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అందుకే.. టాటా బోర్డు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను మళ్లీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ ప్లాంట్, ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్ వంటి వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇందులో పెట్టుబడులు పెడితే.. ఎంత లాభం వస్తుంది, పెట్టుబడి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలను బోర్డు తెలుసుకోవాలనుకుంటోంది. అంటే టాటా ఇప్పుడు కేవలం పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం మాత్రమే కాకుండా, వాటి ఫలితాలు మరియు ఖర్చులను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.టాటా గ్రూప్ ఇప్పటికే జాగ్వార్ ల్యాండ్ రోవర్, తాజ్ హోటల్స్, ఎయిర్ ఇండియా, టెట్లీ టీ వంటి పెద్ద వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లోకి అడుగుపెడుతోంది. ఈ పెట్టుబడులు టాటాకు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ముఖ్యమైనవి.భారత్ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి టాటా పెట్టుబడులు ఉపయోగపడతాయి. అందుకే.. కొత్త టాటా చైర్మన్ ముందు పెద్ద బాధ్యత ఉంది. చంద్రశేఖరన్ ప్రారంభించిన పెద్ద ప్రణాళికలను కొనసాగించాలా, లేక పెట్టుబడులను కొంత తగ్గించి ముందుగా లాభాలపై దృష్టి పెట్టాలా అనేది నిర్ణయించాలి.ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్న్యూస్! -
టాటా సన్స్ నూతన సారథి ఎవరు?
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ మాతృ సంస్థ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ 2027 ఫిబ్రవరి 20తో తన పదవీ కాలాన్ని ముగించి బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో కార్పొరేట్ ప్రపంచంలో పెద్దఎత్తున చర్చ మొదలైంది. బోర్డులో సర్వామోదం లభించకపోవడం, ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో వ్యూహాత్మక విధానాలపై ఏర్పడిన వ్యత్యాసాల నేపథ్యంలో ‘చంద్ర’గా ప్రాచుర్యం పొందిన ఆయన మూడోసారి పదవీకాలాన్ని కోరకూడదని నిశ్చయించుకున్నారు. తొమ్మిదేళ్ల తన హయాంలో సెమీకండక్టర్లు, ఈవీ రంగాలు, ఎయిర్ ఇండియా పునరుద్ధరణ, డిజిటల్ వ్యాపారాల్లో గ్రూప్ను నూతన శిఖరాలకు చేర్చిన ఆయన సజావుగా నాయకత్వ మార్పిడి జరిగేలా త్వరలోనే వారసుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని బోర్డును కోరారు.టాటా సన్స్ నిబంధనావళి (ఆర్టికల్ 118) ప్రకారం నూతన ఛైర్మన్ను ఎంపిక చేసేందుకు టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ బోర్డు ప్రతినిధులతో కూడిన ఐదుగురు సభ్యుల హై-పవర్ సెలేక్షన్ కమిటీ కొద్దిరోజుల్లో ఏర్పాటవుతోంది.ఈ వారసత్వ రేసులో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ టీవీ నరేంద్రన్ (61) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. టాటా గ్రూప్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నరేంద్రన్.. సంక్షోభంలో ఉన్న భూషణ్ స్టీల్ విలీనాన్ని విజయవంతంగా ముగించారు. అంతేకాకుండా, కళింగనగర్ ప్లాంట్ విస్తరణ, యూరప్లో గ్రీన్ స్టీల్ దిశగా వేగవంతమైన పరివర్తనను సాధించి, టాటా స్టీల్ను స్థిరమైన లాభాల బాట పట్టించారు. పారిశ్రామిక రంగానికి సంబంధించి ఆయనకున్న పట్టు, కార్యనిర్వాహక సామర్థ్యం ఆయనను కీలకంగా నిలబెట్టాయి.నరేంద్రన్తో పాటు టీసీఎస్ సీఈఓ కే.కృతివాసన్, జేఎల్ఆర్ సీఈఓ పి.బి.బాలాజీ, టాటా మోటార్స్ ఈవీ విభాగాధిపతి శైలేష్ చంద్రల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే, గ్రూప్లోని ఎగ్జిక్యూటివ్ రిటైర్మెంట్ వయోపరిమితి (65 ఏళ్లు) నిబంధన, 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ దృక్పథానికి పూర్తిగా అనుగుణంగా నడుచుకునే నేతను ఎంచుకోవడం బోర్డు ముందున్న ప్రధాన సవాలు. 280 బిలియన్ డాలర్ల సమూహానికి అంతర్గత నాయకుడే ప్రాతినిధ్యం వహిస్తారా లేక వెలుపలి నుంచి మరోవ్యక్తిని రంగంలోకి దించుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.ఇదీ చదవండి: వివాదాస్పద కంటెంట్కు యాడ్ మనీ! -
ఊరికే ‘వావ్’ అన్నారనుకో.. ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్లకు వార్నింగ్!
సోషల్ మీడియాలో ఫుడ్ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేసే సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇకపై ఏదిపడితే అది చెప్పేయడానికి వీల్లేదు. ఆహార ఉత్పత్తులపై తప్పుడు, అతిశయోక్తి లేదా ధ్రువీకరించని క్లెయిమ్లను ప్రచారం చేయొద్దంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తాజాగా హెచ్చరించింది. ఉత్పత్తిని ప్రమోట్ చేసే ముందు అందులోని క్లెయిమ్లు నిజమైనవా, ధ్రువీకరించగలిగినవా, నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని సూచించింది.‘గొప్ప ప్రభావంతో గొప్ప బాధ్యత వస్తుంది’ అనే సందేశంతో FSSAI ఈ అంశాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తులను ప్రమోట్ చేసే సమయంలో తమ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఇన్ఫ్లుయెన్సర్లకు సూచించింది. ధ్రువీకరించని లేదా తప్పుదోవ పట్టించే ఆహార క్లెయిమ్లను ప్రచారం చేస్తే చట్టపరమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది.ఆరోగ్య ప్రయోజనాల క్లెయిమ్లపై నిఘాహెల్త్ డ్రింక్స్, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి ఉత్పత్తులకు సోషల్ మీడియా ప్రమోషన్లు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘ఇమ్యూనిటీని పెంచుతుంది’, ‘పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది’ వంటి ఆరోగ్య సంబంధిత క్లెయిమ్లను ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రచారం చేయకూడదని FSSAI సూచిస్తోంది.FSSAI నిబంధనల ప్రకారం ఆహార ఉత్పత్తులపై చేసే క్లెయిమ్లు నిజమైనవి, స్పష్టమైనవి, అర్థవంతమైనవి, వినియోగదారులను తప్పుదోవ పట్టించనివిగా ఉండాలి. ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించిన క్లెయిమ్లకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రకటనలోని క్లెయిమ్లు ఉత్పత్తి లేబుల్పై ఉన్న సమాచారంతోనూ సరిపోవాలి.‘100%’ క్లెయిమ్లపైనా కఠిన వైఖరిఆహార రంగంలో ‘100% ప్యూర్’, ‘100% నేచురల్’, ‘100% ఆర్గానిక్’ వంటి పదాల వినియోగంపై కూడా FSSAI ఇటీవల కఠినంగా వ్యవహరిస్తోంది. ‘100%’ అనే పదం ఆహార నిబంధనల్లో లేదని, ఇలాంటి క్లెయిమ్లు వినియోగదారుల్లో ఉత్పత్తి సంపూర్ణంగా స్వచ్ఛమైనదనే తప్పుదారి పట్టించే భావన కలిగించే అవకాశం ఉందని రెగ్యులేటర్ గతంలో స్పష్టం చేసింది.తాజాగా డాబర్ ఇండియా విషయంలోనూ ఇదే అంశం చర్చనీయాంశమైంది. తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు, కొబ్బరి పాలు తదితర ఉత్పత్తులపై ‘100%’ క్లెయిమ్లను FSSAI అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ అంశంలో తాజా పరిణామంగా ఢిల్లీ హైకోర్టు FSSAI ఆదేశంపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో డాబర్కు ప్రస్తుతం సంబంధిత ఉత్పత్తులను విక్రయించేందుకు తాత్కాలికంగా అవకాశం లభించింది. కేసు కోర్టు పరిశీలనలో ఉంది.ఇన్ఫ్లుయెన్సర్లకు ఇప్పటికే ఉన్న బాధ్యతలుఫుడ్ ప్రమోషన్ల విషయంలో FSSAI నిబంధనలతో పాటు వినియోగదారుల వ్యవహారాల శాఖ రూపొందించిన 2022లోని తప్పుదోవ పట్టించే ప్రకటనలు, ఎండార్స్మెంట్ల మార్గదర్శకాలు కూడా కీలకంగా ఉన్నాయి. వీటి ప్రకారం సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఉత్పత్తిని ప్రమోట్ చేసే ముందు తగిన డ్యూ డిలిజెన్స్ చేయాలి. వారి ఎండార్స్మెంట్ నిజమైన అభిప్రాయం లేదా అనుభవాన్ని ప్రతిబింబించాలి. తప్పుడు లేదా మోసపూరిత క్లెయిమ్లకు మద్దతు ఇవ్వకూడదు.ఆరోగ్యం, వెల్నెస్ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేక మార్గదర్శకాలు కూడా సూచిస్తున్నాయి. క్లెయిమ్లకు తగిన ఆధారాలు ఉన్నాయో లేదో పరిశీలించడం, అవసరమైనప్పుడు ఆధారాలు లేదా మూలాలను వెల్లడించడం, తప్పుడు లేదా అతిశయోక్తి సమాచారాన్ని ప్రచారం చేయకపోవడం వంటి బాధ్యతలను అవి నిర్దేశిస్తున్నాయి.తప్పుదోవ పట్టిస్తే జరిమానా కూడా..తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో కేవలం బ్రాండ్ మాత్రమే కాకుండా ఎండార్సర్పైనా చర్యలు తీసుకునే నిబంధనలు ఉన్నాయి. వినియోగదారుల రక్షణ చట్టం కింద మొదటి ఉల్లంఘనకు రూ.10 లక్షల వరకు, పునరావృత ఉల్లంఘనకు రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నిర్దిష్ట కాలానికి ఎండార్స్మెంట్ చేయకుండా నిషేధించే చర్యలు కూడా ఉండొచ్చు.అందుకే ఇకపై ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఉత్పత్తి రుచి చూసి ‘వావ్’ అనడం మాత్రమే కాకుండా, దాని ఆరోగ్య ప్రయోజనాలు, స్వచ్ఛత, పోషక విలువలు వంటి అంశాలపై తాము చేసే ప్రతి క్లెయిమ్ వెనుక ఆధారం ఉందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. ఫాలోవర్ల నమ్మకాన్ని ఉపయోగించి చేసే ప్రతి ఫుడ్ ప్రమోషన్కు బాధ్యత కూడా అంతే స్థాయిలో ఉంటుందని FSSAI తాజా హెచ్చరిక స్పష్టం చేస్తోంది.With great influence comes great responsibility! Before endorsing a food product, ensure that claims are truthful, verifiable & compliant with the law. Promoting misleading or unverified food claims can attract legal consequences. Verify before you amplify.#FSSAIRegulations pic.twitter.com/t0UQzRTnPq— FSSAI (@fssaiindia) August 11, 2026 -
గిగ్ కార్మికులకు రిటైర్మెంట్ భద్రత
ఫుడ్ డెలివరీ, రైడ్ షేరింగ్, క్విక్ కామర్స్ వంటి డిజిటల్ వేదికల్లో పనిచేస్తున్న గిగ్ కార్మికుల భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా పీఎఫ్ఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ ఉద్యోగాల వలె పదవీ విరమణ ప్రయోజనాలు లేని ఈ అసంఘటిత రంగాన్ని జాతీయ పింఛను విధానం (ఎన్పీఎస్) పరిధిలోకి తీసుకురావడానికి ‘ఈ-శ్రామిక్’ (ప్లాట్ఫామ్ సర్వీస్ పార్ట్నర్) నమూనాను పీఎఫ్ఆర్డీఏ ప్రచారం చేస్తోంది.సరళమైన విరాళాల విధానంగిగ్ కార్మికుల నెలవారీ ఆదాయంలో ఉండే హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్ను సులభతరంగా తీర్చిదిద్దారు. కార్మికులు కేవలం రూ.99 వంటి నామమాత్రపు చందాతో పొదుపును ప్రారంభించవచ్చు. అయితే, విరాళాలపై నిర్బంధ కనీస పరిమితి (మ్యాండేటరీ ఫ్లోర్) ఏదీ విధించలేదు. ఈ విధానంలో పొదుపు మొత్తాన్ని కార్మికుడు ఒక్కడే చెల్లించవచ్చు లేదా అగ్రిగేటర్ సంస్థ పూర్తిగా భరించవచ్చు లేదా ఇద్దరూ కలిసి సంయుక్తంగా జమ చేసే వెసులుబాటును కల్పించారు.ఆధార్ కేవైసీ.. ఖాతా పోర్టబిలిటీఅగ్రిగేటర్లతో అనుబంధం ఉన్న ‘పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్’(పీఓపీ)ల ద్వారా నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఆధార్ ఆధారిత కేవైసీ, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పిస్తే చాలు కార్మికుడికి శాశ్వత రిటైర్మెంట్ ఖాతా సంఖ్య (ప్రాన్) కేటాయిస్తారు. ఈ వ్యవస్థలో ఉన్న ప్రధాన ప్రయోజనం.. పోర్టబిలిటీ. కార్మికుడు ఒక సర్వీస్ ప్లాట్ఫామ్ నుంచి మరొక దానికి మారినప్పటికీ అతడి పెన్షన్ ఖాతా యథాతథంగా కొనసాగుతుంది.దేశీయ శ్రామిక శక్తిలో వేగంగా పెరుగుతున్న గిగ్ విభాగాన్ని అధికారిక సామాజిక భద్రతా వలయంలోకి చేర్చడానికి ఇది ఒక విప్లవాత్మక అడుగు. అయితే, ఎన్పీఎస్ రాబడులు మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉండటం, కార్మికులకు స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల క్రమబద్ధమైన విరాళాలు సేకరించడం ప్రధాన సవాలుగా మారవచ్చు. ఈ పథకం ఆశించిన విజయం సాధించాలంటే జొమాటో, స్విగ్గీ, అర్బన్ కంపెనీ వంటి అగ్రిగేటర్ సంస్థలు తమ పార్ట్నర్లలో అవగాహన పెంచి స్వచ్ఛందంగా ప్రొత్సహించడం చాలా అవసరం.ఇదీ చదవండి: వివాదాస్పద కంటెంట్కు యాడ్ మనీ! -
వివాదాస్పద కంటెంట్కు యాడ్ మనీ!
సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. కంపెనీకి ఉన్న సొంత కమ్యూనిటీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ద్వేషాన్ని పెంచేలా ఉండే వివాదాస్పద పోస్టులకు కూడా ప్రకటనల ద్వారా ఆదాయాన్ని (యాడ్ మనీ) చెల్లిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు ఇప్పుడు మెటా చర్యలపై తీవ్రంగా నిఘా పెట్టాయి.ఇన్వెస్టర్లలో ఆందోళనకంపెనీ అమలు చేస్తున్న పెర్ఫార్మెన్స్-బేస్డ్ మోనెటైజేషన్ విధానం వ్యూస్, వాచ్టైమ్ ఆధారంగా క్రియేటర్లకు నిధులు కేటాయిస్తోంది. ఈ క్రమంలో నాజీయిజం, అహంకారం, వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారాలకు సంబంధించిన పోస్టులకు కూడా ప్రకటనల ఆదాయం మళ్లుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. కంటెంట్ మోడరేషన్ ప్రమాణాలకు, ఇన్కమ్ పంపిణీ మోడల్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇది బయటపెడుతోంది.సాంకేతిక వైఫల్యాలుభారత్లోనూ మెటా తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. అక్రమ పెయిడ్ కంటెంట్ను ప్రచారం చేయడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోపై పొరపాటున పరిమితులు విధించడం.. వంటి సాంకేతిక వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మెటా ప్రతినిధులు ఇటీవలే అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఇటువంటి వరుస లోపాల వల్ల ప్లాట్ఫామ్లకు లభించే చట్టబద్ధ రక్షణ హోదా ముప్పులో పడే అవకాశముంది.మరోవైపు, పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిన కేసులో అమెరికా కోర్టు మెటాకు 567 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,750 కోట్లు) భారీ జరిమానా విధించింది. దీనికి తోడు కృత్రిమ మేధ మౌలిక వసతులకై మెటా బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చిస్తుండటంతో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు, ఫ్రీ క్యాష్ ఫ్లోపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ద్వేషపూరిత కంటెంట్కు చెక్ పెడుతూ యూజర్ ఎంగేజ్మెంట్ను కాపాడుకునేలా తన ఆల్గోరిథమ్లను సవరించకపోతే రాబోయే రోజుల్లో నియంత్రణ చర్యలు మరింత కఠినతరమై, మార్కెట్లో వాటాదారుల నమ్మకం దెబ్బతినే ప్రమాదముంది.ఇదీ చదవండి: పిల్లలను కనట్లేదు! గ్లోబల్ ఫెర్టిలిటీ పతనం -
జియో ఫైనాన్షియల్లో బోఫా భారీ పెట్టుబడి
ముంబై: ముకేశ్ అంబానీ ప్రమోట్ చేసిన ఎన్బీఎఫ్సీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా(బోఫా) 1.9 బిలియన్ డాలర్లు (రూ. 18,268 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా జియో క్రెడిట్లో 49.9% వాటా సొంతం చేసుకోనుంది. ఇందుకు రెండు సంస్థలు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జియో ఫైనాన్షియల్ తెలిపింది. ప్రిఫరెన్షియల్ ఇష్యూ, వారంట్ల జారీ ద్వారా బోఫా ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. భాగస్వామ్యం ద్వారా ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో బోఫా నైపుణ్యంతో, దేశీ మార్కెట్లో జియో ఫైనాన్షియల్ డిజిటల్ కార్యకలాపాలను మిళితం చేయనున్నట్లు వివరించింది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన జియో క్రెడిట్కు 2026 జూన్కల్లా రూ. 30,667 కోట్ల నిర్వహణ ఆస్తులున్నాయి.ఈ వార్తల నేపథ్యంలో జియో ఫైనాన్షియల్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ.255 వద్ద ముగిసింది. -
చంద్రశేఖరన్.. ‘టాటా’!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ కార్పొరేట్ సామ్రాజ్యంలో నాయకత్వ సంక్షోభం తారస్థాయికి చేరింది. గ్రూప్ అధిపతిగా పదేళ్ల ‘చంద్ర’ శకానికి ఇక తెరపడనుంది. టాటా సన్స్ చైర్మన్ పదవికి గుడ్బై చెబుతున్నట్లు నటరాజన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. 2027 ఫిబ్రవరిలో తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత వైదొలగనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని బుధవారం టాటా సన్స్ బోర్డుకు తెలియజేశారు. నాయకత్వ మార్పు సజావుగా పూర్తయ్యేలా చూసేందుకు తన వారసుడి ఎంపికను త్వరగా పూర్తి చేయాల్సిందిగా బోర్డును కోరారు. కొనసాగింపుపై అనిశ్చితి... టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటాతో నెలకొన్న విభేదాలు, పునర్నియామకంపై సుదీర్ఘ ప్రతిష్టంభన నేపథ్యంలో చంద్రశేఖరన్ తాజా నిర్ణయం వెలువడింది. కాగా, టాటా సన్స్ చైర్మన్గా పునర్నియామకంపై నెలల తరబడి అనిశ్చితి కొనసాగుతోంది. గ్రూపు హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్లో 51.54 శాతం వాటా కలిగిన సర్ దొరాబ్జీ ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ మరో అయిదేళ్లపాటు చైర్మన్గా తన పదవీ కాలాన్ని పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ ప్రతిపాదనను ఈ ఏడాది ఫిబ్రవరి 24న టాటా సన్స్ బోర్డు, ఎంపిక కమిటీ ముందుంచగా, ఒక బోర్డు సభ్యుడు (డైరెక్టర్) దానికి మద్దతివ్వకపోవడంతో అది ముందుకు సాగలేదన్నారు. ఈ ప్రతిపాదనతో విభేదించిన డైరెక్టర్ పేరును ప్రస్తావించకుండా, బోర్డు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే నిర్ణయం వాయిదా పడిందని వెల్లడించారు. ఆరు నెలల తర్వాత కూడా ఈ ప్రతిపాదనకు అతీగతీ లేదని, టాటా సన్స్ పర్యవేక్షణలో అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులు కీలక దశలో ఉన్నందున నాయకత్వం విషయంలో అనిశ్చితి తారస్థాయికి చేరిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. నోయెల్ రాకతో విభేదాలు.. 2024లో రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్టుల పగ్గాలు ఆయన సవతి సోదరుడైన నోయెల్ టాటా చేతికొచ్చిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచీ చంద్ర, నోయెల్ మధ్య విభేదాలు మొదలయ్యాయని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టాటా సన్స్ లిస్టింగ్కు నోయెల్ నో చెబుతుండగా.. చంద్ర దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే బోర్డులో ప్రాతినిధ్యం విషయంలో కూడా ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. కాగా, టాటా సన్స్ను లిస్టింగ్ చేయకుండా షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ను బయటికి పంపించే విధంగా ఐదేళ్ల వ్యూహాత్మక రోడ్మ్యాప్ విషయంలో స్పష్టతనివ్వాలని టాటాలు చంద్రను కోరారు. అయితే, దీనిపై చంద్ర నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో పునర్నియామకంపై ప్రతిష్టంభనకు దారితీసింది.ఇంటర్న్గా చేరి.. అత్యున్నత స్థానానికి! → ‘చంద్ర’గా అందరికీ సుపరిచితమైన 63 ఏళ్ల నటరాజన్ చంద్రశేఖరన్.. కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి 1987లో టాటా గ్రూప్ కంపెనీ టీసీఎస్లో ఇంటర్న్గా చేరారు. 22 ఏళ్లలో ఏకంగా 2009లో ఆ కంపెనీ సీఈఓ స్థానానికి చేరారు. → ఇక సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించిన తర్వాత తాత్కాలిక చైర్మన్గా కొన్నాళ్లు రతన్ టాటా మళ్లీ పగ్గాలు చేపట్టారు. ఆయన వారసుడిగా 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్ పదవిలో చంద్ర టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. టాటా సన్స్ పగ్గాలు తొలిసారి పార్సీయేతర, టాటాల కుటుంబానికి చెందని వ్యక్తికి దక్కడం విశేషం. → చంద్ర హయాంలో దాదాపు దశాబ్దకాలంలో గ్రూపు ఆదాయం రెట్టింపు కాగా, లాభం మూడింతలైంది. 2024–25లో గ్రూపు మొత్తం ఆదాయం 180 బిలియన్ డాలర్లను దాటింది. 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలున్న టాటా గ్రూపులో 31 లిస్టెడ్ కంపెనీలున్నాయి. వాటి మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.26 లక్షల కోట్లు (360–380 బిలియన్ డాలర్లు). ఇది పాకిస్తాన్, పోర్చుగల్, గ్రీస్ ఉమ్మడి జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. → స్టీల్, ఆటో వంటి బలమైన సంప్రదాయ బిజినెస్ల నుంచి గ్రూపును ఏవియేషన్, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్స్, బ్యాటరీలు, డిజిటల్ కామర్స్ వంటి ఆధునిక వ్యాపారాల దిశగా నడిపించిన ఘనత చంద్ర సొంతం. 2022లో ఏయిరిండియాను మళ్లీ టాటా గూటికి చేర్చారు. బిగ్బాస్కెట్, 1ఎంజీ వంటి పలు నవ తరం కంపెనీలను కొనుగోలు చేశారు. → మరోపక్క, అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. 2025లో ఎయిరిండియా బోయింగ్ 787 విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోవడం చంద్రశేఖరన్కు మాయని మచ్చగా మిగిలింది. అంతేకాదు, ఎయిరిండియా గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.22,238 కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఏఐ ప్రభావంతో టీసీఎస్ సహా టెక్ కంపెనీలపై తీవ్ర ఒత్తిడి, జేఎల్ఆర్పై సైబర్ దాడుల ప్రభావం వంటివి ఉన్నాయి.వారసుడెవరు? చంద్ర ప్లేసులో టాటా గ్రూప్నకు కొత్త వారసుడి ఎంపిక ఇప్పుడు కత్తిమీద సామేనని పరిశీలకులు అంటున్నారు. టాటా ట్రస్టుల్లో పాలనాపరమైన విభేదాలు, గ్రూపు భారీ పెట్టుబడి లక్ష్యాలు, కొన్ని కంపెనీల భారీ నష్టాలు, టాటా ట్రస్ట్లు, టాటా సన్స్ మధ్య సరైన సమన్వయాన్ని నెలకొల్పడం, ఇతరత్రా సవాళ్ల నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని నియమించడం అంత సులువు కాదనే వాదనలున్నాయి. చైర్మన్గా మళ్లీ టాటాల కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారా లేదంటే, బయటి వ్యక్తినే కొనసాగిస్తారా అనేది కీలకంగా మారనుంది. కాగా, టాటా ట్రస్టుల చైర్మన్ నోయెల్ టాటా పేరు కూడా రేసులో ఉంది. కానీ, టాటా సన్స్ కొత్త నిబంధనల ప్రకారం ట్రస్టులకు సారథ్యం వహిస్తున్న వ్యక్తి అదే సమయంలో టాటా సన్స్ పగ్గాలు చేపట్టడానికి వీల్లేదు. ఇదే ఆయనకు ప్రధాన అడ్డంకి. అయితే, కొత్త చైర్మన్ నియామకంలో మాత్రం నోయెల్దే కీలక పాత్ర కానుంది.ఆధిపత్య పోరు... టాటా ట్రస్టులు, టాటా సన్స్ బోర్డుల్లో అధిపత్య పోరుతో సీనియర్లు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. 2024లో నోయెల్ టాటా ట్రస్ట్ల పగ్గాలు చేపట్టాక ఇది మరింత జోరందుకుంది. రతన్ టాటాకు నమ్మకస్తులైన విజయ్ సింగ్, మెహ్లీ మిస్త్రీ, ఇప్పుడు టాటా సన్స్ చైర్మన్ చంద్ర నిష్క్రమణ దీనికి నిదర్శనం. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్లో టాటా ట్రస్ట్లకు సుమారు 66% వాటా ఉండటంతో బోర్డు నిర్ణయాలపై దానిదే పూర్తి ఆధిపత్యం. ప్రస్తుతం టాటా సన్స్లో చంద్ర, టాటా ట్రస్ట్ల చైర్మన్ నోయెల్ టాటా, వైస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, గ్రూప్ సీఎఫ్ఓ సౌరభ్ అగర్వాల్, ఇండిపెండెంట్ డైరెక్టర్లు హరీష్ మన్వానీ, అనితా మరంగోలీ జార్జ్.. ఆరుగురు డైరెక్టర్లుగా ఉన్నారు. టాటా సన్స్ లిస్టింగ్తో పాటు అనేక విషయాల్లో డైరెక్టర్లు వర్గాలుగా విడిపోవడంతో బోర్డు రూమ్ యుద్ధం తీవ్రమైంది. టాటా సన్స్ లిస్టింగ్ను నోయెల్ వ్యతిరేకిస్తుండగా.. చంద్ర తదితరులు సై అంటున్నారు. మరోపక్క, నోయెల్ తన కుమారుడు నెవిల్లే టాటాతో పాటు టైటాన్ మాజీ చీఫ్ భాస్కర్ భట్ను సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ (అన్నింటిలో పెద్దది)లోకి తీసుకొని మరింత పట్టుబిగించారు. బోర్డు సభ్యుల మధ్య విభేధాలు, కొందరి రాజీనామాలకు ఈ ట్రస్టే కేంద్ర బిందువుగా మారింది!!నాయకత్వంపై స్పష్టత ముఖ్యం..టాటా గ్రూప్లో 40 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పని చేశాను. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నా వంతు సహకారం అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. నా పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, భాగస్వాములు, ఇతర పక్షాలకు నాయకత్వంపై స్పష్టత ఇవ్వడం చాలా కీలకం. అయితే, ఆరు నెలలుగా నా పునర్నియామక ప్రతిపాదనపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఫిబ్రవరి 20 తర్వాత చైర్మన్గా కొనసాగబోనని బోర్డుకు తెలియజేశాను. గ్రూపుతో 40 ఏళ్ల నా అనుబంధంలో మీరు (ఉద్యోగులు) చూపిన ప్రేమ, ఆప్యాయతలు వెలకట్టలేనివి. ఈ స్థాయికి చేరుకుంటానని ఎన్నడూ ఊహించలేదు. అయితే, ఎవరి కెరీర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ముగియాల్సిందే, మరొకరు ఆ బాధ్యతలు చేపట్టాల్సిందే. టాటా అనేది గౌరవనీయమైన పేరు. మీ కృషి వల్లే అది సాకారమైంది. సంస్థ ప్రగతి పథంలో కొనసాగుతుంది. ఉద్యోగులందరికీ అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. నా నిష్క్రమణకు సంబంధించి వస్తున్న ఊహాగానాలు, వదంతులు, కుట్ర సిద్ధాంతాలను మీరెవరూ పట్టించుకోవద్దు.– ఎన్. చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ -
ఏనుగుల దినోత్సవం .. ‘వంతారా’ విస్తృత కార్యక్రమాలు
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల సంక్షేమం, సంరక్షణ, సంరక్షకులకు మద్దతు, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞాన మార్పిడిని మరింత విస్తరించేందుకు వంతారా పలు కార్యక్రమాలను ప్రకటించింది. పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ప్రయాణం గౌరి అనే ఏనుగును రక్షించడంతో ప్రారంభమై ప్రస్తుతం 260కుపైగా ఆసియా ఏనుగులకు ప్రత్యేక సంరక్షణ అందిస్తోంది.హాథీ గావ్లో ప్రత్యేక సంరక్షణ కేంద్రంరాజస్థాన్లోని జైపూర్ హాథీ గావ్లో ఏనుగుల సంరక్షణ, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వంతారా, రాజస్థాన్ అటవీ శాఖతో కలిసి పనిచేయనుంది. ఇందులో ఆధునిక ఏనుగుల ఆసుపత్రి, పోషకాహార కేంద్రం, హైడ్రోథెరపీ సదుపాయాలతో కూడిన చికిత్స–సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. వృద్ధ ఏనుగుల కోసం ప్రత్యేక రిటైర్మెంట్ అండ్ కేర్ సెంటర్ను కూడా అభివృద్ధి చేయనున్నారు.182 ఏనుగులకు వైద్య, సంక్షేమ సేవలుఅస్సాం, అరుణాచల్ప్రదేశ్, త్రిపుర, అండమాన్–నికోబార్ దీవుల్లోని ఎనిమిది ప్రాంతాల్లో వంతారా ఇటీవల భారీ ఏనుగుల సంక్షేమ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర అటవీ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా 182 ఏనుగులకు ఆరోగ్య, సంక్షేమ సేవలు అందించగా, 242 మంది మహౌత్లకు శిక్షణ ఇచ్చారు. ఏనుగుల ఆరోగ్యం, మానవీయంగా నిర్వహించడం, ప్రథమ చికిత్స, మస్ట్హ్ నిర్వహణ వంటి అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందించారు. వెటర్నరీ, సంక్షేమ కిట్లతో పాటు పోషకాహార సహాయాన్ని కూడా అందించారు.పిల్లల్లో కరుణ పెంచేందుకు ‘మై ఫ్రెండ్ లీలావతి’పిల్లల్లో ఏనుగుల పట్ల ప్రేమ, కరుణ, బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు వంతారా ‘మై ఫ్రెండ్ లీలావతి’ పేరుతో సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. చిన్నతనంలో తల్లి నుంచి వేరై సర్కస్లో సంవత్సరాలు గడిపిన లీలావతి, సర్కస్ టెంట్లో అగ్నిప్రమాదం కారణంగా తీవ్ర గాయాలకు గురైంది. ప్రస్తుతం వంతారాలో సంరక్షణ పొందుతున్న లీలావతి కథ ఆధారంగా పిల్లలకు పజిల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విజేతలకు లీలావతి గిఫ్ట్ హ్యాంపర్తో పాటు వంతారాను సందర్శించి ఆ ఏనుగును, సంరక్షకుడిని కలిసే అవకాశం కల్పించనున్నారు.మానవ–ఏనుగు ఘర్షణలపై అంతర్జాతీయ సహకారంమనుషులకు, ఏనుగులకు మధ్య ఘర్షణలను తగ్గించేందుకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్ (EPI) ఫౌండేషన్కు వంతారా గ్రాంట్ అందిస్తోంది. 2027 మార్చిలో బ్యాంకాక్లో జరిగే గ్లోబల్ హ్యూమన్–ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ సమ్మిట్, అంతర్జాతీయ హ్యూమన్–వైల్డ్లైఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ కోఎగ్జిస్టెన్స్ సదస్సుల్లో ఆసియా, ఆఫ్రికా దేశాల నిపుణులు, సంరక్షణ కార్యకర్తలు, యువ ప్రతినిధుల భాగస్వామ్యానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.ఆసియా ఏనుగుల పరిధిలోని మొత్తం 13 దేశాల ప్రతినిధులతో పాటు ఆఫ్రికాలోని కనీసం ఐదు దేశాల ప్రతినిధులు, యువ సంరక్షణ కార్యకర్తలకు ఈ కార్యక్రమం ద్వారా అవకాశం లభించనుంది. భారత్లో తొలిసారిగా EPI యూత్ అంబాసిడర్స్ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది.అత్యవసర సేవలకు ఆధునిక సాంకేతికతక్షేత్ర స్థాయిలో మానవ–ఏనుగు ఘర్షణలను ఎదుర్కొనేందుకు వంతారా ర్యాపిడ్ రెస్పాన్స్ వెటర్నరీ బృందాలను, థర్మల్ డ్రోన్ నిఘాను, స్థానిక సమాజాలతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గాయపడిన ఏనుగులకు తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు మనుషులు, ఏనుగులు పరస్పర సహజీవనం సాగించేలా దీర్ఘకాలిక చర్యలను చేపడుతోంది.ఈ సందర్భంగా వంతారా వ్యవస్థాపకుడు అనంత్ అంబానీ మాట్లాడుతూ.. ప్రతి ఏనుగుకు ప్రత్యేకమైన కథ ఉంటుందని, వాటి సంక్షేమం పట్ల బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గౌరి రక్షణతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు అనేక ఏనుగుల సంక్షేమం, సంరక్షకులకు మద్దతు, విజ్ఞాన మార్పిడి, అంతర్జాతీయ పరిరక్షణ కార్యక్రమాల వరకు విస్తరించిందని పేర్కొన్నారు. -
యూపీ ప్రభుత్వం గోమూత్రం కొనుగోలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోశాలల ఆర్థిక స్వావలంబన, ఆయుర్వేద రంగ ప్రోత్సాహం లక్ష్యంగా గోమూత్ర సేకరణ పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ, స్వచ్ఛంద గోశాలల నుంచి గోమూత్రాన్ని సేకరించి ప్రాసెసింగ్ ద్వారా ఆయుర్వేద ఔషధాలు, ప్రాకృతిక ఎరువులు, క్రిమిసంహారకాల తయారీకి ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. గోవుల సంరక్షణ భారాన్ని తగ్గించి గోశాలలను స్వయంసమృద్ధి కేంద్రాలుగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.రైతులు, పశుపోషకుల నుంచి లీటర్ గోమూత్రాన్ని రూ.10 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. (భవిష్యత్తులో ఈ ధరను లీటరుకు రూ.20కి పెంచే ప్రతిపాదన కూడా ఉంది). అయితే, ఈ ప్రాజెక్ట్పై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తీవ్ర స్థాయిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. రాష్ట్రంలో నిరుద్యోగం, రైతాంగ సమస్యలు, గ్రామాల్లో పంటలను నాశనం చేస్తున్న వీధి పశువుల తీవ్ర సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి పథకాలను తెరపైకి తెస్తోందని సమాజ్వాదీ పార్టీ విమర్శించింది. మౌలిక వసతులు, ఉపాధి వంటి కీలక అంశాలను పక్కనపెట్టి గోమూత్ర సేకరణపై దృష్టి సారించడం పాలనా ప్రాధాన్యతల లోపానికి నిదర్శనమని ఆరోపించింది.ఆర్థిక సంస్కరణా?విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గో ఆధారిత ఉత్పత్తులను (పంచగవ్య) వాణిజ్యపరంగా ప్రోత్సహించడం ఒక వైపు సాంప్రదాయ విధానమే అయినా, దాని అమలు తీరుపై అనేక సవాళ్లు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. సేకరించిన గోమూత్రానికి నాణ్యతా ప్రమాణాలు పాటించడం, శాస్త్రీయ శుద్ధి, సక్రమమైన మార్కెటింగ్ నెట్వర్క్ ఏర్పరచడం ప్రాజెక్ట్ విజయానికి అత్యంత కీలకం.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా!
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్లో ఊహించని నాయకత్వ పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆగస్టు 18న జరగనున్న అత్యంత కీలకమైన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముందు ఈ వార్త బయటకు రావడం కార్పొరేట్ వర్గాలను విస్తుపోయేలా చేసింది. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027 వరకు ఉన్న తన ప్రస్తుత పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని, ఆ తర్వాత మళ్లీ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తదుపరి సారథి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఆయన బోర్డును కోరినట్లు సమాచారం.ట్రస్ట్ – బోర్డు మధ్య వ్యూహాత్మక విభేదాలుగత కొంతకాలంగా టాటా సన్స్ ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్(నోయెల్ టాటా నేతృత్వంలో)కు, డైరెక్టర్ల బోర్డుకు మధ్య నూతన వ్యాపారాల పనితీరు, మూలధన కేటాయింపులపై లోతైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరొక ఐదేళ్లు పొడిగించే అంశంపై బోర్డులో ఏకాభిప్రాయం కుదరకపోవడం, అలాగే టాటా సన్స్ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయకూడదనే షరతులతో పాటు బోర్డు ప్రాతినిధ్యంపై ఇరువర్గాల మధ్య విభేదాలు ముదిరాయి. పదేపదే మళ్లీ తెరపైకి వస్తున్న అంతర్గత వివాదాల కంటే గౌరవంగా తప్పుకోవడమే మేలని చంద్రశేఖరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.సరికొత్త ఎత్తులకు చేరిన సంస్థ2016లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత 2017 ప్రారంభంలో టాటా సన్స్ మొదటి నాన్-ఫ్యామిలీ, నాన్-పార్సీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, గ్రూప్ను నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. టీసీఎస్ సీఈఓ స్థాయి నుంచి గ్రూప్ సారధిగా ఎదిగిన ఆయన హయాంలో కంపెనీ రాబడి, నికర లాభాలు గణనీయంగా పెరిగాయి. ఎయిరిండియా పునరుద్ధరణ, డిజిటల్ వ్యాపారాల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ముందంజ వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలు. అయితే ఇటీవల కాలంలో ఎయిరిండియాపై రెగ్యులేటరీ నిఘా, బ్రిటన్లో జాగువార్ ల్యాండ్ రోవర్పై సైబర్ దాడి, టీసీఎస్ ఎదుర్కొంటున్న మార్కెట్ ఒత్తిళ్లు కొంత సవాలుగా మారాయి.కుదేలైన స్టాక్ ధరలుఈ వార్త విస్తరించడంతోనే దలాల్ స్ట్రీట్లో తీవ్ర అలజడి రేగింది. టాటా గ్రూప్నకు చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా గ్రూప్ ఫ్లాగ్షిప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు అత్యధికంగా 4.1 శాతం పతనమవ్వగా, టాటా మోటార్స్, టాటా స్టీల్ సహా ఇతర అనుబంధ సంస్థలు నష్టాలను చవిచూశాయి. 2024 చివర్లో రతన్ టాటా కన్నుమూసిన నాటి నుంచి గ్రూప్లో అంతర్గత విభేదాలు ముదురుతుండటం, ఇప్పుడు చంద్రశేఖరన్ వైదొలగడం 400 బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి కొత్త నాయకత్వ సవాలును తెచ్చిపెట్టింది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
జస్ట్ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్ చేస్తే...!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ( HCL) ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అజయ్ చౌదరి 1976 నాటి ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా పంచుకున్న విషయాలు నెట్టింట విశేషంగా మారాయి.భారతదేశంలో ఆధునిక కంప్యూటింగ్ విప్లవానికి ఇది ఒక పునాదిగా, ఒక సాహసోపేత నిర్ణయంగా నిలిచిన సంస్థ ఆవిర్బావం నాటి 1976 నాటి రోజులను అజయ్ చౌదరి గుర్తు చేసుకున్నారు. చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, చివరికి కారు కూడా విక్రయించి, 1976 ఆగస్టు 11న శివ్ నాడార్, మరో ఐదుగురు భాగస్వాములు కలిసి ఢిల్లీలో ఒక చిన్న గ్యారేజ్ స్టార్టప్గా ప్రారంభించిన వైనాన్ని ఆయన వివరించారు. దేశంలో కంప్యూటర్ల భావన ఇంకా కొత్తగా ఉన్న సమయంలో, ఆరుగురు రూ. 1.87 లక్షలు పోగుచేసి, ఢిల్లీలో ఒక చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఒక భారతీయ కంప్యూటర్ను నిర్మించడానికి ఎలా ప్రయత్నించారో ఆయన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.స్టార్టప్లు, వెంచర్ క్యాపిటల్స్ లేని ఆ రోజుల్లో శివ్ నాడార్, అర్జున్ మల్హోత్రా, యోగేష్ వైద్య, సుభాష్ అరోరా, DS పురి, అజయ్ చౌదరి అనే ఆరుగురు యువకులు తమ ఉద్యోగాలను వదిలి HCLను ప్రారంభించారు. తమ పొదుపు మొత్తం, అప్పులు, చివరికి ఒక కారు కూడా అమ్మి రూ. 1.87 లక్షల పెట్టుబడిని సమకూర్చుకున్నారు. ఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్లో ఒక చిన్న రూఫ్టాప్ (బర్సాతీ) ఆఫీస్లో 'మైక్రోకాంప్' పేరుతో ప్రయాణం మొదలైంది. ఇదీ చదవండి: భర్తను వదిలి లవర్తో పారిపోయి, చివరికి శవమై సూట్కేసులోఅయితే అమ్మకాలు ప్రారంభించడానికి అన్నీ సిద్ధమయ్యే వరకు వేచి ఉండలేదు. ఇంకా రూపకల్పన దశలో ఉన్న కంప్యూటర్ను అమ్మడం ప్రారంభించామని చౌదరి గుర్తుచేసుకున్నారు. తమ వద్ద ఒక బ్రోచర్ ,ఆ యంత్రం నమూనానాల తోనే సేల్స్ బృందాలు దేశవ్యాప్తంగా పర్యటించి, అంతకుముందు చాలామంది ఎన్నడూ ఉపయోగించని ఒక సాంకేతికతలో పెట్టుబడి పెట్టేలా వ్యాపార సంస్థలను ఒప్పించాయి. మొదటి ఆర్డర్లు ఐఐటి ఖరగ్పూర్ , ఐఐటి మద్రాస్ నుండి వచ్చాయన్నారు. అలా కోయంబత్తూరులోని 'ప్రీమియర్ మిల్స్' వద్ద తమ కంటే పెద్ద కంపెనీ అయిన DCM DPని దాటుకుని HCL మొదటి ఆర్డర్ దక్కించుకుంది. ఈ ఒక్క విజయం తర్వాత మరిన్ని ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఆ ఒక్క ఆర్డర్ మరో ఐదు, ఆపై పది ఆర్డర్లకు దారితీసింది. డీసీఎం బృందం తమ ప్రెజెంటేషన్ ఇస్తుండగా ప్రీమియర్ మిల్స్ రిసెప్షన్ ఏరియాలో కూర్చున్నది నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము రెండోసారి వెళ్ళాం గెలుపుసాధించాం," అంటూ ఆయన తమ సక్సెస్ స్టోరీ గురించి రాసుకొచ్చారు. ప్రారంభంలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ, భారతదేశపు తొలి స్వదేశీ కంప్యూటర్లను తయారు చేయడమే కాకుండా, ప్రారంభించిన నాలుగేళ్లలోనే సింగపూర్కు కూడా విస్తరించారు. ఐటీ సేవలు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంజనీరింగ్ రంగాలలో ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సేవలను అందిస్తోంది కంపెనీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలలో విస్తరించి, 2,23,000 కంటే ఎక్కువ ఉద్యోగులతో పనిచేస్తోంది. అనేక నూతన సాంకేతికఆవిష్కరణలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా గుర్తింపు పొందింది.హ్యాకింగ్ ఆరోపణల కలకలంమరోవైపు హెచ్సీఎల్ టెక్ ఉద్యోగి సంబంధిత డేటా బహిర్గతమైందని ఒక హ్యాకర్ గ్రూప్ ఆరోపించింది. అయితే తమ సిస్టమ్లు లేదా క్లయింట్ ఎన్విరాన్మెంట్లు హ్యాకింగ్కు గురైనట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని హెచ్సీఎల్టెక్ ప్రకటించింది. ఉద్యోగుల సమాచారం బహిర్గతమయ్యే అవకాశం ఉందని తమకు థ్రెట్-ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందినట్లు ప్రత్యర్థి ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వెల్లడించిన తర్వాత హెచ్సీఎల్నుంచి కూడా ఈ వివరణ వెలువడింది. -
గాల్లోనే నిలిచిపోయిన ఇంజిన్
కోల్కతా నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో గాల్లో ఉండగానే తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. విమానం చెన్నై విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఎడమ వైపు ఇంజిన్ నిలిచిపోయింది. దీంతో పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో 224 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అలర్ట్ అయిన విమానాశ్రయ బృందాలుకోల్కతా (సీసీయూ) నుంచి చెన్నై (ఎంఏఏ) బయలుదేరిన ఇండిగో 6E-723 విమానం మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయం సమీపంలోకి రాగానే ఎడమ ఇంజిన్ విఫలమైంది. రాత్రి 11:29 గంటలకు పైలట్ అత్యవసర ల్యాండింగ్కు అనుమతి కోరడంతో చెన్నై ఎయిర్పోర్ట్ అథారిటీ వెంటనే స్పందించి విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ అమలు చేసింది. రన్-వే 25 వద్ద ఫైర్ ఇంజిన్లు, వైద్య బృందాలు, అత్యవసర రెస్క్యూ వాహనాలను సిద్ధంగా ఉంచారు.ఒక్క ఇంజిన్తోనే సురక్షిత ల్యాండింగ్అన్ని భద్రతా చర్యల మధ్య రాత్రి 11:37 గంటలకు పైలట్ ఒకే ఇంజిన్ సాయంతో విమానాన్ని రన్-వే 25పై క్షేమంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 224 మంది సురక్షితంగా కిందకు దిగడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ సజావుగా సాగడంతో రాత్రి 11:47 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అనంతరం సాధారణ విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.డీజీసీఏ దర్యాప్తుఈ సాంకేతిక వైఫల్యంపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. గాల్లో ఉండగా ఇంజిన్ ఆగిపోవడానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని పరిశీలిస్తోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
టాటా సన్స్లో నాయకత్వ సంక్షోభం
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్లో మరోసారి నాయకత్వ ఘర్షణలు బహిర్గతమవుతున్నాయి. ఆగస్టు 18న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కంటే ముందే టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.విభేదాలకు ప్రధాన కారణాలురతన్ టాటా అనంతరం టాటా ట్రస్ట్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నోయెల్ టాటాకు, చంద్రశేఖరన్కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఎయిరిండియా, టాటా డిజిటల్, ఎలక్ట్రానిక్స్ వంటి కొత్త వ్యాపారాల్లో పురోగతి స్తంభించడం, పెరిగిన నష్టాలపై నోయెల్ టాటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. చంద్రశేఖరన్ డైరెక్టర్ పదవి పొడిగింపుపై పూర్తిస్థాయి మద్దతు ఇచ్చేందుకు నోయెల్ టాటా సుముఖంగా లేరని, మరో ఐదేళ్లకు బదులుగా కేవలం రెండేళ్ల కాలాన్ని మాత్రమే ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏజీఎంలో ఓటింగ్ ద్వారా వివాదాస్పదంగా తప్పుకోవడం కంటే ముందే గౌరవప్రదంగా రాజీనామా చేయాలని చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు చెబుతున్నారు.చట్టపరమైన ప్రాధాన్యత.. చిక్కులుఈ వివాదానికి మరింత సంక్లిష్టతను చేకూర్చింది మహారాష్ట్ర చారిటీ కమిషనర్ నిర్ణయం. పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ ఉల్లంఘనల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ‘సర్ రతన్ టాటా ట్రస్ట్’ ఎలాంటి కీలక సమావేశాలు నిర్వహించకూడదని ఆంక్షలు విధించారు. టాటా సన్స్లో దాదాపు 66% వాటా కలిగిన ట్రస్టుల ప్రతినిధులు లేకుండా ఏజీఎం నిర్వహణ, ఓటింగ్ చెల్లుబాటుపై చట్టపరమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2017లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత టాటా సన్స్ బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్, గ్రూప్ను ఆధునిక సాంకేతిక, ఏవియేషన్ రంగాల వైపు విజయవంతంగా నడిపించారు. ఒకవేళ ఆయన ఏజీఎంకు ముందే తప్పుకుంటే గ్రూప్ షేర్లపై తాత్కాలిక ఒత్తిడి పెరగడంతో పాటు మళ్లీ కొత్త చైర్మన్ అన్వేషణ ప్రారంభం కానుంది.ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’ -
వందే భారత్లో ప్రయాణించిన నిర్మలా సీతారామన్
బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి రాజస్థాన్లోని జైపూర్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో పయనం అయ్యారు. ‘రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ ప్రాతిపదికన జైపూర్లో ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.ఈ ప్రయాణంలో భాగంగా రైలులోని సహ ప్రయాణికులతో మంత్రి నేరుగా ముచ్చటించారు. ప్రత్యేకించి మీడియా ఎడ్యుకేషన్ అభ్యసిస్తున్న విద్యార్థులు, యువ జర్నలిస్టులతో ఆమె సంభాషించారు. అంతర్జాతీయ భూరాజకీయాలు (జియోపాలిటిక్స్), భారత ఆర్థిక వ్యవస్థ, ప్రాధాన్య రంగాలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆకాంక్షలపై వారితో చర్చించారు. దేశ విధాన నిర్ణేతతో నేరుగా అభిప్రాయాలు పంచుకునే అవకాశం దక్కడంపై యువకులు సంతోషం వ్యక్తం చేశారు.During the train journey, two students pursuing post graduation in media studies, and two young media professionals also accompanied FM Smt. @nsitharaman to Jaipur.The four youngsters had freewheeling discussion with the Union Finance Minister on geopolitics, economy, and… https://t.co/I0T8QDzEYY pic.twitter.com/eU5zCAq21s— Ministry of Finance (@FinMinIndia) August 11, 2026ఒకపక్క ఉన్నతస్థాయి దౌత్య సమావేశానికి వెళ్తూనే వందే భారత్లో ప్రయాణించి ప్రయాణికులతో, యువతతో మమేకం కావడం మంత్రి విలక్షణ శైలిని ప్రతిబింబిస్తోందని కొందరు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించింది.ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’ -
పసిడి తగ్గేదేలే..
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి. -
టీసీఎస్ ఉద్యోగుల డేటా లీక్!
దేశీయ ఐటీ సేవల రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగుల వ్యక్తిగత వివరాల లీకేజీ వార్తలపై అధికారికంగా స్పందించింది. కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం బహిర్గతం అయ్యే అవకాశం ఉందంటూ 'త్రెట్ ఇంటెలిజెన్స్' హెచ్చరికలు జారీ చేసింది. దాంతో సంస్థ స్పందించి సైబర్ భద్రతా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో తమ కస్టమర్ల డేటా, వ్యాపార వ్యవస్థలు, అంతర్గత నెట్వర్క్లు అత్యంత సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి డేటా చోరీ జరగలేదని టీసీఎస్ స్పష్టం చేసింది.నాలుగేళ్ల క్రితం నాటి డేటా?బహిర్గతం అయినట్లు ప్రచారం జరుగుతున్న ఉద్యోగుల డేటా దాదాపు నాలుగేళ్ల క్రితం నాటిదని, అది కూడా కేవలం ప్రాథమిక వివరాలకు మాత్రమే పరిమితమైందని టీసీఎస్ వెల్లడించింది. హ్యాకర్లు ‘పాస్వర్డ్ స్ప్రే’, 'మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫెటీగ్' వంటి సైబర్ దాడి పద్ధతులను ఉపయోగించినట్లు దావా వేసినప్పటికీ తమ రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఈ తరహా సైబర్ దాడులను నిరోధించేందుకు అత్యంత బలమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ను అమలు చేస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ దాఖలు చేసిన నివేదికలో పేర్కొంది.సైబర్ భద్రతపై ముమ్మర నిఘాక్లయింట్ల నమ్మకాన్ని, డేటా భద్రతను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేసిన టీసీఎస్ ప్రస్తుతం ఐటీ నెట్వర్క్ వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సైబర్ ముప్పులపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.ఇటీవలే టాటా గ్రూప్నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి సంస్థలు సైబర్ దాడులను ఎదుర్కొన్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ సైబర్ భద్రతా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. సంస్థల సమాచార భద్రతపై గ్లోబల్ క్లయింట్లలో ఎటువంటి ఆందోళన కలగకుండా ముందస్తుగా ఈ ప్రకటన విడుదల చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
నిఫ్టీ-50 నుంచి విప్రో అవుట్!
భారతీయ స్టాక్ మార్కెట్ బెంచ్మార్క్ సూచీ నిఫ్టీ-50లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా నిఫ్టీలో నిలకడగా కొనసాగుతున్న స్వదేశీ ఐటీ దిగ్గజం విప్రో ప్రధాన సూచీ నుంచి వైదొలగనుంది. దాని స్థానంలో దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఆపరేటర్ అయిన బీఎస్ఈ ప్రవేశించనుంది. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఇండెక్స్ మెయింటెనెన్స్ కమిటీ తన అర్ధవార్షిక సమీక్ష వివరాలను వెల్లడించింది. ఈ మార్పులు సెప్టెంబర్ 30, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.ఈ పరిణామం కేవలం ఒక సాంకేతిక సూచీ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాదు; భారత కార్పొరేట్ రంగంలో సంభవిస్తున్న నాటకీయ మార్పునకు బలమైన నిదర్శనం. గత ఆరు నెలల సగటు ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా చూస్తే బీఎస్ఈ విలువ రూ.1,40,879 కోట్లకు చేరగా విప్రో విలువ రూ.55,930 కోట్లకు పరిమితమైంది. నిబంధనల ప్రకారం కనిష్ట పరిమాణంలో ఉన్న కంపెనీ కంటే 1.5 రెట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ సాధించిన బీఎస్ఈ ప్రధాన సూచీకి అర్హత సాధించగా విప్రో 'నిఫ్టీ నెక్స్ట్ 50'కి మారనుంది.ఒకప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా నిలిచిన ఐటీ పరిశ్రమ వర్తమాన సవాళ్లను ఎదుర్కొంటోందని ఇది స్పష్టం చేస్తోంది. గ్లోబల్ టెక్నాలజీ క్లయింట్ల బడ్జెట్ కోతలు, డిస్క్రిషనరీ వ్యయాల్లో మందగమనం, ఏఐ తెస్తున్న సాంకేతిక విప్లవం సంప్రదాయ అవుట్సోర్సింగ్ ప్రాజెక్టుల లాభదాయకతను ఒత్తిడిలోకి నెట్టాయి. నిఫ్టీ-50లో టాప్-5 ఐటీ కంపెనీల ఉమ్మడి వెయిటేజీ ఈ ఏడాది 9 శాతం కంటే దిగువకు పడిపోవడం గమనార్హం. 2002 సంవత్సరం తర్వాత ఐటీ రంగానికి ఇది అత్యల్ప నిష్పత్తి కావడం విశేషం.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
ఏఐ వ్యయం పెంచాల్సిందేనన్న ఆర్బీఐ!
భారతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలైజ్ అవుతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశీయ బ్యాంకింగ్ రంగానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన దిశానిర్దేశం చేసింది. వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలను విస్తరించేందుకు సంబంధిత డిజిటల్ మౌలిక సదుపాయాలపై తమ వ్యయాన్ని వేగవంతం చేయాలని కేంద్ర బ్యాంకు పిలుపునిచ్చింది.సాంకేతిక పరివర్తన.. వ్యూహాత్మక ప్రాధాన్యంప్రస్తుత ఆధునిక బ్యాంకింగ్లో సాంకేతిక వ్యయం అనేది కేవలం ఒక సాధారణ నిర్వహణ ఖర్చు కాదని, అది బ్యాంకుల భవిష్యత్తు మనుగడకు, స్థిరత్వానికి అవసరమైన వ్యూహాత్మక మూలధన పెట్టుబడి అని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణ అర్హతల సమగ్ర విశ్లేషణ (క్రెడిట్ రిస్క్ అసెస్మెంట్), తక్షణ రుణాల మంజూరు, సైబర్ దాడుల ముందస్తు గుర్తింపు, ఆన్లైన్ మోసాల నివారణ, ఖాతాదారులకు అనుగుణమైన సేవలను వేగంగా అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది.రెస్పాన్సిబుల్ ఏఐసాంకేతికత వాడకం పెరిగే కొద్దీ దానితో పాటు వచ్చే వ్యవస్థాగత సవాళ్లను కూడా బ్యాంకులు సమానంగా పరిగణనలోకి తీసుకోవాలి. జనరేటివ్ ఏఐ సాధనాల వినియోగంలో డేటా ప్రైవసీ (సమాచార గోప్యత), సైబర్ సెక్యూరిటీ లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి. బిగ్-టెక్ సంస్థలు, థర్డ్-పార్టీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్లపై మితిమీరిన ఆధారపడటం వ్యవస్థాగత ప్రమాదాలకు దారితీయవచ్చని ఆర్బీఐ గుర్తుచేసింది. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ విధానాలను అమలు చేస్తూ పారదర్శకమైన అంతర్గత నియంత్రణ చట్రాన్ని రూపొందించుకోవడం అనివార్యం.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
బ్లింకిట్ ‘డార్క్ స్టోర్’ ఆహార లైసెన్స్ రద్దు
వేగవంతమైన డెలివరీల పేరుతో క్విక్-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ బ్లింకిట్కు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్డీఏ) గట్టి షాక్ ఇచ్చింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ పరిధిలో ఉన్న బ్లింకిట్ డార్క్ స్టోర్లో తీవ్రమైన పారిశుధ్య లోపాలు, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఆ స్టోర్ లైసెన్స్ను (లైసెన్స్ సంఖ్య: 11524010000119) సస్పెండ్ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.తనిఖీల్లో వెలుగుచూసిన ఘోరాలుఎఫ్డీఏ బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. స్టోర్లోని పండ్లు, కూరగాయల విభాగంలో పెద్ద ఎత్తున బొద్దింకల సంచారం, తుప్పు పట్టిన రాక్లపై, నేరుగా నేలపై ఆహార పదార్థాల పొట్లాలను నిల్వ ఉంచడం అధికారుల దృష్టికి వచ్చింది. కోల్డ్ స్టోరేజ్ విభాగాన్ని ఏమాత్రం శుభ్రపరచకపోవడమే కాకుండా, గడువు తీరిన (ఎక్స్పైర్డ్), దెబ్బతిన్న ఆహార ఉత్పత్తులు ప్యాకింగ్ నిల్వల్లో ఉండటం గమనార్హం. ఆహార నిర్వహణలో పాటించాల్సిన ఫస్ట్-ఇన్ ఫస్ట్-అవుట్/ ఫస్ట్-ఎక్స్పైరీ, ఫస్ట్-అవుట్ పద్ధతులను పూర్తిగా విస్మరించారని ఎఫ్డీఏ తన నివేదికలో తెలిపింది. ఎలుకలు, కీటకాల నివారణ చర్యలు శూన్యమని స్పష్టం చేసింది.సిబ్బంది ఆరోగ్యంపై నిర్లక్ష్యంఆహారాన్ని నిర్వహించే సిబ్బందికి సంబంధించి ఎలాంటి ఉచిత వైద్య తనిఖీలు లేదా ఆరోగ్య రికార్డులు అందుబాటులో లేవని, వారి వ్యక్తిగత పరిశుభ్రత కూడా అధ్వానంగా ఉందని తనిఖీల్లో తేలింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 (FSS Act) సెక్షన్ 32(3) ప్రకారం ఈ సస్పెన్షన్ వేటు వేశారు. ఉత్తర్వులు అమల్లో ఉన్నంతకాలం ఈ ఫెసిలిటీ నుంచి ఎలాంటి ఆహార విక్రయాలు లేదా పంపిణీ చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.వినియోగదారుల ఆరోగ్యం ప్రశ్నార్థకం10 నిమిషాల డెలివరీ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న క్విక్-కామర్స్ ప్లాట్ఫామ్లు బ్యాక్ ఎండ్లో కనీస పారిశుధ్యాన్ని కూడా విస్మరించడం వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడటమే. సేవల్లో వేగం ఎంత ముఖ్యమో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల నిర్వహణ అంతకంటే ముఖ్యమని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా.. -
గౌతమ్ అదానీకి భారీ ఊరట
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికా న్యాయస్థానంలో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనతో పాటు ఆయన బంధువు సాగర్ అదానీ, ఇతర కంపెనీ ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసును అమెరికాలోని బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసును విత్ డ్రా (ఉపసంహరణ) చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలు చేసిన దరఖాస్తును జడ్జి నికోలస్ గరాఫిస్ ఆమోదిస్తూ తుది తీర్పు వెలువరించారు.న్యాయమూర్తి ఈ కేసును విత్ ప్రిజుడీస్ (కేసును శాశ్వతంగా కొట్టివేయడం అని అర్థం) ప్రాతిపదికన కొట్టివేశారు. దీని ప్రకారం, ఇదే ఆరోపణలపై గౌతమ్ అదానీపై అమెరికా ప్రభుత్వం భవిష్యత్తులో మళ్లీ క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుండదు.కేసు నేపథ్యం2024లో భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి సోలార్ విద్యుత్ కాంట్రాక్టులు పొందారని, అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఈ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అత్యంత సుదీర్ఘ సమీక్ష అనంతరం ఈ కేసు ఎక్కువగా విదేశీ వ్యవహారాలకు సంబంధించినదని, కోర్టులో నిరూపించడం అత్యంత క్లిష్టమని జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. తమ ప్రస్తుత ప్రాధాన్యతల దృష్ట్యా కేసును కొనసాగించకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.I welcome the US court’s decision with humility and deep respect for the judicial process.Throughout this challenging period, our faith in truth, fairness and the rule of law remained unwavering.My deepest gratitude to those who never lost faith in us, in the system and in…— Gautam Adani (@gautam_adani) August 10, 2026సత్యమే జయించింది: గౌతమ్ అదానీకోర్టు తీర్పుపై గౌతమ్ అదానీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘అమెరికా కోర్టు నిర్ణయాన్ని ఎంతో వినయంతో, న్యాయవ్యవస్థపై ఉన్న అత్యున్నత గౌరవంతో స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలోనూ చట్టం, సత్యం, న్యాయంపై మాకున్న విశ్వాసం సడలలేదు’ అని పేర్కొన్నారు. మరోవైపు, పౌర (సివిల్) ఆరోపణల పరిష్కారంలో భాగంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ప్రతిపాదనలకు, ట్రెజరీ విభాగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి అదానీ గ్రూప్ తగిన అంగీకారానికి వచ్చింది. -
ఎయిర్టెల్తో చేతులు కలిపిన ఐటీఐ
ఎయిర్టెల్, ఐటీఐ లిమిటెడ్ కంపెనీలు కలిసి కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పాత టెక్నాలజీ వ్యవస్థలను అప్డేట్ చేయడం, కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించడం, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు జత కట్టాయి.ఎయిర్టెల్, ఐటీఐ లిమిటెడ్ సంస్థలు తమ టెక్నాలజీ, ఇంజినీరింగ్ సామర్థ్యాలను కలిపి.. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలకు కొత్త డిజిటల్ సొల్యూషన్స్ అందించనున్నాయి. అంతే కాకుండా.. ఎంటర్ప్రైజ్ కనెక్టివిటీ, డేటా సెంటర్లు, సావరిన్ క్లౌడ్, ఏఐ ఆధారిత సొల్యూషన్స్, ఎల్ఈఓ శాటిలైట్ సేవలు, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో సేవలను అందించనున్నారు.ముఖ్యంగా బ్యాంకింగ్.. ప్రభుత్వ రంగ సంస్థలు వంటి సున్నితమైన రంగాలకు సురక్షితమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించడంపై ఈ కంపెనీలు దృష్టి పెట్టనున్నారు. దీంతో 4G/5G వంటి హైస్పీడ్ కనెక్టివిటీతో పాటు.. ఏఐ ఆధారిత అనలిటిక్స్, IoT ఆధారిత ట్రాకింగ్, క్లౌడ్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి.ఇక దేశ రక్షణ, భద్రత అవసరాలకు కూడా ఈ భాగస్వామ్యం ఉపయోగపడేలా ప్రయత్నించనున్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా దేశీయ టెక్నాలజీ సామర్థ్యాలను పెంచేందుకు రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. -
రాయల్ ఛాలెంజ్, ఓల్డ్ మాంక్ మద్యం బ్యాన్
దేశీయ మద్యం పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తూ ప్రముఖ లిక్కర్ తయారీ సంస్థ ‘డయాజియో ఇండియా’ (యూనైటెడ్ స్పిరిట్స్)తో పాటు పలు ప్రముఖ కంపెనీలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, పక్కదోవ పట్టించే లేబులింగ్, నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ ఫ్లేవర్లు ఉపయోగిస్తున్నారనే ఆధారాలతో కఠిన చర్యలు చేపట్టింది.లేబులింగ్ మోసండయాజియోకు చెందిన అత్యధిక విక్రయాలు కలిగిన రాయల్ ఛాలెంజ్ విస్కీని ‘అమెరికన్ ఓక్ కాస్క్’లలో మెచ్యూరేషన్ చేసినట్లు కంపెనీ లేబుల్పై ప్రచారం చేసుకుంటోంది. అయితే, అందులో సింహభాగం నాన్-మెచ్యూర్డ్ గ్రెయిన్ న్యూట్రల్ స్పిరిట్, నీరు మాత్రమే ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ విచారణలో వెల్లడైంది. ఇది వినియోగదారులను పక్కదోవ పట్టించడమేనని రెగ్యులేటర్ తేల్చిచెప్పింది. బ్లెండెడ్ ఆల్కహాల్పై ఏజింగ్ (తయారైన తేదీ-వయసు) పేర్కొనేటప్పుడు మిశ్రమంలోని అత్యల్ప వయసుగల స్పిరిట్నే ప్రామాణికంగా తీసుకోవాలనే నిబంధనను కూడా కంపెనీ పాటించలేదని స్పష్టం చేసింది.కృత్రిమ ఫ్లేవర్లు.. ప్యాకేజింగ్ లోపాలుసహజసిద్ధమైన మాల్ట్ లేదా మోలాసెస్ ప్రక్రియ ద్వారా కాకుండా.. విస్కీలో విస్కీ ఫ్లేవర్, రమ్లో రమ్ ఫ్లేవర్ వంటి కృత్రిమ (ఆర్టిఫిషియల్) సువాసనలను నేరుగా కలపడం నియమావళికి విరుద్ధమని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. దీంతో రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, బాగ్పైపర్, ఓల్డ్ మాంక్ వంటి బ్రాండ్ల నిర్దిష్ట బ్యాచ్ల విక్రయాలపై ఆంక్షలు విధించింది. మరోవైపు సురక్షిత గుర్తింపులు లేని రీసైకిల్డ్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించినట్లు గుర్తించి సుమారు 18,000 బాక్సుల పరిమాణంలో ఉన్న సీసాలను బెంగళూరు కేంద్రంలో అధికారులు క్వారంటైన్/సీజ్ చేశారు.ఇదీ చదవండి: కేంద్రానికి పసిడి పంట -
5 నెలలు.. 36 ఇంటర్వ్యూలు.. రూ.30 లక్షల ఉద్యోగం!
చదువు పూర్తయ్యాక ఉద్యోగం తెచ్చుకోవడం కొంతమందికి సులభమే అయినప్పటికీ.. ఇంకొందరికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా పట్టు వదలకుండా ఉద్యోగం సాధించినవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ కథనంలో.. ఏకంగా 36 ఇంటర్వ్యూలకు హాజరైన తరువాత ఉద్యోగం తెచ్చుకున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జర్నీ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టువదలకుండా ప్రయత్నించి.. చివరకు హైదరాబాద్లో రూ.30 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించాడు. తన ఉద్యోగ వేట గురించి ఆయన రెడ్డిట్లోని వివరించారు. గతంలో ఒక కంపెనీలో పనిచేస్తున్న సమయంలో కొన్ని అనారోగ్య కారణాల వల్ల.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.కొంతకాలం ఉద్యోగానికి దూరంగా ఉండి ఆరోగ్యంపై దృష్టి పెట్టిన తర్వాత.. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సమయంలో ఖాళీగా ఉండకుండా.. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న GenAIపై దృష్టి పెట్టారు. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంతో పాటు, తనకు వ్యక్తిగతంగా కూడా GenAIపై ఆసక్తి ఉందని చెప్పారు.After 36 technical interviews, I finally bagged an offerby u/deathmachine1407 in developersIndiaదాదాపు ఐదు నెలల పాటు యాక్టివ్గా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూ.. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మొత్తం 36 ఇంటర్వ్యూల తర్వాత చివరకు హైదరాబాద్లోని ఒక సంస్థలో ఉద్యోగం సాధించారు. కొత్త ఉద్యోగంలో భారీగా జీతం పెరగకపోయినా.. చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎందుకంటే దాదాపు ఏడు నెలల తర్వాత.. మళ్లీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం వచ్చిందని తెలిపారు.ఉద్యోగం అయితే వచ్చింది. కానీ.. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వెళ్లి పనిచేయాల్సి వస్తోంది. ఇది కొంత బాధ కలిగించే విషయమే అయినా.. కెరీర్లో ఇలాంటి మార్పులు తప్పవని ఆయన భావిస్తున్నారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న పలువురు టెక్కీలు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయని కామెంట్లు చేశారు. కొందరు ఆయన ఇంటర్వ్యూ అనుభవాలను పంచుకోవాలని కోరగా, మరికొందరు రెజ్యూమ్ను షేర్ చేయగలరా అని అడిగారు. -
2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు!
ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం భారతదేశంలో రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. దీంతో.. ఈవీ పరిశ్రమలు, అనుబంధ సంస్థలు కూడా విస్తరిస్తున్నాయి. వాహనాల తయారీ, బ్యాటరీలు, ఛార్జింగ్ స్టేషన్లు, సర్వీసింగ్, సాఫ్ట్వేర్, ఫ్లీట్ మేనేజ్మెంట్, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి అనేక రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని 'అడెక్కో ఇండియా' తన నివేదికలో వెల్లడించింది.అడెక్కో ఇండియా డేటా ప్రకారం.. 2030 నాటికి భారతదేశ ఈవీ రంగం 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. అయితే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ భాగం నేరుగా వాహనాల తయారీకి సంబంధించినవి కాకపోవడం గమనార్హం. ఇందులో కేవలం 10-15 శాతం మాత్రమే ప్రత్యక్ష ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది.అంటే.. ఒక వ్యక్తి కార్లు లేదా బైకులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేయకపోయినా ఈవీ రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఛార్జింగ్ స్టేషన్ నిర్వహణ, బ్యాటరీ సర్వీసింగ్, డ్రైవర్ ట్రైనింగ్, కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్, లాజిస్టిక్స్, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కూడా మంచి అవకాశాలు రావచ్చు. తయారీ రంగం మాత్రం ఈవీ ఉద్యోగాల్లో ప్రధాన పాత్ర పోషించనుంది. కాబట్టి మొత్తం ఈవీ ఉద్యోగ డిమాండ్లో సుమారు 50-55 శాతం తయారీ రంగం నుంచి ఉండవచ్చని ఒక అంచనా.ఈవీ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారికి భవిష్యత్తులో మంచి జీతాలు కూడా లభించే అవకాశం ఉంది. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, ఛార్జింగ్ సిస్టమ్స్, టెలిమాటిక్స్ వంటి కొత్త నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోంది. అడెక్కో ఇండియా ప్రకారం, ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు సాధారణ ఉద్యోగుల కంటే కూడా 45 శాతం ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ఆటోమొబైల్ కార్మికులు కూడా కొత్త ఈవీ టెక్నాలజీలను నేర్చుకోవడం చాలా ముఖ్యం.ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలతో.. కమర్షియల్ ఫ్లీట్లు, టాక్సీలు, డెలివరీ వాహనాలు వంటి రంగాల్లో కూడా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. వాహనాల బ్యాటరీ పనితీరును గమనించడం, ఛార్జింగ్ సమయాలను నిర్వహించడం, రూట్లను ప్లాన్ చేయడం, వాహనాలను సర్వీస్ చేయడం వంటి పనులకు ప్రత్యేక సిబ్బంది అవసరం అవుతారు. అయితే.. ఈ ఉద్యోగాల్లో కొన్ని మొదట కాంట్రాక్ట్ లేదా ఫ్లెక్సీ ఉద్యోగాలుగా రావచ్చు. -
ఈ బిలియనీర్ దగ్గర చిరుద్యోగులూ సంపన్నులే!
వాల్స్ట్రీట్లో భారీ ఆస్తులను నిర్వహించే సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుంది. కానీ బిలియనీర్ ఇన్వెస్టర్ బిల్ అక్మన్కు చెందిన పెర్షింగ్ స్క్వేర్ మాత్రం దీనికి భిన్నంగా కనిపిస్తోంది. కేవలం కొన్ని డజన్ల మంది సిబ్బందితోనే బిలియన్ల డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్న ఈ సంస్థలో ఉద్యోగులను నిలుపుకోవడానికి ప్రత్యేకమైన విధానాలను అనుసరిస్తున్నట్లు అక్మన్ వెల్లడించారు.తాజా వివరాల ప్రకారం, పెర్షింగ్ స్క్వేర్ మొత్తం సంస్థ ఆస్తుల నిర్వహణ విలువ (AUM) 2026 జూన్ 30 నాటికి సుమారు 33 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.13 లక్షల కోట్లు). సంస్థ అధికారిక వివరాల ప్రకారం, ఇందులో దాదాపు 98 శాతం శాశ్వత మూలధనం (Permanent Capital) కాగా, సంస్థకు మూడు ప్రధాన శాశ్వత మూలధన వాహనాలు ఉన్నాయి.ఇంత పెద్ద స్థాయి ఆస్తులను నిర్వహిస్తున్న సంస్థలో సిబ్బంది సంఖ్య మాత్రం చాలా తక్కువ. తాజా వ్యాఖ్యల్లో అక్మన్ సుమారు 48 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. 2025 డిసెంబర్ 31 నాటికి పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో 44 మంది ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ సమర్పించిన అధికారిక పత్రాల్లోనూ నమోదైంది.రిసెప్షనిస్ట్ నుంచి స్వీపర్ వరకు.. అందరికీ వాటాలుఉద్యోగులు సంస్థతో ఎక్కువకాలం కొనసాగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వారికి కంపెనీ విజయంతో నేరుగా ఆర్థిక సంబంధం ఉండటమేనని అక్మన్ చెబుతున్నారు. సంస్థలోని ప్రతి ఉద్యోగికి, వారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, గణనీయమైన కంపెనీ స్టాక్ ఉందని ఆయన పేర్కొన్నారు.అంటే ఇన్వెస్ట్మెంట్ టీమ్ సభ్యులకే కాకుండా ఫ్రంట్ డెస్క్, ఇతర సహాయక విభాగాల్లో పనిచేసే సిబ్బందికీ సంస్థలో వాటా ఉందన్నమాట. ఉద్యోగులు సంస్థ ఎదుగుదలలో తమకూ ప్రత్యక్ష ప్రయోజనం ఉందని భావించేలా చేయడం ద్వారా వారి నిబద్ధతను పెంచుతున్నామని అక్మన్ వివరించారు.ఉద్యోగుల పెట్టుబడుల విషయానికొస్తే, 2025 చివరి నాటికి పెర్షింగ్ స్క్వేర్ ఉద్యోగులు, అనుబంధ సంస్థలు కలిపి సంస్థ నిర్వహించే ఫండ్లు, హోవర్డ్ హ్యూస్ హోల్డింగ్స్లో సుమారు 5.8 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు అధికారిక పత్రాలు వెల్లడిస్తున్నాయి.జూలై, ఆగస్టులో హాంప్టన్స్ నుంచి పనిఉద్యోగులను ఆకట్టుకునే మరో ప్రత్యేక విధానం కూడా పెర్షింగ్ స్క్వేర్లో ఉంది. సాధారణంగా ఏడాదిలో ఎక్కువ కాలం ఉద్యోగులు వారానికి ఐదు రోజులు కార్యాలయం నుంచే పనిచేయాల్సి ఉంటుంది. అయితే జూలై, ఆగస్టు నెలల్లో మాత్రం ఈ విధానంలో సడలింపు ఉంటుంది.ఈ రెండు నెలల్లో ఇన్వెస్ట్మెంట్ టీమ్ సభ్యులు న్యూయార్క్కు సమీపంలోని హాంప్టన్స్ ప్రాంతం నుంచి పనిచేసే అవకాశం ఉంటుంది. కొందరు అక్కడ ఇళ్లను అద్దెకు తీసుకోవడం లేదా సొంత ఇళ్లలో ఉండటం ద్వారా కలిసి పనిచేస్తారని అక్మన్ తెలిపారు.ఉద్యోగుల ఆరోగ్యం, సౌకర్యాలపైనా సంస్థ దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఆరోగ్యకరమైన భోజనం, జిమ్ సదుపాయాలు, సమగ్ర ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను ఉద్యోగులకు అందిస్తున్నట్లు వివరించారు.టాలెంట్ కంటే వ్యక్తిత్వానికే ప్రాధాన్యంపెర్షింగ్ స్క్వేర్లో ఉద్యోగులను నిలుపుకోవడం కేవలం జీతాలు, స్టాక్తోనే సాధ్యమవుతుందని అక్మన్ భావించడం లేదు. సరైన వ్యక్తులను నియమించడం నుంచే సంస్థ సంస్కృతి మొదలవుతుందని ఆయన అంటున్నారు.అత్యున్నత ప్రతిభతో పాటు మంచి మానవీయ లక్షణాలు ఉన్న వ్యక్తులకే సంస్థలో చోటు కల్పించేందుకు ప్రయత్నిస్తామని అక్మన్ చెప్పారు. ప్రతిభావంతులైన వ్యక్తులు చాలామంది ఉన్నప్పటికీ, ఇతరులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే, నమ్మదగిన, మంచి వ్యక్తిత్వం ఉన్న ప్రతిభావంతులను ఎంచుకోవడమే బలమైన సంస్థ సంస్కృతికి పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు.2003లో ప్రారంభమైన పెర్షింగ్ స్క్వేర్బిల్ అక్మన్ 1966లో జన్మించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసిన తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. 1992లో డేవిడ్ బెర్కోవిట్జ్తో కలిసి గోథమ్ పార్ట్నర్స్ను ప్రారంభించారు. ఆ సంస్థలో ఎదురైన ఇబ్బందుల తర్వాత అక్మన్ కొత్త పెట్టుబడి సంస్థను నిర్మించే దిశగా అడుగులు వేశారు.2003లో పెర్షింగ్ స్క్వేర్ను స్థాపించారు. కాలక్రమేణా ఇది ప్రముఖ యాక్టివిస్ట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థగా ఎదిగింది. చిపోటిల్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్ వంటి కంపెనీల్లో పెట్టుబడుల ద్వారా అక్మన్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. పెర్షింగ్ స్క్వేర్ హోల్డింగ్స్ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యింది. 2026లో సంస్థ అమెరికాలోనూ తన పబ్లిక్ మార్కెట్ ఉనికిని విస్తరించింది. -
అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి?
అమెరికాకు వెళ్లాలనుకునేవారికి సరైన వీసాను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఉద్యోగం చేయడానికి, వ్యాపార పనుల కోసం, వివాహం చేసుకోవడానికి, తాత్కాలికంగా ఉండడానికి లేదా ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లేవారికి వేర్వేరు రకాల వీసాలు ఉంటాయి. ప్రతి వీసాకు ప్రత్యేకమైన అర్హతలు, నిబంధనలు, కాలపరిమితి, దరఖాస్తు విధానం ఉంటాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.బీ-1 వీసాఅమెరికాలో వ్యాపార సమావేశాలు, క్లయింట్లను కలవడం, సమావేశాలు లేదా కాన్ఫరెన్స్లకు హాజరుకావడం, ఒప్పందాలపై చర్చించడం వంటి తాత్కాలిక వ్యాపార కార్యకలాపాల కోసం B-1 వీసా ఉపయోగపడుతుంది. అయితే.. ఈ వీసాతో అమెరికాలో సాధారణ ఉద్యోగం చేయడం లేదా అమెరికా సంస్థ నుంచి జీతం తీసుకోవడం సాధ్యం కాదు.ఈ వీసా కోసం దరఖాస్తుదారులు తమ ప్రయాణం తాత్కాలికమేనని, అమెరికా నుంచి తిరిగి వెళ్తారని, ప్రయాణ ఖర్చులను భరించగల సామర్థ్యం ఉందని చూపించాలి. సాధారణంగా పాస్పోర్ట్, DS-160 ఫారం, వీసా ఫీజు రసీదు, ఫొటోతో పాటు ప్రయాణ ఉద్దేశాన్ని తెలిపే పత్రాలు అవసరం.హెచ్-1బీ వీసాఅమెరికాలో ప్రత్యేక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలు చేయాలనుకునే వారికి H-1B వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా సంబంధిత విద్యార్హతలు, అమెరికా సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అవసరం. ఈ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, చాలా సందర్భాల్లో లాటరీ విధానం ఉంటుంది.సాధారణంగా ఏడాదికి 65,000 హెచ్-1బీ వీసాల రెగ్యులర్ క్యాప్ ఉంటుంది. అమెరికా మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉన్నవారికి అదనంగా 20,000 వీసాల మాస్టర్స్ క్యాప్ ఉంటుంది. అయితే.. కొన్ని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలు ఈ క్యాప్కు మినహాయింపు పొందవచ్చు. సాధారణంగా హెచ్-1బీ స్టేటస్ మూడు సంవత్సరాల వరకు మంజూరు కావచ్చు. కొన్ని పరిస్థితుల్లో మొత్తం ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. హెచ్-1బీను డ్యూయల్-ఇంటెంట్ వీసాగా పరిగణిస్తారు కాబట్టి, అమెరికాలో పనిచేస్తూనే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది.హెచ్-2బీ వీసాసీజనల్ లేదా తాత్కాలికంగా ఉద్యోగులు అవసరమైనప్పుడు హెచ్-2బీ వీసా ఉపయోగపడుతుంది. టూరిజం, సీజనల్ పనులు, తాత్కాలిక ప్రాజెక్టులు వంటి ఉద్యోగాలకు ఇది ఉపయోగపడుతుంది.హెచ్-2బీ ఉద్యోగులకు సాధారణంగా ప్రారంభంగా గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు స్టేటస్ ఇవ్వవచ్చు. అర్హత ఉన్న సందర్భాల్లో పొడిగింపులు లభించవచ్చు. అయితే హెచ్-2బీ స్టేటస్లో మొత్తం గరిష్ఠంగా మూడు సంవత్సరాలు మాత్రమే ఉండవచ్చు. ఇది డ్యూయల్-ఇంటెంట్ వీసా కాదు. కాబట్టి తాత్కాలిక ఉద్యోగం పూర్తైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఉద్దేశాన్ని చూపించాలి.కే-1 వీసాఅమెరికా పౌరుడిని వివాహం చేసుకోబోయే విదేశీయులకు కే-1 వీసా ఉపయోగపడుతుంది. ఈ వీసాతో అమెరికాలోకి వెళ్లిన తర్వాత 90 రోజుల్లో వివాహం చేసుకోవాలి. వీసా ప్రక్రియలో I-129F పిటిషన్, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ వంటి దశలు ఉంటాయి. వివాహం తర్వాత గ్రీన్ కార్డ్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవచ్చు.కే-3 వీసాఅమెరికా పౌరుడిని ఇప్పటికే వివాహం చేసుకున్న విదేశీ జీవిత భాగస్వామి.. అమెరికాకు రావడానికి కే-3 వీసా ఉద్దేశించబడింది. అయితే I-130 పిటిషన్ ఆమోదం పొందిన తర్వాత K-3 అవసరం సాధారణంగా ముగుస్తుంది. అందువల్ల ఈ వీసా ప్రస్తుతం చాలా తక్కువగా ఉపయోగించబడుతోంది.ఎల్-1 వీసాఒక అంతర్జాతీయ కంపెనీ తన విదేశీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగిని అమెరికాలోని సంబంధిత కార్యాలయానికి బదిలీ చేయాలనుకుంటే L-1 వీసా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఉద్యోగి గత మూడు సంవత్సరాల్లో కనీసం ఒక సంవత్సరం సంబంధిత విదేశీ సంస్థలో పనిచేసి ఉండాలి. మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్లు లేదా కంపెనీకి ప్రత్యేకమైన నైపుణ్యం ఉన్న ఉద్యోగులు ఈ వీసా కింద అర్హత పొందవచ్చు.ఓ వీసాతమ రంగంలో అసాధారణ ప్రతిభ లేదా ప్రత్యేక విజయాలు సాధించిన వ్యక్తులకు O వీసా ఉపయోగపడుతుంది. సైన్స్, విద్య, వ్యాపారం, క్రీడలు, కళలు, సినిమా, టెలివిజన్ వంటి రంగాల్లో ప్రతిభ ఉన్నవారు దీనికి అర్హత పొందవచ్చు. అవార్డులు, ప్రచురణలు, ప్రముఖ సంస్థల్లో సభ్యత్వం, అధిక జీతం, నాయకత్వ స్థానాలు, తమ రంగానికి చేసిన ముఖ్యమైన సేవలు వంటి ఆధారాలతో తమ ప్రతిభను నిరూపించాల్సి ఉంటుంది.పీ వీసాఅమెరికాలో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్లే క్రీడాకారులు, కళాకారులు, ఎంటర్టైనర్లు, కొన్ని సందర్భాల్లో వారి బృందాలకు P వీసా ఉపయోగపడుతుంది. ఇందులో P-1, P-2, P-3 వంటి వివిధ కేటగిరీలు ఉన్నాయి. కొన్ని పరిస్థితుల్లో ట్రైనర్లు, టూర్ మేనేజర్లు, సౌండ్ ఇంజినీర్లు, ఫిజియోథెరపిస్టులు వంటి అవసరమైన సహాయక సిబ్బందికి కూడా ఈ వీసా కింద అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్! -
మారుతున్న జాబ్ మార్కెట్.. వాళ్లకే ఉద్యోగాలు!
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఏఐ.. ఆటోమేషన్ వల్ల చాలా పనులు సులభంగా మారుతున్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో ఉద్యోగం పొందడానికి కేవలం అనుభవం మాత్రమే సరిపోదు. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం కూడా చాలా ముఖ్యం.ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కంటే.. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే వ్యక్తులకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని విద్యావేత్త, రచయిత ప్రశాంత్ కిరాడ్ పేర్కొన్నారు. దీనికి కారణం.. స్కిల్స్ ఎప్పటికప్పుడు మారుతుండటమే అని వెల్లడించారు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా అవసరం అని ఆయన అన్నారు.ఉద్యోగ ప్రపంచంలో మనగలగాలంటే.. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? అని మాత్రమే కాకుండా.. అవసరం వచ్చినప్పుడు కొత్త స్కిల్ ఎంత వేగంగా నేర్చుకోగలను అనే విషయాన్ని కూడా తప్పకుండా ఆలోచించాలి.అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త స్కిల్ నేర్చుకున్న వెంటనే రిజల్ట్స్ రావాలని ఆశించకూడదు. కనీసం 90 రోజుల పాటు ప్రతిరోజూ ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత అది మనకు ఉపయోగపడుతుందా లేదా అని నిర్ణయించుకోవాలి. ప్రపంచం మారుతున్నప్పుడు.. మనం కూడా మారాలి.ఇదీ చదవండి: H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్! -
బెర్క్షైర్లో భారీగా షేర్ల బై బ్యాక్..
వారెన్ బఫెట్ వారసుడిగా బెర్క్షైర్ హాత్వే పగ్గాలు చేపట్టిన గ్రెగ్ అబెల్.. కంపెనీ వద్ద పోగైన భారీ నగదు నిల్వలను క్రమంగా పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నారు. 2026 రెండో త్రైమాసికంలో బెర్క్షైర్ హాత్వే దాదాపు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2021 తర్వాత ఒక త్రైమాసికంలో కంపెనీ చేసిన అతిపెద్ద బైబ్యాక్ ఇదే కావడం విశేషం.జూన్తో ముగిసిన మూడు నెలల్లో బెర్క్షైర్ నిర్వహణ లాభాలు పన్నుల అనంతరం సుమారు 16 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు చేరాయి. రైల్వే, ఇంధన-విద్యుత్, తయారీ, సేవలు, రిటైల్ విభాగాల్లో మెరుగైన పనితీరు లాభాల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అయితే ఇన్సూరెన్స్ అండర్రైటింగ్ లాభాలు తగ్గడం కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపింది.14 త్రైమాసికాల తర్వాత ఈక్విటీల కొనుగోలుబెర్క్షైర్లో అత్యంత ఆసక్తికరమైన మార్పు దాని పెట్టుబడి వ్యూహంలో కనిపించింది. వరుసగా 14 త్రైమాసికాల పాటు అమెరికా ఈక్విటీలను నికరంగా విక్రయించిన సంస్థ.. ఈసారి సుమారు 20 బిబిలియన్ డాలర్ల నికర స్టాక్ కొనుగోళ్లు చేసింది. ఫలితంగా జూన్ చివరి నాటికి కంపెనీ వద్ద నగదు, నగదుతో సమానమైన ఆస్తులు, అమెరికా ట్రెజరీ బిల్లుల నిల్వలు కలిపి సుమారు 365.5 బిలియన్ డాలర్లకు తగ్గాయి. మార్చి చివర్లో ఈ మొత్తం దాదాపు 397.4 బిలియన్ డాలర్లుగా ఉంది.అయితే ఈ భారీ నగదు నిల్వ పూర్తిగా తగ్గిపోలేదు. బెర్క్షైర్ ఇప్పటికీ అమెరికాలోనే అత్యంత భారీ నగదు నిల్వ కలిగిన కంపెనీల్లో ఒకటిగా ఉంది. జూన్ చివరి నాటికి దాని వద్ద సుమారు 325 బిలియన్ డాలర్ల ట్రెజరీ బిల్లులు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి.గూగుల్పై 10 బిలియన్ డాలర్ల బెట్టింగ్గ్రెగ్ అబెల్ నాయకత్వంలో బెర్క్షైర్ భారీగా పెట్టుబడులు పెడుతున్న మరో రంగం టెక్నాలజీ. కంపెనీ రెండో త్రైమాసికంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్లో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడైంది. ఈ పెట్టుబడితో ఆల్ఫాబెట్ బెర్క్షైర్ ఈక్విటీ పోర్ట్ఫోలియోలోని టాప్-5 హోల్డింగ్స్లోకి చేరింది. చెవ్రాన్ స్థానాన్ని ఆల్ఫాబెట్ ఆక్రమించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆల్ఫాబెట్ భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.టేలర్ మోరిసన్ కొనుగోలుతో హౌసింగ్లో అడుగుఅబెల్ నాయకత్వంలో బెర్క్షైర్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రముఖ హోమ్బిల్డర్ టేలర్ మోరిసన్ హోమ్ కార్పొరేషన్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో షేరుకు 72.50 డాలర్ల చొప్పున నగదు చెల్లించే ఈ డీల్లో ఈక్విటీ విలువ సుమారు 6.8 బిలియన్ డాలర్లు, మొత్తం ఎంటర్ప్రైజ్ విలువ సుమారు 8.5 బిలియన్ డాలర్లు. బెర్క్షైర్ ఇప్పటికే క్లేటన్ హోమ్స్, ఇతర బిల్డింగ్ ప్రొడక్ట్స్ వ్యాపారాల ద్వారా హౌసింగ్ రంగంలో ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు ఆ వ్యాపారాన్ని మరింత విస్తరించే అవకాశం కల్పిస్తుంది.బఫెట్తో పోలిస్తే భిన్నమైన దిశవారెన్ బఫెట్ కాలంలో బెర్క్షైర్ భారీ నగదు నిల్వలను కొనసాగిస్తూ, ఆకర్షణీయమైన విలువలు కనిపించే వరకు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండేది. ముఖ్యంగా అమెరికా షేర్ల విలువలు అధికంగా ఉన్నాయంటూ బఫెట్ పలుమార్లు హెచ్చరించారు. అయితే 2026లో అబెల్ నాయకత్వం ప్రారంభమైన తర్వాత పరిస్థితి మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షేర్ల బైబ్యాక్లు, ఆల్ఫాబెట్లో భారీ పెట్టుబడి, టేలర్ మోరిసన్ కొనుగోలు.. బెర్క్షైర్ తన నగదు నిల్వలను మరింత చురుగ్గా వినియోగించేందుకు సిద్ధమవుతోందనే సంకేతాలుగా మార్కెట్ విశ్లేషకులు చూస్తున్నారు.అయితే ఈ మార్పుల మధ్య బెర్క్షైర్ షేరు పనితీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. ఆగస్టు 7న మార్కెట్ ముగిసే సమయానికి క్లాస్-B షేర్లు ఈ ఏడాది సుమారు 3.8 శాతం మాత్రమే పెరిగాయి. ఇదే సమయంలో S&P 500 దాదాపు 13 శాతం లాభపడింది. దీంతో అబెల్ తీసుకుంటున్న కొత్త పెట్టుబడి నిర్ణయాలు బెర్క్షైర్కు దీర్ఘకాలంలో ఎంత మేర విలువను సృష్టిస్తాయన్నది ఇప్పుడు ఇన్వెస్టర్ల ప్రధాన ప్రశ్నగా మారింది. -
UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!
యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ.. ఇటీవల వార్తలు రావడంతో వినియోగదారుల్లో సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో మార్పులకు సంబంధించిన బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ చర్చ మరింత పెరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. సాధారణ యూపీఐ చెల్లింపులకు వినియోగదారుల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది.అంటే ఎప్పటిమాదిరిగానే.. ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బులు పంపడం ఉచితంగానే కొనసాగుతుందన్నమాట. అయితే కొన్ని పరిమితమైన వ్యాపార లావాదేవీల విషయంలో మాత్రం భవిష్యత్తులో చిన్న మొత్తంలో ఛార్జీలు విధించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. దీనినే ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) అంటారు.ఉదాహరణకు.. ఒక షాప్లో యూపీఐ ద్వారా చెల్లించినప్పుడు, ఆ చెల్లింపును ప్రాసెస్ చేసినందుకు వ్యాపారి చెల్లించే రుసుమే ఎండీఆర్. ప్రస్తుతం యూపీఐలో ఎండీఆర్ సున్నాగా ఉంది కాబట్టి సాధారణంగా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు తీసుకున్నందుకు ఎలాంటి ఫీజు చెల్లించడం లేదు.ఒకవేళ భవిష్యత్తులో ఎండీఆర్ను ప్రవేశపెట్టినా, అది ప్రతి యూపీఐ చెల్లింపుపై ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట పరిమితి దాటిన కొన్నింటికి మాత్రమే, అదీ చాలా తక్కువ రేటుతో ఛార్జీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా.. P2P (వ్యక్తి నుంచి వ్యక్తికి) చెల్లింపులు మాత్రం ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి సాధారణంగా మనం చేసే యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు వస్తాయనే ఆందోళన ఇకపై అవసరం లేదు.✅ No Charges for UPI Users✅ Vast Majority of the Transactions to Remain Free of Charge for Merchants as well✅ Amendment to the Payment and Settlement Systems Act (PSS Act) an Enabling Provision to Ensure further proliferation of Financial Inclusion, UPI’s Long-Term… pic.twitter.com/b6QYTgiw8a— Ministry of Finance (@FinMinIndia) August 8, 2026 -
ఉద్యోగాలపై నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల రాబోయే రోజుల్లో.. భారతదేశంలో ఉద్యోగాల తీరు చాలా వరకు మారే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని అన్నారు. ముఖ్యంగా పెద్ద కంపెనీల్లో ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.నిజానికి.. ఒక ఉద్యోగి చేసే పనిని చిన్న చిన్న టాస్కులుగా విభజించి వాటిలో కొన్నింటిని ఏఐతో చేయించుకోవడం పెద్ద సంస్థలకు సులభంగా ఉంటుంది. కాబట్టి.. భవిష్యత్తులో పెద్ద కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం కంటే, ఉద్యోగాలను తొలగిస్తాయని నీలేకని అభిప్రాయపడ్డారు.అయితే.. చిన్న కంపెనీల పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుందని నీలేకని అన్నారు. దేశంలో లక్షల సంఖ్యలో చిన్న సంస్థలు ఉన్నాయి. ఇందులో పనితీరు, అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల వాటి మొత్తం కార్యకలాపాలను ఏఐతో ఆటోమేట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి చిన్న వ్యాపారాలు.. ఏఐ ప్రభావాన్ని కొంతవరకు తట్టుకుని నిలబడగలవు, ఉద్యోగాలను కల్పించగలవని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 లక్షల స్టార్టప్లు ఉన్నాయి. 2035 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని నీలకేని అంచనా వేశారు. అయితే.. చిన్న వ్యాపారాలు పెరగాలంటే నిబంధనలు సులభంగా ఉండాలని, వారికి పెట్టుబడులు, రుణాలు, మార్కెట్లు సులభంగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ఉద్యోగుల విషయంలోనూ పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. ఒక కంపెనీలో చేరి ఏళ్ల పాటు అక్కడే పనిచేసే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో ఉద్యోగులు తరచుగా కంపెనీలు మారే పరిస్థితి రావచ్చని అన్నారు.ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందా? -
తత్కాల్ టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే కన్ఫర్మ్ సీటు!
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోలేకపోయినా రైలు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను ప్రయాణికులు ఆన్లైన్లోనే బుక్ చేసుకునే అవకాశం భారతీయ రైల్వే కల్పిస్తోంది. ఐఆర్సీటీసీలోని ‘Charts Vacancy’ ఫీచర్ ద్వారా ఈ సీట్ల వివరాలను తెలుసుకోవచ్చు. అందుబాటులో ఉన్న సీటును బుక్ చేసుకుంటే నేరుగా కన్ఫర్మ్ టికెట్ జారీ అవుతుంది.చార్ట్ సిద్ధమైన తర్వాత ఖాళీ సీట్లురైలు బయలుదేరే ముందు తొలి రిజర్వేషన్ చార్ట్ సిద్ధం చేసినప్పుడు కొన్ని సీట్లు ఖాళీగా ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా రైలు బయలుదేరడానికి సుమారు నాలుగు గంటల ముందు తొలి చార్ట్ తయారవుతుంది. ఆ తర్వాత కూడా ఖాళీగా ఉన్న సీట్లను ‘కరెంట్ బుకింగ్’ ద్వారా ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. రైలు, మార్గాన్ని బట్టి బుకింగ్ సమయం మారవచ్చు.కరెంట్ బుకింగ్లో లభించే టికెట్లు వెయిట్లిస్ట్ లేదా ఆర్ఏసీ టికెట్లు కావు. ఖాళీ సీటు అందుబాటులో ఉంటే బుక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ టికెట్ (CNF) జారీ అవుతుంది. దీంతో తత్కాల్ టికెట్ దొరకని ప్రయాణికులకు ఇది మరో ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.తత్కాల్ ఛార్జీలు ఉండవుకరెంట్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకునే ప్రయాణికులు అదనంగా తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ సర్ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సాధారణ రిజర్వేషన్ ఛార్జీలే వర్తిస్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఖాళీ సీట్లను ఆకర్షణీయంగా బుక్ చేసుకునేలా డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండొచ్చు. డిస్కౌంట్ వర్తింపు రైలు, సీటు, బుకింగ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.రీఫండ్ విషయంలో జాగ్రత్తకరెంట్ బుకింగ్ టికెట్లను బుక్ చేసుకునే ముందు ప్రయాణ ప్రణాళికను ఖరారు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ టికెట్లను రద్దు చేసినప్పుడు సాధారణంగా రీఫండ్ నిబంధనలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి చివరి నిమిషంలో సీటు దొరికిందని తొందరపడి బుక్ చేసుకునే ముందు క్యాన్సిలేషన్ నిబంధనలను పరిశీలించాలి.ఐఆర్సీటీసీలో ఖాళీ సీట్లు ఎలా చూడాలి?ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్లి రైలు బుకింగ్ విభాగంలో ‘Charts/Vacancy’ ఆప్షన్ను ఎంచుకోవాలి. అనంతరం రైలు నంబర్, ప్రయాణ తేదీ వంటి వివరాలను నమోదు చేస్తే చార్ట్ సిద్ధమైన తర్వాత అందుబాటులో ఉన్న కోచ్లు, బెర్త్ల వివరాలను చూడవచ్చు. ఖాళీ సీటు కనిపిస్తే, నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు.ఇంటర్మీడియట్ స్టేషన్లో ప్రయాణికుడు దిగిపోయిన తర్వాత ఖాళీ అయిన బెర్త్లు కూడా తదుపరి స్టేషన్ల నుంచి ప్రయాణించే వారికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాంటి ఖాళీ సీట్ల కోసం ప్రయాణికులు రైలులో టీటీఈని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు చార్ట్ వేకెన్సీ ద్వారా అందుబాటులో ఉన్న వివరాలను ఆన్లైన్లోనే చూసుకునే అవకాశం ఉంది.అందువల్ల తత్కాల్ బుకింగ్లో టికెట్ దొరకని ప్రయాణికులు రైలు బయలుదేరే ముందు ‘Charts/Vacancy’ను ఒకసారి పరిశీలిస్తే, అదృష్టం కలిసొస్తే నేరుగా కన్ఫర్మ్ సీటును పొందే అవకాశం ఉంటుంది. -
రైళ్లలో ఆహార నాణ్యతా లోపాలు
రైలు ప్రయాణికులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే కఠిన చర్యలు చేపట్టింది. గత మూడేళ్ల కాలంలో ఆహార నాణ్యత, పారిశుధ్య నిబంధనలను ఉల్లంఘించిన క్యాటరింగ్ లైసెన్సీలపై రైల్వే శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని సంస్థలపై రూ.5.13 కోట్ల మేర జరిమానాలు విధించడంతోపాటు ఆరు ప్రధాన కాంట్రాక్టులను రద్దు చేసి, సదరు కాంట్రాక్టర్లను డీబార్ (బ్లాక్లిస్ట్) చేసింది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు.మంత్రి అందించిన సమాచారం ప్రకారం.. గత మూడేళ్లలో ఆహార లోపాలపై 54 షోకాజ్ నోటీసులు జారీ చేశామని, డీబార్ చేసిన లైసెన్సీల జాబితాను ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్లో ప్రచురించామని తెలిపారు. భారతీయ రైల్వేలు ఏటా సగటున 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తుండగా ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు కేవలం 0.0008 శాతానికే పరిమితం కావడం గమనార్హం. ఫిర్యాదుల శాతం అత్యల్పంగా ఉన్నప్పటికీ ప్రయాణికుల ఆరోగ్య భద్రత విషయంలో జోరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆహార భద్రతకై సంస్కరణలుఆధునిక సాంకేతికతతో కూడిన బేస్ కిచెన్లను ఏర్పాటు చేసి వంట తయారీ విధానాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలను అమర్చారు.ప్రయాణికులకు ఇచ్చే మీల్ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రిస్తున్నారు. దీని ద్వారా ప్యాకింగ్ తేదీ, కాంట్రాక్టర్ వివరాలు, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ను ప్రయాణికులు స్వయంగా పరిశీలించవచ్చు.ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఐఆర్సీటీసీ సూపర్వైజర్లచే తరచుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు పొందిన బ్రాండెడ్ ముడిసరుకుల వినియోగం, బేస్ కిచెన్లు, పాంట్రీ కార్లలో రెగ్యులర్ పెస్ట్ కంట్రోల్ (క్రిమిసంహారక) చర్యలను తప్పనిసరి చేశారు. -
తిరస్కరణలే పునాదిగా బిలియన్ డాలర్ల సామ్రాజ్యం
జీవితంలో ఎదురయ్యే తిరస్కరణలు ప్రయాణానికి ముగింపు కాదని, అవి మహోన్నత విజయానికి బాటలు వేసే గుణపాఠాలని నిరూపించారు చెన్నైకి చెందిన 32 ఏళ్ల టెక్ వ్యవస్థాపకుడు, పర్ప్లెక్సిటీ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అరవింద్ శ్రీనివాస్. నేడు ప్రపంచ కృత్రిమ మేధ రంగాన్ని శాసిస్తున్న పర్ప్లెక్సిటీ వెనుక ఉన్న ఆయన ప్రయాణం.. వరుస వైఫల్యాలను దాటుకుని శిఖరాగ్రానికి చేరుకున్న ఒక అసాధారణ పోరాటం.ఐఐటీ నుంచి ఎంఐటీ వరకు.. వరుస నిరాశలే!చిన్నప్పటి నుంచీ కంప్యూటర్ సైన్స్పై మక్కువ ఉన్న అరవింద్కు ఐఐటీ మద్రాస్లో సీఎస్ సీటు లభించలేదు. దీంతో ఆయన డ్యూయల్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో చేరాల్సి వచ్చింది. మొదటి సంవత్సరం ప్రతిభ ఆధారంగా బ్రాంచ్ మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం 0.01 సీజీపీఏ (CGPA) స్వల్ప తేడాతో ఆ అవకాశం చేజారింది. ఆపై ఎలక్ట్రికల్ విద్యార్థిననే కారణంతో మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరేందుకు కూడా మొదట్లో ప్రొఫెసర్ల నుంచి నిరాకరణ ఎదురైంది. ఐఐటీ పూర్తయ్యాక పీహెచ్డీ కోసం ప్రపంచ ప్రఖ్యాత మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి దరఖాస్తు చేయగా అక్కడా తిరస్కరణే లభించింది.వైఫల్యమే విజయ సూత్రమై..ఈ తిరస్కరణలకు కుంగిపోకుండా యూసీ బార్కిలీలో పీహెచ్డీ పూర్తి చేసిన అరవింద్.. ఓపెన్ ఏఐ, గూగుల్, డీప్మైండ్లలో పరిశోధకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. అనంతరం సొంతంగా ప్రారంభించిన తొలి స్టార్టప్ (ఎక్స్ ఆధారిత సెర్చ్ టూల్) ప్లాట్ఫామ్ ఏపీఐ మార్పుల వల్ల విఫలమైంది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా 2022 మధ్యలో డెనిస్ యారట్స్, జానీ హో, ఆండీ కాన్విన్స్కీలతో కలిసి పర్ప్లెక్సిటీ ఏఐకి శ్రీకారం చుట్టారు.ప్రపంచ స్థాయిలో సంచలనంసాంప్రదాయ సెర్చ్ ఇంజిన్లకు భిన్నంగా యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు వెతికి ఇచ్చే ఆన్సరింగ్ టూల్గా పర్ప్లెక్సిటీ ప్రపంచ టెక్ రంగంలో సంచలనం సృష్టించింది. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాల పెట్టుబడులతో కోట్లాది డాలర్ల మూలధనాన్ని సమకూర్చుకున్న ఈ సంస్థ బిలియన్ డాలర్ల వాల్యుయేషన్కు చేరుకుంది. ఈ ఘనతతో అరవింద్ శ్రీనివాస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో చోటు దక్కించుకుని భారత్లోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
ఉద్యోగుల సెలవుల్లో మార్పులు చేసిన యాక్సెంచర్
అంతర్జాతీయ ఐటీ, కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగుల సెలవుల విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వ్యాపారాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో ఉద్యోగులు తమ వద్ద ఉపయోగించకుండా మిగిలివున్న సెలవులను తదుపరి ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.సాధారణంగా సంస్థ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా వాడని సెలవులు రద్దవుతాయి. అయితే, ఆగస్టు నెలాఖరుతో కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగులు లీవ్ల రద్దు భయంతో సెలవులకు వెళ్లకుండా విధుల్లోనే కొనసాగి ప్రాజెక్టులపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడానికి యాక్సెంచర్ ఈ నిర్ణయం తీసుకుంది.క్యూ3 దెబ్బకు సీఈఓ హెచ్చరికమూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, దాంతో షేరు విలువ దాదాపు 20 శాతం మేర పడిపోవడమే ఈ వ్యూహాత్మక అడుగుకి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూలీ స్వీట్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో కీలక విషయాలను వెల్లడించారు. ‘నాలుగో త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను సాధించడంపైనే వాటాదారుల నమ్మకం ఆధారపడి ఉంది. చిన్నవి, పెద్దవి, మెగా డీల్స్ అని తేడా లేకుండా క్లయింట్ల నుంచి నూతన వ్యాపారాన్ని రాబట్టేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలి’ అని ఆమె పిలుపునిచ్చారు.కార్పొరేట్ విశ్లేషణసాధారణంగా ఆగస్టు చివరి వారాల్లో వేలాది మంది ఉద్యోగులు వార్షిక సెలవులను వాడుకోవడానికి లీవ్లో ఉంటారు. ఈ నయా పాలసీతో ఉద్యోగులకు లీవ్లను తర్వాత వాడుకునే సడలింపు లభించడంతోపాటు విధులకు హాజరై సేల్స్ పెంచే వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయంగా ఐటీ వ్యయాలపై క్లయింట్లు ఆచితూచి అడుగులు వేస్తున్న తరుణంలో నిర్దేశిత త్రైమాసిక లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీలు పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తున్నాయని యాక్సెంచర్ తాజా నిర్ణయం స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
త్రైమాసిక ఫలితాల్లో ఆహా అనిపించిన ఎస్బీఐ
బ్యాంకింగ్ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టేట్బ్యాంక్ (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం ఎగసి రూ. 24,113 కోట్లను తాకింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 10 శాతం వృద్ధితో రూ. 21,121 కోట్లను అధిగమించింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 19,160 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతం జంప్చేసి రూ. 46,992 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు దేశీయంగా 3 శాతంగా నమోదయ్యాయి.ఫారెక్స్ డెరివేటివ్స్ ఆదాయం తగ్గడంతో వడ్డీయేతర ఆదాయం 9 శాతం నీరసించి రూ. 15,293 కోట్లకు పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరం 14–15 రుణ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలియజేశారు. ఇందుకు డిపాజిట్లలో 10–11 శాతం వృద్ధి సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎఫ్సీఎన్ఆర్(బీ) మార్గంలో 6 బిలియన్ డాలర్లు మొబిలైజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ పథకం గడువు ముగియనున్న సెపె్టంబర్కల్లా ఇది 10 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేశారు.స్లిప్పేజీలు తగ్గాయ్తాజా సమీక్షా కాలంలో ఎస్బీఐ స్లిప్పేజీలు గతేడాది క్యూ1(రూ. 7,945 కోట్లు)తో పోలిస్తే రూ. 7,046 కోట్లకు తగ్గాయి. వార్షికంగా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) సైతం 1.83 శాతం నుంచి 1.47 శాతానికి దిగివచ్చాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 4,934 కోట్ల నుంచి రూ. 3,359 కోట్లకు వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి 15.67 శాతంగా నమోదైంది.100 లక్షల కోట్ల వ్యాపారం..ఎస్బీఐ మొత్తం వ్యాపారం రూ. 100 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. తద్వారా దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి బ్యాంకుగా నిలిచింది. డిపాజిట్లు రూ. 60 లక్షల కోట్లు, రుణాలు రూ. 50 లక్షల కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. దాదాపు రూ. 3.6 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలపై కసరత్తు జరుగుతోందని ఎండీ అశ్విని కుమార్ తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు -
ఉద్యోగులకు షాకిచ్చిన మెయిల్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దిగ్గజ కంపెనీలు తమ పని విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఉద్యోగులకు సహాయపడే టెక్నాలజీగా ఉన్న ఏఐ.. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలనే భర్తీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ ప్రభావం తాజాగా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా(Visa)లో స్పష్టంగా కనిపించింది.సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో సుమారు 7 శాతం. ఈ నిర్ణయం భారత్లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి టెక్ సెంటర్లపైనా ప్రభావం చూపింది.షాకిచ్చిన మెయిల్జూలై 29 తెల్లవారుజామున కొంతమంది ఉద్యోగులకు.. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాతే తమ ఉద్యోగం పోయిందని వారికి తెలిసింది. కొన్ని రోజుల్లోనే ఆఫీస్ సిస్టమ్లకు యాక్సెస్ నిలిపివేయడంతో పాటు, ల్యాప్టాప్లు, ఐడీ కార్డులను కూడా వెనక్కి తీసుకున్నారు.భారత్లో వీసాకు 3,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ.. ఎంతమందిని తొలగించారనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఒక టెక్నాలజీ టీమ్లో 28 మందిలో 10 మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో సీనియర్ డైరెక్టర్లు, ఇంజినీరింగ్ మేనేజర్లు కూడా ఉండటం గమనార్హం.చాలామంది అనుకునేలా కంపెనీ నష్టాల్లో లేదని వీసా స్పష్టం చేసింది. వ్యాపారం సజావుగానే సాగుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. సంస్థను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దృష్టి మొత్తం ఏఐ మీదనే ఉంది.వీసా మాత్రమే కాదు!ఏఐ కారణంగా ఉద్యోగాల కోత విధిస్తున్న కంపెనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, సిస్కో, క్లౌడ్ఫ్లేర్, పేపాల్, అట్లాసియన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పేమెంట్స్ రంగంలో వీసాకు ప్రధాన ప్రత్యర్థి అయిన మాస్టర్కార్డ్ కూడా ఈ ఏడాది సుమారు 4 శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు తెలిపింది. అలాగే అమెజాన్ వేల సంఖ్యలో కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.ఇదీ చదవండి: జియో రీఛార్జ్.. బడ్జెట్ నుంచి యాన్యువల్ ప్లాన్స్ వరకు! -
జియో రీఛార్జ్: బడ్జెట్ నుంచి యాన్యువల్ ప్లాన్స్ వరకు!
2026 నాటికి రిలయన్స్ జియో ప్రీపెయిడ్ పోర్ట్ఫోలియోలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది అన్లిమిటెడ్ ప్లాన్ల బేస్ ఎంట్రీ పాయింట్ రెండుసార్లు పెరగడంతో పాటు.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓటీటీ యాప్స్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రీమియం, ఏఐ సబ్స్క్రిప్షన్లు వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఈ కథనంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.బడ్జెట్ ప్లాన్లుతక్కువ ఖర్చుతో ఇంటర్నెట్, కాలింగ్ కావాలనుకునే వారికి జియో రెండు ప్రధాన ప్లాన్లను అందిస్తోంది.➤ రూ.199 ప్లాన్ ద్వారా 18 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇది ప్రధానంగా డేటా వినియోగదారుల కోసం రూపొందించిన ప్లాన్.➤రూ.349 ప్లాన్ ప్రస్తుతం జియోలో అత్యంత చౌకైన అన్లిమిటెడ్ ప్లాన్. దీని ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అలాగే జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సేవలు లభిస్తాయి.ధరలు ఎందుకు పెరిగాయి?గత ఏడాది నుంచి జియో అన్లిమిటెడ్ ప్లాన్ల ధరలను రెండుసార్లు పెంచింది. ఒకప్పుడు రూ.249గా ఉన్న అన్లిమిటెడ్ ప్లాన్ ముందుగా రూ.299కి, ఇప్పుడు రూ.349కి చేరింది. దీంతో వినియోగదారులు కొంత ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నా, అదనంగా ఓటీటీ వంటి ప్రయోజనాలు కూడా అందిస్తున్నారు.మధ్యశ్రేణి ప్లాన్స్28 రోజుల కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి ఈ ప్లాన్స్. ఈ ప్లాన్లన్నింటిలో కూడా అపరిమిత కాలింగ్, ఇతర సాధారణ జియో ప్రయోజనాలు లభిస్తాయి.➜రూ.666 ప్లాన్: 70 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5 జీబీ డేటా.➜రూ.719 ప్లాన్: 70 రోజులు, రోజుకు 2 జీబీ డేటా.➜రూ.799 ప్లాన్: 84 రోజులు, రోజుకు 1.5 జీబీ డేటా.➜రూ.899 ప్లాన్: 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5 జీబీ డేటా.➜రూ.1199 ప్లాన్: 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా.నెట్ఫ్లిక్స్ కోసం ప్రత్యేక ప్లాన్లువినోదాన్ని ఇష్టపడే వినియోగదారుల కోసం జియో నెట్ఫ్లిక్స్తో కూడిన ప్రత్యేక ప్లాన్లను కూడా అందిస్తోంది.➯రూ.1299 ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటాతో పాటు నెట్ఫ్లిక్స్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.➯రూ.1799 ప్లాన్లో రోజుకు 3 జీబీ డేటాతో పాటు నెట్ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తున్నారు.యాన్యువల్ రీఛార్జ్ ప్లాన్స్తరచూ రీఛార్జ్ చేయడం ఇష్టం లేని వారికి జియో ఏడాది వ్యాలిడిటీతో రెండు ప్రధాన ప్లాన్లు అందిస్తోంది.➢రూ.3599 ప్లాన్ ద్వారా 365 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సెస్ లభిస్తాయి.➢రూ.3999 ప్లాన్ కూడా 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఎక్కువ డేటా వినియోగించే వారికి ఇది ఫ్లాగ్షిప్ వార్షిక ప్లాన్గా అందుబాటులో ఉంది.జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు పెరిగినా.. ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ప్రీమియం, ఏఐ సేవలు వంటి అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా.. వినోదం, డిజిటల్ సేవలను కూడా ఒకే రీఛార్జ్లో పొందాలనుకునే వినియోగదారులకు ఈ కొత్త ప్లాన్లు మంచి ఎంపిక అనే చెప్పాలి. -
అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ
కొన్ని సక్సెస్లు అనూహ్యంగా రావచ్చు. కానీవిజయాలన్నీ ఎవ్వరూ ఊహించని కష్టాల నుండే సాధ్యమవుతాయి. ఆ విజయానికి కన్నీళ్లు, సవాళ్లే శక్తివంతమైన సోపానాలుగా మారతాయి. ప్రతీ ఎదురు దెబ్బ ఒక్కో మెట్టుగా అసాధారణ విజయానికి పునాది అవుతుంది. అలా కష్టాల నుంచి కోట్లతో వ్యాపార సామ్రాజ్యాన్ని ష్టించిన అభిషేక్ కుమార్ , మోహిత్ కుమార్ సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే ఈ మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి.'వేల్స్టేస్' (ValeStays) వ్యవస్థాపకుల స్ఫూర్తిదాయక కథ ఇదీ. హిందూస్థాన్టైమ్స్.కామ్ కథనం ప్రకారం ఎన్నో కఠిన సవాళ్లనెదుర్కొని, అపజయాలను అధిగమించిన ఇద్దరు యువకులు 'వేల్స్టేస్' అనే మల్టీ-కోర్ల సర్వీస్డ్ అపార్ట్మెంట్ వ్యాపారాన్ని విస్తరించారు అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్ ద్వయం. వీరిద్దరుకో పౌండర్లుగా అవతరించకముందు డబుల్ షిఫ్టులు చేశారు. ఎన్నో ఆర్థిక నష్టాలను తట్టుకున్నారు.అభిషేక్ కుమార్: బిహార్లోని భాగల్పూర్ జిల్లా నౌగాచియాకు చెందిన అభిషేక్, ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉదయం 7:45 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్పొరేట్ ఉద్యోగం. రాత్రి వేళల్లో అర్ధరాత్రి వరకు ఓలా క్యాబ్/బైక్ డ్రైవర్గా పనిచేసేవారు. ఇలా రోజంతా కష్టపడినా వచ్చేది కేవలం రూ. 400 నుంచి రూ. 1,100 మాత్రమే. కొన్నిసార్లు పెట్రోల్ ఖర్చులు పోను ఏమీ మిగిలేది కాదట.మోహిత్ కుమార్: ఉత్తరప్రదేశ్, మైన్పురికి చెందిన మోహిత్, 10వ తరగతి తర్వాత ఢిల్లీ వచ్చారు. 16-17 ఏళ్ల వయస్సులోనే (11వ తరగతి చదువుతున్నప్పటి నుంచి) నెలకు రూ. 1,000 ఫీజుతో ఇంటింటికీ హోం ట్యూషన్స్ చెప్పేవారు.వెళ్లి ట్యూషన్లు చెప్పేవారు. ఐదేళ్ల పాటు దాదాపు 60 మంది విద్యార్థులకు పాఠాలు చెప్పి, ఒక్కో రూపాయి కూడబెట్టి రూ. 20 లక్షల పొదుపు చేశారు. ఆ డబ్బుతో సొంతంగా రెడీమేడ్ దుస్తుల దుకాణం ప్రారంభించాడు. కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా ఆ వ్యాపారం ఘోరంగా దెబ్బతింది. సంపాదనంతా తుడిచిపెట్టుకుపోయింది.వేల్స్టేస్ పుట్టుక ఎలా అంటే..2022 నాటికి అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్ ఇద్దరూ షేర్డ్ ఇంట్లో అద్దెకు ఉండేవారు.ఇద్దరూ ఆర్థికంగా దెబ్బతిని కష్టాల్లో ఉన్నారు. దీంతో తమ వద్ద ఉన్న కొద్దిపాటి వనరులతో ఏదైనా కొత్తది ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.తొలి అడుగుఎవరు తీసుకోని ఒక పాత ప్లాట్ను అద్దెకు తీసుకున్నారు. OLX లో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ కొనుగోలు చేశారు.వాటిని స్వయంగా బాగుచేసి, శుభ్రం చేసి, సర్వీస్డ్ అపార్ట్మెంట్గా మార్చారు. కొన్ని రోజుల్లోనే మొదటి బుకింగ్ వచ్చింది. అలాఒక ఫ్లాట్తో ప్రారంభమైన వీరి ప్రయాణం, ఏడాదికి 18 ఫ్లాట్లకు, నాలుగేళ్లలో ఢిల్లీ-NCR వ్యాప్తంగా 72 సర్వీస్డ్ అపార్ట్మెంట్లకు విస్తరించింది. ప్రస్తుతం కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారంగా మారింది. ఈ వ్యాపార బాధ్యతల నిర్వహణలో అభిషేక్ కుమార్, మోహిత్ కుమార్ బాద్యతలను పంచుకుని మరీ విజయవంతంగా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్గా ఘనతగెస్ట్ మేనేజ్మెంట్, సేల్స్, వ్యాపార విస్తరణ బాధ్యతలను అభిషేక్ చూసుకుంటారు. ఇక హౌస్ కీపింగ్, వెండార్స్ మేనేజ్మెంట్, రోజువారీ క్షేత్రస్థాయి (Ground-level) పనుల పర్యవేక్షణ మోహిత్ పని.సౌకర్యవంతమైన జీవితానికి అలవాటుపడితే సరికొత్తగా ఏదీ సాధించలేమని, ఒడిదొడుకులు ఎదురైనా ప్రయత్నాన్ని ఆపకూడదని అభిషేక్ తన లాంటివారికి సూచిస్తోంటే, వ్యాపారంలో నమ్మకమైన భాగస్వామి దొరకడం అన్నింటికంటే గొప్ప ఆస్తి అని మోహిత్ సంతోషం వ్యక్తం చేయడం విశేషం. ఇదీ చదవండి: పాపులర్ క్రైమ్ సిరీస్ ప్రేరణతో భార్య హత్య, రూ. 13 లక్షలతో పరార్ -
ఎయిరిండియా కొత్త సీఈవో.. పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు జస్ట్ మిస్!
ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఇథియోపియన్ ఎయిర్లైన్స్ మాజీ గ్రూప్ సీఈవో టెవోల్డే గెబ్రెమరియం నియమితులయ్యారు. ఎయిర్ ఇండియా బోర్డు ఆగస్టు 5న ఆయన నియామకాన్ని ప్రకటించింది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న క్యాంప్బెల్ విల్సన్ సెప్టెంబర్ 30లోపు పదవి నుంచి తప్పుకోనున్నారు.అయితే గెబ్రెమరియం నియామకంలో ఆసక్తికరమైన అంశం మరొకటి ఉంది. కొన్ని వారాల క్రితం ఆయన పేరు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) సీఈవో పదవికి ప్రముఖంగా వినిపించింది. జూలైలో వచ్చిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. పీఐఏ సీఈవోగా ఆయన ఎంపిక తుది దశలో ఉంది. అనంతరం అరబ్ న్యూస్ కూడా గెబ్రెమరియంను పీఐఏ ఎంపిక చేసిందని, భద్రతా అనుమతులు పూర్తయ్యే వరకు అధికారిక ప్రకటనను నిలిపివేసిందని సంబంధిత అధికారులను ఉటంకిస్తూ వెల్లడించింది.కానీ ఆ నియామకం కార్యరూపం దాల్చకముందే పరిస్థితి మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులను పరిశీలించిన అనంతరం ఎయిర్ ఇండియా బోర్డు గెబ్రెమరియంను ఎంపిక చేసింది. టాటా సన్స్ చైర్మన్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. విల్సన్ నేతృత్వంలో ఎయిర్లైన్ స్థిరీకరణ, విమానాల ఆధునికీకరణ, విలీన ప్రక్రియ వంటి ప్రారంభ దశ పనులను పూర్తి చేసిందని, ఇప్పుడు అమలు, సామర్థ్యం, లాభదాయక వృద్ధిపై మరింత దృష్టి పెట్టాల్సిన దశ వచ్చిందని తెలిపారు.ఇథియోపియన్ ఎయిర్లైన్స్ను మార్చిన అనుభవంగెబ్రెమరియంకు విమానయాన రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన ఇథియోపియన్ ఎయిర్లైన్స్ గ్రూప్లో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. 2011లో గ్రూప్ సీఈవోగా బాధ్యతలు చేపట్టి 2022లో పదవి నుంచి వైదొలిగారు. ఆయన నాయకత్వంలో సంస్థ ఆదాయం సుమారు 1 బిలియన్ డాలర్ల నుంచి 4.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. విమానాల సంఖ్య 33 నుంచి 130కి, ప్రయాణికుల సంఖ్య కొవిడ్కు ముందు 3 మిలియన్ల నుంచి 12 మిలియన్లకు పెరిగింది.ఆఫ్రికా విమానయాన రంగంలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ను అతిపెద్ద, అత్యంత విజయవంతమైన క్యారియర్లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో గెబ్రెమరియం కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ రూట్ నెట్వర్క్, కార్గో కార్యకలాపాలు, శిక్షణ, నిర్వహణ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు కొవిడ్ సమయంలోనూ సంస్థను నిలబెట్టడంలో ఆయన అనుభవం ఉపయోగపడింది. -
కేవలం క్షమాపణలు సరిపోవు!
భారత డిజిటల్ పరిధిలో సామాజిక మాధ్యమ దిగ్గజాల బాధ్యతారాహిత్య వైఖరిపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్) వేదికలపై కంటెంట్ నియంత్రణ, మార్గదర్శకాల అమలుపై ఐటీ మంత్రిత్వ శాఖ నిఘాను కఠినతరం చేసింది. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కార్యదర్శి ఎస్.కృష్ణన్లు మెటా ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో డిజిటల్ వేదికల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇటీవల విద్యార్థులతో సంభాషిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచుకున్న వీడియో పోస్ట్ను మెటా ఆల్గోరిథమ్ సాంకేతిక లోపం నెపంతో తొలగించడం పెను దుమారం రేపింది. ఈ ఘటనపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా పరిగణించి హెచ్చరించడంతో మెటా గ్లోబల్ అఫైర్స్ హెడ్ జోయెల్ కాప్లాన్, సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తరఫున ప్రతినిధులు కేంద్రానికి అధికారికంగా క్షమాపణలు తెలియజేశారు.కేవలం క్షమాపణలతో వ్యవహారం ముగియదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెటాను ఇకపై తటస్థ మధ్యవర్తిగా (Neutral Intermediary) భావించలేమని, ఐటీ చట్టం సెక్షన్ 79 కింద లభించే చట్టపరమైన రక్షణ మినహాయింపులు అన్నీ వేళలా వర్తించవని కేంద్రం హెచ్చరించింది.బాలల లైంగిక వేధింపుల సమాచారం (సీసామ్), డీప్ఫేక్ వీడియోలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాల నియంత్రణలో మెటా విఫలమైందని కేంద్రం ఆక్షేపించింది.సామాజిక రుగ్మతలు పెంచే కంటెంట్ను ప్రచారం చేయడానికి పెద్ద ఎత్తున డబ్బు చెల్లించి బూస్ట్ చేస్తున్నారనే ప్రశ్నకు, తమ వ్యవస్థలు దీనిని పూర్తిగా అరికట్టడంలో విఫలమవుతున్నాయని మెటా ప్రతినిధులు అంగీకరించినట్లు సమాచారం.సాంకేతిక సమీక్షకు ఆదేశంభారత్లో వ్యాపారం చేసే విదేశీ కంపెనీలు అక్కడి చట్టాల ప్రకారం కాకుండా, ఇక్కడి భూభాగ చట్టాలకు కట్టుబడి తీరాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాబోయే 3-4 రోజుల్లో మెటా సాంకేతిక బృందాలతో మరో విడత సమీక్ష జరగనుంది. ఇందులో మెటా ఆల్గోరిథమ్ల పనితీరు, కంటెంట్ తొలగింపు నిర్ణయాల వెనుక ఉన్న సాంకేతికతను కేంద్ర నిపుణులు ప్రత్యక్షంగా తనిఖీ చేయనున్నారు. బాధ్యతాయుతమైన డిజిటల్ పాలనను విస్మరిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం గట్టి సంకేతాలిచ్చింది.ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా? -
కట్ అవుతున్న ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాలు!
దేశీయ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నప్పటికీ ఐటీ కంపెనీలు కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను (ఫ్రెషర్లు) చేర్చుకునే విషయంలో తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ ‘ఫౌండ్ఇట్’ వెల్లడించిన నివేదిక ప్రకారం ఓవైపు టెక్ రిక్రూట్మెంట్ డిమాండ్ ఏటా 10 శాతం మేర వృద్ధి నమోదు చేయగా, మరోవైపు సంప్రదాయ ఐటీ పరిశ్రమలో ఫ్రెషర్ల నియామకాల వాటా ఇదివరకు ఉన్న 32 శాతం నుంచి 24 శాతానికి క్షీణించింది. ఒక రకంగా ఎంట్రీ-లెవెల్ ఐటీ ఉద్యోగాల్లో దాదాపు పావు వంతు (25%) కోత పడింది.ఈ క్షీణతకు ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఆటోమేషన్, కృత్రిమ మేధ విస్తరణ. ఇదివరకు ఫ్రెషర్లు చేసే ప్రాథమిక కోడింగ్, టెస్టింగ్ పనులను ఇప్పుడు ఏఐ సాధనాలు సులభంగా పూర్తి చేస్తున్నాయి. ప్రైమరీ ఏఐ మోడళ్లను తయారు చేయడం కంటే ఆ సిస్టమ్స్ను నడిపించే, ఆప్టిమైజ్ చేసే నైపుణ్యాల వైపే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. రెండవది బ్యాంకింగ్, హెల్త్కేర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు వంటి నాన్-ఐటీ రంగాలు టెక్ గ్రాడ్యుయేట్లను భారీగా ఆకర్షిస్తున్నాయి. దీనివల్ల సాధారణ ఐటీ సేవల్లో ఎంట్రీ-లెవెల్ ఆఫర్లు తగ్గాయి.ప్రస్తుత మార్కెట్లో సంస్థలు 7-10 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి (ఈ విభాగంలో వార్షికంగా 11 శాతం వృద్ధి నమోదైంది). ఇలాంటి పరిస్థితుల్లో టెక్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులు కేవలం సంప్రదాయ కోడింగ్కే పరిమితం కాకుండా ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ ప్లాట్ఫామ్ల్లో ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యవసరంగా మారింది.ఇదీ చదవండి: మీ EPF డబ్బు సురక్షితంగా ఉండాలా? -
కేకేఆర్ చేతికి మెడికవర్ ఇండియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత హెల్త్కేర్ విభాగంలో అవకాశాలను మరింతగా అందిపుచ్చుకునే దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ తాజాగా భారీ డీల్కి తెరతీసింది. అంతర్జాతీయ వైద్యసేవల దిగ్గజం మెడికవర్ ఏబీకి చెందిన భారత విభాగం మెడికవర్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ ఎంతనేది కేకేఆర్ నిర్దిష్టంగా వెల్లడించకపోయినప్పటికీ.. సంస్థ విలువను 1.2 బిలియన్ యూరోలుగా (దాదాపు రూ. 13,200 కోట్లు) లెక్కగట్టినట్లు న్యాయ సలహాలందిస్తున్న ట్రైలీగల్ వివరించింది. కేకేఆర్కి చెందిన ఫండ్స్కి 100 శాతం వాటాలను విక్రయించేందుకు తమతో పాటు మైనారిటీ వాటాదారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మెడికవర్ తెలిపింది. దీనితో స్థూలంగా 740 మిలియన్ యూరోలు లభిస్తాయని, ఆ మొత్తంతో పోలాండ్ తదితర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు పేర్కొంది. ఈ డీల్కి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో జాన్ స్టబింగ్టన్ చెప్పారు. మరోవైపు ప్రస్తుత మేనేజ్మెంటే మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని మెడికవర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ వెల్లడించారు. సంస్థలో 14 వేల మంది ఉద్యోగులు, 1,900 మంది పైగా డాక్టర్లు ఉన్నారని, వారు కూడా యథాప్రకారంగానే కొనసాగుతారని పేర్కొన్నారు. సంస్థను మరింతగా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఏడాది ఆఖరు నాటికి ఇది పూర్తి కావొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తు తం ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో మొత్తం నాలుగు రాష్ట్రాల్లో సుమారు 11–12 లక్షల మంది పేషంట్లకు చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు. అటు, ‘మరింత నాణ్యమైన వైద్య సేవలందించడంలో మెడికవర్ ఇండియా డాక్టర్లు, ఉద్యోగులకు మద్దతుగా నిలుస్తూ, దేశవ్యాప్తంగా అధునాతన హెల్త్కేర్ సరీ్వసులను విస్తరించేందుకు ఈ పెట్టుబడులు దోహదపడతాయి‘ అని కేకేఆర్ పార్ట్నర్ అక్షయ్ తనా తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో 24 ఆస్పత్రుల నెట్వర్క్.. మ్యాక్స్క్యూర్ హాస్పిటల్ చెయిన్ ఆపరేటర్, హైదరాబాద్కి చెందిన సహృదయ హెల్త్కేర్లో నియంత్రణాధికారాలుండే వాటాలను కొనుగోలు చేయడం ద్వారా స్వీడన్కి చెందిన మెడికవర్ 2017లో భారత హెల్త్కేర్ మార్కెట్లోకి ప్రవేశించింది. మెడికవర్ ఇండియాలో మెడికవర్ హోల్డింగ్స్ బీవీకి 67 శాతం ఉండగా, మైనారిటీ షేర్హోల్డర్లయిన ప్రస్తుత సీఎండీ జి. అనిల్ కృష్ణ తదితరుల వద్ద సుమారు 33 శాతం వాటాలు ఉన్నాయి. సంస్థలో పి. హరికృష్ణ, ఎ. శరత్ రెడ్డి ఈడీలుగా, ఏఆర్ కృష్ణప్రసాద్ డైరెక్టరుగా ఉన్నారు. సుమారు 4,800 పడకలతో 24 ఆస్పత్రుల నెట్వర్క్ ఉంది. 80 పైచిలుకు స్పెషాలిటీల్లో సేవలు అందిస్తోంది. భారీ విస్తరణ బాటలో కేకేఆర్ కేకేఆర్ 2004 నుంచి అంతర్జాతీయంగా హెల్త్కేర్ విభాగంలో సుమారు 20 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. గత కొన్నాళ్లుగా భారత్లోనూ విస్తరించింది. మ్యాక్స్ హెల్త్కేర్లో భారీ లాభాలకు నిష్క్రమించిన దాదాపు నాలుగేళ్ల తర్వాత 2025లో కేరళకు చెందిన బేబీ మెమోరియల్ హాస్పిటల్ (బీఎంహెచ్)లో దాదాపు రూ. 2,500 కోట్లకు సుమారు 70 శాతం వాటాలను కొనుగోలు చేయడం ద్వారా మళ్లీ హెల్త్కేర్ విభాగంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దక్షిణాది మరింతగా కార్యకలాపాలు విస్తరించింది. మైత్రా హాస్పిటల్, చళికట్టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను కొనుగోలు చేసింది. అలాగే హెల్త్కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్లో నియంత్రణాధికారాలున్న వాటాలను దక్కించుకుంది. ఈ విభాగంలో ఫైనాన్సింగ్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తోంది. -
బంగారంపై 85% వరకు లోన్.. ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ఆఫర్!
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే.. చాలామంది తమ వద్ద ఉన్న బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వారికి ముత్తూట్ ఫైనాన్స్ (Muthoot Finance) ఒక మంచి గోల్డ్ లోన్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో మీరు.. మీ బంగారం విలువలో 85 శాతం వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది.వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వ్యాల్యూ, స్పీడ్, సేవింగ్స్ అనే మూడు ప్రధాన ప్రయోజనాలను అందిస్తున్నట్లు ముత్తూట్ ఫైనాన్స్ వెల్లడించింది. తక్కువ సమయంలోనే లోన్ అందించడం, సులభమైన ప్రక్రియతో సేవలు అందించడం తమ ప్రత్యేకత అని సంస్థ చెబుతోంది.గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు మొబైల్ నెంబర్, పిన్కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. సంస్థ నిబంధనలు, షరతులకు అంగీకరించిన తర్వాత దరఖాస్తు పూర్తి చేయవచ్చు.ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకతముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ ప్రత్యేకత ఏమిటంటే.. లోన్ అందించే ప్రక్రియ చాలా వేగంగా ఉండటం. బంగారం విలువను అంచనా వేసిన వెంటనే లోన్ అందించే విధానాన్ని సంస్థ అనుసరిస్తోంది. అంతే కాకుండా.. వడ్డీ రేట్లు, కస్టమర్కు అనుకూలమైన సేవలతో మంచి గుర్తింపు పొందింది. దేశంలోనే అత్యధిక గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కలిగిన సంస్థగా ముత్తూట్ ఫైనాన్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.ముత్తూట్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా 7,500కు పైగా శాఖలతో సేవలు అందిస్తోంది. రోజూ 2.5 లక్షలకు పైగా వినియోగదారులు తమ సేవలను వినియోగిస్తున్నారని, కేవలం ఒక్కసారి శాఖను సందర్శిస్తే వెంటనే గోల్డ్ లోన్ పొందే అవకాశం కల్పిస్తున్నామని కంపెనీ తెలిపింది.Gold Loan@Home గురించివినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ Gold Loan@Home అనే ప్రత్యేక సేవను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవ ద్వారా ఇంటి నుంచే గోల్డ్ లోన్ పొందే అవకాశం ఉంది. దీనికోసం ముందుగా లోన్ కోసం రివెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత సంస్థ ప్రతినిధులు ఇంటికే.. వచ్చి బంగారం విలువను అంచనా వేస్తారు. ఆ తర్వాత డబ్బు నేరుగా వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీంతో శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంటి నుంచే సౌకర్యవంతంగా లోన్ పొందవచ్చు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.23,731 కోట్ల పథకానికి ఆమోదం
న్యూఢిల్లీ: దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రహదారి మౌలిక వసతులను మెరుగుపరిచేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రూ.23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ (GOBARdhan)’ జాతీయ సమగ్ర పథకానికి, అస్సాంలో గువాహటి–తేజ్పూర్ నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ అభివృద్ధికి ₹8,970.20 కోట్ల పెట్టుబడితో కూడిన ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు ప్రాజెక్టుల విలువ కలిపి సుమారు రూ.32,701 కోట్లు.సీబీజీ ఉత్పత్తికి భారీ ఊతం‘గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్ ధన్’ (GOBARdhan) పథకాన్ని జాతీయ స్థాయిలో సమగ్రంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.23,731 కోట్ల ఆర్థిక కేటాయింపు చేయనుంది. సేంద్రియ వ్యర్థాలు, పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు, వంటగది వ్యర్థాలు వంటి బయో వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్, తదుపరి దశలో కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.దేశీయ సీబీజీ ఉత్పత్తిని ప్రస్తుత స్థాయితో పోలిస్తే దాదాపు పది రెట్లు పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతుల ఆదాయం, ఉపాధి అవకాశాలకు ఊతం లభించే అవకాశం ఉంది.గోబర్ధన్ పథకం 2018లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా ప్రారంభమైంది. బయో వ్యర్థాలను బయోగ్యాస్, బయో-స్లర్రీగా మార్చడం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలను విలువైన వనరుగా మార్చడం దీని ప్రాథమిక లక్ష్యం. 2026 జనవరి 27 నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదించిన వివరాల ప్రకారం దేశంలో పలు సీబీజీ ప్రాజెక్టులు ఇప్పటికే పనిచేస్తున్నాయి.దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (#CBG) అభివృద్ధికి ₹23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ (GOBARdhan)’ జాతీయ సమగ్ర పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.➡️ ఈ పథకం ద్వారా దేశీయ #CBG ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడంతో పాటు, భారత ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యం.… pic.twitter.com/zwf2Q3zzB5— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 6, 2026గువాహతి–తేజ్పూర్ మధ్య 135.87 కి.మీ నాలుగు లేన్ల కారిడార్అస్సాంలో జాతీయ రహదారి–15పై 135.871 కి.మీ పొడవైన గువాహతి–తేజ్పూర్ కారిడార్ను నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్ (BOT) టోల్ విధానంలో, నేషనల్ హైవేస్ (ఒరిజినల్) కింద రూ.8,970.20 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో చేపట్టనున్నారు.ఈ ప్రాజెక్టులో 58.7 కి.మీ పొడవున ఐదు ప్రధాన బైపాస్లు, 15 ప్రధాన వంతెనలు, 30 చిన్న వంతెనలు, 19 ఫ్లైఓవర్లు, 46 అండర్పాస్లు, సుమారు 210 కి.మీ సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. తేజ్పూర్ బైపాస్లో 4.9 కి.మీ పొడవైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సదుపాయం భారత వైమానిక దళంతో సమన్వయంతో ఖరారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.అస్సాంలోని జాతీయ రహదారి-15 పై 135.871 కి.మీ పొడవైన, నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గువాహటి–తేజ్పూర్ కారిడార్ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.➡️ ఈ ప్రాజెక్టును బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్ఫర్ (BOT) టోల్ విధానంలో, NH(O) కింద ₹8,970.20 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో… pic.twitter.com/pkKzkNBXFA— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 6, 2026 -
వాజ్పేయి సాయం.. వేదాంత విజయం!
ప్రతి విజయవంతమైన వ్యక్తి జీవితంలో.. కొన్ని సంఘటనలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ఒక మధుర జ్ఞాపకాన్ని వేదాంత సంస్థ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. తన వ్యాపార జీవితంలో అత్యంత కీలకమైన విజయానికి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సహాయం కారణమని ఆయన తెలిపారు.భారతీయ కంపెనీలకు దేశీయ స్టాక్ మార్కెట్లో తగిన గుర్తింపు, విలువ లభించడం లేదని అనిల్ అగర్వాల్ భావించారు. దీంతో.. వేదాంతను లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే.. విదేశీ స్టాక్ మార్కెట్లో భారతదేశ కంపెనీని లిస్ట్ చేయాలంటే ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవడం తప్పనిసరి. ఆ అనుమతి పొందడం చాలా కష్టమైన పని.10 December 2003!मुझे आज भी London की वो सुबह याद है, जब Vedanta के साथ-साथ, हिंदुस्तान भी इतिहास रचने के लिए तैयार था।उस समय मुझे अक्सर लगता था कि भारतीय businesses को सही value और growth नहीं मिल रही।मैंने तय कर लिया कि Vedanta को London Stock Exchange पर list करेंगे।पर… pic.twitter.com/DyX1GE6eCb— Anil Agarwal (@AnilAgarwal_Ved) August 5, 2026ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి అనిల్ అగర్వాల్ ఢిల్లీకి వెళ్లి పలువురు అధికారులను కలిశారు. చివరకు అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని కలిసి తన ఆలోచనను వివరించే అవకాశం దక్కింది. ఆయన చెప్పిన విషయాన్ని వాజ్పేయి ఎంతో శ్రద్ధగా విన్నారు. తర్వాత.. అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ను చూసి,''ఈ అబ్బాయి మంచివాడిలా కనిపిస్తున్నాడు. ఇతనికి సహాయం చేద్దాం. దీని వల్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి వస్తుంది'' అని చెప్పారు.ప్రధానమంత్రి మద్దతుతో ప్రభుత్వం వెంటనే అవసరమైన ఎన్ఓసీను జారీ చేసింది. ఆ అనుమతి పత్రంతో.. అనిల్ అగర్వాల్ తిరిగి లండన్ వెళ్లి తన కలను నిజం చేసుకున్నారు. వేదాంత సంస్థ లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ పొందిన తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఎఫ్టీఎస్ఈ 100 ఇండెక్స్లో కూడా స్థానం సంపాదించింది. ఈ విజయాన్ని అనిల్ అగర్వాల్ తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: 100మంది రిజెక్ట్ చేసినా.. రూ.38 వేల కోట్ల కంపెనీ నిర్మించాడు! -
100మంది రిజెక్ట్ చేసినా.. రూ.38 వేల కోట్ల కంపెనీ నిర్మించాడు!
సాధారణంగా.. జీవితంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేవాళ్లను చాలామంది నమ్మరు. ఒకసారి ఆ ఆలోచనలతో సక్సెస్ అయితే.. ప్రపంచం మొత్తం తమవైపే చూస్తుంది. దీనికి నిలువెత్తు నిదర్శనమే విక్టర్ రిపార్బెల్లీ (Victor Riparbelli). ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన సాధించిన సక్సెస్ ఏమిటి?, అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఏఐ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి చాలా సంవత్సరాల ముందే.. ఏఐతో వీడియోలు తయారు చేయవచ్చని విక్టర్ రిపార్బెల్లీ నమ్మాడు. కానీ ఆ సమయంలో.. తన మాటలను, ఆలోచనలను చాలామంది నమ్మలేదు. తాను నిర్మించాలనుకున్న స్టార్టప్ కోసం పెట్టుబడులు సేకరించే క్రమంలో, దాదాపు 100 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కరణకు గురయ్యాడు. అయినప్పటికీ.. ఏ మాత్రం నిరాశ చెందలేదు. తన ఆలోచన తప్పకుండా ఒక రోజు ఫలిస్తుందని గట్టిగా నమ్మి.. ముందుకు వెళ్ళాడు.తన ఆలోచనకు కార్యరూపం దాల్చడానికి.. రిపార్బెల్లీ 2017లో లండన్లో 'సింథేసియా' పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే.. మనం రాసిన టెక్స్ట్ను ఆధారంగా చేసుకొని ఏఐ సహాయంతో నిజమైన మనుషుల్లా కనిపించే వీడియోలను రూపొందించడం.ప్రారంభంలో.. ఈ సాంకేతికతపై ఎవరూ పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ ఆ తరువాత కంపెనీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించింది. వినోద రంగం కంటే వ్యాపార సంస్థలకు ఈ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగపడుతుందని అర్థం చేసుకుంది. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, కొత్త ఉద్యోగులకు సంస్థ గురించి వివరించడం, అంతర్గత సమాచారాన్ని పంచుకోవడం వంటి పనుల కోసం ఏఐ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గ్రహించింది.ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు కెమెరాలు, నటీనటులు లేదా చిత్రీకరణ బృందం అవసరం లేకుండానే ఏఐ అవతార్లతో నాణ్యమైన వీడియోలను తయారు చేస్తున్నాయి. దీనివల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతున్నాయి. ఈ వినూత్న ఆలోచన కారణంగా సింథేసియా కంపెనీ విలువ 4 బిలియన్ డాలర్లకు (రూ.38 వేలకోట్లు) చేరుకుంది. ప్రస్తుతం ఇది యూరప్లోని అత్యంత విజయవంతమైన ఏఐ స్టార్టప్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.గొప్ప ఆలోచనలు మొదట్లో చాలా మందికి అర్థం కావు. కాబట్టి అందరూ.. మీ ఆలోచనను వెంటనే నమ్మాలని ఆశించకూడదు. విజయాన్ని సాధించాలంటే విమర్శలు, తిరస్కరణలు, అపజయాలు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం అవసరం. మనపై మనకు నమ్మకం ఉంటే, సరైన సమయంలో కష్టానికి తప్పకుండా ఫలితం లభిస్తుందని విక్టర్ రిపార్బెల్లీ చెబుతారు.ఇదీ చదవండి: అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందా?.. కియోసాకి చెప్పేది నిజమేనా? -
వంట గ్యాస్పై సుంకం? కేంద్రం కొత్త ప్లాన్!
అంతర్జాతీయ సంక్షోభాలు, యుద్ధాలు, సరఫరా మార్గాల్లో అంతరాయాల సమయంలో దేశంలో ఇంధన కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రధానంగా ముడి చమురు నిల్వలపై దృష్టి పెట్టిన భారత్.. తొలిసారిగా ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జీ (LNG) కోసం కూడా వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం వినియోగదారులపై ప్రత్యేక లెవీ విధించే ప్రతిపాదనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.ఎల్పీజీపై కిలోకు రూ.1.29 లెవీ?ప్రతిపాదన ప్రకారం వంట గ్యాస్ వినియోగంపై కిలోకు రూ.1.29 చొప్పున లెవీ విధించే అవకాశం ఉంది. ప్రస్తుత వినియోగ స్థాయిల ఆధారంగా దీనివల్ల ఏడాదికి సుమారు 460 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,000 కోట్లకు పైగా) ఆదాయం సమకూరవచ్చని అంచనా. ఈ లెవీ అమలైతే సాధారణ గృహ ఎల్పీజీ సిలిండర్పై సుమారు రూ.18 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.సహజ వాయువుపైనా అదనపు భారంసహజ వాయువు వినియోగంపై కూడా ప్రత్యేక సుంకం విధించే ప్రతిపాదన ఉంది. ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు రూ.1.43 చొప్పున లెవీ విధిస్తే ప్రస్తుత వినియోగం ఆధారంగా ఏడాదికి దాదాపు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,000–10,000 కోట్లు) సమీకరించవచ్చని అంచనా. ఎల్పీజీ, సహజ వాయువుపై ప్రతిపాదిత లెవీల ద్వారా కలిపి ఏడాదికి సుమారు 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమకూరే అవకాశం ఉంది.గ్యాస్ బిల్లులు 2 శాతం పెరిగే అవకాశంఈ అదనపు లెవీల ప్రభావంతో గృహాలు, ఇతర వినియోగదారుల గ్యాస్ బిల్లులు సుమారు 2 శాతం వరకు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఇంధన ధరలపై వినియోగదారుల్లో ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన రాజకీయంగా సున్నితమైన అంశంగా మారే అవకాశం ఉంది. అయితే సుంకాన్ని ఎలా వసూలు చేయాలనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.రూ.4 లక్షల కోట్లతో ప్రణాళికభారత్ రాబోయే దశాబ్దంలో బహుళ ఇంధన వ్యూహాత్మక నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 42 బిలియన్ డాలర్లు, అంటే ప్రస్తుత మారక విలువల ప్రకారం దాదాపు రూ.4 లక్షల కోట్లుగా అంచనా. ఇందులో సగానికి పైగా నిధులను నిల్వ మౌలిక సదుపాయాల నిర్మాణానికి, మిగిలిన మొత్తాన్ని నిల్వ చేయాల్సిన ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వినియోగించే అవకాశం ఉంది. -
రెస్టారెంట్లలో ఫ్రీగా మంచి నీరు ఇవ్వాల్సిందే..
హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ ఇచ్చే ముందు అక్కడి స్టాఫ్ ‘మినరల్ వాటరా, రెగ్యులర్ వాటరా?’ అని అడగడం చూస్తూంటాం. సాధారణంగా కస్టమర్లు సంకోచంతోనో, సమాచారం లేకనో ఖరీదైన బాటిల్ వాటర్ను ఎంచుకుంటూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ వ్యాపార ధోరణిపై మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్డీఏ) చర్యలు చేపట్టింది.ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం రెస్టారెంట్లలో కస్టమర్లకు ఉచితంగా సురక్షితమైన తాగునీటిని అందించడం ప్రాథమిక హక్కు అని రాష్ట్ర ఎఫ్డీఏ స్పష్టం చేసింది. ఇకపై ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా వినియోగదారుడిని బాటిల్ వాటర్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదు. అడగకుండానే ముందే ఉచిత తాగునీటిని అందించాలని ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే ఆదేశాలు జారీ చేశారు.నిబంధనలు.. సూచనలురెస్టారెంట్లలో ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉందనే సమాచారాన్ని వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలి.నూనె పదార్థాలను వార్తాపత్రికలపై పెట్టి ఇవ్వడం పూర్తిగా నిషేధించారు. ఫుడ్-గ్రేడ్ ప్యాకేజింగ్ మాత్రమే వాడాలి.సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమం శిక్షణను నిర్బంధం చేశారు. వంటనూనెలను పదే పదే వాడటంపై ఆంక్షలు విధించారు.హోటల్ లేదా రెస్టారెంట్ ప్రవేశ ద్వారం వద్ద ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ను స్పష్టంగా ప్రదర్శించాలి.ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలతో పాటు లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
తెలంగాణవాళ్లు టూర్ ఇందుకే వెళ్తారు..!!
దేశవ్యాప్తంగా పర్యాటక ఆసక్తులను తెలుసుకునేందుకు ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఆపరేటర్ స్కైస్కానర్స్ ఇండియా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. దీని ఆధారంగా బంజారాహిల్స్లోని హయత్ ప్లేస్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తెలంగాణ వాసుల ప్రయాణాభిరుచులను వెల్లడించే కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ నివేదికను విడుదల చేసింది.దీని ప్రకారం, భారత దేశం వెలుపల పర్యటనలతో సహా ఎక్కడికి ప్రయాణించాలి? అనే అంశాన్ని ఆహారం, పండుగలు, చారిత్రక నేపధ్యాలే ప్రధానంగా నిర్ణయిస్తున్నాయి. ప్రాంతాల వారీగా ఆహార అనుభవాలు తమ పర్యటనలను ఎంచుకోవడానికి ప్రముఖ కారణంగా 56% స్పష్టం చేశారు. ఇటీవలి సంవత్సరాలలో సాంస్కృతిక పర్యటనలపై కూడా తమకు ఆసక్తి పెరిగిందని 83% మంది చెప్పారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్కైస్కానర్స్ చెందిన నీల్ ఘోస్ మాట్లాడుతూ ఇప్పుడు వెళ్లే స్థలం కంటే అక్కడ అందుకునే అనుభవంపైనే ప్రయాణ నిర్ణయాలు ఆధారపడి ఉంటున్నాయని చెప్పారు. ‘నేను ఎక్కడికి ప్రయాణం చేయాలి?’ అనే ప్రశ్న తో పాటు ‘నేను ఏమి అనుభవించాలనుకుంటున్నాను?’అనేది ప్రధానంగా మారింది’’ అని ఆయన వివరించారు.హైదరాబాద్ సాంస్కృతిక గుర్తింపులో ఆహారం ఒక ప్రాథమిక భాగం’’ అని ఘోష్ చెప్పారు. అయితే, చార్మినార్ ఓల్డ్ సిటీ హెరిటేజ్ వాక్ల ద్వారా 39% మంది తెలంగాణ విశేషాలకు మరింత ప్రచారం అవసరమని అభిప్రాయపడ్డారు. దుర్గాపూజను 38% మంది దీపావళిని 37%, పొంగల్ కుంభమేళాలను 33% మంది చొప్పున తమ ప్రయాణాలకు కారణాలుగా చెప్పారు. బతుకమ్మను 32%, బోనాలు 31% మంది ఎంపిక చేసుకున్నారు. దేశీయ జాబితాలో కొచ్చి, ఉదయపూర్, అల్మోరా, కోల్కతా, ముంబై, లక్నో, పూరీ కొహిమాలు హైదరాబాద్ ప్రయాణికులు ఇష్టపడే సాంస్కృతిక నేపధ్యం కలిగిన ప్రదేశాల జాబితాలో ఉన్నాయి. అంతర్జాతీయ సాంస్కృతిక ప్రయాణాల్లో తమ ఎంపికగా 22% మంది జపాన్ను ఎన్నుకున్నారు. థాయ్లాండ్, వియత్నాంలకు 17%, ఫ్రాన్స్ 16%, యునైటెడ్ కింగ్డమ్ 15% ఇటలీ 10% మంది ఇష్టాల్ని గెలుచుకున్నాయి. -
దొంగదారిలో భారత్లోకి పాకిస్తాన్ ఖర్జూరాలు..
భారత్ విధించిన నిషేధాన్ని తప్పించుకుని మూడో దేశం ద్వారా భారత్లోకి పాకిస్తానీ ఖర్జూరాల దిగుమతికి చేసిన ప్రయత్నాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అడ్డుకుంది. గుజరాత్లోని కాండ్లా పోర్టులో పాకిస్తాన్ మూలానికి చెందిన 364 మెట్రిక్ టన్నుల డ్రై ఖర్జూరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3 కోట్లుగా అధికారులు వెల్లడించారు.నిర్దిష్ట సమాచారంతో రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు కాండ్లా పోర్టులో వచ్చిన 13 కంటైనర్లను తనిఖీ చేశారు. పత్రాల్లో ఈ సరుకును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి వచ్చినవిగా పేర్కొన్నప్పటికీ, దర్యాప్తులో అసలు మూల దేశం పాకిస్తాన్ అని తేలింది. పాకిస్తాన్ నుంచి సరుకును తొలుత దుబాయ్కు తరలించి, అక్కడ మరో కంటైనర్లలోకి మార్చిన అనంతరం భారత్కు ఎగుమతి చేసినట్లు విచారణలో గుర్తించారు.గుగ్గుల్ రెసిన్ కేసులోనూ ఇదే తరహా మోసంకాండ్లా ఘటనకు కొద్దిరోజుల ముందే తమిళనాడులోని ట్యుటికోరిన్ పోర్టులోనూ ఇలాంటి వ్యవహారాన్ని డీఆర్ఐ గుర్తించింది. సుమారు 14 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్ మూలానికి చెందిన గుగ్గుల్ రెసిన్ దాదాపు రూ.1.4 కోట్ల విలువైన సరుకును అధికారులు అడ్డుకున్నారు. ఈ సరుకును సోమాలియా మూలానికి చెందిన సహజ రెసిన్గా పత్రాల్లో చూపించి, దుబాయ్ మీదుగా భారత్కు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు గుర్తించిన అధికారులు ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.పాకిస్తాన్ వస్తువులపై ఎందుకు నిషేధం?పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మూలానికి చెందిన వస్తువుల దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రత్యక్షంగానే కాకుండా మూడో దేశాల ద్వారా పరోక్షంగా దిగుమతి చేసుకోవడం లేదా రవాణా చేయడం కూడా నిషేధం. దీంతో పాకిస్తాన్ నుంచి సరుకులను దుబాయ్ వంటి మూడో దేశాలకు తరలించి, అక్కడి నుంచి భారతదేశానికి పంపే మార్గాలను అక్రమంగా ఉపయోగించే ప్రయత్నాలపై డీఆర్ఐ నిఘా పెంచింది.ఇదీ చదవండి: ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్! -
20 ఏళ్లలో ఇండిగో సాధించింది ఇదే..
భారత పౌర విమానయాన రంగాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన ఇండిగో ఎయిర్లైన్స్ నిన్నటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2006 ఆగస్టు 4న ఢిల్లీ నుంచి గౌహతి మీదుగా ఇంఫాల్కి నడిపిన ఒకే ఒక్క విమాన సర్వీస్తో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ సంస్థ ప్రయాణం నేడు భారత గగనతలంలో కీలకంగా మారింది. విజయవంతంగా 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఇండిగో సాధించిన కొన్ని విజయాల గురించి కంపెనీ చెప్పిన కొన్ని అంశాలు కింద చూద్దాం.భారత దేశీయ విమానయాన రంగంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. నేడు దేశీయ విమానయాన సామర్థ్యంలో ఏకంగా 51% పైగా వాటాను కలిగి ఉంది. అంతర్జాతీయ సవాళ్లు, ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు, ఇతర కంపెనీల పోటీని తట్టుకుని లాభాల బాటలో పయనించడం ఇండిగో వ్యాపార వ్యూహానికి నిదర్శనం.ఒక్క విమానంతో మొదలైన ప్రయాణం, నేడు 430కి పైగా ఆధునిక విమానాల నెట్వర్క్గా రూపాంతరం చెందింది.రోజూ 2,200కి పైగా సర్వీసులను నిర్వహిస్తూ అత్యంత రద్దీగా ఉండే ఎయిర్లైన్గా గుర్తింపు పొందింది.భారతదేశంలోని 95 ప్రధాన నగరాలను, 40కి పైగా అంతర్జాతీయ గమ్యస్థానాలను అనుసంధానిస్తోంది.భారత్లోని దాదాపు 90% జనాభాకు 100 కిలోమీటర్ల పరిధిలోనే ఇండిగో విమానాశ్రయ సేవలు అందుబాటులో ఉండేలా తన నెట్వర్క్ను విస్తరించింది.‘లో కాస్ట్ క్యారియర్’ మోడల్ను అమలు చేస్తూ అందుబాటు ధరల్లో టికెట్లను అందిస్తున్నట్లు కంపెనీ చెప్పింది.అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్లతో పాటు ఏఐ వర్చువల్ అసిస్టెంట్ (6SKAI) ద్వారా టికెట్ బుకింగ్స్, కస్టమర్ సేవలను వేగవంతం చేసింది. ఇటీవల ‘ఇండిగో స్ట్రెచ్’ వంటి ప్రీమియం తరగతులను కూడా ప్రవేశపెడుతూ విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది.ఇటీవల 20,000 ఉచిత టికెట్ల వంటి (ఇండిగోఫ్రీ) ఆఫర్లతో తన 20 ఏళ్ల మైలురాయిని జరుపుకునే స్థాయికి ఇండిగో చేరింది.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
ఉచితంగా 20 వేల విమాన టికెట్లు.. ఫ్రీ ఆఫర్!
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) వాణిజ్య కార్యకలాపాల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని ప్రయాణికులకు భారీ గిఫ్ట్ ప్రకటించింది. దేశీయ విమాన ప్రయాణికుల కోసం ఏకంగా 20,000 ఉచిత టికెట్లను అందించే ప్రత్యేక వార్షికోత్సవ ప్రచారాన్ని ప్రారంభించింది. ‘హ్యాపీ ఇండిగో డే’ వేడుకల్లో భాగంగా ‘ఇండిగో ఫ్రీ’ పేరుతో ఈ ఆఫర్ను తీసుకొచ్చింది.గౌహతి మీదుగా తొలి విమానం2006 ఆగస్టు 4న ఢిల్లీ నుంచి ఇంఫాల్కు గౌహతి మీదుగా తొలి విమాన సర్వీసును నడపడం ద్వారా ఇండిగో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. అప్పట్లో ఒకే రూట్తో సేవలు ప్రారంభించిన సంస్థ.. ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విస్తృత నెట్వర్క్ను నిర్వహించే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎదిగింది.2026 ఆర్థిక సంవత్సరంలో ఇండిగో 12.3 కోట్లకు పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం దేశ విమానయాన సామర్థ్యంలో సుమారు 51 శాతం వాటాను కలిగి ఉంది. ముఖ్యంగా నాన్-మెట్రో నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరించడంలో ఇండిగో కీలక పాత్ర పోషించింది.రూ.10 వేల వరకు రీఫండ్వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ‘ఇండిగో ఫ్రీ’ ఆఫర్ కింద అర్హత పొందిన ప్రయాణికులకు వారి టికెట్ ఛార్జీని గరిష్ఠంగా రూ.10,000 వరకు రీఫండ్ చేయనున్నారు. ఈ ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు ఇండిగో అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, ఏఐ వర్చువల్ అసిస్టెంట్ 6ఎస్కై వంటి ప్రత్యక్ష బుకింగ్ ఛానెళ్ల ద్వారా చేసే దేశీయ విమాన బుకింగ్స్కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఆఫర్ వ్యవధిలో టికెట్లు బుక్ చేసుకున్న వారిలో అర్హత కలిగిన ప్రయాణికులను యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈమెయిల్, వాట్సాప్ ద్వారా సమాచారం పంపుతారు. అనంతరం ఒక సాధారణ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సరైన సమాధానం ఇచ్చిన వారికి రూ.10,000 వరకు బుకింగ్ ఛార్జీని తిరిగి చెల్లిస్తారు.ఏ బుకింగ్స్కు వర్తిస్తుంది?ఈ ఆఫర్ కింద వన్-వే, రిటర్న్ జర్నీలతో పాటు దేశీయ ఎకానమీ క్లాస్, ఇండిగోస్ట్రెచ్ బుకింగ్స్కు అవకాశం ఉంది. ఎంపికైన ప్రయాణికులకు రీఫండ్ మొత్తాన్ని మూడు నుంచి ఐదు పనిదినాల్లో ప్రాసెస్ చేస్తామని సంస్థ తెలిపింది. -
చిన్న పట్టణాల్లో కొత్త సినిమా థియేటర్లు
పెద్ద నగరాలకే పరిమితమైన కార్పొరేట్ మల్టీప్లెక్స్ అనుభవాన్ని చిన్న పట్టణాల ప్రేక్షకులకు సైతం చేరువ చేసేందుకు దేశంలోనే అతిపెద్ద థియేటర్ నెట్వర్క్ పీవీఆర్ ఐనాక్స్ భారీ ప్రణాళికను ఆవిష్కరించింది. ‘స్మార్ట్ సినిమా’ పేరిట రాబోయే మూడేళ్లలో టైర్-2, టైర్-3, టైర్-4 పట్టణాల్లో ఏకంగా 300 అధునాతన సినిమా స్క్రీన్లను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది.అందుబాటులో టికెట్ ధరలుమెట్రో నగరాల్లో ఉండే సాధారణ పీవీఆర్ మల్టీప్లెక్స్లతో పోలిస్తే ఈ స్మార్ట్ సినిమా హాళ్లలో టికెట్ ధరలు 30 నుంచి 35 శాతం వరకు తక్కువగా ఉంటాయి. సగటు టికెట్ ధరను రూ.175 పరిధిలోనే ఉంచాలని కంపెనీ నిర్ణయించింది. కేవలం టికెట్ ధరలే కాకుండా పాప్కార్న్, పానీయాలు వంటి ఆహార పదార్థాల ధరలను కూడా 20-25 శాతం వరకు తగ్గించి సామాన్య ప్రేక్షకులకు వినోదాన్ని సులభంగా అందుబాటులోకి తేనున్నారు.ఫ్రాంచైజీ నమూనాసాధారణ మల్టీప్లెక్స్లో ఒక్కో స్క్రీన్ నిర్మాణానికి రూ.3 కోట్లు-రూ.4 కోట్ల వరకు వ్యయమవుతుండగా ‘స్మార్ట్ సినిమా’ నమూనాలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తూనే నిర్మాణ వ్యయాన్ని రూ.1.9 కోట్లకు తగ్గించారు. ఇవి ‘ఫ్రాంచైజీ ఓనర్డ్ – కంపెనీ ఆపరేటెడ్’ పద్ధతిలో పనిచేస్తాయి. బిహార్లోని ముజఫర్పూర్లో మొదటి స్మార్ట్ సినిమాను ప్రారంభిస్తుండగా ఆ తర్వాత బారక్పూర్, రాంపూర్, హనుమాన్గఢ్ వంటి అనేక పట్టణాలకు దీన్ని విస్తరించనున్నారు.సినిమా ప్రదర్శన రంగంలో కొత్త విప్లవంచిన్న నగరాల్లో పెరుగుతున్న ఆర్థిక స్థోమత, మెరుగైన థియేటర్ అనుభవం పట్ల ప్రజల్లో ఉన్న ఆకాంక్షను దృష్టిలో ఉంచుకుని ఈ అడుగు వేసినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజిలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ తెలిపారు. స్క్రీన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ సౌండ్ క్వాలిటీ, డిజిటల్ ప్రొజెక్షన్, సీటింగ్ సౌకర్యాల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
ఎయిర్టెల్ లాభాల డేటా
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం జంప్చేసి రూ. 8,167 కోట్లను తాకింది. భారత్సహా ఆఫ్రికా కార్యకలాపాలలో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2025–26) ఇదే కాలంలో రూ. 5,948 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 18 శాతం ఎగసి రూ. 58,539 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 49,463 కోట్ల టర్నోవర్ అందుకుంది. మొత్తం కస్టమర్ల(సబ్్రస్కయిబర్లు) సంఖ్య 13 శాతం బలపడి 60.5 కోట్లను తాకింది. దీనిలో దేశీ వినియోగదారుల సంఖ్య సైతం 13 శాతం వృద్ధితో 43.6 కోట్లకు చేరింది. డేటా వినియోగం అప్ తాజా సమీక్షా కాలంలో ఎయిర్టెల్.. ఒక్కో వినియోగదారునిపై రూ. 264 చొప్పున సగటు ఆదాయం(ఏఆర్పీయూ) ఆర్జించింది. ఇది 6 శాతం అధికంకాగా, గతేడాది క్యూ1లో ఇది రూ. 250గా నమోదైంది. ఇందుకు మొబైల్ విభాగంలో ధరలు మెరుగుపడటం(ప్రీమియమైజేషన్)తోపాటు.. హోమ్స్, ఎయిర్టెల్ బిజినెస్ల వృద్ధి తోడ్పాటునిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. క్యూ1లో మొత్తం 5 మిలియన్ కస్టమర్లను జత చేసుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా పోస్ట్పెయిడ్ విభాగంలో 10 లక్షలమంది కస్టమర్లను జత చేసుకున్నట్లు కంపెనీ చైర్మన్ గోపాల్ విఠల్ వెల్లడించారు.వెరసి పోస్ట్పెయిడ్ వినియోగదారుల సంఖ్య 3 కోట్లకు చేరింది. దేశీయంగా డేటా సగటు వినియోగం 28 శాతం జంప్చేసి 34.4 జీబీని తాకింది. కన్సాలిడేటెడ్ పెట్టుబడి వ్యయాలు రూ. 13,386 కోట్లుకాగా.. దీనిలో దేశీ వాటా రూ. 9,698 కోట్లు. కంపెనీ నికర రుణ భారం 35 శాతం తగ్గి రూ. 81,852 కోట్లకు పరిమితమైంది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు స్వల్ప లాభంతో రూ. 1,957 వద్ద ముగిసింది. -
అందుకే రూ.11 లక్షల ఉద్యోగానికి గుడ్బై!
మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేయడం అంటే పెద్ద సాహసమే. కానీ కొన్నిసార్లు ఉద్యోగం కంటే.. సొంత వ్యాపారమే ఎక్కువ సంతృప్తిని, మంచి ఆదాయాన్ని ఇస్తుంది. అలాంటి ఓ యువకుడి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఎక్స్(X)లో అంకిత్ పాండే అనే వ్యక్తి తన స్నేహితుడి గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఏడాదికి రూ.11 లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అతని స్నేహితుడు ప్రమోషన్స్, కార్పొరేట్ జీవితాన్ని పక్కనబెట్టి సొంత ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ తన సొంత స్థలంలోనే ఒక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేసి వ్యాపారం ప్రారంభించాడు.ప్రారంభంలో చిన్న స్థాయిలోనే మొదలైనప్పటికీ.. ప్రస్తుతం అతని వ్యాపారం బాగా విస్తరించింది. ఇప్పుడు దాదాపు 300 ఇళ్లు, దుకాణాలకు ప్రతిరోజూ తాగునీటి క్యాన్లను సరఫరా చేస్తున్నాడు. రోజుకు సుమారు 300 క్యాన్లు విక్రయిస్తుండగా, ఒక్కో క్యాన్ను రూ.30కి అమ్ముతున్నాడు.దీంతో రోజుకు దాదాపు రూ.9 వేల ఆదాయం, అంటే నెలకు సుమారు రూ.2.7 లక్షల టర్నోవర్ వస్తోంది. సొంత స్థలం కావడంతో అద్దె భారం లేదు. నీటి శుద్ధి, విద్యుత్ ఖర్చులకు నెలకు సుమారు రూ.15 వేల, రవాణాకు మరో రూ.20 వేల ఖర్చవుతోంది. ఈ ఖర్చులన్నీ తీసేసిన తర్వాత కూడా ప్రతి నెల సుమారు రూ.2.35 లక్షల లాభం మిగులుతోందని అంకిత్ పాండే తెలిపారు. అంటే ఏడాదికి దాదాపు రూ.28.5 లక్షల ఆదాయం వస్తోంది. ఇది ఆయన గతంలో కార్పొరేట్ ఉద్యోగంలో పొందిన వార్షిక జీతం కంటే రెండింతలకు పైగానే ఉంది.My friend quit his ₹11 LPA 9-to-5 job in Bengaluru.Now he earns nearly ₹28 lakh a year from his home.Instead of chasing promotions, he went back home and started a simple water purification business.He installed a water purification plant on his own property and connected… pic.twitter.com/uY3mfTd0d3— Ankit Pandey (@iamankitpande) August 3, 2026ఈ కథను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అంకిత్ పాండే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. విజయమంటే పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయడమే కాదు. ప్రజలకు ప్రతిరోజూ అవసరమయ్యే సమస్యకు పరిష్కారం చూపే వ్యాపారం కూడా అద్భుతమైన అవకాశాలను అందిస్తుందని అన్నారు. చివరగా ఎవరైనా.. ''రూ.11 లక్షల ప్యాకేజీ ఉన్న ఉద్యోగాన్ని వదిలి ఇలాంటి వ్యాపారం చేస్తారా?'' అంటూ నెటిజన్లను ప్రశ్నించారు.ఈ పోస్టుపై చాలామంది స్పందించారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నందున, స్వచ్ఛమైన తాగునీటికి డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం ఈ కథ ఒక మంచి సందేశాన్ని ఇస్తోందని అన్నారు. ఉద్యోగ హోదా కంటే, ప్రజలకు అవసరమైన సేవను అందించే వ్యాపారం స్థిరమైన ఆదాయాన్ని అందించగలదని పేర్కొన్నారు. -
రూ.18 లక్షల జాబ్ వదిలినా నెలకు రూ.1.5 లక్షలు సంపాదన!
కార్పొరేట్ ఉద్యోగంలో ఎంత ఎక్కువ ప్యాకేజీ ఉన్నా.. ఉద్యోగ భద్రత లేని చోట మానసిక ప్రశాంతత కరువే. ఈ విషయాన్ని గ్రహించిన ఒక ఐటీ నిపుణుడు 42 ఏళ్ల వయసులో ఊహించని ధైర్యం చేశారు. ఏకంగా రూ.18 లక్షల వార్షిక ప్యాకేజీ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సేంద్రీయ డెయిరీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం నెలకు రూ.1.5 లక్షల నికర లాభాన్ని అర్జిస్తూ ఆంత్రప్రెన్యూర్లకు ప్రేరణగా నిలుస్తున్నారు.మార్కెట్ అనిశ్చితి నుంచి స్వయం సమృద్ధి వైపు..ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేసిన ఓ పారిశ్రామికవేత్త ప్రయాణాన్ని @VikasAlwys అనే ఎక్స్ హ్యాండిల్ ఇటీవల వెలుగులోకి తెచ్చింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, పెరిగిన మార్కెట్ అనిశ్చితి, ప్రాజెక్టుల కొరత కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలైంది. రోజూ ఆందోళనతో గడిపే కంటే సొంతంగా ఏదైనా నిర్మించాలని ఆయన నిశ్చయించుకున్నారు.ఆర్థిక స్వేచ్ఛే ప్రధాన బలంఈ సాహసోపేతమైన నిర్ణయానికి అతనికి ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్.. ఏ విధమైన అప్పులు లేకపోవడం. ఈఎంఐలు, రుణ బాధ్యతలు లేకపోవడం, తగినంత పొదుపు ఉండటంతో రిస్క్ తీసుకోవడానికి వెనుకాడలేదు. తన డెయిరీ ఫామ్లో కేవలం పాలు మాత్రమే కాకుండా, నాణ్యమైన దేశీ నెయ్యి, స్వచ్ఛమైన పెరుగు, పన్నీర్ వంటి విలువ ఆధారిత సేంద్రీయ ఉత్పత్తులపై దృష్టి సారించారు. దాంతో అన్ని ఖర్చులుపోను నెలవారీ నికర లాభం రూ.1.5 లక్షలుగా ఉంది.సోషల్ మీడియాలో స్పందనఈ కథనం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ‘ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా సరైన సమయంలో ఆస్తులను నిర్మించుకోవడానికి ఇదొక ఉత్తమ ఉదాహరణ’ అని ఒక వినియోగదారుడు తెలిపాడు. ‘నిజమైన పారిశ్రామికవేత్తలు రిస్క్ తీసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా మారతారు. ఆర్థిక అనిశ్చితినే అవకాశంగా మలుచుకోవడంలోనే స్వావలంబన దాగి ఉంది’ అని మరొకరు ప్రశంసించారు.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
బెంచ్ కల్చర్కు ఐటీ దిగ్గజాల స్వస్తి!
భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒక చారిత్రక పరిణామానికి వేదికవుతోంది. దశాబ్దాలుగా ఐటీ దిగ్గజాల వ్యాపార వ్యూహంలో కీలక పాత్ర పోషించిన ‘బెంచ్ స్ట్రెంత్’ (క్రియాశీల ప్రాజెక్టులు లేని ఉద్యోగుల సంఖ్య) సంస్కృతికి స్వస్తి పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, కచ్చితమైన శ్రామిక శక్తి ప్రణాళిక, డిమాండ్-ఆధారిత నియామకాల కారణంగా రాబోయే రోజుల్లో ఐటీ సంస్థలు చాలా తక్కువ బెంచ్ కల్చర్తో పనిచేయనున్నాయి.బెంచ్ కల్చర్ తగ్గేందుకు కారణాలుగతంలో ఐటీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు రాగానే తక్షణమే కేటాయించేందుకు 20-30% వరకు బెంచ్ స్ట్రెంత్ను నిర్వహించేవి. అయితే, గత మూడేళ్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా వంటి అగ్రశ్రేణి సంస్థల్లో ఇది సింగిల్ డిజిట్కు లేదా గరిష్టంగా 12 శాతానికి పడిపోయింది. 2027 ఆర్థిక సంవత్సరం (FY27) నాటికి ఇది 8-10 శాతానికి పరిమితం కానుందని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ డిజిటల్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.గతంలో బెంచ్ సమయం 45-60 రోజులుగా ఉండగా ప్రస్తుతం అది 30-45 రోజులకు తగ్గింది.కంపెనీలు తమ హెడ్ కౌంట్ పై నియంత్రణ సాధిస్తూ ఉద్యోగుల వినియోగ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి చేర్చుతున్నాయి.క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఏఐ స్పెషలైజ్డ్ నైపుణ్యాల ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయి.ఐటీ ఉద్యోగులపై లేఆఫ్ల ప్రభావం ఉందా?బెంచ్ స్ట్రెంత్ తగ్గడం అంటే భారీ తొలగింపులు అని భావించాల్సిన అవసరం లేదని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొవిడ్ అనంతర కాలంలో తీసుకున్న అదనపు సామర్థ్యాన్ని ఐటీ సంస్థలు ఇప్పటికే సర్దుబాటు చేశాయి. ‘ఇది కేవలం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కాదు.. శ్రామిక శక్తిని పునర్నిర్మించడం. ఉద్యోగులను కొత్త ప్రాజెక్టులకు అనుగుణంగా మార్చేందుకు రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్లలో కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి’ అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ చెప్పారు.మారుతున్న నియామకాల వ్యూహంతక్కువ బెంచ్ స్ట్రెంత్ ఉన్నా నియామకాలు పూర్తిగా ఆగిపోలేదు. అయితే, మాస్ రిక్రూట్మెంట్ స్థానంలో ‘స్పెషలిస్ట్ రిక్రూట్మెంట్’ వచ్చి చేరింది. టీసీఎస్ అనుభవపూర్వక, ప్రాజెక్ట్-ఆధారిత విభాగంలో రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇన్ఫీ రాబోయే కాలంలో 6,000 మంది ఫ్రెష్ ఫ్రంటియర్ ఇంజినీర్లను నియమించుకోనుంది. హెచ్సీఎల్ టెక్ స్పెషలిస్ట్ ఫ్రెషర్లపై దృష్టి సారిస్తోంది. టెక్ మహీంద్రా ఫ్రెషర్ రిక్రూట్మెంట్ను తిరిగి ప్రారంభించనుంది.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
మనీ లాండరింగ్ సందేహాలు.. యూఎస్ కోర్టులో క్యాపిటల్ వన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ బ్యాంక్ ఖాతాల రద్దు వివాదంలో మలుపు చోటుచేసుకుంది. 2021లో ట్రంప్ కుటుంబానికి చెందిన 300కి పైగా ఖాతాలను మూసివేయడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, మనీ లాండరింగ్ సమీక్షలో వెల్లడైన తీవ్రమైన ఆర్థిక లావాదేవీల సందేహాలే అసలు కారణమని ప్రముఖ ఆర్థిక సంస్థ ‘క్యాపిటల్ వన్’ అమెరికా ఫెడరల్ కోర్టుకు స్పష్టం చేసింది.రాజకీయ కక్షసాధింపు కాదన్న బ్యాంక్2021 జనవరి 6న వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి అనంతరం తమ రాజకీయ భావజాలం నచ్చక బ్యాంక్ అక్రమంగా తమ ఖాతాలను మూసివేసిందని (‘డీ-బ్యాంకింగ్’) ట్రంప్, ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ క్యాపిటల్ వన్ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసింది.తమ 'యాంటీ మనీ లాండరింగ్' నిపుణుల బృందం నెలల తరబడి జరిపిన సమగ్ర విశ్లేషణ, సందేహాస్పద ఆర్థిక లావాదేవీల తీరుతెన్నుల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఫెడరల్ బ్యాంకింగ్ మార్గదర్శకాలు, బ్యాంక్ అంతర్గత నియమావళి ప్రకారమే ఖాతాలను క్లోజ్ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కోణం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరుచుకోవడానికి ట్రంప్ బృందానికి అనేక నెలల సమయం, పొడిగింపులు కూడా ఇచ్చామని నివేదికలో పేర్కొంది.బిలియన్ డాలర్ల లీగల్ పోరాటంక్యాపిటల్ వన్తో పాటు మరొక దిగ్గజ బ్యాంక్ ‘జేపీమోర్గన్ ఛేజ్’పై కూడా ట్రంప్ 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్లు) పరిహారం కోరుతూ దావా వేశారు. అమెరికాలో కన్జర్వేటివ్ నాయకులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని బ్యాంకింగ్ వ్యవస్థల నుంచి తొలగిస్తున్నారని ట్రంప్ వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. అయితే, చట్టపరమైన లేదా ఇమేజ్ పరమైన ముప్పు ఉన్న ఖాతాలపై రిస్క్ నిర్వహణలో భాగంగా చర్యలు తీసుకోవడం సాధారణ ప్రక్రియ అని బ్యాంకింగ్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.పెరిగిన డీ-బ్యాంకింగ్ వివాదంఈ వివాదం అమెరికా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ట్రంప్ తన రెండో విడత పాలనలో ‘అమెరికన్లందరికీ న్యాయమైన బ్యాంకింగ్ హక్కులు’ పేరుతో ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రాజకీయ ప్రాతిపదికన కస్టమర్ల ఖాతాలను మూసివేయడాన్ని ఇది నిషేధిస్తుంది. ఒకవైపు మనీ లాండరింగ్ నిబంధనలను బ్యాంకింగ్ దిగ్గజాలు కోర్టులో తెరపైకి తెస్తుండగా, మరొకవైపు ట్రంప్ న్యాయ బృందం దీనిని వ్యాపార ప్రత్యర్థుల కుట్రగా అభివర్ణిస్తుండటంతో ఈ చట్టపరమైన పోరాటం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
‘ఒక్క ప్రశ్నకు నవ్వి బయటకు వచ్చాను’
నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ భద్రత, మంచి వేతనం ఎంత ముఖ్యమో అంతకంటే వర్క్లైఫ్ బ్యాలెన్స్, గౌరవప్రదమైన పని సంస్కృతి ముఖ్యమని నిరూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రముఖ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం, మంచి రివ్యూ ఉన్నప్పటికీ.. ఇంటర్వ్యూయర్ అడిగిన ఒక విచిత్రమైన ప్రశ్నతో అభ్యర్థి ఇంటర్వ్యూ మధ్యలోనే బయటకు వచ్చేశారు.సంఘటన వివరాల్లోకి వెళ్తే..సోషల్ మీడియా వేదిక రెడ్డిట్లో ‘సహాలిమ్న్’ అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్ ఇటీవల వైరల్ అయింది. సదరు అభ్యర్థి తాను ఎంతో ఉత్సాహంగా హాజరైన ఇంటర్వ్యూ అనుభవాన్ని పంచుకుంటూ ‘ఉద్యోగ వివరణ, వేతనం, కంపెనీ రివ్యూలు అన్నీ చాలా బాగున్నాయి. హెచ్ఆర్ మేనేజర్ను కలిసి ఇంటర్వ్యూలో కూర్చున్న వెంటనే మొదటి ప్రశ్న వేశారు. అదనంగా ఎలాంటి పేమెంట్ లేకుండా ఓవర్ టైమ్ (Unpaid Overtime) చేయడాన్ని మీరు ఎలా నిర్వహిస్తారు?’ అని అడిగినట్లు చెప్పారు.ఆ ప్రశ్న వినగానే అభ్యర్థి మొదట అది సరదా జోక్ అనుకుని నవ్వేశారు. కానీ, ఇంటర్వ్యూయర్ పట్టుబట్టి సమాధానం కోసం చూడటంతో అసలు విషయం అర్థమైంది. కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ తమ ఉద్యోగులంతా పని పట్ల ఎంతో మక్కువ కలిగి ఉంటారని, పని పూర్తి చేయడానికి ఎంత సమయమైనా కేటాయిస్తారని చెప్పారు. అదనపు పని గంటలకు ప్రత్యేకంగా చెల్లింపులు లేదా ట్రాకింగ్ ఉండదని స్పష్టం చేశారు. దీంతో ఏమాత్రం సంకోచించని అభ్యర్థి ‘మీ సమయానికి ధన్యవాదాలు, ఇది నాకు సరైన ఉద్యోగం కాదు’ అని చెప్పి అక్కడికక్కడే ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చారు.సోషల్ మీడియా స్పందనలుఈ పోస్ట్కు ఇంటర్నెట్లో గంటల వ్యవధిలోనే దాదాపు 45,000 పైగా వ్యూస్ వచ్చాయి. ‘కంపెనీ మిమ్మల్ని ఉచితంగా శ్రమదోపిడీ చేయాలనే సిద్ధంగా ఉంది. మీరు సరైన నిర్ణయమే తీసుకుని పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారు’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ఉచిత ఓవర్ టైమ్ శ్రమ వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని, సమర్థవంతమైన నిర్వహణ లేని చోటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు -
అస్సాం ప్రజలకు అండగా నీతా అంబానీ: రూ.21 కోట్ల విరాళం!
అస్సాంలో భారీ వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.21 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబం పట్ల తనకు ఎంతో బాధ ఉందని, అస్సాం ప్రజలు ఒంటరిగా లేరని నీతా అంబానీ భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న రిలయన్స్ సహాయక చర్యలకు అదనంగా ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో సహాయక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా శివసాగర్, చరైడియో జిల్లాల్లో అవసరమైన కుటుంబాలకు ఆహారం, తాగునీరు, ఆరోగ్య సేవలు, అత్యవసర వసతి వంటి సహాయాన్ని అందిస్తున్నారు. వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాల పునరుద్ధరణ, కమ్యూనిటీ కిచెన్ల నిర్వహణతో పాటు వంటరా బృందాల ద్వారా పశువులకు వైద్య సహాయం కూడా అందిస్తున్నారు.అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ.. నీతా అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఎప్పుడూ అండగా నిలుస్తున్న రిలయన్స్ సహాయం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు.వరదల సమయంలో మనుషులతో పాటు పశువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రిలయన్స్కు చెందిన వంటరా (Vantara) బృందాలు గ్రామాల్లో పశువుల కోసం వైద్య సహాయం, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానిక అధికారులు, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన ప్రాంతాలకు సహాయాన్ని చేరవేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాల ద్వారా వేలాది మంది ప్రజలు ప్రయోజనం పొందారని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది.Standing by the people of Assam. 🤝"We stand with you today, and we will continue to stand with you in the days ahead," shared Mrs. Nita Ambani, Founder & Chairperson, Reliance Foundation, expressing solidarity with flood-affected families in Assam and reaffirming Reliance… pic.twitter.com/os0GgGQxu0— Reliance Foundation (@ril_foundation) August 3, 2026 -
జియో బంపరాఫర్.. రూ.400తో సరికొత్త ప్యాకేజ్!
రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సరికొత్త జియో హోమ్ బ్రాడ్బ్యాండ్ అండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్లు హై-స్పీడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్లు, ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ల సబ్స్క్రిప్షన్లను ఒకే ప్యాకేజీలో నెలకు రూ. 400 ప్రారంభ ధరతో అందిస్తున్నాయి.ఈ బండిల్ ఆఫర్ ద్వారా కస్టమర్లు బ్రాడ్బ్యాండ్, టెలివిజన్ మరియు స్ట్రీమింగ్ వినోదాన్ని ఒకే కనెక్షన్ మరియు ఒకే నెలవారీ బిల్లుతో పొందవచ్చు. కేవలం టీవీ మాత్రమే చూసే వారి నుంచి హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్తో పాటు లైవ్ టీవీ, ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారి వరకు, వివిధ రకాల గృహ అవసరాలకు సరిపోయేలా ఈ ప్లాన్లు రూపొందించారు.ఎంచుకున్న ప్లాన్ను బట్టి, కస్టమర్లు అన్లిమిటెడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్లు, 200కి పైగా HD ఛానెల్లు.. ఆహా, జియోహాట్స్టార్, జీ5, సోనీ లివ్ వంటి వాటితో సహా 12-ప్లస్ ఓటీటీ ప్లాట్ఫారమ్ల యాక్సెస్ను ఆస్వాదించవచ్చు. ఇందులో టీవీలో యూట్యూబ్, జియో సర్వీస్ ఇంజనీర్ల ద్వారా ఉచిత ఇన్స్టాలేషన్.. మెయింటెనెన్స్, అలాగే లైవ్ టీవీని ప్లే, పాజ్ & రివైండ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గృహాలకు.. జియో హోమ్ తన ఫైబర్ నెట్వర్క్ ద్వారా టెలివిజన్ సేవలను అందిస్తుంది. సాధారణంగా వాతావరణం బాగాలేనప్పుడు డీటీహెచ్ సేవలకు అంతరాయం కలుగుతుంది, కానీ ఫైబర్ ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనైనా అంతరాయం లేని వీక్షణ అనుభవాన్ని జియో అందిస్తుంది. కస్టమర్లు లైవ్ టీవీని పాజ్ మరియు రివైండ్ చేయగల సదుపాయం ఉన్నందున, వారు తమకు ఇష్టమైన తెలుగు సీరియల్స్, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ లేదా న్యూస్ ప్రోగ్రామ్లను ఎప్పటికీ మిస్ అయ్యే అవకాశం లేదు. -
19 ఏళ్ల యువతి కథ.. శ్రీధర్ వెంబు భావోద్వేగం!
ప్రస్తుతం సమాజంలో జెన్ జీ (Gen Z) గురించి పలురకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వారు ఎక్కువగా సౌకర్యాలను కోరుకుంటారని, కష్టపడి పనిచేయరని, బాధ్యతలు తీసుకోరని చాలామంది భావిస్తారు. కానీ.. ఇది వాస్తవం కాదని జోహో సంస్థ సీఈఓ శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఎందుకో వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి నేటి జెన్ జీ యువత అందరూ ఒకేలా ఉంటారని చెప్పడం సరికాదు. శ్రీధర్ వెంబు తన ''సంస్థలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువతితో మాట్లాడారు. ఆ సంభాషణలో ఆమె తన జీవితంలోని నిజమైన పరిస్థితిని వివరించింది. తన తల్లిదండ్రులు తీసుకున్న అప్పులను తీర్చడానికి, అలాగే తన చిన్న తమ్ముళ్లు, చెల్లెళ్ల భవిష్యత్తు కోసం తాను కష్టపడి పనిచేస్తున్నానని చెప్పింది. తన కుటుంబం సంతోషంగా ఉండటమే.. తన జీవితంలో ముఖ్యమైన లక్ష్యమని ఆమె తెలిపిందని'' ఆయన పేర్కొన్నారు.కుటుంబ క్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఆ యువతి.. అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపుగా జీవిస్తోంది. ఖరీదైన దుస్తులు కొనకుండా.. తక్కువ ధరలో దొరికేవే కొనుగోలు చేస్తోంది. తెగిపోయిన చెప్పులను కుట్టించుకుని మళ్లీ వాటినే ఉపయోగిస్తోంది. ప్రతి రూపాయిని.. భవిష్యత్తు కోసం ఆదా చేస్తోంది. ఆమె మాటలు విని తాను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు.I come across a large number of people of various age groups, and I don't find categorizing generations based on age all that meaningful.A 19 year old employee told me last week that she works hard to earn money so that her parents can repay their loans and support her younger…— Sridhar Vembu (@svembu) August 3, 2026ఈ సంఘటనను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వేలాది మంది స్పందించారు. ఆయన మరో విషయాన్ని కూడా చెప్పారు. తమ సంస్థలో ఇటీవల వివాహం చేసుకున్న ఇద్దరు యువ ఉద్యోగులు, తన సూచన మేరకు ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారని తెలిపారు. ఇది యువతలో ఇంకా మంచి విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచనలు ఉన్నాయని చూపిస్తుందని పేర్కొన్నారు.ఈ పోస్టుకు అనేక రకాల స్పందనలు వచ్చాయి. కొందరు యువతను ప్రోత్సహించిన శ్రీధర్ వెంబును ప్రశంసించారు. మరికొందరు కుటుంబ పరిస్థితులు, ఆర్థిక సమస్యల వల్లే చాలా మంది యువత చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకోవాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు జీవితంలో విజయం సాధించాలంటే కష్టపడటం, క్రమశిక్షణ, మంచి నడవడిక చాలా అవసరమని వ్యాఖ్యానించారు. -
దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు
దేశ ఆర్థిక రంగాన్ని ఏలుతున్న దిగ్గజ వ్యాపార కుటుంబాలు, వారి వంశపారంపర్య వ్యాపార సామ్రాజ్యాల వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలను ‘హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ వెల్లడించింది. భారత్లోని అత్యంత శ్రీమంతుల జాబితాను నిశితంగా పరిశీలిస్తే అత్యధిక సంపద నిర్దిష్ట సామాజిక వర్గాలు, కొన్ని ప్రత్యేక ఇంటిపేర్లు కలిగిన కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని స్పష్టమవుతోంది.‘హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ ప్రకారం దేశంలో అత్యధిక సంపన్నులను కలిగి ఉన్న టాప్-10 ఇంటిపేర్ల వివరాలు1. అగర్వాల్ (Agarwal): వేదాంత గ్రూప్ అనిల్ అగర్వాల్తో సహా అత్యధిక కుటుంబాలతో అగ్రస్థానంలో నిలిచింది.2. గుప్తా (Gupta): హావెల్స్ ఇండియా అనిల్ రాయ్ గుప్తా కుటుంబం ప్రధానంగా ఉంటూ అగర్వాల్లతో సమానంగా తొలి స్థానాన్ని పంచుకుంది.3. పటేల్ (Patel): గుజరాత్ నేపథ్యమున్న పటేల్ కుటుంబాలు (జైడస్ లైఫ్సైన్సెస్ పంకజ్ పటేల్) మూడో స్థానంలో ఉన్నాయి.4. జైన్ (Jain): ఐనాక్స్ జీఎఫ్ఎల్ గ్రూప్ వివేక్ జైన్ తదితర కుటుంబాలు నాలుగో స్థానంలో నిలిచాయి.5. మెహతా (Mehta): టోరెంట్ ఫార్మా మెహతా కుటుంబంతో సహా విభిన్న రంగాల్లో స్థిరపడ్డారు.6. గోయెంకా (Goenka): మార్వాడీ వ్యాపార సామ్రాజ్యాలకు చెందిన సంజీవ్ గోయెంకా కుటుంబం ముఖ్యమైనది.7. షా (Shah): ఫైన్ ఆర్గానిక్స్ లాంటి రసాయన, తయారీ రంగాల్లో విస్తరించిన కుటుంబాలు.8. సింగ్ (Singh): డీఎల్ఎఫ్ రాజీవ్ సింగ్ వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజాల ప్రాతినిధ్యం.9. రావు (Rao): తెలుగు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యంతో వ్యాపార కుటుంబాలు.10. దోషి (Doshi): సమానమైన ఆర్థిక ప్రాబల్యంతో ముంబై, గుజరాత్ ఆధారిత వ్యాపార వేత్తలు.అంబానీ, అదానీ వంటి ప్రముఖ వ్యక్తుల పేర్లు విడివిడిగా అగ్రస్థానాల్లో కనిపించినప్పటికీ ఇంటిపేర్ల పరంగా చూస్తే ఉత్తర, పశ్చిమ, దక్షిణ భారత దేశాల సాంప్రదాయ వ్యాపార వర్గాలదే పైచేయిగా ఉంది. తరాలుగా వస్తున్న కుటుంబ వ్యాపారాలు, బలమైన నెట్వర్కింగ్, వ్యాపార మెళకువలే వీరి విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: భారత్లోని ప్రముఖ కంపెనీల అసలు పేర్లు -
మందుబాబులకు షాక్.. లిక్కర్లో కృత్రిమ రుచులు!
దేశీయ మద్యం మార్కెట్లో దశాబ్దాలుగా విశేష ప్రజాదరణ పొందిన పలు ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) భారీ షాక్ ఇచ్చింది. నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించడంతో పాటు కృత్రిమ సువాసనలు (ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు) వాడుతూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే లేబులింగ్ విధానాలను పాటిస్తున్నందుకు డయాజియో (యునైటెడ్ స్పిరిట్స్), ఇన్ బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్వాటర్ వంటి దిగ్గజ సంస్థలకు చెందిన కొన్ని నిర్దిష్ట రమ్, విస్కీ వేరియంట్ల అమ్మకాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.ల్యాబొరేటరీ పరీక్షల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, బ్యాగ్పైపర్ డీలక్స్ విస్కీలతో పాటు ఓల్డ్ మాంక్, మెక్డొవెల్స్ నంబర్-1, ఓల్డ్ కాస్క్ డీలక్స్ రమ్ వేరియంట్లలో సహజ సిద్ధమైన ఏజింగ్ (మ్యాచ్యురేషన్) ప్రక్రియకు స్వస్తి చెప్పి కృత్రిమ లేదా 'నేచర్ ఐడెంటికల్' ఫ్లేవర్లను ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణ అయింది. సాధారణంగా మొలాసెస్ లేదా మాల్ట్ వంటి ప్రాథమిక పదార్థాలను పులియబెట్టి ఈస్ట్ చర్య ద్వారా లభించే సహజ రుచి, సువాసనలకు బదులుగా విస్కీలో 'విస్కీ ఫ్లేవర్', రమ్లో 'రమ్ ఫ్లేవర్'లను కలపడం అంతర్జాతీయ తయారీ ప్రమాణాలకు విరుద్ధమని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. కాఫీ, వెనిలా వంటి ఇతర రుచులను జోడించడానికి అనుమతి ఉన్నప్పటికీ మద్యం అసలు నమూనానే కృత్రిమంగా సృష్టించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.లేబులింగ్పై మద్యం తయారీ తేదీ ప్రకటనలకు (Age claims) సంబంధించి కూడా తీవ్ర అతిక్రమణలు వెలుగులోకి వచ్చాయి. 7 ఇయర్స్ ఓల్డ్ బ్లెండెడ్గా ప్రచారం చేసుకుంటున్న ఒక రమ్ వేరియంట్లో నిజమైన మెచ్యూర్డ్ రమ్ వాటా 5 శాతం కంటే తక్కువగా ఉండి అత్యధిక భాగం సాధారణ న్యూట్రల్ స్పిరిట్ మాత్రమే ఉన్నట్లు తేలింది. 2018 ఆల్కహాలిక్ బెవరేజెస్ నిబంధనల ప్రకారం బ్లెండెడ్ మద్యంలో ఉండే అతి తక్కువ వయసు కలిగిన స్పిరిట్ ఆధారంగానే 'ఏజ్' ప్రకటించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో నాణ్యతా ప్రమాణాలు పాటించని ఉత్పత్తులను కేవలం విస్కీ లేదా రమ్ అని కాకుండా బాటిల్ ముందు భాగంలో స్పష్టంగా 'విస్కీ-ఫ్లేవర్డ్ స్పిరిట్' లేదా 'రమ్-ఫ్లేవర్డ్ స్పిరిట్' అని ముద్రించాలని నిబంధన విధించింది. నిబంధనలు పాటించని తయారీ యూనిట్లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మద్దతుతో ఈ చర్యలు తీసుకున్నట్లు నియంత్రణ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: భారత్లోని ప్రముఖ కంపెనీల అసలు పేర్లు -
భారత్లోని ప్రముఖ కంపెనీల అసలు పేర్లు
రోజువారీ జీవితంలో మనం ఎన్నో బ్రాండ్లను చూస్తుంటాం, ఆయా వస్తువులను ఉపయోగిస్తుంటాం. కానీ ఆ సంస్థల అసలు పేర్లు ఏమిటి? వాటి షార్ట్కట్ పేర్ల వెనుక ఉన్న పూర్వాపరాలేంటి? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే ఎంతో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. ఒకప్పుడు చిన్న పరిశ్రమలుగా, ప్రాంతీయ వ్యాపారాలుగా ప్రారంభమై నేడు వేల కోట్ల టర్నోవర్తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో ప్రముఖ భారతీయ సంస్థల పేర్లు కాలక్రమేణా సంక్షిప్త రూపాలుగా స్థిరపడిపోయాయి. మన దేశంలోని ప్రముఖ టెక్నాలజీ, ఆటోమొబైల్, రిటైల్, ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థల అసలు పూర్తి పేర్లు, వాటి వెనుక ఉన్న విశేషాలను ఇక్కడ పరిశీలిద్దాం.టెక్నాలజీ, స్టార్టప్స్, డిజిటల్ రంగాలుOYO: అద్దె గదుల బుకింగ్ రంగాన్ని శాసించే ఓయో పూర్తి పేరు 'ఆన్ యువర్ ఓన్'. వినియోగదారులకు వారి సొంత ఇంటి వాతావరణాన్ని అందిస్తామనే ఉద్దేశంతో ఈ పేరును ఎంచుకున్నారు.Paytm: మొబైల్ రీచార్జ్ యాప్గా ప్రారంభమై డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన పేటీఎమ్ అసలు పేరు 'పే త్రూ మొబైల్'.HCL: భారత్లో ఐటీ రంగానికి పునాది వేసిన సంస్థల్లో ప్రధానమైన హెచ్సీఎల్ పూర్తి పేరు 'హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్'.Wipro: నేడు ప్రముఖ ఐటీ దిగ్గజంగా ఉన్న విప్రో మొదట్లో వంటనూనెలు, వెజిటబుల్ ఆయిల్స్ తయారుచేసే సంస్థ. అందుకే దీనికి 'వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్' అనే పేరు వచ్చింది.ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంTVS: సంస్థ వ్యవస్థాపకుడు టీ.వీ. సుందరం అయ్యంగార్ జ్ఞాపకార్థం ఆయన ఊరు, సొంత పేరు కలిసొచ్చేలా ‘తిరుక్కురుంగుడి వెంగరం సుందరం’ అని నామకరణం చేశారు.MRF: ప్రపంచస్థాయి టైర్ల తయారీ సంస్థ అయిన ఎంఆర్ఎఫ్ మద్రాస్ (చెన్నై) కేంద్రంగా ప్రారంభమైన 'మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ'.BKT: టైర్ల రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బీకేటీ పూర్తి పేరు 'బాల్కృష్ణ టైర్స్'.DLF: దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్ 'ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్' పేరుతో రూపుదిద్దుకుంది.కన్స్యూమర్ గూడ్స్, ఎంటర్టైన్మెంట్AMUL: గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా ప్రారంభమై శ్వేత విప్లవానికి మూలస్తంభంగా నిలిచిన అముల్ పూర్తి పేరు 'ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్'.PVR: భారతదేశ మల్టీప్లెక్స్ అనుభవాన్ని మార్చివేసిన పీవీఆర్ అసలు పేరు 'ప్రియా విలేజ్ రోడ్షో'.ITC: ప్రొడక్షన్ డైవర్సిఫికేషన్లో అగ్రగామిగా ఉన్న ఐటీసీ ఆరంభంలో పొగాకు ఉత్పత్తుల సంస్థగా 'ఇండియన్ టొబాకో కంపెనీ' పేరిట ఏర్పాటైంది.BPL: ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఒకప్పుడు తిరుగులేని గుర్తింపు పొందిన బీపీఎల్ పూర్తి పేరు 'బ్రిటిష్ ఫిజికల్ లాబొరేటరీస్'.ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట.. -
నిలిచిపోయిన కొత్త ఉద్యోగాలు.. అదుపు తప్పిన ఖర్చులు!
దేశీయ ఐటీ పరిశ్రమలో మౌలిక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కృత్రిమ మేధ విస్తృతి పెరిగిన కొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి దాదాపు నిలిచిపోతోందని, డేటా సెంటర్లు, ఏఐ సాధనాల నిర్వహణ వ్యయాలు అదుపు తప్పిపోతున్నాయని జోహో వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వేంబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిశ్చితమైన గ్లోబల్ ఆర్థిక పరిస్థితుల్లో దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం సవాలుతో కూడుకుందని పేర్కొన్నారు.నియామకాల నిధులు ఏఐ ఖర్చులకే..సాధారణంగా కొత్త ఉద్యోగుల నియామకం, జీతభత్యాల కోసం కేటాయించే బడ్జెట్ను ఐటీ కంపెనీలు ఇప్పుడు ఏఐ సాంకేతికత, డేటా సెంటర్ల మౌలిక వసతుల వైపే మళ్లించాల్సి వస్తోందని శ్రీధర్ వేంబు స్పష్టం చేశారు. ‘మా సంస్థ జోహోతో సహా ఏ కంపెనీ కూడా ప్రస్తుతానికి లేఆఫ్లు ప్రకటించకపోయినప్పటికీ గత కొన్నేళ్లుగా కొత్త ఉద్యోగాల నియామకాలను మాత్రం చేపట్టడం లేదు. సర్వర్లు, మెమరీ చిప్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల డేటా సెంటర్ల నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ఈ వ్యయాలను నియంత్రించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ చాలా అంశాలు మన చేతుల్లో లేవు’ అని వేంబు వెల్లడించారు.సంతృప్త స్థాయికి సాఫ్ట్వేర్ మార్కెట్ఏఐ సాధనాల సాయంతో కోడింగ్ చేయడం, కొత్త సాఫ్ట్వేర్లను తయారు చేయడం వేగవంతమైనప్పటికీ ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్కు ఇంకా అదనపు వసతులు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఇతర కమోడిటీ పరిశ్రమలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఇకపై నాణ్యత, విశ్వసనీయత, బ్రాండ్ విలువలే ప్రధానంగా మారతాయన్నారు. దీనివల్ల వృద్ధి రేటు నెమ్మదిస్తుందని విశ్లేషించారు. బహుళజాతి కార్పొరేట్ క్లయింట్లు సైతం తమ ఐటీ బడ్జెట్లను తగ్గించుకుని ఏఐ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు.ఉపాధి పునరుద్ధరణ ప్రశ్నార్థకంఆటోమేషన్ పెరగడం వల్ల భారీ ఉత్పత్తులు సాధించే మాన్యుఫ్యాక్చరింగ్ రంగం కూడా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని వేంబు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ, ఆటోమేషన్ వల్ల వస్తువుల తయారీ వ్యయం తగ్గి ఉత్పత్తులు చవకగా లభించినప్పటికీ వాటిని కొనుగోలు చేసేంత ఆదాయం ప్రజల చేతిలో ఉండేలా ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాలనేదే ఇక్కడ ఉత్పన్నమయ్యే అసలు ప్రశ్న అని పేర్కొన్నారు. ఈ సవాలుకు సమాధానంగా కొందరు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం లేదా సంక్షేమ పథకాలను ఒక మార్గంగా చూస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రతిపాదనలపై రాజకీయ ఒత్తిడి మరింత పెరిగే అవకాశముందని వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట.. -
డిజిటల్ దిగ్గజాల దారెటు?
బీమా కావాలా...? పాలసీ బజార్లో చూడు! ఉద్యోగమా...? నౌఖ్రీలో వెతుకు! మరి సప్లయర్స్..? ఇండియా మార్ట్ ఉందిగా! ఇంటి సంగతో... హౌసింగ్.కామ్కు వెళ్లు! సమాచారాన్ని తెలియజేయటంలో కొత్త ఒరవడికి బాటలువేసి రివ్వుమన్న ఇంటర్నెట్ కంపెనీలివి. వీటి పోలికలతోనే వందల వెబ్సైట్లు వచ్చినా... లీడర్లు ఇవే. కానీ ఏఐ దీన్ని మార్చేసింది. ‘ క్లెయిమ్ సెటిల్మెంట్లో మంచి రికార్డున్న తక్కువ ధర హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి’ ‘కోకాపేట్లో రూ.కోటికి త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరుకుతుందా?’ అని ఏ జెమినైనో, క్లాడ్నో, చాట్జీపీటీనో అడిగితే చాలు. వివిధ ప్లాట్ఫామ్స్లో అవే వెతికేసి... రెడీమేడ్ సమాధానమిస్తున్నాయి. దీనర్థం సెర్చ్ ట్రాఫిక్ ఇపుడు వెబ్సైట్లకే పరిమితం కావటంలేదు. ఏఐ అసిస్టెంట్ల చేతుల్లోకి వెళ్లింది. ఇంటర్నెట్ కంపెనీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. మరెలా? మున్ముందు జరిగేదేంటి? ఈ షేర్ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు చేయాల్సిందేంటి? ఏ కంపెనీ ఎలా మారబోతోంది? ఇదే ఈ వారం ‘సాక్షి వెల్త్’ ప్రత్యేక కథనం...కాలం మారుతుంటుంది. టెక్నాలజీ కూడా. ఇంటర్నెట్ కంపెనీలు మొదటి దశలో సమాచారం ఇచ్చాయి. సెర్చ్లో విప్లవాన్ని తెచ్చాయి. మార్కెట్ ప్లేస్లను నిర్మించి డిజిటల్ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ ఇపుడు ఏఐ విస్ఫోటనంతో వాటికి వ్యూహాలు మార్చుకోక తప్పటం లేదు. కొన్ని స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తూ విలువ పెంచుకుంటుంటే... మరికొన్ని దూకుడుగా ఇతర కంపెనీలను కొంటూ స్ట్రాటజీ మార్చుకుంటున్నాయి. మరికొన్ని ఏఐని అర్థం చేసుకుంటూ దాన్నే తమ బలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మొత్తంగా అన్ని కంపెనీలూ ఏఐ ఏజెంట్లుగా మారే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. పీబీ ఫిన్టెక్ (పాలసీ బజార్)బీమా తేలికైన విషయం కాదు కాబట్టి దీనికి ఏఐ ముప్పు తక్కువే. కస్టమర్లకు ఇతర కంపెనీల పాలసీలతో పోల్చి చూపించటంతో పాటు క్లెయిమ్, అండర్ రైటింగ్, డాక్యుమెంటేషన్, రెన్యూవల్స్ వంటివన్నీ చేసిపెట్టాలి. ఒక ఏఐ ఎల్ఎల్ఎం దీన్నంతటినీ చేయటం కష్టం. కానీ ఇదే ప్లాట్ఫామ్లో ఏఐ ఓ అసిస్టెంట్గా మారగలదు. అందుకే పాలసీలను పోల్చే వెబ్సైట్లా మిగిలిపోకుండా ఏఐ–నేటివ్ ఇన్సూరెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్పై పీబీ ఫిన్టెక్ భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అడ్వయిజరీ టూల్స్లో ఏఐని మిళితం చేస్తోంది. దీనివల్ల ఖర్చులు తగ్గటం ఒక ఎత్తయితే కస్టమర్ల సంతృప్తి స్థాయి పెరిగిందని, ప్రొడక్టివిటీ కూడా పెరిగిందని కంపెనీ యాజమాన్యం చెబుతోంది. భవిష్యత్తులో బీమా ఏజెంటు, ఏఐ ఏజెంటు కలిసి పాలసీ బజార్ ప్లాట్ఫామ్పై సేవలు అందిస్తారు. ఏఐ దీనికి అదనపు బలమవుతుందని చెప్పొచ్చు. కంపెనీ చెబుతున్నవన్నీ ఆచరణలోకి వస్తే వచ్చే పదేళ్లలో ఇది బీమా ఆపరేటింగ్ వ్యవస్థగా మారొచ్చు. ఇన్ఫో ఎడ్జ్నౌఖ్రీ, 99ఏకర్స్, జీవన్సాథీ వంటి వెబ్సైట్లను నిర్వహించే ఇన్ఫో ఎడ్జ్కు పీబీ ఫిన్టెక్, జొమాటోతో సహా చాలా స్టార్టప్లలో పెట్టుబడులున్నాయి. అవి బాగా లాభాలిచ్చాయి కూడా. చాట్ జీపీటీ వంటి ఏఐ ఏజెంట్లు ఇప్పటికీ రెజ్యూమ్స్ రాస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేందుకు ప్రశ్నలు–సమాధానాలు ఇస్తున్నాయి. స్కిల్స్ సరిపోతాయో, లేదో చెక్ చేస్తున్నాయి. మున్ముందు ఇవి ఆటోమేటిగ్గా జాబ్స్ను రికమమెండ్ చేయొచ్చు. దీనివల్ల సంప్రదాయ జాబ్ పోర్టల్స్కు ట్రాఫిక్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువే. మరి నౌఖ్రీ ఏం చేస్తోంది?: ఈ సంస్థ ఏఐపై బాగానే ఇన్వెస్ట్ చేస్తోంది. దీనివల్ల వల్ల ఇప్పటికే యూజర్ల సేవలు మెరుగయ్యాయని, అంతర్గతంగా ప్రొడక్టివిటీ పెరిగిందని యాజమాన్యం చెబుతోంది. ఈ ఏఐ సేవలపై ఇప్పటికిప్పుడు ఆదాయం రాకపోయినా... రెన్యూవల్స్, రెవెన్యూ పెరగవచ్చని, దీర్ఘకాలంలో ధరలు పెంచడానికి కూడా అవకాశముందని చెబుతోంది. భవిష్యత్లో కేవలం జాబ్ పోర్టల్గా మిగిలిపోకుండా రెజ్యుమ్లు, ఇంటర్వ్యూలు, శాలరీ అంచనాలు, కోచ్, రిక్రూట్మెంట్ వంటివన్నీ ఏఐతోనే పూర్తిచేసే ప్లాట్ఫామ్గా నౌఖ్రీ మారుతుందని అంచనా వేస్తోంది. ఈ కంపెనీ తన ‘99ఏకర్స్’ పోర్టల్లో కూడా ప్రాపర్టీ సెర్చ్లో ఏఐ హోమ్ అడ్వయిజర్ను ప్రవేశపెట్టింది. ఇది రుణాలు, రిజిస్ట్రేషన్, ఇంటీరియర్, సొసైటీ మేనేజిమెంట్లో సహకరిస్తుంది. కాకపోతే నౌఖ్రీ కాస్త వేగంగా మారాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. ఆరమ్ ప్రాప్టెక్2020 వరకూ రివ్వుమంటూ ఎగసిన ఈ కంపెనీ షేరు కోవిడ్తో కుదేలయిపోయింది. మళ్లీ మెల్లగా కోలుకున్న కంపెనీ... ఇపుడు రియల్టీలో పూర్తిస్థాయి ఎకోసిస్టమ్పై దృష్టిపెట్టింది. నెస్ట్ ఎవే, హౌసింగ్, హలో వరల్డ్ వంటివన్నీ దీని చేతుల్లో ఉండటంతో... ఇళ్ల ధర, ఇన్వెంటరీ, బ్రోకర్లు, అద్దెలు, కో–లివింగ్, తనఖాలు, నిర్మాణ వ్యవస్థ డేటా ఈ కంపెనీ చేతుల్లో ఉంది. వీటి సాయంతో దేశంలో తొలి పూర్తిస్థాయి నేటివ్ రియల్ ఎస్టేట్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ ప్రయత్నాలు కనక ఫలిస్తే... ఇదో ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్గా మారుతుంది. ఉదాహరణకు ఓ ఇంటికోసం హౌసింగ్ యాప్ తెరిస్తే... మీ బడ్జెట్, వాస్తు, స్కూల్కి– ఆసుపత్రికి దూరం, సౌకర్యాలు, బిల్డర్ చరిత్ర, ఎంత లోన్ వస్తుంది, బేరమాడితే ధర ఎంత తగ్గొచ్చు, రిజిస్ట్రేషన్ వివరాలు వంటివన్నీ కనిపించాయనుకోండి. అపుడిక సాధారణ ప్రాపర్టీ పోర్టల్స్కు ఎవరైనా ఎందుకు వెళతారు? అదే జరిగితే ఈ సంస్థ దేశీ ‘జిల్లో’గా మారినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదుగా!!.ఇండియా మార్ట్ఈ కంపెనీ బలం... పాతికేళ్లుగా ఇది సేకరించిన డేటాయే. నెలకు 9 కోట్ల మంది సందర్శించే ఈ వెబ్సైట్లో 2.2 లక్షల మంది సప్లయర్లున్నారు. కోట్లకొద్దీ ఎంక్వయిరీలు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితే భారీ బీ2బీ డేటా దీని సొంతం. ఏఐ యుగంలో దీని విలువ అమూల్యం. ఒక పంప్కోసం ఇండియా మార్ట్లో వెదికే బదులు ఏఐని నేరుగా అడిగితే సరైన సమాధానం రావచ్చు. కానీ అది కరెక్టో కాదో తెలియదు. అందుకే ఇండియా మార్ట్ సంస్థ వినియోగదారుల నమ్మకమే లక్ష్యంగా ఏఐపై భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. తద్వారా నకిలీ లిస్టింగ్లు, మోసపూరిత విక్రయదార్లను కనిపెడుతోంది. ఆటోమేటిక్ వాయిస్– టు–టెక్ట్స్ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదార్ల అవసరాలు అర్థం చేసుకుని సప్లయర్స్ను వెతికి, చర్చలు జరిపి ఆర్డర్ పెట్టే మొత్తం ప్రక్రియ ఏఐ పూర్తి చేస్తుంది. ఇది పూర్తిగా విజయవంతమైతే ఇండియా మార్ట్... ఏఐ కొనుగోళ్లకు వీలు కల్పించే ఇన్ఫ్రా సంస్థగా మారొచ్చు. జస్ట్ డయల్లోకల్ సెర్చ్కు అడ్రస్గా నిలిచిన జస్ట్ డయల్కు అర్బన్కంపెనీ వంటి సంస్థలతో మొదటి ముప్పు ఎదురైంది. ఇపుడు ఏఐతో. ఎందుకంటే స్థానిక వ్యాపారాల వివరాలు, ఫోన్ నంబర్లు, చిరునామాల వంటి సాధారణ సమాచారాన్ని ఏఐ ఏజెంట్లూ అందిస్తున్నాయి. కాకపోతే జస్ట్ డయల్కు భారీ స్థాయిలో స్థానిక వ్యాపారాల డేటాబేస్ ఉంది. వెరిఫై చేసిన లక్షలకొద్దీ వ్యాపారాల వివరాలు, వినియోగదారుల రేటింగ్లు, రివ్యూలు దీని సొంతం. ఈ సమాచారాన్ని ఏఐతో అనుసంధానించి, వినియోగదార్ల అవసరాలకు సరిపోయేలా సంస్థలను ఎంపిక చేసి, అపాయింట్మెంట్లు బుక్ చేసి, నేరుగా సేవలందించే ప్లాట్ఫామ్గా మారితేనే భవిష్యత్తు బాగుంటుందని చెప్పాలి. కాబట్టి ఏఐని ఉపయోగించి ఈ సెర్చ్ కంపెనీ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్గా ఎదుగుతుందా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశం. కార్ట్రేడ్సెకండ్ హ్యాండ్ కార్ల క్రయవిక్రయాల్లో కార్ట్రేడ్కు గతంతో పోలిస్తే పోటీ పెరిగింది. కార్ల తయారీ కంపెనీలు ‘సర్టిఫైడ్ యూజ్డ్ కార్ల’ విభాగాలను సొంతగా ఆరంభించగా.. స్పిన్నీ, డ్రూమ్, కార్స్24 వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ఆఫ్లైన్లో లోకల్ డీలర్లు వేగంగా విస్తరిస్తున్నారు. శ్రీరామ ఆటోమాల్, కార్వాలే, బైక్వాలే, వాహనాల వేలం వంటి ఇతర వ్యాపారాలున్న కార్ట్రేడ్... కేవలం లిస్టింగ్లకే పరిమితం కాకుండా ధరల విశ్లేషణ, వాహన చరిత్ర, తనిఖీ రిపోర్ట్లు, రుణాలు, బీమా, ఓనర్షిప్ బదిలీ వంటివన్నీ ఏఐ ద్వారా చేసే ప్లాట్ఫామ్గా మారితే తన ప్రత్యేకతను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈజీ ట్రిప్ఆన్లైన్ ట్రావెల్లో పోటీ అంతాఇంతా కాదు. కష్టమర్లను ఆకట్టుకోవటానికి ప్రత్యేక ఆఫర్లిస్తూ ఉండటంతో ఈ సంస్థలకు లాభాలు తక్కువే ఉంటున్నాయి. పైపెచ్చు ఏఐ వచ్చాక ట్రావెల్ ప్రణాళికలను ఏఐ ఏజెంట్లే సిద్ధం చేస్తున్నాయి. ‘రూ.లక్ష లోపులో నాలుగు రోజులు బాలి వెళ్లి రావాలి. సాధ్యమేనా?’ అని చాట్జీపీటీని అడిగితే పూర్తి ప్లాన్ను ఇస్తుంది. దానిప్రకారం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో టికెట్లు బుక్ చేసుకుంటే చాలు. అలా బుకింగ్ చేసుకోవటానికి వీటిని అశ్రయించినపుడు వీటికి వచ్చే లాభాలు తక్కువ. మొత్తం ప్లాన్ను ఈ ఆన్లైన్ సంస్థలే ఇచ్చి, దానిప్రకారం బుక్ చేసినపుడు ఉండే లాభాలు... కేవలం టికెట్లు బుక్చేయటం వల్ల రావు. కాబట్టి భవిష్యత్తులో ఏఐని అనుసంధానించి ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్యాకేజీలు రూపొందించి... ఈ డైనమిక్ ప్యాకేజీలతో పాటు వీసా, బీమా, లోకల్ ఎక్స్పీరియన్స్లు అందించే సంస్థలే ఆన్లైన్ ట్రావెల్ రంగంలో నిలబడతాయని చెప్పొచ్చు. ఏఐని తట్టుకోగలిగేవేంటి? కేవలం సెర్చ్తోనే మనుగడ సాగించే సంస్థలు మనగలగటం కష్టం. కానీ లావాదేవీలు అవసరమయ్యే మార్కెట్ప్లేస్లు దృఢంగా ఉంటాయి. ట్రస్ట్, ధ్రువీకరణ, పేమెంట్, సపోర్ట్ వంటి అంశాల్లో ఏఐ వీటికి సహకరిస్తుంది. ఏఐతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవటం ద్వారా కూడా ఇలా సొంత డేటా ఉన్న కంపెనీలకు రెవెన్యూ రావచ్చు. ఉదాహరణకు ‘రెడిట్’ తన డేటాను ఏఐ కంపెనీలకు వాడుకునేందుకు లైసెన్స్ ఇచ్చింది. వార్తా సంస్థలు ఏఐతో లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డేటా అందించే సంస్థలు చిరకాలంగా తమ ఏపీఐని యాక్సెస్ చేసుకున్నందుకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఏఐ రాకతో వీటి ఫీడ్కు విలువ పెరిగింది. ఇండియా మార్ట్, పీబీ ఫిన్టెక్, ఇన్ఫో ఎడ్జ్ వంటి ఇంటర్నెట్ ఎకానమీకి చెందిన కంపెనీల షేర్లు కొనేముందు ఇన్వెస్టర్లు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి... → ఈ కంపెనీకి ప్రత్యేకమైన డేటా ఏమైనా ఉందా? దాన్ని వేరేవాళ్లు తేలిగ్గా క్రియేట్ చేయగలరా? → ఈ డేటా నిరంతరం అప్డేట్ అవుతోందా? లేక ఒకసారి సేకరిస్తే ఇక మారకుండా అలానే ఉండిపోతుందా? → ఏఐ ఈ డేటా యాక్సెస్ చేసుకోవాలంటే ఈ కంపెనీ అనుమతి తప్పనిసరిగా ఉండాలా? లేక ఏఐ కంపెనీలు ఈ డేటాను సొంతగా క్రియేట్ చేసుకోగలవా? → ఈ డేటాను ఆదాయవనరుగా మార్చుకోవటానికి కంపెనీ ఏపీఐలు, సబ్్రస్కిప్షన్లు, రిఫరల్స్, ఎంటర్ప్రైజ్ సర్వీసుల వంటివాటిపై దృష్టిపెడుతోందా లేదా? అని చూడాలి. ఏఐ యుగంలో ఎక్కువ ట్రాఫిక్ను ఆకర్షించే కంపెనీలన్నీ విజేతలు కాకపోవచ్చు. డేటా.. కస్టమర్ల నమ్మకం... లావాదేవీలు భారీగా ఉన్న కంపెనీలే బావుంటాయి. అవే భవిష్యత్ దిగ్గజాలవుతాయి. అందుకే ఇంటర్నెట్ కంపెనీల విలువను ఇకపై సందర్శకుల సంఖ్యతో కాకుండా వాటి డేటా, ఏఐ సామర్థ్యం, లావాదేవీల లోతుతో కొలవాల్సి ఉంటుంది.భవిష్యత్ విజేతలెవరు...?వచ్చే పదేళ్లలో ఇంటర్నెట్ కంపెనీలు రెండు రకాలుగా విడిపోవచ్చు. వాటిలో ఒకటి ట్రాఫిక్పైనే ఆధారపడే పోర్టల్స్ అయితే రెండోవి ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు. పాలసీ బజార్ ఫిన్టెక్, ఆరమ్ ప్రాప్టెక్, ఇండియా మార్ట్ వంటి కంపెనీలకు భారీగా సొంత డేటా ఉంది. దాంతో పాటు లావాదేవీలు, కస్టమర్లతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏఐ ఆధారిత ఇన్ఫ్రా సంస్థలుగా మారటం వల్ల వీటి పనితీరు మరింత సమర్థంగా మారే అవకాశం ఉంటుంది. సొంత డేటా ఉన్న కంపెనీలు మున్ముందు ఊహించని విధంగా రూపాంతరం చెందొచ్చు. ఉదాహరణకు ఇండియా మార్ట్నే తీసుకుంటే అది కేవలం కంపెనీల జాబితా అందించే డైరెక్టరీ కాదు. పాతికేళ్లుగా... లక్షలకొద్దీ సిసలైన సప్లయర్ల వివరాలు సేకరించింది. ప్రొడక్ట్ కేటలాగ్లు, ధరల తీరు, కొటేషన్లకు అడిగే అభ్యర్థనలు, రెస్పాన్స్ రేటింగ్లు, లావాదేవీల ప్యాటర్న్లు, సప్లయర్ రేటింగ్లు, ప్రతి పరిశ్రమకూ సంబంధించిన టర్మినాలజీ... ఫొటోలు.. వస్తువుల స్పెసిఫికేషన్లు, కాంటాక్ట్లు ఇవన్నీ భారీ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ ఆ కంపెనీకే ప్రత్యేకం. వీటిని మరొకరు మళ్లీ క్రియేట్ చేయాలంటే అంత తేలికకాదు. పబ్లిక్ వెబ్పేజ్లలో ఉండే సమాచారం వరకూ జెమినై, చాట్జీపీటీ వంటివి యాక్సెస్ చేసుకుని మనకు సమాధానమిస్తాయి. కానీ ప్రయివేటు డేటా కావాలంటే మాత్రం ఇండియా మార్ట్ సంస్థ తన ‘ఏపీఐ’ ద్వారానో, అగ్రిమెంట్ ద్వారానో వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఇండియామార్ట్ సంస్థ ఫీజు వసూలు చేసే అవకాశాలూ ఉంటాయి. -రమణమూర్తి మంథా -
వర్క్ ఫ్రమ్ హోమ్కు గుడ్బై.. ఉద్యోగి ముందు కొత్త సవాల్!
కరోనా తర్వాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో సంస్థలన్నీ కూడా ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు పిలుస్తున్నాయి. ముందు పూర్తిగా ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చిన ఓ కంపెనీ, ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేయడంతో ఓ ఉద్యోగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగికి ఐదేళ్ల అనుభవం ఉంది. ఏడాదికి పైగా ఒక కంపెనీలో పనిచేస్తున్న అతను, ప్రారంభంలో రిమోట్ ఉద్యోగం కావడంతో చేరాడు. కానీ ఆ కంపెనీ తాజాగా వర్క్ పాలసీ మార్చి, వారానికి రెండు రోజులు ఆఫీస్కు రావాలని చెప్పింది.కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఉద్యోగికి సమస్యగా మారింది. ఆఫీస్కు వెళ్లి రావడానికి రోజుకు దాదాపు 115 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని అతను తెలిపాడు. వారానికి రెండు రోజులు మాత్రమే అయినప్పటికీ.. ఈ ప్రయాణం వల్ల సమయం, శ్రమ రెండూ ఎక్కువగా ఖర్చవుతున్నాయని చెప్పాడు. దీనికి తోడు కంపెనీలో జీతాల పెంపు ప్రక్రియ ఎలా ఉంటుందో?, కూడా స్పష్టత లేదని పేర్కొన్నాడు.వర్క్ పాలసీలో మార్పు, కెరీర్ ఎదుగుదలపై అనిశ్చితి కారణంగా అతను కొత్త ఉద్యోగ అవకాశాలను వెతకడం ప్రారంభించాడు. మరో పూర్తిగా రిమోట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ప్రస్తుత ఉద్యోగం ఎందుకు వదిలేయాలనుకుంటున్నానో?.. ఎలా చెప్పాలి అని నెటిజన్లను అడిగాడు.2 days of commuting, 115 km/day. Is this a valid reason for job change?by u/whoisthisonred in IndianWorkplaceఇంటర్వ్యూలో.. సాధారణంగా అడిగే ప్రశ్న ''మీరు కొత్త ఉద్యోగం ఎందుకు వెతుకుతున్నారు?''. ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అనే విషయంలో సందేహం వచ్చింది. కేవలం ఎక్కువ దూరం ప్రయాణం కారణంగా.. ఉద్యోగం మారుతున్నట్లు చెప్పడం సరైనదేనా అని అడిగాడు.తర్వాత జరిగిన ఇంటర్వ్యూ గురించి కూడా అతను తన రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించాడు. ప్రస్తుత కంపెనీలో లేఆఫ్స్ జరుగుతున్నాయని, అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీస్ తన ఇంటి నుంచి చాలా దూరంలో ఉందని చెప్పాడు. రిమోట్ ఉద్యోగాలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగినప్పుడు, తనకు కేవలం ఇంటి నుంచి పని చేయడం మాత్రమే లక్ష్యం కాదని, రోజువారీ ప్రయాణం సులభంగా ఉండే మంచి పని వాతావరణం కావాలని స్పష్టం చేశాడు.ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొంతమంది ఉద్యోగి ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించడం చాలామంది ఉద్యోగులకు సాధారణ సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు రిమోట్ ఉద్యోగం దొరికినా, భవిష్యత్తులో ఆ కంపెనీ కూడా హైబ్రిడ్ విధానాన్ని తీసుకురాదనే గ్యారంటీ లేదని చెప్పారు. అందుకే కొత్త కంపెనీలో చేరే ముందు వర్క్ పాలసీపై పూర్తి స్పష్టత తీసుకోవాలని సూచించారు. -
అపోలో హాస్పిటల్స్కు ‘ఫ్యామిలీ బిజినెస్’ అవార్డు
ముంబై: ది ఎకనమిక్ టైమ్స్ ఫ్యామిలీ బిజినెస్ అవార్డ్స్–2026లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ‘ఫ్యామిలీ బిజినెస్ ఆఫ్ ది ఇయర్–మెగా’పురస్కారాన్ని అందుకుంది. భారతదేశంలోని అతిపెద్ద కుటుంబ ఆధారిత సంస్థల్లో వృద్ధి, సుస్థిర కార్పొరేట్ పాలన, తరతరాల వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగించడం వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు లభించింది.ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ ‘ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకురావడం నా కల. నా కుమార్తెలు ఆ కలను తమ కలగా స్వీకరించి, నేడు అపోలో హాస్పిటల్స్లా రూపుదిద్దుకున్న ఈ సంస్థను నిర్మించేందుకు తమ జీవితాలను అంకితం చేశారు’’అని పేర్కొన్నారు. ప్రస్తుతం అపోలోను ప్రీతిరెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్), సంగీతారెడ్డి (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్), సునీతారెడ్డి (మేనేజింగ్ డైరెక్టర్), శోభనా కామినేని (ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్) సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. -
EPFOకు రూ.1,816 కోట్ల నష్టం.. అనిల్ అంబానీపై కేసు
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్సీఎల్) మాజీ చైర్మన్ అనిల్ అంబానీ, సంస్థకు చెందిన ఇతర వ్యక్తులు, గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు సుమారు రూ.1,816 కోట్ల నష్టం వాటిల్లేలా మోసపూరిత లావాదేవీలు, నిధుల మళ్లింపు జరిగాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ కేసులో సుమారు రూ.1,007 కోట్ల మూలధనం, రూ.808.67 కోట్ల వడ్డీ మొత్తాలు సమస్యలో ఉన్నట్లు పేర్కొన్నారు.రూ.2,500 కోట్లను పెట్టుబడి పెట్టిన ఈపీఎఫ్ఓఫిర్యాదు ప్రకారం.. రిలయన్స్ క్యాపిటల్ 2013, 2014 సంవత్సరాల్లో సెక్యూర్డ్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీలు) జారీ చేసింది. వీటిలో ఈపీఎఫ్ఓ తన నిధుల నుంచి మొత్తం రూ.2,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడులను నాలుగు పోర్ట్ఫోలియో మేనేజర్ల ద్వారా నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎన్సీడీల్లో కొన్నింటి మెచ్యూరిటీ 2023, 2024లో ఉండగా, రిలయన్స్ క్యాపిటల్ తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైంది. ఫలితంగా ఈపీఎఫ్ఓకు భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి.నిధుల మళ్లింపుపై ఆరోపణలురిలయన్స్ క్యాపిటల్ నుంచి నిధులు ఇతర లావాదేవీలకు మళ్లించేందుకు మోసపూరిత మార్గాలను ఉపయోగించారని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ లావాదేవీలే ఎన్సీడీలను తిరిగి చెల్లించడంలో సంస్థ డిఫాల్ట్కు దారితీశాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు సహా ఎవరెవరి పాత్ర ఉందో గుర్తించడం, నిధులను ఏ విధంగా ఉపయోగించారో తేల్చడం, పెట్టుబడి మొత్తాల తుది వినియోగాన్ని నిర్ధారించడం తమ దర్యాప్తులో ప్రధాన అంశాలని సీబీఐ వెల్లడించింది.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే.. -
‘ఈ20 పెట్రోల్’ విధానంతో లాభమే..
న్యూఢిల్లీ: ఈ20 పెట్రోల్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. అమెరికా–ఇరాన్ యుద్ధ సమయంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు భారతీయ వినియోగదారులను ధరల భారం నుంచి రక్షించడంలో ఈ20 పెట్రోల్ విధానం కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.పశ్చిమాసియాలో సంక్షోభం త్రీవస్థాయిలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు 135 డాలర్లకు(సుమారు రూ.13,000) పెరిగాయని గుర్తుచేసింది. ఆ సమయంలో భారత్లో పెట్రోల్ ధర లీటర్కు రూ.125కు చేరి ఉండేదని వెల్లడించింది. కానీ, మన ప్రభుత్వం భారీగా ధర పెంచలేదని తెలియజేసింది. సంక్షోభ సమయంలో వినియోగదారులకు లీటర్కు రూ.30 వరకు ఆదా ఆయినట్లు పేర్కొంది. 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఢిల్లీలోని వినియోగదారులు లీటర్కు రూ.94.77 చొప్పున చెల్లిస్తున్నారని వివరించింది. దీనివల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం మన వినియోగదారులపై పడడం లేదని తేల్చిచెప్పింది.80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ను కలిపి విక్రయించడమే ఈ20 విధానం. దీన్ని ప్రతిపక్షాలు, వినియోగదారుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజీ తగ్గడమే కాకుండా నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయని కొందరు వాహనాల యజమానులు చెబుతున్నారు. అయితే, అందులో నిజం లేదని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ఈ20 వల్ల మైలేజీ కొంత తగ్గినప్పటికీ, దానివల్ల కలిగే ప్రయోజనాలు అధికంగా ఉంటాయని వాదిస్తోంది. -
వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా?
వందే భారత్ రైళ్లు భారతదేశం అంతటా విస్తరిస్తున్న తరుణంలో.. వీటిని నడిపే వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. వందే భారత్ లోకో పైలట్లను ఎలా నియమిస్తారు?, ఎలాంటి అర్హతలు కావలి?, జీతం ఎంత? అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వందే భారత్ ట్రైన్స్ కోసం.. భారతీయ రైల్వే లోకో పైలట్లను నేరుగా నియమించదు. అభ్యర్థులు ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ (ALP)గా చేరి, కొన్ని సంవత్సరాల అనుభవం సంపాదించాలి. ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ పొందిన తర్వాతే వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తారు.అర్హతలుఅసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి కనీసం పదో తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి. అంతేకాకుండా.. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. వయస్సు సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రైల్వే నిర్దేశించిన వైద్య పరీక్షలు, ముఖ్యంగా కంటి చూపు పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి.జీతంఉద్యోగంలో చేరిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్కు ప్రాథమిక వేతనం రూ.19,900 ఉంటుంది. అలవెన్సులతో కలిపి, వారి నెలసరి చేతికి అందే జీతం సాధారణంగా రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉంటుంది. అనుభవం పెరిగి వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లను నడిపే స్థాయికి చేరుకున్న తర్వాత నెలకు రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం సీనియారిటీ, పని గంటలు, రన్నింగ్ అలవెన్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.జీతంతో పాటు లోకో పైలట్లకు అనేక సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఇందులో డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, రన్నింగ్ అలవెన్స్, నైట్ డ్యూటీ అలవెన్స్, ఉచిత వైద్య సేవలు, పెన్షన్, రైల్వే ప్రయాణ రాయితీలు, పెయిడ్ లీవ్స్, ఉద్యోగ భద్రత, పదోన్నతి అవకాశాలు వంటి ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి.ఇదీ చదవండి: వీసా కోసం రూ.19 లక్షల బాండ్.. జాబితాలో 50 దేశాలు! -
యాపిల్ యాప్ స్టోర్ ఇండియా హెడ్పై కేసు
సాక్షి, హైదరాబాద్: ట్రేడింగ్ స్కామ్లో రూ. 12.7 లక్షలు కోల్పోయిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు యాపిల్ యాప్ స్టోర్స్ ఇండియా హెడ్ను నిందితుడిగా చేర్చారు. సోమాజీగూడకు చెందిన బాధితుడు ఇన్స్ట్రాగామ్ ద్వారా జే–బారా మొబైల్ ట్రేడింగ్ యాప్ ప్రకటనకు ఆకర్షితుడై యాప్ ప్రతినిధిగా చెప్పుకున్న సోనల్ జగన్నాథ్ నాయక్ను ఫోన్లో సంప్రదించాడు. యాప్ స్టోర్కు సంబంధించిన ఓ లింకును వాట్సాప్ ద్వారా పంపిన నాయక్.. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలని బాధితుడికి సూచించాడు.అలాగే జూలియస్ బేర్ దలాల్ వ్యూ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులోనూ బాధితుడిని చేర్చాడు. దాని అడ్మిన్గా ఉన్న కునాల్ సుమయ అనే మహిళ బాధితుడికి పెట్టుబడులపై సలహాలు ఇచ్చింది. దీంతో బాధితుడు దశలవారీగా మొత్తం రూ. 12.7 లక్షలు పెట్టుబడి పెట్టగా యాప్లో ఆయన పెట్టుబడి విలువ రూ. 25.42 లక్షలకు పెరిగినట్లు చూపింది. కానీ పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోలేదంటూ ఆ ట్రేడింగ్ ఖాతాను నిందితులు బ్లాక్ చేశారు. ఆ తర్వాత కునాల్ సుమయ సహాయకురాలినని చెప్పుకున్న సోనాల్ జగన్నాథ్ నాయక్ అనే వ్యక్తి.. తాము డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాలని డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు.వెంటనే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇందులో యాపిల్ ప్లే స్టోర్ పైనా ఆరోపణలు చేశారు. సదరు ట్రేడింగ్ యాప్ అందులో ఉన్నందునే తాను నమ్మానని పేర్కొన్నాడు. దీంతో యాపిల్ స్టోర్ హెడ్ను సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. మరోవైపు రూ. 29.,25 లక్షలు కోల్పోయి ఖైరతాబాద్కు చెందిన ఓ సేల్స్మన్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన మరో కేసులోనూ జగన్నాథ్ నాయక్, కునాల్ నిందితులుగా ఉన్నారు. -
భారీగా తగ్గిన వంట గ్యాస్ ధరలు..
వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్పై ఢిల్లీలో రూ.202, కోల్కతాలో రూ.209 మేర ధరను తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. ఈ కొత్త ధరలు ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.తాజా సవరణతో కోల్కతాలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,872.50కు చేరింది. ఢిల్లీలోనూ ధర గణనీయంగా తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలకు ఈ తగ్గింపు కొంత ఊరటనివ్వనుంది. గత నెల జూలై 1న కూడా చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్పీజీ ధరలను దేశవ్యాప్తంగా తగ్గించాయి.హైదరాబాద్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,985.00 కు చేరింది. అంతకుముందు జూలైలో దీని ధర రూ.3,191.00 గా ఉండేది. తాజా రేట్ల తగ్గింపు తర్వాత విజయవాడలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.2,954.50గా ఉందిచమురు మార్కెటింగ్ కంపెనీలు సాధారణంగా ప్రతి నెలా మొదటి తేదీన ఎల్పీజీ ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు, ముడిచమురు మార్కెట్ పరిస్థితులు, సరఫరా వ్యయాలు, భౌగోళిక రాజకీయ పరిణామాల ఆధారంగా తదుపరి సవరణలు ఉండే అవకాశం ఉంది. -
స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!
బడి ఈడు పిల్లల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా మహారాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాల ప్రాంగణాల్లోనూ, వాటికి 50 మీటర్ల పరిధిలోనూ జంక్ ఫుడ్ (కొవ్వులు, షుగర్, సాల్ట్ అధికంగా ఉండే పదార్థాలు) విక్రయాలు, ఉచిత పంపిణీ, ప్రకటనలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, పాఠశాలల్లో నిర్వహించే క్యాంటీన్లకు ఆహార భద్రతా లైసెన్సులను తప్పనిసరి చేసింది.వడాపావ్, సమోసాలకు స్వస్తిచిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం, ఇతర జీవనశైలి సమస్యలను అరికట్టేందుకు ఈ కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు. నూతన ఆదేశాల ప్రకారం.. మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వడాపావ్, సమోసాలతో పాటు నూనెలో వేగించిన తినుబండారాలు, చిప్స్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, చాక్లెట్లు, ఐస్క్రీమ్లను పాఠశాలల్లో లేదా వాటి సమీపంలో విక్రయించకూడదు. స్టేట్ బోర్డ్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి బోర్డులతో సంబంధం లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. దీనివల్ల దాదాపు రెండు కోట్లకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.క్యాంటీన్లకు లైసెన్స్ నిర్బంధంఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే వెల్లడించిన వివరాల ప్రకారం.. బడులలో క్యాంటీన్లు నడిపే వెండర్లు తప్పనిసరిగా ఎఫ్డీఏ నుంచి అధికారిక లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. పాఠశాల యాజమాన్యాలే స్వయంగా క్యాంటీన్ నడిపినా లైసెన్స్ తీసుకోవడం విధిగా మారింది. చిన్నారుల నుంచి 17 ఏళ్ల టీనేజర్ల వరకు అందరికీ పోషకాహారంతో కూడిన సురక్షిత ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.అమలులో అలసత్వం వహిస్తే చర్యలుఈ నిబంధనల అమలు బాధ్యతను హెచ్ఎంలు, పాఠశాల యాజమాన్యాలకే అప్పగించారు. నిబంధనల ఉల్లంఘనలను పసిగట్టేందుకు ఎఫ్డీఏ ఇన్స్పెక్టర్లు ఏడాదికి కనీసం రెండుసార్లు ప్రతి పాఠశాలను తనిఖీ చేస్తారని, నిబంధనలు దాటితే కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ హెచ్చరించారు. అదే సమయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు జిల్లా, తాలూకా స్థాయిల్లో వర్క్షాప్లు నిర్వహిస్తామన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ శాఖల్లో ప్రత్యేక యంత్రాల ఏర్పాటు -
వేదాంత, టాటా స్టీల్ లాభాల జోరు..
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ మెరుగైన ఫలితాలతో ఆకట్టుకుంది. అమ్మకాల జోరు, ప్రపంచవ్యాప్తంగా మెటల్స్ ధరలు ఎగబాకుతుండటం, రూపాయి మారకం విలువ క్షీణత దన్నుతో కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27, క్యూ1)లో రూ. 5,473 కోట్ల కన్నాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది.గతేడాది ఇదే కాలంలో రూ. 3,185 కోట్లతో పోలిస్తే లాభం 72 శాతం దూసుకెళ్లింది. అలాగే ఆదాయం సైతం 53.6 శాతం ఎగసి రూ. 15,754 కోట్ల నుంచి రూ. 24,205 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరాన్ని పటిష్టమైన ఫలితాలతో ప్రారంభించామని, వేదాంతా నుంచి విభజించిన (డీమెర్జర్) వ్యాపార విభాగాలన్నీ బలమైన పనితీరును కనబరుస్తున్నట్లు కంపెనీ ఈడీ అరుణ్ మిశ్రా చెప్పారు.టాటా స్టీల్ లాభం 19 శాతం అప్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టాటా స్టీల్ నికర లాభం 19 శాతం ఎగిసి రూ. 2,385 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 2,007 కోట్లుగా నమోదైంది. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 53,467 కోట్ల నుంచి రూ. 61,027 కోట్లకు చేరింది. ఎన్ఐఎన్ఎల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వార్షికంగా 4.8 మిలియన్ టన్నుల మేర పెంచుకునే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం సుమారు రూ. 33,873 కోట్లు వెచ్చించనుంది.దీనితో తమ బ్రాండెడ్ ఉత్పత్తులకు అత్యధిక డిమాండ్ ఉన్న రిటైల్ విభాగంలో లాంగ్ ప్రోడక్ట్స్ పోర్ట్ఫోలియోను విస్తరించేందుకు కంపెనీకి వీలవుతుంది. ప్రస్తుతం టాటా స్టీల్లో ఎన్ఐఎన్ఎల్ విలీన ప్రక్రియ జరుగుతోంది. 2022 జూలై 4న ఒరిస్సాలోని నీలాచల్ ఇస్పాత్ నిగమ్ను (ఎన్ఐఎన్ఎల్) తమ అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ (టీఎస్ఎల్పీ) ద్వారా రూ. 12,100 కోట్లకు టాటా స్టీల్ కొనుగోలు చేసింది. -
తొలి రిజర్వ్ కాఫీహౌస్ హైదరాబాద్లో ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో ఏటా సుమారు 50–100 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు టాటా స్టార్బక్స్ సీఈవో సుశాంత్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 80 పైచిలుకు నగరాల్లో 500 పైగా స్టోర్స్ ఉన్నట్లు ఆయన వివరించారు. పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న వినియోగదారుల అల వాట్లు మొదలైన అంశాలు దేశీయంగా కాఫీ వినియోగం పెరగడానికి తోడ్పడనున్నాయని సుశాంత్ పేర్కొన్నారు.మెట్రో నగరాలు, వ్యాపార వృద్ధికి అధిక అవకాశాలు ఉన్న పట్టణాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్లో ప్రీమియం శ్రేణికి చెందిన ’రిజర్వ్’ కాఫీహౌస్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది ఆరో రిజర్వ్ కాఫీహౌస్ కాగా, దక్షిణాదిలో మొట్టమొదటిదని సుశాంత్ వివరించారు. ఇది ఆగస్టు 1 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా నగరాల్లో ఇవి ఉన్నాయి.టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఇటీవలి క్యూ1 నివేదిక ప్రకారం టాటా స్టార్బక్స్ ఆదాయం 11 శాతం వృద్ధి చెందిందని సుశాంత్ చెప్పారు. కంపెనీలో దేశీయంగా దాదాపు 4,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు వివరించారు. టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, స్టార్బక్స్ కాఫీ కంపెనీకి చెరి సగం వాటాలతో జాయింట్ వెంచర్ సంస్థగా టాటా స్టార్బక్స్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి సమర్థించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగిన సమయంలో ఇథనాల్ కలపకపోయి ఉంటే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.125కు చేరే అవకాశం ఉండేదని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్ను ముందుగా నిర్ణయించిన ధరలకు దేశీయంగా కొనుగోలు చేయడం వల్ల అంతర్జాతీయ ముడిచమురు ధరల ప్రభావం కొంతమేర తగ్గిందని తెలిపింది.ఎఫ్సీఐ బియ్యంపై ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిఇథనాల్ తయారీ కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) బియ్యాన్ని తక్కువ ధరకు డిస్టిలరీలకు విక్రయించడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతోందన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఆహార భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS), జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), సంక్షేమ పథకాలు, తప్పనిసరి బఫర్ నిల్వల అవసరాలు పూర్తయిన తర్వాత మాత్రమే మిగులు ధాన్యాన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తామని తెలిపింది.ఎఫ్సీఐ నుంచి ఇథనాల్ తయారీకి ఉపయోగిస్తున్నది ఆహార భద్రతకు అవసరమైన బియ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. ఆహార, ప్రజా పంపిణీ శాఖ గుర్తించిన మిగులు నిల్వలు, దెబ్బతిన్న ధాన్యం, మానవ వినియోగానికి పనికిరాని విరిగిన బియ్యం వంటి వాటినే వినియోగిస్తున్నట్లు వివరించింది.బియ్యానికి ప్రత్యేక రాయితీ లేదుఇథనాల్ తయారీదారులకు ఎఫ్సీఐ బియ్యాన్ని ప్రత్యేకంగా తక్కువ ధరకు అందిస్తున్నారన్న వాదనను కూడా మంత్రిత్వ శాఖ ఖండించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల వ్యవస్థలో ఇథనాల్ ఉత్పత్తికి అనుమతించిన పలు ఫీడ్స్టాక్స్లో ఎఫ్సీఐ బియ్యం కూడా ఒకటేనని పేర్కొంది.2025-26 ఇథనాల్ సరఫరా సంవత్సరానికి వివిధ ముడి పదార్థాల నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్కు కేంద్రం నిర్ణయించిన కొనుగోలు ధరల్లో మొక్కజొన్నకు లీటరుకు రూ.71.86, చెరకు రసం/సిరప్కు రూ.65.61, దెబ్బతిన్న ఆహార ధాన్యాలకు రూ.64, బి-హెవీ మొలాసిస్కు రూ.60.73, ఎఫ్సీఐ బియ్యానికి రూ.60.32, సి-హెవీ మొలాసిస్కు రూ.57.97గా ఉన్నాయి.2025-26లో ఇథనాల్ ఉత్పత్తిలో ఎఫ్సీఐ బియ్యం వాటా 24.64 శాతానికి చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. రెండేళ్ల క్రితం ఇది కేవలం 0.02 శాతమేనని పేర్కొంది. ఆహార భద్రత అవసరాలకు మించి దేశంలో మిగులు ధాన్య నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.20 శాతానికి చేరిన ఇథనాల్ మిశ్రమందేశంలో పెట్రోల్లో ఇథనాల్ కలిపే స్థాయి గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. 2013-14లో 1.5 శాతం కంటే తక్కువగా ఉన్న బ్లెండింగ్ 2025-26లో 20 శాతానికి చేరింది. దీంతో 2030 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని భారత్ ఐదేళ్లు ముందుగానే సాధించింది. ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం కూడా 2014లోని సుమారు 421 కోట్ల లీటర్ల నుంచి 2026 నాటికి దాదాపు 2,000 కోట్ల లీటర్లకు పెరిగింది.ఇథనాల్ మిశ్రమం ద్వారా 2014-15 నుంచి మే 2026 వరకు రూ.1.90 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసినట్లు కేంద్రం చెబుతోంది. అలాగే 310 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడిచమురు దిగుమతులకు ప్రత్యామ్నాయం లభించిందని, దాదాపు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించగలిగామని పేర్కొంది. రైతులకు అదనంగా రూ.1.60 లక్షల కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు తెలిపింది.ఇకపై 20 శాతానికి మించి పెంచుతారా?ప్రస్తుతం పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచే నిర్ణయం ఏదీ తీసుకోలేదని కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది. భవిష్యత్తులో అధిక మిశ్రమంపై నిర్ణయం తీసుకునే ముందు శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహించి, వాహన తయారీ సంస్థలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు సహా సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.అదే సమయంలో E85ను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల కోసం మాత్రమే ప్రవేశపెట్టామని, అది దేశవ్యాప్తంగా సాధారణ పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచినట్లు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఓవర్టైమ్ చేస్తున్నారా?.. యూకే కంపెనీలు ఏమంటాయో తెలుసా?
ఒకప్పుడు చాలామంది ఉద్యోగమే జీవితం అని బ్రతికేవారు. కానీ నేడు కాలం మారింది. ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. అయితే.. ఈ విధానం ప్రతి దేశంలోనూ ఒకే విధంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ముఖ్యంగా భారత్, యూకే వంటి దేశాల మధ్య ఈ విషయంలో చాలా తేడా కనిపిస్తుంది.ఇండియాలో వర్క్ లైఫ్భారతదేశంలో చాలామంది ఉద్యోగులు ఆఫీస్ టైమ్ ముగిసిన తరువాత కూడా.. రాత్రి వరకు పని చేస్తుంటారు. సెలవు రోజుల్లో కూడా ఆఫీస్ వర్క్స్ చేసేవాళ్లు ఇండియాలో కోకొల్లలు. అలాంటి వారిని అంకితభావం ఉన్న ఉద్యోగులుగా, కంపెనీ కోసం కష్టపడేవారిగా భావిస్తారు. మరోవైపు.. సమయానికి పని ముగించి ఇంటికి వెళ్లేవారిని కొన్ని సంస్థలు నిబద్ధత లేని వారిగా చూస్తాయని చెబుతారు.యూకేలో ఇలా..అయితే.. యూకే వంటి దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ వర్క్ పూరవ్వగానే లేదా ఆఫీస్ టైమ్ ముగిశాక పనిచేయడానికి ఆసక్తి చూపించరు. కంపెనీలు కూడా ఎక్కువసేపు పనిచేయాలని ఒత్తిడి చేయవు. ఉద్యోగులు తమ కుటుంబానికి, ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించాలని సంస్థలు ప్రోత్సహిస్తాయి. వర్క్ టైమ్ ముగిశాక ఈమెయిల్స్ లేదా మెసేజ్లకు వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని భావిస్తారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుభవంఈ విషయాన్ని ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓమ్ తన అనుభవం ద్వారా వివరించాడు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి అతను రాత్రి 7 గంటల తర్వాత కూడా తన తన సహోద్యోగి పంపిన కామెంట్లకు సమాధానం ఇచ్చాడు. ఆఫీసు సమయం దాటిన తరువాత పనిచేయడాన్ని అలవాటుగా చేసుకోవద్దని, వృత్తిపరమైన.. వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటించాలని సహోద్యోగి సలహా ఇచ్చినట్లు చెప్పాడు.I work with a senior developer from England.Because of the time difference, whenever he reviewed my PR and left comments, I'd reply immediately.Even if it was 9 or 10 PM in India.One day he noticed and asked me, .."Wait.. are you working beyond your work hours?"I said,…— Om (@Om_Codes_) July 30, 2026నెటిజన్ల స్పందనఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు విదేశీ కంపెనీలు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవిస్తాయని ప్రశంసించగా, మరికొందరు ప్రతి కంపెనీ లేదా ప్రతి దేశాన్ని ఒకేలా చూడకూడదని అభిప్రాయపడ్డారు.కష్టపడి పని చేయడం ఎంత అవసరమో, అదే విధంగా ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యమైనవని ఈ సంఘటన చెబుతోంది. పని కోసం జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయడం కంటే.. పని - వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం ఉద్యోగిలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, పనిలో మెరుగైన ఫలితాలను తీసుకువస్తుంది. అందుకే ప్రతి ఉద్యోగి పని పట్ల బాధ్యతతో పాటు తన వ్యక్తిగత జీవితానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
రూ.10లకే కడుపునిండా భోజనం
మెట్రో నగరాల్లో ఒక్కపూట సాధారణ భోజనానికి కనీసం రూ.50-రూ.100 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, కేవలం రూ.10లకే పౌష్టికాహారాన్ని అందిస్తూ ఓ సంస్థ తన ఉద్యోగుల పట్ల చూపుతున్న ఆదరణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్గా మారింది. ఆనంద్ కుమార్ (@thenameisanand01) అనే సెక్యూరిటీ గార్డ్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఓ వీడియో కార్పొరేట్ సంక్షేమంపై విస్తృత చర్చకు దారితీసింది.నామమాత్రపు రుసుముతో ఆహారంవైరల్ అవుతున్న ఆ వీడియోలో ఆనంద్ కుమార్ తన కంపెనీ క్యాంటీన్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని చూపించారు. ఆ థాలీలో వేడివేడి అన్నం, పప్పు, సోయాబీన్ కూర, కాకరకాయ వేపుడు, అప్పడం, ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి. బయటి హోటళ్లలో ఇదే భోజనానికి రూ.50-రూ.100 వరకు అవుతుందని, కానీ తమ సంస్థ కేవలం రూ.10లకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ కార్మికులు, సెక్యూరిటీ గార్డుల వంటి తక్కువ ఆదాయ వర్గాలకు ఈ సబ్సిడీ భోజనం వల్ల నెలకు రూ.2,000-రూ.3,000 వరకు ఆదా అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Anand Kumar (@thenameisanand01)నెటిజన్ల ప్రశంసలుఈ వీడియో లక్షలాది వీక్షణలు సాధించడంతోపాటు కార్పొరేట్ వర్గాలకు ఒక ఆదర్శ నమూనాగా నిలిచింది. కనీస వేతనాలపై పనిచేసే సిబ్బందికి ఇటువంటి సదుపాయాలు కల్పించడం వల్ల వారి ఆరోగ్యం మెరుగవ్వడంతోపాటు పని పట్ల వారి బాధ్యతాయుత వైఖరి పెరుగుతుందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. కొందరు నెటిజన్లు వీడియోలో చూపించిన ప్లాస్టిక్ ప్యాకేజింగ్ స్థానంలో పర్యావరణహిత లేదా పునర్వినియోగ పాత్రలను వాడాలని సూచించినప్పటికీ సంస్థ యాజమాన్యం చూపిస్తున్న మానవీయ దృక్పథాన్ని కొనియాడారు.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
ఆఫ్షోరింగ్ తర్వాత అతిపెద్ద ఐటీ విప్లవం
భారత ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ భవిష్యత్తు కీలక మలుపు వద్ద ఉందని ప్రస్తుత ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు. ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్ను గతంలో కంటే మరింత మెరుగైన, దృఢమైన స్థానంలో నిలిపి వెళ్తున్నానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల రంగంలో రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్ ప్రపంచస్థాయిలో తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.సలీల్ పరేఖ్ నాయకత్వంలో ఇన్ఫోసిస్ కేవలం సాంప్రదాయ ఐటీ సేవలకు పరిమితం కాకుండా గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా వేగంగా రూపాంతరం చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ మందగమనం, భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇన్ఫోసిస్ బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలను దక్కించుకోవడంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ప్రధాన క్లయింట్లలో దాదాపు 90 శాతానికి పైగా సంస్థలు ఏఐ సాంకేతికత ఆధారిత పరిష్కారాలను వినియోగిస్తుండటం, పరేఖ్ చేపట్టిన వ్యూహాత్మక మార్పుల సామర్థ్యానికి అద్దం పడుతోంది.ఇంజినీరింగ్, లెగసీ మోడర్నైజేషన్, డేటా, ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవల ద్వారా సుమారు 300 బిలియన్ డాలర్ల గ్లోబల్ మార్కెట్ అవకాశాన్ని అందుకునేందుకు కంపెనీ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. 35 ఏళ్ల క్రితం ఐటీ రంగాన్ని ఊపేసిన ఆఫ్షోరింగ్ మోడల్ తర్వాత ఏఐ ప్రవేశంతో వస్తున్న ఈ ఆపరేటింగ్ మోడల్ మార్పు అతిపెద్ద సాంకేతిక విప్లవమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
హెచ్డీఎఫ్సీ టాప్ ఎగ్జిక్యూటివ్లకు రూ.1 లక్ష జరిమానా
దేశీయ ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ పాలనాపరమైన నియమ ఉల్లంఘనల కేసులో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ శశిధర్ జగదీషన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) శ్రీనివాసన్ వైద్యనాథన్, రిటైల్ అసెట్స్ గ్రూప్ హెడ్ అరవింద్ వోహ్రాలపై బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించడంతో పాటు హెచ్చరిక లేఖలు జారీ చేసింది.కేసు నేపథ్యంమహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 2017-21 మధ్యకాలంలో సేకరించిన భారీ డిపాజిట్లకు సంబంధించి సుమారు రూ.45 కోట్లను మార్కెటింగ్ వ్యయాలుగా చూపించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన స్పెషల్ డిసిప్లినరీ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. విచారణలో ఎలాంటి దురుద్దేశం గానీ, వ్యక్తిగత లాభార్జన ధోరణి గానీ లేనప్పటికీ తమ అధికారిక పరిధిని దాటి వ్యవహరించడం (Business Overreach) జరిగిందని కమిటీ గుర్తించింది.ఆర్బీఐ నిబంధనలు.. బోర్డు నిర్ణయంరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల నుంచి పాక్షికంగా పాటించనట్లు బోర్డు భావించి స్వతంత్ర కమిటీ సిఫార్సుల మేరకు ఈ చర్యలు చేపట్టింది. మిగిలిన సంబంధిత సిబ్బందికి కూడా హెచ్చరిక లేఖలు పంపినట్లు, ఈ అంతర్గత విచారణ వివరాలు, చేపట్టిన చర్యలను ఆర్బీఐకి అధికారికంగా నివేదించనున్నట్లు బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమర్పించిన సమాచారంలో తెలిపింది.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
హురున్ మహిళా లీడర్లలో ‘అపోలో’ సిస్టర్స్
న్యూఢిల్లీ: క్యాండియర్ హురున్ ఇండియా 2026 మహిళా లీడర్ల జాబితాకి సంబంధించి వెటరన్స్ విభాగంలో రూ. 1,21,000 కోట్లకు పైగా వేల్యుయేషన్ గల అపోలో హాస్పిటల్స్ గ్రూప్నకు చెందిన ప్రీతా రెడ్డి (68), సునీతా రెడ్డి (67) సంయుక్తంగా అగ్రస్థానం దక్కించుకున్నారు. వెల్త్ మలి్టప్లయర్ విభాగంలో హెచ్సీఎల్ టెక్ చైర్పర్సన్ రోష్ని నాడార్ టాప్లో నిల్చారు. మరోవైపు, రూ.5,06,600 కోట్ల విలువైన కంపెనీ హిందుస్తాన్ యూనీలివర్ సీఈవో ప్రియా నాయర్.. ప్రొఫెషనల్ సీఈవోల కేటగిరీలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఈసారి 117 మంది స్థానం దక్కించుకున్నారు. గతేడాది లిస్టులోని 97 మందితో పోలిస్తే ఇది 21 శాతం అధికం. ఈ లిస్టులో చోటు లభించిన వారి సంస్థల మొత్తం వేల్యుయేషన్ రూ.39 లక్షల కోట్ల పైమాటే. ఇది ఫిన్లాండ్ జీడీపీ కన్నా అధికం. -
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026: డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ వివరాలు
ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి కోసం అమెజాన్ ఆగస్టు 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభించనుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు, హోమ్ అప్లయెన్సెస్, కిచెన్ వస్తువులు, గ్రాసరీ వంటి ఎన్నో విభాగాల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.ఈసారి సేల్లో కస్టమర్ల కోసం టాప్ 100 డీల్స్, బ్లాక్బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, 8 పీఎం డీల్స్ వంటి ప్రత్యేక ఆఫర్లను అమెజాన్ తీసుకొస్తోంది. దీంతో పాటు.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ అందిస్తుంది. అంతే కాకుండా.. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయంతో పాటు రూ.2,000 వరకు క్యాష్బ్యాక్ రివార్డ్స్ పొందే సదుపాయం కూడా ఉంది.డిస్కౌంట్లతో పాటు కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు అమెజాన్ పలు ఆఫర్లను ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, అమెజాన్ పే రివార్డ్స్ ద్వారా కొనుగోళ్లను మరింత చౌకగా మార్చుకునే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న పిన్కోడ్లలో వేగవంతమైన డెలివరీ సదుపాయం కల్పించనున్నట్లు అమెజాన్ తెలిపింది.ఈసారి అమెజాన్ సేల్లో ఏఐ ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కస్టమర్లకు సరైన ఉత్పత్తిని కనుగొనడంలో సహాయపడేందుకు రూఫస్ ఏఐ షాపింగ్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువు గురించి సాధారణ భాషలో అడిగితే, దానికి సరిపోయే ఉత్పత్తులను రూఫస్ సూచిస్తుంది. లెన్స్ ఏఐ ద్వారా ఫొటో తీసి లేదా అప్లోడ్ చేసి నచ్చిన వస్తువులను సులభంగా వెతకవచ్చు.ఒక ఉత్పత్తి ధర ఎప్పుడు తగ్గిందో తెలుసుకునేందుకు 30 నుంచి 90 రోజుల ప్రైస్ హిస్టరీ ట్రాకర్ సదుపాయం కూడా ఉంటుంది. ధర మనకు అనుకూలంగా మారినప్పుడు కొనుగోలు చేయడానికి అలర్ట్స్ పంపుతుంది. ఒక వస్తువు కొనుగోలు చేసే ముందు రివ్యూలు చదవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. దీనిని సులభతరం చేసేందుకు ఏఐ రివ్యూ హైలైట్స్ ఫీచర్ ద్వారా ముఖ్యమైన అంశాలను సంక్షిప్తంగా చూపిస్తుంది. దీంతో కస్టమర్లు సరైన నిర్ణయం తీసుకోవడం మరింత సులభం అవుతుంది.అమెజాన్ పే ఉపయోగించే వారికి కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న ప్రైమ్ సభ్యులు 5 శాతం, ఇతర సభ్యులు 3 శాతం వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. అర్హత ఉన్న వినియోగదారులు అమెజాన్ పే లేటర్ ద్వారా రూ.60,000 వరకు క్రెడిట్ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, అప్లయెన్సెస్ వంటి ఉత్పత్తులను సులభమైన ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు. రూ.1,500 కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లను మూడు నెలల పాటు వడ్డీ లేకుండా విడతలుగా చెల్లించే సదుపాయం కూడా ఉంది. -
రైలు ఏసీ కోచ్లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా?
రైలు ప్రయాణం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అయితే మీరెప్పుడైనా ఏసీ కోచ్లో ప్రయాణించి ఉంటే.. బెడ్రోల్ కిట్లో రెండు తెల్లని బెడ్షీట్లు, ఒక దిండు కవర్, ఒక చేతి తువాలు, ఒక దుప్పటి ఇచ్చి ఉంటారు. ఒక ప్రయాణికుడికి రెండు దుప్పట్లు ఎందుకు అని అనుమానం బహుశా చాలామందికి వచ్చి ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.నిజానికి రెండు బెడ్షీట్లను చాలా మంది ప్రయాణికులు తమకు నచ్చినట్లు ఉపయోగిస్తుంటారు. కొందరు ఒకటి పరచుకుని, మరొకటి కప్పుకుంటే.. ఇంకొందరు ఒక బెడ్షీట్ను అసలు ఉపయోగించరు. కానీ.. ఈ రెండు బెడ్షీట్లను ఎందుకు ఇస్తారు? వాటిని ఎలా ఉపయోగించాలనే దానిపై.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు.ఏసీ కోచ్లో ఇచ్చే రెండు బెడ్షీట్లలో ఒకటి బెర్త్పై పరచుకోవాలి. రెండో బెడ్షీట్ను దుప్పటి కింద కప్పుకోవాలి. దీనికి ప్రధాన కారణం పరిశుభ్రత. బెడ్షీట్లు ప్రతి ప్రయాణం తర్వాత ఉతికి మళ్లీ ప్రయాణికులకు అందిస్తారు. అయితే.. ఉన్నితో తయారైన దుప్పట్లను ప్రతి ట్రిప్ తర్వాత ఉతకడం సాధ్యం కాదు. అందుకే దుప్పటి, ప్రయాణికుడి శరీరం మధ్య రక్షణ పొరలా రెండో బెడ్షీట్ను ఉపయోగించాలని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.ఏసీ ఫస్ట్ క్లాస్, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ ఎకానమీ కోచ్లలో ప్రయాణించే వారికి ఈ బెడ్రోల్ కిట్.. టికెట్ ధరలో భాగంగానే అందిస్తారు. కాబట్టి దీనికోసం మళ్లీ అదనంగా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.ప్రయాణికులకు మరింత శుభ్రమైన బెడ్రోల్ అందించేందుకు రైల్వే శాఖ ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తోంది. కొన్ని యాంత్రిక లాండ్రీల్లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్టెయిన్ డిటెక్షన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. దీని ద్వారా బెడ్షీట్లపై ఉన్న మరకలను సులభంగా గుర్తించి, మెరుగైన నాణ్యతతో ఉతికే ప్రయత్నం చేస్తోంది. -
ఆగస్టులో హాలిడేస్: ఈ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు!
భారతదేశంలోని బ్యాంకులకు జాతీయ సెలవులతో పాటు రాష్ట్రాల వారీగా స్థానిక పండుగలు, సాంస్కృతిక వేడుకలు, ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా కూడా సెలవులు ఉంటాయి. వీటికి అదనంగా ప్రతి నెల రెండో శనివారం, నాలుగో శనివారం, అన్ని ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి. అందువల్ల బ్యాంకుకు సంబంధించిన పనులు ముందుగానే ప్రణాళిక చేసుకోవడం మంచిది. ఈ కథనంలో 2026 ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్ గురించి తెలుసుకుందాం.ఆగస్టు 8: టెండోంగ్ రో రమ్ ఫాత్ - ఈ పండుగ సందర్భంగా సిక్కిం రాష్ట్రంలోని బ్యాంకులు మూసివేయబడతాయి. ఇది సిక్కిం ప్రజలకు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన పండుగ.ఆగస్టు 13: పేట్రియాట్ డే - మణిపూర్ రాష్ట్రంలో ఈ రోజు వీరమరణం పొందిన దేశభక్తులను స్మరించుకుంటారు. ఈ సందర్భంగా మణిపూర్లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం - భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.ఆగస్టు 16: పార్సీ నూతన సంవత్సరం - పార్సీ సమాజం నూతన సంవత్సరాన్ని జరుపుకునే సందర్భంగా డామన్ & డయ్యూ, దాద్రా & నగర్ హవేలీ, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని బ్యాంకులు సెలవు పాటిస్తాయి.ఆగస్టు 25: ఈద్-ఎ-మిలాద్ - ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే అండమాన్ & నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి.ఆగస్టు 26: ఓణం -కేరళ రాష్ట్రంలోని ప్రముఖ పండుగ అయిన ఓణం సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.ఆగస్టు 27: ఝూలన్ యాత్ర - ఒడిశా రాష్ట్రంలో జరుపుకునే ఝూలన్ యాత్ర సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు ఉంటుంది.ఆగస్టు 28: రక్షా బంధన్ - అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ప్రేమకు ప్రతీకగా జరుపుకునే రక్షా బంధన్ సందర్భంగా ఛత్తీస్గఢ్, డామన్ & డయ్యూ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.ఈ సెలవుల కారణంగా బ్యాంక్ బ్రాంచ్ సేవలు అందుబాటులో ఉండకపోయినా, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం కొనసాగుతాయి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, అలాగే ఏటీఎం సేవలు సాధారణంగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
ప్రయాణికుడి కేసు.. రైల్వేకు రూ.25 వేల జరిమానా
రైలులో ప్రయాణికులకు అందించాల్సిన బెడ్రోల్ విషయంలో రైల్వేకు వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఆర్ఏసీ టికెట్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అపరిచితులకు ఒకే దుప్పటి, దిండు ఇచ్చిన ఘటనలో సేవాలోపం జరిగిందని తేల్చిన ఢిల్లీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ప్రయాణికుడు పడిన మానసిక వేధన, శారీరక అసౌకర్యానికి రూ.20,000, వ్యాజ్య ఖర్చుల కింద మరో రూ.5,000 మొత్తం రూ.25,000 పరిహారం చెల్లించాలని నార్తెర్న్ రైల్వేను ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా రైల్వే ఈ మొత్తాన్ని చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే, ఉత్తర్వు తేదీ నుంచి మొత్తాన్ని వసూలు చేసే వరకు 7 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.అసలేం జరిగింది?2022 అక్టోబర్ 28న ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఓ ప్రయాణికుడు ఆర్ఏసీ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలులో మరో ప్రయాణికుడితో ఉమ్మడి సీటును పంచుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇద్దరికీ కలిపి ఒకటే దుప్పటి, దిండు, రెండు బెడ్షీట్లు మాత్రమే అందించారని అతను కమిషన్ను ఆశ్రయించాడు. అపరిచితుడితో ఒకే దుప్పటి పంచుకోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురయ్యానని ప్రయాణికుడు విన్నవించాడు. అదనపు దుప్పటి, దిండు ఇవ్వాలని కోచ్ అటెండెంట్ను కోరినా స్పందన లేదని తెలిపాడు. రైల్వే అధికారులకు, టీటీఈకి ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నాడు.రైల్వే వాదన ఏంటి?తమ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు బెడ్రోల్ అందిస్తామని ఉత్తర రైల్వే కమిషన్కు తెలిపింది. అదనపు దుప్పటి అవసరం, డిమాండ్, అందుబాటుపై ఆధారపడి ఇవ్వవచ్చని వాదించింది. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత రైల్వే అధికారుల పరిధిలో విచారణ జరుగుతోందని పేర్కొంది.అయితే.. బెడ్రోల్ అందించే కాంట్రాక్టర్పై రూ.1,000 జరిమానా విధించినట్లు రైల్వే అంతర్గత సమాచారంలో వెల్లడైంది. కానీ ఆ చర్యను ఫిర్యాదుదారుడికి తెలియజేయలేదని కమిషన్ గుర్తించింది. అంతేకాకుండా, ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్రోల్ అందించామని రైల్వే పేర్కొన్నప్పటికీ, దానికి సరైన ఆధారాలను సమర్పించలేకపోయిందని పేర్కొంది.2009 సర్క్యులర్ కీలకంఈ కేసులో 2009 సెప్టెంబర్ 23న జారీ చేసిన ప్రభుత్వ సర్క్యులర్ను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఆర్ఏసీ ప్రయాణికులకు బెడ్రోల్ సదుపాయం కల్పించవచ్చని, బెడ్రోల్ ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఛార్జీల్లోనే భాగంగా ఉన్నాయని కమిషన్ గమనించింది. అందువల్ల ప్రయాణికుడికి వాగ్దానం చేసిన సదుపాయాన్ని అందించకపోవడం సేవలో లోపం కిందకు వస్తుందని తేల్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు ప్రయాగ్రాజ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడని, ఆర్ఏసీ సీటులో అపరిచితుడితో ప్రయాణాన్ని పంచుకున్నాడని ఇరుపక్షాలు అంగీకరించినట్లు కమిషన్ పేర్కొంది. -
నెలకు రూ.3 లక్షల జీతం.. నిద్రకూ టైమ్ లేదు!
నెల తిరిగేసరికి ఖాతాలో రూ.3 లక్షల వేతనం జమవుతోంది.. సమాజంలో మంచి గుర్తింపు, ఆకర్షణీయమైన కెరీర్.. కానీ, ప్రశాంతంగా నిద్రపోయేందుకు సమయం లేదు. రోజుకు 15-16 గంటల పాటు నిరంతరాయంగా కంప్యూటర్ స్క్రీన్ల ముందే జీవితం కరిగిపోతోంది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ పంచుకున్న ఈ చేదు నిజం ఇప్పుడు అటు కార్పొరేట్ రంగాన్ని, ఇటు సామాజిక వర్గాలను ఆలోచింపజేస్తోంది.సామాజిక మాధ్యమం ‘రెడ్డిట్’ వేదికగా ఆ యువకుడు పంచుకున్న ఆవేదన నేటి ఐటీ రంగంలో విస్తరిస్తున్న టాక్సిక్ వర్క్ కల్చర్ (విషపూరితమైన పని సంస్కృతి), లైఫ్-వర్క్ ఇంబ్యాలెన్స్ను స్పష్టంగా ఎత్తిచూపుతోంది. రోజువారీ పనిభారంతో శారీరకంగా, మానసికంగా తీవ్రమైన అలసటకు (బర్న్ఔట్) గురవుతున్నానని చెప్పాడు. అసలు జీవితం ఎటు వైపు వెళ్తుందో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రాజెక్ట్ డెడ్లైన్లు, విపరీతమైన పని ఒత్తిడితో వ్యక్తిగత జీవితం పూర్తిగా శూన్యమైపోయిందని సదరు టెక్కీ వాపోయాడు.జీతం ఎక్కువే.. శ్రమా ఎక్కువే!అధిక వేతనాలు చెల్లిస్తున్నామనే సాకుతో ఉద్యోగుల నుంచి 15-16 గంటల శ్రమను పిండుకోవడం ఐటీ సంస్కృతిలో భాగమైపోతోంది. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు డిప్రెషన్ వంటి మానసిక ఒత్తిళ్లు యువతను కుంగదీస్తున్నాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య ఇది.చట్టబద్ధమైన హద్దులు ఏవి?పని గంటల నియంత్రణ, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన బాధ్యత కంపెనీలపై ఎంతో ఉంది. నాణ్యమైన పని పొందాలంటే ఉద్యోగికి తగినంత విశ్రాంతి, వ్యక్తిగత సమయం లభించడం అత్యంత ఆవశ్యకం. పని చేయడానికి బతుకుతున్నామా? లేక బతకడానికి పని చేస్తున్నామా? అనే ప్రాథమిక సూత్రాన్ని కార్పొరేట్ యాజమాన్యాలు గుర్తుంచుకోవాలని కొందరు చెబుతున్నారు. రూపాయి నాణేనికి ఒకవైపు మెరిసే జీతాలు కనిపిస్తున్నా రెండో వైపు నలిగిపోతున్న ఉద్యోగుల ఆరోగ్యం, కుటుంబ జీవితం అంధకారంలోకి వెళ్తుంది. మానవ వనరులను కేవలం యంత్రాలుగా కాకుండా మనుషులుగా చూసే శ్రమ సంస్కృతి వైపు పరిశ్రమ అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
బిజినెస్ ఏఐ సేవలతోనే వేల కోట్ల ఆదాయం
కార్పొరేట్ వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విక్రయించడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇదే రాబోయే రోజుల్లో తమ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన టెక్ రంగాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రధానంగా ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడిన మెటా ఇప్పుడు ఎంటర్ ప్రైజ్ ఏఐ మార్కెట్లోకి వేగంగా దూసుకెళ్లేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.జుకర్ బర్గ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వ్యాపార సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించే ఏఐ బిజినెస్ ఏజెంట్లు, ఏపీఐల ద్వారా టెక్ సేవలు అందించడం, తమ అధునాతన డేటా సెంటర్లలోని అదనపు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని నేరుగా విక్రయించడం వంటి మూడు ప్రధాన మార్గాల్లో బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్, మెసెంజర్ ప్లాట్ఫారమ్లలో 10 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు మెటా ఏఐ ఏజెంట్లను కస్టమర్ సర్వీస్, విక్రయాల కోసం ఉపయోగిస్తున్నాయని, త్వరలోనే ఈ సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్కు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన తెలిపారు.మరోవైపు, ఏఐ మౌలిక వసతుల కల్పనకు మెటా భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి తమ మూలధన వ్యయం అంచనాలను 130 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్లకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. బిలియన్ల కొద్దీ వినియోగదారులకు పర్సనల్ ఏఐ అసిస్టెంట్లను అందించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా క్లౌడ్ మౌలిక వసతులను కల్పించడమే తమ లక్ష్యమని జుకర్ బర్గ్ చెప్పారు. అమెజాన్ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలకు పోటీగా మెటా సొంత క్లౌడ్ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది.ఈ త్రైమాసికంలో మెటా ఆదాయం 28 శాతం పెరిగి 60.8 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ ఏఐ పరిశోధనలు, సూపర్ కంప్యూటింగ్ మౌలిక వసతులకై చేసిన వ్యయం గణనీయంగా పెరిగింది. స్వల్పకాలిక లాభాల కంటే భవిష్యత్తు సాంకేతిక ఆధిపత్యమే ముఖ్యమని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతిక రంగాన్ని నడిపించే తదుపరి ప్రధాన శక్తి వ్యాపార స్థాయి ఏఐ సాధనాలేనని మెటా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎంటార్ టెక్నాలజీస్ లాభం రూ. 50 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన సుమారు రూ. 11 కోట్లతో పోలిస్తే 365 శాతం మేర వృద్ధి చెందింది. ఆదాయం రూ. 157 కోట్ల నుంచి 130 శాతం వృద్ధి చెంది రూ. 361 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన గైడెన్స్కి అనుగుణంగా క్యూ1లో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు కంపెనీ ఎండీ పర్వత్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.బీఎస్ఈలో ఎంటార్ టెక్నాలజీస్ షేరు 5% క్షీణించి రూ. 5,183 వద్ద ముగిసింది. -
అదానీ పోర్ట్స్ లాభం 10 శాతం అప్
న్యూఢిల్లీ: దేశీ ప్రైవేటు పోర్ట్స్ దిగ్గజం అదానీ పోర్ట్స్ (ఏపీసెజ్) ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. అంతర్జాతీయ పోర్టుల, మెరైన బిజినెస్ల జోరు, దేశీ పోర్టుల స్థిరమైన పనితీరుతో ఈ ఏడాది తొలి త్రైమాసికం (2026–26, క్యూ1)లో కంపెనీ రూ. 3,650 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.3,311 కోట్లతో పోలిస్తే లాభం 10.23 శాతం జంప్ చేసింది. మొత్తం ఆదాయం కూడా 24 శాతం వృద్ధితో రూ. 9,422 కోట్ల నుంచి రూ. 11,674 కోట్లకు ఎగబాకింది. మరోపక్క, కంపెనీ వ్యయాలు రూ.5,732 కోట్ల నుంచి రూ. 7,079 కోట్లకు పెరగడం గమనార్హం. ‘అన్ని వ్యాపార విభాగాల్లో ఈ సమతుల్యమైన వృద్ధితో 2031 నాటికి కంపెనీ లక్ష్యాలను సాధించగలమన్న నమ్మకం మరింత బలపడింది. 2030 కల్లా దేశీ పోర్టుల హ్యాడ్లింగ్ సామర్థ్యాన్ని 1,000 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ)కు విస్తరించాలన్న టార్గెట్, అంతర్జాతీయ పోర్ట్ట్ఫోలియో వృద్ధి, వేగంగా విస్తరిస్తున్న లాజిస్టిక్స్ ఎకోసిస్టమ్ దన్నుతో దీర్ఘకాలిక విలువను సృష్టించే సామర్థ్యం గల మరింత వైవిధ్యమైన, స్థిరమైన, ప్రపంచవ్యాప్తంగా అనువైన రవాణా ప్లాట్ఫామ్ను ఎపీసెజ్ నెలకొల్పుతోంది’ అని కంపెనీ సీఈఓ అశ్వని గుప్తా పేర్కొన్నారు. క్యూ1లో అంతర్జాతీయ పోర్టుల నుంచి ఆదాయం 256 శాతం దూసుకెళ్లి రూ. 1,747 కోట్లకు చేరింది. దేశీ పోర్టుల ఆదాయం 12 శాతం వృద్ధి చెందింది. ఇక మెరైన్ వ్యాపార ఆదాయం 67 శాతం ఎగసి రూ. 901 కోట్లను తాకింది. కొత్త ఆఫ్షోర్ వెసల్స్ జోడింపు, యూరోపియన్ సబ్సీ విస్తరణ దీనికి దోహదం చేశాయి. కాగా, 2026–27 పూర్తి ఏడాదికి అదానీ పోర్ట్స్ రూ. 43,000–45,000 కోట్ల ఆదాయాన్ని, రూ. 25,000–26,000 కోట్ల ఎబిటాను అంచనా వేస్తోంది. జూన్ నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ. 56,776 కోట్లు కాగా, రూ. 12,428 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు 3 శాతం క్షీణించి రూ. 1,721 వద్ద ముగిసింది. -
ఒక్కో షేరుకు రూ.1.10 లక్షల డివిడెండ్..
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ‘టాటా సన్స్’ 2025–26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, స్టాండలోన్ నికర లాభం రూ.31,961 కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలోని రూ.26,232 కోట్లతో పోలిస్తే 21.8 శాతం అధికం. అదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం 9.1 శాతం పెరిగి రూ.42,367 కోట్లకు చేరింది. ఈ వృద్ధికి పెట్టుబడుల విక్రయం ద్వారా వచ్చిన లాభాలు, గ్రూప్ కంపెనీల నుంచి మెరుగైన ఆదాయం ప్రధాన కారణాలుగా నిలిచాయి.ఈ బలమైన ఫలితాల నేపథ్యంలో టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.1,10,717 డివిడెండ్ సిఫార్సు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రూ.64,900 డివిడెండ్ చెల్లించగా, ఈసారి దాదాపు 70 శాతం అధిక డివిడెండ్ ప్రకటించడం విశేషం. వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ఆమోదం లభిస్తే మొత్తం రూ.4,475 కోట్ల మేర డివిడెండ్ పంపిణీ చేయనుంది.అయితే ఈ డివిడెండ్ సాధారణ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు అందదు. ఎందుకంటే టాటా సన్స్ ఒక లిస్టెడ్ కంపెనీ కాదు. దీంతో డివిడెండ్ ప్రయోజనం ప్రధానంగా కంపెనీ ప్రమోటర్లు, ట్రస్టులు, ప్రైవేట్ వాటాదారులకే పరిమితం అవుతుంది.టాటా సన్స్లో సుమారు 66 శాతం వాటాను కలిగి ఉన్న టాటా ట్రస్టులు ఈ డివిడెండ్లో అత్యధిక లబ్ధిదారులు కానున్నారు. ముఖ్యంగా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్కు అత్యధిక వాటా లభించనుండగా, టాటా సన్స్లో 4,060 షేర్లు కలిగిన నోయెల్ టాటాకు సుమారు రూ.45 కోట్ల డివిడెండ్ అందనున్నట్లు వార్షిక నివేదికలో వెల్లడైంది.వార్షిక నివేదికలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్ వంటి సంస్థలు ప్రస్తుతం నష్టాల్లో ఉన్నప్పటికీ, విమానయానం, సెమీకండక్టర్లు, బ్యాటరీలు, డిజిటల్ వ్యాపారాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులుగా వాటిని కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆల్టైమ్ రికార్డు లాభం -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆల్టైమ్ రికార్డు లాభం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 1,075 కోట్ల ఆల్టైమ్ రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో నమోదైన రూ. 463 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 132.4 శాతం వృద్ధి చెందడం విశేషం. బ్యాంక్ మొత్తం కస్టమర్ వ్యాపారం 18.6% వృద్ధితో రూ.5,10,031 కోట్ల నుంచి రూ.6,04,776 కోట్లకు చేరింది.జారీ చేసిన రుణాలు, అడ్వాన్సులు 20.6 శాతం వృద్ధితో రూ. 3,05,370 కోట్లకు పెరిగాయి. ఆస్తుల నాణ్యత కూడా గణనీయంగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97 శాతం నుంచి 1.51 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏ 0.55 శాతం నుంచి 0.44 శాతానికి దిగొచి్చంది. నికర వడ్డీ మార్జిన్ గతేడాది ఉన్న 5.71 శాతం నుంచి 5.96 శాతానికి బలపడింది.ఏయూ స్మాల్ ఫైనాన్స్ లాభం 37% జంప్ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అద్భుత ప్రదర్శన కనబరిచింది. బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 37 శాతం వద్ధితో రూ.796 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం, నికర వడ్డీ మార్జిన్లు 5.9%కి మెరుగుపడటంతో లాభాలు పెరిగాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.2,695 కోట్లకు చేరింది. రుణాలు 23 శాతం వృద్ధి చెందాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.10 శాతానికి తగ్గడం ద్వారా ఆస్తుల నాణ్యత మెరుగైంది. -
రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రోజూ కనిపించే తోపులాటలు, దళారుల ఆధిపత్యానికి తెరదించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 1, 2026 నుంచి తత్కాల్ టికెట్ల జారీ విధానంలో విప్లవాత్మకమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెడుతున్నారు. ప్రాథమికంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే (కోటా డివిజన్) పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేకపోయినప్పటికీ క్యూలైన్లలో నిలబడే పద్ధతి పూర్తిగా మారనుంది.టోకెన్ల కేటాయింపు వేళలు ఇవే..కొత్త నిబంధనల ప్రకారం కౌంటర్ వద్ద నేరుగా గుమిగూడేందుకు అనుమతించరు. ముందుగా టోకెన్లు పొందిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఏసీ తరగతుల వారికి ఉదయం 8:30-9:00 గంటల మధ్య టోకెన్లు పంపిణీ చేస్తారు. ప్రతి కౌంటర్కు గరిష్ఠంగా 10 టోకెన్లు మాత్రమే ఇస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 10:00 గంటలు). నాన్-ఏసీ తరగతులకు ఉదయం 9:30-10:00 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. ప్రతి కౌంటర్కు 15 టోకెన్లు కేటాయిస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 11:00 గంటలు)కేటగిరీ ఏ, బీ ప్రాధాన్యతలుదళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రయాణికులను రెండు వర్గాలుగా విభజించారు. కేటగిరీ ఏ..(తొలి ప్రాధాన్యం) తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ వర్గంలోకి వస్తారు. వీరు తమ అసలు గుర్తింపు కార్డుతో పాటు కుటుంబ సంబంధాన్ని రుజువు చేసే ఐడీ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి. కేటగిరీ ‘బీ’ కింద ఇతర ప్రయాణికులకు ఇస్తారు. ‘ఏ’ కేటగిరీ ప్రయాణికుల బుకింగ్ పూర్తయిన తర్వాతే వీరికి అవకాశం కల్పిస్తారు. వీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.పారదర్శకత, భద్రతకే ప్రాధాన్యంజారీ చేసిన టోకెన్లపై ప్రయాణికుడి పేరు, వివరాలు స్పష్టంగా ముద్రిస్తారు. ఇవి ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. టోకెన్ ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరంతరం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా హాల్లో వేచి ఉండవచ్చు. అటు ఆన్లైన్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులకు ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి. సాధారణ ప్రయాణికులకు తత్కాల్ రిజర్వేషన్ సులభతరం చేయడం, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ కీలక మార్పులు చేపట్టింది.ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు -
గూగుల్లో ఉద్యోగం నిజంగానే హ్యాపీనా?
ప్రపంచంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగం సాధించడం ప్రతి ఐటీ నిపుణుడి డ్రీమ్. ఆకర్షణీయమైన వేతనాలు, కార్పొరేట్ సదుపాయాలు, ప్రపంచ స్థాయి గుర్తింపు ఉండే ఈ సంస్థలో పని సంస్కృతి ఎలా ఉంటుందనే దానిపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని గూగుల్ విభాగంలో పనిచేస్తున్న ప్రియ అనే భారతీయ టెక్కీ అక్కడి ఉద్యోగ పరిస్థితులు, కెరీర్ ఎదుగుదల, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.పనివేళల్లో సౌలభ్యంగూగుల్లో రోజూ 10-12 గంటలు తప్పనిసరిగా శ్రమిస్తారనే భావన సరికాదని ప్రియ స్పష్టం చేశారు. ‘గూగుల్లో పనివేళల విషయంలో ఎంతో సౌలభ్యం ఉంటుంది. కొన్ని రోజులు ప్రాజెక్ట్ డెడ్లైన్స్ ఆధారంగా 10-12 గంటలు పనిచేయాల్సి వచ్చినా మరికొన్ని రోజులు ఎంతో సులభంగా, ప్రశాంతంగా సాగుతాయి. గూగుల్లో ఫ్లెక్సిబిలిటీ లేదనడం ముమ్మాటికీ అవాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగి ఎంచుకునే లక్ష్యాలు, ఉద్యోగ సంతృప్తి పైనే వారి పనివేళలు ఆధారపడి ఉంటాయని వివరించారు.పోటీ తీవ్రత.. నిరంతర శ్రమగూగుల్లో ప్రవేశించిన ప్రారంభంలో జీవితంలో అన్నీ సాధించినట్లు అనిపించినప్పటికీ కాలక్రమేణా అక్కడ ఉండే తీవ్ర పోటీ వాతావరణం అర్థమవుతుందని ఆమె తెలిపారు. అత్యంత ప్రతిభావంతులైన సహోద్యోగులు మధ్య పనిచేస్తున్నప్పుడు సంస్థలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే సాధారణ బాధ్యతలకు మించి శ్రమించాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఐటీ రంగాన్ని పట్టిపీడిస్తున్న లేఆఫ్ల నేపథ్యంలో నిలకడైన పురోగతి సాధించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.అనుభవాల పాఠంలండన్, చికాగో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాల్లో నివసించిన అనుభవాలను పంచుకుంటూ విదేశీ అవకాశాలను అందుకోవడం తన కెరీర్కు ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. అధిక జీతాలు, హోదాలతో పాటు గ్లోబల్ టెక్ సంస్థలలో రాణించాలంటే నిరంతర నైపుణ్యాభివృద్ధి, మానసిక సంసిద్ధత అత్యంత కీలకమని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.1 కోటి జీతం.. 3 ఇళ్లు.. తీరా చూస్తే రూ.15 వేల అప్పు! -
బేబీ పౌడర్ వివాదం.. రూ.52 వేలకోట్ల పరిహారం!
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (Johnson & Johnson) టాల్కం పౌడర్కు సంబంధించిన కేసుల కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్ వినియోగం వల్ల అండాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని, వేలాది మంది కోర్టులను ఆశ్రయించారు. ఈ వివాదం చాన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలకడానికి సంస్థ భారీ మొత్తంలో పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది.జాన్సన్ & జాన్సన్ సంస్థ దాదాపు 76,000 కేసులను పరిష్కరించడానికి 5.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52 వేలకోట్లు) చెల్లించాలని ప్రతిపాదించింది. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం వల్ల కంపెనీ ప్రతిష్ఠ చాలా వరకు దెబ్బతింది. ఇది సంస్థ ఆర్ధిక పరిస్థితి మీద కూడా ప్రభావం చూపింది. ఈ కారణంగానే.. సంస్థ ఈ వివాదాన్ని శాశ్వతంగా ముగించాలని నిర్ణయించింది.క్యాన్సర్కు కారణమయ్యే అస్బెస్టాస్జాన్సన్ & జాన్సన్ తయారు చేసిన టాల్కం బేబీ పౌడర్ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల..తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు అండాశయ క్యాన్సర్ లేదా మెసోథెలియోమా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. టాల్కం పౌడర్లో క్యాన్సర్కు కారణమయ్యే అస్బెస్టాస్ అనే పదార్థం ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు.బేబీ పౌడర్ అమ్మకాల నిలిపివేతఈ ఆరోపణలను జాన్సన్ & జాన్సన్ కంపెనీ పూర్తిగా తిరస్కరిస్తోంది. తమ ఉత్పత్తులు క్యాన్సర్కు కారణమవుతాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ.. వినియోగదారుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, 2020లో అమెరికాలో మాత్రమే కాకుండా కెనడాలో కూడా టాల్కం ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. కాగా ఇప్పుడు వివాదానికి ముగింపు పలకడానికి పరిహారం చెల్లించేందుకు సన్నద్ధమైంది.ఇదీ చదవండి: అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్! -
తర్వాతి హైడ్రోజన్ రైలు రూట్లు ఇవే..
పర్యావరణహిత రవాణా వ్యవస్థే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’లో భాగంగా ప్రవేశపెట్టిన దేశపు తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు ఇటీవలే విజయవంతంగా పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్-సోనెపట్ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రైలు ఇప్పటికే 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ విజయవంతమైన ట్రయల్స్ ఆధారంగా త్వరలోనే ఢిల్లీ రూట్తో పాటు చారిత్రాత్మక కాల్కా-శిమ్లా, ఇతర పర్వత ప్రాంతాల (హెరిటేజ్ రూట్లు) వైపు ఈ సేవలను విస్తరించేందుకు భారతీయ రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది.జింద్ - సోనెపట్ సక్సెస్తొలి విడతగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ హైడ్రోజన్ రైలు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందించింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేసింది.3,200+ లీటర్ల డీజిల్ పొదుపు: కేవలం 1,200 కి.మీల ప్రయాణంలోనే దాదాపు 3,200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ వాడకాన్ని తగ్గించింది.జీరో కార్బన్ ఉద్గారాలు: ఈ రైలు నుంచి విషపూరిత పొగ లేదా కార్బన్ డై ఆక్సైడ్ వెలువడదు. రసాయన ప్రక్రియ ద్వారా కేవలం నీటి ఆవిరి, స్వచ్ఛమైన గాలి మాత్రమే ఉపఉత్పత్తిగా బయటకు వస్తాయి.శబ్ద రహిత ప్రయాణం: సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే శబ్ద కాలుష్యం దాదాపు శూన్యం.ఢిల్లీ, కాల్కా-శిమ్లా హెరిటేజ్ రూట్లకు విస్తరణజింద్-సోనెపట్ రూట్లో విజయం సాధించడంతో రైల్వే శాఖ తదుపరి దశ పరీక్షలకు సిద్ధమైంది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాల్కా-శిమ్లా నారోగేజ్ ట్రాక్పై ఈ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, మాథేరాన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో డీజిల్ రైళ్ల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ రైళ్లను తీసుకురానున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
సీఈఓ ముందే ఉద్యోగుల నినాదాలు!
భారత ఐటీ రంగంలో గత కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా రగులుతున్న వేతనాల అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. చెన్నై వేదికగా జరిగిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ అంతర్గత వార్షిక కార్యక్రమంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటన ఇప్పుడు దేశీయ టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. కంపెనీ సీఈఓ సి.విజయకుమార్ వేదికపైకి రాగానే సభలో పాల్గొన్న వందలాది మంది ఉద్యోగులు ఒకేసారి ‘మాకు జీతాల పెంపు కావాలి’ అంటూ నినాదాలు చేయడం, దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ కావడం ఐటీ వర్గాల్లో కలకలం రేపింది.లాభాల పంట.. వేతనాల్లో కోత!ఈ సంఘటన కేవలం ఒక కంపెనీకి చెందిన తాత్కాలిక నిరసనగా చూడలేం. కరోనా అనంతర కాలంలో గ్లోబల్ టెక్ రంగం కేవలం ఆర్థిక మందగమనాన్ని మాత్రమే ఎదుర్కొవడం లేదు.. తీవ్రమైన మానవ వనరుల సంక్షోభాన్ని కూడా మోస్తోంది. హెచ్సీఎల్తో పాటు పలు ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజాలు ఆరోగ్యకరమైన త్రైమాసిక లాభాలను నమోదు చేస్తున్నప్పటికీ అప్రైజల్స్ (జీతాల పెంపు) విషయంలో తీవ్ర ఆలస్యం వహిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రాజెక్టుల తగ్గింపు, వ్యయ నియంత్రణ పేరుతో మేనేజ్మెంట్లు తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయి ఇంజినీర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరగకపోవడం, పదోన్నతులు నిలిచిపోవడంతో ఉద్యోగుల్లో సహనం నశించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం.కార్పొరేట్ సంస్కృతిలో మార్పుసాధారణంగా భారతీయ ఐటీ ఉద్యోగులు క్రమశిక్షణకు, అంతర్గత నిబంధనలకు కట్టుబడి ఉంటారు. తమ నిరసనలను అధికారిక ఈ-మెయిల్స్ లేదా హెచ్ఆర్ సమావేశాలకే పరిమితం చేస్తారు. అయితే, ఏకంగా కంపెనీ అత్యున్నత నాయకత్వం (సీఈఓ) కళ్ల ముందే బహిరంగంగా నినాదాలు చేశారంటే ఉద్యోగుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కార్పొరేట్ కమ్యూనికేషన్ వ్యవస్థల వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతోంది.When the CEO of HCL came on stage, employees started chanting, "We want a hike!" pic.twitter.com/hty1tNGp26— Nandkishor (@devops_nk) July 27, 2026పరిశ్రమకు హెచ్చరికఈ చెన్నై ఘటన ఐటీ యాజమాన్యాలకు ఒక బలమైన హెచ్చరిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, రీ-స్కిల్లింగ్ సవాళ్ల మధ్య ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తే అది కంపెనీ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. మేనేజ్మెంట్లు ఇప్పటికైనా ప్రాజెక్టు లాభాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా పారదర్శకమైన వేతన విధానాలను అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
రైల్వే ప్లాట్ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ఏకంగా రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సక్సెస్ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్ఫారమ్పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్పూర్లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు. 18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి. రాజస్థాన్లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్కు చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్ఫారమ్పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.చిన్న అడుగుతో మొదలైన వ్యాపారంబల్హార్షాలో నువాల్కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.#WATCH | Solar Group Chairman Satyanarayan Nuwal receives Padma Shri award from President Droupadi Murmu for his contribution to India's defence manufacturing ecosystem pic.twitter.com/xEuTePY74k— ANI (@ANI) May 25, 2026త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్ప్లోజివ్స్ బిజినెస్లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.'సోలార్ ఇండస్ట్రీస్' అద్భుత ప్రగతి1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.2006 IPOఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.'మేక్ ఇన్ ఇండియా' మిషన్లో భాగంగా కంపెనీ ఎక్స్ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిపద్మశ్రీ పురస్కారం2026, మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే!
డబ్బు ఎక్కువగా ఉంటే.. జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తారు. కానీ.. మనసులో ఉండే భయం, చిన్నప్పటి అనుభవాలు, బాధ్యతలు కూడా మన సంతోషాన్ని ప్రభావితం చేస్తాయనేది నిజం. దీనికి బెంగళూరులో నివసిస్తున్న 26 ఏళ్ల టెకీ కథ మంచి ఉదాహరణ.రెడ్దిట్ పోస్టులో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. బెంగళూరులో నివసిస్తున్న యువకుడు ప్రస్తుతం నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. అతనికి ఎలాంటి అప్పులు లేవు. అయినప్పటికీ.. తాను ఇప్పటికీ పేదవాడిననే భావనతో జీవిస్తున్నానని తన మనసులో మాట చెప్పాడు.చిన్నప్పటి నుంచి అతని కుటుంబం చాలా పేదరికంలో జీవించింది. వారి కుటుంబ ఆదాయం నెలకు రూ.6,000 నుంచి రూ.7,000 మాత్రమే ఉండేది. ఒక చిన్న 10×10 గదిలో అందరూ ఉండేవారు. ఆ రోజుల్లో డబ్బు కోసం పడిన కష్టాలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే.. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబ జీవితాన్ని మార్చాలనే లక్ష్యంతో కష్టపడ్డాడు.2021లో ఉద్యోగం వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులను పని చేయనివ్వకుండా ఇంట్లోనే విశ్రాంతిగా ఉండేలా చేశాడు. వారికోసం స్వగ్రామంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసి ఇచ్చాడు. తాను ఉండటానికి బెంగళూరులో ఒక 2BHK అద్దెకు తీసుకున్నాడు. ప్రతి నెలా తల్లిదండ్రులకు రూ.15,000 నుంచి రూ.20,000 పంపిస్తున్నాడు.అతను సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాడు. ప్రతి నెలా రూ.30,000 మ్యూచువల్ ఫండ్స్లో, రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్లో, మరో రూ.10,000 బంగారం కోసం దాస్తున్నారు. ఇప్పటివరకు స్టాక్స్, FDలు, బంగారం, బ్యాంక్ పొదుపులతో మంచి మొత్తాన్ని కూడబెట్టాడు. స్కూటర్, మ్యాక్ బుక్, ఫోన్ వంటి అవసరమైనవి కొనుగోలు చేశాడు. తల్లిదండ్రుల ఇంటికి అవసరమైన ఫర్నిచర్, ఇతర పరికరాలను కూడా కొనిచ్చాడు.#Rant, Feeling poor: Earning ₹2l a month with ₹0 deptby u/Cautious-Table158 in FinancialAdviceIndiaఅయినా.. కూడా అతనికి తాను ధనవంతుడిననే భావన రాలేదు. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. పెళ్లికి కనీసం రూ.10 లక్షలు ఖర్చవుతాయని భావిస్తున్నాడు. అదనంగా ఒక కారు, స్వగ్రామంలో స్థలం, ఒక బైక్ కొనాలని కూడా ఉంది. కానీ ఒకటి ఎంచుకుంటే.. మరొకటి చేయలేనేమో అనే భయం అతనిని ఎప్పుడూ వెంటాడుతోంది.అతని బాధలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సొంత ఊరిలో ఆటో డ్రైవర్లు, కూలీలుగా పనిచేసే స్నేహితులు తనకంటే తక్కువ సంపాదించినా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వారు అప్పులు తీసుకుని తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ నేను మాత్రం రూ.750 కంటే ఎక్కువ ధర ఉన్న చొక్కా కొనాలన్నా చాలా సార్లు ఆలోచిస్తున్నానని చెప్పాడు. డబ్బు ఉన్నా ఖర్చు చేయడానికి భయపడటం అతని మనసులోని అసురక్షిత భావాన్ని చూపిస్తుంది.ఈ పోస్ట్ చూసిన చాలా మంది రెడ్దిట్ వినియోగదారులు అతనికి ధైర్యం చెప్పారు. చిన్నప్పుడు పేదరికంలో పెరిగిన వారికి, తర్వాత ఎంత డబ్బు వచ్చినా 'రేపు ఏమవుతుందో?' అనే భయం పోవడం కష్టం అని వివరించారు. అతను ఇప్పటివరకు సాధించిన విజయాలను గుర్తు చేసుకుని తనపై తాను గర్వపడాలని సూచించారు. అలాగే తొందరపడి పెద్ద రిస్క్లు తీసుకోవద్దని, ఓపికగా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఇంకా మంచి స్థితికి చేరుకుంటారని సలహా ఇచ్చారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రికి జీతం ఎక్కువా?
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యాశాఖ మంత్రి పదవికి సంబంధించిన జీతభత్యాలు, అధికారిక సౌకర్యాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించగా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి కేబినెట్ హోదా కలిగిన మంత్రి. అదే సమయంలో లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉంటారు. అందువల్ల పార్లమెంట్ సభ్యులకు వర్తించే వేతనం, భత్యాలతో పాటు కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా లభించే అధికారిక సౌకర్యాలు కూడా పొందుతారు.జీత భత్యాలు ఇవే..ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా నెలకు రూ.1 లక్ష ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా నియోజకవర్గ భత్యం రూ.70,000, కార్యాలయ వ్యయాల కోసం రూ.60,000 అందుతాయి. పార్లమెంట్ లేదా దాని కమిటీల సమావేశాలకు హాజరయ్యే ప్రతి రోజుకు రూ.2,000 రోజువారీ భత్యం చెల్లిస్తారు. ఇవి పార్లమెంట్ సభ్యులకు వర్తించే నిబంధనల ప్రకారం అందే ప్రయోజనాలు.కేబినెట్ మంత్రిగా లభించేవి..కేబినెట్ మంత్రిగా విద్యాశాఖ మంత్రికి న్యూఢిల్లీలోని లుటియెన్స్ జోన్లో ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తారు. ఈ నివాసానికి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంటి నిర్వహణ, అధికారిక అవసరాల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.అలాగే అధికారిక వినియోగం కోసం ప్రభుత్వ వాహనం, డ్రైవర్, ఇంధన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. భద్రతా సంస్థల ముప్పు అంచనాల ఆధారంగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్ వాహనాలు వంటి భద్రతా ఏర్పాట్లు కూడా కల్పిస్తారు.ప్రభుత్వ విధుల నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా అధికారిక విమాన ప్రయాణాలు, ఫస్ట్ ఏసీ రైలు ప్రయాణాలకు అర్హత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద మంత్రి, ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు లభిస్తాయి.మంత్రి కార్యాలయ నిర్వహణ కోసం వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. అధికారిక నివాసం, కార్యాలయంలో టెలిఫోన్, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వంటి అన్ని అవసరమైన సౌకర్యాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది.అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా వేరే జీతం ఉండదు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో ఉండటం వల్ల కేంద్ర మంత్రులందరికీ వర్తించే వేతనం, పార్లమెంట్ సభ్యుల భత్యాలు, అధికారిక సౌకర్యాలనే పొందుతారు. -
ఆగస్టులో ఐపీఓల జాతర
ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్ ఆగస్టులో భారీ ఐపీఓల రాకతో కళకళలాడనుంది. ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న సానుకూల స్పందన, స్థిరపడుతున్న మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 12కు పైగా కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫర్కు సిద్ధమయ్యాయి. రాబోయే నెలలో మార్కెట్లోకి రానున్న ఈ ఐపీఓల ద్వారా కంపెనీలు రూ.25,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిలో కొత్త షేర్ల జారీ తో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లు కూడా ఉన్నాయి. ‘స్టాక్ మార్కెట్ స్థిరీకరణ సాధించడం, ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడంతో ఇన్నాళ్లూ వేచి చూసిన కంపెనీలు ఇప్పుడు ఐపీఓలకు సన్నద్ధమయ్యాయి. 2026లో ఐపీఓల ద్వారా సుమారు 20 బిలియన్ డాలర్ల (రూ. 1.66 లక్షల కోట్లకు పైగా) నిధులు సమీకరించే అవకాశం ఉంది’ అని ఈక్విరస్ క్యాపిటల్ ఎండీ భవేశ్ షా తెలిపారు. జెప్టో: క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో అత్యంత భారీ ఆఫర్తో మార్కెట్లోకి వస్తోంది. కంపెనీ కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 8,010 కోట్లు సేకరించడమే కాకుండా, ఓఎఫ్ఎస్ రూపంలో 11.34 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ట్రూహోమ్: ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ రూ. 3,000 కోట్ల ఐపీఓను ప్రతిపాదించింది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ.1,500 కోట్ల ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఎలివేట్ క్యాంపసెస్: ఈ కంపెనీ పూర్తిగా తాజా ఇష్యూ ద్వారానే రూ. 2,550 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. షిప్రాకెట్: లాజిస్టిక్స్ ప్లాట్ఫారమ్ షిప్రాకెట్ మొత్తం రూ. 2,342.35 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా రూ. 1,100 కోట్ల తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 1,242.35 కోట్ల షేర్లను జారీ చేయనుంది.ఈ వారంలో మూడు పబ్లిక్ ఇష్యూలు ఈ వారంలో ప్రధానంగా మూడు పబ్లిక్ ఇష్యూలు సబ్్రస్కిబ్షన్ కోసం రానున్నాయి. వీటన్నింటిలో మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఐపీఓ అతి పెద్ద ఆఫర్. రూ. 9,275 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 29న (బుధవారం) ప్రారంభమై జూలై 31న ముగియనుంది. ధర శ్రేణిని రూ. 560 – రూ. 590గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో రూ. 8,000 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు రూ. 1,275.22 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించనున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ రంగానికి చెందిన జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ జూలై 30న (గురువారం) ప్రారంభమై ఆగస్టు 3న ముగియనుంది. ఈ కంపెనీ ఎలాంటి ఓఎఫ్ఎస్ లేకుండా, పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే రూ. 1,800 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడో ఇష్యూ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ కూడా జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉండనుంది. పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో రానున్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 290 కోట్ల నిధులను సేకరించనుంది. -
దలాల్ స్ట్రీట్లో బిగ్ ఫైట్
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారంల దలాల్ స్ట్రీట్కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ఇరాన్పై సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడిచమురు ధరలు 100 డాలర్ల స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు జులై 28–29 తేదీల్లో జరగనున్న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన, జూలై 28న (మంగళవారం) వెలువడే దేశీయ ఐఐపీ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు, కార్పొరేట్ రంగానికి వస్తే ఎల్అండ్టీ, మారుతీ, హెచ్యూఎల్, ఐటీసీ వంటి నిఫ్టీ దిగ్గజాల క్యూ1 ఫలితాలు స్టాక్–ఆధారిత ట్రేడింగ్ను నడిపిస్తాయి. వీటికి తోడు ఒకే రోజున నిఫ్టీ వీక్లీ, నిఫ్టీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల ’సూపర్ ఎక్స్పైరీ’ రాబోతుండటంతో దలాల్ స్ట్రీట్లో రోలోవర్లు, షార్ట్ కవరింగ్ వల్ల అస్థిరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల ప్రకటనలపై కన్ను నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ ప్రధానంగా ఐడీఎఫ్సీ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి దిగ్గజాల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ), ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్), అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఆర్ఎఫ్సీ, ఐటీసీ తదితర కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలపై దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాలు జూలై 28–29 తేదీల్లో జరగనున్నాయి. బుధవారం వెలువడే ప్రకటనలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనాలున్నాయి. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల నిర్ణయం కంటే కూడా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ద్రవ్య విధానంపై ఫెడ్ ఇచ్చే సంకేతాలే మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని చెబుతున్నారు. పశ్చిమాసియా పరిణామాలు... క్రూడాయిల్ దరలు ప్రభావం పశ్చిమాసియాలో శరవేగంగా మారుతున్న పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వైమానిక క్షిపణి నిల్వలు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్పై భారీ సైనిక చర్య ప్రణాళికలను డోనాల్డ్ ట్రంప్ నిలిపివేసినట్లు వెలువడిన నివేదికలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి. అయితే మిడిల్ ఈస్ట్లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత తక్షణం పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, అమెరికా–ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో గురువారం (జూలై 23న) 100 డాలర్లకు చేరిన ముడి చమురు ధరలు, శుక్రవారం ఒక్కరోజే 4% కంటే ఎక్కువ పడిపోయాయి. ముడిచమురు ధరల్లో తీవ్ర ఊగిసలాట, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను పెంచడంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మంగళవారం ‘సూపర్ ఎక్స్పైరీ’ మంగళవారం (జూలై 28) ఒకే ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ–50 వీక్లీ ఎక్స్పైరీతో పాటు, నిఫ్టీ–50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల జూలై నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీలు ఒకేసారి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దలాల్ స్ట్రీట్లో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నెల కాంట్రాక్టుల సెటిల్మెంట్లతో పాటు, ట్రేడర్లు తమ పొజిషన్లను తదుపరి నెలకు రోలోవర్ చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒత్తిడి కారణంగా మార్కెట్లో షార్ట్ కవరింగ్ లేదా ఉన్నట్టుండి భారీ విక్రయాలు నెలకొనే అవకాశం ఉంది. కావున ఎక్స్పైరీ రోజున ఇంట్రాడే ట్రేడర్లు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, కఠినమైన స్టాప్లాస్లతో వ్యవహరించడం శ్రేయస్కరం.నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్ గత నెల రోజులుగా 23,800 – 24,400 పరిధిలోనే ట్రేడైన నిఫ్టీ, ప్రస్తుతం ఆ స్థాయిలను కోల్పోయింది. సాంకేతికంగా ఇది సమీప కాలంలో మార్కెట్ వైఖరికి ప్రతికూల అంశమే. ప్రస్తుతం నిఫ్టీకి 23,600 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 23,100 వరకు దిగివచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ షార్ట్ కవరింగ్ జరిగి మార్కెట్ కోలుకుంటే నిఫ్టీ 24,000 – 24,100 శ్రేణిలో తొలి నిరోధాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ పైన 24,400 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు.బేరీష్గానే ఎఫ్ఐఐలు గత వారంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 7,180 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 8,640 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేసి మార్కెట్ పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలపై స్పష్టత వచ్చే వరకు విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.గతవారమంతా నష్టాలే.. దలాల్ స్ట్రీట్ గతవారంలో వరుసగా అయిదు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టాలనే చవిచూసింది. మళ్లీ తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కంపెనీల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అలాగే డాలర్తో మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్ 2,091 పాయింట్లు (2.68%), నిఫ్టీ 566 పాయింట్లు (2.33%) చొప్పున భారీగా క్షీణించాయి. -
మోదీ ఎంచుకున్న టెక్ దిగ్గజం.. ఆధార్ రూపకర్తకు కీలక బాధ్యత!
భారతదేశంలో సమాచార సాంకేతిక (ఐటీ) రంగం ప్రపంచ స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో నందన్ నీలేకని ఒకరు. కేవలం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్గా మాత్రమే కాకుండా.. ఆధార్ (Aadhaar) రూపకల్పనలో చేసిన సేవలకు ఈయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కాగా.. ఇప్పుడు పరీక్షల సంస్కరణల కోసం నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పీఎం మోదీ పేర్కొన్నారు.ఎవరీ నందన్ నీలేకనినందన్ నీలేకని 1955 జూన్ 2న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన తండ్రి మోహన్ రావు నీలేకని టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన నందన్, ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఆయనకు సాంకేతిక రంగంపై మరింత ఆసక్తి పెరిగింది.1981లో ఎన్.ఆర్. నారాయణ మూర్తితో కలిసి మరో ఆరుగురు సహ వ్యవస్థాపకులతో కలిసి ఇన్ఫోసిస్ (Infosys) సంస్థను ప్రారంభించారు. అప్పట్లో చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థ, నేడు ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. కంపెనీ అభివృద్ధిలో నందన్ నీలేకని కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసి సంస్థను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేశారు.ఉడాయ్ చైర్మన్2009లో ఆయన కార్పొరేట్ జీవితానికి కొంత విరామం ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ''యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా'' (UIDAI)కి తొలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందించే ఆధార్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలిచింది.రచయితగా నీలేకనివ్యాపారవేత్తగానే మాత్రమే కాకుండా.. రచయితగా కూడా గుర్తింపు పొందారు. 'ఇమాజినింగ్ ఇండియా' అనే పుస్తకంలో భారతదేశ భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, విద్య, సాంకేతికత వంటి అంశాలపై తన ఆలోచనలను వివరించారు. ఆయన రచనలు, ప్రసంగాలు యువతకు స్ఫూర్తినిస్తుంటాయి.రాజకీయాల్లో నీలేకని2014లో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బెంగళూరు దక్షిణ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించలేదు. అనంతరం తిరిగి ఇన్ఫోసిస్లో చేరి సంస్థ అభివృద్ధిలో తన పాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సేవలందిస్తున్నారు.నందన్ నీలేకని కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. డిజిటల్ ఇండియా, ఫిన్టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కూడా విలువైన సూచనలు చేస్తుంటారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మార్గం సుగమం చేసిన ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
సముద్రంపై ఆఫీస్.. గూగుల్ కో-ఫౌండర్ సూపర్యాచ్!
సాధారణంగా.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల గురించి మాట్లాడితే, వారి విలాసవంతమైన జీవనశైలి గురించి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్లు, సూపర్యాచ్లు కూడా వారి జీవితంలో భాగమే. అయితే గూగుల్ సహ వ్యవస్థాపకుడు 'సెర్గీ బ్రిన్' మాత్రం తన సూపర్యాచ్ను కేవలం విహారం కోసం కాకుండా.. సముద్రంపై తేలియాడే ఆఫీసుగా మార్చుకున్నారు. ఈ కారణంగానే ఆయన సూపర్యాచ్ 'డ్రాగన్ఫ్లై' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.జర్మనీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ ల్యూర్సెన్ ఈ యాచ్ను నిర్మించింది. దాదాపు 466 అడుగుల పొడవు (142.1 మీటర్లు) ఉన్న ఈ సూపర్యాచ్ను 2024లో సెర్గీ బ్రిన్కు అందజేశారు. ప్రారంభంలో.. దీనిని మరో వ్యక్తి కోసం తయారు చేసినప్పటికీ, చివరికి బ్రిన్ సొంతం చేసుకున్నారు. దీని విలువ 450 మిలియన్ డాలర్లు (రూ.3700 కోట్ల కంటే ఎక్కువ). ఈ యాచ్ ప్రత్యేకత కేవలం విలాసవంతమైన సౌకర్యాలు మాత్రమే కాదు. అందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బిజినెస్ డెక్. సాధారణంగా సూపర్యాచ్లలో ఎక్కువ స్థలాన్ని అతిథుల కోసం, వినోదం కోసం కేటాయిస్తారు. కానీ.. డ్రాగన్ఫ్లైలో మాత్రం పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వ్యక్తిగత ఆఫీస్, సమావేశాల కోసం ప్రత్యేక స్థలం, జిమ్, గేమ్స్ రూమ్తో పాటు బయటకు కనిపించని హెలికాప్టర్ హ్యాంగర్ కూడా ఉంది. దీంతో ప్రపంచంలో ఎక్కడ సముద్ర ప్రయాణం చేస్తున్నా.. అవసరమైనప్పుడు హెలికాప్టర్లో వచ్చి నేరుగా యాచ్పై దిగవచ్చు. అదే సమయంలో కార్యాలయ పనులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు.డ్రాగన్ఫ్లైలో అత్యాధునిక టెక్నాలజీలను కూడా ఉపయోగించారు. ఇందులో డీజిల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇంజిన్ వ్యవస్థను అమర్చారు. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయంలో శబ్దం, కంపనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ యాచ్ గరిష్టంగా 24 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. సుదూర సముద్ర ప్రయాణాలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చే ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి.ఈ సూపర్యాచ్లో ఒకేసారి 18 మంది అతిథులు ఉండటానికి సౌకర్యవంతంగా ఉంది. వారికి సేవలు అందించేందుకు దాదాపు 40 మంది సిబ్బంది ఉండవచ్చు. రెండు హెలిప్యాడ్లు, స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన విశ్రాంతి ప్రదేశాలు వంటి అనేక సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేశారు. అందుకే ఇది కేవలం ఒక విలాసవంతమైన యాచ్ మాత్రమే కాదు.. 5 స్టార్ హోటల్ను తలపించే తేలియాడే భవనం అని చెప్పవచ్చు.ఇదీ చదవండి: నాసా కొత్త ప్రయోగం.. శని వలయాల రహస్యాలపై దృష్టి! -
ఉద్యోగం పోగొట్టిన రూ.4.5 కోట్ల జీతం!
రూ.4.5 కోట్ల జీతం శాపం కావడం ఏంటి? అంత జీతం వస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు కదా.. మరి ఉద్యోగం పోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి..చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్లో (Tencent) పనిచేస్తున్న ఓ ప్రాజెక్ట్ మేనేజర్కు తన భారీ వేతన ప్యాకేజీనే చివరకు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది. కంపెనీ అంతర్గత సమాచారంగా ఉన్న అతని వార్షిక పరిహారం వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, గోప్య సమాచారాన్ని బాహ్య వ్యక్తులతో పంచుకున్నారనే ఆరోపణలపై సంస్థ అతడిని తొలగించింది. ఈ ఘటన చైనాలో కార్పొరేట్ గోప్యత, ఉద్యోగుల వేతన పారదర్శకతపై మరోసారి చర్చకు దారితీసింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. 'యే'(Ye) అనే ఇంటిపేరుతో ఉన్న ఓ వ్యక్తి టెన్సెంట్కు చెందిన వీషిన్ (Weixin) గ్రూప్లో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఈ వీషిన్ గ్రూపే ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకు పైగా వినియోగదారులు ఉపయోగించే వీచాట్ (WeChat) సూపర్ యాప్ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.కంపెనీ అంతర్గత వ్యవస్థ నుంచి తీసినట్లు భావిస్తున్న ఒక స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో యేకు ఏడాదికి సుమారు 3.17 మిలియన్ యువాన్లు (సుమారు రూ.4.5 కోట్లు) వేతన పరిహారం లభిస్తున్నట్లు కనిపించింది. ఇందులో 8.2 లక్షల యువాన్లకు పైగా నగదు బోనస్ (దాదాపు రూ.1.17 కోట్లు), 2.35 మిలియన్ యువాన్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాలు (సుమారు రూ.3.35 కోట్లు) కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ వివరాలు చైనీస్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ఉద్యోగుల వేతనాలు, కంపెనీల గోప్యతా విధానాలపై తీవ్ర చర్చ మొదలైంది.టెన్సెంట్ అంతర్గత క్రమశిక్షణా నోటీసు ప్రకారం.. యే సున్నితమైన కార్పొరేట్ సమాచారాన్ని సంస్థ వెలుపలికి చేరవేసినందుకు అతన్ని తొలగించినట్లు పేర్కొంది. ఈ లీక్ కంపెనీకి అంతర్గతంగా, బాహ్యంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని సంస్థ అభిప్రాయపడింది. అంతేకాదు, భవిష్యత్తులో టెన్సెంట్లో ఎలాంటి ఉద్యోగానికి కూడా అతడిని పరిగణించబోమని, శాశ్వతంగా బ్లాక్లిస్ట్ చేసినట్లు సమాచారం.ఇటీవలి కాలంలో టెన్సెంట్ తన కంప్లయెన్స్, అవినీతి నిరోధక చర్యలను మరింత కఠినతరం చేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2025లో 70కు పైగా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించగా, వాటి ఫలితంగా 90 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. మరో 20కు పైగా కేసులను క్రిమినల్ విచారణ కోసం చట్ట అమలు సంస్థలకు పంపించారు. టెన్సెంట్ విధానాల ప్రకారం ఉద్యోగులు వ్యాపార రహస్యాలు, అంతర్గత కమ్యూనికేషన్లు, విడుదల కాని సోర్స్ కోడ్, ఉద్యోగుల రికార్డులు వంటి గోప్య సమాచారాన్ని బహిర్గతం చేయడం నిషేధితం. -
ఇండియా పాస్పోర్ట్ పవర్ తగ్గిందా?
ప్రపంచ దేశాల పాస్పోర్ట్ల బలాన్ని అంచనా వేసే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 (జూలై ఎడిషన్)లో భారత పాస్పోర్ట్ ర్యాంకింగ్ మరోసారి పడిపోయింది. ఫిబ్రవరిలో 75వ స్థానానికి చేరిన భారత్, మేలో 78వ స్థానానికి జారగా, తాజాగా 81వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత పాస్పోర్ట్తో ప్రపంచంలోని 55 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. ఈ ర్యాంకింగ్ 199 దేశాల పాస్పోర్ట్లను, 227 గమ్యస్థానాలకు ఉన్న వీసా సౌకర్యాల ఆధారంగా రూపొందించారు.ఈ ఏడాది ప్రారంభంలో భారత్ 85వ స్థానంలో ఉండగా, ఫిబ్రవరిలో ఒక్కసారిగా 75వ స్థానానికి ఎగబాకింది. అయితే తరువాతి నెలల్లో ఇతర దేశాల వీసా విధానాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాల పునర్వ్యవస్థీకరణ ప్రభావంతో భారత్ మళ్లీ క్రమంగా దిగజారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హెన్లీ ఇండెక్స్లో ర్యాంకు మార్పు అనేది ఒక దేశానికి లభించే వీసా-రహిత గమ్యస్థానాల సంఖ్యతో పాటు ఇతర దేశాల పనితీరుపైనా ఆధారపడి ఉంటుంది.హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 20వ వార్షికోత్సవ ఎడిషన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సగటు పాస్పోర్ట్కు 2006లో 58 గమ్యస్థానాలకు మాత్రమే వీసా-రహిత ప్రవేశం ఉండగా, ప్రస్తుతం అది 108 గమ్యస్థానాలకు పెరిగింది. ఈ ఇండెక్స్ను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) టిమాటిక్ డేటా ఆధారంగా రూపొందిస్తారు.ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా సింగపూర్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పౌరులు 192 గమ్యస్థానాలకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. యూఏఈ ఈ ఏడాది అత్యధిక పురోగతి సాధించి మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్ను చేరుకుంది. మరోవైపు అమెరికా 10వ స్థానంలో కొనసాగుతోంది. -
గూగుల్లో పెట్టుబడి.. అసలు రహస్యం ఇదే!
ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ 2025 చివరి నాటికి బెర్క్షైర్ హాత్వే సీఈఓ పదవి నుంచి వైదొలగి.. ఛైర్మన్గా మాత్రమే ఉంటున్నారు. అయితే ఈయన ఈ వయసులో ఎలాంటి పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, కొత్త సీఈఓ 'గ్రెగ్ అబెల్' అన్నీ చూసుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ, ఒక ఇంటర్వ్యూలో బఫెట్ మాట్లాడుతూ.. గూగుల్ మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్'లో బెర్క్షైర్ పెట్టిన లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెనుక అసలు మాస్టర్ మైండ్ తానేనని వెల్లడించారు.నిజానికి ఈ పెట్టుబడి నిర్ణయం అంతా గ్రెగ్ అబెల్ తీసుకున్నారనే భావించారు. కానీ.. సీఈఓగా తుది నిర్ణయం ఆయనే తీసుకున్నప్పటికీ, అసలు ఈ ఐడియా పుట్టింది మాత్రం బఫెట్ మైండ్లోనే. "నేను అతడి ఆమోదం లేకుండా ఏదీ చేయను, అతను నా ఆమోదం లేని పని చేయడు. మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం గ్రెగ్ అబెల్ దే" అని బఫెట్ చాలా సింపుల్గా చెప్పారు.అయితే గూగుల్లో ఇంత ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడానికి అసలు కారణం ఏంటో కూడా బఫెట్ ఓపెన్గా చెప్పేశారు. అప్పట్లో గూగుల్ కంపెనీ టెక్నాలజీ రంగంలో ఇంతలా ఎదుగుతుందని బఫెట్ నమ్మలేకపోయారట. అందుకే పెట్టుబడులు పెట్టలేదు. తాను 'పొరపాటు చేశానని' వారెన్ బఫెట్ అన్నారు. ఆ పశ్చాత్తాపం నుంచి బయటపడటానికే ఇప్పుడు ఆల్ఫాబెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. -
హింద్ జింక్ లాభం డబుల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్ (హెచ్జెడ్ఎల్) నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ. 5,469 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ. 2,234 కోట్లు. ఇక ఆదాయం సైతం 72 శాతం ఎగిసి రూ. 13,033 కోట్లకు పెరిగింది. క్రితం క్యూ1లో ఇది రూ. 7,591 కోట్లు.లోహాల ధరలు .. ఉత్పత్తి పెరగడం, బై–ప్రోడక్టుల ద్వారా మరింత ఆదాయం లభించడం, డాలరు పటిష్టంగా ఉండటం తదితర అంశాల కారణంగా ఆదాయం గణనీయంగా వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ మాజీ సీఎండీ అమరేందు ప్రకాశ్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైమ్ డైరెక్టర్గా నియమించుకున్నట్లు వివరించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. -
భారీగా తగ్గిన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం.. కేసు సెటిల్మెంట్ ఎఫెక్ట్!
ముంబై: ఎన్ఎంసీ గ్రూప్ వివాదం విషయంలో కోర్టు వెలుపల సెటిల్మెంట్ కోసం భారీగా రూ. 5,680 కోట్లు చెల్లించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)పై తీవ్ర ప్రభావం చూపింది. దీనితో బ్యాంకు లాభం రూ. 1,783 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఇది 48% తక్కువ. అనేక సంవత్సరాలుగా సాగుతున్న సంక్లిష్టమైన వివాదానికి ముగింపు పలికేందుకు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవడం వ్యాపారపరంగా సరైన నిర్ణయమని బ్యాంకు సీఈవో, ఎండీ దేవదత్త చాంద్ తెలిపారు. దివాలా తీసిన యూఏఈ సంస్థ ఎన్ఎంసీ గ్రూప్ రుణాల మోసంలో బీవోబీ పాత్ర కూడా ఉందంటూ అబుదాబి ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దీని సెటిల్మెంట్కి అబుధాబి బ్రాంచ్ ద్వారా 600 మిలియన్ డాలర్లు (రూ. 5,700 కోట్లు) చెల్లించినట్లు బీవోబీ జూలై 2న వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో 17 శాతం రుణాల వృద్ధితో బ్యాంకు రూ. 12,524 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించగా, నికర వడ్డీ మార్జిన్ 2.91 శాతం నుంచి 2.77 శాతానికి నెమ్మదించింది. స్థూల మొండిబకాయిలు 1.89 శాతం నుంచి 1.99 శాతానికి పెరిగాయి. -
700 సార్లు రిజెక్ట్ చేశారు.. అయినా పట్టుదలతో..
సాంకేతిక నేపథ్యం లేదు.. చేతిలో ఐఐటీ, ఎన్ఐటీల డిగ్రీలు లేవు.. కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ల నుంచి వరుస నిరాకరణలు.. కుటుంబ సభ్యుల్లో నిరాశ, భవిష్యత్తుపై తీవ్ర భయాందోళనలు. అయినా సరే పట్టుదల వీడకుండా పోరాడి, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నెలకు రూ.25,000 జీతం నుంచి ఏకంగా రూ.22 లక్షల వార్షిక వేతనానికి ఎదిగిన ఓ 24 ఏళ్ల యువకుడి కథనం ఇప్పుడు సోషల్ మీడియా, కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎంబీఏ నుంచి డేటా సైన్స్ వైపు2022లో ఒక సాధారణ కళాశాల నుంచి బీబీఏ పూర్తి చేసిన సదరు యువకుడు క్యాట్ (సీఏటీ) రాసి మంచి మేనేజ్మెంట్ కళాశాలలో సీటు సాధించడానికి ఏళ్ల సమయం పడుతుందని గ్రహించాడు. సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో తన మార్గాన్ని డేటా సైన్స్ వైపు మళ్లించాడు. నాన్-టెక్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ యూట్యూబ్, కొన్ని వంటి డిజిటల్ వేదికల ద్వారా దాదాపు ఏడాదిన్నర పాటు స్వయంగా కోడింగ్, డేటా ఎనలిటిక్స్ నేర్చుకున్నాడు. స్నేహితులు ఉన్నత ఉద్యోగాలు, పైచదువుల కోసం విదేశాలకు వెళ్తున్న సమయంలో తాను మాత్రం గదికే పరిమితమై, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూనే నైపుణ్యాలను పెంపొందించుకున్నాడు.700 దరఖాస్తులు.. ఉద్యోగ సంక్షోభంటెక్ డిగ్రీ, అనుభవం లేదన్న కారణంతో 90 శాతానికి పైగా హెచ్ఆర్లు అతడి ప్రొఫైల్ను తిరస్కరించారు. దాదాపు 700కు పైగా కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాక నెలకు రూ.25,000 జీతంతో ఒక స్టార్టప్లో తొలి ఉద్యోగం లభించింది. అయితే, ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. మూడు నెలలకే కంపెనీలో ప్రాజెక్టులు లేక ఉద్యోగం పోయింది. రెండు నెలల జీతం కూడా బకాయి పడింది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా ధైర్యంతో మళ్లీ లింక్డ్ఇన్లో దరఖాస్తులు చేస్తూ నాలుగు నెలల తర్వాత రూ.6 లక్షల ప్యాకేజీతో మరో ఉద్యోగం సాధించాడు.ఆ కంపెనీలో 1.7 ఏళ్లు పనిచేస్తూ సమాంతరంగా నైపుణ్యాలను మరింత పదును పెట్టుకున్న అతడు తాజాగా ఒక ప్రముఖ అమెరికన్ ఎంఎన్సీలో రూ.22 లక్షల వేతనంతో ఆఫర్ లెటర్ సాధించాడు. డిగ్రీల కంటే నిరంతర నైపుణ్యాభివృద్ధి, మానసిక స్థిరత్వం ఉన్నవారికి నేటి డిజిటల్ యుగంలో ఆకాశమే హద్దు అని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే.. -
ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ సాధ్యమైందిలా..
ఒక పారిశ్రామికవేత్త విజయతీరాలకు చేరడానికి కేవలం మూలధనం, వ్యాపార వ్యూహాలు ఉంటే సరిపోవు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచే అపరిమితమైన విశ్వాసం, అంతులేని పట్టుదల కూడా చాలా అవసరమని నిరూపించారు భారతీయ లాజిస్టిక్స్ దిగ్గజం ‘డీటీడీసీ’ వ్యవస్థాపకుడు, సీఎండీ సుభాశిష్ చక్రవర్తి. వ్యాపార ఆలోచన ఎంత గొప్పదైనా బ్యాంకు తలుపులు తడితే నిరాశే ఎదురైన వేళ.. భార్య అందించిన ఆత్మీయ ప్రోత్సాహంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు రూ.2,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది.బ్యాంకుల తిరస్కరణ.. భార్య ప్రోత్సాహంచదువుకునే రోజుల్లోనే వ్యాపారంలో అడుగుపెట్టిన సుభాశిష్.. కెమికల్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నప్పుడు ఒక ప్రధాన సమస్యను గమనించారు. వినియోగదారులకు సరుకులు చేరినంత వేగంగా దానికి సంబంధించిన కాగితపత్రాలు (పేపర్వర్క్) అందడం లేదని గ్రహించారు. ఆ లోపాన్నే ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవాలనుకున్నారు. అలా ఉద్భవించిందే డోర్-టు-డోర్ డెలివరీ స్టార్టప్ ఆలోచన. అయితే ఈ ప్రాజెక్ట్కు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. ఆ సంక్షోభ సమయంలో ఆయన భార్య తపసి చక్రవర్తి తన ఒంటిపై ఉన్న పసిడి ఆభరణాలను కుదువబెట్టి పెట్టుబడిగా ఆ డబ్బును అందించారు. ఆ విశ్వాసమే డీటీడీసీ ఆవిర్భావానికి పునాదిగా మారింది.ఫ్రాంచైజీ మోడల్తో విప్లవంఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ విస్తరణకు సరికొత్త దారి వెతికారు సుభాశిష్. భారతీయ లాజిస్టిక్స్ రంగంలోనే తొలిసారిగా ‘ఫ్రాంచైజీ మోడల్’ను ప్రవేశపెట్టారు. నిధులకు బదులుగా మానవ వనరుల భాగస్వామ్యంతో నెట్వర్క్ను పెంచుకుంటూ పోయారు. ఫలితంగా ప్రస్తుతం డీటీడీసీకి 16,500 కంటే ఎక్కువ మంది ఛానెల్ పార్టనర్లు ఉన్నారు. దేశంలోని 96 శాతం జనాభాకు ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. రోజూ సుమారు 1,00,000 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఏటా దాదాపు 19 కోట్ల పార్సెళ్లను విజయవంతంగా డెలివరీ చేస్తున్నారు.నవతరం స్టార్టప్లకు మార్గదర్శనం‘ఇవాళ మీకు ఎదురయ్యే తిరస్కరణలు మీ ప్రయాణానికి ముగింపు కాదు. మిమ్మల్ని మీరు నమ్మేంతవరకు మిమ్మల్ని నమ్మే ఒక వ్యక్తి తోడున్నా చాలు’ అని సుభాశిష్ చక్రవర్తి పేర్కొన్న వ్యాఖ్యలు నేటి యువ పారిశ్రామికవేత్తలకు దిక్సూచిలాంటివి. ఒక సాదాసీదా మహిళ చూపిన నమ్మకం, వేలాది మంది చిన్న తరహా భాగస్వాములను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే అసలైన భారతీయ వ్యాపార విజయం.ఇదీ చదవండి: ‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ -
‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలకమైన ఉత్తర్వులను వెలువరించింది. ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారి అయిన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషితో పాటు దుబాయ్కి చెందిన ప్రధాన ట్రేడర్ ప్రిజేష్ కురానీలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఏడేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.రూ.30.56 కోట్ల అక్రమ లాభాల జప్తుఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన రూ.30.56 కోట్ల అక్రమ లాభాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సెబీ ఆ మొత్తాన్ని ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’కి తరలించాలని ఆదేశించింది. దీనికి అదనంగా దర్యాప్తు కాలం ముగిసిన నాటి నుంచి డిపాజిట్ చేసే తేదీ వరకు సంవత్సరానికి 12 శాతం చొప్పున వడ్డీని కూడా జరిమానాగా చెల్లించాలని స్పష్టం చేసింది.అసలు వివాదం ఏమిటి?సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు (యాక్సిస్ వంటివి) మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీ షేర్లను వేల కోట్లలో కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి సిద్ధమైనప్పుడు ఆ షేరు ధర మార్కెట్లో ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఈ సమాచారం బయటకు రాకముందు అత్యంత రహస్యంగా ఉంటుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషి తన వద్ద ఉన్న ఈ రహస్య ట్రేడింగ్ సమాచారాన్ని ఆసరాగా చేసుకున్నాడు. యాక్సిస్ ఫండ్ మార్కెట్లో ఏ షేరును ఎంత పరిమాణంలో కొనుగోలు చేయబోతుందో లేదా అమ్మబోతుందో వీరేష్ జోషి ముందే తెలుసుకునేవాడు. ఈ ముందస్తు సమాచారాన్ని దుబాయ్లో ఉన్న ప్రధాన ట్రేడర్ ప్రిజేష్ కురానీకి చేరవేసేవాడు (ఈ చాటింగ్లలో జోషిని ‘జాదూగర్’ అని పిలిచేవారు). యాక్సిస్ ఫండ్ తన భారీ ఆర్డర్ను మార్కెట్లో పెట్టడానికి కొద్ది నిమిషాల ముందే కురానీ తన వద్ద ఉన్న బినామీ/బోగస్ ఖాతాల ద్వారా ఆ షేర్లను తక్కువ ధరకు కొనేసేవాడు. ఆ వెంటనే యాక్సిస్ ఫండ్ భారీ ఆర్డర్ మార్కెట్లోకి రాగానే షేరు ధర పెరిగేది. అప్పుడు కురానీ ముందే కొన్న షేర్లను అధిక ధరకు యాక్సిస్ ఫండ్కే (లేదా మార్కెట్లో) అమ్మేసి రూ.కోట్లలో లాభాలు గడించేవాడు. సెబీ జరిపిన సమగ్ర విచారణలో సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 మధ్యకాలంలో ఈ అక్రమాలు సాగినట్లు తేలింది.సిండికేట్పై కఠిన చర్యలువాట్సాప్ చాట్లు, ట్రేడ్ లాగ్లు, కాల్ రికార్డుల ఆధారంగా సెబీ ఈ బినామీ వ్యవస్థను ఛేదించింది. తీవ్రతను బట్టి నెట్వర్క్లోని మిగిలిన భాగస్వాములపై విభిన్న నిషేధాలు విధించింది.7 ఏళ్ల నిషేధం: వీరేష్ జోషి, ప్రిజేష్ కురానీతో పాటు ధరిణి కురానీ, రేఖా కురానీ, భారతి గొడాయా సహా ఏడుగురు.5 ఏళ్ల నిషేధం: బినామీ ఖాతాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన సుమిత్ దేశాయ్, ప్రణవ్ వోరా.3 ఏళ్ల నిషేధం: వైభవ్ పాండ్యా, నిశిల్ మార్ఫాటియా, ఆల్గా ట్రేడింగ్, వీసా క్యాపిటల్ పార్టనర్స్ సహా మరో 12 మంది వ్యక్తులు, సంస్థలపై.సాధారణ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్పై ఉంచిన నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ సాగించిన ఈ కార్పొరేట్ అక్రమాన్ని సెబీ నిరోధించిన తీరు మార్కెట్ పారదర్శకతకు, ఇన్వెస్టర్ల విశ్వాస పునరుద్ధరణకు దారితీస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్, ఫ్రంట్ రన్నింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ఏ శక్తికీ మార్కెట్లో చోటు లేదని సెబీ ఈ తీర్పు ద్వారా స్పష్టమైన హెచ్చరిక పంపింది.ఇదీ చదవండి: ఎగుమతులకు రెక్కలొచ్చేనా? -
రూ.8 లక్షల కోట్ల మార్కెట్పై కన్ను!
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంది. వచ్చే దశాబ్దకాలంలో (2035 నాటికి) ఎఫ్ఎంసీజీ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించి రూ. 8 లక్షల కోట్లకు వృద్ధి చెందనున్న మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు.ప్రీమియం ఉత్పత్తులు, యువ జనాభా ఇందుకు తోడ్పడనున్నట్లు సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇతర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా కూడా అధిక వృద్ధికి అవకాశమున్న విభాగాల్లో విస్తరిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కొనుగోలుదారుల అవసరాలను అర్థం చేసుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) సాధనాలను ఉపయోగిస్తున్నట్లు పురి తెలిపారు.ఆన్లైన్, క్విక్ కామర్స్ మాధ్యమాలు వేగంగా విస్తరిస్తున్నాయని, స్మార్ట్ సరఫరా వ్యవస్థలు అనేక ఉత్పత్తులను కొనుగోలుదారుల ఇంటి వద్దకు సురక్షితంగా చేరుస్తున్నాయని చెప్పారు. ఐటీసీ ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 30 పైగా ప్రపంచ స్థాయి బ్రాండ్స్ ఉన్నాయని పురి తెలిపారు.2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,720 కోట్లుగా ఉన్న ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,200 కోట్లకు ఎగిసిందన్నారు. మరోవైపు పాలసీలపరంగా వివిధ సంస్కరణల తోడ్పాటుతోనే భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుస్తోందని పురి తెలిపారు. -
జాతి వివక్ష ఆరోపణలు.. ఎలాన్ మస్క్ క్లారిటీ!
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి జాతి వివక్ష ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. అయితే.. ఈసారి సోషల్ మీడియాలో స్పందించకుండా, తన కుటుంబం గురించే ప్రస్తావిస్తూ తాను జాతి వివక్షను నమ్మే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.తన భార్య శివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ అని మస్క్ వెల్లడించారు. ఆమె తల్లి భారతీయురాలు. అయితే జిలిస్ కెనడాలో పెరిగిందని చెప్పారు. తమకు నలుగురు పిల్లలు ఉన్నారని, వారిలో ఒక కుమారుడికి భారతీయ సంతతికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు పెట్టాము. అలాంటప్పుడు నన్ను జాతి వివక్షవాదిగా ఎలా అంటారు?, అని మస్క్ ప్రశ్నించారు.మస్క్ కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ సిరియస్. నక్షత్రాల పరిణామం, నిర్మాణంపై చేసిన అద్భుతమైన కృషికి గాను 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్కు నివాళిగా 'శేఖర్' అనే మధ్య పేరు పెట్టారు. ఈ విషయాన్ని మస్క్ నిఖిల్ కామత్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.జాతి వివక్ష ఆరోపణలకు కారణంగత కొంతకాలంగా వలసలు, జాతి అంశాలు, రాజకీయాలపై మస్క్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూరప్లోని కొన్ని మితవాద రాజకీయ పార్టీలకు ఆయన మద్దతు ఇవ్వడం, వలసలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయనపై జాతి వివక్ష ఆరోపణలు కూడా వచ్చాయి.అయితే.. ఈ ఆరోపణలను మస్క్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తన కుటుంబం వివిధ సంస్కృతులు, భిన్న నేపథ్యాల కలయికకు నిదర్శనమని, అలాంటి వ్యక్తిని జాతి వివక్షవాదిగా చెప్పడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యమే ఈ ఆరోపణలకు సమాధానమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం! -
నెలకు రూ.2 లక్షల జీతం.. అప్పుల ఊబిలో ఐటీ ఉద్యోగి!
నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఎలాటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా ముందుకు సాగిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ దీనికి భిన్నంగా ఉంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేయడం మాత్రమే కాకుండా.. ఆలోచింపజేసింది కూడా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఒక 27 ఏళ్ల ఐటీ ఉద్యోగి తన జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి రెడ్డిట్లో వెల్లడించాడు. నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నప్పటికీ సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత తన జీవితంలో వరుసగా ఎన్నో పెద్ద ఖర్చులు వచ్చాయని చెప్పాడు.పెళ్లి ఖర్చులతో పాటు.. కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చింది. కొన్ని నెలలకే భార్యతో కలిసి మరో నగరానికి మారాల్సి రావడంతో కొత్త ఇంటిని పూర్తిగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇంటి అద్దె, అడ్వాన్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామగ్రి వంటి అవసరాల కోసం లక్షల రూపాయలు ఖర్చయ్యాయని టెకీ పేర్కొన్నాడు.ఇంతలో మరో ఊహించని సమస్య ఎదురైంది. తన భార్య ఉద్యోగం కోల్పోవడంతో.. కుటుంబం మొత్తం ఒక్కరి జీతంపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆదాయం తగ్గిపోకపోయినా, బాధ్యతలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో అప్పులు చేయడం తప్ప.. మరో మార్గం కనిపించలేదని ఆయన వివరించాడు.Earning ₹2L/month but drowning in debt, need adviceby u/lonewolf_2298 in FinancialAdviceIndiaప్రస్తుతం ఆయన బంధువుల నుంచి తీసుకున్న రూ.20 లక్షల అప్పుకు ప్రతి నెల రూ.25 వేల చెల్లిస్తున్నారు. మరోవైపు పర్సనల్ లోన్ ఈఎంఐ కూడా రూ.25 వేల వరకు ఉంది. అదనంగా క్రెడిట్ కార్డు ఈఎంఐల కోసం ప్రతి నెల దాదాపు రూ.30 వేల చెల్లిస్తున్నారు. ఈ ఈఎంఐలు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత కొంత ఉపశమనం లభిస్తుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశారు.అంతేకాకుండా.. రూ.6 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టి రూ.2.2 లక్షల లోన్ తీసుకున్నారు. ప్రస్తుతం చేతిలో సేవింగ్స్ లేకపోవడమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదని చెప్పారు. ఈ పరిస్థితి తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.అయితే తన పరిస్థితిపై ఎవరి సానుభూతి అవసరం లేదని, ఈ సమస్య నుంచి వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఎలా బయటపడాలో చెప్పాలని రెడ్డిట్ యూజర్లను కోరారు. దీనికి స్పందించిన చాలామంది ముందుగా అవసరం లేని ఖర్చులను తగ్గించాలని, అధిక వడ్డీ ఉన్న అప్పులను త్వరగా తీర్చాలని, మళ్లీ పొదుపు ప్రారంభించాలని సూచించారు. అలాగే కుటుంబంలో ఇద్దరూ సంపాదించే పరిస్థితి వస్తే.. ఆర్థిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఎక్కువ జీతం వస్తే.. అదే ఆర్ధిక భద్రత ఉన్నట్లు కాదు. జీవితంలో అనుకోకుండా వచ్చే బాధ్యతలు, అత్యవసర ఖర్చులు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల ఎవరైనా అప్పుల ఊబిలో చిక్కుకోవచ్చు. కాబట్టి.. ఎంత ఆదాయం ఉన్నా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, అవసరం లేని అప్పులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే, దానిని సరిగ్గా నిర్వహించడం అంతకంటే గొప్ప నైపుణ్యం. -
ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష
ఆన్లైన్ షాపింగ్ షాకింగ్ అనుభవాన్నిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖరీదైన గాడ్జెట్లు ఆర్డర్ ఇస్తే.. ఇటుకలు, సోప్లు వచ్చిన సంఘటనలు గతంలో అనేకం చూశాం. అయితే జరిగిన మోసం పట్ల సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం చాలా మంచిదని చాటి చెప్పే సంఘటన ఇది. అలా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) కు భారీ షాక్ తగిలింది.అసలు ఏం జరిగిందంటే...ఆన్లైన్ ద్వారా ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) ఆర్డర్ చేస్తే దానికి బదులుగా Beard Growth Oil పార్శిల్ పంపింది ఫ్లిప్కార్ట్. ముంబైలోని పవాయ్కు చెందిన వినియోగదారుడు 2023 ఏప్రిల్ 22న ఫ్లిప్కార్ట్లో రూ. 1,11,793 విలువైన 'ఆపిల్ ఐఫోన్ 14 ప్రో (128 GB)'ను నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) ద్వారా ఆర్డర్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఫోన్కు బదులుగా గడ్డం పెరిగే నూనె సీసా ఉంది.తొలుత పట్టించుకోని ఫ్లిప్కార్ట్ దీనిపై కస్టమర్ కేర్కు పదే పదే ఫిర్యాదు చేసినా, అవసరమైన ఆధారాలు అందించినా సమస్య పరిష్కరించకుండానే ఫ్లిప్కార్ట్ ఆ కస్టమర్ కంప్లైంట్ను రిసాల్వ్డ్ అని క్లోజ్ చేస్తూ వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా క్లోజ్ చేయడంపై వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ముంబైలోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమీషన్ కోర్టు వస్తువు విక్రయించాక ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేవని తేల్చి చెప్పింది. అతనికి తగిన పరిహారం చెల్లించాలని ఆదేశించింది.పరిహారం ఎంతంటే:ఫోన్ ధర రూ. 1,11,793కు 2023 నుంచి ఏప్రిల్ 22 నుండి 9శాతం వార్షిక వడ్డీతో కలిపి వెనక్కి చెల్లించాలి. అలాగే మానసిక వేదనకు గాను రూ. 50,000 బాధితుడికి చెల్లించాలి. ఇంకా కోర్టుల ఖర్చుల కింద కేసు ఖర్చుల కింద రూ. 20వేలు చెల్లించాలని ఆదేశించింది మొత్తంగా ఫ్లిప్కార్ట్ , సెల్లర్ ఉమ్మడిగా రూ. 1.81 లక్షల పైచిలుకు పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీఈ కేసులో ఆపిల్ ఇండియా (Apple India) ను కూడా కస్టమర్ బాధ్యులను చేస్తూ చేర్చారు. అయితే, తమ ఉత్పత్తులను స్వతంత్ర డీలర్ల ద్వారా విక్రయిస్తామని, ప్యాకింగ్ లేదా డెలివరీలో తమ పాత్ర ఏమీ ఉండదని ఆపిల్ వాదించింది. ఈ వాదనను అంగీకరించిన వినియోగదారుల ఫోరమ్ ఆపిల్ ఇండియాపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసి, లోపమంతా ఫ్లిప్కార్ట్, సెల్లర్దేనని తీర్పు ఇచ్చింది.ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం -
అపోలో హాస్పిటల్స్, ఇప్లేన్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రమాదాల్లో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి చేర్చి, కీలక సమయంలో చికిత్స అందేందుకు తోడ్పడేలా యూబిఫ్లై టెక్నాలజీస్ (ఇప్లేన్ కంపెనీ), అపోలో హాస్పిటల్స్ చేతులు కలిపాయి. ఎమర్జెన్సీ హెల్త్ కేర్ వ్యవస్థలో ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్లు, మెడికల్ డెలివరీ డ్రోన్లను వినియోగించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.దీనితో పేషంట్లను వేగవంతంగా ఆస్పత్రికి చేర్చేందుకు ఇప్లేన్కి చెందిన ఈ200ఎక్స్ ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్లు, అపోలోకి చెందిన 1066 అంబులెన్స్లు..ఆస్పత్రులతో పాటు ఔషధాలు.. ఉత్పత్తులను నిమిషాల్లో సరఫరా చేసే మెడికల్ డెలివరీ డ్రోన్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా కీలక సమయంలో నాణ్యమైన వైద్యం అందగలదని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. ఈ భాగస్వామ్యం కింద ఈ200ఎక్స్ ఎయిర్ అంబులెన్స్లు, మెడికల్ డెలివరీ డ్రోన్ల కోసం అపోలో ఆర్డర్లు ఇవ్వడానికి, అలాగే ఇప్లేన్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. -
డెంగ్యూ టీకా ఇక తీసుకోవచ్చు.. డీసీజీఐ అనుమతులు
న్యూఢిల్లీ: డెంగ్యూ నివారణకు ఉద్దేశించిన ’క్యూడెంగా’ టీకా మార్కెటింగ్కి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు లభించినట్లు టకెడా బయోఫార్మా ఇండియా వెల్లడించింది. డెంగ్యూకి సంబంధించి భారత్లో ఆమోదం లభించిన ఈ తొలి టీకాను, 4–60 ఏళ్ల వయస్సు గలవారు తీసుకోవచ్చు.2022లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ వేక్సిన్కి 43 దేశాల్లో ఆమోదం లభించిందని, అంతర్జాతీయంగా 3.2 కోట్ల డోస్లు సరఫరా అయ్యాయని టకెడా ఇంటర్కాంటినెంటల్ మార్కెట్స్ విభాగం హెడ్ మహేందర్ నాయక్ తెలిపారు. తమ గ్లోబల్ క్లినికల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫలితాల ఆధారంగా భారత్లో దీనికి ఆమోదం లభించినట్లు వివరించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధి 125 దేశాల్లో ఉంది. మొత్తం కేసుల్లో భారత్ వాటా మూడో వంతు ఉంటోంది. -
ఇంటికి పిలిస్తే రూ .79,000.. దుబాయ్ కొత్త స్కీమ్!
విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను దుబాయ్కు ఆహ్వానించే యూఏఈ నివాసితులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) తాజాగా 'A Dubai Invite' పేరుతో ప్రత్యేక సిటీ అంబాసిడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన నివాసితులు విదేశాల నుంచి బంధువులు లేదా స్నేహితులను దుబాయ్కు తీసుకొస్తే 3,000 దిర్హమ్లకు పైగా (సుమారు రూ.79,000) విలువైన హోటల్ బసలు, రెస్టారెంట్ ఆఫర్లు, పర్యాటక ఆకర్షణల టికెట్లు, లైఫ్స్టైల్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.ఈ కార్యక్రమం ప్రకారం, 2026 జూలై 20 నుంచి అక్టోబర్ 31 మధ్య దుబాయ్కు వచ్చే విదేశీ సందర్శకులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సందర్శకులు చేరుకునే ముందు యూఏఈ నివాసితులు ఆన్లైన్లో వారి వివరాలను నమోదు చేయాలి. ఒకేసారి గరిష్ఠంగా ఐదుగురిని నామినేట్ చేయవచ్చు. వారు దుబాయ్ చేరుకున్న తర్వాత అధికారిక వ్యవస్థల ద్వారా రాక ఆటోమేటిక్గా వేరిఫై అవుతుంది. అనంతరం 72 గంటల్లో రివార్డులను ఎలా వినియోగించుకోవాలో తెలిపే ఈమెయిల్ను టూరిజం డిపార్ట్మెంట్ పంపిస్తుంది. ఈ రివార్డులు 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి.అర్హులు ఎవరంటే..ఈ పథకానికి 18 ఏళ్లు పైబడిన యూఏఈ పౌరులు, చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ ఐడీ కలిగిన నివాసితులు అర్హులు. ఆహ్వానితులు యూఏఈ నివాసితులు కాకూడదు. వారు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో లేదా వీసా-ఆన్-అరైవల్ అర్హతతో విమానం, సముద్రం లేదా రోడ్డు మార్గంలో దుబాయ్కు చేరుకోవాలి. అయితే వీసా ఏర్పాట్లు ఈ పథకంలో భాగం కావని, వాటిని సందర్శకులే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.గుర్తుంచుకోవాల్సిన నిబంధనలుప్రతి సందర్శకుడిని ఈ కార్యక్రమంలో ఒక్కసారి మాత్రమే నామినేట్ చేయవచ్చు. ఇప్పటికే మరో నివాసితుడు అదే వ్యక్తిని నమోదు చేసి ఉంటే, తదుపరి నామినేషన్కు రివార్డు వర్తించదు. అలాగే ప్రచార కాలంలో ప్రతి అర్హుడైన నివాసితుడు గరిష్ఠంగా మూడు రివార్డ్ ప్యాకేజీలు మాత్రమే పొందగలడు. పాల్గొనే బ్రాండ్లలో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, కరీమ్, హాలా వంటి సేవలు ఉన్నాయి. ఇటీవలి నెలల్లో అంతర్జాతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు దుబాయ్ చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. -
ఆఫీస్లో స్కూటీ స్వారీ చేసిన సీఈఓ
కార్పొరేట్ ఉద్యోగాలనగానే వెంటనే గుర్తుకువచ్చేది ఒత్తిడి, నిరంతర లక్ష్యాల సాధన, ఫార్మల్ సమావేశాలు. కానీ, బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ కంపెనీ ‘నోబ్రోకర్’ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన కార్పొరేట్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. కంపెనీ సాధించిన అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను జరుపుకొనే క్రమంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ కుమార్ అగర్వాల్ ఏకంగా ఆఫీసు ఆవరణలోనే స్కూటీ నడుపుతూ హల్చల్ చేశారు.ఉద్యోగులకు బహుమతినోబ్రోకర్ ప్రాపర్టీ అండ్ మూవర్స్ విభాగం ఊహించని రీతిలో రికార్డు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. నెలల తరబడి జట్టుగా పనిచేసి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్న ఉద్యోగుల శ్రమను గుర్తించిన యాజమాన్యం, వారికి పారితోషికంగా పలు బహుమతులను ప్రకటించింది. అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ద్విచక్రాహనాన్ని సీఈఓ స్వయంగా ఆఫీస్ ఫ్లోర్పై నడుపుకుంటూ వచ్చి విజేతలకు అందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.🚨 A Bengaluru-based CEO of NoBroker, rides scooter inside office to celebrate company's 'amazing quarter.' pic.twitter.com/UFq5zhMPh8— Indian Tech & Infra (@IndianTechGuide) July 23, 2026ఈ దృశ్యాన్ని చూసి ఉద్యోగులు చప్పట్లు, కేరింతలతో ఆఫీసును హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోను అమిత్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ‘ఈ రోజు నాకో అత్యంత ముఖ్యమైన పని అప్పగించారు.. అదేంటంటే ఆఫీస్లో స్కూటర్ నడపడం!’ అని సరదాగా పేర్కొన్నారు. ‘కష్టపడి పని చేసే ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్పడానికి ఫార్మల్ అవార్డు వేడుకల కంటే నాయకులే స్వయంగా వారి సంతోషంలో భాగస్వామి కావడం సరైన పద్ధతి’ అని అమిత్ కుమార్ అగర్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఇన్ఫోసిస్లో ఏఐ విప్లవం
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏఐ స్వీకరణలో సరికొత్త మైలురాయిని అందుకుంది. తమ సంస్థలోని దాదాపు 80,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం క్లాడ్ కోడ్, కోడెక్స్ వంటి అత్యాధునిక ఏఐ కోడింగ్ అసిస్టెంట్లను రోజువారీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ఫ్లోలో ఉపయోగిస్తున్నారని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన త్రైమాసిక ఫలితాల విశ్లేషణ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.రాబడిలో 8.2 శాతం ఏఐ వాటాసాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసినట్లు వివరిస్తూ జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సాధించిన మొత్తం రాబడిలో ఏఐ సేవల వాటానే 8.2 శాతానికి చేరిందని పరేఖ్ తెలిపారు. ఈ విభాగం గత కొన్ని త్రైమాసికాలుగా వరుసగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లు, ప్రాసెస్ ఆటోమేషన్, డేటా మోడర్నైజేషన్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సహా ఆరు వ్యాపార విభాగాల్లో బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్లయింట్ అవసరాలను తీర్చేందుకు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 6,000 మంది ‘ఫ్రంటియర్ ఇంజినీర్ల’ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.భద్రతతో కూడిన ప్లాట్ఫామ్సంస్థల డేటా భద్రతను కాపాడుతూ ఏఐ సేవలను అందించేందుకు ఇన్ఫోసిస్ తన ‘టోపాజ్ ఫ్యాబ్రిక్’ ప్లాట్ఫామ్ను మరింత విస్తరిస్తోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా క్లయింట్లు తమ డేటా సావర్నిటీకి భంగం వాటిల్లకుండా క్లౌడ్ ఆధారిత ఏ ఫౌండేషన్ మోడల్నైనా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా భారీ స్థాయిలో జెన్ ఏఐ ప్రయోగాలు చేసే సమయంలో కంపెనీలకు భారం కాకుండా ఏఐ టోకెన్ ఖర్చులను తగ్గించడంలో ఇది సాయపడుతోంది.భవిష్యత్తు కార్యాచరణప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ సంబంధిత పరిణామాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ రాబడి అంచనాను 1.5-3% కి తగ్గించినప్పటికీ ఏఐ విభాగంలో ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక భవిష్యత్తుపై ధీమాతో ఉంది. కంపెనీ వద్ద ఉన్న ఏఐ ప్రాజెక్టుల పైప్లైన్ ప్రస్తుతం లభిస్తున్న రాబడి కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఇన్ఫీ లాభం రూ.7,769 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మిశ్రమ పనితీరును నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.7,769 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 6,921 కోట్లతో పోలిస్తే లాభం 12.2% పెరిగింది. మొత్తం ఆదాయం 14% వృద్ధితో రూ. 48,211 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 42,279 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్గా.. ప్చ్ గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో నమోదైన లాభం రూ. 8,501 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్గా ఈ ఏడాది క్యూ1లో 8.6 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం స్వల్పంగా 3.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్యూ4లో కంపెనీ రూ. 46,402 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గైడెన్స్ కోత.. ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో 2026–27 పూర్తి ఏడాది ఆదాయం వృద్ధి అంచనాల్లో (గైడెన్స్) ఇన్ఫీ కోత విధించింది. ఆదాయ గైడెన్స్ను 1.5–3 శాతానికి తగ్గించింది. గతంలో ఆదాయ వృద్ధి 1.5–3.5 శాతంగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. ఇతర ముఖ్యాంశాలివీ... → క్లయింట్ల కోసం కంపెనీలో 80,000 మంది సిబ్బంది ఏఐ కోడింగ్ టూల్స్ ఉపయోగిస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో 6,000 మంది ఏఐ ఫ్రాంటియర్ ఇంజినీర్ల టీమ్ను ఏర్పాటు చేస్తామని ఇన్ఫీ పేర్కొంది.→ జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగులు సంఖ్య 3,28,062కు చేరింది. మార్చినాటికి సిబ్బంది సంఖ్య 3,28,594తో పోలిస్తే 532 మంది తగ్గారు. ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 13%గా నమోదైంది. → ఉద్యోగులకు వేతనాల పెంపు విషయానికొస్తే అక్టోబర్, జనవరి (సీనియర్లకు)లో రెండు విడతల్లో ఉంటుందని కంపెనీ తెలిపింది.→ క్యూ1లో 4,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని కంపెనీ వెల్లడించింది, గతేడాది మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చే ప్రణాళికల్లో ఉన్నామని వెల్లడించింది. → క్యూ1 ఆదాయంలో ఏఐ సర్వీసుల వాటా 8.5 శాతానికి పెరిగింది. → 3.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ షేరు ఫ్లాట్గా రూ.1,052 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఇన్ఫీ ఏడీఆర్ 4 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది.ఏఐ జోరు ఇప్పుడు ఆదాయం వనరుగా మారుతోంది. ఎంటర్ప్రైజ్ ఏఐని అమలు చేయడం ద్వారా ఇన్ఫోసిస్ స్థిరమైన మార్కెట్ వాటాను దక్కించుకుంటోంది. పటిష్టమైన భారీ డీల్స్ కుదరడం కంపెనీపై క్లయింట్ల నమ్మకానికి నిదర్శనం. దాదాపు అన్ని దిగ్గజ ఏఐ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం, నవకల్పనల ఎకోసిస్టమ్ను అందించడం ద్వారా క్లయింట్లు తమ నిర్వహణ ఉత్పాదకతను పెంచుకోవడంలో, వృద్ధి అవకాశాలను అన్లాక్ చేయడంలో తోడ్పాటునందిస్తున్నాం.మా ఉద్యోగులందరికీ ఏఐ నైపుణ్యాలను పెంచడానికి కట్టుబడి ఉన్నాం. ఒక క్లయింట్ నిర్ణయం కారణంగా ఆదాయంపై అసాధారణ (వన్టైమ్) ప్రభావం పడింది. – సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
అదనపు లగేజ్ కోసం.. రైల్వే కొత్త రూల్!
ట్రైన్ జర్నీ చేసేవారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్లాలంటే ప్రయాణికులు రైల్వే పార్సిల్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం వృథా కావడంతో పాటు, ప్రయాణానికి ముందు అనవసర ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ రైల్వే కొత్త నిర్ణయం తీసుకుంది.భారతీయ రైల్వే 2026 జూలై 31 నుంచి టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే.. అదనపు లగేజ్ కోసం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో ప్రయాణికులు ఇంటి నుంచే అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా సులభమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.లగేజ్ లిమిట్ ఇలా..ప్రస్తుతం ప్రయాణికుడు ప్రయాణించే క్లాస్ ఆధారంగా ఉచితంగా తీసుకెళ్లే లగేజీకి లిమిట్ ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్లో 70 కిలోలు.. ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్లో 50 కిలోలు.. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్, స్లీపర్ క్లాస్లో 40 కిలోలు, సెకండ్ క్లాస్లో 35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితిని మించి సామాను తీసుకెళ్లాలనుకుంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.అయితే.. అన్ని కోచ్లకు ఒకే విధమైన నిబంధనలు ఉండవు. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్లో ఉచిత పరిమితి, గరిష్ఠ పరిమితి రెండూ ఒకటే కావడంతో ఈ తరగతుల్లో అదనపు లగేజ్ బుకింగ్కు అనుమతి ఉండదు. మిగతా తరగతుల్లో మాత్రం నిర్ణయించిన గరిష్ఠ పరిమితి వరకు అదనపు లగేజీని బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సాధారణ లగేజ్ ఛార్జీ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించాలి.జరిగిమానాప్రయాణికులు మరో విషయం కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. అనుమతించిన బరువుకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లి, దానికి సరైన బుకింగ్ చేయకపోతే ప్రయాణ సమయంలో లేదా గమ్యస్థానంలో తనిఖీ చేసినప్పుడు జరిమానా విధించే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే లగేజీని బుక్ చేసుకోవడం మంచిది.బరువుతో పాటు సామాను పరిమాణంపై కూడా రైల్వే నిబంధనలు అమలు చేస్తోంది. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్లో చిన్న పరిమాణం ఉన్న బ్యాగులకే అనుమతి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్, స్లీపర్, జనరల్ కోచ్లలో కొంచెం పెద్ద సైజు బ్యాగులను తీసుకెళ్లవచ్చు. నిర్ణయించిన పరిమాణాన్ని మించిన సామానును కోచ్లోకి అనుమతించరు. అలాంటి లగేజీని ప్రత్యేకంగా లగేజ్ లేదా పార్సిల్ వ్యాన్లో బుక్ చేయాల్సి ఉంటుంది.పార్సిల్ ద్వారా ఎక్కువ బరువున్న వస్తువులను కూడా పంపించుకునే అవకాశం ఉంది. అయితే మీరు ప్రయాణించే తరగతిని బట్టి గరిష్ఠ బరువు పరిమితి మారుతుంది. లగేజ్ ఛార్జీలు ప్రయాణ దూరం, బరువు, రైలు సేవలను బట్టి నిర్ణయిస్తారు. కనీస ఛార్జీ రూ.30గా ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త విధానం రైలు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు! -
వచ్చేస్తున్నాయ్ 10 కిలోల గ్యాస్ సిలిండర్లు..
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను మరింత విస్తరించనుంది. ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో మరో 100 నగరాలకు ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. చిన్న కుటుంబాలు, ఒంటరిగా నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, తరచూ నివాసం మారే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ముడి చమురు కొనుగోళ్లలో కూడా బీపీసీఎల్ వైవిధ్యాన్ని పెంచుతోంది. జూన్ త్రైమాసికంలో వెనిజులా, అంగోలా నుంచి దిగుమతులను పెంచగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం ముడి చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 38 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో స్పాట్ కార్గోల ద్వారా కొనుగోళ్లు గత ఏడాది ఇదే కాలంలోని 44 శాతం నుంచి 69 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 3.8 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉండగా, ఇవి సుమారు 35 రోజుల అవసరాలకు సరిపోతాయని వెల్లడించింది. అలాగే మొజాంబిక్ ఎల్ఎన్జీ ప్రాజెక్టు కార్యకలాపాలు 2029 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని అంచనా వేసింది.ఇదిలా ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీపీసీఎల్ రూ.3,962 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.3,919 కోట్ల లాభం వచ్చినప్పటికీ, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం, ఎల్పీజీ విక్రయాల్లో అండర్రికవరీలు పెరగడం వల్ల మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ నష్టం మార్కెట్ అంచనా అయిన రూ.12,632 కోట్ల కంటే చాలా తక్కువగా నమోదవడం విశేషం. -
ఢిల్లీలో ఉద్రిక్తతలు.. TCS లొకేషన్ చేంజ్!
జాతీయ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాంపస్లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రత, ఆటంకం లేని కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని వారిని నోయిడా లేదా గురుగ్రామ్లోని సమీప కార్యాలయాల నుంచి పనిచేయాలని సూచించింది.సురక్షిత ప్రయాణం కోసం ముందస్తు అడ్వైజరీఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాల్లో కొనసాగుతున్న నిరసనలు, పార్లమెంట్ వైపు చేపట్టిన 'సంసద్ చలో' మార్చ్ కారణంగా ఢిల్లీ పరిధిలో రాకపోకలు ప్రభావితమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, ఐటీఓ సహా కీలకమైన 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది.దీనికి తోడు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో రోడ్డు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీసీఎస్ హెచ్ఆర్ విభాగం ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ పరిస్థితికి కారణం..జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పరీక్షల నిర్వహణ వివాదాలు, నీట్ అక్రమాలపై జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్ ముట్టడి పిలుపుతో పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, లాఠీచార్జీలు జరగడంతో రాజధానిలోని వ్యాపార, ఐటీ రంగాలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.ఇదీ చదవండి: మామిడి రసంలో పల్ప్ ఉంటేనే ట్యాక్స్ బెనిఫిట్


