Corporate
-
ఉద్యోగం పోయాక బంపరాఫర్.. డబుల్ శాలరీతో కొత్త జాబ్!
ఉద్యోగం కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు, సదరు వ్యక్తి ఆర్ధిక పరిస్థితి దెబ్బ తింటుంది. చాలా మందికి జీవితంలో ఒక పెద్ద షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు అదే పరిస్థితి కొత్త అవకాశాలకు కూడా తలుపులు తెరుస్తుంది. అలాంటి అనుభవాన్నే ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకుని నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు.దాదాపు నాలుగున్నరేళ్లుగా ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి, తక్కువ జీతంతో కొనసాగుతున్నప్పటికీ.. సంస్థ పట్ల చాలా విధేయతతో వ్యవహరించాడు. అయితే కంపెనీ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ (Restructuring) ప్రక్రియలో భాగంగా అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది.సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయాల ప్రకారం.. అతను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తూ నెలకు సుమారు రూ.70 వేల జీతం పొందేవాడు. నాలుగున్నరేళ్ల సేవ చేసినప్పటికీ సరైన వేతన పెంపులు లేకపోవడంతో అదే జీతం వద్ద కొనసాగాడు. ఉద్యోగం కోల్పోయిన సమయంలో ఉద్యోగ విరమణ పరిహారం చెల్లింపు విషయంలో హెచ్ఆర్తో వాగ్వాదం కూడా జరిగిందని వెల్లడించాడు.అయితే ఆశ్చర్యకరంగా, తన చివరి పని రోజునే మరో కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. అది కూడా పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్. జీతం కూడా నెలకు రూ.1.58 లక్షలు అని వెల్లడించాడు. దీంతో అతని ఆదాయం ఒక్కసారిగా రెండింతలకు పైగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో ప్రయాణ ఖర్చులు, ఇతర ఖర్చులు కూడా తగ్గినట్లు పేర్కొన్నాడు. జీతం ఒక్కసారిగా అంత పెరుగుతుందని ఊహించలేదని ఉద్యోగి చెప్పాడు. ఇది కలలా అనిపిస్తోందని అన్నాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వేలాది మంది దీనిపై స్పందిస్తూ ఉద్యోగికి శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది 'ఉద్యోగంలో విధేయత కంటే నైపుణ్యానికి సరైన విలువ దక్కే చోటుకు మారడం మంచిది' అని సూచించారు. ఒక నెటిజన్ 'ప్రతి రెండు లేదా రెండున్నరేళ్లకు ఉద్యోగం మార్చడం మంచిది. విధేయతకు ఈ రోజుల్లో పెద్దగా విలువ లేదు' అని వ్యాఖ్యానించగా, మరొకరు 'నేను కూడా రూ.50 వేల జీతం నుంచి ఉద్యోగం మారి ఇప్పుడు రూ.1.1 లక్షలు పొందుతున్నాను' అని తెలిపారు.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసా?
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లే ప్రయాణం మాత్రమే కాదు. అది ఒక ప్రత్యేక అనుభవం కూడా. సందడిగా ఉండే రైల్వే స్టేషన్లు, ప్రకృతి అందాలను చూపించే మార్గాలు, ప్రయాణంలో కలిసే కొత్త వ్యక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఇవన్నీ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే.. టికెట్ బుకింగ్ సమయంలో లేదా రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసే సమయంలో కనిపించే కొన్ని రైల్వే పదాలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఈ పదాల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభంగా.. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.ఆర్ఏసీ (RAC)RAC అంటే రిజర్వేషన్ అగెనెస్ట్ క్యాన్సిలేషన్. ఈ స్టేటస్ ఉన్న ప్రయాణికుడికి ఫుల్ బెర్త్ లభించదు. కానీ రైలులో ప్రయాణించవచ్చు. అయితే.. ఒక సీటును ఇద్దరు ఆర్ఏసీ ప్రయాణికులు పంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళా ఇతర ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకుంటే, అలాంటి సందర్భంలో ఆర్ఏసీ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా వెయిటింగ్ లిస్ట్లో ఉండటానికి బదులుగా ఆర్ఏసీ మంచి ఎంపికగా భావిస్తారు.జీఎన్డబ్ల్యుఎల్ (GNWL)GNWL అంటే జనరల్ వెయిటింగ్ లిస్ట్. ఇది రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సాధారణంగా కనిపించే వెయిటింగ్ లిస్ట్ రకం. ఇతర వెయిటింగ్ లిస్ట్లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందుగా టికెట్ బుక్ చేస్తే కన్ఫర్మేషన్ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి.టీక్యూడబ్ల్యుఎల్ (TQWL)TQWL అంటే తత్కాల్ కోటా వెయిటింగ్ లిస్ట్. తత్కాల్ పద్ధతిలో టికెట్ బుక్ చేసినప్పుడు సీటు దొరకకపోతే ఈ స్టేటస్ వస్తుంది. తత్కాల్ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో, TQWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు GNWL కంటే తక్కువగా ఉంటాయి. ప్రయాణం ప్రారంభమయ్యే వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అయితే మీ డబ్బు రీఫండ్ అవుతుంది.యూటీఎస్ (UTS)UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్. ఇది రిజర్వేషన్ అవసరం లేని ప్రయాణాల కోసం ఉపయోగించే టికెట్ విధానం. సాధారణంగా చిన్న దూర ప్రయాణాలు లేదా రోజువారీ ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. UTS టికెట్లను కౌంటర్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. రద్దీ సమయాల్లో ఈ కోచ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతాయి, కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవడం మంచిది.ఈ-క్యాటరింగ్ఈ-క్యాటరింగ్ అనేది ప్రయాణికులు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి, ప్రయాణ సమయంలో దానిని తమ సీటు వద్దకే తెప్పించుకునేందుకు వీలు కల్పించే ఒక సర్వీస్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా వివిధ రెస్టారెంట్ల నుంచి భోజనాన్ని సెలక్ట్ చేసుకుని, రైలు ప్రయాణ సమయంలో స్టేషన్ వద్ద మీరున్న చోటుకే డెలివరీ పొందవచ్చు. లాంగ్ జర్నీ సమయంలో తాజా, రుచికరమైన ఆహారం (ప్రాంతీయ వంటకాలు) రుచి చూడవచ్చు.ఎల్హెచ్బీ కోచ్లుLHB అంటే లింకే హోఫ్మాన్ బుష్. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించిన రైల్వే కోచ్లు. పాత ఐసీఎఫ్ కోచ్లతో పోలిస్తే ఇవి చాలా సురక్షితమైనవి. ప్రయాణ సమయంలో తక్కువ కుదుపులు ఉండటం వల్ల ప్రయాణికులకు మెరుగైన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రధానంగా LHB కోచ్లను ఉపయోగిస్తున్నారు.వికల్ప్ పథకంవికల్ప్ పథకం అనేది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రైలులో ప్రయాణించే అవకాశం కల్పించే ప్రత్యేక సదుపాయం. మీ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, అదే మార్గంలో వెళ్లే మరో రైలులో సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ సేవ పూర్తిగా ఉచితం. ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అధిక రద్దీ ఉన్న రోజుల్లో ఇది ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతుంది.భారతీయ రైల్వేలో ఉపయోగించే ఈ ముఖ్యమైన పదాల అర్థం తెలుసుకోవడం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. RAC, GNWL, TQWL వంటి స్టేటస్ల అర్థం తెలిసి ఉంటే మీ టికెట్ పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. అలాగే UTS, E-Catering, LHB కోచ్లు, వికల్ప్ పథకం వంటి సదుపాయాల గురించి అవగాహన ఉండటం వల్ల మీ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది. కాబట్టి ప్రతి రైలు ప్రయాణికుడు ఈ పదాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ.. -
రతన్ టాటా స్వయంగా మెయిల్ చేశారు!.. కానీ..
జీవితంలో కొన్ని అవకాశాలు కోల్పోతే.. ఎప్పటికీ తిరిగి రావు. అలాంటి ఒక సంఘటనను భారతదేశానికి చెందిన అమెరికాలోని ఒక పాఠశాల వ్యవస్థాపకురాలు, సీఈఓ స్నేహా బిస్వాస్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఆమెకు.. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాను వ్యక్తిగతంగా కలిసే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని పరిస్థితుల కారణంగా కలుసుకోలేక పోయారు. ఈ విషయం ఇప్పటికీ తన జీవితంలో పెద్ద లోటుగా మిగిలిపోయిందని ఆమె వెల్లడించారు.స్నేహా బిస్వాస్ 2020 జనవరిలో టాటా స్టీల్లో ఇంటర్న్గా పనిచేస్తున్న సమయంలో రతన్ టాటాకు ఒక ఈమెయిల్ పంపారు. సాధారణంగా ఇలాంటి ప్రముఖులకు రోజూ వందలాది మెయిల్స్ వస్తుంటాయి. అయితే ఆశ్చర్యకరంగా రతన్ టాటా స్వయంగా ఆమె మెయిల్ను చదివి సమాధానం పంపారు. 'మిమ్మల్ని కలిసేందుకు ప్రయత్నిస్తాను. మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు” అని ఆయన రాసిన సందేశం స్నేహాను ఎంతో ఆశ్చర్యపరిచింది.ఆమెను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం రతన్ టాటా వినయం. 82 ఏళ్ల వయస్సులో కూడా ఒక ఇంటర్న్ పంపిన మెయిల్ను చదివి స్పందించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. చాలా మంది నాయకులు తమకంటే చిన్నవారిని పట్టించుకోకపోయినా, రతన్ టాటా మాత్రం ప్రతి వ్యక్తిని గౌరవంగా చూసేవారని ఆమె అన్నారు.ఈ సంఘటన తర్వాత రతన్ టాటా ఆఫీస్ నుంచి ఆమెకు ఫోన్ కాల్ కూడా వచ్చింది. టాటా ఆమెను కలవాలనుకుంటున్నారని, సమావేశానికి అనువైన తేదీ చెప్పాలని కోరారు. అయితే అదే రోజున స్నేహా అమెరికాకు తిరిగి వెళ్లాల్సి ఉండటంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. 'తర్వాత కలుసుకోవచ్చు' అని అనుకున్నప్పటికీ, ఆ అవకాశం మళ్లీ రాలేదు.తర్వాతి సంవత్సరాల్లో అమెరికాలోనే ఉండి తన వ్యాపార కార్యకలాపాల్లో స్నేహా బిజీ అయిపోయారు. ఇదే సమయంలో 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయస్సులో రతన్ టాటా కన్నుమూశారు. దీంతో ఆయనను ప్రత్యక్షంగా కలవాలనే కోరిక శాశ్వతంగా నెరవేరకుండా పోయింది.అయితే ఈ అనుభవం తనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని స్నేహా చెప్పారు. నిజమైన నాయకత్వం అంటే కేవలం వ్యాపార విజయాలు కాదు, వినయం, దయ, ప్రతి వ్యక్తిని గౌరవించే మనస్తత్వం కూడా కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. రతన్ టాటా నుంచి వచ్చిన ఆ ఈమెయిల్ను ఇప్పటికీ చదువుతుంటానని, అది తనకు స్ఫూర్తినిస్తుందని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: 80 గంటల పని.. అమెజాన్ అనుభవాలు చెప్పిన సీఈవో! -
సుప్రీంకోర్టులో ఓమిక్స్ ఇంటర్నేషనల్కు ఊరట
అమీన్పూర్ (సంగారెడ్డి జిల్లా)లోని ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) డీ-నోటిఫికేషన్కు సంబంధించిన వివాదంలో ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్కు సుప్రీంకోర్టులో కీలక ఉపశమనం లభించింది. తెలంగాణ హైకోర్టు గతంలో మంజూరు చేసిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగిస్తూ, కేంద్ర ప్రభుత్వం సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.న్యాయమూర్తులు జస్టిస్ జే.కే. మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్లతో కూడిన ధర్మాసనం, ఓమిక్స్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)పై విచారణ జరిపి, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ వరకు అమల్లో కొనసాగాలని ఆదేశించింది.ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు, 2025 జూలై 18న జరిగిన స్పెషల్ ఎకనామిక్ జోన్ల బోర్డ్ ఆఫ్ అప్రూవల్ 130వ సమావేశపు నిమిషాల్లోని అజెండా అంశం నం. 130.13 అమలును నిలిపివేసింది. ఈ అజెండా అంశం ప్రకారం.. అమీన్పూర్ గ్రామం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉన్న 4.05 హెక్టార్ల ఎస్ఈజెడ్ ప్రాంతాన్ని పూర్తిగా డీ-నోటిఫై చేయాలని ప్రతిపాదించబడింది.ఈ నిర్ణయాన్ని ఓమిక్స్ ఇంటర్నేషనల్ సవాలు చేస్తూ, తమకు ఇప్పటికే మంజూరైన అనుమతులకు విరుద్ధంగా ఈ చర్య ఉందని, అలాగే ఎస్ఈజెడ్ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వాదించింది. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన అనుమతుల మేరకు తాము ఎస్ఈజెడ్ డెవలపర్గా గుర్తింపు పొందే హక్కు కలిగి ఉన్నామని కంపెనీ పేర్కొంది.హైకోర్టు ఇచ్చిన మధ్యంతర రక్షణను సుప్రీంకోర్టు కొనసాగించడం ద్వారా, వివాదంపై తుది నిర్ణయం వెలువడే వరకు ఎస్ఈజెడ్కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి యథాతథంగా కొనసాగుతుందని స్పష్టమైంది.సుప్రీంకోర్టు ఉత్తర్వులను స్వాగతించిన ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు, ఎస్ఈజెడ్ విధానాల లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపారు. తమ వాదనలను సుప్రీంకోర్టు ముందు సమగ్రంగా వినిపించే అవకాశాన్ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతివాదులు తమ కౌంటర్లు దాఖలు చేసిన అనంతరం ఈ కేసు తదుపరి విచారణకు రానుంది. -
రైలు ఆలస్యమైతే.. ప్రయాణికులకు ఫ్రీ ఫుడ్!
రైలు ప్రయాణాలు ఆలస్యమైతే ప్రయాణికులకు అసహనం కలుగుతుంది. గంటల తరబడి స్టేషన్లో వేచి ఉండడం, అనౌన్స్మెంట్లు వినడం, టైమ్ చూసుకుంటూ ఆందోళన చెందడం చాలా మందికి సాధారణ అనుభవమే. ఇలాంటి పరిస్థితుల్లో భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికులకు ఊరట కలిగించే ఒక సదుపాయాన్ని అందిస్తోంది.నియమాల ప్రకారం.. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు నిర్ణీత సమయానికి.. రెండు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులకు ఉచిత భోజనం అందించడం జరుగుతుంది. ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అయితే లంచ్, సాయంత్రం లేదా రాత్రి అయితే డిన్నర్ అందిస్తారు.ఫుడ్ మెనూ ప్రకారం..టీ / కాఫీ➤టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్లు➤మిల్క్ క్రీమర్, షుగర్ లేదా షుగర్-ఫ్రీ సాచెట్లుబ్రేక్ఫాస్ట్ / సాయంత్రం స్నాక్స్➤4 బ్రెడ్ స్లైసులు (వైట్ లేదా బ్రౌన్)➤బటర్➤ఫ్రూట్ జ్యూస్ లేదా డ్రింక్➤టీ లేదా కాఫీలంచ్ / డిన్నర్➤అన్నం + పప్పు (దాల్)➤రాజ్మా లేదా చోలే➤పచ్చడి ప్యాకెట్➤లేదా 7 పూరీలు + మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ➤ఉప్పు, మిరియాల ప్యాకెట్లు కూడా ఉంటాయిఇది ప్రయాణికులు కొంత సౌకర్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా.. రైలు మూడు గంటలకు పైగా ఆలస్యమైతే ప్రయాణికులు తమ టికెట్ను రద్దు చేసుకుని పూర్తి రీఫండ్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ రీఫండ్ ప్రక్రియను కూడా ఆన్లైన్ బుకింగ్ చేసిన అదే ప్లాట్ఫార్మ్ ద్వారా సులభంగా పొందవచ్చు.దీర్ఘకాలిక ఆలస్యాల సమయంలో వెయిటింగ్ హాల్స్ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కొన్ని స్టేషన్లలో ఫుడ్ కౌంటర్లు కూడా ఎక్కువ సమయం వరకు తెరిచి ఉంటాయి, తద్వారా ప్రయాణికులకు అవసరమైన ఆహారం అందుబాటులో ఉంటుంది. -
80 గంటల పని.. అమెజాన్ అనుభవాలు చెప్పిన సీఈవో!
విజయవంతమైన వ్యాపారవేత్తల జీవితంలో ఎన్నో కఠినమైన అనుభవాలు, కష్టపడి పనిచేసిన రోజులు ఉంటాయి. అమెరికాకు చెందిన ఏఐ భద్రతా సంస్థ డీప్ సెంటినెల్ సీఈవో డేవిడ్ సెలింగర్ కూడా అలాంటి అనుభవాలనే గుర్తు చేసుకున్నారు. ఆయన తన కెరీర్ ప్రారంభ దశలో అమెజాన్లో పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ, సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నాయకత్వం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు.డేవిడ్ సెలింగర్ 2002లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా అమెజాన్లో ఉద్యోగం పొందారు. 2003 జనవరిలో కంపెనీలో చేరి.. కస్టమర్ కస్టమర్ బిహేవియర్ రోల్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో అమెజాన్ ఇప్పటిలా లక్షలాది ఉద్యోగులతో కూడిన దిగ్గజ సంస్థ కాదు. కొద్దిమంది ఉద్యోగులతో పనిచేస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో డేటాను విశ్లేషించే అవకాశాలు అక్కడ ఉండేవని ఆయన తెలిపారు.అమెజాన్లో పనిచేసే సమయంలో జెఫ్ బెజోస్ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు కలిసేవాడినని సెలింగర్ చెప్పారు. బెజోస్ గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో శక్తివంతమైన, లక్ష్యసాధనపై పూర్తిగా దృష్టి పెట్టే నాయకుడని పేర్కొన్నారు. “ఆయనతో పనిచేయడం అద్భుతమైన అనుభవం” అని సెలింగర్ అన్నారు.అమెజాన్లోని పని సంస్కృతి కూడా అంతే కఠినంగా ఉండేదని ఆయన వివరించారు. వారానికి సుమారు 80 గంటలు పనిచేసేవాళ్లమని చెప్పారు. ఉద్యోగుల నుంచి అత్యుత్తమ ఫలితాలను రాబట్టే వాతావరణం ఉండేదని, అక్కడ పనులు కూడా వేగంగా పూర్తయ్యేవని తెలిపారు. సంప్రదాయ సంస్థల్లో ఉండే అనవసర ప్రక్రియలు, సమస్యలు తక్కువగా ఉండటంతో పనిలో వేగం పెరిగేదని చెప్పారు.ఆ కఠినమైన అనుభవమే.. తనను మరింత మెరుగైన నాయకుడిగా తీర్చిదిద్దిందని సెలింగర్ అభిప్రాయపడ్డారు. అమెజాన్ను విడిచిన తర్వాత ఆయన డీప్ సెంటినెల్ అనే ఏఐ బేస్డ్ హోం సెక్యూరిటీ సంస్థను స్థాపించారు. పెద్ద స్థాయి డేటా విశ్లేషణ, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై అమెజాన్లో పొందిన అనుభవం తన వ్యాపార విజయానికి బలమైన పునాదిగా మారిందని పేర్కొన్నారు. -
ఆ రాత్రంతా ఏడ్చాను.. చివరకు కాగ్నిజెంట్లో జాబ్!
ప్రతి విజయం వెనుక ఎన్నో కష్టాలు, నిరాశలు, తిరస్కరణలు దాగి ఉంటాయి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అంటారు చెన్నైకు చెందిన మహేశ్వరి మోహన్. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సక్సెస్ జర్నీ ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మహేశ్వరి మోహన్ చదువుకునే రోజుల్లోనే కాగ్నిజెంట్లో ఉద్యోగం చేయాలని కలలు కనింది. 2022లో తన కాలేజీ క్యాంపస్ డ్రైవ్ సమయంలో కాగ్నిజెంట్ తనను మొదటిసారి తిరస్కరించింది. కలలు కన్న కంపెనీ రిజెక్ట్ చేయడంతో 'ఆ రాత్రంతా నేను ఏడ్చాను' అని ఆమె తన లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.కాగ్నిజెంట్ కంపెనీ రిజెక్ట్ చేసిందని, మహేశ్వరి అక్కడితో ఆగిపోలేదు. మరోసారి 2023 జూన్లో జరిగిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరై మళ్లీ చివరి రౌండ్ వరకు చేరుకున్నారు. కానీ మరోసారి తిరస్కరణ ఎదురైంది. దీంతో ఆమె తనను తాను ప్రశ్నించుకుంది, తనకు కాగ్నిజెంట్లో పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యం లేదని భావించింది.అలాంటి సమయంలో.. 2023 నవంబర్లో హెచ్సీఎల్టెక్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ పనిచేయడమే తన కెరీర్లో ఒక కీలక మలుపుగా మారిందని మహేశ్వరి చెప్పారు. సంస్థలో కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నారు, అనుభవం సంపాదించారు, వృత్తిపరంగా ఎంతో ఎదిగారు. అయినప్పటికీ కాగ్నిజెంట్లో చేరాలనే కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.ఇదిలా ఉండగా.. 2026 ఏప్రిల్లో అనుకోకుండా కాగ్నిజెంట్ రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. రియల్ టైమ్ అనలిస్ట్ (RTA) పోస్టుకు అవకాశం ఉందని తెలియజేశారు. ఈసారి మహేశ్వరి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. అన్ని ఇంటర్వ్యూ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి ఎంపికయ్యారు. చివరకు 2026 జూన్లో కాగ్నిజెంట్లో చేరి తన నాలుగేళ్ల కలను సాకారం చేసుకున్నారు.తన విజయాన్ని వివరిస్తూ ఆమె ''2022లో ఫ్రెషర్గా ఉన్నప్పటికంటే.. ఇప్పుడు నేను పది రెట్లు ఎక్కువగా సిద్ధంగా ఉన్నాను'' అని చెప్పారు. జీవితంలో కొన్ని అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, అవి మన ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.ఒకసారి లేదా రెండుసార్లు విఫలమైనా ప్రయత్నాన్ని ఆపకూడదు. ప్రతి తిరస్కరణ మనల్ని మరింత బలంగా, అనుభవజ్ఞులుగా తయారు చేస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు విజయం తప్పకుండా లభిస్తుందని మహేశ్వరి కథ కళ్ళకు కట్టినట్లు చెబుతుంది.ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో.. -
మస్క్ ఎంత ధనవంతుండంటే.. వందేళ్లు తరగని సంపద!
కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేది సామెత. కానీ ప్రపంచ అపర కుబేరుడిగా అవతరించిన ఎలాన్ మస్క్కు మాత్రం ఈ సామెత సరిపోదేమో! ఎందుకంటే ఆయన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ స్టాక్మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా (లక్ష కోట్ల డాలర్లకు అధిపతి) అవతరించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు రాయిటర్స్, ఏపీ, బ్లూమ్బర్గ్ నివేదికల ప్రకారం, ఇది ఆధునిక ఆర్థిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ క్రమంలో మస్క్ సంపద గురించి విస్తృత చర్చ సాగుతోంది.జూన్ 12, 2026న నాస్డాక్లో "SPCX" టిక్కర్తో స్పేస్ఎక్స్ షేర్లు లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర 135 డాలర్లుగా నిర్ణయించగా, ట్రేడింగ్ ప్రారంభంలోనే 150 డాలర్లకు చేరుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ సుమారు 75 బిలియన్ డాలర్లు సమీకరించడం విశేషం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా నమోదైంది. లిస్టింగ్ అనంతరం స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ తొలుత 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ట్రేడింగ్లో పెరుగుదలతో 2 ట్రిలియన్ డాలర్లను కూడా అధిగమించింది.స్పేస్ఎక్స్లో మస్క్కు ఉన్న భారీ వాటా, అలాగే టెస్లాలోని ఆయన పెట్టుబడులను కలిపి చూస్తే ఆయన నికర విలువ సుమారు 1.1 నుంచి 1.3 ట్రిలియన్ డాలర్ల మధ్యకు చేరిందని అంచనాలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ తొలి ట్రిలియనీర్గా ఆయన చరిత్ర సృష్టించారు. అయితే ఈ సంపద ఎక్కువ భాగం కంపెనీ షేర్ల రూపంలో ఉండే "పేపర్ వెల్త్" మాత్రమే; అది నగదు రూపంలో అందుబాటులో ఉండదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. కంపెనీల మార్కెట్ విలువలు మారితే ఈ సంపద కూడా మారే అవకాశం ఉంది.శతాబ్దమైనా చాలదు!ఒక ట్రిలియన్ డాలర్ల పరిమాణాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. గంటకు 10 లక్షల డాలర్లు అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం భారతీయ కరెన్సీలో సుమారు రూ.9.4 కోట్లు ఖర్చు పెడుతూ వచ్చినా 1 ట్రిలియన్ డాలర్లను పూర్తిగా ఖర్చు చేయడానికి శతాబ్దానికి పైగా సమయం పడుతుంది. అంతటి ఆర్థిక శక్తి ఇప్పుడు ఎలాన్ మస్క్ సొంతం.దేశాల జీడీపీలను మించి..మస్క్ సంపదను దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే దాని విస్తృతి మరింత స్పష్టమవుతుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) గణాంకాల ప్రకారం, ప్రపంచంలోని చాలా కొన్ని దేశాల జీడీపీ మాత్రమే ట్రిలియన్ డాలర్లకు మించి ఉంటుంది. అంటే ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మస్క్ వ్యక్తిగత సంపద అధికంగా ఉంటుందన్న మాట.అయితే ఈ అసాధారణ సంపదపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం అసమానతలను పెంచుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, మస్క్ అభిమానులు మాత్రం అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సు, విద్యుత్ వాహనాల్లో ఆయన చూపిన దూరదృష్టే ఈ విజయానికి కారణమని పేర్కొంటున్నారు.టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (గతంలో ట్విటర్), ఎక్స్ఏఐ వంటి సంస్థల ద్వారా ఆటోమొబైల్, అంతరిక్షం, కృత్రిమ మేధస్సు రంగాల్లో ప్రభావం చూపుతున్న ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ ఆర్థిక చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్నారు. -
తక్కువ ధరకు విమాన టికెట్లు.. ఎయిర్ ఇండియాలో కొత్త కేటగిరీ
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశీయ ప్రయాణికుల కోసం కొత్తగా ‘బేసిక్’ ఛార్జీల కేటగిరీని ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ కొత్త ఫేర్ ద్వారా తక్కువ ధరలో టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేటగిరీలో ప్రయాణించే వారికి ఉచిత భోజనం అందుబాటులో ఉండదు. అయితే 15 కిలోల చెక్డ్ బ్యాగేజ్, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్ అనుమతి యథాతథంగా కొనసాగుతుంది. టీ లేదా కాఫీ వంటి పానీయ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది.ప్రస్తుతం ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ‘వాల్యూ’, ‘క్లాసిక్’, ‘ఫ్లెక్స్’ అనే ఫేర్ కేటగిరీలు అందుబాటులో ఉండగా, వాటితో పాటు ‘బేసిక్’ను కూడా చేర్చింది. ధరకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయాణికులు అవసరమైన సేవలను మాత్రమే ఎంచుకునేలా ఈ కొత్త విధానాన్ని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది. ప్రయాణానికి 24 గంటల ముందువరకు ప్రయాణికులు అదనపు చెల్లింపుతో భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. షెడ్యూల్ మార్పులు జరిగితే ముందుగా బుక్ చేసిన భోజనాన్ని కొత్త విమానానికి బదిలీ చేయడం లేదా అందుబాటులో లేకపోతే పూర్తి రీఫండ్ ఇవ్వడం జరుగుతుందని ఎయిర్ ఇండియా తెలిపింది.దేశీయ మార్కెట్లో తక్కువ ధరల విమానయాన సంస్థల నుంచి పెరుగుతున్న పోటీ, నిర్వహణ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ ‘అన్బండిల్డ్’ మోడల్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎంపిక చేసిన మార్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ సేవపై ప్రయాణికుల స్పందనను పరిశీలించిన తర్వాత భవిష్యత్ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంస్థ వెల్లడించింది. 2024లో ప్రవేశపెట్టిన స్మార్ట్ ఫేర్ వ్యవస్థను మరింత సరళీకృతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిర్ ఇండియా ఈ కొత్త ఫేర్ను ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ధరలను తగ్గించేందుకు భోజనాన్ని ఐచ్ఛికంగా మార్చే ప్రయత్నం గత కొన్ని నెలలుగా చర్చల్లో ఉండగా, ఇప్పుడు అధికారికంగా అమలులోకి తీసుకొచ్చింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం, ఈ మార్పుతో టికెట్ ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉంది.‘బేసిక్’ ఫేర్ ప్రస్తుతం ఎయిర్ ఇండియా వెబ్సైట్, మొబైల్ యాప్, కాంటాక్ట్ సెంటర్ మరియు ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా అందుబాటులో ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. -
యువతకు ఆర్బీఐ బంపర్ ఆఫర్!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) యువ ప్రతిభను ఆకర్షించేందుకు ‘యంగ్ ప్రొఫెషనల్స్ (YP)’ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ, పబ్లిక్ పాలసీ, డేటా విశ్లేషణ, సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన యువతకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.5 లక్షల స్థిర స్టైఫండ్ లభించనుండగా, నియామకం ఒప్పంద ప్రాతిపదికన ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారు ముంబైలోని ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.ఆర్బీఐ ప్రణాళిక ప్రకారం ప్రారంభంలో మూడేళ్ల కాలానికి నియామకం చేపడతారు. పనితీరు, పరస్పర అంగీకారం ఆధారంగా ఈ గడువును గరిష్ఠంగా ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఈ నియామకం శాశ్వత ఉద్యోగానికి హామీ కాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. కానీ, ఎంపికైన అభ్యర్థులు ఫుల్ టైమ్ ఉద్యోగులుగా పనిచేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అనుమతి లేకుండా ఇతర ఉద్యోగాలు లేదా కన్సల్టెన్సీ పనులు చేపట్టరాదు.ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్కు నెలకు రూ.1,50,000 స్థిర స్టైఫండ్ చెల్లిస్తారు. దీనిపై వర్తించే ఆదాయపన్ను మినహాయింపులు అమల్లో ఉంటాయి. స్టైఫండ్కు అదనంగా ఇతర అలవెన్సులు, హెచ్ఆర్ఏ లేదా ప్రోత్సాహకాలు ఉండవని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. ముందుగా దరఖాస్తుల పరిశీలన, షార్ట్లిస్టింగ్ నిర్వహించి, అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపడతారు. ఖాళీల సంఖ్య, దరఖాస్తుల నాణ్యత ఆధారంగా ఇంటర్వ్యూకు పిలిచే అభ్యర్థుల సంఖ్యను పరిమితం చేసే అధికారం ఆర్బీఐకి ఉంటుంది.ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, సీవీ, విద్యార్హత సర్టిఫికెట్లు, స్టేట్మెంట్ ఆఫ్ ఇంటరెస్ట్, రైటింగ్ శాంపిల్, రిఫరెన్స్ లెటర్తో కలిసి ఈ-మెయిల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. “YP Application – Post Code – Candidate Name” అనే సబ్జెక్ట్ లైన్తో [yphrmdco@rbi.org.in](mailto:yphrmdco@rbi.org.in) కు దరఖాస్తులు పంపాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వారు ప్రతి పోస్టుకు ప్రత్యేక ఈ-మెయిల్ పంపాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం దరఖాస్తుల చివరి తేదీ జూలై 6, 2026గా అధికారిక ప్రకటనల్లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ను తప్పనిసరిగా పరిశీలించాలని ఆర్బీఐ సూచించింది. -
టాటా ఐఫోన్ ప్లాంట్కు క్లీన్ చిట్
యాపిల్ ఐఫోన్లకు కీలక భాగాలను తయారు చేసే టాటా ఎలక్ట్రానిక్స్ హోసూర్ ప్లాంట్కు తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి (TNPCB) ఊరటనిచ్చింది. ప్లాంట్ నుంచి మురుగునీటి విడుదల కారణంగా భూగర్భజలాలు కలుషితమయ్యాయన్న ఆరోపణలపై జరిగిన పరిశీలన అనంతరం, సంస్థ నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగానే పనిచేస్తోందని మండలి గుర్తించింది. ఈ అంశంపై ఇకపై తదుపరి చర్యలు తీసుకోబోమని నిర్ణయించినట్లు టాటా ఎలక్ట్రానిక్స్ వెల్లడించింది.ఇటీవల అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం వెలువరించడంతో ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. హోసూర్లోని టాటా ప్లాంట్ నుంచి విడుదలయ్యే మురుగునీరు సమీప వ్యవసాయ భూములు, బావులపై ప్రభావం చూపుతోందని స్థానిక రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా యంత్రాంగం, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పలుమార్లు తనిఖీలు నిర్వహించాయి. గత నెలలో జారీ చేసిన షోకాజ్ నోటీసులో కూడా పలు అంశాలపై వివరణ కోరింది.అయితే, నోటీసు అందుకున్న వెంటనే గుర్తింపు పొందిన ప్రయోగశాల ద్వారా స్వతంత్ర పరీక్షలు నిర్వహించామని టాటా ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ఈ పరీక్షల్లో టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (TDS), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) వంటి కీలక పర్యావరణ సూచికలు అనుమతించిన పరిమితుల్లోనే ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఆ ఫలితాలను అధికారికంగా తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి సమర్పించినట్లు వెల్లడించింది.అదేవిధంగా, ఇటీవల సేకరించిన నీటి నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా స్వయంగా పరీక్షించగా ఎటువంటి కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని కంపెనీ తెలిపింది. దీంతో షోకాజ్ నోటీసులో ప్రస్తావించిన అన్ని అంశాలను సంతృప్తికరంగా పరిష్కరించినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ధ్రువీకరించిందని పేర్కొంది.కాగా, ఈ హోసూర్ ప్లాంట్ యాపిల్ ‘చైనా ప్లస్ వన్’ వ్యూహంలో అత్యంత కీలక కేంద్రంగా మారింది. ఐఫోన్ బ్యాక్ప్యానెల్స్తో పాటు పలు కీలక భాగాలను ఈ యూనిట్లో తయారు చేస్తున్నారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ ఉత్పత్తిని భారత్కు మళ్లిస్తున్న యాపిల్కు టాటా ఎలక్ట్రానిక్స్ ప్రధాన భాగస్వామిగా ఎదిగింది. పరిశోధనా సంస్థ కౌంటర్పాయింట్ అంచనాల ప్రకారం 2026 నాటికి ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తిలో భారత వాటా 26 శాతానికి చేరుకునే అవకాశం ఉంది.అయితే, పర్యావరణ పరిరక్షణపై తమ నిబద్ధత కొనసాగుతుందని టాటా ఎలక్ట్రానిక్స్ స్పష్టం చేసింది. భవిష్యత్తులోనూ పర్యావరణ నిబంధనలకు పూర్తిస్థాయిలో అనుగుణంగా ఉండేందుకు ప్రక్రియలు, మౌలిక సదుపాయాలను నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొంది. -
మళ్లీ ఐపీవోల జోరు
న్యూఢిల్లీ: మార్కెట్లలో అనిశ్చితి, ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ ఐపీవో మార్కెట్ నెమ్మదిగా పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈక్విరస్ క్యాపిటల్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 27,000 కోట్ల సమీకరణ కోసం 23 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల బాట పట్టాయి. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, హెక్సాగాన్ న్యూట్రిషన్ జూన్లోనే ఐపీవోకి వచ్చాయి. ఇన్సూర్టెక్ సంస్థ టర్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్, అద్విత్ జ్యుయెల్స్ ఐపీవోలు జూన్ 19, 23 తేదీల్లో మొదలవుతున్నాయి. కార్డీలియా క్రూయిజెస్ని నిర్వహించే వాటర్వేస్ లీజర్ టూరిజం ఇష్యూ కూడా ఇదే నెలలో రానుంది. ఇక, దేశీయంగా అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజ్ ఎన్ఎస్ఈ ఈ వారంలో ముసాయిదా పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. అటు క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వచ్చే నెలలో పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సన్నాహాల్లో మరో 236 సంస్థలు .. ఈ ఏడాది మే నాటికి 236 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో 163 సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించగా, మరో 73 కంపెనీలు ఆమోదముద్ర కోసం ఎదురుచూస్తున్నాయి. 2025లో 103 ఇష్యూల ద్వారా కంపెనీలు రికార్డు స్థాయిలో రూ. 1.76 లక్షల కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది 2024లో 90 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు, 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు దక్కించుకున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 2,422 కోట్లు సమీకరించాయి. తొలి త్రైమాసికంలో 19 సంస్థలు రూ. 24,772 కోట్లు సమకూర్చుకున్నాయి. 2025 నాలుగో త్రైమాసికంలో 30 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 91,058 కోట్లు దక్కించుకున్నాయి. ఈక్విరస్ రిపోర్ట్ ప్రకారం మార్కెట్లో పరిస్థితులు కఠినతరం కావడం, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో గతేడాది సెప్టెంబర్ తర్వాత నుంచి ఐపీవో కార్యకలాపాలు గణనీయంగా నెమ్మదించాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ, దేశీ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం సిప్ల విధానంలో మార్కెట్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో నెలవారీ సిప్ల ద్వారా రూ. 30,000 కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లోకి వస్తున్నాయి.19న టర్టిల్మింట్ ఇష్యూ.. ఇన్సూర్టెక్ సంస్థ టర్టిల్మింట్ ఫిన్టెక్ సొల్యూషన్స్ ఐపీవో జూన్ 19న ప్రారంభమై 23న ముగియనుంది. జూన్ 29న లిస్ట్ అవుతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 883 కోట్లు సమీకరిస్తోంది. షేరు ధర శ్రేణి రూ. 144–152గా ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ. 660.72 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రస్తుత షేర్హోల్డర్లు రూ. 221.95 కోట్ల విలువైన విక్రయించనున్నారు. -
అమెజాన్, మైక్రోసాఫ్ట్లను దాటేసిన స్పేస్ఎక్స్
న్యూయార్క్: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్ షేరు వాల్స్ట్రీట్లో రోజుకో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. అమెరికా నాస్డాక్ ఎక్సే్చంజీలో మంగళవారం ఇంట్రాడేలో ఈ షేరు ఏకంగా 17 శాతానికి పైగా లాభపడి 226 డాలర్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు భారీ ర్యాలీతో స్పేస్ఎక్స్ సంస్థ మార్కెట్ విలువ 2.95 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో 2.64 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ–కామర్స్ దిగ్గజ సంస్థ ‘అమెజాన్’ను వెనక్కి నెట్టింది. అలాగే, ఒక దశలో 2.92 ట్రిలియన్ డాలర్ల విలువ గల ‘మైక్రోసాఫ్ట్’ను సైతం అధిగమించి ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్–5 కంపెనీల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక ఎలాన్ మస్క్ సంపద కూడా రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. స్పేస్ఎక్స్ లిస్టింగ్తో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్గా అవతరించిన ఎలాన్ వెల్త్ తాజాగా 1.3 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. -
బ్లాక్ కలర్ సాక్స్.. విమానంలో ప్రమాదమా?
విమాన ప్రయాణం చేసే సమయంలో.. దాదాపు అందరూ సౌకర్యవంతమైన దుస్తులు, సులభంగా తొలగించడానికి వీలయ్యే షూస్, చలిని తట్టుకునేందుకు జాకెట్లు లేదా హుడీలు ధరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే చాలామంది గమనించని ఒక చిన్న విషయం ఏమిటంటే? సాక్స్ రంగు. ముఖ్యంగా బ్లాక్ కలర్ సాక్స్ ధరించడం విమాన ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలకు కారణమవుతుందని విమాన సిబ్బంది చెబుతున్నారు. దీనికి గల కారణాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విమానాల్లో.. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల సమయంలో, క్యాబిన్ లైటింగ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో నల్ల రంగు సాక్స్ విమానంలోని పరిసరాలతో (కింది భాగం) కలిసిపోతాయి. ప్రయాణికులు షూస్ తీసేసి కాళ్లను ముందుకు చాచినప్పుడు లేదా నడిచే మార్గంలో ఉంచినప్పుడు, అవి సిబ్బందికి లేదా ఇతర ప్రయాణికులకు సులభంగా కనిపించకపోవచ్చు.విమానాల్లో నడిచే మార్గాలు చాలా ఇరుకుగా ఉంటాయి. క్యాబిన్ సిబ్బంది ఆహారం, పానీయాలు లేదా ఇతర సర్వీసులను అందించేందుకు తరచుగా ఆ మార్గాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో కాళ్లు స్పష్టంగా కనిపించకపోతే సిబ్బంది వాటిని తొక్కే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సర్వీస్ ట్రాలీలు కూడా కాళ్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఇది చిన్న విషయం లాగా కనిపించినప్పటికీ భద్రత పరంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.ఇంకో ముఖ్యమైన అంశం పరిశుభ్రత. విమానాల నేలపై వివిధ రకాల సూక్ష్మక్రిములు, వైరస్లు కొంతకాలం జీవించి ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి షూస్ తీసేసి కేవలం సాక్స్తోనే నేలపై నడవడం ఆరోగ్యపరమైన ప్రమాదాలను కూడా పెంచే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో.. నిపుణులు లేత రంగుల సాక్స్ ధరించడం మంచిదని సూచిస్తున్నారు. తెలుపు, బూడిద లేదా ఇతర లేత రంగుల సాక్స్ తక్కువ వెలుతురులో కూడా సులభంగా కనిపిస్తాయి. దీంతో సిబ్బంది, ఇతర ప్రయాణికులు వాటిని గుర్తించి ప్రమాదాలను నివారించగలరు. -
డబ్బు నిజంగా సంతోషాన్ని ఇస్తుందా?: బిల్ గేట్స్ ఏమన్నారంటే..
డబ్బు నిజంగా మనిషికి సంతోషాన్ని ఇస్తుందా? అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతోంది. కొందరి అభిప్రాయం ప్రకారం.. సంతోషం అనేది ప్రేమ, సంబంధాలు, ఆరోగ్యం, జీవిత లక్ష్యం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. మరికొందరు మాత్రం ఆర్థిక భద్రత ఉంటేనే మనిషి ప్రశాంతంగా జీవించగలడని చెబుతారు. ఈ అంశంపై ప్రముఖ వ్యాపారవేత్త బిల్ గేట్స్ (Bill Gates) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.2019లో జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్లో ఒక రెడ్డిట్.. అపారమైన సంపద (డబ్బు) జీవితంలో నిజంగా సంతోషాన్ని పెంచిందా అని గేట్స్ను అడిగారు. దానికి ఆయన సమాధానంగా, ''అవును, నేను ఆరోగ్య ఖర్చులు, విద్య ఖర్చులు, ఆర్థిక సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది. అది నాకు చాలా పెద్ద ఉపశమనం'' అని చెప్పారు. అంటే డబ్బు వల్ల ఆయనకు లగ్జరీ కంటే ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిలేని జీవితం లభించిందని స్పష్టమవుతోంది.సంతోషంగా ఉండటానికి బిలియనీర్ కావాల్సిన అవసరం లేదని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్థిరత్వం ఉంటే సరిపోతుంది, అది మనిషి జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా మారుస్తుందని చెప్పారు.అయితే నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డేనియల్ కాహ్నెమాన్, ఆర్థికవేత్త ఆంగస్ డీటన్ చేసిన పరిశోధనల్లో.. ఆదాయం పెరిగే కొద్దీ మనిషి జీవితంలో ఒత్తిడి తగ్గి సంతోషం పెరుగుతుంది. కానీ ఒక స్థాయికి చేరిన తర్వాత అదనపు సంపద సంతోషాన్ని పెద్దగా పెంచదని తెలిపారు.ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!: ఎలాన్ మస్క్ -
డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..
స్పేస్ఎక్స్ ఐపీఓ విజయవంతం కావడంతో ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్ అయ్యారు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఆయన, డబ్బు చివరికి పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి.ఇటీవల ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ 'పీటర్ డయామాండిస్'తో మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోబోట్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మారుస్తాయని మస్క్ పేర్కొన్నారు. ఏఐ, రోబోట్లు నిరంతరం, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలవు. తద్వారా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతాయి. చివరికి మనుషులు చేయడానికి పనులు లేకుండా పోతాయని అన్నారు.మనుషుల అవసరం ఎప్పుడైతే తగ్గిపోతుందో.. ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. కార్మికుల అవసరం ఉండదు, వారికి వేతనాలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఒక దశలో డబ్బు అవసరం ఉండదని మస్క్ స్పష్టం చేశారు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన్ మీరు, డబ్బు అవసరం ఉండదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని మస్క్ను ఇంటర్వ్యూ చేసే పీటర్ డయామాండిస్ అన్నారు. భవిష్యత్తులో ఇది నిజం అవుతుందని టెస్లా బాస్ జవాబిచ్చారు.భవిష్యత్తులో ప్రజలు ఉద్యోగాల ద్వారా సంపాదించకపోయినా.. జీవించగలిగేలా 'యూనివర్సల్ హై ఇన్కమ్' (సార్వత్రిక ఆదాయం) అనే వ్యవస్థ వస్తుందని మస్క్ గతంలో సూచించారు. ఈ విధానంలో ప్రతి ఒక్కరికీ కనీస జీవనానికి సరిపడే ఆదాయం లభిస్తుంది. అవసరమైనవారికి ప్రభుత్వాలే డబ్బులు ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. తద్వారా ఆటోమేషన్ వల్ల వచ్చే మార్పులను సమాజం ఎదుర్కోగలుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
టెస్లా బాస్పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఎలాన్ మస్క్'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ విజయాన్ని కేవలం సంపదతో కొలవలేమని, అసలు విజయ రహస్యం ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదలలోనే ఉందని పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ లిస్టింగ్తో మస్క్ సంపద భారీగా పెరిగి ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈరోజు అందరూ ట్రిలియన్ డాలర్ల మైలురాయి గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు కథ ఏమిటంటే.. ఈ రోజు అసాధ్యం అనుకున్నది రేపు సాధ్యమవుతుందని మస్క్ గట్టిగా విశ్వసిస్తారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.మస్క్ ప్రస్తుతం టెస్లా, స్టార్లింక్ వంటి సంస్థల ద్వారా ప్రపంచ సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టకాలాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా 2018లో మస్క్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని వెల్లడించారు. ఆ సమయంలో చాలామంది విమర్శించినప్పటికీ, ఆనంద్ మహీంద్ర మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించారు.అప్పట్లో సోషల్ మీడియా వేదికగా మస్క్ను ఉద్దేశించి 'ధైర్యంగా ముందుకు సాగండి. ప్రపంచానికి మీలాంటి స్ఫూర్తిదాయక ఆవిష్కర్తలు అవసరం' అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆ సమయంలో మస్క్ చూపిన సహనం, సంకల్పమే తనను ఎక్కువగా ఆకట్టుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు.ఆనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. నిజమైన ఆవిష్కర్తలను వారి విజయ సమయాల్లో కాకుండా కష్టకాలంలో వారు ఎలా నిలబడతారనే అంశం ఆధారంగా అంచనా వేయాలి. ఎలాన్ మస్క్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాలపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగడం వల్లే నేడు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్! -
సాఫ్ట్వేర్, ఎంబీఏ శకానికి చరమగీతం?
భారతదేశ జాబ్ మార్కెట్లో దశాబ్దాలుగా నడుస్తున్న ‘వైట్ కాలర్’ ఉద్యోగాల బూమ్ ఇకపై సాగకపోవచ్చని, సాఫ్ట్వేర్, ఎంబీఏ డిగ్రీల హవా ముగింపు దశకు చేరుకుందని దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో.. వెల్డింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, వడ్రంగి వంటి భౌతిక, వాణిజ్య నైపుణ్యాలకే (ట్రేడ్ స్కిల్స్) రాబోయే రోజుల్లో విపరీతమైన గిరాకీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పని స్వభావం, ఉద్యోగ నష్టాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపాయి.శ్రమకు దక్కని గౌరవం‘స్విట్జర్లాండ్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు, వృత్తి నిపుణులకు సమాజంలో అత్యున్నత గౌరవం లభిస్తుంది. కానీ భారతదేశంలో అది కరవైంది. వెల్డర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వడ్రంగి వంటి వారిని మనం తక్కువ చేసి చూస్తాం. వారి వృత్తులను అగౌరవంగా, ఫ్యాషన్ కానిదిగా మార్చేశాం. ఈ ఆలోచనా విధానం తక్షణమే మారాల్సిన అవసరం ఉంది’ అని అనంత నాగేశ్వరన్ అన్నారు.సాంకేతిక పురోగతి అనేది ఉపాధిని పూర్తిగా హరించబోదని, అయితే అది ఉద్యోగాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుందని నాగేశ్వరన్ విశ్లేషించారు. గతంలో ప్రపంచీకరణ వల్ల భారత సాఫ్ట్వేర్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ విద్యార్థులకు భారీగా ప్రయోజనం చేకూరిన మాట వాస్తవమే అయినా ఆ శకం ఇప్పుడు ముగిసిందని పేర్కొన్నారు.ఏఐ భర్తీ చేయలేని రంగాలు‘మనుషుల ప్రత్యక్ష అవసరం ఉండే, ఆటోమేషన్కు గురికావడానికి తక్కువ అవకాశం ఉన్న రంగాలపై యువత దృష్టి పెట్టాలి. భారతదేశంలో నిరుద్యోగిత, తక్కువ ఉపాధి సమస్యలను ఒకేసారి పరిష్కరించాలంటే శ్రమశక్తి ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి’ అన్నారు. ఉత్పాదక రంగంతో పాటు మానవ సంబంధాలు, సేవలతో ముడిపడి ఉన్న కొన్ని రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా అవకాశాలు సృష్టించవచ్చని నాగేశ్వరన్ వెల్లడించారు.ఇదీ చదవండి: బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. -
ఒక్క వాట్సాప్ మెసేజ్.. ఐటీ ఇంటర్న్పై వేటు!
ఐటీ రంగంలో కొన్ని స్టార్టప్ల పనితీరు, ఇంటర్న్ల పట్ల యాజమాన్యాల ధోరణిపై సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఒక చర్చ వైరల్ అవుతుంది. కేవలం అర్హతకు తగ్గ వేతనం (స్టైపెండ్) పెంచాలని వాట్సాప్లో మెసేజ్ పంపినందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్ను తొలగించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్క వాట్సాప్ మెసేజ్తో నా ఇంటర్న్షిప్ను రద్దు చేశారు.. అంటూ సదరు టెక్కీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.కంపెనీ భారాన్ని మోసి.. చివరకు..బాధిత టెక్కీ కథనం ప్రకారం.. ఆమె ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో ఏఐ ఇంజినీర్ ఇంటర్న్గా చేరారు. ఆరు నెలల కాలపరిమితి గల ఈ ఇంటర్న్షిప్లో ఆమెకు అత్యంత స్వల్ప మొత్తాన్ని స్టైపెండ్గా నిర్ణయించారు. ఆ స్టార్టప్ సాంకేతిక విభాగంలో ఉన్న ఏకైక వ్యక్తి ఆమే కావడం గమనార్హం. ఒక ఇంటర్న్ అయినప్పటికీ, సంస్థ కోసం ఆమె నిత్యం శ్రమిస్తున్నారు.కంపెనీకి సంబంధించిన పూర్తి స్థాయి స్మాల్ లాంగ్వేజ్ మోడల్ (ఎస్ఎల్ఎం)ను ఆమే స్వయంగా అభివృద్ధి చేశారు. సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి జాప్యం (Latency) తగ్గించేలా కోడింగ్ను ఆప్టిమైజ్ చేశారు. ఆమె ప్రతిభ కారణంగా సదరు స్టార్టప్కు ఏకంగా ఏడుగురు కొత్త క్లయింట్లు వచ్చారు. మూడు నెలల విజయవంతమైన పనితీరు తర్వాత ఆన్బోర్డింగ్ సమయంలో యాజమాన్యం ఇచ్చిన మాట ప్రకారం స్టైపెండ్ రివిజన్ కోసం ఆమె మేనేజర్కు వాట్సాప్లో ఒక మెసేజ్ పంపారు.వాట్సాప్ సందేశంలో ఏముందంటే..‘హలో మేడమ్, నేను ఇక్కడ మూడు నెలలు పూర్తి చేసుకున్నాను. ఆన్బోర్డింగ్ సమయంలో మాట్లాడినట్లుగా నా స్టైపెండ్ రివిజన్ గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. గత 3 నెలల్లో నేను ఎస్ఎల్ఎం ఏజెంట్లను నిర్మించాను. వాటిని పరీక్షించాను. డెప్లాయ్ చేశాను. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా స్టైపెండ్ను కొంత మేర(XXXX) పెంచుతారని ఆశిస్తున్నాను. దీనిపై మరింత చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని రాశారు.కానీ, ఈ సాధారణ మెసేజ్ను మేనేజర్ జీర్ణించుకోలేకపోయారు. ‘ఒక విద్యార్థికి ఇంత పెద్ద మొత్తంలో పెంపు ఇవ్వడం అసాధ్యం’ అని కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా ఆమె రాత్రింబవళ్లు కష్టపడి చేసిన పనిని కేవలం ‘టెస్టింగ్ క్యాంపెయిన్లు, టెస్ట్ క్లయింట్లు’ అంటూ తక్కువ చేసి మాట్లాడారు. స్వతంత్రంగా పనిచేయడాన్ని కూడా ఒక తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు.తర్వాత కొన్ని రోజులకు..ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే సదరు ఇంటర్న్కు కంపెనీ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. అంచనాలకు తగిన పని లేదనే (Mismatch in expectations) నెపంతో ఆమె ఇంటర్న్షిప్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా కంపెనీ సీఈఓ ఆమెకు దాదాపు 30 నిమిషాల పాటు స్టార్టప్ సంస్కృతిపై ఉచిత ఉపన్యాసం ఇచ్చి ఆమెను ‘మనీ-మైండెడ్’ అని సంబోధించారు.‘‘నాలుగు నెలల పాటు కష్టపడి రాసిన కోడ్ను పూర్తిగా విస్మరించారు. ‘మేము ఇంత మొత్తమే ఇవ్వగలం’ అని వారు నేరుగా చెప్పి ఉంటే నేను సంతోషంగా అంగీకరించేదాన్ని. కానీ కేవలం చర్చలు జరిపినందుకు నన్ను తీసేశారు’ అని టెక్కీ వాపోయారు. ‘ప్రామాణిక వ్యాపార చర్చలను వ్యక్తిగత ద్రోహంగా భావించే నిర్వాహకుల కింద వేతనం కోసం నేను భిక్షం ఎత్తాలనుకోవడం లేదు. అందుకే నా ఎక్స్పీరియన్స్ లెటర్ కోసం డిమాండ్ చేస్తూ మెయిల్ పెడుతున్నాను’ అని ఆమె చెప్పారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్గా మారడంతో ఐటీ నిపుణులు, నెటిజన్లు సదరు టెక్కీకి మద్దతుగా నిలుస్తున్నారు. కంపెనీల దోపిడీని ఎండగడుతూ పలువురు వ్యాఖ్యానించారు. ‘కూల్గా ఉండండి.. మీ ప్రమాణాలను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. మిమ్మల్ని కోల్పోవడం ఆ కంపెనీకే నష్టం’ అని ఒకరన్నారు. ‘నాకు కూడా ఇలాగే జరిగింది. కంపెనీ అవసరాలకు మించి ఎక్కువ పనులు చేయకూడదని దీని ద్వారా నేర్చుకున్నాను’ అని మరొకరు చెప్పారు.ఇదీ చదవండి: బంగారు పంట పండింది! -
జూన్ 30 డెడ్లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్!
భారతదేశంలో ఎల్పీజీ సబ్సిడీలను పారదర్శకంగా.. సమర్థవంతంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లక్షలాది ఎల్పీజీ వినియోగదారులు, ముఖ్యంగా 'ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన' (PMUY) లబ్ధిదారులు, తమ eKYC ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ఈ ప్రక్రియను 2026 జూన్ 30లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ నిలిపివేయనున్నట్లు హెచ్చరించింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఇండియన్ ఆయిల్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులు ఆధార్ ఆధారిత గుర్తింపు తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచిస్తున్నాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వినియోగదారులకు ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ వంటి సంస్థల ద్వారా వచ్చే సబ్సిడీలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది.ఈకేవైసీ ప్రక్రియ సులభంగా ఉంటుందని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. వినియోగదారులు తమ మొబైల్ యాప్ల ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇండేన్ వినియోగదారులు ఇండియన్ఆయిల్ వన్ యాప్ ద్వారా, భారత్ గ్యాస్ వినియోగదారులు హలో బీపీసీఎల్ యాప్ ద్వారా, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు హెచ్పీ పే యాప్ లేదా ఆధార్ ఫేస్ఆర్డీ యాప్ ద్వారా ఈకవైసీ పూర్తి చేయవచ్చు. ఇందులో ఓటీపీ ధృవీకరణ, ఆధార్ లింకింగ్, ఫేస్ అథెంటికేషన్ వంటి దశలు ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు. కాగా ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పరిధిలో లేని వినియోగదారులకు ఈకేవైసీ తప్పనిసరి కాదు. అయితే అయితే అర్హులైన వారు సమయానికి పూర్తి చేయకపోతే సబ్సిడీ ప్రయోజనాలు ఆగిపోతాయి. కాబట్టి గడువు (జూన్ 30)లోపు ఈ ప్రక్రియను తప్పకుండా పూర్తి చేసుకోవడం ఉత్తమం.एलपीजी सब्सिडी का लाभ बिना किसी रुकावट के प्राप्त करते रहें।30 जून 2026 से पहले अपना eKYC पूरा करें। यह प्रक्रिया सरल, सुरक्षित और पूर्णतः निःशुल्क है। आप इसे इंडियनऑयल ONE ऐप, अपने इंडेन वितरक या एलपीजी डिलीवरी कर्मी के माध्यम से आसानी से पूरा कर सकते हैं।आज ही eKYC करवाएँ… pic.twitter.com/E7bukytXWA— Indian Oil Corp Ltd (@IndianOilcl) June 12, 2026 -
అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ నియామకం
ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తమ సరికొత్త హెల్త్ టెక్ స్పిన్-ఆఫ్ (నూతన విభాగం) పునర్నిర్మాణంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి ఈ ప్రతిపాదిత పథకానికి తుది ఆమోదం లభించిన అనంతరం అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా శోభన కామినేనిని నియమించనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. కంపెనీ ప్రతిపాదిత విభజన, అపోలో హెల్త్ టెక్ లిస్టింగ్ (స్టాక్ మార్కెట్లో నమోదు), కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ఫ్రేమ్ వర్క్)కు సంబంధించిన అదనపు వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది.12 మందితో బోర్డు ఏర్పాటుదీర్ఘకాలిక విలువ సృష్టి, పారదర్శకమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ పునర్నిర్మాణ పథకంలో బలమైన అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ను రూపొందించినట్లు అపోలో తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హెల్త్ టెక్ బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డులో సగం మంది (ఆరుగురు) స్వతంత్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డులోని ప్రతి డైరెక్టర్ తమ విశ్వసనీయ విధులకు కట్టుబడి ఉంటారని, స్వతంత్ర డైరెక్టర్లు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ సమతుల్య నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని కంపెనీ పేర్కొంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఒక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ను నియమించనున్నట్లు, బోర్డు వ్యవహారాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది.శోభన కామినేని నియామక నిబంధనలు, పదవీకాలం, వేతన ప్యాకేజీకి సంబంధించి వాటాదారుల అనుమతిని త్వరలోనే కోరనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, పాలనాపరమైన పారదర్శకత కోసం పెట్టుబడిదారు లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా 10 శాతం కంటే తగ్గితే వారి నామినేషన్ హక్కులు ముగుస్తాయి.అప్సైడ్ అగ్రిమెంట్ వివరాలుఈ విలీన పథకంలో భాగమైన ‘అప్సైడ్ అగ్రిమెంట్’ గురించి వస్తున్న ఊహాగానాలకు అపోలో తెరదించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిధులను వ్యూహాత్మక పెట్టుబడిదారు రాస్మేలి (Rasmeley) మాత్రమే సమకూరుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల అపోలో హెల్త్ టెక్ నుంచి గానీ, దాని ప్రస్తుత వాటాదారుల నుంచి గానీ ఎటువంటి నగదు బయటకు వెళ్లదు.వ్యూహాత్మక పునర్నిర్మాణం లక్ష్యం ఇదే..అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చేపట్టిన ఈ భారీ విభజన, పునర్నిర్మాణ పథకం వెనుక స్పష్టమైన వ్యాపార వ్యూహం ఉంది. కంపెనీకి చెందిన సేవలను విడివిడిగా విభజించి (స్పిన్ ఆఫ్), విలీనం చేయడం ద్వారా స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఓమ్నిఛానల్ రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పంపిణీ వ్యాపారం, డిజిటల్ హెల్త్ వ్యాపారం (Apollo 24/7 వంటి డిజిటల్ సేవలు) వంటి విభాగాలన్నింటినీ ‘అపోలో హెల్త్ టెక్’ గొడుగు కిందికి తెచ్చి ప్రత్యేకంగా వృద్ధి పథంలో నడిపించనున్నారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
బద్రీనాథ్, కేదార్నాథ్ క్షేత్రాల వృద్ధికి రూ.10 కోట్ల విరాళం
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ హిమాలయ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉభయ క్షేత్రాల అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. శతాబ్దాల నాటి ఈ ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల తనకున్న భక్తిని చాటుకుంటూ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.కట్టుదిట్టమైన భద్రతఉదయం 10:00 గంటలకు ముఖేష్ అంబానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బద్రీనాథ్ హెలిప్యాడ్కు చేరుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా వలయం నడుమ ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అంబానీ దాదాపు 20 నిమిషాల పాటు బద్రి విశాల్ భగవానుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 10 నిమిషాల పాటు సాంప్రదాయ ఆచారాలను నిర్వహించారు.కమిటీతో భేటీ - విరాళంపూజా కార్యక్రమాల అనంతరం బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు పుణ్యక్షేత్రాల మౌలిక వసతులు, అభివృద్ధి, నిర్వహణ పనుల నిమిత్తం రూ.10 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఉదయం 10:40 గంటలకు బద్రీనాథ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11:15 గంటలకు కేదార్నాథ్ చేరుకున్నారు. అక్కడ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి జలాభిషేకం చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.జై శ్రీరామ్ నినాదాలతో..కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో అంబానీని చూసిన భక్తులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అంబానీ చేతులు జోడించి నమస్కరిస్తూ భక్తులను పలకరించారు. పర్యటన ముగిసిన అనంతరం ఆయన మధ్యాహ్నం తిరుగుపయనమయ్యారు.ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం -
మెరుస్తూనే ఉంటాయి... కానీ!
సాక్షి, వెల్త్: ఈక్విటీలు, బంగారం, వెండి.. ఏ అసెట్ ర్యాలీ చేస్తున్నా ఇన్వెస్టర్లకు సందడే. స్టాక్స్ ర్యాలీలో బుల్స్ వెంట పరుగులు తీస్తారు. అనిశ్చితులు, సంక్షోభాలతో ఈక్విటీలు బేల చూపులు చూస్తుంటే.. బంగారం, వెండిని ఎత్తుకుంటారు. ఏ ర్యాలీ అయినా రివర్స్ గేర్ తీసుకుంటే మాత్రం కంగారు పడిపోతుంటారు. 2020లో కరోనా విపత్తు, 2022లో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, 2025లో ట్రంప్ రెండో విడత అమెరికా అధ్యక్ష బాధ్యతల అనంతరం ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాల యుద్ధాన్ని ప్రకటించడం, 2026లో ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం.. ఈ అనిశ్చితి, అయోమయ పరిస్థితులతో రెండేళ్లుగా పసిడి, వెండి జిగేల్మన్నాయి.ఏ దశలో పెట్టుబడి పెట్టినా ఇన్వెస్టర్లకు కాసులు కురిపించాయి. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి బంగారం 25 శాతం, వెండి 45 శాతం వరకు పతనమయ్యాయి. ఎందుకని? ఎందుకంటే యుద్ధాలు, సంక్షోభాలు, ధరల మంటలు, ఆర్థిక మాంద్యాలు వంటి సందర్భాల్లో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు (హెడ్జింగ్ కోసం) ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి కొంత పెట్టుబడులను పసిడి, వెండిలోకి మళ్లిస్తారు.సంక్షోభం కుదుటపడుతోందని సంకేతాలొచ్చినా... లేదా అప్పటికే భారీగా పెరిగి ఉన్నా కొంత విక్రయించి లాభాలు స్వీకరిద్దామన్న ధోరణి నెలకొన్నా.. పసిడి, వెండి రివర్స్ గేర్ తీసుకుంటాయి. 2026 జనవరిలో జీవితకాల గరిష్ట స్థాయికి చేరాక పసిడి, వెండిలో కనిపించిన దిద్దుబాటు ఒక రకంగా ఇలాంటిదే. ఒక్క ఈ నెలలోనే 12 శాతం మేర వీటి ధరలు పతనమయ్యాయి. మరి ఈ కరెక్షన్ బుల్ మార్కెట్ ముగింపు కార్డా? ఇన్వెస్టర్ల ముందున్న మార్గం ఏంటి? ఏం చేయాలిపుడు?ఎందుకు ఈ పతనం?⇒ ఏ ప్రయాణం మధ్యలో అయినా ఎక్కడో ఒక చోట బ్రేక్ తీసుకుంటాం. పసిడి, వెండిలోనూ ఇప్పుడదే చూస్తున్నాం. ⇒ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలతో అంతర్జాతీయ వృద్ధిపై అనిశ్చితులు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆటుపోట్లు గత రెండేళ్ల కాలంలో ఇన్వెస్టర్లను గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకు చేరువ చేశాయి. ఇప్పుడు అనిశ్చితి పరిస్థితులు కొంత తెరిపిన పడుతున్నాయి. ⇒ ఇంతకాలం దేశీ ఈక్విటీలు బలహీనంగా కదలాడాయి. ఆకర్షణీయ వేల్యుయేషన్ల వద్ద ఉండడంతో సమీప కాలంలో ఈక్విటీలు ర్యాలీ చేయొచ్చన్న విశ్వాసం పెరుగుతోంది. ⇒ బంగారాన్ని కేవలం విలువను కాపాడే వస్తువుగానే చూస్తుంటారు. అంతేకానీ దీనిపై పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయమేదీ రాదు. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణంతో గరిష్టాల్లో వడ్డీ రేట్లు ఉండడం, మన దగ్గరా సమీప కాలంలో వడ్డీ రేట్లు పెరిగే పరిస్థితులతో వడ్డీ రాబడినిచ్చే బాండ్లు, డిపాజిట్లు ఇప్పుడు ఆకర్షణీయంగా మారుతున్నాయి. కనుక ఎలాంటి రాబడి లేని పసిడి, వెండి నుంచి పెట్టుబడులు బాండ్లు, ఈక్విటీల వైపు యూటర్న్ తీసుకుంటాయి. ⇒ అంతర్జాతీయంగా పసిడి ధరలు డాలర్లోనే ట్రేడవుతుంటాయి. డాలర్ బలపడడం బంగారం, వెండి ధరలపై ఒత్తిడికి దారితీస్తోంది. ⇒ బంగారం, వెండి గత 18– 24 నెలల్లో అసాధారణ రాబడులనిచ్చాయి. ఏదో ఒక దశలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం సహజమే. ఒక విధంగా ఇది పోర్ట్ఫోలియోకి మంచిది కూడా. అప్పుడే తాజా పెట్టుబడిదారులకు ధరలు అందుబాటులోకి వస్తాయి. ఏంటి మార్గం..?⇒ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులు పె ట్టిన వారు ప్రస్తుత దిద్దుబాటును చూసి ఎ లాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ⇒ బంగారం, వెండిలో 10–12 శాతం దిద్దుబాటు అసాధారణమేమీ కాదు. చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ర్యాలీ తర్వాత బంగారం, వెండి ర్యాలీ దిద్దుబాటుకు చవిచూశాయి. ⇒ ధరలను చూసి నిర్ణయం తీసుకోవద్దు. అస లు మీ పెట్టుబడి లక్ష్యం ఏంటో తెలుసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించండి. ⇒ కేవలం ధరలు పెరుగుతున్నాయి కదా అని, ఇన్వెస్ట్ చేసి కొన్ని రోజుల్లో విక్రయించడం ద్వారా లాభాలు సంపాదించొచ్చని అ డుగు పెట్టినట్టయితే.. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే స్వల్పకాలంలో ధరల తీరును ఎవరూ అంచనా వేయలేరు. ⇒ ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారు ఒకే విడత కాకుండా, క్రమానుగతంగా, నెలవారీ కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లడమే మంచిది. గోల్డ్ ఈటీఎఫ్లు, లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ను ఎంపిక చేసుకోవచ్చు. ⇒ దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి ప్రస్తుత దిద్దుబాటు అనుకూలం. వెండికి అదనపు అనుకూలత⇒ ఆభరణాలతోపాటు పెట్టుబడికి హెడ్జింగ్ సాధనంగా పసిడికి గుర్తింపు ఎక్కువ. వెండికి పెట్టుబడితోపాటు పరిశ్రమల నుంచి ముడి పదార్థంగానూ బలమైన డిమాండ్ నెలకొంది. ⇒ ఎల్రక్టానిక్స్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్వాహనాలు, సోలార్ ప్యానెళ్లు ఇలా ఎన్నో అత్యాధునిక పరిశ్రమల్లో వెండి అవసరం. ⇒ బంగారంతోపాటు వెండికి సైతం పెట్టుబడుల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కానీ పసిడితో పోలి్చతే వెండిలో అస్థిరతలు ఎక్కువన్నది గుర్తు పెట్టుకోవాలి. కథ ముగిసినట్టేనా?బంగారం కథ ఇంతటితో సమాప్తం అని అనుకోవడానికి లేదు. ⇒ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్లు తమ రిజర్వ్ అసెట్స్లో బంగారానికీ పెద్ద పీట వేస్తున్నాయి. గతంలో యూఎస్ డాలర్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు డాలర్ వెయిటేజీ తగ్గించి, గోల్డ్కు వెయిటేజీని పెంచడం ద్వారా వైవిధ్యంపై దృష్టి పెట్టాయి. ⇒ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల అప్పుల భారం గరిష్ట స్థాయిల్లోనే ఉంది. ⇒ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా సమసిపోలేదు. ఇక ముందు పెరగవని, మళ్లీ ఏర్పడవని కూడా చెప్పలేం. ⇒ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ⇒ కనుక స్వల్పకాలంలో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా.. దీర్ఘకాలానికి పెట్టుబడుల పరంగా వాటి ప్రాధాన్యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎంత కేటాయించొచ్చు?⇒ రిటైల్ ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పెట్టుబడుల కేటాయింపుల్లో పసిడికి 10–15 శాతం కేటాయించుకోవచ్చు. పెట్టుబడి పరంగా వెండి కంటే పసిడిలో స్థిరత్వం ఎక్కువ. చారిత్రకంగా చూస్తే బంగారం కంటే ఈక్విటీలే అధిక రాబడినిచ్చాయి. రూ.10 లక్షల మోడల్ పోర్ట్ఫోలియో వేటికి ఎంత చోటు అసెట్ క్లాస్ కేటాయింపులు (రూ.లలో) ఈక్విటీలు - 6,00,000 డెట్ఫండ్స్/ఎఫ్డీలు/ బాండ్లు తదితర స్థిరదాయ సాధనాలు - 2,00,000 బంగారం - 1,00,000 వెండి - 50,000 నగదు/లిక్విడ్ ఫండ్స్ - 50,000ఒక్కటి గుర్తు పెట్టుకోండిప్రస్తుత దిద్దుబాటు విలువైన లోహాల ర్యాలీ లో కేవలం విరామమే. ర్యాలీ వెంట పరుగెత్తడం, పతనంలో ఆందోళన చెందడానికి దూరంగా ఉండాలి. బంగారం ఇన్వెస్టర్లను రాత్రికి రాత్రి ఐశ్వర్యవంతులను చేసేయదు. ఇతర పెట్టుబడి సాధనాల్లో అల్లకల్లలాలు నెలకొన్నప్పుడు పోర్ట్ఫోలియోకి స్థిరత్వాన్నిచ్చి, కొనుగోలు శక్తిని కాపాడే సాధనం. తాత్కాలిక దిద్దుబాట్లను సహనంతో ఎదుర్కొన్న వారికే విలువైన లోహాలు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయని చరిత్ర చెబుతోంది.పడుట పెరుగుట కొరకే⇒ బంగారం, వెండిలో దిద్దుబాట్లు ఎన్నో సందర్భాల్లో చోటుచేసుకున్నాయి. ప్రతీ దిద్దుబాటు అనంతరం తిరిగి పుంజుకున్నాయి. ⇒ అందుకే ఈక్విటీలు, పసిడిని దీర్ఘకాల పెట్టుబడి ఆస్తులుగానే చూడాలి. ⇒ స్వల్పకాల అవసరాల కోసం ఉద్దేశించిన వాటిని స్థిరాదాయ పథకాలకే కేటాయించుకోవాలి. ⇒ పోర్ట్ఫోలియోకి బీమాగా బంగారం, వెండినిచూడొచ్చు. ఇవీ... వాస్తవాలుబంగారం వెండి 10–20శాతం 20–30శాతం కరెక్షన్లు సాధారణం కరెక్షన్లు సాధారణం 25–35శాతం 40–60శాతం కరెక్షన్లు అరుదు కరెక్షన్లు అరుదు -
సహారా కేసులో సుప్రీం కోర్టుకు సెబీ
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ సంస్థ రూ.14,106 కోట్ల అక్రమ నిధుల సేకరణ కేసులో ‘సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్’ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో కంపెనీ అక్రమాలకు డైరెక్టర్లు మాత్రమే బాధ్యులని, అక్కడ పనిచేసే కంపెనీ సెక్రటరీ, నలుగురు మేనేజర్లు కేవలం ‘ఉద్యోగులు’ మాత్రమేనని పేర్కొంటూ వారికి ‘శాట్’ మినహాయింపునిచ్చింది.అయితే, సంస్థ అక్రమ పత్రాలపై సంతకాలు చేసినందుకు ఉద్యోగులనూ బాధ్యులను చేయాలని సెబీ వాదిస్తోంది. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జవాబుదారీతనంపై కీలకమైన ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు జూన్ 18న విచారించనుంది. -
మార్కెట్లోకి ఎల్జీ ‘ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్’
హైదరాబాద్: గృహోపకరణాల తయారీ సంస్థ ‘ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా’ మార్కెట్లోకి సరికొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. భారతీయ కుటుంబాల జీవన విధానం, అవసరాలకు అనుగుణంగా 83.82 సెం.మీ (33 అంగుళాల) వెడల్పు విభాగంలో ‘ఆటో ఐస్ మేకర్’ సదుపాయంతో వీటిని రూపొందించారు. 574 లీటర్ల నుండి 610 లీటర్ల సామర్థ్యంతో లభించే ఈ రిఫ్రిజిరేటర్లు దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్లెట్లలో లభిస్తాయి. ప్రారంభ ధర రూ.1.18 లక్షలతో అందుబాటులో ఉన్నాయి.ఈ సరికొత్త ఫోర్–డోర్ నిర్మాణంలో ‘రిఫ్రిజిరేటర్’ పై భాగంలో, ‘ఫ్రీజర్’ దిగువ భాగంలో ఉన్నాయి. ఇందులో అమర్చిన ఎల్జీ ‘ఇన్స్టా వ్యూ’ ఫీచర్ ద్వారా కేవలం రెండుసార్లు తట్టడంతోనే లోపల ఉన్న వస్తువులను చూడవచ్చు. ఆహార పదార్థాల తాజాదనం కోసం ‘ఫ్రెష్ కన్వర్టర్ ప్లస్’, నిరంతర ఐస్ ఉత్పత్తి కోసం రీఫిల్ చేయగల వాటర్ ట్యాంక్ సిస్టమ్ గల ‘ఆటో ఐస్ మేకర్’ ఉన్నాయి. వీటితో పాటు ఇన్బిల్ట్ వాటర్ డిస్పెన్సర్, డోర్ కూలింగ్, హైజీన్ ఫ్రెష్ ప్లస్, స్మార్ట్ లెర్నర్ కూలింగ్ టెక్నాలజీ, ఎల్జీ థింక్ వై–ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ సందర్భంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోమ్ సొల్యూషన్స్ డైరెక్టర్ యంగ్ మిస్ హ్వాంగ్ మాట్లాడుతూ ‘‘భారతీయ వినియోగదారుల రోజువారీ జీవితాన్ని మెరుగుపరిచే ఆవిష్కరణలను తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తాం. మా కొత్త ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్ శ్రేణి ప్రీమియం డిజైన్, సౌలభ్యం, స్మార్ట్ టెక్నాలజీ పట్ల మాకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అన్నారు. -
ఫేబుల్-5, మైథోస్-5 సేవలు నిలిపివేత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ‘ఆంథ్రోపిక్’కు అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా యూఎస్ ప్రభుత్వం ‘ఎగుమతి నియంత్రణ’ ఆదేశాలను జారీ చేసింది. దీనికి స్పందించిన ఆంథ్రోపిక్ తన అధునాతన ఏఐ మోడళ్లు ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లందరికీ ఈ సేవల యాక్సెస్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.అమెరికా భూభాగంలోనైనా, వెలుపలనైనా, ఏ విదేశీ పౌరుడికైనా, చివరికి ఆంథ్రోపిక్ సంస్థలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు సైతం ఫేబుల్ 5, మైథోస్ 5 మోడళ్ల యాక్సెస్ను పూర్తిగా నిలిపివేయాలని యూఎస్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అయితే తమ ఇతర ఏఐ మోడళ్ల సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆంథ్రోపిక్ వివరణ ఇచ్చింది.భారత్పై తీవ్ర ప్రభావం అమెరికా తర్వాత ఆంథ్రోపిక్ సంస్థకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ కావడంతో తాజా నిర్ణయం భారతీయ క్లయింట్లు, కార్పొరేట్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటీవలే దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన 50 వేల మంది ఉద్యోగులకు ఆంథ్రోపిక్ ఏఐ మోడళ్లపై శిక్షణ అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్లాడ్ మోడళ్ల ఆధారంగా అధునాతన ఎంటర్ప్రైజ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేసేందుకు ఫిబ్రవరిలో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అలాగే సైబర్ సెక్యూరిటీ చొరవ కింద ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ ద్వారా కొన్ని భారత ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు కూడా ఈ మైథోస్ మోడల్ యాక్సెస్ లభించింది. తాజా నిర్ణయంతో ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి.ప్రభుత్వ నిర్ణయంతో విభేదిస్తున్న ఆంథ్రోపిక్ప్రభుత్వ ఆదేశాలు జూన్ 12న సాయంత్రం 5.21 గంటలకు అందినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ‘ఫేబుల్ 5’, ‘మైథోస్ 5’ మోడళ్లలో భద్రతా లోపాలను దారి మళ్లించే ఒక పద్ధతి బయటపడిందని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ప్రభుత్వం చెబుతున్న లోపం చాలా చిన్నదని, సాఫ్ట్వేర్ లోపాలను సరిదిద్దమని మోడల్ను కోరడం లాంటి సాధారణ విషయమేనని కంపెనీ వాదిస్తోంది. ఇలాంటి ఫీచర్లు ఓపెన్ఏఐకు చెందిన జీపీటీ–5.5తో పాటు ఇతర ఏఐ మోడళ్లలో కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఒక కమర్షియల్ మోడల్ను ఇలాంటి చిన్న కారణంతో నిలిపివేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ, సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆంథ్రోపిక్ వెల్లడించింది. -
ట్రిలియనీర్ మస్క్.. ఇల్లు మరీ ఇంత సింపులా?
సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా ఉంటాయి. భారీ అంతస్తుల్లో, సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాలను తలపిస్తుంటాయి. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాస భవనం యాంటిలియా (Antilia) గురించి విన్నాం కదా. మరి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా (లక్ష కోట్ల డాలర్ల సంపద) నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటోందనన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మస్క్ ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్ 12న జరిగిన ‘స్పేస్ఎక్స్’ చారిత్రాత్మక ఐపీఓ (SpaceX IPO success) అనంతరం కంపెనీ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఒక ట్రిలియన్ డాలర్ల మార్క్ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.అయితే ఇంత అపార సంపద ఉన్నప్పటికీ మస్క్ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలోని బోకా చికా సమీపంలో, స్పేస్ఎక్స్ స్టార్బేస్ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్ చిన్న ఇంటిలోనే (Elon Musk Tiny House) ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంటిని మాడ్యులర్ హౌసింగ్ సంస్థ బాక్సబుల్ (Boxabl) రూపొందించింది.చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్ ఏరియా, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్, బిల్ట్-ఇన్ స్టోరేజ్, శక్తి పొదుపు డిజైన్ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మస్క్ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ “అద్భుతమైనది”గా అభివర్ణించారు.2020 తర్వాత కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన పలు ఆస్తులను విక్రయించిన మస్క్, వ్యక్తిగత ఆస్తుల కంటే తన వ్యాపార లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా స్టార్షిప్ రాకెట్ అభివృద్ధి, స్టార్లింక్ విస్తరణ, కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు స్టార్బేస్కు సమీపంలోనే మస్క్ నివసిస్తున్నారు.స్పేస్ఎక్స్ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. షేర్లు మార్కెట్లో జోరుగా లిస్టింగ్ కావడంతో కంపెనీ విలువ రెండు ట్రిలియన్ డాలర్లకు చేరువై, మస్క్ సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల స్థాయిని తాకినట్లు అంచనాలు వెలువడ్డాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే -
మల్టీప్లెక్స్ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్ల ముఖచిత్రం వేగంగా మారుతోంది. కేవలం భారీ బడ్జెట్, అగ్ర హీరోల పెద్ద సినిమాలపైనే ఆధారపడకుండా నిరంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సరికొత్త వ్యూహాలను తయారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ‘జెన్ జీ’ వినియోగదారులను తమ ప్రధాన ఆడియన్స్ గ్రూప్గా మల్టీప్లెక్స్ పరిశ్రమ టార్గెట్ చేస్తోంది. ఓటీటీలు, రీల్స్ వంటి ఆన్లైన్ వేదికలపై విరక్తి (డిజిటల్ అలసట) చెందిన యువత.. మళ్లీ థియేటర్ల వైపు అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.మరోవైపు, పెద్ద సినిమాల విడుదలకు మధ్య ఉండే గ్యాప్లో మల్టీప్లెక్స్ల్లో ఆక్యుపెన్సీ రేటు పడిపోకుండా ప్రాంతీయ చిత్రాలు, హాలీవుడ్ సినిమాలు, ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే చిన్న చిత్రాలు (స్లీపర్ హిట్లు) కీలక పాత్ర పోషిస్తున్నాయి.బాక్సాఫీస్ను శాసిస్తున్న యూత్!ఇటీవల విడుదలైన ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ మీడియా టోబర్ 2026 నివేదిక ప్రకారం.. భారతీయ బాక్సాఫీస్ వసూళ్లలో యువత పాత్ర ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. హిందీ బాక్సాఫీస్ మొత్తం కలెక్షన్లలో 30 ఏళ్ల లోపు ఉన్న యువత వాటా ఏకంగా 57% గా ఉంది. ఇక ఒక సినిమా విడుదలైన మొదటి రోజు (ఫస్ట్ డే) వచ్చే రెవెన్యూలో ఈ యువ తరం వాటా అత్యధికంగా 70% గా నమోదు కావడం విశేషం.‘ప్రస్తుతం సినిమా థియేటర్లకు వస్తున్న వారిలో జెన్ జీ తరం వారే అత్యధికంగా ఉంటున్నారు. ఆన్లైన్ వేదికలతో విసిగిపోయిన యువత, మళ్లీ వెండితెర అనుభూతిని ఆస్వాదించేందుకు థియేటర్లకు తిరిగి వస్తున్నారు’ అని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజ్లీ అన్నారు.ఒరిజినల్ కథలకే జై కొడుతున్న యువతఏదో ఒక సూపర్ హీరో ఫ్రాంచైజీలనో, పాత హిట్ చిత్రాల రీమేక్లనో లేదా రీబూట్లనో కాకుండా.. సరికొత్త లైన్లతో, ఒరిజినల్ కథాంశాలతో వచ్చే సినిమాలను చూసేందుకే యువత మక్కువ చూపుతున్నారని సంజీవ్ బిజ్లీ పేర్కొన్నారు. యువ దర్శకులు రూపొందించిన సరికొత్త చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎలా కనెక్ట్ చేస్తున్నాయనే దానికి కర్రీ బార్కర్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ హారర్ చిత్రం ‘అబ్సెషన్’, కేన్ పార్సన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్యాక్రూమ్స్’ చిత్రాల విజయాలే నిదర్శనమని ఉదహరించారు.భవిష్యత్తు ట్రెండ్స్ ఇవే..సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని రాబోయే రోజుల్లో కొన్ని అంశాలు శాసించనున్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి..థియేటర్లలో అధునాతన స్క్రీన్లు, మెరుగైన సీటింగ్, లగ్జరీ అనుభూతిని అందించడం.ద్వితీయ, తృతీయ శ్రేణి (టైర్2, టైర్3) పట్టణాలు, నగరాలకు మల్టీప్లెక్స్లను విస్తరించడం.కేవలం ఈవెంట్ సినిమాలు, పెద్ద చిత్రాలపైనే ఆధారపడకుండా.. విభిన్నమైన కంటెంట్తో వచ్చే స్లీపర్ హిట్ చిత్రాల ద్వారా థియేటర్లను నిరంతరం నిర్వహించడం.ఇదీ చదవండి: కాకపెంచుతున్న పసిడి ధరలు -
జెన్జీ..చెప్పుడు మాటలు నమ్మట్లేదు
నిన్నటివరకు కేవలం గాడ్జెట్లు, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఎంపికలకే పరిమితమనుకున్న ‘జెన్-జీ’ వినియోగదారుల ప్రభావం.. ఇప్పుడు ఫుడ్ బ్రాండ్లకు పాకింది. దశాబ్దాల చరిత్ర గల ప్రముఖ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలు సైతం ఇప్పుడు తమ వ్యూహాలను మార్చుకోక తప్పడం లేదు. కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు, ప్రొడక్ట్ లేబులింగ్, సరికొత్త ఉత్పత్తుల రూపకల్పన.. ఇలా ప్రతి నిర్ణయాన్నీ ఈ తరం యువ వినియోగదారులే శాసిస్తున్నారని పరిశ్రమవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.దేశీయ వినియోగంలో 35 శాతం వీరిదే!ఇప్సోస్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఫుడ్ వినియోగ వ్యయంలో దాదాపు 35 శాతం వాటా 15 నుంచి 20 ఏళ్ల పైబడిన జెన్-జీ యువతదే. ఆరోగ్యం, డిజిటల్ పరిజ్ఞానం, పర్యావరణ స్పృహ వంటి అంశాలే వీరి ఎంపికలను నిర్ణయిస్తున్నాయి.లేబుల్స్ చదువుతున్నారు.. ప్రశ్నిస్తున్నారు!ఒకప్పుడు బ్రాండ్ పేరు చూసి వస్తువులు కొనేవారు. కానీ నేటి తరం ఆలోచనా విధానం వేరుగా ఉంది. దీనిపై ఎమ్టీఆర్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ తివారీ మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నారు. ‘కాలేజీకి వెళ్లే నా కుమారుడు, అతని స్నేహితులు ఏ ప్రొడక్ట్ కొన్నా.. బ్రాండ్తో సంబంధం లేకుండా వెనుక వైపు ఉన్న లేబుల్ను నిశితంగా పరిశీలించడం స్వయంగా చూశాను. నేను మార్కెట్ విజిట్స్కి వెళ్లినప్పుడు కూడా ఈ విషయం గమనిస్తుంటాను. యువ వినియోగదారులు షాపింగ్ మాల్స్లో నిలబడి లేబుల్స్ను పోల్చి చూస్తూ ఆ ప్రొడక్ట్లో ఏమేం పదార్థాలు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి సమయం కేటాయిస్తున్నారు. బ్రాండ్లు చెప్పే మాటలను నమ్మడం లేదు. చదువుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఆపైనే నిర్ణయం తీసుకుంటున్నారు’ అని విశ్లేషించారు.ఫ్యూచర్-రెడీ దిశగా దిగ్గజ కంపెనీలుయువతను ఆకట్టుకునే వ్యూహంలో భాగంగా మారిపోతున్న ట్రెండ్ను మారికో ఎండీ సౌగతా గుప్తా వివరిస్తూ.. ‘మేము ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంతో పాటు సంస్థను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయాలంటే.. మా ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కచ్చితంగా జెన్-జీ, మిలీనియల్స్ అభిరుచులకు అనుగుణంగా ఉండాలి’ అన్నారు. ఇందుకు తగ్గట్టుగానే, మారికో సంస్థ కేవలం మూడు వారాల వ్యవధిలోనే యువతను టార్గెట్ చేసే మూడు డైరెక్ట్-టు-కన్స్యూమర్ బ్రాండ్లను దాదాపు రూ.800 కోట్లతో కొనుగోలు చేసింది.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో..అంశంశాతం తమ ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలనుకుంటున్న జెన్-జీ యువత79%అరోగ్యం కోసం జీవనశైలిలో గణనీయమైన మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నవారు83%2022 - 2025 మధ్య కాలంలో భారతదేశంలో ప్లాంట్-బేస్డ్ (మొక్కల ఆధారిత) ఫుడ్ ఇండస్ట్రీ సాధించిన వృద్ధి19% -
విమానాల కొనుగోలు ప్రణాళిక వాయిదా?
టాటా గ్రూప్ సారథ్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఆర్థిక ఒడిదొడుకుల నేపథ్యంలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కొత్త విమానాల డెలివరీలను వాయిదా వేయడంతో పాటు, తన ప్రతిష్టాత్మక విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాము ఆర్డర్ చేసిన సుమారు 500 విమానాల డెలివరీ ప్రక్రియను మందగించేలా (స్లో డౌన్) చేయడంపై ప్రముఖ విమాన తయారీ సంస్థలైన ‘ఎయిర్బస్ ఎస్ఈ’, ‘బోయింగ్ కో’లతో ఎయిరిండియా చర్చలు జరుపుతున్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించింది.భారీ చెల్లింపులు తప్పించుకునేందుకా?సాధారణంగా విమానయాన సంస్థలు జెట్ విమానాల కొనుగోలుకు సంబంధించిన చెల్లింపులను చాలా సంవత్సరాల పాటు విడతల వారీగా చెల్లిస్తాయి. అయితే, మొత్తం కొనుగోలు ధరలో సింహభాగం..అంటే దాదాపు 80 శాతం నిధులను విమానాన్ని అప్పగించే (డెలివరీ) సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డెలివరీలను వాయిదా వేసుకోవడం ద్వారా తయారీదారులకు చెల్లించాల్సిన ఈ భారీ వ్యయాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని, తద్వారా ప్రస్తుత నిధుల కొరత నుంచి ఉపశమనం పొందవచ్చని ఎయిరిండియా వ్యూహాత్మకంగా యోచిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.దీనితో పాటు కొత్త దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలపై సంస్థ పునసమీక్ష జరుపుతోంది. లాభదాయకంగా లేని కొన్ని పాత మార్గాలను పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించింది. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ఎయిర్పోర్ట్ల్లో తమ కార్యకలాపాల ప్రారంభాన్ని వాయిదా వేయాలని చూస్తోంది. ఇప్పటికే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఎయిరిండియా గత నెలలో అంతర్జాతీయ విమాన సామర్థ్యాన్ని తాత్కాలికంగా 27 శాతం (జూన్ - ఆగస్టు మధ్య 145 వారపు విమానాలు), దేశీయ విమాన సామర్థ్యాన్ని 22 శాతం వరకు తగ్గించిన సంగతి తెలిసిందే.ఇందుకు దారితీసిన కారణాలుపశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల తరచూ గగనతలం మూసివేత.గత ఏడాది మార్చి నుంచి పాకిస్థాన్ వైపు గగనతలాన్ని శాశ్వతంగా మూసివేయడం వల్ల విమాన ప్రయాణ సమయం, ఇంధన ఖర్చులు పెరగడం.అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలు భగ్గుమనడం.అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం.ఎయిర్ ఇండియా ప్రతినిధి ఏమన్నారంటే..బ్లూమ్బెర్గ్ నివేదికపై ఎయిరిండియా ప్రతినిధి స్పందిస్తూ... ఈ వార్తలు కేవలం ఊహాజనితమైనవని కొట్టిపారేశారు. తమ ఫ్లీట్ను ఆధునీకరించడానికి, దీర్ఘకాలిక పరివర్తన ప్రణాళికను అమలు చేయడానికి సంస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
భారత్ మార్కెట్పై ఎల్జీ ఫోకస్
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎల్రక్టానిక్స్ తన భవిష్యత్ వ్యాపార వృద్ధికి భారత్ను కీలక కేంద్రంగా చూస్తోంది. భారత్తోపాటు సౌదీ అరేబియా, బ్రెజిల్ మార్కెట్ల నుంచి ఆదాయాన్ని 2030 నాటికి రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు సంస్థ సీఈవో ల్యూ జే చియోల్ తెలిపారు. ముఖ్యంగా భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడం, అతిపెద్ద వినియోగ మార్కెట్ కూడా కావడంతో.. ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీలు) వినియోగం ఇంకా విస్తృతంగా పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. దీంతో ఎల్జీ బ్రాండ్కు ఉన్న ఆదరణ దృష్ట్యా తన మార్కెట్ను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత గృహోపకరణాల విస్తరణపై ఎల్జీ దృష్టి సారించింది. వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్లు, ఎయిర్ కండీషనర్లు, కిచెన్ ఉత్పత్తుల్లో ఏఐతోపాటు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఎగుమతులకూ ప్రాధాన్యం.. 2025లో భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ దేశాల నుంచి ఎల్జీకి 6.2 ట్రిలియన్ కొరియన్ వోన్ల ఆదాయం లభించగా, 2023తో పోలిస్తే ఇది 20 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. గతేడాది సంస్థ మొత్తం ఆదాయం 89.2 ట్రిలియన్ వోన్ల్లో 8 శాతానికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీ సంస్థ సాధించిన వృద్ధితో పోలి్చతే ఇది రెండింతలకుపైగా కావడం విశేషం. ఇంత భారీ వృద్ధి అవకాశాల నేపథ్యంలో భారత్ను ‘గ్లోబల్ సౌత్’ వ్యూహానికి కేంద్రబిందువుగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్టు ఎల్జీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంస్థకు ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా, మహారాష్ట్రలోని పుణేలో ప్లాంట్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో మూడో తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇది 2026 చివరినాటికి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. ఈ కొత్త ప్లాంట్ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచుకోవాలని చూస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం భారత్లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంది. యూకే, ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకోగా, వీటిని అనుకూలంగా చేసుకోవడాన్ని పరిశీలించనున్నట్టు తెలిపింది. ప్రీమియం ఉత్పత్తులపై దృష్టిప్రస్తుతం భారత్లో మధ్యస్థ, తక్కువ ధరల ఉత్పత్తుల తయారీపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన ఎల్జీ, ఇకపై నాలుగు డోర్ల ఫ్రిజ్లు, ఫ్రెంచ్ డోర్ ఫ్రిజ్లు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీని పెంచనున్నట్టు వెల్లడించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడం, నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించుకోవడం, స్థానిక సంస్థలను కొనుగోలు చేయడం లేదా విలీన అవకాశాలను సైతం పరిశీలించనున్నట్టు పేర్కొంది. హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ (హెచ్వీఏసీ) విభాగంలోకీ విస్తరించనున్నట్టు ప్రకటించింది. భారత వినియోగదారులు సాధారణ ఉత్పత్తుల కంటే ఇంటెలిజెంట్, కనెక్టెడ్ (ఒకదానితో ఒకటి అనుసంధానిత) గృహోపకరణాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు ఆధారిత గృహోపకరణాలు, వాటిని అనుసంధానించే స్మార్ట్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్టు వెల్లడించింది. -
AI వల్ల ఉద్యోగాలు పోతాయా..: లేటెస్ట్ రిపోర్ట్ ఇదే!
‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది.అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్ఫోర్స్ సర్వేను నిర్వహించింది.ఉత్పాదకతపై భిన్న అభిప్రాయాలుఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో కొంత అయోమయం నెలకొన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రతిరోజూ ఏఐని ఉపయోగించే వారిలో 30 శాతం మంది పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ.. ఏఐ వాడని వారితో పోలిస్తే తాము తక్కువ ఉత్పాదకతతో ఉన్నట్లు భావిస్తున్నామని వారు చెప్పారు. నిత్యం చేసే సాధారణ పనులను ఏఐ చూసుకోవడం వల్ల, తమ సొంత పనితీరును అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు భావిస్తుండటమే దీనికి కారణం.సాంకేతికత-స్కిల్స్ కీలకంవ్యాపార సంస్థల అధిపతులు కేవలం ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే కోణంలో ఆలోచించకుండా, సాంకేతికతను, మానవ నైపుణ్యాలను ఎలా మేళవించాలనే దానిపై దృష్టి పెట్టాలని రాహుల్ గోయల్ సూచించారు. రోజు వారీగా పదే పదే చేసే పనులను ఏఐ సులువుగా పూర్తి చేస్తుంది.దీనివల్ల ఉద్యోగులకు సమయం కలిసివచ్చి, వారు నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, సమన్వయం వంటి మానవ మేధస్సుకు సంబంధించిన సృజనాత్మకత పనులపై మరింత దృష్టి పెట్టవచ్చు. నాలెడ్జ్ ఆధారిత రంగాల్లో ఉన్న ఉద్యోగులు తమ కెరీర్పై ధీమాగా ఉన్నారు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం వృథా చేయకుండా, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని గోయల్ వివరించారు. -
పెంటగాన్ ఏఐ డీల్తో గూగుల్లో సంక్షోభం
సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి కంపెనీల్లో ఉద్యోగులు బలవంతంగా బయటకు వెళ్తున్న తరుణంలో గూగుల్కు చెందిన ఒక టాప్ డైరెక్టర్ తన నైతిక విలువల కోసం కోట్లాది రూపాయల ప్యాకేజీని, అత్యున్నత హోదాను స్వచ్ఛందంగా వదులుకున్నారు. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రెనే మేర్హోఫర్ తన పదవికి రాజీనామా చేశారు. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్)తో గూగుల్ కుదుర్చుకున్న వివాదాస్పద కృత్రిమ మేధ ఒప్పందమే ఇందుకు ప్రధాన కారణం. రాజీనామా లేఖను వ్యక్తిగత బ్లాగ్ పోస్ట్లో బహిర్గతం చేస్తూ గూగుల్ మేనేజ్మెంట్ తన నైతికతను కోల్పోయిందని రెనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న 2017వ సంవత్సరంలో గూగుల్ నుంచి వచ్చిన తిరస్కరించలేని ఆఫర్తో రెనే మేర్హోఫర్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ డైరెక్టర్గా చేరారు. దాదాపు దశాబ్ద కాలం పాటు సేవలందించిన ఆయన, తొమ్మిదేళ్ల క్రితం తాను చేరిన నాటి గూగుల్ సంస్కృతికి, నేటి గూగుల్ వైఖరికి అసలు పొంతన లేదని స్పష్టం చేశారు.‘ప్రపంచ స్థాయిలో అద్భుతాలు చేయడానికి గూగుల్ ఒక సరైన వేదిక. ఇక్కడి పారదర్శక సంస్కృతి, భిన్న అభిప్రాయాలకు ఇచ్చే గౌరవం నన్ను ఆకర్షించాయి. ఒక గూగులర్గా మా సొంత గుర్తింపును, విలువలను పనిలో చూపించే స్వేచ్ఛ ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నత స్థాయి యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ సంస్కృతిని దెబ్బతీశాయి’ అని జోహన్నెస్ కెప్లర్ యూనివర్శిటీ లింజ్లో ప్రొఫెసర్గా, ఇన్స్టిట్యూట్ ఫర్ నెట్వర్క్స్ అండ్ సెక్యూరిటీ అధిపతిగా కూడా ఉన్న మేర్హోఫర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ, ప్రైవసీ ఇంజినీరింగ్ ఉపాధ్యక్షుడు డేవ్ క్లీడర్మాకర్, ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ సెక్యూరిటీ హెడ్ నిక్ క్రాలెవిచ్లు తనపై ఉంచిన నమ్మకానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.సుందర్ సొంత ఏఐ సూత్రాలను పక్కనబెట్టారా?2018లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా కొన్ని ఏఐ సూత్రాలను ప్రకటించారు. వాటి ప్రకారం గూగుల్ అభివృద్ధి చేసే ఏఐ అప్లికేషన్లు కింది అంశాలకు విరుద్ధంగా ఉండకూడదు.1. ఆయుధాల తయారీ లేదా ప్రజలకు ప్రత్యక్షంగా గాయం కలిగించే సాంకేతికతలు.2. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామూహిక నిఘా కోసం సమాచారాన్ని సేకరించడం.3. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సూత్రాలను ఉల్లంఘించే సాంకేతికతలు.అయితే, ప్రస్తుత పెంటగాన్ ఒప్పందం ద్వారా గూగుల్ యాజమాన్యం ఈ నియమాలను నిశ్శబ్దంగా తుంగలో తొక్కిందని మేర్హోఫర్ ఆరోపించారు. అమెరికా రక్షణ శాఖ ఏదైనా చట్టబద్ధమైన ఉద్దేశం కోసం తమ ఏఐ నమూనాలను వాడుకునేలా గూగుల్ ఒప్పందం చేసుకుందని, అయితే అవి ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు రుజువైందని ఆయన ఎండగట్టారు.ఉద్యోగుల తీవ్ర నిరసనఅమెరికా రక్షణ శాఖకు క్లాసిఫైడ్ ఏఐ సేవలు అందించడాన్ని గూగుల్ అంతర్గత ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రక్షణ శాఖతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని డిమాండ్ చేస్తూ 600 మందికి పైగా ఉద్యోగులు సంతకాలు చేసిన లేఖను సీఈఓ సుందర్ పిచాయ్కు పంపినప్పటికీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు. ఈ నిర్ణయాలన్నీ కేవలం ఉన్నత స్థాయి యాజమాన్యం మాత్రమే తీసుకుందని, అంతర్గత ఛానెళ్ల ద్వారా తమలాంటి డైరెక్టర్లకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని మేర్హోఫర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
దేశాల జీడీపీలను దాటేసిన మస్క్ సంపద
ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రధాన దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను (జీడీపీ) సైతం అధిగమించడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐంఎఎఫ్) తాజా అంచనాలతో మస్క్ సంపదను పోల్చి చూస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఆధునిక పారిశ్రామిక ప్రపంచంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ వివాదాలు-విజయాల నడుమ దూసుకుపోతున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయన సంస్థ ‘స్పేస్ఎక్స్’ యూఎస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో 75 బిలియన్ డాలర్ల పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) నిధులను సేకరించింది. దాంతో మస్క్ అధికారికంగా ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ డాలర్లకుపైగా(సుమారు రూ.103 లక్షల కోట్లు) ఆస్తుల అధిపతిగా అవతరించారు.తైవాన్ కంటే ఎక్కువే.సెమీకండక్టర్ల తయారీలో ప్రపంచ కేంద్రంగా పేరొందిన తైవాన్ దేశ వార్షిక జీడీపీ 976.7 బిలియన్ డాలర్లు. అయితే, స్పేస్ఎక్స్ ఐపీఓ తర్వాత మస్క్ నికర సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు (1,100 బిలియన్ డాలర్లు) చేరడంతో తైవాన్ దేశం ఒక ఏడాదిలో సృష్టించే మొత్తం ఆర్థిక విలువ కంటే మస్క్ వ్యక్తిగత ఆస్తే ఎక్కువని తేలింది.ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం.. సంపన్న దేశాలైన నెదర్లాండ్స్ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), టర్కీ (జీడీపీ సుమారు 1.1 ట్రిలియన్ డాలర్లు), సౌదీ అరేబియా (జీడీపీ సుమారు 1.05 ట్రిలియన్ డాలర్లు) వంటి దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో ఎలాన్ మస్క్ ఒంటరిగా పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తి ఆస్తులు ఏకంగా ఒక సార్వభౌమ దేశ ఆర్థిక వ్యవస్థను దాటిపోవడం ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది మొదటిసారి.ఇదీ చదవండి: స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం -
స్పాటిఫైలో నకిలీ పాడ్కాస్ట్ల గుట్టురట్టు!
డిజిటల్ ప్రపంచంలో వినోదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లు ఇప్పుడు అక్రమ మాదకద్రవ్యాల అమ్మకాలకు మార్గమవుతున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఆడియో స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై వేదికగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ డ్రగ్స్ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే అత్యంత ప్రమాదకరమైన ఔషధాలను విక్రయించే అక్రమ ఆన్లైన్ ఫార్మసీలను ప్రోత్సహిస్తున్న పదివేల నకిలీ పాడ్కాస్ట్లను స్పాటిఫై యాజమాన్యం తాజాగా తొలగించింది. అమెరికాకు చెందిన సీఎన్ఎన్ గతంలో ప్రచురించిన పరిశోధనాత్మక కథనాల ఆధారంగా, యూఎస్ సెనేటర్ మాగీ హసన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి దర్యాప్తులో ఈ షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.అసలేమిటీ కుంభకోణం?గత ఏడాది మే నెలలో అమెరికాలో నిషేధిత లేదా కఠినమైన నిబంధనలు గల అడెరాల్, ఆక్సికాంటిన్ వంటి తీవ్ర ప్రభావం చూపే మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఆన్లైన్లో విక్రయించే ముఠాలు స్పాటిఫైని వేదికగా చేసుకున్నట్లు సీఎన్ఎన్ గుర్తించింది. దీనిపై స్పందించిన న్యూ హాంప్షైర్ డెమొక్రాట్, జాయింట్ ఎకనామిక్ కమిటీ ర్యాంకింగ్ సభ్యురాలు సెనేటర్ మాగీ హసన్ తక్షణమే దర్యాప్తునకు ఆదేశించారు.గురువారం విడుదలైన ఈ దర్యాప్తు నివేదిక ఫలితాలు డిజిటల్ ప్లాట్ఫారమ్ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. నేరగాళ్లు కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ భారీ ఎత్తున కుంభకోణాలకు పాల్పడుతున్నారని నివేదిక హెచ్చరించింది. ‘నేరస్థులు ప్రమాదకరమైన చర్యలను వేగంగా నిర్వహించేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారు. కాబట్టి అన్ని ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు ముందడుగు వేయాలి. తమ వినియోగదారులను రక్షించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్ను తొలగించడానికి సమగ్ర వ్యూహాలను అమలు చేయాలి’ అని హసన్ అన్నారు.ఆప్టిమైజేషన్ కోసం స్పామ్ దాడిఈ వ్యవహారంపై స్పాటిఫై ప్రతినిధి లారా బాటే స్పందిస్తూ.. ఇవి నేరుగా స్పాటిఫై వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని చేసినవి కావని, సెర్చ్ ఇంజిన్లలో సదరు అక్రమ ఆన్లైన్ ఫార్మసీల వెబ్సైట్లు మొదటి వరుసలో కనిపించేలా చేసేందుకు (ఎస్ఈఓ) ప్లాన్ చేసిన స్పామ్ దాడి అని వివరించారు. యాప్ నిబంధనల ప్రకారం అక్రమ మాదకద్రవ్యాల ప్రమోషన్ను నిషేధించామన్నారు. దీనికోసం ఆటోమేటెడ్ టెక్నాలజీతో పాటు హ్యూమన్ రివ్యూవర్లను వాడుతున్నామని కంపెనీ తెలిపింది. ఈ నకిలీ కంటెంట్ ద్వారా తాము ఎలాంటి ఆదాయాన్ని గడించలేదని స్పాటిఫై స్పష్టం చేసింది.స్పాటిఫై చర్యలుగత ఏడాది మే నుంచి నవంబర్ మధ్య కాలంలోనే దాదాపు 3,500 పాడ్కాస్ట్ అకౌంట్లును బ్లాక్ చేశారు. ఏకంగా 57,000 వ్యక్తిగత ఎపిసోడ్లు (అంతకుముందు ఏడాది కేవలం 100 లోపు ఖాతాలు మాత్రమే తొలగించబడటం గమనార్హం) తొలగించారు. అయితే, ఇలా తొలగించిన వాటిలో 94% పాడ్కాస్ట్లు ఎప్పుడూ ప్లే అవ్వలేదని స్పాటిఫై తెలిపింది. కానీ, మోడాఫినిల్ అనే డ్రగ్ను బిట్కాయిన్ ద్వారా కొనమని ప్రోత్సహించిన ఒక సిరీస్ను దాదాపు 13,000 సార్లు వినడం ఆందోళన కలిగిస్తోందని చెప్పింది.స్పాటిఫై మాత్రమే కాదు..సెనేటర్ హసన్ నివేదిక ప్రకారం, ఈ సమస్య కేవలం స్పాటిఫైకే పరిమితం కాలేదు. ఇతర ప్రముఖ ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో కూడా ఈ తరహా నకిలీ ఆడియోలు లభ్యమవుతున్నాయి. ఐహార్ట్లో ‘క్సానాక్స్ పిల్స్’ ఆన్లైన్ ప్రకటనలు కలకలం రేపాయి. అమెజాన్ మ్యూజిక్ అండ్ పాడ్ చేజర్లోనూ నిషేధిత మందులను ప్రోత్సహించే సిరీస్లను పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఈ అంశాలపై అమెజాన్ మ్యూజిక్, ఐహార్ట్ సంస్థలు అధికారికంగా ఇంకా స్పందించలేదు.ఇదీ చదవండి: స్పేస్ఎక్స్ ఐపీఓతో ప్రభంజనం -
లాంచింగ్కు స్పేస్ఎక్స్ రెడీ!
రాకెట్ ప్రయోగాల వేదిక, ప్రపంచవ్యాప్త శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కలిగిన దిగ్గజం స్పేస్ఎక్స్ ఐపీవో సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది. కంపెనీ అధిపతి ఎలాన్ మస్క్ ఈ కంపెనీ లిస్టింగ్తో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ (లక్ష కోట్ల డాలర్లు)గా అవతరించనున్నారు. అటు కార్పొరేట్లను, ఇటు ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఇష్యూకి రిస్క్ లు సైతం ఎక్కువే. అయితే దేశీ ఇన్వెస్టర్ల ఐపీవో దరఖాస్తుకు నిబంధనలు అడ్డుపడుతుండటంతో లిస్టింగ్ తదుపరి కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది! యూఎస్ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రాకెట్ కంపెనీ.. స్పేస్ఎక్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టింది. షేరుకి 135 డాలర్ల ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా 55.56 కోట్ల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా 75 బిలియన్ డాలర్లు సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు అత్యధికంగా 35 శాతం వాటా ఆఫర్ చేయడం విశేషం. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించడంతో ఇష్యూ 3 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రయిబ్ (250 బిలియన్ డాలర్ల విలువైన బిడ్లు) అయింది. నేడు (12న) లిస్ట్కానున్న కంపెనీ ప్రపంచంలోనే అత్యంత భారీ ఇష్యూగా రికార్డ్ నెలకొల్పనుంది. తద్వారా 1.75 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ విలువను అందుకోనున్నట్లు అంచనా. వెరసి ప్రపంచంలోని అత్యంత విలువైన దిగ్గజాలలో ఒకటిగా నిలవనుంది. ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓ రికార్డు సౌదీ ఆరా మ్కో (29.4 బి. డాలర్లు) పేరిట ఉండగా.. దీన్ని స్పేస్ఎక్స్ బ్రేక్ చేయనుంది. లిస్టింగ్లోనే ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన రెండో కంపెనీ (మొదటిది సౌదీ ఆరామ్కో) గా కూడా రికార్డులకెక్కనుంది. మరోపక్క స్టాక్ ఆప్షన్స్ పొందిన కంపెనీ ఉద్యోగుల సంపద సృష్టికి సైతం తెరలేవనుంది!స్పేస్ఎక్స్ అంటే? 2002లో ఏర్పాటైన స్పేస్ఎక్స్ ప్రయివేట్ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐపీవోతో పబ్లిక్ మార్కెట్లో ప్రవేశించనుంది. రాకెట్ లాంచింగ్తోపాటు..అంతరిక్ష ప్రయాణ(స్పేస్ ట్రాన్స్పోర్టేషన్) సేవలందిస్తోంది. అయితే కంపెనీ వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్నది మాత్రం స్టార్లింక్గా పేర్కొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా టెలికం సేవలందించగల శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ఇది. ఐపీవో ద్వారా స్టార్లింక్ సేవల విస్తరణకు నిధులు లభించనున్నాయి. అంతేకాకుండా కొత్త స్పేస్క్రాఫ్ట్ అభివృద్ధి, స్పేస్ ఎక్స్ప్లొరేషన్ తదితరాలకు సైతం ఆర్థికంగా మద్దతు లభించనుంది. స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ కనెక్టివిటీ, వాణిజ్యపరమైన స్పేస్ ట్రావెల్లో ఇన్వెస్ట్ చేసేందుకు రిటైలర్లకు సైతం వీలు కల్పిస్తుండటం కంపెనీ ఐపీవోకున్న ప్రత్యేకతలుగా పేర్కొనవచ్చు. మస్క్ మస్త్.. మస్త్ స్పేస్ఎక్స్ లిస్టింగ్తో ప్రమోటర్ ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా అవతరించే వీలుంది. స్పేస్ఎక్స్ ప్రణాళికలు ఫలిస్తే మార్స్లోకి మానవులను పంపిన తొలి కంపెనీగా ఘనత వహించవచ్చు. అయితే కంపెనీ కార్యకలాపాలు అత్యంత వ్యయభరితంకావడం, అత్యధిక పెట్టుబడుల అవసరం ఉండటంతో రిస్కులూ అధికమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్పేస్ఎక్స్కు గ్లోబల్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన బ్లూ ఒరిజిన్ నుంచి పోటీ ఉంది. ఇదేవిధంగా ఏఎస్టీ స్పేస్మొబైల్ నుంచి స్టార్లింక్కు సైతం సెగ తగులుతోంది.రాకెట్ స్పీడ్పునర్వినియోగానికి వీలు కల్పించే రాకెట్ సాంకేతికతకు తెరతీయడం ద్వారా స్పేస్ఎక్స్ సరికొత్త మార్పులకు తెరతీసింది. దీంతో రాకెట్ల ప్రయోగ వ్యయాలు తగ్గాయి. ఫాల్కన్ రాకెట్లు శాటిలైట్ లాంచింగ్, స్పేస్ మిషన్స్కు వినియోగించవచ్చు. అయితే కంపెనీ బిజినెస్లలో స్టార్లింక్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈవీ దిగ్గజం టెస్లాసహా.. పేపాల్కు ఊపిరిపోసిన ప్రమోటర్ ఎలాన్ మస్క్ కంపెనీ కావడంతో స్పేస్ఎక్స్పై భారీ అంచనాలున్నాయి.లిస్టింగ్ తర్వాతే...దేశీ ఇన్వెస్టర్లు స్పేస్ఎక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు లిస్టింగ్ తదుపరి మాత్రమే వీలుంటుంది. లిబరలైజ్డ్ రెమిటెన్స్ పథకం(ఎల్ఆర్ఎస్)లో భాగంగా అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ల కొనొచ్చు. అధిక విలువ కారణంగా లిస్టింగ్ తర్వాత కంపెనీ పనితీరుపై ఒత్తిడి పెరిగే వీలుంది. ప్రాజెక్టుల్లో ఆలస్యం, రాకెట్ ప్రయోగాలలో అనుకోని సవాళ్లు, టెక్నాలజీ వైఫల్యాల వంటి రిస్క్ లున్నాయి. 2025లో 18.67 బిలియన్ డాలర్ల ఆదాయం, 4.94 బి. డాలర్ల నష్టం నమోదు చేసింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నెల రోజుల్లో IRCTC కొత్త వెబ్సైట్..
రైల్వే టికెట్ బుకింగ్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జూలై 15 నాటికి పూర్తిగా పునరుద్ధరించిన, ఆధునిక ఫీచర్లతో కూడిన కొత్త ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విద్యార్థులతో జరిగిన ఓ సమావేశంలో ప్రస్తుత పోర్టల్లో ఉన్న లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.సమావేశంలో ఓ విద్యార్థిని క్యాప్చా సమస్యలు, తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్సైట్ నెమ్మదించడం లేదా క్రాష్ కావడం, పాతబడిన డిజైన్, తరచూ ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల గురించి ప్రస్తావించింది. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, 30 రోజుల్లో కొత్త వెబ్సైట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జూలై 15న కొత్త పోర్టల్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.రైల్వే వర్గాల సమాచారం ప్రకారం, కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్ మరింత వేగవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా రూపొందిస్తున్నారు. టికెట్ బుకింగ్ ప్రక్రియను సరళీకృతం చేయడం, అధిక ట్రాఫిక్ను సమర్థంగా నిర్వహించడం, చెల్లింపుల ప్రక్రియను మెరుగుపరచడం, మొబైల్, డెస్క్టాప్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారు. -
అనంత్తో పెళ్లి.. అంబానీ కోడలి ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ కుటుంబానికి కోడలైన రాధికా మర్చంట్ మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ టు యునైటెడ్ నేషన్స్ (IIMUN) కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. వివాహ బంధంలో సమానత్వం, పరస్పర గౌరవం, మహిళల ఆర్థిక స్వేచ్ఛ ప్రాముఖ్యతపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.అనంత్ అంబానీతో వివాహంపై..అనంత్ అంబానీతో తన దాంపత్య జీవితం గురించి మాట్లాడుతూ, ఒక విజయవంతమైన వివాహానికి ‘ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు’ అన్న భావన కంటే పరస్పర గౌరవమే ముఖ్యమని చెప్పారు. ప్రతి సంబంధంలో రాజీలు సహజమేనని, కొన్ని సందర్భాల్లో అనంత్ తన అభిప్రాయాన్ని పక్కన పెడతారని, మరికొన్ని సందర్భాల్లో తాను రాజీ పడతానని పేర్కొన్నారు. అయితే, ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకునేంత వరకు ఆ బంధం సమానత్వంతోనే కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.మహిళల ఆర్థిక స్వాతంత్ర్యంపై మాట్లాడిన రాధికా, కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదైనా, జీవిత భాగస్వామి ఎంత సంపన్నుడైనా, ప్రతి మహిళ తన సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. “మీరు ఎవరి కుమార్తె అయినా, ఎవరి భార్య అయినా, మీ జీవితంలో ఎంత సౌకర్యంగా ఉన్నా సరే, మీ నిర్ణయాలు మీరే తీసుకునే శక్తి ఉండాలంటే ఆర్థిక స్వాతంత్ర్యం అవసరం” అని ఆమె అన్నారు.అది ప్రమాదకరంఆర్థికంగా పూర్తిగా ఇతరులపై ఆధారపడటం ప్రమాదకరమని హెచ్చరించిన ఆమె, జీవితంలో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే స్వేచ్ఛ మహిళలకు ఉండాలని పేర్కొన్నారు. “మీకు బయటపడే అవకాశం లేనంతగా ఏదైనా పరిస్థితికి బంధించబడకండి” అని రాధిక సూచించారు.సమాజంలో నిజమైన లింగ సమానత్వం సాధించాలంటే మహిళలకు విద్య, ఉపాధి, వ్యాపారం, ఆస్తుల సృష్టి వంటి రంగాల్లో మరింత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని రాధిక అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక సాధికారత లేకుండా సంపూర్ణ సమానత్వం సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక స్వేచ్ఛ కుటుంబాల్లో నిర్ణయాధికారాన్ని పెంచుతుందని, వ్యక్తిగత గౌరవాన్ని బలోపేతం చేస్తుందని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు. View this post on Instagram A post shared by Isha Ambani Piramal (@ishaambani)ప్రముఖ వ్యాపారవేత్తలు వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్ 1994లో ముంబైలో జన్మించారు. న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె, భారతీయ శాస్త్రీయ నృత్యంలో కూడా శిక్షణ పొందారు. ప్రస్తుతం కుటుంబానికి చెందిన ఆరోగ్య సంరక్షణ వ్యాపార సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. అనంత్ అంబానీతో గత ఏడాది జరిగిన ఆమె వివాహం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యం పొందింది. -
యువ ఆవిష్కర్తలకు బంపర్ ఆఫర్..
డిగ్రీ సర్టిఫికేట్లు, క్లాస్రూమ్ పాఠాలు మాత్రమే జీవితాన్ని నిర్దేశించలేవని నమ్మే యువ మేధావులకు కొన్ని సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. సాంప్రదాయ విశ్వవిద్యాలయాల చట్రం నుంచి బయటకు వచ్చి ప్రపంచాన్ని మార్చే సరికొత్త ఆలోచనలతో దూసుకుపోయే యువ ఆవిష్కర్తల కోసం ప్రతిష్టాత్మక ‘థీల్ ఫెలోషిప్ 2026’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏకంగా 2,50,000 డాలర్లు (సుమారు రూ.2.10 కోట్లు) భారీ గ్రాంట్తో పాటు అంతర్జాతీయ మార్గదర్శకత్వాన్ని (మెంటార్షిప్) ఈ ప్రోగ్రామ్ అందించనుంది.ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్, పేపాల్ సహ-వ్యవస్థాపకుడు పీటర్ థీల్ 2011లో స్థాపించిన ఈ ఫెలోషిప్, గ్లోబల్ స్టార్టప్ రంగాన్ని శాసించే అత్యుత్తమ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది.అసలు ఏంటి ఈ థీల్ ఫెలోషిప్?సాధారణంగా ఉన్నత విద్య కోసం లక్షలాది రూపాయల అప్పులు చేసి డిగ్రీలు పూర్తి చేశాక ఉద్యోగాల కోసం వెతకడం ఒక సంప్రదాయం. కానీ, థీల్ ఫెలోషిప్ దీనికి భిన్నమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఫెలోషిప్కు ఎంపికైన యువకులు తమ రెండేళ్ల కాలపరిమితిలో కాలేజీ చదువులకు స్వస్తి చెప్పాలి. చదువు పక్కన పెట్టి తాము నమ్మిన సరికొత్త వ్యాపార ఆలోచనలను లేదా పరిశోధనలను నిజం చేయడంపైనే పూర్తి దృష్టి సారించాల్సి ఉంటుంది.ఫెలోషిప్ ద్వారా లభించే ప్రయోజనాలుఎలాంటి ఈక్విటీ (వాటా) ఆశించకుండా రెండేళ్ల కాలానికి 2,50,000 డాలర్లు సహాయం.సిలికాన్ వ్యాలీలోని అగ్రశ్రేణి పెట్టుబడిదారులు (వెంచర్ క్యాపిటలిస్ట్లు), శాస్త్రవేత్తలు, విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో నేరుగా పనిచేసే అవకాశం.విద్యా రుణాలు, ఫీజుల ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా టెక్నాలజీలు, ఉత్పత్తులను రూపొందించుకునే స్వేచ్ఛ.ఇప్పటికే ఈ ఫెలోషిప్ ద్వారా లబ్ధి పొంది ప్రస్తుతం బిలియన్ డాలర్ల కంపెనీలను నడుపుతున్న పూర్వ విద్యార్థుల గ్లోబల్ కమ్యూనిటీలో సభ్యత్వం.ఏయే రంగాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత?టెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా భవిష్యత్తును మార్చే సత్తా ఉన్న ఏ రంగంలోని ప్రాజెక్ట్ అయినా ఈ ఫెలోషిప్కు అర్హమైనదే. ముఖ్యంగా కింది రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.రంగంప్రాధాన్యత గల అంశాలుసాంకేతికతఏఐ, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ఆరోగ్యం, జీవశాస్త్రంబయోటెక్నాలజీ, మెడికల్ ఇన్నోవేషన్స్, హెల్త్కేర్ సొల్యూషన్స్పర్యావరణంగ్రీన్ ఎనర్జీ, వాతావరణ మార్పుల నివారణ, సుస్థిర అభివృద్ధిఇంజినీరింగ్అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, ఎడ్యుకేట్, సోషల్ వెంచర్స్అర్హతలుఈ ఫెలోషిప్ కోసం ఎటువంటి నిర్దిష్ట విద్యా అర్హతలు లేదా డిగ్రీలు అవసరం లేదు. కేవలం అసాధారణ సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే బలమైన ఆశయం, సాంప్రదాయ పద్ధతులను సవాలు చేసే ధైర్యం ఉన్న యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతీ యువకులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది.దరఖాస్తు విధానంఆసక్తి గల అభ్యర్థులు థీల్ ఫెలోషిప్ అధికారిక వెబ్సైట్(https://thielfellowship.org/) ద్వారా ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తమ వ్యక్తిగత నేపథ్యం, తాము చేస్తున్న లేదా చేయబోయే ప్రాజెక్ట్ వివరాలను సమర్పించాలి. తమ ఆలోచనల వెనుక ఉన్న దీర్ఘకాలిక లక్ష్యాలు, ఈ ఫెలోషిప్ తమకు ఎలా ఉపయోగపడుతుందనే అంశాలను స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. అత్యంత పారదర్శకంగా, పోటీతత్వంతో కూడిన స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా తుది విజేతలను ఎంపిక చేస్తారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
భారత్లో తలుపులు మూసిన ‘ఓపెన్డోర్’
సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, ఏఐ విస్తరణ, భారతీయ ఐటీ, సర్వీస్ రంగ ఉద్యోగులపై భారీ ప్రభావమే చూపుతున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ‘ఓపెన్డోర్’ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 250 మంది భారతీయ ఉద్యోగులు ఒకేసారి రోడ్డున పడినట్లయింది.కంపెనీ వ్యూహాత్మక మార్పులపై ఓపెన్డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్లో కొన్ని అంశాలు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో చర్చనీయాంశమైంది. ‘మా కస్టమర్లు అందరూ అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి వారికి సేవలందించే ఆపరేషనల్ విభాగాలు కూడా ఆ కస్టమర్లకు వీలైనంత దగ్గరగా ఉండటమే వ్యాపారపరంగా ఉత్తమం’ అని చెప్పారు. గతంలో వివిధ వ్యవస్థల్లో మ్యాన్యువల్ వర్క్ఫ్లోలను నిర్వహించడానికి భారతదేశంలో ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుత సాంకేతిక పురోగతి వల్ల ఆ అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు.శ్రామిక శక్తిపై ఏఐ దెబ్బ!ఈ లేఆఫ్స్కు ప్రధాన కారణం కంపెనీ శరవేగంగా అవలంబిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతగా తెలుస్తోంది. గతంలో భారత్లోని సిబ్బంది మ్యాన్యువల్గా చేసే పనులను ఇప్పుడు అమెరికాలో ఏఐ ఎనేబుల్డ్ బృందాల సాయంతో మరింత సులభంగా పూర్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సాంకేతికత పెరగడం వల్ల విదేశాల్లో (భారత్లో) ప్రత్యేకంగా ఒక టీమ్ను ఉంచాల్సిన అవసరం తగ్గిందని మేనేజ్మెంట్ పేర్కొంది.I shared this note earlier today with the entire team at Opendoor. Today we began to say goodbye to our colleagues in India as we wind down our India operations.Our customers are in America, and that's where our operational work belongs. pic.twitter.com/Ak2jLxKiX5— Kaz Nejatian (@nejatian) June 10, 2026ప్రతిభకు లోటు లేదు.. కానీ తప్పట్లేదు!ఈ తొలగింపులు భారతీయ బృందం పనితీరు లోపం వల్ల జరిగినవి కావని సీఈఓ నెజాటియన్ నొక్కి చెప్పారు. భారత్లోని ఉద్యోగులు ఎంతో ప్రతిభావంతులని, ఇతర సంస్థలకు వారు అద్భుతమైన ఆస్తిగా మారుతారని ప్రశంసించారు. అయితే, వ్యాపార సరళీకరణ, ఏకీకృత ప్లాట్ఫారమ్ నిర్మాణం, మ్యాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
ఆంత్రోపిక్తో చేతులు కలిపిన టీసీఎస్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంచలన అడుగు వేసింది. ప్రపంచ ప్రసిద్ధ ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ భాగస్వామ్యంతో ఎంటర్ప్రైజ్ ఏఐ స్కేలింగ్ను వేగవంతం చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఐటీ రంగంలో సాంప్రదాయ శ్రమ-ఆధారిత నమూనాపై జనరేటివ్ ఏఐ ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల నడుమ టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది.50,000 మంది ఉద్యోగులకు ‘క్లాడ్ ఏఐ’ శిక్షణఈ వ్యూహాత్మక కూటమిలో భాగంగా ఆంత్రోపిక్ సంస్థకు చెందిన అత్యాధునిక ఏఐ మోడల్ ‘క్లాడ్’ వినియోగంలో దాదాపు 50,000 మంది టీసీఎస్ అసోసియేట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్ వంటి కఠినమైన నిబంధనలు ఉండే రంగాల కోసం ఇరు సంస్థలు సంయుక్తంగా సరికొత్త ఏఐ పరిష్కారాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. క్లాడ్ ఏఐకి ఉన్న డేటా సెక్యూరిటీ, అక్యూరసీ ఫీచర్లు కార్పొరేట్ క్లయింట్లకు మెరుగైన సర్వీసులు అందించేందుకు దోహదపడతాయని కంపెనీ అధికారులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ఆందోళనలుభారతదేశానికి చెందిన సుమారు 315 బిలియన్ డాలర్ల ఐటీ రంగం ప్రస్తుతం ఒక కీలక సంధిగ్ధ దశను ఎదుర్కొంటోంది. సాంప్రదాయ కోడింగ్, టెస్టింగ్, సపోర్ట్ వంటి శ్రమ-ఆధారిత పనులను ఏఐ సాధనాలు భర్తీ చేస్తే ఐటీ కంపెనీల ఆదాయ నమూనా దెబ్బతింటుందనే భయాలు పెట్టుబడిదారులలో నెలకొన్నాయి.శ్రామిక శక్తిలో మార్పులుటాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మంగళవారం జరిగిన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) భవిష్యత్తు వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కంపెనీ శ్రామిక శక్తిలో మానవ ఉద్యోగులు ఎంతమంది ఉంటారో, అంతే సంఖ్యలో ఏఐ ఏజెంట్లు కూడా ఉండేలా టీసీఎస్ అడుగులు వేస్తోంది. ఈ మార్పుల వల్ల రాబోయే రోజుల్లో కొత్త నియామకాల వేగం మందగించే అవకాశం ఉందని చంద్రశేఖరన్ సంకేతాలిచ్చారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు! -
సెబీకి వ్యతిరేకంగా వెళ్లము
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాలకు అనుగుణంగా చేపట్టనున్న ఫోరెన్సిక్ ఆడిట్కు పూర్తిస్థాయిలో సహకరించనున్నట్లు బంగారు ఆభరణాలు, రిఫైనరీ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ తాజాగా వెల్లడించింది. కంపెనీ 2020–21 నుంచి 2024–25 కాలంలో రూ. 15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని అక్రమంగా నమోదుచేసినట్లు సెబీ గుర్తించింది. దీంతో తాజాగా ఫోరెన్సిక్ ఆడిట్కు సెబీ ఆదేశించింది. వీటిని సవాలు చేయబోమని కంపెనీ స్పష్టం చేసింది. కాగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం ఆదాయ నమోదులో అక్రమాలకు తెరతీసినట్లు గుర్తించడంతో ఇటీవల కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ నుంచి సెబీ నిషేధించింది. అయితే ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదంటూ రాజేష్ మెహతా ప్రకటించడం గమనార్హం! సెబీ అడిగిన అన్ని డాక్యుమెంట్లనూ దాఖలు చేసినట్లు చెప్పారు. ఎక్కడో సమాచార లోపం ఏర్పడినట్లు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
135 ఎన్బీఎఫ్సీల లైసెన్స్ల రద్దు
ముంబై: జూపిటర్ ఫిన్వెస్ట్, ఎస్సెల్ ఫైనాన్స్ బిజినెస్ లోన్స్ సహా 135 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) లైసెన్స్లను రద్దు చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో మెజారిటీ కంపెనీల రిజిస్టర్డ్ కార్యాలయ చిరునామా పశ్చిమబెంగాల్లో ఉన్నట్టు పేర్కొంది. రద్దయిన జాబితాలో ఎక్స్ప్రెస్ ఫిన్క్యాప్ హౌస్, అక్షయ్ ఫిస్కల్ సరీ్వసెస్, టైమ్ ఫైనాన్స్, జూపిటర్ ప్రాజెక్ట్స్, సిటీవైడ్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కూడా ఉన్నాయి. వ్యాపారం నుంచి వైదొలగడం లేదా వీలీన కారణాలతో 13 సంస్థలు స్వచ్చందంగా తమ సరి్టఫికెట్ ఆఫ్ రిజి్రస్టేషన్ను స్వా«దీనం చేశాయి. ఇలా స్వాధీనం చేసిన సంస్థల్లో జే థామస్ ఫైనాన్స్, ఈకాన్ సూపర్ సేల్స్, హితేష ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, కార్నెక్స్ వినిమయ్, ఇంపాక్ట్ లీజింగ్ తదితర సంస్థలు ఉన్నాయి. -
‘డ్రాగన్ మిలిటరీతో వీటికి సంబంధం ఉంది’
ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాల్లో దూసుకుపోతున్న చైనా కంపెనీలకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. చైనా సైన్యానికి పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సహకరిస్తున్నాయనే అనుమానంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ఎనర్జీ, బ్యాటరీ తయారీ సంస్థలతో పాటు ప్రముఖ టెక్ దిగ్గజాలను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) తన ‘మిలిటరీ లింక్డ్ కంపెనీ’ల బ్లాక్లిస్ట్లో చేర్చింది. ఇటీవల విడుదల చేసిన ఈ తాజా జాబితా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చకు దారితీసింది.బ్లాక్లిస్ట్లోకి చేరిన ప్రముఖ కంపెనీలుఅమెరికా రక్షణ శాఖ ఆంక్షల పరిధిలోకి తెచ్చిన చైనా కంపెనీల్లో గ్లోబల్ మార్కెట్ను శాసిస్తున్న టాప్ బ్రాండ్లు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ విభాగంలో.. అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారులైన ట్రినా సోలార్, జేఏ సోలార్ టెక్నాలజీ ఉన్నాయి. ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న ఈవ్ ఎనర్జీ, సీఏఎల్బీ గ్రూప్ సంస్థలున్నాయి. చైనా ఈ-కామర్స్లో కీలకంగా ఉన్న అలీబాబా, ప్రముఖ ఇంటర్నెట్ సెర్చ్ ప్రొవైడర్ బైడు, బయోటెక్నాలజీ సంస్థ వుజి యాప్ టెక్ ఉన్నాయి.అమెరికా చట్టం ఏం చెబుతోంది?పెంటగాన్ నిబంధనల ప్రకారం, ఈ మిలిటరీ లింక్డ్ జాబితాలో చేరిన కంపెనీలపై అమెరికా కఠినమైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా రక్షణ శాఖ ఈ కంపెనీలతో నేరుగా ఎలాంటి వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోకూడదు. 2027 నాటికి థర్డ్ పార్టీల ద్వారా కూడా ఈ కంపెనీల ఉత్పత్తులను లేదా సేవలను కొనుగోలు చేయకుండా పూర్తిస్థాయిలో పరిమితులు అమల్లోకి వస్తాయి.కంపెనీలు ఏం చేయబోతున్నాయి?అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతున్నాయి. దీనిపై ట్రినా సోలార్ స్పందిస్తూ.. తాము ఎలాంటి సైనిక సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనలేదని ట్రినా సోలార్ స్పష్టం చేసింది. అమెరికా నిర్ణయం పూర్తిగా నిరాధారమైనదని కొట్టిపారేసింది. ‘అమెరికా ప్రభుత్వం వెంటనే ఈ పొరపాటు నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలి. అంతర్జాతీయంగా న్యాయమైన, సమానమైన, వివక్ష లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించాలి. దీన్ని సవాలు చేస్తూ ఇప్పటికే చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాం’ అని ట్రినా సోలార్ ఒక అధికారిక ప్రకటనలో డిమాండ్ చేసింది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఏఐ వెనుక పరుగెత్తబోం!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ ఇన్వెస్ట్మెంట్ బూమ్పై దేశీయ టెక్ దిగ్గజం జోహో అధినేత శ్రీధర్ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న ఏఐ హైప్ వెనుక పరుగెత్తే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు ఎగబడుతున్న రంగాలకు భిన్నంగా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే, ప్రస్తుతం అందరూ విస్మరిస్తున్న మెటలర్జీ వంటి డీప్ టెక్నాలజీ విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, మార్కెట్ విశ్లేషకులు ముత్తుకృష్ణన్ దండపాణి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్పై శ్రీధర్ వెంబు స్పందిస్తూ ఈ విశ్లేషణ చేశారు.ప్రస్తుతం అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ చుట్టూ నెలకొన్న పెట్టుబడి ధోరణిని శ్రీధర్ వెంబు తీవ్రమైన ‘ఏఐ ఉన్మాదం’గా అభివర్ణించారు. ‘అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఏఐ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులను వెచ్చిస్తున్నాయి. ఏఐ మౌలిక సదుపాయాలను సరఫరా చేసే కంపెనీలు ఈ వ్యయ చక్రం నుంచి తక్షణమే భారీ లాభాలను పొందుతున్నాయి. కొనుగోలుదారులు ఈ వ్యయాలను సుదీర్ఘ కాలానికి విస్తరించడం ద్వారా ప్రస్తుతానికి ఆదాయ వృద్ధిని, లాభదాయకతను కాపాడుకోగలుగుతున్నారు’ అని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) కొందరు భారతదేశం ఏఐ రేసులో వెనుకబడిందని భావిస్తున్నారు. అయితే, ఈ ఆందోళనలను తాము ఏమాత్రం పట్టించుకోవడం లేదని వెంబు స్పష్టం చేశారు.మాకొద్దీ విధానం..ప్రస్తుత ట్రెండ్కు భిన్నమైన వైఖరిని తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని జోహో అధినేత ప్రకటించారు. ‘మేము ఏఐలో జరుగుతున్న క్యాష్ బర్న్ను వెంబడించాలనుకోవడం లేదు. మార్కెట్ దృష్టిలో బోరింగ్గా కనిపించే, భారతదేశానికి అత్యంత కీలకమైన దీర్ఘకాలిక డీప్ టెక్ విభాగాల్లో పెట్టుబడి పెడుతున్నాం’ అని తెలిపారు. దీనికి ఉదాహరణగా ఆయన మెటలర్జీ రంగాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ రంగానికి ఏఐకి వచ్చినంత పబ్లిసిటీ రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో దేశీయ ఉత్పాదక రంగానికి, వ్యూహాత్మక అభివృద్ధికి ఇది అత్యంత విలువైనదిగా మారబోతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.10-15 ఏళ్ల సుదీర్ఘ వ్యూహంఈ తరహా పెట్టుబడుల ఫలితాలు రాత్రికి రాత్రే రావని, తమ వ్యూహం విజయవంతం కావడానికి కనీసం 10 నుంచి 15 సంవత్సరాల కాలం పడుతుందని వెంబు అంగీకరించారు. తెలివైన దీర్ఘకాలిక పెట్టుబడిదారులు మార్కెట్ ఫ్యాషన్లను, తాత్కాలిక హైప్లను అనుసరించరని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం జాతీయ అహంభావంతో తీసుకున్నది కాదని, దీర్ఘకాలంలో స్థిరమైన విలువను సృష్టించే రంగాలను గుర్తించడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
డేటా సెంటర్లో అగ్నిప్రమాదం
భారతదేశంలో గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దేశంలోని ఒక ప్రముఖ థర్డ్ పార్టీ డేటా సెంటర్లో హఠాత్తుగా సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా.. దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్ నెట్వర్క్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ఆల్ఫాబెట్ అనుబంధ సంస్థ ‘గూగుల్ క్లౌడ్’ అధికారికంగా ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సాంకేతిక సిబ్బంది నెట్వర్కింగ్ పరికరాలను అత్యవసరంగా మూసివేయడం (Emergency Shutdown) వల్ల ఈ అంతరాయం తలెత్తినట్లు కంపెనీ వెల్లడించింది.మెట్రో నగరాలపై ప్రభావండేటా సెంటర్లో మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు సదుపాయంలో అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల ఢిల్లీలోని ‘లోకల్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఫలితంగా సదరు మెట్రోపాలిటన్ ప్రాంతం అంతటా నెట్వర్క్ సామర్థ్యం ఒక్కసారిగా పడిపోయింది. ఈ సాంకేతిక లోపం కారణంగా దేశంలోని ప్రధాన ఐటీ హబ్లైన కొన్ని నగరాల్లో నెట్వర్క్ ట్రాఫిక్కు ఆటంకం ఏర్పడిందని కంపెనీ తన స్టేటస్ పేజీలో స్పష్టం చేసింది. ఢిల్లీ (ఎన్సీఆర్ ప్రాంతం), ముంబై, చెన్నై, వాటి సమీప ప్రాంతాలు దీనివల్ల ప్రభావితమైనట్లు తెలిపింది.అయితే, ఈ అగ్నిప్రమాదం అసలు ఎప్పుడు సంభవించింది? దీనివల్ల ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది? లేదా ఎవరికైనా గాయాలయ్యాయా? అనే పూర్తి వివరాలను గూగుల్ క్లౌడ్ అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.వ్యాపార రంగంపై ప్రభావంప్రస్తుత డిజిటల్ యుగంలో క్లౌడ్ సేవలపైనే మెజారిటీ కార్పొరేట్ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ వంటి దిగ్గజ నెట్వర్క్ నిలిచిపోవడంతో దీని ప్రభావం గొలుసుకట్టు తరహాలో వ్యాపారాలు, వినియోగదారులపై పడింది. దేశంలోని పలు ప్రముఖ వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లు, కంపెనీల అంతర్గత సర్వర్ వ్యవస్థలు మందగించాయి.క్లౌడ్ మార్కెట్లో గూగుల్ ప్రాధాన్యతప్రపంచంలోనే అతిపెద్ద క్లౌడ్ సేవల అందించే కంపెనీల్లో గూగుల్ క్లౌడ్ ప్రధానమైంది. అంతర్జాతీయంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలతో గూగుల్ క్లౌడ్ పోటీపడుతోంది. ముఖ్యంగా భారీ డేటా వాల్యూమ్లను ప్రాసెస్ చేయడానికి, అధునాతన కృత్రిమ మేధ పరికరాలను రన్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు గూగుల్ క్లౌడ్ను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం ఐటీ రంగాన్ని కాసేపు కుదిపేసింది.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఇన్ఫోసిస్లో అసెస్మెంట్ పరీక్షలు వాయిదా!
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ప్రతిష్టాత్మకమైన స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, డిజిటల్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం జరగాల్సిన ఆన్లైన్ నియామక పరీక్షలు, వ్యక్తిగత అసెస్మెంట్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.అక్రమాల గుర్తింపుతోనే బ్రేక్!ఇటీవల నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో అభ్యర్థుల ప్రవర్తనకు సంబంధించి కొన్ని అవకతవకలు, దుర్వినియోగం జరిగినట్లు కంపెనీ అంతర్గత తనిఖీల్లో వెల్లడైంది. నియామక ప్రక్రియలో వక్రీకరణలు చోటుచేసుకున్నాయన్న నివేదికల నేపథ్యంలో పరీక్షల విధానాన్ని కాపాడేందుకు ఇన్ఫోసిస్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బాధిత అభ్యర్థులందరికీ ఇప్పటికే ఈ వాయిదా సమాచారాన్ని ఈమెయిల్స్ ద్వారా చేరవేసినట్లు స్పష్టం చేసింది. సవరించిన కొత్త అసెస్మెంట్ షెడ్యూల్స్ ఖరారు కాగానే అభ్యర్థులకు మళ్లీ సమాచారం అందిస్తామని కంపెనీ పేర్కొంది. ‘ఈ తాత్కాలిక వాయిదా వల్ల మా నియామక కట్టుబాట్లకు ఎలాంటి ఆటంకం కలగదు. అగ్రశ్రేణి ప్రతిభావంతులను గుర్తించడం, వారికి సరైన అవకాశాలు కల్పించి పెంపొందించడంపైనే మా పూర్తి దృష్టి ఉంది’ అని ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటనలో తెలిపింది.క్యాంపస్ రిక్రూట్మెంట్లు యథాతథం..కొన్ని వార్తా సంస్థల నివేదిక ప్రకారం.. ఈ పరీక్షల వాయిదా ప్రభావం కంపెనీ దూకుడుగా చేపడుతున్న క్యాంపస్ సెలక్షన్లపై పడబోదని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ తన నియామక లక్ష్యాలను యథాతథంగా కొనసాగించనుంది. అయితే ఈ అంశంపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సుమారు 20,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే స్థాయి లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం! -
డార్క్ ప్యాటర్న్స్తో ఏటా రూ.28,000 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన డిజిటల్ ప్లాట్ఫారమ్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ ప్యాటర్న్స్’ (మోసపూరిత డిజైన్ విధానాలు) కారణంగా భారతీయ ఆన్లైన్ కొనుగోలుదారులు ఏటా రూ.25,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు మార్కెట్ పరిశోధనా సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్ప్లేసెస్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026 తొలి త్రైమాసికంలో దేశంలోని 50 నగరాలకు చెందిన 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన 12 ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఇందులో విశ్లేషించారు. డార్క్ పాటర్న్స్ అంటే: ఉత్పత్తులు లేదా సేవలను అంటగట్టేందుకు అనుసరించే వివిధ పద్ధతులే డార్క్ పాటర్న్స్గా వ్యవహరిస్తారు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయించడమే వీటి లక్ష్యం. నివేదికలో మరిన్ని అంశాలు: → రహస్య ఛార్జీలు, బలవంతపు యాడ్–ఆన్లు, డ్రిప్ ప్రైసింగ్, ఫాల్స్ అర్జెన్సీ, సబ్్రస్కిప్షన్ ఉచ్చులు వంటి విధానాల కారణంగా దేశంలోని 30.4 కోట్ల మంది ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 88 శాతం మంది నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు భారం భరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. → ప్రారంభంలో ఒక ధర చూపించి, చెల్లింపు దశలో అదనపు రుసుములు జోడించే ‘డ్రిప్ ప్రైసింగ్’ లేదా ‘హిడెన్ ఛార్జీలు’ ఎదురవుతున్నాయని 63 % మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 52 శాతంగా ఉండగా, ప్రస్తుతం 63 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది → అధ్యయనంలో భాగమైన 73 శాతం ప్లాట్ఫారమ్లు వినియోగదారులకు ఇష్టం లేకపోయినా.., కొనుగోలు చేసేలా బలవంతపు వ్యూహాలు (ఫోర్డ్స్ యాక్షన్) అమలు చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. → ఆన్లైన్ కొనుగోలుదారులలో 81 శాతం మందికి ఇలాంటి మోసపూరిత టెక్నిక్స్ (డార్క్ ప్యాటర్న్స్) గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో 85 శాతం మంది డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఏదో ఒక రూపంలో తప్పుదోవ పట్టించబడినట్లు వెల్లడించారు. దీనిని నివేదిక ‘అవగాహన వైరుధ్యం’ గా అభివరి్ణంచింది. → ఈ–కామర్స్ విభాగంలో 50 శాతం మంది వినియోగదారుల మద్దతుతో అమెజాన్ అత్యంత విశ్వసనీయ వేదికగా నిలిచింది. మరోవైపు, ఫ్లిప్కార్ట్ విషయంలో నమ్మకం (37 శాతం) కంటే అపనమ్మకమే (41 శాతం) ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ప్రతి లావాదేవీలోనూ వినియోగదారుల నుంచి ‘అదనపు సొమ్ము’ వసూలు చేసే ప్రక్రియ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది. → ఆన్లైన్ ట్రావెల్ రంగంలో మేక్మైట్రిప్ అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. కాగా క్లియర్ట్రిప్ వినియోగదారులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నట్లు రేటింగ్ పొందింది. → క్విక్ కామర్స్ రంగంలో బిగ్బాస్కెట్ యాప్ తీవ్రమైన డార్క్ ప్యాటర్న్స్ స్కోరును నమోదు చేసింది. → ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఈ డిజిటల్ మోసాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 74 శాతం మంది పారదర్శకమైన, న్యాయబద్ధమైన డిజైన్ విధానాలను అనుసరించే ప్లాట్ఫారమ్ల కోసం అవసరమైతే కొంత ఎక్కువ ధర చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
మెటాతో ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్, సోషల్ మీడియా దిగ్గజం మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికల ద్వారా క్రియేటర్ ఆధారిత షాపింగ్ను ప్రోత్సహించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని తెలిపింది. ఇందులో భాగంగా కంటెంట్ క్రియేటర్లు ఫ్లిప్కార్ట్, మింత్రా వేదికలపై లభ్యమయ్యే ఉత్పత్తులను గుర్తించి, వాటిని నేరుగా తమ ఫేస్బుక్ పోస్టులు, రీల్స్లో ట్యాగ్ చేస్తారు. వినియోగదారులు ఆ ఉత్పత్తి ట్యాగ్లపై ట్యాప్ చేసి నేరుగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జరిగే ప్రతి విక్రయంపై క్రియేటర్లకు కమీషన్ లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ సేవలను తొలుత ఫేస్బుక్లో అందుబాటులోకి తెచ్చి, తదుపరి దశలో ఇన్స్ట్రాగామ్కు విస్తరించనున్నారు. మారుతున్న కొనుగోలు ధోరణులు: ‘‘భారతీయ రిటైల్ రంగంలో జెన్ జెడ్ కొనుగోలు ధోరణులను ఫ్లిప్కార్ట్ రెండేళ్ల క్రితమే గుర్తించింది. ప్రస్తుతం కొనుగోలుదారులు సెర్చ్ బార్ల కంటే సోషల్ మీడియా ఫీడ్స్ ఆధారంగానే ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటున్నారు. క్రియేటర్లే కొత్త తరహా డిజిటల్ దుకాణాలుగా అవతరిస్తున్నారు. ఈ క్రమంలో మెటాతో కుదిరిన భాగస్వామ్యం కంటెట్ క్రియేటర్లను వ్యాపారవేత్తలుగా మార్చడమే కాకుండా, బ్రాండ్లు వినియోగదారులకు మరింత చేరువ అవుతాయి’’ అని ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఎఫ్వో రవి అయ్యర్ తెలిపారు. -
బీఎస్ఈతో చేతులు కలిపిన మీషో
న్యూఢిల్లీ: ఈకామర్స్ ప్లాట్ఫామ్ మీషో తాజాగా బీఎస్ఈతో చేతులు కలిపింది. తద్వారా ప్రాజెక్ట్ శిఖర్ (Project Shikhar) పేరుతో కొత్త కార్యాచరణకు తెరతీసింది. ఇందుకు రెండు సంస్థలు అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. తాజా ప్రాజెక్ట్లో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ(ఎంఎస్ఎంఈ)లు, డిజిటల్ బిజినెస్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు వెసులుబాటు కల్పించనున్నాయి.వెరసి ఎంఎస్ఎంఈలతోపాటు.. అత్యున్నత పనితీరు చూపుతున్న స్వతంత్ర ఈకామర్స్ సంస్థలు బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలుగా అవతరించేందుకు దారి ఏర్పడనుంది. దీంతో వృద్ధి అవకాశాలకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకునేందుకు వీలు చిక్కనుంది. చురుకైన, ఉపాధి కల్పనకు వీలున్న బిజినెస్లు ప్రత్యక్షంగా క్యాపిటల్ మార్కెట్లను ఆశ్రయించేందుకు ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అత్యున్నత అవకాశాలను కల్పిస్తున్నట్లు బీఎస్ఈ ఎండీ, సీఈవో సుందరరామన్ రామమూర్తి ఈ సందర్భంగా పేర్కొన్నారు.గత కొన్నేళ్లుగా బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ వందలకొద్దీ సంస్థల లిస్టింగ్కు దారి చూపినట్లు తెలియజేశారు. తద్వారా వృద్ధి సంబంధ పెట్టుబడులు, పాలనాప్రమాణాల మెరుగుకు సహకరించినట్లు వివరించారు. మీషోతో తాజా భాగస్వామ్యం ద్వారా ఎస్ఎంఈలు, ఈకామర్స్ విక్రేతలకు లిస్టింగ్ అవకాశాలు మెరుగుపడనున్నట్లు పేర్కొన్నారు.చదవండి: లీటర్పై 20 రూపాయల డిస్కౌంట్! -
పేటీఎంలో నియామకాల జోరు
భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం సరికొత్త పునర్నిర్మాణ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, మర్చంట్ నెట్వర్క్ విస్తరణే లక్ష్యంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సుమారు 10 శాతం మేర పెంచుకోవాలని నిర్ణయించింది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే తొమ్మిది నెలల్లో (మార్చి 2027 నాటికి) కొత్తగా సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.అయితే, ఒకవైపు భారీ నియామకాలు చేపడుతూనే.. మరోవైపు అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 400 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 1 శాతం) తొలగించేందుకు సంస్థ సిద్ధమవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కీలక అంశాలు..భారీ నియామకాలు: రాబోయే 9 నెలల్లో 4,000 మంది కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్. ఇప్పటికే గత రెండు నెలల్లో 800 మందికి పైగా నియామకం పూర్తి.ఉద్యోగాల కోత: వార్షిక పనితీరు మదింపు ఆధారంగా ఎంపిక చేసిన విభాగాల్లో 400 మంది తొలగింపు.ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య: ప్రస్తుతం కంపెనీలో 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతన నియామకాలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.ప్రధాన దృష్టి: సీనియర్ లీడర్షిప్ పాత్రలతో పాటు.. ప్రొడక్ట్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల బలోపేతం.సరికొత్త ప్లాన్2010లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం మొబైల్ రీఛార్జ్లతో ప్రారంభమై 2016 నోట్ల రద్దు తర్వాత దేశీయ ఫిన్టెక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండేళ్ల క్రితం పేటీఎం బ్యాంకింగ్ విభాగంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలు విధించడం, ఆపై లైసెన్స్ రద్దు చేయడంతో కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో దాదాపు 4,500 మందికి పైగా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది.ఆ నియంత్రణ సవాళ్ల నుంచి కోలుకున్న పేటీఎం వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలను నమోదు చేస్తూ మళ్లీ ట్రాక్లోకి వచ్చింది. ఇప్పుడు కంపెనీకి ఉన్న రిజిస్టర్డ్ వినియోగదారులను కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా.. రుణాలు, పెట్టుబడి ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను విస్తృతంగా అందించడంపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
మానవీయ విలువలే ప్రగతికి మూలాధారం
సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగం అంటేనే టార్గెట్లు, డెడ్లైన్లు. ఒక రోజు లీవ్ కావాలన్నా వంద సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. అలాంటిది, పది రోజుల సుదీర్ఘ సెలవు ముగించుకుని తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతానని మెసేజ్ చేసిన ఉద్యోగికి.. ‘కంగారేం లేదు, పరిస్థితులు సర్దుకోవడానికి మరో రోజు సెలవు తీసుకో’ అంటూ ఓ బాస్ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగుల మానసిక పరిస్థితికి పెద్దపీట వేసే ఇలాంటి మేనేజర్లు కూడా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఒక సంస్థలో పని వాతావరణం, ఉద్యోగుల ప్రవర్తన, యాజమాన్యం తీరు ఎలా ఉండాలో ఈ కింది విధంగా విశ్లేషించవచ్చు.యాజమాన్యం, మేనేజర్ల పాత్రఈ సంఘటనలో మేనేజర్ చూపిన చొరవ కేవలం ఒక అదనపు సెలవు ఇవ్వడం మాత్రమే కాదు; అది ఉద్యోగి మానసిక ఆరోగ్యానికి ఇచ్చిన విలువ. యాజమాన్యం, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు కింది విషయాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.మానవత్వంతో కూడిన నాయకత్వం: నియమ నిబంధనలను పక్కన పెట్టి ఉద్యోగి పరిస్థితిని అర్థం చేసుకోవడమే నిజమైన నాయకత్వం.మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు ఇవ్వగలరు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చే అలసటను గుర్తించి స్థిరపడటానికి సమయం ఇవ్వడం ద్వారా మేనేజర్ ఉద్యోగిపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించగలిగారు.నమ్మకాన్ని నిర్మించడం: నిరంతరం పర్యవేక్షించడం కంటే ఉద్యోగులపై నమ్మకం ఉంచడం వల్ల వారు సంస్థ పట్ల మరింత నిబద్ధతతో పనిచేస్తారు.ఆరోగ్యకరమైన పని వాతావరణం అనేది సంస్థ విజయానికి పునాది. కంపెనీల పని వాతావరణం ఇలా మారాలో కూడా నిపుణులు చెబుతున్నారు.వర్క్-లైఫ్ బ్యాలెన్స్: వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఉద్యోగి ఎక్కువ కాలం ఆ సంస్థలో కొనసాగుతాడు.సహకార సంస్కృతి: ఒకరినొకరు వేధించుకునే వాతావరణం కాకుండా ఒకరికొకరు మద్దతుగా నిలిచే వాతావరణం ఉండాలి. నియమాలు ఉద్యోగులను నియంత్రించడానికి మాత్రమే కాదు, వారి పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి.గౌరవప్రదమైన గుర్తింపు: కేవలం కంపెనీ రికార్డుల్లో ఐడీ నంబర్గా కాకుండా ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేక గుర్తింపు, విలువ ఉన్నాయనే భావన కల్పించాలి.ఉద్యోగుల బాధ్యత ఇదే..యాజమాన్యం లేదా మేనేజర్లు ఉదారంగా ఉన్నప్పుడు ఉద్యోగులపై కూడా అంతే బాధ్యత పెరుగుతుంది. మేనేజర్ చూపిన చొరవను ఆసరాగా తీసుకుని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు. లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. ‘ఇలాంటి మేనేజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేయాలి’ అని ఒక నెటిజన్లు చెబుతున్నారు. యాజమాన్యం పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు సంస్థ వృద్ధి కోసం ఉద్యోగి తన శాయశక్తులా కృషి చేయాలి. తాము ఎప్పుడు వస్తున్నదీ, పని ఏ స్థితిలో ఉన్నదీ మేనేజర్కు ముందుగానే తెలియజేయడం ద్వారా ఉద్యోగులు కూడా తమ వృత్తిపరమైన బాధ్యతను చాటుకోవాలి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్
కార్పొరేట్ కంపెనీల్లో ఓ పదిరోజులు సెలవు తీసుకోవడం, వెకేషన్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తిరిగి ఉద్యోగంలో చేరిపోవడం చాలా కామన్. కానీ వచ్చిన వెంటనే ఆఫీస్ పనిలో పడిపోవడం ఎందుకు, ఇంకో రోజు రెస్ట్ తీసుకొని హ్యాపీగా రా అని మేనేజర్ చెప్పడం ఎక్కడైనా విన్నారా? వినలేదు కదా. అలా గొప్పమనసు చాటుకున్న ఒక మేనేజర్ను బాస్ విత్ హార్ట్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. తన అనుభవాన్ని ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దాని ప్రకారం 10 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత తిరిగి వచ్చిన సదరు ఉద్యోగి, తాను మరుసటి రోజు నుండి విధుల్లో చేరుతున్నట్లు మెసేజ్ చేశాడు. దానికి ఆయన స్పందిస్తే.. వెరీ గుడ్.. రేపు కూడా సెలవు తీసుకో, కాస్త కుదురుకో. బుధవారం నుంచి ఆఫీసుకు రావచ్చులే అని రిప్లై రావడంతో ఆశ్యర్యం పోయాడు. అందుకే తన సంతోషాన్ని నెటిజనులతో పంచకున్నాడు. తన మేనేజర్తో వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్ను రెడ్డిట్లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఎంతో కఠినమైన వాతావరణంలో పనిచేసి వచ్చిన తనకు, మేనేజర్ చేసిన ఈ చిన్న సాయం ఎంతో సంతోషాన్ని, సంస్థలో తన విలువను తెలియజేసిందని పేర్కొన్నాడు.ఆశ్చర్యపోతున్న నెటిజన్లుసాధారణంగా కార్పొరేట్ రంగంలో ఇంతటి దయాగుణాన్ని ఊహించలేమని, ఇది నమ్మశక్యంగా లేదని పలువురు నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. మానవీయ కోణంలో ఆలోచించే లీడర్షిప్కు ఇదొ అరుదైన ఉదాహరణ అని నెటిజన్లు కొనియాడు తున్నారు. ఇదీ చదవండి: ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్ఇదే మెసేజ్ మా బాస్ పెడితే సెటైరిక్గా అంటున్నాడేమో అని భయపడతా, ఎందుకంటే అంత టాక్సిక్ వాతావరణం ఉంటుంది అని ఒకరు, మరొకరైతే ఉద్యోగం నుంచి తీసేయడానికి ఇదొక సంకేతమేమోనని భయపడతా అని వెల్లడించారు."ఒక రోజు సెలవు అడిగితేనే మా మేనేజర్ తన సొంత ఆస్తి అడిగినట్లు ముఖం పెడతాడు" అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా నువ్వు చాలా లక్కీ బ్రో అంటూ మేనేజర్పై ప్రశంసల జల్లు కురిసింది.ఇదీ చదవండి : 51 ఏళ్ల అక్క, 48 ఏళ్ల తమ్ముడు, కన్నీళ్లు తెప్పించే అనురాగం -
ఎయిరిండియాకు షాక్ : రెట్టింపు ఫైన్
విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.‘మహారాజా స్కాలర్ స్కీమ్’ వివాదంలో విద్యార్థినికి అనుకూలంగా వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. ‘మహారాజా స్కాలర్ స్కీమ్’ (Maharaja Scholar Scheme) నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు రూ. 74,131 జరిమానా విధిస్తూ రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్ (State Consumer Redressal Commission) తీర్పునిచ్చింది.2021లో అదనపు లగేజీ (Excess Baggage) కింద ఒక విద్యార్థిని నుండి రూ. 34,131లను ఎయిర్ ఇండియా అక్రమంగా వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె ఈ పథకానికి అర్హురాలేనని సంస్థ అంగీకరించినప్పటికీ, రీఫండ్ (డబ్బులు తిరిగి ఇవ్వడం) ఇవ్వడంలో ఏళ్ల తరబడి జాప్యం చేసింది. దీంతో ఆ విద్యార్థిని కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు విద్యార్థినికి అనుకూలంగా తీర్పునిచ్చింది.జిల్లా వినియోగదారుల కమిషన్ 2024 ఫిబ్రవరి నాటి ఆదేశాల ప్రకారం తనకు చెల్లింపులు చేయకుండా, ఆలస్యం చేయడంతోపాటు, తనను మానసిక క్షోభ గురి చేశారని జైపూర్ నివాసి లావణ్య మాగన్ ఆరోపించింది. దీనికి అదనంగా మరింత పరిహారం అందించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై జుడీషియల్ మెంబర్ ముఖేష్, మెంబర్ దినేష్ కుమార్లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.ఫిర్యాదుదారైన విద్యార్థినిని అనవసరమైన మానసిక వేధింపులకు గురైందని, కోర్టు చుట్టూ తిరగడం వల్ల ఆమె విలువైన సమయం వృధా అయిందని కోర్టు విశ్వసించింది. కాబట్టి ఆమె పడిన మానసిక ఆవేదన పూర్తిగా సమంజసమైనదేనని మే 29న కమిషన్ వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల మధ్య పలుమార్లు ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత, మాగన్ సదరు స్టూడెంట్ స్కీమ్కు అర్హురాలేనని స్వయంగా సంస్థే అంగీకరించిందని వినియోగదారుల కమిషన్ తన తీర్పులో పేర్కొంది.అసలు వివాదం ఏంటి? ఎయిరిండియా ప్రవేశపెట్టిన “మహారాజా స్కాలర్ స్కీమ్” ద్వారా అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రత్యేక లగేజీ అలవెన్స్ లభిస్తుంది. ఈ స్కీం కిందే యూకేలో చదువుకుంటున్న విద్యార్థిని లావణ్య మాగన్, లండన్నుంచి ఇండియాకు వచ్చేందుకు జూలై 21, 2021న ఎయిరిండియా టికెట్ బుక్ చేసుకుంది. ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ చేసే సమయంలో ఆమెకు ఈ స్టూడెంట్ లగేజీ స్కీమ్ వర్తించదంటూ అదనపు లగేజీ ఛార్జీల కింద 350 బ్రిటిష్ పౌండ్లు (రూ. 34,131) వసూలుచేయడంతో వివాదం మొదలైంది.అకడమిక్ ప్రోగ్రామ్ (చదువు) కాలపరిమితి ముగిసినందువల్ల ఆమె ఈ పథకానికి అర్హురాలు కాదని మొదట ఎయిరిండియా వాదించి, క్లెయిమ్ను తిరస్కరించింది. అయినా మాగన్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. తాను నాలుగేళ్ల కోర్సును మూడేళ్లలోనే పూర్తి చేశానని, తన ప్రయాణం చదువు పూర్తి కావడానికి సంబంధించిందేనని వాదించింది. చివరికి ఎయిరిండియా డబ్బులు చెల్లించేందుకు అంగీకరించింది. కానీ దాన్ని చెల్లించడంలో విఫలం కావడంతో మరోసారి వినియోగరుదారుల కమిషన్ను ఆశ్రయించి విజయం సాధించింది. -
రాపిడోతో కేంద్రం జట్టు
దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘రహావీర్’ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రముఖ మొబిలిటీ ప్లాట్ఫారమ్ రాపిడో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేతులు కలిపాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తొలి గంటలో (గోల్డెన్ అవర్) బాధితులకు సకాలంలో ప్రాణరక్షణ సహాయం అందించడాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. కేంద్ర రోడ్ల, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంక సమక్షంలో ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.‘‘రోడ్డు భద్రత అందరి ఉమ్మడి బాధ్యత. ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకం. రహావీర్ పథకం ద్వారా ప్రమాద బాధితులకు తొలి గంటలో సహాయం చేయడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నాము’’ అని నితిన్ గడ్కరీ తెలిపారు. రాపిడో కో–ఫౌండర్ అరవింద్ సంక మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 400కుపైగా నగరాల్లో ఉన్న తమ నెట్వర్క్, లక్షలాది కెప్టెన్ల ద్వారా రహావీర్ పథకంపై విస్తృత అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. డిజిటల్ ప్రచారాలు, ఇన్–యాప్ ఎడ్యుకేషన్, సోషల్ మీడియా కార్యక్రమాలు, గ్రౌండ్ స్థాయి అవుట్రీచ్ ద్వారా ప్రజల్లో చైతన్యం పెంచనున్నట్లు వెల్లడించారు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ఈ భాగస్వామ్య ప్రారంభోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి పైగా రాపిడో కెప్టెన్లు యాప్ ద్వారా ఏకకాలంలో ‘రహావీర్’ ప్రతిజ్ఞను స్వీకరించారు. ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందిస్తామని చాటుతూ వీరంతా ఉమ్మడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పడం విశేషం. పౌరులు ఎలాంటి సంకోచం లేకుండా బాధితులను ఆదుకునేలా చేయడమే దీని ఉద్దేశమని అరవింద్ సంక తెలిపారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలీదు!
న్యూఢిల్లీ: ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు. కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటా ప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది. అయితే తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
LIC పెట్టుబడుల వివాదం.. స్పందించిన రాజేష్ మెహతా
ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు.కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటాప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది.అయితే.. తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
ఎలక్ట్రానిక్స్ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!
ముంబై: ఎల్రక్టానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్ మార్కెట్ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్ వన్ విధానం) ఈ మార్కెట్ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 2025లో ఈఎంఎస్ మార్కెట్ పరిమాణం 40–45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వృద్ధికి అపార అవకాశాలు.. అంతర్జాతీయ ఈఎంఎస్ మార్కెట్ 2025లో 640–650 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్సోర్సింగ్ ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ చర్యలు అవసరం.. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్–డిజైన్పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది. -
నెలకు రూ.1.35 లక్షల భరణం ఇవ్వాల్సిందే!
ఆధునిక వివాహ బంధాల్లో వస్తున్న విభేదాలు, విడాకుల కేసులో ఇటీవల పుణె కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశం అయింది. భార్య నెలకు లక్షకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, ఆమెకు భర్త భారీ మొత్తంలో భరణం (మెయింటెనెన్స్) చెల్లించాల్సిందేనంటూ పుణెలోని ఒక కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది.అసలేం జరిగింది? కేసు వివరాలు ఇవీ..ఉద్యోగ రీత్యా పుణెలో స్థిరపడిన ఒక ఐటీ/కార్పొరేట్ జంటకు వివాహమైన ఆరు నెలలకే మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సమయంలో భార్య తరఫు న్యాయవాది కీలక వాదనను తెరపైకి తెచ్చారు. వివాహ బంధంలో ఉన్నప్పుడు తాను ఎలాంటి విలాసవంతమైన, ఉన్నతమైన జీవన ప్రమాణాలను అనుభవించిందో విడిపోయిన తర్వాత కూడా అదే స్థాయి జీవనాన్ని కొనసాగించే హక్కు ఆమెకు ఉందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. భర్త తన విడాకులు తీసుకున్న భార్యకు నెలకు రూ.1,35,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది.ఆదాయాల లెక్కలు ఇలా..కోర్టు రికార్డుల ప్రకారం ఇద్దరి ఆదాయ వివరాలు కింది విధంగా ఉన్నాయి.వివరాలుభర్త ఆర్థిక పరిస్థితిభార్య ఆర్థిక పరిస్థితిప్రస్తుత నెలవారీ జీతంరూ. 2,79,499రూ. 1,41,436కోర్టు ఆదేశించిన భరణంరూ. 1,35,000రూ. 1,35,000తీర్పు తర్వాత మొత్తం ఆదాయంరూ. 1,44,499రూ. 2,76,436 -
లేఆఫ్స్ సమయంలో వాల్మార్ట్ వినూత్న వ్యూహం
ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఏఐ సాకుతో ఉద్యోగులపై లేఆఫ్స్ పంజా విసురుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్మార్ట్ భిన్నమైన వ్యూహాన్ని ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవ వనరులను భర్తీ చేయడానికి కాదు, వారి పనితీరును మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. అర్కాన్సాస్లోని బెంటన్విల్లేలో నిర్వహించిన వాల్మార్ట్ వార్షిక ‘అసోసియేట్స్ వీక్’ ఈవెంట్లో సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్లు కీలక ప్రకటనలు చేశారు. డిజిటల్ సాధనాలు కేవలం సమస్యల పరిష్కారానికి, వ్యాపార సరళీకరణకు, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికే ఉపయోగపడతాయని భరోసా ఇచ్చారు.ఉత్పాదకత సాధనంగానే ఏఐగత మూడు నెలల్లో అమెరికా కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి ఏఐ సాంకేతికతను ఒక ప్రధాన కారణంగా చూపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. వాల్మార్ట్ సైతం ఇటీవల తన టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో వందలాది పోస్టులను తగ్గించినప్పటికీ ఆ నిర్ణయానికి ఏఐతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐని ఉద్యోగుల భర్తీ వ్యూహంగా కాకుండా ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా వాల్మార్ట్ అగ్రనాయకత్వం అభివర్ణించింది.‘సాంకేతికత మన భవిష్యత్తుకు ఊతమిస్తుంది. కానీ, మన ఉద్యోగులే దానికి నాయకత్వం వహిస్తారు’ అని డోనా మోరిస్, వాల్మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తెలిపారు. వాల్మార్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఫర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్మార్ట్ చరిత్రలో సాధించిన విజయాల వెనుక సాంకేతికత కంటే ఉద్యోగుల కృషి, వారు చూపిన ప్రతిభే కీలకమని కొనియాడారు.భిన్నాభిప్రాయాలు - ఆందోళనలుఏఐ పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ వాల్మార్ట్ వార్షిక ఆదాయం సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయితే గత ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కార్మికులపై ఏఐ ప్రభావంపై మరింత పారదర్శకత కావాలంటూ ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే లేబర్ అడ్వకసీ గ్రూప్ వాటాదారుల సమావేశంలో ప్రతిపాదన తెచ్చింది. ఏఐ సాధనాల వల్ల పని వేగం పెరిగి కార్మికులపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!
ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పంచుకున్న కొన్ని ఆర్థిక సూత్రాలు ఇప్పుడు యువతను, వర్ధమాన పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతికే సగటు ఆలోచనా విధానానికి, రూ.కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తల మైండ్ సెట్కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు.‘ ‘నేను ధనవంతుడిగా ఎలా మారాలి? దీనికోసం ఏదైనా మంత్రదండం ఉందా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. వారంతా నా నుంచి ఏదో ఒక సంక్లిష్టమైన ఫార్ములానో లేక మాయా పెట్టుబడి వ్యూహాన్నో ఆశిస్తారు. కానీ, నేను కుర్రాడిగా ఉన్నప్పుడే మా ‘రిచ్ డాడ్’ నాకు అసలైన రహస్యం చెప్పారు. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలననుకుంటే.. కేవలం రెండు విషయాల్లో పట్టు సాధించు. ఒకటి సేల్స్ (అమ్మకాలు), రెండు రియల్ ఎస్టేట్’ అన్నారు.ఆ రెండు నైపుణ్యాలే ఎందుకు?రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరడానికి ఈ రెండు రంగాలు పునాదిగా పనిచేస్తాయి.సేల్స్ (అమ్మకాలు)వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అమ్మనంత వరకు అక్కడ ఎలాంటి చలనం ఉండదు. సేల్స్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదు.ఎదుటివారితో ఎలా మాట్లాడాలి.ఎలా చర్చలు జరపాలిఇతరులను ఎలా ప్రభావితం చేయాలి.విలువను ఎలా సృష్టించాలి.. అనేది సేల్స్ నేర్పుతుంది.ఇదే ఉద్దేశంతో రాబర్ట్ కియోసాకి మెరైన్ కార్ప్స్ విడిచిపెట్టిన తర్వాత కేవలం సేల్స్ నేర్చుకోవడం కోసమే ‘జిరాక్స్’ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కెరీర్ బిల్డ్ చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఒక పారిశ్రామికవేత్తకు కావలసిన అసలైన సేల్స్ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ఆయన లక్ష్యం.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూములు, భవనాల కొనుగోలు మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సూత్రాలైన అప్పు, పన్నుల గురించి నేర్పుతుంది.లెవరేజ్: రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుడానికి మీ సొంత డబ్బు అక్కర్లేదు. ఇతరుల లేదా బ్యాంకుల డబ్బును ఎలా ఉపయోగించవచ్చో ఇది నేర్పుతుంది.క్యాష్ ఫ్లో: క్రమబద్ధమైన ఆదాయ వనరును ఎలా సృష్టించాలో చూపిస్తుంది.టాక్స్-ఫ్రీ వెల్త్: పన్ను నిబంధనలను చట్టబద్ధంగా ఉపయోగించుకుంటూ అతి తక్కువ పన్నుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో రియల్ ఎస్టేట్ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.నేటి ఆధునిక కాలంలో కేవలం అకడమిక్ డిగ్రీలు మాత్రమే జీవితంలో స్థిరపడటానికి సరిపోవు అనేది జగమెరిగిన సత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మనల్ని కేవలం ఒక ఉద్యోగిగా మారడానికే శిక్షణ ఇస్తాయి. కానీ, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు సేల్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై అవగాహన పెంచుకోవడం అంటే వ్యాపారం చేయడం మాత్రమే కాదు. సంపదను సృష్టించే మైండ్ సెట్ను అలవర్చుకోవడం. డిగ్రీల వేటలో పడేముందు.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ముంబై-హైదరాబాద్.. కేవలం 3 గంటల్లోనే!
హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముంబై-పుణె-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) అధికారికంగా ఖరారైంది. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో ఇది కీలకంగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని, అలాగే హైదరాబాద్ను ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే మరో మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాట్లను కూడా సమగ్రంగా సమీక్షించారు.12 గంటల ప్రయాణం.. ఇక 3 గంటల్లోనే..ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవడానికి సాధారణ రైళ్లు లేదా రోడ్డు మార్గం ద్వారా దాదాపు 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. అయితే, ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. కేవలం 3 గంటల్లోనే ప్రయాణీకులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.ప్రాజెక్టు పేరు: ముంబై-పుణె-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ప్రాజెక్ట్ అమలు చేసే సంస్థ: నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)మొత్తం దూరం: 671 కిలోమీటర్లుగరిష్ట వేగం: గంటకు 320 కిలోమీటర్లుటెర్మినల్ నగరాలు: నవీ ముంబై-హైదరాబాద్మూడు రాష్ట్రాల మీదుగా 10 స్టేషన్లుఈ హై-స్పీడ్ రైలు కారిడార్ మొత్తం మూడు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ గుండా ప్రయాణిస్తుంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఐటీ, ఆధ్యాత్మిక పట్టణ కేంద్రాలను అనుసంధానిస్తూ మొత్తం 10 స్టేషన్లను ఈ మార్గంలో ప్రతిపాదించారు.స్టేషన్ల వారీగా రూట్ మ్యాప్..1. నవీ ముంబై2. లోనావాలా3. పింప్రి-చించ్వాడ్4. పుణె (లోని)5. బారామతి6. పంఢరపూర్7. సోలాపూర్8. కలబురగి9. వికారాబాద్10. హైదరాబాద్ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు - ప్రయోజనాలుఈ మెగా ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు మూడు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెరగడం వల్ల పెట్టుబడులు వరదలా రానున్నాయి. గంటకు 320 కి.మీ వేగంతో నడిచే ఈ రైళ్లు రవాణా రంగంలో సరికొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తాయి. మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతాలు, కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాలు, తెలంగాణలోని ఐటీ-ఫార్మా హబ్లకు ఈ కారిడార్ ఊతం ఇవ్వనుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించి స్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను భవిష్యత్తు తరాలకు అందించడమే దీని లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశల్లో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
కేంద్రానికి ఎస్బీఐ భారీ డివిడెండ్
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం, ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులతో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.8,813 కోట్ల భారీ డివిడెండ్ను ఎస్బీఐ చెల్లించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి ఈ డివిడెండ్ చెక్కును కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్కు అధికారికంగా అందజేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎస్బీఐ సాధించిన ఈ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పన్నుయేతర ఆదాయ వనరులకు మరింత బలాన్ని చేకూర్చడంతోపాటు బ్యాంక్ పటిష్టమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.రికార్డు స్థాయి లాభాలతో..ఇటీవలే ముగిసిన జనవరి-మార్చి 2026 త్రైమాసికంలో ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ బలమైన ఆదాయాలే ప్రభుత్వానికి ఈ స్థాయిలో భారీ డివిడెండ్ చెల్లించడానికి ప్రధాన కారణమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,643 కోట్లతో పోలిస్తే ఈసారి నికర లాభం 6 శాతం వృద్ధితో రూ.19,684 కోట్లకు చేరింది. బ్యాంక్ ప్రధాన ఆదాయ వనరు అయిన నికర వడ్డీ ఆదాయం (రుణాలపై వచ్చే వడ్డీకి, డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం) ఏకంగా 4 శాతం వృద్ధితో రూ.44,380 కోట్లుగా నమోదైంది.Smt @nsitharaman receives a dividend cheque of Rs 8,813 crore for FY 2025-26 from Shri C S Setty, Chairman - @TheOfficialSBI. pic.twitter.com/wNeB9HkqVw— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) June 8, 2026దలాల్ స్ట్రీట్లో జోరుస్టాక్ మార్కెట్లో ఎస్బీఐ షేరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. గత నెల రోజుల్లో స్వల్పంగా 4 శాతం మేర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గత వారంలోనే ఈ స్టాక్ 3 శాతానికి పైగా పుంజుకుంది. ప్రస్తుతం ఎస్బీఐ మార్కెట్ విలువ సుమారు రూ.9.08 లక్షల కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత విలువైన బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఎస్బీఐ తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
విమానయాన రంగానికి ఇంధన గండం!
ప్రపంచ విమానయాన రంగాన్ని మిడిల్ ఈస్ట్ సంక్షోభం కుదిపేస్తోంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ల యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా జెట్ ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్-ఏటీఎఫ్) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీలకమైన ఎయిర్ కారిడార్లు మూతపడటంతో విమానాలను సుదూర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధన ఖర్చులు రికార్డు స్థాయికి చేరాయి. ఈ పెరిగిన భారంతో మున్ముందు కొన్ని విమానయాన సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంస్థ (ఐఏటీఏ) హెచ్చరించింది. రియో డి జనీరోలో జరిగిన ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ రాయిటర్స్ సంస్థతో మాట్లాడుతూ పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విశ్లేషించారు.బడ్జెట్ విమానయాన సంస్థలపైనే ప్రభావం..పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం పూర్తిస్థాయి సేవలందించే పెద్ద ఎయిర్లైన్స్ కంటే తక్కువ ధరలకే సేవలందించే ‘బడ్జెట్ క్యారియర్ల’పైనే ఎక్కువగా పడుతోందని ఐఏటీఏ స్పష్టం చేసింది. ‘పెద్ద విమానయాన సంస్థలకు ప్రీమియం క్యాబిన్లు, అధిక ఛార్జీలు చెల్లించే బిజినెస్ ప్రయాణికులు, క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్ల ద్వారా అదనపు మార్జిన్ ఆదాయం లభిస్తుంది. బడ్జెట్ ఎయిర్లైన్స్కు ఇలాంటి అదనపు వనరులు ఉండవు’ అని ఐటీఏటీ తెలిపింది. అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్ ‘స్పిరిట్ ఎయిర్లైన్స్’ గత నెలలో భారీగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో మరికొన్ని చిన్న సంస్థలు వ్యాపారాల నుంచి తప్పుకోవడమో లేదా పెద్ద క్యారియర్ల చేతుల్లోకి వెళ్లిపోవడమో తప్పదని విల్లీ వాల్ష్ ఆందోళన వ్యక్తం చేశారు.టికెట్ ధరలు తగ్గే ప్రసక్తే లేదు!ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ నష్టాలను/మార్జిన్లను కాపాడుకోవడానికి లాభసాటి కాని మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నాయి. ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుంచి పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదని వాల్ష్ తేల్చిచెప్పారు. ప్రస్తుత తరుణంలో అధిక ఇంధన ధరలను తట్టుకుని నిలబడటం చాలా కష్టమన్నారు. అమెరికా మార్కెట్లో మాత్రం యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్ వంటి క్యారియర్లు చిన్న బడ్జెట్ పోటీదారులను గట్టిగా అణచివేస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ఈ యూరప్ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్!
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. కనువిందు చేసే నీటి కాలువలు, చారిత్రక భవనాలు, మ్యూజియంలు, సాంస్కృతిక వైవిధ్యంతో ఏటా కోట్లాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు ‘ఓవర్ టూరిజం’ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించడంతో పాటు నగర నిర్వహణకు అదనపు నిధులు సమకూర్చుకునేందుకు ఆమ్స్టర్డామ్ సిటీ ప్రభుత్వం పర్యాటక పన్నును భారీగా పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.12.5 శాతం నుంచి 20 శాతానికి..ప్రస్తుతం ఆమ్స్టర్డామ్లో హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వసతి కేంద్రాల్లో బస చేసే పర్యాటకులపై గది అద్దెపై 12.5 శాతం పర్యాటక పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే క్రూయిజ్ నౌకల ద్వారా ఒక రోజు పర్యటనకు వచ్చే వారిపై ఒక్కొక్కరికి 15 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1650 పన్ను విధిస్తున్నారు.కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం 2027 నుంచి ఈ పన్నును 16 శాతానికి పెంచి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున పెంచుతూ 2030 నాటికి 20 శాతానికి చేర్చనుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటక పన్నులు విధించే నగరాల్లో ఆమ్స్టర్డామ్ ఒకటిగా నిలవనుంది.నగరంపై పెరుగుతున్న ఒత్తిడే కారణంపర్యాటకం నగర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరు అయినప్పటికీ, అదే సమయంలో జనసమ్మర్థ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, స్థానికుల జీవన ప్రమాణాలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని సిటీ ప్రభుత్వం పేర్కొంది. అందుకే నగర నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, చట్ట అమలు, మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల్లో పర్యాటకులు కూడా తగిన వాటా భరించాలని భావిస్తోంది. పన్ను పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.క్రూయిజ్ టెర్మినల్కు కూడా గుడ్బై?పన్ను పెంపుతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సముద్ర క్రూయిజ్ నౌకల ద్వారా వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన క్రూయిజ్ టెర్మినల్ను మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనుంది.అదనంగా, కాలువలపై బోటు టూర్లు, అద్దె పడవలు వంటి వినోద కార్యకలాపాలపై కూడా అధిక రుసుములు విధించే అవకాశాలు ఉన్నాయి. నగర కేంద్రంలోని కొన్ని భవనాలను కొనుగోలు చేసి, వాటి వినియోగాన్ని మార్చడం ద్వారా అధిక పర్యాటక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు.రెడ్ లైట్ ప్రాంతానికి ప్రత్యామ్నాయంప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్పై ఒత్తిడిని తగ్గించేందుకు నగర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక “ఎరోటిక్ సెంటర్” ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడం, నేర కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడం, నగర కేంద్రంలో రద్దీని నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.పర్యాటకులను ఆహ్వానిస్తూనే నియంత్రణగత కొన్నేళ్లుగా ఆమ్స్టర్డామ్ ‘టూరిజం ఇన్ బ్యాలెన్స్’ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యాటకులను పూర్తిగా నిరోధించడం కాకుండా, నగర సామర్థ్యానికి మించి పెరుగుతున్న సందర్శకుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలు, యునెస్కో వారసత్వ హోదా పొందిన కాలువల వలయం, సైకిల్ సంస్కృతి కారణంగా ఆమ్స్టర్డామ్ ఇప్పటికీ ఐరోపాలో అత్యధికులు సందర్శించాలనుకునే పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు మరింత ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. -
భారత్లోకి ఆంథ్రోపిక్ ‘మైథోస్’
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ విస్తరణలో భాగంగా భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అంటే సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్వేర్లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్బేస్లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్వేర్ ప్యాచ్ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
దశాబ్దాలుగా, కోట్లాది కుటుంబాలకు విశ్వసనీయమైన పెట్టుబడి సాధనాల్లో మొదటి ఎంపిక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)కే. బ్యాంకు శాఖకు వెళ్లి ఎఫ్డీ వేయడం, కావాల్సినప్పుడు వెనక్కి తీసుకోవడం.. రాబడి తక్కువే అయినా అందులోని సౌలభ్యం, నమ్మకం ఎఫ్డీకి అంత ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడంతా డిజిటల్ సేవల యుగం. దాదాపు అన్ని బ్యాంకు సేవలు డిజిటల్గానే లభిస్తున్నాయి. ఎఫ్డీ కంటే అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్ తదితర సాధనాలను స్మార్ట్ఫోన్ నుంచే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు. దీంతో గతంతో పోల్చితే ఎఫ్డీలకు డిమాండ్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి వేగం నిదానించడం దీన్నే తెలియజేస్తోంది. దీంతో బ్యాంక్లు సైతం డిజిటల్ ఎఫ్డీలతో పోటీ పడుతున్నాయి. సొంత మొబైల్ అప్లికేషన్లు, నెట్బ్యాంకింగ్ ద్వారానే కాకుండా.. ఫిన్టెక్ల రూపంలోనూ డిజిటల్ ఎఫ్డీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా బ్రహా్మండం. మొదటిసారి ఇన్వెస్టర్లు సైతం సులభంగా డిజిటల్ ఎఫ్డీ చేసుకోవచ్చు. వీటి సేవలను ఎలా పొందొచ్చో తెలియజేసే కథనమే ఇది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సొంతంగానూ డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు వీటిని ఇన్వెస్టర్లకు మరింత చేరువ చేస్తున్నాయి. డిపాజిట్కు సరిపడా సొమ్మును స్వీకరించడం, ఎఫ్డీగా మార్చడం, ఉపసంహరణ తదితర సేవలన్నింటినీ ఫిన్టెక్ సంస్థలు అందిస్తాయి. డిపాజిట్ రిసీప్్టలు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీల నుంచే జారీ అవుతాయి. అంటే డిపాజిట్ మొత్తం బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలకే వెళుతుంది. ఒకే చోట డిపాజిట్లన్నీ.. → తమకు ఖాతా ఉన్న బ్యాంక్లోనే డిజిటల్ ఎఫ్డీ వేసుకోవచ్చు. → అధిక రాబడిని (వడ్డీ రేటు) ఆఫర్ చేసే చోటే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఎంతో అనుకూలం. → దాదాపు అన్ని ప్రముఖ బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. → అన్ని డిపాజిట్లు ఒకే చోటు కనిపించడం వల్ల ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే డిపాజిట్లను సులభంగా గుర్తించొచ్చు. → కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్కు అవకాశం ఉంది. కావాలంటే అక్కడే రెన్యువల్ చేసుకోవచ్చు.డిపాజిట్ చిటికెలో పని→ డిజిటల్ ఎఫ్డీ కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. నిమిషాల్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. → ఈ–కేవైసీ లేదా వీడియో కేవైసీ ద్వారా తమ గుర్తింపు వివరాలను ఇస్తే సరిపోతుంది. → అనంతరం తమకు నచ్చిన సంస్థ డిపాజిట్ను ఎంపిక చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. → గడువు ముగిసిన తర్వాత ఉపసంహరణ కూడా సులభమే. నిమిషాల్లోనే డిపాజిట్ మొత్తం వడ్డీ సహా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. → కావాలంటే ఆ డిపాజిట్ను అక్కడికక్కడే రెన్యువల్ ( పునరుద్ధరణ) చేసుకోవచ్చు. → ఈ సేవలన్నీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్ పోర్టల్ నుంచి పొందొచ్చు. రెండూ ఒకటే.. → భౌతికంగా బ్యాంకులో చేసే ఫిక్స్డ్ డిపాజిట్, ఆన్లైన్లో డిజిటల్గా చేసే ఎఫ్డీ రెండూ ఒక్కటే. వడ్డీ రేటు, భద్రత, పన్ను తదితర అంశాల్లో ఎలాంటి మార్పుల్లేవు. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలో రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం కూడా లేదు. → చాలా ఫిక్స్డ్ డిపాజిట్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక డిపాజిట్ పథకాలలో ఈ సౌకర్యం ఉండకపోవచ్చు. → ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద ఒక బ్యాంకు పరిధిలో ఒక్కో ఇన్వెస్టర్కు గరిష్టంగా రూ.5. లక్షల ఎఫ్డీకి బీమా వర్తిస్తుంది. రిస్కుల్లేవా..→ సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లలో రిస్క్ చాలా తక్కువ. → బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడినప్పుడే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని అన్ని వాణిజ్య బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ల్లో ఒక్కో డిపాజిటర్కు గరిష్టంగా రూ.5 లక్షల మొత్తానికి బీమా ఉంటుంది. → ఉదాహరణకు ఒక వ్యక్తి రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేశాడనుకుందాం. రెండు బ్యాంకులూ సంక్షోభంలోకి వెళ్లాయనుకుంటే.. అప్పుడు రెండు బ్యాంకుల నుంచి డిపాజిటర్కు రూ.5 లక్షల చొప్పున వెనక్కి వస్తుంది. → కనుక ఒక బ్యాంకు పరిధిలో గరిష్ట డిపాజిట్ను రూ.5 లక్షలకు పరిమితం చేయడం ద్వారా రిస్్క తగ్గించుకోవచ్చు. → ఎన్బీఎఫ్సీల డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, బ్యాంకుల్లో మాదిరి ఎన్బీఎఫ్సీల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా సదుపాయం లేదు. ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడితే డిపాజిట్ పూర్తిగా రిస్్కలోకి వెళ్లినట్లే. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ సేవలు మెరుగ్గా ఉన్నాయేమో విచారించుకోవాలి. → మెచ్యూరిటీ అనంతరం ఆటో రెన్యువల్ అయినా, కొత్తగా అమల్లో ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది. గతంలో పొందిన అధిక వడ్డీ రేటు కొనసాగదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ కేవలం మధ్యవర్తి గా మాత్రమే పనిచేస్తుంది. డిపాజిట్ భద్రత పూర్తిగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందే డిపాజిట్ ఏ సంస్థ వద్ద నమోదవుతోందో పరిశీలించాలి.అధిక రాబడి→ తమ ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్ అయితే, మెరుగైన రేటుపై చేసే అవకాశం ఉండదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల ద్వారా అయితే ఏ బ్యాంక్ ఎక్కువ రేటు ఆఫర్ చేస్తుందో తెలుసుకుని, అందులోనే డిపాజిట్ చేసుకోవచ్చు. → కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు 0.5–2 శాతం వరకు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. → గతంలో పోల్చితే డిపాజిట్లకు పోటీ పెరగడంతో ప్రముఖ బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన రేటును అందిస్తున్నాయి. → సీనియర్ సిటిజన్ (60 ఏళ్లు నిండిన) డిపాజిట్లపై అరశాతం వరకు అదనపు రాబడిని అందుకోవచ్చు. → అధిక రాబడి కోసం దీర్ఘకాలాన్ని ఎంపిక చేసుకునే ముందు.. అంతకాలం పాటు వేచి ఉండగలమా? అన్నది ఆలోచించుకోవాలి.డిపాజిట్పై రుణం → చాలా బ్యాంకులు డిపాజిట్పై రుణం లేదా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎఫ్డీ విలువలో 75–80 శాతం మేర రుణంగా లభిస్తుంది. → ఎఫ్డీ రేటు కంటే 1–3 శాతం అధికంగా రుణానికి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా వెనక్కి తీసుకుంటే.. → డిపాజిట్లు ఏవైనా వాటి నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే ఉపసంహరించుకుంటే రాబడి విషయంలో రాజీ పడక తప్పదు. → ఉదాహరణకు రూ.3 ఏళ్లకు డిపాజిట్ చేసి, ఏడాదికే వెనక్కి తీసుకుంటే.. ఏడాది కాలానికి వర్తించే వడ్డీ రేటు ప్రకారమే చెల్లింపులు లభిస్తాయి. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల్లో ముందస్తుగా డిపాజిట్ నుంచి తప్పుకుంటే 0.5–1 శాతం వరకు పెనాల్టీని కూడా చెల్లించాల్సి రావొచ్చు. → కాలవ్యవధి ముగిసేలోపు అత్యవసరాల్లో తీసుకోవచ్చని భావించే వారు.. ఒకే డిపాజిట్ కాకుండా ఒకటికి మించి వేర్వేరు డిపాజిట్లుగా, వేర్వేరు కాల వ్యవధిపై చేసుకోవడం వల్ల రాబడి నష్టపోకుండా, పెనాల్టీ భారం ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. పన్ను భారం మరవొద్దు..→ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. కనుక ఆదాయానికి అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. → ఉదాహరణకు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న వ్యక్తి 8.5 శాతం రేటుపై ఎఫ్డీ చేశాడని అనుకుందాం. అప్పుడు పన్ను పోను ఎఫ్డీపై నికర రాబడి 6 శాతం మించదు. → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్పై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తికి రూ.50,000 మించితే (60 ఏళ్లలోపు), 60 ఏళ్లు నిండిన వారికి రూ.లక్ష మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పాన్ నంబర్ సమరి్పంచిన వారికి 10 శాతం, అది లేని వారికి 20 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. → పన్ను వర్తించేంత ఆదాయం లేని వారు టీడీఎస్ అమలు చేయకుండా ఫారమ్ 15జీ (60 ఏళ్లలోపు), ఫారమ్ 15హెచ్ (60 ఏళ్లు నిండిన) సమర్పిస్తే సరిపోతుంది. డిజిటల్ ఎఫ్డీ వేదికలు..→ జియోఫైనాన్స్ → స్టెబుల్ మనీ → జెరోదా కాయిన్ → ఫైబ్ → పైసా బజార్→ ఐఎన్డీ మనీ → క్రెడ్ → ఫోన్పే → నవీ → పేటీఎం -
తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!
భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. నేడు ముఖేష్ అంబానీ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి, ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ చెప్పిన మాట అని ఒక సందర్భంలో పేర్కొన్నారు.ఒకసారి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన ఒక మాటను గుర్తుచేశారు. ''నువ్వు వ్యాపారవేత్త కావాలనుకుంటే సమస్యలకు పరిష్కారాలను నువ్వే కనుగొనాలి. మేనేజర్లకు మాత్రమే ఏం చేయాలో చెబుతారు. కానీ వ్యాపారవేత్తలకు ఎవరూ దారి చూపరు'' అని ధీరూభాయ్ అంబానీ తనకు చెప్పారని వెల్లడించారు.వ్యాపారవేత్త పరిస్థితి భిన్నం!ఈ మాటల్లో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. సాధారణంగా ఒక ఉద్యోగి లేదా మేనేజర్కు సంస్థలో ఉన్నతాధికారులు పనులను అప్పగిస్తారు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం పని చేస్తారు. కానీ.. ఒక వ్యాపారవేత్త పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడే సమస్యలను గుర్తించాలి, అవకాశాలను వెతకాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వాటి ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలి.జీవితంలో లేదా వ్యాపారంలో ఎదగాలంటే ఎప్పుడూ ఇతరుల మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడకూడదని, స్వయంగా ఆలోచించి ముందుకు సాగాలని ధీరూభాయ్ అంబానీ ఉద్దేశ్యం. ఒక వ్యాపారాన్ని నిర్మించాలంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, వాటికి పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం అవసరమని ఆయన చెబుతారు.నిర్ణయాలపై నమ్మకంప్రస్తుత కాలానికి కూడా ధీరూభాయ్ అంబానీ మాటలు చాలా ఉపయోగపడతాయి. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఎంతో మంది యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధమవుతారు. అయితే.. చాలామంది ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తుంటారు. కానీ నిజమైన వ్యాపారవేత్త తన నిర్ణయాలపై తానే నమ్మకం ఉంచి ముందుకు సాగాలి.సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఇతరులపై ఆధారపడకుండా ముందుగా మనమే ఆలోచించాలి. తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవమే మనకు ఉత్తమ గురువు. విజయవంతమైన నాయకులు తమ తప్పులను అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగుతారు.కొత్త ప్రయత్నాలు అవసరంఅలాగే.. జీవితంలో ప్రతి విషయం స్పష్టంగా కనిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా సరైంది కాదు. కొన్నిసార్లు చర్యలు తీసుకున్న తర్వాతే స్పష్టత వస్తుంది. అందుకే అపజయాలకు భయపడకుండా.. కొత్త ప్రయత్నాలు చేయడం అవసరం. కాబట్టి ఎప్పుడూ ఇతరులు చెప్పేదాన్ని అనుసరించే వారిగా కాకుండా, సొంత దారిని సృష్టించే వారిగా మారితేనే విజయం సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ! -
మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అదానీ గ్రూప్కు చెందిన పలు కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో ఆసియా ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆయన తిరిగి కైవసం చేసుకున్నారు.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఒక్క రోజులోనే అదానీ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ 89.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను అధిగమించి అదానీ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లుగా ఉండగా, సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ సంపద 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది.అదానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల షేర్లలో నమోదైన భారీ ర్యాలీ. ముఖ్యంగా అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు దాదాపు 6.9 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 3.8 శాతం లాభపడింది.గత నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇటీవల అదానీ గ్రూప్పై నమోదైన మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులను అమెరికా న్యాయశాఖ విరమించుకున్న తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే.. ఆ ఆరోపణలను అదానీ, ఆయన సహచరులు మొదటి నుంచే ఖండించారు.ప్రస్తుతం అదానీ గ్రూప్కు చెందిన ఆరు ప్రధాన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి సుమారు 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గ్రూప్ వ్యాపార సామర్థ్యాన్ని, మార్కెట్లో ఉన్న బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వివిధ ఆరోపణలు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. అయితే.. ప్రస్తుతం కంపెనీల పనితీరు మెరుగుపడటం, షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిపాయి. -
రూ. 2,873 కోట్ల లెన్స్కార్ట్ షేర్లు అమ్మేసిన సాఫ్ట్బ్యాంక్
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ తాజాగా ఐవేర్ కంపెనీ లెన్స్కార్ట్లో 3.25 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 508.55 సగటు ధరలో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 5.65 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఎన్ఎస్ఈ బ్లాక్ డీల్ వివరాల ప్రకారం వీటి విలువ రూ. 2,873 కోట్లు. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ 2 లైట్బల్బ్(కేమాన్) ద్వారా వాటా విక్రయించింది. ఈ విక్రయానికి ముందు లెన్స్కార్ట్లో సాఫ్ట్ బ్యాంక్ వాటా 13.13 శాతంకాగా.. ప్రస్తుతం 9.88 శాతానికి తగ్గింది. ఎంఎఫ్లు వైట్ఓక్ క్యాపిటల్, మిరాయ్ అసెట్, కొటక్, కెనరా రొబెకో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్తోపాటు.. ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, సొసైటీ జనరాలి తదితరాలు సాఫ్ట్ బ్యాంక్ విక్రయించిన షేర్లను కొనుగోలు చేశాయి. -
వెండి హాల్మార్కింగ్ సవాళ్లపై అధ్యయనం
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ నిబంధనలను తప్పనిసరి చేసేందుకు మౌలిక సదుపాయాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను అధ్యయనం చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ సంజయ్ గర్గ్ తెలిపారు. జ్యుయలరీ, కళాకృతులు, ఫర్నిచర్ తదితర రూపాల్లో కూడా వెండిని చాలా స్టోర్స్లో విక్రయిస్తారు కాబట్టి మార్కెట్పరంగా చూసినప్పుడు పసిడితో పోలిస్తే సిల్వర్ హాల్మార్కింగ్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.బీఐఎస్లో మొత్తం హాల్మార్కింగ్ కార్యకలాపాలను కేవలం అయిదుగురు మాత్రమే పర్యవేక్షిస్తుంటారని, మిగతా సిబ్బంది అంతా ప్రైవేట్ లేదా ఔట్సోర్సింగ్ వారే అయి ఉంటారని గర్గ్ చెప్పారు. ప్రైవేట్ వర్గాల సహాయంతో హాల్మార్కింగ్ సెంటర్లను నిర్వహించడం, నమ్మకాన్ని చూరగొనడం అనేది చాలా కష్టతరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి సిల్వర్ హాల్మార్కింగ్ని క్రమంగా అమల్లోకి తేనున్నట్లు గర్గ్ చెప్పారు.2005 నుంచి వెండికి హాల్మార్కింగ్ స్వచ్ఛందంగా అమలవుతోంది. 2025 సెప్టెంబర్ నుంచి సిల్వర్ ఆర్టికల్స్ స్వచ్ఛతకు సంబంధించి హాల్మార్క్ విశిష్ట గుర్తింపు (యూహెచ్ఐడీ) సంఖ్యను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం వెండి ఆభరణాలను పరీక్షించేందుకు బీఐఎస్ గుర్తింపు పొందిన అసేయింగ్, హాల్మార్కింగ్ సెంటర్లు (ఏహెచ్సీ) సుమారు 230 ఉన్నాయి. -
2030 నాటికి 20% మార్కెట్ వాటా
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ రంగం 2030 నాటికి ఏటా 60 లక్షల వాహనాల విక్రయాల దిశగా భారీగా వృద్ధిని సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అందులో దాదాపు 12 లక్షల వాహన విక్రయాలు తమవే ఉండాలని టాటా మోటర్స్ నిర్దేశించుకుంది. తద్వారా 20 శాతం పైగా మార్కెట్ వాటాను దక్కించుకోవాలని టాటా మోటర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గోవాలో జరిగిన టాటా మోటార్స్ డీలర్ల వార్షిక బిజినెస్ ప్లానింగ్ సమావేశం–2026లో టాటా సన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకునేందుకు రూ. 35,000 కోట్ల భారీ మూలధన పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. మార్కెట్ పురోగతిని బట్టి ఈ ప్రణాళికను మరింత విస్తరిస్తామని చెప్పారు. డీలర్లదే కీలక పాత్ర టాటా మోటార్స్ భవిష్యత్ విజయం డీలర్ల చేతుల్లోనే ఉందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ‘‘కంపెనీ తరఫున కొత్త మోడళ్లు, ఆవిష్కరణలను వేగంగా మార్కెట్లోకి తీసుకువస్తాము. అయితే సేల్స్ అనుభవం, సరీ్వస్ నాణ్యత, కస్టమర్ల నమ్మకాన్ని పొందడంలో డీలర్ నెట్వర్క్ బలంగా పనిచేసినప్పుడే అనుకున్న మైలురాళ్లను చేరుకోగలము’’ అని చంద్రశేఖర్ వివరించారు. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు రాణించే సంస్థలే నిజమైన గొప్ప కంపెనీలుగా నిలుస్తాయన్నారు. ఇందుకోసం డీలర్లందరూ సరికొత్త ఆలోచనా దృక్పథంతో ముందుకు సాగాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.అప్పట్లో వ్యాపారం మూసేయమన్నారు .. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘‘2017లో ప్యాసింజర్ వాహనాల (కార్ల) వ్యాపారం మూసివేసి, కేవలం కమర్షియల్ వాహనాలపైనే దృష్టి పెట్టాలని కంపెనీలో చర్చలు జరిగాయి. కానీ, మనమందరం కలిసి సాధించిన కృషి కారణంగా ఈ రోజు భారతీయ కార్ల మార్కెట్లో టాప్–2 స్థానాల్లో ఒకటిగా గర్వంగా నిలబడ్డాం’’ అని చంద్రశేఖరన్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో కంపెనీ సాధించిన నాయకత్వాన్ని, నిలకడగా మెరుగుపడుతున్న ఆర్థిక పనితీరును ఆయన కొనియాడారు. -
ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు మాయం!
టెక్ రంగంలో ఉద్యోగాలు కోతలు భారీగా పెరుగుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి కేవలం ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,16,000కు పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్లు లేఆఫ్.ఫై (Layoff.fyi) ట్రాకర్ వెల్లడించింది.లక్షలాది ఉద్యోగాలు పోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందడం అని తెలుస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. మార్చి నెలలో మాత్రమే 46,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో 28,000 ఉద్యోగాలు తొలగింపులు జరిగాయి.భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంట్యూట్, క్లౌడ్ఫ్లేర్, లింక్డ్ఇన్, ఉబర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.ఉబర్ తన పీపుల్ అండ్ ప్లేసెస్ డివిజన్లో సుమారు 23 శాతం సిబ్బందిని తగ్గించింది. సిస్కో 4,000 ఉద్యోగాలను తొలగిస్తూ, అదే సమయంలో కృత్రిమ మేధస్సు, సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించింది. పేపాల్ అయితే రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, తన ప్రణాళికను కూడా వెల్లడించింది. మెటా కంపెనీ కూడా తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో భారీ మొత్తంలో తగ్గిస్తూ, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది. -
పర్యావరణ పరిరక్షణలో కార్పొరేట్లు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్పొరేట్లు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ తమ ప్రాజెక్టులవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉద్యోగులు.. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంపై పోటీలు నిర్వహించింది. భూగ్రహాన్ని కాపాడుకోవడం మానవాళి శ్రేయస్సుకి కీలకమని సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిలో అయిదు రాష్ట్రాలవ్యాప్తంగా ఓపెన్ ఫర్ ది ప్లానెట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది.ఇందులో 8,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొంది. మొక్కలు నాటడం, క్లీన్–అ–థాన్ కార్యక్రమాలు, కొత్త తరం గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం ఈవీ డిస్ప్లే జోన్ల ఏర్పాటు మొదలైనవి చేసినట్లు వివరించింది. కార్యకలాపాలు, వ్యవసాయ వాల్యూ చెయిన్స్వ్యాప్తంగా వాతావరణంపరమైన రిసు్కలను మదింపు చేసేందుకు కృత్రిమ మేథను ఉపయోగిస్తున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ వెల్లడించింది. తద్వారా ఆయా సందర్భాలకు అనువైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అటు, క్లైమేట్ యాక్షన్, లో-కార్బన్ మొబిలిటీపై వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది.పర్యావరణహిత మొబిలిటీ దిశగా భారత్ గణనీయంగా పురోగతి సాధించినట్లు సియామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కె. బెనర్జీ తెలిపారు. వనరులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, స్వచ్ఛ టెక్నాలజీలను వేగవంతంగా వినియోగించుకోవడం తదితర చర్యలతో భారత్ నిర్దేశించుకున్న తటస్థ స్థాయి ఉద్గారాల లక్ష్య సాధనకు తోడ్పడుతున్నట్లు సిమెంటు తయారీ సంస్థల అసోసియేషన్ సీఎంఏ తెలిపింది. -
‘జీ’ కొత్త ఇన్నింగ్స్.. నాలుగు స్పోర్ట్స్ ఛానళ్లు ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్బాల్ పాలక సంస్థ ఫిఫాతో ఎనిమిదేళ్ల డీల్ కుదుర్చుకున్న ‘జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’ (జీఈఈఎల్) క్రీడా ప్రసారాల రంగంలోకి ప్రవేశించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘యునైట్8 స్పోర్ట్స్’ పేరిట క్రీడా ఛానళ్ల పోర్ట్ఫోలియోను ప్రారంభించినట్లు ప్రకటించింది. 2026 ఫిఫా వరల్డ్కప్తో పాటు ఫిఫా టోర్నీలను భారత ప్రేక్షకులకు ప్రసారం చేయనుంది.దేశవ్యాప్తంగా 500కుపైగా కేబుల్, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫారమ్లలో యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డీ ఛానళ్లు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ నెట్వర్క్లో ఫుట్బాల్తో పాటు క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడల ప్రసారాలు ఉంటాయి.‘‘డిస్ట్రిబ్యూషన్ భాగస్వాముల సహకారంతో వీక్షకులకు అంతరాయం లేని ప్రసారాలు అందించడమే మా లక్ష్యం. రానున్న ఫిఫా ఈవెంట్లను మా ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులకు మెరుగైన వీక్షణ అనుభూతిని అందిస్తాం’’ అని యునైట్8 స్పోర్ట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ భవేష్ జనావ్లేకర్ తెలిపారు. -
‘ఈ సిటీలో రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నా చాలడం లేదు’
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో జీవన వ్యయం ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి చర్చనీయాంశమైంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి నెలకు రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తమ ఖర్చులను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆర్థిక ప్రణాళికపై సూచనలు ఇవ్వాలని వారు కోరారు.అద్దె, పెట్టుబడులు, ప్రయాణ ఖర్చులే భారమా?రెడ్డిట్లో చేసిన పోస్టు ప్రకారం, ఈ దంపతులు ముంబైలో ఒక 1BHK ఫ్లాట్లో నివసిస్తున్నారు. నెలకు రూ.44 వేల అద్దె చెల్లిస్తున్నారు. కిరాణా సరుకులకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతుండగా, పనిమనిషి జీతం రూ.8 వేలు, విద్యుత్, ప్రయాణ ఖర్చులు కలిపి మరో రూ.10-12 వేల వరకు వెళ్తున్నాయి. వీటితో పాటు ప్రతి నెలా రూ.60 వేల మేర సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెడుతున్నారు.అంతేకాకుండా ఉద్యోగ సంబంధిత సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, సమావేశాల కోసం నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. లెక్కల ప్రకారం ఇంకా సుమారు రూ.60 వేల వరకు మిగలాల్సి ఉన్నప్పటికీ, నెలాఖరుకు ఆ మొత్తం కూడా ఖర్చయిపోతోందని వారు పేర్కొన్నారు.చిన్న చిన్న ఖర్చులే పెద్ద భారంబట్టలు, వాచ్లు, పర్ఫ్యూమ్లు కొనడం వంటి వ్యక్తిగత ఖర్చులతో పాటు స్వగ్రామానికి వెళ్లి వచ్చేందుకు ప్రయాణాలపై కూడా భారీగా ఖర్చవుతోందని దంపతులు తెలిపారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల కోసం బహుమతులు, ఇతర అవసరాలతో కలిపి ఒక్కో ప్రయాణానికే రూ.45 వేల వరకు వెచ్చిస్తున్నామని వివరించారు.భవిష్యత్తులో పిల్లలను కనాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఖర్చు విధానం దీర్ఘకాలంలో నిలకడగా ఉంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.“సిప్ కూడా పొదుపే”.. నెటిజన్ల సలహాలుఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు, నెలకు రూ.60 వేలు సిప్లో పెట్టుబడి పెడుతున్నారు కదా దీన్ని కూడా పొదుపుగా పరిగణించాలని సూచించారు. రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురైతే సిప్ చేసే మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.మరికొందరు అసలు సమస్య ఆదాయం తక్కువగా ఉండటంలో కాదని, ఖర్చుల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆఫీస్ పార్టీల పేరుతో ప్రతి నెలా రూ.12-13 వేల వ్యయం చేయడం, అవసరం లేని కొనుగోళ్లు, తరచూ ఖరీదైన ప్రయాణాలు చేయడం వంటి అంశాలను తగ్గిస్తే పొదుపు పెరుగుతుందని సూచించారు.మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంఇటీవలి సంవత్సరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దెలు, రవాణా, తిండి, సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో మంచి వేతనాలు పొందుతున్న మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల సమతుల్యతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై దంపతుల పోస్ట్ నగర జీవనశైలిపై, ఆదాయం-ఖర్చుల సమతుల్యతపై విస్తృత చర్చకు దారితీసింది. -
ట్రైన్ టికెట్ దొరకట్లేదా.. అసలు కారణం ఇదే!
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు.. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైల్వే టికెట్ల బుకింగ్లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు ఈ సన్నాహాలు చేస్తోంది.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. రైలు టికెట్లు పొందడం ప్రయాణికులకు చాలా కష్టంగా మారింది. టికెట్ బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సీట్లు పూర్తవుతున్నాయని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా బాట్స్, టౌట్స్, నకిలీ ఖాతాలు, మోసపూరిత యూజర్ ఐడీలు అని అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ మూడు కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. అదనంగా మరో ఆరు కోట్ల ఖాతాలను పరిశీలన కోసం గుర్తించింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా.. 4.2 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించిన 501 ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో నమోదు చేసింది. అలాగే నకిలీ డిజిటల్ గుర్తింపులతో సంబంధం ఉన్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను కూడా బ్లాక్ చేసింది. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు టికెట్లు అందుబాటులోకి రావడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.ట్రైన్ టికెట్ తొందరగా బుక్ అవ్వాలంటే?మీ IRCTC ఖాతాలో ముందుగానే లాగిన్ అయి ఉండండి.ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోండి.వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించండి.బుకింగ్ ప్రారంభ సమయానికి 5-10 నిమిషాల ముందే సిద్ధంగా ఉండండి.యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోండి.తత్కాల్ టికెట్ అయితే బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికే ప్రయత్నించండి.ఒకేసారి అనేక బ్రౌజర్ ట్యాబ్లు లేదా పరికరాల్లో ప్రయత్నించవద్దు.తక్కువ రద్దీ ఉన్న ప్రత్యామ్నాయ రైళ్లు, తేదీలను కూడా పరిశీలించండి.బుకింగ్ పూర్తయ్యే వరకు పేజీని రిఫ్రెష్ చేయకుండా జాగ్రత్తగా కొనసాగించండి.ఇదీ చదవండి: డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ -
కోట్లలో లాభాల పంట.. కంపెనీలో లేఆఫ్స్ మంట!
టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ మునుపెన్నడూలేని విధంగా భారీగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ విభాగాల్లో రికార్డు స్థాయి వృద్ధిని, బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేస్తున్నప్పటికీ.. ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తుండటం ఐటీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు 18 శాతం మందిని తొలగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ ఉద్వాసనకు ప్రభావితమైన ఉద్యోగుల అధికారిక పీరియడ్ జూన్ 1 నుంచి జూన్ 15 మధ్య ముగియనుంది.లాభాల బాటలో ఒరాకిల్..వ్యాపార పరంగా ఒరాకిల్ వృద్ధిని కనబరుస్తున్న తరుణంలోనే ఈ లేఆఫ్స్ నిర్ణయం రావడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. ఏడాది ప్రాతిపదికన 22 శాతం వృద్ధి చెంది 17.2 బిలియన్ డాలర్ల లాభం నమోదైంది. క్లౌడ్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 44 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ అప్లికేషన్ల అభివృద్ధికి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐ విభాగం ఏకంగా 243 శాతం, మల్టీక్లౌడ్ డేటాబేస్ ఆదాయం 531 శాతం వృద్ధిని సాధించాయి.ఉద్యోగాలను ఎందుకు తగ్గిస్తోంది?రికార్డు లాభాలు వస్తున్నప్పటికీ ఒరాకిల్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహాత్మక పునర్నిర్మాణ ప్రణాళిక ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ విభాగాల నుంచి వనరులను తగ్గించి, వాటిని పూర్తిగా ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ విస్తరణ వైపు మళ్లించాలని ఒరాకిల్ భావిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 50 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది. ఇందులో అధికంగా ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకే ఖర్చు చేయనున్నారు. ఓపెన్ఏఐ, సాఫ్ట్బ్యాంక్ మద్దతుతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ స్థాయి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ‘స్టార్ గేట్’లో ఒరాకిల్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.సెవెరెన్స్ ప్యాకేజీపై అసంతృప్తిఒకవైపు కంపెనీ భారీ లాభాలను ప్రకటిస్తూ మరోవైపు ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీ ఆఫర్ చేసిన సెవెరెన్స్ (విడదీత) ప్యాకేజీ నిబంధనలపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. అన్వెస్టెడ్ (ఇంకా చేతికి రాని) స్టాక్ అవార్డుల విషయంలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒరాకిల్ అందిస్తున్న సెవెరెన్స్ ప్యాకేజీలో పదవీకాలం ఆధారిత పరిహారాన్ని గరిష్టంగా 26 వారాలకే పరిమితం చేశారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ఏఐ వైపు నిధులు.. జీతాల పెంపునకు బ్రేకులు!
ఐటీ రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకు ఉద్యోగాల కోతకే పరిమితమైన ఏఐ ముప్పు.. ఇప్పుడు నేరుగా ఉద్యోగుల వార్షిక వేతన ప్యాకేజీలు, ఇంక్రిమెంట్లపై పడింది. సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు తమ వ్యాపార శైలిని పూర్తిగా మార్చేస్తున్నాయి. పనులను వేగవంతం చేయడానికి ఏఐపై పెట్టుబడులను భారీగా పెంచుతూ అందుకోసం ఉద్యోగుల జీతాల పెంపునకు బ్రేకులు వేస్తున్నాయి. తాజాగా, గ్లోబల్ క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘టెరాడేటా’ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఏఐ వైపు మళ్లుతున్న నిధులుప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ జర్నల్ ‘బిజినెస్ ఇన్సైడర్’ నివేదిక ప్రకారం.. టెరాడేటా సంస్థ తన ఉద్యోగుల వార్షిక వేతన పెంపును ఈ ఏడాదికి పూర్తిగా నిలిపివేయాలని (ఫ్రీజ్) నిర్ణయించింది. ఈ బడ్జెట్ను నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఈ ఏడాది వార్షిక జీతాల సర్దుబాటు ఉండబోదని కంపెనీ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో స్పష్టం చేశారు.‘మార్కెట్లోకి సరికొత్త ఏఐ ఆవిష్కరణలను తీసుకురావడానికి, ఈ రంగానికి చెందిన నిపుణులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకే ఈ ఏడాది వార్షిక జీతాల బడ్జెట్ను పునసమీక్షించి ఆ నిధులను ఏఐ పెట్టుబడులకు కేటాయిస్తున్నాం’ అని టెరాడేటా సీఈఓ స్టీవ్ మెక్మిలన్ అన్నారు. అయితే, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్లు, ఈక్విటీ షేర్లను మాత్రం యథావిధిగా అందిస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
పెట్రోల్ కన్నా రూ.20 తక్కువ.. ఈ85 ఇంధనం
న్యూఢిల్లీ: ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల కోసం దేశీయంగా ఈ85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియన్ఆయిల్ రిటైల్ ఔట్లెట్లో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దీన్ని ఆవిష్కరించారు.సాధారణ పెట్రోల్తో పోలిస్తే దీని ధర లీటరుకు రూ. 20 మేర తక్కువకే లభిస్తుంది. ప్రాథమికంగా ఇది ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజిన్లున్న వాహనాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించడానికి వీలవుతుంది. తొలుత 48 ప్రభుత్వ రంగ బంకులతో ప్రారంభించి 2026 డిసెంబర్ నాటికి 500 ఔట్లెట్స్లో, 2027 డిసెంబర్ నాటికి 5,000 ఔట్లెట్స్లోను అందుబాటులోకి తెస్తారు.80–85 శాతం ఇథనాల్, 14–19 శాతం పెట్రోల్ ఉండే మిశ్రమ ఇంధనాన్ని ఈ85గా వ్యవహరిస్తారు. ఈ20 నుంచి ఈ100 వరకు ఇథనాల్ మిశ్రమాలపై పని చేసే ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలకు ఇది అనువుగా ఉంటుంది. -
కొత్త ట్రెండ్.. ‘ఇన్సూరెన్స్’ సీఈఓల రాజీనామాలు..
న్యూఢిల్లీ: భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ప్రముఖ బీమా సంస్థల సీఈఓలు తమ పదవులకు రాజీనామా చేసి సొంత వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో సాధారణ బీమా (జనరల్ ఇన్సూరెన్స్) రంగంలో వృద్ధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడం, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. బీమా రంగంలో అపార అనుభవం కలిగిన సీఈఓలకు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థల నుంచి గణనీయమైన నిధుల మద్దతు లభిస్తోంది.ఐఆర్డీఏఐ సంస్కరణలు.. డిజిటల్ జోరు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన పలు సంస్కరణలతో వ్యాపార నిర్వహణ సులభతరమైంది. దీంతో బీమా రంగం ‘ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ’గా మారింది. కొత్త సంస్థల ప్రవేశాన్ని కూడా నియంత్రణ సంస్థ సానుకూలంగా స్వాగతిస్తోంది. మరోవైపు ‘బీమా సుగమ్’ వంటి డిజిటల్ పంపిణీ మౌలిక సదుపాయాలు, యూపీఐ తరహా కస్టమర్ యాక్సెస్ విధానాలు బీమా రంగ వ్యాపార నమూనాలను మౌలికంగా మార్చుతున్నాయి. బీమా రంగంలో అపార అవకాశాలు ఆసియా ఆర్థిక సేవల రంగంలో భారత జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాల్లో ఒకటిగా నిలుస్తోందని అపియరీ కన్సల్టింగ్ మేనేజింగ్ పార్ట్నర్ హరిహరన్ రామకృష్ణన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ బీమా వ్యాప్తి జీడీపీలో సగటున నాలుగు శాతానికి పైగా ఉండగా, భారత్లో అది కేవలం ఒక శాతానికే పరిమితమైందన్నారు. దీంతో దేశీయ మార్కెట్లో భారీ వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.‘‘కేవలం పెట్టుబడులతోనే ఈ మార్కెట్లోని అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకోవడం సాధ్యం కాదని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు గుర్తించాయి. ఈ అవకాశాలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచడానికి అనుభవజ్ఞులైన రంగ నిపుణులు అవసరం. సుదీర్ఘ అనుభవం కలిగిన సీఈఓలు నియంత్రణ సంస్థలతో సంబంధాలు, పంపిణీ వ్యవస్థపై నమ్మకం, రిస్క్ అంచనా సామర్థ్యం వంటి కీలక బలాలను వెంట తెచ్చుకుంటారు. కొత్త సంస్థలు ఇదే స్థాయి విశ్వసనీయతను, నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడానికి సాధారణంగా దశాబ్ద కాలం పడుతుంది’’ అని రామకృష్ణన్ తెలిపారు.స్టార్ హెల్త్ ఒక ఆదర్శం ‘‘యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సీఎండీగా పదవీ విరమణ చేసిన అనంతరం వెంకటసామి జగన్నాథన్ చెన్నైలో చిన్న కార్యాలయం నుంచి ప్రారంభించిన స్టార్ హెల్త్ను రూ.30,000 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. విషయ పరిజ్ఞానం, వ్యాపార దృక్పథం, ఓపికతో కూడిన పెట్టుబడులు కలిస్తే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు అనేందుకు స్టార్ హెల్త్ ఉదంతం నిరూపించింది’’ అని అని రామకృష్ణన్ పేర్కొన్నారు.రాజీనామాలు.. కొత్త సంస్థల ఏర్పాటు బీమా రంగంలో విశేష అనుభవం ఉన్న పలువురు మాజీ సీఈఓలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థల మద్దతుతో కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.నీలేష్ గార్గ్ (కివి జనరల్ ఇన్సూరెన్స్)టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ మాజీ ఎండీ, సీఈఓ నీలేశ్ గార్గ్ అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్తో కలిసి ‘కివీ జనరల్ ఇన్సూరెన్స్’ను స్థాపించారు. ఈ సంస్థలో వెస్ట్బ్రిడ్జ్ 70 శాతం, గార్గ్ 30 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థ ‘ఐఆర్డీఏఐ’ మార్చి 2026లో ఈ సంస్థకు రిజి్రస్టేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసింది.అనుజ్ త్యాగి (హెచ్డీఎఫ్సీ ఎర్గో)కివీ జనరల్ ఇన్సూరెన్స్కు అనుమతి లభించిన మూడు నెలలకే హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనుజ్ త్యాగి తన వ్యాపార లక్ష్యాలను కొనసాగించేందుకు పదవికి రాజీనామా చేశారు.అనూప్ రావు (జెనరాలి సెంట్రల్ ఇన్సూరెన్స్) ఇదే ఏడాది మార్చిలో జెనరాలి సెంట్రల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనూప్ రావు తన ఏడేళ్ల పదవీకాలం అనంతరం వైదొలిగారు. ఆయన కొత్త బీమా సంస్థలో షేర్హోల్డర్ లేదా ఫౌండేషన్ భాగస్వామిగా చేరే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే నెలల్లో మరో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ కూడా వైదొలిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఏఐ మౌలిక సదుపాయాల ‘మహారాజులు’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా ఎన్విడియా వంటి సాఫ్ట్వేర్, సెమీకండక్టర్ దిగ్గజాలే గుర్తుకు వస్తాయి. ఈ రేసులో భారతదేశం నేరుగా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా కనిపించకపోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఏఐ విప్లవానికి వెన్నుముకగా నిలుస్తూ భారత్కు చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తూ 2026 స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీలు మెరుగ్గా రాణిస్తున్నాయి.ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఏఐ మౌలిక సదుపాయాల సరఫరా గొలుసుతో ముడిపడి ఉన్న 28 భారతీయ కంపెనీలు ఈ ఏడాది మార్కెట్లో ఏకంగా 47 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.9 లక్షల కోట్లు) అదనపు విలువను జోడించాయి. వీటి ఉమ్మడి మార్కెట్ విలువ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం పెరగడం గమనార్హం.దలాల్ స్ట్రీట్లో కొత్త ట్రెండ్భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ ధోరణిని ‘ఏఐ కాపెక్స్ ట్రేడ్’ అని పిలుస్తున్నారు. దీనిపై యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) ఆర్.శివకుమార్ మాట్లాడుతూ ‘ఏఐ సాఫ్ట్వేర్ రేసులో భారతదేశం ముందంజలో లేకపోవచ్చు. కానీ గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరుగుతున్న భారీ వ్యయం నుంచి మన కంపెనీలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. పెట్టుబడిదారులు డేటా సెంటర్లు, విస్తృత సరఫరా గొలుసుతో అనుసంధానించిన కంపెనీలపై దృష్టి పెట్టాలి’ అని విశ్లేషించారు.దూసుకుపోతున్న స్వదేశీ కంపెనీలుస్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్: వేదాంత గ్రూప్నకు చెందిన ఈ ఆప్టికల్-ఫైబర్ కంపెనీ షేర్లు 2026లో ఏకంగా 530 శాతానికి పైగా పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది మే నెలలో ఈ కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల (రూ.9,000 కోట్లకు పైగా) మల్టీ ఇయర్ మెగా ఒప్పందాన్ని దక్కించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్: స్టెర్లైట్ ప్రత్యర్థి అయిన హెచ్ఎఫ్సీఎల్ షేర్లు కూడా ఈ ఏడాది 191 శాతం మేర లాభపడ్డాయి.ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్: ప్రెసిషన్ కూలింగ్, పవర్ కాంపోనెంట్స్ తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఈ ఏడాది ఏకంగా మూడు రెట్లు పెరిగింది.గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అవసరమైన పరికరాలను అందిస్తూ హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఏబీబీ ఇండియా లిమిటెడ్, కమ్మిన్స్ ఇండియా లిమిటెడ్ వంటి పారిశ్రామిక కంపెనీలు కూడా ఈ ర్యాలీలో భారీగా లబ్ధి పొందుతున్నాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు భారతదేశాన్ని ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా మారుస్తున్నాయి. ఇందులో భాగంగా భారీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయి.అమెజాన్: 2030 నాటికి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసం 12.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.ఆల్ఫాబెట్ (గూగుల్): విశాఖపట్నంలోని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ కోసం 15.0 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.రిలయన్స్ జాయింట్ వెంచర్: దేశీయంగా స్థానిక డేటా సెంటర్ల నిర్మాణం కోసం 11.0 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది.అదానీకనెక్స్: గూగుల్, ఉబెర్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.సెల్లర్స్ మార్కెట్గా..‘డేటా సెంటర్లను నిర్మించడానికి, పవర్ సప్లై చేయడానికి, వాటిని చల్లబరచడానికి అవసరమైన పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కొరత ఉంది. కొన్ని విడిభాగాల డెలివరీ కోసం ప్రస్తుతం 2 నుంచి 4 ఏళ్ల వెయింటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఇది తయారీదారులకు ‘సెల్లర్స్ మార్కెట్’గా మారింది. ఇప్పుడు గెలుచుకుంటున్న ఆర్డర్లు 2027-2029 మధ్య కంపెనీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి’ అని నోమురా నివేదికలో విశ్లేషించింది. నోమురా అంచనా ప్రకారం, ప్రస్తుత డేటా-సెంటర్ బూమ్ అనేది గతంలోని గ్లోబల్ 4జీ వైర్లెస్ రోల్అవుట్, 2008 నాటి ఎల్ఎన్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, 2010ల నాటి షేల్ గ్యాస్ బూమ్ కంటే చాలా పెద్దది.రూ.100 లక్షల కోట్ల మార్కెట్.. కానీ..మరో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘ఏంజెల్ వన్’ నివేదిక ప్రకారం డేటా సెంటర్లలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులు 2025-2027 మధ్య 1.2 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.100 లక్షల కోట్లు) దాటనున్నాయి. ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ అవకాశం మాత్రమే కాదని, ఇది దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల పెట్టుబడి చక్రాన్ని సృష్టిస్తోందని ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నట్లు ఏంజెల్ వన్ చెప్పింది. అయితే, ఇదే సమయంలో వాల్యుయేషన్ల పరంగా హెచ్చరికలు కూడా వస్తున్నాయి.ఏఐ అవకాశాల గురించి కేవలం ప్రకటనలు చేసే కంపెనీల కంటే ఇప్పటికే ఏఐ సంబంధిత వ్యాపారం ద్వారా ఆదాయాన్ని చూపిస్తున్న కంపెనీలకే మార్కెట్ ప్రాధాన్యత ఇస్తోంది. కానీ, కొన్ని కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికే విపరీతంగా పెరగడం వల్ల అధిక వాల్యుయేషన్ల ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ధరల వద్ద కంపెనీల ఫలితాల్లో ఎలాంటి చిన్న తప్పు లేదా నిరాశ ఎదురైనా స్టాక్స్ పతనం కావడానికి ఆస్కారం ఉందని గమనించాలి.గమనిక: స్టాక్ మార్కెట్ ద్వారా ఏదైనా కంపెనీలో నేరుగా పెట్టుబడి పెట్టేముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
కారును ట్రైన్లో ఎలా పంపాలంటే..?
ఉద్యోగం, చదువులు లేదా ఇతరత్రా కారణాల వల్ల కొత్త నగరానికి మారాల్సి వచ్చినప్పుడు, చాలామందికి ఎదురయ్యే సమస్య కారును తరలించడం. చిన్న దూరాలకు అయితే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు, కానీ.. వందలు లేదా వేల కిలోమీటర్లు స్వయంగా డ్రైవ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇండియన్ రైల్వే కార్ పార్సిల్ సేవను ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేస్ తమ పార్సిల్ సేవల ద్వారా వాహనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. దీనికోసం వాహన యజమానులు తాము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో.. సమీప రైల్వే స్టేషన్లోని పార్సిల్ కార్యాలయంలో బుక్ చేయాలి. ఆ తరువాత ప్రత్యేక క్యారియర్ బోగీలో కారును లోడ్ చేసి గమ్యస్థానానికి పంపిస్తారు. కారును పంపే వ్యక్తి అదే రైలులో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 1,400 కిలోమీటర్లకు పైబడిన దూరాలకు ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కారును రైలులో పంపించాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు, చిరునామాకు సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలి. అలాగే రైల్వే పార్సిల్ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్ను నింపాలి.బుకింగ్ ప్రక్రియలో మొదట.. వాహన లోడింగ్, అన్లోడింగ్ సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్లను గుర్తించాలి. ఆ తరువాత అవసరమైన పత్రాలతో పార్సిల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. అధికారులు వాహనాన్ని పరిశీలించి, దాని బరువు, పరిమాణం, ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత కారును ప్రత్యేక బోగీలో భద్రంగా తరలిస్తారు.రవాణా ఖర్చులు అనేవి వాహనం రకం, ప్రయాణ దూరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వరకు ఒక చిన్న కారును తరలించడానికి సుమారు రూ.8,000 నుంచి రూ.13,000 వరకు ఖర్చవుతుంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు ఈ ఖర్చు రూ.13,000 నుంచి రూ.19,000 వరకు ఉండవచ్చు. ఖచ్చితమైన ఛార్జీలను సంబంధిత రైల్వే పార్సిల్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు.కారును అప్పగించే ముందు దానిని శుభ్రపరచడం, వివిధ కోణాల్లో ఫోటోలు తీసుకోవడం, వ్యక్తిగత వస్తువులను తొలగించడం, ఇంధన స్థాయిని తక్కువగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనితో పాటు అలారం సిస్టంను కూడా నిలిపివేయడం మంచిదని చెబుతారు. మొత్తం మీద దూర ప్రాంతాలకు కారును తరలించడానికి రైల్వే కార్ పార్సిల్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టమవుతోంది. -
మరోసారి 300 మందికి ఉచిత వీసాలు
మోర్తాడ్(బాల్కొండ): యూఏఈలో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకోసం యూఏఈకి చెందిన ఏడీఎన్హెచ్, మన దేశానికి చెందిన జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ మేళా నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈనెల 12న సిరిసిల్ల, జగిత్యాల, 13న నిజామాబాద్, ఆర్మూర్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. ఎంపికైన వారికి ఉచితంగా వీసాలు ఇచ్చి, విమాన చార్జీలను సైతం కంపెనీయే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు రూ.24 వేల వేతనం చెల్లిస్తూ.. నివాసం, భోజన సదుపాయాన్ని ఏడీఎన్హెచ్ కంపెనీ సమకూర్చనుంది. వివరాల కోసం సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999 నంబర్లలో సంప్రదించాలి.ఈ సందర్భంగా జీటీఎం సంస్థ చైర్మన్ సతీష్రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉచితంగా వీసాలు జారీ చేసే అవకాశం తమ సంస్థకు రావడం ఎంతో విశేషం అన్నారు. వలస వెళ్లేవారిపై నయాపైసా భారం లేకుండా అన్ని వసతులు ఉచితంగా సమకూర్చడం తమ ప్రత్యేకత అని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రూ.6,000 కోట్ల డీల్: ఐనాక్స్ క్లీన్ చేతికి వేనా ఎనర్జీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ తాజాగా వేనా ఎనర్జీ ఇండియా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వా రా 6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను సొంతం చేసుకోనుంది. సంబంధిత వర్గాల అంచనా ప్రకారం ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లుకాగా.. వేనా ప్రస్తుతం 1.2 గిగావాట్ల నిర్వహణలోని ఇంధన ఆస్తులతోపాటు.. త్వరలో ప్రారంభంకానున్న చివరి దశ అభివృద్ధిలోని 1.8 గిగావాట్ల ప్రాజెక్టులను కలిగి ఉంది.వీటికి జతగా మరో 3 గిగావాట్ల అభివృద్ధి దశ ప్రాజెక్టులు సైతం ఉన్నట్లు ఐనాక్స్ క్లీన్ వెల్లడించింది. అంతేకాకుండా విద్యుత్ కొనుగోలుకి సోలార్ ఎస్ఈసీఐ, గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ తదితర వా ణిజ్య, పారిశ్రామిక క్లయింట్లుసహా.. ప్రభుత్వ రంగ పంపిణీ సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉంది. -
ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ హెచ్చరిక
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్ రూట్(వీఆర్ఆర్) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఒక ఫైలింగ్లో అధికారికంగా వెల్లడించింది.అసలేం జరిగింది?సెక్యూరిటీ కస్టోడియన్ (Securities Custodian)గా వ్యవహరిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్పీఐ)కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చినట్లు సెబీ గుర్తించింది. వీఆర్ఆర్ ప్రోగ్రామ్ కింద దేశీయ బాండ్లలో పెట్టుబడి పెట్టిన సదరు విదేశీ ఇన్వెస్టర్, లాక్-ఇన్ పీరియడ్ పూర్తి కాకముందే తన నిధులను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ అనుమతించింది.సెబీ అభ్యంతరంనిబంధనల ప్రకారం గడువు ముగియకుండా నిధులను వెనక్కి పంపడం ఆర్బీఐ, సెబీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తూ సెబీ జూన్ 1న బ్యాంకుకు హెచ్చరిక లేఖ పంపింది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపరిమితిలోగా ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలోనూ బ్యాంక్ విఫలమైంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం వల్లే ఈ సమాచారాన్ని సకాలంలో సమర్పించలేకపోయామని బ్యాంక్ అంగీకరించింది.వీఆర్ఆర్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?భారతీయ ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచేలా ప్రోత్సహించడానికి ఆర్బీఐ 2019లో ఈ స్వచ్ఛంద నిలుపుదల మార్గాన్ని (వీఆర్ఆర్) ప్రవేశపెట్టింది. సాధారణ ఎఫ్పీఐ పెట్టుబడులపై ఉండే కఠినమైన నియంత్రణ అవసరాల నుంచి విదేశీ ఇన్వెస్టర్లకు ఈ మార్గం ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. అయితే, ఇందుకు ప్రతిగా సదరు విదేశీ ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల్లో ఒక కనీస శాతాన్ని నిర్ణీత కాలం పాటు దేశంలోనే ఉంచేందుకు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండాలి. కాగా, ఇటీవలే (ఫిబ్రవరిలో) కేంద్ర బ్యాంక్ ఈ ఎఫ్పీఐ పెట్టుబడుల కోసం వీఆర్ఆర్ను జనరల్ రూట్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఐసీఐసీఐ బ్యాంక్ వివరణసెబీ తీసుకున్న ఈ నియంత్రణ చర్యపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఈ హెచ్చరిక లేఖ కేవలం ఒక నిర్దిష్ట సమ్మతి లోపానికి సంబంధించినది మాత్రమేనని తెలిపింది. ‘ఈ చర్య వల్ల బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉండదు. బ్యాంకు దైనందిన కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అంతర్గత నియంత్రణలను మరింత బలోపేతం చేస్తాం’ అని చెప్పింది. బ్యాంకు మొత్తం పనితీరుపై గానీ, భద్రతపై గానీ దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని మేనేజ్మెంట్ ఇన్వెస్టర్లకు, ఖాతాదారులకు భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం! -
మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!
భారతీయులకు బంగారం కేవలం ఒక లోహం కాదు... అదొక సెంటిమెంట్, సంస్కృతి, సంపద. అయితే, ఇళ్లల్లో, దేవాలయాల ట్రస్టుల్లో నిరుపయోగంగా పడి ఉన్న పసిడిని కేవలం ఆస్తిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఆర్థిక వనరుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కంటే దేశీయంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు.ప్రస్తుతం భారతదేశంలోని గృహాలు, ఆలయ ట్రస్టుల వద్ద సుమారు 30,000 టన్నులకు పైగా నిరుపయోగ బంగారం ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో గోల్డ్ రీసైక్లింగ్ అనేది రూపాయి విలువను స్థిరపరచడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, దాగి ఉన్న సంపదను వెలికితీయడానికి ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుతోంది.గోల్డ్ రీసైక్లింగ్ ఎందుకు కీలకం?మన దేశ ఆర్థిక, పర్యావరణ రక్షణలో గోల్డ్ రీసైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ప్రయోజనాలు ఇవే..ఆర్థిక స్థిరత్వం: ఏటా పసిడి దిగుమతుల కోసం భారతదేశం బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. రీసైక్లింగ్ పెరిగితే ఈ దిగుమతుల భారం తగ్గి దేశ కరెంట్ ఖాతా లోటు అదుపులోకి వస్తుంది. ఫలితంగా రూపాయి మరింత బలపడుతుంది.పర్యావరణ బాధ్యత: కొత్తగా గనుల నుంచి బంగారాన్ని వెలికితీయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదే పాత బంగారాన్ని రీసైకిల్ చేయడం వల్ల భూగర్భ వనరుల తవ్వకాలు తగ్గి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.ఆర్థిక సమగ్రత: కష్టకాలంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను సులభంగా, పారదర్శకంగా నగదుగా మార్చుకునేందుకు ఇది దోహదపడుతుంది.వ్యవస్థీకృత రంగం వైపు..గతంలో పాత బంగారాన్ని విక్రయించాలంటే అన్-ఆర్గనైజ్డ్ (అవ్యవస్థీకృత) రంగంపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అక్కడ మోసాలు, తక్కువ ధరకు వస్తుందనే సాకుతో చాలా సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా జూన్ 2026 నాటికి అందుతున్న నివేదికల ప్రకారం.. ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ సంస్థల వివరాలు కింది విధంగా ఉన్నాయి.ముత్తూట్ గోల్డ్ పాయింట్: ముత్తూట్ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ‘ముత్తూట్ గోల్డ్ పాయింట్’ దేశంలోనే మొట్టమొదటి జాతీయ స్థాయి వ్యవస్థీకృత గోల్డ్ రీసైక్లింగ్ నెట్వర్క్గా అవతరించింది. ఇక్కడ అత్యాధునిక ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ సాంకేతికతతో బంగారం స్వచ్ఛతను పారదర్శకంగా గుర్తిస్తారు. కస్టమర్లకు గరిష్ట విలువను కట్టి తక్షణమే నగదు లేదా బ్యాంక్ బదిలీ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. సేకరించిన బంగారాన్ని 995 స్వచ్ఛత కలిగిన బిస్కెట్లుగా మార్చి దేశీయ జ్యువెలరీ తయారీ రంగానికి అందిస్తారు. తద్వారా దేశీయ సరఫరా గొలుసు బలోపేతమవుతోంది.ఒనిక్స్ మెటల్స్: అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విలువైన లోహాల పునరుత్పత్తిలో ‘ఒనిక్స్ మెటల్స్’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పారిశ్రామిక రీసైక్లింగ్, ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) రికవరీ రంగాల్లో పని చేస్తూ.. స్థిరమైన పర్యావరణ వృద్ధికి, సర్క్యులర్ ఎకానమీ విధానాలకు ఈ సంస్థ పెద్దపీట వేస్తోంది.స్కై గోల్డ్ అండ్ డైమండ్స్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ స్కై గోల్డ్ అండ్ డైమండ్స్.. వ్యవస్థీకృత రీసైక్లింగ్కు మద్దతిస్తూ పాత లేదా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా రీసైకిల్ చేయడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. యువత సంప్రదాయ ధోరణులను పక్కనబెట్టి, ఇంట్లో ఊరికే పడి ఉండే లేదా వారసత్వంగా వచ్చిన అదనపు బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఈ రీసైక్లింగ్ అనేది ఎక్కువగా వివాహాలు, ఆర్థిక అవసరాలు లేదా మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు మాత్రమే జరుగుతోందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్! -
ఉద్యోగుల పొట్టకొడుతున్న ఏఐ!
వ్యాపార రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగవంతమైన మార్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ టెరాడేటా (Teradata) కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 5,100 మంది ఉద్యోగులకు 2026 సంవత్సరంలో వార్షిక జీతాల పెంపు ఉండబోదని యాజమాన్యం ప్రకటించింది.టెరాడేటా సంస్థ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన మెమోలో, 2026 సంవత్సరానికి కంపెనీ ప్రధాన లక్ష్యం.. ఏఐ రంగంలో విజయాన్ని సాధించడం అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం, ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెట్టడం అవసరమని వివరించారు. ఈ పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు వార్షిక జీతాల పెంపు కోసం కేటాయించిన బడ్జెట్ను ఏఐ అభివృద్ధికి మళ్లిస్తున్నట్లు తెలిపారు.సాధారణంగా.. కంపెనీలో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2 నుంచి 4 శాతం వరకు జీతాల పెంపు ఉండేది. అయితే ఈసారి ఆ పెంపులను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ ఉద్యోగుల కోసం అన్ని రకాల ప్రయోజనాలను రద్దు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది. పర్ఫామెన్స్ బేస్డ్ బోనస్లు, షేర్ల రూపంలో ఇచ్చే ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపింది.టెరాడేటా మాత్రమే కాకుండా.. మరో టెక్ కంపెనీ టీటీఈసీ కూడా అమెరికాలోని ఉద్యోగుల రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్ ప్రయోజనాలను 2026 వరకు నిలిపివేసింది. ఆ నిధులను ఏఐ టూల్స్, ఉద్యోగుల శిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపులుపై ప్రభావం చూపిన ఏఐ, ఇప్పుడు జీతాలపైనా కూడా ప్రభావం చూపుతోంది. -
టాప్లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల సీఈఓల వేతనాల విషయంలో FY26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు మొత్తం రూ. 82.6 కోట్ల పారితోషికం లభించింది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలలో ఇది అత్యధిక వేతనం కావడం విశేషం.కాగా విప్రో సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీనివాస్ పల్లియా' పారితోషికం తగ్గినప్పటికీ రెండవ స్థానంలో నిలిచారు. బుధవారం విడుదల చేసిన విప్రో వార్షిక నివేదిక ప్రకారం, FY26లో పల్లియా పరిహారం రూ. 49.6 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది రూ. 53.6 కోట్ల కన్నా 7.4% తక్కువ.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ కే. కృతివాసన్ ఈ సంవత్సరంలో రూ. 28 కోట్లు అందుకున్నారు. ఇప్పటివరకు తమ పరిహార వివరాలను వెల్లడించిన దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల అధిపతులలో ఆయన అత్యల్ప వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. అయితే హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన FY26 యాన్యువల్ రిపోర్టును ఇంకా విడుదల చేయలేదు.ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ వేతనంలో ప్రధాన భాగం షేర్ల ఆధారిత ప్రోత్సాహకాల నుంచే వచ్చింది. ఆయనకు రూ. 50.75 కోట్ల విలువైన రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs), రూ. 23.35 కోట్ల స్టాక్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించాయి.విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. FY26లో శ్రీనివాస్ పల్లియా జీతం, ఇతర అలవెన్సులు రూ. 14.6 కోట్ల నుంచి రూ. 15.5 కోట్లకు పెరిగినప్పటికీ, వేరియబుల్ పే రూ. 14.5 కోట్ల నుంచి రూ. 9.9 కోట్లకు తగ్గడంతో మొత్తం వేతనం కొంత తగ్గింది. అదనంగా.. ఇతర విభాగాల కింద రూ. 23.3 కోట్లు, డిఫర్డ్ కాంపెన్సేషన్ బెనిఫిట్స్ రూపంలో సుమారు రూ. కోటి పొందారు.విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్జీ వేతనం కూడా గణనీయంగా తగ్గింది. FY25లో రూ. 13.8 కోట్లుగా ఉన్న ఆయన పారితోషికం FY26లో రూ. 7.3 కోట్లకు పడిపోయింది. అలాగే వేరియబుల్ పే రూ. 7 కోట్ల నుంచి రూ. 2.2 కోట్లకు తగ్గింది.విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. శ్రీనివాస్ పల్లియా, రిషాద్ ప్రేమ్జీ ఇద్దరికీ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరిగిన సమీకృత నికర లాభంపై 0.35 శాతం కమిషన్ పొందే హక్కు ఉంది. ఇది సంస్థ పనితీరు మెరుగుపడితే వారికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే.. -
వెల్త్ మేనేజ్మెంట్లోకి ‘గోద్రెజ్’ ఎంట్రీ.. రూ.లక్ష కోట్లు టార్గెట్!
ముంబై: వినియోగ వస్తువులు, రసాయనాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు వెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ’గోద్రెజ్ వెల్త్’ పేరుతో కొత్త వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. కంపెనీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ కాపిటల్తో కలిసి ఈ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఆర్థిక సేవలు అందిస్తుంది.గోద్రెజ్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణానికి (ఏయూఎం) సంబంధించి 30 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 ఆఖరు నాటికి రూ. 38,000 కోట్లను టార్గెట్గా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ మనీష్ షా తెలిపారు. వచ్చే అయిదేళ్లలో దీన్ని రూ. 1,00,000 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రెజ్ ఫైనాన్స్ విభాగాల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న గోద్రెజ్ క్యాపిటల్ ఏయూఎం గత ఆర్థిక సంవత్సరం రూ. 28,000 కోట్లుగా నమోదైంది. వెల్త్ బిజినెస్ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా షా ఈ విషయాలు తెలిపారు.ముందుగా ఎనిమిది కీలక నగరాలతో ప్రారంభించి వచ్చే మూడేళ్లలో ఈ వ్యాపారాన్ని 35 ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రూ. 2 కోట్లకు పైబడి అసెట్స్ కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ఇది సరీ్వసులు అందిస్తుంది. ఇక గోద్రెజ్ క్యాపిటల్ ప్రస్తుతం 100కు పైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది 200 పైచిలుకు ప్రాంతాలకు విస్తరించనున్నట్లు షా వివరించారు. అలాగే సప్లై చెయిన్ ఫైనాన్స్, గోల్డ్ లోన్స్ సహా మూడు కొత్త వ్యాపార విభాగాలు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. -
సర్వీసుల రంగం @ 6 నెలల గరిష్టం
న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం గత నెల(మే)లో ఆరు నెలల గరిష్టానికి చేరింది. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త క్లయింట్లను పొందడం, కొత్త బిజినెస్ల వినియోగంలో పురోగతి ఇందుకు సహకరించాయి. వెరసి బుధవారం విడుదలైన నెలవారీ సర్వేలో హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.8కు బలపడింది. ఏప్రిల్లో ఇది 58.8గా నమోదుకాగా.. గత నవంబర్ తదుపరి మే నెలలో సర్వీసులు బలంగా పుంజుకున్నాయి.పీఎంఐగా పిలిచే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50ను దాటితే సర్వీసుల రంగం విస్తరించినట్లు లెక్క. 50కు దిగువన నమోదైతే క్షీణతను చవిచూస్తున్నట్లు తెలియజేస్తుంది. ప్రధానంగా రవాణా, డిజిటల్ సొల్యూషన్లు, ఈకామర్స్, ఎంటర్టైన్మెంట్, ఐటీ విభాగాలలో సర్వీసులకు పెరిగిన డిమాండ్ కొత్త బిజినెస్ల వృద్ధికి దోహదపడింది. దీంతో కంపెనీలలో యాక్టివిటీ పుంజుకోవడంతోపాటు.. ఉపాధి కల్పనకు బూస్ట్ లభించింది. -
ఎల్పీజీ సిలిండర్లు.. ఎన్ని రంగులో..
ఇళ్లలో ఉపయోగించే ఎరుపు రంగు ఎల్పీజీ సిలిండర్ అందరికీ తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులోనే కాకుండా పలు ఇతర రంగుల్లోనూ కనిపిస్తాయి. ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. సిలిండర్లో ఏ రకం గ్యాస్ ఉందో, అది ఎక్కడ ఉపయోగించాలో గుర్తించేందుకు ఈ రంగు కోడింగ్ను ఉపయోగిస్తారు.ఎరుపు రంగు సిలిండర్భారతదేశంలో ఇళ్లలో వంట కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్లు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎల్పీజీ దహనశీల పదార్థం కావడంతో ప్రమాద హెచ్చరికకు సంకేతంగా ఈ రంగును ఉపయోగిస్తారు. ఇండేన్, భారత్గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి సంస్థలు సరఫరా చేసే సిలిండర్లు ఈ కోవలోకే వస్తాయి.నీలం రంగు సిలిండర్కొన్ని పరిశ్రమలు, వర్క్షాప్లు, తయారీ యూనిట్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లకు నీలం రంగు కనిపిస్తుంది. భారీ స్థాయిలో తాపన, ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాలకు వీటిని వినియోగిస్తారు.పసుపు రంగు సిలిండర్హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. వీటి ధరలు, సరఫరా నిబంధనలు గృహ సిలిండర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.నలుపు రంగు సిలిండర్నలుపు రంగు సిలిండర్లలో ఎక్కువగా ప్రొపేన్ గ్యాస్ నిల్వ చేస్తారు. పరిశ్రమలు, హీటింగ్ వ్యవస్థలు, కొన్ని ప్రత్యేక యంత్రాల్లో ఈ గ్యాస్ను ఉపయోగిస్తారు. చల్లని ప్రాంతాల్లో కూడా ప్రొపేన్కు మంచి డిమాండ్ ఉంటుంది.తెలుపు రంగు సిలిండర్ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాల్లో ఉపయోగించే ఆక్సిజన్ వంటి వైద్య వాయువులు లేదా ప్రత్యేక గ్యాస్ మిశ్రమాల కోసం తెలుపు రంగు సిలిండర్లను ఉపయోగిస్తారు. వీటిపై కఠిన భద్రతా ప్రమాణాలు అమలులో ఉంటాయి.ఆకుపచ్చ రంగు సిలిండర్కొన్ని దేశాలు లేదా సంస్థలు పర్యావరణహిత గ్యాస్లు, ప్రత్యేక వినియోగ గ్యాస్ల కోసం ఆకుపచ్చ రంగు సిలిండర్లను ఉపయోగిస్తాయి. అయితే ఈ రంగు అర్థం ప్రాంతానికీ, సరఫరాదారునికీ అనుగుణంగా మారవచ్చు.రంగుల కంటే లేబుల్ ముఖ్యంగ్యాస్ సిలిండర్ల రంగులు గుర్తింపునకు ఉపయోగపడినా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకూడదు. సిలిండర్పై ఉన్న లేబుల్, గ్యాస్ పేరు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే రంగు ప్రమాణాలు దేశానికీ, సంస్థకీ అనుగుణంగా మారే అవకాశం ఉంటుంది. -
‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’
డబ్బు గురించి ఆందోళన చెందకూడదంటే ఒక మనిషికి ఎంత సంపాదన కావాలి? ఏడు అంకెల జీతం, చేతిలో లగ్జరీ కారు, మెట్రో సిటీలో సొంత ఇల్లు ఉంటే ఆర్థిక భద్రత దొరికినట్లేనా? అసలు విజయానికి కొలమానం ఏమిటి?.. నేటి డిజిటల్ యుగంలో చాలా మంది ప్రొఫెషనల్స్ మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే స్టార్టప్ విజయాలు, విలాసవంతమైన లైఫ్ స్టైల్స్ మధ్య.. సమాజం దృష్టిలో సక్సెస్ అయిన వారు సైతం లోలోపల ఒక రకమైన అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ వెనుక ఉన్న అసలు విషయాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.‘ఎవర్ హోప్ ఆంకాలజీ’ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సన్నీ గార్గ్ ఇటీవల పంచుకున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆయనను కలిసిన 34 ఏళ్ల గుర్గావ్ యువకుడి కథ ఇది. పోస్ట్లోని వివరాల ప్రకారం.. ఆ యువకుడి వార్షిక ఆదాయం రూ.40 లక్షలు. బీఎండబ్ల్యూ కారు, గుర్గావ్లో సొంత 2 బీహెచ్కే అపార్ట్మెంట్ ఉంది. కానీ, ఆ యువకుడు పంచుకున్న కొన్ని విషయాలు షాక్కు గురిచేసేలా ఉన్నాయి. ‘డాక్టర్, నేను చాలా పేదవాడిని అనిపిస్తోంది. రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టడం లేదు’ అన్నాడు. సదరు యువకుడు భారతదేశంలో అత్యధిక ఆదాయం పొందే మొదటి 1% జనాభాలో ఉన్నాడు. అయినా అతను ఎందుకు కుంగిపోతున్నాడనే దానికి డాక్టర్ గార్గ్ విశ్లేషణ నేటి సమాజానికి అద్దం పడుతోంది. ‘ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల పరిస్థితి ఇదే. ఆ యువకుడి రిఫరెన్స్ పాయింట్ మారింది. ఒకప్పుడు అతను తన గ్రామంలోని పొరుగువారితో పోల్చుకునేవాడు. కానీ ఇప్పుడు అతను తనను తాను లింక్డ్ఇన్లో రూ.80 కోట్లకు స్టార్టప్ను విక్రయించిన 28 ఏళ్ల కుర్రాడితో పోల్చుకుంటున్నాడు. ఆదాయం పెరిగింది, కానీ అంచనాలు పది రెట్లు పెరిగాయి. దీనిపేరే మాడ్రన్ పావర్టీ’ అన్నారు.మూడు ప్రశ్నలుఆ యువకుడి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి డాక్టర్ గార్గ్ అడిగిన మూడు ప్రశ్నలు, దానికి వచ్చిన సమాధానాలు అసలు సమస్యను వెల్లడించాయి.1. గత ఏడాదిలో ఒక్కసారైనా ‘నాకు ఇది చాలు’ అని అనుకున్నావా?సమాధానం: ఎప్పుడూ లేదు2. ఎవరి కోసం ఇంత డబ్బు సంపాదిస్తున్నావు?సమాధానం: నాకు తెలియదు. చుట్టూ ఉన్నవాళ్లు పరిగెడుతున్నారు, నేను పరిగెడుతున్నాను.3. నీ జీవితంలో డబ్బు కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేసిన పని ఏదైనా ఉందా? సమాధానం: కొద్దిసేపు ఆగి.. ‘ఏదీ లేదు’.డబ్బు ప్రతి పనికి కొలమానంగా మారినప్పుడు మనిషి యంత్రంగా మారిపోతాడని డాక్టర్ గార్గ్ హెచ్చరించారు. రూ.40 లక్షలు సంపాదించినా, రూ.4 కోట్లు సంపాదించినా ప్రతి ఆరు నెలలకోసారి ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడం సులభం. కానీ అంతర్గత గుర్తింపు సమస్యలను పరిష్కరించడం కష్టమని, 90% మంది ఈ రెండింటికీ తేడా తెలియక గందరగోళ పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.విజయాన్ని ఎల్లప్పుడూ మనకంటే పైన ఉన్నవారితోనే కొలిస్తే.. ఆ విజయానికి ఎప్పటికీ ముగింపు రేఖ ఉండదు. రేసు గుర్రంలా పరిగెత్తడం ఆపి ఎక్కడ ఫుల్స్టాప్ పెట్టాలో తెలుసుకున్నప్పుడే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ, ప్రశాంతత లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో వాటా విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల ఆపరేటర్ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో జీక్యూజీ పార్ట్నర్స్ 1.8 శాతం వాటాను ఫిడిలిటీ ఇంటర్నేషనల్కి ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. వీటి విలువ రూ. 1,906 కోట్లు.ఎన్ఎస్ఈలో బ్లాక్ డీల్ డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ సగటున ఒక్కో షేరుకి రూ. 97.75 రేటు చొప్పున 19.50 కోట్ల షేర్లను విక్రయించింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫిడిలిటీ ఇంటర్నేషనల్ స్మాల్ క్యాప్ ఫండ్ వీటిని కొనుగోలు చేసింది. జీఎంఆర్ గత ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల్లోకి మళ్లిన సంగతి తెలిసిందే. -
రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు
సాక్షి, ముంబై: భారతదేశంలోని అతిపెద్ద లిస్టెడ్ సంస్థలలో ఒకటి, ప్రముఖ బంగారు శుద్ధి మరియు ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ (Rajesh Exports) భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 15.15 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆరోపించింది. ఈ మేరకు జూన్ 3న జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వులో సెబీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ , దాని ప్రమోటర్-చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఐదు ఆర్థిక సంవత్సరాల పాటు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని రెగ్యులేటర్ వెల్లడించింది. ఈ ఆదేశాలు దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు సృష్టించాయి. దీని షేర్ బాగా పడిపోయింది. చివరికి కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్లోకి జారుకుంది.బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, ప్రపంచ బంగారు దిగ్గజంగా పేరు సంపాదించింది. ఆర్థిక సంవత్సరం FY21 నుంచి FY25 మధ్య కాలంలో, కంపెనీ తన విదేశీ అనుబంధ సంస్థల (ముఖ్యంగా స్విట్జర్లాండ్కు చెందినవాల్కంబి SA) ద్వారా రూ. 15.15 లక్షల కోట్ల మేర (కన్సాలిడేటెడ్ రెవెన్యూలో దాదాపు 99.8 శాతం) తప్పుడు ఆదాయాన్ని చూపించిందని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.దర్యాప్తు అధికారులు కోరిన అనేక కీలక పత్రాలను కంపెనీ అందించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటర్కు కస్టమర్ రికార్డులు, వెండర్ వివరాలు, ముఖ్యమైన అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సమర్పించలేదనీ, పొంతన లేని ఆదాయ వ్యవయాల వివరాలు, దర్యాప్తునకు సహకరించకపోవడం లాంటి వాటిని రెగ్యులేటర్ ఎత్తి చూపింది. ఈ ఆదాయ ఆరోపణలతోపాటు ఆఫ్రికాలో ఉన్న బంగారు గనుల ఆస్తులలో రూ. 1,035 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వచ్చిన నివేదికను కూడా సెబీ ప్రశ్నించింది.ఎల్ఐసీకీ తప్పని ముప్పురాజేష్ ఎక్స్పోర్ట్స్లో సుమారు 10.8% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అతిపెద్ద వాటాదారులలో ఒకటి. తాజా స్కాం కారణంగా వాటాదారుల సంపదలో రూ. 12,726 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని సెబీ అంచనా వేసింది. ఈ ప్రభావం ప్రమోటర్లు, నియంత్రణ సంస్థలకే పరిమితం కాలేదు. పరోక్షంగా సంబంధం ఉన్న లక్షలాది మంది సాధారణ పెట్టుబడిదారులను కూడా ప్రభావితం చేయనుంది.ఇప్పటికే కెనరా బ్యాంక్ పోరాటంమరోవైపు రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏకకాలంలో రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 509 కోట్ల రుణాల చెల్లింపులో విఫలం కావడంతో కెనరా బ్యాంక్ ఈ కంపెనీకి ఉన్న తన రుణాన్ని ఒత్తిడికి గురైన ఆస్తిగా (స్ట్రెస్డ్ అసెట్) వర్గీకరించింది. ఫలితంగా, ఈ రుణదాత వేలం ప్రక్రియ ద్వారా ఒత్తిడికి గురైన ఈ రుణాన్ని విక్రయించేందుకు చర్యలు ప్రారంభించింది. బ్యాంకింగ్ సమస్య సెక్యూరిటీస్ మార్కెట్ విచారణకు భిన్నమైందే అయి నప్పటికీ, ఈ రెండూ కలిసి కంపెనీకి రెండు వైపుల సంక్షోభాన్ని సృష్టించాయి. సెబీ ఉత్తర్వు మధ్యంతరమైనదని గమనించడం ముఖ్యం. నియంత్రణ సంస్థ తన తుది తీర్పును ఇంకా వెలువరించలేదు.రాజేష్ ఎక్స్పోర్ట్స్ , రాజేష్ మెహతాలకు తమ వాదన వినిపించుకునేందుకు, ఆరోపణలపై ప్రతిస్పందించేందుకు అవకాశం ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున తుది ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు.ఒకవేళ ఇది రుజువైతే, భారతదేశ కార్పొరేట్ రంగంలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద స్కాంలలో ఒకటిగా నిలుస్తుంది. భారతదేశ కార్పొరేట్ పాలనా వ్యవస్థకు ఈ కేసు గుణపాఠంగా నిలవవచ్చు. పెట్టుబడిదారులకు ఇదొక తీవ్ర హెచ్చరిక. కంపెనీ ఎంత పెద్దదైనా, ఎంత గౌరవనీయమైనదైనా సరే, రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి మూలధనంలో గణనీయమైన భాగాన్ని ఒకే కంపెనీ స్టాక్లో కేంద్రీకరించే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్ డిస్క్లోజర్లు, రెడ్ ఫ్లాగ్లను పర్యవేక్షించాలి అంటున్నారు నిపుణులు.ఇదీ చదవండి: ఆస్తికోసం వ్యాపారవేత్త కుటుంబం దారుణ హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన -
రాజకీయాల్లో డబ్బు విరాళాలపై సామ్ కామెంట్
సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు అమెరికా మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 యూఎస్ ఎన్నికల్లో(మధ్యంతర) తాను ఎలాంటి రాజకీయ విరాళాలు ఇచ్చే ప్రణాళికలు లేవని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆల్ట్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాధారణంగా రాజకీయాల నుంచి డబ్బు దూరం కావాలని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే చాలా మంచిది’ అని పేర్కొన్నారు.తాను స్వయంగా రాజకీయ విరాళాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఏఐ పరిశ్రమపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ప్రచారాలకు డబ్బు పెట్టే ఇతర టెక్ దిగ్గజాల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘మా పోటీదారులందరి కంటే మమ్మల్ని వేరే ప్రమాణాలతో కొలవడం సరికాదు. వారు మమ్మల్ని తొక్కేయడానికి డబ్బును ఆయుధంగా వాడుతుంటే మేము కూడా తిరిగి పోరాడగలగాలి. అయితే, బోర్డు అంతటా నిబంధనలు అందరికీ ఒకేలా ఉండడానికి నేను ఇష్టపడతాను’ అని ఆల్ట్మన్ వ్యాఖ్యానించారు.సూపర్ పీఏసీల హోరాహోరీకృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం, అనుకూల చట్టాల కోసం సిలికాన్ వ్యాలీలో పొలిటికల్ యాక్షన్ కమిటీల (పీఏసీ) యుద్ధం నడుస్తోంది.లీడింగ్ ది ఫ్యూచర్: ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మన్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్’ సహ వ్యవస్థాపకుల మద్దతుతో నడుస్తున్న సూపర్ పీఏసీ ఇది. ఏఐ స్నేహపూర్వక అభ్యర్థులను గెలిపించడం, డేటా సెంటర్ల నిర్మాణంపై రాష్ట్రాల ఆంక్షలను ఎదుర్కోవడం దీని ముఖ్య ఉద్దేశం.పబ్లిక్ ఫస్ట్ యాక్షన్: ఓపెన్ఏఐ ప్రధాన పోటీదారు ‘ఆంత్రోపిక్ పీబీసీ’ ఈ సూపర్ పీఏసీకి ఏకంగా 20 మిలియన్ డాలర్ల నిధులు ఇచ్చింది. ఇది కఠినమైన ఏఐ భద్రతా నిబంధనల కోసం వాదిస్తుంది.ఓపెన్ఏఐ వివరణ: లీడింగ్ ది ఫ్యూచర్ పీఏసీకి గ్రెగ్ బ్రోక్మన్, ఆయన భార్య అన్నా నుంచి 25 మిలియన్ డాలర్ల విరాళాలు అందినప్పటికీ ఆ సంస్థతో తమకు ఎలాంటి అధికారిక అనుబంధం లేదని ఓపెన్ఏఐ బ్లాగ్ పోస్ట్లో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ఐఆర్సీటీసీ.. మూడు కోట్ల అకౌంట్లు క్లోజ్!
రైల్వే ప్రయాణికులకు మరింత పారదర్శకమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మెగా ఆపరేషన్కు తెరలేపింది. ఒకవైపు కన్ఫర్మ్డ్ టిక్కెట్ల కోసం సామాన్య ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న టికెటింగ్ మాఫియాకు చెక్ పెడుతూ, మరోవైపు రైళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను నిలిపివేయడంతో పాటు రైల్వే వంటశాలల్లో నాణ్యతను పర్యవేక్షించడానికి ఏఐ కెమెరాలను తీసుకొచ్చింది.టికెట్ దందాపై చర్యలుసాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకకుండా బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ముఠాలు, దళారీల ఆట కట్టించేందుకు ఐఆర్సీటీసీ డిజిటల్ నిఘాను తీవ్రం చేసింది. ఇందులో భాగంగా తీసుకున్న కీలక చర్యలు చేపట్టింది.డిజిటల్ గుర్తింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3 కోట్లకు పైగా అనుమానాస్పద వినియోగదారుల ఖాతాలను ఐఆర్సీటీసీ బ్లాక్ చేసింది.వీటితో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో ఆరు కోట్ల ఐడీల ప్రామాణికతను తనిఖీ చేయడానికి వాటిని కఠినమైన ధ్రువీకరణ పరిధిలో ఉంచింది.గత ఏడాది కాలంలో అక్రమ బుకింగులకు కారణమవుతున్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు.నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించి 501 అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి.800 కిచెన్లలో ఏఐ కెమెరాలురైలు ప్రయాణంలో లభించే భోజనంపై తరచూ వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా బేస్ కిచెన్లలో (వంటశాలలు) పరిశుభ్రత, కార్యాచరణ లోపాలను రియల్ టైమ్లో పర్యవేక్షించేందుకు 2,394 ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలను మోహరించింది.తొమ్మిది రకాల ఉల్లంఘనలను పట్టేసే టెక్నాలజీఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ వంటశాలల్లో జరిగే 9 రకాల ప్రధాన ఉల్లంఘనలను ఇట్టే పసిగడుతుంది. వంట చేసేవారు తలకు క్యాప్ పెట్టుకోకపోవడం, చేతి తొడుగులు (గ్లౌజెస్) ధరించకపోవడం, వంటగదిని సరిగ్గా తుడవకపోవడం వంటి లోపాలతో పాటు వంటశాలల్లో ఎలుకలు, ఈగలు, బొద్దింకల కదలికలను కూడా ఈ కెమెరాలు క్షణాల్లో గుర్తిస్తాయి.టూ-అవర్స్ డెడ్లైన్.. వార్ రూమ్ పర్యవేక్షణఈ సాంకేతికత ఎంతటి చిన్న వస్తువునైనా, లోపాన్నైనా సులభంగా గుర్తించగలదని ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘వంటశాలల్లో పరిశుభ్రత లోపిస్తే ఏఐ కెమెరాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) హెచ్చరికలను జారీ చేస్తాయి. ఈ అలర్ట్ నేరుగా సంబంధిత కిచెన్ మేనేజర్కు వెళ్తుంది. ఐఆర్సీటీసీ ప్రత్యేక వార్ రూమ్ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలర్ట్ వచ్చిన రెండు గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వార్ రూమ్ పర్యవేక్షణ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం వంటశాలల్లో హెడ్ క్యాప్లు ధరించకపోవడం అనేదే అత్యంత ప్రాథమిక, ప్రధాన ఉల్లంఘనగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ప్రయోగం నుంచి వినియోగం వైపు
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ కృత్రిమ మేథ (ఏఐ) ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా పరీక్షించే దశ నుంచి క్రమంగా విస్తృతంగా వినియోగించే దశ వైపు మళ్లుతున్నాయి. సంస్థాగతంగా కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐ ఏజెంట్లను అనుసంధానం చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దేశీ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వినియోగాన్ని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. తద్వారా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న దిగ్గజాల సరసన చేరాయి. భారత్లో గణనీయంగా సిబ్బంది ఉన్న యాక్సెంచర్ కూడా వేల కొద్దీ ఉద్యోగులకు కోపైలట్ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ చేపట్టింది.‘రోజువారీ ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహించేందుకు, తెలివిగా నిర్ణయాలను తీసుకోవడంలోను తోడ్పడేందుకు మేము 1,00,000 మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ని అందుబాటులోకి తెచ్చాం‘ అని టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్ తెలిపారు. సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని భారీగా వినియోగించడం ద్వారా అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఏఐని తాము రోజువారీ పనుల్లో అనుసంధానిస్తున్నామని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్ణయాలను పక్కాగా అమలుచేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలాంటి అంశాలకు ఏఐ ఉపయోగపడుతుందని విప్రో సీఈవో శ్రీని పల్లియా తెలిపారు. కలిసి పని చేసే హైబ్రిడ్ విధానం.. ఏఐ కార్యకలాపాలను కేవలం స్టాండెలోన్ సాధనాలుగా కాకుండా మనుషులు, ఏజెంట్లు కలిసి పని చేసే విధానంగా తీర్చిదిద్దుకోవడంపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్కి చెందిన వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ 2026 ప్రకారం ఈ తరహా ఏఐ వినియోగం .. ప్రాథమిక ఆటోమేషన్ పరిధిని దాటి విశ్లేషణ, సమస్యల పరిష్కారంలాంటి పనులను సులభతరం చేస్తోంది. కంపెనీవ్యాప్తంగా ఏఐని ఉపయోగించడం వల్ల దేశీ ఐటీ దిగ్గజాలకు భారీగా ఆదా అవుతోంది. ప్రతి మూడు నెలలకు 2,50,000 ఫుల్ టైమ్ పనిదినాల సమయం ఆదా అవుతోందని విప్రో తెలిపారు. అలాగే తమ సిబ్బంది 29,000 పైగా కస్టమ్ ఏఐ ఏజెంట్లను రూపొందించినట్లు వివరించారు. ఇక టీసీఎస్ విషయానికొస్తే.. నిర్దిష్ట పని పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 35 శాతం మేర తగ్గింది. దేశీ ఐటీ పరిశ్రమ పరిమాణం దాదాపు 300 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.ఏఐ డీప్ఫేక్లతో వ్యాపారానికి రిస్కువిప్రో వెల్లడిఏఐ వినియోగం వేగవంతం కావడమనేది రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని ఐటీ దిగ్గజం విప్రో హెచ్చరించింది. లోపభూయిష్టమైన అల్గోరిథంలు, పక్షపాత ధోరణులు, మారిపోతున్న నిబంధనలు, డీప్ఫేక్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటి రీత్యా తమ వ్యాపారానికి లీగల్గా, ఆర్థికంగా, పేరు ప్రతిష్టలపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని 2025–26 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్లకు అందించే సేవల్లోనూ, అంతర్గతంగా కార్యకలాపాల్లోను జనరేటివ్, అటానామస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ ఈ సాంకేతికత విషయంలో అనిశ్చితి నెలకొందని వివరించింది. పరిమిత స్థాయి మానవ జోక్యంతో ఏఐ సిస్టమ్లు పని చేయడం వల్ల అనుకోని ఫలితాలు వచ్చే రిసు్కలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వీసుల్లో లోపాల వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం లాంటి రిస్కులు ఉండొచ్చని విప్రో తెలిపింది. కొన్ని సర్వీసులకు డిమాండ్ తగ్గుతుంది ఏఐ ఆటోమేషన్ పెరగడం, సామర్థ్యాలు మెరుగుపడటం, క్లయింట్ టూల్స్ని వినియోగించడం లాంటి అంశాల వల్ల నిర్దిష్ట కోర్ సర్వీసులకు డిమాండ్ తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా ధరలు, లాభాల మార్జిన్లు, సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. అలాగే ఏఐ వినియోగంతో లీగల్, నియంత్రణ సంస్థ నిబంధనల అమలుపరంగా కూడా సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. ఒకవేళ ఏఐ ఎనబుల్డ్ సొల్యూషన్స్ వల్ల క్లయింట్లకు, వారి కస్టమర్లకు లేదా థర్డ్ పారీ్టలకు హాని జరిగితే తమ సంస్థ లిటిగేషన్లు, నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొనాల్సి రావొచ్చని విప్రో తెలిపింది. విప్రో ఐటీ సర్వీసుల్లో 62 శాతం ఆదాయం అమెరికన్ దేశాల నుంచి, 27 శాతం యూరప్ దేశాల నుంచి ఉంటోంది. అయితే, పశ్చిమాసియా, దక్షిణాసియాలో ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినొచ్చని, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడిళ్లు పెరగొచ్చని, వ్యాపారాలపై విశ్వసనీయత తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాలను తగ్గించుకోవడానికి లేదా జాప్యం చేయడానికి దారి తీయొచ్చని వివరించింది. ఇక దేశీయంగా పెరుగుతున్న వేతన వ్యయాల కారణంగా అమెరికా, యూరప్లోని టెక్ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలకు పోటీపడే సామ ర్థ్యాలు తగ్గొచ్చని తెలిపింది. -
అరబిందో ఫార్మా థెరానిమ్ బయోలాజిక్స్ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్డీ ప్రధాన కస్టమర్గా చేరింది.ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్డీ సీనియర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్ కాంట్రాక్ట్ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్ చికిత్సల డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
అవి సాధారణ లాభాలే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) లాభాలు సాధారణ స్థాయికి తిరిగొచ్చాయే తప్ప పశ్చిమాసియా సంక్షోభం నుంచి అవేమీ భారీగా లబ్ధి పొందలేదని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2025–26లో మూడు ఓఎంసీలు కలిసి రూ. 77,821 కోట్ల లాభాలను ప్రకటించాయి. ఇది 2024–25తో పోలిస్తే ఏకంగా 130 శాతం అధికం. దీనితో ఆయిల్ కంపెనీలు పశ్చిమాసియా సంక్షోభం సాకుతో రేట్లను పెంచేసి అనూహ్య లాభాలను ఆర్జించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు ఓఎంసీలైన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) నిపుణుల విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది.వాస్తవానికి 2024–25లో వంట గ్యాస్ రేట్లు పెరగకుండా రేట్లను అదే స్థాయిలో కొనసాగించడం వల్ల ఓఎంసీలు రూ. 40,434 కోట్ల ఆదాయ నష్టాన్ని భరించాయి. ఫలితంగా 2024–25లో లాభాలు రూ. 33,602 కోట్లకు పరిమితమయ్యాయి. 2025–26లో లాభాలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో అవి భారీగా అండర్ రికవరీలను నమోదు చేయడం వల్ల, దానితో పోల్చి చూడటం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు 2023–24లో నమోదైన రూ. 80,986 కోట్ల స్థాయికి దరిదాపుల్లో ఉన్నాయని, ఈ స్థాయి ప్రాఫిట్స్ సాధారణమే తప్ప ఆకస్మిక లాభాలు కావని తెలిపారు.ఆ మాత్రం మార్జిన్లుండాలి.. కంపెనీల ఆదాయాల స్థాయిని వాటి పరిమాణాన్ని బట్టి మదింపు చేయాలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మూడు ఏఎంసీల వార్షికాదాయం రూ. 20 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థ ఆదాయామే ఏటా రూ. 10 లక్షల కోట్లు ఉంటుంది. భారీ కమోడిటీ రిఫైనింగ్ సంస్థల నిర్వహణ మార్జిన్లు 1–3 శాతం ఉండటం సాధారణమేనని నిపుణులు తెలిపారు. మూలధన పెట్టుబడులను కొనసాగించడానికి, రిఫైనరీలను అప్గ్రేడ్ చేసుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ మాత్రం నిధులు కావాల్సి ఉంటుందని వివరించారు. కేవలం ఒక రిఫైనరీని విస్తరించాలన్నా రూ. 50,000–60,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.2030 నాటికి రిఫైనింగ్ సామర్థ్యాలను వార్షికంగా 310 మిలియన్ టన్నులకు మించి పెంచుకోవాలని పరిశ్రమ నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 2025–26లో ఆదాయాలకు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధం లేదని కంపెనీలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి సంక్షోభం తలెత్తడానికి 50–60 రోజుల ముందు కొన్న ముడిచమురును తాము శుద్ధి చేసినట్లు వివరించాయి. కాబట్టి పశ్చిమాసియా సంక్షోభంపరంగా క్రూడాయిల్ రేట్లు, రవాణా వ్యయాలు, ఇన్సూరెన్స్ సర్చార్జీల పెరుగుదల మొదలైనవన్నీ 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయాల్లోనే కనిపించవచ్చంటున్నాయి. ఈ గణాంకాలు ఆగస్టులో వెల్లడవుతాయి.ప్రపంచంలో అయిదో వంతు ముడిచమురు హార్మూజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. అక్కడ ఉద్రిక్తతల వల్ల ఆసియావ్యాప్తంగా ఆయిల్ ధరలు, షిప్పింగ్ వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. ఫిబ్రవరిలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ రేట్లు 8–9 శాతం పెరిగాయి. అయితే పలు పొరుగు దేశాల్లో నమోదైన 20–67 శాతం వరకు పెంపుతో పోలిస్తే ఇది తక్కువేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. పైగా 2026 మార్చి 27 నుంచి పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపాయి.దీనితో 2021 నుంచి చూస్తే పెట్రోల్పై రూ. 23, డీజిల్పై రూ. 26 మేర సుంకాలను తగ్గించినట్లయిందని పేర్కొన్నాయి. ఇక ఓఎంసీల లాభాల్లో దాదాపు సగం వాటా డివిడెండ్లు, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందని.. హైవేలు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టుల్లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగతా మొత్తాన్ని ఇంధన భద్రత కోసం, రిఫైనింగ్ సామర్థ్యాల పెంపు కోసం పెట్టుబడులకి వినియోగమవుతున్నాయని వివరించాయి. -
అదానీ గ్రూప్ ఇబిటా రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం, డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో రికార్డ్ నిర్వహణ లాభం(ఇబిటా) సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,834 కోట్లు(10 బిలియన్ డాలర్లు) ఆర్జించింది. ఇదేసమయంలో రూ. 1.53 లక్షల కోట్ల(16.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి వ్యయాలు చేపట్టింది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా అత్యధిక పెట్టుబడులు వెచ్చించిన దేశీ కార్పొరేట్ గ్రూప్గా నిలిచింది.దీంతో గ్రూప్ పోర్ట్ఫోలియో స్థూల ఆస్తుల విలువ రూ. 7.85 లక్షల కోట్ల(82.8 బిలియన్ డాలర్లు)కు చేరింది. పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం ఎనర్జీ, యుటిలిటీస్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ బిజినెస్ తదితర కీలక మౌలిక సదుపాయాలపై వెచ్చించింది. అదానీ గ్రూప్ విడుదల చేసిన వివరాల ప్రకారం కన్సాలిడేటెడ్ ఇబిటా వార్షికంగా 5.6 శాతం బలపడింది. -
ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్టాక్ ఫౌండర్
చైనా టెక్ దిగ్గజం బైట్డాన్స్ (ByteDance) సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (Zhang Yiming) సంపద మరోసారి భారీగా పెరిగింది. ఫలితంగా ఆయన భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని (Mukesh Ambani)ను వెనక్కి నెట్టి ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం జాంగ్ యిమింగ్ నికర సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన చైనాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. 2019లో బ్లూమ్బర్గ్ ఆయన సంపదను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు అది కేవలం 13 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం.ఈ వృద్ధికి ప్రధాన కారణం టిక్టాక్ ప్రపంచవ్యాప్త విజయంతో పాటు బైట్డాన్స్ అభివృద్ధి చేసిన డౌబావో (Doubao) ఏఐ చాట్బాట్కు చైనాలో లభిస్తున్న ఆదరణ. డౌబావోకు ఇప్పటికే 300 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో బైట్డాన్స్ దూకుడుగా పెట్టుబడులు పెడుతుండటం కూడా కంపెనీ విలువను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా నెలకొన్న నియంత్రణ అనిశ్చితి కూడా ఇటీవల కొంతవరకు తగ్గింది. బైట్డాన్స్ తన అమెరికా వ్యాపారంలోని భాగాలను అమెరికన్ పెట్టుబడిదారులకు బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్ను బ్లూమ్బర్గ్ తగ్గించింది. దీంతో సంస్థ విలువపై మరింత సానుకూల అంచనాలు వెలువడ్డాయి.ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు బ్లాక్రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టి.రోవీ ప్రైజ్, జనరల్ అట్లాంటిక్, తదితర సంస్థల తాజా విలువల అంచనాల ఆధారంగా జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు సమాచారం.అగ్రస్థానంలో గౌతమ్ అదానీఇక భారతీయ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలో మూడో స్థానానికి దిగజారగా, గౌతమ్ అదానీ (Gautam Adani) 117.4 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఏఐతో కొత్త శకానికి బైట్డాన్స్సోషల్ మీడియా కంపెనీగా ప్రారంభమైన బైట్డాన్స్ ఇప్పుడు ఏఐ రంగంలోనూ భారీ ఆశయాలతో ముందుకు సాగుతోంది. 2026లో ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, మోడల్ అభివృద్ధిపై భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. టిక్టాక్ విజయాన్ని ఏఐ వ్యాపారంలోనూ పునరావృతం చేయగలిగితే, జాంగ్ యిమింగ్ సంపద మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కెనరా బ్యాంక్కు కొత్త బాస్.. బ్రజేష్ కుమార్ సింగ్
బెంగుళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు కెనరా నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బ్రజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం మే 30న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బ్రజేష్ కుమార్ సింగ్ 2029 ఏప్రిల్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.మాజీ ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు పదవీ విరమణ అనంతరం స్థానంలో నియమితులయ్యారు. బ్రజేష్ కుమార్ సింగ్కు బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కెనరా బ్యాంక్లో చేరకముందు ఇండియన్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో వ్యవసాయ విద్యను అభ్యసించారు.ఫైనాన్స్లో ఎంబీఏ పట్టా పొందారు. బ్రజేష్ కుమార్ సింగ్ నాయకత్వంలో కెనరా బ్యాంక్ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేయనుంది. ఆర్థిక చేరిక విస్తరణ, ఆస్తుల నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వినియోగదారుల సేవలను మెరుగుపరుస్తూ, షేర్ హోల్డర్లకు స్థిరమైన విలువను సృష్టించడమే లక్ష్యమని బ్యాంక్ తెలిపింది. -
ఒక్కో ట్రిప్పుపై రూ.300-రూ.400 భారం
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా ఉంది. ఇంధన ఖర్చులు భారంగా మారడంతో పుణె-ముంబై మార్గంలో నడిచే క్యాబ్ ఆపరేటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. ఈ సవరించిన రేట్లు నిత్యం ప్రయాణించే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.రూ.300 - రూ.400 అదనం!గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల భారాన్ని క్యాబ్ డ్రైవర్లు, ఆపరేటర్లు భరిస్తూ వచ్చారు. అయితే, మే నెలలో ధరలు పదేపదే పెరగడంతో ఇక లాభాలు రాకపోగా చేతి డబ్బులు పోయే పరిస్థితి రావడంతో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు డ్రైవర్లు చెప్పారు. వాహనం రకాన్ని బట్టి ఛార్జీల పెంపుదల మారుతుందని, అయితే సగటున పుణె-ముంబై వన్-వే ప్రయాణానికి ఇప్పుడు రూ.300 నుంచి రూ.400 వరకు అదనంగా ఖర్చు అవుతుందని పుణెకు చెందిన క్యాబ్ ఆపరేటర్ జ్ఞానేశ్వర్ షెల్కే తెలిపారు. టోల్ ఛార్జీలు మినహాయించి కిలోమీటరుకు వసూలు చేసే బేస్ రేటు రూ.19 నుంచి రూ.20కి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.చేతులెత్తేసిన ఆపరేటర్లు..పుణె-ముంబై రూట్లో నిత్యం ప్రయాణించే విశాల్ జాదవ్ అనే క్యాబ్ డ్రైవర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘నా వద్దకు వచ్చే ప్రయాణికుల్లో 80 శాతం మంది అంతర్జాతీయ విమానాల కోసం ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్లేవారే. మే నెలలోనే వరుసగా మూడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఆ కార్యాచరణ ఖర్చులను మేం భరించలేకే ఈ భారాన్ని ప్రయాణికులపై వేయాల్సి వచ్చింది. పాత కస్టమర్లు పరిస్థితిని అర్థం చేసుకుంటున్నప్పటికీ కొత్త ప్రయాణికులు మాత్రం పెరిగిన రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు’ అన్నారు.ఈ పెరిగిన ధరల వల్ల క్యాబ్ ప్రయాణం మధ్యతరగతికి భారంగా మారుతోంది. ధరల పట్ల అత్యంత సున్నితంగా ఉండే కొత్త కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. క్యాబ్ ఛార్జీలు బడ్జెట్ దాటిపోతుండటంతో చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు లగ్జరీ బస్సులు లేదా రైలు ప్రయాణాలను ఎంచుకుంటున్నారని ఆపరేటర్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంపై మహీంద్రా కన్ను
ఏరోస్పేస్ రంగంలో భారతీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దూసుకుపోతున్నట్లు చెప్పింది. విమానాల తయారీలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న సరఫరా-గొలుసు (సప్లై-చైన్) లోపాలను అధిగమించడానికి, గ్లోబల్ ఏరోస్పేస్ మార్కెట్లో వ్యూహాత్మక కొనుగోళ్లు జరపడంపై కంపెనీ దృష్టి సారించింది. ఈ విషయాన్ని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా అధికారికంగా వెల్లడించారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా విమాన డెలివరీలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సప్లై-చైన్ నెట్వర్క్లో తలెత్తుతున్న అంతరాయాలేనని కంపెనీ చెప్పింది. ఈ అడ్డంకులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాల్సిందిగా గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎం) మహీంద్రా గ్రూప్ను సంప్రదించారని అనీష్ షా స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన కంపెనీ ఆదాయాల వెల్లడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం గ్లోబల్ ఓఈఎంలు కేవలం ఆర్డర్ల కోసమే కాకుండా మా సామర్థ్యాన్ని నమ్మి వస్తున్నాయి. మేము అత్యుత్తమ నాణ్యతను అందిస్తామని, మా ఉత్పాదక పరిధిని మరింత విస్తరించమని కోరుతున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు సరఫరా పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’ అన్నారు. పరిశ్రమ వర్గాల విశ్లేషణల ప్రకారం.. అనీష్ షా పేర్కొన్న ఆ గ్లోబల్ ఓఈఎం.. అంతర్జాతీయ విమాన తయారీ దిగ్గజం ఎయిర్బస్ అనేలా అంచనాలున్నాయి. గత కొద్దికాలంగా మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్తో ఎయిర్బస్ తన వ్యాపారం భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
డీమెర్జర్ వేళ, వేదాంతకు ఎదురు దెబ్బ : ఈడీ దాడులు
ప్రముఖ వ్యాపార సంస్థ వేదాంతకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాకిచ్చింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత (Vedanta) గ్రూప్ ప్రాంగణాల్లో జూన్ 2న సోదాలు నిర్వహిస్తోంది. రాయల్టీ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేదాంత గ్రూప్ తన ప్రస్తుత వ్యాపారాన్ని ఐదు విభిన్న విభాగాలుగా విభజించే (డీమెర్జర్) ప్రక్రియలో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకొంది. అనిల్ అగర్వాల్ సుప్రీం కోర్టులో అదానీని సవాలు చేసిన ఒక నెల తర్వాత, ఈడీ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూప్పై దాడులు నిర్వహించడం గమనార్హం. వేదాంత తన మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్కు చెల్లించిన రాయల్టీ చెల్లింపుపై జరుగుతున్న దర్యాప్తులో భాగమే ఈ దాడులు. ముంబై, ఢిల్లీలలోని వేదాంత కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వేదాంత లిమిటెడ్ తన మాతృ సంస్థ అయిన 'వేదాంత రిసోర్సెస్' (Vedanta Resources) కు చేసిన రాయల్టీ చెల్లింపులపై వస్తున్న ఆరోపణల విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ సోమవారం ప్రారంభమై ఇప్పుడు ముగిసిందని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. దర్యాప్తు అధికారులు ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, రికార్డులను సేకరించారు. ఫెమా కింద ఉన్న విదేశీ మారకపు నిబంధనలకు అవి అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఉదయం 11:45 గంటల సమయంలో వేదాంత షేరు ధర 0.7 శాతం క్షీణించి రూ. 334.6 వద్ద ట్రేడ్ అయింది.వేదాంత స్పందనఈడీ దాడులపై వేదాంత స్పందించింది. అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, చట్టపరిధిలో అన్ని నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది ప్రస్తుతం ఈ వ్యవహారం నియంత్రణ సంస్థల (Regulatory Process) పరిశీలనలో ఉన్నందున, ఇంతకుమించి వ్యాఖ్యానించలేమని వేదాంత ప్రతినిధి ఒకరు తెలిపారు.వేదాంత vs అదానీమరోవైపు భారతదేశపు ఏకైక ఫార్ములా వన్ సర్క్యూట్తో సహా పలు ఆస్తులను కలిగి ఉన్న దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL) కోసం గౌతమ్ అదానీ గ్రూప్ వేసిన విజేత బిడ్ను, మైనింగ్ బిలియనీర్ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ సవాలు చేయగా, కంపెనీ లా అప్పీల్స్ కోర్టు (మే 4, 2026న) తిరస్కరించింది. వేదాంత లేవనెత్తిన అంశాలలో యోగ్యత లేదని భావించిన జాతీయ కంపెనీ చట్ట అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT), దాని రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఇలా సవాల్ చేసింనందుకే ఈడీ దాడుల అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా బ్రిటన్కు చెందిన 'వేదాంత రిసోర్సెస్' దీనికి మాతృ సంస్థ (Parent Company). ఈ విదేశీ మాతృ సంస్థ భారీగా అప్పుల్లో మునిగిపోయింది. నివేదికల ప్రకారం.. వేదాంత రిసోర్సెస్ మొత్తం అప్పు రూ. 74,000 కోట్లుగా ఉంది. ఇందుకోసమే భారతీయ అనుబంధ సంస్థ (Vedanta Ltd) తన మాతృ సంస్థకు భారీగా రాయల్టీలు చెల్లిస్తూ వస్తోంది. వేదాంత లిమిటెడ్ అనేది భారతదేశంలో లిస్ట్ అయిన కంపెనీ, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.3 లక్షల కోట్లుగా ఉంది.మే నెలలో ఈ కంపెనీ వ్యాపార విభజనకు సంబంధించి వివిధ నియంత్రణ సంస్థల నుండి అనుమతులు పొందింది. దీని ప్రకారం, కొత్తగా నాలుగు సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ ప్రధాన సంస్థ అలాగే కొనసాగుతుంది. ఇందులో హిందుస్థాన్ జింక్, జింక్ ఇంటర్నేషనల్, కాపర్, ఫెర్రో క్రోమ్ మరియు కొత్త టెక్నాలజీ వ్యాపారాలు ఉంటాయి. అల్యూమినియం కార్యకలాపాలు, పవర్ ప్లాంట్లు మరియు బాల్కో (BALCO) లో 51 శాతం వాటాను ఇది నిర్వహిస్తుంది.వేదాంత పవర్ (Vedanta Power) తల్వాండి సాబో ప్లాంట్తో సహా థర్మల్ పవర్ ఆస్తులను పర్యవేక్షిస్తుంది. వేదాంత ఆయిల్ & గ్యాస్ (Vedanta Oil & Gas): కేయిర్న్ ఆయిల్ & గ్యాస్ (Cairn Oil & Gas) బాధ్యతలను ఇది పర్యవేక్షిస్తుంది. వేదాంత స్టీల్ & ఫెర్రస్ (Vedanta Steel & Ferrous): ఇనుప ఖనిజం గనులు మరియు ఈఎస్ఎల్ (ESL) స్టీల్ ప్లాంట్ను ఇది నిర్వహిస్తుంది. -
సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే..
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సాంప్రదాయ ఐటీ రంగ ఉనికినే ప్రశ్నిస్తోందన్న ఆందోళనలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని కౌంటర్ ఇచ్చారు. ‘కోడింగ్ ఆటోమేటెడ్ అయితే ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎందుకు?’ అంటూ మార్కెట్లో వ్యక్తమవుతున్న అస్తిత్వ ప్రశ్నలకు ఆయన వ్యూహాత్మక సమాధానమిచ్చారు. ఏఐ అనేది ఐటీ సేవల ప్రాధాన్యతను తగ్గించబోదని, పైగా నైపుణ్యాల డిమాండ్ను మరింత పెంచిందని ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక సమర్పణ సందర్భంగా వాటాదారులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఆందోళనల మధ్యే అద్భుత వృద్ధిగత ఏడాది కాలంగా ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు అధునాతన ఏఐ సాధనాలను మార్కెట్లోకి తీసుకురావడంతో ఐటీ కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ భయాల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 28% పైగా క్షీణించాయి. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇన్ఫోసిస్ బలమైన ఆర్థిక ఫలితాలను సాధించినట్లు చెప్పారు.వార్షిక ఆదాయం: మునుపటి ఏడాదితో పోలిస్తే 4.6% వద్ధితో 20.16 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.65 లక్షల కోట్లు) వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది.ఉద్యోగుల సంఖ్య: కంపెనీ ఉద్యోగుల సంఖ్య మునుపటి కంటే 5,016 పెరిగి మొత్తం 3,28,594 కు చేరుకుంది.మునుపటికంటే బలంగా..‘జనరేటివ్ ఏఐ (GenAI) రంగ ప్రవేశం చేసి మూడేళ్లు పూర్తయింది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గతంలో కంటే మరింత సందర్భోచితంగా, పటిష్టంగా మారిందని చెప్పగలం. మన ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఏఐ అనేది మునుపెన్నడూ లేనంత పెద్ద సాంకేతికగా కనిపిస్తుంది. కాబట్టి సందేహాలు రావడం సహజం. కోడింగ్ ఆటోమేటిక్ అయితే, ఇక మన అవసరం ఏముంది? అనే ప్రశ్న మా ముందూ నిలిచింది. కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది’ అన్నారు.ఐటీ అంటే అంతకంటే ఎక్కువే!ఏఐ కేవలం కోడింగ్ను ఆటోమేట్ చేయగలదని, అయితే ఒక పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ సరిపోదని నీలేకని స్పష్టం చేశారు. వేగవంతమైన ఏఐ డిమాండ్కు అనుగుణంగా ఐటీ రంగంలో కింది అంశాలు అత్యంత కీలకంగా మారాయని చెప్పారు.1. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ (ఎస్డీఎల్సీ) పరీక్షలు: క్లిష్టమైన సిస్టమ్స్ను నిరంతరం పర్యవేక్షించడం.2. సాఫ్ట్వేర్ వ్యవస్థలు వైఫల్యం చెందకుండా నిరోధించడం.3. సైబర్ సెక్యూరిటీ: ఏఐ యుగంలో పెరిగిపోతున్న సైబర్ ముప్పుల నుంచి రక్షణ కల్పించడం.4. ఐటీ ఆధునీకరణ: పాత సాఫ్ట్వేర్ వ్యవస్థలను సరికొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్చడం.కొత్త వ్యాపార నమూనా వైపు అడుగులుభవిష్యత్తు ఐటీ రంగాన్ని శాసించడానికి పాత పద్ధతులు సరిపోవని, సరికొత్త వ్యాపార నమూనా అవసరమని నీలేకని పిలుపునిచ్చారు. ‘మేము ఈ సరికొత్త సవాలుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. మా శ్రామిక శక్తిని ఈ కొత్త యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతాం. ఏఐ ఆటోమేషన్, ఉత్పాదకత ద్వారా ఆదా అయ్యే మానవ వనరులను కొత్త యూజర్లను ఆకర్షించడానికి, సరికొత్త సేవలను విస్తరించడానికి తిరిగి వినియోగిస్తాం’ అని నందన్ నీలేకని వాటాదారులకు హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
‘సర్ జీతం రాలేదు.. ఇన్సెంటివ్ ఎప్పుడు’
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో యజమాని-ఉద్యోగి మధ్య బంధం కేవలం ‘నెలవారీ జీతం-పని’ అనే లావాదేవీకే పరిమితమా? లేక సంస్థ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు ఉద్యోగులు కూడా నైతిక బాధ్యత వహించాలా?- ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ వేదికగా జరుగుతున్న ఒక ఆసక్తికర చర్చ ఈ ప్రశ్నలను రేకిత్తించింది. ఒక సంస్థలో వారం రోజుల జీతం ఆలస్యం కావడం, దానికి ప్రతిస్పందనగా ఒక కంపెనీ వ్యవస్థాపకురాలు చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది. గీతికా కౌశిక్ అనే బిజినెస్ లీడర్ పంచుకున్న అభిప్రాయాలు, దానికి నెటిజన్ల స్పందన కింద చూద్దాం.లక్ష్యాలు విఫలమైతే బాధ్యత ఎవరిది?సంస్థల్లో వ్యాపార లక్ష్యాలు (బిజినెస్ టార్గెట్లు) నీరుగారినప్పుడు, జీతాలు ఆలస్యమైనప్పుడు వ్యవస్థాపకులు ఎదుర్కొనే మానసిక, ఆర్థిక ఒత్తిడిని గీతికా కౌశిక్ తన పోస్ట్లో ప్రస్తావించారు. ఇటీవల ఒక సంఘటనను ఉదహరిస్తూ.. కేవలం ఏడు రోజులు జీతం ఆలస్యమవడానికే ఉద్యోగులు తమ భద్రతను ప్రశ్నించారని ఆమె పేర్కొన్నారు. ‘ఉద్యోగులు ముందుకు వచ్చి.. మాకు ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు. జీతాలు ఆలస్యమైతే కుటుంబం, ఈఎంఐల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించడం నిజమే. వారి వైపు ఉన్న బాధ్యతలు, ఇబ్బందుల్లో నిజముంది. కానీ, నాణేనికి మరోవైపు ఉన్న మేనేజ్మెంట్ ఆవేదనను కూడా చూడాలి కదా?’ అని ఆమె ప్రశ్నించారు.అత్యంత కీలకమైన పీక్ సీజన్లో 30 మందికి పైగా బృందాన్ని నడిపించే ఒక సీనియర్ మేనేజర్ కేవలం 20 శాతం టార్గెట్ను మాత్రమే రీచ్ అయ్యారని ఆమె ఎత్తి చూపారు. 70 శాతానికి పైగా బిజినెస్ లక్ష్యాలను చేరడంలో విఫలమై కూడా బాధ్యతను పక్కనబెట్టి కేవలం ‘సర్, జీతం రాలేదు?’, ‘సర్, ఇన్సెంటివ్స్ ఎప్పుడు?’ అని అడగడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు.గౌరవంతో సంపాదించండివ్యాపారాన్ని నిలబెట్టడానికి, ఉద్యోగుల కుటుంబాలు సకాలంలో ఈఎంఐలు కట్టుకోవడానికి వ్యవస్థాపకులు తెరవెనుక ఎన్నో త్యాగాలు, ఆర్థిక ఇబ్బందులను భరిస్తుంటారని కౌశిక్ పేర్కొన్నారు. ‘రేపు ఆఫీస్కు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఉద్యోగానికి, చేసే పనికి మోసం చేయకండి. ఏదో అలవాటుగా ఆఫీస్కు వెళ్లి రావడం కాదు.. మీ పని ద్వారా గౌరవప్రదంగా జీతాన్ని సంపాదించుకోండి’ అంటూ ఆమె తన పోస్ట్ను ముగించారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్పై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రీ-పోస్టులు చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల పక్షాన నిలిచిన పలువురు నెటిజన్లు యజమానుల ధోరణిని తప్పుబట్టారు. ‘మీరు ఒక వ్యవస్థాపకుడిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడే.. అనిశ్చితి, ఒత్తిడి, నిద్రలేని రాత్రులు, ఆర్థిక నష్టాల రిస్క్ను మీరే ఎంచుకున్నారు. కానీ ఉద్యోగి అలా కాదు. సంస్థ ఎలాంటి స్థితిలో ఉన్నా సమయానికి జీతం ఇవ్వడం యజమాని కనీస బాధ్యత’ అని ఒక వినియోగదారుడు స్పష్టం చేశారు. ‘ఉపాధి అనేది ఒక ఒప్పందం, భాగస్వామ్యం కాదు. వచ్చే నెలలో కంపెనీ 500% లాభాల్లోకి దూసుకెళ్తే.. ఉద్యోగుల జీతాలు కూడా 500% పెరగవు కదా? అలాంటప్పుడు నష్టాలు లేదా టార్గెట్స్ రీచ్ అవ్వనప్పుడు ఉద్యోగులపై భారం వేయడం తగదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
రూ.72 లక్షల జాబ్ ఆఫర్.. అందుకే రిజెక్ట్ చేసాడు!
భారీ జీతమా?, వర్క్-లైఫ్ బ్యాలెన్సా?, అనే విషయపై చాలారోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి రూ.72 లక్షల వేతనంతో కూడిన జాబ్ ఆఫర్ను తిరస్కరించారు. దీనికి సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ఆ ఉద్యోగ ఆఫర్లో కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. వారానికి ఐదు రోజులు ఆఫీస్కు రావాలి, అధికారిక సెలవు విధానం లేదు, అలాగే రీలోకేషన్ సహాయం కూడా ఇవ్వలేదు. ఈ కారణాలతో అభ్యర్థి ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుత జీతంపై కేవలం 25 శాతం మాత్రమే పెంపు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పెరిగిన జీవన వ్యయం, వ్యక్తిగత సమయానికి అవకాశం లేకపోవడం వంటి అంశాలు కూడా అతని జాబ్ రిజెక్ట్ చేయడానికి కారణమైంది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొంతమంది వినియోగదారులు ఇంత పెద్ద జీతాన్ని వదిలేయడం ఆశ్చర్యం అని భావించగా, మరికొందరు మాత్రం డబ్బు కంటే మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.My friend just rejected a 72 LPA offer.Reasons:• 5 days strict WFO• No leave policy• Zero relocation supportWhat shocked me the most? He had zero sense of loss.It’s fascinating that people like these exist who are willing to let so much money go because of work life… pic.twitter.com/GtSOLEi4S3— Ragini Pandey (@pandeyragini24) May 31, 2026ఒక వినియోగదారు తాను ఏడాదికి ఒక కోటి రూపాయలకుపైగా సంపాదించినప్పటికీ, నిరంతరం పని ఒత్తిడిలో ఉండటం వల్ల జీవితం కష్టమైందని చెప్పాడు. మరో వ్యక్తి 2015లో ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, తక్కువ జీతం ఉన్న కానీ ప్రశాంతమైన ఉద్యోగాన్ని ఎంచుకున్నానని తన అనుభవాన్ని పంచుకున్నాడు.ఈ చర్చ ద్వారా ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతోంది. నేటి ఉద్యోగ ప్రపంచంలో కేవలం జీతం మాత్రమే కాదు, పని వాతావరణం, వ్యక్తిగత సమయం, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమవుతున్నాయి. ఎక్కువ డబ్బు ఉన్న ఉద్యోగాలు అన్ని సమయాల్లో సంతోషాన్ని ఇవ్వవు అనే ఆలోచన ఉద్యోగులలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన! -
జాబ్ కోసం.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!
గత కొన్నేళ్లుగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ, ఏఐ ప్రధానమని వినిపిస్తోంది. అయితే.. జాబ్ పోతే ఏముందిలే.. ఇంకో జాబ్ వచ్చేస్తుంది అనేవారికి.. అమెజాన్ మాజీ ఉద్యోగి కథ తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల ఒక మాజీ అమెజాన్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దాదాపు ఎనిమిది నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా ఉద్యోగం దొరకలేదని ఆయన వెల్లడించడం.. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో నెలకొన్న పోటీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.ప్రముఖ ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ఏడు సంవత్సరాల పాటు పనిచేశాడు. అయితే.. 2025 చివరి త్రైమాసికంలో కంపెనీ చేపట్టిన ఉద్యోగుల తొలగింపులలో భాగంగా ఆయన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే.. ఆయనకు పెద్దగా సమస్య అనిపించలేదు. ఎందుకంటే ఆయన అనుభవం, నైపుణ్యాల కారణంగా అనేక ప్రముఖ సంస్థల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందులో అమెరికన్ ఎక్స్ప్రెస్, అగోడా, ఉబెర్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.ఇంటర్వ్యూలలో తనకు కొంత నిరాశ ఎదురైంది. ఆ తరువాత కొంతకాలం ఉద్యోగ అన్వేషణ నుంచి విరామం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి అంతగా ప్రతికూలంగా కనిపించలేదు. కానీ.. కొంతకాలం తర్వాత తిరిగి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించగా, పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నాడు.2026 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. జాబ్ కోసం తన బయోడేటాను నాలుగు నుంచి ఐదు సార్లు అప్డేట్ చేసుకున్నాడు. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంకు అనుకూలంగా రెజ్యూమే రూపొందించి అప్లై చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ఎంత కఠినంగా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది ఉద్యోగులు నెలల తరబడి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరికొందరు కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించడం, నియామక ప్రక్రియలను నిలిపివేయడం, ఉద్యోగాల కోసం పోటీ మరింత పెరగడం వంటి సమస్యలను ప్రస్తావించారు. -
ఆదాయాల అంతరం.. ఆప్యాయతలు దూరం!
సాఫ్ట్వేర్ రంగంలో భారీ ప్యాకేజీలు, విలాసవంతమైన జీవనశైలి ఒకవైపు ఆకర్షిస్తున్నా.. అంతర్గతంగా ఐటీ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో కొత్త రకమైన ఆర్థిక విబేధాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్ తన భాగస్వామితో ఎదుర్కొంటున్న ‘ఆదాయ అసమానత’కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కలిసి జీవించడం సులువే అయినా నెలవారీ ఖర్చులు, జీతాల మధ్య ఉండే భారీ వ్యత్యాసం వారి మధ్య ఉన్న ప్రేమను ఎలా దూరం చేస్తోందో సదరు టెక్కీ ఆవేదన వ్యక్తం చేశాడు.కార్పొరేట్ ఉద్యోగుల ప్రొఫెషనల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ‘గ్రేప్వైన్’లో ఒక మైక్రోసాఫ్ట్ టెక్కీ ‘గూఫీపాండా’ అనే పేరుతో తన వ్యక్తిగత జీవితంలోని అంశాలను పంచుకున్నాడు. అందులోని వివరాల ప్రకారం.. ‘నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్గా పనిచేస్తూ ఏడాదికి రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. నా స్నేహితురాలి వార్షిక ఆదాయం రూ.8 లక్షలు. ఈ ఏడాది ప్రారంభంలో మేమిద్దరం కలిసి ఉండాలని(లివ్-ఇన్ రిలేషన్షిప్) నిర్ణయించుకున్నాం. నా ఆఫీస్కు దగ్గర్లోనే ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మొదట్లో అంతా సజావుగానే సాగింది. కానీ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి అసలు కథ మొదలైంది’ అని పేర్కొన్నాడు.ప్లాట్ లీజు ఒప్పందంపై సంతకాలు చేసి కొత్త ఇంట్లోకి మారిన తర్వాత నిత్యం వచ్చే బిల్లులు, కిరాణా ఖర్చులు, భారీ సెక్యూరిటీ డిపాజిట్ వంటివి వారి ఆర్థిక స్థితిగతుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించాయి. ఇద్దరి జీతాల మధ్య ఏకంగా 6 రెట్లు తేడా ఉండటంతో ఖర్చులను సమానంగా పంచుకోవడం అసాధ్యంగా మారింది.టెక్కీ తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుతం అద్దె, రోజువారీ జీవనశైలి ఖర్చులతో కూడిన ఉమ్మడి బడ్జెట్లో 85 శాతానికి పైగా అతడే ఒంటరిగా భరిస్తున్నట్లు చెప్పాడు. బంధం న్యాయంగా సాగాలనే ఉద్దేశంతో ఆఫీస్ సీనియర్లను సంప్రదించి ఒక జాయింట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసినట్లు తెలిపాడు. అయినా సమస్య సర్దుమణగలేదన్నాడు.కారు రిపేర్ బిల్లుతో..ఈ ఏర్పాటు కొంతకాలం స్థిరంగా సాగినట్లు అనిపించినా ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు అసలు సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇటీవల వారి కారు రిపేర్ బిల్లు వచ్చింది. ఈ ఖర్చును ఇద్దరం పంచుకుందామని అతను ప్రతిపాదించగా ఆమె ఆర్థికంగా ఆ విషయాన్ని పూర్తిగా దాటవేసేందుకు ప్రయత్నించినట్లు పోస్ట్లో తెలిపాడు. ‘డబ్బు విషయంలో జరిగే ప్రతి చిన్న గొడవ మా మధ్య ఉన్న ఆప్యాయతను, ప్రేమను క్రమంగా నాశనం చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితి ఇదే’ అని సదరు టెక్కీ ఆందోళన వ్యక్తం చేశాడు.నెటిజన్ల అభిప్రాయాలుఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలతో కామెంట్ చేస్తున్నారు. ‘ఆమెతో నీకు దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందని నమ్మకం ఉంటే ఆర్థిక భారాన్ని నువ్వే ఎక్కువగా మోయడంలో తప్పులేదు. ఆదాయ అసమానతలు సహజం. భాగస్వామి కెరీర్ ఎదగడానికి నువ్వే సాయం చేయాలి’ అని కొందరు చెబుతున్నారు. ‘ఆమెకు నీతో కలిసి జీవించాలనే నిబద్ధత ఉంటే.. అదనపు ఖర్చుల విషయంలో రక్షణాత్మకంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? నువ్వు ఆమెను జీవిత భాగస్వామిగా చూస్తున్నావా లేక కేవలం రూమ్ మేట్లా భావిస్తున్నావా?’ అని కొందరంటున్నారు. నెటిజన్ల నుంచి వచ్చిన ఈ స్పందనపై సదరు మైక్రోసాఫ్ట్ ఉద్యోగి మళ్లీ స్పందించాడు. తాను ఆమెను కేవలం ఫ్లాట్ మేట్లా కాకుండా తన జీవిత భాగస్వామిగానే భావిస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే, సాధారణ డేటింగ్ స్థాయి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సంసారాన్ని నిర్వహించే స్థాయికి మారే క్రమంలో ఎదురైన ఆర్థిక సవాళ్లు తను ఊహించలేదని అంగీకరించాడు. ‘త్వరలోనే మేమిద్దరం ప్రశాంతంగా కూర్చుని, దీర్ఘకాలంలో మా బంధం నిలబడటానికి తగ్గట్టుగా ఒక స్థిరమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటాం’ అని అతను ముగించాడు.ఇదీ చదవండి: రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి? -
రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి?
భారతీయ రైల్వే సాంకేతిక విప్లవంలో మరో అడుగు ముందుకేస్తూ ఇటీవల విడుదల చేసిన సూపర్ యాప్ ‘రైల్వన్’ ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు సాధారణ రిజర్వేషన్లకు ఒక యాప్, జనరల్ (అన్రిజర్వ్డ్) టికెట్లకు మరో యాప్, ఫిర్యాదులకు వేరొక యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) రూపొందించిన ఈ రైల్వన్ యాప్.. అసలు గతంలో ఉన్న ఐఆర్సీటీసీ యాప్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? రైల్వే శాఖ దీన్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చింది? అనే పూర్తి వివరాలపై విశ్లేషణ.అసలు రైల్వన్ యాప్ను రైల్వే శాఖ ఎందుకు తీసుకొచ్చింది?గతంలో రైల్వే సేవలు వేర్వేరు డిజిటల్ విభాగాల కింద విడిపోయి ఉండేవి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధిగమించడానికి మంత్రిత్వ శాఖ ఈ సూపర్ యాప్ను ప్రవేశపెట్టింది.రిజర్వేషన్ల కోసం IRCTC Rail Connect, జనరల్ టికెట్ల కోసం UTS, ఫిర్యాదుల కోసం Rail Madad ఇలా ఫోన్ నిండా యాప్లను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా ప్రయాణికుడి స్మార్ట్ఫోన్ స్పేస్ను ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ప్రయాణికుడు ఒక్కసారి బయోమెట్రిక్ లేదా mPIN తో లాగిన్ అయితే చాలు అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు.రైల్వే వ్యవస్థ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా నిమిషానికి లక్షలాది బుకింగ్స్, ఎంక్వైరీలను తట్టుకునేలా అత్యంత వేగవంతమైన, యాడ్ఫ్రీ ఇంటర్ఫేస్ను అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు.ఐఆర్సీటీసీ.. రైల్వన్ మధ్య ప్రధాన తేడాలుచాలా మంది ప్రయాణికులు ఈ రెండు యాప్లు ఒకటే అని భావిస్తుంటారు. కానీ వీటి పనితీరు, సేవల పరిధిలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.ఫీచర్ఐఆర్సీటీసీ (రైల్ కనెక్ట్)రైల్ వన్నిర్వహణఐఆర్సీటీసీ ప్రభుత్వ అనుబంధ కార్పొరేట్ సంస్థ).క్రిస్ (రైల్వే శాఖ పరిధిలోని ఐటీ విభాగం).టికెట్ల లభ్యతప్రధానంగా రిజర్వ్డ్ రైలు టికెట్లు (కన్ఫర్మ్డ్, తత్కాల్) మాత్రమే.రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫారమ్ టికెట్లు అన్నీ లభిస్తాయి.రిజర్వేషన్ ప్రక్రియఐఆర్సీటీసీ సొంత గేట్వే, లాగిన్ ద్వారా బుకింగ్ జరుగుతుంది.ఐఆర్సీటీసీ అథరైజ్డ్ పార్ట్నర్లుగా ఉంటూనే దాని సర్వర్ను అనుసంధానించి వేగంగా బుక్ చేస్తుంది.లైవ్ ట్రాకింగ్, రూట్లుకొంత పరిమితంగా ఉంటుంది లేదా వేరే థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడాలి.లైవ్ రన్నింగ్ స్టేటస్, కోచ్ పొజిషన్, స్టేషన్ క్యూఆర్ కోడ్స్ ఇన్-బిల్ట్గా ఉంటాయి.రైల్ మదద్ఈ యాప్లో ఫిర్యాదుల వ్యవస్థ నేరుగా సమగ్రంగా ఉండదు.యాప్లోనే ఇన్-బిల్ట్గా ఫిర్యాదులు చేయడం, వాటి స్టేటస్ ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.యూజర్ అనుభవంయాప్లో యాడ్స్ ఎక్కువగా రావడం వల్ల కొన్నిసార్లు పేజీ లోడింగ్ నెమ్మదిస్తుంది.యాప్ ఫ్రీ ఇంటర్ఫేస్, బయోమెట్రిక్ లాగిన్ చాలా వేగంగా పనిచేస్తుంది.రైల్వన్ యాప్లోని టాప్ ఫీచర్లుపేపర్లెస్ అన్రిజర్వ్డ్ టికెటింగ్: రైల్వే స్టేషన్ల్లో ఉండే RailOne QR Codeలను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్లు పొందవచ్చు. అన్రిజర్వ్డ్, నప్లాట్ఫారమ్ టికెట్లపై కొన్ని సందర్భాల్లో ప్రమోషనల్ డిస్కౌంట్లు (ఉదాహరణకు 3% వరకు) కూడా లభిస్తాయి.ఫుడ్ ఆర్డర్: ప్రయాణంలో ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ వెరిఫైడ్ పార్ట్నర్ వెండర్స్ నుంచి నేరుగా మీ సీటుకే భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు.ఆర్-వాలెట్: ఆధార్ అనుసంధానిత డిజిటల్ వాలెట్ ద్వారా అత్యంత సురక్షితంగా క్షణాల వ్యవధిలో పేమెంట్లు పూర్తి చేయవచ్చు.మల్టీ ల్యాంగ్వేజీ: ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 10కి పైగా ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ను వాడుకునే సదుపాయం ఉంది.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
రూ.25 లక్షల ప్యాకేజీ వద్దు.. క్యాబ్ డ్రైవింగే ముద్దు!
జీవితంలో స్థిరపడటానికి ఒక మంచి వైట్ కాలర్ జాబ్, చేతినిండా జీతం ఉంటే చాలని చాలామంది భావిస్తారు. కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఏడాదికి రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? కళ్లు మూసుకుని ఆఫర్ లెటర్ అందుకుంటారు. కానీ, ఆ యువకుడు మాత్రం అందరిలా ఆలోచించలేదు. ఆకర్షణీయమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించి స్టీరింగ్ చేతపట్టాడు. ‘ఓలా’ క్యాబ్ డ్రైవర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ఒక యువకుడి స్ఫూర్తిదాయక కథనం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వైరల్గా మారింది.రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరణసోషల్ మీడియా యూజర్ సచన్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సచన్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని సోదరుడు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే ప్రముఖ కార్పొరేట్ సంస్థ నుంచి రూ.25 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ ఆఫర్ సాధించాడు. అయితే, మొదటి నుంచి కార్పొరేట్ ఉద్యోగాలపై అతనికి ఆసక్తి లేదు. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పంతో ఆ భారీ ఆఫర్ను తిరస్కరించాడు. ఊహించని విధంగా ఓలా క్యాబ్ నడపాలని నిర్ణయించుకున్నాడు.ఈ నిర్ణయం కుటుంబంలో, బంధువుల్లో కలకలం రేపింది. ‘లక్షలు ఖర్చు పెట్టి చదివించింది కార్లు తోలడానికా?’ అంటూ బంధువులు, సమాజం అతన్ని విమర్శించాయి. ఉన్నత చదువులన్నీ వృధా అయిపోయాయని, భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నాడంటూ బహిరంగంగానే ఎగతాళి చేశారు. కానీ, ఆ యువకుడు తన లక్ష్యంపై నమ్మకంతో ముందడుగు వేశాడు.డ్రైవర్ స్థాయి నుంచి ఫ్లీట్ ఓనర్ వరకు..సమాజం అతన్ని కేవలం ఒక ‘క్యాబ్ డ్రైవర్’గా మాత్రమే చూసింది. కానీ సదరు ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం అందులోనే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని చూశాడు. కేవలం డ్రైవింగ్కే పరిమితం కాకుండా లాజిస్టిక్స్, రవాణా రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. గడిచిన మూడేళ్ల కాలంలో క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్లాడు. సొంతంగా అదనపు వాహనాలను కొనుగోలు చేస్తూ వాటిని నిర్వహించడం ప్రారంభించాడు. సచన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అతని సోదరుడు ఓలా ప్లాట్ఫారమ్ కింద ఏకంగా 5 కార్లను నడుపుతున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.1.5 లక్షల నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలుఈ వైరల్ పోస్ట్ కెరీర్ ఎంపికలపై నెటిజన్ల మధ్య చర్చకు తెరలేపింది. ఈ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయక వైట్ కాలర్ ఉద్యోగాల చట్రం నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛను, స్వయం ఉపాధిని ఎంచుకున్న సదరు యువకుడి సాహసాన్ని అత్యధికులు అభినందిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రూ.25 లక్షల కార్పొరేట్ ఉద్యోగంలో చేరి ఉంటే, మూడేళ్ల అనుభవం తర్వాత ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతో అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేదని అభిప్రాయపడ్డారు. కొంతమంది యూజర్లు ఈ ఆదాయ గణాంకాలను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఐదు కార్లపై నెలకు రూ.1.5 లక్షల నికర లాభం (అన్ని ఖర్చులు, డ్రైవర్ల జీతాలు పోను) సాధించడం అంత సులువు కాదని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే బాగుంటుందన్నారు.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి!
భారతీయ ఆర్థిక రంగం (బీఎఫ్ఎస్ఐ) రాబోయే దశాబ్దంలో అసాధారణ వృద్ధిని నమోదు చేయనుందని, అయితే విద్యార్థులు కేవలం కొన్ని పాపులర్ ఉద్యోగాల వెంటే పరుగులు పెడుతూ అపారమైన అవకాశాలను కోల్పోతున్నారని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయ కెరీర్ మార్గాలను వీడి, మార్కెట్లో తీవ్ర ప్రతిభ కొరత ఉన్న సరికొత్త విభాగాలపై దృష్టి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా విద్యార్థులు, విద్యా సంస్థల ప్లేస్మెంట్ సెల్స్ను ఉద్దేశించి కొన్ని అంశాలు పంచుకున్నారు.85 శాతం మంది చూపు ఒకే వైపు!క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులు ఇప్పటికీ పాత ఆలోచనలతోనే ఉన్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. ‘మా సంస్థ (ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్)కు వస్తున్న వేలాది ఉద్యోగ దరఖాస్తులను గమనిస్తే.. అందులో దాదాపు 85 శాతం మంది కేవలం ఈక్విటీ రీసెర్చ్ లేదా ఇన్వెస్ట్మెంట్ రోల్స్ కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. క్యాంపస్ల్లో ఈక్విటీ రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (ఐబీ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) వంటి వాటిని మాత్రమే అత్యున్నతమైనవిగా చూస్తున్నారు. మిగిలిన విభాగాలను తక్కువ ప్రాధాన్యత కలిగిన (సెకండ్ టైర్) కెరీర్లుగా భావిస్తున్నారు. కానీ, ఈ పాత ఆలోచనా విధానం మారాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పారు.రాబోయే దశాబ్దంలో ఈ రంగాల్లో బూమ్..పెరుగుతున్న ఆర్థిక సంక్లిష్టతలు, మారుతున్న నియంత్రణల నేపథ్యంలో రాబోయే పదేళ్లలో కొన్ని విభాగాలు తీవ్ర ప్రతిభ కొరతను ఎదుర్కోబోతున్నాయని, అక్కడ పోటీ తక్కువగా ఉండి కెరీర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుందని గుప్తా విశ్లేషించారు. ఆ రంగాలు..రిస్క్ మేనేజ్మెంట్: నియంత్రణ సంస్థల కఠిన నిబంధనలు, కార్పొరేట్ గవర్నెన్స్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఈ విభాగంలో నిపుణులైన ప్రతిభకు డిమాండ్, సప్లై ఎక్కువగా ఉంది.ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్: ఆధునిక కాలంలో పెట్టుబడి ఉత్పత్తుల రూపకల్పన, మార్కెట్ పొజిషనింగ్, కమ్యూనికేషన్ అనేవి అసలైన పెట్టుబడి నిర్వహణతో సమానంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.డెరివేటివ్స్ ట్రేడింగ్: దేశంలో సరికొత్త ఎస్ఐఎఫ్, హెడ్జ్ ఫండ్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోంది. అయితే దీనికి తగినట్టుగా శిక్షణ పొందిన నిపుణులు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నారు.ప్రైవేట్ డెట్, మౌలిక సదుపాయాల పెట్టుబడులు: భారతదేశ మౌలిక వసతుల రంగానికి అపారమైన మూలధనం అవసరం. కానీ, ఈ విభాగంలో నిధుల నిర్వహణ చేపట్టే స్పెషలిస్ట్ నిపుణులు చాలా పరిమితంగా ఉన్నారు.సేల్స్ కెరీర్పై ఉన్నది అపోహే!ఆర్థిక రంగంలో తప్పుగా అర్థం చేసుకున్న, విస్మరించిన విభాగం సేల్స్ డిపార్ట్మెంట్ అని రాధికా గుప్తా స్పష్టం చేశారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ల సమయంలో సేల్స్ పాత్రల కోసం తమకు అసలు దరఖాస్తులు రాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ‘సేల్స్ రంగం వ్యక్తిలో ఒత్తిడిని తట్టుకునే శక్తిని, వ్యాపార చతురతను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన చాలా మంది సీఈఓలు ఒకప్పుడు సేల్స్ లీడర్లుగా పనిచేసినవారే. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో విక్రయ నైపుణ్యాలను ఉపయోగించాల్సిందే’ అని ఆమె పేర్కొన్నారు. గ్లామర్ కోణంలో చూసి ఈ అవకాశాలను వదిలేస్తున్న వారు ఒకే చోట నిలిచిపోతుంటే, ఈ సరికొత్త రంగాలను ఎంచుకున్న కొంతమంది యువత చిన్న వయసులోనే వేగంగా ఎదుగుతూ, భారీగా సంపాదిస్తూ కెరీర్లో స్థిరపడుతున్నారని తెలిపారు.A LinkedIn post I thought would be worth sharing here too.An honest open letter to placement cells and campuses:We get thousands of CVs to join us. 85% of them come for one role: equity research / investing.I am pretty all 85% of these will get these roles. Or that they…— Radhika Gupta (@iRadhikaGupta) May 31, 2026విజయానికి మూడు ప్రశ్నలుయువత తమ కెరీర్ను ఎంచుకునేటప్పుడు గుంపుతో కలిసి పోకుండా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడిలా ఆలోచించాలని ఆమె సలహా ఇచ్చారు. నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అభ్యర్థి తమను తాము ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నారు.1. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత అవసరమైనది ఏమిటి?2. ఏ విభాగంలో పోటీ తీవ్రత చాలా తక్కువగా ఉంది?3. నేను ఏ పనిని సమర్థవంతంగా చేయగలను?ఈ కోణంలో ఆలోచిస్తే డిమాండ్ ఉండి సరైన సప్లై లేని మార్కెట్లను సులభంగా గుర్తించవచ్చని ఆమె సూచించారు.ఇదీ చదవండి: ఫిన్టెక్ సేవల్లోకి ఎల్ఐసీ -
ఫిన్టెక్ సేవల్లోకి ఎల్ఐసీ
ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ ఎల్ఐసీ డిజిటల్ సేవలను పెద్ద ఎత్తున విస్తరించడంపై దృష్టి సారించింది. ఒక ఫిన్టెక్ సంస్థను ఏర్పాటు చేయడాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. పెరుగుతున్న డిజిటల్ సేవల అవసరాలను తీర్చేందుకు అవసరమైతే ప్రత్యేకమైన సేవలు అందించే సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడిని సైతం పరిశీలిస్తున్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి తెలిపారు.‘సహజంగా ఆధునికీకరణ అవసరాలు, కొత్త ఆవిష్కరణల కోసం మేము ఫిన్టెక్, ఇన్సూర్టెక్ సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తుంటాం. ఈ సంస్థల ద్వారా పలు కొత్త విషయాలను తెలుసుకుంటుంటాం. పెద్ద ఆర్థిక సంస్థగా పలు కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెడుతుంటాం. పాలసీదారుల రాబడులను మెరుగుపరిచేందుకు అవసరమనుకుంటే ప్రత్యేకమైన సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులనూ పరిశీలిస్తాం’ అని దొరైస్వామి తెలిపారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఈ వారం రెండు ఐపీవోలు
న్యూఢిల్లీ: వచ్చే వారం ప్రైమరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, హెక్సగాన్ న్యూట్రిషన్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. తద్వారా సంయుక్తంగా రూ. 770 కోట్లవరకూ సమీకరించనున్నాయి. రెండు కంపెనీలు పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఇష్యూ చేపట్టనున్నాయి. నాన్ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ కంపెనీ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ జూన్ 3–5 మధ్య పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 182–192కాగా.. తద్వారా రూ. 631 కోట్లు సమీకరించనుంది. జూన్ 5–9 మధ్య హెక్సగాన్.. జూన్ 5–9 మధ్య మైక్రో న్యూట్రియంట్ ఫార్ములేషన్ల కంపెనీ హెక్సగాన్ న్యూట్రిషన్ ఐపీవోకు వస్తోంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 42–45కాగా.. తద్వారా రూ. 139 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్ల షేర్లు ఆఫర్ చేయనున్నారు. 1993లో ఏర్పాటైన ఈ కంపెనీ బ్రాండెడ్ న్యూట్రిషన్ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. -
IIT ఫెయిల్.. సొంతంగా AI నేర్చుకుని
ఐఐటీ ప్రవేశ పరీక్షలో విఫలం కావడం అంటే.. చాలామంది విద్యార్థుల జీవితాల్లో పెద్ద నిరాశగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు, కొంతమందికి కొత్త ప్రారంభానికి మార్గం అవుతుంది. అలాంటి ఒక ప్రేరణాత్మక కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం.. ఒక యూజర్ తన జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ, తాను రెండు సార్లు ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలో విఫలమైనట్లు చెప్పుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చినందుకు.. చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడం, ప్రెజర్స్ అన్నీ చాలా కష్టంగా అనిపించాయని అతను చెప్పుకోచ్చారు. ఒకానొక దశలో జీవితం ముగిసిపోయినట్టే అనిపించిందని కూడా పేర్కొన్నారు.ఫెయిల్యూర్ తర్వాత తన ఊరిని వదిలి, వేరే నగరంలోని ప్రభుత్వ కాలేజీలో చేరాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. తల్లిదండ్రులు ఎక్కువగా సహాయం చేయలేని పరిస్థితి కావడంతో, చదువు కోసం లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే చిన్న పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పి కొంత ఆదాయం సంపాదించాడు. కొన్ని సార్లు రెండు సమోసాలతో రోజంతా గడపాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదని వివరించారు.ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. కాలేజీ పూర్తి చేసిన తర్వాత, అతనికి నెలకు రూ.20,000 జీతంతో ఒక ఐటీ సపోర్ట్ జాబ్ వచ్చింది. అది పెద్ద జీతం కాకపోయినా.. అతని కెరీర్కు ఒక ప్రారంభం అయింది. కానీ అతను అక్కడే ఆగిపోలేదు. తన కుటుంబ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో, ఉద్యోగం తర్వాత ఖాళీ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషిన్ లెర్నింగ్ (ML) నేర్చుకోవడం ప్రారంభించాడు.I failed IIT. Twice.At one point, it genuinely felt like life was over. In small towns, failure doesn’t stay private. The comparisons, the silent judgment, the feeling that everyone suddenly sees you differently ,I experienced all of it. It hurt more than I ever admitted.So,…— AJ (@JainJec2013) May 29, 2026ఎలాంటి కోచింగ్ లేకుండా, ఎలాంటి మెంటార్ లేకుండా, కేవలం ఇంటర్నెట్ సాయంతో అతను స్వయంగా ఈ టెక్నాలజీలను నేర్చుకున్నాడు. ఈ ప్రయత్నం అతని కెరీర్లో పెద్ద మలుపు తీసుకువచ్చింది. తర్వాత అతనికి ఏఐ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి అతను ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ లీడర్షిప్ రోల్స్లోకి ఎదిగాడు.కొన్నేళ్ల తర్వాత.. ఐఐటీలో సీటు పొందిన తన స్నేహితులతో సమాన స్థాయిలో సంపాదిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను దుబాయ్లో ఉన్నట్లు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒకప్పుడు పాలు కొనడానికి కూడా ఇబ్బంది పడిన కుటుంబం నుంచి, ఇప్పుడు రెండవ ఆలోచన లేకుండా కావలసినవి కొనగలిగే స్థాయికి ఎదిగానని పేర్కొన్నాడు.జీవితంలో ఎదగాలంటే.. పర్ఫెక్ట్ స్టార్ట్ అవసరం లేదు, మీకు దృఢ సంకల్పం కావాలి అని వెల్లడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అతని పట్టుదలను, కష్టపడి ఎదిగిన తీరును ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు! -
రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!
ఒకప్పుడు ఐటీలో కొలువంటే చాలామంది ఎగిరి గంతేసేవారు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక కొంతమంది బిక్కుబిక్కుమనే రోజుల్లో టెకీలు బతికేస్తున్నారు. ఏ ఉదయం ఏ మెయిల్ వస్తుందో తెలియదు. ఏ కారణం చేత జాబ్ పోతుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ చెప్పాపెట్టకుండా క్లోజ్ అయింది. దీంతో 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.పుణెలోని హింజవాడి ఫేజ్-2లో ఉన్న థింక్ టెక్నాలజీ ఇండియా అనే ఐటీ సంస్థ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. రాత్రికి రాత్రే కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఘటనతో 700 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్స్, ఫ్రెషర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపెనీ వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడం, ఉద్యోగుల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటివి కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.ప్రారంభంలో భారీ నియామకాలుథింక్ టెక్నాలజీ ఇండియా 2025లో పెద్ద మొత్తంలో నియామకాలను చేపట్టింది. ఇందులో ఫ్రెషర్స్, ఇంటర్న్స్, ఎక్స్పీరియన్స్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదట్లో సంస్థ అందరికీ జీతాలు, స్టైఫండ్స్ క్రమంగా చెల్లించింది. దీంతో ఉద్యోగుల్లో సంస్థపై నమ్మకం పెరిగింది.అయితే.. 2026 ప్రారంభం నుంచి పరిస్థితులు మారాయి. ఫిబ్రవరి నుంచి జీతాల చెల్లింపుల విషయంలో ఆలస్యం జరిగిందని ఉద్యోగులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల 7 లేదా 8వ తేదీకి జమయ్యే జీతాలు ఆగిపోవడంతో ఉద్యోగులు యాజమాన్యాన్ని సంప్రదించారు. ఈ సమయంలో సంస్థ సీఈఓ హర్షల్ భానుదాస్ ఠాక్రే ఆడిట్ జరుగుతోందని, ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులుసీఈఓ ఇచ్చిన హామీ ప్రకారం.. జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. అయితే కొన్ని రోజులకు సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు గుర్తించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా.. సంస్థ మూతపడటంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన కొన్ని జీతాల చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్ అయినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు, లోన్స్ చెల్లింపులు చేయలేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఈ వ్యవహారంలో ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) జోక్యం చేసుకుంది. బాధిత ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫైట్ అధ్యక్షుడు పవంజీత్ మానే తెలిపారు. పోలీసులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు వెల్లడించారు.మరో ముఖ్యమైన ఆరోపణ ఏమిటంటే.. ఉద్యోగులకు ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమని తేలితే సంస్థ ఉద్యోగులతో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు జరిపినట్లు స్పష్టమవుతుంది.భద్రతపై చర్చఈ ఘటన మరోసారి భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై చర్చకు తెరలేపింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యోగి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జీతాల చెల్లింపులు, ఆర్థిక పారదర్శకత, ఉద్యోగుల రక్షణ కోసం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు విచారణ కొనసాగుతోంది. జీతాల బకాయిలు, బౌన్స్ అయిన చెక్కులు, ఉద్యోగుల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: గూగుల్కు రూ.30 లక్షల జరిమానా! -
గూగుల్కు రూ.30 లక్షల జరిమానా!
డిజిటల్ ప్రకటనల రంగంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఒక కేసులో ఢిల్లీ హైకోర్టు, గూగుల్పై కీలకమైన తీర్పును వెల్లడించింది. ప్రముఖ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అండ్ శానిటరీ వేర్ తయారీ సంస్థ 'హింద్వేర్' ట్రేడ్మార్క్ హక్కులను ఉల్లంఘించిందని గుర్తించిన కోర్టు, గూగుల్కు రూ.30 లక్షల జరిమానా విధించింది.హింద్వేర్ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శానిటరీ వేర్ బ్రాండ్. వినియోగదారులు గూగుల్లో Hindware అని వెతికినప్పుడు, హింద్వేర్ వెబ్సైట్కు బదులుగా ప్రత్యర్థి కంపెనీల ప్రకటనలు ముందుగా కనిపిస్తున్నాయని సంస్థ గుర్తించింది. దీనికి కారణం.. ఆ కంపెనీలు హింద్వేర్ అనే పదాన్ని తమ ప్రకటనల కోసం కీవర్డ్గా కొనుగోలు చేయడమే.గూగుల్ యొక్క AdWords (ప్రస్తుతం గూగుల్ యాడ్స్) వ్యవస్థలో కంపెనీలు తమకు కావలసిన కీవర్డ్లపై బిడ్ వేస్తాయి. వినియోగదారులు ఆ పదాలను సెర్చ్ చేసినప్పుడు, ఎక్కువ బిడ్ వేసిన కంపెనీల ప్రకటనలు పైభాగంలో కనిపిస్తాయి. ఈ విధంగా హింద్వేర్ పేరును ప్రత్యర్థులు ఉపయోగించుకోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని కంపెనీ వాదించింది.163 పేజీల తీర్పుఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. గూగుల్ కేవలం ఒక మధ్యవర్తి కాదని స్పష్టం చేశారు. గూగుల్ స్వయంగా కీవర్డ్లను సూచించడం, వాటి వేలాన్ని నిర్వహించడం, ప్రకటనల ప్రదర్శనను తన అల్గోరిథమ్ల ద్వారా నియంత్రించడం వంటి చర్యలు చేపడుతోంది. కాబట్టి ట్రేడ్మార్క్ను వ్యాపార ప్రయోజనాల కోసం ప్రదర్శించాల్సిన బాధ్యత గూగుల్పైనా ఉంటుందని కోర్టు తన 163 పేజీల తీర్పులో పేర్కొంది.కోర్టు అభిప్రాయం ప్రకారం.. హింద్వేర్ అనే ట్రేడ్మార్క్పై గూగుల్కు ఎటువంటి యాజమాన్య హక్కు లేదు. అయినప్పటికీ.. ఆ పేరును ప్రత్యర్థి సంస్థలకు అమ్మి లాభం పొందడం ద్వారా గూగుల్ ఆ కంపెనీ ప్రతిష్ఠను వాణిజ్యపరంగా వినియోగించుకుంది. దీనిని కోర్టు ఫ్రీ రైడింగ్ (ఇతరుల కృషి వల్ల ఏర్పడిన పేరును ఉపయోగించి లాభపడటం) అని వెల్లడించింది.గూగుల్ వాదనగూగుల్ తనను తాను కేవలం ప్రకటనల వేదికగా మాత్రమే పేర్కొంటూ.. హింద్వేర్ సమస్యకు తాము బాధ్యులు కాదని వాదించింది. కీవర్డ్స్ అనేవి వినియోగదారుడు సెర్చ్ చేసినప్పుడు.. ప్రకటనలు చూపించడానికి బ్యాక్ ఎండ్లో పనిచేసే కొన్ని సాధనాలు మాత్రమే అని వెల్లడించింది. అంతేకాకుండా.. సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్ 79 ప్రకారం తమకు సేఫ్ హార్బర్ రక్షణ వర్తిస్తుందని తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.ఎందుకంటే.. గూగుల్ కేవలం ప్రకటనలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా, ట్రేడ్మార్క్లను కీవర్డ్లుగా అమ్మి ఆదాయం పొందుతోందని గుర్తించింది. అందువల్ల గూగుల్ ఒక క్రియాశీల పాత్ర పోషిస్తోందని, సేఫ్ హార్బర్ రక్షణకు అర్హత లేదని తీర్పు చెప్పింది.ప్రత్యర్థి సంస్థలుఈ కేసులో ప్రత్యర్థి సంస్థలుగా గ్రోహే ఇండియా, ఓంకార ఇన్ఫోవెబ్, సెరా శానిటరీవేర్ కూడా ఉన్నారు. వీరు హింద్వేర్ పేరును లేదా హింద్వేర్ శానిటరీవేర్ వంటి పదాలను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ ప్రకటనలను ప్రదర్శించారు. అయితే విచారణ సమయంలో ఈ సంస్థలు హింద్వేర్తో రాజీ చేసుకోవడంతో, చివరకు గూగుల్ మాత్రమే ఈ కేసులో మిగిలింది.ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని డిజిటల్ మార్కెటింగ్ రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు అనేక కంపెనీలు ప్రత్యర్థి బ్రాండ్ల పేర్లను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ వ్యాపారాలను ప్రోత్సహించేవి. ఇకపై అలాంటి చర్యలు ట్రేడ్మార్క్ ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉంది. నితిన్ కామత్ కూడా ఈ తీర్పును స్వాగతిస్తూ, తమ సంస్థకు ఇలాంటి సమస్యలు సంవత్సరాలుగా ఎదురవుతున్నాయని, ఇప్పుడు చట్టపరమైన పరిష్కారం పొందేందుకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం! -
ఆప్టిమిస్ట్ నుంచి స్మార్ట్ ఏసీ
హైదరాబాద్: దేశీ క్లైమేట్–టెక్ బ్రాండ్ ఆప్టిమిస్ట్ ఎయిర్ కండీషనింగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ సమర్ధవంతంగా పని చేసే స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద 1.4 టన్నుల 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై ఎంఆర్పీ మీద 38 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు, రూ. 39,990కే అందిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో ఆశీష్ గోయల్ తెలిపారు. రాబోయే రోజుల్లో 1 టన్, 2 టన్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. తమ ఆఫ్లైన్ స్టోర్స్తో పాటు ఆన్లైన్లో అమెజాన్, ఆప్టిమిస్ట్ పోర్టల్స్లో కూడా ఇవి లభిస్తాయని పేర్కొన్నారు.ఆప్టిమిస్ట్ సంస్థను అర్బన్ ల్యాడర్ మాజీ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ గోయల్, ప్రణవ్ చోప్రా కలిసి 2024లో స్థాపించారు. భారత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏసీలను అభివృద్ధి చేస్తున్న ఈ స్టార్టప్ ఇటీవలే యాక్సెల్, అర్కామ్ వెంచర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 12 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఐఐటీ ఢిల్లీతో కలిసి థర్మల్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ వాలిడేషన్పై పనిచేసిన సంస్థ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించే అధిక సామర్థ్య సాంకేతికతతో పాటు స్మార్ట్ యాప్ ఆధారిత మానిటరింగ్, గ్యాస్ లెవల్ ఇండికేటర్ వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు తెలిపింది. -
హైదరాబాద్లో డిజిలాజిక్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెస్టింగ్, సిమ్యులేషన్స్ సేవలందించే హైదరాబాద్ సంస్థ డిజిలాజిక్ సిస్టమ్స్ గత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో రూ. 78.27 కోట్ల ఆదాయం ఆర్జించింది. రూ. 10.43 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 72.19 కోట్లు కాగా, లాభం సుమారు 7.79 కోట్లుగా నమోదైంది.జనవరిలో బీఎస్ఈ ఎస్ఎంఈలో లిస్టయిన డిజిలాజిక్.. సుమారు రూ. 70 కోట్లు సమీకరించింది. హైదరాబాద్లోని టీజీఐఐసీ హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2లో ఈఎంఎస్ తయారీ, ఈఎస్ఎస్ స్క్రీనింగ్ మొదలైన వాటికి సంబంధించి రూ. 52 కోట్లతో ప్రాజెక్ట్ ఉడాన్ పేరిట ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇది 2027 మే నాటికి అందుబాటులోకి రానుంది.అలాగే, డిఫెన్స్, ఏరోస్పేస్ సంబంధ కార్యకలాపాల విస్తరణ కోసం అభేద్య సిస్టమ్స్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ. 31 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఉండగా, రూ. 110 కోట్ల టెండర్లకు కోట్ చేసినట్లు కంపెనీ సీఈవో శశాంక్ వర్మ జెట్టి తెలిపారు. -
కస్టమర్లకు దూరంగా బీమా కంపెనీలు
దేశీయంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు, కస్టమర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండటం లేదని కన్సల్టింగ్ సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 80 శాతం పాలసీల కొనుగోళ్లు బీమా కంపెనీల వెబ్సైట్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఫలితంగా కస్టమర్లను సమకూర్చుకోవడం కంటే ఏజెంట్లను అందిపుచ్చుకునేందుకే కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించింది. అన్ని లావాదేవీలు మధ్యవర్తులద్వారానే జరుగుతుండటం వల్ల కస్టమర్లు కూడా వారికే ఎక్కువగా విశ్వసనీయంగా ఉంటున్నారని పేర్కొంది. ఫలితంగా కంపెనీలకి కస్టమర్లకు మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు ఉండటం లేదని రిపోర్టు తెలిపింది. సాధారణంగా బీమా కంపెనీలకు పాలసీల విక్రయాలపై నష్టాలే తప్ప లాభం ఉండటం లేదని వివరించింది. అండర్రైటింగ్ రూపంలో వచ్చే నిధుల కంటే షేర్ మార్కెట్లలోనో, ప్రభుత్వ బాండ్లలోనో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాలతోనే కంపెనీలు మనుగడ సాగిస్తున్నట్లు ప్రాక్సిస్ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే బీమా కంపెనీలు ఏజెంట్లపై ఆధారపడటం తగ్గించి, నేరుగా కస్టమర్లకే పాలసీలను విక్రయించే పద్ధతిని పెంచుకోవాలని సూచించింది. కంపెనీల నుంచే నేరుగా పాలసీలను కొనే కస్టమర్లకు తక్కువ ధరకు, సరళతరమైన పాలసీలను అందించాల్సి ఉంటుందని ప్రాక్సిస్ తెలిపింది. అలాగే క్లెయిమ్స్ను సత్వరం సెటిల్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కొత్త నిబంధనలు, బీమా సుగమ్లాంటి ప్లాట్ఫామ్ల వల్ల కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. -
సెమీకండక్టర్ దిగ్గజంగా భారత్!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ రంగంలో భారత్ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా దిగ్గజంగా ఎదగాలని, 2035 నాటికి 120–150 బిలియన్ డాలర్ల (రూ.14.25 లక్షల కోట్లు సుమారు) విలువైన సెమీకండక్టర్ వ్యాల్యూచైన్ నిర్మించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతును ప్రభుత్వమే సమకూర్చడం ద్వారా యాంకర్ పాత్రను పోషించాలంటూ, తద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కల్పించొచ్చని పేర్కొంది. ‘భారత్ దేశ సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్’ పేరుతో ఒక నివేదికను నీతి ఆయోగ్ రూపొందించింది. అంతర్జాతీయంగా పోటీనివ్వగలిగిన సెమీకండక్టర్ వ్యవస్థను దేశీయంగా నిర్మించుకునేందుకు 135–180 బిలియన్ డాలర్ల (రూ.17.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చే దశాబ్ద కాలంలో అవసరమవుతాయని తెలిపింది. ముఖ్యంగా డిజైన్, ఫ్యాబ్రికేషన్, అత్యాధునిక ప్యాకేజింగ్, మేటీరియల్స్, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ మేరకు పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. దిగుమతులను తగ్గించుకోవాలి.. ప్రస్తుతం భారత్లో సెమీకండక్టర్ల డిమాండ్ వేగంగా పెరుగుతుండగా, ఇందులో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యం తరలిపోవడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడినప్పుడు దేశ రక్షణ, డిజిటల్ రంగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. 2035 నాటికి దేశీయ సెమీకండక్టర్ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా వ్యక్తం చేస్తూ.. ఈ డిమాండ్ను దేశీయంగానే తీర్చుకునే విధంగా పరిశ్రమను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. దేశీయంగా డిమాండ్ స్థాయిలో ఉత్పాదకత లేకపోవడాన్ని గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. టెక్నాలజీలో స్వావలంబనతోనే వికసిత్ భారత్ బ్లాక్బాక్స్ సాంకేతికతల దిగుమతులపై ఆధారపడడం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పెద్ద అవరోధమని నీతి ఆయోగ్ వైస్చ ఐర్మన్ అశోక లాహిరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సాంకేతిక సౌర్వబౌమత్వం పునాది కావాలన్నారు. అది మౌలిక వసతుల నుంచే ఆరంభం కావాలన్నారు. సరికొత్త పరిశోధనలు, సొంత డిజైన్ల సృష్టి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే స్థిరమైన విధానాలు, అధునాతన ప్యాకేజింగ్ మరియు కాంపౌండ్ సెమీకండక్టర్ల ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి అవసరమని ఈ నివేదిక సూచించింది. భారతదేశం కేవలం చిప్స్ వినియోగించే దేశంగా కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో ఒక తప్పనిసరి భాగస్వామిగా మారాలనే తమ సంకల్పాన్ని ఈ నివేదిక చాటిచెబుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదిక విడుదల సందర్భంగా పేర్కొన్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను (డిజైన్, నైపుణ్య వనరులు, మెటీరియల్స్, ఎక్విప్మెంట్, ఫ్యాబ్, ప్యాకేజింగ్) నిర్మించడంపై తాము దృష్టి పెట్టినట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. -
ఒలెక్ట్రా గ్రీన్టెక్ లాభం రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్టెక్ రూ. 51 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 24 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఇక ఆదాయం 45 శాతం వృద్ధితో రూ. 438 కోట్ల నుంచి రూ. 635 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 29 శాతం పెరిగి రూ. 139 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 1,802 కోట్ల నుంచి రూ. 2,312 కోట్లకు ఎగిసింది.ఒక్కో షేరుపై కంపెనీ 15 శాతం (రూ. 0.60) మేర తుది డివిడెండు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 32 శాతం అధికంగా 1,280 ఈవీలను డెలివర్ చేసింది. 10,161 ఎలక్ట్రిక్ వాహనాలకు ఆర్డర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఆదాయాలు, లాభదాయకత, పటిష్టమైన ఫండమెంటల్స్ తదుపరి దశ వృద్ధికి పటిష్టమైన పునాదులుగా నిలుస్తాయని ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీ మహేష్ బాబు చెప్పారు. చదవండి: టెస్లా నుంచి మరో కొత్త కారు.. ఇదే అత్యంత చౌక -
అధిక వృద్ధి బాటలో రిలయన్స్ కన్జూమర్
న్యూఢిల్లీ: సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితుల దన్నుతో 2030 నాటికి ఎఫ్ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) ఆదాయం అనేక రెట్లు పెరగనున్నట్లు మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ వార్షిక నివేదికలో తెలిపింది. 2025–26లో కంపెనీ ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లు దాటినట్లు వివరించింది. నిత్యావసరాలు, పానీయాల విక్రయాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది.అంతర్జాతీయంగా అగ్రగామి బ్రాండెడ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలన్న లక్ష్య సాకారం దిశగా ఆర్సీపీఎల్ ఇకపైనా ఇతర సంస్థలు, బ్రాండ్స్ కొనుగోళ్లను కొనసాగిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వివరించింది. 2025 డిసెంబర్ 1న రిలయన్స్ రిటైల్ నుంచి విడగొట్టిన ఆర్సీపీఎల్ ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. -
ఫ్రిజ్ వాడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంటు బిల్లు భారీగా ఆదా..
భానుడి భగభగలతో మే నెల వచ్చేసరికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి చల్లటి నీరు, అలాగే పండ్లు, కూరగాయలు, వండిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్లు రోజుకు 24 గంటల పాటు నిరంత రాయంగా పనిచేస్తుంటాయి. అయితే, చాలా ఇళ్లలో ఫ్రిజ్ సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో కూలింగ్ తగ్గడం, అదే సమయంలో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఫ్రిజ్ లోపల కంప్రెసర్పై అదనపు భారం పడి, విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఇంధన సామర్థ్య బ్యూరో నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్రిజ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. కరెంట్ బిల్లును 25 శాతం వరకు ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..చేయకూడని పొరపాట్లు ఇవే..వేసవిలో చల్లటి నీటి కోసం ఇంట్లో పిల్లలు, పెద్దలు తరచూ ఫ్రిజ్ డోర్ తెరుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లోపలి చల్లటి గాలి బయటకు పోయి, గదిలోని వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఫ్రిజ్ మళ్లీ చల్లబడటానికి కంప్రెసర్ ఎక్కువ సమయం శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైన వస్తువులను ఒకేసారి బయటకు తీయడం అలవాటు చేసుకోవాలి. వండిన అన్నం, కూరలు లేదా పాలు పూర్తిగా చల్లారక ముందే నేరుగా ఫ్రిజ్లో పెట్టడం చాలా మందికి అలవాటు. దీనివల్ల లోపలి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. దాన్ని సమం చేయడానికి యంత్రంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందుకే ఏ పదార్థమైనా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాతే లోపల ఉంచాలి. ఫ్రిజ్ వెనుక భాగం నుంచి వెలువడే వేడి గాలి బయటకు పోవడానికి తగినంత స్థలం ఉండాలి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ త్వరగా వేడెక్కి కూలింగ్ తగ్గిపోతుంది. అందుకే ఫ్రిజ్ను గోడకు కనీసం 4 నుండి 6 అంగుళాల దూరంలో ఉంచాలి. ఫ్రిజ్ నిండా వస్తువులను ఇరుకైన పద్ధతిలో సర్దితే లోపల చల్లటి గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల అన్ని అరలకు సమానంగా కూలింగ్ అందదు.ఫ్రిజ్ లోపలి భాగంతో పాటు వెనుక వైపు ఉండే కాయిల్స్, వెంట్లను కూడా శుభ్రం చేయాలి. అక్కడ దుమ్ము పేరుకుపోతే హీట్ ఎక్స్ఛేంజ్ సామర్థ్యం తగ్గి, కరెంట్ ఎక్కువగా కాలుతుంది. నెలకు ఒకసారైనా వెనుక భాగాన్ని శుభ్రం చేయడం మేలు. ఫ్రిజ్ తలుపునకు ఉండే రబ్బరు పట్టీ అంటే గాస్కెట్ వదులైనా లేదా దెబ్బతిన్నా లోపలి చల్లదనం నిరంతరం బయటకు లీక్ అవుతుంది. డోర్ సరిగ్గా లాక్ అవ్వడం లేదని గమనిస్తే వెంటనే గాస్కెట్ను మార్చడం ఉత్తమం. ఫ్రిజ్ను ఎప్పుడూ నేరుగా ఎండ తగిలే చోట లేదా గ్యాస్ స్టవ్ వంటి వేడి వస్తువుల పక్కన పెట్టకూడదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఫ్రిజ్ డోర్ను అస్సలు తెరవద్దు. దీనివల్ల లోపల దాదాపు గంటల తరబడి చల్లదనం అలాగే ఉంటుంది. ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోకుండా చూసుకోవడానికి 'ఆటో డీఫ్రాస్ట్' ఫీచర్ను ఉపయోగించాలి. కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడల్ రిఫ్రిజిరేటర్లను ఎంచుకుంటే దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లును మరింతగా తగ్గించుకోవచ్చు. -
నేరుగా ఆర్థిక శాఖ బృందాలే వచ్చేస్తున్నాయ్..
న్యూఢిల్లీ: ఆర్థిక విధానాలు .. బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు, పశ్చిమాసియా సంక్షోభంపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోతగిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, పరిశ్రమ క్లస్టర్లను సందర్శించడంపై కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక వ్యవహారాల విభాగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.దీని ప్రకారం ఆర్థిక శాఖలోని అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి లేదా డైరెక్టర్ సారథ్యంలో అయిదుగురు వరకు సభ్యులతో బృందాలను ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు భారీ, మధ్య, చిన్న తరహా తయారీ యూనిట్లను సందర్శిస్తాయి. వివిధ రంగాలవ్యాప్తంగా విధానాలు, నిర్వహణపరమైన సవాళ్లను పరిశీలిస్తాయి. మౌలిక సదుపాయాలు, రెగ్యులేటరీ అవరోధాలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, నిధుల లభ్యతపరమైన సవాళ్లు, నైపుణ్యాల్లో కొరత, సాంకేతికత వినియోగం మొదలైన అంశాలు వ్యాపారాలపై చూపుతున్న ప్రభావాల గురించి నేరుగా తెలుసుకుంటాయి.ఒక్కో విడతలో కనీసం రెండు స్టార్టప్లతో పాటు తయారీ, ఇన్ఫ్రా, పరిశోధనలు తదితర రంగాల సంస్థలను సందర్శించి, పరిస్థితుల గురించి బృంద సభ్యులు తెలుసుకుంటారు. కొన్ని రంగాలపై ప్రభుత్వం గణనీయంగా వ్యయం చేస్తున్నప్పటికీ, వివిధ కారణాలరీత్యా ప్రైవేట్ పెట్టుబడులు ఇంకా పుంజుకోవడం లేదు. పశి్చమాసియా సంక్షోభం వల్ల రూపాయి బలహీనపడటం, క్రూడాయిల్ రేట్లు పెరగడం తదితర సవాళ్లు వీటికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది. -
వాహనదారులకు షాక్.. సీఎన్జీ ధరలు మళ్లీ పెంపు
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో వాహనదారులకు మరోసారి ఇంధన భారం పెరిగింది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) సీఎన్జీ ధరలను కిలోకు రూ.2 పెంచింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.84 నుంచి రూ.86కు చేరుకుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.పీఎన్జీ ధరలకూ పెరుగుదలసీఎన్జీతో పాటు గృహ వినియోగానికి ఉపయోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలను కూడా ఎంజీఎల్ పెంచింది. యూనిట్కు 50 పైసలు పెంచడంతో ప్రస్తుతం వినియోగదారులు యూనిట్కు రూ.52 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల 31 లక్షలకు పైగా కుటుంబాలపై ప్రభావం పడనుంది.పెరుగుతున్న గ్యాస్ సేకరణ ఖర్చులే కారణందేశీయ గ్యాస్ కేటాయింపులు తగ్గడం, అధిక ధరలతో గ్యాస్ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో గ్యాస్ సేకరణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎంజీఎల్ వెల్లడించింది. అయినప్పటికీ ఖర్చులను తగ్గిస్తూ వినియోగదారులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ఇటీవలి కాలంలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత మే 14న కూడా ఎంజీఎల్ కిలోకు రూ.2 చొప్పున ధరలను పెంచింది. తాజా పెంపుతో ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, బస్సులు సహా సీఎన్జీ ఆధారిత రవాణా సేవల నిర్వహణ వ్యయాలు మరింత పెరగనున్నాయి.ముంబై, థానే, నవీ ముంబైతో పాటు ఎంఎంఆర్లోని ఇతర ప్రాంతాల్లో ఈ ధరల పెంపు అమలులోకి వచ్చింది. ఎంజీఎల్ గ్యాస్ సరఫరా నెట్వర్క్ కళ్యాణ్, రాయ్గఢ్, రత్నగిరి, లాతూర్, ఉస్మానాబాద్, చిత్రదుర్గ, దావణగెరె వంటి ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంది.పెట్రోల్, డీజిల్తో పోలిస్తే ఇంకా చౌకేధరలు పెరిగినా కిలోమీటరుకు అయ్యే నిర్వహణ వ్యయ పరంగా సీఎన్జీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే చౌకైన ప్రత్యామ్నాయంగానే కొనసాగుతోంది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21గా, డీజిల్ ధర రూ.97.83గా నమోదైంది. దీంతో రవాణా రంగంపై ఇంధన వ్యయాల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం!
ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు ఇచ్చినా.. వారికి కేటాయించిన బెర్త్లు అందించకపోవడం, ఇండియన్ రైల్వే సేవల లోపమే అని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. భోజ్పూర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ నుంచి బీహార్లోని ఆరా వరకు వెళ్లాల్సిన నలుగురు ప్రయాణికులు.. ఎల్టీటీ పాట్నా ఎక్స్ప్రెస్లో కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వీరు రైలెక్కిన తరువాత తమకు కేటాయించిన బెర్త్లపై రైల్వే సిబ్బంది ఉండటం గమనించారు. తమకు కేటాయించిన సీట్లను ఖాళీ చేయాలని కోరినా.. ఎవరూ స్పందించలేదు. దీంతో వారు తమ గమ్యస్థానం వచ్చేవరకు నిలబడే ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ..తాము సీట్లను రిజర్వ్ చేసుకున్నప్పటికీ.. నిలబడే ప్రయాణం చేయడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నారు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించడానికంటే ముందు.. రైల్వే హెల్ప్లైన్, రైల్వే సేవా, రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేశారు. తమకు ఎస్ఎమ్ఎస్ ద్వారా కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ, ప్రయాణ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.బక్సర్ స్టేషన్ వద్ద వచ్చిన టికెట్ ఎగ్జామినర్ (TTE) వద్ద కూడా సమస్యను వివరించారు. అయితే.. రైలులో భారీ రద్దీ ఉందని, ఎలాగోలా మేనేజ్ చేసుకోండని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ వ్యవహారం రైల్వే ప్రయాణికుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించిందని కోర్టు అభిప్రాయపడింది.ఇక రైల్వే శాఖ మాత్రం.. ఈ వివాదం శాంతి భద్రతలకు సంబంధించినదని, ఇది ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) పరిధిలోకి వస్తుందని వాదించింది. తమవైపు నుంచి ఎలాంటి సేవల లోపం జరగలేదని, ఫిర్యాదుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అయితే.. కోర్టు ప్రయాణికులు సమర్పించిన టికెట్లు, ఫిర్యాదు రికార్డులు, మెసేజ్లు, ఫోటోలను పరిశీలించిన తరువాత రైల్వే శాఖ సేవలలో స్పష్టమైన లోపం ఉందని తేల్చింది. ప్రయాణికులకు కన్ఫర్మ్ చేసిన బెర్త్లు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది.రూ.20,000 పరిహారందీంతో నార్త్ సెంట్రల్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కలిసి ప్రయాణికులకు టికెట్ మొత్తానికి (రూ.1,876.80) 8 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా రూ.20,000 పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం 60 రోజుల్లో చెల్లించకపోతే, 10 శాతం వడ్డీతో చట్టపరమైన చర్యల ద్వారా వసూలు చేసుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పును చాలామంది ప్రశంసించారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వే శాఖ బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. కాబట్టి ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైతే.. సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి, పరిష్కారం పొందవచ్చు.ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్! -
రిలయన్స్ ఫౌండేషన్ సేవ.. కోట్లాది జీవితాల్లో మార్పు!
నీతా అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఖర్చులను గణనీయంగా పెంచింది. సామజిక కార్యక్రమాల కోసం ఏకంగా రూ.2248 కోట్లు ఖర్చు చేసింది. ఇది గత సంవత్సరం (రూ.2156 కోట్లు)తో పోలిస్తే సుమారు రూ.100 కోట్లు ఎక్కువ.కోవిడ్ తర్వాత కాలం నుంచి ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ మొత్తం సీఎస్ఆర్ ఖర్చు రూ.9,500 కోట్లు దాటింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరింది.ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ జీవనంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. గ్రామీణ ప్రాంతాల్లోని ఒక డెయిరీ రైతు ఆదాయం గణనీయంగా పెరిగి రెండింతలయింది. అంతే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్ కోసం స్కాలర్షిప్ సదుపాయాలను అందిస్తున్నారు.2020-21లో ప్రారంభమైన రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ కార్యక్రమం ప్రతి సంవత్సరం సుమారు 5,100 మంది విద్యార్థులకు ఉపయోగపడుతోంది. వీరిలో చాలామంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందారు. వారి కుటుంబాల ఆర్థిక స్థితిలో పురోగతికి సహాయపడుతున్నారు. ఇది సమాజంలో దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు.Reliance Foundation ka impact badhta ja raha hai! 💛 FY26 mein CSR spending Rs 2,248 crore tak pahunchi, aur education, healthcare, rural development aur sports projects ko support kiya. Ek strong aur healthy India ki taraf ek aur kadam.#RelianceFoundation pic.twitter.com/8s5lDMIOrg— Reliance Update (@RelianceUpdate_) May 29, 2026మహిళా సాధికారత విషయంలో కూడా స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ లిటరసీ, ఆర్థిక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళల్లో 75% మందికి ఆర్థిక నిర్ణయాలపై విశ్వాసం పెరిగింది. సగం మంది కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మరింతగా పాల్గొంటున్నారు.జంతు సంరక్షణ రంగంలో వంతారా ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జంతువులకు సంరక్షణ అందించారు. దీనికిగాను అనంత్ అంబానీకి 2025లో గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. నీతా అంబానీకి కూడా అంతర్జాతీయ స్థాయిలో హ్యూమానిటేరియన్ అవార్డులు వచ్చాయి.గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పాడి రైతుల రోజువారీ పాలు ఉత్పత్తి 6.14 లీటర్ల నుంచి 10.37 లీటర్లకు పెరిగింది. వారి వార్షిక ఆదాయం సుమారు 64.6% పెరిగింది. మొత్తం కుటుంబ ఆదాయం కూడా సుమారు 56% వరకు పెరిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఫౌండేషన్ సేవలు అందించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో వచ్చిన తుపాను హెచ్చరికల సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చి మత్స్యకారులు, రైతులను అప్రమత్తం చేసింది. ఈ సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా లభించింది. ఇలా రిలయన్స్ ఫౌండేషన్ సామజిక కార్యక్రమాల కోసం ప్రతి ఏటా భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది. -
రూ.1.4 కోట్ల బిల్లు కస్టమర్లకు వాపస్!
వ్యాపారంలో లాభాల కంటే వినియోగదారుల నమ్మకమే ముఖ్యమని బార్బెక్యూ రెస్టారెంట్ తెలిపింది. తాము అందించిన ఆహారం సొంత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గ్రహించిన సదరు యాజమాన్యం.. ఏకంగా కస్టమర్లకు సుమారు రూ.1.4 కోట్లు (1,62,000 అమెరికన్ డాలర్లు / 1.1 మిలియన్ యువాన్లు) తిరిగి చెల్లించింది. కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినా సంస్థే స్వయంగా ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుంది. ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. చైనావ్యాప్తంగా 142 అవుట్లెట్లతో విస్తరించిన ప్రసిద్ధ బ్రాండ్ ‘వెరీ లాంగ్ అగో లాంబ్ స్కేవర్స్’ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.అసలేం జరిగింది? గ్రిల్లింగ్లో లోపమే కారణమా?ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీకి చెందిన 24 అవుట్లెట్లలో దాదాపు 48,000 టేబుల్స్ వద్ద భోజనం చేసిన కస్టమర్లను రెస్టారెంట్ యాజమాన్యం ఈ నెల ప్రారంభంలో స్వయంగా సంప్రదించింది. అంతర్గత నాణ్యత సమీక్షలో ఒక షాకింగ్ నిజం బయటపడటమే దీనికి కారణం. ఆ సమయంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రిల్లింగ్ పరికరాల్లో ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడం వల్ల, మటన్ కబాబ్లు ఆశించిన స్థాయిలో గ్రిల్ కాలేదని కంపెనీ గుర్తించింది. కస్టమర్ల నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు రానప్పటికీ తమ బ్రాండ్ విలువలకు కట్టుబడి సదరు మటన్ స్కేవర్ల ధరలో 50 శాతం మొత్తాన్ని ఖాతాదారులకు రీఫండ్ చేసింది.నిజాయితీయా? మార్కెటింగ్ జిమ్మిక్కా?ఈ భారీ వాపసు కార్యక్రమం నెట్టింట వైరల్గా మారడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘లాభాల కంటే కస్టమర్ల సంతృప్తికే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించిన రెస్టారెంట్ నిజాయితీ అమోఘం’ అని మెజారిటీ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవడానికి, పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసిన ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం కావచ్చునని సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ‘గరం గరం’ సేల్.. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
ఫ్లిప్కార్ట్ (Flipkart) తమ ఫ్యాషన్ విభాగంలో కొత్త తరహా షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ‘GRWM GRWM’ పేరుతో ప్రత్యేక ఫ్యాషన్ సేల్ను ప్రారంభించింది. మే 29 నుంచి జూన్ 7, 2026 వరకు జరిగే ఈ ఫ్యాషన్ కార్నివల్లో 10 లక్షలకుపైగా ట్రెండీ స్టైల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. “Get Ready With Me” అనే గ్లోబల్ జెన్జీ (GenZ) ట్రెండ్కు భారతీయ మసాలా జోడిస్తూ “గరం గరం” శైలిలో రూపొందించిన ఈ క్యాంపెయిన్ ద్వారా ఫ్యాషన్ షాపింగ్ను ఒక కల్చరల్ ఎక్స్పీరియన్స్గా మార్చాలని ఫ్లిప్కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రారంభ అంచనాల ప్రకారం ఈ సేల్కు 55 కోట్లకుపైగా సందర్శనలు నమోదయ్యే అవకాశం ఉండగా, అందులో సగానికి పైగా జెన్జీ వినియోగదారులే ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సేల్లో ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లతో పాటు డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్లు, మార్కెట్ప్లేస్ విక్రేతలు పాల్గొంటున్నారు. బాగీ జీన్స్, కొరియన్ ట్రౌజర్స్, ఫ్లోరల్ డ్రెస్సులు, పలాజో సెట్లు వంటి తాజా ఫ్యాషన్ ట్రెండ్స్ను వినియోగదారులకు అందించనున్నారు.లీవైస్, టైటన్, రెడ్ టేప్, నైక్, ప్యూమా, ఆసిక్స్, సఫారీ, రేర్ రాబిట్, ది బేర్ హౌస్ వంటి ప్రముఖ బ్రాండ్లపై 90 శాతం వరకు తగ్గింపులు, సూపర్కాయిన్స్ ఆఫర్లు, స్క్రాచ్ కార్డులు, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ బడ్జెట్ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లు రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. -
చిన్న సంస్థల్లో ‘పశ్చిమాసియా’ సంక్షోభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశీయంగా దాదాపు 61 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్ సౌరభ్ సన్యాల్ తెలిపారు. సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, వ్యాపారాలు మందగించడంతో పలు సంస్థలు తీసుకున్న రుణాలు ఎన్పీఏలుగా మారే ముప్పు నెలకొందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.55 లక్షల కోట్లతో ఈసీఎల్జీఎస్ (ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీమ్) తరహాలో రాష్ట్రాలు ప్రత్యేక స్కీమ్లాంటిదేదైనా ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నారు. అలాగే సంక్లిష్టమైన నిబంధనల అమలుకు సంబంధించి కొంత వెసులుబాట్లు కల్పించాలని గురువారమిక్కడ డేటా సెంటర్స్, ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. చిన్న సంస్థలకు ఉపశమనం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్కి కూడా అసోచాం పలు ప్రతిపాదనలు చేసినట్లు సన్యాల్ చెప్పారు. ఆరు నెలల పాటు రుణాలపై మారటోరియం విధించడం, గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో విదేశీ మారకంలో ప్రీ–షిప్మెంట్ రుణాలు కల్పించడం, వాటి కాల వ్యవధిని 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచడంలాంటి చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. అలాగే తదుపరి రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకులు అవసరమైనప్పుడు తీసుకునేలా రెపో రేటుకే రూ. 1 లక్ష కోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సన్యాల్ తెలిపారు. మరో మూడు నుంచి ఆరు నెలల వరకు ఎకానమీ సాధారణంగానే ఉన్నా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆ తర్వాత సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉన్నా, వృద్ధి రేటు 7 శాతం లోపునకు తగ్గకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు సన్యాల్ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తకపోయి ఉంటే ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీ సంస్థలకు గణనీయంగా ప్రయోజనాలు లభించేవని చెప్పారు. -
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాభం రూ. 400 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఏఎల్) రూ.400 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ4లో కంపెనీ రూ.253 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా క్యూ4లో ఆదాయం రూ. 2,977 కోట్ల నుంచి రూ.4043 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాదికి గాను దశాబ్దకాలంలో తొలిసారి లాభాలు నమోదు చేసింది. రూ. 472 కోట్ల లాభం ప్రకటించింది. ఆదాయం రూ. 10,836 కోట్ల నుంచి రూ. 15,201 కోట్లకు ఎగిసింది. జీఏఎల్ హైదరాబాద్, ఢిల్లీ, గోవాలో విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. సవాళ్లు నెలకొన్నప్పటికీ తమ నిర్వహణలోని విమానాశ్రయాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ, నాలుగో త్రైమాసికంలోనూ ప్యాసింజర్ల రద్దీ వరుసగా 12.16 కోట్లు, 3.17 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. -
ఆరో ఏడాదీ అంబానీ వేతనం జీరో..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (69) వరుసగా ఆరో ఏడాదీ సున్నా వేతనంతోనే సరిపెట్టుకున్నారు. కంపెనీ వార్షిక నివేదిక లో ఈ విషయం వెల్లడైంది. 2008–09 ఆర్థిక సంవత్సరంలో ముకేశ్ రూ.15 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. అప్పటి నుంచి 2019–20 వరకు ఆయన పారితోషికంలో ఎలాంటి మార్పు లేదు. కానీ, కరోనా విపత్తు నేపథ్యంలో 2020–21లో వేతన ప్రయోజనాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. భారీ డివిడెండ్ ఆదాయం: ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీకి రిలయన్స్లో ఉన్న వాటాల రూపంలో భారీ డివిడెండ్ ఆదాయం వస్తుండడం విశేషం. వ్యక్తిగతంగా ఆయన పేరిట ఉన్న 1.61 కోట్ల షేర్లపై రూ.9.66 కోట్ల డివిడెండ్ ఆదాయం 2024–25లో వచ్చింది. ఇక కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ సంస్థలకు మొత్తంగా 664.5 కోట్ల షేర్లు (50.07% వాటా) ఉన్నాయి. వీటి రూపంలో రూ.3,987 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రమోటర్ల గ్రూప్నకు వెళ్లింది. ఇక రిలయన్స్ గ్రూప్లో పనిచేసే అంబానీ సోదరులు నిఖిల్, హితల్ మేశ్వానీ ఎప్పటి మాదిరే గత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.25 కోట్ల చొప్పున అందుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వార్షిక ప్రయోజనాలు 2025–26లో రూ.20.58 కోట్లకు పెరిగాయి. ఇక అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రూ.12.17 కోట్లు లభించాయి. -
శాంసంగ్ నుంచి 72 టీవీ మోడల్స్
శాంసంగ్ ఇండియా తాజాగా విజన్ ఏఐ టీవీ శ్రేణిని ఆవిష్కరించింది. 72 టీవీ మోడల్స్ను ప్రవేశపెట్టింది. వీటిలో మైక్రో ఆర్జీబీ, ఓఎల్ఈడీ, నియో క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ మొదలైనవి ఉన్నాయి. శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా ఉచిత కంటెంట్, కేర్ ప్లస్ ద్వారా అదనపు వారంటీ మొదలైనవి పొందవచ్చు.పరిమిత కాలం పాటు నిర్దిష్ట టీవీ మోడల్స్పై కాంప్లిమెంటరీగా రూ. 1,02,990 విలువ చేసే సౌండ్బార్, రూ. 23,990 విలువ చేసే మ్యూజిక్ స్టూడియో ఉచితంగా లభిస్తాయని సంస్థ తెలిపింది. యూహెచ్డీ టీవీల శ్రేణి ధర రూ. 36,990 నుంచి, మైక్రో ఆర్జీబీ రేటు రూ. 1,24,990 నుంచి ప్రారంభమవుతుంది. -
సగానికి తగ్గిన వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్
వెంచర్ క్యాపిటల్, ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో సగానికి క్షీణించాయి. వెరసి ఏప్రిల్లో 38 డీల్స్ ద్వారా 2.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా డాలరుతో మారకంలో రూపాయి క్షీణత, రాజకీయ భౌగోళిక ఆందోళనలు దెబ్బతీశాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్తో పోలిస్తే విలువలో 50 శాతం తగ్గాయి.2026 ఏప్రిల్లో 83 లావాదేవీలు నమోదయ్యాయి. ఇవి 29 నెలల కనిష్టంకాగా.. గతేడాది ఏప్రిల్లో 134, ఈ ఏడాది మార్చిలో 131 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. డాలరుతో మారకంలో రూపాయి 96 స్థాయికి పడిపోవడం, అధికస్థాయిలలో కొనసాగుతున్న ముడిచమురు ధరలు, రాజకీయ భౌగోళిక ఆందోళనలు పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ ఆల్టర్నేటివ్స్ 28.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు గత నెలలో నమోదైన అతిపెద్ద డీల్గా నివేదిక తెలియజేసింది. బెంగళూరు, పుణేలలో ఆర్ఎంజెడ్ కార్యాలయ ఆస్తులలో ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. -
వైద్య రంగంలోకి బజాజ్ గ్రూప్
బజాజ్ గ్రూప్ ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అడుగు పెడుతోంది. రూ.2,000–2,500 కోట్లతో వచ్చే మూడేళ్ల కాలంలో పుణెలో హాస్పిటల్ను ఏర్పాటు చేయనున్నట్టు బజాజ్ ఇంటెగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్ ఎండీ నీరవ్ బజాజ్ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 12 పట్టణాల్లోకి సేవలను విస్తరిస్తామని తెలిపారు. క్లినిక్లు, అంబులేటరీ సేవలు, హోమ్కేర్ (ఇంటివద్దే వైద్య సేవలు), హాస్పిటల్తో కూడిన ఆరోగ్య సంరక్షణ నమూనాను రూపొందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.వ్యాధుల నివారణ నుంచి తక్షణ చికిత్స వరకు ఆస్పత్రికి దూరంగా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ఆరోగ్య సంరక్షణ నమూనా చాలా భిన్నమైందంటూ దీన్ని సొంతంగానే నిర్మింకుంటామని చెప్పారు. పడకల సంఖ్య, ఒక్కో పడకవారీ ఆదాయం తదితర సంప్రదాయ కొలమానాలను తాము అనుసరించబోమన్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్స్ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. -
భారత సైన్యంతో ఎయిరిండియా ఒప్పందం
దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, సైనిక దివ్యాంగుల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ వితంతువులు(వీర నారీ-యుద్ధంలో భర్తలను కోల్పోయినవారు), వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్మీ ప్రత్యేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా భారత సైన్యంతో ఎయిరిండియా సహకార ఒప్పందం కుదుర్చుకుంది. దేశ నిర్మాణంలో, సామాజిక బాధ్యతలో కార్పొరేట్ రంగానికి ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.తొలి విడతగా 60 మందికి అవకాశంఈ వినూత్న భాగస్వామ్యం ద్వారా వీర నారీలు, వారి పిల్లలకు ‘ఎయిరిండియా శాట్స్ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఏఐ సాట్స్)లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం కింద ప్రాథమికంగా 20 మంది యుద్ధ వితంతువులను, 40 మంది వారి పిల్లలను ఎయిర్లైన్స్ ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వీరికి విమానాశ్రయ కార్యకలాపాల్లో కీలకమైన కస్టమర్ సేవలు, లోడ్ అండ్ కంట్రోల్, ర్యాంప్ ఆపరేషన్స్ విభాగాల్లో బాధ్యతలు అప్పగిస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వీరికి శిక్షణ అందిస్తారు. తద్వారా దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ ఉద్యోగానికి తక్షణమే సిద్ధమయ్యేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతారు.‘ఆశా’ పాఠశాలల్లో వృత్తి విద్యా ల్యాబ్ల ఏర్పాటుకంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనికులు, పూర్వ సైనికోద్యోగులు (అనుభవజ్ఞులు), దివ్యాంగుల పిల్లల సంక్షేమం కోసం భారత సైన్యం ప్రత్యేకంగా ‘ఆశా’ (ఆర్మీ స్పెషల్ హెల్ప్ అండ్ అసోసియేషన్) పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ చిన్నారులకు నాణ్యమైన విద్యా వైద్యంతో పాటు దీర్ఘకాలిక భవిష్యత్తును అందించేందుకు ఎయిరిండియా వృత్తి శిక్షణా మౌలిక సదుపాయాలను నిర్మించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 25 ఆశా పాఠశాలల్లో అత్యాధునిక వృత్తి శిక్షణా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడమే ఈ చొరవ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే 10 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభం కాగా, త్వరలోనే మిగిలిన 15 పాఠశాలలకు కూడా దీనిని విస్తరించనున్నారు.వైవిధ్యమైన రంగాలలో శిక్షణచిన్నారుల సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేలా ఈ ల్యాబ్ల్లో విభిన్న విభాగాలపై అనుభవపూర్వక శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంలో ఫోటోగ్రఫి, విజువల్ స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్, పెయింటింగ్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కుకింగ్, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, బోటిక్ అండ్ టైలరింగ్, ఎలక్ట్రికల్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో శిక్షణ ఇస్తారు.భారత సైన్యంతో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఎయిరిండియా గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్, కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ హెడ్ పి.బాలాజీ మాట్లాడుతూ ‘భారత సైన్యంతో ఎయిరిండియా భాగస్వామ్యం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు; ఇది దేశ నిర్మాణ ప్రయత్నంలో భాగం కావాలనే మా ఉమ్మడి సంకల్పానికి ప్రతిరూపం. నైపుణ్యాలను బలోపేతం చేయడం, సరైన అవకాశాల ద్వారా సమాజంలో గౌరవాన్ని, సాధికారతను పెంపొందించడమే ఈ రెండు కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. సైన్యంతో కలిసి పనిచేస్తూ భవిష్యత్తులో స్థిరమైన, సానుకూల ప్రభావాన్ని చూపే ఒక స్కేలబుల్ మోడల్ను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అన్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఉద్యోగాల కోతకు ‘ఏఐ’ సాకు మాత్రమే
కృత్రిమ మేధ ప్రపంచాన్ని మార్చేస్తోందని, మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా మారిపోయిందని ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రముఖ దేశీయ సాఫ్ట్వేర్ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబు ఖండించారు. ప్రపంచ టెక్ పరిశ్రమ అంతా కలిసి ‘ఏఐ వల్ల మాత్రమే సానుకూల మార్పులు సాధ్యం’ అనే ఒక బలవంతపు కథనాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆయన మండిపడ్డారు.ప్రస్తుతం టెక్ ప్రపంచంలో నడుస్తున్న ఏఐ హైప్ వెనుక ఉన్న అసలు నిజాలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన ఎండగట్టారు. ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్, ఆర్థిక మందగమనంపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఉత్పాదకత శూన్యం..ఏఐ వల్ల కంపెనీల్లో ఉత్పాదకత అసాధారణంగా పెరిగిపోతోందన్న వాదనలో వాస్తవం లేదని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. వాస్తవ లాభాలు చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కంపెనీలు తమ ఆర్థిక ఒత్తిళ్లను దాచడానికి, పెట్టుబడిదారుల అంచనాలను అందుకోవడానికి మాత్రమే ఏఐని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు.‘కంపెనీలు తాము చేస్తున్న ఉద్యోగాల తొలగింపులను ఏఐ ఖాతాలో వేయడం చాలా సౌకర్యవంతంగా మారింది. ఇలా చేయడం వల్ల ఆయా సంస్థలు భవిష్యత్ సాంకేతికతను అందుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తున్నాయి. కానీ, అసలు నిజం అది కాదు’ అని శ్రీధర్ వెంబు అన్నారు. మానవ శ్రమను అకస్మాత్తుగా భర్తీ చేసేంత సామర్థ్యం ఏఐకి ఇంకా రాలేదని, ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్కు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ప్రపంచవ్యాప్త ఆర్థిక ఒత్తిళ్లే ప్రధాన కారణమని వెంబు విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక చిత్రం రోజురోజుకూ బలహీనపడుతోందన్నారు. కేవలం ఏఐ మాత్రమే ఆ లోతైన సంక్షోభ సమస్యలను పరిష్కరించలేదని హెచ్చరించారు.ఐఫోన్ విప్లవం కూడా 2008 సంక్షోభాన్ని ఆపలేకపోయింది!గత సాంకేతిక విప్లవాలను ఉదాహరణగా చూపుతూ శ్రీధర్ వెంబు ప్రస్తుత ఏఐ బూమ్ను విమర్శించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతానికి ఈ ఏఐ ఇన్వెస్ట్మెంట్ బబుల్ కాపాడుతూ వస్తోందని, కానీ ఇది ఎక్కువ కాలం సాగదని స్పష్టం చేశారు. గతంలో ఐఫోన్ విప్లవం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేకపోయిందని గుర్తుచేశారు. సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ, ప్రపంచ ఆర్థిక అసమతులాన్ని ఏఐ తన మాయాజాలంతో ఒక్క రాత్రిలో నయం చేయలేదని వెంబు తేల్చిచెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ టూల్స్ ఉత్పాదకతను ఆకాశానికి తీసుకెళ్తాయనే అతిపెద్ద అపోహను కూడా తీవ్రంగా ప్రశ్నించారు.స్వరం మారుస్తున్న గ్లోబల్ టెక్ లీడర్స్!విచిత్రం ఏమిటంటే, ఏఐ విప్లవానికి పితామహుడిగా చెప్పుకునే ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం ఇటీవల తన స్వరాన్ని మార్చడం గమనార్హం. ‘దీని (ఏఐ ప్రభావం) గురించి నేను తప్పుగా అంచనా వేసినందుకు సంతోషిస్తున్నాను’ అంటూ ఆల్ట్మాన్ వ్యాఖ్యానించారు. టెక్ పరిశ్రమ మొదట్లో ఊహించిన దానికంటే సమాజం ఇప్పటికీ మానవ మేధస్సుకు, మానవ పరస్పర చర్యలకే అత్యధిక విలువ ఇస్తోందని ఆయన అంగీకరించారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
డిజిటల్ చెల్లింపులకు కేంద్ర బిందువు భారత్ కనెక్ట్
దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పౌరుల జీవన ప్రమాణాలను, ప్రభుత్వ సేవలను సమూలంగా మార్చేస్తోంది. సాధారణ యుటిలిటీ బిల్లులకే పరిమితం కాకుండా, విస్తృత శ్రేణి ప్రభుత్వ సర్వీసులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడంలో భారతదేశం ప్రగతి సాధిస్తోంది. దేశవ్యాప్తంగా మొబైల్ యాప్ల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘భారత్ కనెక్ట్’ ఈ డిజిటల్ చెల్లింపుల పరివర్తనకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.భారత్ కనెక్ట్ (గతంలో భారత్ బిల్ పే - బీబీపీఎస్) వివిధ బిల్లుల చెల్లింపులను, ఆర్థిక లావాదేవీ మార్గాలను ఒకే ప్లాట్ఫారమ్పైకి తీసుకురావడం ద్వారా పౌరులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా భారత్ కనెక్ట్ ఆధారిత యాప్లు, వెబ్సైట్ల ద్వారా కింది సేవలను క్షణాల్లో అందుతున్నాయని పేర్కొంది.విద్యుత్ బిల్లులుమున్సిపల్, నీటి పన్నులుఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్లుఈ-చలాన్లులైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలునేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ఇది భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన కస్టమర్-టు-గవర్నమెంట్ (సీ2జీ) డిజిటల్ సర్వీసుగా నిలిచింది. ప్రస్తుతం భారత్ కనెక్ట్ నెట్వర్క్లో 29 కంటే ఎక్కువ విభాగాల్లో 22,000 పైగా బిల్లుదారులు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే 700 కంటే ఎక్కువ యాప్ల ద్వారా ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.డిజిటల్ భరోసాఈ మార్పు కేవలం చెల్లింపుల వేగానికి సంబంధించింది మాత్రమే కాదని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేదని ఎన్పీసీఐ భారత్ బిల్పే లిమిటెడ్ (ఎన్బీబీఎల్) ఎండీ, సీఈఓ నూపుర్ చతుర్వేది పేర్కొన్నారు. ‘శ్రమతో కూడిన ప్రక్రియల స్థానంలో సులభతరమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ ద్వారా అన్ని సేవలు పారదర్శకంగా ఉన్నాయి. భారీ స్థాయిలో డిజిటల్ అడాప్షన్ను కొనసాగించడానికి ఈ నమ్మకమే అత్యంత కీలకం’ అని చతుర్వేది అన్నారు.హైబ్రిడ్ మోడల్భారత్ కనెక్ట్ స్మార్ట్ఫోన్ వినియోగదారులతోపాటు అందరికీ కలుపుకొనిపోయే సాంకేతిక నిర్మాణాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఆఫ్ లైన్ ఏజెంట్ల ద్వారా డిజిటల్ పరిజ్ఞానం లేని వారికి కూడా ఈ సేవలను అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తమ సమీపంలోని ఏజెంట్ వద్దకు వెళ్లి నగదు రూపంలో ప్రభుత్వ బాకీలను సులభంగా చెల్లించవచ్చు. ఈ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ విభజనను సమర్థవంతంగా తొలగిస్తోంది.ఈ వ్యవస్థీకృత ప్రక్రియ ద్వారా ప్రజలు తమ ఖర్చులను ట్రాక్ చేసుకోవడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తూ క్రమశిక్షణ అలవాటు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.‘ప్రభుత్వ విభాగాలకు సైతం ఇది ఎంతో మేలు చేస్తోంది. దీనివల్ల రాబడుల సేకరణ మెరుగైంది. చెల్లింపుల్లో జాప్యం తగ్గింది. వ్యవస్థలో పారదర్శకత పెరిగి పౌరులకు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నమ్మకం బలపడింది’ అని తెలిపారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
కాగితంపై ఆహా ఓహో.. ముఖాముఖిలో..
ఉద్యోగ అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సరికొత్త ట్రెండ్గా మారింది. ఒకప్పుడు చక్కటి రెజ్యూమే (సీవీ) రాయడం చేతకాక ఎంతోమంది ప్రతిభావంతులు వెనకబడిపోయేవారు. కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ పుణ్యమా అని నిమిషాల్లో ప్రొఫెషనల్ రెజ్యూమేలు సిద్ధమైపోతున్నాయి. కంపెనీల అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏటీఎస్) ఫిల్టర్లను సులభంగా దాటేలా కీవర్డ్స్తో వీటిని అభ్యర్థులు ముస్తాబు చేస్తున్నారు. అయితే, ఇదే ఇప్పుడు రిక్రూటర్లకు తలనొప్పిగా మారింది. కాగితంపై అద్భుతంగా కనిపిస్తున్న అభ్యర్థులు తీరా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కనీస ప్రతిభ చూపలేకపోతుండటంతో కంపెనీలు తమ ఎంపిక వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి.గణాంకాలు ఏం చెబుతున్నాయి?ప్రస్తుతం వైట్ కాలర్ ఉద్యోగాలకు పోటీ పడేవారిలో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని మార్కెట్ వర్గాల తాజా డేటా స్పష్టం చేస్తోంది.హనార్.ఏఐ నివేదిక: ప్రస్తుతం దాదాపు 70 శాతానికి పైగా వైట్ కాలర్ అభ్యర్థులు తమ రెజ్యూమేల రూపకల్పనకు ఏఐని వాడుతున్నారు. ఇక యువత (జెన్ జీ) విషయానికి వస్తే ఈ సంఖ్య ఏకంగా 85 శాతం దాటిపోయింది.నెక్సాస్క్రీన్ విశ్లేషణ: ఒకే రకమైన అనుభవం ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఏఐ ద్వారా ఆప్టిమైజ్ చేసిన రెజ్యూమే ఉన్న అభ్యర్థికి షార్ట్లిస్ట్ అయ్యే అవకాశం 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటోంది.లింక్డ్ఇన్ పరిశోధన: కొవిడ్ పూర్వపు రోజులతో పోలిస్తే ప్రస్తుతం నియామక ప్రక్రియలు 40 శాతం పెరిగాయి. అయినప్పటికీ, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం సవాలుగా మారిందని 74 శాతం మంది రిక్రూటర్లు వాపోతున్నారు. ఇందులో 53 శాతం మంది ఏఐ రెజ్యూమేల వెల్లువను నిందిస్తుండగా 47 శాతం మంది నైపుణ్యాల కొరతను కారణంగా చూపుతున్నారు.నకిలీల జోరు.. పెరిగిన నిఘా!రెజ్యూమేల్లో ఏఐ వాడకం పెరగడంతోపాటు ఆన్లైన్ అసెస్మెంట్లలో (పరీక్షల్లో) అవసరాన్ని మించి ఏఐ టూల్స్ వాడుతూ దొరికిపోతున్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రముఖ హైరింగ్ ప్లాట్ఫామ్ హైర్ప్రో సీఓఓ పసుపతి ఎస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రిక్రూటర్ల ముందున్న అతిపెద్ద సవాలు.. ఏఐ సృష్టించిన హడావుడిని దాటుకుని అభ్యర్థిలో ఉన్న నిజమైన ప్రతిభను గుర్తించడమే’ అని పేర్కొన్నారు.ఒకే మూసలో రెజ్యూమేలు..‘ఏఐ రెజ్యూమేలు ఏటీఎస్ ఫిల్టర్లను సులభంగా దాటుతున్నాయి. కాగితంపై అంతా సవ్యంగానే ఉంటోంది. కానీ, ప్రతి ఒక్కరూ ఒకే రకమైన టెంప్లేట్లు వాడటం వల్ల రిక్రూటర్లకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి’ అని ‘హనార్.ఏఐ’ వ్యవస్థాపకుడు కృష్ణ ఖండేల్వాల్ తెలిపారు. కాగితంపై ప్రొఫైల్ ఎంత బలంగా ఉందో ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రదర్శన అంత బలహీనంగా ఉంటోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులు తమ నైపుణ్యాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఏఐ ఉపయోగపడాలి కానీ, లేని అనుభవాన్ని ఉన్నట్లు చూపించడానికి కాదని హెచ్చరిస్తున్నారు. పేపర్ షార్ట్లిస్టింగ్లో టాప్లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అందులో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కనీసం బాటమ్ 25 పర్సంటైల్ స్కోరు కూడా సాధించలేకపోతున్నారని వాపోతున్నారు.కెరీర్ మార్చేవారికి శాపం!ఈ ఏఐ ఆధారిత ఫిల్టరింగ్ వ్యవస్థ వల్ల కొందరు తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. స్వదేశంలో పెద్ద స్టార్టప్ల్లో లేదా యూనికార్న్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఏటీఎస్ సిస్టమ్స్ ఆయా కంపెనీల పేర్లను గుర్తించలేక వారి అప్లికేషన్లను ఆటో-రిజెక్ట్ చేస్తున్నాయి. వేరే రంగం నుంచి ఐటీ లేదా ఇతర విభాగాలకు మారాలనుకునే అభ్యర్థుల హిస్టరీలో నిర్దిష్ట కీవర్డ్స్ లేకపోవడం వల్ల ఏఐ సహాయంతో రెజ్యూమే మార్చినా సిస్టమ్స్ వాటిని తిరస్కరిస్తున్నాయి.మారుతున్న నియామక సూత్రాలుకీవర్డ్స్ ఆధారిత రెజ్యూమేలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి.రెఫరల్స్, పోర్ట్ఫోలియోలు: పాత కంపెనీల బ్రాండ్ వాల్యూ, గతంలో చేసిన ప్రాజెక్టుల పోర్ట్ఫోలియోలు, అంతర్గత రెఫరల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.వాయిస్ బేస్డ్ అసెస్మెంట్స్: కేవలం రెజ్యూమేలు చూడకుండా తొలి దశలోనే 15 నిమిషాల వాయిస్ కాల్స్ లేదా ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థికి ఉన్న ప్రాక్టికల్ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి బయటపడతాయని రిక్రూటర్లు నమ్ముతున్నారు.ఫలితాల ఆధారిత పరిశీలన: కేవలం బాధ్యతల గురించిన రాతలు కాకుండా అభ్యర్థి సాధించిన నిర్దిష్ట విజయాలు, ప్రాజెక్ట్ ఓనర్షిప్, సమస్యల పరిష్కార సామర్థ్యం ఆధారంగా అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఇంధన భద్రతే ముఖ్యం
ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు), వనరుల నియంత్రణ అన్నవి భవిష్యత్ ఆర్థిక ఆధిపత్యానికి ఎంతో కీలకమని భూమి వెంచర్స్ సీఈవో, వేదాంత గ్రూప్ మాజీ సీఈవో అయిన సునీల్ దగ్గల్ అభిప్రాయపడ్డారు. భారత్ ప్రపంచంలోమూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉందంటూ, తన అవసరాల్లో 88–89 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే గ్యాస్ డిమాండ్లో సగాన్ని దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్నట్టు తెలిపారు. కనుక భారత్ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి ఇంధన భద్రత ఎంతో కీలకమన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పారిశ్రామిక సరఫరాలు, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలను మార్చివేస్తున్న పరిస్థితులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాహ్య ఇంధన సరఫరాలపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు గత కొన్నేళ్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన సమీకరణాలను మార్చగా, అమెరికా–ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలు ‘హార్మూజ్ జలసంధి’ వంటి చమురు రవాణా మార్గాల ప్రాధాన్యతను గుర్తుచేసినట్టు పేర్కొన్నారు. భారతదేశ ముడిచమురు దిగుమతుల్లో 45 శాతం హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తున్నందున, పశ్చిమాసియాలో స్థిరత్వం భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్నారు. ఆయిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ వాణిజ్య లోటు విస్తరించి, ద్రవ్యోల్బణ ఒత్తిడులు అధికమవుతాయంటూ.. ఇది దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని దగ్గల్ హెచ్చరించారు. కీలక ఖనిజాల ప్రాధాన్యత..పరిమిత ఇంధన వనరులపై ఆధారపడిన ఏ దేశమూ దీర్ఘకాలిక ఆర్థిక సార్వభౌమాధికారాన్ని సాధించలేదని సునీల్ దగ్గల్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్లు, ఏఐ సదుపాయాలు, రక్షణ టెక్నాలజీలకు అవసరమైన కీలక ఖనిజ వనరులు, ప్రాసెసింగ్ సామర్థ్యాలపైనే తదుపరి దశ అంతర్జాతీయ పోటీతత్వం ఆధారపడి ఉంటుందన్నారు. గత శతాబ్దంలో చమురుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. రాబోయే రోజుల్లో కీలక ఖనిజాలకు అంతటి ప్రాముఖ్యత ఉంటుందని దుగ్గల్ పేర్కొన్నారు. లిథియం, కాపర్, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, అరుదైన భూ ఖనిజాల (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) వెలికితీత, శుద్ధి, సరఫరా గొలుసులను నియంత్రించే దేశాలే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తాయని ఆయన చెప్పారు. కనుక ఇంధన పరివర్తనను కేవలం పర్యావరణ పరమైన మార్పుగా కాకుండా.. ఒక వ్యూహాత్మక పారిశ్రామిక మార్పుగా చూడాలన్నారు. 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారద్ కీలక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సరఫరాలపై అతిగా ఆధారపడటం సరికాదని ఆయన హెచ్చరించారు. మైనింగ్, లోహాలు, రవాణా, మౌలిక సదుపాయాలను కేవలం పరిశ్రమలుగా కాకుండా వ్యూహాత్మక ఆర్థిక స్తంభాలుగా చూడాలని సూచించారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
బీమా రంగం డీలా
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం పాటు కొనసాగితే బీమా రంగం వృద్ధి మందగించొచ్చని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధాని చెప్పినట్టు మనం కష్టకాలాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడకుండా రక్షణ కలి్పంచారు. ఒకవేళ ఈ సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది వ్యక్తుల ఖర్చులు, పొదుపులను ప్రభావితం చేస్తుంది. ఈ సంక్షోభం సాధ్యమైనంత త్వరలో ముగిసి, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నాం’’అని దొరైస్వామి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ప్రభావితమైతే బీమా రంగం దీనికి దూరంగా ఉండలేదన్నారు. వ్యక్తుల ఆదాయాలు, వారి సామర్థ్యాలు ప్రభావితమైతే బీమా రంగంపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో మరికొంత విక్రయించే విషయమై ఎదురైన ఒక ప్రశ్నకు.. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దొరైస్వామి చెప్పారు. లిస్టింగ్ నిబంధనలను పాటించడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించినట్టు దొరైస్వామి పేర్కొన్నారు. వాటాలను దశల వారీగా 10–15 శాతం మేర తగ్గించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. 2022లో ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాలను రూ.21,000 కోట్లకు విక్రయిచడం గమనార్హం. -
నందన్ నీలేకని వీసీ పెట్టుబడులు..రూ.3,000 కోట్లతో రెడీ
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఈసీవో, సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు తెరతీశారు. వెంచర్ క్యాపిటల్(వీసీ) సంస్థ ఫండమెంటమ్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రత్యేకించిన ఫ్రంటియర్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఇందుకు ప్రాథమికంగా రూ. 3,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నారు.దేశీయంగా ఏఐ, డీప్టెక్ కంపెనీల దన్నుతో ఫండమెంటమ్ ఫ్రంటియర్ అడ్వయిజర్స్(ఎఫ్2ఏ)ను ఏర్పాటు చేశారు. సెబీ అనుమతించిన తొలి ఫండ్.. ఫండమెంటమ్ 3– ఏఐ, డీప్టెక్ రూ. 2,000 కోట్లు సమకూర్చనున్నాయి. వీటికి అదనంగా ఎఫ్2ఏ మరో రూ. 1,000 కోట్ల సహపెట్టుబడులను సమీకరించనుంది. ఎఫ్2ఏ టెక్నాలజీ ఆధారిత బిజినెస్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ప్రధానంగా కన్జూమర్, ఎంటర్ప్రైజ్, ఫిజికల్ ఏఐను లక్ష్యంగా చేసుకోనుంది. -
ఏఐ బూమ్తో శామ్సంగ్ బంపర్ ఆఫర్
కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్ రంగాన్ని ఏ విధంగా శాసిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదు. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తన చిప్ విభాగం ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ సాధించిన బంపర్ ప్రాఫిట్స్ నేపథ్యంలో చిప్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.3.25 కోట్లు) బోనస్ లభించనుంది. బుధవారం నాడు శాంసంగ్కు చెందిన అతిపెద్ద కార్మిక సంఘం (యూనియన్) ఈ మెగా బోనస్ ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపింది. దాదాపు 18 రోజుల పాటు సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె హెచ్చరికల నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగివచ్చి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఏకంగా 49 రెట్లు పెరిగిన ఆదాయం!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ బూమ్ కారణంగా చాట్ జీపీటీ, జెమిని వంటి అధునాతన ఏఐ మోడల్స్, భారీ డేటాసెంటర్లకు మెమరీ చిప్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ మెమరీ చిప్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న శామ్సంగ్.. గత త్రైమాసికంలో తన చిప్ విభాగం ఆదాయంలో ఏకంగా 49 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ అసాధారణ వృద్ధి కారణంగానే తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ తర్వాత మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్లను దాటిన రెండో ఆసియా కంపెనీగా శామ్సంగ్ ఇటీవల రికార్డు సృష్టించింది.ఎవరు అర్హులు?ఈ భారీ బోనస్ ప్యాకేజీ శామ్సంగ్ ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం కంపెనీకి చెందిన ప్రాసెసర్లు, ర్యామ్, హై-ఎండ్ మెమరీ చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ (చిప్) విభాగానికి మాత్రమే ఇది పరిమితం. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ డేటాసెంటర్లలో వాడే చిప్స్ అన్నీ ఈ విభాగంలోనే తయారవుతాయి.ఈ ఏడాది మార్చిలో శామ్సంగ్ సమర్పించిన అధికారిక ఫైలింగ్ ప్రకారం.. 2025లో కంపెనీ ఉద్యోగులు సగటున 158 మిలియన్ వాన్ (సుమారు రూ.1 కోటి) ఆర్జించారు. కానీ ఈసారి రాబోయే బోనస్ ఆ మొత్తాన్ని ఎన్నో రెట్లు అధిగమించింది.కేవలం బోనస్ల కోసమే 26.5 బిలియన్ డాలర్లుశామ్సంగ్ అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ చిప్ విభాగంలో సుమారు 78,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరికీ సగటున 3,40,000 డాలర్ల బోనస్ ఇవ్వాలంటే కంపెనీ కేవలం బోనస్ కోసమే ఏకంగా 26.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయబోతోంది. కార్పొరేట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు వ్యయంగా మారనుంది.ఓటింగ్లో భారీ మెజారిటీయూనియన్ ప్రతినిధులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందంపై నిర్వహించిన ఓటింగ్లో అర్హులైన సభ్యులలో 95 శాతానికి పైగా పాల్గొన్నారు. మొత్తం 62,600 బ్యాలెట్లలో 73.7 శాతం మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. నిబంధనల ప్రకారం సగానికి పైగా మద్దతు అవసరం కాగా, ఉద్యోగులు భారీ మెజారిటీతో దీనిని ఆమోదించారు.తప్పిన గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభంఈ ఒప్పందం కేవలం శామ్సంగ్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ టెక్ రంగానికి సైతం పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే దక్షిణ కొరియా మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో శామ్సంగ్ వాటా ఏకంగా 12.5 శాతం. అలాగే ఆ దేశ ఎగుమతుల్లో మెమరీ చిప్స్ వాటా 35 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం ఈ డిమాండ్లకు ఒప్పుకోకపోయి ఉంటే ఉద్యోగులు 18 రోజుల పాటు సమ్మెకు వెళ్లేవారు. దీనివల్ల ప్రపంచవ్యాప్టింగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల తయారీ నిలిచిపోయి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతినేది. వారం రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ముప్పు తప్పింది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
పసిడి వెనక్కి.. వెండి ముందుకు
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.2,800 నష్టపోయి రూ.1,62,400 వద్ద స్థిరపడింది. వెండి కిలోకి రూ.2,000 పెరిగి రూ.2,73,000కు చేరింది. ఇరాన్–యూఎస్ మధ్య సంప్రదింపులపై అనిశ్చితులు ఏర్పడడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా–ఇరాన్ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో ఉన్నారని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతం నష్టంతో 4,534 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్స్కు 2 శాతం నష్టంతో 76.49 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
గ్యాస్ వినియోగదారులకు ఊరట!
కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరా, పంపిణీ సవరణ ఉత్తర్వుల ప్రకారం.. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేలా నిబంధనలను సవరించింది.పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కొత్త నిబంధనలతో గృహ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజులలోపు తమ ఎల్పీజీ కనెక్షన్ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా.. భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారితే.. మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు.ఈ నిర్ణయం.. ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు పొందేవారికి, వలస కుటుంబాలకు, అద్దె ఇళ్లలో నివసించే వారికి, విద్యార్థులు, తరచూ ప్రాంతాలు మారే కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.దేశంలో ఎల్పీజీ కొరత సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. లోకల్ సర్కిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ వారం 68 శాతం భారత కుటుంబాలు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి. గత వారం ఇది 57 శాతంగా ఉండగా ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది.ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భారత్ తన అవసరాలకు పెద్దమొత్తంలో దిగుమతులపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడుతోంది. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. 20 శాతం మంది తమ అవసరాల కోసం బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ధరల కంటే రూ.300 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. -
ఆర్థిక సేవల్లోకి ఐషర్ మోటర్స్
ఐషర్ మోటర్స్ తాజాగా వోల్వో గ్రూప్తో కలిసి ఆర్థిక సేవల విభాగంలోకి విస్తరిస్తోంది. వోల్వో ఫైనాన్షియల్ సర్వీసెస్ (వీఎఫ్ఎస్) ఇండియాలో 50 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం సంస్థ రూ. 750 కోట్లు వెచ్చించనుంది.ప్రస్తుతం ఐషర్ (ఈఎంఎల్), వోల్వో గ్రూప్నకు వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) పేరుతో జాయింట్ వెంచర్ ఉంది. ప్రతిపాదిత ఆర్థిక సేవల జాయింటు వెంచరనేది భారత్లో వీఈసీవీ, ఈఎంఎల్, వోల్వో గ్రూప్ ఉత్పత్తులకు క్యాప్టివ్ ఫైనాన్సింగ్ సంస్థగా వ్యవహరిస్తుంది. వోల్వో గ్రూప్తో 18 ఏళ్ల భాగస్వామ్యాన్ని వాహనాలకు ఫైనాన్సింగ్ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్లు ఈఎంఎల్ చైర్మన్ సిద్ధార్థ లాల్ తెలిపారు. -
అటల్ పెన్షన్ యోజన కొత్త రికార్డు!
సామాజిక భద్రతా పథకం ‘అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవై) కింద సభ్యుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ ఎస్ రామన్ తెలిపారు. 2026 మార్చి చివరికి ఏపీవై సభ్యులు 8.96 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2025 మార్చి నాటికి)లో సభ్యుల సంఖ్య 7.61 కోట్లతో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది కొత్త సభ్యులు జతయ్యారు. 18 శాతం వార్షిక వృద్ధి అంచనా ఆధారంగా సభ్యుల సంఖ్య 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్టు రామన్ పేర్కొన్నారు.ఎన్పీఎస్ కూడా పీఎఫ్ఆర్డీఏ నియంత్రణల కిందే నడుస్తుండడం గమనార్హం. 18–25 ఏళ్ల వయసు వారి నుంచి ఎక్కువ మంది సభ్యులు చేరుతున్నారని.. దీర్ఘకాల ఆర్థిక భద్రతపై యువతలో అవగాహన పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తున్నట్టు రామన్ చెప్పారు. ఎన్పీఎస్ కింద 2026 మార్చి నాటికి 2.17 కోట్ల మంది సభ్యులు ఉండగా, వీరికి సంబంధించి రూ.15.95 లక్షల కోట్ల పింఛను నిధి నిర్వహణలో ఉన్నట్టు రామన్ తెలిపారు. ఈ ఏడాది ఎన్పీఎస్ సభ్యుల సంఖ్య 22 శాతం పెరగొచ్చని అంచనా వేశారు.


