Corporate
-
ఫ్లిప్కార్ట్ సీఎఫ్ఓ రాజీనామా
పబ్లిక్ లిస్టింగ్కు ముందు, ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ (సీఎఫ్ఓ) ఆఫీసర్ శ్రీరామ్ వెంకటరామన్ తన పదవికి రాజీనామా చేశారని కంపెనీ తెలిపింది. తదుపరి సీఎఫ్ఓ నియామకం వరకు.. రవి అయ్యర్ ఈ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని సంస్థ వెల్లడించింది.''శ్రీరామ్ నాయకత్వ బృందంలో ఒక సభ్యుడిగా ఉంటూ.. ఇన్నేళ్లుగా సంస్థ ఆర్థికంగా ముందుకు సాగడంతో కీలక పాత్ర పోషించారు. ఆయన చేసిన సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులో ఆయన మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాము'' అని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్లో ఫ్లిప్కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేసింది. -
ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ అయిన జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును మరోసారి పెంచింది. ఒక్కో ఆర్డర్కు ప్లాట్ఫామ్ ఫీజును రూ. 12.50 నుంచి రూ. 14.90కి పెంచినట్లు వెల్లడించింది. పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.చివరిసారిగా ప్లాట్ఫామ్ పీజుల పెంపును కంపెనీ సెప్టెంబర్ 2025లో చేపట్టింది. జొమాటో ఫుడ్ డెలివరీకి.. పోటీదారు అయిన స్విగ్గీ ప్రస్తుతం ఒక్కో ఆర్డర్కు 14.99 రూపాయలు వసూలు చేస్తోంది. ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందిఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ రంగంలో కొత్త పోటీదారులు పుట్టుకొస్తున్నారు. ఇందులో భాగంగానే.. అర్బన్ మొబిలిటీ స్టార్టప్ అయిన రాపిడో, ఇటీవల బెంగళూరులో 'ఓన్లీ' అనే తన ఫుడ్ డెలివరీ సర్వీస్ను ప్రారంభించింది. డెలివరీ ఫీజు మినహా, కస్టమర్ల నుంచి గానీ, రెస్టారెంట్ల నుండి గానీ ఎలాంటి అదనపు రుసుములను వసూలు చేయబోమని ఆ కంపెనీ తెలిపింది.ఫుడ్ డెలివరీ ఆర్డర్లపై కంపెనీలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న సమయంలో రాపిడో తీసుకున్న ఈ చర్య ఇప్పటికే ఉన్న సంస్థలపై కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది. కాగా.. ప్లాట్ఫామ్ ఫీజుల పెంపుకు సంబంధించిన ప్రకటన తరువాత.. ఎటర్నల్ షేర్లు దాదాపు 2% పెరిగి ఒక్కో షేరు రూ. 233 వద్ద ముగిశాయి. -
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
భారత్లో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తన ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ .2 పెంచింది. సవరించిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీ ఈ పెంపు వెనుక ఎటువంటి కారణాన్ని పేర్కొననప్పటికీ, కొనసాగుతున్న ఇరాన్-యుఎస్ వివాదం మధ్య ప్రపంచ ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు, లాజిస్టిక్స్ ఖర్చులలో మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.ఇక హైదరాబాద్లో ఈ ధరలు కనిష్ఠంగా రూ.2.26 మేర పెరిగినట్లు పెట్రోల్ డీలర్స్ చెబుతున్నారు. అయితే.. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మేరకు ఒక్కో బంకులో ఒక్కోరకంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. అంటే.. అయిదు నుంచి పది పైసల మేర ఈ తేడా ఉంటుందని వెల్లడించారు.సాధారణ పెట్రోల్ ధరలో మార్పు లేదు..సాధారణ పెట్రోల్ వాడే సామాన్యులకు మాత్రం ఈ పెంపు నుంచి ఉపశమనం లభించింది. హెచ్పీసీఎల్ సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. అంతేకాకుండా, చమురు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని సంస్థ స్పష్టం చేసింది. "అదనపు సరకు రవాణా ఇప్పటికే మార్గంలో ఉంది. రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా మరింత బలోపేతం అవుతుంది. ప్రజలు పుకార్లను నమ్మవద్దు" అని హెచ్పీసీఎల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేసింది.ఏమిటీ ప్రీమియం పెట్రోల్?ప్రీమియం పెట్రోల్ను ‘హై-ఆక్టేన్ ఫ్యూయల్’ లేదా ‘పవర్ పెట్రోల్’ అని పిలుస్తారు. ఇది సాధారణంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వాడతారు. ఇది ఇంజిన్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మైలేజీని కూడా పెంచుతుంది. ఈ ధరల పెంపు ప్రధానంగా లగ్జరీ వాహన యజమానులపై, సంపన్న వర్గాలపైనే ప్రభావం చూపనుంది.డీజిల్ ధర కూడా పెంపు హెపీసీఎల్ను అనుసరిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) కూడా బల్క్ డీజిల్ ధరను లీటరుకు ఏకంగా లీటరుకు రూ.22 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు రూ.87.57 గా ఉన్న లీటరు డీజిల్ ధర.. తాజా రేట్ల పెంపుతో రూ.109.59కి చేరుకుంది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో లభించే డీజిల్ ధరలపై ప్రస్తుతం పెద్దగా ప్రభావం లేనప్పటికీ.. నేరుగా కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో డీజిల్ కొనే పారిశ్రామిక వినియోగదారులకు షాక్ తగిలింది.రవాణా ఛార్జీలు పెరిగే అవకాశంబల్క్ డీజిల్ ధరల పెరుగుదల ప్రధానంగా తయారీ రంగం, భారీ పరిశ్రమలు, లాజిస్టిక్స్ విభాగాలపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. సిమెంట్, ఉక్కు కర్మాగారాలు, భారీ యంత్రాలను నడిపే పరిశ్రమలకు డీజిల్ వినియోగం అధికంగా ఉంటుంది. ఇది లీటరుకు రూ.22 పెరగడం వల్ల వారి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. అలాగే నేరుగా కంపెనీల నుంచి డీజిల్ కొనే భారతీయ రైల్వే, రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు వల్ల రవాణా ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీయవచ్చు.వచ్చేవారం పెట్రోల్ మోత?పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్నా.. చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సామాన్యులపై పెట్రోల్ భారం వేయలేదు. దేశంలో 60 రోజులకు సరిపడా వ్యూహాత్మక నిల్వలు ఉన్నప్పటికీ.. వచ్చేవారం నుంచి పెట్రోల్ మోతకు చమురు సంస్థలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు పెట్రోల్, డీజిల్పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలిపాయి.ఇదీ చదవండి: అతి భారీగా తగ్గిన బంగారం.. అంతలోనే.. -
క్లౌడ్ఫ్లేర్ సీఈఓ హెచ్చరిక!.. 2027 నాటికి..
ఆటోమేటెడ్ ఆన్లైన్ కార్యకలాపాలలో జనరేటివ్ ఏఐ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నందున, 2027 నాటికి ఏఐ-ఆధారిత బాట్ ట్రాఫిక్.. మానవ ఇంటర్నెట్ వినియోగాన్ని మించిపోయే అవకాశం ఉందని క్లౌడ్ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ హెచ్చరించారు. ఆస్టిన్లోని SXSW సదస్సులో మాట్లాడుతూ.. ఈ విషయం వెల్లడించారు.AI-ఆధారిత ఏజెంట్లు మనుషుల కంటే చాలా ఎక్కువ వెబ్సైట్లను సందర్శించగలవని మాథ్యూ వివరించారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను తనిఖీ చేస్తారు. కానీ ఒక AI వ్యవస్థ సమాచారాన్ని సేకరించడానికి వేలాది పేజీలను స్కాన్ చేయగలదు. ఇది వెబ్ ట్రాఫిక్లో తీవ్రమైన పెరుగుదలకు దారితీస్తుంది. అంతే కాకుండా.. ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.బాట్స్ అంటేబాట్స్ అనేవి స్వయంచాలకంగా పనిచేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఇవి మనుషుల సహాయం లేకుండా వెబ్సైట్లు సందర్శించడం, డేటాను సేకరించడం వంటి పనులు చేస్తాయి. గతంలో కూడా బాట్స్ ఉండేవి, కానీ వాటిలో చాలా భాగం గూగుల్ వంటి సెర్చ్ ఇంజిన్లకు సంబంధించినవి. ఉదాహరణకు గూగుల్ ఉపయోగించే క్రాలర్లు వెబ్సైట్లను స్కాన్ చేసి సమాచారం సేకరించేవి. అలాగే కొన్ని బాట్స్ దుష్ట కార్యకలాపాలకు కూడా ఉపయోగించేవారు.కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. జనరేటివ్ AI రాకతో, బాట్స్ సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక సాధారణ వ్యక్తి ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు కొన్ని వెబ్సైట్లను మాత్రమే చూస్తాడు. అయితే AI ఆధారిత బాట్ మాత్రం వేలాది వెబ్సైట్లను స్కాన్ చేసి, పూర్తి సమాచారం సేకరిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ ట్రాఫిక్ అనూహ్యంగా పెరుగుతోంది.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. చరిత్రలో అతిపెద్ద బబుల్ బస్ట్!ఈ పెరుగుతున్న ట్రాఫిక్ ఇంటర్నెట్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని పెంచుతోంది. మరిన్ని డేటా సెంటర్లు, శక్తివంతమైన సర్వర్లు అవసరం అవుతున్నాయి. గతంలో COVID-19 సమయంలో కూడా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. అప్పుడు యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటి ప్లాట్ఫార్మ్లను ఎక్కువగా ఉపయోగించారు. అయితే ఆ పెరుగుదల తాత్కాలికం. కానీ.. ఇప్పుడు జరుగుతున్న పెరుగుదల మాత్రం నిరంతరంగా కొనసాగుతుందని మాథ్యూ చెప్పారు. -
మహిళల కోసం ఎస్బీఐ సెక్యూరిటీస్ కొత్త ఫీచర్
భారతీయ మహిళలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ సంపద సృష్టిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్బీఐ సెక్యూరిటీస్ తన మొబైల్ అప్లికేషన్లో ‘ఉమెన్స్ మోడ్’ అనే సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. మహిళా పెట్టుబడిదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్లాట్ఫారమ్ ఎకానమీ మార్కెట్లో వారి భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయనుంది.6,000 మంది మహిళల అభిప్రాయాలతో..ఏదో ఒక ఫీచర్ను మొక్కుబడిగా ప్రవేశపెట్టడం కాకుండా క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఎస్బీఐ సెక్యూరిటీస్ విస్తృతమైన కసరత్తు చేసిందని అధికారులు చెప్పారు. సుమారు 6,000 మందికి పైగా మహిళా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ ‘ఉమెన్స్ మోడ్’ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సంక్లిష్టంగా ఉండే పెట్టుబడి ప్రక్రియను సరళతరం చేయడం ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.ఈ ఫీచర్ ప్రత్యేకతలుఈ ఫీచర్తో ఈక్విటీ మార్కెట్లో ఎడ్యుకేషన్, పదవీ విరమణ లేదా సొంత ఇల్లు వంటి వ్యక్తిగత ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. మార్కెట్ జార్గన్ (క్లిష్ట పదజాలం) తగ్గించి సులభమైన రీతిలో సమాచారాన్ని అందిస్తుంది. ఇన్వెస్టర్ల అనుభవం, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగతీకరించిన పెట్టుబడి మార్గాలను సూచిస్తుంది.ఎస్బీఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో భువనేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఇప్పుడు ఆర్థిక నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ‘మహిళల ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కారాలను రూపొందించాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలపై ఉంది. మహిళలకు సాధికారత కల్పించి వారిలో నమ్మకాన్ని నింపే ఉమెన్స్ మోడ్ను ప్రారంభించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఐసీఐసీఐ బ్యాంక్కు రూ.769 కోట్ల జీఎస్టీ నోటీసు
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు జీఎస్టీ విభాగం నుంచి నోటీసులు అందాయి. ముంబై ఈస్ట్ కమిషనరేట్కు చెందిన సీజీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఏకంగా రూ.769 కోట్ల డిమాండ్ నోటీసులను జారీ చేశారు.డిమాండ్ మొత్తం రూ.384,33,53,972 (సుమారు రూ.384 కోట్లు)గా ఉన్నా పెనాల్టీ రూపంలో పన్ను మొత్తంతో పాటు దానికి సమానమైన జరిమానా, వడ్డీని కూడా చెల్లించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. దాంతో మొత్తంగా రూ.769 కోట్లు అయింది. మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 లోని సెక్షన్ 74 ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.వివాదం నేపథ్యం ఏమిటి?సాధారణంగా బ్యాంకులు తమ వినియోగదారుల ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల సేవలను ఉచితంగా అందిస్తుంటాయి. అయితే, ఈ ఉచిత సేవలకు కూడా ప్రతిఫలం ఉంటుందని, దానిపై పన్ను చెల్లించాలని జీఎస్టీ విభాగం వాదిస్తోంది. ఈ అంశంపై గతంలో కూడా షోకాజ్ నోటీసులు అందినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ‘గతంలోనూ ఇలాంటి అంశాలపై బ్యాంక్ న్యాయపోరాటం చేస్తోంది. అయితే ప్రస్తుత డిమాండ్ మొత్తం పరిమితిని మించి ఉన్నందున నిబంధనల ప్రకారం దీన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదిస్తున్నాం’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.తదుపరి కార్యాచరణఈ నోటీసులపై ఐసీఐసీఐ బ్యాంక్ వెనక్కి తగ్గడం లేదు. నిర్ణీత గడువులోగా రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించడం ద్వారా ఈ ఉత్తర్వులను సవాలు చేయనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం బ్యాంక్ ఆర్థిక వ్యవహారంపై పెద్దగా ప్రభావం చూపకపోయినా చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
అదనపు ఛార్జీ లేకుండానే ఇష్టమైన సీటు ఎంపిక
విమాన ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లోని మొత్తం సీట్లలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను ఆదేశించింది. పారదర్శకతను పెంచడం, ప్రయాణీకుల హక్కులను కాపాడటమే లక్ష్యంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలను విడుదల చేసింది.ఖర్చు లేకుండా సీట్ల కేటాయింపుప్రస్తుతం చాలా విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ లేదా టికెట్ బుకింగ్ సమయంలో ‘ప్రిఫర్డ్ సీట్’ పేరుతో ఫీజు వసూళ్లు చేస్తున్నాయి. దీనివల్ల ప్రయాణికులు టికెట్ ధర కంటే ఈ ఫీజుకే ఎక్కువే చెల్లించాల్సి వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి విమానంలో 60 శాతం సీట్లు కచ్చితంగా ఉచిత ఎంపిక కేటగిరీలో ఉండాలి. ఒకే పీఎన్ఆర్పై టికెట్ బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు కలిసి కూర్చునేలా విమానయాన సంస్థలు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనివల్ల పక్కపక్క సీట్ల కోసం అదనంగా చెల్లించే అవసరం తప్పుతుంది.బ్యాగేజీపై డీజీసీఏ సూచించిన స్పష్టమైన విధానాలుస్పోర్ట్స్ కిట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లు తీసుకెళ్లడంపై స్పష్టమైన, సులభతరమైన నిబంధనలు ఉండాలి.విమానాల్లో పెంపుడు జంతువుల రవాణాపై ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ విమానయాన సంస్థలు తమ వెబ్సైట్లలో కచ్చితమైన పాలసీని ప్రదర్శించాలి.ప్రయాణికుల హక్కులు, విమాన ఆలస్యం లేదా రద్దు సమయంలో లభించే పరిహారం గురించి వెబ్సైట్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో తెలుగుతో సహా ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలి.భారత విమానయాన రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్గా ఎదుగుతోంది. రోజుకు 5 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్న తరుణంలో ప్రయాణికుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యతని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో భారీ కుదుపు..
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.అసలేం జరిగింది?మార్చి 17న పంపిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు."నేను బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు. కానీ నా వ్యక్తిగత భావజాలం, సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు ఒకేలా లేవు. అందుకే తప్పుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.ఆర్థిక శాఖ మాజీ బ్యూరోక్రాట్ అయిన చక్రవర్తి, 2021లో బోర్డులో చేరారు. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో విలీనం వంటి కీలక ప్రక్రియలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.మార్కెట్లో ప్రకంపనలుచక్రవర్తి నిష్క్రమణ వార్త బయటకు రాగానే మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ప్రారంభ ట్రేడింగ్లోనే షేరు ధర 9 శాతం మేర పడిపోయి రూ.770 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల పతనం కారణంగా బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50 వందల పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని, క్రితం ముగింపుతో పోలిస్తే 3.8 శాతం నష్టంతో రూ.810.80 వద్ద స్థిరపడింది.రంగంలోకి దిగిన ఆర్బీఐపరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే రంగంలోకి దిగింది. హెచ్డీఎఫ్సీ గ్రూప్ వెటరన్ కేకీ మిస్త్రీని మార్చి 19 నుండి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్గా నియమించేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని కేకీ మిస్త్రీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, దాని వద్ద తగినంత మూలధనం, నగదు లభ్యత ఉన్నాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. మేనేజ్మెంట్ తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు -
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ అంబానీ
రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) నిధుల మళ్లింపు కేసులో రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు నమోదైన రూ.2929.05 కోట్ల బ్యాంకు మోసం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించింది.నిధుల మళ్లింపుపైనే ప్రధాన దృష్టితెల్లవారుజామునే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న అనిల్ అంబానీని ఆర్కామ్కు కేటాయించిన రుణాల వినియోగంపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. కంపెనీ అవసరాల కోసం తీసుకున్న రుణాలను ఇతర అవసరాలకు మళ్లించడం, నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు జరిపారనే ఆరోపణలున్నాయి. ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది ఆగస్టులో అనిల్ అంబానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. అనిల్ అంబానీ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 19, 20 తేదీల్లో ఆయన దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరు అవుతున్నారు.ముగిసిన ‘జై అన్మోల్’ విచారణఇదే క్రమంలో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని కూడా సీబీఐ వదిలిపెట్టలేదు. రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)లో జరిగిన రూ.228.06 కోట్ల ఆర్థిక అవకతవకలపై గత వారం (మార్చి 14, 2026) ఆయన్ను అధికారులు విచారించారు. ‘చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు అనిల్ అంబానీ కట్టుబడి ఉన్నారు. అందులో భాగంగానే ఈ విచారణకు హాజరవుతున్నారు’ అని అనిల్ అంబానీ అధికార ప్రతినిధి చెప్పారు.ఈ కేసులో మరికొంతమంది ప్రభుత్వ అధికారులు, రిలయన్స్ గ్రూప్ మాజీ ఉన్నతాధికారుల పాత్రపై కూడా సీబీఐ ఆరా తీస్తోంది. ఇప్పటికే జై అన్మోల్ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, తాము సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణను వేగవంతం చేశారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఛైర్మన్ రాజీనామా
దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో చోటుచేసుకున్న అనూహ్య మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ ఛైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా చేసిన నేపథ్యంలో సంస్థ పాలనా విషయాల్లో ఎటువంటి ఆందోళనలు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది.గందరగోళానికి తెరదించిన ఆర్బీఐహెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఇటీవలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపిన ఆర్బీఐ, బ్యాంక్ మేనేజ్మెంట్ కోరిన విధంగా పరివర్తన ఏర్పాట్లకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో బ్యాంక్ పటిష్టతపై ఆర్బీఐ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ‘హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యుత్తమ ఆర్థిక ప్రమాణాలు, సమర్థవంతమైన మేనేజ్మెంట్ బృందాన్ని కలిగి ఉంది. మా అంచనాల ప్రకారం ఈ బ్యాంక్ నిర్వహణ లేదా పాలనలో ఎటువంటి భౌతిక పరమైన లోపాలు లేవు’ అని ఆర్బీఐ పేర్కొంది.తాత్కాలిక సారథిగా కేకీ మిస్త్రీఅతాను చక్రవర్తి నిష్క్రమణతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కేకీ మిస్త్రీని మార్చి 19 నుంచి మూడు నెలల పాటు తాత్కాలిక పార్ట్-టైమ్ ఛైర్మన్గా నియమించేందుకు ఆర్బీఐ పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.కేకీ మిస్త్రీగురువారం జరిగిన కాన్ఫరెన్స్ కాల్లో కేకీ మిస్త్రీ మాట్లాడుతూ, బ్యాంక్ పనితీరులో ఎటువంటి లోపాలు లేవని పునరుద్ఘాటించారు. ‘మా అంతర్గత చర్చల్లో కానీ, మా దృష్టికి వచ్చిన అంశాల్లో కానీ ఎటువంటి కార్యాచరణ లోపాలు లేవు. హైలైట్ చేయాల్సిన ప్రత్యేక సమస్యలేవీ ప్రస్తుతానికి లేవు’ అని ఆయన స్పష్టం చేశారు.అతాను చక్రవర్తి నిష్క్రమణ వెనుక..మే 2021లో బోర్డులో చేరిన అతాను చక్రవర్తి మార్చి 17న తన రాజీనామా లేఖను సమర్పించారు. తన వ్యక్తిగత విలువలు, నైతికతకు ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవని ఆయన లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే, రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు మినహా ఇతర కారణాలేవీ లేవని బ్యాంక్ యాజమాన్యం ధ్రువీకరించింది. చక్రవర్తి హయాంలోనే హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో బ్యాంక్ విలీనం వంటి చారిత్రాత్మక నిర్ణయం జరిగింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సిరామిక్ టైల్స్పై యుద్ధం ఎఫెక్ట్
దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధం ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో పరిశ్రమ ఆదాయం 1–2 శాతంస్థాయిలో నీరసించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వరుసగా రెండో ఏడాది ఆదాయంలో క్షీణత నమోదుకానున్నట్లు తెలియజేసింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా సిరామిక్ టైల్స్ ఉత్పత్తి, ఎగుమతులు, సరఫరాలకు విఘాతం కలగనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 53,000 కోట్ల విలువైన దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై యుద్ధం రెండు విధాల ప్రభావం చూపనున్నట్లు వివరించింది.మధ్యప్రాచ్య దేశాలకు లాజిస్టిక్స్పరంగా సవాళ్లు ఎదురవుతుండటంతో సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంకావడంతోపాటు ఎగుమతులు దెబ్బతినే వీలున్నట్లు క్రిసిల్ పేర్కొంది. సిరామిక్ టైల్స్ ఆదాయంలో ప్రధానంగా ఎగుమతులు 40 శాతం వాటా ఆక్రమిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా 15 శాతంగా తెలియజేసింది. హార్ముజ్ ద్వారా జల రవాణాకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ఎగుమతుల ఆదాయం 6–7 శాతం క్షీణించనున్నట్లు అంచనా వేసింది. డెలివరీలు నిలిచిపోవడంతోపాటు.. బీమా వ్యయాలు పెరిగిపోనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు చేపట్టే ఎగుమతి వ్యయాలు సైతం పెరగనున్నట్లు వెల్లడించింది.ఎల్ఎన్జీ సెగతయారీ వ్యయాల్లో 35 శాతం వాటా ఆక్రమించే కీలక ముడిసరుకులు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ), ప్రొపేన్ సరఫరాలు తగ్గడంతో దేశీయంగా పలు సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీల కార్యకలాపాలు మూతపడటం లేదా ఉత్పత్తి నిలిచిపోవడం లేదా ఉత్పత్తిలో భారీ క్షీణతకు అవకాశమున్నట్లు క్రిసిల్ నివేదికలో వివరించింది. ఈ నెల(మార్చి)లో టైల్స్ ఉత్పత్తి దాదాపు నిలిచిపోగా.. దేశీ వినియోగ వ్యయాలు సైతం మందగించనున్నట్లు తెలియజేసింది. ఫలితంగా దేశీ టైల్స్ మార్కెట్ వృద్ధి గతంలో వేసిన 7–8% అంచనాలస్థానే 4–5 శాతానికి పరిమితంకానున్నట్లు పేర్కొంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే కంపెనీల దీర్ఘకాలిక మూసివేతలు, భారీ నష్టాలకు కారణంకావచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలియజేశారు. దీంతో నెలవారీ ఆదాయంలో 7–8 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేశారు. ఈ అంశాలన్నీ కంపెనీల నిర్వహణ లాభదాయకతను 1.3–1.5%మేర దెబ్బతీయవచ్చని నివే దిక పేర్కొంది. వెరసి ఐదేళ్ల కనిష్టం 9.3–9.5%నికి మార్జిన్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సవాళ్ల నుంచి అవకాశాలదాకా.. కెమికల్స్ రంగం బూమ్
దేశీ కెమికల్స్ పరిశ్రమ ఆర్థిక వృద్ధిని మించి పరుగుతీయనున్నట్లు కన్సల్టింగ్ దిగ్గజం మెకిన్సీ అండ్ కంపెనీ తాజా నివేదికలో పేర్కొంది. దీంతో 2030కల్లా కెమికల్స్ రంగం 230–255 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. ఇందుకు అధిక వృద్ధిలో ఉన్న విభాగాలు దోహదం చేయనున్నట్లు ‘ప్రపంచ అవరోధాలమధ్య సవాళ్ల నుంచి అవకాశాలలోకి దేశీ కెమికల్ పరిశ్రమ’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది.ప్రస్తుతం 155–165 బిలియన్ డాలర్లుగా ఉన్న కెమికల్స్ పరిశ్రమ అంతర్జాతీయంగా అవాంతరాలు ఎదురైనప్పటికీ వార్షిక ప్రాతిపదికన 8–9 శాతం పురోగతిని సాధించనున్నట్లు అభిప్రాయపడింది. ఈ రంగంలో ప్రధానంగా 8 విభాగాలు అధిక వృద్ధిని అందుకోనున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో సెమీకండక్టర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు– బ్యాటరీలు, రెనెవబుల్స్, కన్స్ట్రక్షన్, ఏరోస్పేస్– డిఫెన్స్, ఆటో విడిభాగాలు, బయో– ఎక్స్, ఈకామర్స్ను ప్రస్తావించింది. ఈ విభాగాలు 16 శాతం వార్షిక వృద్ధితో 2030కల్లా 30–35 బిలియన్ డాలర్ల అదనపు డిమాండుకు తెరతీయనున్నట్లు అంచనా వేసింది. ఈ కాలంలో నిర్మాణ సంబంధ కెమికల్స్ రెట్టింపై 28 బిలియన్ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. ఇందుకు మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది.17 శాతం రిటర్నులుగత దశాబ్ద కాలంలో వార్షిక ప్రాతిపదికన మొత్తం వాటాదారులకు 17 శాతం రాబడిని అందించినట్లు మెకిన్సీ నివేదిక పేర్కొంది. తద్వారా ప్రామాణిక ఇండెక్సులు, విదేశీ కంపెనీలను అధిగమించినట్లు వెల్లడించింది. అయితే కెమికల్స్ రంగంలో 31 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ ప్రధానంగా ఇనార్గానిక్స్(12 బిలియన్ డాలర్లు), పాలిమర్స్(13 బిలియన్ డాలర్లు)లో దిగుమతి ప్రత్యామ్నాయాలకు వీలున్నట్లు వివరించింది. ఇందుకు ఉదాహరణగా స్టైరీన్, ఎసెటిక్ యాసిడ్, పాలియోల్స్ తదితర వేల్యూ చైన్స్లో ప్రపంచస్థాయి సామర్థ్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వృద్ధిని అందుకునేందుకు వీలుగా కంపెనీలు అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించవలసి ఉన్నట్లు పేర్కొంది. దీనిలో భాగంగా భాగస్వామ్యాలు నెలకొల్పుకోవడం, ఇతర సంస్థల కొనుగోళ్లు, పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)పై వ్యయాల పెంపు, ఏఐ ఆధారిత సామర్థ్యాలను అమలు చేయడం తదితరాలను ప్రస్తావించింది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునేందుకు సరఫరా చైన్, బ్యాలన్స్షీట్లను పటిష్టపరచుకోవడంతోపాటు.. విలువ ఆధారిత వృద్ధిపై దృష్టిపెట్టవలసి ఉన్నట్లు తెలియజేసింది. వెరసి కెమికల్స్ పరిశ్రమ నిర్వచనా దశాబ్దంలోకి ప్రవేశిస్తున్నట్లు పేర్కొంది. వాటా స్వల్పమేగత దశాబ్ద కాలంలో దేశీ కెమికల్స్ పరిశ్రమ పటిష్ట వృద్ధిని సాధించినప్పటికీ అంతర్జాతీయ కెమికల్స్ వాణిజ్యంలో వాటా 3 శాతమే. చైనా 20 శాతం వాటాను ఆక్రమిస్తుంటే.. యూరోపియన్ యూనియన్ 15 శాతం, యూఎస్ 10 శాతం చొప్పున వాటా కలిగి ఉన్నాయి. దేశీయంగా ఈ రంగంలో విలీనాలు, కొనుగోళ్ల వాటా 0.9 శాతమేకాగా.. జాతీయ సగటు 2.5 శాతంగా ఉంది. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోర్ట్ఫోలియో క్రమబద్ధీకరణకు తెరలేవడంతోపాటు.. యూరప్లో ఆస్తుల విలువ పునర్నిర్మితమవుతున్న నేపథ్యంలో ఇతర సంస్థల కొనుగోళ్లు, టెక్నాలజీ అందుకునేందుకు దేశీ కంపెనీలకు అవకాశాలున్నట్లు నివేదిక పేర్కొంది. జపాన్, యూఎస్, ఈయూలతో పోలిస్తే దేశీ కంపెనీలు చాల స్వల్ప స్థాయిలో అంటే ఆదాయంలో 0.5 శాతమే ఆర్అండ్డీపై వెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ఈ రంగంలో ఆర్అండ్డీ కీలకమని పేర్కొంది. ఏఐ, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ వినియోగంతో ప్రొక్యూర్మెంట్, సరఫరా చైన్ నిర్వహణ తదితరాలలో భారీ పెట్టుబడులు చేపట్టకుండానే ఇబిటాను 8–12 శాతంమేర మెరుగుపరచుకోవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
60% సీట్లకు అదనపు చార్జీలు వద్దు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, వారి సౌకర్యార్థం ఎయిర్లైన్స్కి పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) మార్గదర్శకాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపునకు సంబంధించి కనీసం 60 శాతం సీట్లపై అదనపు చార్జీలు విధించొద్దని సూచించింది. ప్రస్తుతం 20 శాతం సీట్లను ఉచితంగా బుక్ చేసుకోవడానికి ఉండగా మిగతా సీట్లకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటోంది. ఇక ఒకే పీఎన్ఆర్పై ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు ఒకే దగ్గర కూర్చునే విధంగా చూడాలని కూడా డీజీసీఏ సూచించినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. దేశీ రూట్లలోని ఫ్లయిట్స్కి ఇవి వర్తిస్తాయి. ప్యాసింజర్లకు మరింత వెసులుబాటు కలి్పంచేలా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనల అమలును మరింత కఠినతరం చేస్తామన్నారు. దేశీ విమాన ప్రయాణాలకు సంబంధించి భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతి పెద్ద మార్కెట్గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగి 17.5–18.1 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. 2014లో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య సెపె్టంబర్ 2025 నాటికి 162కి చేరింది. దేశ, విదేశీ రూట్లలో ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్–అక్టోబర్ 2025 మధ్య కాలంలో 23.74 కోట్లకు చేరింది. మార్గదర్శకాల ప్రకారం.. → స్పోర్ట్స్ పరికరాలు, సంగీత సాధనాలను పారదర్శకమైన విధంగా, సురక్షితంగా చేర్చాలి. → అలాగే, పెంపుడు జంతువుల విషయంలోను స్పష్టమైన, పారదర్శకమైన విధానాలు ఉండాలి. → ఫ్లయిట్స్ జాప్యం, రద్దు, బోర్డింగ్కి నిరాకరించడం తదితర కేసుల్లో ప్రయాణికుల హక్కుల పరిరక్షణ నిబంధనలను కచి్చతంగా పాటించాలి. → ప్రయాణికుల హక్కులను ఎయిర్లైన్స్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, బుకింగ్ ప్లాట్ఫాంలు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో స్పష్టంగా డిస్ప్లే చేయాలి. → ప్రాంతీయ భాషల్లో కూడా ప్రయాణికుల హక్కులను తెలియజేయాలి. -
రైల్వే టికెట్ బుకింగ్లో భారీ మార్పులు.. త్వరలోనే!
దేశంలో రైలు టికెట్ బుకింగ్ వ్యవస్థ త్వరలో మరింత వేగవంతం, సులభతరం కానుంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో ఎదురయ్యే ఆలస్యం, సర్వర్ సమస్యలు, లావాదేవీ వైఫల్యాలకు చెక్ పెట్టేలా రైల్వే శాఖ భారీ అప్గ్రేడ్ పనులు చేపట్టింది.జూన్ నాటికి కొత్త వ్యవస్థ సిద్ధం!అధికారుల ప్రకారం.. అప్గ్రేడ్ చేసిన ప్రయాణీకుల రిజర్వేషన్ వ్యవస్థ జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత నిమిషానికి 1.5 లక్షల బుకింగ్స్ను నిర్వహించగలదు. దీంతో పీక్ టైమ్లో కూడా సాఫీగా టికెట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది.ఎంక్వైరీ సేవల్లోనూ వేగంటికెట్ బుకింగ్ మాత్రమే కాకుండా, రైలు వివరాలు, సీట్ల లభ్యత తెలుసుకునే ఎంక్వైరీ సేవలు కూడా మరింత వేగవంతం కానున్నాయి. ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలను నిర్వహిస్తున్న వ్యవస్థ, అప్గ్రేడ్ తర్వాత ఇంకా అధిక సామర్థ్యంతో పని చేయనుంది.సాంకేతిక సమస్యలకు చెక్ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సర్వర్ క్రాష్లు, స్లో స్పీడ్, పేమెంట్ ఫెయిల్యూర్స్. కొత్త వ్యవస్థతో ఈ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా రద్దీ సమయాల్లో కన్ఫర్మ్ టికెట్ పొందడం సులభమవుతుంది.కొత్త ఫీచర్లుఅప్గ్రేడ్ వ్యవస్థలో పలు కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. వివిధ తేదీలలో టికెట్ ధరలను ముందుగానే తెలుసుకునే ఫేర్ క్యాలెండర్, ప్రయాణికుడు స్వయంగా సీటు ఎంపిక చేసుకునే ఆప్షన్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావచ్చు. అలాగే బహుభాషా సౌకర్యం కూడా కల్పించనున్నారు.ఆన్లైన్ బుకింగ్కు పెరుగుతున్న ఆదరణప్రస్తుతం రిజర్వేషన్ టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్ ద్వారా బుక్ అవుతుండగా, కేవలం 11 శాతం మాత్రమే కౌంటర్లలో కొనుగోలు చేస్తున్నారు. రాబోయే మార్పులతో ఆన్లైన్ బుకింగ్ మరింత నమ్మదగినదిగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనుంది. మొత్తంగా, ఈ అప్గ్రేడ్తో రైలు ప్రయాణికుల టికెట్ బుకింగ్ అనుభవం పూర్తిగా మారిపోనుంది. -
విమాన ప్రయాణం.. ఇక కొత్త నిబంధనలు
దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సరసమైనదిగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. యాడ్-ఆన్ ఛార్జీల భారం తగ్గించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఉచితంగా సీట్ల కేటాయింపుకొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్ల కేటాయింపును ఉచితంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.ఒకే పీఎన్ఆర్ ఉంటే పక్కపక్కనే సీట్లుఒకే పీఎన్ఆర్పై టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా దంపతులకు విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో విడివిడిగా సీట్లు రావడం, అదనపు చార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాపై విమానయాన సంస్థలు పారదర్శక విధానాలు పాటించాలి. భద్రతా నిబంధనలతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా వీటి నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.రద్దులు, ఆలస్యాలపై కఠిన నియంత్రణవిమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎయిర్లైన్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, బుకింగ్ ప్లాట్ఫామ్లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు.విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్లు’ ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో ఆహారం అందించనున్నారు. ‘ఫ్లైబ్రరీ’ ద్వారా ఉచితంగా పుస్తకాలు చదుకునే అవకాశం కల్పించనున్నారు. అదనంగా ఉచిత వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. -
ఘనంగా సీడీకే 'కన్వర్జెన్స్ 2026' వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ సంస్థ 'సీడీకే' (CDK), తన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల కోసం హైదరాబాద్, పుణె నగరాల్లో 'కన్వర్జెన్స్ 2026' వేడుకలను ఘనంగా నిర్వహించింది. సంస్థ సాధించిన విజయాలను వేడుకగా జరుపుకోవడంతో పాటు, భారతీయ సంస్కృతి కుటుంబ విలువలకు అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఏడాది "మన భారతీయ మూలాల్లోకి వెళ్దాం" అనే థీమ్తో వేడుకలు నిర్వహించారు.ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసే సీడీకే సంస్థ, 2019 నుండి వరుసగా 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (GPTW) గుర్తింపును పొందుతోంది. అంతేకాకుండా, 2025 సంవత్సరానికి గాను భారతదేశంలోని టాప్ 100 ఐటీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఈ విజయాల వెనుక ఉద్యోగుల శ్రమతో పాటు వారి కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని ఈ వేడుక చాటిచెప్పింది.కన్వర్జెన్స్ 2026 వేడుకల్లో ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అలంకరించిన వేదికపై సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు థీమ్ ఆధారిత ఫ్యాషన్ వాక్ వంటి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యంగా పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయించిన జోన్ ఆకట్టుకుంది. ఇదే వేదికపై సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులకు 'రివార్డ్స్ అండ్ రికగ్నిషన్' విభాగంలో అవార్డులను అందజేసి గౌరవించారు. -
కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త పథకానికి ఆమోదం
ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 33,600 కోట్ల రూపాయల ఖర్చుతో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తారు.వంద నుంచి వెయ్యి ఎకరాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవ్య ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు జరగనుంది. అలాగే యూపీలో బారాబంకి నుంచి బహరాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ జాతీయ రహదారి నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణానికి 6969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.ఇక పత్తి గిట్టుబాటు ధరల నిధికి 1718 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో ఎంఎస్పీ కోసం సీసీఐకి కేటాయింపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. -
ఉత్తరాలే కాదు.. ఇక లాభాలూ డెలివరీ!
చిన్న పొదుపులు ఇపుడు పెద్ద పెట్టుబడుల దిశగా అడుగులు వేయనున్నాయి.పెట్టుబడుల్లో కొత్త అధ్యాయానికి తపాలా శాఖ శ్రీకారం చుట్టింది. ఇకపై మీ ఇంటి పక్కన ఉండే పోస్టాఫీసు కేవలం ఉత్తరాలు, సేవింగ్స్ ఖాతాలకు మాత్రమే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ లాభాలను సామాన్యులకు అందించేలా మ్యూచువల్ ఫండ్స్ అమ్మకానికి సిద్ధమవుతోంది. భారత తపాలా శాఖ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) చేతులు కలపడంతో దేశవ్యాప్తంగా పెట్టుబడుల విప్లవం రాబోతోంది.పోస్ట్ ఆఫీసుల విస్తృత నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు గ్రామీణ ప్రాంతాలతో పాటు, మారు మూల పల్లెలకూ చేరే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన పెంచి, సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిని చేయాలనే సంకల్పంతో పోస్టాఫీసుల ద్వారా ఈ పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు యాంఫి సీఈఓ వెంకట్ చలసాని చెప్పారు. పోస్ట్ ఆఫీసుల నెట్వర్క్తో మ్యూచువల్ ఫండ్లు మెట్రోల నుంచి మండలాలు, పల్లెలోకి అడుగుపెడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో మహారాష్ట్రే దేశంలో అగ్రస్థానంలో ఉంది దేశ మొత్తం ఫండ్ ఆస్తుల్లో 40శాతానికి పైగా వాటా ముంబై, పుణె నగరాలదే. దీంతో మహారాష్ట్రలోని ముంబై, పూణె, నాగపూర్, ఔరంగాబాద్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా తపాలాశాఖ మ్యూచువల్ ఫండ్స్ విక్రయానికి తెరతీసింది. అది విజయవంతం కావడంతో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు కసరత్తు ప్రారంభించింది. రెండో దశలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా పదివేల మంది పోస్టల్ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎంపిక చేసిన సిబ్బందికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ శిక్షణ ఇస్తుంది. సర్టీఫై అయిన ఉద్యోగులు పోస్టాఫీసుల ద్వారా మ్యూచువల్ ఫండ్ స్కీములను విక్రయిస్తారు. యాంఫి డి్రస్టిబ్యూటర్గా వ్యవహరిస్తుంది. చిన్న పట్టణాలపై ఫోకస్ దేశంలోని మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల్లో 80 శాతం టాప్ 10 నగరాల నుంచే వస్తున్నాయి. 65 శాతం మందికి అవగాహన ఉన్నా, కేవలం 7 శాతం మాత్రమే అంటే 6 కోట్ల మందే పెట్టుబడి పెడుతున్నారు. గ్రామీణప్రాంతాల, పల్లెలదాకా విస్తరిస్తే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని యాంఫి అంచనా వేస్తోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ బడ్జెట్ బూస్ట్ఒక్కో కొత్త ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకం 2026 బడ్జెట్లో ప్రతి కొత్త మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కు రూ2,000 ప్రోత్సాహకాన్ని ఆరి్ధక మంత్రి ప్రకటించారు. పోస్టల్ సిబ్బందికి ఈ ప్రోత్సాహకంలో భాగస్వామ్యం కల్పించే విధానాన్ని తపాలాశాఖ రూపొందిస్తోంది. ఇది వారి రెగ్యులర్ కమిషన్కు అదనంగా ఉంటుంది. 2025 ఆగస్టు నుంచి అమల్లోకి వచి్చన ఈ ఒప్పందం 2028 ఆగస్టు వరకు మూడేళ్ల పాటు ఉంటుందని యాంఫి వెల్లడించింది. -
పీఎఫ్సీ డివిడెండ్ రూ. 3.25
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) బోర్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) నాలుగో మధ్యంతర డివిడెండ్ను చెల్లించేందుకు అనుమతించింది. దీంతో వాటాదారులకు షేరుకి రూ. 3.25 చొప్పున లభించనుంది. ఇందుకు ఈ నెల 23 రికార్డ్ డేట్కాగా.. ఏప్రిల్ 16కల్లా చెల్లించనుంది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026–27)లో రూ. 1,60,000 కోట్ల రుణ సమీకరణ ప్రణాళికకు సైతం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈబీఆర్ నిధులకు సంబంధంలేకుండా వీటిని ఒకేసారి లేదా దశలవారీగా వివిధ మూలాల నుంచి సమీకరించనుంది. వీటిలో రూ. లక్ష కోట్లు బాండ్లు, సెక్యూరిటీలు, మధ్యకాలిక ఇన్స్ట్రుమెంట్స్, కాలావధి రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. వివిధ ఇన్స్ట్రుమెంట్స్ జారీతో రూ. 20,000 కోట్ల విదేశీ మారకపు రుణాలు సైతం వీటిలో కలసి ఉన్నాయి. ఈ వార్తల నేపథ్యంలో పీఎఫ్సీ షేరు బీఎస్ఈలో 3% జంప్చేసి రూ. 418 వద్ద ముగిసింది. -
రూ. 216 కోట్లతో ఎగ్జికామ్ ప్లాంటు
ఈవీ చార్జర్లు తదితర ఉత్పత్తుల సంస్థ ఎగ్జికామ్ టెలీసిస్టమ్స్ హైదరాబాద్లో తమ కొత్త సమగ్ర తయారీ ప్లాంటును ప్రారంభించింది. దీనిపై రూ. 216 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ సీఈవో అనంత్ నహతా తెలిపారు. 18.4 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ప్లాంటు తొలి దశతో ఉత్పత్తి సామర్థ్యం రెండున్నర రెట్లు పెరుగుతుందని, ప్రాంతీయంగా 750 పైగా ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని ఆయన వివరించారు.దేశీయంగా ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాలు, లిథియం అయాన్ బ్యాటరీ సిస్టమ్స్, క్రిటికల్ పవర్ సొల్యూషన్స్కి పెరుగుతున్న డిమాండ్ని తీర్చేందుకు ఇది ఉపయోగపడగలదని నహదా చెప్పారు. ఇందులో ట్రై–ఫ్లక్స్ లిక్విడ్ కూల్డ్ పవర్ మాడ్యూల్స్ని కూడా తయారు చేయనున్నట్లు, అలాగే దేశీయంగా తొలి ఈవీ చార్జర్ ఇంటరాపరబిలిటీ టెస్టింగ్ సెంటర్ని సైతం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్!
ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుపై బీమా కంపెనీలు చెబుతున్న వాదనలకు, వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. వైద్య ఖర్చుల పెరుగుదల (మెడికల్ ఇన్ఫ్లేషన్) కారణంగానే ప్రీమియంలు పెంచుతున్నామన్న కంపెనీల వాదనను బలపరిచేలా ఎలాంటి అధికారిక అధ్యయనాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సామాన్యులపై భారంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వ్యవహారంపై కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.అధ్యయనం లేదు.. ఆధారాల్లేవు!బీమా రంగ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) వద్ద దీనిపై నిర్దిష్టమైన డేటా లేదని మంత్రి తెలిపారు. మెడికల్ ఇన్ఫ్లేషన్ రేటుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపునకు మధ్య గల సంబంధంపై ఐఆర్డీఏఐ ఎటువంటి ప్రత్యేక అధ్యయనం నిర్వహించలేదు.కేవలం వైద్య ఖర్చులే కాకుండా పాలసీదారుల సగటు వయసు పెరగడం, క్లెయిమ్ హిస్టరీ, మెరుగైన పాలసీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ప్రీమియం పెంపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం వైద్య ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే ఎంత శాతం ప్రీమియం పెరిగిందో విడదీసి చూడటం సాధ్యం కాదని మంత్రి వివరించారు.కంపెనీల వాదన.. వాస్తవ పరిస్థితిసాధారణంగా బీమా కంపెనీలు దేశంలో మెడికల్ ఇన్ఫ్లేషన్ 12-14 శాతం మధ్య ఉందని, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు అని వాదిస్తుంటాయి. కరోనా అనంతర కాలంలో కొన్ని కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 100 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది తమ 65 శాతం ఉత్పత్తుల ధరలను పెంచడానికి వైద్య ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం తాజా వివరణతో కంపెనీల ‘ద్రవ్యోల్బణ సాకు’ బలహీనపడింది.బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వైద్య ఖర్చులను సాకుగా చూపిస్తున్నాయనే ఆరోపణలకు కేంద్ర మంత్రి సమాధానం బలాన్ని చేకూర్చింది. పారదర్శకత లేని ప్రీమియం పెంపుదలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్డీఏఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు. -
డిమాండ్కి తగినంత బొగ్గు సరఫరా
దేశీయంగా డిమాండ్కి సరిపడేంత బొగ్గును సరఫరా చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కోల్ ఇండియాలో భాగమైన సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ (ఎస్ఈసీఎల్) సీఎండీ హరీష్ దుహాన్ తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 2.3 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ రంగం నుంచి డిమాండ్ పెరిగినా ఇవి సరిపోతాయని వివరించారు. వీటితో పాటు సత్వరం వెలికితీసేందుకు వీలుగా 1.2 కోట్ల టన్నుల బొగ్గు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అలాగే మైనింగ్ కార్యకలాపాల కోసం తగినంత స్థలం, ఇతరత్రా మైనింగ్..రవాణా కాంట్రాక్టులు కూడా ఉన్నట్లు హరీష్ తెలిపారు.ఇక తాము సరఫరా చేసే విద్యుత్ ప్లాంట్ల వద్ద కూడా తగినన్ని బొగ్గు నిల్వలు ఉండటం వల్ల విద్యుదుత్పత్తికి అవరోధాలు లేకుండా స్థిరంగా కొనసాగేందుకు వీలవుతుందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలో బొగ్గు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులకు విఘాతం ఏర్పడి బొగ్గు, విద్యుత్ రంగాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో హరీష్ భరోసా ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్టీపీసీ, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్, మధ్యప్రదేశ్ పవర్ జనరేటింగ్ కంపెనీ లాంటి దిగ్గజ విద్యుదుత్పత్తి సంస్థలకు కంపెనీ బొగ్గు సరఫరా చేస్తోంది.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
శామ్సంగ్తో ఆర్ఐఎల్ డీల్
న్యూఢిల్లీ: గ్రీన్ అమోనియా సరఫరాకు వీలుగా దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ సీఅండ్టీతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) తాజాగా వెల్లడించింది. 15ఏళ్ల కాలం అమల్లో ఉండే ఈ డీల్ విలువ 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,000 కోట్లు)గా తెలియజేసింది. ఇది ప్రపంచస్థాయి అమోనియా ఒప్పందాలలో ఒకటికాగా.. పూర్తిగా దేశీయంగా రూపొందించిన హరిత ఇంధనాన్ని ఎగుమతి చేయనుంది.2028–29 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఇంధన సరఫరాలు ప్రారంభంకానున్నట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. శామ్సంగ్ సీఅండ్టీ కార్పొరేషన్ (దక్షిణ కొరియా)తో గ్రీన్ అమోనియా దీర్ఘకాలిక సరఫరా, కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది.2028–29 ద్వితీయార్ధం నుంచి 15ఏళ్లపాటు సరఫరాలు కొనసాగించనున్నట్లు తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం ద్వారా గ్రీన్ అమోనియాను రూపొందించనున్నట్లు వెల్లడించింది. దీనిని ఎరువులు, ఇండ్రస్టియల్ కెమికల్, షిప్పింగ్తోపాటు.. విద్యుదుత్పాదనలోనూ వినియోగించవచ్చని పేర్కొంది. ఆర్ఐఎల్ షేరు 1% బలపడి రూ. 1,395 వద్ద ముగిసింది. -
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్ ఉచితం
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉపాధి విస్తరణకు ఏడీఎన్హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి ఉచిత నియామకాల మేళా నిర్వహించనున్నాయి. కేటరింగ్ విభాగంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగానే వీసాలు, విమాన టికెట్లు అందించిన ఈ రెండు సంస్థలు.. మరో మూడు విభాగాల్లో ఉచిత వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో మాదిరిగా నిర్ణీత తేదీల్లో నియామకాల ర్యాలీలు కాకుండా వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం సంస్థ చైర్మన్ చీటీ సతీశ్రావు ‘సాక్షి’కి తెలిపారు. హెవీ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డింగ్ సూపర్వైజర్లు, ఆఫీస్ బాయ్స్గా పని చేయాలనుకునే వారిని నేరుగా ఇంటర్వ్యూ చేస్తామన్నారు. వేతనం, అర్హతల వివరాలు.. హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డ్ సూపర్వైజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల చొప్పున, లైట్ డ్రైవర్లకు రూ.45 వేలు, ఆఫీస్ బాయ్స్కు రూ.25 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. వసతి, భోజన సదుపాయాలు కంపెనీలు కల్పిస్తాయి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. స్టీవార్డ్ సూపర్వైజర్లుగా పని చేయాలనుకునేవారికి గతంలో గల్ఫ్లో పని చేసిన అనుభవం అవసరం. ఆఫీస్ బాయ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఇంగ్లిష్ మాట్లాడగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు gulfjobsgtm @gmail.com మెయిల్కు వివరాలను పంపించాలని కంపెనీల ప్రతినిధులు సూచించారు. పూర్తి వివరాలకు జీటీఎం సంస్థ కార్యాలయాలు ఉన్న ఆర్మూర్ (83320 62299), నిజామాబాద్ (93916 61522), జగిత్యాల(83320 42299), సిరిసిల్ల(93916 61522)లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్లైన్లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు. -
కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
పశ్చిమ ఆసియా సంక్షోభం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, భారతీయ కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి స్థాయి అనిశ్చితిని సృష్టించిన ఈ పరిణామాలను ఎదుర్కోవడంలో కార్పొరేట్ కంపెనీల సీఈఓలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక కథనం.మునుపెన్నడూ లేని సవాలుసాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కంపెనీల అధినేతలు గత చరిత్రను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభం అసాధారణమైంది. గత అనుభవాలేవీ దీనికి సరిపోలవు. ఈ నేపథ్యంలో వ్యాపార రంగానికి పొంచి ఉన్న ప్రధాన ముప్పులు కింది విధంగా ఉన్నాయి.ముడి చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్ నుంచి ఎరువుల వరకు అన్ని ఉత్పత్తుల ధరలు భారమవుతాయి.ఎఫ్ఎంసీజీ రంగంలో ప్యాకేజింగ్ ఖర్చు 10% కంటే ఎక్కువగా ఉంటుంది. పెట్రో-డెరివేటివ్స్ ధరలు పెరగడం వల్ల ఈ వ్యయం మరింత భారం కానుంది.కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్లోబల్ సప్లై చైన్ మళ్లీ సంక్షోభంలో పడింది. పశ్చిమ ఆసియా మీదుగా సాగే రవాణా మార్గాలపై అనిశ్చితి నెలకొంది.గల్ఫ్ దేశాల నుంచి భారత్కు వచ్చే పెట్టుబడులు, రెమిటెన్స్లు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.దుబాయ్ వంటి పర్యాటక కేంద్రాలకు డిమాండ్ తగ్గి విమాన ప్రయాణాలు మరింత భారంగా మారుతాయి.బంగారం ధరలు తగ్గడం, విలాసవంతమైన బ్రాండ్ మార్కెట్ దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.సీఈఓల వ్యూహరచన.. ఏం చేయాలి?వినియోగదారుడి కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ కార్యాచరణను మార్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాబడిని అందించే వినియోగదారుడిని కాపాడుకోవడం ముఖ్యం. ధరలు పెంచడం లేదా ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం వంటి పనులు చేయకపోవడమే మంచిది. ఇది దీర్ఘకాలంలో బ్రాండ్ విలువను దెబ్బతీస్తుంది.వ్యయ నియంత్రణఉద్యోగులను తొలగించడం కంటే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. అవసరంలేని ఇన్వెంటరీ, ఎంతోకాలంగా జాప్యం జరుగుతున్న నిర్ణయాలు, భారీ అప్పులపై వడ్డీలను తగ్గించుకోవాలి. సిబ్బంది సంఖ్యను కత్తిరించకుండానే 20% ఖర్చులను తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేయాలి.కాలానుగుణంగా ప్రణాళికలురాబోయే 30 రోజులు, 90 రోజులు, 300 రోజులకు స్పష్టమైన కార్యాచరణ ఉండాలి. దీన్ని ఉద్యోగులందరికీ వివరించాలి. వారిలో భయాందోళనలు కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలి. నగదు నిల్వలను కాపాడుకోవడం ముఖ్యం. అదే సమయంలో జీతాల్లో కోతలు విధించకూడదు.బ్యాంకులు, ప్రభుత్వంతో సమన్వయంఇది అసాధారణ పరిస్థితి కాబట్టి బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపు గడువును, మూలధన అవసరాలను పునర్వ్యవస్థీకరించుకోవాలి. అలాగే, పరిశ్రమ వర్గాలన్నీ ఏకమై ప్రభుత్వం నుంచి అవసరమైన రాయితీలు, మద్దతు కోరాలి.ఈ సంక్షోభ సమయంలో సీఈఓలు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడం, మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి రావడం వంటి మార్పులను అందిపుచ్చుకోవాలి. తిరిగి పోటీలో నిలబడగలిగే సామర్థ్యాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత అసలైన నాయకత్వ లక్షణం.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు గిగ్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు వీధి వ్యాపారుల నుంచి మెట్రో నగరాల ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు అందరినీ రోడ్డున పడేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు మూతపడుతుండటంతో.. డెలివరీ ఆర్డర్లు లేక గిగ్ కార్మికుల ఆదాయం సగానికి పడిపోయింది.అడుగంటిన సరఫరా.. ఆకాశన్నంటిన ధరలుఅంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులు తగ్గడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్ను సుమారు రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని గిగ్, ప్లాట్ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా స్పందించి ఈ కృత్రిమ కొరతను అరికట్టాలి’ అని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.తగ్గిన ఆర్డర్లు..రెస్టారెంట్లు, ధాబాలు గ్యాస్ లేక వంటలు చేయలేకపోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్ఫారమ్లపై ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ వ్యవహారంపై ఓ గిగ్ సిబ్బంది స్పందిస్తూ.. ‘గతంలో రోజుకు 30-40 ఆర్డర్లు చేసేవాడిని. ఇప్పుడు 20 కూడా రావడం లేదు. గంటల తరబడి యాప్ వైపు చూస్తూ ఖాళీగా కూర్చుంటున్నాం’ అన్నాడు.ఆర్ధిక సంక్షోభంలో గిగ్ కుటుంబాలుకేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు, రోడ్డు పక్కన బండ్లు నడిపేవారు ఈ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్ల పతనం వల్ల ఆదాయం తగ్గడమే కాకుండా, పెరిగిన నిత్యావసరాల ధరలు వారిని కుంగదీస్తున్నాయి. చాలా మంది గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్లు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ పెరిగిన కరెంటు బిల్లులు మరో భారంగా మారుతున్నాయి.ప్రభుత్వ జోక్యం అవసరంగ్యాస్ సరఫరాతోపాటు లక్షలాది మంది కార్మికుల జీవనాధారానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వ స్పందించాల్సి ఉంది. సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆదాయం కోల్పోయిన డెలివరీ భాగస్వాములకు కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కొందరు చెబుతున్నారు. మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ దిగుమతులను వేగవంతం చేయాలి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ ఫ్లయిట్ టికెట్ చార్జీలు
ఇతర విమానయాన సంస్థల బాటలోనే ఆకాశ ఎయిర్ కూడా తమ ఫ్లయిట్ టికెట్లపై ఇంధన సర్చార్జీ విధించనున్నట్లు ప్రకటించింది. దేశ, విదేశ రూట్లను బట్టి చార్జీలు రూ. 199 నుంచి రూ. 1,300 వరకు ఉంటాయి. ఇది మార్చి 15 (నేడు) నుంచి అమల్లోకి వస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇంధనాల రేట్లు భగ్గుమన్న నేపథ్యంలో దేశీ ఎయిర్లైన్స్ ఈ చార్జీలు విధిస్తున్నాయి. సాధారణంగా విమానయాన సంస్థల వ్యయాల్లో ఇంధనం భారం 40 శాతం స్థాయిలో ఉంటుంది. -
సిక్ లీవ్ అడిగితే జీతం కోత!
ఇటీవల నోయిడాలోని ఒక SaaS స్టార్టప్ కంపెనీకి చెందిన ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్..చాలా వైరల్ అయింది. ఈ పోస్ట్ ద్వారా ఇండియన్ స్టార్టప్ కంపెనీలలో ఉన్న పనిసంస్కృతి గురించి పెద్ద చర్చ మొదలైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. SaaS స్టార్టప్లో సపోర్ట్ ఉద్యోగిగా వ్యక్తికి.. ఒక రోజు అతని ప్రాంతంలో రాత్రంతా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సరిగా నిద్రపట్టలేదు. నిద్రలేమి వల్ల అతను అలసటగా అనిపించింది. దీంతో ఆ రోజు పని చేయలేనని భావించి.. హెచ్ఆర్ విభాగానికి ఒక సిక్ లీవ్ కోసం ఈమెయిల్ పంపాడు. ఆ ఉద్యోగి చెప్పినట్టు, ఆరు నెలల్లో ఇది అతను తీసుకున్న రెండో సెలవు మాత్రమే.అయినప్పటికీ.. అతను ఊహించని విధంగా కంపెనీ ఫౌండర్ స్వయంగా ఆ ఈమెయిల్కు స్పందించారు. ఆ ఉద్యోగికి ఒకరోజు జీతం కోత పెట్టాలని HRకు సూచించారు. అదే రోజు సెలవు తీసుకోవడం కుదరదని కూడా చెప్పారు. అంతే కాకుండా.. ఫౌండర్ ఆ ఉద్యోగికి ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యోగి తాను అస్వస్థంగా ఉన్నానని చెప్పినా, ఫౌండర్ 'నీ వాయిస్ చూస్తే నువ్వు బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది' అని చెప్పారు. ఇది ఆ ఉద్యోగికి చాలా బాధ కలిగించింది.ఇదీ చదవండి: మస్క్ టీమ్లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో.. పలువురు నెటిజన్లు స్పందించారు. వ్యవస్థాపకులు చాలా సున్నితంగా వ్యవహరించాలి అని కొందరు చెబితే.. మరికొందరు ఆ ఉద్యోగిని వేరే ఉద్యోగం చూసుకోమని సలహా ఇచ్చారు. ఈ వ్యవస్థాపకులు లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఏమి ఆలోచిస్తారో నాకు అర్థం కావడం లేదు. వారి ఉద్యోగులతో సరిగ్గా వ్యవహరించలేరు. వారు మనల్ని ఏమని భావిస్తారు? అని ఇంకొందరు అంటున్నారు. -
కీలక రంగాల్లో భాగస్వామిగా తెలంగాణ.. టాంజానియా బృందంతో మంత్రి
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, మహిళా సాధికారత, ఎమర్జింట్ టెక్నాలజీస్, డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలెప్మెంట్ తదితర కీలక రంగాల్లో టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.శనివారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాంజానియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ ముద్రిక్ రమదాని సోరాగా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యింది. ‘తెలంగాణ - టాంజానియా' మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అవకాశాలపై చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సామాజిక, ఆర్థిక సమ్మిళిత వృద్ధికి బలమైన పునాదిగా మారిందన్నారు. ఆ దిశగా తెలంగాణ వేసిన అడుగులు ప్రపంచ పటంలో మన రాష్ట్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేశాయన్నారు. ఇదే స్ఫూర్తితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారం, మెంటార్ షిప్, నైపుణ్య మార్పిడి అందిస్తామన్నారు. అక్కడ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ను ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.‘మీ సేవ’ ద్వారా డోర్ స్టెప్ సిటిజన్ సర్వీసెస్ డెలివరీ, ‘వీ హబ్’ మార్గ నిర్దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహాం, స్టార్టప్ ఎకో సిస్టం బలోపేతం తదితర అంశాల్లో ఒక ‘నాలెడ్జ్ పార్ట్నర్’గా వ్యవహరిస్తామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై మార్గనిర్దేశం చేస్తామన్నారు. బ్లూ ఎకానమీ, టూరిజంలో టాంజానియా అవలంభిస్తోన్న బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేసి... తెలంగాణలోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.‘డిజిటల్ ఎకానమీగా మారాలన్న మా లక్ష్య సాధనలో తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఆవశ్యకం. ఐటీ, హెల్త్ కేర్, మెడికల్ టూరిజం, డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకో సిస్టం, లైఫ్ సైన్సెస్ తదితర రంగాల్లో సాధించిన ప్రగతి, చేపట్టిన సంస్కరణలు మాకు స్ఫూర్తిదాయకం. అందుకే.. తెలంగాణతో కలిసి పని చేసేందుకు త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకుంటాం’ అని టాంజానియా మంత్రి ముద్రిక్ రమదాని సోరాగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో టాంజానియా కమ్యూనికేషన్, ఐటీ, ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఫాత్మా మబ్రూక్ ఖమిస్, జాంజిబార్ ఐసీటీ అథారిటీ సీఈవో శుకూరు అవాద్ సులేమాన్, ప్రెసిడెంట్స్ డెలివరీ బ్యూరో - హెడ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్ మెంట్స్ జాన్ మహుండి తదితరులు పాల్గొన్నారు. -
మస్క్ టీమ్లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.ఎవరీ దేవేంద్ర చాప్లోట్?IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్బుక్ AI రీసెర్చ్లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.Welcome to @xAI! https://t.co/5tAdHPJmfx— Elon Musk (@elonmusk) March 13, 2026సాధించిన పురస్కారాలుదేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్షాప్లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు. -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 16వేల మంది ఇంటికి!
అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు ఇటీవల తమ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించాయి. ఇప్పుడు తాజాగా.. మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థలోని 20శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిని తొలగించడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.గత సంవత్సరం నుంచి కంపెనీ సీఈఓ జుకర్బర్గ్ ఏఐలో పెట్టుబడులను విపరీతంగా పెంచుతున్నారు. మెటా ఉత్పాదకను పెంచడంలో భాగంగా.. తగిన చర్యలు తీసుకుంటోంది. ఇది సంస్థలోని 16,000 ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే లేఆఫ్స్ ఎప్పుడు ఉంటాయనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు. కాగా కంపెనీలో డిసెంబర్ 31 నాటికి దాదాపు 79,000 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.మార్క్ జుకర్బర్గ్ నేతృత్వంలోని సంస్థ ఏఐ స్టార్టప్లను కొనుగోలు చేయడానికి బిలియన్ల కొద్దీ ఖర్చు చేసింది. చైనీస్ ఏఐ స్టార్టప్, మనుస్ను కొనుగోలు చేయడానికి కంపెనీ కనీసం 2 బిలియన్ డాలర్లను చెల్లించాల్సి ఉంది. మానవులు పోస్ట్ చేయడానికి అనుమతించని ఏఐ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన మోల్ట్బుక్ను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను కూడా ఇటీవల ప్రకటించింది.ఏఐ కారణంగా లేదా ఏఐను ఉపయోగించుకోవడంలో భాగంగా.. ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా మాత్రమే కాకుండా.. అమెజాన్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, SaaS దిగ్గజం అట్లాసియన్ కూడా ఉన్నాయి. జనవరిలో అమెజాన్ తన శ్రామిక శక్తిలో 1 శాతం లేదా దాదాపు 16,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అట్లాసియన్ కూడా AIపై ఎక్కువ ఖర్చు చేయడానికి 1,600 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. -
వీసాల పొడిగింపు.. భారత్ గుడ్ న్యూస్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత విదేశీ పౌరులకు అన్ని రకాల వీసాలకు 30 రోజుల పాటు పొడిగింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎక్కువ కాలం బస చేసినందుకు విధించే జరిమానాలను కూడా మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. రెగ్యులర్ వీసాలు, ఈ-వీసాలు సహా అన్ని రకాల వీసాలకు ఈ సడలింపులు వర్తిస్తాయని తెలిపింది.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పలువురు విదేశీయులు ప్రయాణ సమస్యల కారణంగా తమ దేశాలకు వెళ్లలేకపోతున్నారు.వీసా పొడిగింపు, జరిమానా మాఫీభారత ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు ఇలా ఉన్నాయి..గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న అన్ని రకాల వీసాలకు ఒక నెల పాటు పొడిగింపు.కేసు ప్రాతిపదికన ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా ఈ పొడిగింపు మంజూరు.ఫిబ్రవరి 28, 2026 తర్వాత ఎక్కువ కాలం బస చేసిన విదేశీయులపై విధించే జరిమానా పూర్తిగా మాఫీ.ఎగ్జిట్ పర్మిట్, తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్పై సడలింపుయుద్ధ పరిస్థితుల వల్ల చిక్కుకుపోయిన విదేశీయులకు భారత్ మరిన్ని సడలింపులు ప్రకటించింది.అవసరమైన విదేశీయులకు ఎగ్జిట్ పర్మిట్లు ఉచితంగా జారీ.ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయకపోవడం వలస చట్ట ఉల్లంఘనగా పరిగణించరు.విమానాల మళ్లింపు కారణంగా భారత్కు వచ్చే విదేశీయులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్ (TLP) మంజూరు.ముందుగానే సూచనలుమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన వెంటనే, మార్చి 1న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశీ పౌరులకు సూచనలు జారీ చేసింది. వీసా పొడిగింపు లేదా బసను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ సమీపంలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)ను సంప్రదించాలని సూచించింది. -
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు రిజర్వేషన్లు బంద్!
కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న భారత రైల్వే.. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి PRS అనే కంప్యూటరైజ్డ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థ ద్వారా దేశంలోని ఏ రైల్వే స్టేషన్ నుంచైనా రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సిస్టమ్ పనితీరును మెరుగుపరచడానికి.. సాంకేతిక నిర్వహణ పనులు చేపట్టాల్సి వచ్చింది.సిస్టమ్ అప్గ్రేడ్ కారణంగా కొన్ని గంటల పాటు ముఖ్యమైన సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ప్రయాణికులు ముందుగా ఈ విషయాన్ని తెలుసుకొని తమ ప్రయాణ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఢిల్లీ పీఆర్ఎస్ సిస్టమ్తో అనుసంధానమైన సేవలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.రైల్వే అధికారుల ప్రకారం.. మార్చి 14 అర్ధరాత్రి నుంచి, మార్చి 15 అర్ధరాత్రి వరకు.. అంటే ఈ రెండు రోజులు నిర్వహణ పనులు జరుగుతాయి. ప్రతి రాత్రి సుమారు మూడు గంటల పాటు PRS సేవలు అందుబాటులో ఉండవు. ఈ సమయంలో కొన్ని ఆన్లైన్ & టెలిఫోన్ సేవలు పనిచేయవు.ఆన్లైన్ టికెట్ బుకింగ్, టికెట్ రద్దు, పీఎన్ఆర్ స్టేటస్ చెక్, కరెంట్ రిజర్వేషన్ సమాచారం, టికెట్కు సంబంధించిన ఇతర విచారణలు మాత్రమే కాకుండా.. ఇండియన్ రైల్వేస్ అందించే 139 పీఎన్ఆర్ విచారణ సేవ కూడా పనిచేయదు.PRS అంటే?PRS (ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం) అనేది భారతీయ రైల్వే రూపొందించిన కంప్యూటరైజ్డ్ వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా రైల్వే టికెట్కు సంబంధించిన.. టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సిల్, తత్కాల్ టికెట్ జారీ, వెయిటింగ్ లిస్ట్ స్టేటస్, ట్రైన్ చార్ట్ తయారీ మొదలైన సేవలను అందిస్తుంది.రెండు రోజుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. అవసరమైన టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం, అత్యవసర ప్రయాణాలకు ముందస్తు ప్రణాళిక చేయడం వంటివి ముందుగానే చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు. ఈ తాత్కాలిక నిలిపివేత అనేది సిస్టమ్ పనితీరును మెరుగుపరచడం కోసం మాత్రమేనని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికులకు మరింత వేగవంతమైన మరియు సులభమైన సేవలను అందించడమే ఈ నిర్వహణ పనుల లక్ష్యమని చెప్పారు. -
ఇన్ఫోసిస్ మొహాలీ క్యాంపస్ విస్తరణ
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. మొహాలీ డెవలప్మెంట్ సెంటర్ (డీసీ)ని విస్తరించింది. 3,50,000 చ.అ. విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ని ప్రారంభించింది. ఇది సుమారు 3,000 మంది ఉద్యోగులకు సరిపోతుందని కంపెనీ తెలిపింది. బ్యాంకింగ్, హెల్త్కేర్, రిటైల్ తదితర రంగాల్లో గ్లోబల్ క్లయింట్లకు ఏఐ ఆధారిత సొల్యూషన్స్, క్లౌడ్ సర్వీసులు అందించేందుకు ఇందులోని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ బ్లాక్ ఉపయోగపడుతుందని వివరించింది.కృత్రిమ మేధ సర్వీసులను పటిష్టం చేసుకోవాలన్న తమ వ్యూహంలో ఇదొక కీలక మైలురాయని ఇన్ఫీ సీఎఫ్వో జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు. స్థానికంగా మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రాంతీయంగా టెక్నాలజీ వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రాష్ట్ర వృద్ధికి ఇది తోడ్పడగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం మొహాలీ సెంటర్లో ఇన్ఫికి 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
సీఈఓ పదవికి శంతను వీడ్కోలు.. కొత్త బాస్ ఎవరు?
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్లో.. దాదాపు రెండు దశాబ్దాలుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొనసాగుతోన్న శంతను నారాయణ్ ఆ పదవికి రాజీనామా చేయనున్నట్లు కొన్ని వదంతులు వినిపించాయి. దీనిపై కంపెనీ స్పందిస్తూ.. కొత్త సీఈఓగా వేరొకరు బాధ్యతలు స్వీకరించే వరకు శంతను సీఈఓగా కొనసాగుతారని స్పష్టం చేసింది.అడోబ్ కంపెనీ సీఈఓను ఎందుకు మారుస్తోంది?, లేదా.. శంతను నారాయణ్ ఎందుకు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు అనేదానికి కారణాలు ఏమిటనేది అధికారికంగా వెల్లడి కాలేదు. శంతను సీఈఓగా తప్పుకున్నప్పటికీ.. సంస్థ బోర్డు ఛైర్మన్గా కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.అడోబ్ బోర్డు కొత్త సీఈఓను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంస్థలో ఉన్న అభ్యర్థులతో పాటు బయటి అభ్యర్థులను కూడా పరిశీలిస్తుంది. కాగా సంస్థ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫ్రాంక్ కాల్డెరోని మాట్లాడుతూ.. శంతను నారాయణ్ గత 18 సంవత్సరాలుగా సంస్థ అభివృద్ధికి కృషి చేసారని ప్రశంసించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో అడోబ్ విజయానికి ఆయన వేసిన పునాది ఎంతో కీలకమని చెప్పారు.శంతను సీఈఓగా తప్పుకోవాలనుకుంటున్న నిర్ణయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 18 సంవత్సరాలుగా సీఈఓగా బాథ్యతలు నిర్వర్తించాను. కొత్త సీఈఓ ఎంపిక పూర్తయ్యే వరకు తాను బోర్డుతో కలిసి పనిచేసి.. బాధ్యతల మార్పు జరిగేలా చూస్తానని తెలిపారు.ఇదీ చదవండి: గ్యాస్ కష్టాలు.. ఆఫీసుకు రాకండి, ఇంట్లో పనిచేసుకోండిఈ సందర్భంగా తన నాయకత్వ కాలాన్ని గుర్తు చేసుకుంటూ అడోబ్ సంస్థ సాధించిన అభివృద్ధిని వివరించారు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు కంపెనీలో సుమారు 3,000 మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 30,000 మందికి పైగా పెరిగిందని చెప్పారు. అలాగే కంపెనీ ఆదాయం కూడా ఒక బిలియన్ డాలర్ల కంటే తక్కువ స్థాయి నుంచి 25 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని తెలిపారు. అడోబ్ తయారు చేసిన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను చేరుకుందని ఆయన గర్వంగా చెప్పారు. -
సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు భారత్లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. యునైటెడ్ స్టేట్స్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాకుండా భారతీయులు రోజువారీ వాడే ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు కొరతతో ప్యాకేజింగ్ ఖర్చులు భారమవడంవల్ల కంపెనీలు ధరల పెంపు లేదా పరిమాణం తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్నాయి.పశ్చిమాసియా ప్రాంతం ప్యాకేజింగ్ పరిశ్రమకు కీలకంగా ఉంది. సబ్బులు, బిస్కెట్లు, డిటర్జెంట్ల ప్యాకింగ్కు వాడే పాలిమర్లు (పాలీప్రొపైలిన్, పాలిథిలిన్) నేరుగా ముడి చమురు నుంచే తయారవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా గొలుసు దెబ్బతింది.ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి 50% పాలిమర్లను దిగుమతి చేసుకున్న భారత కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చైనా, థాయ్లాండ్, సింగపూర్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ముడి చమురు ధరలు పెరగడంతో రవాణా, ముడిసరుకు సేకరణ ఖరీదైన వ్యవహారంగా మారింది.ధర పెంపు లేదా క్వాంటిటీలో కోత?వ్యాపార నిర్వహణ భారమవడంతో దిగ్గజ సంస్థలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా దీనిపై స్పందిస్తూ.. తమ మొత్తం ఖర్చులో ప్యాకేజింగ్ వాటా 15-20 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. ‘చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే చిన్న ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించడం, పెద్ద ప్యాకెట్ల ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదు’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తుల తయారీలో కీలకమైన లీనియర్ ఆల్కైల్ బెంజీన్ (ఎల్ఏబీ) ధరలు కూడా చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. డిటర్జెంట్ ముడి పదార్థాల ఖర్చులో దీని వాటా దాదాపు 50% ఉండటం గమనార్హం.జీఎస్టీ లాభాలకు గండిఈ ధరల పెంపు నిర్ణయం సామాన్య వినియోగదారుడికి భారంగా మారనుంది. గత సెప్టెంబర్లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సవరణల వల్ల కంపెనీలు ప్యాకెట్ల పరిమాణాన్ని పెంచి, ధరలను తగ్గించాయి. తద్వారా లభించిన ఉపశమనాన్ని ప్రస్తుత యుద్ధ వాతావరణం పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. -
రూ.582 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు
రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. భారీ బ్యాంక్ మోసాలు, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి చర్యలు చేపట్టింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)లకు చెందిన రూ.581.65 కోట్ల విలువైన 31 స్థిరాస్తులను ఏజెన్సీ తాజాగా జప్తు చేసింది. తాజా చర్యతో ఈ గ్రూపునకు సంబంధించి ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.16,310 కోట్లకు చేరింది.దేశవ్యాప్తంగా విస్తరించిన ఆస్తులుతాజాగా జప్తు చేసిన 31 ఆస్తులు కేవలం ఒకట్రెండు ప్రాంతాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ భూములున్నాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు ఉత్తరాదిలో ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. రిలయన్స్ పవర్ లిమిటెడ్పై నమోదైన ఫెమా కేసు దర్యాప్తులో భాగంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.దర్యాప్తులో అంశాలుయస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రముఖ బ్యాంకులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 2025 జులై 22న ఈడీ దర్యాప్తును ప్రారంభించింది. ఈ విచారణలో వెలుగుచూసిన ప్రధానాంశాలు కింది విధంగా ఉన్నాయి.ఆర్హెచ్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ఎల్ సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సేకరించిన ప్రజా నిధుల్లో దాదాపు రూ.11,000 కోట్లకు పైగా నిధులు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ)గా మారాయి.ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేని, ఆర్థిక బలం లేని డమ్మీ/షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.సేకరించిన నిధులను గ్రూపులోని ఇతర సంస్థలైన రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్ వంటి కంపెనీలకు అక్రమంగా బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయి.గ్రూప్ ప్రమోటర్లు, కీలక వ్యక్తులు దురుద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను తమ సొంత ప్రయోజనాల కోసం మళ్లించినట్లు దర్యాప్తులో స్పష్టమైందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.నగదు, డిపాజిట్లపై వేటుకేవలం స్థిరాస్తులే కాకుండా నగదు రూపంలో ఉన్న ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. పీఎంఎల్ఏ, ఫెమా కింద జరిపిన దాడుల్లో రూ.2.48 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ సీజ్ చేశారు. ఫెమా సెక్షన్ 37ఏ కింద రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు చెందిన 13 బ్యాంకు ఖాతాల్లోని రూ.77.86 కోట్ల బ్యాలెన్స్ను ఈడీ అటాచ్ చేసింది. గతంలోనే ఆర్కామ్ సహా ఇతర సంస్థలకు చెందిన రూ.15,729 కోట్ల ఆస్తులను ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా? -
ఫ్లిప్కార్ట్లో మోటోరోలా ఏసీలు
వేసవి కాలం దగ్గరపడుతున్న సమయంలో.. ప్రముఖ స్వదేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫామ్లో మోటోరోలా ఎయిర్ కండిషనర్ల కొత్త శ్రేణిని విడుదల చేసింది. ఈ ACలు వినియోగదారులకు సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడ్డాయి. ఈ కొత్త శ్రేణి ధరలు సుమారు రూ.28,990 నుంచి ప్రారంభమవుతాయి.సాధారణంగా ఎయిర్ కండిషనర్ కొనుగోలు చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ఫీజులు, కాపర్ పైపింగ్, అవుట్డోర్ యూనిట్ స్టాండ్ వంటి అదనపు ఖర్చులు వస్తాయి. కానీ మోటోరోలా ఏసీలలో ఈ ఖర్చులన్నీ ముందుగానే ధరలో చేర్చారు. అందువల్ల వినియోగదారులకు కొనుగోలు తరువాత అదనపు ఖర్చులు ఉండవు. అంతే కాకుండా.. అదనంగా మూడు సంవత్సరాల పాటు గ్యాస్ రీఫిల్ కూడా లభిస్తుంది.ఈ ఎయిర్ కండిషనర్లు ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటు ఎనర్జీ ఎఫిషియెంట్ డిజైన్తో రూపొందించారు. ఇవి భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి. వినియోగదారులు ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. -
వార్ ఎఫెక్ట్: లేటెస్ట్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..
భారతదేశంలో వంట గ్యాస్ (LPG) ధరలు మళ్లీ పెరిగాయి. దీని ప్రభావం సాధారణ వినియోగదారులతో పాటు, హోటళ్లు & రెస్టారెంట్లు వ్యాపారుల మీద కూడా పడింది. ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంధన మార్కెట్లో ఏర్పడిన అస్థిర పరిస్థితుల అని తెలుస్తోంది.ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి.. ప్రపంచంలో ఇంధన రవాణాకు అత్యంత కీలకమైనది. ఈ ప్రాంతంలో ఏర్పడిన సమస్యల వల్ల నౌకాశ్రయ మార్గాలు ప్రభావితమై, ఇంధన సరఫరా ఆలస్యం అవుతోంది.నిజానికి ఇండియా ఎక్కువ మొత్తంలో ఎల్పీజీని.. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల పశ్చిమ ఆసియాలో జరిగే రాజకీయ లేదా యుద్ధ పరిస్థితులు భారత్లో ఎల్పీజీ ధరలపై నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో, దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచాల్సిన పరిస్థితి వచ్చింది.14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ (గృహ వినియోగం) ధర దేశవ్యాప్తంగా రూ.60 వరకు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా గణనీయంగా పెరిగింది.కొత్త ధరలుఢిల్లీడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 913కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1884.50ముంబైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 912.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,836కోల్కతాడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 939.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 1,988.50చెన్నైడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 928.50కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,043.50హైదరాబాద్డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్: రూ. 965.00కమర్షియల్ గ్యాస్ సిలిండర్: రూ. 2,105.50వినియోగదారులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గ్యాస్ సిలిండర్ ధరలు రాష్ట్రాల వారీగా ఉండే స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల కారణంగా కొంత మారే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ధరలు వినియోదాగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధరలు ఇలా పెరిగితే ఎలా.. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందా? అని భయపడుతున్నారు0 -
హైదరాబాద్కు నెట్ఫ్లిక్స్.. ఐలైన్ స్టూడియో ప్రారంభం
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగంలో హైదరాబాద్ను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.ఓ వైపు అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే... మరోవైపు స్కిల్లింగ్, రీ – స్కిల్లింగ్, అప్ – స్కిల్లింగ్ పై దృష్టి సారించిందన్నారు. గురువారం హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ కు నెట్ ఫ్లిక్స్ రాకతో సినిమా స్టోరీ టెల్లింగ్ లో ‘తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. గ్లోబల్ ప్రొడక్షన్ పైప్లైన్లో నగరం ఓ నిర్ణయాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. ప్రపంచ స్థాయి ప్రొడక్షన్ స్టాండర్డ్స్, అడ్వాన్స్డ్ టూల్స్, ఇన్నోవేషన్-లెడ్ వర్క్ ఫ్లో ఇక్కడి ఎకో సిస్టంలో భాగమవుతాయని, ఇక్కడి యువతకు ఫ్యూచర్ రెడీ స్కిల్స్ లభిస్తాయన్నారు.పరిశ్రమల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులను కోరారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో స్టూడియోను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. -
గ్యాస్ కష్టాలు.. ఆఫీసుకు రాకండి!
దేశంలో గ్యాస్ కొరత మొదలైపోయింది. దీని ప్రభావం సాధారణ ప్రజలపై మాత్రమే కాకుండా.. టెక్ కంపెనీలపై కూడా పడింది. దీంతో ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హెచ్సీఎల్ కంపెనీ మార్చి 12,13 తేదీలలో చెన్నై కార్యాలయంలోని తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించింది. క్యాంటిన్లలో ఆహారం వండటానికి గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదే సమస్య ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా తలెత్తింది. దీంతో బెంగళూరు, చెన్నైలలోని ఆఫీసుల్లో క్యాఫెటీరియా సేవలను పరిమితం చేశారు. వంటగ్యాస్ కొరత కారణంగా క్యాఫెటీరియాల్లో మెనూ ఐటెమ్స్ తగ్గించారు. లైవ్ ఫుడ్ కౌంటర్లను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఉద్యోగులు వీలైతే ఇంటి నుంచి తీసుకువచ్చిన ఆహారాన్ని తినాలని సంస్థ సూచించింది.అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడులు ప్రారంభించిన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనివల్ల ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం పడింది. ఫలితంగా వంటగ్యాస్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా నగరాల్లోని అనేక రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. -
అశోక్ లేలాండ్ రూ.500 కోట్ల పెట్టుబడి: ఎందుకంటే?
వాణిజ్య వాహన తయారీ హిందుజా గ్రూప్ దిగ్గజం అశోక్ లేలాండ్ తాజాగా గ్రీన్ఫీల్డ్ బ్యాటరీ ప్యాక్ తయారీపై దృష్టి పెట్టింది. ఇందుకు చెన్నై సమీపంలో తయారీ యూనిట్ నెలకొల్పేందుకు రూ. 500 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.వెరసి కొత్త బ్యాటరీ ప్యాక్ తయారీ ప్లాంటు ఏర్పాటుకు వీలుగా పిళ్లైపక్కం(చెన్నై)లో భూమి పూజ నిర్వహించినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై రూ. 400–500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు 2025 సెప్టెంబర్లోనే హిందుజా గ్రూప్ పెట్టుబడులలో భాగంగా అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణంలో ఇది కీలక ముందడుగుగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. అంతేకాకుండా దేశీయంగా పటిష్ట ఈవీ ఎకోసిస్టమ్ ఏర్పాటులో తమ కట్టుబాటుకు మరింత మద్దతివ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఈవీ బ్యాటరీ ప్యాక్ ఉత్పత్తికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. -
ఇండిగో, ఎయిరిండియాపై ఫిర్యాదు కొట్టివేత
దేశీ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిరిండియాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఊరటనిచ్చింది. మార్కెట్పై ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నాయంటూ వాటిపై వచ్చిన ఫిర్యాదులను కొట్టివేసింది. రెండు సంస్థలు పోటీ చట్ట నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ప్రాథమికంగా రుజువు కాలేదని పేర్కొంది.వివరాల్లోకి వెళ్తే, ఈ కంపెనీలు చట్టవిరుద్ధంగా భారీ స్థాయిలో టికెట్ల క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేస్తున్నాయని, ఏకపక్ష నిబంధనలను కస్టమర్లపై రుద్దుతున్నాయని సీసీఐకి ఫిర్యాదు వచ్చింది. అయితే, టికెట్ల రిఫండ్లకి ఎయిర్లైన్స్లో నిర్దిష్ట వ్యవస్థ ఇప్పటికే అమల్లో ఉన్నందున, అలాగే క్యాన్సిల్ చేసుకుంటే పెద్ద మొత్తంలో రిఫండ్ వచ్చేలా బుక్ చేసుకునే వీలు కూడా ఉన్నందున గుత్తాధిపత్య దురి్వనియోగం ఆరోపణలపై తదుపరి విచారణ అవసరం లేదని సీసీఐ పేర్కొంది.రిఫండ్, క్యాన్సిలేషన్ నిబంధనలను కంపెనీలు ముందుగానే ప్యాసింజర్లకు తెలియజేస్తాయని తెలిపింది. ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా వాటిని అమలు చేస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయనడానికి ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు సీసీఐ అభిప్రాయపడింది. అటు 2025 డిసెంబర్లో ఇండిగో పెద్ద ఎత్తున ఫ్లయిట్లను రద్దు చేయడంపై దాఖలైన కేసుతో కలిపి ఈ కేసును కూడా విచారణ చేయాలన్న మరో పిటీషన్ని తోసిపుచ్చింది. రెండూ వేర్వేరు అంశాలు కాబట్టి కలిపి విచారణ చేసేందుకు అవకాశం ఉండదని పేర్కొంది. దేశీ ఏవియేషన్ మార్కెట్లో ఇండిగోకి 65 శాతం, ఎయిరిండియాకి 27 శాతం వాటా ఉన్నాయి.ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా? -
భారత కుబేరుల సంపద రూ.92 లక్షల కోట్లు
ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన 2026 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, భారతదేశం సంపద సృష్టిలో సరికొత్త రికార్డులను సృష్టించింది. దేశంలో కుబేరుల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా, వారి నికర ఆస్తుల విలువ కూడా లక్ష కోట్ల డాలర్ల మార్కును అధిగమించడం విశేషం. భారత ఆర్థిక వ్యవస్థ దూకుడుకు అద్దం పడుతూ దేశీయ కుబేరుల సంఖ్య సరికొత్త గరిష్టానికి చేరుకుంది. ఫోర్బ్స్ ప్రకటించిన 40వ వార్షిక బిలియనీర్ల జాబితా ప్రకారం, గతేడాది 205 మందిగా ఉన్న భారతీయ బిలియనీర్ల సంఖ్య ఈసారి 229కి పెరిగింది. స్టాక్ మార్కెట్ల సానుకూల ధోరణి, వరుస ఐపీఓలు సంపద పెరుగుదలకు ప్రధాన చోదక శక్తిగా నిలిచాయి.భారత బిలియనీర్ల మొత్తం సంపద విలువ లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.92 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది. 2025లో ఈ విలువ 941 బిలియన్ డాలర్లుగా ఉండేది. కేవలం అగ్రగామి 10 మంది భారతీయ కుబేరుల వద్దే 368 బిలియన్ డాలర్ల (రూ.33.85 లక్షల కోట్ల) సంపద కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.అంబానీ, అదానీలదే అగ్రస్థానం..రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 99.7 బిలియన్ డాలర్ల సంపదతో భారత్, ఆసియాలోనే అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన సంపద ఏడాది కాలంలో 12% వృద్ధి చెందింది. ఇక గౌతమ్ అదానీ 63.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరిద్దరూ కలిసి గతేడాది తమ సంపదకు సుమారు రూ.1.35 లక్షల కోట్లను జోడించారు.ప్రధాన విశేషాలుసావిత్రి జిందాల్.. 39.1 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత ధనిక మహిళగా నిలిచారు.లక్ష్మీ మిట్టల్.. ఆర్సెలర్ మిట్టల్ షేర్ల విజృంభణతో ఈయన సంపద 61% పెరిగి 31 బిలియన్ డాలర్లకు చేరింది.ఉదయ్ కోటక్.. బ్యాంకింగ్ దిగ్గజం ఉదయ్ కోటక్ తొలిసారిగా టాప్-10 జాబితాలోకి ప్రవేశించారు.అరవింద్ శ్రీనివాస్.. 31 ఏళ్ల వయసులోనే పర్ప్లెక్సిటీ కో-ఫౌండర్ అరవింద్ అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ బిలియనీర్గా రికార్డు సృష్టించారు.భారతదేశంలోని టాప్-10 కుబేరులు (ఫోర్బ్స్ 2026)ర్యాంక్పేరుసంపద (బిలియన్ డాలర్లు)సంస్థ1ముకేశ్ అంబానీ99.7రిలయన్స్ ఇండస్ట్రీస్2గౌతామ్ అదానీ63.8అదానీ గ్రూప్3సావిత్రి జిందాల్, ఫ్యామిలీ39.1ఓపీ జిందాల్ గ్రూప్4లక్ష్మీ మిట్టల్31.0ఆర్సెలర్ మిట్టల్5శివ్ నాడార్30.9హెచ్సీఎల్ టెక్6సైరస్ పూనావాలా27.0సీరమ్ ఇన్స్టిట్యూట్7దిలీప్ సంఘ్వీ25.6సన్ ఫార్మా8కుమార మంగళం బిర్లా21.1ఆదిత్య బిర్లా గ్రూప్9రాధాకిషన్ దమానీ15.7అవెన్యూ సూపర్ మార్ట్స్10ఉదయ్ కోటక్14.4కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫోర్బ్స్ జాబితాలో మెరిసిన తెలుగు కుబేరులుమురళీ దివి (దివీస్ ల్యాబ్స్)పి.పి. రెడ్డి, పి.వి. కృష్ణా రెడ్డి (మేఘా ఇంజినీరింగ్-మెయిల్)బి.పార్థసారథి రెడ్డి (హెటిరో గ్రూప్- ఫార్మా)పి.వి. రామప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా)సతీశ్ రెడ్డి, జి.వి. ప్రసాద్ (డాక్టర్ రెడ్డీస్)జుపల్లి రామేశ్వరరావు (మై హోమ్ గ్రూప్-రియల్ ఎస్టేట్)సురేందర్ సలూజా (ప్రీమియర్ ఎనర్జీస్- సోలార్ ఎనర్జీ)ప్రతాప్ సి. రెడ్డి (అపోలో హాస్పిటల్స్)ఎం. సత్యనారాయణ రెడ్డి (ఎంఎస్ఎన్ ల్యాబ్స్)గ్రంధి మల్లికార్జున రావు (జీఎంఆర్ గ్రూప్-విమానాశ్రయాలు)ఇదీ చదవండి: ట్రంప్ కోరిక నెరవేరుతుందా? -
ఆయిల్ రిటైల్ కంపెనీలకు గడ్డుకాలం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల భారత ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు వెల్లడించాయి. ప్రభుత్వరంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా స్థానిక మార్కెట్లో వెంటనే ఇంధన ధరలను పెంచలేకపోవడంతో వాటి లాభాలు తగ్గే పరిస్థితి ఏర్పడినట్టు తెలిపాయి. దేశ ముడి చమురు అవసరాల్లో 88 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండడం తెలిసిందే. ఇందులో 30–44 శాతం మేర సరఫరాలు ఇరాన్ పక్కనే ఉన్న హార్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంటాయి. అక్కడ ఉద్రిక్తతలు పెరిగితే సరఫరాపై ప్రభావం పడుతుందన్నది రేటింగ్ సంస్థల అంచనా. వ్యూహాత్మక నిల్వలు 10 రోజుల అవసరాలకు సరిపోతాయని, అలాగే, వాణిజ్య నిల్వలు 65 రోజులకు అవసరాలను తీరుస్తాయంటూ.. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే సరఫరా సమస్యలను ఎదుర్కోక తప్పదని పేర్కొన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడొచ్చంటూ రేటింగ్ సంస్థలు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్, మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్, ఫిచ్ రేటింగ్స్ హెచ్చరించాయి. రుణ పరపతిపై ప్రభావం.. ఇరాన్ ఆయిల్ లేదా ఎల్ఎన్జీ సరఫరా అవరోరధాలు దీర్ఘకాలం పాటు కొనసాగితే సమీప కాలంలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థల రుణ పరపతిపై ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అయితే, ప్రభుత్వ మద్దతు ఉండడం రేటింగ్కు మద్దతునిస్తుందని తెలిపింది. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను దేశీయంగా పెంచడం లేదు. ఇంధన విక్రయ మార్కెట్లో 90 శాతం వాటా ప్రభుత్వరంగ సంస్థల చేతుల్లోనే ఉండడంతో ఒక విధంగా ధరలు స్థిరంగా కొనసాగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దేశీయంగా ధరల సవరణకు పరిమిత అవకాశాలే ఉండడం కంపెనీలపై వ్యయాలు పెరిగేందుకు దారితీస్తుందని.. మార్కెటింగ్ మార్జిన్లపై ప్రభావం పడి, నగదు ప్రవాహాలు తగ్గిపోతాయని మూడిస్ తెలిపింది. గతంలో ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఆరంభమైన తర్వాత ధరల పెరుగుదలతో ఆయిల్ కంపెనీలు తాత్కాలికంగా నష్టాలు ఎదుర్కోగా, తర్వాత ధరలు కనిష్టానికి దిగి రావడంతో అవి భర్తీ అయినట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై కేంద్రం రూ.60 పెంచడం తెలిసిందే. మార్కెట్ ధరలకంటే తక్కువకు ఎల్పీజీ విక్రయించడం వల్ల ఏర్పడే నష్టాల భర్తీకి కేంద్రం 2024–25లో కేటాయించిన రూ.30వేల కోట్ల మాదిరి బడ్జెట్ కేటాయింపులు చేయొచ్చని ఫిచ్, మూడిస్ పేర్కొన్నాయి. అధిక ముడి చమురు ధరల ప్రభావం రిలయన్స్ ఇండస్ట్రీస్పై మిశ్రమంగా ఉండొచ్చని.. ముందస్తు నిల్వల కారణంగా తొలుత లాభపడొచ్చని, తర్వాత సరఫరా అవరోధాలతో రిఫైనరీ వినియోగం తగ్గించుకోవచ్చని అంచనా వేశాయి. ‘‘భారత్ తన చమురు అవసరాల కోసం సముద్ర రవాణాపైనే ఆధారపడి ఉంది. అయితే, సరఫరా వైవిధ్యానికి కూడా అవకాశం ఉంది. ఆసియా వెలుపల రష్యా, దక్షిణ అమెరికా నుంచి గతంలో చమురు కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. రష్యా నుంచి కొనుగోళ్లు ప్రస్తుతం రోజుకు 1.1 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే, గత నెలలో పునరుద్ధరించిన వెనెజువెలా నుంచి సరఫరా 1,42,000 బ్యారెళ్లుగా ఉంది’’అని ఎస్అండ్పీ రేటింగ్స్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ సంస్థలతోపాటు గెయిల్కు సమీప కాలంలో నగదు ప్రవాహ సమస్యలు ఎదుర్కోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఎక్కువ కాలం పాటు ఆయిల్ సరఫరాల సమస్యలు ఏర్పడితే ఓఎంసీల్లో అత్యధిక నగదు నిల్వలు కలిగిన బీపీసీఎల్ వీటిని తట్టుకోగలదని పేర్కొంది. -
గ్యాస్ షార్టేజీ.. ఇండక్షన్ స్టవ్లకు గిరాకీ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలతో వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. దీనితో ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కెటిల్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. గత కొద్ది రోజులుగా తమ దగ్గర ఇండక్షన్ కుక్టాప్లకు డిమాండ్ మూడు రెట్లు పెరిగినట్లు టాటా గ్రూప్లో భాగమైన క్రోమా తెలిపింది. ‘కొద్ది రోజులుగా ఇండక్షన్ కుక్టాప్లకు డిమాండ్ భారీగా ఎగిసింది. రోజువారీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. పైగా ముందు జాగ్రత్త చర్యగా కొందరు కస్టమర్లు ఒకేసారి పలు యూనిట్లను కొనే ధోరణి కూడా కనిపిస్తోంది. గతంలో ఇలాంటిది చూడలేదు‘ అని ఇన్ఫినిటీ రిటైల్ (క్రోమా) సీఈవో, ఎండీ శిబాశీష్ రాయ్ తెలిపారు. ఇండక్షన్ కుక్టాప్లతో పాటు ఎలక్ట్రిక్ కెటిల్స్ అమ్మకాలు కూడా సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపైనట్లు రాయ్ వివరించారు. వీటిని విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయ సాధనాలుగా కస్టమర్లు పరిగణిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దీనితో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కుకింగ్ సాధనాలకు డిమాండ్ నెలకొందని, అందుకు అనుగుణంగా తమ ఆఫ్లైన్ స్టోర్స్, ఆన్లైన్ మాధ్యమాల్లో తగినంత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఈ–కామర్స్ పోర్టల్ అమెజాన్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ‘గత రెండు రోజులుగా ఇండక్షన్ కుక్టాప్ల అమ్మకాలు 30 రెట్లు పెరగ్గా, రైస్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ల సేల్స్ 4 రెట్లు పెరిగాయి. ఎయిర్ఫ్రయర్స్, మల్టీ–యూజ్ కెటిల్స్ రెండు రెట్లు అధికంగా అమ్ముడవుతున్నాయి. నిమిషాల్లోనే డెలివరీలు పొందేలా ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని కస్టమర్లు మా అమెజాన్ నౌ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు’ అని అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు. స్టవ్క్రాఫ్ట్ జోరు.. పిజియన్, గిల్మా బ్రాండ్స్ కింద గృహోపకరణాలు విక్రయించే స్టవ్క్రాఫ్ట్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి తమ ఆన్లైన్ విక్రయాలు వారంవారీగా చూస్తే సగటున నాలుగు రెట్లు ఎగిసినట్లు సంస్థ ఎండీ రాజేంద్ర గాంధీ తెలిపారు. విశ్వసనీయమైన, చౌక గృహోపకరణాల కోసం వినియోగదారులు అన్వేషిస్తున్న నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేసే, ప్రత్యామ్నాయ సాధనాల వైపు మళ్లే ధోరణి ఇకపైనా కొనసాగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అటు, వంటగ్యాస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయువు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు. డెలివరీ వ్యవధి సాధారణ స్థాయిలో రెండున్నర రోజులుగానే కొనసాగుతోందని వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎల్పీజీ ఉత్పత్తి 25 శాతం పెరిగిందని తెలిపారు. కానీ పశ్చిమాసియా పరిణామాలతో ఇంధన సరఫరాకు అవరోధాలు ఎదురువుతున్నందున, పారిశ్రామిక, వాణిజ్య కస్టమర్లకు ఎల్పీజీ ‘పరిమిత’ స్థాయిలోనే సరఫరా అవుతోంది. -
చికెన్, పిజ్జా, బర్గర్.. కంపెనీలకు కష్టాలు
దేశీయ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) విభాగంపై గ్యాస్ సెగ ముసురుతోంది. వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో బుధవారం స్టాక్ మార్కెట్లో ప్రధాన క్యూఎస్ఆర్ కంపెనీల షేర్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. సరఫరా గొలుసులో తలెత్తిన సమస్యలు మరో రెండు వారాలకు పైగా కొనసాగితే కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.సరఫరా గొలుసులో సంక్షోభంప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ తాజా నివేదికలో క్యూఎస్ఆర్ విభాగం ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషించింది. ప్రధాన క్యూఎస్ఆర్ చైన్లో దాదాపు 60-65 శాతం వంట ప్రక్రియ పూర్తిగా ఎల్పీజీపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థలు కేవలం ఒకటి నుంచి రెండు వారాలకు సరిపడా గ్యాస్ నిల్వలను మాత్రమే కలిగి ఉన్నాయి. సరఫరా లోటు కారణంగా మార్చి నెలలోనే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 8 శాతం మేర పెరిగింది. ఇది నేరుగా రెస్టారెంట్ల నిర్వహణ వ్యయాన్ని పెంచుతోంది.ఆదాయం, మార్జిన్లపై ప్రభావంఒకవేళ సరఫరా నిలిచిపోయి, రెస్టారెంట్లు ఐదు రోజుల పాటు మూతపడితే ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. త్రైమాసిక ప్రాతిపదికన ప్రతి స్టోర్ ఆదాయం 6 శాతం తగ్గే అవకాశం ఉంది. రెస్టారెంట్ స్థాయి ఎబిటా మార్జిన్లు సాధారణం కంటే 14-20 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో వాణిజ్య వినియోగదారులపై రేషనింగ్(ప్రాధాన్యత క్రమంలో పరిమితంగా పంపిణీ చేయడం) విధించడం రెస్టారెంట్లకు శాపంగా మారింది.ముంచుకొస్తున్న ముప్పు.. ప్రత్యామ్నాయం తప్పదా?పెద్ద సంస్థల కంటే చిన్న, స్వతంత్ర రెస్టారెంట్లు ఈ సంక్షోభానికి త్వరగా ప్రభావితమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హార్ముజ్ జలసంధి వంటి కీలక షిప్పింగ్ మార్గాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల ఎల్పీజీ దిగుమతులకు ఆటంకం కలుగుతోంది. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రెస్టారెంట్ విభాగం ప్రత్యామ్నాయ ఇంధన వనరులు (విద్యుత్ ఆధారిత వంట పరికరాలు) లేదా సెంట్రలైజ్డ్ కిచెన్ మౌలిక సదుపాయాల వైపు మళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. -
గ్యాస్ సిలిండర్లకు ఐఆర్సీటీసీ స్వస్తి?
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారతీయ రైల్వే వంటశాలలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ వేదికగా సాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీయడంతో దేశంలో ఎల్పీజీ కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు ఆహార కొరత రాకుండా ఉండేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.ఐఆర్సీటీసీ తాజాగా వెలువరించిన అధికారిక సర్క్యులర్ ప్రకారం, వెస్ట్ జోన్ పరిధిలోని అన్ని స్టాటిక్ క్యాటరింగ్ యూనిట్లు తక్షణమే ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల్లోకి మారాలని ఆదేశించింది. ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్మెంట్ రూమ్లు, జన్ ఆహార్ కేంద్రాల్లో ఇకపై సాంప్రదాయ ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్లు వినియోగించాలని సూచించింది.అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ‘రెడీ-టు-ఈట్’ ఆహార పదార్థాలను తగినంత పరిమాణంలో నిల్వ ఉంచుకోవాలని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల సౌకర్యమే మా ప్రధమ ప్రాధాన్యత. అంతర్జాతీయ పరిణామాల వల్ల భవిష్యత్తులో ఆహార సరఫరాకు ఆటంకం కలగకూడదనే ఈ ముందస్తు చర్యలు తీసుకున్నాం’ అని ఐఆర్సీటీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.సంక్షోభానికి కారణాలుభారతదేశం తన ఎల్పీజీ అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల తలెత్తిన సవాళ్లు కింది విధంగా ఉన్నాయి.ఇరాన్ యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల లభ్యత తగ్గింది.గ్యాస్ సరఫరా నిలిచిపోతే రైల్వే స్టేషన్లలోని అవుట్లెట్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముందుచూపుతో..రైల్వే క్యాటరింగ్ వ్యవస్థను ఆధునీకరించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని ఐఆర్సీటీసీ భావిస్తోంది. విద్యుత్ ఆధారిత వంట పద్ధతులు కేవలం గ్యాస్ కొరతను అధిగమించడమే కాకుండా స్టేషన్లలో అగ్ని ప్రమాదాల ముప్పును కూడా తగ్గిస్తాయని కొందరు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి మరిన్ని జోన్లకు ఈ నిబంధనలను వర్తింపజేసే అవకాశం ఉంది. ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూనే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడబోమని ఐఆర్సీటీసీ భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు.. -
అమెరికాలో ముఖేష్ అంబానీ లక్షల కోట్ల పెట్టుబడులు
వాషింగ్టన్: అమెరికా ఇంధన రంగంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి భారత ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో ఆయిల్ రిఫైనరీ కేంద్రాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా 300 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టేలా ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు. రిలయన్స్ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తూ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘అమెరికా ఎనర్జీ రంగంలో తన ఆధిపత్యాన్ని తిరిగి సొంతం చేసుకోనుంది. 50 సంవత్సరాల తర్వాత తొలిసారి టెక్సాస్లోని బ్రౌన్స్విల్లే వేదికగా కొత్త ఆయిల్ రిఫైనరీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను. ఇది చారిత్రాత్మక 300 బిలియన్ డాలర్ల ఒప్పందం. అమెరికా చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి. ఇది అమెరికన్ కార్మికులు, శక్తి రంగం, దక్షిణ టెక్సాస్ ప్రజలకు గొప్ప విజయం. భారత్లోని మా భాగస్వాములకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ‘భారత్లోని మా భాగస్వాములకు, వారి అతిపెద్ద ప్రైవేట్ ఎనర్జీ కంపెనీ రిలయన్స్కు ధన్యవాదాలు. మా అమెరికా ఫస్ట్ అజెండా. అనుమతులను సులభతరం చేయడం, పన్నులను తగ్గించడం వల్లే బిలియన్ల డాలర్ల పెట్టుబడులు తిరిగి మా దేశానికి వస్తున్నాయి. బ్రౌన్స్విల్లే పోర్టులో కొత్త రిఫైనరీ అమెరికా మార్కెట్లకు ఇంధనం అందిస్తుంది, జాతీయ భద్రతను బలోపేతం చేస్తుంది. అమెరికా ఎనర్జీ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన రిఫైనరీగా నిలుస్తుంది. ఇది గ్లోబల్ ఎగుమతులకు శక్తినిస్తుంది. వేలకొద్దీ ఉద్యోగాలను సృష్టిస్తుంది. అభివృద్ధిని తెస్తుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రాంతానికి ఇది గొప్ప వరం. ఇదే అమెరికా ఎనర్జీ ఆధిపత్యం ఎలా ఉంటుందో చూపిస్తోందని పునరుద్ఘాటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎనర్జీ కంపెనీలలో ఒకటి. ఇప్పటికే జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తున్న రిలయన్స్ ఇప్పుడు అమెరికాలో కూడా తన ముద్ర వేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రిలయన్స్ అమెరికా ఎనర్జీ రంగంలో కీలక పాత్ర పోషించనుంది. అమెరికాలో పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ మార్పుల నేపథ్యంలో ఈ కొత్త రిఫైనరీ నిర్మాణం చాలా ముఖ్యమైనది. ఇది అమెరికా ఎనర్జీ భద్రతను పెంచడమే కాకుండా, కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. America is returning to REAL ENERGY DOMINANCE! Today I am proud to announce that America First Refining is opening the FIRST new U.S. Oil Refinery in 50 YEARS in Brownsville, Texas. THIS IS A HISTORIC $300 BILLION DOLLAR DEAL — THE BIGGEST IN U.S. HISTORY, A MASSIVE WIN for…— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) March 10, 2026 -
ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్..
దేశంలో ఎల్పీజీ కొరత ప్రభావంతో ఇండక్షన్ కుక్కర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించడంతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్లు అలాగే ఆన్లైన్ వేదికల్లో ఇండక్షన్ కుక్కర్లకు భారీగా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా గత శనివారం నుంచి అమ్మకాలు, ఎంక్వైరీలు అసాధారణంగా పెరిగినట్లు వెల్లడించారు.ఇంతకు ముందు కొన్ని షోరూమ్ చైన్లు రోజుకు సుమారు 35–40 ఇండక్షన్ కుక్కర్లను మాత్రమే విక్రయించేవి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరువైందని వ్యాపారులు చెబుతున్నారు.ఇండక్షన్ కుక్కర్లకు పెరుగుతున్న డిమాండ్ ప్రభావం స్టాక్ మార్కెట్పై కూడా కనిపించింది. ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్ ధరలు ఒక్క రోజులో గణనీయంగా పెరిగాయి. బోరోజ్ షేర్లు సుమారు 13 శాతం, బజాజ్ ఎలక్ట్రికల్స్ 7 శాతం, టిటికే ప్రెస్టీజ్ 7 శాతం, హాకిన్స్ 4.8 శాతం లాభపడ్డాయి. బటర్ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ షేర్లు కూడా సుమారు 2 శాతం పెరిగాయి.భారతదేశంలో ఎల్పీజీ వార్షిక వినియోగం సుమారు 31.3 మిలియన్ టన్నులు. ఇందులో 87 శాతం వినియోగం గృహ రంగానిదే. ఎల్పీజీ కొరత, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరగడం, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలపై భయాలు ఉండటంతో ఇండక్షన్ కుక్కర్లపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ఇదిలా ఉండగా, పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం, అవసరమైన రంగాలకు మాత్రమే సిలిండర్ల సరఫరాను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలకు మాత్రమే ఎల్పీజీ సరఫరా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు.దేశీయ ఉత్పత్తిని సుమారు 10 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆంక్షలను సడలించే అవకాశముందని కేంద్రం, చమురు కంపెనీలు తెలిపాయి. -
ఇండిగో సీఈఓ రాజీనామా
భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్.. తన పదవీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే నోటీసు పీరియడ్ను మినహాయించాలని అభ్యర్థించారు. ఈ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో కూడా వెల్లడించబడింది.ఇండిగో తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా బాధ్యతలు స్వీకరిస్తూ.. సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.2025 డిసెంబరులో కొత్త నియమాలను అమలు చేయడంలో ఎదురైన సమస్యల వల్ల భారీ ఆపరేషనల్ సంక్షోభం ఏర్పడింది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు 2,500 పైగా విమానాలు రద్దు కావడం, 1,900 పైగా విమానాలు ఆలస్యం కావడం వల్ల 3 లక్షలకి పైగా ప్రయాణికులు ప్రభావితులు అయ్యారు. DGCA ఈ ఘటనపై రూ. 22.20 కోట్ల రికార్డు జరిమానా విధించింది. అంతే కాకుండా ఎల్బర్స్కు షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. -
ఇన్వెస్టర్లూ.. ఆందోళన వద్దు!
రాజకీయ, భౌగోళిక సవాళ్లు ఎదురైనప్పుడు ఆందోళనకు లోనుకావద్దని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంతా పాండే ఇన్వెస్టర్లకు సూచించారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భయాలకు లోనుకాకుండా వ్యవహరించవలసిందిగా సలహా ఇచ్చారు. దేశీయంగా ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు.ప్రస్తుత సవాళ్లు సద్దుమణిగేవరకూ వేచిచూడమని సూచించారు. దీర్ఘకాలంలో ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ పటిష్టత కొనసాగుతుందని, తద్వారా భారత్ వృద్ధి అవకాశాలను ప్రతిబింబిస్తుందని తెలియజేశారు. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50.. 30 వసంతాల వేడుక సందర్భంగా పాండే ఇన్వెస్టర్లకు పలు సూచనలు ఇచ్చారు.పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశీయంగా స్టాక్ మార్కెట్లు అత్యధికస్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూస్తున్నట్లు పేర్కొన్నారు. కీలక నౌకా మార్గాలలో ఎదురవుతున్న అవాంతరాల కారణంగా చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం ఏర్పడుతున్నట్లు తెలియజేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ సరఫరాలమధ్య సమతౌల్యం దెబ్బతింటున్నట్లు వివరించారు. -
రూ.లక్ష కోట్లకు లోన్ బుక్..
ప్రభుత్వరంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్సీఎల్) వచ్చే ఆర్థిక సంవత్సరంలో (రూ.2026–27) రూ.లక్ష కోట్ల రుణ మార్క్ను అధిగమించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ‘‘2025 డిసెంబర్ 31 నాటికి రుణ పుస్తకం రూ.80,515 కోట్లుగా ఉంది. ప్రస్తుత ధోరణి, వివిధ రంగాల్లో ప్రస్తుత ప్రాజెక్టుల ఆధారంగా చూస్తే మా రుణ పుస్తకం విలువ 2027 మార్చి నాటికి రూ.లక్ష కోట్లు దాటనుంది’’అని ఐఐఎఫ్సీఎల్ ఎండీ రోహిత్ రిషి తెలిపారు. అంతేకాదు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో రుణ పుస్తకాన్ని రెట్టింపు చేసుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.క్రమశిక్షణతో కూడిన మదింపు ప్రమాణాలు, మెరుగైన ఆస్తుల నాణ్యత, నిధుల సమీకరణ వ్యూహాలు వృద్ధికి దోహదం చేస్తున్నట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్ షీటును విస్తరించుకోవడమే కాకుండా, అధిక నాణ్యతతో, వైవిధ్యమైన, జాతీయ మౌలిక ప్రయోజనాలకు అనుగుణంగా పటిష్ట రుణ పోర్ట్ఫోలియో నిర్మాణంపైనే మా ప్రధాన దృష్టి’’అని వివరించారు. మౌలిక రంగ అవసరాలకు అనుగుణంగా, తక్కువ వ్యయాలతో దీర్ఘకాలం కోసం దేశ, విదేశీ మార్కెట్ల నుంచి సైతం నిధులను సమీకరించుకోనున్నట్టు చెప్పారు.లోగడ ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, జికా, ఈఐబీ, ప్రపంచ బ్యాంక్ తదితర సంస్థల నుంచి నిధులను పొందినట్టు తెలిపారు. ఎంఐజీఏ (ప్రపంచ బ్యాంక్ సంస్థ) సహకారంతో సావరీన్ గ్యారంటీ లేకుండా దీర్ఘకాలానికి బిలియన్ డాలర్ల నిధులు సమీకరించనున్నట్టు రోహత్ రిషి తెలిపారు. ఐఐఎఫ్సీఎల్లో కేంద్రానికి నూరు శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!? -
వేసవిలో ఏసీ ధరల మంటలు
వేసవి ఎండలు అప్పుడే తారా స్థాయికి చేరుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్ కండీషనర్ (ఏసీ) కొనుగోలు చేద్దామనుకుంటున్న వారు.. కాస్తంత అదనంగా సమకూర్చుకోక తప్పదు. ఎందుకంటే సరిగ్గా సీజన్ ఆరంభానికి ముందు ఎసీ తయారీ సంస్థలు 5–15 శాతం మధ్య ధరల పెంపును అమలు చేస్తున్నాయి. ముడి సరుకుల ధరలు ప్రియంగా మారడం, సరఫరా చైన్ వ్యయాలు తగ్గించుకునేందుకు ధరల పెంపు బాటలో పయనిస్తున్నాయి. డైకిన్, వోల్టాస్, బ్లూస్టార్, ఎల్జీ, హైయర్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ పలు మోడళ్ల ఏసీల ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి.ఏసీల తయారీలోకి వినియోగించే రాగి తదితర ముడి సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు, అధిక రవాణా చార్జీలను కారణాలుగా కంపెనీలు పేర్కొంటున్నాయి. ధరలు పెంచినప్పటికీ.. అధిక ఉష్ణోగ్రతల అంచనాలతో ఈ ఏడాది అమ్మకాలు బలంగానే నమోదవుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీ రేట్ల సవరణ ఫలితంగా ఏసీల ధరలు దిగిరాగా.. తాజా పెంపుతో ఆ ప్రయోజనం పూర్తిగా ఆవిరికానుంది. అప్పుడు రూమ్ ఏసీలపై పన్ను రేటు 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడం గమనార్హం. డైకిన్ 12 శాతం పెంపు..జపనీస్ సంస్థ డైకిన్ ఏప్రిల్ నుంచి తన ఏసీ ధరలను 12 శాతం పెంచనున్నట్టు ప్రకటించింది. మోడళ్లను బట్టి ధరల పెంపు మారుతుందని డైకిన్ ఇండియా చైర్మన్, ఎండీ కన్వల్జిత్ జావా తెలిపారు. ‘‘కొత్త ఇంధన నిబంధనలతో ఉత్పత్తుల సామర్థ్యం పెరగనుంది. కాపర్ వంటి ముడి సరుకుల ధరలు పెరిగాయి. రూపాయితో డాలర్ ఆల్టైమ్ గరిష్టాల్లో ఉంది. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నాయి. రవాణా చార్జీలు కూడా పెరిగాయి. దీంతో దిగుమతులు (విడిభాగాలు) వ్యయంగా మారాయి. కనుక కంపెనీలకు ధరలు పెంచడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు’’అని జావా వివరించారు. ఈ సీజన్లో అమ్మకాలు 2024 స్థాయిలో ఉంటాయంటూ.. కనీసం 15 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. తాము ఫిబ్రవరి మధ్య నుంచే 8–10 శాతం మేర ధరలను పెంచినట్టు బ్లాస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. ‘‘ధరల పెంపునకు ముందుగానే డీలర్లు అదనపు నిల్వలను సమకూర్చుకున్నారు. పెరిగిన ధరలతో కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. గతేడాది జీఎస్టీ రేటు తగ్గింపు.. ఇప్పుడు ధరల పెరుగుదల ప్రభావాన్ని భర్తీ చేయనుందన్నారు. డిసెంబర్ నుంచి కాకుండా, గతేడాది వేసవి సీజన్తో పోలి్చతే ధరల పెరుగుదల పెద్దగా ఉండదని త్యాగరాజన్ పేర్కొన్నారు. గతేడాది వేసవిలో అసాధారణ వర్షాలు, ముందుగానే నైరుతి సీజన్ రావడం ఏసీ అమ్మకాలను ప్రభావితం చేయడం గమనార్హం.పోటీ తీవ్రతరంఈ ఏడాది రూమ్ ఏసీల మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంటుందన్నది మార్కెట్ విశ్లేషకుల అంచనా. గతేడాది సీజన్ ఆశించిన మేర లేకపోవడంతో ఈ ఏడాది అధిక విక్రయాల ద్వారా మార్కెట్ వాటా పెంచుకునేందుకు కంపెనీలు పోటీపడే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాటా గ్రూప్ సంస్థ వోల్టాస్ సైతం తన ఏసీల ధరలను 5–15 శాతం మధ్య పెంచనున్నట్టు ప్రకటించింది. తయారీ వ్యయాలు పెరగడం, రూపాయి విలువ క్షీణత, మెరుగైన ఇంధన సామర్థ్యాలతో కూడిన నాణ్యమైన ఏసీలను వినియోగదారులకు అందించాలంటే ధరలను పెంచక తప్పదని వోల్టాస్ ఎండీ ముకుందన్ మీనన్ తెలిపారు. ఎల్జీ ఎల్రక్టానిక్స్ 3 స్టార్ ఏసీల ధరలను 7 శాతం మేర, 5 స్టార్ ఏసీలను 9–10 శాతం మేర పెంచినట్టు ప్రకటించింది.కొత్త ఇంధన సామర్థ్యాలతో కూడిన ఏసీలతో వినియోగదారులకు 11 శాతం మేర ఇంధనం అదా అవుతుందని.. దీనివల్ల విద్యుత్ బిల్లు రూపంలో గణనీయంగా ఆదా అవుతుందని ఎల్జీ ఎల్రక్టానిక్స్ డైరెక్టర్ సంజయ్ చిట్కర తెలిపారు. హైయర్ ఇండియా తన ఏసీ ధరలను 5–8 శాతం వరకు పెంచగా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ 5 శాతం పెంచినట్టు వెల్లడించాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ కొత్త స్టార్ రేటింగ్ ప్రమాణాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం 5 స్టార్ ఏసీలు 10 శాతం మేర మరింత ఇంధనాన్ని ఆదా చేయనున్నాయి.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!? -
మహిళల నుంచే అన్నీ.. గౌతమ్ అదానీ భావోద్వేగం!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహిళలను స్మరించుకున్నారు. ఒక మనిషి విజయానికి కేవలం అతని కృషి మాత్రమే కాదు.. అతని కుటుంబం, ముఖ్యంగా మహిళల ప్రోత్సాహం, విలువలు, ప్రేమ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తన విజయాలకు పునాది తన కుటుంబ మహిళల నుంచే ఏర్పడిందని వెల్లడించారు.గౌతమ్ అదానీ తన బాల్యంలో.. తన తల్లి శాంతాబెన్ అదానీ చెప్పిన కథలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా రామాయణంలోని కథలు ఆయనలో ధైర్యం, త్యాగం, బాధ్యత వంటి విలువలను నాటాయి. కేవలం 16 ఏళ్ల వయసులో ఆయన తన భవిష్యత్తు కోసం ముంబైకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆయన తల్లి ఎంతో ధైర్యంతో తన కుమారుడిని తెలియని భవిష్యత్తు వైపు నడిపించింది. ఆ త్యాగం & ప్రేమను ఆయన జీవితాంతం గుర్తుంచుకుంటానని భావోద్వేగానికి లోనయ్యారు.అదానీ ఫౌండేషన్కు నాయకత్వం వహించడానికి దంతవైద్యంలో తన వృత్తిని విడిచిపెట్టిన తన భార్య ప్రీతి అదానీ గురించి కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో పనిచేస్తూ ఒక కోటి మందికి పైగా ప్రజలకు సహాయం అందిస్తోందని తెలిపారు.తన కోడళ్లు పరిధి అదానీ & దివా అదానీలు కుటుంబంలోకి తాజా దృక్పథాలు & కొత్త శక్తిని తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు, అదే సమయంలో తన మనవరాలు తన జీవితంలోకి తెచ్చే ఆనందాన్ని గురించి కూడా పేర్కొన్నారు. పిల్లల కళ్లలో కనిపించే విశ్వాసం మరియు అమాయకత్వం జీవితం అసలు అర్థాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: 2026లో ధనవతుల జాబితా: టాప్ 10లో వీరే..మనిషి జీవితంలో పెద్ద కంపెనీలు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. కానీ నిజమైన బలమైన పునాదులు కాంక్రీట్ లేదా ఉక్కుతో నిర్మితం కావు. మన జీవితాన్ని ప్రభావితం చేసే మనుషులతో నిర్మితమవుతాయి అని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలు మన జీవితాలను తీర్చిదిద్దే గొప్ప శక్తిగా ఉంటారని గౌతమ్ అదానీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. -
నీతా అంబానీ హీరోస్ ఉద్యమం.. ఎందుకంటే?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నీతా ముఖేష్ అంబానీ 'హీరోస్' ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రతి మహిళా ఒక హీరో అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ ప్రత్యేక ప్రచారం కోసం, రిలయన్స్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న రంగాలు అయిన విద్య, క్రీడలు, ఆరోగ్యం, మహిళా వ్యాపార ప్రోత్సాహం, పర్యావరణ సంరక్షణ & గ్రామీణ అభివృద్ధి వంటి విభాగాల్లోని మహిళా హీరోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మహిళలో ఉన్న ధైర్యం, ప్రతిభ & నాయకత్వాన్ని గుర్తించి, ప్రతి మహిళ తనలోని హీరోను కనుగొని ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.On International Women’s Day, Mrs. Nita Mukesh Ambani launched the HERoes movement and gave a powerful message – Har Nari Hero Hai! For this special campaign, she is joined by Heroes from different areas that Reliance Foundation has focused on for decades – education, sports,… pic.twitter.com/ElEfEK8wu1— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2026 -
2026లో ధనవంతుల జాబితా: టాప్ 10లో వీరే..
భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, ఇండియాలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు, వారి మొత్తం సంపద రూ. 112 లక్షల కోట్లు అని అంచనా. దీంతో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బిలియనీర్ల కేంద్రంగా నిలిచింది, యునైటెడ్ స్టేట్స్, చైనా ముందు వరుసలో ఉన్నాయి.2026లో భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో గౌతమ్ అదానీ, మూడో స్థానంలో రోష్ని నాడర్ మల్హోత్రా నిలిచారు.భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు➤ముఖేష్ అంబానీ: రూ. 9.8 లక్షల కోట్లు➤గౌతమ్ అదానీ: రూ. 7.5 లక్షల కోట్లు➤రోష్నీ నాడార్: రూ. 3.2 లక్షల కోట్లు➤సైరస్ ఎస్ పూనావల్ల: రూ. 3.0 లక్షల కోట్లు➤కుమార్ బిర్లా: రూ. 2.5 లక్షల కోట్లు➤దిలీప్ షాంఘ్వీ: రూ. 2.3 లక్షల కోట్లు➤అజీమ్ ప్రేమ్జీ: రూ. 2.3 లక్షల కోట్లు➤నీరజ్ బజాజ్: రూ. 2.2 లక్షల కోట్లు➤అశోక్ హిందూజా: రూ. 2.2 లక్షల కోట్లు➤రాధాకృష్ణ దమానీ: రూ. 1.5 లక్షల కోట్లు🚨 Top 10 richest people in India in 2026.1. Mukesh Ambani - ₹9.8 lakh crore2. Gautham Adani - ₹7.5 lakh crore3. Roshni Nadar - ₹3.2 lakh crore4. Cyrus S Poonawalla - ₹3.0 lakh crore5. Kumar Birla - ₹2.5 lakh crore6. Dilip Shanghvi - ₹2.3 lakh crore7. Azim Premji -…— Indian Tech & Infra (@IndianTechGuide) March 7, 2026 -
గ్యాస్ సిలిండర్ బుకింగ్.. కొత్త రూల్స్!
ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒక సిలిండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడానికి 15 రోజుల గడువు ఉండేది. ఇకపై ఈ వ్యవధిని 21 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ డెలివరీకి కనీసం 21 రోజుల విరామం ఉండాల్సి ఉంటుంది.ఈ కొత్త నిబంధన అమలుకు గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్వేర్ను వెంటనే అప్డేట్ చేశారు. అయితే బుకింగ్ విధానం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా భవిష్యత్తులోనూ 21 రోజుల గడువు పూర్తైన తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునే విధానాన్ని అమలు చేయాలనే విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఏడాదికి 15 సిలిండర్ల కొనుగోలుకు అనుమతిదేశీయ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై చమురు సంస్థలు ఇప్పటికే కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. వాటి ప్రకారం ప్రతి వినియోగదారు సంవత్సరానికి గరిష్టంగా 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే పొందగలరు. అదనంగా మూడు సబ్సిడీ రహిత సిలిండర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఏడాదిలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక్క గ్యాస్ కనెక్షన్పై మొత్తం 15 సిలిండర్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది.24 గంటల్లో సిలిండర్ డెలివరీవినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుకింగ్ చేసిన తర్వాత 24 గంటలలోపు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు ఏజెన్సీలకు సూచించాయి. ఈ నిబంధన వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది.21 రోజుల తర్వాతే రెండో సిలిండర్ డెలివరీకొత్త నిబంధన ప్రకారం మొదటి సిలిండర్ అందుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ డెలివరీ ఇవ్వబడుతుంది. దీనిని ఏజెన్సీల సాఫ్ట్వేర్లో లాక్ చేశారు. అయితే సిలిండర్ల కొరత ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లిపారు. ఇక సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ వారం బాట్లింగ్ ప్లాంట్లు ఆదివారాల్లో కూడా పనిచేయనున్నట్లు సమాచారం.గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా..పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో భారతదేశంలో డొమెస్టిక్ ఎల్పీజీ (14.2 కేజీలు) సిలిండర్ ధరలు మార్చి 7 నుంచి రూ.60 పెరిగాయి. ఈ పెంపు ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించదు. వారికి రూ.300 సబ్సిడీ కొనసాగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో రూ.913, ముంబైలో రూ.912.50, కోల్కతాలో రూ.939, చెన్నైలొ రూ.928.50, బెంగళూరులో రూ.915.50, హైదరాబాద్లో రూ.965లుగా ఉన్నాయి. -
కాంపోజిషన్ ఫీజు ఉండదు.. ఎగుమతిదారులకు కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 31 మధ్య ముగిసిపోయే ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ (ఈవో) వ్యవధిని ఆటోమేటిక్గా ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఇందుకోసం కాంపోజిషన్ ఫీజు ఉండదని పేర్కొంది.సాధారణంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) స్కీము కింద దేశీ సంస్థలు సుంకాల రహితంగా మెషిన్లను దిగుమతి చేసుకోవచ్చు. అయితే, దానికి ప్రతిగా నిర్దిష్ట వ్యవధిలో ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. అమెరికా టారిఫ్లతో సతమతమవుతుండగా ఇటు పశ్చిమాసియాలో సంక్షోభం కూడా తోడు కావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎగుమతిదారులు ఈ విషయంలో వెసులుబాటునివ్వాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. పోర్టుల్లో వెసులుబాటు.. ఎగుమతి సంస్థలకు మద్దతుగా నిల్చేలా కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, జలమార్గాల శాఖ నిర్ణయాలు తీసుకుంది. స్టోరేజి అద్దెలు, నౌకలను మార్చుకోవడానికి సంబంధించిన చార్జీలు మొదలైన వాటిని తగ్గించాలని లేదా మినహాయింపునివ్వాలని యూజర్ల నుంచి వచ్చే అభ్యర్ధనలను పరిస్థితిని బట్టి పరిగణనలోకి తీసుకోవాలని పోర్టులకు సూచించింది. పశ్చిమాసియా నుంచి వచ్చే పెరిషబుల్ కార్గో (ఎక్కువ కాలం నిల్వ ఉండని ఉత్పత్తుల)కి ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది.అలాగే పోర్టుల్లో సమస్యలేవైనా తలెత్తితే సంప్రదించేందుకు నిర్దిష్టంగా నోడల్ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం సూచించింది. ఆ అధికారి సదరు సమస్యలను ఆయా విభాగాల దృష్టికి తీసుకెళ్లి 24–72 గంటల్లోగా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ప్రకారం పోర్ట్ చైర్పర్సన్లు తరచుగా షిప్పింగ్ లైన్స్, ఎగుమతిదారులు, కస్టమ్స్, టర్మినల్ ఆపరేటర్లు మొదలైన వర్గాలతో సమావేశమై, పరిస్థితులను సమీక్షిస్తూ ఉండాలని తెలిపింది. -
మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..
దేశీయంగా బీమా కవరేజీ ఉన్న జనాభాలో మహిళల వాటా 47 శాతంగా ఉన్నప్పటికీ, వారికి ఆరోగ్య బీమా కవరేజీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేవలం 20 శాతం మంది మహిళలకు మాత్రమే తగినంత కవరేజీ ఉంటోందని టాటాఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది.కార్డియాక్, క్యాన్సర్లాంటి తీవ్ర అనారోగ్యాల చికిత్స వ్యయాలకు సాధారణంగా రూ. 20 లక్షలకు పైగా కవరేజీ అవసరమవుతోందని పేర్కొంది. కానీ 80 శాతం మందికి ఆ స్థాయిలో బీమా ఉండటం లేదని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో కార్డియాక్ రిసు్కలు ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నాయని 34 శాతం మంది కార్డియాలజిస్టులు వివరించినట్లు తెలిపింది.అయితే, మహిళల్లో వ్యాధి లక్షణాలను చాలా సందర్భాల్లో సకాలంలో గుర్తించకపోవడం లేదా తప్పుగా నిర్ధారించడం వల్ల చికిత్స అందడంలో జాప్యం చోటు చేసుకుంటోందని సంస్థ తెలిపింది. ఇక చికిత్స వ్యయాల విషయానికొస్తే.. నేషనల్ హెల్త్ అకౌంట్స్ (2021–22) గణాంకాల ప్రకారం 39.4 శాతం ఖర్చులు జేబునుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది.ఆరోగ్య బీమా తీసుకోవడం పెరుగుతున్నప్పటికీ దాన్ని కొనసాగించకపోవడం, తక్కువ కవరేజీ తీసుకోవడంలాంటి ధోరణులను బట్టి చూస్తే చాలా మటుకు మహిళలకు తగినంత కవరేజీ ఉండటం లేదనే విషయం తెలుస్తోందని కంపెనీ హెడ్ (కన్జూమర్ బిజినెస్ క్లెయిమ్స్) రాజగోపాల్ రుద్రరాజు తెలిపారు.మహిళల్లో క్యాన్సర్, తీవ్ర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సన్నద్ధత గతంలో కన్నా మరింత కీలకంగా మారిందని పేర్కొన్నారు. తగినంత కవరేజీ తీసుకోవడం, ప్రివెంటివ్ హెల్త్కేర్పై దృష్టి పెట్టడం అవసరమని వివరించారు. -
భారత్కు ఫిన్లాండ్ చాక్లెట్లు తీసుకొస్తున్న రిలయన్స్
న్యూఢిల్లీ: ఫిన్లాండ్కి చెందిన ఆహారోత్పత్తుల దిగ్గజం ఫేజర్తో రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫేజర్ ప్రీమియం చాక్లెట్లను భారత్లో ఉత్పత్తి, మార్కెటింగ్, పంపిణీ కార్యకలాపాలను ఆర్సీపీఎల్ చేపట్టనుంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.పోలాండ్, చైనా తదితర 40 పైగా దేశాలకు ఫేజర్ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి. 2022లో ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీపీఎల్ సంస్థ టాఫీమ్యాన్, పాన్ పసంద్, లోటస్ చాక్లెట్స్లాంటి పలు దేశీ బ్రాండ్లను పునరుద్ధరించింది. అలాగే మాలిబాన్, నెక్స్బా, పేస్లాంటి గ్లోబల్ బ్రాండ్స్ని కూడా ప్రవేశపెట్టింది. -
మహిళా సాధికారతకు ఎస్బీఐ 50 కోట్ల డాలర్ల రుణ సదుపాయం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 50 కోట్ల డాలర్ల సిండికేటెడ్ సోషల్ టర్మ్ రుణ సదుపాయాన్ని ప్రకటించింది. ఇందులో గ్రీన్షూ ఆప్షన్ కూడా ఉంటుంది.లింగ సమా నత్వం, సమగ్ర ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఈ రుణం అందించనున్నట్లు బ్యాంకు తెలిపింది. పర్యావరణ, సామాజిక, గవర్నెన్స్ (ఈఎస్జీ) సిద్ధాంతాలపై బ్యాంకు చిత్తశుద్ధిని ఇది ప్రతిబింబిస్తుందని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. -
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!
సాధారణంగా ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏడాదికి రూ. 26 లక్షలు వేతనం వచ్చే జాబ్ తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వెబ్సైట్ డిజైనర్ అయిన పుష్కర్ సోషల్ మీడియా పోస్ట్లో, ఉద్యోగంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని, జీతం కంటే వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం అని వెల్లడించారు.ఉద్యోగం వదులుకోవాలనుకున్నప్పుడు.. చాలాసార్లు ఆలోచించాను. ఒక వైపు నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? అనే సందేహం, మరోవైపు ఉద్యోగంలో నేను చిక్కుకోకూడదనుకుంటున్నాను అనే భావన. మొత్తానికి ఫ్రీలాన్సింగ్ కోసం ఉద్యోగం వదులుకున్నాను. ఇది కూడా అంత స్థిరంగా ఉండదు. ఇందులో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఉద్యోగంలో ఉంటే.. ప్రతిరోజూ పశ్చాత్తాపపడేవాడిని. కాబట్టి నేను నా మనసును నమ్ముకుని బయటకు వచ్చేశాను.ముఖ్యంగా పెద్ద నగరాల్లో, నెలకు చేతికి వచ్చే జీతం తన జీవితాన్ని మార్చేది కాకపోవచ్చు, ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినందున ఏడాదికి రూ. 26 లక్షలు చాలాపెద్ద మొత్తం అని పుష్కర్ అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.మీ మీద నమ్మకం ఉంచండి, మీకు ప్రతిఫలం లభిస్తుందని కొందరు చెబుతుంటే.. వ్యక్తి విలువలకు అనుగుణంగా ఉన్నంత వరకు రెండు ఎంపికలు మంచివేనని ఇంకొందరు చెబుతున్నారు. ''మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సామ్రాజ్య నిర్మాణంలో రిస్క్ తీసుకోవడం ప్రధానం'' అని మరికొందరు చెబుతున్నారు.A few days ago, I walked away from a ₹26 LPA job right at the time of onboarding.Since then I’ve had very mixed feelings.One side of me says I made the right decision. I didn’t want to get trapped in a job.The other side keeps asking… what if this was a huge mistake?…— Pushkar @ Website Designer (@in_pushkar) March 5, 2026 -
భారీగా పెరిగిన సుందర్ పిచాయ్ వేతనం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ గూగుల్.. సీఈఓ సుందర్ పిచాయ్ వేతనాన్ని రాబోయే మూడు సంవత్సరాలలో 692 మిలియన్ డాలర్లకు (రూ. 63,61,79,82,000) పెంచింది. దీంతో ఈయన ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా నిలిచారు.సీఈఓ సుందర్ పిచాయ్ మొత్తం ప్యాకేజీలో ఎక్కువ భాగం (126 మిలియన్ డాలర్లు) పర్ఫార్మెన్స్ స్టాక్ యూనిట్స్ ద్వారా వస్తుంది. అదనంగా పిచాయ్ మూడేళ్లలో నెలవారీగా 84 మిలియన్ డాలర్ల రిస్ట్రిక్టెడ్ స్టాక్ పొందతారు. వీటితో పాటు ఆయన యాన్యువల్ సాలరీ 2 మిలియన్ డాలర్లను కూడా పొందుతారుగూగుల్.. వేమో & వింగ్ ఏవియేషన్ వంటి ఆటోనమస్ విభాగాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి కొత్త స్టాక్ ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించింది. దీనిద్వారా మొత్తం 350 మిలియన్ డాలర్ల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.2015 ఆగష్టులో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఆయన నాయకత్వంలో గూగుల్ మార్కెట్ కాపిటలైజేషన్ 535 బిలియన్ డాలర్ల నుంచి 3.6 ట్రిలియన్ డాలర్ల వరకు పెరిగింది. కొన్నిసార్లు నాలుగు ట్రిలియన్ డాలర్లను సైతం అధిగమించింది. పిచాయ్ గూగుల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2004లో గూగుల్ కంపెనీలో చేరిన తరువాత క్రోమ్ను అభివృద్ధి చేయడం & ఆండ్రాయిడ్ను నడిపించడం ద్వారా ఉన్నత స్థానానికి ఎదిగారు. -
‘భారతీయ బ్యాంకింగ్పై నమ్మకం’లో కొత్త కోణాలు
చిరకాలంగా బ్యాంకింగ్ రంగంలో నమ్మకమనేది కీలకాంశంగా ఉంటోంది. అయితే ఆ నమ్మకం కలిగే ప్రక్రియ ఇప్పుడు మారుతోంది. నేటి కస్టమర్ల దగ్గర మరింత సమాచారం ఉంటోంది. వారు మరింతగా కనెక్ట్ అయి ఉంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి కూడా అవగాహన పెరిగింది. కాబట్టి, ఇప్పుడు వారు బ్యాంకుల నుంచి కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే కాకుండా, విశ్వసనీయత, జవాబుదారీతనం, నిలకడైన నిరంతర సేవలను కూడా ఆశిస్తున్నారు.ఆర్థిక రంగ సంస్కరణల తర్వాతి కాలంలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలను ఎక్కువ మందికి చేరవేయడంపై దృష్టి పెట్టింది. మరింత మంది ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమనేది ఆర్థిక, సామాజిక పరంగా ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ దిశగా గణనీయమైన పురోగతి కూడా సాధించబడింది. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, కస్టమర్లు మరో ముఖ్య అంశాన్ని కోరుకుంటున్నారు. అదేమిటంటే, మారుతున్న పరిస్థితుల్లో కూడా తమ బ్యాంక్ ఆధారపడే విధంగానే ఉంటుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే ఓ నమ్మకాన్ని వారు కోరుకుంటున్నారు.విశ్వాసానికి మారుతున్న పునాదులుకొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్యాంకులపై విశ్వాసం ప్రధానంగా భౌతిక ఉనికితో అనుసంధానమై ఉండేది. దగ్గరలో ఉన్న బ్రాంచ్, చిరపరిచితమైన సిబ్బంది, స్థిరమైన ప్రక్రియలు కస్టమర్లకు భరోసా కలిగించేవి. స్థిరత్వమే విశ్వాసానికి ఆధారంగా ఉండేది.టెక్నాలజీ అభివృద్ధితో బ్యాంకింగ్ రంగం మారిన తర్వాత సౌలభ్యమనేది కూడా కస్టమర్ల ప్రాధాన్యతల్లో కీలకంగా మారింది. వేగవంతమైన లావాదేవీలు, సులభమైన ప్రక్రియలు రోజువారీ బ్యాంకింగ్ను సులభతరం చేశాయి. అయితే కాలక్రమేణా ఇవి ప్రత్యేతలుగా కాకుండా సర్వసాధారణంగా ఆశించే సేవలుగా మారిపోయాయి.ఇప్పుడు కస్టమర్లు బ్యాంకింగ్ సేవలనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణంగా అందుబాటులోనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దృష్టి ఇప్పుడు విశ్వసనీయ వ్యవస్థలవైపు మళ్లింది. బ్యాంకింగ్ సిస్టమ్లు సజావుగా పనిచేయాలి. కస్టమర్ సమాచారం భద్రంగా ఉండాలి. సంస్థలు కార్యకలాపాల్లో క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నారు.దీనితో భద్రత అనే భావన పరిధి కూడా పెరిగింది. బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉండటం ముఖ్యమే. అదే సమయంలో మోసాల నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించడంలాంటి బ్యాంకింగ్ సామర్థ్యాలపై కూడా కస్టమర్లు దృష్టి పెడుతున్నారు.రుణ లభ్యత పెరగడం కూడా కస్టమర్ల అంచనాలను ప్రభావితం చేసింది. రుణాల మంజూరులో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వడ్డీ మరియు ఛార్జీల్లో పారదర్శకత ఉండటం, రిస్క్ను సమగ్రంగా అంచనా వేయడం వంటి అంశాల విషయంలో బ్యాంకుల నుంచి కస్టమర్లు భరోసాను కోరుకుంటున్నారు. బ్యాంకులు వ్యాపార వృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా తాము సేవలందించే కస్టమర్ల దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి కూడా మద్దతుగా నిలిచేలా ఉండాలని ఈ అంశాలు సూచిస్తాయి.ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయత, వివేచన, స్థిరత్వాన్ని బట్టి నమ్మకం నిలిచి ఉంటుంది.డిజిటల్ పురోగతి - కస్టమర్ అవగాహనభారత్లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి రోజువారీ బ్యాంకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఎక్కడో దూరంగా ఉండి కూడా ఖాతాలు తెరవొచ్చు. రుణాలపై నిర్ణయాలు కూడా గతంతో పోలిస్తే చాలా వేగంగా తెలియజేయవచ్చు. ఇలాంటి పురోగతి వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు ఆర్థిక అంశాల నిర్వహణ మరింత సులభమైంది.అయితే ఈ అభివృద్ధితో పాటు కస్టమర్లలో సైబర్ భద్రత అంశాలపై కూడా అప్రమత్తత పెరుగుతోంది. మోసాలు, డేటా లీక్ ఘటనలు భద్రత చర్యల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. కేవలం సౌలభ్యం మాత్రమే కస్టమర్లకు భరోసా కలిగించడం లేదు. భద్రత, సన్నద్ధత కూడా అంతే ముఖ్యమైనదిగా ఉంటోంది.ఇప్పుడు బ్యాంకులు డిజిటల్ సేవలు అందించగలవా లేదా అనే విషయం గురించి కస్టమర్లు ప్రశ్నించడం లేదు. బ్యాంకులు రిస్క్లను ఎంత సమర్ధవంతంగా ముందుగానే గుర్తిస్తున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలను గమనిస్తున్నారు. అసాధారణ లావాదేవీలపై తక్షణ అలర్ట్లు, అవసరమైన సమయంలో సత్వర సహాయం, ఖాతాలను భద్రంగా ఉంచే స్పష్టమైన విధానాలు కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలకంగా మారుతున్నాయి.దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంపొందించుకునే సంస్థలు టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తిస్తున్నాయి. అందువల్ల డిజిటల్ సామర్థ్యాల విస్తరణతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలు, భద్రతా చర్యలు, స్పందనా విధానాలను పటిష్టం చేసుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ యుగంలో నమ్మకమనేది అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది.ముందున్న దారిగత దశాబ్దకాలంలో భారత బ్యాంకింగ్ రంగం స్థిరంగా విస్తరించింది. బ్యాంకింగ్ సేవల లభ్యత విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయాల నాణ్యతపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాంకులు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాయనేది కస్టమర్లు నిశితంగా గమనిస్తున్నారు.కొన్ని సందర్భాల్లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అంటే కొంత నిగ్రహం పాటించడం కూడా అవుతుంది. ఉదాహరణకు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే రుణాన్ని నిరాకరించడం, భారీ లావాదేవీల ముందు అదనపు ధృవీకరణ చేపట్టడం, లేదా నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తి అనేది కస్టమర్ పరిస్థితులకు ఎందుకు అనుకూలం కాదనే విషయాన్ని స్పష్టంగా వివరించడంలాంటి చర్యలు అవసరం కావచ్చు. ఇలాంటి నిర్ణయాలు తాత్కాలికంగా వ్యాపార విస్తరణ వేగాన్ని నెమ్మదింపచేసినా, అవి సంస్థల బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. దీర్ఘకాలంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు తోడ్పడతాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు సమతుల్యతతో, స్థిరంగా వ్యవహరిస్తుందనే నమ్మకాన్ని పెంచుతుంది.మొత్తంగా చూస్తే విశ్వాసమనేది మాటలతో కాదు, రోజువారీ తీసుకునే చర్యలతోనే ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా ఉంటూ, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించే బ్యాంకులు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలవు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కూడా అవి తోడ్పడతాయి.- హితేంద్ర నాథ్ ఝా, హెడ్ - రిటైల్ లయబిలిటీస్, టీఏఎస్సీ & టీపీపీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ -
ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష
ఈ-కామర్స్ సర్వీసులు అందిస్తున్న ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్ష తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వాల్మార్ట్ ఆధ్వర్యంలోని ఈ సంస్థ త్వరలో రానున్న పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ ఉద్యోగ కోతలపై ఫ్లిప్కార్ట్ అధికారికంగా స్పందిస్తూ, ఇది ఒక సాధారణ ప్రక్రియ అని స్పష్టం చేసింది. ‘ఫ్లిప్కార్ట్లో స్పష్టంగా నిర్వచించిన అంచనాలకు అనుగుణంగా రెగ్యులర్ పనితీరు సమీక్షలను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియలో భాగంగా కొద్ది శాతం మంది ఉద్యోగులు సంస్థ నుంచి బయటకు వెళ్లవచ్చు. ఇందులో ప్రభావితమైన ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తున్నాం’ అని సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.ఐపీఓ లక్ష్యంగా..2025 డిసెంబర్లో ఫ్లిప్కార్ట్ తన అధికారిక చిరునామాను చట్టపరంగా సింగపూర్ నుంచి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి అనుమతి పొందింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావాలనే ప్రణాళికలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యాషన్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి వివిధ విభాగాలను సరళీకృతం చేస్తూ సింగపూర్కు చెందిన ఎనిమిది సంస్థలను ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్లో విలీనం చేసింది.నష్టాలున్నా.. పెరిగిన ఆదాయంబిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ‘టోఫ్లర్’ డేటా ప్రకారం ఫ్లిప్కార్ట్ ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.5,189 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అయితే కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.3 శాతం వృద్ధి చెంది రూ.82,787.3 కోట్లకు చేరింది (గత ఏడాది ఇది రూ.70,541.9 కోట్లు). మొత్తం ఖర్చులు 17.4 శాతం పెరిగి రూ.88,121.4 కోట్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా స్టాక్ కొనుగోళ్ల వ్యయం పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ఇదీ చదవండి: రష్యా చమురు కొనుగోలుకు యూఎస్ ఓకే -
పేటీఎం తర్వాత మరో భారీ ఐపీవో.. ఫోన్పే ప్లాన్ ఇదే!
పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాల్లో ఉన్న ఫిన్టెక్ సంస్థ ఫోన్పే సుమారు 1.05 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం కంపెనీ సుమారు 9-10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 – రూ. 87,000 కోట్లు) వేల్యుయేషన్తో నిధులు సమీకరించినట్లు అవుతుందని పేర్కొన్నాయి.మూడేళ్ల క్రితం కంపెనీ 100 మిలియన్ డాలర్లు సమీకరించినప్పటి 12 బిలియన్ డాలర్ల విలువతో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ కావడం గమనార్హం. అయితే వేల్యుయేషన్ తగ్గినా కూడా పేటీఎం ఐపీవో తర్వాత ఫోన్పే ఇష్యూ రెండో అతి పెద్ద ఐపీవోగా నిలిచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.పేటీఎం 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.4 లక్షల కోట్లు) వేల్యుయేషన్తో 2021 నవంబర్లో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఫోన్పే ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండనుంది. కంపెనీలో వాటాదారులైన వాల్మార్ట్, టైగర్ గ్లోబల్, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ ఫైనాన్స్ వాటాలు విక్రయించనున్నాయి. ఐపీవోతో మైక్రోసాఫ్ట్, టైగర్ గ్లోబల్ పూర్తిగా ని్రష్కమించే యోచనలో ఉన్నాయి. -
బంగారంపై భారీ డిస్కౌంట్.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు
మిడిల్ ఈస్ట్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్కు, అమెరికా-ఇజ్రాయెల్కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. -
ఒకేసారి 300 మంది ఉద్యోగులపై వేటు!
అమెజాన్ కంపెనీ ఉద్యోగుల తొలగింపును ప్రకటించిన తరువాత.. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో భాగంగా దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సంస్థ తన వ్యాపారాలలో దాదాపు 20,000 మంది ఉద్యోగులను మాత్రమే కలిగి ఉంది.2024 ప్రారంభంలో కూడా ఫ్లిప్కార్ట్ తన వార్షిక పనితీరు సమీక్షలో 5 శాతం లేదా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరోమారు 300 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఇంటర్నెట్ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించడం & పనితీరును మెరుగుపరచడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. స్టార్టప్ రంగంలో పెట్టుబడులు తగ్గడం.. లాభదాయకతపై పెట్టుబడిదారులు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలను తీసుకుంటున్నాయి. ఫ్లిప్కార్ట్ కూడా అదే దిశగా చర్యలు తీసుకుంటూ సంస్థ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోంది.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఫ్లిప్కార్ట్ భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. సంస్థ గోల్డ్మన్ సాచ్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్ & కోటక్ మహీంద్రా క్యాపిటల్ వంటి పెట్టుబడి బ్యాంకులతో ప్రారంభ చర్చలు జరుపుతోంది. కాగా కంపెనీ 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో ఐపీఓ చేయాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. ఇటీవల ఫ్లిప్కార్ట్ తన సంస్థ నిర్మాణంలో కూడా కొన్ని మార్పులు చేసింది. కంపెనీకి సంబంధించిన హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి తిరిగి భారతదేశానికి మార్చడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) నుంచి ఆమోదం పొందింది. ఈ నిర్ణయం కంపెనీ భారతదేశంలో పబ్లిక్ లిస్టింగ్కు సిద్ధం కావడంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఇదీ చదవండి: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్: 200 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీ! -
టాటా స్టీల్ రూ. 11,000 కోట్ల పెట్టుబడులు
రాంచీ: అధునాతన గ్రేడ్ ఉక్కును తయారు చేసే దిశగా జంషెడ్పూర్ ప్లాంటుపై రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. ఇందుకోసం తాము రూపొందించిన టెక్నాలజీతో ఉక్కు ప్రాసెసింగ్ వేగవంతమవుతుందని, అలాగే కర్బన ఉద్గారాలు కూడా తగ్గుతాయని చెప్పారు. నెదర్లాండ్స్లో ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయిన నేపథ్యంలో 2030 నాటికి జంషెడ్పూర్లో 1 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. హైడ్రోజన్ ట్రక్కులపై కూడా టాటా మోటర్స్ ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. ఇక జార్ఖండ్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని టాటా గ్రూప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
అదీ ‘ఆర్థిక’ యుద్ధమే: రాబర్ట్ కియోసాకి
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మూడోసారి చేసిన వియత్నాం పర్యటన సందర్భంగా తన అనుభూతులను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వియత్నాం యుద్ధం (Vietnam War) తర్వాత ఆయన చేసిన ఈ పర్యటనలో వియత్నాం ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాసుకొచ్చారు.అయితే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సహ పైలట్లు, సహాధ్యాయుల జ్ఞాపకాలు తాను మర్చిపోలేకపోతున్నానని పేర్కొన్నారు. వియత్నాం యుద్ధ సమయంలో హెలికాప్టర్ పైలట్గా పనిచేసిన కియోసాకి, యుద్ధం వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే తాను మళ్లీ మళ్లీ వియత్నాంకు వెళ్తున్నానని తెలిపారు. “నిజాన్ని ఎంత ఎక్కువగా వెతుకుతానో, అది అబద్ధాల కింద దాగి ఉందనే విషయం అంతగా అర్థమవుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.యుద్ధాలు తరచుగా ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతాయని కియోసాకి తన పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో యుద్ధాలు నడుస్తాయని, అయితే యువత, వారి కుటుంబాలే ప్రాణ నష్టాన్ని భరిస్తారని ఆయన పేర్కొన్నారు. వియత్నాం యుద్ధం కూడా చమురు ప్రయోజనాల కోసం జరిగిందని ఆయన అభిప్రాయపడుతూ, ప్రస్తుతం ఇరాన్ (Iran War) చుట్టూ జరుగుతున్న ఉద్రిక్తతలతో పోల్చారు.ఇదే సందర్భంలో, యుద్ధాల వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించే ఎంపైర్ ఆఫ్ లైస్ (Empire of Lies) అనే పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. నిజాలను తెలుసుకోవాలనుకునే వారు ఇలాంటి పుస్తకాలను చదవాలని ఆయన పిలుపునిచ్చారు.సాంప్రదాయ విద్యా వ్యవస్థపై కూడా కియోసాకి ప్రశ్నలు లేవనెత్తారు. పాఠశాలల్లో సరైన ఆర్థిక విద్య అందకపోవడం వల్ల ప్రజలు ఆర్థిక వ్యవస్థల నిజాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.“నిజాన్ని వెతికే వ్యక్తులుగా మారండి, అబద్ధాల వల్ల మోసపోయే బాధితులుగా కాకండి” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.3rd trip back to Vietnam since war ended.Happy to report the Vietnamese economy is booming. Yet…Bittersweet memories of fellow pilots and classmates who never returned.I have returned three times since the war….seeking answers….I seekthe truth….yet the more I seek…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 5, 2026 -
నౌకలు నిల్చిపోతే కీలక రంగాలపై ఎఫెక్ట్
పశ్చిమాసియాలో యుద్ధంతో (#IranIsraelUSWar) హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వారానికి పైగా నిల్చిపోతే దేశీయంగా పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఒక నివేదికలో వెల్లడించింది. ఇంధన మార్కెట్ల నుంచి ఎరువుల సరఫరా, పరిశ్రమలకు ముడిపదార్థాలు, నిర్మాణ రంగ మెటీరియల్స్తో పాటు ఇతరత్రా ఎగుమతి రంగాలకు కూడా సవాళ్లు తప్పవని పేర్కొంది.‘‘దీనితో తక్షణం పెట్రోలియంపై ప్రభావం పడుతుంది. 2025లో పశ్చిమాసియా నుంచి భారత్ 70 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్రోలియం క్రూడ్, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత్ వద్ద 30 రోజులకు సరిపడేంత ఇంధన నిల్వలే ఉన్నాయి. ఒకవేళ షిప్మెంట్స్లో ప్రతిష్టంభన మరింత దీర్ఘకాలం కొనసాగితే ఇంధనాల ధరలు వేగంగా పెరిగిపోతాయి. దీంతో రవాణా వ్యయాలతో పాటు మిగతా అన్నింటి ధరలూ పెరుగుతాయి. డీజిల్ రేట్ల వల్ల రైతులకు ఇరిగేషన్ పంపులు, ట్రాక్టర్ల నిర్వహణ వ్యయాల భారం పెరుగుతుంది’’ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. -
అనిల్ అంబానీకి ఈడీ షాక్
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ గ్రూప్పై కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చు బిగుస్తోంది. నిధుల మళ్లింపు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రిలయన్స్ పవర్ లిమిటెడ్కు చెందిన పలు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది.పదికి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలుముంబైలోని రిలయన్స్ పవర్ కార్యాలయాలు, ఆ సంస్థతో సంబంధం ఉన్న కీలక వ్యక్తుల నివాసాలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. దాదాపు 15 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. నగరంలోని 10 నుంచి 12 ప్రదేశాల్లో తెల్లవారుజాము నుంచే అధికారులు తనిఖీలు చేపట్టారు. రిలయన్స్ పవర్ సంస్థకు సంబంధించి జరిగిన కొన్ని అనుమానాస్పద నిధుల బదిలీపై దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక సమాచారం. అయితే, ఈ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను ఈడీ వెల్లడించాల్సి ఉంది.పాత కేసుల సెగఅనిల్ అంబానీకి చెందిన కంపెనీలపై దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. గత కొంతకాలంగా వరుస పరిణామాలు రిలయన్స్ గ్రూప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో భాగంగా ముంబైలోని అత్యంత విలాసవంతమైన పాలి హిల్ ప్రాంతంలో ఉన్న రూ.3,716.83 కోట్ల విలువైన ‘అబోడ్’ నివాస ఆస్తిని ఈడీ ఇప్పటికే తాత్కాలికంగా జప్తు చేసింది. పీఎంఎల్ఏ 2002 నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నారు.గత నెలలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సైతం అనిల్ అంబానీ నివాసంలో సోదాలు నిర్వహించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ద్వారా రూ.2,220 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నది ప్రధాన ఆరోపణ. కల్పిత లావాదేవీల ద్వారా రుణాలను మళ్లించడం, ఖాతాలను తారుమారు చేయడం వంటి అక్రమాలకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు -
యుద్ధ భయం.. బీమా ప్రీమియం ప్రియం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో అత్యంత రిస్కీ ప్రాంతాల నుంచి వెళ్లే నౌకలకు యుద్ధ రిస్కుల కవరేజీకి సంబంధించి మరింత ఎక్కువగా ప్రీమియం చెల్లించాల్సి రానుందని నిపుణులు తెలిపారు. క్రూడాయిల్, ద్రవీకృత సహజ వాయువును రవాణా చేసే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) నౌకలు, ముఖ్యంగా ఎర్ర సముద్రం ప్రాంతం గుండా వెళ్లేవి, ఇంకా అధికంగా చెల్లించాల్సి రావచ్చని పాలసీబజార్ హెడ్ (మెరైన్ ఇన్సూరెన్స్) ఆర్. బాలసుందరం తెలిపారు.ఇలాంటి పరిణామాలతో సమీప భవిష్యత్తులో ఆయిల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. పర్షియన్ గల్ఫ్లో ఉద్రిక్తతలతో మెరైన్ ఇన్సూరెన్స్కి సంబంధించి వార్ రిస్క్ కవరేజీని బీమా సంస్థలు ఉపసంహరించాయని ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐబీఏఐ) నిపుణుడు హరి రాధాకృష్ణన్ తెలిపారు. సాధారణంగా మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీల కింద యుద్ధం, సమ్మెలు, అల్లర్లు మొదలైనవాటికి సంబంధించిన కవరేజీ రద్దుకు మూడు రోజుల నుంచి ఏడు రోజుల వరకు నోటీసు పీరియడ్ ఉంటుందని పేర్కొన్నారు.ఒకసారి రద్దయితే, తాజాగా రిస్క్ కవరేజీ దొరక్కపోవచ్చని, ఒకవేళ లభించినా భరించలేనంత స్థాయిలో ప్రీమియంలు ఉంటాయని రాధాకృష్ణన్ చెప్పారు. మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలు 0.25 శాతం–0.50 శాతం నుంచి ఒక్క శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోందని తెలిపారు. దీనితో షిప్పింగ్ వ్యయాలు గణనీయంగా పెరుగుతాయని, అంతర్జాతీయంగా వాణిజ్య వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. విమానయాన సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే ఇజ్రాయెల్ తరహాలో ప్రభుత్వాల నుంచి రీఇన్సూరెన్స్పరమైన దన్ను అవసరమవుతుందని రాధాకృష్ణన్ తెలిపారు.యుద్ధంతో సవాళ్లు తీవ్ర స్థాయిలో పెరిగితే రిస్కు స్థాయిని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీలు సత్వరం ప్రీమియంలను మార్చే అవకాశం ఉందని ప్రూడెంట్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ హెడ్ (మెరైన్ స్పెషాలిటీస్) గౌరవ్ అగర్వాల్ చెప్పారు. కార్గో విలువపై ప్రీమియంను లెక్కిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో కార్గో రేటు మారకపోయినా, ప్రీమియం మాత్రం పెరగొచ్చని వివరించారు. అయితే, ఉద్రిక్తతలు భారీగా విస్తరిస్తే తప్ప బీమా ప్రీమియంలు విస్తృత స్థాయిలో పెరగకపోవచ్చని పేర్కొన్నారు. -
పల్లె మహిళల్లోనూ యూపీఐ పరిమళాలు
గ్రామీణ, చిన్న పట్టణాల్లోని మహిళలు సైతం నిత్యజీవితంలో భాగంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సాధనంతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు. గ్రోసరీ చెల్లింపులు, మొబైల్, యుటిలిటీ బిల్లు చెల్లింపులు, రీచార్జ్లను యూపీఐ ద్వారా కానిచ్చేస్తున్నారు. పెట్టుబడుల విషయంలోనూ వీరు ఆసక్తి చూపిస్తున్నట్టు ‘పే నియర్బై ఉమెన్ ఫైనాన్షియల్ ఇండెక్స్ 2026’ ఆరో ఎడిషన్ నివేదిక వెల్లడించింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో ఆర్థిక సేవలను అందించే 10,000 మంది మహిళా ఏజెంట్లను సర్వే చేసి ‘పే నియర్బై’ ఈ వివరాలు విడుదల చేసింది.గ్రామీణ, చిన్న పట్టణాల్లో 38 శాతం మహిళలు వారంలో కనీసం ఒకసారి యూపీఐని వినియోగిస్తున్నారు. ఆస్తుల అనుసంధాన ఉత్పత్తులు, పెట్టుబడుల పట్ల మహిళల్లో అవగాహన పెరుగుతోంది. కుటుంబంలో తామే ప్రాథమిక పొదుపుదారులమని 85 శాతం మహిళలు తెలిపారు. బంగారం ఆధారిత సాధనాల్లో పెట్టుబడుల పట్ల 44% మహిళలు ఆసక్తి చూపించారు. తమకు అందుబాటులోని సేవా పాయింట్ల ద్వారా చిన్న మొత్తంతో బంగారం సాధనాల్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కొత్త పొదుపు సాధనాల పట్ల వారిలో ఆసక్తికి ఇది నిదర్శనం.సులభంగా ఉపసంహరించుకునే ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లకు మహిళల్లో ఆదరణ కనిపించింది. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తామని 98 శాతం మంది మహిళలు తెలిపారు. కాకపోతే ఇటీవలి కాలంలో ఎక్కువగా ఆదరణ, అవగాహనకు నోచుకుంటున్న మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల విషయంలో మాత్రం మహిళల్లో ఆసక్తి ఆశించినంత లేదు. వీటి పట్ల గ్రామీణ, చిన్న పట్టణాల్లో 10 శాతం మంది మహిళల్లోనే అవగాహన ఉండడం గమనార్హం. ఒకవైపు డిజిటల్ చెల్లింపులూ క్రమంగా పెరుగుతుండగా.. మరోవైపు నగదు వినియోగం కూడా ప్రధానంగానే ఉంది. ఇంటి ఖర్చులతోపాటు, అవసరమైనప్పుడు వినియోగించేందుకు వీలుగా వారు నగదుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నగదు ఉపసంహరణకు బయోమెట్రిక్ గుర్తింపు లేదా ముఖ గుర్తింపును సౌకర్యంగా భావిస్తున్నారు. చాలా మంది మహిళల నగదు ఉపసంహరణ రూ.1,000–2,500 మధ్య ఉంటోంది.బీమా రక్షణ విషయమై అధిక శాతం మంది మహిళల్లో అవగాహన ఉంది. కానీ, తీసుకునే వారు 26 శాతంగానే ఉన్నారు. ఆరోగ్య, జీవిత, ప్రమాద బీమాకు ప్రాధాన్యం ఇస్తున్నారు.సొంతంగానే కానిచ్చేస్తున్నారు..‘‘మరింత మంది మహిళలు స్వతంత్రంగానే తమ బ్యాంక్ ఖాతాలను నిర్వహించుకుంటున్నారు. క్రమశిక్షణతో నెలవారీ పొదుపు చేసుకోవడం, బంగారం సాధనాలు, బీమా, సంఘటిత రంగంలో రుణాల పట్ల సుముఖత చూపిస్తున్నారు. ఆర్థిక సాధనాల పట్ల అవగాహన పెరిగే క్రమంలో విశ్వసనీయమైన సహాయక నమూనాలు వారధిగా పనిచేస్తాయి. మహిళలు ఒకరి మార్గదర్శనానికి బదులు సొంతంగానే ఆర్థిక అంశాల్లో భాగస్వాములయ్యేందుకు వీలు కల్పిస్తాయి’’అని పే నియర్బై ఎండీ, సీఈవో ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు.ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం -
రాంకీ ఇన్ఫ్రాకి రూ.1,402 కోట్ల కాంట్రాక్టు
మౌలిక రంగ దిగ్గజం రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తాజాగా మహారాష్ట్ర ఇండ్రస్టియల్ టౌన్షిప్ (ఎంఐటీఎల్) నుంచి భారీ కాంట్రాక్టు లభించింది. దీని విలువ రూ. 1,401.84 కోట్లని కంపెనీ తెలిపింది. దీని ప్రకారం ఢిల్లీ ముంబై ఇండ్రస్టియల్ కారిడార్కి సంబంధించి దిఘి పోర్ట్ ఇండ్రస్టియల్ ఏరియాలో తొలి దశ కింద రహదారులు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉంటుంది.930 రోజుల్లో పూర్తి చేయాలి. 4 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్, ప్రణాళికల అమలుకు సంబంధించి తమ సామర్థ్యాలకు ఈ భారీ కాంట్రాక్టు నిదర్శనమని రాంకీ ఇన్ఫ్రా సీఈవో సునీల్ నాయర్ తెలిపారు.ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం -
సెన్కో గోల్డ్ నుంచి షేప్ ఆఫ్ యూ ఏఐ అప్లికేషన్
కోల్కతా: ఆభరణాల ఎంపికలో కస్టమర్లకు మరింత సహాయకరంగా ఉండేలా షేప్ ఆఫ్ యూ పేరిట ఏఐ ఫీచర్, అప్లికేషన్ని ప్రవేశపెట్టినట్లు సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ వెల్లడించింది. ఇది తమ అన్ని షోరూమ్లతో పాటు సెన్కో యాప్లో కూడా అందుబాటులో ఉంటుందని సంస్థ డైరెక్టర్ జోయితా సేన్ తెలిపారు. కస్టమర్లు తమ ముఖాకృతికి తగ్గట్లుగా ఉంటూ, తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ఆభరణాలను ఎంపిక చేసుకునేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు మహిళా దినోత్సవం సందర్భంగా 10 గ్రా. పసిడి ఆభరణాలపై రూ. 3,000, అలాగే డైమండ్ ఆభరణాల మేకింగ్ చార్జీల్లో 75% వరకు, డైమండ్ విలువలో 15% వరకు, సిల్వర్ ఐటమ్ల మేకింగ్ చార్జీలపై 15% వరకు డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. అటు, ఆన్లైన్కి సంబంధించి మార్చి 8న (ఒక్కరోజు మాత్రమే) గోల్డ్, డైమండ్, ప్లాటినం జ్యుయలరీ మేకింగ్ చార్జీలపై 100 శాతం మినహాయింపు ఉంటుందని పేర్కొంది. -
అమెజాన్లో మరోమారు లేఆఫ్స్!
దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావం రోబోటిక్స్ యూనిట్లోని సుమారు 100 మంది ఉద్యోగులపై పడింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.2026 జనవరిలో కూడా అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 16,000 ఉద్యోగాలను తొలగించింది. ఏఐకి అప్డేట్ అవుతున్న నేపథ్యంలో భారీ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. కాగా ఇప్పుడు రెండు నెలలు కూడా గడవకముందే.. మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. 2022 నుంచి కంపెనీ దాదాపు 57వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది.గత సంవత్సరం చివరి నాటికి.. అమెజాన్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.58 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. ఎక్కువ మంది గిడ్డంగి & లాజిస్టిక్స్ విభాగాలలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఏఐ టెక్నాలజీ.. ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపింది. రానున్న రోజుల్లో కూడా ఏఐ కారణంగా మరింతమంది జాబ్స్ కోల్పొయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా. -
పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో భారీ నష్టాలు?
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క లీటర్ ఇంధన విక్రయంపై సుమారు రూ.20 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తోంది.ప్రభుత్వ రంగ దిగ్గజాలు అయిన ఐఓసీఎల్ (Indian Oil Corporation), హెచ్పీసీఎల్ (Hindustan Petroleum Corporation Limited), బీపీసీఎల్ (Bharat Petroleum Corporation Limited) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.మార్జిన్లపై ప్రతికూల ప్రభావంస్థూల మార్కెటింగ్ మార్జిన్ అంటే ఇంధనాల రిటైల్ విక్రయ ధర, వాటిని కొనుగోలు చేసి వినియోగదారులకు అందించే వరకు అయ్యే మొత్తం ఖర్చు మధ్య వ్యత్యాసం. ప్రస్తుతం ఈ మార్జిన్ ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, అదే సమయంలో రూపాయి బలహీనపడటం ఓఎంసీలపై ద్వంద్వ ప్రభావాన్ని చూపుతున్నాయి.రూపాయి పతనం, క్రూడ్ ధరల పెరుగుదలఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ సుమారు 2 శాతం తగ్గింది. మరోవైపు బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 33 శాతం పెరిగి 80 డాలర్లకు పైగా చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్లో హెచ్సీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ షేర్లు గణనీయంగా పడిపోయాయి.క్రూడ్ ధరల పెరుగుదలతో లాభాల క్షీణతచమురు మార్కెటింగ్ కంపెనీల లాభదాయకత సాధారణంగా అంతర్జాతీయ క్రూడ్ ధరలకు విలోమంగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 1 డాలర్ పెరిగితే, ఈ సంస్థల స్థూల మార్కెటింగ్ మార్జిన్ లీటరుకు సుమారు రూ.0.5 వరకు తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.క్రూడ్ ధరలు బ్యారెల్కు 80 డాలర్లకు మించి కొనసాగితే, మార్జిన్లు లీటరుకు సుమారు రూ.3.5 వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కంపెనీల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు ఈ వారం ప్రారంభంలోనే పెరిగాయి. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త వైమానిక దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.ఇరాన్ కీలక చమురు ఉత్పత్తి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం, అలాగే హార్మూజ్ జలసంధిలో నౌకల రవాణాను అడ్డుకుంటామని హెచ్చరించడం ప్రపంచ ఇంధన సరఫరాపై ఆందోళనలను పెంచింది.భారత దిగుమతులపై ప్రభావం?భారత్ రోజుకు సుమారు 2.5–2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశ మొత్తం చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటా కలిగి ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితులు కొనసాగితే దేశీయ చమురు మార్కెట్పై మరింత ఒత్తిడి పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
2,500 మందిని తొలగిస్తున్న ప్రముఖ బ్యాంకు
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం ఉద్యోగుల్లో సుమారు 3 శాతం మందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 2,500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. బ్యాంక్ ఇటీవలే తన చరిత్రలోనే అత్యంత బలమైన ఆర్థిక సంవత్సరాల్లో ఒకటిని నమోదు చేసింది. అయినప్పటికీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఉద్యోగ కోతలను చేపడుతున్నట్లు సమాచారం.రికార్డు స్థాయి ఆదాయం2025 సంవత్సరానికి మోర్గాన్ స్టాన్లీ 70.6 బిలియన్ డాలర్ల పూర్తి సంవత్సర ఆదాయాన్ని నమోదు చేసింది. పెట్టుబడి బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరగడంతో బ్యాంక్ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ముఖ్యంగా డీల్మేకింగ్ కార్యకలాపాలు పెరగడం వల్ల పెట్టుబడి బ్యాంకింగ్ ఆదాయం 47% పెరిగింది. ఇదే సమయంలో కంపెనీలకు రుణాలు సమకూర్చడం ద్వారా వచ్చే ఫీజులు కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి.లేఆఫ్ల ప్రభావం వీరిపైనే.. ఈ ఉద్యోగ కోతలు బ్యాంక్కు చెందిన మూడు ప్రధాన విభాగాల్లో ఉండనున్నాయి. అవి ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ (ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ట్రేడింగ్), వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. అయితే బ్యాంక్కు కీలకమైన ఫైనాన్షియల్ అడ్వైజర్లపై ఈ కోతలు ఉండవని సమాచారం.అమలు ఎప్పుడంటే.. వివిధ నివేదికల ప్రకారం, ఈ ఉద్యోగ కోతలు మార్చి ప్రారంభం నుంచే దశలవారీగా అమలు కావచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై బ్యాంక్ అధికారికంగా పూర్తి కాలక్రమాన్ని వెల్లడించలేదు.లాభాలున్నా ఉద్యోగ కోతలు ఎందుకు?బ్యాంక్ లాభాల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇది ఆర్థిక బలహీనత కారణంగా కాకుండా వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరుగుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పులు, గ్లోబల్ లొకేషన్ వ్యూహంలో సర్దుబాట్లు, వ్యక్తిగత పనితీరు సమీక్షలు వంటి అంశాలు కూడా దీనికి కారణమని తెలుస్తోంది.గత సంవత్సరం కూడా మోర్గాన్ స్టాన్లీ సుమారు 2,000 ఉద్యోగాలను తగ్గించింది. అప్పట్లో పనితీరు సమీక్షలు, కార్యకలాపాల్లో మార్పులు కారణమయ్యాయి. -
బైక్ డ్రైవర్ ఖాతాలో రూ.550 కోట్లు..
నెలకు పట్టుమని రూ.పది వేలు సంపాదించలేని ఒక సాధారణ డ్రైవర్.. వందల కోట్ల ఆర్థిక కుంభకోణానికి కారణమయ్యాడు. అహ్మదాబాద్కు చెందిన ప్రదీప్ ఓడే అనే వ్యక్తి బ్యాంకు ఖాతాల ద్వారా ఏకంగా రూ.550 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్, హవాలా మార్గాల ద్వారా ఈ భారీ నెట్వర్క్ నడిచినట్లు అధికారులు గుర్తించారు.రూ.25 వేల ఆశ జూపి..విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రదీప్ ఓడే, కిరణ్ పర్మార్ అనే వ్యక్తికి తన బ్యాంకు ఖాతాను రూ.25,000కు అద్దెకు ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా తాను సంతకం చేసిన ప్రతి చెక్కుకు అదనంగా రూ.400 కమిషన్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రదీప్ పత్రాలను ఉపయోగించి నిందితులు ‘ప్రదీప్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో ఒక డమ్మీ సంస్థను స్థాపించారు.ప్రదీప్ ఎంటర్ప్రైజెస్తో పాటు కమలేష్ ట్రేడింగ్, రౌనక్ ట్రేడర్స్ అనే మరో రెండు షెల్ కంపెనీలను 2024లో నమోదు చేశారు. ఈ సంస్థలకు వాస్తవంగా ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు లేవు. కానీ, వీటి బ్యాంకు ఖాతాల్లో మాత్రం రూ.550 కోట్ల లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేలింది. మూడు వేర్వేరు కంపెనీలకు వరుసగా రూ.80.50 కోట్లు, రూ. 52.11 కోట్లు, రూ.22.86 కోట్ల చొప్పున డబ్బు బదిలీ అయినట్లు ఈడీ తేల్చింది.క్రికెట్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ఈ భారీ మొత్తమంతా అక్రమ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం బెట్టింగ్ మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్లో ‘సర్క్యులర్ ట్రేడింగ్’(కృత్రిమంగా ట్రేడింగ్ వాల్యూమ్ పెంచడం) ద్వారా షేర్ల ధరలను తారుమారు చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. ‘సాధారణ పొదుపు ఖాతాగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక వ్యవస్థీకృత సిండికేట్కు సంబంధించిన హవాలా ఛానెల్గా పనిచేస్తోంది’ అని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ‘ఇంపాక్ట్ గురు’ వంటి ప్లాట్ఫారమ్ల ద్వారా అనుమానాస్పద విరాళాలు సేకరించి వాటిని మనీ లాండరింగ్కు వినియోగించినట్లు తెలుస్తుంది.ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరెవరికి చేరుతోంది? అనే అంశంపై ఈడీ ప్రస్తుతం మనీ ట్రయిల్(డబ్బు వెళ్లిన క్రమం)ను ట్రాక్ చేస్తోంది. త్వరలోనే మరిన్ని ఆస్తుల అటాచ్మెంట్, కీలక వ్యక్తుల అరెస్టులు ఉండొచ్చని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. సామాన్యుల బ్యాంకు ఖాతాలను అద్దెకు తీసుకుని వందల కోట్ల కుంభకోణాలకు పాల్పడే ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం -
ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం
సాంకేతిక మార్పులను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు ప్రకటనల రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకంలో భారత్ ప్రపంచ దేశాల కంటే వేగంగా దూసుకుపోతోందని ప్రముఖ గ్లోబల్ యాడ్టెక్ సంస్థ తబూలా (Taboola) వ్యవస్థాపకుడు, సీఈఓ ఆడమ్ సింగోల్డా స్పష్టం చేశారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ప్రకటనకర్తలు, పబ్లిషర్లు కొత్త ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడటం లేదన్నారు. వైఫల్యాలు ఎదుర్కోవడానికైనా సిద్ధపడుతూ ఏఐ స్వీకరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. సింగోల్డా తన 15 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ చూడనంత గణాంకాలను భారత్లో చూస్తున్నట్లు వెల్లడించారు. ‘కంపెనీ ప్రవేశపెట్టిన డీపర్ డైవ్ ప్రొడక్ట్ ద్వారా వినియోగదారులు పబ్లిషర్ సైట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీని ‘క్లిక్-త్రూ రేట్’ డబుల్ డిజిట్లో ఉంది. ఏఐ ఆధారిత ఈ యాడ్ ప్లాట్ఫామ్ కోసం ఏటా రూ.80 లక్షలకు పైగా ఖర్చు చేసే ప్రకటనకర్తల సంఖ్య గతేడాది భారీగా పెరిగింది’ అని అన్నారు.డిజిటల్ డిమాండ్ప్రముఖ అడ్వర్టైజింగ్ సంస్థ మెడిసన్ వరల్డ్ తన తాజా వ్యయ నివేదికలో 2026 నాటికి భారతీయ మార్కెట్ పూర్తిగా డిజిటల్ డిమాండ్తో నడుస్తుందని విశ్లేషించింది. ఏఐ టూల్స్ వాడటం వల్ల క్యాంపెయిన్ మేనేజ్మెంట్లో వారానికి సగటున 5.2 గంటలు (ఏడాదికి దాదాపు 30 పనిదినాలు) ఆదా అవుతున్నట్లు పేర్కొంది. ఏఐ ద్వారా విజువల్స్, కంటెంట్ రూపొందించడం సులభతరం కావడంతో చిన్న సంస్థలు కూడా పెద్ద కార్పొరేట్ కంపెనీల స్థాయిలో నాణ్యమైన ప్రకటనలు ఇవ్వగలుగుతున్నాయని తెలిపింది.2027 నాటికి ఏజెన్సీల విభజనభవిష్యత్తులో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు రెండు విభాగాలుగా విడిపోయే అవకాశం ఉందని మెడిసన్ వరల్డ్ అంచనా వేసింది. అందులో సిస్టమ్స్ ఏజెన్సీలు సొంతంగా ఏఐ ఫ్రేమ్వర్క్లు, మేధో సంపత్తిని కలిగి ఉండి ఫలితాల ఆధారంగా పని చేస్తాయి. సర్వీస్ ఏజెన్సీలు కేవలం ప్లాట్ఫామ్ టూల్స్ను ఉపయోగించి క్లయింట్లకు సేవలను అందిస్తాయని చెప్పింది.వినియోగదారుల అలవాట్లుభారత్లో వినియోగదారులు కూడా టెక్నాలజీని వేగంగా స్వీకరిస్తున్నారు. గణాంకాల ప్రకారం, 65 శాతం మంది భారతీయులు రోజూ ఏదో ఒక రూపంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఈ-కామర్స్ మార్కెట్గా ఉన్న భారత్ ఏఐ అడ్వర్టైజింగ్కు అడ్డాగా మారబోతోందని సింగోల్డా ధీమా వ్యక్తం చేశారు. అయితే త్వరలోనే ఏఐని ప్రాథమిక దశలో కాకుండా పూర్తిస్థాయిలో వినియోగించే సంస్థలకు, వెనుకబడిన సంస్థలకు మధ్య వ్యత్యాసం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: ఆర్థిక నిర్ణయాల్లో మహిళా గళం -
దుబాయ్ దాటని బంగారం..
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్గా పేరుగాంచిన దుబాయ్ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్, లండన్ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.దుబాయ్కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ట్రేడింగ్ హబ్ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్రైటింగ్ చేస్తాయి.ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్లైన్గా పేరొందిన ఎమిరేట్స్ బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్ ఎయిర్వేస్ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్, న్యూయార్క్ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్ ఛేస్ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి. -
టాటా కారుకు ఫుల్ డిమాండ్.. 10వేల డెలివరీలు!
టాటా మోటార్స్ తన సియెర్రా కారును లాంచ్ చేసినప్పటి నుంచి 10000 కార్లను డెలివరీ చేసింది. 2025 డిసెంబర్ 16న దీనికోసం బుకింగ్స్ మొదలయ్యాయి. డెలివరీలు 2026 జనవరి 15 నుంచి ప్రారంభమయ్యాయి. మార్కెట్లో లాంచ్ అయిన టాటా సియెర్రా ప్రారంభ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లు, మూడు పవర్ ట్రెయిన్ ఆప్షన్లు, ఆరు కలర్ స్కీంలలో లభిస్తుంది.సియెర్రా క్యాబిన్ కర్వ్వి మాదిరిగానే ఉంటున్నప్పటికీ టాటా డిజైన్ లాంగ్వేజ్కు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, సౌండ్ బార్తో 12 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, హెచ్యూడీ, సెంటర్ కన్సోల్ వంటి వాటిలో కొత్తదనాన్ని జోడిస్తుంది.డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవల్ 2 ADAS, 360-డిగ్రీల కెమెరా, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఐకానిక్ ఆల్పైన్ పైకప్పును ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పు చేశారు. సన్ రూఫ్ కాస్త విశాలంగా ఇచ్చారు. టాటా సియెర్రా కారులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్లు ఉన్నాయి. -
ఏఐతో విద్య.. ప్రీమియా అకాడమీ కొత్త ఆలోచన!
అన్నిరంగాల్లో నేనున్నానంటున్న ఏఐ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ప్రధాన శక్తిగా మారింది. ట్యూటరింగ్ సిస్టమ్స్, ఆడాప్టివ్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్, తక్షణ ఫీడ్బ్యాక్ వ్యవస్థలు, విభిన్న విజువలైజేషన్ సాంకేతికతల ద్వారా కృత్రిమ మేధస్సు విద్యార్ధుల కోసం జ్ఞానాన్ని పంచుకునే, అర్థం చేసుకునే, అన్వయించే విధానాలను పునఃరూపకల్పన చేస్తోంది. వీటన్నింటిని గమనించి ప్రీమియా అకాడమీ తన విద్యా వ్యవస్థలో కృత్రిమ మేధను ప్రవేశపెట్టడానికి సంకల్పించింది.ప్రతి విద్యార్థికి నేర్చుకునే వేగం, జిజ్ఞాస, అర్థం చేసుకునే శైలి వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. సాధారణ తరగతులు లేదా పద్ధతులు ఈ సమస్యను పరిష్కరించలేవు. దీనిని ఏఐ తప్పకుండా భర్తీ చేయగలదు. అంటే దీని అర్థం.. ఉపాధ్యాయుల స్థానంలో ఏఐను తీసుకురావడం కాదు. వారి సామర్థ్యాలను పెంచడం.కొత్త విధానాల ద్వారా.. ఉపాధ్యాయులు బాధ్యతలు కొన్ని తగ్గుతాయి. అదే సమయంలో మరింతమంది విద్యార్థులకు మెంటార్గా ఉంటారు. ఇది విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ద వహించడానికి ఉపయోగపడుతుంది. కాగా విద్యార్థులు వారి స్వంత వేగానికి తగిన పాఠాలను నేర్చుకోగలుగుతారు. తరగతులు మరింత ఇంటరాక్టివ్ అవుతాయి. ఇది ఒక సమర్థవంతమైన, ప్రేరణ కలిగించే విద్యా అనుభవాన్ని తెస్తుంది. -
ఎక్స్లో అశ్లీల కంటెంట్ నిషేధం?
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో అశ్లీల కంటెంట్ లేదా అడల్ట్ కంటెంట్ మీద భారత ప్రభుత్వం పరిమితులు విధించినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ యూజర్లు సైతం స్పందిస్తున్నారు.భారత ప్రభుత్వం సాధారణంగా అడల్ట్ కంటెంట్ నిషేధంపై చాలా సీరియస్గా ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇలాంటి కంటెంట్ అందించే చాలా ప్లాట్ఫామ్ల మీద కఠిన చర్యలు తీసుకుంది. అయితే ఇప్పుడు ఎక్స్కు కూడా పరిమితులు విదించిందా? అనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.భారతదేశంలో ఎక్స్లో 18+ కంటెంట్ నిషేధంపై మస్క్ కూడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా యూజర్లు దీనికి సంబంధించిన పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఆ పోస్టుల ప్రకారం.. అడల్ట్ కంటెంట్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.Elon Musk banned 18+ videos in india.Respect @elonmusk 🫡 pic.twitter.com/QXmRa043nx— Let's X OTT GLOBAL (@LetsXOtt) March 3, 2026Elon Musk banned 18+ content?— Tammubaby (@tammubaby) March 3, 2026How can elon musk ban the porn, damn all my bookmarks are now not showing the content 😭😭— Just Chocolate™ (@LovelyFantasyyy) March 3, 2026 -
ఇంటర్ చదివి.. రూ.300 కోట్ల బిజినెస్!
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. దిగ్గజ పారిశ్రామికవేత్తల ముందు నిలబడి నా కంపెనీ విలువ రూ.300 కోట్లు అని చెప్పడం ఒక సాధారణ యువకుడికి పెద్ద సాహసమే!. డిగ్రీలు పూర్తిచేసి 30 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేస్తూ.. బరువు బాధ్యతలు మోసేవాళ్లే సమాజంలో ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఎలాంటి డిగ్రీ లేకుండానే.. వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యం స్థాపించండం అంటే మాటలా?, అయినా అలాంటిదే నిజం చేసి చూపించారు 'శుభం గుప్తా'. ఇంతకీ ఈయనెవరు, ఈయన స్టార్ట్ చేసిన బిజినెస్ ఏది? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.2011లో ముంబైలో ఏళ్ల యువకుడిగా 12వ తరగతి పూర్తి చేసిన శుభం గుప్తా.. అందరిలా డిగ్రీ చేయాలని అనుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన కుటుంబం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తండ్రి బట్టల వ్యాపారం దివాళా తీసింది. కష్టాలను ఎదుర్కోవడానికి.. జీవితంలో ఎదగడానికి కంకణం కట్టుకున్న శుభం, చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ.. బిజినెస్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు.యువతలో స్టైలిష్, కూల్ టీ-షర్టులపై పెరుగుతున్న ఆసక్తిని గమనించిన శుభం గుప్తా.. కొంత డబ్బుతో అక్కడ స్థానికంగా ఉన్న మార్కెట్లలో టీ-షర్ట్స్ కొనుగోలు చేసి, విక్రయించడం మొదలుపెట్టారు. ఈ వ్యాపారం గురించి బాగా తెలుసుకోవడానికి.. నేరుగా కస్టమర్లతో మాట్లాడి వారి అభిరుచులను అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత ఆన్లైన్ ఆర్డర్లను పంపించడం మొదలుపెట్టాడు.ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!2014లో శుభం గుప్తా చేస్తున్న వ్యాపారానికి 'బాంకర్స్ కార్నర్' (Bonkers Corner) అనే పేరు పెట్టాడు. దీనిద్వారా యువత అభిరుచికి తగిన బ్రాండెడ్ స్ట్రీట్ స్టైల్ దేశీ టచ్తో దుస్తులు విక్రయించాడు. పెద్ద మార్కెటింగ్, పెద్ద బడ్జెట్ లేకపోయినా.. కొత్త కొత్త డిజైన్స్ పరిచయం చేసి బ్రాండ్ అంచెలంచెలుగా ఎదిగింది. కాగా ఈయన కంపెనీ విలువ ప్రస్తుతం రూ.300 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. -
ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు!
2026లోనూ దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించిన సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ స్టార్టప్.. తన ఉద్యోగులలో 40 శాతం మందిని ఒకే రోజులో తొలగించింది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.బెంగళూరులో ఒక ఐటీ స్టార్టప్లో పనిచేస్తున్న నా స్నేహితుల్లో ఒకరు.. ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయారు. అతనితో పాటు కంపెనీ ఒకేరోజు 40 శాతం మందిని తొలగించినట్లు సీఏ అర్పిత్ గోయల్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ వెల్లడించారు.నా స్నేహితుడు పనిచేసే ఐటీ స్టార్టప్లో ఏడాదికి రూ. 92 లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కంపెనీలు ఖర్చును తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులను తొలగించేస్తున్నారని అర్పిత్ గోయల్ పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇది ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితిని స్పష్టం చేస్తోందని పేర్కొంటున్నారు.ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కలిగి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగం ఊడిపోతుందో తెలియదు. కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండాలని ఒకరు పేర్కొన్నారు. రూ. 92 లక్షల జీతం అంటే.. ఒక ఐదేళ్లు జీతం తీసుకున్న వ్యక్తిని కంపెనీ తొలగించినప్పటికీ.. అది అతన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం లేదని మరొకరు అన్నారు. రూ. 92 లక్షల జీతం, జీరో సేఫ్టీ అని ఇంకొకరు అన్నారు.One of my friend working in IT startup at bangalore, Recently his company did a 40% layoff in literally a single day and this is a real story.And he is having a CTC of 92 lakhs.The job loss is real.— CA Arpit Goyal (@Arpit1223) February 24, 2026 -
బంగారం ఎన్బీఎఫ్సీలకు పండగే!
బంగారంపై రుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) లాభదాయకత మధ్యకాలానికి బలంగా ఉంటుందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం రుణాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ గణనీయంగా పెరగడం తెలిసిందే. ఈ విభాగంలో బ్యాంకులు, తోటి ఎన్బీఎఫ్సీల నుంచి పోటీ నెలకొన్నప్పటికీ.. డిమాండ్కు తోడు నిర్వహణ సామర్థ్యం, రుణాలపై నష్టాలు తగ్గడం లాభదాయకత మెరుగుపడేందుకు అనుకూలించనున్నట్టు తన నివేదికలో పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) గోల్డ్ ఎన్బీఎఫ్సీల రిటర్న్ ఆన్ మేనేజ్డ్ అసెట్స్ (నిర్వహణ ఆస్తులపై రాబడి/ఆర్వోఎంఏ) 4.25–4.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.రుణాలపై నష్టాలు చాలా తక్కువగా ఉంటుండడం, ఈ రుణాలవైపు కస్టమర్లు మొగ్గు చూపిస్తుండడంతో ఈ వ్యాపారం ఆకర్షణీయంగా మారిందని.. దీంతో బ్యాంక్లు, డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ పెరిగినట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం మధ్య గోల్డ్ ఎన్బీఎఫ్సీల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 40 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది. పెద్దసైజు బంగారం రుణ ఎన్బీఎఫ్సీల్లో ఒక్కో శాఖ ఏయూఎం రూ.21 కోట్ల వరకు పెరిగిందని.. మధ్య స్థాయి ఎన్బీఎఫ్సీల్లో ఈ పెరుగుదల రూ.11.5 కోట్లకు చేరినట్టు క్రిసిల్ తెలిపింది. బంగారం ధరలు పెరగడం అధిక రుణ వృద్ధికి దారితీసినట్టు పేర్కొంది. వృద్ధికి అనుకూలతలు..అన్సెక్యూర్డ్ నుంచి సెక్యూర్డ్ అయిన బంగారం రుణాల వైపు డిమాండ్ మళ్లడం, బంగారంపై అధిక రుణానికి (లోన్ టు వ్యాల్యూ) ఆర్బీఐ అనుమతించడం, శాఖల విస్తరణలో వెసులుబాటు వృద్ధికి అనుకూలించనున్నట్టు క్రిసిల్ తెలిపింది. ‘‘బంగారం రుణాల్లో పెద్ద ఎన్బీఎఫ్సీలకు నిర్వహణ వెసులుబాటు ఉంటుంది. బలమైన ఫ్రాంచైజీ నెట్వర్క్, ఒక్కో శాఖ నుంచి అధిక వ్యాపారం, టెక్నాలజీపై పెట్టుబడులతో స్థిర వ్యయాలను మరింత సమర్థవంతంగా అవి ఎదుర్కోగలవు’’అని క్రిసిల్ వివరించింది. ఇక పెరుగుతున్న డిమాండ్ను సొంతం చేసుకునేందుకు శాఖల విస్తరణపై దృష్టి పెట్టిన మధ్యస్థాయి గోల్డ్ ఎన్బీఎఫ్సీలు సమీప కాలంలో నిర్వహణ వ్యయాల పెరుగుదలను చూస్తాయని తెలిపింది. శాఖల సంఖ్య పెరిగి, ఉత్పాదకత మెరుగుపడితే, అప్పుడు వాటికి సైతం నిర్వహణ అనుకూలతలు కలిసొస్తాయని అంచనా వేసింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు -
EPF వడ్డీ యథాతథం.. ఖాతాల్లోకి జమ ఎప్పుడంటే?
ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతుందా.. అని ఎదురు చూసేవారికి నిరాశ ఎదురైంది. ఎందుకంటే.. 2025-26 సంవత్సరానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగానే నిర్ణయించారు. అంటే వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదన్నమాట.ఈపీఎఫ్ఓ తన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి EPF డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది. సీబీటీ నిర్ణయం తర్వాత.. 2025-26 సంవత్సరానికి EPF డిపాజిట్లపై వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపుతారు. ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత, 2025-26 సంవత్సరానికి వడ్డీ రేటు ఏడు కోట్ల చందాదారుల ఖాతాల్లోకి జమ అవుతుంది.నిజానికి 2024లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), చందాదారులకు 2015-16లో వడ్డీ రేటు 8.8 శాతం వడ్డీని అందించింది. ఆ తరువాత వడ్డీ రేటును తగ్గించి 2016-17లో 8.65 శాతం & 2017-18లో 8.55 శాతం అందించింది. 2020-21లో 8.5 శాతం వద్ద ఉన్న వడ్డీ రేటును 2021-22 సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించారు. 2022-23లో 8.15 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2023-24కి స్వల్పంగా 8.25 శాతానికి పెంచింది. ఇప్పుడు కూడా అదే వడ్డీ రేటు కొనసాగుతోంది.ఇదీ చదవండి: రూ.3 లక్షలు దాటేసిన వెండి: కారణాలు ఇవే! -
హైదరాబాద్లో మరో గోల్డ్ పాయింట్ సెంటర్
బంగారం, వెండి వ్యాపార రంగంలో ఒకటైన ముత్తూట్ పప్పచన్ గ్రూప్ అనుబంధ సంస్థ.. ముత్తూట్ ఎగ్జిమ్ (ప్రై) లిమిటెడ్ హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో తన కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా సంస్థకు 95వ శాఖ కాగా, హైదరాబాద్లో 6వది, తెలంగాణలో 9వ కేంద్రం ద్వారా సేవలు అందిస్తోంది.ఈ కొత్త గోల్డ్ పాయింట్ కేంద్రం ద్వారా హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల వినియోగదారులకు పారదర్శక, శాస్త్రీయ, బాధ్యతాయుత బంగారం రీసైక్లింగ్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులు తమ పాత, ఉపయోగించిన బంగారు ఆభరణాలను సురక్షితంగా విక్రయించవచ్చు. మొత్తం మూల్యాంకన ప్రక్రియను కస్టమర్లు ప్రత్యక్షంగా వీక్షించే విధంగా పారదర్శక విధానాన్ని సంస్థ అమలు చేస్తోంది. రూ.10,000 వరకు విలువైన బంగారానికి తక్షణ నగదు చెల్లింపు లభిస్తుంది. అంతకుమించిన మొత్తాలు IMPS, NEFT లేదా RTGS ద్వారా సురక్షితంగా నగదు బదిలీ చేస్తారు. -
విక్రేతలకు అమెజాన్ బంపర్ ఆఫర్!
దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు అమెజాన్ ఇండియా భారీ మార్పులు చేస్తోంది. చిన్న వ్యాపారులు, స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.1,000 లోపు ధర కలిగిన ఉత్పత్తులపై అమ్మకందారుల నుంచి వసూలు చేసే రిఫరల్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 16 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది.ఏమిటీ రిఫరల్ ఫీజు?అమెజాన్ ప్లాట్ఫారమ్లో వస్తువులను విక్రయించినందుకు గానూ ప్రతి అమ్మకంపై సెల్లర్ నుంచి కంపెనీ కొంత శాతం కమీషన్ను వసూలు చేస్తుంది. దీనినే రిఫరల్ ఫీజు అంటారు. సాధారణంగా ఇది ఉత్పత్తి కేటగిరీని బట్టి 2% నుంచి 16.5% వరకు ఉంటుంది. తాజా నిర్ణయంతో దాదాపు 1,800 కేటగిరీల్లో రూ.300 నుంచి రూ.1,000 మధ్య ధర ఉన్న ఉత్పత్తులకు ఈ కమీషన్ భారం ఉండదు.కీలక మార్పులు ఇవే..గతంలో (ఏప్రిల్ 2025) కేవలం రూ.300 లోపు వస్తువులకే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు రూ.1,000 వరకు విస్తరించారు. దీనివల్ల లబ్ధి పొందే ఉత్పత్తుల సంఖ్య 1.2 కోట్ల నుంచి ఏకంగా 12.5 కోట్లకు పెరగనుంది. దాంతోపాటు రూ.300 కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల విక్రేతలకు షిప్పింగ్ ఫీజులో 20% రాయితీ ప్రకటించింది. అమ్మకందారులు తమ వద్దే స్టాక్ ఉంచుకుని కేవలం డెలివరీ బాధ్యతను అమెజాన్కు అప్పగించే ‘ఈజీ షిప్’ పద్ధతిలో కూడా ఈ 20% ఫీజు తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది.‘ఈ నిర్ణయం వల్ల విక్రేతలకు అమ్మకం ఖర్చులో దాదాపు 70% వరకు ఆదా అవుతుంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని చిన్న వ్యాపారవేత్తలకు అమెజాన్ ప్లాట్ఫారమ్ మరింత లాభదాయకంగా మారుతుంది’ అని అమిత్ నందా, డైరెక్టర్, అమెజాన్ ఇండియా సెల్లింగ్ పార్ట్నర్ సర్వీసెస్ అన్నారు.తీవ్రమవుతున్న ఈ-కామర్స్ పోటీ..మీషో 2022లోనే జీరో కమీషన్ మోడల్ను ప్రవేశపెట్టి చిన్న వ్యాపారులను భారీగా ఆకర్షించింది. ఫ్లిప్ కార్ట్ గతేడాది నవంబర్లో రూ.1,000 లోపు ఉత్పత్తులపై కమీషన్ రద్దు చేయడమే కాకుండా, తన ‘షాప్సీ’ ప్లాట్ఫారమ్లో పూర్తిగా జీరో కమీషన్ అమలు చేస్తోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని విక్రేతలను తమ ప్లాట్ఫారమ్లోకి తీసుకురావడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం. అమ్మకందారులపై భారం తగ్గడం వల్ల వినియోగదారులకు కూడా తక్కువ ధరకే వస్తువులు అందే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు! -
ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందా?: PIB హెచ్చరిక
ఇటీవల కాలం తప్పుడు వార్తల ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇవన్నీ నిజమేనేమో అని నమ్మి, చాలామంది భయపడుతుంటారు. ఇలాంటి మరోవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.SBI పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మెసేజ్, వినియోగదారులు తమ ఆధార్ను అప్డేట్ చేయడానికి APK ఫైల్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలని పేర్కొంది. ఆధార్ను అప్డేట్ చేయకపోతే, SBI YONO యాప్ బ్లాక్ చేయబడుతుందని కూడా ఇది పేర్కొంది.మీరు మీ ఆధార్ను అప్డేట్ చేయకపోతే మీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) YONO యాప్ బ్లాక్ అవుతుందనే వార్త తప్పు అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. యోనో యూజర్లు ఎలాంటి ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దు. అంతే కాకుండా మీరు వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ & ఆధార్ వివరాలను షేర్ చేసుకోవద్దు అని వెల్లడించింది.Is it true that your SBI YONO app will be blocked if you don’t update your Aadhaar❓A message circulating on social media in the name of SBI claims that users must download and install an APK file to update their Aadhaar. It further claims that if Aadhaar is not updated, the… pic.twitter.com/t3DK62h7PJ— PIB Fact Check (@PIBFactCheck) March 1, 2026 -
నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్లో వేలమందికి ఉద్యోగం!
సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.మొదటి జీతందిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణికులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందారు. ఇదే అతని మొదటి జీతం.ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించారు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. తాను చేసిన పనికి యజమాని తన జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచారు.రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయంకున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసారు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నారు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.1700 మందికి ఉపాధి1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు! -
అదానీ గ్రీన్ ఎనర్జీకి నార్జెస్ బ్యాంక్ గుడ్బై!
తమ పోర్ట్ఫోలియో నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ(ఏజీఈఎల్)ను తప్పించనున్నట్లు నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ నార్జెస్ బ్యాంక్ పేర్కొంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో షేర్లను విక్రయించనున్నట్లు తెలియజేసింది. ఇలాంటి ఆరోపణలతోనే 2024 మే నెలలోనూ సంస్థ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లను వదిలించుకుంది.నార్జెస్ బ్యాంక్ 2020 జూలైలో తొలిసారి ఏజీఈఎల్ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 341 ధరలో వీటిని సొంతం చేసుకోగా.. ప్రస్తుతం షేరు రూ. 944 వద్ద కదులుతోంది. కాగా.. గతంలోనూ నార్వేజియన్ వెల్త్ ఫండ్ వివిధ కారణాలతో దేశీ బ్లూచిప్స్ ఐటీసీ, ఎల్అండ్టీ, ఎన్హెచ్పీసీ, ఎన్టీపీసీ, వేదాంతాలను పోర్ట్ఫోలియో నుంచి తప్పించింది.మార్కెట్ గణాంకాల ప్రకారం 2025 ప్రారంభంనుంచి నార్జెస్ బ్యాంక్ 4.39 కోట్ల డాలర్ల విలువైన ఏజీఈఎల్ షేర్లను విక్రయించగా.. దేశీ మ్యూచువల్ ఫండ్స్ 50 కోట్ల డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయి. -
ఇరాన్పై యుద్ధం.. కియోసాకి సంచలన ట్వీట్
బంగారం, వెండి, స్టాక్ మార్కెట్లు, బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పరిణామాలు, పెట్టుబడులపై ఎప్పటికప్పుడు తర అభిప్రాయాలను, సమాచారాన్ని పంచుకునే ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా విభిన్న అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు.. దానికి ఇరాన్ ప్రతిదాడులతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం (#IranWar)నెలకొన్న నేపథ్యంలో ఆయన చేసిన సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా చర్చకు దారితీశాయి.కియోసాకి తన ట్వీట్లో తాను హనోయి (వియత్నాం రాజధాని)లో దిగిన సమయానికే ఇరాన్పై యుద్ధం ప్రారంభమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు మత, ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ రక్షణ, చమురు ప్రయోజనాల అంశాలు కూడా యుద్ధాల వెనుక ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే గతంలో జరిగిన వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, ఆ సంఘర్షణలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. తాను ఆ యుద్ధంలో సహచరులను కోల్పోయానని భావోద్వేగంగా పేర్కొన్నారు. ప్రపంచం ఎప్పుడు శాంతి వైపు అడుగులు వేస్తుందో అంటూ నిట్టూర్చారు.ఇదే ట్వీట్లో అమెరికా రాజకీయాలపై కూడా కియోసాకి స్పందించారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ హయాంలో మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అని ప్రశ్నించారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలని పిలుపునిచ్చారు.తర్వాత చేసిన మరో ట్వీట్లో మిన్నెసోటా రాష్ట్ర రాజకీయాలపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఓమర్, గవర్నర్ టిమ్ వాల్జ్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. సైకాలజిస్ట్, రచయిత జోర్డన్ పీటర్సన్ మాటలను ఉదహరిస్తూ, “బలహీన నాయకత్వం మరింత నష్టం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) “దృఢ నాయకుడు”గా అభివర్ణించారు.WAR!!!! Whst is it good for?Ironically I was landing in Hanoi when the war against Iran started .If truth be told we all know the war against Iran is a war financed by American Jews and Christians against Muslims for oil and to protect Israel.Vietnam was a war of Christians…— Robert Kiyosaki (@theRealKiyosaki) February 28, 2026 -
విశాల్ మెగా మార్ట్లో వాటా విక్రయం
సూపర్ మార్కెట్ చైన్ కంపెనీ విశాల్ మెగా మార్ట్లో సమయత్ సర్వీసెస్ తాజాగా 14 శాతం వాటా విక్రయించింది. పీఈ దిగ్గజం కేదార క్యాపిటల్, స్విట్జర్లాండ్ కంపెనీ పార్ట్నర్స్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఎస్పీవీ ఇది. షేరుకి రూ. 117 సగటు ధరలో 13.96 శాతం వాటాకు సమానమైన 65.25 కోట్ల షేర్లను అమ్మివేసింది.వీటి విలువ దాదాపు రూ. 7,636 కోట్లుకాగా.. విశాల్లో సమయత్ వాటా 54.09 శాతం నుంచి 40.13 శాతానికి దిగివచి్చంది. ఈ నేపథ్యంలో విశాల్ మెగా మార్ట్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 118 వద్ద ముగిసింది. -
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు ట్రూజాన్ సోలార్ పేరిట సౌర విద్యుదుత్పత్తుల సేవలందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు సీహెచ్ భవానీ సురేష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 300–350 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి రెట్టింపు స్థాయిలో రూ. 600–650 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో 10,000కు పైగా రూఫ్టాప్ ఇన్స్టాలేషన్స్ చేసినట్లు ఆయన చెప్పారు.ప్రస్తుతం 600 మంది పైగా సిబ్బందితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు 5 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని సురేష్ తెలిపారు. వచ్చే నాలుగైదు నెలల్లో తమిళనాడు, ఉత్తర్ప్రదేశ్ తదితర 4 రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్లు ఇన్వెస్ట్ చేశామన్నారు. -
టీసీఎస్ కోడ్విటా ఛాంపియన్ 2026 విజేతలు
ఐటీ సేవలు, కన్సల్టింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ వంటి వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గ్లోబల్ కోడింగ్ పోటీ టీసీఎస్ కోడ్విటా (TCS CodeVita) విజేతలను ప్రకటించింది. ఇందులో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన 21 ఏళ్ల జౌ జింకై మొదటి స్థానంలో నిలిచారు.ఈ సంవత్సరం జరిగిన గ్లోబల్ కోడింగ్ పోటీకి 1,46,922 మంది పాల్గొన్నారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీగా కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ను టీసీఎస్ సొంతం చేసుకుంది.విజేతలుబెస్ట్ ఉమెన్ కోడర్స్➤తేజస్విని సింగ్ (లక్నో)➤కీర్తి కె.పి. (చెన్నై)➤మహాక్ లచ్వానీ (భోపాల్)బెస్ట్ ఏఐ కోడర్స్➤జౌ జింకై (చైనా)➤బెంజమిన్ ఒరెల్లానా (అమెరికా)➤జార్జ్ వాల్డివియా (పెరూ)బెస్ట్ ఎమర్జింగ్ కోడర్స్➤బాలశివ ఎస్ (చెన్నై)➤జోస్ నూనెజ్ (ఈక్వెడార్)➤గాబ్రియెల్లా పాడిల్లా (ఈక్వెడార్) -
యస్ బ్యాంక్ ఫారెక్స్ కార్డులతో రూ.2.5 కోట్ల ఫ్రాడ్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తమ మల్టీ–కరెన్సీ ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డుల ద్వారా 2,80,000 డాలర్ల (సుమారు రూ. 2.5 కోట్లు) అనధికారిక లావాదేవీలను గుర్తించినట్లు వెల్లడించింది. బుక్మైఫారెక్స్ భాగస్వామ్యంతో జారీ చేసిన 5,000 మంది కస్టమర్లకు చెందిన కార్డుల ద్వారా ఫిబ్రవరి 24 తెల్లవారు ఝామున ఓ లాటిన్ అమెరికా దేశంలో మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది.అసాధారణ స్థాయిలో లావాదేవీలు తిరస్కరణకు గురవుతుండటంతో సిస్టం దీన్ని గుర్తించినట్లు పేర్కొంది. సదరు కస్టమర్లు నష్టపోకుండా ఆ మొత్తాన్ని వెనక్కి రప్పించేలా కార్డ్ నెట్వర్క్తో కలిసి పని చేస్తున్నట్లు వివరించింది. పటిష్టమైన నియంత్రణ విధానాల కారణంగా 688 అనధికారిక ప్రయత్నాలను సిస్టం అడ్డుకుందని, దీంతో 1,00,000 డాలర్ల నష్టాన్ని నివారించిందని యస్ బ్యాంక్ తెలిపింది. -
ఘనంగా జాతీయ ఆరోగ్య మేళా 2026 ప్రారంభం
ఆయుర్వేద వైద్య విధానాల ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య మేళా 2026ను దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం అధికారికంగా ప్రారంభించారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా షెగావ్ పట్టణం విశావా గ్రౌండ్, భక్తినివాస్ కాంప్లెక్స్లో ఈ మేళా ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు కొనసాగనుంది.కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, అఖిల్ భారతీయ ఆయుర్వేద మహాసమ్మేళన సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేళాకు ప్రఖ్యాత ఆయుర్వేద సంస్థలు బైద్యనాథ్, సిద్ధాయి ప్రధాన ప్రాయోజకులు (స్పాన్సర్షిప్)గా వ్యవహరించాయి. తమ స్టాళ్లలో విస్తృత శ్రేణి ఆయుర్వేద ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు, ఆయుర్వేదంపై అవగాహన కల్పించే పుస్తకాలను రాయితీ ధరలకు అందుబాటులో ఉంచాయి.ఈ మేళా ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయడంలో కీలకంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్రావు జాధవ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. -
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్
అమెరికాలోని దక్షిణాసియా కమ్యునిటీకి ఎఫ్ఎంసీజీ విభాగంలో సర్వీసులందిస్తున్న హెచ్ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ తమ ఫ్లాగ్షిప్ బ్రాండ్ ‘లక్ష్మి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రాబ్ మోర్, విన్ మోర్’ దీపావళి ఆఫర్ విజేతను ప్రకటించింది. ఈ ఆఫర్ను గతేడాది దీపావళికి ప్రవేశపెట్టారు. తాజాగా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు ఉదయకుమార్ బాలతాండాయుధం విజేతగా నిలిచారు. ఇందులో భాగంగా లెక్సస్ ఆర్ఎక్స్ 350 కారు(సుమారు రూ.80 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. యూఎస్లోని బ్రిడ్జ్వాటర్ ప్రాంతంలో ఉన్న లెక్సస్ షోరూమ్లో జరిగిన కార్యక్రమంలో ‘లక్ష్మి’ బ్రాండ్ ప్రతినిధుల సమక్షంలో ఉదయకుమార్ కుటుంబానికి కారు తాళాలను అందజేశారు.ఈ సందర్భంగా హెచ్ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ సీఈఓ నీల్ సోనీ మాట్లాడుతూ.. ‘చాలా కుటుంబాల్లో తమ సంప్రదాయాలు, రుచుల పట్ల మాకున్న అంకితభావానికి ఈ బహుమతి నిదర్శనం. ప్రామాణిక ఆహారం, రుచి ద్వారా కుటుంబ సంస్కృతిని సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ సీఓఓ అమ్రపాలి సోనీ మాట్లాడుతూ ‘గత 50 ఏళ్లుగా లక్ష్మి బ్రాండ్ ప్రవాస భారతీయుల ఇళ్లలో భాగమైంది. సొంత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారికి స్వదేశీ రుచులను అందిస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని తెలిపారు.కారు తాళాలు అందుకున్న అనంతరం విజేత ఉదయకుమార్ తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘మేము గెలిచామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏళ్ల తరబడి మా ఇంట్లో లక్ష్మి ఉత్పత్తులు వాడుతున్నాం’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో దక్షిణాసియా కమ్యూనిటీకి నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను అందించడంలో ‘లక్ష్మి’ ప్రముఖంగా నిలుస్తోందని అధికారులు చెప్పారు.ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం.. -
ఏసీ ధరలు అప్! కారణం ఇదే..
రాగి ధరలు పెరగడం, డాలర్తో మారకంలో రూపాయి బలహీనతల కారణంగా ఈ ఏడాది ఎయిర్ కండిషనర్ (ఏసీ) ధరలు 5–15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వోల్టాస్ మేనేజింగ్ డైరెక్టర్ ముకుందన్ మీనన్ తెలిపారు. పీటీఐతో మాట్లాడుతూ..., ఏసీ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఏడాది ఎనర్జీ లేబుల్ మార్పులు అమలు చేస్తున్నామని, దీనివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందన్నారు.‘గత ఏడాది రాగి ధర టన్నుకు సుమారు 8,500 డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది 12,000–13,000 డాలర్లకు చేరుకుంది. ఏసీల తయారీలో రాగి వినియోగం అధికంగా ఉండటంతో ఉత్పత్తి వ్యయంపై గణనీయ ప్రభావం పడుతోంది. అలాగే ఏసీల్లో వినియోగించే కొన్ని కీలక విడిభాగాలు ఇంకా దిగుమతులపై ఆధారపడటంతో, డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా వ్యయాలను పెంచింది. ఈ పరిస్థితుల్లో ఖర్చుల ఒత్తిడిని తగ్గించేందుకు ఏసీ ధరలను 5–15 శాతం వరకు పెంచే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోంది’ అని మీనన్ తెలిపారు. దేశీయ ఏసీ మార్కెట్లో వోల్టాస్కు ప్రస్తుతం సుమారు 18 శాతం వాటా ఉందని ఆయన చెప్పారు. ఏసీల తయారీలో చైనా అగ్ర స్థానంలో ఉండగా, థాయిలాండ్ రెండో స్థానంలో ఉంది.2026లో అమ్మకాలు 15–20% పెరగొచ్చుగత ఏడాదితో పోలిస్తే 2026లో దేశీయ ఏసీ విక్రయాలు 15–20 శాతం పెరుగుతాయని మీనన్ అంచనా వేశారు. మార్కెట్లో పెరిగిన డిమాండ్ను ఎదుర్కొనేందుకు కంపెనీ సిద్ధంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్, తమిళనాడులోని రెండు ప్లాంట్లలో కలిపి 30 లక్షల స్లి్పట్ ఏసీ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో పాటు మెరుగైన అమ్మకాలు, సేవల మద్దతు ఆధారంగా దేశీయ ఏసీ విభాగంలో అగ్రస్థానాన్ని కొనసాగించడమే లక్ష్యమని చెప్పారు. లోకలైజేషన్పై దృష్టిరాబోయే రెండేళ్లలో ఏసీ యూనిట్లలో లోకలైజేషన్ స్థాయిని 70 శాతం నుంచి 90 శాతానికి పెంచే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మీనన్ తెలిపారు. తయారీలో వినియోగించే కంప్రెసర్లు, మోటార్లు, పీసీబీలు, రాగి, అల్యూమినియం భాగాల స్థానిక కొనుగోళ్లను విస్తరించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం 35–40 శాతంగా ఉన్న లోకలైజేషన్ స్థాయి ప్రస్తుతం 70 శాతానికి చేరిందని వెల్లడించారు. లోకలైజేషన్ స్థాయి ప్రస్తుతం 70 శాతానికి చేరిందని తెలిపారు.ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం.. -
ఐఆర్ఎఫ్సీ వాటా ఆఫర్.. స్పందించని ఇన్వెస్టర్స్
పీఎస్యూ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ)లో ప్రభుత్వం ఆఫర్ చేసిన 2 శాతం వాటా విక్రయానికి సరైన స్పందన లభించలేదు. ఆఫర్లో భాగంగా ప్రభుత్వం సంస్థాగత ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసిన 23.52 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా.. 22.34 కోట్ల షేర్లకు మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 94.98 శాతం స్పందన నమోదైంది. సంస్థాగత ఇన్వెస్టర్లు షేరుకి రూ. 104.12 సంకేత ధరలో బిడ్స్ వేశారు. వీటి విలువ రూ. 2,326 కోట్లుకాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు గురువారం విండో ఓపెన్ కానుంది.కాగా.. ప్రభుత్వం 2 శాతం వాటాకు సమానమైన 26.13 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్కు అధిక డిమాండ్ కనిపిస్తే మరో 2 శాతం వాటాను సైతం విక్రయించేందుకు(గ్రీన్ షూ ఆప్షన్) అవకాశముంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 104 ఫ్లోర్ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 86.36 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్ -
ఏఐకి భయపడం
ముంబై: కృత్రిమ మేధ (ఏఐ)తో నెలకొన్న రిస్కుల గురించి తమ సంస్థ భయపడబోదని దేశీ ఐటీ సర్వీసుల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎండీ కె. కృతివాసన్ స్పష్టం చేశారు. కంపెనీ ఆదాయం తగ్గినా ఫర్వాలేదు కానీ ఏఐ సాధనాలను వినియోగించుకోవడాన్ని నేర్చుకునేలా ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొత్తం 6 లక్షల మంది ఉద్యోగుల్లో ప్రతీ ఒక్కరు కృత్రిమ మేధలో నిష్ణాతులుగా మారేలా ప్రయతి్నస్తున్నట్లు వివరించారు. ఇదే క్రమంలో కొంత భాగం ఆదాయాన్ని కోల్పోయినా, వివిధ ప్రాజెక్టుల్లో ఏఐని ఉపయోగించే విధానాలను అన్వేషించాలని సిబ్బందికి సూచించినట్లు కృతివాసన్ తెలిపారు. యువ సిబ్బందితో పోలిస్తే కృత్రిమ మేధ ఆధారిత సొల్యూషన్స్ని రూపొందించడంలో సీనియర్ ఉద్యోగులు కాస్త నెమ్మదిగా ఉంటున్న విషయాన్ని గమనించినట్లు వార్షిక నాస్కామ్ టెక్నాలజీ, లీడర్షిప్ ఫోరం (ఎన్టీఎల్ఎఫ్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. కొత్త ఏఐ నైపుణ్యాలు నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు ప్రస్తుతం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదని, అందరూ వాటిపై ఆసక్తిగానే ఉన్నారని పేర్కొన్నారు. అయితే, నైపుణ్యాలంటే చాట్జీపీటీ లాంటి ప్లాట్ఫాంకి ప్రాంప్్టలు ఇవ్వడం మాత్రమే కాదని, సిబ్బంది శ్రమించి ఏఐ సాధనాలతో కొత్త సొల్యూషన్స్ను రూపొందిస్తేనే ప్రయోజనకరమని కృతివాసన్ చెప్పారు. ఏఐ ప్రస్తుతం బోర్డు స్థాయి సమావేశాల్లోను ప్రధాన ఎజెండాగా ఉంటోందన్నారు. కొత్త టెక్నాలజీతో ఉత్పాదకత పెరుగుతుందని, కానీ, అలాంటి సాంకేతికతలతో తమ కస్టమర్లకు ఏవిధంగా ప్రయోజనం చేకూర్చగలం అనే అంశంపై కూడా తాము ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. -
కోల్ ఇండియా రేర్ ఎర్త్ మైనింగ్
న్యూఢిల్లీ: అనుబంధ కంపెనీ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్ఈసీఎల్) తాజాగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్గల 7 మైన్ డంప్లను గుర్తించినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా వెల్లడించింది. బొగ్గు గనుల వృథా నుంచి విలువను వెలికితీయాలన్న ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా ఎస్ఈసీఎల్ చర్యలు చేపట్టినట్లు తెలియజేసింది. ఈ బాటలో ప్రధాన కోల్ ఫీల్డ్స్వద్ద భారీగా పేరుకుపోయిన డంప్స్ ద్వారా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(ఆర్ఈఈలు)ను గుర్తించినట్లు పేర్కొంది. దీంతో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని ఎస్ఈసీఎల్ చైర్మన్, ఎండీ హరీష్ దుహన్ వివరించారు. వీటి వెలికితీత కోసం ఇప్పటికే టెండరింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. వెరసి ఏడాదిలోగా ఇందుకు వీలున్న డంప్స్ను సైంటిఫిక్ పద్ధతిలో గుర్తించనున్నట్లు తెలియజేశారు. బొగ్గు శాఖ మార్గదర్శకత్వాల ప్రకారం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వెలికితీతకు 7 మైన్ డంప్స్ను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఏడాదిలోగా ఆర్థికంగా ఉపయుక్తమైన ప్రాంతాలను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్స్, పునరుత్పాదక ఇంధనం, రక్షణ రంగ పరికరాలు, ఎలక్ట్రికల్ వాహనాలు తదితర హైటెక్ పరిశ్రమలలో ఇవి కీలకంకాగా.. అంతర్జాతీయస్థాయిలో వీటి సరఫరాలకు చైనా ఆధిపత్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతొ కోల్ ఇండియా షేరు 2% ఎగసి రూ. 438 వద్ద ముగిసింది. -
రూ. 237 కోట్లు.. అంతా ఉద్యోగులకే..
చైనాలోని ప్రముఖ క్రేన్ తయారీ సంస్థ హెనాన్ కువాంగ్షాన్ క్రేన్ కో, లిమిటెడ్ (Henan Kuangshan Crane Co., Ltd) తమ ఉద్యోగుల పట్ల చూపిన అపూర్వ ఉదారత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 270 మిలియన్ యువాన్ల నికర లాభాల్లో 180 మిలియన్ యువాన్లు (సుమారు 26 మిలియన్ డాలర్లు లేదా రూ.237 కోట్లు) ఉద్యోగులకు వార్షిక బోనస్లుగా పంచి అందరి దృష్టిని ఆకర్షించింది.వార్షిక వేడుకలో నగదు వర్షంసౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 13న నిర్వహించిన కంపెనీ వార్షిక గాలా వేడుకలోనే 60 మిలియన్ యువాన్లు (సుమారు 8.7 మిలియన్ డాలర్లు) నగదును అక్కడికక్కడే పంపిణీ చేశారు. సుమారు 7,000 మంది ఉద్యోగులు హాజరైన ఈ కార్యక్రమానికి 800 విందు టేబుళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో పొడవైన టేబుళ్లపై నోట్ల కట్టలు పేర్చిన దృశ్యాలు కనిపించాయి. ఉద్యోగులను వేదికపైకి ఆహ్వానించి, వారు లెక్కించగలిగినంత మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించారు. కొందరు చేతుల్లో భారీ నోట్ల కట్టలతో కనిపించగా, మరికొందరు నగదు కుప్పలను ఎత్తుకునేందుకు కష్టపడిన దృశ్యాలు ఆసక్తికరంగా మారాయి.లాభాల్లో 70 శాతం ఉద్యోగులకే..ఆన్లైన్ పంపిణీతో కలిపి మొత్తం బోనస్ చెల్లింపులు 180 మిలియన్ యువాన్లను మించాయి. 2025లో కంపెనీ సంపాదించిన 270 మిలియన్ యువాన్ల లాభంలో దాదాపు 70 శాతం మొత్తాన్ని సిబ్బందితో పంచుకోవడం విశేషం.‘డబ్బు ఇవ్వడానికి ఇష్టపడే బాస్’సంస్థ చైర్మన్ కుయి పీజున్ (Cui Peijun) ఈ కార్యక్రమంలో మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ప్రణాళికాబద్ధంగా ఇవ్వాల్సిన ఉపకరణ బహుమతులను రద్దు చేస్తూ, “వాషింగ్ మెషీన్లు ఎందుకు? గతంలో బంగారు ఆభరణాలు ఇచ్చాం. ఈసారి ప్రతి ఉద్యోగికి అదనంగా 20,000 యువాన్లు నగదు ఇవ్వండి,” అని ఆర్థిక విభాగాన్ని ఆదేశించారు.2002 సెప్టెంబర్లో స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం 130 దేశాల్లో క్రేన్లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాల తయారీ, సర్వీసులు అందిస్తోంది. ఉద్యోగులకు భారీ రివార్డులు ఇవ్వడంలో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ, 2024లో 260 మిలియన్ యువాన్ల లాభాల్లో 170 మిలియన్ యువాన్లను సిబ్బందికి పంచింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా 2,000 మంది మహిళా ఉద్యోగులకు సుమారు 1.6 మిలియన్ యువాన్ల బోనస్ ప్రకటించారు.“నేను డబ్బు ఇవ్వడం ఇష్టపడతానని కాదు. యువత కారు రుణాలు, గృహ రుణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మేము చేయగల సహాయం చేస్తే వారికి ఉపశమనం లభిస్తుంది,” అని కుయి వ్యాఖ్యానించారు. -
50 శాతం గృహ రుణాలు మహిళలకే..
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్లు, ఎంఎస్ఎంఈలకు మరింత రుణ వితరణకు వీలుగా ఆవాస్ ఫైనాన్షియర్స్తో ఆసియా అభివృద్ధి బ్యాంక్ చేతులు కలిపింది. 108 మిలియన్ డాలర్ల (సుమారు రూ.983 కోట్లు) సీనియర్ సెక్యూర్డ్ డెట్ ఫైనాన్సింగ్ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది.తక్కువ ఆదాయ వర్గాలు కొనుగోలు చేసే ఇళ్లు, రుణ సాయం అంతగా విస్తరించని రాష్ట్రాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈలు) సంస్థలకు రుణ వితరణ కోసం ఈ నిధులను ఆవాస్ ఫైనాన్షియర్స్ వినియోగించనుందని ఏడీబీ ప్రకటించింది. సొంతంగా నిర్మించుకునే ఇళ్లు, పర్యావరణ అనుకూల ఆమోదిత ఇళ్లు, ఇంధన ఆదా పరిష్కారాలతో నిర్మించిన ఇళ్ల కోసం రుణాలను అందించనుంది.మహిళలకు ప్రాధాన్యంగృహ రుణాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ముఖ్యంగా ఏడీబీ అందించే సాయంలో 70 శాతం మేర తక్కువ ఆదాయ వర్గాల ఇళ్ల కొనుగోళ్లకు రుణాలుగా అందించనున్నారు. 50 శాతం మేర రుణాలను మహిళలకే ఇవ్వనున్నారు. మిగిలిన 30 శాతం నిధులను ఎంఎస్ఎంఈలకు అందించనున్నారు. 8 మిలియన్ డాలర్లను రాయితీ రేటుపై అందించడం కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది. -
తప్పు చేశా.. క్షమించండి
న్యూయార్క్: సెక్స్ కుంభకోణం సూత్రధారి, అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు సంబంధాలున్న మాట నిజమేనని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ఎట్టకేలకు అంగీకరించారు. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించినట్లు వెల్లడించారు. అయితే, చట్టవిరుద్ధమైన పనులేవీ చేయలేదని పేర్కొన్నారు. ఎప్స్టీన్ నేరాల్లో తాను పాలుపంచుకోలేదని స్పష్టంచేశారు. అయినప్పటికీ తన వల్ల ‘గేట్స్ ఫౌండేషన్’కు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్స్టీన్ను కలవడం తప్పేనని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ఫౌండేషన్ సిబ్బందికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఒక నివేదికను తాజాగా బహిర్గతం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలపై మంగళవారం జరిగిన టౌన్హాల్ సమావేశంలో బిల్ గేట్స్ వివరణ ఇచ్చారని పేర్కొంది. ‘‘ఎప్స్టీన్ ఫైల్స్లో భాగంగా విడుదల చేసిన ఫొటోల్లో మహిళలతో నేను ఉన్నట్లు చూపించారు. ఆ ఫొటోల్లో మహిళల ముఖాలను తారుమారు చేశారు. నిజానికి ఎప్స్టీన్ సహాయకులతో ఫొటో దిగాను. ఎప్స్టీన్ వినతి వల్లే దిగాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్న మహిళలతో ఏనాడూ నేను కాలం గడపలేదు. ఎప్స్టీన్ బారిన పడిన బాధిత మహిళలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎప్స్టీన్ను కలవడం ద్వారా పెద్ద తప్పు చేశా. అతడితో సమావేశాలకు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను కూడా తీసుకెళ్లడం ఇంకా పెద్ద తప్పు. మైనర్లతో వ్యభిచారం కేసులో ఎప్స్టీన్ 2008లో దోషిగా తేలాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో అతడిని కలిశా. అతడి నేపథ్యం గురించి సరిగ్గా తనిఖీ చేసుకోలేదు. ఎప్స్టీన్తో సంబంధాల గురించి 2013లో నా భార్య మెలిండా ఆందోళన వ్యక్తంచేసింది. అయినప్పటికీ 2014 దాకా అతడిని పలుమార్లు కలిశా. ఎప్స్టీన్తో కలిసి ప్రైవేట్ జెట్ విమానాల్లో ప్రయాణించా. జర్మనీ, ఫ్రాన్స్, న్యూయార్క్, వాషింగ్టన్లో అతడితో సమావేశమయ్యా. కానీ, ఎప్స్టీన్ ఐలాండ్లో ఏనాడూ ఒక్కరాత్రి కూడా గడపలేదు. నా వల్ల గేట్స్ ఫౌండేషన్కు మచ్చ రావడం బాధగా ఉంది. నా వ్యవహార శైలి, ప్రవర్తన ఫౌండేషన్ విలువలకు, లక్ష్యాలకు విరుద్ధంగానే ఉన్నాయి. చివరిసారిగా 2014లో ఎప్స్టీన్ను కలిశా. ఎప్స్టీన్ విషయంలో నా భార్య మెలిండాకు మొదటినుంచీ అనుమానాలున్నాయి. ఎప్స్టీన్తో సంబంధాల వల్ల నా పేరు ప్రతిష్టలు మంట గలుస్తున్నాయని చివరికి గ్రహించా. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించిన సంగతి నిజమే. వారిలో ఒకరు బ్రిడ్జ్ ప్లేయర్. బ్రిడ్స్ ఈవెంట్లలో ఆమె నన్ను కలిశారు. మరొకరు న్యూక్లియర్ ఫిజిసిస్ట్. బిజినెస్ కార్యక్రమాల్లో భాగంగా మేము కలుసుకున్నాం’’అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించిట్లు వార్తా సంస్థ స్పష్టంచేసింది. లక్షలాది పత్రాలు విడుదల ఎప్స్టీప్ ఫైళ్లను అమెరికా న్యాయ శాఖ గత నెలలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎప్స్టీన్తో సన్నిహితంగా మెలిగారని తెలియజేసింది. ఎప్స్టీన్తో బిల్ గేట్స్కు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈ దస్త్రాల్లో తేలడంతో సంచలనాత్మకంగా మారింది. ఇదీ చదవండి: భారత్కు అమెరికా కొత్త ‘షాక్’.. 126% టారిఫ్! -
అనిల్ అంబానీ ఖరీదైన ఇల్లు జప్తు!
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన ముంబై నివాసం ‘అబోడ్’ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఈడీ (Enforcement Directorate) బుధవారం (ఫిబ్రవరి 25) వెల్లడించింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు అని అధికారులు తెలిపారు. ఇప్పటికే రూ.473.17 కోట్ల విలువైన ఆస్తులపై అమల్లో ఉన్న తాత్కాలిక అటాచ్మెంట్కు కొనసాగింపుగా తాజా ఉత్తర్వు జారీ అయ్యింది.సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. భారత శిక్షాస్మృతి సెక్షన్లు 120-బి, 406, 420తో పాటు అవినీతి నిరోధక చట్టం, 1989 నిబంధనల కింద రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Reliance Communications (ఆర్కామ్)), అనిల్ అంబానీ, ఇతరులపై కేసులు నమోదు అయ్యాయి.దర్యాప్తులో ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ రుణదాతల నుండి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు, అందులో సుమారు రూ.40,185 కోట్లు బకాయి ఉన్నట్లు ఈడీ వెల్లడించింది. అలాగే ముంబై పాలి హిల్లోని ఆస్తితో పాటు ఇతర ఆస్తులను అనిల్ అంబానీ కుటుంబ సభ్యుల ప్రైవేట్ ట్రస్ట్ అయిన రైజ్ ఈ ట్రస్ట్లో సమీకరించినట్లు గుర్తించింది. కుటుంబ సంపదను రక్షించుకునేందుకు, బ్యాంకుల రికవరీ చర్యల నుంచి తప్పించుకునేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అనుమానం వ్యక్తం చేసింది.ముంబైలోని ప్రముఖ పాలి హిల్ ప్రాంతంలో 17 అంతస్తులతో, 216 అడుగుల ఎత్తులో నిర్మితమైన ఈ భవనం నగరంలో అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తాజా ఉత్తర్వుతో ఈ కేసులో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.15,700 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది. -
భారత్కు అమెరికా కొత్త ‘షాక్’.. 126% టారిఫ్!
భారత్కు అమెరికా కొత్త ‘షాక్’ ఇచ్చింది. ఇండియా నుంచి దిగుమతి అయ్యే సౌర ఉత్పత్తులపై భారీగా సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. భారత్తోపాటు ఇండోనేషియా, లావోస్ దేశాల సౌర ఉత్పత్తులపైనా టారిఫ్లను విధిస్తున్నట్లు వెల్లడించింది. కొంతమంది విదేశీ తయారీదారులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందుతూ, మార్కెట్ ధరల కంటే తక్కువకు సౌర పరికరాలను అమెరికాలో విక్రయిస్తున్నారన్న దర్యాప్తు నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.భారత్కు 126% సుంకాలుభారతీయ సౌర ఉత్పత్తులపై సుమారు 126 శాతం ప్రాథమిక సుంకం విధించనుంది అమెరికా. ఇక ఇండోనేషియా నుంచి వచ్చే దిగుమతులపై 86 శాతం నుంచి 143 శాతం వరకు, లావోస్ ఉత్పత్తులపై సుమారు 81 శాతం సుంకాలు అమల్లోకి రానున్నాయి. పన్ను రాయితీలు, తక్కువ వడ్డీ రుణాలు, ఇతర ప్రభుత్వ మద్దతు వంటి ప్రయోజనాల వల్ల ఎగుమతిదారులు పొందుతున్న అన్యాయ లాభాలను సమతుల్యం చేయడమే ఈ చర్యల లక్ష్యమని యూఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఈ సుంకాలు ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా వీటిపై రానున్న నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.అమెరికా మార్కెట్లో కీలక భాగస్వామ్యంయూఎస్ గణాంకాల ప్రకారం.. 2025 ప్రథమార్ధంలో అమెరికాలోకి దిగుమతి అయిన మొత్తం సోలార్ మాడ్యూల్స్లో భారత్, ఇండోనేషియా, లావోస్.. మూడు దేశాల వాటా 57 శాతం. ఇందులో భారత ఎగుమతుల విలువ సుమారు 790 మిలియన్ డాలర్లుగా అంచనా. దేశీయ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా సౌర మార్కెట్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది.(ఇదీ చదవండి: అఫైర్లు నిజమే.. అంగీకరించిన బిల్గేట్స్)భారత ఎగుమతిదారుల్లో ఆందోళనఅమెరికా ప్రధాన మార్కెట్గా మారిన నేపథ్యంలో భారత సౌర తయారీదారులు ఈ నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023 నుంచి 2025 మధ్య భారత సోలార్ మాడ్యూల్ ఎగుమతుల్లో దాదాపు 97 శాతం యునైటెడ్ స్టేట్స్కే వెళ్లినట్లు అంచనాలు చెబుతున్నాయి. తాజా సుంకాల వల్ల ధరల పోటీ సామర్థ్యం, ఎగుమతి పరిమాణాలపై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
2026లో పెరగనున్న వేతనాలు!
భారతీయ కార్పొరేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు రానున్న ఆర్థిక సంవత్సరంలో తీపి కబురు అందనుంది. 2025లో నమోదైన 8.9 శాతం వేతన పెంపు 2026లో 9.1 శాతానికి చేరుకోనుందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏయాన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. తాజాగా విడుదలైన ‘32వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2025-26’ ప్రకారం.. దేశంలోని 45 పరిశ్రమలకు చెందిన సుమారు 1,400 సంస్థల గణాంకాలను విశ్లేషించి ఈ అంచనాలను రూపొందించారు.రంగాల వారీగా వేతనాల జోరుఈ ఏడాది వేతన పెంపులో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, ఎన్బీఎఫ్సీ (బ్యాంకింగ్ ఏతర ఆర్థిక సంస్థలు) రంగాలు అగ్రస్థానంలో నిలవనున్నాయి. సాంకేతికత, ఇంజినీరింగ్, కస్టమర్ ఫేసింగ్ విభాగాల్లో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల కోసం సంస్థలు పోటీ పడుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో చెప్పారు.ప్రధాన రంగాల అంచనాలుపరిశ్రమ2025 వాస్తవ పెంపు (%)2026 అంచనా (%)ఎన్బీఎఫ్సీ9.710.1రియల్టీ / ఇన్ఫ్రా10.510.2ఆటోమోటివ్9.89.9రిటైల్9.09.5టెక్నాలజీ7.06.6 తగ్గిన వలసలుగడిచిన మూడేళ్లుగా ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్-ఉద్యోగ మార్పు) క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం.2023: 18.7%2024: 17.7%2025: 16.2%ప్రస్తుతం ఈ రేటు కొవిడ్ పూర్వపు స్థాయికి చేరుకుంది. కంపెనీలు అనుసరిస్తున్న మెరుగైన నియామక ప్రక్రియలు, ఉద్యోగుల నిలుపుదల కోసం చేపడుతున్న కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు ఈ సానుకూల మార్పుకు కారణమని నివేదిక పేర్కొంది.ఈ సందర్భంగా ఏయాన్ ఇండియా పార్టనర్ రూపాంక్ చౌదరి మాట్లాడుతూ..‘భారతదేశం ప్రస్తుతం బలమైన స్థూల ఆర్థిక పునాదులతో వృద్ధి పథంలో ఉంది. దేశీయ గిరాకీ పెరగడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం వల్ల కంపెనీలు ప్రతిభావంతులపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు. దేశంలో కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తుండటంతో కంపెనీలు తమ వేతన నిర్మాణాలను మారుస్తున్నాయని ఏయాన్ అసోసియేట్ పార్టనర్ అమిత్ కుమార్ ఓత్వానీ తెలిపారు.ఇదీ చదవండి: రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా? -
చంద్రశేఖరన్ ఎంపిక వాయిదా
దేశీ కార్పొరేట్ దిగ్గజ గ్రూప్ టాటా సన్స్ బోర్డ్ తాజాగా నిర్వహించిన సమావేశంలో 62 ఏళ్ల నజరాజన్ చంద్రశేఖరన్ ఎంపికపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. గ్రూప్ చైర్మన్గా మూడోసారి పదవీ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు హోల్డింగ్ కంపెనీలో విభేదాలు కారణమని తెలుస్తోంది. 2027 ఫిబ్రవరితో చంద్రశేఖరన్ పదవీ కాలం ముగియనుంది. టాటా ట్రస్ట్స్ చైర్మన్గా వ్యవహరిస్తున్న నోయెల్ టాటా గ్రూప్లోని కొన్ని కంపెనీలకు వాటిల్లుతున్న నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా టాటా సన్స్ లిస్టింగ్పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నాయి. వెరసి చంద్రశేఖరన్ బాధ్యతల పొడిగింపుపై నిర్ణయం వాయిదాపడినట్లు తెలియజేశాయి.టాటా సన్స్లో టాటా ట్రస్ట్స్కు 66 శాతం వాటా ఉంది. అయితే సమావేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ వెలువడకపోవడం గమనార్హం! కాగా.. గ్రూప్లోని ఒక కంపెనీ నష్టాలు నమోదు చేస్తున్నంతమాత్రాన మొత్తం గ్రూప్తోపాటు.. కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైర్మన్ పనితీరును తప్పుపట్టడం సరికాదని బోర్డు సభ్యులు పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కొంతమంది డైరెక్టర్లు ఈ అంశంపై ఓటింగ్కు ప్రతిపాదించినప్పటికీ చంద్రశేఖరన్ వాయిదాకు ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. 2017 నుంచి..1987లో టాటా గ్రూప్లో చేరిన చంద్రశేఖరన్ తదుపరి కాలంలో ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆపై 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్ చైర్మన్గా ఎంపికయ్యారు. విభిన్న బిజినెస్లుగల కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్ పునర్వ్యవస్థీకరణ, కన్సాలిడేషన్ సమయంలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రూప్లోని 15 భారీ లిస్టెడ్ కంపెనీల ఆదాయం, నికర లాభాలు రెట్టింపయ్యాయి.ఇదీ చదవండి: మార్కెట్ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? -
ఐటీలో పెను మార్పులు
ప్రస్తుతం ప్రపంచ ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ).. సాఫ్ట్వేర్ సర్వీసుల్లో పెను మార్పులకు తెరతీస్తున్నట్లు బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ తాజా నివేదిక పేర్కొంది. వెరసి ఐటీ రంగం వ్యవస్థాగతంగా తీవ్ర మార్పులకు లోనుకానున్నట్లు అభిప్రాయపడింది. ఐటీ రంగానికి కీలకమైన బిజినెస్ మిక్స్ను ఏఐ పునర్నిర్వచించనున్నట్లు తెలిపింది. తద్వారా కాలానుగుణ మార్పులు (సైక్లికాలిటీ) పెరగడంతోపాటు.. నిర్వహణా పద్ధతులు, నైపుణ్యాలు పునసమీక్షించుకోవలసి ఉన్నట్లు వివరించింది. ఏఐ సవాళ్లు ముగియలేదని, కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ పెరుగుతున్నప్పటికీ ఏఐ ఆధారిత మార్పులు సంప్రదాయ మేనేజ్డ్ సర్వీసులకు చెక్ పెట్టే అవకాశమున్నదని పేర్కొంది. డౌన్గ్రేడ్ బాటలో..ఇప్పటికే ఐటీ దిగ్గజ కౌంటర్లు గరిష్టాల నుంచి 20–25 శాతం మధ్య పతనమైనప్పటికీ మరింత క్షీణతకు వీలున్నట్లు నివేదికలో జెఫరీస్ అంచనా వేసింది. ఈ బాటలో ఐటీ పరిశ్రమ లీడర్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లను సైతం డౌన్గ్రేడ్ చేసింది. తద్వారా షేర్ల ధరల టార్గెట్ను 33 శాతంమేర కుదించింది. ఇటీవల ఆంత్రోపిక్ క్లాడ్ తదితరాలు అసిస్టెంట్ల స్థాయి నుంచి క్లిష్టమైన టాస్క్లకు సైతం పూర్తి చేయగల టూల్స్ను రూపొందిస్తూ ఏఐ సవాళ్లు విసురుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కొద్ది వారాలుగా సంప్రదాయ ఐటీ సర్వీసులు సహా.. సాఫ్ట్వేర్ విభాగ సేవలకు చెక్ పడే వీలున్నదని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నట్లు నివేదిక వివరించింది. ఆదాయాల్లో 22–45% వరకూ ఆక్రమిస్తున్న అప్లికేషన్ మేనేజ్డ్ సర్వీసుల నుంచి ఐటీ కంపెనీలు అడ్వయిజరీ, ఇంప్లిమెంటేషన్వైపు వ్యవస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టవలసి ఉంటుందని సూచించింది. కాగా.. ఈ ప్రభావంతో దేశీయంగా ఫిబ్రవరి తొలి 3 వారాల్లోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 20% పతనంకావడం గమనార్హం! -
ఫోన్పే పనితీరు ఓకే..
న్యూఢిల్లీ: ఐపీవో బాటలో సాగుతున్న ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే పనితీరు మెరుగుపడుతున్నట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ ప్రకారం చూస్తే.. గత మూడేళ్లలో ఆదాయం, లాభదాయకత, నగదు ఆర్జన పుంజుకున్నట్లు తెలుస్తోంది. నిర్వహణ ఆదాయం గతేడాది(2024–25) రూ. 7,115 కోట్లకు చేరింది. 2022–23లో నమోదైన రూ. 2,914 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 56 శాతం జంప్చేసింది. వివిధ బిజినెస్ విభాగాల మానిటైజేషన్ సైతం ఇందుకు సహకరించింది.వీటిలో మర్చంట్ చెల్లింపులు, రుణాలు, బీమా పంపిణీ కలగలసి ఉన్నాయి. ఆదాయంలో మర్చంట్ పేమెంట్ల బిజినెస్ 15 శాతం నుంచి 2025కల్లా 28 శాతానికి బలపడగా.. 2025 సెప్టెంబర్ తో ముగిసిన ఆరు నెలల్లో 31 శాతానికి ఎగసింది. రుణాలు, బీమా పంపిణీ విభాగం సైతం 2023లో నామమాత్ర వృద్ధి కనబరచగా.. 2025కల్లా 8 శాతానికి, తదుపరి ఆరు నెలల్లో 12 శాతానికి పుంజుకుంది. ఇది కంపెనీకి కీలకమైన చెల్లింపుల బిజినెస్ నుంచి డైవర్సిఫికేషన్ను సూచిస్తోంది. నష్టాలకు చెక్ పలు అంశాలలో నిర్వహణా పనితీరు మెరుగుపడిన నేపథ్యంలో ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే నష్టాలు సైతం తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది రూ. 1,727 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే రూ. 1,069 కోట్లమేర రికవర్ అయ్యాయి. ఇదే కాలంలో నష్టాల మార్జిన్ 90.68 శాతం నుంచి 22.64 శాతానికి మెరుగుపడ్డాయి. గత రెండేళ్ల(2024, 2025)లో సర్దుబాటు తదుపరి నిర్వహణ లాభం(ఇబిటా) సానుకూలస్థాయికి చేరింది.నిర్వహణ సామర్థ్యం, కఠిన వ్యయ నియంత్రణలు ఇందుకు సహకరించాయి. ఇక 2024–25లో రూ. 190 కోట్లకుపైగా ఫ్రీ క్యాష్ఫ్లో సాధించగా.. తదుపరి 6 నెలల్లో రూ. 250 కోట్లు అందుకుంది. ప్రధానంగా కార్యకలాపాల ద్వారానే నగదు ఆర్జన సాధించడం ప్రస్తావించదగ్గ అంశం! కంపెనీ దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యేందుకు 2025 సెప్టెంబర్ లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
సవాళ్లున్నా సాఫ్ట్వేర్దే హవా
ముంబై: భౌగోళిక–రాజకీయ అంశాల కారణంగా ఒడిదుడుకులు నెలకొని, కృత్రిమ మేథతో (ఏఐ) పరిస్థితుల్లో పెను మార్పులు వచ్చినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ టెక్నాలజీ రంగం ఆదాయం 315 బిలియన్ డాలర్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6.1 శాతం వృద్ధి చెందనుంది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వార్షిక నివేదికలో ఈ విషయాలు తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలో కొత్తగా 1.35 లక్షల ఉద్యోగాలు జత కావడం ద్వారా ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య 58.15 లక్షల నుంచి పెరిగి 59.5 లక్షలకు చేరుతుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.33 లక్షల కొత్త కొలువులు జత కాగా, ఈసారి 2,000 మాత్రమే పెరగడమనేది ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ స్థాయి వృద్ధిగా నమోదు కానుంది. ఆదాయం వృద్ధి చెందినంత స్థాయిలో కొలువులు పెరగకపోయినప్పటికీ, నికరంగా ఉద్యోగాలు పెరుగుతుండటమనేది సానుకూలాంశమని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. టెక్నాలజీలో పరిస్థితులు మారే కొద్దీ రాబోయే రోజుల్లోనూ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా వేస్తుననట్లు వివరించారు. 59.5 లక్షల మంది ఉద్యోగుల్లో 20 లక్షల మంది ఏఐ శిక్షణ పొందగా, వీరిలో 3 లక్షల మంది అడ్వాన్స్డ్ ఏఐ నైపుణ్యాలను నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాస్తవంగా చూస్తే కొత్త విభాగాల్లో టెక్నాలజీపై ఖర్చు చేయడం పెరుగుతుండటం సానుకూలమైన విషయమన్నారు. నివేదిక ప్రకారం.. ⇒ ప్రధాన ఐటీ సరీ్వసుల ఆదాయం 143 బిలియన్ డాలర్ల నుంచి 149 బిలియన్ డాలర్లకు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ రెవెన్యూ 55 బిలియన్ డాలర్ల నుంచి 59 బిలియన్ డాలర్లకు, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఆదాయం 21 బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరగనుంది. ⇒ ఇంజినీరింగ్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఆదాయాలు 59 బిలియన్ డాలర్ల నుంచి 63 బిలియన్ డాలర్లకు, హార్డ్వేర్ కంపెనీల ఆదాయాలు 19 బిలియన్ డాలర్ల నుంచి 21 బిలియన్ డాలర్లకు పెరగనున్నాయి. ⇒ గతంలో అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లలో ఆదాయ వృద్ధి అత్యధికంగా ఉండగా, ప్రస్తుతం ఆసియా–పసిఫిక్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ప్రపంచ సగటుతో పోలిస్తే దేశీ మార్కెట్లో ఆదాయాలు అత్యధికంగా 7.9 శాతం మేర వృద్ధి చెందనుండటం ఆసక్తికరమైన అంశం. ⇒ విభాగాలవారీగా చూస్తే ఆరోగ్య సంరక్షణ, ట్రావెల్, రవాణా సెగ్మెంట్ల ఆదాయాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ⇒ చాలా మటుకు కంపెనీలు ఏఐ ఆదాయాలను వెల్లడించవు, కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కృత్రిమ మేథపరమైన ఆదాయాలు 10–12 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. -
తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఒకటి. చాలామంది వాహన ప్రియులకు ఈ కార్లలో ఒక్కసారైనా తిరగాలని ఉంటుంది. కానీ వీటి ధర కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు. ధనవంతులు సైతం రోల్స్ రాయిస్ కారు కొనాలంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ (Reuben Singh) యూకేకు చెందిన వ్యాపారవేత్త, ఇషర్ క్యాపిటల్ సీఈఓ. తలపాగా ధరించడం వల్ల ఈయన ఒకప్పుడు జాతి వివక్షను, ఆంగ్లేయుల నుంచి అవమానాలను ఎదుర్కున్నారు. సిక్కులు పవిత్రంగా చూసే తలపాగాను అవమానించడంతో.. సింగ్ తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు.టర్బన్ ఛాలెంజ్ పేరుతో ప్రతి వారం ఆయన ధరించిన తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి.. దానితో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తం 15 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయనను అవమానించినవారే అవాక్కయ్యారు.ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన కియోసాకి బుక్రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. ఈయన వద్ద పోర్స్చే 918 స్పైడర్, బుగట్టి వెయ్రాన్, పగని హుయారా, లంబోర్గిని హురాకాన్, లిమిటెడ్ ఎడిషన్ ఫెరారీ F12 బెర్లినెట్టా కార్లను కూడా కలిగి ఉన్నారు.ఎవరీ రూబెన్ సింగ్?బ్రిటన్ బిల్ గేట్స్గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రూబెన్ సింగ్. తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు. -
రూ.20 వేలకోట్ల పెట్టుబడి: ఎయిర్టెల్ ప్లాన్ ఏంటి?
మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బ్యాంకింగేతర అనుబంధ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) ఎయిర్టెల్ మనీ లిమిటెడ్పై భారీ ప్రణాళికలు ప్రకటించింది. రానున్న కొన్నేళ్లలో రూ. 20,000 కోట్ల పెట్టుబడులకు తెరతీయనున్నట్లు పేర్కొంది. వీటిలో 70 శాతం ఎయిర్టెల్ సమకూర్చనుండగా.. మిగిలిన 30 శాతం ప్రమోటర్ గ్రూప్ సంస్థ భారతీ ఎంటర్ప్రైజెస్ ద్వారా లభించనున్నట్లు తెలియజేసింది.ఎయిర్టెల్ మనీ ఇటీవలే(2026 ఫిబ్రవరి 13న) ఆర్బీఐ నుంచి ఎన్బీఎఫ్సీ లైసెన్స్ను పొందింది. పటిష్ట డిజిటల్ ఆస్తులు, 500కుపైగా సైంటిస్టులతో నడుస్తున్న భారీ డేటా ఎనలిటిక్స్, లోతైన నిర్వహణా సామర్థ్యాలు కలిగిన కంపెనీగా ఎయిర్టెల్ కొత్తతరహా డిజిటల్ ఫైనాన్షియల్ సరీ్వసులను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.డిజిటల్ ప్లాట్ఫామ్, సమీకృత చానళ్ల ద్వారా గత రెండేళ్లుగా క్రెడిట్ ఇంజిన్ను నిర్మించినట్లు పేర్కొంది. దీంతో దేశీయంగా పటిష్ట రుణ సర్వీసుల మోడళ్లలో ఒకటిగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఇప్పటికే రూ. 9,000 కోట్లకుపైగా రుణాల విడుదల ద్వారా ప్లాట్ఫామ్ అత్యున్నతస్థాయి(హైపర్స్కేల్)ని అందుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు పటిష్ట అండర్రైటింగ్ విధానాలు, క్రమశిక్షణాయుత పోర్ట్ఫోలియో నిర్వహణ, రియల్టైమ్ రిస్క్ పర్యవేక్షణ దోహదపడినట్లు వివరించింది. -
25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన బుక్
రాబర్ట్ కియోసాకి అంటే ముందుగా గుర్తొచ్చేది.. ఆయన రాసిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తకం. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఈ బుక్.. తన జీవితాన్ని మార్చేసిందని, మిలియనీర్ను చేసిందని హెచ్బీ క్యాపిటల్ ఫౌండర్ & సీఈఓ 'హన్నా హామండ్' వెల్లడించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.13 ఏళ్ల వయసులో నా దగ్గర రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ ఉండేది. ఈ పుస్తకం నా జీవిత దిశనే మార్చేసింది. చిన్నప్పుడే కియోసాకి నాకు హీరో అయ్యారు, అని హన్నా హామండ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. కష్టపడి పనిచేసి, ఆర్థిక జ్ఞానం పెంపొందించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాను. దీని ఫలితంగా 25 ఏళ్లకే మిలియనీర్ అయ్యానని ఆమె పేర్కొంది.నా జీవితంలో నేను ఊహించని విషయం ఏమిటంటే.. నా ఫ్రెండ్ జో పోలిష్ ద్వారా రాబర్ట్ కియోసాకిని కలుసుకోవడం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆమె ఇంటి దగ్గరలోనే కియోసాకి నివసిస్తున్నారని నాకు అప్పటి వరకు తెలియదు.ఈ సందర్భంలో ఆమె తన జీవితాన్ని తిరిగి ఒకేసారి నెమరు వేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం జీవితం దుర్భరంగా ఉండేది.ఇప్పుడు నా బాల్యంలో ఆశను నింపిన వ్యక్తి పక్కన నిలబడి ఉన్నాను. ఆ పుస్తకంలోని మాటలు నన్ను కష్టకాలంలో నిలబెట్టాయి, ముందుకు నడిపించాయని హన్నా హామండ్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Hannah Hammond (@hannahbhammond) -
తెలంగాణలో త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’
తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ విధానాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.మంగళవారం జూబ్లీహిల్స్లో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించి ప్రభుత్వ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు.2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థరాష్ట్ర వృద్ధి అనేది యాదృచ్ఛికంగా జరిగేది కాదని, అది పక్కా ప్రణాళికతో కూడిన ప్రక్రియ అని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘తెలంగాణ విజన్ 2047’ డాక్యుమెంట్ను రూపొందించిందని తెలిపారు. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదిగిందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో పని చేస్తుందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.రాష్ట్ర అభివృద్ధికి త్రిముఖ వ్యూహంతెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘క్యూర్ - ప్యూర్ - రేర్’ అనే వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోందని శ్రీధర్ బాబు వివరించారు. అభివృద్ధిని కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై స్పందిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలు పని సంస్కృతిని పూర్తిగా మార్చేశాయని మంత్రి అభిప్రాయపడ్డారు.‘రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా కంపెనీల కంటే బలమైన ఎకో సిస్టమ్కే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే భవిష్యత్తు కోసం వేచి చూడకుండా ఆ భవిష్యత్తును మనమే నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం’ అని చెప్పారు. ప్రభుత్వం కేవలం అనుమతులు ఇచ్చే యంత్రాంగంలా కాకుండా పరిశ్రమలతో కలిసి నడిచే భాగస్వామిగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నేత రాంచందర్ రావు, డా.నాగేశ్వర్ రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ కన్వీనర్ పంకజ్ దివాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇదీ చదవండి: ‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్ఫామ్ ప్రారంభం -
‘భారత్ టాక్సీ’ సహకార ప్లాట్ఫామ్ ప్రారంభం
దేశీయ రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించుతూ డ్రైవర్లే యజమానులుగా సాగే ప్రక్రియకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘భారత్ టాక్సీ’ అనే సహకార రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ను అధికారికంగా ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల లాభార్జనే ధ్యేయంగా సాగే ప్రస్తుత వ్యవస్థకు భిన్నంగా ఇది డ్రైవర్ల సంక్షేమం, యాజమాన్య భాగస్వామ్యం ప్రాతిపదికన పనిచేయనుంది.డ్రైవర్ల చేతికే లాభాలుఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్కు చెందిన క్యాబ్, ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా ఈ ప్లాట్ఫామ్ లాభాల పంపిణీ విధానాన్ని వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. సంస్థ గడించే నికర లాభాల్లో 80 శాతం మొత్తాన్ని కిలోమీటర్ల ప్రయాణం ఆధారంగా నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తారు. మిగిలిన 20 శాతం మొత్తాన్ని సహకార సంస్థ బలోపేతానికి, సాంకేతిక అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తారు. ‘ప్రస్తుత ప్రైవేట్ కంపెనీలు డ్రైవర్లకు కనీస బేస్ రేటును కూడా ఖరారు చేయడం లేదు. కానీ భారత్ టాక్సీ ద్వారా డ్రైవర్ల కనీస ఆదాయానికి భరోసా ఇస్తాం’ అని షా స్పష్టం చేశారు.రూ.500తో యజమానిగా.. ‘అమూల్’ తరహా మోడల్భారత్ టాక్సీ నిర్మాణాన్ని ప్రపంచ ప్రఖ్యాత అమూల్ డెయిరీ కోఆపరేటివ్తో అమిత్ షా పోల్చారు. 36 లక్షల మంది మహిళలు కేవలం రూ.50 పెట్టుబడితో ప్రారంభించిన అమూల్ నేడు రూ.1.25 లక్షల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందని ఆయన గుర్తు చేశారు. కేవలం రూ.500 చెల్లించి భారత్ ట్యాక్సీలో షేర్ కొనడం ద్వారా ప్రతి డ్రైవర్ ఈ సంస్థలో సహ యజమాని కావచ్చు. సభ్యుల సంఖ్య పెరిగిన తర్వాత డ్రైవర్లే డైరెక్టర్ల బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ నిర్ణయం జరిగినా ప్రశ్నించే హక్కు డ్రైవర్ల ప్రతినిధులకు ఉంటుంది.15 కోట్ల మంది డ్రైవర్లే లక్ష్యంప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసుకున్న భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్, రాజ్కోట్ ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2 ఏళ్లలో 15 కోట్ల మంది డ్రైవర్లను చేర్చుకోవడమే స్వల్పకాలిక లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా అంటే 3 ఏళ్లలో దేశంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించాలని చూస్తోంది.మార్కెట్ దిగ్గజాలకు పోటీప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లు డ్రైవర్ల నుంచి 25-30% వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. దీనికి భిన్నంగా భారత్ టాక్సీ ప్రస్తుతం ఎటువంటి కమీషన్ వసూలు చేయడం లేదు. ఈ లాభాల భాగస్వామ్య వ్యవస్థ పూర్తిస్థాయిలో స్థిరపడటానికి మూడు ఏళ్ల సమయం పడుతుందని అంతవరకు డ్రైవర్లు సహకరించాలని అమిత్ షా కోరారు.ఇదీ చదవండి: పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే.. -
మెడికవర్ ఎయిర్ అంబులెన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా, అంతర్జాతీయంగా పేషంట్ల బదిలీ కోసం ఎయిర్ అంబులెన్స్ సరీ్వసులను అందుబాటులోకి తెచ్చేలా ఎవర్గ్రీన్ హెల్త్కేర్తో మెడికవర్ హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్లో కొత్త ఆసుపత్రిని ఇంకా అధికారికంగా ప్రారంభించేలోపే ఎయిర్ అంబులెన్స్ ఏర్పాట్లు చేసుకోవడం వల్ల, తొలి రోజు నుంచే ఎమర్జెన్సీ సమయాల్లో మరింత మెరుగ్గా స్పందించేందుకు వీలవుతుందని సంస్థ తెలిపింది. ప్రతి క్షణం విలువైనదిగా ఉండే క్రిటికల్ కేసుల్లో ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయని హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ నయన్ శ్రీరాముల తెలిపారు. ప్రమాదాలు, గుండెపోటులాంటి క్రిటికల్ సందర్భాల్లో పేషంట్లను ఆసుపత్రికి తరలించే ప్రక్రియ నిపుణుల పర్యవేక్షణలో జరగడమనేది ప్రాణాలను కాపాడటంలో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. -
అమెజాన్ అతిపెద్ద ఆఫీస్.. ఇక్కడే..
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఆసియాలో రెండవ అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయంగా నిలిచే తన కొత్త క్యాంపస్ను బెంగళూరులో అధికారికంగా ప్రారంభించింది. 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ప్రధాన కార్యాలయం ఈ-కామర్స్, ఆపరేషన్స్, చెల్లింపులు, సాంకేతికత, విక్రేత సేవల విభాగాల్లో 7,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేసుకునేందుకు వీలు కల్పించనుంది.గతంలో అమెజాన్ ఇండియా ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగళూరులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించేది. వ్యయ నియంత్రణ చర్యలలో భాగంగా ఆ కార్యాలయాన్ని మారుస్తూ సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ మాట్లాడుతూ.. “భారత్ అమెజాన్కు దీర్ఘకాలిక ప్రాధాన్యతగల మార్కెట్. మా ప్రయాణంలో బెంగళూరు కీలక పాత్ర పోషించింది. ప్రారంభ దశలోనే సాంకేతిక, వ్యాపార బృందాలకు ఈ నగరం నిలయమైంది. నేడు ఇది ఆవిష్కరణ, ప్రతిభకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది” అని తెలిపారు.ఆర్థిక ఫలితాల పరంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ ఇండియా మార్కెట్ప్లేస్ సంస్థ ‘అమెజాన్ సెల్లర్ సర్వీసెస్’ కార్యకలాపాల ద్వారా సాధించిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగి రూ.30,139 కోట్లకు చేరుకుంది. వ్యయాలు నెమ్మదిగా పెరగడంతో నష్టాలు 89 శాతం తగ్గి రూ.374 కోట్లకు పరిమితమయ్యాయి. అయితే, కోవిడ్ కాలంతో పోలిస్తే ఆదాయ వృద్ధి మోస్తరు స్థాయిలోనే నమోదైనట్లు వెల్లడైంది. -
2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!
ఈవై ఇండియా విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ పే నివేదిక ప్రకారం.. ఈ ఏడాది (2026) కార్పొరేట్ ఇండియా సగటు జీతం 9.1 శాతం ఉంటుంది. ఇది ఉద్యోగ విఫణిలో చోటుచేసుకుంటున్న మార్పులను, ముఖ్యంగా నైపుణ్యాల ఆధారిత వేతన విధానాల పెరుగుదలను స్పష్టంగా తెలియజేస్తోంది.జీతాల పెరుగుదల విషయంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ముందంజలో ఉండనున్నాయి. ఇవి గరిష్టంగా 10.4 శాతం వరకు జీతాలను హైక్ చేయనున్నాయి. ఆ తరువాత ఆర్థిక సేవల రంగం సుమారు 10 శాతం, ఈ-కామర్స్ రంగంలో 9.9 శాతం, జీవవిజ్ఞాన శాస్త్రాలు & ఔషధ రంగాల్లో 9.7 శాతం వరకు జీతాల పెరుగుదల ఉంటుంది.ఉద్యోగాల తొలగింపులు విషయానికి వస్తే.. 2024లో ఇది 17.5 శాతం ఉంది, ఇది 2025కి 16.4 శాతానికి చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఉద్యోగలు తొలగింపులు సంఖ్య కొంత తగ్గినట్లు తెలుస్తోంది. కాగా ఉద్యోగాలను స్వచ్చందంగా వదిలిపెట్టి రాజీనామా చేస్తున్నవారి సంఖ్య 80 శాతం ఉందని నివేదిక చెబుతోంది. అంటే వీరు తొలగింపుల కారణంగా కాకుండా, మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలను మార్చుతున్నారు. ఉద్యోగులను ఎక్కువగా తొలగించిన రంగాల్లో ప్రొఫెషనల్ సర్వీసెస్ & ఐటీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి.నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని వేతనం చెల్లించడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి అదనపు వేతనం లభిస్తుంది. ఇదే సమయంలో వేరియబుల్ పే ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. 2025లో స్థిర వేతనంలో వేరియబుల్ పే వాటా 16.1 శాతానికి పెరిగింది. 2024లో ఇది 14.8 శాతం మాత్రమే ఉండేది. అంటే కంపెనీలు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి. -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మోసం.. రంగంలోకి ఫోరెన్సిక్ టీమ్!
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్లోని ఒక శాఖలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. హరియాణా ప్రభుత్వ రంగానికి చెందిన సుమారు రూ.590 కోట్ల నిధులకు సంబంధించి జరిగిన మోసపూరిత వ్యవహారంపై బ్యాంక్ యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ ఉదంతంపై స్పందించిన బ్యాంక్ ఎండీ, సీఈఓ వి.వైద్యనాథన్.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అసలేం జరిగింది?హరియాణా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను మరో బ్యాంకుకు బదిలీ చేయాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న బ్యాలెన్స్కు, బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్న బ్యాలెన్స్కు మధ్య రూ.590 కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. చండీగఢ్లోని ఒక బ్రాంచ్లో కొందరు ఉద్యోగులు బయటి వ్యక్తులతో కుమ్మక్కై ఈ అనధికార లావాదేవీలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.బ్యాంక్ తక్షణ చర్యలుఈ మోసంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నలుగురు బ్యాంకు అధికారులను తక్షణమే సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, రికవరీ ప్రక్రియ ప్రారంభమైనట్లు బ్యాంక్ వెల్లడించింది. ఈ కుంభకోణం మూలాలను, పూర్తి స్థాయి దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి స్వతంత్ర సంస్థ కేపీఎంజీని ఫోరెన్సిక్ ఆడిటర్లుగా నియమించారు.అన్నీ తెలుసుకుంటాం: వి.వైద్యనాథన్సోమవారం ఉదయం జరిగిన కాన్కాల్లో వైద్యనాథన్ మాట్లాడుతూ.. బ్యాంక్ విలువలకు, పారదర్శకతకు కట్టుబడి ఉందన్నారు. ‘గత ఐదేళ్లలో 1,050 పైగా శాఖలను ప్రారంభించాం. కానీ ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. ఇది దురదృష్టకరం. వ్యవస్థలోని లోపాలను లేదా ఉద్యోగుల కుమ్మక్కును గుర్తించడానికి బ్యాంక్లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. బోర్డు మార్గదర్శకత్వంలో ఈ సమస్యను అత్యంత నైతికంగా, నిర్ణయాత్మకంగా పరిష్కరిస్తాం’ అని చెప్పారు.నిన్న రాత్రి దేశవ్యాప్తంగా తమ బ్యాంకు ఉద్యోగులతో మాట్లాడానని, బ్యాంక్ కార్యకలాపాలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఎవరికీ ఇందులో ప్రమేయం లేదని, సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.ఆర్థిక ప్రభావం అంచనాఈ మోసం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని నిర్ధారించే పనిలో బ్యాంక్ ఉంది. ఇతర బ్యాంకుల్లో ఉన్న మోసపూరిత లబ్ధిదారుల ఖాతాలను గుర్తించడం, చట్టపరమైన రికవరీల ద్వారా వచ్చే నిధుల ఆధారంగా తుది ప్రభావాన్ని నిర్ణయిస్తారు. ఈ నష్టాన్ని బ్యాంక్ తన ప్రాఫిట్ అండ్ లాస్ ఖాతా ద్వారా సర్దుబాటు చేయనుంది.డిసెంబర్ 2018లో క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్సీ బ్యాంక్ విలీనం తర్వాత వి.వైద్యనాథన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి బ్యాంక్ వేగంగా వృద్ధి సాధిస్తున్న తరుణంలో ఈ మోసం బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా చట్ట ప్రకారం బాధ్యులపై కఠినమైన సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని బ్యాంక్ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తేల్చి చెప్పింది.ఇదీ చదవండి: పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు -
ప్రైవేటు బ్యాంకులో రూ .590 కోట్ల ఫ్రాడ్..
ప్రముఖ ప్రైవేటు రంగ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులో (IDFC First Bank) రూ. 590 కోట్ల ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. చండీగఢ్లోని ఒక బ్రాంచ్లో హర్యానా ప్రభుత్వ ఖాతాలకు సంబంధించి అనధికారిక, మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది.బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. హర్యానా ప్రభుత్వంలోని ఒక నిర్దిష్ట విభాగం నుంచి సమాచారం అందిన అనంతరం ప్రాథమిక అంతర్గత విచారణ చేపట్టగా ఈ అక్రమాలు బయటపడ్డాయి. చండీగఢ్ బ్రాంచ్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు అనధికారిక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు, సంస్థలు లేదా కౌంటర్ పార్టీల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటివరకు గుర్తించిన ఖాతాల్లో మొత్తం రూ. 590 కోట్ల మేర ప్రభావం ఉన్నట్లు అంచనా వేసిన బ్యాంక్.. పూర్తి వివరాలు, క్లెయిమ్ల ధ్రువీకరణ అనంతరం తుది ప్రభావాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటన చండీగఢ్ బ్రాంచ్ ద్వారా నిర్వహించబడుతున్న హర్యానా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రభుత్వ-లింక్డ్ ఖాతాలకు మాత్రమే పరిమితమైందని ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొంది. ఇతర ఖాతాదారులపై ప్రభావం లేదని బ్యాంక్ వెల్లడించింది.హర్యానా ప్రభుత్వంలో ఓ విభాగం తన ఖాతాను మూసివేసి నిధులను మరొక బ్యాంకుకు బదిలీ చేయాలంటూ చేసిన అభ్యర్థనతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ప్రక్రియలో ఖాతా బ్యాలెన్స్తో పోలిస్తే గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం మరికొన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తమ ఖాతాల వివరాలపై బ్యాంకును సంప్రదించగా, బ్యాంక్ రికార్డులు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల మధ్య పలు తేడాలు ఉన్నట్లు తెలిసింది.దర్యాప్తు పూర్తయ్యే వరకు నలుగురు అనుమానిత అధికారులను సస్పెండ్ చేసినట్లు బ్యాంక్ వెల్లడించింది. వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత ఉద్యోగులు, ఇతర బయటి వ్యక్తులపై కఠినమైన క్రమశిక్షణా, సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపింది.ఈ ఘటనను మోసాల కేసుల పర్యవేక్షణ, అనుసరణ బోర్డు (SCBMF) ప్రత్యేక కమిటీ ముందుంచినట్లు పేర్కొన్న బ్యాంక్.. స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు బాహ్య ఏజెన్సీని నియమించే ప్రక్రియలో ఉన్నట్లు వెల్లడించింది.ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో సంచలనం సృష్టించగా, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
నాన్న అదే రాత్రి పోర్టుకు పంపారు.. నాకు ఆఫీస్ కూడా లేదు: కరణ్ ఆదానీ
దేశ రాజధానిలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్.. ప్లాటినం జూబ్లీ (70వ) వ్యవస్థాపక దినోత్సవం & 20వ జాతీయ మేనేజ్మెంట్ దినోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సమావేశంలో అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.కృత్రిమ మేధస్సు మానవులను పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సామర్థ్యాన్ని పెంచేదిగా పనిచేస్తుందని కరణ్ అదానీ పేర్కొన్నారు. ఉత్పాదకతను మెరుగుపరిచే & సంస్థలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడే శక్తివంతమైన సాధనంగా AIని చూడాలని అన్నారు. అయితే.. ఒక టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోవడం సర్వ సాధారణమే అని కరణ్ అదానీ పేర్కొన్నారు.ఇప్పటికే కొన్ని పెద్ద సంస్థలు తమ ఉద్యోగులకు ఏఐ వంటి వాటిలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇది ఉద్యోగ భద్రతను అందిస్తుంది. కంపెనీలు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు కూడా తమకు తాము కొత్త నైపుణ్యాలను పెంచుకోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో మనగలుగుతాము.ఈ సందర్భంగా.. తన బాల్యం గురించి మాట్లాడుతూ నేను మూడేళ్లు మిషనరీ పాఠశాలలో చదువుకున్నాను అని కరణ్ అదానీ చెప్పారు. అక్కడే నేను క్రమశిక్షణ, స్వతంత్రత & భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన పిల్లలతో కలసి మెలసి ఉండటం వంటి విలువలను నేర్చుకున్నారని చెప్పారు. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు.సింగపూర్లోని స్నేహితులు తనకు పరిచయం చేసిన ఫార్ములా 1 పట్ల తనకున్న మక్కువ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇందులో ప్రతి మిల్లీ సెకన్ ఎంత ముఖ్యమైనదో మైఖేల్ షూమేకర్ వంటి వాళ్లను చూసి నేర్చుకున్నాను అని అన్నారు. ఫార్ములా 1 భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం గురించి మాట్లాడుతూ, ప్రపంచ క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం వల్ల అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని కరణ్ అదానీ అన్నారు.ఇదీ చదవండి: 'భారీ క్రాష్ మొదలైంది'.. కియోసాకి హెచ్చరిక!కరణ్ ఆదానీ తన వృత్తి ప్రయాణం గురించి మాట్లాడుతూ.. కాలేజీలో చదువు పూర్తయిపోయిన తరువాత.. పోర్టుల వ్యాపారంపై తనకు ఆసక్తి ఉందని తన తండ్రికి చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. అదే రాత్రి, నన్ను ముంద్రా పోర్టుకు పంపారు. నా మొదటి సంవత్సరం స్పెషల్ ఆఫీస్ & డెస్క్ లేకుండా నేలపై పని చేస్తూ గడిపాను. ఆ సమయంలోనే అనేక విభాగాలను సందర్శిస్తూ, అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, అనుభవం ద్వారా నేర్చుకున్నాను అని వెల్లడించారు. -
ఎంతో మందికి ఉపాధి! ఎవరీ రాజు పి.పుత్రన్?
వ్యక్తిగత ఎదుగుదలే పరమావధిగా భావించే ప్రస్తుత పోటీ ప్రపంచంలో తోటివారి కష్టాన్ని చూసి చలించి, వారి జీవితాల్లో వెలుగులు నింపే వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. అటువంటి వారిలో రాజు పి.పుత్రన్ ఒకరు. తన జీవితానుభవాలనే పాఠాలుగా మలుచుకుని ‘సరస్వతి ఫౌండేషన్’ ద్వారా వేలాది మందికి ఆశాదీపంగా నిలుస్తున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.కష్టాల నుంచి కమ్యూనిటీ లీడర్షిప్ఉడిపి జిల్లాలోని మంచల్ సమీపంలో షిర్వా గ్రామంలో జన్మించిన రాజు పి.పుత్రన్, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నలుగురు తోబుట్టువుల్లో అందరికంటే చిన్నవాడైన రాజు తన ప్రాథమిక విద్యను షిర్వాలోనే పూర్తి చేశారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముంబైకి వలస వెళ్లి అక్కడ మదర్ మేరీ నైట్ హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు విరామం ఇచ్చి అతిథ్య రంగంలో సాధారణ కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. హోటళ్లు, క్యాంటీన్ల నిర్వహణలో ఆయన పడిన కష్టం, నేర్చుకున్న పాఠాలే నేడు తనను ఒక సమర్థవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి.సేవే లక్ష్యంగా..తాను అనుభవించిన పేదరికం, కష్టం మరొకరు పడకూడదనే సంకల్పంతో 2012లో సరస్వతి ఫౌండేషన్ను స్థాపించారు. ఒక చిన్న ఆలోచనగా మొదలైన ఈ సంస్థ నేడు విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక సంక్షేమ రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకువస్తోంది. ‘సేవ అనేది కేవలం సహాయం కాదు, ఒక వ్యక్తిని గౌరవప్రదంగా బ్రతికేలా చేసే సాధనం’ అని రాజు పుత్రన్ చెబుతుంటారు.ప్రభావశీల కార్యక్రమాలుసరస్వతి ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజంలోని వివిధ వర్గాలకు అండగా నిలుస్తున్నాయి.విద్య - సాధికారత: ఓరియంట్ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యం కుదుర్చుకుని అర్హులైన విద్యార్థులకు ఫీజులో 50% రాయితీ కల్పిస్తున్నారు. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూనే పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే పోటీలను నిర్వహిస్తున్నారు.ఆరోగ్యం, వెల్నెస్: కేవలం వైద్య చికిత్సలకే పరిమితం కాకుండా యోగా, ఆరోగ్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య పునరావాస కేంద్రాలకు, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ఫౌండేషన్ అండగా ఉంటోంది.ఆర్థిక స్వాలంబన: కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నారు.సామాజిక బాధ్యత: వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల నిర్వహణతో పాటు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించడంలో ఈ సంస్థ ముందుంటోంది. ఆధ్యాత్మిక చింతనతో కూడిన సామాజిక ఐక్యత కోసం కొన్ని ఆలయాల పునరుద్ధరణ వంటి పనుల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.గమనిక: ఈ కథనం సరస్వతి ఫౌండేషన్ తరఫున సాక్షి.కామ్లో అందిస్తున్నాం. -
అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్) చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, డాలర్లలో జీతం పొందుతూ స్థిరపడొచ్చని భావించే భారతీయ విద్యార్థుల కలలకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాలు విసురుతున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న ఐటీ నిపుణులు అక్కడ ఉండలేక.. అక్కడి నుంచి రాలేక.. సతమతమవుతున్నారు. తాజాగా ఒక భారతీయ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అంశం నెట్టింట చర్చనీయాంశమైంది.అవమానకరమైన ఆఫర్కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక ఎంఎన్సీ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటర్న్గా పనిచేసిన ఒక భారతీయ నిపుణుడు తన ఆవేదనను రెడ్డిట్లో పంచుకున్నారు. అజూర్, ఎస్క్యూఎల్ వంటి కీలక టెక్నాలజీలపై పని చేసినప్పటికీ కంపెనీ ఇచ్చిన ఫుల్ టైం ఆఫర్ ఆ విద్యార్థిని విస్మయానికి గురిచేసింది.ప్రస్తుత ఇంటర్న్షిప్ స్టైపెండ్ కంటే గంటకు కేవలం మూడు డాలర్లు (సుమారు రూ.250) మాత్రమే పెంచుతామని కంపెనీ ప్రతిపాదించింది. సదరు కంపెనీ హెచ్1బీ వీసా స్పాన్సర్షిప్ ఇవ్వడానికి నిరాకరించింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ అభ్యర్థికి ‘బిజినెస్ ఆటోమేషన్ అనలిస్ట్’ అనే రోల్ను ఆఫర్ చేశారు. ఇది భవిష్యత్తులో కెరీర్ వృద్ధిని దెబ్బతీస్తుందని ఆ టెక్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంఎస్ డిగ్రీ ఉన్న వ్యక్తికి గంటకు మూడు డాలర్లు పెంచడం అంటే అది నైపుణ్యాన్ని అవమానించడమే. ఇక్కడ ఉండటం వృధా అనిపిస్తోంది. భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఉంది’ అని ఆ నిపుణుడు పేర్కొన్నారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్పై స్పందించిన నెటిజన్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్ చాలా దారుణంగా ఉంది. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారికే కాల్స్ రావడం లేదు. కాబట్టి చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవద్దు’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘జీతం కంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండటానికి ఉపాధి ముఖ్యం. ఉద్యోగాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని ఇంకొందరు చెబుతున్నారు. ‘స్వదేశానికి వెళ్లడం మంచిదే కానీ, అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉందని గుర్తించాలి. ఏదైనా ఆఫర్ చేతిలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం’ అని కొందరు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు -
బ్రెజిల్ కంపెనీతో.. దేశీ దిగ్గజం జట్టు!
భారత వైమానిక దళానికి సరఫరా చేసే సీ-390 మిలీనియం విమానాల మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎంఆర్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా బ్రెజిలియన్ సంస్థ ఎంబ్రేయర్తో దేశీ దిగ్గజం మహీంద్రా గ్రూప్ చేతులు కలిపింది. లోకలైజేషన్ వ్యూహంలో భాగంగా నెలకొల్పే ఈ కేంద్రంలో టెస్టింగ్, తనిఖీ, విడిభాగాల రిపేర్, శిక్షణ తదితర సర్వీసులన్నీ అందిస్తుందని ఎంబ్రేయర్, మహీంద్రా తెలిపాయి.ఎంబ్రేయర్కి చెందిన సీ-390 మిలీనియం మల్టీ-మిషన్ మిలిటరీ రవాణా విమానాలను భారత్లో తయారు చేసేందుకు ఇరు సంస్థలు గతేడాది అక్టోబర్లో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇతర మధ్యస్థాయి మిలిటరీ రవాణా విమానాలతో పోలిస్తే సీ-390 అత్యధిక వేగం, రేంజి, 26 టన్నుల వరకు పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. సరుకు, బలగాల రవాణా, సెర్చ్ ఆపరేషన్లు మొదలైన అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది. -
ప్రమోషన్ కావాలంటే.. ఐటీ కంపెనీ సంచలన నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్నవేళ.. యాక్సెంచర్ కంపెనీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉన్న సీనియర్ ఉద్యోగులకు.. ముఖ్యంగా అసోసియేట్ డైరెక్టర్లు & సీనియర్ మేనేజర్లు, పదోన్నతులు పొందాలంటే కంపెనీ రూపొందించిన ఏఐ టూల్స్ క్రమం తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించింది.ఏఐ ఎనేబుల్డ్ కంపెనీగా మారాలనే లక్ష్యంతో యాక్సెంచర్ సరికొత్త వ్యూహం రచించింది. కేవలం కస్టమర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులకు కూడా ఏఐ టెక్నాలజీని అందుబాటులో ఉంచి, దానిద్వారా.. పనితీరును & ఉత్పాదకతను పెంచడానికి సంస్థ సిద్ధమైంది. పోటీ ప్రపంచంలో మనం నిలబడాలంటే.. ప్రతి ఉద్యోగి ఏఐలో నైపుణ్యం పెంచుకోవాలని సీఈఓ జూలీ స్వీట్ పేర్కొన్నారు.యాక్సెంచర్ ప్రకటించిన ఈ కొత్త విధానం.. యూరప్లోని 12 దేశాలలో ఉన్న సిబ్బందికి & అమెరికా ప్రభుత్వ ఒప్పందాల విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మినహాయింపు. మిగిలిన అందరూ తప్పకుండా పాటించాల్సిందే. ఏఐ ఉపయోగించాల్సిందే. కంపెనీ 11,000 మంది ఉద్యోగులను తొలగించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది.మూడు నెలల్లో 11000 మంది!యాక్సెంచర్ కంపెనీ గత మూడు నెలల్లో 11,000 మందికిపైగా ఉద్యోగులను తగ్గించింది. ఏఐ కార్యాచరణకు సరిపోయేలా ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోకపోతే.. మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా కంపెనీ ఏఐలో స్థిరంగా నిలబడటానికి ప్రముఖ టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యం కూడా ఏర్పాటు చేసుకుంది.ఇదీ చదవండి: ఏమిటీ MANAV Vision: ప్రపంచానికి దిక్సూచిగా భారత్! -
సహజంగా ఉండి సమర్థంగా పని చేసేలా కొత్త ఉత్పత్తులు
ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక సైన్స్ను జోడిస్తూ ‘రిలీఫ్ వెల్నెస్’ తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. భారత వెల్నెస్ మార్కెట్లో మొదటి స్మాల్ మాలిక్యూల్ హెర్బల్ ఫార్మా బ్రాండ్గా ఇది రికార్డు సృష్టించినట్లు చెప్పింది. ఈ బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ముఖ్య అతిథిగా పాల్గొని కంపెనీ ఉత్పత్తులను ఆవిష్కరించారు.సుమారు 5,000 ఏళ్ల నాటి ఆయుర్వేద విజ్ఞానానికి, ప్రస్తుత ఫార్మాస్యూటికల్ టెక్నాలజీకి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా రీలీఫ్ వెల్నెస్ పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘కంపెనీ ఉత్పత్తుల్లో నానో సాంకేతికతను ఉపయోగించడం వల్ల సాధారణ హెర్బల్ ఉత్పత్తుల కంటే 20-30 రెట్లు వేగంగా శరీరంలోకి ఇంకుతాయి. కణాల స్థాయిలో పనిచేసే చిన్న అణువులతో కూడిన ఫార్ములేషన్లను భారత్లో తొలిసారిగా తీసుకొచ్చాం. ఇది అల్లోపతి మందుల తరహాలోనే వేగవంతమైన ఫలితాలను అందిస్తుంది’ అని కంపెనీ చెప్పింది.పరిశోధనలే పునాదిగా..రిలీఫ్ వెల్నెస్ వ్యవస్థాపకుడు మిస్టర్ డోలేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ పరిశోధనలతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాం. ఆయుర్వేద మూలికల శక్తిని ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వేగంతో అందించడమే మా లక్ష్యం’ అని చెప్పారు. బ్రాండ్ సీఈఓ తరుణ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ‘కెమికల్స్తో కూడిన మందులకు ప్రత్యామ్నాయంగా, సహజంగా ఉండి సమర్థంగా పనిచేసే మందులు కావాలనేవారికి రిలీఫ్ వెల్నెస్ బెటర్ చాయిస్’ అన్నారు.ఈ సందర్భంగా నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘దేశ ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో అనుసంధానం చేసిన విధానం ఆకట్టుకుంది. వెల్నెస్ రంగంలో పరిశోధనల ఆధారిత ఉత్పత్తులు రావడం అభినందనీయం’ అన్నారు. ఈ సంస్థ భారత్లోని ప్రముఖ లైఫ్ సైన్సెస్ హబ్ సీ-క్యాంప్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
రూ. 2.01 లక్షల కోట్లకు ప్రకటన ఆదాయాలు
ముంబై: దేశీయంగా అడ్వర్టైజింగ్ మార్కెట్ 2026లో రూ. 2,01,891 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డబ్ల్యూపీపీ మీడియా వెల్లడించింది. 2025తో పోలిస్తే రూ. 17,844 కోట్లు అధికంగా, 9.7 శాతం మేర వృద్ధి చెందవచ్చని దిస్ ఇయర్ నెక్ట్స్ ఇయర్ నివేదికలో పేర్కొంది. ఇందులో డిజిటల్ వాటా 68.1 శాతంగా ఉండనుందని డబ్ల్యూపీపీ మీడియా దక్షిణాసియా సీఈవో ప్రశాంత్ కుమార్ తెలిపారు. కృత్రిమ మేధ, వాణిజ్యం, గోప్యత కలిసి, వినియోగదారులతో ప్రకటనకర్తల బంధాన్ని సరికొత్తగా నిర్వచిస్తున్నాయని వివరించారు. నివేదిక ప్రకారం డీఏవీపీ ధరల పెంపుతో ప్రింట్ మాధ్యమంలో ప్రకటనల ఆదాయాలు 4.4%, టీవీ 3.1%, ఆడియో 1.5% వృద్ధి చెందనున్నాయి. టాప్ 10 గ్లోబల్ అడ్వర్టైజింగ్ మార్కెట్లలో భారత్ ఒకటన్నారు. -
ఓపెన్ ఏఐ ఇన్ఫ్రాకు టీసీ‘ఎస్’
న్యూఢిల్లీ: ఐటీ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ తాజాగా ఓపెన్ ఏఐతో చేతులు కలిపింది. తద్వారా దేశీయంగా 100 మెగావాట్ల ఏఐ మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) కల్పనకు తెరతీయనుంది. ఇన్ఫ్రా సామర్థ్యాన్ని ఒక గిగావాట్వరకూ పెంచుకునేందుకు వీలుంది. కొన్నేళ్లపాటు అమల్లోఉండే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. తద్వారా ఎంటర్ప్రైజ్ ఏఐ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేయనున్నట్లు తెలియజేశాయి. ఒప్పందంలో భాగంగా టీసీఎస్కు చెందిన హైపర్వాల్ట్ యూనిట్.. ఏఐ రెడీ, గ్రీన్ ఎనర్జీ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయనుంది. ఇది తదుపరి తరం ఏఐ వర్క్లోడ్స్కు మద్దతుగా నిలవనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. రెండు సంస్థల మధ్య సహకారం నేపథ్యంలో ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్కు దన్నుగా టాటా గ్రూప్ ఉద్యోగులకు ఎంటర్ప్రైజ్ చాట్జీపీటీ అందుబాటులోకి వస్తుంది. దేశీయంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో భాగంగా టీసీఎస్ తాజా భాగస్వామ్యాన్ని ప్రకటించింది. -
పాకెట్ ఎఫ్ఎం లక్ష్యం ఇదే!
ఈ ఏడాది (2026) ఆఖరు నాటికి 10 లక్షల క్రియేటర్ల స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆడియో సిరీస్ ప్లాట్ఫాం పాకెట్ ఎఫ్ఎం వెల్లడించింది. గత ఏడాది వ్యవధిలో 3 లక్షల మంది పైగా క్రియేటర్లు తమ తొలి స్టోరీలను ఈ ప్లాట్ఫాం మీద పబ్లిష్ చేసినట్లు వివరించింది. దీనితో తమ క్రియేటర్ ఎకానమీ విలువ రూ. 300 కోట్లు దాటిందని, 2026 ఆఖరు నాటికి ఇది మూడు రెట్లు పెరిగి రూ. 1,000 కోట్లకు చేరుతుందమే అంచనాలు ఉన్నట్లు పాకెట్ ఎఫ్ఎం పేర్కొంది.2025 నాటి కంపెనీ డేటా ప్రకారం టాప్ 10 శాతం మానిటైజ్డ్ క్రియేటర్లు 2025లో సంయుక్తంగా రూ. 50 కోట్లు ఆర్జించారు. టాప్ 1 శాతంలోని వారు ఏటా రూ. 50 లక్షలు పొందగా, 20 శాతం మంది పైగా క్రియేటర్లు నెలకు రూ. 1 లక్ష పైగా అందుకుంటున్నారు. తమ ఏఐ ఉత్పత్తుల శ్రేణితో కంటెంట్ క్రియేషన్కి పట్టే సమయం 90 శాతం పైగా తగ్గిందని పాకెట్ ఎఫ్ఎం తెలిపింది. -
పీఎఫ్పై లోన్ తీసుకోవచ్చా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. ఇందులో ప్రతి నెలా భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తం జమ అవుతూ ఉంటుంది. సాధారంగా ఈ మొత్తాన్ని రిటైర్మెంట్ తరువాత ఉపయోగించుకోవాలి. కానీ ఉద్యోగికి అత్యవసర సమయంలో.. డబ్బు అందించడానికి ఈపీఎఫ్ఓ కొన్ని ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేసింది. దీని ద్వారా కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇందులో లోన్ తీసుకోవచ్చా? అని కొందరికి సందేహం కలుగవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.నిజానికి ఈపీఎఫ్ఓ నుంచి లోన్ తీసుకోలేరు. అయితే మీ ఖాతాలో ఉన్న మొత్తంలో కొంత అడ్వాన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఎక్కడైనా లోన్ తీసుకుంటే.. దాన్ని తిరిగి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కానీ పీఎఫ్ విత్డ్రా చేసుకుంటే మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.ఇల్లు కొనుగోలు చేయడం, పెళ్లి చేసుకోవడానికి, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈపీఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ఎంత శాతం తీసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. అయితే ఖాతాలో ఉన్న మొత్తం తీసుకోలేరు. దీనిని గుర్తుంచుకోవాలి.యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రాఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందాదారులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. ఇప్పటికే కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ సదుపాయం 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది.ఇదీ చదవండి: బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?ప్రస్తుతం ఉద్యోగులు పీఎఫ్ విత్డ్రా చేసుకోవడానికి క్లెయిమ్ ఫారమ్స్ సమర్పించి రోజులు తరబడి వేచి చూడాలి. అయితే ఈ విధానానికి మంగళం పాడటానికి కేంద్రం సన్నద్ధమైంది. కొత్త విధానంలో.. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా నిమిషాల్లో పీఎఫ్ డబ్బును ఉపయోగించుకోవచ్చు. -
జియోహాట్స్టార్లో వాయిస్ స్ట్రీమింగ్
దశాబ్ద కాలంగా డిజిటల్ వినోదం అంటే.. కేవలం బ్రౌజ్ చేయడం, క్లిక్ చేయడం, అందులోని కంటెంట్ను వీక్షించడం మాత్రమే. కానీ ప్రస్తుతం ఆ పద్ధతి మారుతోంది. భారతదేశపు అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ జియోహాట్స్టార్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ చేతులు కలిపాయి. చాట్జీపీటీ వాయిస్ అసిస్టెంట్(మల్టీలింగువల్ కాగ్నిటివ్ సెర్చ్)తో వినోదాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ, సంభాషణల ద్వారా కంటెంట్ను వెతికే వినూత్న సదుపాయాన్ని ప్రారంభించాయి.ఇకపై యూజర్లు మెనూల్లో వెతకడం లేదా కీవర్డ్స్తో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చూడాలి? అనే తడబాటు లేకుండా కేవలం సహజమైన భాషలో మాట్లాడితే చాలు. ఓపెన్ఏఐ ఏపీఐలను ఉపయోగించి పనిచేసే ఈ వాయిస్ ఇంటర్ఫేస్ మీరు చెప్పే మూడ్, సందర్భం, భాషను అర్థం చేసుకుని కచ్చితమైన సలహాలను ఇస్తుంది.ఉదాహరణకు ‘మా అమ్మనాన్నలు వస్తున్నారు, మేమంతా కలిసి చూడగలిగే సినిమా ఏదైనా సూచించు’ లేదా ‘మేము కవలలం, కవలల మీద వచ్చిన సినిమాలే మాకు కావాలి’ అని మనం అడగవచ్చు. ఇలాంటి సంక్లిష్టమైన, సాంస్కృతిక అంశాలతో కూడిన ప్రశ్నలను కూడా ఈ ఏఐ చాట్బాట్ సులభంగా అర్థం చేసుకొని అందుకు తగిన కంటెంట్ను మీ ముందు ఉంచుతుంది.కేవలం సినిమాలు, సిరీస్లు మాత్రమే కాకుండా లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు కూడా ఈ అసిస్టెంట్ సహాయపడుతుంది. స్కోర్లు, ప్లేయర్ హైలైట్స్, కీలక అంశాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం కేవలం జియోహాట్స్టార్ యాప్కే పరిమితం కాకుండా, నేరుగా చాట్జీపీటీ యాప్లో ఎవరైనా వినోదం గురించి సెర్చ్ చేసినప్పుడు జియోహాట్స్టార్లోని కంటెంట్కు సంబంధించిన లింక్లు అక్కడ కూడా కనిపిస్తాయి. -
పశు వికాస్ దినోత్సవం: వేలాది పశువులకు ఆరోగ్య సంరక్షణ!
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ NBFCలలో ఒకటైన SMFG ఇండియా క్రెడిట్, దాని ప్రధాన పశువుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం అయిన పశు వికాస్ దినోత్సవం (పీవీడి) 8వ ఎడిషన్ను విజయవంతంగా నిర్వహించింది. 'సర్వోత్తమ సేవ: పశు, పరివార్ ఔర్ ప్రగతి' అనే ఇతివృత్తంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం.. పశువుల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు & స్థిరమైన పురోగతిని బలోపేతం చేయడం ద్వారా సమగ్ర గ్రామీణ అభివృద్ధికి సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటించింది.2014లో ప్రారంభించిన పశు వికాస్ దినోత్సవం, ఉచిత పశువైద్య సేవలు & నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించడం ద్వారా పశువుల యజమానుల కీలకమైన ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీరుస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా.. ఈ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద ఒకరోజు పశువుల సంక్షేమ కార్యక్రమాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది.SMFG ఇండియా క్రెడిట్.. 1.55 లక్షలకు పైగా జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసింది. వీటిలో సుమారు 1.4 లక్షల పశువులకు చికిత్స & 14,000 మందికి పైగా వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణ సహాయం అందించింది. 30,000 కంటే ఎక్కువ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయి. ఈ కార్యక్రమం 16 రాష్ట్రాలలో, 510 SMFG గ్రామశక్తి శాఖలలో నిర్వహించబడింది, ఇది గ్రామీణ భారతదేశంలో కంపెనీ లోతైన విస్తరణను నొక్కి చెబుతుంది.ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో.. పశు వికాస్ దినోత్సవం 47 ప్రదేశాలలో నిర్వహించారు. మొత్తంమీద 8,350కి పైగా పశువులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించింది. 2,300 కంటే ఎక్కువ గృహాలకు ప్రయోజనం చేకూర్చింది. -
అదానీ గ్రూప్ అతి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన ఆధారిత హైపర్స్కేల్ ఏఐ రెడీ డేటా సెంటర్ల ఏర్పాటుకు 2035కల్లా 100 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. దీంతో సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్ఫామ్స్, సపోర్టింగ్ పరిశ్రమల ద్వారా మరో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా 250 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు వీలు కలగనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలియజేసింది. అదానీ గ్రూప్ (Adani Group) ఈ ప్రాజెక్ట్ను దశలవారీగా అమలు చేయాలని యోచిస్తోంది. దేశవ్యాప్తంగా అధిక విద్యుత్ వినియోగ సామర్థ్యం, ఫైబర్ కనెక్టివిటీ, భూసౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలను గుర్తించి హైపర్స్కేల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర, వాయు విద్యుత్ ప్లాంట్లతో నేరుగా అనుసంధానం చేసి గ్రీన్ ఎనర్జీ ఆధారిత డేటా సెంటర్లుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేయగల డిజిటల్ మౌలిక సదుపాయాలను దేశంలోనే సృష్టించడం సాధ్యమవుతుందని సంస్థ పేర్కొంది.ఈ విస్తరణ ప్రణాళికలో భాగంగా అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) ఆధ్వర్యంలో సర్వర్ తయారీ యూనిట్లు, క్లౌడ్ సర్వీసులు, డేటా స్టోరేజ్ సొల్యూషన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే ఐటీ, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ, ఇంజినీరింగ్ రంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించబడటంతో పాటు, భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
స్నాప్డీల్కు జరిమానా.. ఎందుకో తెలుసా?
ఆన్లైన్లో నాణ్యతా ప్రమాణాలు లేని, ప్రమాదకరమైన బొమ్మలను విక్రయిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘స్పాప్డీల్’ (ఏస్ విక్టర్ లిమిటెడ్)పై కేంద్రం కొరడా ఝుళిపించింది. బీఐఎస్ ప్రమాణాలు లేని నాసిరకం బొమ్మలను అమ్మినందుకు గాను కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. రూ. 5 లక్షల జరిమానా విధించింది.వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తూ, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సోమవారం సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే, కమిషనర్ అనుపమ్ మిశ్రా నేతృత్వంలో జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.విచారణలో వెలుగుచూసిన లోపాలు ఇవే.. 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘టాయ్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్ 2020’ను స్నాప్డీల్ ఉల్లంఘించినట్లు సీసీపీఏ సుమోటోగా గుర్తించింది. అథారిటీ జరిపిన సమగ్ర విచారణలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. యాప్ నుంచి తొలగించామని చెబుతున్నప్పటికీ.. 2025 డిసెంబర్ వరకు నాసిరకం బొమ్మలు ప్లాట్ఫామ్పై అందుబాటులోనే ఉన్నాయి.విక్రయిస్తున్న చాలా బొమ్మల వివరాల్లో తయారీదారుల పేరు, చిరునామా, బీఐఎస్ నెంబర్ వంటి కనీస సమాచారం లేదు. స్టాలిన్ ట్రేడింగ్ కంపెనీ, త్రిఫ్ట్ కార్ట్ అనే రెండు విక్రయ సంస్థల ద్వారా ఈ నాసిరకం బొమ్మలను అమ్మించి స్నాప్డీల్ రూ.41,032 మేర కమీషన్ ఫీజులు పొందింది. అమ్మకం దారులు ఇచి్చన సమాచారాన్ని విశ్వసిస్తూ.. ఎలాంటి తనిఖీలు చేయలేదు.సీసీపీఏ జారీ చేసిన తాజా ఆదేశాలు..వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం జరిమానాతో పాటు స్నాప్డీల్కు సీసీపీఏ పలు కఠిన ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఎలాంటి నాన్–బీఐఎస్ బొమ్మలను తమ ప్లాట్ఫామ్లో ప్రదర్శించబోమని, విక్రయించబోమని హామీ ఇవ్వాలి. వినియోగదారులు ఫిర్యాదులు చేసేందుకు వీలుగా గ్రీవెన్స్ ఆఫీసర్ వివరాలు, సంప్రదించాల్సిన నంబర్లు, ఈమెయిల్ ఐడీలను వెబ్సైట్లో స్పష్టంగా, ప్రముఖంగా ప్రదర్శించాలని స్పష్టం చేసింది. సురక్షితమైన డిజిటల్ మార్కెట్ను అందించేందుకు నిరంతరం పనిచేస్తామని సీసీపీఏ పునరుద్ఘాటించింది.స్నాప్డీల్ వాదనను తోసిపుచ్చిన సీసీపీఏ..తాము కేవలం షాపింగ్ మాల్ తరహాలో ఒక ‘ఆన్లైన్ మార్కెట్ప్లేస్‘ మాత్రమేనని, అందులో అమ్మే వస్తువుల నాణ్యతకు తమకు సంబంధం లేదని స్నాప్డీల్ వాదించింది. అయితే, ఈ వాదనను సీసీపీఏ తీవ్రంగా తోసిపుచ్చింది. ‘తూఫాన్ సేల్‘ వంటి ప్రమోషనల్ ఈవెంట్లను నిర్వహించడం, నాసిరకం వస్తువులకు ‘గ్రేట్ క్వాలిటీ‘ అంటూ ట్యాగ్లు ఇవ్వడం, డెలివరీలు, రిఫండ్లను నియంత్రిస్తున్నందున ఆ వాదన చెల్లదని స్పష్టం చేసింది. కొనుగోలుదారులకు చేరే వస్తువుల నాణ్యత, భద్రత విషయంలో ప్లాట్ఫామ్లదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పింది. -
బ్యాంక్ లాకర్లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?
ఢిల్లీలోని కీర్తి నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్లో ఒక మహిళ & ఆమె అత్త బ్యాంకు లాకర్లో ఉంచిన బంగారు ఆభరణాలు పోయాయని ఆరోపించడంతో, కస్టమర్లలో భయాందోళనలు చెలరేగాయి. దొంగతనం జరిగిందనే పుకార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగింది అనేది కేవలం పుకారు మాత్రమే అని పోలీసులు వెల్లడించారు.ఈ తరుణంలో.. బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెబుతున్నాయి? అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.ఇంట్లో రక్షణ ఉండదని చాలామంది తమ వద్ద ఉన్న బంగారం, ఇతర ఖరీదైన డాక్యుమెంట్స్ వంటివి బ్యాంక్ లాకర్లో దాచుకుంటారు. ఒకవేళా బ్యాంక్ లాకర్లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఆ బ్యాంకు బాధ్యత వహించదు. ఎందుకంటే.. బ్యాంకులు తమ వస్తువులను భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం అందిస్తాయి. ఆ లాకర్లో ఏమి ఉంచారనే దానికి సంబంధించిన రికార్డ్ కూడా బ్యాంకు దగ్గర ఉండదు.రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. బ్యాంకు సరైన భద్రత కల్పించని పక్షంలో (సీసీ టీవీ పనిచేయకపోవడం, సిబ్బంది తప్పిదం, బ్యాంకు ఉద్యోగుల మోసం) నష్టపరిహారం పొందుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీరు కోల్పోయిన మొత్తం నష్టపరిహారంగా వస్తుందనుకోవడం పొరపాటే.2022 ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ తప్పిదం వల్ల నష్టం జరిగితే.. లాకర్ అద్దెకు 100 రెట్లు పరిహారం లభిస్తుంది. అంటే లాకర్ అద్దె ఏడాదికి 5000 రూపాయలు ఉంటే.. రూ. 5 లక్షలు పరిహారం లభిస్తుందన్న మాట. లాకర్లో కోట్ల విలువైన వస్తువులున్నా అదే ఫార్ములా ప్రకారం నష్టపరిహారం లభిస్తుంది. ఒకవేళా ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగితే ఎలాంటి నష్టపరిహారం లభించదు. అటువంటి పరిస్థితులలో బ్యాంకులు ఎటువంటి బాధ్యత వహించవు.లాకర్ ఉపయోగించేవారు తెలుసుకోవాల్సిన విషయాలుబ్యాంక్ లాకర్లో వస్తువులను దాచుకోవాలనుకునేవారు.. లాకర్ అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్లో ఏ వస్తువులు ఉంచారో.. వాటికి సంబంధించిన ఫోటోలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఖరీదైన వస్తువులకు తప్పకుండా బీమా చేయించుకోవాలి. నష్టం జరిగిన వెంటనే బ్యాంకుకు, పోలీసులకు సమాచారం అందించాలి. -
అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే..
సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అభిషేక్ బచ్చన్ ఇప్పుడు వ్యాపార, పెట్టుబడి విభాగంలోనూ వ్యూహాత్మకంగా ఎదుగుతున్నారు. కేవలం లాభాల కోసమో లేదా బ్రాండ్ విలువ కోసమో కాకుండా తాను స్వయంగా వాడే వస్తువులపైనే పెట్టుబడి పెట్టడం ఆయన ప్రత్యేకత. ఇటీవల జరిగిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026’లో పాల్గొన్న అభిషేక్ తన పెట్టుబడి ప్రయాణం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తండ్రి బాటలో రియల్ ఎస్టేట్..పెట్టుబడుల విషయంలో తన తండ్రి అమితాబ్ బచ్చన్ ప్రభావం తనపై ఎంతో ఉందని అభిషేక్ అంగీకరించారు. ‘జమీన్ హై తో సబ్ టీక్ హై’ (నేల బాగుంటే అంతా బాగున్నట్లే) అనే నమ్మకాన్నే తాను కూడా అనుసరిస్తున్నట్లు తెలిపారు. స్క్వేర్ యార్డ్స్ డేటా ప్రకారం ముంబై అంతటా అభిషేక్, ఆయన కుటుంబం సుమారు రూ.219 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు అంచనా. సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని ఎంచుకున్న అభిషేక్ తన భార్య ఐశ్వర్య రాయ్ కోసం వెండిలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సరదాగా వ్యాఖ్యానించారు.అభిషేక్ బచ్చన్ పెట్టుబడి సూత్రం చాలా సరళం. తాను సదరు వస్తువులను వాడితేనే పెట్టుబడి పెడతానని చెప్పారు. 2019లో ప్రారంభమైన ‘నాగిన్ హాట్ సాస్’ బ్రాండ్ను అభిషేక్ స్వయంగా రుచి చూసి, తనకు నచ్చడంతో కంపెనీని సంప్రదించి వ్యూహాత్మక భాగస్వామిగా మారారు. థానేలోని ప్రసిద్ధ ‘మామ్లేదార్ మిసాల్’(వంటకం) పట్ల తనకున్న మక్కువతో రోజూ స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసేవారు. ‘నేను మీ సర్వీసుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాను. మీ కంపెనీలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి’ అని సరదాగా అడిగి అందులోనూ పెట్టుబడి పెట్టినట్లు ఆయన వివరించారు. ఇదే క్రమంలో జెప్టో వంటి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో కూడా ఆయన పెట్టుబడులు కొనసాగుతున్నాయి.బ్రాండ్ ఎండార్స్మెంట్నేటి కాలంలో సెలబ్రిటీలు ఏదో ఒక బ్రాండ్ను ప్రమోట్ చేయడం సర్వసాధారణం. కానీ అభిషేక్ మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ‘నేను స్వయంగా ఉపయోగించని ఉత్పత్తిని ప్రజలకు అమ్మడం నాకు మోసపూరితంగా అనిపిస్తుంది. అందుకే నేను 20 ఏళ్లుగా ఒమేగా వాచ్నే ధరిస్తున్నాను. ఫోర్డ్ బ్రాండ్తో పనిచేసినప్పుడు ఫోర్డ్ కారునే నడిపాను. ఇప్పటికీ నా దగ్గర ఐడియా మొబైల్ నంబర్, అమెక్స్ క్రెడిట్ కార్డ్, మోటరోలా ఫోన్ ఉన్నాయి’ అని చెప్పారు.స్పోర్ట్స్ వెంచర్స్, ఇతర పెట్టుబడులుకేవలం టెక్, ఎఫ్ఎంసీజీ రంగాలు మాత్రమే కాకుండా క్రీడారంగంలోనూ అభిషేక్ పెట్టుబడులున్నాయి. ప్రో కబడ్డీ లీగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు యజమానిగా వ్యవహరిస్తున్నారు. చెన్నైయిన్ ఎఫ్సీ.. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ క్లబ్లో సహ యజమానిగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్తో కలిసి వహ్దమ్ టీ గ్లోబల్ బ్రాండ్కు మద్దతునిస్తున్నారు.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు.. -
ఐటీపై ఇన్వెస్టర్ల ఆందోళన అర్థరహితం
ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతున్న ఆందోళన ‘అర్ధరహిత’మైనదిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు. కృత్రిమ మేథ మరింతగా విస్తరించడంలో పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, డేటా స్క్రబ్బింగ్లాంటివి ఇందుకు ఉదాహరణలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు.ఆంథ్రోపిక్లాంటి కంపెనీలు వినూత్న ఏఐ ప్లాట్ఫాంలను ప్రవేశపెడుతుండటంతో ఐటీ కంపెనీల షేర్లు గత కొద్ది రోజులుగా క్షీణించిన నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొన్నాళ్లుగా వివిధ దేశాలు, యూరోపియన్ యూనియన్లాంటి కూటములతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, అమెరికాను కూడా కలిపితే తొమ్మిది డీల్స్ అవుతాయని గోయల్ చెప్పారు.అమెరికాతో ఒప్పందంలో రైతులు, చిన్న సంస్థల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు ఉన్నాయన్నారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
కార్పొరేట్ల గ్రీన్గేమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, సానుకూల ప్రభావం చూపుతున్న 50 దేశీ కంపెనీల్లో హిందుస్తాన్ యూనిలీవర్ అగ్రస్థానంలో నిలి్చంది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ మూడో స్థానంలో నిల్చాయి. పర్పెచ్యువల్ క్యాపిటల్, హురున్ ఇండియా 50 జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా దిగ్గజాలు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్ కూడా లిస్టులో చోటు దక్కించుకున్నాయి. ఎస్డీజీ లక్ష్యాలకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా 150 కంపెనీలను వడబోసి ఈ జాబితాను రూపొందించినట్లు హురున్ ఇండియా ఫౌండర్ అనాస్ రెహా్మన్ జునైద్ గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. కంపెనీలు ఈ లక్ష్యాలను నివేదికలకు పరిమితం చేయకుండా, వ్యాపార వ్యూహాల్లో భాగంగా మార్చుకుంటున్నాయని వివరించారు. వినియోగ, వాణిజ్య, సామాజిక రంగాలపై అర్థవంతమైన ప్రభావం చూపే సంస్థలకు తాము తోడ్పాటు అందిస్తున్నామని పర్పెచ్యువల్ క్యాపిటల్ పార్ట్నర్స్ ప్రణవ్ ప్రశాంత్, అన్విత ప్రశాంత్ వివరించారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → ఎస్డీజీ లక్ష్యాల సాధన దిశగా కృషి చేస్తున్న కంపెనీల సంఖ్యకు సంబంధించి 26 సంస్థలతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, పుణే, అహ్మదాబాద్ తదుపరి రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ళీ మెటల్స్, మైనింగ్ రంగం నుంచి అత్యధికంగా 7 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్, ఎనర్జీ, కన్జూమర్ గూడ్స్ రంగాల నుంచి తలో మూడు కంపెనీలు ఉన్నాయి. → హిందుస్తాన్ యూనిలీవర్ 97 శాతం పునరుత్పాదక విద్యుత్ని వినియోగిస్తోంది. ళీ పర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఇప్పటికే తటస్థ ఉద్గార స్థాయిని సాధించగా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ తదితర అయిదు దిగ్గజ కంపెనీలు ఇందుకోసం 2030ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. → కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యకలాపాలపై జాబితాలోని కంపెనీలు రూ. 8,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయగా, 20 కోట్ల మందికి పైగా లబ్ధి చేకూరింది. పర్యావరణ పరిరక్షణపరమైన చర్యలకు కంపెనీలు (48 సంస్థలు) అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. → లిస్టులోని 50 కంపెనీల మొత్తం ఆదాయం రూ. 48.5 లక్షల కోట్లుగా, లాభం రూ. 4.95 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 10.7 లక్షల కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. -
30 ఏళ్ల కృషి, ఉద్యోగులకు రూ. 20 కోట్ల లగ్జరీ కార్లు
కార్పొరేట్ కంపెనీలు భారీ బహుమతులతో ఉద్యోగులను సర్ప్రైజ్ చేస్తుంటాయి. భారీగా నగదు, కార్లు, ఇళ్లు లాంటి కానుకలతో వార్తల్లో నిలుస్తాయి. తాజాగా తన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తన ఉద్యోగులకు రూ. 20 కోట్ల విలువైన 47 కార్లను బహుమతిగా ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.కోజికోడ్కు చెందిన కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సిబ్బందికి భారీ బహుమతులలిచ్చి వార్షికోత్సవ సంబరాలకు మరింత వన్నె తీసుకొచ్చింది. గత మూడు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో సిబ్బంది చేసిన కృషికి గుర్తింపుగా రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లు అందించినట్టు కంపెనీ ప్రకటించింది.బిజినెస్లైన్ నివేదిక ప్రకారం ఈ కార్లలో ప్రీమియ , ప్రసిద్ధ మోడళ్ల కార్లున్నాయి. ముఖ్యంగా రేంజ్ రోవర్లు, ఆడి క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లు ఉండటం విశేషం. ఈ జాబితాలో టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ మోడళ్లు, ఇతర కార్లతో పాటు ఉన్నాయి. భారీ భవిష్యత్ ప్రణాళికలుహైలైట్ గ్రూప్ ఛైర్మన్ పి.సులైమాన్ ఈ సందర్బంగా భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో పది మాల్స్ అభివృద్ధిలో ఉన్నాయని తెలిపారు. దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ 2030 నాటికి సంస్థను విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సులైమాన్ వెల్లడించారు.హైలైట్ గ్రూప్ విస్తరణహైలైట్ గ్రూప్ 1996లో కోజికోడ్లోస్థాపించబడింది. రిటైల్ అండ్ కమర్షియల్ వాణిజ్య అభివృద్ధితో ప్రారంభమై, నివాస, ఐటీ, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులుగా విస్తరించింది. మూడు దశాబ్దాల ప్రయాణంలో హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా నిలిచింది. తరువాత కంపెనీ కోజికోడ్లో హైలైట్ మాల్, త్రిస్సూర్లోని హైలైట్ మాల్ను అభివృద్ధి చేసింది. క్రమంగా అంతర్జాతీయ వ్యాపారాలు,భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో కోజికోడ్లో 12.5 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వేసిన పెట్టుబడి సుమారు 680 మిలియన్ డాలర్లు (రూ. 623.06 కోట్లు) ఇదీ చదవండి: బ్లింకిట్కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులుఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే! -
లోకల్తో పోటీకి బ్రిటానియా రెడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిన్న సంస్థలతో పోటీ పడేందుకు బ్రిటానియా ఇండస్ట్రీస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చిన్న సంస్థలతో పోటీపడేందుకు స్టార్టప్ స్వభావంతో బ్రిటానియా వ్యవహరిస్తుందని.. ఈ–కామర్స్ విభాగంలో బిస్కెట్లు, రస్క్, కేక్, వేఫర్ల విభాగాల్లో మరింత బలంగా అవతరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో రక్షిత్ హర్గవే తెలిపారు.‘‘ప్రాంతీయ పోటీని ఎదుర్కొంటాం. ఈ–కామర్స్లో విస్తరణపై పెట్టుబడులు పెడతాం. అమ్మకాలు పెంచుకునేందుకు మాకు తగినన్ని అవకాశాలున్నాయని భావిస్తున్నాం’’అని వాటాదారులతో నిర్వహించిన కాల్లో భాగంగా చెప్పారు. విక్రయాలు పెంచుకునేందుకు మరింత మంది వినియోగదారులను చేరుకోవడం కీలకమని పేర్కొన్నారు. గుడ్డే, టైగర్, నూట్రిచాయిస్, మ్యారీగోల్డ్ తదితర పాపులర్ బ్రాండ్లు బ్రిటానియా ఇండస్ట్రీస్ సొంతం. చిన్న కంపెనీలను ప్రాంతీయ పోటీదారులుగానే చూస్తామంటూ.. కేవలం తూర్పునే కాకుండా దేశవ్యాప్తంగా చిన్న సంస్థల నుంచి వస్తున్న పోటీని సవాలుగా పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం వల్లే.. ద్రవ్యోల్బణం, ధరలు పెంచడంలో జాప్యం లోగడ మార్జిన్లపై ప్రభావం చూపించిందని, కమోడిటీ ధరలు దిగిరావడతో కంపెనీ లాభదాయకత మెరుగుపడినట్టు రక్షిత్ హర్గవే చెప్పారు. కీలకమైన ముడి పదార్థాలు, పాలు గోధుమల ధరలు స్థిరంగానే ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలన్నారు. చెక్కెర, కోకోవా ధరలు స్థిరంగా ఉండొచ్చన్నారు. కొనుగోళ్లకూ సై.. విస్తృతమైన పోర్ట్ఫోలియో నిర్మాణం దిశగా అవసరమైతే కొనుగోళ్ల అవకాశాలనూ బ్రిటానియా ఇండస్ట్రీస్ పరిశీలిస్తుందని చెప్పారు. అన్నీ సొంతంగానే నిర్మించుకోవడం సాధ్యం కాదన్నారు. చిన్న సంస్థలు ప్రాంతీయంగా అక్కడి ప్రజల ఇష్టాలు, అభిరుచులను మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలవని, అవి వాటి బలమని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విపిన్ కటారియా తెలిపారు. వాటితో పోటీపడేందుకు బ్రాండ్ నిర్మాణంపై పెట్టుబడులు పెడుతున్నట్టు వాటాదారుల సమావేశంలో చెప్పారు. -
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో హెచ్యూఎల్ టాప్
భారతదేశ కార్పొరేట్ దిగ్గజాలు కేవలం లాభాల ఆర్జనే ధ్యేయంగా కాకుండా సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ‘పెర్పెచువల్ క్యాపిటల్ హురున్ ఇండియా ఇంపాక్ట్ 50 - 2026’ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోని టాప్ 50 కంపెనీలు గడిచిన ఏడాదిలో ఏకంగా రూ.8,000 కోట్లను సామాజిక సేవా కార్యక్రమాల కోసం వెచ్చించాయి. ఈ కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగా ప్రజలు లబ్ధి పొందడం విశేషం.అగ్రస్థానంలో హిందుస్థాన్ యూనిలీవర్సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సాధనలో హిందుస్థాన్ యూనిలీవర్ 53.9 పాయింట్లతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ, మెరుగైన ఆర్థిక వ్యవస్థ, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో హెచ్యూఎల్ ప్రదర్శించిన సమతుల్య పనితీరు ఈ ఘనతకు కారణమైంది.టాప్ 5 కంపెనీల వివరాలుర్యాంక్కంపెనీస్కోరు (పాయింట్లు)కీలక అంశం1హిందుస్థాన్ యూనిలీవర్53.9సమతుల్య ఎస్డీజీ పనితీరు2హెచ్సీఎల్ టెక్నాలజీస్53.8అత్యధిక మహిళా శ్రామిక శక్తి (67,217 మంది)3గ్రాసిమ్ ఇండస్ట్రీస్52.6సుస్థిర పారిశ్రామిక విధానాలు4టాటా మోటార్స్51.8గ్రీన్ మొబిలిటీ5డాబర్ ఇండియా50.3బాధ్యతాయుతమైన వినియోగం సాంకేతిక రంగంలో మహిళా సాధికారతఈ జాబితాలో 53.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రగతిని కనబరిచింది. భారత సాంకేతిక రంగంలోనే అత్యధికంగా 67,217 మంది మహిళలకు ఉపాధి కల్పించి మహిళా సాధికారతలో ఆదర్శంగా నిలిచింది. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాల తగ్గింపు, శక్తి-సమర్థవంతమైన డిజిటల్ సొల్యూషన్ల విస్తరణలో ఈ సంస్థ ముందుంది.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంకార్పొరేట్ సంస్థలు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నాయి.జాబితాలోని 50 కంపెనీలలో 48 సంస్థలు పర్యావరణ లక్ష్యాలను నిర్ణీత కాలపరిమితిలోగా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.40 కంపెనీలు ఉత్పత్తి, వినియోగంలో పారదర్శకతను పాటిస్తున్నాయి.30 కంపెనీలు స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు అడుగులు వేస్తున్నాయి.ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 50 కంపెనీలు కలిసి మొత్తం రూ.48.5 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం గమనార్హం. తమ భారీ ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం ఖర్చు చేస్తూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా మారుతున్నాయి.కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)సీఎస్ఆర్ ద్వారా కంపెనీలు తాము సంపాదించే లాభాల్లో కొంత భాగాన్ని సమాజ శ్రేయస్సు కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఖర్చు చేస్తాయి. అంటే.. సమాజం నుంచి వనరులను తీసుకుంటున్న కంపెనీలు తిరిగి సమాజానికి మేలు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. కంపెనీల చట్టం 2013 ప్రకారం ఒక నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ లాభాలు లేదా టర్నోవర్ ఉన్న కంపెనీలు తమ సగటు నికర లాభంలో కనీసం 2 శాతం మొత్తాన్ని సీఎస్ఆర్ కార్యకలాపాలకు ఖర్చు చేయడం తప్పనిసరి.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
ఉద్యోగాలకు చలిగాలి
నిరుద్యోగం జనవరిలో 5 శాతానికి పెరిగింది. 2025 డిసెంబర్లో ఇది 4.8 శాతంగానే ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు మించిన వారికి సంబంధించి నిరుద్యోగం జనవరిలో పెరిగినట్టు తెలుస్తోంది. కార్మికుల భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్), జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) సైతం తగ్గడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో సాగు కాలం ముగియడం వంటి సీజనల్ ప్రభావాలే ఎల్ఎఫ్పీఆర్, డబ్ల్యూపీఆర్ తగ్గడానికి కారణమని ఎన్ఎస్వో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనులు, రవాణా, వ్యాపార కార్యకలాపాలు శీతాకాలంలో నిదానించగా, పట్టణాల్లో మాత్రం వాణిజ్య కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి. గ్రామీణ నిరుద్యోగం గత డిసెంబర్లో 3.9 శాతంగా ఉంటే, జనవరిలో 4.2 శాతానికి పెరిగింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 7 శాతానికి చేరింది. జనవరిలో కార్మికుల భాగస్వామ్య రేటు దేశవ్యాప్తంగా 55.9 శాతంగా నమోదైంది. డిసెంబర్లో ఇది 56.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్య రేటు 59 శాతం నుంచి 58.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 50.2 శాతం నుంచి 50.3 శాతానికి స్వల్పంగా మెరుగుపడింది.మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జనవరిలో 35.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 39.7 శాతం కాగా, పట్టణాల్లో 25.5 శాతంగా ఉండడం గమనార్హం. జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) 2025 జూన్లో 53.3 శాతంగా ఉంటే, డిసెంబర్ నాటికి 56.7 శాతానికి మెరుగుపడగా.. 2026 జనవరిలో తిరిగి 56.2 శాతానికి బలహీనపడింది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు సంబంధించి డబ్ల్యూపీఆర్ 75.7 శాతంగా, మహిళలకు సంబంధించి 38 శాతంగా ఉంది. పట్టణాల్లో పురుషులకు సంబంధించి 70.5 శాతం, మహిళలకు సంబంధించి 23 శాతం చొప్పున నమోదయ్యాయి.


