Corporate
-
ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తెలీదు!
న్యూఢిల్లీ: ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు. కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటా ప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది. అయితే తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
LIC పెట్టుబడుల వివాదం.. స్పందించిన రాజేష్ మెహతా
ఇటీవల వివాదాలలో చిక్కుకున్న ఆభరణ వర్తక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కౌంటర్లో బీమా రంగ పీఎస్యూ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పెట్టుబడులపై వాడి, వేడి చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అసలు ఎల్ఐసీ ఆఫీస్ ఎక్కడుందో కూడా తనకు తెలియదని రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తాజాగా వ్యాఖ్యానించారు.కంపెనీలో ఎల్ఐసీ పెట్టుబడులు నిన్నటివి లేదా ఏడాది క్రితం చేసినవి కాదని పేర్కొన్నారు. సుమారు రెండు రెండు దశాబ్దాల కాలంలో చేపట్టిన పెట్టుబడులివని తెలియజేశారు. ఓపెన్ మార్కెట్ ద్వారా షేర్లు కొనుగోలు చేసినట్లు వివరించారు. వెరసి కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో తానకుగానీ లేదా ఇతర ప్రమోటర్లకుగానీ ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు.కంపెనీ ప్రమోటర్లు ఎవరూ ఎల్ఐసీకి వాటా విక్రయించలేదని వెల్లడించారు. ఇదేవిధంగా ఎల్ఐసీకి ఎలాంటి షేర్ల కేటాయింపునూ చేపట్టలేదని తెలియజేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో బీమా దిగ్గజం చేపట్టిన పెట్టుబడులతో కంపెనీ లేదా ప్రమోటర్లకు ఎలాంటి లబ్ది చేకూరలేదని స్పష్టం చేశారు. ఎల్ఐసీ పెట్టుబడి నిర్ణయాలలో తమకు ఏ విధమైన సంబంధమూలేదని, ఈ విషయాలు తెలియవని వివరించారు. పూర్తిగా వాణిజ్య ధృక్పథంతో ఎల్ఐసీ తీసుకున్న సొంత నిర్ణయాలేనని పేర్కొన్నారు. 10.8 శాతం వాటాప్రస్తుతం రాజేష్ ఎక్స్పోర్ట్స్లో ఎల్ఐసీ వాటా 10.8 శాతంగా నమోదైంది. తొలి దర్యాప్తులో భాగంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కంపెనీ అక్రమ ఆదాయ నమోదుపై సీరియస్ అయ్యింది. రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ల నుంచి నిషేధించింది. ఈ అంశంలో సెబీ దర్యాప్తు కొనసాగుతోంది. కాగా.. రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు సోమవారం సైతం 5 శాతం పతనమై రూ. 94.5 వద్ద ఫ్రీజయ్యింది. మూడు రోజుల్లో 14 శాతం క్షీణించింది.అయితే.. తనకున్న అవగాహన ద్వారా ఈ ధరలోనూ ఎల్ఐసీ నష్టపోయి ఉండదని భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ నష్టపోయి ఉంటే అవతలి పక్క మరొకరు లాభపడి ఉండాలని, ఇది సాధారణ పబ్లిక్ వాటాదారులేనని మెహతా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తొలిసారి మాట్లాడుతున్నానని, ఒకవేళ ఇప్పుడు ఎల్ఐసీ విక్రయిస్తుంటే కామన్ పబ్లిక్ కొనుగోలు చేస్తుంటారని, తద్వారా లబ్ది పొందుతారని, అంతేతప్ప కంపెనీ లేదా ప్రమోటర్ లాభపడరని వివరించారు. ఈ అంశాన్ని వ్యతిరేకించేవారు సాధారణ వాటాదారులు లాభపడటాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. -
ఎలక్ట్రానిక్స్ రంగం @ రూ.14.4 లక్షల కోట్లు!
ముంబై: ఎల్రక్టానిక్స్ తయారీ సేవల (ఈఎంఎస్) రంగం వచ్చే ఐదేళ్లలో భారీగా విస్తరించనుంది. 2030 నాటికి మూడు రెట్లకు పైగా పెరిగి 150 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.14.4 లక్షల కోట్లు) ఈఎంఎస్ మార్కెట్ చేరుకుంటుందని కేపీఎంజీ ఇండియా నివేదిక అంచనా వేసింది. దేశీ డిమాండ్కు తోడు ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలు. చైనాకు ప్రత్యామ్నాయంగా విశ్వసనీయమైన సరఫరా వ్యవస్థల కోసం అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తుండడం (చైనా ప్లస్ వన్ విధానం) ఈ మార్కెట్ విస్తరణకు దన్నుగా నిలవనున్నట్టు తెలిపింది. 2025లో ఈఎంఎస్ మార్కెట్ పరిమాణం 40–45 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. అయితే ఈ రంగం వృద్ధి విస్తృతంగా కాకుండా పరిమితంగా ఉండడాన్ని ఎత్తి చూపించింది. అధిక విలువను తీసుకొచ్చే డిజైన్, విడిభాగాలు, మేధో హక్కుల (ఐపీ) పరంగా దేశీ సంస్థల పాత్ర పరిమితంగానే ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో మొబైల్, అధికంగా అమ్ముడుపోయే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అసెంబ్లింగ్కే భారత కంపెనీలు ఎక్కువగా పరిమితమైనట్టు వివరించింది. దీని స్థానంలో డిజైన్, తయారీ, ఐపీ, వ్యాల్యూ చైన్తో కూడిన సమగ్రమైన ఎల్రక్టానిక్స్ తయారీ కేంద్రంగా భారత్ అవతరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. వృద్ధికి అపార అవకాశాలు.. అంతర్జాతీయ ఈఎంఎస్ మార్కెట్ 2025లో 640–650 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు పెరగనున్నట్టు కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది. అనుసంధానత, ఎలక్ట్రిఫికేషన్, ఓఈఎం అవుట్సోర్సింగ్ ఈ మార్కెట్ విస్తరణకు దోహదం చేయనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రంగం కేవలం ఖర్చులను నియంత్రించుకోవడం కంటే, నమ్మకమైన ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో భారత్ వాటా 5–6 శాతంగానే ఉండగా, ఇక్కడి నుంచి భారీ వృద్ధి సాధించడానికి బలమైన అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ చర్యలు అవసరం.. ఎలక్ట్రానిక్స్ తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం భారత్ ఇప్పటికీ 80–95 శాతం మేర దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. దీనివల్ల ఇక్కడి కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతున్నాయని.. దీన్ని అధిగమించడం అత్యంత ముఖ్యమని ఈ నివేదిక సూచించింది. సాధారణ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ ద్వారా మార్కెట్ పరిమాణం పెరిగినప్పటికీ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం క్లిష్టమైన సాంకేతికత కలిగిన ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, ఏరోస్పేస్ రంగాలపై ఎక్కువగా దృష్టి సారించాలని పేర్కొంది. ఈ రంగాల్లో అధిక విలువ సృష్టికి అవకాశాలున్నట్టు వివరించింది. ఎల్రక్టానిక్స్ తయారీలో తక్కువ వ్యయాలతో అంతర్జాతీయంగా భారత్ పోటీపడేందుకు కేవలం సామర్థ్య ఆధారితం కాకుండా నైపుణ్య ఆధారితంగా ఎదగాల్సి ఉందని పేర్కొంది. ‘‘ఇందుకోసం ప్రభుత్వం, తయారీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. దేశీయంగా విడి భాగాల తయారీని పెంచడంతోపాటు కారి్మకుల్లో నైపుణ్యాలను పెంచాలి. ఇంజనీరింగ్–డిజైన్పై పెట్టుబడులు పెట్టడం, అంతర్జాతీయ విలువ ఆధారిత వ్యవస్థతో అనుసంధానం కావడంపై దృష్టి సారించాలి’’అని ఈ నివేదిక సూచించింది. -
నెలకు రూ.1.35 లక్షల భరణం ఇవ్వాల్సిందే!
ఆధునిక వివాహ బంధాల్లో వస్తున్న విభేదాలు, విడాకుల కేసులో ఇటీవల పుణె కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశం అయింది. భార్య నెలకు లక్షకు పైగా జీతం సంపాదిస్తున్నప్పటికీ, ఆమెకు భర్త భారీ మొత్తంలో భరణం (మెయింటెనెన్స్) చెల్లించాల్సిందేనంటూ పుణెలోని ఒక కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్గా మారింది.అసలేం జరిగింది? కేసు వివరాలు ఇవీ..ఉద్యోగ రీత్యా పుణెలో స్థిరపడిన ఒక ఐటీ/కార్పొరేట్ జంటకు వివాహమైన ఆరు నెలలకే మనస్పర్థలు వచ్చాయి. ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రం కావడంతో వారు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణ సమయంలో భార్య తరఫు న్యాయవాది కీలక వాదనను తెరపైకి తెచ్చారు. వివాహ బంధంలో ఉన్నప్పుడు తాను ఎలాంటి విలాసవంతమైన, ఉన్నతమైన జీవన ప్రమాణాలను అనుభవించిందో విడిపోయిన తర్వాత కూడా అదే స్థాయి జీవనాన్ని కొనసాగించే హక్కు ఆమెకు ఉందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. భర్త తన విడాకులు తీసుకున్న భార్యకు నెలకు రూ.1,35,000 భరణంగా చెల్లించాలని ఆదేశించింది.ఆదాయాల లెక్కలు ఇలా..కోర్టు రికార్డుల ప్రకారం ఇద్దరి ఆదాయ వివరాలు కింది విధంగా ఉన్నాయి.వివరాలుభర్త ఆర్థిక పరిస్థితిభార్య ఆర్థిక పరిస్థితిప్రస్తుత నెలవారీ జీతంరూ. 2,79,499రూ. 1,41,436కోర్టు ఆదేశించిన భరణంరూ. 1,35,000రూ. 1,35,000తీర్పు తర్వాత మొత్తం ఆదాయంరూ. 1,44,499రూ. 2,76,436 -
లేఆఫ్స్ సమయంలో వాల్మార్ట్ వినూత్న వ్యూహం
ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి ఐటీ, కార్పొరేట్ కంపెనీలు ఏఐ సాకుతో ఉద్యోగులపై లేఆఫ్స్ పంజా విసురుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలర్ వాల్మార్ట్ భిన్నమైన వ్యూహాన్ని ప్రకటించింది. సాంకేతిక పరిజ్ఞానం అనేది మానవ వనరులను భర్తీ చేయడానికి కాదు, వారి పనితీరును మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేసింది. అర్కాన్సాస్లోని బెంటన్విల్లేలో నిర్వహించిన వాల్మార్ట్ వార్షిక ‘అసోసియేట్స్ వీక్’ ఈవెంట్లో సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్లు కీలక ప్రకటనలు చేశారు. డిజిటల్ సాధనాలు కేవలం సమస్యల పరిష్కారానికి, వ్యాపార సరళీకరణకు, కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికే ఉపయోగపడతాయని భరోసా ఇచ్చారు.ఉత్పాదకత సాధనంగానే ఏఐగత మూడు నెలల్లో అమెరికా కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించడానికి ఏఐ సాంకేతికతను ఒక ప్రధాన కారణంగా చూపినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. వాల్మార్ట్ సైతం ఇటీవల తన టెక్నాలజీ, ప్రొడక్ట్ డిజైన్ విభాగాల్లో వందలాది పోస్టులను తగ్గించినప్పటికీ ఆ నిర్ణయానికి ఏఐతో ఎటువంటి సంబంధం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఏఐని ఉద్యోగుల భర్తీ వ్యూహంగా కాకుండా ఉత్పాదకతను పెంచే ఒక సాధనంగా వాల్మార్ట్ అగ్రనాయకత్వం అభివర్ణించింది.‘సాంకేతికత మన భవిష్యత్తుకు ఊతమిస్తుంది. కానీ, మన ఉద్యోగులే దానికి నాయకత్వం వహిస్తారు’ అని డోనా మోరిస్, వాల్మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ తెలిపారు. వాల్మార్ట్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఫర్నర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్మార్ట్ చరిత్రలో సాధించిన విజయాల వెనుక సాంకేతికత కంటే ఉద్యోగుల కృషి, వారు చూపిన ప్రతిభే కీలకమని కొనియాడారు.భిన్నాభిప్రాయాలు - ఆందోళనలుఏఐ పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ వాల్మార్ట్ వార్షిక ఆదాయం సుమారు 700 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. అయితే గత ఐదేళ్లలో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కార్మికులపై ఏఐ ప్రభావంపై మరింత పారదర్శకత కావాలంటూ ‘యునైటెడ్ ఫర్ రెస్పెక్ట్’ అనే లేబర్ అడ్వకసీ గ్రూప్ వాటాదారుల సమావేశంలో ప్రతిపాదన తెచ్చింది. ఏఐ సాధనాల వల్ల పని వేగం పెరిగి కార్మికులపై ఒత్తిడి తీవ్రమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ ప్రతిపాదనకు తగినంత మద్దతు లభించలేదు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
డబ్బు కావాలా? వీటిలో మాస్టర్స్ అవ్వాల్సిందే!
ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పంచుకున్న కొన్ని ఆర్థిక సూత్రాలు ఇప్పుడు యువతను, వర్ధమాన పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతికే సగటు ఆలోచనా విధానానికి, రూ.కోట్లకు పడగలెత్తే వ్యాపారవేత్తల మైండ్ సెట్కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టం చేశారు.‘ ‘నేను ధనవంతుడిగా ఎలా మారాలి? దీనికోసం ఏదైనా మంత్రదండం ఉందా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. వారంతా నా నుంచి ఏదో ఒక సంక్లిష్టమైన ఫార్ములానో లేక మాయా పెట్టుబడి వ్యూహాన్నో ఆశిస్తారు. కానీ, నేను కుర్రాడిగా ఉన్నప్పుడే మా ‘రిచ్ డాడ్’ నాకు అసలైన రహస్యం చెప్పారు. నువ్వు నిజంగా ధనవంతుడివి కావాలననుకుంటే.. కేవలం రెండు విషయాల్లో పట్టు సాధించు. ఒకటి సేల్స్ (అమ్మకాలు), రెండు రియల్ ఎస్టేట్’ అన్నారు.ఆ రెండు నైపుణ్యాలే ఎందుకు?రాబర్ట్ కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఒక వ్యక్తి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరడానికి ఈ రెండు రంగాలు పునాదిగా పనిచేస్తాయి.సేల్స్ (అమ్మకాలు)వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ఏదైనా అమ్మనంత వరకు అక్కడ ఎలాంటి చలనం ఉండదు. సేల్స్ అంటే కేవలం వస్తువులను అమ్మడం కాదు.ఎదుటివారితో ఎలా మాట్లాడాలి.ఎలా చర్చలు జరపాలిఇతరులను ఎలా ప్రభావితం చేయాలి.విలువను ఎలా సృష్టించాలి.. అనేది సేల్స్ నేర్పుతుంది.ఇదే ఉద్దేశంతో రాబర్ట్ కియోసాకి మెరైన్ కార్ప్స్ విడిచిపెట్టిన తర్వాత కేవలం సేల్స్ నేర్చుకోవడం కోసమే ‘జిరాక్స్’ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. అక్కడ కెరీర్ బిల్డ్ చేయడం ఆయన ఉద్దేశం కాదు. ఒక పారిశ్రామికవేత్తకు కావలసిన అసలైన సేల్స్ నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడమే ఆయన లక్ష్యం.రియల్ ఎస్టేట్రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూములు, భవనాల కొనుగోలు మాత్రమే కాదు. అది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన సూత్రాలైన అప్పు, పన్నుల గురించి నేర్పుతుంది.లెవరేజ్: రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుడానికి మీ సొంత డబ్బు అక్కర్లేదు. ఇతరుల లేదా బ్యాంకుల డబ్బును ఎలా ఉపయోగించవచ్చో ఇది నేర్పుతుంది.క్యాష్ ఫ్లో: క్రమబద్ధమైన ఆదాయ వనరును ఎలా సృష్టించాలో చూపిస్తుంది.టాక్స్-ఫ్రీ వెల్త్: పన్ను నిబంధనలను చట్టబద్ధంగా ఉపయోగించుకుంటూ అతి తక్కువ పన్నుతో సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలో రియల్ ఎస్టేట్ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.నేటి ఆధునిక కాలంలో కేవలం అకడమిక్ డిగ్రీలు మాత్రమే జీవితంలో స్థిరపడటానికి సరిపోవు అనేది జగమెరిగిన సత్యం. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మనల్ని కేవలం ఒక ఉద్యోగిగా మారడానికే శిక్షణ ఇస్తాయి. కానీ, ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి. రాబర్ట్ కియోసాకి చెప్పినట్లు సేల్స్, రియల్ ఎస్టేట్ రంగాలపై అవగాహన పెంచుకోవడం అంటే వ్యాపారం చేయడం మాత్రమే కాదు. సంపదను సృష్టించే మైండ్ సెట్ను అలవర్చుకోవడం. డిగ్రీల వేటలో పడేముందు.. ప్రతి ఒక్కరూ ఈ ప్రాథమిక ఆర్థిక నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ముంబై-హైదరాబాద్.. కేవలం 3 గంటల్లోనే!
హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు తుది రూపానికి వచ్చాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ముంబై-పుణె-హైదరాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) అధికారికంగా ఖరారైంది. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో ఇది కీలకంగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పురోగతిని, అలాగే హైదరాబాద్ను ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించే మరో మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాట్లను కూడా సమగ్రంగా సమీక్షించారు.12 గంటల ప్రయాణం.. ఇక 3 గంటల్లోనే..ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవడానికి సాధారణ రైళ్లు లేదా రోడ్డు మార్గం ద్వారా దాదాపు 12 నుంచి 15 గంటల సమయం పడుతోంది. అయితే, ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. కేవలం 3 గంటల్లోనే ప్రయాణీకులు తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.ప్రాజెక్టు పేరు: ముంబై-పుణె-హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ప్రాజెక్ట్ అమలు చేసే సంస్థ: నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)మొత్తం దూరం: 671 కిలోమీటర్లుగరిష్ట వేగం: గంటకు 320 కిలోమీటర్లుటెర్మినల్ నగరాలు: నవీ ముంబై-హైదరాబాద్మూడు రాష్ట్రాల మీదుగా 10 స్టేషన్లుఈ హై-స్పీడ్ రైలు కారిడార్ మొత్తం మూడు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ గుండా ప్రయాణిస్తుంది. పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక, ఐటీ, ఆధ్యాత్మిక పట్టణ కేంద్రాలను అనుసంధానిస్తూ మొత్తం 10 స్టేషన్లను ఈ మార్గంలో ప్రతిపాదించారు.స్టేషన్ల వారీగా రూట్ మ్యాప్..1. నవీ ముంబై2. లోనావాలా3. పింప్రి-చించ్వాడ్4. పుణె (లోని)5. బారామతి6. పంఢరపూర్7. సోలాపూర్8. కలబురగి9. వికారాబాద్10. హైదరాబాద్ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు - ప్రయోజనాలుఈ మెగా ప్రాజెక్టు ప్రయాణ సమయాన్ని తగ్గించడంతోపాటు మూడు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. ప్రధాన నగరాల మధ్య కనెక్టివిటీ పెరగడం వల్ల పెట్టుబడులు వరదలా రానున్నాయి. గంటకు 320 కి.మీ వేగంతో నడిచే ఈ రైళ్లు రవాణా రంగంలో సరికొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తాయి. మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతాలు, కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాలు, తెలంగాణలోని ఐటీ-ఫార్మా హబ్లకు ఈ కారిడార్ ఊతం ఇవ్వనుంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించి స్థిరమైన, పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను భవిష్యత్తు తరాలకు అందించడమే దీని లక్ష్యం. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశల్లో వేలాది మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
కేంద్రానికి ఎస్బీఐ భారీ డివిడెండ్
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం, ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికార్డులతో దూసుకుపోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.8,813 కోట్ల భారీ డివిడెండ్ను ఎస్బీఐ చెల్లించింది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి ఈ డివిడెండ్ చెక్కును కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్కు అధికారికంగా అందజేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎస్బీఐ సాధించిన ఈ ఆర్థిక వృద్ధి, ప్రభుత్వ పన్నుయేతర ఆదాయ వనరులకు మరింత బలాన్ని చేకూర్చడంతోపాటు బ్యాంక్ పటిష్టమైన ఆర్థిక స్థితిని ప్రతిబింబిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.రికార్డు స్థాయి లాభాలతో..ఇటీవలే ముగిసిన జనవరి-మార్చి 2026 త్రైమాసికంలో ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ బలమైన ఆదాయాలే ప్రభుత్వానికి ఈ స్థాయిలో భారీ డివిడెండ్ చెల్లించడానికి ప్రధాన కారణమయ్యాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.18,643 కోట్లతో పోలిస్తే ఈసారి నికర లాభం 6 శాతం వృద్ధితో రూ.19,684 కోట్లకు చేరింది. బ్యాంక్ ప్రధాన ఆదాయ వనరు అయిన నికర వడ్డీ ఆదాయం (రుణాలపై వచ్చే వడ్డీకి, డిపాజిట్లపై చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం) ఏకంగా 4 శాతం వృద్ధితో రూ.44,380 కోట్లుగా నమోదైంది.Smt @nsitharaman receives a dividend cheque of Rs 8,813 crore for FY 2025-26 from Shri C S Setty, Chairman - @TheOfficialSBI. pic.twitter.com/wNeB9HkqVw— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) June 8, 2026దలాల్ స్ట్రీట్లో జోరుస్టాక్ మార్కెట్లో ఎస్బీఐ షేరు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. గత నెల రోజుల్లో స్వల్పంగా 4 శాతం మేర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ గత వారంలోనే ఈ స్టాక్ 3 శాతానికి పైగా పుంజుకుంది. ప్రస్తుతం ఎస్బీఐ మార్కెట్ విలువ సుమారు రూ.9.08 లక్షల కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత విలువైన బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఎస్బీఐ తన అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
విమానయాన రంగానికి ఇంధన గండం!
ప్రపంచ విమానయాన రంగాన్ని మిడిల్ ఈస్ట్ సంక్షోభం కుదిపేస్తోంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ల యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా జెట్ ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్-ఏటీఎఫ్) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీలకమైన ఎయిర్ కారిడార్లు మూతపడటంతో విమానాలను సుదూర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాల్సి వస్తోంది. ఫలితంగా ఇంధన ఖర్చులు రికార్డు స్థాయికి చేరాయి. ఈ పెరిగిన భారంతో మున్ముందు కొన్ని విమానయాన సంస్థలు దివాలా తీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంస్థ (ఐఏటీఏ) హెచ్చరించింది. రియో డి జనీరోలో జరిగిన ఐఏటీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ రాయిటర్స్ సంస్థతో మాట్లాడుతూ పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని విశ్లేషించారు.బడ్జెట్ విమానయాన సంస్థలపైనే ప్రభావం..పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం పూర్తిస్థాయి సేవలందించే పెద్ద ఎయిర్లైన్స్ కంటే తక్కువ ధరలకే సేవలందించే ‘బడ్జెట్ క్యారియర్ల’పైనే ఎక్కువగా పడుతోందని ఐఏటీఏ స్పష్టం చేసింది. ‘పెద్ద విమానయాన సంస్థలకు ప్రీమియం క్యాబిన్లు, అధిక ఛార్జీలు చెల్లించే బిజినెస్ ప్రయాణికులు, క్రెడిట్ కార్డ్ లాయల్టీ ప్రోగ్రామ్ల ద్వారా అదనపు మార్జిన్ ఆదాయం లభిస్తుంది. బడ్జెట్ ఎయిర్లైన్స్కు ఇలాంటి అదనపు వనరులు ఉండవు’ అని ఐటీఏటీ తెలిపింది. అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ ఎయిర్లైన్ ‘స్పిరిట్ ఎయిర్లైన్స్’ గత నెలలో భారీగా నష్టపోయింది. రాబోయే రోజుల్లో మరికొన్ని చిన్న సంస్థలు వ్యాపారాల నుంచి తప్పుకోవడమో లేదా పెద్ద క్యారియర్ల చేతుల్లోకి వెళ్లిపోవడమో తప్పదని విల్లీ వాల్ష్ ఆందోళన వ్యక్తం చేశారు.టికెట్ ధరలు తగ్గే ప్రసక్తే లేదు!ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ నష్టాలను/మార్జిన్లను కాపాడుకోవడానికి లాభసాటి కాని మార్గాల్లో సర్వీసులను నిలిపివేస్తున్నాయి. ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుంచి పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదని వాల్ష్ తేల్చిచెప్పారు. ప్రస్తుత తరుణంలో అధిక ఇంధన ధరలను తట్టుకుని నిలబడటం చాలా కష్టమన్నారు. అమెరికా మార్కెట్లో మాత్రం యునైటెడ్, డెల్టా, అమెరికన్ ఎయిర్లైన్స్ వంటి క్యారియర్లు చిన్న బడ్జెట్ పోటీదారులను గట్టిగా అణచివేస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ఈ యూరప్ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్!
నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటి. కనువిందు చేసే నీటి కాలువలు, చారిత్రక భవనాలు, మ్యూజియంలు, సాంస్కృతిక వైవిధ్యంతో ఏటా కోట్లాది మంది సందర్శకులను ఆకర్షిస్తున్న ఈ నగరం ఇప్పుడు ‘ఓవర్ టూరిజం’ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల సంఖ్యను నియంత్రించడంతో పాటు నగర నిర్వహణకు అదనపు నిధులు సమకూర్చుకునేందుకు ఆమ్స్టర్డామ్ సిటీ ప్రభుత్వం పర్యాటక పన్నును భారీగా పెంచే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.12.5 శాతం నుంచి 20 శాతానికి..ప్రస్తుతం ఆమ్స్టర్డామ్లో హోటళ్లు, హాస్టళ్లు, ఇతర వసతి కేంద్రాల్లో బస చేసే పర్యాటకులపై గది అద్దెపై 12.5 శాతం పర్యాటక పన్ను వసూలు చేస్తున్నారు. అలాగే క్రూయిజ్ నౌకల ద్వారా ఒక రోజు పర్యటనకు వచ్చే వారిపై ఒక్కొక్కరికి 15 యూరోలు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1650 పన్ను విధిస్తున్నారు.కొత్త సంకీర్ణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రణాళిక ప్రకారం 2027 నుంచి ఈ పన్నును 16 శాతానికి పెంచి, ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక శాతం చొప్పున పెంచుతూ 2030 నాటికి 20 శాతానికి చేర్చనుంది. ఇది అమలైతే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటక పన్నులు విధించే నగరాల్లో ఆమ్స్టర్డామ్ ఒకటిగా నిలవనుంది.నగరంపై పెరుగుతున్న ఒత్తిడే కారణంపర్యాటకం నగర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరు అయినప్పటికీ, అదే సమయంలో జనసమ్మర్థ ప్రదేశాలు, మౌలిక సదుపాయాలు, స్థానికుల జీవన ప్రమాణాలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తోందని సిటీ ప్రభుత్వం పేర్కొంది. అందుకే నగర నిర్వహణ, పరిశుభ్రత, భద్రత, చట్ట అమలు, మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల్లో పర్యాటకులు కూడా తగిన వాటా భరించాలని భావిస్తోంది. పన్ను పెంపు ద్వారా వచ్చే ఆదాయాన్ని నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సురక్షితంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.క్రూయిజ్ టెర్మినల్కు కూడా గుడ్బై?పన్ను పెంపుతో పాటు మరికొన్ని కఠిన నిర్ణయాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. సముద్ర క్రూయిజ్ నౌకల ద్వారా వచ్చే పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నగరంలోని ప్రధాన క్రూయిజ్ టెర్మినల్ను మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. జాతీయ ప్రభుత్వం, ప్రాంతీయ అధికారులతో చర్చల అనంతరం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై నిర్ణయం తీసుకోనుంది.అదనంగా, కాలువలపై బోటు టూర్లు, అద్దె పడవలు వంటి వినోద కార్యకలాపాలపై కూడా అధిక రుసుములు విధించే అవకాశాలు ఉన్నాయి. నగర కేంద్రంలోని కొన్ని భవనాలను కొనుగోలు చేసి, వాటి వినియోగాన్ని మార్చడం ద్వారా అధిక పర్యాటక ఒత్తిడిని తగ్గించే ప్రణాళికలను కూడా పరిశీలిస్తున్నారు.రెడ్ లైట్ ప్రాంతానికి ప్రత్యామ్నాయంప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్పై ఒత్తిడిని తగ్గించేందుకు నగర దక్షిణ ప్రాంతంలో ప్రత్యేక “ఎరోటిక్ సెంటర్” ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగిస్తోంది. సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడం, నేర కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడం, నగర కేంద్రంలో రద్దీని నియంత్రించడం ఈ ప్రణాళిక ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.పర్యాటకులను ఆహ్వానిస్తూనే నియంత్రణగత కొన్నేళ్లుగా ఆమ్స్టర్డామ్ ‘టూరిజం ఇన్ బ్యాలెన్స్’ విధానాన్ని అమలు చేస్తోంది. పర్యాటకులను పూర్తిగా నిరోధించడం కాకుండా, నగర సామర్థ్యానికి మించి పెరుగుతున్న సందర్శకుల ప్రవాహాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియంలు, యునెస్కో వారసత్వ హోదా పొందిన కాలువల వలయం, సైకిల్ సంస్కృతి కారణంగా ఆమ్స్టర్డామ్ ఇప్పటికీ ఐరోపాలో అత్యధికులు సందర్శించాలనుకునే పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా కొనసాగుతోంది. అయితే ఇకపై అక్కడికి వెళ్లే పర్యాటకులు మరింత ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సి రావచ్చు. -
భారత్లోకి ఆంథ్రోపిక్ ‘మైథోస్’
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ విస్తరణలో భాగంగా భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అంటే సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్వేర్లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్బేస్లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్వేర్ ప్యాచ్ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు. -
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
దశాబ్దాలుగా, కోట్లాది కుటుంబాలకు విశ్వసనీయమైన పెట్టుబడి సాధనాల్లో మొదటి ఎంపిక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)కే. బ్యాంకు శాఖకు వెళ్లి ఎఫ్డీ వేయడం, కావాల్సినప్పుడు వెనక్కి తీసుకోవడం.. రాబడి తక్కువే అయినా అందులోని సౌలభ్యం, నమ్మకం ఎఫ్డీకి అంత ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడంతా డిజిటల్ సేవల యుగం. దాదాపు అన్ని బ్యాంకు సేవలు డిజిటల్గానే లభిస్తున్నాయి. ఎఫ్డీ కంటే అధిక రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్ తదితర సాధనాలను స్మార్ట్ఫోన్ నుంచే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు. దీంతో గతంతో పోల్చితే ఎఫ్డీలకు డిమాండ్ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి వేగం నిదానించడం దీన్నే తెలియజేస్తోంది. దీంతో బ్యాంక్లు సైతం డిజిటల్ ఎఫ్డీలతో పోటీ పడుతున్నాయి. సొంత మొబైల్ అప్లికేషన్లు, నెట్బ్యాంకింగ్ ద్వారానే కాకుండా.. ఫిన్టెక్ల రూపంలోనూ డిజిటల్ ఎఫ్డీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా బ్రహా్మండం. మొదటిసారి ఇన్వెస్టర్లు సైతం సులభంగా డిజిటల్ ఎఫ్డీ చేసుకోవచ్చు. వీటి సేవలను ఎలా పొందొచ్చో తెలియజేసే కథనమే ఇది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సొంతంగానూ డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు వీటిని ఇన్వెస్టర్లకు మరింత చేరువ చేస్తున్నాయి. డిపాజిట్కు సరిపడా సొమ్మును స్వీకరించడం, ఎఫ్డీగా మార్చడం, ఉపసంహరణ తదితర సేవలన్నింటినీ ఫిన్టెక్ సంస్థలు అందిస్తాయి. డిపాజిట్ రిసీప్్టలు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీల నుంచే జారీ అవుతాయి. అంటే డిపాజిట్ మొత్తం బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలకే వెళుతుంది. ఒకే చోట డిపాజిట్లన్నీ.. → తమకు ఖాతా ఉన్న బ్యాంక్లోనే డిజిటల్ ఎఫ్డీ వేసుకోవచ్చు. → అధిక రాబడిని (వడ్డీ రేటు) ఆఫర్ చేసే చోటే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు ఎంతో అనుకూలం. → దాదాపు అన్ని ప్రముఖ బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. → అన్ని డిపాజిట్లు ఒకే చోటు కనిపించడం వల్ల ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే డిపాజిట్లను సులభంగా గుర్తించొచ్చు. → కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్కు అవకాశం ఉంది. కావాలంటే అక్కడే రెన్యువల్ చేసుకోవచ్చు.డిపాజిట్ చిటికెలో పని→ డిజిటల్ ఎఫ్డీ కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. నిమిషాల్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. → ఈ–కేవైసీ లేదా వీడియో కేవైసీ ద్వారా తమ గుర్తింపు వివరాలను ఇస్తే సరిపోతుంది. → అనంతరం తమకు నచ్చిన సంస్థ డిపాజిట్ను ఎంపిక చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. → గడువు ముగిసిన తర్వాత ఉపసంహరణ కూడా సులభమే. నిమిషాల్లోనే డిపాజిట్ మొత్తం వడ్డీ సహా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. → కావాలంటే ఆ డిపాజిట్ను అక్కడికక్కడే రెన్యువల్ ( పునరుద్ధరణ) చేసుకోవచ్చు. → ఈ సేవలన్నీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ లేదా వెబ్ పోర్టల్ నుంచి పొందొచ్చు. రెండూ ఒకటే.. → భౌతికంగా బ్యాంకులో చేసే ఫిక్స్డ్ డిపాజిట్, ఆన్లైన్లో డిజిటల్గా చేసే ఎఫ్డీ రెండూ ఒక్కటే. వడ్డీ రేటు, భద్రత, పన్ను తదితర అంశాల్లో ఎలాంటి మార్పుల్లేవు. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలో రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం కూడా లేదు. → చాలా ఫిక్స్డ్ డిపాజిట్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక డిపాజిట్ పథకాలలో ఈ సౌకర్యం ఉండకపోవచ్చు. → ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద ఒక బ్యాంకు పరిధిలో ఒక్కో ఇన్వెస్టర్కు గరిష్టంగా రూ.5. లక్షల ఎఫ్డీకి బీమా వర్తిస్తుంది. రిస్కుల్లేవా..→ సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లలో రిస్క్ చాలా తక్కువ. → బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడినప్పుడే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. → ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని అన్ని వాణిజ్య బ్యాంక్లు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ల్లో ఒక్కో డిపాజిటర్కు గరిష్టంగా రూ.5 లక్షల మొత్తానికి బీమా ఉంటుంది. → ఉదాహరణకు ఒక వ్యక్తి రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్ చేశాడనుకుందాం. రెండు బ్యాంకులూ సంక్షోభంలోకి వెళ్లాయనుకుంటే.. అప్పుడు రెండు బ్యాంకుల నుంచి డిపాజిటర్కు రూ.5 లక్షల చొప్పున వెనక్కి వస్తుంది. → కనుక ఒక బ్యాంకు పరిధిలో గరిష్ట డిపాజిట్ను రూ.5 లక్షలకు పరిమితం చేయడం ద్వారా రిస్్క తగ్గించుకోవచ్చు. → ఎన్బీఎఫ్సీల డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, బ్యాంకుల్లో మాదిరి ఎన్బీఎఫ్సీల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా సదుపాయం లేదు. ఎన్బీఎఫ్సీ సంక్షోభంలో పడితే డిపాజిట్ పూర్తిగా రిస్్కలోకి వెళ్లినట్లే. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ సేవలు మెరుగ్గా ఉన్నాయేమో విచారించుకోవాలి. → మెచ్యూరిటీ అనంతరం ఆటో రెన్యువల్ అయినా, కొత్తగా అమల్లో ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది. గతంలో పొందిన అధిక వడ్డీ రేటు కొనసాగదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ కేవలం మధ్యవర్తి గా మాత్రమే పనిచేస్తుంది. డిపాజిట్ భద్రత పూర్తిగా సంబంధిత బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందే డిపాజిట్ ఏ సంస్థ వద్ద నమోదవుతోందో పరిశీలించాలి.అధిక రాబడి→ తమ ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్ అయితే, మెరుగైన రేటుపై చేసే అవకాశం ఉండదు. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల ద్వారా అయితే ఏ బ్యాంక్ ఎక్కువ రేటు ఆఫర్ చేస్తుందో తెలుసుకుని, అందులోనే డిపాజిట్ చేసుకోవచ్చు. → కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు 0.5–2 శాతం వరకు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. → గతంలో పోల్చితే డిపాజిట్లకు పోటీ పెరగడంతో ప్రముఖ బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన రేటును అందిస్తున్నాయి. → సీనియర్ సిటిజన్ (60 ఏళ్లు నిండిన) డిపాజిట్లపై అరశాతం వరకు అదనపు రాబడిని అందుకోవచ్చు. → అధిక రాబడి కోసం దీర్ఘకాలాన్ని ఎంపిక చేసుకునే ముందు.. అంతకాలం పాటు వేచి ఉండగలమా? అన్నది ఆలోచించుకోవాలి.డిపాజిట్పై రుణం → చాలా బ్యాంకులు డిపాజిట్పై రుణం లేదా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎఫ్డీ విలువలో 75–80 శాతం మేర రుణంగా లభిస్తుంది. → ఎఫ్డీ రేటు కంటే 1–3 శాతం అధికంగా రుణానికి చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా వెనక్కి తీసుకుంటే.. → డిపాజిట్లు ఏవైనా వాటి నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే ఉపసంహరించుకుంటే రాబడి విషయంలో రాజీ పడక తప్పదు. → ఉదాహరణకు రూ.3 ఏళ్లకు డిపాజిట్ చేసి, ఏడాదికే వెనక్కి తీసుకుంటే.. ఏడాది కాలానికి వర్తించే వడ్డీ రేటు ప్రకారమే చెల్లింపులు లభిస్తాయి. → ఫిన్టెక్ ప్లాట్ఫామ్ల్లో ముందస్తుగా డిపాజిట్ నుంచి తప్పుకుంటే 0.5–1 శాతం వరకు పెనాల్టీని కూడా చెల్లించాల్సి రావొచ్చు. → కాలవ్యవధి ముగిసేలోపు అత్యవసరాల్లో తీసుకోవచ్చని భావించే వారు.. ఒకే డిపాజిట్ కాకుండా ఒకటికి మించి వేర్వేరు డిపాజిట్లుగా, వేర్వేరు కాల వ్యవధిపై చేసుకోవడం వల్ల రాబడి నష్టపోకుండా, పెనాల్టీ భారం ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు. పన్ను భారం మరవొద్దు..→ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. కనుక ఆదాయానికి అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది. → ఉదాహరణకు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న వ్యక్తి 8.5 శాతం రేటుపై ఎఫ్డీ చేశాడని అనుకుందాం. అప్పుడు పన్ను పోను ఎఫ్డీపై నికర రాబడి 6 శాతం మించదు. → బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్పై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తికి రూ.50,000 మించితే (60 ఏళ్లలోపు), 60 ఏళ్లు నిండిన వారికి రూ.లక్ష మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పాన్ నంబర్ సమరి్పంచిన వారికి 10 శాతం, అది లేని వారికి 20 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. → పన్ను వర్తించేంత ఆదాయం లేని వారు టీడీఎస్ అమలు చేయకుండా ఫారమ్ 15జీ (60 ఏళ్లలోపు), ఫారమ్ 15హెచ్ (60 ఏళ్లు నిండిన) సమర్పిస్తే సరిపోతుంది. డిజిటల్ ఎఫ్డీ వేదికలు..→ జియోఫైనాన్స్ → స్టెబుల్ మనీ → జెరోదా కాయిన్ → ఫైబ్ → పైసా బజార్→ ఐఎన్డీ మనీ → క్రెడ్ → ఫోన్పే → నవీ → పేటీఎం -
తండ్రి మాట.. అంబానీ విజయ రహస్యం!
భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ముఖేష్ అంబానీ ఒకరు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఈయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. నేడు ముఖేష్ అంబానీ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగడానికి, ఆయన తండ్రి ధీరూభాయ్ అంబానీ చెప్పిన మాట అని ఒక సందర్భంలో పేర్కొన్నారు.ఒకసారి ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. తన తండ్రి చెప్పిన ఒక మాటను గుర్తుచేశారు. ''నువ్వు వ్యాపారవేత్త కావాలనుకుంటే సమస్యలకు పరిష్కారాలను నువ్వే కనుగొనాలి. మేనేజర్లకు మాత్రమే ఏం చేయాలో చెబుతారు. కానీ వ్యాపారవేత్తలకు ఎవరూ దారి చూపరు'' అని ధీరూభాయ్ అంబానీ తనకు చెప్పారని వెల్లడించారు.వ్యాపారవేత్త పరిస్థితి భిన్నం!ఈ మాటల్లో గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. సాధారణంగా ఒక ఉద్యోగి లేదా మేనేజర్కు సంస్థలో ఉన్నతాధికారులు పనులను అప్పగిస్తారు. వారు ఇచ్చిన సూచనల ప్రకారం పని చేస్తారు. కానీ.. ఒక వ్యాపారవేత్త పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతడే సమస్యలను గుర్తించాలి, అవకాశాలను వెతకాలి, నిర్ణయాలు తీసుకోవాలి, వాటి ఫలితాలకు పూర్తి బాధ్యత వహించాలి.జీవితంలో లేదా వ్యాపారంలో ఎదగాలంటే ఎప్పుడూ ఇతరుల మార్గదర్శకత్వం కోసం ఎదురు చూడకూడదని, స్వయంగా ఆలోచించి ముందుకు సాగాలని ధీరూభాయ్ అంబానీ ఉద్దేశ్యం. ఒక వ్యాపారాన్ని నిర్మించాలంటే నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, వాటికి పరిష్కారాలు కనుగొనే ఆత్మవిశ్వాసం అవసరమని ఆయన చెబుతారు.నిర్ణయాలపై నమ్మకంప్రస్తుత కాలానికి కూడా ధీరూభాయ్ అంబానీ మాటలు చాలా ఉపయోగపడతాయి. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఎంతో మంది యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి సిద్ధమవుతారు. అయితే.. చాలామంది ప్రతి అడుగులోనూ ఎవరో ఒకరు మార్గనిర్దేశం చేయాలని ఆశిస్తుంటారు. కానీ నిజమైన వ్యాపారవేత్త తన నిర్ణయాలపై తానే నమ్మకం ఉంచి ముందుకు సాగాలి.సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే ఇతరులపై ఆధారపడకుండా ముందుగా మనమే ఆలోచించాలి. తప్పులు చేసినా వాటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవమే మనకు ఉత్తమ గురువు. విజయవంతమైన నాయకులు తమ తప్పులను అంగీకరించి, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత బలంగా ముందుకు సాగుతారు.కొత్త ప్రయత్నాలు అవసరంఅలాగే.. జీవితంలో ప్రతి విషయం స్పష్టంగా కనిపించిన తర్వాతే చర్యలు తీసుకోవాలనే ఆలోచన కూడా సరైంది కాదు. కొన్నిసార్లు చర్యలు తీసుకున్న తర్వాతే స్పష్టత వస్తుంది. అందుకే అపజయాలకు భయపడకుండా.. కొత్త ప్రయత్నాలు చేయడం అవసరం. కాబట్టి ఎప్పుడూ ఇతరులు చెప్పేదాన్ని అనుసరించే వారిగా కాకుండా, సొంత దారిని సృష్టించే వారిగా మారితేనే విజయం సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ! -
మారిన అంబానీ ప్లేస్.. ఆసియా కుబేరుడిగా అదానీ!
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అదానీ గ్రూప్కు చెందిన పలు కంపెనీల షేర్లు భారీగా పెరగడంతో ఆయన సంపద గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో ఆసియా ధనవంతుల జాబితాలో అగ్రస్థానాన్ని ఆయన తిరిగి కైవసం చేసుకున్నారు.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఒక్క రోజులోనే అదానీ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ 89.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ పెరుగుదలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను అధిగమించి అదానీ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం అంబానీ సంపద 88 బిలియన్ డాలర్లుగా ఉండగా, సాఫ్ట్బ్యాంక్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ సంపద 87 బిలియన్ డాలర్లుగా నమోదైంది.అదానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్కు చెందిన కంపెనీల షేర్లలో నమోదైన భారీ ర్యాలీ. ముఖ్యంగా అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. వీటిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు దాదాపు 6.9 శాతం పెరగగా, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 3.8 శాతం లాభపడింది.గత నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద దాదాపు 10 బిలియన్ డాలర్లు పెరిగినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇటీవల అదానీ గ్రూప్పై నమోదైన మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులను అమెరికా న్యాయశాఖ విరమించుకున్న తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం మరింత పెరిగిందని నివేదిక తెలిపింది. అయితే.. ఆ ఆరోపణలను అదానీ, ఆయన సహచరులు మొదటి నుంచే ఖండించారు.ప్రస్తుతం అదానీ గ్రూప్కు చెందిన ఆరు ప్రధాన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ కలిపి సుమారు 191 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది గ్రూప్ వ్యాపార సామర్థ్యాన్ని, మార్కెట్లో ఉన్న బలమైన స్థానాన్ని ప్రతిబింబిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వివిధ ఆరోపణలు, మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అదానీ గ్రూప్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంది. అయితే.. ప్రస్తుతం కంపెనీల పనితీరు మెరుగుపడటం, షేర్ల ధరలు పుంజుకోవడం వల్ల గౌతమ్ అదానీ మళ్లీ ప్రపంచ ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిపాయి. -
రూ. 2,873 కోట్ల లెన్స్కార్ట్ షేర్లు అమ్మేసిన సాఫ్ట్బ్యాంక్
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ తాజాగా ఐవేర్ కంపెనీ లెన్స్కార్ట్లో 3.25 శాతం వాటా విక్రయించింది. షేరుకి రూ. 508.55 సగటు ధరలో ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 5.65 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఎన్ఎస్ఈ బ్లాక్ డీల్ వివరాల ప్రకారం వీటి విలువ రూ. 2,873 కోట్లు. అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ 2 లైట్బల్బ్(కేమాన్) ద్వారా వాటా విక్రయించింది. ఈ విక్రయానికి ముందు లెన్స్కార్ట్లో సాఫ్ట్ బ్యాంక్ వాటా 13.13 శాతంకాగా.. ప్రస్తుతం 9.88 శాతానికి తగ్గింది. ఎంఎఫ్లు వైట్ఓక్ క్యాపిటల్, మిరాయ్ అసెట్, కొటక్, కెనరా రొబెకో, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్తోపాటు.. ఇన్సూరెన్స్ కంపెనీలు హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, సొసైటీ జనరాలి తదితరాలు సాఫ్ట్ బ్యాంక్ విక్రయించిన షేర్లను కొనుగోలు చేశాయి. -
వెండి హాల్మార్కింగ్ సవాళ్లపై అధ్యయనం
న్యూఢిల్లీ: వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ నిబంధనలను తప్పనిసరి చేసేందుకు మౌలిక సదుపాయాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను అధ్యయనం చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ సంజయ్ గర్గ్ తెలిపారు. జ్యుయలరీ, కళాకృతులు, ఫర్నిచర్ తదితర రూపాల్లో కూడా వెండిని చాలా స్టోర్స్లో విక్రయిస్తారు కాబట్టి మార్కెట్పరంగా చూసినప్పుడు పసిడితో పోలిస్తే సిల్వర్ హాల్మార్కింగ్ చాలా సంక్లిష్టంగా ఉంటుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.బీఐఎస్లో మొత్తం హాల్మార్కింగ్ కార్యకలాపాలను కేవలం అయిదుగురు మాత్రమే పర్యవేక్షిస్తుంటారని, మిగతా సిబ్బంది అంతా ప్రైవేట్ లేదా ఔట్సోర్సింగ్ వారే అయి ఉంటారని గర్గ్ చెప్పారు. ప్రైవేట్ వర్గాల సహాయంతో హాల్మార్కింగ్ సెంటర్లను నిర్వహించడం, నమ్మకాన్ని చూరగొనడం అనేది చాలా కష్టతరమైన విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి సిల్వర్ హాల్మార్కింగ్ని క్రమంగా అమల్లోకి తేనున్నట్లు గర్గ్ చెప్పారు.2005 నుంచి వెండికి హాల్మార్కింగ్ స్వచ్ఛందంగా అమలవుతోంది. 2025 సెప్టెంబర్ నుంచి సిల్వర్ ఆర్టికల్స్ స్వచ్ఛతకు సంబంధించి హాల్మార్క్ విశిష్ట గుర్తింపు (యూహెచ్ఐడీ) సంఖ్యను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం వెండి ఆభరణాలను పరీక్షించేందుకు బీఐఎస్ గుర్తింపు పొందిన అసేయింగ్, హాల్మార్కింగ్ సెంటర్లు (ఏహెచ్సీ) సుమారు 230 ఉన్నాయి. -
2030 నాటికి 20% మార్కెట్ వాటా
న్యూఢిల్లీ: భారతీయ ఆటోమొబైల్ రంగం 2030 నాటికి ఏటా 60 లక్షల వాహనాల విక్రయాల దిశగా భారీగా వృద్ధిని సాధిస్తుందన్న అంచనాల నేపథ్యంలో అందులో దాదాపు 12 లక్షల వాహన విక్రయాలు తమవే ఉండాలని టాటా మోటర్స్ నిర్దేశించుకుంది. తద్వారా 20 శాతం పైగా మార్కెట్ వాటాను దక్కించుకోవాలని టాటా మోటర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గోవాలో జరిగిన టాటా మోటార్స్ డీలర్ల వార్షిక బిజినెస్ ప్లానింగ్ సమావేశం–2026లో టాటా సన్స్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక మైలురాయిని అందుకునేందుకు రూ. 35,000 కోట్ల భారీ మూలధన పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. మార్కెట్ పురోగతిని బట్టి ఈ ప్రణాళికను మరింత విస్తరిస్తామని చెప్పారు. డీలర్లదే కీలక పాత్ర టాటా మోటార్స్ భవిష్యత్ విజయం డీలర్ల చేతుల్లోనే ఉందని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ‘‘కంపెనీ తరఫున కొత్త మోడళ్లు, ఆవిష్కరణలను వేగంగా మార్కెట్లోకి తీసుకువస్తాము. అయితే సేల్స్ అనుభవం, సరీ్వస్ నాణ్యత, కస్టమర్ల నమ్మకాన్ని పొందడంలో డీలర్ నెట్వర్క్ బలంగా పనిచేసినప్పుడే అనుకున్న మైలురాళ్లను చేరుకోగలము’’ అని చంద్రశేఖర్ వివరించారు. కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు రాణించే సంస్థలే నిజమైన గొప్ప కంపెనీలుగా నిలుస్తాయన్నారు. ఇందుకోసం డీలర్లందరూ సరికొత్త ఆలోచనా దృక్పథంతో ముందుకు సాగాలని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.అప్పట్లో వ్యాపారం మూసేయమన్నారు .. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘‘2017లో ప్యాసింజర్ వాహనాల (కార్ల) వ్యాపారం మూసివేసి, కేవలం కమర్షియల్ వాహనాలపైనే దృష్టి పెట్టాలని కంపెనీలో చర్చలు జరిగాయి. కానీ, మనమందరం కలిసి సాధించిన కృషి కారణంగా ఈ రోజు భారతీయ కార్ల మార్కెట్లో టాప్–2 స్థానాల్లో ఒకటిగా గర్వంగా నిలబడ్డాం’’ అని చంద్రశేఖరన్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో కంపెనీ సాధించిన నాయకత్వాన్ని, నిలకడగా మెరుగుపడుతున్న ఆర్థిక పనితీరును ఆయన కొనియాడారు. -
ఐదు నెలల్లో లక్ష ఉద్యోగాలు మాయం!
టెక్ రంగంలో ఉద్యోగాలు కోతలు భారీగా పెరుగుతున్నాయి. 2026 ప్రారంభం నుంచి కేవలం ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1,16,000కు పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్లు లేఆఫ్.ఫై (Layoff.fyi) ట్రాకర్ వెల్లడించింది.లక్షలాది ఉద్యోగాలు పోవడానికి ప్రధాన కారణం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందడం అని తెలుస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కూడా కొన్ని పెద్ద కంపెనీలు ఉద్యోగ కోతలకు పాల్పడుతున్నాయి. మార్చి నెలలో మాత్రమే 46,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. మే నెలలో 28,000 ఉద్యోగాలు తొలగింపులు జరిగాయి.భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో మెటా, పేపాల్, సిస్కో, ఇంట్యూట్, క్లౌడ్ఫ్లేర్, లింక్డ్ఇన్, ఉబర్ మొదలైన కంపెనీలు ఉన్నాయి.ఉబర్ తన పీపుల్ అండ్ ప్లేసెస్ డివిజన్లో సుమారు 23 శాతం సిబ్బందిని తగ్గించింది. సిస్కో 4,000 ఉద్యోగాలను తొలగిస్తూ, అదే సమయంలో కృత్రిమ మేధస్సు, సెక్యూరిటీ రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించింది. పేపాల్ అయితే రానున్న రోజుల్లో మరింతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, తన ప్రణాళికను కూడా వెల్లడించింది. మెటా కంపెనీ కూడా తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో భారీ మొత్తంలో తగ్గిస్తూ, ఏఐ ఆధారిత ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది. -
పర్యావరణ పరిరక్షణలో కార్పొరేట్లు
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్పొరేట్లు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ తమ ప్రాజెక్టులవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, ఉద్యోగులు.. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంపై పోటీలు నిర్వహించింది. భూగ్రహాన్ని కాపాడుకోవడం మానవాళి శ్రేయస్సుకి కీలకమని సంస్థ సీఎండీ అమితవ ముఖర్జీ తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాలు సహా దక్షిణాదిలో అయిదు రాష్ట్రాలవ్యాప్తంగా ఓపెన్ ఫర్ ది ప్లానెట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది.ఇందులో 8,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నట్లు పేర్కొంది. మొక్కలు నాటడం, క్లీన్–అ–థాన్ కార్యక్రమాలు, కొత్త తరం గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం ఈవీ డిస్ప్లే జోన్ల ఏర్పాటు మొదలైనవి చేసినట్లు వివరించింది. కార్యకలాపాలు, వ్యవసాయ వాల్యూ చెయిన్స్వ్యాప్తంగా వాతావరణంపరమైన రిసు్కలను మదింపు చేసేందుకు కృత్రిమ మేథను ఉపయోగిస్తున్నట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ వెల్లడించింది. తద్వారా ఆయా సందర్భాలకు అనువైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. అటు, క్లైమేట్ యాక్షన్, లో-కార్బన్ మొబిలిటీపై వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది.పర్యావరణహిత మొబిలిటీ దిశగా భారత్ గణనీయంగా పురోగతి సాధించినట్లు సియామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కె. బెనర్జీ తెలిపారు. వనరులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, స్వచ్ఛ టెక్నాలజీలను వేగవంతంగా వినియోగించుకోవడం తదితర చర్యలతో భారత్ నిర్దేశించుకున్న తటస్థ స్థాయి ఉద్గారాల లక్ష్య సాధనకు తోడ్పడుతున్నట్లు సిమెంటు తయారీ సంస్థల అసోసియేషన్ సీఎంఏ తెలిపింది. -
‘జీ’ కొత్త ఇన్నింగ్స్.. నాలుగు స్పోర్ట్స్ ఛానళ్లు ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రపంచ ఫుట్బాల్ పాలక సంస్థ ఫిఫాతో ఎనిమిదేళ్ల డీల్ కుదుర్చుకున్న ‘జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్’ (జీఈఈఎల్) క్రీడా ప్రసారాల రంగంలోకి ప్రవేశించింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ‘యునైట్8 స్పోర్ట్స్’ పేరిట క్రీడా ఛానళ్ల పోర్ట్ఫోలియోను ప్రారంభించినట్లు ప్రకటించింది. 2026 ఫిఫా వరల్డ్కప్తో పాటు ఫిఫా టోర్నీలను భారత ప్రేక్షకులకు ప్రసారం చేయనుంది.దేశవ్యాప్తంగా 500కుపైగా కేబుల్, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫారమ్లలో యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డీ ఛానళ్లు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ నెట్వర్క్లో ఫుట్బాల్తో పాటు క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడల ప్రసారాలు ఉంటాయి.‘‘డిస్ట్రిబ్యూషన్ భాగస్వాముల సహకారంతో వీక్షకులకు అంతరాయం లేని ప్రసారాలు అందించడమే మా లక్ష్యం. రానున్న ఫిఫా ఈవెంట్లను మా ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశవ్యాప్తంగా క్రీడాభిమానులకు మెరుగైన వీక్షణ అనుభూతిని అందిస్తాం’’ అని యునైట్8 స్పోర్ట్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ భవేష్ జనావ్లేకర్ తెలిపారు. -
‘ఈ సిటీలో రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నా చాలడం లేదు’
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో జీవన వ్యయం ఎంత వేగంగా పెరుగుతోందో మరోసారి చర్చనీయాంశమైంది. భార్యాభర్త ఇద్దరూ కలిసి నెలకు రూ.2.2 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ నెలాఖరుకు చేతిలో డబ్బు మిగలడం లేదంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. తమ ఖర్చులను నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆర్థిక ప్రణాళికపై సూచనలు ఇవ్వాలని వారు కోరారు.అద్దె, పెట్టుబడులు, ప్రయాణ ఖర్చులే భారమా?రెడ్డిట్లో చేసిన పోస్టు ప్రకారం, ఈ దంపతులు ముంబైలో ఒక 1BHK ఫ్లాట్లో నివసిస్తున్నారు. నెలకు రూ.44 వేల అద్దె చెల్లిస్తున్నారు. కిరాణా సరుకులకు సుమారు రూ.20 వేల వరకు ఖర్చవుతుండగా, పనిమనిషి జీతం రూ.8 వేలు, విద్యుత్, ప్రయాణ ఖర్చులు కలిపి మరో రూ.10-12 వేల వరకు వెళ్తున్నాయి. వీటితో పాటు ప్రతి నెలా రూ.60 వేల మేర సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP)లో పెట్టుబడి పెడుతున్నారు.అంతేకాకుండా ఉద్యోగ సంబంధిత సామాజిక కార్యక్రమాలు, పార్టీలు, సమావేశాల కోసం నెలకు రూ.12 వేల నుంచి రూ.13 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. లెక్కల ప్రకారం ఇంకా సుమారు రూ.60 వేల వరకు మిగలాల్సి ఉన్నప్పటికీ, నెలాఖరుకు ఆ మొత్తం కూడా ఖర్చయిపోతోందని వారు పేర్కొన్నారు.చిన్న చిన్న ఖర్చులే పెద్ద భారంబట్టలు, వాచ్లు, పర్ఫ్యూమ్లు కొనడం వంటి వ్యక్తిగత ఖర్చులతో పాటు స్వగ్రామానికి వెళ్లి వచ్చేందుకు ప్రయాణాలపై కూడా భారీగా ఖర్చవుతోందని దంపతులు తెలిపారు. ఒక్కోసారి కుటుంబ సభ్యుల కోసం బహుమతులు, ఇతర అవసరాలతో కలిపి ఒక్కో ప్రయాణానికే రూ.45 వేల వరకు వెచ్చిస్తున్నామని వివరించారు.భవిష్యత్తులో పిల్లలను కనాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఖర్చు విధానం దీర్ఘకాలంలో నిలకడగా ఉంటుందా అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు.“సిప్ కూడా పొదుపే”.. నెటిజన్ల సలహాలుఈ పోస్టుపై స్పందించిన పలువురు నెటిజన్లు, నెలకు రూ.60 వేలు సిప్లో పెట్టుబడి పెడుతున్నారు కదా దీన్ని కూడా పొదుపుగా పరిగణించాలని సూచించారు. రోజువారీ ఖర్చులను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురైతే సిప్ చేసే మొత్తాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవచ్చని అభిప్రాయపడ్డారు.మరికొందరు అసలు సమస్య ఆదాయం తక్కువగా ఉండటంలో కాదని, ఖర్చుల నియంత్రణలోనే ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఆఫీస్ పార్టీల పేరుతో ప్రతి నెలా రూ.12-13 వేల వ్యయం చేయడం, అవసరం లేని కొనుగోళ్లు, తరచూ ఖరీదైన ప్రయాణాలు చేయడం వంటి అంశాలను తగ్గిస్తే పొదుపు పెరుగుతుందని సూచించారు.మెట్రో నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంఇటీవలి సంవత్సరాల్లో ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో అద్దెలు, రవాణా, తిండి, సేవల ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో మంచి వేతనాలు పొందుతున్న మధ్యతరగతి ఉద్యోగులు సైతం ఆర్థిక ప్రణాళిక, ఖర్చుల నియంత్రణ, పెట్టుబడుల సమతుల్యతపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ముంబై దంపతుల పోస్ట్ నగర జీవనశైలిపై, ఆదాయం-ఖర్చుల సమతుల్యతపై విస్తృత చర్చకు దారితీసింది. -
ట్రైన్ టికెట్ దొరకట్లేదా.. అసలు కారణం ఇదే!
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు.. అవినీతి, మోసపూరిత కార్యకలాపాలను అరికట్టేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రైల్వే టికెట్ల బుకింగ్లో జరుగుతున్న అక్రమాలను నియంత్రించేందుకు ఈ సన్నాహాలు చేస్తోంది.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. రైలు టికెట్లు పొందడం ప్రయాణికులకు చాలా కష్టంగా మారింది. టికెట్ బుకింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే సీట్లు పూర్తవుతున్నాయని చాలామంది ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణంగా బాట్స్, టౌట్స్, నకిలీ ఖాతాలు, మోసపూరిత యూజర్ ఐడీలు అని అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో ఐఆర్సీటీసీ మూడు కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. అదనంగా మరో ఆరు కోట్ల ఖాతాలను పరిశీలన కోసం గుర్తించింది. టికెట్ బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.అంతేకాకుండా.. 4.2 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించిన 501 ఫిర్యాదులను నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో నమోదు చేసింది. అలాగే నకిలీ డిజిటల్ గుర్తింపులతో సంబంధం ఉన్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను కూడా బ్లాక్ చేసింది. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు టికెట్లు అందుబాటులోకి రావడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.ట్రైన్ టికెట్ తొందరగా బుక్ అవ్వాలంటే?మీ IRCTC ఖాతాలో ముందుగానే లాగిన్ అయి ఉండండి.ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోండి.వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించండి.బుకింగ్ ప్రారంభ సమయానికి 5-10 నిమిషాల ముందే సిద్ధంగా ఉండండి.యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ వివరాలను ముందుగానే సిద్ధం చేసుకోండి.తత్కాల్ టికెట్ అయితే బుకింగ్ ఓపెన్ అయ్యే సమయానికే ప్రయత్నించండి.ఒకేసారి అనేక బ్రౌజర్ ట్యాబ్లు లేదా పరికరాల్లో ప్రయత్నించవద్దు.తక్కువ రద్దీ ఉన్న ప్రత్యామ్నాయ రైళ్లు, తేదీలను కూడా పరిశీలించండి.బుకింగ్ పూర్తయ్యే వరకు పేజీని రిఫ్రెష్ చేయకుండా జాగ్రత్తగా కొనసాగించండి.ఇదీ చదవండి: డబ్బు కోసమే వ్యాపారం చేయాలా?: రిచ్ డాడ్ క్లారిటీ -
కోట్లలో లాభాల పంట.. కంపెనీలో లేఆఫ్స్ మంట!
టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ మునుపెన్నడూలేని విధంగా భారీగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. కంపెనీ క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ విభాగాల్లో రికార్డు స్థాయి వృద్ధిని, బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేస్తున్నప్పటికీ.. ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తుండటం ఐటీ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. టెక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో దాదాపు 18 శాతం మందిని తొలగించే ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ ఉద్వాసనకు ప్రభావితమైన ఉద్యోగుల అధికారిక పీరియడ్ జూన్ 1 నుంచి జూన్ 15 మధ్య ముగియనుంది.లాభాల బాటలో ఒరాకిల్..వ్యాపార పరంగా ఒరాకిల్ వృద్ధిని కనబరుస్తున్న తరుణంలోనే ఈ లేఆఫ్స్ నిర్ణయం రావడం గమనార్హం. 2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను పరిశీలిస్తే.. ఏడాది ప్రాతిపదికన 22 శాతం వృద్ధి చెంది 17.2 బిలియన్ డాలర్ల లాభం నమోదైంది. క్లౌడ్ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 44 శాతం పెరిగి 8.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఏఐ అప్లికేషన్ల అభివృద్ధికి కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐ విభాగం ఏకంగా 243 శాతం, మల్టీక్లౌడ్ డేటాబేస్ ఆదాయం 531 శాతం వృద్ధిని సాధించాయి.ఉద్యోగాలను ఎందుకు తగ్గిస్తోంది?రికార్డు లాభాలు వస్తున్నప్పటికీ ఒరాకిల్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యూహాత్మక పునర్నిర్మాణ ప్రణాళిక ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ విభాగాల నుంచి వనరులను తగ్గించి, వాటిని పూర్తిగా ఏఐ మౌలిక సదుపాయాలు, క్లౌడ్ విస్తరణ వైపు మళ్లించాలని ఒరాకిల్ భావిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 50 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని కేటాయించింది. ఇందులో అధికంగా ఏఐ డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకే ఖర్చు చేయనున్నారు. ఓపెన్ఏఐ, సాఫ్ట్బ్యాంక్ మద్దతుతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భారీ స్థాయి ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ‘స్టార్ గేట్’లో ఒరాకిల్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.సెవెరెన్స్ ప్యాకేజీపై అసంతృప్తిఒకవైపు కంపెనీ భారీ లాభాలను ప్రకటిస్తూ మరోవైపు ఉద్యోగాల నుంచి తొలగిస్తుండటంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపెనీ ఆఫర్ చేసిన సెవెరెన్స్ (విడదీత) ప్యాకేజీ నిబంధనలపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. అన్వెస్టెడ్ (ఇంకా చేతికి రాని) స్టాక్ అవార్డుల విషయంలో తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. ఒరాకిల్ అందిస్తున్న సెవెరెన్స్ ప్యాకేజీలో పదవీకాలం ఆధారిత పరిహారాన్ని గరిష్టంగా 26 వారాలకే పరిమితం చేశారు.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
ఏఐ వైపు నిధులు.. జీతాల పెంపునకు బ్రేకులు!
ఐటీ రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకు ఉద్యోగాల కోతకే పరిమితమైన ఏఐ ముప్పు.. ఇప్పుడు నేరుగా ఉద్యోగుల వార్షిక వేతన ప్యాకేజీలు, ఇంక్రిమెంట్లపై పడింది. సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలు తమ వ్యాపార శైలిని పూర్తిగా మార్చేస్తున్నాయి. పనులను వేగవంతం చేయడానికి ఏఐపై పెట్టుబడులను భారీగా పెంచుతూ అందుకోసం ఉద్యోగుల జీతాల పెంపునకు బ్రేకులు వేస్తున్నాయి. తాజాగా, గ్లోబల్ క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘టెరాడేటా’ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఏఐ వైపు మళ్లుతున్న నిధులుప్రముఖ అంతర్జాతీయ బిజినెస్ జర్నల్ ‘బిజినెస్ ఇన్సైడర్’ నివేదిక ప్రకారం.. టెరాడేటా సంస్థ తన ఉద్యోగుల వార్షిక వేతన పెంపును ఈ ఏడాదికి పూర్తిగా నిలిపివేయాలని (ఫ్రీజ్) నిర్ణయించింది. ఈ బడ్జెట్ను నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా మళ్లించడమే దీనికి ప్రధాన కారణం. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 5,100 మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ఈ ఏడాది వార్షిక జీతాల సర్దుబాటు ఉండబోదని కంపెనీ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన ఒక అంతర్గత మెమోలో స్పష్టం చేశారు.‘మార్కెట్లోకి సరికొత్త ఏఐ ఆవిష్కరణలను తీసుకురావడానికి, ఈ రంగానికి చెందిన నిపుణులను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందుకే ఈ ఏడాది వార్షిక జీతాల బడ్జెట్ను పునసమీక్షించి ఆ నిధులను ఏఐ పెట్టుబడులకు కేటాయిస్తున్నాం’ అని టెరాడేటా సీఈఓ స్టీవ్ మెక్మిలన్ అన్నారు. అయితే, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్లు, ఈక్విటీ షేర్లను మాత్రం యథావిధిగా అందిస్తామని కంపెనీ పేర్కొంది.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
పెట్రోల్ కన్నా రూ.20 తక్కువ.. ఈ85 ఇంధనం
న్యూఢిల్లీ: ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల కోసం దేశీయంగా ఈ85 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని ఇండియన్ఆయిల్ రిటైల్ ఔట్లెట్లో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి దీన్ని ఆవిష్కరించారు.సాధారణ పెట్రోల్తో పోలిస్తే దీని ధర లీటరుకు రూ. 20 మేర తక్కువకే లభిస్తుంది. ప్రాథమికంగా ఇది ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రమే లభిస్తుంది. ఫ్లెక్స్ ఫ్యుయల్ ఇంజిన్లున్న వాహనాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించడానికి వీలవుతుంది. తొలుత 48 ప్రభుత్వ రంగ బంకులతో ప్రారంభించి 2026 డిసెంబర్ నాటికి 500 ఔట్లెట్స్లో, 2027 డిసెంబర్ నాటికి 5,000 ఔట్లెట్స్లోను అందుబాటులోకి తెస్తారు.80–85 శాతం ఇథనాల్, 14–19 శాతం పెట్రోల్ ఉండే మిశ్రమ ఇంధనాన్ని ఈ85గా వ్యవహరిస్తారు. ఈ20 నుంచి ఈ100 వరకు ఇథనాల్ మిశ్రమాలపై పని చేసే ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాలకు ఇది అనువుగా ఉంటుంది. -
కొత్త ట్రెండ్.. ‘ఇన్సూరెన్స్’ సీఈఓల రాజీనామాలు..
న్యూఢిల్లీ: భారతీయ జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ప్రముఖ బీమా సంస్థల సీఈఓలు తమ పదవులకు రాజీనామా చేసి సొంత వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో సాధారణ బీమా (జనరల్ ఇన్సూరెన్స్) రంగంలో వృద్ధి అవకాశాలు ఇంకా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడం, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. బీమా రంగంలో అపార అనుభవం కలిగిన సీఈఓలకు ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థల నుంచి గణనీయమైన నిధుల మద్దతు లభిస్తోంది.ఐఆర్డీఏఐ సంస్కరణలు.. డిజిటల్ జోరు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన పలు సంస్కరణలతో వ్యాపార నిర్వహణ సులభతరమైంది. దీంతో బీమా రంగం ‘ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ’గా మారింది. కొత్త సంస్థల ప్రవేశాన్ని కూడా నియంత్రణ సంస్థ సానుకూలంగా స్వాగతిస్తోంది. మరోవైపు ‘బీమా సుగమ్’ వంటి డిజిటల్ పంపిణీ మౌలిక సదుపాయాలు, యూపీఐ తరహా కస్టమర్ యాక్సెస్ విధానాలు బీమా రంగ వ్యాపార నమూనాలను మౌలికంగా మార్చుతున్నాయి. బీమా రంగంలో అపార అవకాశాలు ఆసియా ఆర్థిక సేవల రంగంలో భారత జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమ అత్యంత ఆకర్షణీయమైన వృద్ధి అవకాశాల్లో ఒకటిగా నిలుస్తోందని అపియరీ కన్సల్టింగ్ మేనేజింగ్ పార్ట్నర్ హరిహరన్ రామకృష్ణన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణ బీమా వ్యాప్తి జీడీపీలో సగటున నాలుగు శాతానికి పైగా ఉండగా, భారత్లో అది కేవలం ఒక శాతానికే పరిమితమైందన్నారు. దీంతో దేశీయ మార్కెట్లో భారీ వృద్ధి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.‘‘కేవలం పెట్టుబడులతోనే ఈ మార్కెట్లోని అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకోవడం సాధ్యం కాదని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు గుర్తించాయి. ఈ అవకాశాలను విజయవంతమైన వ్యాపారాలుగా మలచడానికి అనుభవజ్ఞులైన రంగ నిపుణులు అవసరం. సుదీర్ఘ అనుభవం కలిగిన సీఈఓలు నియంత్రణ సంస్థలతో సంబంధాలు, పంపిణీ వ్యవస్థపై నమ్మకం, రిస్క్ అంచనా సామర్థ్యం వంటి కీలక బలాలను వెంట తెచ్చుకుంటారు. కొత్త సంస్థలు ఇదే స్థాయి విశ్వసనీయతను, నైపుణ్యాన్ని సొంతం చేసుకోవడానికి సాధారణంగా దశాబ్ద కాలం పడుతుంది’’ అని రామకృష్ణన్ తెలిపారు.స్టార్ హెల్త్ ఒక ఆదర్శం ‘‘యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సీఎండీగా పదవీ విరమణ చేసిన అనంతరం వెంకటసామి జగన్నాథన్ చెన్నైలో చిన్న కార్యాలయం నుంచి ప్రారంభించిన స్టార్ హెల్త్ను రూ.30,000 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. విషయ పరిజ్ఞానం, వ్యాపార దృక్పథం, ఓపికతో కూడిన పెట్టుబడులు కలిస్తే ఎంతటి విజయాన్ని సాధించవచ్చు అనేందుకు స్టార్ హెల్త్ ఉదంతం నిరూపించింది’’ అని అని రామకృష్ణన్ పేర్కొన్నారు.రాజీనామాలు.. కొత్త సంస్థల ఏర్పాటు బీమా రంగంలో విశేష అనుభవం ఉన్న పలువురు మాజీ సీఈఓలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థల మద్దతుతో కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు.నీలేష్ గార్గ్ (కివి జనరల్ ఇన్సూరెన్స్)టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ మాజీ ఎండీ, సీఈఓ నీలేశ్ గార్గ్ అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్తో కలిసి ‘కివీ జనరల్ ఇన్సూరెన్స్’ను స్థాపించారు. ఈ సంస్థలో వెస్ట్బ్రిడ్జ్ 70 శాతం, గార్గ్ 30 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఇన్సూరెన్స్ నియంత్రణ సంస్థ ‘ఐఆర్డీఏఐ’ మార్చి 2026లో ఈ సంస్థకు రిజి్రస్టేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసింది.అనుజ్ త్యాగి (హెచ్డీఎఫ్సీ ఎర్గో)కివీ జనరల్ ఇన్సూరెన్స్కు అనుమతి లభించిన మూడు నెలలకే హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనుజ్ త్యాగి తన వ్యాపార లక్ష్యాలను కొనసాగించేందుకు పదవికి రాజీనామా చేశారు.అనూప్ రావు (జెనరాలి సెంట్రల్ ఇన్సూరెన్స్) ఇదే ఏడాది మార్చిలో జెనరాలి సెంట్రల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ అనూప్ రావు తన ఏడేళ్ల పదవీకాలం అనంతరం వైదొలిగారు. ఆయన కొత్త బీమా సంస్థలో షేర్హోల్డర్ లేదా ఫౌండేషన్ భాగస్వామిగా చేరే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే నెలల్లో మరో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ కూడా వైదొలిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
ఏఐ మౌలిక సదుపాయాల ‘మహారాజులు’!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా ఎన్విడియా వంటి సాఫ్ట్వేర్, సెమీకండక్టర్ దిగ్గజాలే గుర్తుకు వస్తాయి. ఈ రేసులో భారతదేశం నేరుగా సాఫ్ట్వేర్ రంగంలో అగ్రగామిగా కనిపించకపోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఏఐ విప్లవానికి వెన్నుముకగా నిలుస్తూ భారత్కు చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తూ 2026 స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీలు మెరుగ్గా రాణిస్తున్నాయి.ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఏఐ మౌలిక సదుపాయాల సరఫరా గొలుసుతో ముడిపడి ఉన్న 28 భారతీయ కంపెనీలు ఈ ఏడాది మార్కెట్లో ఏకంగా 47 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.9 లక్షల కోట్లు) అదనపు విలువను జోడించాయి. వీటి ఉమ్మడి మార్కెట్ విలువ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం పెరగడం గమనార్హం.దలాల్ స్ట్రీట్లో కొత్త ట్రెండ్భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ ధోరణిని ‘ఏఐ కాపెక్స్ ట్రేడ్’ అని పిలుస్తున్నారు. దీనిపై యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) ఆర్.శివకుమార్ మాట్లాడుతూ ‘ఏఐ సాఫ్ట్వేర్ రేసులో భారతదేశం ముందంజలో లేకపోవచ్చు. కానీ గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై జరుగుతున్న భారీ వ్యయం నుంచి మన కంపెనీలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. పెట్టుబడిదారులు డేటా సెంటర్లు, విస్తృత సరఫరా గొలుసుతో అనుసంధానించిన కంపెనీలపై దృష్టి పెట్టాలి’ అని విశ్లేషించారు.దూసుకుపోతున్న స్వదేశీ కంపెనీలుస్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్: వేదాంత గ్రూప్నకు చెందిన ఈ ఆప్టికల్-ఫైబర్ కంపెనీ షేర్లు 2026లో ఏకంగా 530 శాతానికి పైగా పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది మే నెలలో ఈ కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల (రూ.9,000 కోట్లకు పైగా) మల్టీ ఇయర్ మెగా ఒప్పందాన్ని దక్కించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్: స్టెర్లైట్ ప్రత్యర్థి అయిన హెచ్ఎఫ్సీఎల్ షేర్లు కూడా ఈ ఏడాది 191 శాతం మేర లాభపడ్డాయి.ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్: ప్రెసిషన్ కూలింగ్, పవర్ కాంపోనెంట్స్ తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఈ ఏడాది ఏకంగా మూడు రెట్లు పెరిగింది.గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అవసరమైన పరికరాలను అందిస్తూ హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఏబీబీ ఇండియా లిమిటెడ్, కమ్మిన్స్ ఇండియా లిమిటెడ్ వంటి పారిశ్రామిక కంపెనీలు కూడా ఈ ర్యాలీలో భారీగా లబ్ధి పొందుతున్నాయి.ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు భారతదేశాన్ని ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్గా మారుస్తున్నాయి. ఇందులో భాగంగా భారీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయి.అమెజాన్: 2030 నాటికి క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసం 12.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.ఆల్ఫాబెట్ (గూగుల్): విశాఖపట్నంలోని ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ కోసం 15.0 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.రిలయన్స్ జాయింట్ వెంచర్: దేశీయంగా స్థానిక డేటా సెంటర్ల నిర్మాణం కోసం 11.0 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది.అదానీకనెక్స్: గూగుల్, ఉబెర్లతో భాగస్వామ్యం కుదుర్చుకొని అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.సెల్లర్స్ మార్కెట్గా..‘డేటా సెంటర్లను నిర్మించడానికి, పవర్ సప్లై చేయడానికి, వాటిని చల్లబరచడానికి అవసరమైన పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కొరత ఉంది. కొన్ని విడిభాగాల డెలివరీ కోసం ప్రస్తుతం 2 నుంచి 4 ఏళ్ల వెయింటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఇది తయారీదారులకు ‘సెల్లర్స్ మార్కెట్’గా మారింది. ఇప్పుడు గెలుచుకుంటున్న ఆర్డర్లు 2027-2029 మధ్య కంపెనీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి’ అని నోమురా నివేదికలో విశ్లేషించింది. నోమురా అంచనా ప్రకారం, ప్రస్తుత డేటా-సెంటర్ బూమ్ అనేది గతంలోని గ్లోబల్ 4జీ వైర్లెస్ రోల్అవుట్, 2008 నాటి ఎల్ఎన్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, 2010ల నాటి షేల్ గ్యాస్ బూమ్ కంటే చాలా పెద్దది.రూ.100 లక్షల కోట్ల మార్కెట్.. కానీ..మరో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘ఏంజెల్ వన్’ నివేదిక ప్రకారం డేటా సెంటర్లలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులు 2025-2027 మధ్య 1.2 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.100 లక్షల కోట్లు) దాటనున్నాయి. ఏఐ అనేది కేవలం సాఫ్ట్వేర్ అవకాశం మాత్రమే కాదని, ఇది దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల పెట్టుబడి చక్రాన్ని సృష్టిస్తోందని ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నట్లు ఏంజెల్ వన్ చెప్పింది. అయితే, ఇదే సమయంలో వాల్యుయేషన్ల పరంగా హెచ్చరికలు కూడా వస్తున్నాయి.ఏఐ అవకాశాల గురించి కేవలం ప్రకటనలు చేసే కంపెనీల కంటే ఇప్పటికే ఏఐ సంబంధిత వ్యాపారం ద్వారా ఆదాయాన్ని చూపిస్తున్న కంపెనీలకే మార్కెట్ ప్రాధాన్యత ఇస్తోంది. కానీ, కొన్ని కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికే విపరీతంగా పెరగడం వల్ల అధిక వాల్యుయేషన్ల ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ధరల వద్ద కంపెనీల ఫలితాల్లో ఎలాంటి చిన్న తప్పు లేదా నిరాశ ఎదురైనా స్టాక్స్ పతనం కావడానికి ఆస్కారం ఉందని గమనించాలి.గమనిక: స్టాక్ మార్కెట్ ద్వారా ఏదైనా కంపెనీలో నేరుగా పెట్టుబడి పెట్టేముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం! -
కారును ట్రైన్లో ఎలా పంపాలంటే..?
ఉద్యోగం, చదువులు లేదా ఇతరత్రా కారణాల వల్ల కొత్త నగరానికి మారాల్సి వచ్చినప్పుడు, చాలామందికి ఎదురయ్యే సమస్య కారును తరలించడం. చిన్న దూరాలకు అయితే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు, కానీ.. వందలు లేదా వేల కిలోమీటర్లు స్వయంగా డ్రైవ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి వారు ఇండియన్ రైల్వే కార్ పార్సిల్ సేవను ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేస్ తమ పార్సిల్ సేవల ద్వారా వాహనాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. దీనికోసం వాహన యజమానులు తాము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారో.. సమీప రైల్వే స్టేషన్లోని పార్సిల్ కార్యాలయంలో బుక్ చేయాలి. ఆ తరువాత ప్రత్యేక క్యారియర్ బోగీలో కారును లోడ్ చేసి గమ్యస్థానానికి పంపిస్తారు. కారును పంపే వ్యక్తి అదే రైలులో ప్రయాణించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 1,400 కిలోమీటర్లకు పైబడిన దూరాలకు ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కారును రైలులో పంపించాలంటే కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు, చిరునామాకు సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కూడా సమర్పించాలి. అలాగే రైల్వే పార్సిల్ కార్యాలయంలో అప్లికేషన్ ఫామ్ను నింపాలి.బుకింగ్ ప్రక్రియలో మొదట.. వాహన లోడింగ్, అన్లోడింగ్ సదుపాయం ఉన్న రైల్వే స్టేషన్లను గుర్తించాలి. ఆ తరువాత అవసరమైన పత్రాలతో పార్సిల్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. అధికారులు వాహనాన్ని పరిశీలించి, దాని బరువు, పరిమాణం, ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలను నిర్ణయిస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తైన తర్వాత కారును ప్రత్యేక బోగీలో భద్రంగా తరలిస్తారు.రవాణా ఖర్చులు అనేవి వాహనం రకం, ప్రయాణ దూరం వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు ఢిల్లీ నుంచి ముంబై వరకు ఒక చిన్న కారును తరలించడానికి సుమారు రూ.8,000 నుంచి రూ.13,000 వరకు ఖర్చవుతుంది. బెంగళూరు నుంచి ఢిల్లీ వంటి దూర ప్రాంతాలకు ఈ ఖర్చు రూ.13,000 నుంచి రూ.19,000 వరకు ఉండవచ్చు. ఖచ్చితమైన ఛార్జీలను సంబంధిత రైల్వే పార్సిల్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు.కారును అప్పగించే ముందు దానిని శుభ్రపరచడం, వివిధ కోణాల్లో ఫోటోలు తీసుకోవడం, వ్యక్తిగత వస్తువులను తొలగించడం, ఇంధన స్థాయిని తక్కువగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనితో పాటు అలారం సిస్టంను కూడా నిలిపివేయడం మంచిదని చెబుతారు. మొత్తం మీద దూర ప్రాంతాలకు కారును తరలించడానికి రైల్వే కార్ పార్సిల్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టమవుతోంది. -
మరోసారి 300 మందికి ఉచిత వీసాలు
మోర్తాడ్(బాల్కొండ): యూఏఈలో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకోసం యూఏఈకి చెందిన ఏడీఎన్హెచ్, మన దేశానికి చెందిన జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ మేళా నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈనెల 12న సిరిసిల్ల, జగిత్యాల, 13న నిజామాబాద్, ఆర్మూర్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. ఎంపికైన వారికి ఉచితంగా వీసాలు ఇచ్చి, విమాన చార్జీలను సైతం కంపెనీయే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు రూ.24 వేల వేతనం చెల్లిస్తూ.. నివాసం, భోజన సదుపాయాన్ని ఏడీఎన్హెచ్ కంపెనీ సమకూర్చనుంది. వివరాల కోసం సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999 నంబర్లలో సంప్రదించాలి.ఈ సందర్భంగా జీటీఎం సంస్థ చైర్మన్ సతీష్రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉచితంగా వీసాలు జారీ చేసే అవకాశం తమ సంస్థకు రావడం ఎంతో విశేషం అన్నారు. వలస వెళ్లేవారిపై నయాపైసా భారం లేకుండా అన్ని వసతులు ఉచితంగా సమకూర్చడం తమ ప్రత్యేకత అని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
రూ.6,000 కోట్ల డీల్: ఐనాక్స్ క్లీన్ చేతికి వేనా ఎనర్జీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ తాజాగా వేనా ఎనర్జీ ఇండియా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకుంది. తద్వా రా 6 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోను సొంతం చేసుకోనుంది. సంబంధిత వర్గాల అంచనా ప్రకారం ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లుకాగా.. వేనా ప్రస్తుతం 1.2 గిగావాట్ల నిర్వహణలోని ఇంధన ఆస్తులతోపాటు.. త్వరలో ప్రారంభంకానున్న చివరి దశ అభివృద్ధిలోని 1.8 గిగావాట్ల ప్రాజెక్టులను కలిగి ఉంది.వీటికి జతగా మరో 3 గిగావాట్ల అభివృద్ధి దశ ప్రాజెక్టులు సైతం ఉన్నట్లు ఐనాక్స్ క్లీన్ వెల్లడించింది. అంతేకాకుండా విద్యుత్ కొనుగోలుకి సోలార్ ఎస్ఈసీఐ, గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ తదితర వా ణిజ్య, పారిశ్రామిక క్లయింట్లుసహా.. ప్రభుత్వ రంగ పంపిణీ సంస్థలతో ఒప్పందాలను కలిగి ఉంది. -
ఐసీఐసీఐ బ్యాంకుకు సెబీ హెచ్చరిక
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్ రూట్(వీఆర్ఆర్) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఒక ఫైలింగ్లో అధికారికంగా వెల్లడించింది.అసలేం జరిగింది?సెక్యూరిటీ కస్టోడియన్ (Securities Custodian)గా వ్యవహరిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్పీఐ)కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చినట్లు సెబీ గుర్తించింది. వీఆర్ఆర్ ప్రోగ్రామ్ కింద దేశీయ బాండ్లలో పెట్టుబడి పెట్టిన సదరు విదేశీ ఇన్వెస్టర్, లాక్-ఇన్ పీరియడ్ పూర్తి కాకముందే తన నిధులను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ అనుమతించింది.సెబీ అభ్యంతరంనిబంధనల ప్రకారం గడువు ముగియకుండా నిధులను వెనక్కి పంపడం ఆర్బీఐ, సెబీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తూ సెబీ జూన్ 1న బ్యాంకుకు హెచ్చరిక లేఖ పంపింది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపరిమితిలోగా ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలోనూ బ్యాంక్ విఫలమైంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం వల్లే ఈ సమాచారాన్ని సకాలంలో సమర్పించలేకపోయామని బ్యాంక్ అంగీకరించింది.వీఆర్ఆర్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?భారతీయ ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచేలా ప్రోత్సహించడానికి ఆర్బీఐ 2019లో ఈ స్వచ్ఛంద నిలుపుదల మార్గాన్ని (వీఆర్ఆర్) ప్రవేశపెట్టింది. సాధారణ ఎఫ్పీఐ పెట్టుబడులపై ఉండే కఠినమైన నియంత్రణ అవసరాల నుంచి విదేశీ ఇన్వెస్టర్లకు ఈ మార్గం ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. అయితే, ఇందుకు ప్రతిగా సదరు విదేశీ ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల్లో ఒక కనీస శాతాన్ని నిర్ణీత కాలం పాటు దేశంలోనే ఉంచేందుకు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండాలి. కాగా, ఇటీవలే (ఫిబ్రవరిలో) కేంద్ర బ్యాంక్ ఈ ఎఫ్పీఐ పెట్టుబడుల కోసం వీఆర్ఆర్ను జనరల్ రూట్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఐసీఐసీఐ బ్యాంక్ వివరణసెబీ తీసుకున్న ఈ నియంత్రణ చర్యపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఈ హెచ్చరిక లేఖ కేవలం ఒక నిర్దిష్ట సమ్మతి లోపానికి సంబంధించినది మాత్రమేనని తెలిపింది. ‘ఈ చర్య వల్ల బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉండదు. బ్యాంకు దైనందిన కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అంతర్గత నియంత్రణలను మరింత బలోపేతం చేస్తాం’ అని చెప్పింది. బ్యాంకు మొత్తం పనితీరుపై గానీ, భద్రతపై గానీ దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని మేనేజ్మెంట్ ఇన్వెస్టర్లకు, ఖాతాదారులకు భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం! -
మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!
భారతీయులకు బంగారం కేవలం ఒక లోహం కాదు... అదొక సెంటిమెంట్, సంస్కృతి, సంపద. అయితే, ఇళ్లల్లో, దేవాలయాల ట్రస్టుల్లో నిరుపయోగంగా పడి ఉన్న పసిడిని కేవలం ఆస్తిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఆర్థిక వనరుగా మార్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం కంటే దేశీయంగా ఉన్న బంగారాన్ని రీసైక్లింగ్ చేసుకోవడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని పిలుపునిచ్చారు.ప్రస్తుతం భారతదేశంలోని గృహాలు, ఆలయ ట్రస్టుల వద్ద సుమారు 30,000 టన్నులకు పైగా నిరుపయోగ బంగారం ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో గోల్డ్ రీసైక్లింగ్ అనేది రూపాయి విలువను స్థిరపరచడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి, దాగి ఉన్న సంపదను వెలికితీయడానికి ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారుతోంది.గోల్డ్ రీసైక్లింగ్ ఎందుకు కీలకం?మన దేశ ఆర్థిక, పర్యావరణ రక్షణలో గోల్డ్ రీసైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రధాన ప్రయోజనాలు ఇవే..ఆర్థిక స్థిరత్వం: ఏటా పసిడి దిగుమతుల కోసం భారతదేశం బిలియన్ల కొద్దీ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది. రీసైక్లింగ్ పెరిగితే ఈ దిగుమతుల భారం తగ్గి దేశ కరెంట్ ఖాతా లోటు అదుపులోకి వస్తుంది. ఫలితంగా రూపాయి మరింత బలపడుతుంది.పర్యావరణ బాధ్యత: కొత్తగా గనుల నుంచి బంగారాన్ని వెలికితీయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అదే పాత బంగారాన్ని రీసైకిల్ చేయడం వల్ల భూగర్భ వనరుల తవ్వకాలు తగ్గి, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.ఆర్థిక సమగ్రత: కష్టకాలంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాలు తమ వద్ద ఉన్న పాత ఆభరణాలను సులభంగా, పారదర్శకంగా నగదుగా మార్చుకునేందుకు ఇది దోహదపడుతుంది.వ్యవస్థీకృత రంగం వైపు..గతంలో పాత బంగారాన్ని విక్రయించాలంటే అన్-ఆర్గనైజ్డ్ (అవ్యవస్థీకృత) రంగంపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అక్కడ మోసాలు, తక్కువ ధరకు వస్తుందనే సాకుతో చాలా సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి. న్యూఢిల్లీ కేంద్రంగా జూన్ 2026 నాటికి అందుతున్న నివేదికల ప్రకారం.. ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ సంస్థల వివరాలు కింది విధంగా ఉన్నాయి.ముత్తూట్ గోల్డ్ పాయింట్: ముత్తూట్ ఎక్సిమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని ‘ముత్తూట్ గోల్డ్ పాయింట్’ దేశంలోనే మొట్టమొదటి జాతీయ స్థాయి వ్యవస్థీకృత గోల్డ్ రీసైక్లింగ్ నెట్వర్క్గా అవతరించింది. ఇక్కడ అత్యాధునిక ఎక్స్-రే ఫ్లోరోసెన్స్ సాంకేతికతతో బంగారం స్వచ్ఛతను పారదర్శకంగా గుర్తిస్తారు. కస్టమర్లకు గరిష్ట విలువను కట్టి తక్షణమే నగదు లేదా బ్యాంక్ బదిలీ ద్వారా సొమ్ము చెల్లిస్తారు. సేకరించిన బంగారాన్ని 995 స్వచ్ఛత కలిగిన బిస్కెట్లుగా మార్చి దేశీయ జ్యువెలరీ తయారీ రంగానికి అందిస్తారు. తద్వారా దేశీయ సరఫరా గొలుసు బలోపేతమవుతోంది.ఒనిక్స్ మెటల్స్: అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విలువైన లోహాల పునరుత్పత్తిలో ‘ఒనిక్స్ మెటల్స్’ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పారిశ్రామిక రీసైక్లింగ్, ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) రికవరీ రంగాల్లో పని చేస్తూ.. స్థిరమైన పర్యావరణ వృద్ధికి, సర్క్యులర్ ఎకానమీ విధానాలకు ఈ సంస్థ పెద్దపీట వేస్తోంది.స్కై గోల్డ్ అండ్ డైమండ్స్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ స్కై గోల్డ్ అండ్ డైమండ్స్.. వ్యవస్థీకృత రీసైక్లింగ్కు మద్దతిస్తూ పాత లేదా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా రీసైకిల్ చేయడానికి వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. యువత సంప్రదాయ ధోరణులను పక్కనబెట్టి, ఇంట్లో ఊరికే పడి ఉండే లేదా వారసత్వంగా వచ్చిన అదనపు బంగారాన్ని అధికారిక మార్గాల ద్వారా విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం ఈ రీసైక్లింగ్ అనేది ఎక్కువగా వివాహాలు, ఆర్థిక అవసరాలు లేదా మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు మాత్రమే జరుగుతోందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్! -
ఉద్యోగుల పొట్టకొడుతున్న ఏఐ!
వ్యాపార రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగవంతమైన మార్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో అనేక సంస్థలు ఏఐలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాకు చెందిన క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ టెరాడేటా (Teradata) కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 5,100 మంది ఉద్యోగులకు 2026 సంవత్సరంలో వార్షిక జీతాల పెంపు ఉండబోదని యాజమాన్యం ప్రకటించింది.టెరాడేటా సంస్థ సీఈఓ స్టీవ్ మెక్మిలన్ ఉద్యోగులకు పంపిన మెమోలో, 2026 సంవత్సరానికి కంపెనీ ప్రధాన లక్ష్యం.. ఏఐ రంగంలో విజయాన్ని సాధించడం అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతిభావంతులైన ఉద్యోగులను నియమించుకోవడం, ఏఐ సామర్థ్యాలను పెంచుకోవడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై పెట్టుబడులు పెట్టడం అవసరమని వివరించారు. ఈ పెట్టుబడులకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు వార్షిక జీతాల పెంపు కోసం కేటాయించిన బడ్జెట్ను ఏఐ అభివృద్ధికి మళ్లిస్తున్నట్లు తెలిపారు.సాధారణంగా.. కంపెనీలో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 2 నుంచి 4 శాతం వరకు జీతాల పెంపు ఉండేది. అయితే ఈసారి ఆ పెంపులను పూర్తిగా నిలిపివేశారు. అయినప్పటికీ ఉద్యోగుల కోసం అన్ని రకాల ప్రయోజనాలను రద్దు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది. పర్ఫామెన్స్ బేస్డ్ బోనస్లు, షేర్ల రూపంలో ఇచ్చే ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపింది.టెరాడేటా మాత్రమే కాకుండా.. మరో టెక్ కంపెనీ టీటీఈసీ కూడా అమెరికాలోని ఉద్యోగుల రిటైర్మెంట్ కంట్రిబ్యూషన్ ప్రయోజనాలను 2026 వరకు నిలిపివేసింది. ఆ నిధులను ఏఐ టూల్స్, ఉద్యోగుల శిక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉద్యోగుల తొలగింపులుపై ప్రభావం చూపిన ఏఐ, ఇప్పుడు జీతాలపైనా కూడా ప్రభావం చూపుతోంది. -
టాప్లో ఇన్ఫోసిస్ బాస్.. విప్రో సీఈఓ వేతనం ఎంతంటే?
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల సీఈఓల వేతనాల విషయంలో FY26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు మొత్తం రూ. 82.6 కోట్ల పారితోషికం లభించింది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలలో ఇది అత్యధిక వేతనం కావడం విశేషం.కాగా విప్రో సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీనివాస్ పల్లియా' పారితోషికం తగ్గినప్పటికీ రెండవ స్థానంలో నిలిచారు. బుధవారం విడుదల చేసిన విప్రో వార్షిక నివేదిక ప్రకారం, FY26లో పల్లియా పరిహారం రూ. 49.6 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది రూ. 53.6 కోట్ల కన్నా 7.4% తక్కువ.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ కే. కృతివాసన్ ఈ సంవత్సరంలో రూ. 28 కోట్లు అందుకున్నారు. ఇప్పటివరకు తమ పరిహార వివరాలను వెల్లడించిన దేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల అధిపతులలో ఆయన అత్యల్ప వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. అయితే హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన FY26 యాన్యువల్ రిపోర్టును ఇంకా విడుదల చేయలేదు.ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ వేతనంలో ప్రధాన భాగం షేర్ల ఆధారిత ప్రోత్సాహకాల నుంచే వచ్చింది. ఆయనకు రూ. 50.75 కోట్ల విలువైన రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs), రూ. 23.35 కోట్ల స్టాక్ బేస్డ్ ఇన్సెంటివ్స్ లభించాయి.విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. FY26లో శ్రీనివాస్ పల్లియా జీతం, ఇతర అలవెన్సులు రూ. 14.6 కోట్ల నుంచి రూ. 15.5 కోట్లకు పెరిగినప్పటికీ, వేరియబుల్ పే రూ. 14.5 కోట్ల నుంచి రూ. 9.9 కోట్లకు తగ్గడంతో మొత్తం వేతనం కొంత తగ్గింది. అదనంగా.. ఇతర విభాగాల కింద రూ. 23.3 కోట్లు, డిఫర్డ్ కాంపెన్సేషన్ బెనిఫిట్స్ రూపంలో సుమారు రూ. కోటి పొందారు.విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషాద్ ప్రేమ్జీ వేతనం కూడా గణనీయంగా తగ్గింది. FY25లో రూ. 13.8 కోట్లుగా ఉన్న ఆయన పారితోషికం FY26లో రూ. 7.3 కోట్లకు పడిపోయింది. అలాగే వేరియబుల్ పే రూ. 7 కోట్ల నుంచి రూ. 2.2 కోట్లకు తగ్గింది.విప్రో వార్షిక నివేదిక ప్రకారం.. శ్రీనివాస్ పల్లియా, రిషాద్ ప్రేమ్జీ ఇద్దరికీ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పెరిగిన సమీకృత నికర లాభంపై 0.35 శాతం కమిషన్ పొందే హక్కు ఉంది. ఇది సంస్థ పనితీరు మెరుగుపడితే వారికి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది?: కియోసాకి సమాధానం ఇదే.. -
వెల్త్ మేనేజ్మెంట్లోకి ‘గోద్రెజ్’ ఎంట్రీ.. రూ.లక్ష కోట్లు టార్గెట్!
ముంబై: వినియోగ వస్తువులు, రసాయనాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయం వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు వెల్త్ మేనేజ్మెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ’గోద్రెజ్ వెల్త్’ పేరుతో కొత్త వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. కంపెనీకి చెందిన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ కాపిటల్తో కలిసి ఈ వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఆర్థిక సేవలు అందిస్తుంది.గోద్రెజ్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణానికి (ఏయూఎం) సంబంధించి 30 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. 2026–27 ఆఖరు నాటికి రూ. 38,000 కోట్లను టార్గెట్గా పెట్టుకున్నట్లు సంస్థ ఎండీ మనీష్ షా తెలిపారు. వచ్చే అయిదేళ్లలో దీన్ని రూ. 1,00,000 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్, గోద్రెజ్ ఫైనాన్స్ విభాగాల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్న గోద్రెజ్ క్యాపిటల్ ఏయూఎం గత ఆర్థిక సంవత్సరం రూ. 28,000 కోట్లుగా నమోదైంది. వెల్త్ బిజినెస్ విభాగాన్ని ప్రారంభించిన సందర్భంగా షా ఈ విషయాలు తెలిపారు.ముందుగా ఎనిమిది కీలక నగరాలతో ప్రారంభించి వచ్చే మూడేళ్లలో ఈ వ్యాపారాన్ని 35 ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రధానంగా రూ. 2 కోట్లకు పైబడి అసెట్స్ కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు ఇది సరీ్వసులు అందిస్తుంది. ఇక గోద్రెజ్ క్యాపిటల్ ప్రస్తుతం 100కు పైగా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది 200 పైచిలుకు ప్రాంతాలకు విస్తరించనున్నట్లు షా వివరించారు. అలాగే సప్లై చెయిన్ ఫైనాన్స్, గోల్డ్ లోన్స్ సహా మూడు కొత్త వ్యాపార విభాగాలు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. -
సర్వీసుల రంగం @ 6 నెలల గరిష్టం
న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం గత నెల(మే)లో ఆరు నెలల గరిష్టానికి చేరింది. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త క్లయింట్లను పొందడం, కొత్త బిజినెస్ల వినియోగంలో పురోగతి ఇందుకు సహకరించాయి. వెరసి బుధవారం విడుదలైన నెలవారీ సర్వేలో హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.8కు బలపడింది. ఏప్రిల్లో ఇది 58.8గా నమోదుకాగా.. గత నవంబర్ తదుపరి మే నెలలో సర్వీసులు బలంగా పుంజుకున్నాయి.పీఎంఐగా పిలిచే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 50ను దాటితే సర్వీసుల రంగం విస్తరించినట్లు లెక్క. 50కు దిగువన నమోదైతే క్షీణతను చవిచూస్తున్నట్లు తెలియజేస్తుంది. ప్రధానంగా రవాణా, డిజిటల్ సొల్యూషన్లు, ఈకామర్స్, ఎంటర్టైన్మెంట్, ఐటీ విభాగాలలో సర్వీసులకు పెరిగిన డిమాండ్ కొత్త బిజినెస్ల వృద్ధికి దోహదపడింది. దీంతో కంపెనీలలో యాక్టివిటీ పుంజుకోవడంతోపాటు.. ఉపాధి కల్పనకు బూస్ట్ లభించింది. -
ఎల్పీజీ సిలిండర్లు.. ఎన్ని రంగులో..
ఇళ్లలో ఉపయోగించే ఎరుపు రంగు ఎల్పీజీ సిలిండర్ అందరికీ తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులోనే కాకుండా పలు ఇతర రంగుల్లోనూ కనిపిస్తాయి. ప్రతి రంగు వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. సిలిండర్లో ఏ రకం గ్యాస్ ఉందో, అది ఎక్కడ ఉపయోగించాలో గుర్తించేందుకు ఈ రంగు కోడింగ్ను ఉపయోగిస్తారు.ఎరుపు రంగు సిలిండర్భారతదేశంలో ఇళ్లలో వంట కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్లు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎల్పీజీ దహనశీల పదార్థం కావడంతో ప్రమాద హెచ్చరికకు సంకేతంగా ఈ రంగును ఉపయోగిస్తారు. ఇండేన్, భారత్గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటి సంస్థలు సరఫరా చేసే సిలిండర్లు ఈ కోవలోకే వస్తాయి.నీలం రంగు సిలిండర్కొన్ని పరిశ్రమలు, వర్క్షాప్లు, తయారీ యూనిట్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లకు నీలం రంగు కనిపిస్తుంది. భారీ స్థాయిలో తాపన, ప్రాసెసింగ్ వంటి కార్యకలాపాలకు వీటిని వినియోగిస్తారు.పసుపు రంగు సిలిండర్హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, క్యాటరింగ్ సంస్థలు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. వీటి ధరలు, సరఫరా నిబంధనలు గృహ సిలిండర్లతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి.నలుపు రంగు సిలిండర్నలుపు రంగు సిలిండర్లలో ఎక్కువగా ప్రొపేన్ గ్యాస్ నిల్వ చేస్తారు. పరిశ్రమలు, హీటింగ్ వ్యవస్థలు, కొన్ని ప్రత్యేక యంత్రాల్లో ఈ గ్యాస్ను ఉపయోగిస్తారు. చల్లని ప్రాంతాల్లో కూడా ప్రొపేన్కు మంచి డిమాండ్ ఉంటుంది.తెలుపు రంగు సిలిండర్ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాల్లో ఉపయోగించే ఆక్సిజన్ వంటి వైద్య వాయువులు లేదా ప్రత్యేక గ్యాస్ మిశ్రమాల కోసం తెలుపు రంగు సిలిండర్లను ఉపయోగిస్తారు. వీటిపై కఠిన భద్రతా ప్రమాణాలు అమలులో ఉంటాయి.ఆకుపచ్చ రంగు సిలిండర్కొన్ని దేశాలు లేదా సంస్థలు పర్యావరణహిత గ్యాస్లు, ప్రత్యేక వినియోగ గ్యాస్ల కోసం ఆకుపచ్చ రంగు సిలిండర్లను ఉపయోగిస్తాయి. అయితే ఈ రంగు అర్థం ప్రాంతానికీ, సరఫరాదారునికీ అనుగుణంగా మారవచ్చు.రంగుల కంటే లేబుల్ ముఖ్యంగ్యాస్ సిలిండర్ల రంగులు గుర్తింపునకు ఉపయోగపడినా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకూడదు. సిలిండర్పై ఉన్న లేబుల్, గ్యాస్ పేరు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఎందుకంటే రంగు ప్రమాణాలు దేశానికీ, సంస్థకీ అనుగుణంగా మారే అవకాశం ఉంటుంది. -
‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’
డబ్బు గురించి ఆందోళన చెందకూడదంటే ఒక మనిషికి ఎంత సంపాదన కావాలి? ఏడు అంకెల జీతం, చేతిలో లగ్జరీ కారు, మెట్రో సిటీలో సొంత ఇల్లు ఉంటే ఆర్థిక భద్రత దొరికినట్లేనా? అసలు విజయానికి కొలమానం ఏమిటి?.. నేటి డిజిటల్ యుగంలో చాలా మంది ప్రొఫెషనల్స్ మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే స్టార్టప్ విజయాలు, విలాసవంతమైన లైఫ్ స్టైల్స్ మధ్య.. సమాజం దృష్టిలో సక్సెస్ అయిన వారు సైతం లోలోపల ఒక రకమైన అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ వెనుక ఉన్న అసలు విషయాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.‘ఎవర్ హోప్ ఆంకాలజీ’ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సన్నీ గార్గ్ ఇటీవల పంచుకున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆయనను కలిసిన 34 ఏళ్ల గుర్గావ్ యువకుడి కథ ఇది. పోస్ట్లోని వివరాల ప్రకారం.. ఆ యువకుడి వార్షిక ఆదాయం రూ.40 లక్షలు. బీఎండబ్ల్యూ కారు, గుర్గావ్లో సొంత 2 బీహెచ్కే అపార్ట్మెంట్ ఉంది. కానీ, ఆ యువకుడు పంచుకున్న కొన్ని విషయాలు షాక్కు గురిచేసేలా ఉన్నాయి. ‘డాక్టర్, నేను చాలా పేదవాడిని అనిపిస్తోంది. రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టడం లేదు’ అన్నాడు. సదరు యువకుడు భారతదేశంలో అత్యధిక ఆదాయం పొందే మొదటి 1% జనాభాలో ఉన్నాడు. అయినా అతను ఎందుకు కుంగిపోతున్నాడనే దానికి డాక్టర్ గార్గ్ విశ్లేషణ నేటి సమాజానికి అద్దం పడుతోంది. ‘ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల పరిస్థితి ఇదే. ఆ యువకుడి రిఫరెన్స్ పాయింట్ మారింది. ఒకప్పుడు అతను తన గ్రామంలోని పొరుగువారితో పోల్చుకునేవాడు. కానీ ఇప్పుడు అతను తనను తాను లింక్డ్ఇన్లో రూ.80 కోట్లకు స్టార్టప్ను విక్రయించిన 28 ఏళ్ల కుర్రాడితో పోల్చుకుంటున్నాడు. ఆదాయం పెరిగింది, కానీ అంచనాలు పది రెట్లు పెరిగాయి. దీనిపేరే మాడ్రన్ పావర్టీ’ అన్నారు.మూడు ప్రశ్నలుఆ యువకుడి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి డాక్టర్ గార్గ్ అడిగిన మూడు ప్రశ్నలు, దానికి వచ్చిన సమాధానాలు అసలు సమస్యను వెల్లడించాయి.1. గత ఏడాదిలో ఒక్కసారైనా ‘నాకు ఇది చాలు’ అని అనుకున్నావా?సమాధానం: ఎప్పుడూ లేదు2. ఎవరి కోసం ఇంత డబ్బు సంపాదిస్తున్నావు?సమాధానం: నాకు తెలియదు. చుట్టూ ఉన్నవాళ్లు పరిగెడుతున్నారు, నేను పరిగెడుతున్నాను.3. నీ జీవితంలో డబ్బు కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేసిన పని ఏదైనా ఉందా? సమాధానం: కొద్దిసేపు ఆగి.. ‘ఏదీ లేదు’.డబ్బు ప్రతి పనికి కొలమానంగా మారినప్పుడు మనిషి యంత్రంగా మారిపోతాడని డాక్టర్ గార్గ్ హెచ్చరించారు. రూ.40 లక్షలు సంపాదించినా, రూ.4 కోట్లు సంపాదించినా ప్రతి ఆరు నెలలకోసారి ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడం సులభం. కానీ అంతర్గత గుర్తింపు సమస్యలను పరిష్కరించడం కష్టమని, 90% మంది ఈ రెండింటికీ తేడా తెలియక గందరగోళ పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.విజయాన్ని ఎల్లప్పుడూ మనకంటే పైన ఉన్నవారితోనే కొలిస్తే.. ఆ విజయానికి ఎప్పటికీ ముగింపు రేఖ ఉండదు. రేసు గుర్రంలా పరిగెత్తడం ఆపి ఎక్కడ ఫుల్స్టాప్ పెట్టాలో తెలుసుకున్నప్పుడే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ, ప్రశాంతత లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో వాటా విక్రయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానాశ్రయాల ఆపరేటర్ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్లో జీక్యూజీ పార్ట్నర్స్ 1.8 శాతం వాటాను ఫిడిలిటీ ఇంటర్నేషనల్కి ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించింది. వీటి విలువ రూ. 1,906 కోట్లు.ఎన్ఎస్ఈలో బ్లాక్ డీల్ డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ సగటున ఒక్కో షేరుకి రూ. 97.75 రేటు చొప్పున 19.50 కోట్ల షేర్లను విక్రయించింది. ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫిడిలిటీ ఇంటర్నేషనల్ స్మాల్ క్యాప్ ఫండ్ వీటిని కొనుగోలు చేసింది. జీఎంఆర్ గత ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల్లోకి మళ్లిన సంగతి తెలిసిందే. -
రూ. 15.15 లక్షల కోట్ల స్కాం : దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు
సాక్షి, ముంబై: భారతదేశంలోని అతిపెద్ద లిస్టెడ్ సంస్థలలో ఒకటి, ప్రముఖ బంగారు శుద్ధి మరియు ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ (Rajesh Exports) భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రూ. 15.15 లక్షల కోట్ల మేర భారీ ఆర్థిక అవకతవకలు జరిగినట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) ఆరోపించింది. ఈ మేరకు జూన్ 3న జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వులో సెబీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ , దాని ప్రమోటర్-చైర్మన్ రాజేష్ మెహతాలను సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఐదు ఆర్థిక సంవత్సరాల పాటు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని రెగ్యులేటర్ వెల్లడించింది. ఈ ఆదేశాలు దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు సృష్టించాయి. దీని షేర్ బాగా పడిపోయింది. చివరికి కొనేవాళ్లు లేక లోయర్ సర్క్యూట్లోకి జారుకుంది.బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ, ప్రపంచ బంగారు దిగ్గజంగా పేరు సంపాదించింది. ఆర్థిక సంవత్సరం FY21 నుంచి FY25 మధ్య కాలంలో, కంపెనీ తన విదేశీ అనుబంధ సంస్థల (ముఖ్యంగా స్విట్జర్లాండ్కు చెందినవాల్కంబి SA) ద్వారా రూ. 15.15 లక్షల కోట్ల మేర (కన్సాలిడేటెడ్ రెవెన్యూలో దాదాపు 99.8 శాతం) తప్పుడు ఆదాయాన్ని చూపించిందని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.దర్యాప్తు అధికారులు కోరిన అనేక కీలక పత్రాలను కంపెనీ అందించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. ఫోరెన్సిక్ ఆడిటర్కు కస్టమర్ రికార్డులు, వెండర్ వివరాలు, ముఖ్యమైన అనుబంధ సంస్థల ఆర్థిక నివేదికలు సమర్పించలేదనీ, పొంతన లేని ఆదాయ వ్యవయాల వివరాలు, దర్యాప్తునకు సహకరించకపోవడం లాంటి వాటిని రెగ్యులేటర్ ఎత్తి చూపింది. ఈ ఆదాయ ఆరోపణలతోపాటు ఆఫ్రికాలో ఉన్న బంగారు గనుల ఆస్తులలో రూ. 1,035 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వచ్చిన నివేదికను కూడా సెబీ ప్రశ్నించింది.ఎల్ఐసీకీ తప్పని ముప్పురాజేష్ ఎక్స్పోర్ట్స్లో సుమారు 10.8% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అతిపెద్ద వాటాదారులలో ఒకటి. తాజా స్కాం కారణంగా వాటాదారుల సంపదలో రూ. 12,726 కోట్ల వరకు నష్టం వాటిల్లవచ్చని సెబీ అంచనా వేసింది. ఈ ప్రభావం ప్రమోటర్లు, నియంత్రణ సంస్థలకే పరిమితం కాలేదు. పరోక్షంగా సంబంధం ఉన్న లక్షలాది మంది సాధారణ పెట్టుబడిదారులను కూడా ప్రభావితం చేయనుంది.ఇప్పటికే కెనరా బ్యాంక్ పోరాటంమరోవైపు రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏకకాలంలో రుణదాతల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 509 కోట్ల రుణాల చెల్లింపులో విఫలం కావడంతో కెనరా బ్యాంక్ ఈ కంపెనీకి ఉన్న తన రుణాన్ని ఒత్తిడికి గురైన ఆస్తిగా (స్ట్రెస్డ్ అసెట్) వర్గీకరించింది. ఫలితంగా, ఈ రుణదాత వేలం ప్రక్రియ ద్వారా ఒత్తిడికి గురైన ఈ రుణాన్ని విక్రయించేందుకు చర్యలు ప్రారంభించింది. బ్యాంకింగ్ సమస్య సెక్యూరిటీస్ మార్కెట్ విచారణకు భిన్నమైందే అయి నప్పటికీ, ఈ రెండూ కలిసి కంపెనీకి రెండు వైపుల సంక్షోభాన్ని సృష్టించాయి. సెబీ ఉత్తర్వు మధ్యంతరమైనదని గమనించడం ముఖ్యం. నియంత్రణ సంస్థ తన తుది తీర్పును ఇంకా వెలువరించలేదు.రాజేష్ ఎక్స్పోర్ట్స్ , రాజేష్ మెహతాలకు తమ వాదన వినిపించుకునేందుకు, ఆరోపణలపై ప్రతిస్పందించేందుకు అవకాశం ఉంది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందున తుది ఫలితం రావడానికి సమయం పట్టవచ్చు.ఒకవేళ ఇది రుజువైతే, భారతదేశ కార్పొరేట్ రంగంలో ఇప్పటివరకు చూసిన అతిపెద్ద స్కాంలలో ఒకటిగా నిలుస్తుంది. భారతదేశ కార్పొరేట్ పాలనా వ్యవస్థకు ఈ కేసు గుణపాఠంగా నిలవవచ్చు. పెట్టుబడిదారులకు ఇదొక తీవ్ర హెచ్చరిక. కంపెనీ ఎంత పెద్దదైనా, ఎంత గౌరవనీయమైనదైనా సరే, రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి మూలధనంలో గణనీయమైన భాగాన్ని ఒకే కంపెనీ స్టాక్లో కేంద్రీకరించే విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటూ, కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్ డిస్క్లోజర్లు, రెడ్ ఫ్లాగ్లను పర్యవేక్షించాలి అంటున్నారు నిపుణులు.ఇదీ చదవండి: ఆస్తికోసం వ్యాపారవేత్త కుటుంబం దారుణ హత్య, ఆ తర్వాత షాకింగ్ ఘటన -
రాజకీయాల్లో డబ్బు విరాళాలపై సామ్ కామెంట్
సిలికాన్ వ్యాలీ బిలియనీర్లు, టెక్ దిగ్గజాలు అమెరికా మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కోట్లాది డాలర్లు కుమ్మరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో ఓపెన్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026 యూఎస్ ఎన్నికల్లో(మధ్యంతర) తాను ఎలాంటి రాజకీయ విరాళాలు ఇచ్చే ప్రణాళికలు లేవని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆల్ట్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాధారణంగా రాజకీయాల నుంచి డబ్బు దూరం కావాలని నేను కోరుకుంటున్నాను. అది జరిగితే చాలా మంచిది’ అని పేర్కొన్నారు.తాను స్వయంగా రాజకీయ విరాళాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఏఐ పరిశ్రమపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోవడానికి ప్రచారాలకు డబ్బు పెట్టే ఇతర టెక్ దిగ్గజాల నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ‘మా పోటీదారులందరి కంటే మమ్మల్ని వేరే ప్రమాణాలతో కొలవడం సరికాదు. వారు మమ్మల్ని తొక్కేయడానికి డబ్బును ఆయుధంగా వాడుతుంటే మేము కూడా తిరిగి పోరాడగలగాలి. అయితే, బోర్డు అంతటా నిబంధనలు అందరికీ ఒకేలా ఉండడానికి నేను ఇష్టపడతాను’ అని ఆల్ట్మన్ వ్యాఖ్యానించారు.సూపర్ పీఏసీల హోరాహోరీకృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం, అనుకూల చట్టాల కోసం సిలికాన్ వ్యాలీలో పొలిటికల్ యాక్షన్ కమిటీల (పీఏసీ) యుద్ధం నడుస్తోంది.లీడింగ్ ది ఫ్యూచర్: ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మన్, సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఆండ్రీసెన్ హోరోవిట్జ్’ సహ వ్యవస్థాపకుల మద్దతుతో నడుస్తున్న సూపర్ పీఏసీ ఇది. ఏఐ స్నేహపూర్వక అభ్యర్థులను గెలిపించడం, డేటా సెంటర్ల నిర్మాణంపై రాష్ట్రాల ఆంక్షలను ఎదుర్కోవడం దీని ముఖ్య ఉద్దేశం.పబ్లిక్ ఫస్ట్ యాక్షన్: ఓపెన్ఏఐ ప్రధాన పోటీదారు ‘ఆంత్రోపిక్ పీబీసీ’ ఈ సూపర్ పీఏసీకి ఏకంగా 20 మిలియన్ డాలర్ల నిధులు ఇచ్చింది. ఇది కఠినమైన ఏఐ భద్రతా నిబంధనల కోసం వాదిస్తుంది.ఓపెన్ఏఐ వివరణ: లీడింగ్ ది ఫ్యూచర్ పీఏసీకి గ్రెగ్ బ్రోక్మన్, ఆయన భార్య అన్నా నుంచి 25 మిలియన్ డాలర్ల విరాళాలు అందినప్పటికీ ఆ సంస్థతో తమకు ఎలాంటి అధికారిక అనుబంధం లేదని ఓపెన్ఏఐ బ్లాగ్ పోస్ట్లో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ఐఆర్సీటీసీ.. మూడు కోట్ల అకౌంట్లు క్లోజ్!
రైల్వే ప్రయాణికులకు మరింత పారదర్శకమైన, సురక్షితమైన సేవలను అందించేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మెగా ఆపరేషన్కు తెరలేపింది. ఒకవైపు కన్ఫర్మ్డ్ టిక్కెట్ల కోసం సామాన్య ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని సాగుతున్న టికెటింగ్ మాఫియాకు చెక్ పెడుతూ, మరోవైపు రైళ్లలో నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏకంగా 3 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను నిలిపివేయడంతో పాటు రైల్వే వంటశాలల్లో నాణ్యతను పర్యవేక్షించడానికి ఏఐ కెమెరాలను తీసుకొచ్చింది.టికెట్ దందాపై చర్యలుసాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకకుండా బుకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ముఠాలు, దళారీల ఆట కట్టించేందుకు ఐఆర్సీటీసీ డిజిటల్ నిఘాను తీవ్రం చేసింది. ఇందులో భాగంగా తీసుకున్న కీలక చర్యలు చేపట్టింది.డిజిటల్ గుర్తింపుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3 కోట్లకు పైగా అనుమానాస్పద వినియోగదారుల ఖాతాలను ఐఆర్సీటీసీ బ్లాక్ చేసింది.వీటితో పాటు అనుమానాస్పదంగా ఉన్న మరో ఆరు కోట్ల ఐడీల ప్రామాణికతను తనిఖీ చేయడానికి వాటిని కఠినమైన ధ్రువీకరణ పరిధిలో ఉంచింది.గత ఏడాది కాలంలో అక్రమ బుకింగులకు కారణమవుతున్న 13,343 అనుమానాస్పద ఈమెయిల్ డొమైన్లను అధికారులు పూర్తిగా నిషేధించారు.నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో 4.18 లక్షల అనుమానాస్పద పీఎన్ఆర్లకు సంబంధించి 501 అధికారిక ఫిర్యాదులు నమోదయ్యాయి.800 కిచెన్లలో ఏఐ కెమెరాలురైలు ప్రయాణంలో లభించే భోజనంపై తరచూ వచ్చే అపరిశుభ్రత ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఐఆర్సీటీసీ సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా బేస్ కిచెన్లలో (వంటశాలలు) పరిశుభ్రత, కార్యాచరణ లోపాలను రియల్ టైమ్లో పర్యవేక్షించేందుకు 2,394 ఏఐ ఎనేబుల్డ్ కెమెరాలను మోహరించింది.తొమ్మిది రకాల ఉల్లంఘనలను పట్టేసే టెక్నాలజీఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ వంటశాలల్లో జరిగే 9 రకాల ప్రధాన ఉల్లంఘనలను ఇట్టే పసిగడుతుంది. వంట చేసేవారు తలకు క్యాప్ పెట్టుకోకపోవడం, చేతి తొడుగులు (గ్లౌజెస్) ధరించకపోవడం, వంటగదిని సరిగ్గా తుడవకపోవడం వంటి లోపాలతో పాటు వంటశాలల్లో ఎలుకలు, ఈగలు, బొద్దింకల కదలికలను కూడా ఈ కెమెరాలు క్షణాల్లో గుర్తిస్తాయి.టూ-అవర్స్ డెడ్లైన్.. వార్ రూమ్ పర్యవేక్షణఈ సాంకేతికత ఎంతటి చిన్న వస్తువునైనా, లోపాన్నైనా సులభంగా గుర్తించగలదని ఐఆర్సీటీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘వంటశాలల్లో పరిశుభ్రత లోపిస్తే ఏఐ కెమెరాలు స్వయంచాలకంగా (ఆటోమేటిక్) హెచ్చరికలను జారీ చేస్తాయి. ఈ అలర్ట్ నేరుగా సంబంధిత కిచెన్ మేనేజర్కు వెళ్తుంది. ఐఆర్సీటీసీ ప్రత్యేక వార్ రూమ్ దీనిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. అలర్ట్ వచ్చిన రెండు గంటల్లోగా సమస్యను పరిష్కరించకపోతే బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వార్ రూమ్ పర్యవేక్షణ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం వంటశాలల్లో హెడ్ క్యాప్లు ధరించకపోవడం అనేదే అత్యంత ప్రాథమిక, ప్రధాన ఉల్లంఘనగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ప్రయోగం నుంచి వినియోగం వైపు
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమ కృత్రిమ మేథ (ఏఐ) ప్రాజెక్టులను ప్రయోగాత్మకంగా పరీక్షించే దశ నుంచి క్రమంగా విస్తృతంగా వినియోగించే దశ వైపు మళ్లుతున్నాయి. సంస్థాగతంగా కార్యకలాపాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏఐ ఏజెంట్లను అనుసంధానం చేసుకుంటున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో దేశీ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ వినియోగాన్ని మూడు లక్షల మందికి పైగా ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చాయి. తద్వారా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఏఐని వినియోగిస్తున్న దిగ్గజాల సరసన చేరాయి. భారత్లో గణనీయంగా సిబ్బంది ఉన్న యాక్సెంచర్ కూడా వేల కొద్దీ ఉద్యోగులకు కోపైలట్ని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ చేపట్టింది.‘రోజువారీ ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పనిచేయడాన్ని ప్రోత్సహించేందుకు, తెలివిగా నిర్ణయాలను తీసుకోవడంలోను తోడ్పడేందుకు మేము 1,00,000 మంది సిబ్బందికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్ని అందుబాటులోకి తెచ్చాం‘ అని టీసీఎస్ సీఈవో కె. కృతివాసన్ తెలిపారు. సంస్థ రోజువారీ కార్యకలాపాల్లో టెక్నాలజీని భారీగా వినియోగించడం ద్వారా అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవచ్చని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ తెలిపారు. ఏఐని తాము రోజువారీ పనుల్లో అనుసంధానిస్తున్నామని, తద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, నిర్ణయాలను పక్కాగా అమలుచేయడం, ఆవిష్కరణలను వేగవంతం చేయడంలాంటి అంశాలకు ఏఐ ఉపయోగపడుతుందని విప్రో సీఈవో శ్రీని పల్లియా తెలిపారు. కలిసి పని చేసే హైబ్రిడ్ విధానం.. ఏఐ కార్యకలాపాలను కేవలం స్టాండెలోన్ సాధనాలుగా కాకుండా మనుషులు, ఏజెంట్లు కలిసి పని చేసే విధానంగా తీర్చిదిద్దుకోవడంపై కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్కి చెందిన వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ 2026 ప్రకారం ఈ తరహా ఏఐ వినియోగం .. ప్రాథమిక ఆటోమేషన్ పరిధిని దాటి విశ్లేషణ, సమస్యల పరిష్కారంలాంటి పనులను సులభతరం చేస్తోంది. కంపెనీవ్యాప్తంగా ఏఐని ఉపయోగించడం వల్ల దేశీ ఐటీ దిగ్గజాలకు భారీగా ఆదా అవుతోంది. ప్రతి మూడు నెలలకు 2,50,000 ఫుల్ టైమ్ పనిదినాల సమయం ఆదా అవుతోందని విప్రో తెలిపారు. అలాగే తమ సిబ్బంది 29,000 పైగా కస్టమ్ ఏఐ ఏజెంట్లను రూపొందించినట్లు వివరించారు. ఇక టీసీఎస్ విషయానికొస్తే.. నిర్దిష్ట పని పూర్తి చేసేందుకు పట్టే సమయం దాదాపు 35 శాతం మేర తగ్గింది. దేశీ ఐటీ పరిశ్రమ పరిమాణం దాదాపు 300 బిలియన్ డాలర్లుగా ఉంటుంది.ఏఐ డీప్ఫేక్లతో వ్యాపారానికి రిస్కువిప్రో వెల్లడిఏఐ వినియోగం వేగవంతం కావడమనేది రిసు్కలతో కూడుకున్న వ్యవహారమని ఐటీ దిగ్గజం విప్రో హెచ్చరించింది. లోపభూయిష్టమైన అల్గోరిథంలు, పక్షపాత ధోరణులు, మారిపోతున్న నిబంధనలు, డీప్ఫేక్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటి రీత్యా తమ వ్యాపారానికి లీగల్గా, ఆర్థికంగా, పేరు ప్రతిష్టలపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని 2025–26 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికలో కంపెనీ పేర్కొంది. తమ క్లయింట్లకు అందించే సేవల్లోనూ, అంతర్గతంగా కార్యకలాపాల్లోను జనరేటివ్, అటానామస్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ ఈ సాంకేతికత విషయంలో అనిశ్చితి నెలకొందని వివరించింది. పరిమిత స్థాయి మానవ జోక్యంతో ఏఐ సిస్టమ్లు పని చేయడం వల్ల అనుకోని ఫలితాలు వచ్చే రిసు్కలు ఉన్నాయని పేర్కొంది. ఈ సర్వీసుల్లో లోపాల వల్ల ప్రాజెక్టుల్లో జాప్యం లాంటి రిస్కులు ఉండొచ్చని విప్రో తెలిపింది. కొన్ని సర్వీసులకు డిమాండ్ తగ్గుతుంది ఏఐ ఆటోమేషన్ పెరగడం, సామర్థ్యాలు మెరుగుపడటం, క్లయింట్ టూల్స్ని వినియోగించడం లాంటి అంశాల వల్ల నిర్దిష్ట కోర్ సర్వీసులకు డిమాండ్ తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా ధరలు, లాభాల మార్జిన్లు, సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. అలాగే ఏఐ వినియోగంతో లీగల్, నియంత్రణ సంస్థ నిబంధనల అమలుపరంగా కూడా సవాళ్లు ఎదురుకావచ్చని పేర్కొంది. ఒకవేళ ఏఐ ఎనబుల్డ్ సొల్యూషన్స్ వల్ల క్లయింట్లకు, వారి కస్టమర్లకు లేదా థర్డ్ పారీ్టలకు హాని జరిగితే తమ సంస్థ లిటిగేషన్లు, నియంత్రణ సంస్థ చర్యలను ఎదుర్కొనాల్సి రావొచ్చని విప్రో తెలిపింది. విప్రో ఐటీ సర్వీసుల్లో 62 శాతం ఆదాయం అమెరికన్ దేశాల నుంచి, 27 శాతం యూరప్ దేశాల నుంచి ఉంటోంది. అయితే, పశ్చిమాసియా, దక్షిణాసియాలో ఉద్రిక్తతల వల్ల సరఫరా వ్యవస్థ దెబ్బతినొచ్చని, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిడిళ్లు పెరగొచ్చని, వ్యాపారాలపై విశ్వసనీయత తగ్గొచ్చని విప్రో పేర్కొంది. ఫలితంగా క్లయింట్లు టెక్నాలజీపై వ్యయాలను తగ్గించుకోవడానికి లేదా జాప్యం చేయడానికి దారి తీయొచ్చని వివరించింది. ఇక దేశీయంగా పెరుగుతున్న వేతన వ్యయాల కారణంగా అమెరికా, యూరప్లోని టెక్ కంపెనీలతో పోలిస్తే మన కంపెనీలకు పోటీపడే సామ ర్థ్యాలు తగ్గొచ్చని తెలిపింది. -
అరబిందో ఫార్మా థెరానిమ్ బయోలాజిక్స్ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్: భారతదేశంలోని అతిపెద్ద ప్రత్యేక బయోలాజిక్స్ కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లలో (సీఎంఓ) ఒకటైన థెరానిమ్ కేంద్రాన్ని అరబిందో ఫార్మా ప్రారంభించింది. తెలంగాణ మంత్రులు డి. శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ సమక్షంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. బయోలాజిక్స్ తయారీలో కొత్త ప్రమాణాలను నెలకొల్పే ఈ ప్రాజెక్ట్కు ప్రముఖ ఔషధ సంస్థ ఎంఎస్డీ ప్రధాన కస్టమర్గా చేరింది.ప్రారంభోత్సవానికి ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్లు, ఎంఎస్డీ సీనియర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్ట్ వివరాలు తెలియజేసి ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా నిలుస్తుందని మంత్రులు పేర్కొన్నారు. బయోలాజిక్స్ కాంట్రాక్ట్ తయారీ రంగంలో అరబిందో ఫార్మా వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఏర్పాటైన థెరానిమ్, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న బయోలాజిక్ చికిత్సల డిమాండ్ను తీర్చడంలో కీలక పాత్ర పోషించనుంది. -
అవి సాధారణ లాభాలే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) లాభాలు సాధారణ స్థాయికి తిరిగొచ్చాయే తప్ప పశ్చిమాసియా సంక్షోభం నుంచి అవేమీ భారీగా లబ్ధి పొందలేదని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2025–26లో మూడు ఓఎంసీలు కలిసి రూ. 77,821 కోట్ల లాభాలను ప్రకటించాయి. ఇది 2024–25తో పోలిస్తే ఏకంగా 130 శాతం అధికం. దీనితో ఆయిల్ కంపెనీలు పశ్చిమాసియా సంక్షోభం సాకుతో రేట్లను పెంచేసి అనూహ్య లాభాలను ఆర్జించాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మూడు ఓఎంసీలైన ఇండియన్ ఆయిల్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) నిపుణుల విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది.వాస్తవానికి 2024–25లో వంట గ్యాస్ రేట్లు పెరగకుండా రేట్లను అదే స్థాయిలో కొనసాగించడం వల్ల ఓఎంసీలు రూ. 40,434 కోట్ల ఆదాయ నష్టాన్ని భరించాయి. ఫలితంగా 2024–25లో లాభాలు రూ. 33,602 కోట్లకు పరిమితమయ్యాయి. 2025–26లో లాభాలు భారీగా పెరిగినట్లు కనిపిస్తున్నా, అంత క్రితం ఆర్థిక సంవత్సరంలో అవి భారీగా అండర్ రికవరీలను నమోదు చేయడం వల్ల, దానితో పోల్చి చూడటం సరికాదని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న లాభాలు 2023–24లో నమోదైన రూ. 80,986 కోట్ల స్థాయికి దరిదాపుల్లో ఉన్నాయని, ఈ స్థాయి ప్రాఫిట్స్ సాధారణమే తప్ప ఆకస్మిక లాభాలు కావని తెలిపారు.ఆ మాత్రం మార్జిన్లుండాలి.. కంపెనీల ఆదాయాల స్థాయిని వాటి పరిమాణాన్ని బట్టి మదింపు చేయాలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీయంగా మూడు ఏఎంసీల వార్షికాదాయం రూ. 20 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థ ఆదాయామే ఏటా రూ. 10 లక్షల కోట్లు ఉంటుంది. భారీ కమోడిటీ రిఫైనింగ్ సంస్థల నిర్వహణ మార్జిన్లు 1–3 శాతం ఉండటం సాధారణమేనని నిపుణులు తెలిపారు. మూలధన పెట్టుబడులను కొనసాగించడానికి, రిఫైనరీలను అప్గ్రేడ్ చేసుకోవడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ మాత్రం నిధులు కావాల్సి ఉంటుందని వివరించారు. కేవలం ఒక రిఫైనరీని విస్తరించాలన్నా రూ. 50,000–60,000 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.2030 నాటికి రిఫైనింగ్ సామర్థ్యాలను వార్షికంగా 310 మిలియన్ టన్నులకు మించి పెంచుకోవాలని పరిశ్రమ నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 2025–26లో ఆదాయాలకు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు సంబంధం లేదని కంపెనీలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి సంక్షోభం తలెత్తడానికి 50–60 రోజుల ముందు కొన్న ముడిచమురును తాము శుద్ధి చేసినట్లు వివరించాయి. కాబట్టి పశ్చిమాసియా సంక్షోభంపరంగా క్రూడాయిల్ రేట్లు, రవాణా వ్యయాలు, ఇన్సూరెన్స్ సర్చార్జీల పెరుగుదల మొదలైనవన్నీ 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆదాయాల్లోనే కనిపించవచ్చంటున్నాయి. ఈ గణాంకాలు ఆగస్టులో వెల్లడవుతాయి.ప్రపంచంలో అయిదో వంతు ముడిచమురు హార్మూజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. అక్కడ ఉద్రిక్తతల వల్ల ఆసియావ్యాప్తంగా ఆయిల్ ధరలు, షిప్పింగ్ వ్యయాలు భారీగా పెరిగిపోయాయి. ఫిబ్రవరిలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి దేశీయంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ రేట్లు 8–9 శాతం పెరిగాయి. అయితే పలు పొరుగు దేశాల్లో నమోదైన 20–67 శాతం వరకు పెంపుతో పోలిస్తే ఇది తక్కువేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. పైగా 2026 మార్చి 27 నుంచి పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లు తెలిపాయి.దీనితో 2021 నుంచి చూస్తే పెట్రోల్పై రూ. 23, డీజిల్పై రూ. 26 మేర సుంకాలను తగ్గించినట్లయిందని పేర్కొన్నాయి. ఇక ఓఎంసీల లాభాల్లో దాదాపు సగం వాటా డివిడెండ్లు, ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తుందని.. హైవేలు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టుల్లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఇవి ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మిగతా మొత్తాన్ని ఇంధన భద్రత కోసం, రిఫైనింగ్ సామర్థ్యాల పెంపు కోసం పెట్టుబడులకి వినియోగమవుతున్నాయని వివరించాయి. -
అదానీ గ్రూప్ ఇబిటా రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం, డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో రికార్డ్ నిర్వహణ లాభం(ఇబిటా) సాధించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 94,834 కోట్లు(10 బిలియన్ డాలర్లు) ఆర్జించింది. ఇదేసమయంలో రూ. 1.53 లక్షల కోట్ల(16.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి వ్యయాలు చేపట్టింది. ఇది సరికొత్త రికార్డ్కాగా.. వార్షికంగా అత్యధిక పెట్టుబడులు వెచ్చించిన దేశీ కార్పొరేట్ గ్రూప్గా నిలిచింది.దీంతో గ్రూప్ పోర్ట్ఫోలియో స్థూల ఆస్తుల విలువ రూ. 7.85 లక్షల కోట్ల(82.8 బిలియన్ డాలర్లు)కు చేరింది. పెట్టుబడుల్లో దాదాపు 80 శాతం ఎనర్జీ, యుటిలిటీస్, ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ బిజినెస్ తదితర కీలక మౌలిక సదుపాయాలపై వెచ్చించింది. అదానీ గ్రూప్ విడుదల చేసిన వివరాల ప్రకారం కన్సాలిడేటెడ్ ఇబిటా వార్షికంగా 5.6 శాతం బలపడింది. -
ధనవంతుల్లో అంబానీని దాటేసిన టిక్టాక్ ఫౌండర్
చైనా టెక్ దిగ్గజం బైట్డాన్స్ (ByteDance) సహ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ (Zhang Yiming) సంపద మరోసారి భారీగా పెరిగింది. ఫలితంగా ఆయన భారత పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీని (Mukesh Ambani)ను వెనక్కి నెట్టి ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.తాజా బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (Bloomberg Billionaires Index) ప్రకారం జాంగ్ యిమింగ్ నికర సంపద 92.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన చైనాలోనే అత్యంత ధనవంతుడిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. 2019లో బ్లూమ్బర్గ్ ఆయన సంపదను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు అది కేవలం 13 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా, ప్రస్తుతం ఏడు రెట్లకు పైగా పెరగడం విశేషం.ఈ వృద్ధికి ప్రధాన కారణం టిక్టాక్ ప్రపంచవ్యాప్త విజయంతో పాటు బైట్డాన్స్ అభివృద్ధి చేసిన డౌబావో (Doubao) ఏఐ చాట్బాట్కు చైనాలో లభిస్తున్న ఆదరణ. డౌబావోకు ఇప్పటికే 300 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ వినియోగదారులు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో బైట్డాన్స్ దూకుడుగా పెట్టుబడులు పెడుతుండటం కూడా కంపెనీ విలువను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.అమెరికాలో టిక్టాక్ కార్యకలాపాలపై గత కొన్నేళ్లుగా నెలకొన్న నియంత్రణ అనిశ్చితి కూడా ఇటీవల కొంతవరకు తగ్గింది. బైట్డాన్స్ తన అమెరికా వ్యాపారంలోని భాగాలను అమెరికన్ పెట్టుబడిదారులకు బదిలీ చేయడంతో కంపెనీపై ఉన్న రిస్క్ డిస్కౌంట్ను బ్లూమ్బర్గ్ తగ్గించింది. దీంతో సంస్థ విలువపై మరింత సానుకూల అంచనాలు వెలువడ్డాయి.ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు బ్లాక్రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్, టి.రోవీ ప్రైజ్, జనరల్ అట్లాంటిక్, తదితర సంస్థల తాజా విలువల అంచనాల ఆధారంగా జాంగ్ సంపద ఒక్కసారిగా 24 బిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు సమాచారం.అగ్రస్థానంలో గౌతమ్ అదానీఇక భారతీయ బిలియనీర్లలో ముకేశ్ అంబానీ 86.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆసియాలో మూడో స్థానానికి దిగజారగా, గౌతమ్ అదానీ (Gautam Adani) 117.4 బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఏఐతో కొత్త శకానికి బైట్డాన్స్సోషల్ మీడియా కంపెనీగా ప్రారంభమైన బైట్డాన్స్ ఇప్పుడు ఏఐ రంగంలోనూ భారీ ఆశయాలతో ముందుకు సాగుతోంది. 2026లో ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, మోడల్ అభివృద్ధిపై భారీ పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి. టిక్టాక్ విజయాన్ని ఏఐ వ్యాపారంలోనూ పునరావృతం చేయగలిగితే, జాంగ్ యిమింగ్ సంపద మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కెనరా బ్యాంక్కు కొత్త బాస్.. బ్రజేష్ కుమార్ సింగ్
బెంగుళూరు: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు కెనరా నూతన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బ్రజేష్ కుమార్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం మే 30న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు బ్రజేష్ కుమార్ సింగ్ 2029 ఏప్రిల్ 30 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.మాజీ ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు పదవీ విరమణ అనంతరం స్థానంలో నియమితులయ్యారు. బ్రజేష్ కుమార్ సింగ్కు బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. కెనరా బ్యాంక్లో చేరకముందు ఇండియన్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. అలహాబాద్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో వ్యవసాయ విద్యను అభ్యసించారు.ఫైనాన్స్లో ఎంబీఏ పట్టా పొందారు. బ్రజేష్ కుమార్ సింగ్ నాయకత్వంలో కెనరా బ్యాంక్ డిజిటల్ పరివర్తనను మరింత వేగవంతం చేయనుంది. ఆర్థిక చేరిక విస్తరణ, ఆస్తుల నాణ్యత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. వినియోగదారుల సేవలను మెరుగుపరుస్తూ, షేర్ హోల్డర్లకు స్థిరమైన విలువను సృష్టించడమే లక్ష్యమని బ్యాంక్ తెలిపింది. -
ఒక్కో ట్రిప్పుపై రూ.300-రూ.400 భారం
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం రవాణా రంగంపై తీవ్రంగా ఉంది. ఇంధన ఖర్చులు భారంగా మారడంతో పుణె-ముంబై మార్గంలో నడిచే క్యాబ్ ఆపరేటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఛార్జీలను పెంచుతున్నట్లు చెప్పారు. ఈ సవరించిన రేట్లు నిత్యం ప్రయాణించే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.రూ.300 - రూ.400 అదనం!గత కొన్ని నెలలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల భారాన్ని క్యాబ్ డ్రైవర్లు, ఆపరేటర్లు భరిస్తూ వచ్చారు. అయితే, మే నెలలో ధరలు పదేపదే పెరగడంతో ఇక లాభాలు రాకపోగా చేతి డబ్బులు పోయే పరిస్థితి రావడంతో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు డ్రైవర్లు చెప్పారు. వాహనం రకాన్ని బట్టి ఛార్జీల పెంపుదల మారుతుందని, అయితే సగటున పుణె-ముంబై వన్-వే ప్రయాణానికి ఇప్పుడు రూ.300 నుంచి రూ.400 వరకు అదనంగా ఖర్చు అవుతుందని పుణెకు చెందిన క్యాబ్ ఆపరేటర్ జ్ఞానేశ్వర్ షెల్కే తెలిపారు. టోల్ ఛార్జీలు మినహాయించి కిలోమీటరుకు వసూలు చేసే బేస్ రేటు రూ.19 నుంచి రూ.20కి పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.చేతులెత్తేసిన ఆపరేటర్లు..పుణె-ముంబై రూట్లో నిత్యం ప్రయాణించే విశాల్ జాదవ్ అనే క్యాబ్ డ్రైవర్ ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘నా వద్దకు వచ్చే ప్రయాణికుల్లో 80 శాతం మంది అంతర్జాతీయ విమానాల కోసం ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్లేవారే. మే నెలలోనే వరుసగా మూడుసార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఆ కార్యాచరణ ఖర్చులను మేం భరించలేకే ఈ భారాన్ని ప్రయాణికులపై వేయాల్సి వచ్చింది. పాత కస్టమర్లు పరిస్థితిని అర్థం చేసుకుంటున్నప్పటికీ కొత్త ప్రయాణికులు మాత్రం పెరిగిన రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు’ అన్నారు.ఈ పెరిగిన ధరల వల్ల క్యాబ్ ప్రయాణం మధ్యతరగతికి భారంగా మారుతోంది. ధరల పట్ల అత్యంత సున్నితంగా ఉండే కొత్త కస్టమర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. క్యాబ్ ఛార్జీలు బడ్జెట్ దాటిపోతుండటంతో చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు లగ్జరీ బస్సులు లేదా రైలు ప్రయాణాలను ఎంచుకుంటున్నారని ఆపరేటర్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంపై మహీంద్రా కన్ను
ఏరోస్పేస్ రంగంలో భారతీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) దూసుకుపోతున్నట్లు చెప్పింది. విమానాల తయారీలో అంతర్జాతీయంగా ఎదురవుతున్న సరఫరా-గొలుసు (సప్లై-చైన్) లోపాలను అధిగమించడానికి, గ్లోబల్ ఏరోస్పేస్ మార్కెట్లో వ్యూహాత్మక కొనుగోళ్లు జరపడంపై కంపెనీ దృష్టి సారించింది. ఈ విషయాన్ని గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా అధికారికంగా వెల్లడించారు.ప్రస్తుతం అంతర్జాతీయంగా విమాన డెలివరీలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం సప్లై-చైన్ నెట్వర్క్లో తలెత్తుతున్న అంతరాయాలేనని కంపెనీ చెప్పింది. ఈ అడ్డంకులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాల్సిందిగా గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు (ఓఈఎం) మహీంద్రా గ్రూప్ను సంప్రదించారని అనీష్ షా స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన కంపెనీ ఆదాయాల వెల్లడి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం గ్లోబల్ ఓఈఎంలు కేవలం ఆర్డర్ల కోసమే కాకుండా మా సామర్థ్యాన్ని నమ్మి వస్తున్నాయి. మేము అత్యుత్తమ నాణ్యతను అందిస్తామని, మా ఉత్పాదక పరిధిని మరింత విస్తరించమని కోరుతున్నారు. ప్రస్తుతం చాలా కంపెనీలు సరఫరా పరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’ అన్నారు. పరిశ్రమ వర్గాల విశ్లేషణల ప్రకారం.. అనీష్ షా పేర్కొన్న ఆ గ్లోబల్ ఓఈఎం.. అంతర్జాతీయ విమాన తయారీ దిగ్గజం ఎయిర్బస్ అనేలా అంచనాలున్నాయి. గత కొద్దికాలంగా మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్తో ఎయిర్బస్ తన వ్యాపారం భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తోంది.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
డీమెర్జర్ వేళ, వేదాంతకు ఎదురు దెబ్బ : ఈడీ దాడులు
ప్రముఖ వ్యాపార సంస్థ వేదాంతకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాకిచ్చింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత (Vedanta) గ్రూప్ ప్రాంగణాల్లో జూన్ 2న సోదాలు నిర్వహిస్తోంది. రాయల్టీ చెల్లింపులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేదాంత గ్రూప్ తన ప్రస్తుత వ్యాపారాన్ని ఐదు విభిన్న విభాగాలుగా విభజించే (డీమెర్జర్) ప్రక్రియలో ఉన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకొంది. అనిల్ అగర్వాల్ సుప్రీం కోర్టులో అదానీని సవాలు చేసిన ఒక నెల తర్వాత, ఈడీ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత గ్రూప్పై దాడులు నిర్వహించడం గమనార్హం. వేదాంత తన మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్కు చెల్లించిన రాయల్టీ చెల్లింపుపై జరుగుతున్న దర్యాప్తులో భాగమే ఈ దాడులు. ముంబై, ఢిల్లీలలోని వేదాంత కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. వేదాంత లిమిటెడ్ తన మాతృ సంస్థ అయిన 'వేదాంత రిసోర్సెస్' (Vedanta Resources) కు చేసిన రాయల్టీ చెల్లింపులపై వస్తున్న ఆరోపణల విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ సోమవారం ప్రారంభమై ఇప్పుడు ముగిసిందని ఒక సీనియర్ ఈడీ అధికారి తెలిపారు. దర్యాప్తు అధికారులు ఈ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, రికార్డులను సేకరించారు. ఫెమా కింద ఉన్న విదేశీ మారకపు నిబంధనలకు అవి అనుగుణంగా ఉన్నాయో లేదో అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఉదయం 11:45 గంటల సమయంలో వేదాంత షేరు ధర 0.7 శాతం క్షీణించి రూ. 334.6 వద్ద ట్రేడ్ అయింది.వేదాంత స్పందనఈడీ దాడులపై వేదాంత స్పందించింది. అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, చట్టపరిధిలో అన్ని నిబంధనలకు కట్టుబడి ఉంటామని ప్రకటించింది ప్రస్తుతం ఈ వ్యవహారం నియంత్రణ సంస్థల (Regulatory Process) పరిశీలనలో ఉన్నందున, ఇంతకుమించి వ్యాఖ్యానించలేమని వేదాంత ప్రతినిధి ఒకరు తెలిపారు.వేదాంత vs అదానీమరోవైపు భారతదేశపు ఏకైక ఫార్ములా వన్ సర్క్యూట్తో సహా పలు ఆస్తులను కలిగి ఉన్న దివాలా తీసిన రియల్ ఎస్టేట్ సంస్థ జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (JAL) కోసం గౌతమ్ అదానీ గ్రూప్ వేసిన విజేత బిడ్ను, మైనింగ్ బిలియనీర్ అనిల్ అగర్వాల్కు చెందిన వేదాంత లిమిటెడ్ సవాలు చేయగా, కంపెనీ లా అప్పీల్స్ కోర్టు (మే 4, 2026న) తిరస్కరించింది. వేదాంత లేవనెత్తిన అంశాలలో యోగ్యత లేదని భావించిన జాతీయ కంపెనీ చట్ట అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT), దాని రెండు పిటిషన్లను కొట్టివేసింది. ఇలా సవాల్ చేసింనందుకే ఈడీ దాడుల అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా బ్రిటన్కు చెందిన 'వేదాంత రిసోర్సెస్' దీనికి మాతృ సంస్థ (Parent Company). ఈ విదేశీ మాతృ సంస్థ భారీగా అప్పుల్లో మునిగిపోయింది. నివేదికల ప్రకారం.. వేదాంత రిసోర్సెస్ మొత్తం అప్పు రూ. 74,000 కోట్లుగా ఉంది. ఇందుకోసమే భారతీయ అనుబంధ సంస్థ (Vedanta Ltd) తన మాతృ సంస్థకు భారీగా రాయల్టీలు చెల్లిస్తూ వస్తోంది. వేదాంత లిమిటెడ్ అనేది భారతదేశంలో లిస్ట్ అయిన కంపెనీ, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.3 లక్షల కోట్లుగా ఉంది.మే నెలలో ఈ కంపెనీ వ్యాపార విభజనకు సంబంధించి వివిధ నియంత్రణ సంస్థల నుండి అనుమతులు పొందింది. దీని ప్రకారం, కొత్తగా నాలుగు సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. ఈ ప్రధాన సంస్థ అలాగే కొనసాగుతుంది. ఇందులో హిందుస్థాన్ జింక్, జింక్ ఇంటర్నేషనల్, కాపర్, ఫెర్రో క్రోమ్ మరియు కొత్త టెక్నాలజీ వ్యాపారాలు ఉంటాయి. అల్యూమినియం కార్యకలాపాలు, పవర్ ప్లాంట్లు మరియు బాల్కో (BALCO) లో 51 శాతం వాటాను ఇది నిర్వహిస్తుంది.వేదాంత పవర్ (Vedanta Power) తల్వాండి సాబో ప్లాంట్తో సహా థర్మల్ పవర్ ఆస్తులను పర్యవేక్షిస్తుంది. వేదాంత ఆయిల్ & గ్యాస్ (Vedanta Oil & Gas): కేయిర్న్ ఆయిల్ & గ్యాస్ (Cairn Oil & Gas) బాధ్యతలను ఇది పర్యవేక్షిస్తుంది. వేదాంత స్టీల్ & ఫెర్రస్ (Vedanta Steel & Ferrous): ఇనుప ఖనిజం గనులు మరియు ఈఎస్ఎల్ (ESL) స్టీల్ ప్లాంట్ను ఇది నిర్వహిస్తుంది. -
సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే..
సాంకేతిక ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం సాంప్రదాయ ఐటీ రంగ ఉనికినే ప్రశ్నిస్తోందన్న ఆందోళనలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని కౌంటర్ ఇచ్చారు. ‘కోడింగ్ ఆటోమేటెడ్ అయితే ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎందుకు?’ అంటూ మార్కెట్లో వ్యక్తమవుతున్న అస్తిత్వ ప్రశ్నలకు ఆయన వ్యూహాత్మక సమాధానమిచ్చారు. ఏఐ అనేది ఐటీ సేవల ప్రాధాన్యతను తగ్గించబోదని, పైగా నైపుణ్యాల డిమాండ్ను మరింత పెంచిందని ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక సమర్పణ సందర్భంగా వాటాదారులు, పెట్టుబడిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఆందోళనల మధ్యే అద్భుత వృద్ధిగత ఏడాది కాలంగా ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు అధునాతన ఏఐ సాధనాలను మార్కెట్లోకి తీసుకురావడంతో ఐటీ కంపెనీల భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ భయాల కారణంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 28% పైగా క్షీణించాయి. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇన్ఫోసిస్ బలమైన ఆర్థిక ఫలితాలను సాధించినట్లు చెప్పారు.వార్షిక ఆదాయం: మునుపటి ఏడాదితో పోలిస్తే 4.6% వద్ధితో 20.16 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.65 లక్షల కోట్లు) వార్షిక ఆదాయాన్ని నమోదు చేసింది.ఉద్యోగుల సంఖ్య: కంపెనీ ఉద్యోగుల సంఖ్య మునుపటి కంటే 5,016 పెరిగి మొత్తం 3,28,594 కు చేరుకుంది.మునుపటికంటే బలంగా..‘జనరేటివ్ ఏఐ (GenAI) రంగ ప్రవేశం చేసి మూడేళ్లు పూర్తయింది. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గతంలో కంటే మరింత సందర్భోచితంగా, పటిష్టంగా మారిందని చెప్పగలం. మన ముందు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ఏఐ అనేది మునుపెన్నడూ లేనంత పెద్ద సాంకేతికగా కనిపిస్తుంది. కాబట్టి సందేహాలు రావడం సహజం. కోడింగ్ ఆటోమేటిక్ అయితే, ఇక మన అవసరం ఏముంది? అనే ప్రశ్న మా ముందూ నిలిచింది. కానీ, వాస్తవం దానికి భిన్నంగా ఉంది’ అన్నారు.ఐటీ అంటే అంతకంటే ఎక్కువే!ఏఐ కేవలం కోడింగ్ను ఆటోమేట్ చేయగలదని, అయితే ఒక పూర్తి స్థాయి సాఫ్ట్వేర్ విజయం సాధించాలంటే కేవలం కోడింగ్ సరిపోదని నీలేకని స్పష్టం చేశారు. వేగవంతమైన ఏఐ డిమాండ్కు అనుగుణంగా ఐటీ రంగంలో కింది అంశాలు అత్యంత కీలకంగా మారాయని చెప్పారు.1. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ (ఎస్డీఎల్సీ) పరీక్షలు: క్లిష్టమైన సిస్టమ్స్ను నిరంతరం పర్యవేక్షించడం.2. సాఫ్ట్వేర్ వ్యవస్థలు వైఫల్యం చెందకుండా నిరోధించడం.3. సైబర్ సెక్యూరిటీ: ఏఐ యుగంలో పెరిగిపోతున్న సైబర్ ముప్పుల నుంచి రక్షణ కల్పించడం.4. ఐటీ ఆధునీకరణ: పాత సాఫ్ట్వేర్ వ్యవస్థలను సరికొత్త సాంకేతికతకు అనుగుణంగా మార్చడం.కొత్త వ్యాపార నమూనా వైపు అడుగులుభవిష్యత్తు ఐటీ రంగాన్ని శాసించడానికి పాత పద్ధతులు సరిపోవని, సరికొత్త వ్యాపార నమూనా అవసరమని నీలేకని పిలుపునిచ్చారు. ‘మేము ఈ సరికొత్త సవాలుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. మా శ్రామిక శక్తిని ఈ కొత్త యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతాం. ఏఐ ఆటోమేషన్, ఉత్పాదకత ద్వారా ఆదా అయ్యే మానవ వనరులను కొత్త యూజర్లను ఆకర్షించడానికి, సరికొత్త సేవలను విస్తరించడానికి తిరిగి వినియోగిస్తాం’ అని నందన్ నీలేకని వాటాదారులకు హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: నిన్నటి ధరే నేడు.. ప్రశాంతంగా పసిడి -
‘సర్ జీతం రాలేదు.. ఇన్సెంటివ్ ఎప్పుడు’
ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో యజమాని-ఉద్యోగి మధ్య బంధం కేవలం ‘నెలవారీ జీతం-పని’ అనే లావాదేవీకే పరిమితమా? లేక సంస్థ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు ఉద్యోగులు కూడా నైతిక బాధ్యత వహించాలా?- ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ వేదికగా జరుగుతున్న ఒక ఆసక్తికర చర్చ ఈ ప్రశ్నలను రేకిత్తించింది. ఒక సంస్థలో వారం రోజుల జీతం ఆలస్యం కావడం, దానికి ప్రతిస్పందనగా ఒక కంపెనీ వ్యవస్థాపకురాలు చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది. గీతికా కౌశిక్ అనే బిజినెస్ లీడర్ పంచుకున్న అభిప్రాయాలు, దానికి నెటిజన్ల స్పందన కింద చూద్దాం.లక్ష్యాలు విఫలమైతే బాధ్యత ఎవరిది?సంస్థల్లో వ్యాపార లక్ష్యాలు (బిజినెస్ టార్గెట్లు) నీరుగారినప్పుడు, జీతాలు ఆలస్యమైనప్పుడు వ్యవస్థాపకులు ఎదుర్కొనే మానసిక, ఆర్థిక ఒత్తిడిని గీతికా కౌశిక్ తన పోస్ట్లో ప్రస్తావించారు. ఇటీవల ఒక సంఘటనను ఉదహరిస్తూ.. కేవలం ఏడు రోజులు జీతం ఆలస్యమవడానికే ఉద్యోగులు తమ భద్రతను ప్రశ్నించారని ఆమె పేర్కొన్నారు. ‘ఉద్యోగులు ముందుకు వచ్చి.. మాకు ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు. జీతాలు ఆలస్యమైతే కుటుంబం, ఈఎంఐల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించడం నిజమే. వారి వైపు ఉన్న బాధ్యతలు, ఇబ్బందుల్లో నిజముంది. కానీ, నాణేనికి మరోవైపు ఉన్న మేనేజ్మెంట్ ఆవేదనను కూడా చూడాలి కదా?’ అని ఆమె ప్రశ్నించారు.అత్యంత కీలకమైన పీక్ సీజన్లో 30 మందికి పైగా బృందాన్ని నడిపించే ఒక సీనియర్ మేనేజర్ కేవలం 20 శాతం టార్గెట్ను మాత్రమే రీచ్ అయ్యారని ఆమె ఎత్తి చూపారు. 70 శాతానికి పైగా బిజినెస్ లక్ష్యాలను చేరడంలో విఫలమై కూడా బాధ్యతను పక్కనబెట్టి కేవలం ‘సర్, జీతం రాలేదు?’, ‘సర్, ఇన్సెంటివ్స్ ఎప్పుడు?’ అని అడగడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు.గౌరవంతో సంపాదించండివ్యాపారాన్ని నిలబెట్టడానికి, ఉద్యోగుల కుటుంబాలు సకాలంలో ఈఎంఐలు కట్టుకోవడానికి వ్యవస్థాపకులు తెరవెనుక ఎన్నో త్యాగాలు, ఆర్థిక ఇబ్బందులను భరిస్తుంటారని కౌశిక్ పేర్కొన్నారు. ‘రేపు ఆఫీస్కు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఉద్యోగానికి, చేసే పనికి మోసం చేయకండి. ఏదో అలవాటుగా ఆఫీస్కు వెళ్లి రావడం కాదు.. మీ పని ద్వారా గౌరవప్రదంగా జీతాన్ని సంపాదించుకోండి’ అంటూ ఆమె తన పోస్ట్ను ముగించారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్పై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రీ-పోస్టులు చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల పక్షాన నిలిచిన పలువురు నెటిజన్లు యజమానుల ధోరణిని తప్పుబట్టారు. ‘మీరు ఒక వ్యవస్థాపకుడిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడే.. అనిశ్చితి, ఒత్తిడి, నిద్రలేని రాత్రులు, ఆర్థిక నష్టాల రిస్క్ను మీరే ఎంచుకున్నారు. కానీ ఉద్యోగి అలా కాదు. సంస్థ ఎలాంటి స్థితిలో ఉన్నా సమయానికి జీతం ఇవ్వడం యజమాని కనీస బాధ్యత’ అని ఒక వినియోగదారుడు స్పష్టం చేశారు. ‘ఉపాధి అనేది ఒక ఒప్పందం, భాగస్వామ్యం కాదు. వచ్చే నెలలో కంపెనీ 500% లాభాల్లోకి దూసుకెళ్తే.. ఉద్యోగుల జీతాలు కూడా 500% పెరగవు కదా? అలాంటప్పుడు నష్టాలు లేదా టార్గెట్స్ రీచ్ అవ్వనప్పుడు ఉద్యోగులపై భారం వేయడం తగదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
రూ.72 లక్షల జాబ్ ఆఫర్.. అందుకే రిజెక్ట్ చేసాడు!
భారీ జీతమా?, వర్క్-లైఫ్ బ్యాలెన్సా?, అనే విషయపై చాలారోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి రూ.72 లక్షల వేతనంతో కూడిన జాబ్ ఆఫర్ను తిరస్కరించారు. దీనికి సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ఆ ఉద్యోగ ఆఫర్లో కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. వారానికి ఐదు రోజులు ఆఫీస్కు రావాలి, అధికారిక సెలవు విధానం లేదు, అలాగే రీలోకేషన్ సహాయం కూడా ఇవ్వలేదు. ఈ కారణాలతో అభ్యర్థి ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుత జీతంపై కేవలం 25 శాతం మాత్రమే పెంపు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పెరిగిన జీవన వ్యయం, వ్యక్తిగత సమయానికి అవకాశం లేకపోవడం వంటి అంశాలు కూడా అతని జాబ్ రిజెక్ట్ చేయడానికి కారణమైంది.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. కొంతమంది వినియోగదారులు ఇంత పెద్ద జీతాన్ని వదిలేయడం ఆశ్చర్యం అని భావించగా, మరికొందరు మాత్రం డబ్బు కంటే మానసిక, శారీరక ఆరోగ్యం ముఖ్యమని అభిప్రాయపడ్డారు.My friend just rejected a 72 LPA offer.Reasons:• 5 days strict WFO• No leave policy• Zero relocation supportWhat shocked me the most? He had zero sense of loss.It’s fascinating that people like these exist who are willing to let so much money go because of work life… pic.twitter.com/GtSOLEi4S3— Ragini Pandey (@pandeyragini24) May 31, 2026ఒక వినియోగదారు తాను ఏడాదికి ఒక కోటి రూపాయలకుపైగా సంపాదించినప్పటికీ, నిరంతరం పని ఒత్తిడిలో ఉండటం వల్ల జీవితం కష్టమైందని చెప్పాడు. మరో వ్యక్తి 2015లో ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, తక్కువ జీతం ఉన్న కానీ ప్రశాంతమైన ఉద్యోగాన్ని ఎంచుకున్నానని తన అనుభవాన్ని పంచుకున్నాడు.ఈ చర్చ ద్వారా ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతోంది. నేటి ఉద్యోగ ప్రపంచంలో కేవలం జీతం మాత్రమే కాదు, పని వాతావరణం, వ్యక్తిగత సమయం, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమవుతున్నాయి. ఎక్కువ డబ్బు ఉన్న ఉద్యోగాలు అన్ని సమయాల్లో సంతోషాన్ని ఇవ్వవు అనే ఆలోచన ఉద్యోగులలో స్పష్టంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన! -
జాబ్ కోసం.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!
గత కొన్నేళ్లుగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ, ఏఐ ప్రధానమని వినిపిస్తోంది. అయితే.. జాబ్ పోతే ఏముందిలే.. ఇంకో జాబ్ వచ్చేస్తుంది అనేవారికి.. అమెజాన్ మాజీ ఉద్యోగి కథ తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల ఒక మాజీ అమెజాన్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దాదాపు ఎనిమిది నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా ఉద్యోగం దొరకలేదని ఆయన వెల్లడించడం.. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో నెలకొన్న పోటీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.ప్రముఖ ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ఏడు సంవత్సరాల పాటు పనిచేశాడు. అయితే.. 2025 చివరి త్రైమాసికంలో కంపెనీ చేపట్టిన ఉద్యోగుల తొలగింపులలో భాగంగా ఆయన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే.. ఆయనకు పెద్దగా సమస్య అనిపించలేదు. ఎందుకంటే ఆయన అనుభవం, నైపుణ్యాల కారణంగా అనేక ప్రముఖ సంస్థల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందులో అమెరికన్ ఎక్స్ప్రెస్, అగోడా, ఉబెర్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.ఇంటర్వ్యూలలో తనకు కొంత నిరాశ ఎదురైంది. ఆ తరువాత కొంతకాలం ఉద్యోగ అన్వేషణ నుంచి విరామం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి అంతగా ప్రతికూలంగా కనిపించలేదు. కానీ.. కొంతకాలం తర్వాత తిరిగి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించగా, పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నాడు.2026 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. జాబ్ కోసం తన బయోడేటాను నాలుగు నుంచి ఐదు సార్లు అప్డేట్ చేసుకున్నాడు. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంకు అనుకూలంగా రెజ్యూమే రూపొందించి అప్లై చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ఎంత కఠినంగా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది ఉద్యోగులు నెలల తరబడి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరికొందరు కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించడం, నియామక ప్రక్రియలను నిలిపివేయడం, ఉద్యోగాల కోసం పోటీ మరింత పెరగడం వంటి సమస్యలను ప్రస్తావించారు. -
ఆదాయాల అంతరం.. ఆప్యాయతలు దూరం!
సాఫ్ట్వేర్ రంగంలో భారీ ప్యాకేజీలు, విలాసవంతమైన జీవనశైలి ఒకవైపు ఆకర్షిస్తున్నా.. అంతర్గతంగా ఐటీ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో కొత్త రకమైన ఆర్థిక విబేధాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఒక సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్ తన భాగస్వామితో ఎదుర్కొంటున్న ‘ఆదాయ అసమానత’కు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కలిసి జీవించడం సులువే అయినా నెలవారీ ఖర్చులు, జీతాల మధ్య ఉండే భారీ వ్యత్యాసం వారి మధ్య ఉన్న ప్రేమను ఎలా దూరం చేస్తోందో సదరు టెక్కీ ఆవేదన వ్యక్తం చేశాడు.కార్పొరేట్ ఉద్యోగుల ప్రొఫెషనల్ కమ్యూనిటీ ప్లాట్ఫామ్ ‘గ్రేప్వైన్’లో ఒక మైక్రోసాఫ్ట్ టెక్కీ ‘గూఫీపాండా’ అనే పేరుతో తన వ్యక్తిగత జీవితంలోని అంశాలను పంచుకున్నాడు. అందులోని వివరాల ప్రకారం.. ‘నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ ప్రొడక్ట్ డిజైనర్గా పనిచేస్తూ ఏడాదికి రూ.48 లక్షలు సంపాదిస్తున్నాను. నా స్నేహితురాలి వార్షిక ఆదాయం రూ.8 లక్షలు. ఈ ఏడాది ప్రారంభంలో మేమిద్దరం కలిసి ఉండాలని(లివ్-ఇన్ రిలేషన్షిప్) నిర్ణయించుకున్నాం. నా ఆఫీస్కు దగ్గర్లోనే ఒక మంచి ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాం. మొదట్లో అంతా సజావుగానే సాగింది. కానీ బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి అసలు కథ మొదలైంది’ అని పేర్కొన్నాడు.ప్లాట్ లీజు ఒప్పందంపై సంతకాలు చేసి కొత్త ఇంట్లోకి మారిన తర్వాత నిత్యం వచ్చే బిల్లులు, కిరాణా ఖర్చులు, భారీ సెక్యూరిటీ డిపాజిట్ వంటివి వారి ఆర్థిక స్థితిగతుల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించాయి. ఇద్దరి జీతాల మధ్య ఏకంగా 6 రెట్లు తేడా ఉండటంతో ఖర్చులను సమానంగా పంచుకోవడం అసాధ్యంగా మారింది.టెక్కీ తెలిపిన వివరాల ప్రకారం..ప్రస్తుతం అద్దె, రోజువారీ జీవనశైలి ఖర్చులతో కూడిన ఉమ్మడి బడ్జెట్లో 85 శాతానికి పైగా అతడే ఒంటరిగా భరిస్తున్నట్లు చెప్పాడు. బంధం న్యాయంగా సాగాలనే ఉద్దేశంతో ఆఫీస్ సీనియర్లను సంప్రదించి ఒక జాయింట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసినట్లు తెలిపాడు. అయినా సమస్య సర్దుమణగలేదన్నాడు.కారు రిపేర్ బిల్లుతో..ఈ ఏర్పాటు కొంతకాలం స్థిరంగా సాగినట్లు అనిపించినా ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు అసలు సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇటీవల వారి కారు రిపేర్ బిల్లు వచ్చింది. ఈ ఖర్చును ఇద్దరం పంచుకుందామని అతను ప్రతిపాదించగా ఆమె ఆర్థికంగా ఆ విషయాన్ని పూర్తిగా దాటవేసేందుకు ప్రయత్నించినట్లు పోస్ట్లో తెలిపాడు. ‘డబ్బు విషయంలో జరిగే ప్రతి చిన్న గొడవ మా మధ్య ఉన్న ఆప్యాయతను, ప్రేమను క్రమంగా నాశనం చేస్తోంది. వ్యక్తిగత జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితి ఇదే’ అని సదరు టెక్కీ ఆందోళన వ్యక్తం చేశాడు.నెటిజన్ల అభిప్రాయాలుఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలతో కామెంట్ చేస్తున్నారు. ‘ఆమెతో నీకు దీర్ఘకాలిక భవిష్యత్తు ఉంటుందని నమ్మకం ఉంటే ఆర్థిక భారాన్ని నువ్వే ఎక్కువగా మోయడంలో తప్పులేదు. ఆదాయ అసమానతలు సహజం. భాగస్వామి కెరీర్ ఎదగడానికి నువ్వే సాయం చేయాలి’ అని కొందరు చెబుతున్నారు. ‘ఆమెకు నీతో కలిసి జీవించాలనే నిబద్ధత ఉంటే.. అదనపు ఖర్చుల విషయంలో రక్షణాత్మకంగా ఎందుకు ప్రవర్తిస్తుంది? నువ్వు ఆమెను జీవిత భాగస్వామిగా చూస్తున్నావా లేక కేవలం రూమ్ మేట్లా భావిస్తున్నావా?’ అని కొందరంటున్నారు. నెటిజన్ల నుంచి వచ్చిన ఈ స్పందనపై సదరు మైక్రోసాఫ్ట్ ఉద్యోగి మళ్లీ స్పందించాడు. తాను ఆమెను కేవలం ఫ్లాట్ మేట్లా కాకుండా తన జీవిత భాగస్వామిగానే భావిస్తున్నానని స్పష్టం చేశాడు. అయితే, సాధారణ డేటింగ్ స్థాయి నుంచి ఒకే ఇంట్లో ఉంటూ సంసారాన్ని నిర్వహించే స్థాయికి మారే క్రమంలో ఎదురైన ఆర్థిక సవాళ్లు తను ఊహించలేదని అంగీకరించాడు. ‘త్వరలోనే మేమిద్దరం ప్రశాంతంగా కూర్చుని, దీర్ఘకాలంలో మా బంధం నిలబడటానికి తగ్గట్టుగా ఒక స్థిరమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటాం’ అని అతను ముగించాడు.ఇదీ చదవండి: రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి? -
రైల్వే సూపర్ యాప్.. పాత యాప్ మధ్య తేడా ఏమిటి?
భారతీయ రైల్వే సాంకేతిక విప్లవంలో మరో అడుగు ముందుకేస్తూ ఇటీవల విడుదల చేసిన సూపర్ యాప్ ‘రైల్వన్’ ప్రస్తుతం ప్రయాణికుల్లో ఆదరణ పొందుతోంది. ఇప్పటివరకు సాధారణ రిజర్వేషన్లకు ఒక యాప్, జనరల్ (అన్రిజర్వ్డ్) టికెట్లకు మరో యాప్, ఫిర్యాదులకు వేరొక యాప్ ఉపయోగించాల్సి వచ్చేది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సీఆర్ఐఎస్) రూపొందించిన ఈ రైల్వన్ యాప్.. అసలు గతంలో ఉన్న ఐఆర్సీటీసీ యాప్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? రైల్వే శాఖ దీన్ని ఎందుకు ప్రత్యేకంగా తీసుకొచ్చింది? అనే పూర్తి వివరాలపై విశ్లేషణ.అసలు రైల్వన్ యాప్ను రైల్వే శాఖ ఎందుకు తీసుకొచ్చింది?గతంలో రైల్వే సేవలు వేర్వేరు డిజిటల్ విభాగాల కింద విడిపోయి ఉండేవి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అధిగమించడానికి మంత్రిత్వ శాఖ ఈ సూపర్ యాప్ను ప్రవేశపెట్టింది.రిజర్వేషన్ల కోసం IRCTC Rail Connect, జనరల్ టికెట్ల కోసం UTS, ఫిర్యాదుల కోసం Rail Madad ఇలా ఫోన్ నిండా యాప్లను డౌన్లోడ్ చేసుకునే అవసరం లేకుండా ప్రయాణికుడి స్మార్ట్ఫోన్ స్పేస్ను ఆదా చేయడం దీని ముఖ్య ఉద్దేశం.ప్రయాణికుడు ఒక్కసారి బయోమెట్రిక్ లేదా mPIN తో లాగిన్ అయితే చాలు అన్ని సేవలను ఒకే చోట పొందవచ్చు.రైల్వే వ్యవస్థ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా నిమిషానికి లక్షలాది బుకింగ్స్, ఎంక్వైరీలను తట్టుకునేలా అత్యంత వేగవంతమైన, యాడ్ఫ్రీ ఇంటర్ఫేస్ను అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు.ఐఆర్సీటీసీ.. రైల్వన్ మధ్య ప్రధాన తేడాలుచాలా మంది ప్రయాణికులు ఈ రెండు యాప్లు ఒకటే అని భావిస్తుంటారు. కానీ వీటి పనితీరు, సేవల పరిధిలో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి.ఫీచర్ఐఆర్సీటీసీ (రైల్ కనెక్ట్)రైల్ వన్నిర్వహణఐఆర్సీటీసీ ప్రభుత్వ అనుబంధ కార్పొరేట్ సంస్థ).క్రిస్ (రైల్వే శాఖ పరిధిలోని ఐటీ విభాగం).టికెట్ల లభ్యతప్రధానంగా రిజర్వ్డ్ రైలు టికెట్లు (కన్ఫర్మ్డ్, తత్కాల్) మాత్రమే.రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫారమ్ టికెట్లు అన్నీ లభిస్తాయి.రిజర్వేషన్ ప్రక్రియఐఆర్సీటీసీ సొంత గేట్వే, లాగిన్ ద్వారా బుకింగ్ జరుగుతుంది.ఐఆర్సీటీసీ అథరైజ్డ్ పార్ట్నర్లుగా ఉంటూనే దాని సర్వర్ను అనుసంధానించి వేగంగా బుక్ చేస్తుంది.లైవ్ ట్రాకింగ్, రూట్లుకొంత పరిమితంగా ఉంటుంది లేదా వేరే థర్డ్ పార్టీ యాప్లపై ఆధారపడాలి.లైవ్ రన్నింగ్ స్టేటస్, కోచ్ పొజిషన్, స్టేషన్ క్యూఆర్ కోడ్స్ ఇన్-బిల్ట్గా ఉంటాయి.రైల్ మదద్ఈ యాప్లో ఫిర్యాదుల వ్యవస్థ నేరుగా సమగ్రంగా ఉండదు.యాప్లోనే ఇన్-బిల్ట్గా ఫిర్యాదులు చేయడం, వాటి స్టేటస్ ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.యూజర్ అనుభవంయాప్లో యాడ్స్ ఎక్కువగా రావడం వల్ల కొన్నిసార్లు పేజీ లోడింగ్ నెమ్మదిస్తుంది.యాప్ ఫ్రీ ఇంటర్ఫేస్, బయోమెట్రిక్ లాగిన్ చాలా వేగంగా పనిచేస్తుంది.రైల్వన్ యాప్లోని టాప్ ఫీచర్లుపేపర్లెస్ అన్రిజర్వ్డ్ టికెటింగ్: రైల్వే స్టేషన్ల్లో ఉండే RailOne QR Codeలను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల్లో క్యూలో నిలబడకుండా జనరల్ టికెట్లు పొందవచ్చు. అన్రిజర్వ్డ్, నప్లాట్ఫారమ్ టికెట్లపై కొన్ని సందర్భాల్లో ప్రమోషనల్ డిస్కౌంట్లు (ఉదాహరణకు 3% వరకు) కూడా లభిస్తాయి.ఫుడ్ ఆర్డర్: ప్రయాణంలో ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ వెరిఫైడ్ పార్ట్నర్ వెండర్స్ నుంచి నేరుగా మీ సీటుకే భోజనం ఆర్డర్ చేసుకోవచ్చు.ఆర్-వాలెట్: ఆధార్ అనుసంధానిత డిజిటల్ వాలెట్ ద్వారా అత్యంత సురక్షితంగా క్షణాల వ్యవధిలో పేమెంట్లు పూర్తి చేయవచ్చు.మల్టీ ల్యాంగ్వేజీ: ఇంగ్లీష్తో పాటు తెలుగు సహా 10కి పైగా ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ను వాడుకునే సదుపాయం ఉంది.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
రూ.25 లక్షల ప్యాకేజీ వద్దు.. క్యాబ్ డ్రైవింగే ముద్దు!
జీవితంలో స్థిరపడటానికి ఒక మంచి వైట్ కాలర్ జాబ్, చేతినిండా జీతం ఉంటే చాలని చాలామంది భావిస్తారు. కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఏడాదికి రూ.25 లక్షల ప్యాకేజీ ఆఫర్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? కళ్లు మూసుకుని ఆఫర్ లెటర్ అందుకుంటారు. కానీ, ఆ యువకుడు మాత్రం అందరిలా ఆలోచించలేదు. ఆకర్షణీయమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని సున్నితంగా తిరస్కరించి స్టీరింగ్ చేతపట్టాడు. ‘ఓలా’ క్యాబ్ డ్రైవర్గా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన ఒక యువకుడి స్ఫూర్తిదాయక కథనం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో వైరల్గా మారింది.రూ.25 లక్షల ఆఫర్ తిరస్కరణసోషల్ మీడియా యూజర్ సచన్ షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సచన్ తెలిపిన వివరాల ప్రకారం.. అతని సోదరుడు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ పూర్తి కాగానే ప్రముఖ కార్పొరేట్ సంస్థ నుంచి రూ.25 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ ఆఫర్ సాధించాడు. అయితే, మొదటి నుంచి కార్పొరేట్ ఉద్యోగాలపై అతనికి ఆసక్తి లేదు. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన సంకల్పంతో ఆ భారీ ఆఫర్ను తిరస్కరించాడు. ఊహించని విధంగా ఓలా క్యాబ్ నడపాలని నిర్ణయించుకున్నాడు.ఈ నిర్ణయం కుటుంబంలో, బంధువుల్లో కలకలం రేపింది. ‘లక్షలు ఖర్చు పెట్టి చదివించింది కార్లు తోలడానికా?’ అంటూ బంధువులు, సమాజం అతన్ని విమర్శించాయి. ఉన్నత చదువులన్నీ వృధా అయిపోయాయని, భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నాడంటూ బహిరంగంగానే ఎగతాళి చేశారు. కానీ, ఆ యువకుడు తన లక్ష్యంపై నమ్మకంతో ముందడుగు వేశాడు.డ్రైవర్ స్థాయి నుంచి ఫ్లీట్ ఓనర్ వరకు..సమాజం అతన్ని కేవలం ఒక ‘క్యాబ్ డ్రైవర్’గా మాత్రమే చూసింది. కానీ సదరు ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం అందులోనే ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని చూశాడు. కేవలం డ్రైవింగ్కే పరిమితం కాకుండా లాజిస్టిక్స్, రవాణా రంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. గడిచిన మూడేళ్ల కాలంలో క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళ్లాడు. సొంతంగా అదనపు వాహనాలను కొనుగోలు చేస్తూ వాటిని నిర్వహించడం ప్రారంభించాడు. సచన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అతని సోదరుడు ఓలా ప్లాట్ఫారమ్ కింద ఏకంగా 5 కార్లను నడుపుతున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు సుమారు రూ.1.5 లక్షల నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలుఈ వైరల్ పోస్ట్ కెరీర్ ఎంపికలపై నెటిజన్ల మధ్య చర్చకు తెరలేపింది. ఈ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాంప్రదాయక వైట్ కాలర్ ఉద్యోగాల చట్రం నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛను, స్వయం ఉపాధిని ఎంచుకున్న సదరు యువకుడి సాహసాన్ని అత్యధికులు అభినందిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు భిన్నంగా స్పందించారు. రూ.25 లక్షల కార్పొరేట్ ఉద్యోగంలో చేరి ఉంటే, మూడేళ్ల అనుభవం తర్వాత ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతో అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేదని అభిప్రాయపడ్డారు. కొంతమంది యూజర్లు ఈ ఆదాయ గణాంకాలను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఐదు కార్లపై నెలకు రూ.1.5 లక్షల నికర లాభం (అన్ని ఖర్చులు, డ్రైవర్ల జీతాలు పోను) సాధించడం అంత సులువు కాదని, దీనికి సంబంధించిన ఆధారాలు ఉంటే బాగుంటుందన్నారు.ఇదీ చదవండి: పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి! -
పాపులర్ ఉద్యోగాల వెంటే పడకండి!
భారతీయ ఆర్థిక రంగం (బీఎఫ్ఎస్ఐ) రాబోయే దశాబ్దంలో అసాధారణ వృద్ధిని నమోదు చేయనుందని, అయితే విద్యార్థులు కేవలం కొన్ని పాపులర్ ఉద్యోగాల వెంటే పరుగులు పెడుతూ అపారమైన అవకాశాలను కోల్పోతున్నారని ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రాధికా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయ కెరీర్ మార్గాలను వీడి, మార్కెట్లో తీవ్ర ప్రతిభ కొరత ఉన్న సరికొత్త విభాగాలపై దృష్టి పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా విద్యార్థులు, విద్యా సంస్థల ప్లేస్మెంట్ సెల్స్ను ఉద్దేశించి కొన్ని అంశాలు పంచుకున్నారు.85 శాతం మంది చూపు ఒకే వైపు!క్యాంపస్ ప్లేస్మెంట్లలో విద్యార్థులు ఇప్పటికీ పాత ఆలోచనలతోనే ఉన్నారని రాధికా గుప్తా పేర్కొన్నారు. ‘మా సంస్థ (ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్)కు వస్తున్న వేలాది ఉద్యోగ దరఖాస్తులను గమనిస్తే.. అందులో దాదాపు 85 శాతం మంది కేవలం ఈక్విటీ రీసెర్చ్ లేదా ఇన్వెస్ట్మెంట్ రోల్స్ కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. క్యాంపస్ల్లో ఈక్విటీ రీసెర్చ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (ఐబీ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) వంటి వాటిని మాత్రమే అత్యున్నతమైనవిగా చూస్తున్నారు. మిగిలిన విభాగాలను తక్కువ ప్రాధాన్యత కలిగిన (సెకండ్ టైర్) కెరీర్లుగా భావిస్తున్నారు. కానీ, ఈ పాత ఆలోచనా విధానం మారాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పారు.రాబోయే దశాబ్దంలో ఈ రంగాల్లో బూమ్..పెరుగుతున్న ఆర్థిక సంక్లిష్టతలు, మారుతున్న నియంత్రణల నేపథ్యంలో రాబోయే పదేళ్లలో కొన్ని విభాగాలు తీవ్ర ప్రతిభ కొరతను ఎదుర్కోబోతున్నాయని, అక్కడ పోటీ తక్కువగా ఉండి కెరీర్ గ్రోత్ అద్భుతంగా ఉంటుందని గుప్తా విశ్లేషించారు. ఆ రంగాలు..రిస్క్ మేనేజ్మెంట్: నియంత్రణ సంస్థల కఠిన నిబంధనలు, కార్పొరేట్ గవర్నెన్స్ అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఈ విభాగంలో నిపుణులైన ప్రతిభకు డిమాండ్, సప్లై ఎక్కువగా ఉంది.ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్: ఆధునిక కాలంలో పెట్టుబడి ఉత్పత్తుల రూపకల్పన, మార్కెట్ పొజిషనింగ్, కమ్యూనికేషన్ అనేవి అసలైన పెట్టుబడి నిర్వహణతో సమానంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.డెరివేటివ్స్ ట్రేడింగ్: దేశంలో సరికొత్త ఎస్ఐఎఫ్, హెడ్జ్ ఫండ్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోంది. అయితే దీనికి తగినట్టుగా శిక్షణ పొందిన నిపుణులు మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నారు.ప్రైవేట్ డెట్, మౌలిక సదుపాయాల పెట్టుబడులు: భారతదేశ మౌలిక వసతుల రంగానికి అపారమైన మూలధనం అవసరం. కానీ, ఈ విభాగంలో నిధుల నిర్వహణ చేపట్టే స్పెషలిస్ట్ నిపుణులు చాలా పరిమితంగా ఉన్నారు.సేల్స్ కెరీర్పై ఉన్నది అపోహే!ఆర్థిక రంగంలో తప్పుగా అర్థం చేసుకున్న, విస్మరించిన విభాగం సేల్స్ డిపార్ట్మెంట్ అని రాధికా గుప్తా స్పష్టం చేశారు. క్యాంపస్ రిక్రూట్మెంట్ల సమయంలో సేల్స్ పాత్రల కోసం తమకు అసలు దరఖాస్తులు రాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ‘సేల్స్ రంగం వ్యక్తిలో ఒత్తిడిని తట్టుకునే శక్తిని, వ్యాపార చతురతను, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన చాలా మంది సీఈఓలు ఒకప్పుడు సేల్స్ లీడర్లుగా పనిచేసినవారే. ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో విక్రయ నైపుణ్యాలను ఉపయోగించాల్సిందే’ అని ఆమె పేర్కొన్నారు. గ్లామర్ కోణంలో చూసి ఈ అవకాశాలను వదిలేస్తున్న వారు ఒకే చోట నిలిచిపోతుంటే, ఈ సరికొత్త రంగాలను ఎంచుకున్న కొంతమంది యువత చిన్న వయసులోనే వేగంగా ఎదుగుతూ, భారీగా సంపాదిస్తూ కెరీర్లో స్థిరపడుతున్నారని తెలిపారు.A LinkedIn post I thought would be worth sharing here too.An honest open letter to placement cells and campuses:We get thousands of CVs to join us. 85% of them come for one role: equity research / investing.I am pretty all 85% of these will get these roles. Or that they…— Radhika Gupta (@iRadhikaGupta) May 31, 2026విజయానికి మూడు ప్రశ్నలుయువత తమ కెరీర్ను ఎంచుకునేటప్పుడు గుంపుతో కలిసి పోకుండా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడిలా ఆలోచించాలని ఆమె సలహా ఇచ్చారు. నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అభ్యర్థి తమను తాము ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలన్నారు.1. ప్రస్తుత ప్రపంచానికి అత్యంత అవసరమైనది ఏమిటి?2. ఏ విభాగంలో పోటీ తీవ్రత చాలా తక్కువగా ఉంది?3. నేను ఏ పనిని సమర్థవంతంగా చేయగలను?ఈ కోణంలో ఆలోచిస్తే డిమాండ్ ఉండి సరైన సప్లై లేని మార్కెట్లను సులభంగా గుర్తించవచ్చని ఆమె సూచించారు.ఇదీ చదవండి: ఫిన్టెక్ సేవల్లోకి ఎల్ఐసీ -
ఫిన్టెక్ సేవల్లోకి ఎల్ఐసీ
ప్రభుత్వరంగ జీవితబీమా సంస్థ ఎల్ఐసీ డిజిటల్ సేవలను పెద్ద ఎత్తున విస్తరించడంపై దృష్టి సారించింది. ఒక ఫిన్టెక్ సంస్థను ఏర్పాటు చేయడాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. పెరుగుతున్న డిజిటల్ సేవల అవసరాలను తీర్చేందుకు అవసరమైతే ప్రత్యేకమైన సేవలు అందించే సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడిని సైతం పరిశీలిస్తున్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి తెలిపారు.‘సహజంగా ఆధునికీకరణ అవసరాలు, కొత్త ఆవిష్కరణల కోసం మేము ఫిన్టెక్, ఇన్సూర్టెక్ సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహిస్తుంటాం. ఈ సంస్థల ద్వారా పలు కొత్త విషయాలను తెలుసుకుంటుంటాం. పెద్ద ఆర్థిక సంస్థగా పలు కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెడుతుంటాం. పాలసీదారుల రాబడులను మెరుగుపరిచేందుకు అవసరమనుకుంటే ప్రత్యేకమైన సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులనూ పరిశీలిస్తాం’ అని దొరైస్వామి తెలిపారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఈ వారం రెండు ఐపీవోలు
న్యూఢిల్లీ: వచ్చే వారం ప్రైమరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్, హెక్సగాన్ న్యూట్రిషన్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. తద్వారా సంయుక్తంగా రూ. 770 కోట్లవరకూ సమీకరించనున్నాయి. రెండు కంపెనీలు పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఇష్యూ చేపట్టనున్నాయి. నాన్ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ కంపెనీ సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ జూన్ 3–5 మధ్య పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 182–192కాగా.. తద్వారా రూ. 631 కోట్లు సమీకరించనుంది. జూన్ 5–9 మధ్య హెక్సగాన్.. జూన్ 5–9 మధ్య మైక్రో న్యూట్రియంట్ ఫార్ములేషన్ల కంపెనీ హెక్సగాన్ న్యూట్రిషన్ ఐపీవోకు వస్తోంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 42–45కాగా.. తద్వారా రూ. 139 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్ల షేర్లు ఆఫర్ చేయనున్నారు. 1993లో ఏర్పాటైన ఈ కంపెనీ బ్రాండెడ్ న్యూట్రిషన్ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది. -
IIT ఫెయిల్.. సొంతంగా AI నేర్చుకుని
ఐఐటీ ప్రవేశ పరీక్షలో విఫలం కావడం అంటే.. చాలామంది విద్యార్థుల జీవితాల్లో పెద్ద నిరాశగా భావించాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఫెయిల్యూర్ ఒక ముగింపు కాదు, కొంతమందికి కొత్త ప్రారంభానికి మార్గం అవుతుంది. అలాంటి ఒక ప్రేరణాత్మక కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు ప్రకారం.. ఒక యూజర్ తన జీవిత ప్రయాణాన్ని పంచుకుంటూ, తాను రెండు సార్లు ఐఐటీ ఎంట్రన్స్ పరీక్షలో విఫలమైనట్లు చెప్పుకున్నారు. చిన్న పట్టణం నుంచి వచ్చినందుకు.. చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడం, ప్రెజర్స్ అన్నీ చాలా కష్టంగా అనిపించాయని అతను చెప్పుకోచ్చారు. ఒకానొక దశలో జీవితం ముగిసిపోయినట్టే అనిపించిందని కూడా పేర్కొన్నారు.ఫెయిల్యూర్ తర్వాత తన ఊరిని వదిలి, వేరే నగరంలోని ప్రభుత్వ కాలేజీలో చేరాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉండేవి. తల్లిదండ్రులు ఎక్కువగా సహాయం చేయలేని పరిస్థితి కావడంతో, చదువు కోసం లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే చిన్న పిల్లలకు మ్యాథ్స్ ట్యూషన్ చెప్పి కొంత ఆదాయం సంపాదించాడు. కొన్ని సార్లు రెండు సమోసాలతో రోజంతా గడపాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. అయినప్పటికీ అతను వెనక్కి తగ్గలేదని వివరించారు.ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని.. కాలేజీ పూర్తి చేసిన తర్వాత, అతనికి నెలకు రూ.20,000 జీతంతో ఒక ఐటీ సపోర్ట్ జాబ్ వచ్చింది. అది పెద్ద జీతం కాకపోయినా.. అతని కెరీర్కు ఒక ప్రారంభం అయింది. కానీ అతను అక్కడే ఆగిపోలేదు. తన కుటుంబ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతో, ఉద్యోగం తర్వాత ఖాళీ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మిషిన్ లెర్నింగ్ (ML) నేర్చుకోవడం ప్రారంభించాడు.I failed IIT. Twice.At one point, it genuinely felt like life was over. In small towns, failure doesn’t stay private. The comparisons, the silent judgment, the feeling that everyone suddenly sees you differently ,I experienced all of it. It hurt more than I ever admitted.So,…— AJ (@JainJec2013) May 29, 2026ఎలాంటి కోచింగ్ లేకుండా, ఎలాంటి మెంటార్ లేకుండా, కేవలం ఇంటర్నెట్ సాయంతో అతను స్వయంగా ఈ టెక్నాలజీలను నేర్చుకున్నాడు. ఈ ప్రయత్నం అతని కెరీర్లో పెద్ద మలుపు తీసుకువచ్చింది. తర్వాత అతనికి ఏఐ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి అతను ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బిజినెస్ లీడర్షిప్ రోల్స్లోకి ఎదిగాడు.కొన్నేళ్ల తర్వాత.. ఐఐటీలో సీటు పొందిన తన స్నేహితులతో సమాన స్థాయిలో సంపాదిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను దుబాయ్లో ఉన్నట్లు తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒకప్పుడు పాలు కొనడానికి కూడా ఇబ్బంది పడిన కుటుంబం నుంచి, ఇప్పుడు రెండవ ఆలోచన లేకుండా కావలసినవి కొనగలిగే స్థాయికి ఎదిగానని పేర్కొన్నాడు.జీవితంలో ఎదగాలంటే.. పర్ఫెక్ట్ స్టార్ట్ అవసరం లేదు, మీకు దృఢ సంకల్పం కావాలి అని వెల్లడించాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ అతని పట్టుదలను, కష్టపడి ఎదిగిన తీరును ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు! -
రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!
ఒకప్పుడు ఐటీలో కొలువంటే చాలామంది ఎగిరి గంతేసేవారు. కానీ.. ఇప్పుడు రోజులు మారాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక కొంతమంది బిక్కుబిక్కుమనే రోజుల్లో టెకీలు బతికేస్తున్నారు. ఏ ఉదయం ఏ మెయిల్ వస్తుందో తెలియదు. ఏ కారణం చేత జాబ్ పోతుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఓ కంపెనీ చెప్పాపెట్టకుండా క్లోజ్ అయింది. దీంతో 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.పుణెలోని హింజవాడి ఫేజ్-2లో ఉన్న థింక్ టెక్నాలజీ ఇండియా అనే ఐటీ సంస్థ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. రాత్రికి రాత్రే కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ ఘటనతో 700 మందికి పైగా ఉద్యోగులు, ఇంటర్న్స్, ఫ్రెషర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపెనీ వారికి నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం, చెక్కులు బౌన్స్ కావడం, ఉద్యోగుల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటివి కూడా జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.ప్రారంభంలో భారీ నియామకాలుథింక్ టెక్నాలజీ ఇండియా 2025లో పెద్ద మొత్తంలో నియామకాలను చేపట్టింది. ఇందులో ఫ్రెషర్స్, ఇంటర్న్స్, ఎక్స్పీరియన్స్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మొదట్లో సంస్థ అందరికీ జీతాలు, స్టైఫండ్స్ క్రమంగా చెల్లించింది. దీంతో ఉద్యోగుల్లో సంస్థపై నమ్మకం పెరిగింది.అయితే.. 2026 ప్రారంభం నుంచి పరిస్థితులు మారాయి. ఫిబ్రవరి నుంచి జీతాల చెల్లింపుల విషయంలో ఆలస్యం జరిగిందని ఉద్యోగులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి నెల 7 లేదా 8వ తేదీకి జమయ్యే జీతాలు ఆగిపోవడంతో ఉద్యోగులు యాజమాన్యాన్ని సంప్రదించారు. ఈ సమయంలో సంస్థ సీఈఓ హర్షల్ భానుదాస్ ఠాక్రే ఆడిట్ జరుగుతోందని, ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య పెండింగ్ జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులుసీఈఓ ఇచ్చిన హామీ ప్రకారం.. జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరిగింది. అయితే కొన్ని రోజులకు సంస్థ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు గుర్తించారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా.. సంస్థ మూతపడటంతో ఉద్యోగులు షాక్కు గురయ్యారు. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన కొన్ని జీతాల చెక్కులు బ్యాంకుల్లో బౌన్స్ అయినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇంటి అద్దెలు, కుటుంబ ఖర్చులు, లోన్స్ చెల్లింపులు చేయలేక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఈ వ్యవహారంలో ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) జోక్యం చేసుకుంది. బాధిత ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఫైట్ అధ్యక్షుడు పవంజీత్ మానే తెలిపారు. పోలీసులకు కూడా ఫిర్యాదులు అందజేసినట్లు వెల్లడించారు.మరో ముఖ్యమైన ఆరోపణ ఏమిటంటే.. ఉద్యోగులకు ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.15,000 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమని తేలితే సంస్థ ఉద్యోగులతో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు జరిపినట్లు స్పష్టమవుతుంది.భద్రతపై చర్చఈ ఘటన మరోసారి భారత ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై చర్చకు తెరలేపింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా ఐటీ సంస్థలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యోగి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. జీతాల చెల్లింపులు, ఆర్థిక పారదర్శకత, ఉద్యోగుల రక్షణ కోసం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు విచారణ కొనసాగుతోంది. జీతాల బకాయిలు, బౌన్స్ అయిన చెక్కులు, ఉద్యోగుల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయ్యాకే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: గూగుల్కు రూ.30 లక్షల జరిమానా! -
గూగుల్కు రూ.30 లక్షల జరిమానా!
డిజిటల్ ప్రకటనల రంగంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఒక కేసులో ఢిల్లీ హైకోర్టు, గూగుల్పై కీలకమైన తీర్పును వెల్లడించింది. ప్రముఖ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అండ్ శానిటరీ వేర్ తయారీ సంస్థ 'హింద్వేర్' ట్రేడ్మార్క్ హక్కులను ఉల్లంఘించిందని గుర్తించిన కోర్టు, గూగుల్కు రూ.30 లక్షల జరిమానా విధించింది.హింద్వేర్ అనేది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శానిటరీ వేర్ బ్రాండ్. వినియోగదారులు గూగుల్లో Hindware అని వెతికినప్పుడు, హింద్వేర్ వెబ్సైట్కు బదులుగా ప్రత్యర్థి కంపెనీల ప్రకటనలు ముందుగా కనిపిస్తున్నాయని సంస్థ గుర్తించింది. దీనికి కారణం.. ఆ కంపెనీలు హింద్వేర్ అనే పదాన్ని తమ ప్రకటనల కోసం కీవర్డ్గా కొనుగోలు చేయడమే.గూగుల్ యొక్క AdWords (ప్రస్తుతం గూగుల్ యాడ్స్) వ్యవస్థలో కంపెనీలు తమకు కావలసిన కీవర్డ్లపై బిడ్ వేస్తాయి. వినియోగదారులు ఆ పదాలను సెర్చ్ చేసినప్పుడు, ఎక్కువ బిడ్ వేసిన కంపెనీల ప్రకటనలు పైభాగంలో కనిపిస్తాయి. ఈ విధంగా హింద్వేర్ పేరును ప్రత్యర్థులు ఉపయోగించుకోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని కంపెనీ వాదించింది.163 పేజీల తీర్పుఈ కేసును విచారించిన న్యాయమూర్తి.. గూగుల్ కేవలం ఒక మధ్యవర్తి కాదని స్పష్టం చేశారు. గూగుల్ స్వయంగా కీవర్డ్లను సూచించడం, వాటి వేలాన్ని నిర్వహించడం, ప్రకటనల ప్రదర్శనను తన అల్గోరిథమ్ల ద్వారా నియంత్రించడం వంటి చర్యలు చేపడుతోంది. కాబట్టి ట్రేడ్మార్క్ను వ్యాపార ప్రయోజనాల కోసం ప్రదర్శించాల్సిన బాధ్యత గూగుల్పైనా ఉంటుందని కోర్టు తన 163 పేజీల తీర్పులో పేర్కొంది.కోర్టు అభిప్రాయం ప్రకారం.. హింద్వేర్ అనే ట్రేడ్మార్క్పై గూగుల్కు ఎటువంటి యాజమాన్య హక్కు లేదు. అయినప్పటికీ.. ఆ పేరును ప్రత్యర్థి సంస్థలకు అమ్మి లాభం పొందడం ద్వారా గూగుల్ ఆ కంపెనీ ప్రతిష్ఠను వాణిజ్యపరంగా వినియోగించుకుంది. దీనిని కోర్టు ఫ్రీ రైడింగ్ (ఇతరుల కృషి వల్ల ఏర్పడిన పేరును ఉపయోగించి లాభపడటం) అని వెల్లడించింది.గూగుల్ వాదనగూగుల్ తనను తాను కేవలం ప్రకటనల వేదికగా మాత్రమే పేర్కొంటూ.. హింద్వేర్ సమస్యకు తాము బాధ్యులు కాదని వాదించింది. కీవర్డ్స్ అనేవి వినియోగదారుడు సెర్చ్ చేసినప్పుడు.. ప్రకటనలు చూపించడానికి బ్యాక్ ఎండ్లో పనిచేసే కొన్ని సాధనాలు మాత్రమే అని వెల్లడించింది. అంతేకాకుండా.. సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్ 79 ప్రకారం తమకు సేఫ్ హార్బర్ రక్షణ వర్తిస్తుందని తెలిపింది. అయితే కోర్టు ఈ వాదనను తిరస్కరించింది.ఎందుకంటే.. గూగుల్ కేవలం ప్రకటనలను ప్రదర్శించడం మాత్రమే కాకుండా, ట్రేడ్మార్క్లను కీవర్డ్లుగా అమ్మి ఆదాయం పొందుతోందని గుర్తించింది. అందువల్ల గూగుల్ ఒక క్రియాశీల పాత్ర పోషిస్తోందని, సేఫ్ హార్బర్ రక్షణకు అర్హత లేదని తీర్పు చెప్పింది.ప్రత్యర్థి సంస్థలుఈ కేసులో ప్రత్యర్థి సంస్థలుగా గ్రోహే ఇండియా, ఓంకార ఇన్ఫోవెబ్, సెరా శానిటరీవేర్ కూడా ఉన్నారు. వీరు హింద్వేర్ పేరును లేదా హింద్వేర్ శానిటరీవేర్ వంటి పదాలను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ ప్రకటనలను ప్రదర్శించారు. అయితే విచారణ సమయంలో ఈ సంస్థలు హింద్వేర్తో రాజీ చేసుకోవడంతో, చివరకు గూగుల్ మాత్రమే ఈ కేసులో మిగిలింది.ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు భారతదేశంలోని డిజిటల్ మార్కెటింగ్ రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటి వరకు అనేక కంపెనీలు ప్రత్యర్థి బ్రాండ్ల పేర్లను కీవర్డ్లుగా కొనుగోలు చేసి తమ వ్యాపారాలను ప్రోత్సహించేవి. ఇకపై అలాంటి చర్యలు ట్రేడ్మార్క్ ఉల్లంఘనగా పరిగణించబడే అవకాశం ఉంది. నితిన్ కామత్ కూడా ఈ తీర్పును స్వాగతిస్తూ, తమ సంస్థకు ఇలాంటి సమస్యలు సంవత్సరాలుగా ఎదురవుతున్నాయని, ఇప్పుడు చట్టపరమైన పరిష్కారం పొందేందుకు మార్గం ఏర్పడిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం! -
ఆప్టిమిస్ట్ నుంచి స్మార్ట్ ఏసీ
హైదరాబాద్: దేశీ క్లైమేట్–టెక్ బ్రాండ్ ఆప్టిమిస్ట్ ఎయిర్ కండీషనింగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ సమర్ధవంతంగా పని చేసే స్మార్ట్ ఏసీలను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద 1.4 టన్నుల 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీలపై ఎంఆర్పీ మీద 38 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు, రూ. 39,990కే అందిస్తున్నట్లు సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈవో ఆశీష్ గోయల్ తెలిపారు. రాబోయే రోజుల్లో 1 టన్, 2 టన్ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. తమ ఆఫ్లైన్ స్టోర్స్తో పాటు ఆన్లైన్లో అమెజాన్, ఆప్టిమిస్ట్ పోర్టల్స్లో కూడా ఇవి లభిస్తాయని పేర్కొన్నారు.ఆప్టిమిస్ట్ సంస్థను అర్బన్ ల్యాడర్ మాజీ సహ వ్యవస్థాపకుడు ఆశీష్ గోయల్, ప్రణవ్ చోప్రా కలిసి 2024లో స్థాపించారు. భారత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఏసీలను అభివృద్ధి చేస్తున్న ఈ స్టార్టప్ ఇటీవలే యాక్సెల్, అర్కామ్ వెంచర్స్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 12 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఐఐటీ ఢిల్లీతో కలిసి థర్మల్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ వాలిడేషన్పై పనిచేసిన సంస్థ, విద్యుత్ వినియోగాన్ని తగ్గించే అధిక సామర్థ్య సాంకేతికతతో పాటు స్మార్ట్ యాప్ ఆధారిత మానిటరింగ్, గ్యాస్ లెవల్ ఇండికేటర్ వంటి ఫీచర్లను కూడా అందిస్తున్నట్లు తెలిపింది. -
హైదరాబాద్లో డిజిలాజిక్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెస్టింగ్, సిమ్యులేషన్స్ సేవలందించే హైదరాబాద్ సంస్థ డిజిలాజిక్ సిస్టమ్స్ గత ఆర్థిక సంవత్సరంలో (2025–26)లో రూ. 78.27 కోట్ల ఆదాయం ఆర్జించింది. రూ. 10.43 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 72.19 కోట్లు కాగా, లాభం సుమారు 7.79 కోట్లుగా నమోదైంది.జనవరిలో బీఎస్ఈ ఎస్ఎంఈలో లిస్టయిన డిజిలాజిక్.. సుమారు రూ. 70 కోట్లు సమీకరించింది. హైదరాబాద్లోని టీజీఐఐసీ హార్డ్వేర్ పార్క్ ఫేజ్ 2లో ఈఎంఎస్ తయారీ, ఈఎస్ఎస్ స్క్రీనింగ్ మొదలైన వాటికి సంబంధించి రూ. 52 కోట్లతో ప్రాజెక్ట్ ఉడాన్ పేరిట ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. ఇది 2027 మే నాటికి అందుబాటులోకి రానుంది.అలాగే, డిఫెన్స్, ఏరోస్పేస్ సంబంధ కార్యకలాపాల విస్తరణ కోసం అభేద్య సిస్టమ్స్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ. 31 కోట్ల విలువ చేసే ఆర్డర్లు ఉండగా, రూ. 110 కోట్ల టెండర్లకు కోట్ చేసినట్లు కంపెనీ సీఈవో శశాంక్ వర్మ జెట్టి తెలిపారు. -
కస్టమర్లకు దూరంగా బీమా కంపెనీలు
దేశీయంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు, కస్టమర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండటం లేదని కన్సల్టింగ్ సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 80 శాతం పాలసీల కొనుగోళ్లు బీమా కంపెనీల వెబ్సైట్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఫలితంగా కస్టమర్లను సమకూర్చుకోవడం కంటే ఏజెంట్లను అందిపుచ్చుకునేందుకే కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించింది. అన్ని లావాదేవీలు మధ్యవర్తులద్వారానే జరుగుతుండటం వల్ల కస్టమర్లు కూడా వారికే ఎక్కువగా విశ్వసనీయంగా ఉంటున్నారని పేర్కొంది. ఫలితంగా కంపెనీలకి కస్టమర్లకు మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు ఉండటం లేదని రిపోర్టు తెలిపింది. సాధారణంగా బీమా కంపెనీలకు పాలసీల విక్రయాలపై నష్టాలే తప్ప లాభం ఉండటం లేదని వివరించింది. అండర్రైటింగ్ రూపంలో వచ్చే నిధుల కంటే షేర్ మార్కెట్లలోనో, ప్రభుత్వ బాండ్లలోనో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాలతోనే కంపెనీలు మనుగడ సాగిస్తున్నట్లు ప్రాక్సిస్ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే బీమా కంపెనీలు ఏజెంట్లపై ఆధారపడటం తగ్గించి, నేరుగా కస్టమర్లకే పాలసీలను విక్రయించే పద్ధతిని పెంచుకోవాలని సూచించింది. కంపెనీల నుంచే నేరుగా పాలసీలను కొనే కస్టమర్లకు తక్కువ ధరకు, సరళతరమైన పాలసీలను అందించాల్సి ఉంటుందని ప్రాక్సిస్ తెలిపింది. అలాగే క్లెయిమ్స్ను సత్వరం సెటిల్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కొత్త నిబంధనలు, బీమా సుగమ్లాంటి ప్లాట్ఫామ్ల వల్ల కస్టమర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు పెరుగుతాయని తెలిపింది. -
సెమీకండక్టర్ దిగ్గజంగా భారత్!
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ రంగంలో భారత్ కేవలం భాగస్వామ్యానికే పరిమితం కాకుండా దిగ్గజంగా ఎదగాలని, 2035 నాటికి 120–150 బిలియన్ డాలర్ల (రూ.14.25 లక్షల కోట్లు సుమారు) విలువైన సెమీకండక్టర్ వ్యాల్యూచైన్ నిర్మించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు అవసరమైన పెట్టుబడుల్లో మూడింట ఒక వంతును ప్రభుత్వమే సమకూర్చడం ద్వారా యాంకర్ పాత్రను పోషించాలంటూ, తద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కల్పించొచ్చని పేర్కొంది. ‘భారత్ దేశ సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్’ పేరుతో ఒక నివేదికను నీతి ఆయోగ్ రూపొందించింది. అంతర్జాతీయంగా పోటీనివ్వగలిగిన సెమీకండక్టర్ వ్యవస్థను దేశీయంగా నిర్మించుకునేందుకు 135–180 బిలియన్ డాలర్ల (రూ.17.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చే దశాబ్ద కాలంలో అవసరమవుతాయని తెలిపింది. ముఖ్యంగా డిజైన్, ఫ్యాబ్రికేషన్, అత్యాధునిక ప్యాకేజింగ్, మేటీరియల్స్, అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఈ మేరకు పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. దిగుమతులను తగ్గించుకోవాలి.. ప్రస్తుతం భారత్లో సెమీకండక్టర్ల డిమాండ్ వేగంగా పెరుగుతుండగా, ఇందులో 90 నుంచి 95 శాతం వరకు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దీనివల్ల భారీగా విదేశీ మారకద్రవ్యం తరలిపోవడమే కాకుండా, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో అడ్డంకులు ఏర్పడినప్పుడు దేశ రక్షణ, డిజిటల్ రంగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. 2035 నాటికి దేశీయ సెమీకండక్టర్ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్న అంచనా వ్యక్తం చేస్తూ.. ఈ డిమాండ్ను దేశీయంగానే తీర్చుకునే విధంగా పరిశ్రమను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. దేశీయంగా డిమాండ్ స్థాయిలో ఉత్పాదకత లేకపోవడాన్ని గొప్ప అవకాశంగా మలుచుకోవాలని సూచించింది. టెక్నాలజీలో స్వావలంబనతోనే వికసిత్ భారత్ బ్లాక్బాక్స్ సాంకేతికతల దిగుమతులపై ఆధారపడడం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పెద్ద అవరోధమని నీతి ఆయోగ్ వైస్చ ఐర్మన్ అశోక లాహిరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సాంకేతిక సౌర్వబౌమత్వం పునాది కావాలన్నారు. అది మౌలిక వసతుల నుంచే ఆరంభం కావాలన్నారు. సరికొత్త పరిశోధనలు, సొంత డిజైన్ల సృష్టి, దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే స్థిరమైన విధానాలు, అధునాతన ప్యాకేజింగ్ మరియు కాంపౌండ్ సెమీకండక్టర్ల ఉత్పత్తి, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి అవసరమని ఈ నివేదిక సూచించింది. భారతదేశం కేవలం చిప్స్ వినియోగించే దేశంగా కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో ఒక తప్పనిసరి భాగస్వామిగా మారాలనే తమ సంకల్పాన్ని ఈ నివేదిక చాటిచెబుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నివేదిక విడుదల సందర్భంగా పేర్కొన్నారు. సెమీ కండక్టర్లకు సంబంధించి పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను (డిజైన్, నైపుణ్య వనరులు, మెటీరియల్స్, ఎక్విప్మెంట్, ఫ్యాబ్, ప్యాకేజింగ్) నిర్మించడంపై తాము దృష్టి పెట్టినట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. -
ఒలెక్ట్రా గ్రీన్టెక్ లాభం రెట్టింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్టెక్ రూ. 51 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 24 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ఇక ఆదాయం 45 శాతం వృద్ధితో రూ. 438 కోట్ల నుంచి రూ. 635 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 29 శాతం పెరిగి రూ. 139 కోట్ల నుంచి రూ. 180 కోట్లకు చేరగా, ఆదాయం రూ. 1,802 కోట్ల నుంచి రూ. 2,312 కోట్లకు ఎగిసింది.ఒక్కో షేరుపై కంపెనీ 15 శాతం (రూ. 0.60) మేర తుది డివిడెండు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 32 శాతం అధికంగా 1,280 ఈవీలను డెలివర్ చేసింది. 10,161 ఎలక్ట్రిక్ వాహనాలకు ఆర్డర్లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఆదాయాలు, లాభదాయకత, పటిష్టమైన ఫండమెంటల్స్ తదుపరి దశ వృద్ధికి పటిష్టమైన పునాదులుగా నిలుస్తాయని ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీ మహేష్ బాబు చెప్పారు. చదవండి: టెస్లా నుంచి మరో కొత్త కారు.. ఇదే అత్యంత చౌక -
అధిక వృద్ధి బాటలో రిలయన్స్ కన్జూమర్
న్యూఢిల్లీ: సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితుల దన్నుతో 2030 నాటికి ఎఫ్ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (ఆర్సీపీఎల్) ఆదాయం అనేక రెట్లు పెరగనున్నట్లు మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ వార్షిక నివేదికలో తెలిపింది. 2025–26లో కంపెనీ ఆదాయం రెండు రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లు దాటినట్లు వివరించింది. నిత్యావసరాలు, పానీయాల విక్రయాలు ఇందుకు దోహదపడినట్లు పేర్కొంది.అంతర్జాతీయంగా అగ్రగామి బ్రాండెడ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలన్న లక్ష్య సాకారం దిశగా ఆర్సీపీఎల్ ఇకపైనా ఇతర సంస్థలు, బ్రాండ్స్ కొనుగోళ్లను కొనసాగిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వివరించింది. 2025 డిసెంబర్ 1న రిలయన్స్ రిటైల్ నుంచి విడగొట్టిన ఆర్సీపీఎల్ ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో ఒకటిగా ఉంది. -
ఫ్రిజ్ వాడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే కరెంటు బిల్లు భారీగా ఆదా..
భానుడి భగభగలతో మే నెల వచ్చేసరికి ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ వేసవి కాలంలో దాహం తీర్చుకోవడానికి చల్లటి నీరు, అలాగే పండ్లు, కూరగాయలు, వండిన ఆహార పదార్థాలు పాడవకుండా ఉండటానికి ప్రతి ఇంట్లోనూ రిఫ్రిజిరేటర్లు రోజుకు 24 గంటల పాటు నిరంత రాయంగా పనిచేస్తుంటాయి. అయితే, చాలా ఇళ్లలో ఫ్రిజ్ సరిగ్గా పనిచేస్తున్నప్పటికీ.. ఈ మధ్యకాలంలో కూలింగ్ తగ్గడం, అదే సమయంలో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరగడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఫ్రిజ్ లోపల కంప్రెసర్పై అదనపు భారం పడి, విద్యుత్ వినియోగం పెరుగుతుందని ఇంధన సామర్థ్య బ్యూరో నిపుణులు చెబుతున్నారు. రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్రిజ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. కరెంట్ బిల్లును 25 శాతం వరకు ఎలా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..చేయకూడని పొరపాట్లు ఇవే..వేసవిలో చల్లటి నీటి కోసం ఇంట్లో పిల్లలు, పెద్దలు తరచూ ఫ్రిజ్ డోర్ తెరుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లోపలి చల్లటి గాలి బయటకు పోయి, గదిలోని వేడి గాలి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఫ్రిజ్ మళ్లీ చల్లబడటానికి కంప్రెసర్ ఎక్కువ సమయం శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి అవసరమైన వస్తువులను ఒకేసారి బయటకు తీయడం అలవాటు చేసుకోవాలి. వండిన అన్నం, కూరలు లేదా పాలు పూర్తిగా చల్లారక ముందే నేరుగా ఫ్రిజ్లో పెట్టడం చాలా మందికి అలవాటు. దీనివల్ల లోపలి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరుగుతుంది. దాన్ని సమం చేయడానికి యంత్రంపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అందుకే ఏ పదార్థమైనా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాతే లోపల ఉంచాలి. ఫ్రిజ్ వెనుక భాగం నుంచి వెలువడే వేడి గాలి బయటకు పోవడానికి తగినంత స్థలం ఉండాలి. వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కంప్రెసర్ త్వరగా వేడెక్కి కూలింగ్ తగ్గిపోతుంది. అందుకే ఫ్రిజ్ను గోడకు కనీసం 4 నుండి 6 అంగుళాల దూరంలో ఉంచాలి. ఫ్రిజ్ నిండా వస్తువులను ఇరుకైన పద్ధతిలో సర్దితే లోపల చల్లటి గాలి ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. దీనివల్ల అన్ని అరలకు సమానంగా కూలింగ్ అందదు.ఫ్రిజ్ లోపలి భాగంతో పాటు వెనుక వైపు ఉండే కాయిల్స్, వెంట్లను కూడా శుభ్రం చేయాలి. అక్కడ దుమ్ము పేరుకుపోతే హీట్ ఎక్స్ఛేంజ్ సామర్థ్యం తగ్గి, కరెంట్ ఎక్కువగా కాలుతుంది. నెలకు ఒకసారైనా వెనుక భాగాన్ని శుభ్రం చేయడం మేలు. ఫ్రిజ్ తలుపునకు ఉండే రబ్బరు పట్టీ అంటే గాస్కెట్ వదులైనా లేదా దెబ్బతిన్నా లోపలి చల్లదనం నిరంతరం బయటకు లీక్ అవుతుంది. డోర్ సరిగ్గా లాక్ అవ్వడం లేదని గమనిస్తే వెంటనే గాస్కెట్ను మార్చడం ఉత్తమం. ఫ్రిజ్ను ఎప్పుడూ నేరుగా ఎండ తగిలే చోట లేదా గ్యాస్ స్టవ్ వంటి వేడి వస్తువుల పక్కన పెట్టకూడదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు ఫ్రిజ్ డోర్ను అస్సలు తెరవద్దు. దీనివల్ల లోపల దాదాపు గంటల తరబడి చల్లదనం అలాగే ఉంటుంది. ఫ్రిజ్లో ఐస్ పేరుకుపోకుండా చూసుకోవడానికి 'ఆటో డీఫ్రాస్ట్' ఫీచర్ను ఉపయోగించాలి. కొత్తగా కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ మోడల్ రిఫ్రిజిరేటర్లను ఎంచుకుంటే దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లును మరింతగా తగ్గించుకోవచ్చు. -
నేరుగా ఆర్థిక శాఖ బృందాలే వచ్చేస్తున్నాయ్..
న్యూఢిల్లీ: ఆర్థిక విధానాలు .. బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనకు, పశ్చిమాసియా సంక్షోభంపరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోతగిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు, పరిశ్రమ క్లస్టర్లను సందర్శించడంపై కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక వ్యవహారాల విభాగం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.దీని ప్రకారం ఆర్థిక శాఖలోని అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి లేదా డైరెక్టర్ సారథ్యంలో అయిదుగురు వరకు సభ్యులతో బృందాలను ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు భారీ, మధ్య, చిన్న తరహా తయారీ యూనిట్లను సందర్శిస్తాయి. వివిధ రంగాలవ్యాప్తంగా విధానాలు, నిర్వహణపరమైన సవాళ్లను పరిశీలిస్తాయి. మౌలిక సదుపాయాలు, రెగ్యులేటరీ అవరోధాలు, సరఫరా వ్యవస్థలో అవాంతరాలు, నిధుల లభ్యతపరమైన సవాళ్లు, నైపుణ్యాల్లో కొరత, సాంకేతికత వినియోగం మొదలైన అంశాలు వ్యాపారాలపై చూపుతున్న ప్రభావాల గురించి నేరుగా తెలుసుకుంటాయి.ఒక్కో విడతలో కనీసం రెండు స్టార్టప్లతో పాటు తయారీ, ఇన్ఫ్రా, పరిశోధనలు తదితర రంగాల సంస్థలను సందర్శించి, పరిస్థితుల గురించి బృంద సభ్యులు తెలుసుకుంటారు. కొన్ని రంగాలపై ప్రభుత్వం గణనీయంగా వ్యయం చేస్తున్నప్పటికీ, వివిధ కారణాలరీత్యా ప్రైవేట్ పెట్టుబడులు ఇంకా పుంజుకోవడం లేదు. పశి్చమాసియా సంక్షోభం వల్ల రూపాయి బలహీనపడటం, క్రూడాయిల్ రేట్లు పెరగడం తదితర సవాళ్లు వీటికి తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది. -
వాహనదారులకు షాక్.. సీఎన్జీ ధరలు మళ్లీ పెంపు
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో వాహనదారులకు మరోసారి ఇంధన భారం పెరిగింది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) సీఎన్జీ ధరలను కిలోకు రూ.2 పెంచింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.84 నుంచి రూ.86కు చేరుకుంది. శనివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.పీఎన్జీ ధరలకూ పెరుగుదలసీఎన్జీతో పాటు గృహ వినియోగానికి ఉపయోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) ధరలను కూడా ఎంజీఎల్ పెంచింది. యూనిట్కు 50 పైసలు పెంచడంతో ప్రస్తుతం వినియోగదారులు యూనిట్కు రూ.52 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల 31 లక్షలకు పైగా కుటుంబాలపై ప్రభావం పడనుంది.పెరుగుతున్న గ్యాస్ సేకరణ ఖర్చులే కారణందేశీయ గ్యాస్ కేటాయింపులు తగ్గడం, అధిక ధరలతో గ్యాస్ను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో గ్యాస్ సేకరణ వ్యయం గణనీయంగా పెరిగిందని ఎంజీఎల్ వెల్లడించింది. అయినప్పటికీ ఖర్చులను తగ్గిస్తూ వినియోగదారులకు గరిష్ఠ ప్రయోజనాలు అందించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు సంస్థ తెలిపింది.ఇటీవలి కాలంలో సీఎన్జీ ధరలు పెరగడం ఇది రెండోసారి. గత మే 14న కూడా ఎంజీఎల్ కిలోకు రూ.2 చొప్పున ధరలను పెంచింది. తాజా పెంపుతో ఆటోరిక్షాలు, ట్యాక్సీలు, బస్సులు సహా సీఎన్జీ ఆధారిత రవాణా సేవల నిర్వహణ వ్యయాలు మరింత పెరగనున్నాయి.ముంబై, థానే, నవీ ముంబైతో పాటు ఎంఎంఆర్లోని ఇతర ప్రాంతాల్లో ఈ ధరల పెంపు అమలులోకి వచ్చింది. ఎంజీఎల్ గ్యాస్ సరఫరా నెట్వర్క్ కళ్యాణ్, రాయ్గఢ్, రత్నగిరి, లాతూర్, ఉస్మానాబాద్, చిత్రదుర్గ, దావణగెరె వంటి ప్రాంతాలకు కూడా విస్తరించి ఉంది.పెట్రోల్, డీజిల్తో పోలిస్తే ఇంకా చౌకేధరలు పెరిగినా కిలోమీటరుకు అయ్యే నిర్వహణ వ్యయ పరంగా సీఎన్జీ ఇప్పటికీ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే చౌకైన ప్రత్యామ్నాయంగానే కొనసాగుతోంది. ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21గా, డీజిల్ ధర రూ.97.83గా నమోదైంది. దీంతో రవాణా రంగంపై ఇంధన వ్యయాల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
టికెట్ కన్ఫర్మ్.. అయినా నిలబడే ప్రయాణం!
ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు ఇచ్చినా.. వారికి కేటాయించిన బెర్త్లు అందించకపోవడం, ఇండియన్ రైల్వే సేవల లోపమే అని వినియోగదారుల కోర్టు స్పష్టం చేసింది. భోజ్పూర్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రైల్వే శాఖపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఉత్తరప్రదేశ్లోని వింధ్యాచల్ నుంచి బీహార్లోని ఆరా వరకు వెళ్లాల్సిన నలుగురు ప్రయాణికులు.. ఎల్టీటీ పాట్నా ఎక్స్ప్రెస్లో కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే.. వీరు రైలెక్కిన తరువాత తమకు కేటాయించిన బెర్త్లపై రైల్వే సిబ్బంది ఉండటం గమనించారు. తమకు కేటాయించిన సీట్లను ఖాళీ చేయాలని కోరినా.. ఎవరూ స్పందించలేదు. దీంతో వారు తమ గమ్యస్థానం వచ్చేవరకు నిలబడే ఉండాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ..తాము సీట్లను రిజర్వ్ చేసుకున్నప్పటికీ.. నిలబడే ప్రయాణం చేయడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని పేర్కొన్నారు. వినియోగదారుల కోర్టును ఆశ్రయించడానికంటే ముందు.. రైల్వే హెల్ప్లైన్, రైల్వే సేవా, రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేశారు. తమకు ఎస్ఎమ్ఎస్ ద్వారా కంప్లైంట్ నంబర్ వచ్చినప్పటికీ, ప్రయాణ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.బక్సర్ స్టేషన్ వద్ద వచ్చిన టికెట్ ఎగ్జామినర్ (TTE) వద్ద కూడా సమస్యను వివరించారు. అయితే.. రైలులో భారీ రద్దీ ఉందని, ఎలాగోలా మేనేజ్ చేసుకోండని చెప్పినట్లు వారు ఆరోపించారు. ఈ వ్యవహారం రైల్వే ప్రయాణికుల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపించిందని కోర్టు అభిప్రాయపడింది.ఇక రైల్వే శాఖ మాత్రం.. ఈ వివాదం శాంతి భద్రతలకు సంబంధించినదని, ఇది ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) పరిధిలోకి వస్తుందని వాదించింది. తమవైపు నుంచి ఎలాంటి సేవల లోపం జరగలేదని, ఫిర్యాదుపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపింది. అయితే.. కోర్టు ప్రయాణికులు సమర్పించిన టికెట్లు, ఫిర్యాదు రికార్డులు, మెసేజ్లు, ఫోటోలను పరిశీలించిన తరువాత రైల్వే శాఖ సేవలలో స్పష్టమైన లోపం ఉందని తేల్చింది. ప్రయాణికులకు కన్ఫర్మ్ చేసిన బెర్త్లు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది.రూ.20,000 పరిహారందీంతో నార్త్ సెంట్రల్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కలిసి ప్రయాణికులకు టికెట్ మొత్తానికి (రూ.1,876.80) 8 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా రూ.20,000 పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈ మొత్తం 60 రోజుల్లో చెల్లించకపోతే, 10 శాతం వడ్డీతో చట్టపరమైన చర్యల ద్వారా వసూలు చేసుకునే హక్కు ప్రయాణికులకు ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.వినియోగదారుల కోర్టు ఇచ్చిన తీర్పును చాలామంది ప్రశంసించారు. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించడం రైల్వే శాఖ బాధ్యత అని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది. కాబట్టి ప్రయాణికులకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైతే.. సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి, పరిష్కారం పొందవచ్చు.ఇదీ చదవండి: ఢిల్లీ ఘటన: అందుకే ACలు పేలిపోతున్నాయ్! -
రిలయన్స్ ఫౌండేషన్ సేవ.. కోట్లాది జీవితాల్లో మార్పు!
నీతా అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ఖర్చులను గణనీయంగా పెంచింది. సామజిక కార్యక్రమాల కోసం ఏకంగా రూ.2248 కోట్లు ఖర్చు చేసింది. ఇది గత సంవత్సరం (రూ.2156 కోట్లు)తో పోలిస్తే సుమారు రూ.100 కోట్లు ఎక్కువ.కోవిడ్ తర్వాత కాలం నుంచి ఇప్పటివరకు రిలయన్స్ ఫౌండేషన్ మొత్తం సీఎస్ఆర్ ఖర్చు రూ.9,500 కోట్లు దాటింది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరింది.ఈ కార్యక్రమాల ద్వారా గ్రామీణ జీవనంలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. గ్రామీణ ప్రాంతాల్లోని ఒక డెయిరీ రైతు ఆదాయం గణనీయంగా పెరిగి రెండింతలయింది. అంతే కాకుండా.. విద్యార్థుల భవిష్యత్ కోసం స్కాలర్షిప్ సదుపాయాలను అందిస్తున్నారు.2020-21లో ప్రారంభమైన రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ కార్యక్రమం ప్రతి సంవత్సరం సుమారు 5,100 మంది విద్యార్థులకు ఉపయోగపడుతోంది. వీరిలో చాలామంది మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందారు. వారి కుటుంబాల ఆర్థిక స్థితిలో పురోగతికి సహాయపడుతున్నారు. ఇది సమాజంలో దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు.Reliance Foundation ka impact badhta ja raha hai! 💛 FY26 mein CSR spending Rs 2,248 crore tak pahunchi, aur education, healthcare, rural development aur sports projects ko support kiya. Ek strong aur healthy India ki taraf ek aur kadam.#RelianceFoundation pic.twitter.com/8s5lDMIOrg— Reliance Update (@RelianceUpdate_) May 29, 2026మహిళా సాధికారత విషయంలో కూడా స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. డిజిటల్ లిటరసీ, ఆర్థిక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళల్లో 75% మందికి ఆర్థిక నిర్ణయాలపై విశ్వాసం పెరిగింది. సగం మంది కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మరింతగా పాల్గొంటున్నారు.జంతు సంరక్షణ రంగంలో వంతారా ద్వారా ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జంతువులకు సంరక్షణ అందించారు. దీనికిగాను అనంత్ అంబానీకి 2025లో గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు లభించింది. నీతా అంబానీకి కూడా అంతర్జాతీయ స్థాయిలో హ్యూమానిటేరియన్ అవార్డులు వచ్చాయి.గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పాడి రైతుల రోజువారీ పాలు ఉత్పత్తి 6.14 లీటర్ల నుంచి 10.37 లీటర్లకు పెరిగింది. వారి వార్షిక ఆదాయం సుమారు 64.6% పెరిగింది. మొత్తం కుటుంబ ఆదాయం కూడా సుమారు 56% వరకు పెరిగింది. ప్రకృతి విపత్తుల సమయంలో కూడా ఫౌండేషన్ సేవలు అందించింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో వచ్చిన తుపాను హెచ్చరికల సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చి మత్స్యకారులు, రైతులను అప్రమత్తం చేసింది. ఈ సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా లభించింది. ఇలా రిలయన్స్ ఫౌండేషన్ సామజిక కార్యక్రమాల కోసం ప్రతి ఏటా భారీ మొత్తంలో ఖర్చు చేస్తోంది. -
రూ.1.4 కోట్ల బిల్లు కస్టమర్లకు వాపస్!
వ్యాపారంలో లాభాల కంటే వినియోగదారుల నమ్మకమే ముఖ్యమని బార్బెక్యూ రెస్టారెంట్ తెలిపింది. తాము అందించిన ఆహారం సొంత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గ్రహించిన సదరు యాజమాన్యం.. ఏకంగా కస్టమర్లకు సుమారు రూ.1.4 కోట్లు (1,62,000 అమెరికన్ డాలర్లు / 1.1 మిలియన్ యువాన్లు) తిరిగి చెల్లించింది. కస్టమర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినా సంస్థే స్వయంగా ముందడుగు వేసి ఈ నిర్ణయం తీసుకుంది. ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ నివేదిక ప్రకారం.. చైనావ్యాప్తంగా 142 అవుట్లెట్లతో విస్తరించిన ప్రసిద్ధ బ్రాండ్ ‘వెరీ లాంగ్ అగో లాంబ్ స్కేవర్స్’ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.అసలేం జరిగింది? గ్రిల్లింగ్లో లోపమే కారణమా?ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీకి చెందిన 24 అవుట్లెట్లలో దాదాపు 48,000 టేబుల్స్ వద్ద భోజనం చేసిన కస్టమర్లను రెస్టారెంట్ యాజమాన్యం ఈ నెల ప్రారంభంలో స్వయంగా సంప్రదించింది. అంతర్గత నాణ్యత సమీక్షలో ఒక షాకింగ్ నిజం బయటపడటమే దీనికి కారణం. ఆ సమయంలో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రిల్లింగ్ పరికరాల్లో ఉష్ణోగ్రత స్థిరంగా లేకపోవడం వల్ల, మటన్ కబాబ్లు ఆశించిన స్థాయిలో గ్రిల్ కాలేదని కంపెనీ గుర్తించింది. కస్టమర్ల నుంచి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు రానప్పటికీ తమ బ్రాండ్ విలువలకు కట్టుబడి సదరు మటన్ స్కేవర్ల ధరలో 50 శాతం మొత్తాన్ని ఖాతాదారులకు రీఫండ్ చేసింది.నిజాయితీయా? మార్కెటింగ్ జిమ్మిక్కా?ఈ భారీ వాపసు కార్యక్రమం నెట్టింట వైరల్గా మారడంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘లాభాల కంటే కస్టమర్ల సంతృప్తికే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించిన రెస్టారెంట్ నిజాయితీ అమోఘం’ అని మెజారిటీ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇది బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవడానికి, పబ్లిసిటీ కోసం ప్లాన్ చేసిన ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం కావచ్చునని సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
ఫ్లిప్కార్ట్లో ‘గరం గరం’ సేల్.. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
ఫ్లిప్కార్ట్ (Flipkart) తమ ఫ్యాషన్ విభాగంలో కొత్త తరహా షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ‘GRWM GRWM’ పేరుతో ప్రత్యేక ఫ్యాషన్ సేల్ను ప్రారంభించింది. మే 29 నుంచి జూన్ 7, 2026 వరకు జరిగే ఈ ఫ్యాషన్ కార్నివల్లో 10 లక్షలకుపైగా ట్రెండీ స్టైల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. “Get Ready With Me” అనే గ్లోబల్ జెన్జీ (GenZ) ట్రెండ్కు భారతీయ మసాలా జోడిస్తూ “గరం గరం” శైలిలో రూపొందించిన ఈ క్యాంపెయిన్ ద్వారా ఫ్యాషన్ షాపింగ్ను ఒక కల్చరల్ ఎక్స్పీరియన్స్గా మార్చాలని ఫ్లిప్కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రారంభ అంచనాల ప్రకారం ఈ సేల్కు 55 కోట్లకుపైగా సందర్శనలు నమోదయ్యే అవకాశం ఉండగా, అందులో సగానికి పైగా జెన్జీ వినియోగదారులే ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సేల్లో ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లతో పాటు డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్లు, మార్కెట్ప్లేస్ విక్రేతలు పాల్గొంటున్నారు. బాగీ జీన్స్, కొరియన్ ట్రౌజర్స్, ఫ్లోరల్ డ్రెస్సులు, పలాజో సెట్లు వంటి తాజా ఫ్యాషన్ ట్రెండ్స్ను వినియోగదారులకు అందించనున్నారు.లీవైస్, టైటన్, రెడ్ టేప్, నైక్, ప్యూమా, ఆసిక్స్, సఫారీ, రేర్ రాబిట్, ది బేర్ హౌస్ వంటి ప్రముఖ బ్రాండ్లపై 90 శాతం వరకు తగ్గింపులు, సూపర్కాయిన్స్ ఆఫర్లు, స్క్రాచ్ కార్డులు, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ బడ్జెట్ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లు రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. -
చిన్న సంస్థల్లో ‘పశ్చిమాసియా’ సంక్షోభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశీయంగా దాదాపు 61 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్ సౌరభ్ సన్యాల్ తెలిపారు. సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, వ్యాపారాలు మందగించడంతో పలు సంస్థలు తీసుకున్న రుణాలు ఎన్పీఏలుగా మారే ముప్పు నెలకొందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.55 లక్షల కోట్లతో ఈసీఎల్జీఎస్ (ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీమ్) తరహాలో రాష్ట్రాలు ప్రత్యేక స్కీమ్లాంటిదేదైనా ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నారు. అలాగే సంక్లిష్టమైన నిబంధనల అమలుకు సంబంధించి కొంత వెసులుబాట్లు కల్పించాలని గురువారమిక్కడ డేటా సెంటర్స్, ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. చిన్న సంస్థలకు ఉపశమనం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్కి కూడా అసోచాం పలు ప్రతిపాదనలు చేసినట్లు సన్యాల్ చెప్పారు. ఆరు నెలల పాటు రుణాలపై మారటోరియం విధించడం, గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో విదేశీ మారకంలో ప్రీ–షిప్మెంట్ రుణాలు కల్పించడం, వాటి కాల వ్యవధిని 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచడంలాంటి చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. అలాగే తదుపరి రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకులు అవసరమైనప్పుడు తీసుకునేలా రెపో రేటుకే రూ. 1 లక్ష కోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సన్యాల్ తెలిపారు. మరో మూడు నుంచి ఆరు నెలల వరకు ఎకానమీ సాధారణంగానే ఉన్నా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆ తర్వాత సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉన్నా, వృద్ధి రేటు 7 శాతం లోపునకు తగ్గకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు సన్యాల్ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తకపోయి ఉంటే ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీ సంస్థలకు గణనీయంగా ప్రయోజనాలు లభించేవని చెప్పారు. -
జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లాభం రూ. 400 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఏఎల్) రూ.400 కోట్ల లాభం ప్రకటించింది. గత క్యూ4లో కంపెనీ రూ.253 కోట్ల నష్టం నమోదు చేసింది. తాజా క్యూ4లో ఆదాయం రూ. 2,977 కోట్ల నుంచి రూ.4043 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాదికి గాను దశాబ్దకాలంలో తొలిసారి లాభాలు నమోదు చేసింది. రూ. 472 కోట్ల లాభం ప్రకటించింది. ఆదాయం రూ. 10,836 కోట్ల నుంచి రూ. 15,201 కోట్లకు ఎగిసింది. జీఏఎల్ హైదరాబాద్, ఢిల్లీ, గోవాలో విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. సవాళ్లు నెలకొన్నప్పటికీ తమ నిర్వహణలోని విమానాశ్రయాల్లో పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ, నాలుగో త్రైమాసికంలోనూ ప్యాసింజర్ల రద్దీ వరుసగా 12.16 కోట్లు, 3.17 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. -
ఆరో ఏడాదీ అంబానీ వేతనం జీరో..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (69) వరుసగా ఆరో ఏడాదీ సున్నా వేతనంతోనే సరిపెట్టుకున్నారు. కంపెనీ వార్షిక నివేదిక లో ఈ విషయం వెల్లడైంది. 2008–09 ఆర్థిక సంవత్సరంలో ముకేశ్ రూ.15 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. అప్పటి నుంచి 2019–20 వరకు ఆయన పారితోషికంలో ఎలాంటి మార్పు లేదు. కానీ, కరోనా విపత్తు నేపథ్యంలో 2020–21లో వేతన ప్రయోజనాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. భారీ డివిడెండ్ ఆదాయం: ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీకి రిలయన్స్లో ఉన్న వాటాల రూపంలో భారీ డివిడెండ్ ఆదాయం వస్తుండడం విశేషం. వ్యక్తిగతంగా ఆయన పేరిట ఉన్న 1.61 కోట్ల షేర్లపై రూ.9.66 కోట్ల డివిడెండ్ ఆదాయం 2024–25లో వచ్చింది. ఇక కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ సంస్థలకు మొత్తంగా 664.5 కోట్ల షేర్లు (50.07% వాటా) ఉన్నాయి. వీటి రూపంలో రూ.3,987 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రమోటర్ల గ్రూప్నకు వెళ్లింది. ఇక రిలయన్స్ గ్రూప్లో పనిచేసే అంబానీ సోదరులు నిఖిల్, హితల్ మేశ్వానీ ఎప్పటి మాదిరే గత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.25 కోట్ల చొప్పున అందుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వార్షిక ప్రయోజనాలు 2025–26లో రూ.20.58 కోట్లకు పెరిగాయి. ఇక అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రూ.12.17 కోట్లు లభించాయి. -
శాంసంగ్ నుంచి 72 టీవీ మోడల్స్
శాంసంగ్ ఇండియా తాజాగా విజన్ ఏఐ టీవీ శ్రేణిని ఆవిష్కరించింది. 72 టీవీ మోడల్స్ను ప్రవేశపెట్టింది. వీటిలో మైక్రో ఆర్జీబీ, ఓఎల్ఈడీ, నియో క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ మొదలైనవి ఉన్నాయి. శాంసంగ్ టీవీ ప్లస్ ద్వారా ఉచిత కంటెంట్, కేర్ ప్లస్ ద్వారా అదనపు వారంటీ మొదలైనవి పొందవచ్చు.పరిమిత కాలం పాటు నిర్దిష్ట టీవీ మోడల్స్పై కాంప్లిమెంటరీగా రూ. 1,02,990 విలువ చేసే సౌండ్బార్, రూ. 23,990 విలువ చేసే మ్యూజిక్ స్టూడియో ఉచితంగా లభిస్తాయని సంస్థ తెలిపింది. యూహెచ్డీ టీవీల శ్రేణి ధర రూ. 36,990 నుంచి, మైక్రో ఆర్జీబీ రేటు రూ. 1,24,990 నుంచి ప్రారంభమవుతుంది. -
సగానికి తగ్గిన వెంచర్ ఇన్వెస్ట్మెంట్స్
వెంచర్ క్యాపిటల్, ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో సగానికి క్షీణించాయి. వెరసి ఏప్రిల్లో 38 డీల్స్ ద్వారా 2.7 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా డాలరుతో మారకంలో రూపాయి క్షీణత, రాజకీయ భౌగోళిక ఆందోళనలు దెబ్బతీశాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 ఏప్రిల్తో పోలిస్తే విలువలో 50 శాతం తగ్గాయి.2026 ఏప్రిల్లో 83 లావాదేవీలు నమోదయ్యాయి. ఇవి 29 నెలల కనిష్టంకాగా.. గతేడాది ఏప్రిల్లో 134, ఈ ఏడాది మార్చిలో 131 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. డాలరుతో మారకంలో రూపాయి 96 స్థాయికి పడిపోవడం, అధికస్థాయిలలో కొనసాగుతున్న ముడిచమురు ధరలు, రాజకీయ భౌగోళిక ఆందోళనలు పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఈవై పార్ట్నర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ ఆల్టర్నేటివ్స్ 28.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు గత నెలలో నమోదైన అతిపెద్ద డీల్గా నివేదిక తెలియజేసింది. బెంగళూరు, పుణేలలో ఆర్ఎంజెడ్ కార్యాలయ ఆస్తులలో ఇన్వెస్ట్ చేసినట్లు వెల్లడించింది. -
వైద్య రంగంలోకి బజాజ్ గ్రూప్
బజాజ్ గ్రూప్ ఆరోగ్య సంరక్షణ సేవల్లోకి అడుగు పెడుతోంది. రూ.2,000–2,500 కోట్లతో వచ్చే మూడేళ్ల కాలంలో పుణెలో హాస్పిటల్ను ఏర్పాటు చేయనున్నట్టు బజాజ్ ఇంటెగ్రేటెడ్ హెల్త్ సిస్టమ్ ఎండీ నీరవ్ బజాజ్ ప్రకటించారు. వచ్చే దశాబ్ద కాలంలో 12 పట్టణాల్లోకి సేవలను విస్తరిస్తామని తెలిపారు. క్లినిక్లు, అంబులేటరీ సేవలు, హోమ్కేర్ (ఇంటివద్దే వైద్య సేవలు), హాస్పిటల్తో కూడిన ఆరోగ్య సంరక్షణ నమూనాను రూపొందించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పారు.వ్యాధుల నివారణ నుంచి తక్షణ చికిత్స వరకు ఆస్పత్రికి దూరంగా సేవలను అందించాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ ఆరోగ్య సంరక్షణ నమూనా చాలా భిన్నమైందంటూ దీన్ని సొంతంగానే నిర్మింకుంటామని చెప్పారు. పడకల సంఖ్య, ఒక్కో పడకవారీ ఆదాయం తదితర సంప్రదాయ కొలమానాలను తాము అనుసరించబోమన్నారు. ప్రస్తుతమున్న హాస్పిటల్స్ను కొనుగోలు చేసే ఉద్దేశ్యం లేదన్నారు. -
భారత సైన్యంతో ఎయిరిండియా ఒప్పందం
దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు, సైనిక దివ్యాంగుల పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ టాటా గ్రూప్ యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ వితంతువులు(వీర నారీ-యుద్ధంలో భర్తలను కోల్పోయినవారు), వారి పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్మీ ప్రత్యేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా భారత సైన్యంతో ఎయిరిండియా సహకార ఒప్పందం కుదుర్చుకుంది. దేశ నిర్మాణంలో, సామాజిక బాధ్యతలో కార్పొరేట్ రంగానికి ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.తొలి విడతగా 60 మందికి అవకాశంఈ వినూత్న భాగస్వామ్యం ద్వారా వీర నారీలు, వారి పిల్లలకు ‘ఎయిరిండియా శాట్స్ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ (ఏఐ సాట్స్)లో స్థిరమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమం కింద ప్రాథమికంగా 20 మంది యుద్ధ వితంతువులను, 40 మంది వారి పిల్లలను ఎయిర్లైన్స్ ఉద్యోగాల్లోకి తీసుకోనున్నారు. వీరికి విమానాశ్రయ కార్యకలాపాల్లో కీలకమైన కస్టమర్ సేవలు, లోడ్ అండ్ కంట్రోల్, ర్యాంప్ ఆపరేషన్స్ విభాగాల్లో బాధ్యతలు అప్పగిస్తారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వీరికి శిక్షణ అందిస్తారు. తద్వారా దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక సాధికారతను పెంపొందిస్తూ ఉద్యోగానికి తక్షణమే సిద్ధమయ్యేలా అభ్యర్థులను తీర్చిదిద్దుతారు.‘ఆశా’ పాఠశాలల్లో వృత్తి విద్యా ల్యాబ్ల ఏర్పాటుకంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనికులు, పూర్వ సైనికోద్యోగులు (అనుభవజ్ఞులు), దివ్యాంగుల పిల్లల సంక్షేమం కోసం భారత సైన్యం ప్రత్యేకంగా ‘ఆశా’ (ఆర్మీ స్పెషల్ హెల్ప్ అండ్ అసోసియేషన్) పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ చిన్నారులకు నాణ్యమైన విద్యా వైద్యంతో పాటు దీర్ఘకాలిక భవిష్యత్తును అందించేందుకు ఎయిరిండియా వృత్తి శిక్షణా మౌలిక సదుపాయాలను నిర్మించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 25 ఆశా పాఠశాలల్లో అత్యాధునిక వృత్తి శిక్షణా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడమే ఈ చొరవ ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే 10 పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభం కాగా, త్వరలోనే మిగిలిన 15 పాఠశాలలకు కూడా దీనిని విస్తరించనున్నారు.వైవిధ్యమైన రంగాలలో శిక్షణచిన్నారుల సృజనాత్మకతను, సాంకేతిక నైపుణ్యాలను వెలికితీసేలా ఈ ల్యాబ్ల్లో విభిన్న విభాగాలపై అనుభవపూర్వక శిక్షణ ఇవ్వనున్నారు. అందులో భాగంలో ఫోటోగ్రఫి, విజువల్ స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్, పెయింటింగ్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కుకింగ్, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, బోటిక్ అండ్ టైలరింగ్, ఎలక్ట్రికల్, ఇతర సాంకేతిక నైపుణ్యాలు, క్రీడల్లో శిక్షణ ఇస్తారు.భారత సైన్యంతో కుదిరిన ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఎయిరిండియా గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్, కార్పొరేట్ వ్యవహారాల గ్రూప్ హెడ్ పి.బాలాజీ మాట్లాడుతూ ‘భారత సైన్యంతో ఎయిరిండియా భాగస్వామ్యం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు; ఇది దేశ నిర్మాణ ప్రయత్నంలో భాగం కావాలనే మా ఉమ్మడి సంకల్పానికి ప్రతిరూపం. నైపుణ్యాలను బలోపేతం చేయడం, సరైన అవకాశాల ద్వారా సమాజంలో గౌరవాన్ని, సాధికారతను పెంపొందించడమే ఈ రెండు కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. సైన్యంతో కలిసి పనిచేస్తూ భవిష్యత్తులో స్థిరమైన, సానుకూల ప్రభావాన్ని చూపే ఒక స్కేలబుల్ మోడల్ను రూపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాం’ అన్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఉద్యోగాల కోతకు ‘ఏఐ’ సాకు మాత్రమే
కృత్రిమ మేధ ప్రపంచాన్ని మార్చేస్తోందని, మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా మారిపోయిందని ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ప్రముఖ దేశీయ సాఫ్ట్వేర్ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబు ఖండించారు. ప్రపంచ టెక్ పరిశ్రమ అంతా కలిసి ‘ఏఐ వల్ల మాత్రమే సానుకూల మార్పులు సాధ్యం’ అనే ఒక బలవంతపు కథనాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆయన మండిపడ్డారు.ప్రస్తుతం టెక్ ప్రపంచంలో నడుస్తున్న ఏఐ హైప్ వెనుక ఉన్న అసలు నిజాలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఆయన ఎండగట్టారు. ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్, ఆర్థిక మందగమనంపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఉత్పాదకత శూన్యం..ఏఐ వల్ల కంపెనీల్లో ఉత్పాదకత అసాధారణంగా పెరిగిపోతోందన్న వాదనలో వాస్తవం లేదని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. వాస్తవ లాభాలు చాలా పరిమితంగా ఉన్నాయని పేర్కొన్నారు. కంపెనీలు తమ ఆర్థిక ఒత్తిళ్లను దాచడానికి, పెట్టుబడిదారుల అంచనాలను అందుకోవడానికి మాత్రమే ఏఐని ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు.‘కంపెనీలు తాము చేస్తున్న ఉద్యోగాల తొలగింపులను ఏఐ ఖాతాలో వేయడం చాలా సౌకర్యవంతంగా మారింది. ఇలా చేయడం వల్ల ఆయా సంస్థలు భవిష్యత్ సాంకేతికతను అందుకుంటున్నట్లు కలరింగ్ ఇస్తున్నాయి. కానీ, అసలు నిజం అది కాదు’ అని శ్రీధర్ వెంబు అన్నారు. మానవ శ్రమను అకస్మాత్తుగా భర్తీ చేసేంత సామర్థ్యం ఏఐకి ఇంకా రాలేదని, ప్రస్తుతం జరుగుతున్న లే-ఆఫ్స్కు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ప్రపంచవ్యాప్త ఆర్థిక ఒత్తిళ్లే ప్రధాన కారణమని వెంబు విశ్లేషించారు. ప్రపంచ ఆర్థిక చిత్రం రోజురోజుకూ బలహీనపడుతోందన్నారు. కేవలం ఏఐ మాత్రమే ఆ లోతైన సంక్షోభ సమస్యలను పరిష్కరించలేదని హెచ్చరించారు.ఐఫోన్ విప్లవం కూడా 2008 సంక్షోభాన్ని ఆపలేకపోయింది!గత సాంకేతిక విప్లవాలను ఉదాహరణగా చూపుతూ శ్రీధర్ వెంబు ప్రస్తుత ఏఐ బూమ్ను విమర్శించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతానికి ఈ ఏఐ ఇన్వెస్ట్మెంట్ బబుల్ కాపాడుతూ వస్తోందని, కానీ ఇది ఎక్కువ కాలం సాగదని స్పష్టం చేశారు. గతంలో ఐఫోన్ విప్లవం 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని నివారించలేకపోయిందని గుర్తుచేశారు. సాంకేతికత ఎంత పెరిగినప్పటికీ, ప్రపంచ ఆర్థిక అసమతులాన్ని ఏఐ తన మాయాజాలంతో ఒక్క రాత్రిలో నయం చేయలేదని వెంబు తేల్చిచెప్పారు. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ రంగంలో ఏఐ టూల్స్ ఉత్పాదకతను ఆకాశానికి తీసుకెళ్తాయనే అతిపెద్ద అపోహను కూడా తీవ్రంగా ప్రశ్నించారు.స్వరం మారుస్తున్న గ్లోబల్ టెక్ లీడర్స్!విచిత్రం ఏమిటంటే, ఏఐ విప్లవానికి పితామహుడిగా చెప్పుకునే ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం ఇటీవల తన స్వరాన్ని మార్చడం గమనార్హం. ‘దీని (ఏఐ ప్రభావం) గురించి నేను తప్పుగా అంచనా వేసినందుకు సంతోషిస్తున్నాను’ అంటూ ఆల్ట్మాన్ వ్యాఖ్యానించారు. టెక్ పరిశ్రమ మొదట్లో ఊహించిన దానికంటే సమాజం ఇప్పటికీ మానవ మేధస్సుకు, మానవ పరస్పర చర్యలకే అత్యధిక విలువ ఇస్తోందని ఆయన అంగీకరించారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
డిజిటల్ చెల్లింపులకు కేంద్ర బిందువు భారత్ కనెక్ట్
దేశంలో వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పౌరుల జీవన ప్రమాణాలను, ప్రభుత్వ సేవలను సమూలంగా మార్చేస్తోంది. సాధారణ యుటిలిటీ బిల్లులకే పరిమితం కాకుండా, విస్తృత శ్రేణి ప్రభుత్వ సర్వీసులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడంలో భారతదేశం ప్రగతి సాధిస్తోంది. దేశవ్యాప్తంగా మొబైల్ యాప్ల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ‘భారత్ కనెక్ట్’ ఈ డిజిటల్ చెల్లింపుల పరివర్తనకు కేంద్ర బిందువుగా నిలుస్తోందని అధికారులు చెబుతున్నారు.భారత్ కనెక్ట్ (గతంలో భారత్ బిల్ పే - బీబీపీఎస్) వివిధ బిల్లుల చెల్లింపులను, ఆర్థిక లావాదేవీ మార్గాలను ఒకే ప్లాట్ఫారమ్పైకి తీసుకురావడం ద్వారా పౌరులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా భారత్ కనెక్ట్ ఆధారిత యాప్లు, వెబ్సైట్ల ద్వారా కింది సేవలను క్షణాల్లో అందుతున్నాయని పేర్కొంది.విద్యుత్ బిల్లులుమున్సిపల్, నీటి పన్నులుఫాస్ట్ట్యాగ్ రీఛార్జ్లుఈ-చలాన్లులైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలునేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)ఇది భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన కస్టమర్-టు-గవర్నమెంట్ (సీ2జీ) డిజిటల్ సర్వీసుగా నిలిచింది. ప్రస్తుతం భారత్ కనెక్ట్ నెట్వర్క్లో 29 కంటే ఎక్కువ విభాగాల్లో 22,000 పైగా బిల్లుదారులు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే 700 కంటే ఎక్కువ యాప్ల ద్వారా ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.డిజిటల్ భరోసాఈ మార్పు కేవలం చెల్లింపుల వేగానికి సంబంధించింది మాత్రమే కాదని, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేదని ఎన్పీసీఐ భారత్ బిల్పే లిమిటెడ్ (ఎన్బీబీఎల్) ఎండీ, సీఈఓ నూపుర్ చతుర్వేది పేర్కొన్నారు. ‘శ్రమతో కూడిన ప్రక్రియల స్థానంలో సులభతరమైన డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏకీకృత చెల్లింపుల వ్యవస్థ ద్వారా అన్ని సేవలు పారదర్శకంగా ఉన్నాయి. భారీ స్థాయిలో డిజిటల్ అడాప్షన్ను కొనసాగించడానికి ఈ నమ్మకమే అత్యంత కీలకం’ అని చతుర్వేది అన్నారు.హైబ్రిడ్ మోడల్భారత్ కనెక్ట్ స్మార్ట్ఫోన్ వినియోగదారులతోపాటు అందరికీ కలుపుకొనిపోయే సాంకేతిక నిర్మాణాన్ని కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది ఆఫ్ లైన్ ఏజెంట్ల ద్వారా డిజిటల్ పరిజ్ఞానం లేని వారికి కూడా ఈ సేవలను అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు తమ సమీపంలోని ఏజెంట్ వద్దకు వెళ్లి నగదు రూపంలో ప్రభుత్వ బాకీలను సులభంగా చెల్లించవచ్చు. ఈ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ విభజనను సమర్థవంతంగా తొలగిస్తోంది.ఈ వ్యవస్థీకృత ప్రక్రియ ద్వారా ప్రజలు తమ ఖర్చులను ట్రాక్ చేసుకోవడంతో పాటు సకాలంలో బిల్లులు చెల్లిస్తూ క్రమశిక్షణ అలవాటు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.‘ప్రభుత్వ విభాగాలకు సైతం ఇది ఎంతో మేలు చేస్తోంది. దీనివల్ల రాబడుల సేకరణ మెరుగైంది. చెల్లింపుల్లో జాప్యం తగ్గింది. వ్యవస్థలో పారదర్శకత పెరిగి పౌరులకు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నమ్మకం బలపడింది’ అని తెలిపారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
కాగితంపై ఆహా ఓహో.. ముఖాముఖిలో..
ఉద్యోగ అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సరికొత్త ట్రెండ్గా మారింది. ఒకప్పుడు చక్కటి రెజ్యూమే (సీవీ) రాయడం చేతకాక ఎంతోమంది ప్రతిభావంతులు వెనకబడిపోయేవారు. కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ పుణ్యమా అని నిమిషాల్లో ప్రొఫెషనల్ రెజ్యూమేలు సిద్ధమైపోతున్నాయి. కంపెనీల అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ (ఏటీఎస్) ఫిల్టర్లను సులభంగా దాటేలా కీవర్డ్స్తో వీటిని అభ్యర్థులు ముస్తాబు చేస్తున్నారు. అయితే, ఇదే ఇప్పుడు రిక్రూటర్లకు తలనొప్పిగా మారింది. కాగితంపై అద్భుతంగా కనిపిస్తున్న అభ్యర్థులు తీరా ఇంటర్వ్యూకి వచ్చేసరికి కనీస ప్రతిభ చూపలేకపోతుండటంతో కంపెనీలు తమ ఎంపిక వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి.గణాంకాలు ఏం చెబుతున్నాయి?ప్రస్తుతం వైట్ కాలర్ ఉద్యోగాలకు పోటీ పడేవారిలో ఏఐ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని మార్కెట్ వర్గాల తాజా డేటా స్పష్టం చేస్తోంది.హనార్.ఏఐ నివేదిక: ప్రస్తుతం దాదాపు 70 శాతానికి పైగా వైట్ కాలర్ అభ్యర్థులు తమ రెజ్యూమేల రూపకల్పనకు ఏఐని వాడుతున్నారు. ఇక యువత (జెన్ జీ) విషయానికి వస్తే ఈ సంఖ్య ఏకంగా 85 శాతం దాటిపోయింది.నెక్సాస్క్రీన్ విశ్లేషణ: ఒకే రకమైన అనుభవం ఉన్న ఇద్దరు అభ్యర్థుల్లో ఏఐ ద్వారా ఆప్టిమైజ్ చేసిన రెజ్యూమే ఉన్న అభ్యర్థికి షార్ట్లిస్ట్ అయ్యే అవకాశం 5 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉంటోంది.లింక్డ్ఇన్ పరిశోధన: కొవిడ్ పూర్వపు రోజులతో పోలిస్తే ప్రస్తుతం నియామక ప్రక్రియలు 40 శాతం పెరిగాయి. అయినప్పటికీ, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడం సవాలుగా మారిందని 74 శాతం మంది రిక్రూటర్లు వాపోతున్నారు. ఇందులో 53 శాతం మంది ఏఐ రెజ్యూమేల వెల్లువను నిందిస్తుండగా 47 శాతం మంది నైపుణ్యాల కొరతను కారణంగా చూపుతున్నారు.నకిలీల జోరు.. పెరిగిన నిఘా!రెజ్యూమేల్లో ఏఐ వాడకం పెరగడంతోపాటు ఆన్లైన్ అసెస్మెంట్లలో (పరీక్షల్లో) అవసరాన్ని మించి ఏఐ టూల్స్ వాడుతూ దొరికిపోతున్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. ప్రముఖ హైరింగ్ ప్లాట్ఫామ్ హైర్ప్రో సీఓఓ పసుపతి ఎస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రిక్రూటర్ల ముందున్న అతిపెద్ద సవాలు.. ఏఐ సృష్టించిన హడావుడిని దాటుకుని అభ్యర్థిలో ఉన్న నిజమైన ప్రతిభను గుర్తించడమే’ అని పేర్కొన్నారు.ఒకే మూసలో రెజ్యూమేలు..‘ఏఐ రెజ్యూమేలు ఏటీఎస్ ఫిల్టర్లను సులభంగా దాటుతున్నాయి. కాగితంపై అంతా సవ్యంగానే ఉంటోంది. కానీ, ప్రతి ఒక్కరూ ఒకే రకమైన టెంప్లేట్లు వాడటం వల్ల రిక్రూటర్లకు అన్నీ ఒకేలా కనిపిస్తున్నాయి’ అని ‘హనార్.ఏఐ’ వ్యవస్థాపకుడు కృష్ణ ఖండేల్వాల్ తెలిపారు. కాగితంపై ప్రొఫైల్ ఎంత బలంగా ఉందో ఇంటర్వ్యూలో అభ్యర్థి ప్రదర్శన అంత బలహీనంగా ఉంటోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థులు తమ నైపుణ్యాలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఏఐ ఉపయోగపడాలి కానీ, లేని అనుభవాన్ని ఉన్నట్లు చూపించడానికి కాదని హెచ్చరిస్తున్నారు. పేపర్ షార్ట్లిస్టింగ్లో టాప్లో ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తే అందులో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కనీసం బాటమ్ 25 పర్సంటైల్ స్కోరు కూడా సాధించలేకపోతున్నారని వాపోతున్నారు.కెరీర్ మార్చేవారికి శాపం!ఈ ఏఐ ఆధారిత ఫిల్టరింగ్ వ్యవస్థ వల్ల కొందరు తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. స్వదేశంలో పెద్ద స్టార్టప్ల్లో లేదా యూనికార్న్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఏటీఎస్ సిస్టమ్స్ ఆయా కంపెనీల పేర్లను గుర్తించలేక వారి అప్లికేషన్లను ఆటో-రిజెక్ట్ చేస్తున్నాయి. వేరే రంగం నుంచి ఐటీ లేదా ఇతర విభాగాలకు మారాలనుకునే అభ్యర్థుల హిస్టరీలో నిర్దిష్ట కీవర్డ్స్ లేకపోవడం వల్ల ఏఐ సహాయంతో రెజ్యూమే మార్చినా సిస్టమ్స్ వాటిని తిరస్కరిస్తున్నాయి.మారుతున్న నియామక సూత్రాలుకీవర్డ్స్ ఆధారిత రెజ్యూమేలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి.రెఫరల్స్, పోర్ట్ఫోలియోలు: పాత కంపెనీల బ్రాండ్ వాల్యూ, గతంలో చేసిన ప్రాజెక్టుల పోర్ట్ఫోలియోలు, అంతర్గత రెఫరల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు.వాయిస్ బేస్డ్ అసెస్మెంట్స్: కేవలం రెజ్యూమేలు చూడకుండా తొలి దశలోనే 15 నిమిషాల వాయిస్ కాల్స్ లేదా ఏఐ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థికి ఉన్న ప్రాక్టికల్ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి బయటపడతాయని రిక్రూటర్లు నమ్ముతున్నారు.ఫలితాల ఆధారిత పరిశీలన: కేవలం బాధ్యతల గురించిన రాతలు కాకుండా అభ్యర్థి సాధించిన నిర్దిష్ట విజయాలు, ప్రాజెక్ట్ ఓనర్షిప్, సమస్యల పరిష్కార సామర్థ్యం ఆధారంగా అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ఇంధన భద్రతే ముఖ్యం
ఇంధన భద్రత, క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాలు), వనరుల నియంత్రణ అన్నవి భవిష్యత్ ఆర్థిక ఆధిపత్యానికి ఎంతో కీలకమని భూమి వెంచర్స్ సీఈవో, వేదాంత గ్రూప్ మాజీ సీఈవో అయిన సునీల్ దగ్గల్ అభిప్రాయపడ్డారు. భారత్ ప్రపంచంలోమూడో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉందంటూ, తన అవసరాల్లో 88–89 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే గ్యాస్ డిమాండ్లో సగాన్ని దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్నట్టు తెలిపారు. కనుక భారత్ దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వానికి ఇంధన భద్రత ఎంతో కీలకమన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పారిశ్రామిక సరఫరాలు, ప్రపంచ ఆర్థిక ప్రాధాన్యతలను మార్చివేస్తున్న పరిస్థితులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బాహ్య ఇంధన సరఫరాలపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థలు గత కొన్నేళ్లలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన సమీకరణాలను మార్చగా, అమెరికా–ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలు ‘హార్మూజ్ జలసంధి’ వంటి చమురు రవాణా మార్గాల ప్రాధాన్యతను గుర్తుచేసినట్టు పేర్కొన్నారు. భారతదేశ ముడిచమురు దిగుమతుల్లో 45 శాతం హార్మూజ్ జలసంధి ద్వారానే వస్తున్నందున, పశ్చిమాసియాలో స్థిరత్వం భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్నారు. ఆయిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ వాణిజ్య లోటు విస్తరించి, ద్రవ్యోల్బణ ఒత్తిడులు అధికమవుతాయంటూ.. ఇది దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని దగ్గల్ హెచ్చరించారు. కీలక ఖనిజాల ప్రాధాన్యత..పరిమిత ఇంధన వనరులపై ఆధారపడిన ఏ దేశమూ దీర్ఘకాలిక ఆర్థిక సార్వభౌమాధికారాన్ని సాధించలేదని సునీల్ దగ్గల్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, సెమీకండక్టర్లు, ఏఐ సదుపాయాలు, రక్షణ టెక్నాలజీలకు అవసరమైన కీలక ఖనిజ వనరులు, ప్రాసెసింగ్ సామర్థ్యాలపైనే తదుపరి దశ అంతర్జాతీయ పోటీతత్వం ఆధారపడి ఉంటుందన్నారు. గత శతాబ్దంలో చమురుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో.. రాబోయే రోజుల్లో కీలక ఖనిజాలకు అంతటి ప్రాముఖ్యత ఉంటుందని దుగ్గల్ పేర్కొన్నారు. లిథియం, కాపర్, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, అరుదైన భూ ఖనిజాల (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) వెలికితీత, శుద్ధి, సరఫరా గొలుసులను నియంత్రించే దేశాలే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తాయని ఆయన చెప్పారు. కనుక ఇంధన పరివర్తనను కేవలం పర్యావరణ పరమైన మార్పుగా కాకుండా.. ఒక వ్యూహాత్మక పారిశ్రామిక మార్పుగా చూడాలన్నారు. 1.4 బిలియన్ల జనాభా కలిగిన భారద్ కీలక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం కోసం విదేశీ సరఫరాలపై అతిగా ఆధారపడటం సరికాదని ఆయన హెచ్చరించారు. మైనింగ్, లోహాలు, రవాణా, మౌలిక సదుపాయాలను కేవలం పరిశ్రమలుగా కాకుండా వ్యూహాత్మక ఆర్థిక స్తంభాలుగా చూడాలని సూచించారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
బీమా రంగం డీలా
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం పాటు కొనసాగితే బీమా రంగం వృద్ధి మందగించొచ్చని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధాని చెప్పినట్టు మనం కష్టకాలాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడకుండా రక్షణ కలి్పంచారు. ఒకవేళ ఈ సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది వ్యక్తుల ఖర్చులు, పొదుపులను ప్రభావితం చేస్తుంది. ఈ సంక్షోభం సాధ్యమైనంత త్వరలో ముగిసి, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నాం’’అని దొరైస్వామి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ప్రభావితమైతే బీమా రంగం దీనికి దూరంగా ఉండలేదన్నారు. వ్యక్తుల ఆదాయాలు, వారి సామర్థ్యాలు ప్రభావితమైతే బీమా రంగంపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో మరికొంత విక్రయించే విషయమై ఎదురైన ఒక ప్రశ్నకు.. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దొరైస్వామి చెప్పారు. లిస్టింగ్ నిబంధనలను పాటించడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించినట్టు దొరైస్వామి పేర్కొన్నారు. వాటాలను దశల వారీగా 10–15 శాతం మేర తగ్గించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. 2022లో ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాలను రూ.21,000 కోట్లకు విక్రయిచడం గమనార్హం. -
నందన్ నీలేకని వీసీ పెట్టుబడులు..రూ.3,000 కోట్లతో రెడీ
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఈసీవో, సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని తాజాగా టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు తెరతీశారు. వెంచర్ క్యాపిటల్(వీసీ) సంస్థ ఫండమెంటమ్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రత్యేకించిన ఫ్రంటియర్ టెక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. ఇందుకు ప్రాథమికంగా రూ. 3,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నారు.దేశీయంగా ఏఐ, డీప్టెక్ కంపెనీల దన్నుతో ఫండమెంటమ్ ఫ్రంటియర్ అడ్వయిజర్స్(ఎఫ్2ఏ)ను ఏర్పాటు చేశారు. సెబీ అనుమతించిన తొలి ఫండ్.. ఫండమెంటమ్ 3– ఏఐ, డీప్టెక్ రూ. 2,000 కోట్లు సమకూర్చనున్నాయి. వీటికి అదనంగా ఎఫ్2ఏ మరో రూ. 1,000 కోట్ల సహపెట్టుబడులను సమీకరించనుంది. ఎఫ్2ఏ టెక్నాలజీ ఆధారిత బిజినెస్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ప్రధానంగా కన్జూమర్, ఎంటర్ప్రైజ్, ఫిజికల్ ఏఐను లక్ష్యంగా చేసుకోనుంది. -
ఏఐ బూమ్తో శామ్సంగ్ బంపర్ ఆఫర్
కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం ప్రపంచ టెక్ రంగాన్ని ఏ విధంగా శాసిస్తోందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదు. గ్లోబల్ సెమీకండక్టర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శామ్సంగ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తన చిప్ విభాగం ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ సాధించిన బంపర్ ప్రాఫిట్స్ నేపథ్యంలో చిప్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి సగటున 3,40,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.3.25 కోట్లు) బోనస్ లభించనుంది. బుధవారం నాడు శాంసంగ్కు చెందిన అతిపెద్ద కార్మిక సంఘం (యూనియన్) ఈ మెగా బోనస్ ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపింది. దాదాపు 18 రోజుల పాటు సమ్మెకు దిగుతామంటూ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె హెచ్చరికల నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం దిగివచ్చి ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఏకంగా 49 రెట్లు పెరిగిన ఆదాయం!ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ఏఐ బూమ్ కారణంగా చాట్ జీపీటీ, జెమిని వంటి అధునాతన ఏఐ మోడల్స్, భారీ డేటాసెంటర్లకు మెమరీ చిప్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ మెమరీ చిప్స్ తయారీలో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న శామ్సంగ్.. గత త్రైమాసికంలో తన చిప్ విభాగం ఆదాయంలో ఏకంగా 49 రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఈ అసాధారణ వృద్ధి కారణంగానే తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ తర్వాత మార్కెట్ విలువలో ట్రిలియన్ డాలర్లను దాటిన రెండో ఆసియా కంపెనీగా శామ్సంగ్ ఇటీవల రికార్డు సృష్టించింది.ఎవరు అర్హులు?ఈ భారీ బోనస్ ప్యాకేజీ శామ్సంగ్ ఉద్యోగులందరికీ వర్తించదు. కేవలం కంపెనీకి చెందిన ప్రాసెసర్లు, ర్యామ్, హై-ఎండ్ మెమరీ చిప్స్ తయారు చేసే సెమీకండక్టర్ (చిప్) విభాగానికి మాత్రమే ఇది పరిమితం. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రిక్ కార్లు, ఏఐ డేటాసెంటర్లలో వాడే చిప్స్ అన్నీ ఈ విభాగంలోనే తయారవుతాయి.ఈ ఏడాది మార్చిలో శామ్సంగ్ సమర్పించిన అధికారిక ఫైలింగ్ ప్రకారం.. 2025లో కంపెనీ ఉద్యోగులు సగటున 158 మిలియన్ వాన్ (సుమారు రూ.1 కోటి) ఆర్జించారు. కానీ ఈసారి రాబోయే బోనస్ ఆ మొత్తాన్ని ఎన్నో రెట్లు అధిగమించింది.కేవలం బోనస్ల కోసమే 26.5 బిలియన్ డాలర్లుశామ్సంగ్ అధికారిక గణాంకాల ప్రకారం.. కంపెనీ చిప్ విభాగంలో సుమారు 78,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ లెక్కన ప్రతి ఒక్కరికీ సగటున 3,40,000 డాలర్ల బోనస్ ఇవ్వాలంటే కంపెనీ కేవలం బోనస్ కోసమే ఏకంగా 26.5 బిలియన్ డాలర్లను ఖర్చు చేయబోతోంది. కార్పొరేట్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు వ్యయంగా మారనుంది.ఓటింగ్లో భారీ మెజారిటీయూనియన్ ప్రతినిధులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఒప్పందంపై నిర్వహించిన ఓటింగ్లో అర్హులైన సభ్యులలో 95 శాతానికి పైగా పాల్గొన్నారు. మొత్తం 62,600 బ్యాలెట్లలో 73.7 శాతం మంది ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేశారు. నిబంధనల ప్రకారం సగానికి పైగా మద్దతు అవసరం కాగా, ఉద్యోగులు భారీ మెజారిటీతో దీనిని ఆమోదించారు.తప్పిన గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభంఈ ఒప్పందం కేవలం శామ్సంగ్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ టెక్ రంగానికి సైతం పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే దక్షిణ కొరియా మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో శామ్సంగ్ వాటా ఏకంగా 12.5 శాతం. అలాగే ఆ దేశ ఎగుమతుల్లో మెమరీ చిప్స్ వాటా 35 శాతం వరకు ఉంటుంది. ఒకవేళ యాజమాన్యం ఈ డిమాండ్లకు ఒప్పుకోకపోయి ఉంటే ఉద్యోగులు 18 రోజుల పాటు సమ్మెకు వెళ్లేవారు. దీనివల్ల ప్రపంచవ్యాప్టింగా స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల తయారీ నిలిచిపోయి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతినేది. వారం రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ ముప్పు తప్పింది.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
పసిడి వెనక్కి.. వెండి ముందుకు
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.2,800 నష్టపోయి రూ.1,62,400 వద్ద స్థిరపడింది. వెండి కిలోకి రూ.2,000 పెరిగి రూ.2,73,000కు చేరింది. ఇరాన్–యూఎస్ మధ్య సంప్రదింపులపై అనిశ్చితులు ఏర్పడడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికా–ఇరాన్ ఒప్పందంపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణితో ఉన్నారని చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు ఒక శాతం నష్టంతో 4,534 డాలర్ల వద్ద, వెండి ధర ఔన్స్కు 2 శాతం నష్టంతో 76.49 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. -
గ్యాస్ వినియోగదారులకు ఊరట!
కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సరఫరా, పంపిణీ సవరణ ఉత్తర్వుల ప్రకారం.. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించేలా నిబంధనలను సవరించింది.పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కొత్త నిబంధనలతో గృహ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న 30 రోజులలోపు తమ ఎల్పీజీ కనెక్షన్ను రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా.. భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు మారితే.. మళ్లీ ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ కూడా తీసుకునే వెసులుబాటు కల్పించారు.ఈ నిర్ణయం.. ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు పొందేవారికి, వలస కుటుంబాలకు, అద్దె ఇళ్లలో నివసించే వారికి, విద్యార్థులు, తరచూ ప్రాంతాలు మారే కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.దేశంలో ఎల్పీజీ కొరత సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. లోకల్ సర్కిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఈ వారం 68 శాతం భారత కుటుంబాలు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి. గత వారం ఇది 57 శాతంగా ఉండగా ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది.ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భారత్ తన అవసరాలకు పెద్దమొత్తంలో దిగుమతులపై ఆధారపడటం వల్ల ఈ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడుతోంది. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం.. 20 శాతం మంది తమ అవసరాల కోసం బ్లాక్ మార్కెట్ను ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. అధికారిక ధరల కంటే రూ.300 నుంచి రూ.4,000 వరకు అదనంగా చెల్లించి గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది. -
ఆర్థిక సేవల్లోకి ఐషర్ మోటర్స్
ఐషర్ మోటర్స్ తాజాగా వోల్వో గ్రూప్తో కలిసి ఆర్థిక సేవల విభాగంలోకి విస్తరిస్తోంది. వోల్వో ఫైనాన్షియల్ సర్వీసెస్ (వీఎఫ్ఎస్) ఇండియాలో 50 శాతం వాటాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం సంస్థ రూ. 750 కోట్లు వెచ్చించనుంది.ప్రస్తుతం ఐషర్ (ఈఎంఎల్), వోల్వో గ్రూప్నకు వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ (వీఈసీవీ) పేరుతో జాయింట్ వెంచర్ ఉంది. ప్రతిపాదిత ఆర్థిక సేవల జాయింటు వెంచరనేది భారత్లో వీఈసీవీ, ఈఎంఎల్, వోల్వో గ్రూప్ ఉత్పత్తులకు క్యాప్టివ్ ఫైనాన్సింగ్ సంస్థగా వ్యవహరిస్తుంది. వోల్వో గ్రూప్తో 18 ఏళ్ల భాగస్వామ్యాన్ని వాహనాలకు ఫైనాన్సింగ్ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్లు ఈఎంఎల్ చైర్మన్ సిద్ధార్థ లాల్ తెలిపారు. -
అటల్ పెన్షన్ యోజన కొత్త రికార్డు!
సామాజిక భద్రతా పథకం ‘అటల్ పెన్షన్ యోజన’ (ఏపీవై) కింద సభ్యుల సంఖ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి మండలి (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ ఎస్ రామన్ తెలిపారు. 2026 మార్చి చివరికి ఏపీవై సభ్యులు 8.96 కోట్లుగా ఉన్నట్టు చెప్పారు.అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2025 మార్చి నాటికి)లో సభ్యుల సంఖ్య 7.61 కోట్లతో పోల్చితే, గత ఆర్థిక సంవత్సరంలో 1.35 కోట్ల మంది కొత్త సభ్యులు జతయ్యారు. 18 శాతం వార్షిక వృద్ధి అంచనా ఆధారంగా సభ్యుల సంఖ్య 10 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్టు రామన్ పేర్కొన్నారు.ఎన్పీఎస్ కూడా పీఎఫ్ఆర్డీఏ నియంత్రణల కిందే నడుస్తుండడం గమనార్హం. 18–25 ఏళ్ల వయసు వారి నుంచి ఎక్కువ మంది సభ్యులు చేరుతున్నారని.. దీర్ఘకాల ఆర్థిక భద్రతపై యువతలో అవగాహన పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తున్నట్టు రామన్ చెప్పారు. ఎన్పీఎస్ కింద 2026 మార్చి నాటికి 2.17 కోట్ల మంది సభ్యులు ఉండగా, వీరికి సంబంధించి రూ.15.95 లక్షల కోట్ల పింఛను నిధి నిర్వహణలో ఉన్నట్టు రామన్ తెలిపారు. ఈ ఏడాది ఎన్పీఎస్ సభ్యుల సంఖ్య 22 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. -
ఆర్బీఎల్కు ఎమిరేట్స్ ఓపెన్ ఆఫర్
ప్రయివేట్ రంగ సంస్థ ఆర్బీఎల్ బ్యాంక్ సాధారణ వాటాదారులకు దుబాయ్ సంస్థ ఎమిరేట్స్ ఎన్బీడీ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. తద్వారా 26 శాతం వాటాకు సమానమైన దాదాపు 41.56 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 280 ధరలో చేపట్టిన ఆఫర్ జూన్ 12న ముగియనుంది.ఈ నెల మొదట్లో ఆర్బీఎల్లో 74 శాతం వాటా కొనుగోలుకి ఎమిరేట్స్ ఎన్బీడీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతిపాదిత 3 బిలియన్ డాలర్ల(రూ. 26,850 కోట్లు) డీల్ దేశీ బ్యాంకింగ్ పరిశ్రమలో అత్యంత భారీ పెట్టుబడికాగా.. బ్యాంక్ తదుపరి వృద్ధికి నిధులు ఉపయోగపడనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెలలో ఆర్బీఐ సైతం ఇందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. -
మైక్రోసాఫ్ట్ వర్సెస్ ఎంసీఏ
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) మధ్య న్యాయ పోరాటం మరింత ముదిరింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో సహా ఇతర అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్లపై ఢిల్లీ-హరియాణా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ) విధించిన జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ లింక్డ్ఇన్ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ను ఆశ్రయించింది.మే 15, 2026న దాఖలైన ఈ అప్పీల్ను పరిశీలించిన ట్రైబ్యునల్ ఈ వివాదంపై తుది నిర్ణయం వచ్చే వరకు ఆర్ఓసీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ (స్టే) మధ్యంతర ఉపశమనం కల్పించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. భారతదేశంలో పనిచేస్తున్న బహుళజాతి కంపెనీల (ఎంఎన్సీ) భవిష్యత్తుపై దీని ప్రభావం ఉండనుండటంతో లీగల్ సర్కిల్స్లో ఈ కేసు హాట్ టాపిక్గా మారింది.అసలు వివాదం ఏమిటి?లింక్డ్ఇన్ సంస్థ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉంది. 2016లో సుమారు 26.2 బిలియన్ డాలర్ల డీల్తో మైక్రోసాఫ్ట్ దీనిని సొంతం చేసుకుంది. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ సీఈఓగా సత్య నాదెళ్ల ఈ కార్పొరేట్ నిర్మాణంలో అగ్రస్థానంలో ఉండగా లింక్డ్ఇన్ సీఈఓ ర్యాన్ రోస్లాన్స్కీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ పరిధిలో పనిచేస్తున్నారు. అయితే, మే 5, 2024న జారీ చేసిన ఒక ఉత్తర్వులో లింక్డ్ఇన్ ఇండియా, లింక్డ్ఇన్ ఐర్లాండ్లతో పాటు సత్య నాదెళ్ల, ర్యాన్ రోస్లాన్స్కీలపై ఆర్ఓసీ రూ.27 లక్షల జరిమానా విధించింది. కంపెనీల చట్టం ప్రకారం వీరు ‘గణనీయమైన ప్రయోజనకరమైన యజమానుల’ (సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్స్-ఎస్బీఓ) నిర్వచనం కిందికి వస్తారని, అయితే ఈ వివరాలను దాచారని ఆర్ఓసీ పేర్కొంది.లింక్డ్ఇన్ వాదనలింక్డ్ఇన్ ఇండియా అనేది మైక్రోసాఫ్ట్ పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ. అయితే, మాతృ సంస్థలో ఏ ఒక్క నిర్దిష్ట వాటాదారుకూ గణనీయమైన వాటా లేదు. అందువల్ల ఎంసీఏ ఫైలింగ్స్లో తాము ‘శూన్య’ (నిల్) ఎస్బీఓలను ప్రకటించామని, చట్టాన్ని తాము ఉల్లంఘించలేదని లింక్డ్ఇన్ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై స్పందన కోరుతూ పంపిన ఈమెయిల్స్కు లింక్డ్ఇన్, మైక్రోసాఫ్ట్ లేదా ఎంసీఏ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.ఎస్ఈసీ మాటేంటి..ఈ వివాదంలో అత్యంత కీలకమైన అంశం.. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) ముందు మైక్రోసాఫ్ట్ సమర్పించిన పత్రాలను ఆర్ఓసీ పరిగణనలోకి తీసుకోవడం. సత్య నాదెళ్లకు లింక్డ్ఇన్ ఇండియాపై నియంత్రణ ఉందనే నిర్ధారణకు రావడానికి, ఆయన ఎస్ఈసీకి సమర్పించిన ‘ఫారం 4ఎస్’ ఫైలింగ్స్ను ఆర్ఓసీ తన 63 పేజీల ఉత్తర్వులో ప్రధానంగా ప్రస్తావించింది. కంపెనీ అంతర్గత వ్యక్తులు (ఇన్సైడర్స్), డైరెక్టర్లు తమ వాటాల మార్పులను వెల్లడించడానికి అమెరికాలో ఈ ఫారం 4ఎస్ ఉపయోగిస్తారు.బహుళజాతి కంపెనీలపై పడే ప్రభావంభారతీయ చట్టాల ప్రకారం ప్రయోజనకరమైన యాజమాన్యాన్ని (ఎస్బీఓ) రెండు పరీక్షల ద్వారా గుర్తిస్తారు. షేర్హోల్డింగ్ టెస్ట్.. కంపెనీలో 10 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉండటం. నియంత్రణ టెస్ట్.. ప్రత్యక్ష వాటాతో సంబంధం లేకుండా కంపెనీ వ్యవహారాలపై గణనీయమైన ప్రభావం లేదా నియంత్రణను (వీటో హక్కులు వంటివి) కలిగి ఉండటం. ప్రస్తుత కేసులో ఆర్ఓసీ ఏ వాటాదారుకో కాకుండా, ఏకంగా గ్లోబల్ సీఈఓకు జరిమానా విధించడం గమనార్హం.‘సీఈఓ విధి కంపెనీని నడపడమే. నిర్ణయాధికారాల కోసం వారికి కొన్ని అధికారాలు సహజంగానే ఉంటాయి. అంతమాత్రాన సీఈఓలు తీసుకునే ప్రతి నిర్ణయం ఎస్బీఓ నిబంధనల ప్రకారం ‘నియంత్రణ’ కిందికి రాదు’ అని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
లేఆఫ్స్కు సాకు చెప్పడం సీఈఓల సోమరితనం
టెక్ ప్రపంచంలో కొంతకాలంగా సాగుతున్న ఉద్యోగాల కోత (లేఆఫ్స్)పై కృత్రిమ మేధ (ఏఐ) దిగ్గజం, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీల్లో జరుగుతున్న ఉద్యోగాల తొలగింపునకు ఏఐ సాంకేతికతను సాకుగా చూపించడాన్ని ఆయన తప్పుపట్టారు. కొంతమంది టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లు తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, కేవలం స్మార్ట్గా కనిపించడానికి ఏఐని వాడుకుంటున్నారని ఇది వారి సోమరితనం(లేజీ నారేటివ్) అని మండిపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హువాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.రెండేళ్ల క్రితం తీసేసి.. ఇప్పుడు ఏఐ అనడం ఏంటి?ఉద్యోగ నష్టాలకు, ఏఐ విస్తరణకు ముడిపెడుతూ సాగుతున్న ప్రచారాన్ని జెన్సెన్ హువాంగ్ పూర్తిగా ఖండించారు. సాంకేతికత ఇప్పుడిప్పుడే వ్యాపారాలకు ఉపయోగకరంగా మారుతోందని, కానీ కంపెనీలు మాత్రం చాలా కాలం క్రితమే ఉద్యోగులను తొలగించాయని ఆయన గుర్తుచేశారు. ‘ఏఐ అనేది కేవలం గత ఆరు నెలలుగా మాత్రమే పూర్తిస్థాయిలో ఉత్పాదకతను ఇస్తూ కంపెనీలకు ఉపయోగకరంగా మారింది. మరి అలాంటప్పుడు రెండేళ్ల క్రితమే ఉద్యోగులను తొలగించిన కంపెనీలు.. దానికి ఏఐ కారణమని ఎలా చెబుతాయి? టెక్నాలజీ ఇప్పుడే మార్కెట్లోకి వస్తే.. అప్పుడే ఉద్యోగాలు ఎలా పోతాయి? నేను ఈ ధోరణిని తీవ్రంగా ద్వేషిస్తున్నాను’ అని హువాంగ్ అన్నారు. కొంతమంది వ్యాపార నాయకులు శ్రామిక శక్తిని తగ్గించుకోవడానికి ఉన్న అసలైన అంతర్గత కారణాలను దాచిపెట్టి కేవలం చర్చనీయాంశంగా మార్చడానికి ఏఐని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు.భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్యంప్రస్తుతం మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఒకవైపు ఏఐ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెడుతూనే.. మరోవైపు వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవ కార్మికులను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేస్తుందేమోనన్న ఆందోళనను ఉద్యోగుల్లో పెంచుతున్నాయి. ఈ అంశంపై హువాంగ్ స్పందిస్తూ.. కార్పొరేట్ నాయకులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ‘మనం అనవసరంగా ప్రజలను భయపెడుతున్నాం, ఇది చాలా బాధ్యతారాహిత్యం. ఏఐ చుట్టూ ఉన్న వాస్తవాలను, దానివల్ల కలిగే సమతుల్య ప్రయోజనాలను సమాజానికి వివరించడంపై పరిశ్రమ దృష్టి పెట్టాలి’ అని ఆయన స్పష్టం చేశారు.పీక్ స్టేజ్లో ఉద్యోగాల కోత: గణంకాలు ఏం చెబుతున్నాయి?ఉత్పాదకతను పెంచడానికి, పనులను ఆటోమేట్ చేయడానికి పరిశ్రమలు ఏఐ సాధనాలను వేగంగా స్వీకరిస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ లేఆఫ్స్కు కేవలం అదే కారణం కాదని మార్కెట్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే ‘లేఆఫ్స్.ఎఫ్వైఐ’ తాజా గణాంకాల ప్రకారం.. 2026లో ఇప్పటివరకు 150 టెక్ కంపెనీల్లోని 1,14,210 మందికి పైగా ఈ లేఆప్స్ ద్వారా ప్రభావితమయ్యారు. మొత్తమ్మీద, లేఆఫ్స్ వెనుక ఉన్న ఆర్థిక మాంద్యం భయాలు, కంపెనీల మితిమీరిన విస్తరణ, వ్యయాల తగ్గింపు వంటి అసలు కారణాలను పక్కనబెట్టి ప్రతిదానికీ సరికొత్త టెక్నాలజీ వైపు వేలెత్తి చూపడం సరికాదన్న ఎన్విడియా చీఫ్ వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
ఆహార అలవాట్లలో మార్పు
భారతీయుల రోజువారీ ఆహార అలవాట్లలో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు జిమ్కు వెళ్లేవారో, బాడీ బిల్డర్లో అధికంగా తీసుకునే ప్రోటీన్ (మాంసకృత్తులు)పై ఇప్పుడు సామాన్యులకు ఆసక్తి పెరిగింది. దేశవ్యాప్తంగా హెల్త్, ఫిట్నెస్ పట్ల అవగాహన పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఫుడ్మెనూలో ప్రోటీన్ ఆధారిత ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్ ఇన్స్టామార్ట్ తాజాగా విడుదల చేసిన 2023-2025 కాలానికి సంబంధించిన నివేదికలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. గడిచిన రెండేళ్లలోనే ఇన్స్టామార్ట్లో ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు ఏకంగా 150 శాతం వృద్ధి చెందగా వినియోగదారులు వీటికోసం చేసే ఖర్చు ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.టైర్-2 నగరాల్లో వృద్ధి!ఒకప్పుడు హెల్తీ లైఫ్స్టైల్ ట్రెండ్స్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మెట్రో నగరాలతో పోలిస్తే టైర్-2, 3 నగరాల్లో ప్రోటీన్ ఆర్డర్ల వృద్ధి రేటు 200 శాతం వేగంగా ఉంది. వైజాగ్ వంటి నగరాలు ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్ వినియోగ హబ్లుగా మారుతున్నాయి. ఇక్కడి ప్రజలు తమ రోజువారీ సరుకుల లిస్ట్లో సాంప్రదాయ ఆహారంతో పాటు ఆధునిక ప్రోటీన్ ప్రొడక్ట్స్ను కూడా చేరుస్తున్నారు.ప్రోటీన్ ఆర్డర్ల ట్రెండ్పై ఇన్స్టామార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హరి కుమార్ మాట్లాడుతూ ‘మేం నిత్యావసరాలను వేగంగా అందించడంతోపాటు భారతీయుల జీవన విధానంలో వస్తున్న ఒక ప్రాథమిక మార్పులో భాగస్వామ్యం అవుతున్నాం. ఇది హెల్తీ లైఫ్స్టైల్ వైపు మళ్లుతున్న ట్రెండ్ను సూచిస్తుంది. మెట్రోల నుంచి చిన్న నగరాల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.నివేదికలోని కొన్ని అంశాలు..మార్నింగ్ విండో క్రేజ్ (ఉదయం 7 నుంచి 11 గంటలు): దేశవ్యాప్తంగా ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు అత్యధికంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యే వస్తున్నాయి. అంటే ప్రజలు తమ బ్రేక్ఫాస్ట్ను ప్రోటీన్-రిచ్గా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు.నంబర్ 1 కాంబో: భారతీయుల ఇన్స్టామార్ట్ కార్ట్లో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న నంబర్ వన్ హెల్తీ కాంబో.. కోడిగుడ్లు, పనీర్. వీటి తర్వాత చికెన్, శనగలు ఉన్నాయి.2025 నాటి డేటా ప్రకారం.. యాప్లో అత్యధికంగా వెతికిన ప్రోటీన్ పదం ‘పీనట్ బటర్’. రెండో స్థానంలో గ్రీక్ యోగర్ట్ నిలిచింది.చెన్నై యూజర్ రికార్డ్: ప్రోటీన్ డైట్ కోసం ఒక చెన్నై వినియోగదారుడు ఏకంగా రూ.2,71,385 ఖర్చు చేశాడు. ఇందులో ఎక్కువ భాగం పీనట్ ఆధారిత ప్రోటీన్ స్టేపుల్స్ ఉండటం విశేషం.ట్రెండీ స్నాక్స్ వైపు మొగ్గు..సాధారణ చిప్స్, స్నాక్స్ స్థానంలో ఇప్పుడు హెల్తీ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ప్రోటీన్ యోగర్ట్, ప్రోటీన్ స్నాక్స్ (ప్రోటీన్ చిప్స్) కేటగిరీ ఏటా ఏకంగా 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. యువత ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇటువంటి హై-ప్రోటీన్ స్నాక్స్ను ఎంచుకుంటున్నారు.సాంప్రదాయ ప్రోటీన్కు డిమాండ్ఆధునిక మార్పులు వస్తున్నప్పటికీ మన దేశీయ పాతకాలపు ప్రోటీన్ వనరుల క్రేజ్ తగ్గలేదు. భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ అయిన సోయా చంక్స్, సత్తు (వేయించిన శనగల పిండి)ల డిమాండ్లో కూడా 100 శాతానికి పైగా వృద్ధి కనిపించింది. మొత్తంగా చూస్తే.. భారతదేశంలో క్విక్ కామర్స్ విప్లవం వస్తువులను వేగంగా డెలివరీ చేయడంతోపాటు ప్రజలు మరింత ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రోటీన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
నేడు టాటా సన్స్ భేటీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్లోని పలు అన్లిస్టెడ్ సంస్థల నష్టాలు భారీగా పెరుగుతున్న తరుణంలో టాటా సన్స్ బోర్డు మంగళవారం (నేడు) సమావేశం కానుంది. ఈ సందర్భంగా సంస్థల ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునరి్నయామకం అంశం చర్చకు రాకపోవచ్చని పేర్కొన్నాయి.టాటా గ్రూప్లో అంతర్గతంగా విభేదాలు నెలకొన్న పరిస్థితుల్లో టాటా సన్స్ బోర్డు సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్లో భాగమైన అన్లిస్టెడ్ సంస్థలు రూ. 10,905 కోట్ల నష్టాలు ప్రకటించాయి. అటుపైన ఇవి రూ. 29,000 కోట్లకు చేరి ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
హైదరాబాద్ ఫార్మా కంపెనీ లాభం హైజంప్
హైదరాబాద్: ఫార్మాస్యూటికల్స్ రంగ కంపెనీ సాయి పేరెంటరల్స్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు ప్రకటించింది. క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం భారీగా జంప్చేసి రూ. 13 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1.6 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 74 కోట్ల నుంచి రూ. 201 కోట్లకు ఎగసింది.నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 6 కోట్ల నుంచి రూ. 29 కోట్లకు మెరుగుపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 45 శాతం వృద్ధితో రూ. 14 కోట్లను అధిగమించింది. 2024–25లో రూ. 10 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 159 కోట్ల నుంచి రూ. 381 కోట్లకు జంప్ చేసింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. -
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్లో కొత్త పద్ధతి!
రైల్వే కౌంటర్లలో తత్కాల్ టికెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాసే ప్రయాణికుల ఇబ్బందులకు స్వస్తి పలికేందుకు భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. పశ్చిమ మధ్య రైల్వే (WCR) పరిధిలోని ప్రతిష్టాత్మక కోటా డివిజన్ తన పరిధిలోని అన్ని రైల్వే స్టేషన్లలో వినూత్నమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెట్టింది. తత్కాల్ బుకింగ్ ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, కౌంటర్ల వద్ద తోపులాటలు, గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కోటా డివిజన్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త విధానం ఎలా పనిచేస్తుంది?కౌంటర్ల వద్ద క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు రైల్వే శాఖ ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ప్రయాణికులు ముందుగా నిర్ణయించిన సమయానికి బుకింగ్ కార్యాలయానికి చేరుకోవాలి. కౌంటర్ సిబ్బంది నుండి కేటగిరీకి సంబంధించిన టోకెన్ను తీసుకోవాలి. టోకెన్ నంబర్ల వరుస క్రమం ఆధారంగానే ప్రయాణికులను కౌంటర్ వద్దకు అనుమతిస్తారు. మీ వంతు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తత్కాల్ టికెట్ పొందవచ్చు.టోకెన్ పంపిణీ సమయాలు ఇవే..తత్కాల్ బుకింగ్ ప్రారంభం కావడానికి ముందే కౌంటర్ల వద్ద ఈ టోకెన్ల పంపిణీ జరుగుతుంది. ఏసీ క్లాస్ (AC Classes) కేటగిరీ ప్రయాణికులకు ఉదయం 9:00 నుండి 9:25 వరకు టోకెన్లు ఇస్తారు. ఉదయం 10:00 గంటలకు తత్కాల్ బుకింగ్ ప్రారంభవుతుంది. ఇక స్లీపర్ క్లాస్ (Sleeper Class) ప్రయాణికులకు ఉదయం 9:30 నుండి 9:55 వరకు టోకెన్ పంపిణీ ఉంటుంది. ఉదయం 11:00 గంటలకు తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం మొదలవుతుంది. సాధారణ రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణ తేదీకి ఒక రోజు ముందే తత్కాల్ విండో తెరుచుకుంటుంది. కౌంటర్లతో పాటు ఐఆర్సీటీసీ (IRCTC) అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా డిజిటల్గా తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.రైల్వే చార్ట్ తయారీలో మార్పులుప్రయాణికుల సౌకర్యార్థం రైలు బయలుదేరే సమయాన్ని బట్టి మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారీ సమయాలను కూడా రైల్వే శాఖ ఇటీవల పునరుద్ధరించింది. ఉదయం 05:01 నుండి మధ్యాహ్నం 14:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు ప్రయాణానికి ముందటి రోజు రాత్రి 20:00 గంటల (8:00 PM) లోపు మొదటి చార్ట్ సిద్ధం చేస్తారు. మధ్యాహ్నం 14:01 నుండి రాత్రి 23:59 వరకు, అర్ధరాత్రి 00:00 నుండి తెల్లవారుజామున 05:00 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు రైలు ప్రయాణ సమయానికి కనీసం 10 గంటల ముందే మొదటి రిజర్వేషన్ చార్ట్ తయారు చేశారు.రైల్వే కౌంటర్ల వద్ద దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు, సాధారణ ప్రయాణికులకు సులభంగా టికెట్లు అందించేందుకు కోటా డివిజన్ తెచ్చిన ఈ టోకెన్ విధానం ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇదే పద్ధతిని ఇతర రైల్వే డివిజన్లలోనూ అమలు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. -
కస్టమర్ల ఇళ్లలో కెమెరాల కలకలం
బెంగళూరుకు చెందిన ప్రముఖ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ ప్రోంటో ప్రస్తుతం సాంకేతిక, నైతిక వివాదంలో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు కస్టమర్ల ఇళ్లలో వీడియోలను రికార్డ్ చేయడానికి తన సిబ్బందిని ఉపయోగించిందనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో టెక్ స్టార్టప్ ‘హ్యూమన్ ఆర్కైవ్’ వ్యవస్థాపకుడు రుషిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.నాడు ఎగతాళి చేశారు.. నేడు అదే చేస్తున్నారుభవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లు, ఫిజికల్ ఏఐ వ్యవస్థల శిక్షణ కోసం మానవ ప్రవర్తన, కదలికలు, రియల్ వరల్డ్ పరస్పర చర్యలను (ఉదాహరణకు: లైవ్లో ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వస్తువులను సర్దడం) రికార్డ్ చేసే పనుల్లో ‘హ్యూమన్ ఆర్కైవ్’ సంస్థ నిమగ్నమై ఉంది. ఈ అంశంపైనే కొన్ని నెలల క్రితం (జనవరిలో) తాను ప్రోంటో వ్యవస్థాపకురాలు అంజలి సర్దానాతో చర్చించానని రుషిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఆలోచనను తీవ్రంగా ఎగతాళి చేసిందని ఆయన ఆరోపించారు.‘జనవరిలో నేను అంజలి సర్దానాతో మాట్లాడినప్పుడు ఆమె నన్ను చూసి నవ్వింది. ఇలాంటి డేటా సేకరిస్తున్నందుకు నన్ను ఒక తెలివితక్కువవాడిగా చిత్రీకరించింది. స్టార్టప్ వ్యవస్థాపకులను తక్కువ చేసి మాట్లాడటం ఆమెకు అలవాటు. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ను పట్టుకోవడానికి వాళ్లే ఆపసోపాలు పడుతున్నారు’ అని రుషిల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.ఏడాదిలో భారీ వాల్యుయేషన్.. కానీ..23 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అంజలి సర్దానా నేతృత్వంలోని ప్రోంటో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. యూఎస్లోని జార్జ్టౌన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన అంజలి గతంలో బైన్ క్యాపిటల్, 8వీసీ వంటి ప్రతిష్టాత్మక వెంచర్ సంస్థల్లో పనిచేశారు. ఏప్రిల్ 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఇళ్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంటగది-బాత్రూమ్ క్లీనింగ్, లాండ్రీ వంటి సర్వీసుల కోసం కస్టమర్లను శిక్షణ పొందిన గృహ కార్మికులతో అనుసంధానిస్తుంది. ఇది ప్రారంభమైన ఏడాదిలోపే దీని వాల్యుయేషన్ 100 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ‘కెమెరా వివాదం’ సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా కనిపిస్తోంది.కెమెరాలు ఎందుకోసమంటే..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రోంటో కంపెనీ ఇళ్లలో కెమెరాలు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. భవిష్యత్తులో మనుషులతో సంబంధం లేకుండా ఇళ్లలో స్వయంగా పనులు చేయగల హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేయడానికి ఈ కెమెరా రికార్డింగులు అత్యంత కీలకం.అది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే..కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రోంటో సంస్థ అధికారికంగా స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కస్టమర్లు స్వచ్ఛందంగా అంగీకరించి ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప సిబ్బంది ఇళ్లకు కెమెరాలతో వెళ్లరు. ఈ అనుమతి ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు, ప్రతి బుకింగ్కు ముందు కస్టమర్ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ కేవలం 0.1% మంది కస్టమర్ల వద్ద మాత్రమే నడుస్తోంది. దేశంలో అమలులో ఉన్న డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్ట నిబంధనలకు కట్టుబడే నెలల తరబడి కసరత్తు చేసి ఈ ప్రక్రియను రూపొందించాం’ అని సంస్థ తెలిపింది. ఏఐ, రోబోటిక్స్ రంగాన్ని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ రంగంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ఏకైక సంస్థ తమది మాత్రమే కాదని ప్రోంటో స్పష్టం చేసింది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
టిక్కెట్ల రద్దు ఛార్జీల దోపిడీపై కేంద్రం సీరియస్
ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్లు(ఓటీఏ) వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న భారీ రద్దు చార్జీల (క్యాన్సిలేషన్ ఛార్జీలు) వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. విమానయాన సంస్థలు నిర్ణయించిన రుసుముల కంటే అదనంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న టిక్కెట్ రద్దు ఛార్జీలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖతో పాటు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) తక్షణమే రంగంలోకి దిగి అన్ని ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ల విధానాలపై దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.పారదర్శకతకు పాతర.. చట్టప్రకారం చర్యలు!ఈ అంశంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఆన్లైన్ బుకింగ్ సంస్థల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘విమానయాన సంస్థలు అధికారికంగా వసూలు చేసే ఛార్జీల కంటే ఎక్కువగా లేదా బుకింగ్ సమయంలో వినియోగదారులకు స్పష్టంగా వెల్లడించకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఇష్టారాజ్యంగా అదనపు రద్దు ఛార్జీలు వసూలు చేస్తున్నాయనే అంశంపై విచారణకు ఆదేశించాం. ఇటువంటి చర్యలు మార్కెట్లో పారదర్శకతను దెబ్బతీయడమే కాకుండా వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి’ అని ప్రహ్లాద్ జోషి అన్నారు.ఒకవేళ విచారణలో ఈ ప్లాట్ఫామ్లు వినియోగదారుల హక్కులను ఉల్లంఘించినట్లు లేదా అక్రమ వ్యాపార పద్ధతులకు పాల్పడినట్లు తేలితే.. ‘వినియోగదారుల రక్షణ చట్టం-2019’ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అవసరమైతే బాధితుల తరఫున సీసీపీఏ ద్వారా ‘క్లాస్ యాక్షన్’ (ఉమ్మడి చట్టపరమైన చర్యలు) తీసుకునేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు.అసలు వివాదం ఎక్కడ మొదలైంది?భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యదర్శి తేజీందర్ బగ్గా చేసిన సోషల్ మీడియా పోస్ట్తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరుగా ఎయిర్లైన్ సంస్థ ద్వారా బుక్ చేసుకునే టికెట్ రద్దు ఛార్జీలకు, థర్డ్-పార్టీ ఆన్లైన్ ట్రావెల్ యాప్ల ద్వారా బుక్ చేసుకునే ఛార్జీలకు మధ్య వ్యత్యాసం ఉంటోందని ఆయన ఆధారాలతో సహా పోస్ట్ చేశారు.విచారణ పరిధిలోకి అన్ని ప్లాట్ఫామ్లుకేవలం ఒక్క సంస్థపైనే కాకుండా దేశంలో సేవలందిస్తున్న అన్ని ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ల (ఉదాహరణకు మేక్మైట్రిప్, ఈజ్మైట్రిప్, క్లియర్ట్రిప్, యాత్ర, అగోడా మొదలైనవి) రద్దు విధానాలు, వారు విధిస్తున్న హిడెన్ ఛార్జీలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగనుందని మంత్రి జోషి పేర్కొన్నారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
సెంట్రల్ బ్యాంక్ ఆఫర్ నేడు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విండో నేడు(25న) రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు ఓపెన్ కానుంది. గత వారాంతాన సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి ఆఫర్కు 2.35 రెట్లు అధికంగా స్పందన లభించింది. తొలి రోజు(22న) రూ. 2,380 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. దీంతో ప్రభుత్వం గ్రీన్ షూ ఆప్షన్ను వినియోగించుకోవడం ద్వారా బ్యాంక్లో మొత్తం 8 శాతం వాటా విక్రయించనున్నట్లు దీపమ్ కార్యదర్శి అరునిష్ చావ్లా ఎక్స్లో పేర్కొన్నారు. ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రభుత్వం తొలుత 4 శాతం వాటా ఆఫర్ చేసింది. అధిక స్పందన లభిస్తే మరో 4 శాతం వాటా సైతం విక్రయించనుంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 31కాగా.. 8 శాతం వాటాకు ప్రభుత్వం రూ. 2,456 కోట్లు అందుకోనుంది. ప్రభుత్వం తొలుత 32.58 కోట్ల షేర్లు(4 శాతం వాటా) ఆఫర్ చేయగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి రూ. 2,380 కోట్ల విలువైన 76.86 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. సెంట్రల్ బ్యాంక్ ద్వారా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27)లో తొలిసారి ఓఎఫ్ఎస్కు తెరతీసింది. తాజా ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం పబ్లిక్కు కనీస వాటా(25 శాతం) అంశంలో మరింత ముందుకెళ్లనుంది. ప్రస్తుతం బ్యాంక్లో ప్రభుత్వ వాటా 89.27 శాతంగా ఉంది. ఓఎఫ్ఎస్ తదుపరి 81.27 శాతానికి దిగిరానుంది. ఓఎఫ్ఎస్ ధర గురువారం ముగింపుతో పోలిస్తే 8.6% డిస్కౌంట్ కాగా.. శుక్రవారం షేరు 8% పతనమై రూ. 31.3 వద్ద ముగిసింది. -
నన్ను జాబ్ నుంచి తొలగించండి.. మెటా ఉద్యోగిని
మెటా సంస్థ ఇటీవలే భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో జూలీ బోన్ అనే ఉద్యోగిని కూడా ఉన్నారు. అయితే.. ఈమె తనకు తానుగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు.. లింక్డ్ఇన్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.జూలీ బోన్ కంపెనీలో జరుగుతున్న ఉద్యోగాల కోతల్లో తన పేరును కూడా చేర్చాలని స్వయంగా కోరినట్లు వెల్లడించింది. ఈమె సంస్థలో ఆరేళ్లు పనిచేసింది. అయితే ఇప్పుడు ఉద్యోగాన్ని వదులుకోవాలనుకోవడం ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని పేర్కొంది. చాలా కాలంగా కంపెనీ లక్ష్యాలు, తన వ్యక్తిగత ఆశయాలు వేర్వేరు దారుల్లో సాగుతున్నాయని ఆమె భావించింది. అందుకే తన వ్యక్తిగత జీవితానికి సరైన సమయం వచ్చిందని భావించి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకుందన్నారు.అంతేకాకుండా.. తాను స్వచ్ఛందంగా బయటకు వస్తే సంస్థలో కొనసాగాలని కోరుకునే మరో ఉద్యోగికి అవకాశం దక్కవచ్చనే ఆలోచన కూడా తనలో ఉందని పేర్కొన్నారు. మెటాలో పని చేసిన కాలంలో ఏఐ ఆధారిత నైపుణ్యాలను కూడా నేర్చుకున్నానని జూలీ వెల్లడించింది. కొత్త ఆలోచనలను రూపొందించడానికి, కోడింగ్ సమస్యలను పరిష్కరించడానికి ఏఐ టూల్స్ ఉపయోగించడం నేర్చుకున్నానని తెలిపింది.ప్రస్తుతం మెటాలో 'AI-first' విధానం అమల్లో ఉందని, ఉద్యోగులు ఏఐ టెక్నాలజీకి అనుగుణంగా తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆమె వివరించింది. అయితే.. ఏఐ నేర్చుకోవడం మాత్రమే ఉద్యోగ భద్రతకు హామీ కాదని జూలీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను రక్షించాలంటే.. సంస్థలు, ఉద్యోగులు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా, మానవ సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంస్కృతిక అవగాహన వంటి అంశాలు ఎంతో ముఖ్యమని జూలీ నమ్మకం. మెటాలో చేసిన పనుల్లో ముఖ్యంగా బ్రాండ్ వాయిస్, లోకలైజేషన్ రంగాల్లో పనిచేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె వెల్లడించారు.ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్న జూలీ, భవిష్యత్తులో సృజనాత్మకతకు, ఎడిటోరియల్ తీర్పుకు, స్పష్టమైన కమ్యూనికేషన్కు ప్రాధాన్యం ఇచ్చే సంస్థల్లో అవకాశాలను వెతుకుతానని వెల్లడించింది. మొత్తం మీద ఈమె వ్యాఖ్యలు.. ప్రస్తుతం ఏఐ ప్రభావం, ఉద్యోగ భద్రత, టెక్నాలజీ రంగంలో మారుతున్న పని సంస్కృతి వంటి అంశాలపై విస్తృత చర్చకు దారితీశాయి. -
యూపీఐ ఆటోపే.. ఎయిర్టెల్ బ్యాంక్ సత్తా!
డిజిటల్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి 73 శాతం వృద్ధితో రూ.109 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024–25)లో నికర లాభం రూ.63 కోట్లుగా నమోదైంది. మరోవైపు వార్షిక ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.2024–25లో రూ.2,709 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2025–26 నాటికి రూ.3,207 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ కస్టమర్ల డిపాజిట్ బ్యాలెన్స్ కూడా 26 శాతం వృద్ధితో రూ.4,612 కోట్లకు చేరింది.యూపీఐ ఆటోపేలో దూకుడు: ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బ్యాంక్ అందిస్తున్న ‘సేఫ్ సెకండ్ అకౌంట్’ కు కస్టమర్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. ‘యూపీఐ ఆటోపే’ మ్యాండేట్స్ విభాగంలో రెండో అతిపెద్ద ప్లేయర్గా బ్యాంక్ అవతరించింది. -
పిల్లలకు విద్య, క్రీడలు అవసరం: నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ & వ్యవస్థాపకురాలు 'నీతా అంబానీ' విద్య, క్రీడలు ప్రతి చిన్నారి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలని ముంబై ఇండియన్ జట్టుకు వివరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.'అందరికీ విద్య, క్రీడలు' అనే కార్యక్రమంలో నీతా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పేద, వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యతో పాటు క్రీడల్లో అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సందర్భంగా.. వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ను వీక్షించేందుకు దాదాపు 20 వేల మంది నిరుపేద పిల్లలను ఆహ్వానించారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఈ మ్యాచ్ చిన్నారులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించింది. క్రీడలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, జట్టు భావన పెంచుతాయని నీతా అంబానీ పేర్కొన్నారు.“𝙔𝙤𝙪 𝙖𝙡𝙨𝙤 𝙨𝙢𝙞𝙡𝙚 𝙖𝙣𝙙 𝙢𝙖𝙠𝙚 𝙩𝙝𝙚 𝙘𝙝𝙞𝙡𝙙𝙧𝙚𝙣 𝙖𝙡𝙨𝙤 𝙨𝙢𝙞𝙡𝙚!”A special message to the squad from Mrs Nita Ambani ahead of today’s special Reliance Foundation #ESAMatchDay! 💙#MumbaiIndians #OneFamily pic.twitter.com/SOTmsrNnMS— Reliance Foundation (@ril_foundation) May 24, 2026 -
పేటీఎంలో బ్లాక్ డీల్.. చేతులు మారిన రూ.963 కోట్ల షేర్లు
న్యూఢిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్లో 1.34 శాతం వాటా బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారింది. గోల్డ్మన్ సాక్స్, సొసైటే జనరల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అలాగే సుందరం మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వంటి దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఈ షేర్లను కొనుగోలు చేశాయి.మొత్తం 85.98 లక్షల షేర్లను ఒక్కోటి సగటున రూ.1,120.65 ధరకు కొనుగోలు చేయగా, డీల్ విలువ రూ.963.60 కోట్లకు చేరింది. ఈ షేర్లను హాంకాంగ్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీదారు ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్, గురుగ్రామ్కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ ఎలివేషన్ క్యాపిటల్లు విక్రయించాయి. ఈ లావాదేవీ అనంతరం వన్97 కమ్యూనికేషన్స్లో ఎస్ఏఐఎఫ్ పార్ట్నర్స్ వాటా 13.43% నుంచి 12.18 శాతానికి తగ్గింది. -
పన్ను వివాదం.. కోట్లు విరాళం ఇచ్చిన సీఈఓ!
అమెరికాలో కొనసాగుతున్న పన్నుల వివాదం.. మధ్య సెర్గే బ్రిన్ తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. ఓవర్పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్న వివాదాస్పద పన్ను ప్రతిపాదనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ కమిటీకి ఈయన 5 లక్షల డాలర్లు (సుమారు రూ.4.80 కోట్లు) విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా.. వ్యాపార సంస్థలకు అనుకూలంగా భావిస్తున్న మరో పన్ను ప్రతిపాదనకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో రెండు ముఖ్యమైన పన్ను ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. అవి 'మెజర్ సీ, మెజర్ డి'. వీటిపై జూన్ 2న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.మెజర్ Cకు వ్యాపార వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ప్రతిపాదన ప్రకారం.. చిన్న వ్యాపార సంస్థలకు పన్ను మినహాయింపు పరిమితిని 5 మిలియన్ డాలర్ల నుంచి 7.5 మిలియన్ డాలర్ల వరకు పెంచుతారు. దీని వల్ల చిన్న కంపెనీలకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. అయితే.. పెద్ద కంపెనీలపై పన్ను భారం కొంత పెరుగుతుంది. అయినప్పటికీ, నగర ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతూనే చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడమే దీని లక్ష్యమని మద్దతుదారులు చెబుతున్నారు.ఇక మెజర్ D మాత్రం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని ఓవర్పెయిడ్ సీఈఓ ట్యాక్స్ అని పిలుస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం కంపెనీల్లో సీఈఓల జీతాలు, సాధారణ ఉద్యోగుల జీతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల ఆధారంగా లెక్కిస్తారు. అంతేకాకుండా.. పన్ను రేట్లు పెరగడంతో పాటు భవిష్యత్తులో వాటిని తగ్గించడం కూడా కష్టమవుతుంది.కార్మిక సంఘాలు, కొన్ని సంస్థలు మెజర్ డీ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నాయి. ధనిక కంపెనీలు సమాజానికి తగిన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. కానీ వ్యాపార వర్గాలు మాత్రం.. ఈ విధానం వల్ల కంపెనీలు నగరాన్ని విడిచి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో ఆఫిసులు ఖాళీ అవడం, కంపెనీలు ఇతర ప్రాంతాలకు మారడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ పన్ను విధానం ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు.సెర్గే బ్రిన్ కూడా అధిక పన్నుల విధానాలకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. 1979లో తన కుటుంబం సోవియట్ యూనియన్లోని సామ్యవాద పాలన నుంచి అమెరికాకు వలస వచ్చిందని గుర్తుచేసుకుంటూ, 'సోషలిజం సమాజాన్ని ఎలా దెబ్బతీస్తుందో నేను స్వయంగా చూశాను. కాలిఫోర్నియా కూడా అలాంటి పరిస్థితికి వెళ్లకూడదు' అని వ్యాఖ్యానించారు.కాగా.. బ్రిన్ ఇటీవల తన నివాసాన్ని సిలికాన్ వ్యాలీ నుంచి నెవాడాలోని లేక్ టాహో సమీప ప్రాంతానికి మార్చినట్లు సమాచారం. నెవాడాలో కాలిఫోర్నియా మాదిరిగా అధిక రాష్ట్ర పన్నులు లేకపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్! -
ఆ టీమ్ వల్లే సమస్యలు.. అందుకే లేఆఫ్స్!
అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్టెక్ సంస్థ బోల్ట్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. తన మొత్తం హ్యూమన్ రిసోర్సెస్ (HR) విభాగాన్ని తొలగించింది. అంతేకాకుండా, మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 30 శాతం మందిని కూడా ఉద్యోగాల నుంచి తీసివేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ సీఈఓ రయాన్ బ్రెస్లో సమర్ధించడం మరింత సంచలనం సృష్టించింది.హెచ్ఆర్ విభాగం కంపెనీలో అసలు లేని సమస్యలను సృష్టిస్తోందని.. ఆ టీమ్ను తొలగించిన తర్వాత సమస్యలు కూడా మాయమయ్యాయని రయాన్ బ్రెస్లో పేర్కొన్నారు. కంపెనీని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి, పనితీరు మెరుగుపరచడానికి ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.బోల్ట్ సంస్థను రయాన్ బ్రెస్లో 2014లో ప్రారంభించారు. ఇది చాలా తక్కువ కాలంలోనే అమెరికాలో అత్యంత వేగంగా ఎదిగిన ఫిన్టెక్ స్టార్టప్లలో ఒకటిగా మారింది. కానీ.. 2022లో ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకున్న తర్వాత సంస్థ విలువ తగ్గడం ప్రారంభమైంది. ఆ తరువాత అనేకసార్లు ఉద్యోగుల తొలగింపులు జరిగాయి. 2025లో తిరిగి కంపెనీ బాధ్యతలను బ్రెస్లో చేపట్టారు. తరువాత కీలక మార్పులు చేసారు.ప్రస్తుతం బోల్ట్ సంస్థలో కేవలం 100 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య గతంతో పోలిస్తే చాలా తక్కువ. అయినప్పటికీ, కంపెనీ పనితీరు మెరుగైందని బ్రెస్లో చెబుతున్నారు. కస్టమర్లకు వేగంగా సేవలు అందుతున్నాయని, ఉద్యోగుల పనితీరు కూడా మెరుగుపడిందని తెలిపారు.ఇదీ చదవండి: కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు! -
కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!
పెంపుడు జంతుల మీద ప్రేమ చూపించేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు మొదలైనవాటి కోసం ఎంతైనా ఖర్చుపెట్టే రోజులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అమెరికాలో 'డాగ్ నానీ'లకు డిమాండ్ ఎక్కువైంది. ధనిక కుటుంబాలు తమ పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని చూసుకునే ప్రొఫెషనల్ కేర్టేకర్లను నియమించుకుంటున్నారు. అధికమొత్తంలో జీతాలు కూడా ఇస్తున్నారు.అమెరికాలో ఫుల్టైమ్ డాగ్ నానీలు వారానికి 2,500 డాలర్లకుపైగా, అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.2.4 లక్షలు వరకు సంపాదిస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.కరోనా లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం వల్ల.. తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపారు. దీంతో వాటిపై అనుబంధం పెరిగింది. ఫలితంగా పెంపుడు జంతువుల సంరక్షణను కూడా చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ధనిక కుటుంబాలు తమ కుక్కల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం సాధారణమవుతోంది.డాగ్ నానీల పని కేవలం కుక్కను బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు. వాటికి సమయానికి ఆహారం పెట్టడం, వాకింగ్ చేయించడం, గ్రూమింగ్ అపాయింట్మెంట్లు బుక్ చేయడం, మందులు ఇవ్వడం, యజమానులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లడం వంటి బాధ్యతలూ ఉంటాయి. కొందరు నానీలు యజమానులు ఇళ్లలోనే ఉంటారు. వారికి వసతి, భోజనం, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు కూడా యజమానులే భరిస్తున్నారు.కుక్కలను సంరక్షించడంలో అనుభవం ఉన్నవారు గంటకు 40 నుంచి 50 డాలర్లు సంపాదిస్తున్నారు. మరికొందరు రోజుకు 500 నుంచి 800 డాలర్ల వరకు సంపాదించుకుంటున్నట్లు సమాచారం. గతంలో బ్రిటన్లో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క కోసం సంవత్సరానికి లక్ష పౌండ్ల (రూ. కోటి కంటే ఏక్కువ) జీతంతో డాగ్ నానీ ఉద్యోగ ప్రకటన ఇచ్చి వార్తల్లో నిలిచింది.పెట్ కేర్ రంగం ఉత్తర అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెట్ సిట్టింగ్, జంతు సంరక్షణ సేవలకు సంబంధించిన లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన లేదా సర్టిఫికేషన్ ఉన్న కేర్టేకర్లు మరింత ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం పెరుగుతున్న కొద్దీ ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం! -
‘ఇంటికి వచ్చేయండి.. భారత్ గర్వపడేలా చేద్దాం’
అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివసిస్తూ గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు మరోసారి విజ్ఞప్తి చేశారు. పరాయి దేశంలో అనిశ్చితి మధ్య కాలం వెళ్లదీసే కంటే స్వదేశానికి తిరిగి వచ్చి దేశ వృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘దయచేసి మాతృభూమికి తిరిగి వచ్చేయండి. ఇది కొంత కష్టంతో కూడుకున్నది. త్యాగంతో కూడినదే కావచ్చు.. కానీ, జీవితంలో ఆత్మగౌరవం అనేదే మీ మార్గాన్ని నిర్దేశించాలి. అంతా కలిసి భారత్ గర్వపడేలా చేద్దాం’ అంటూ ఆయన ఎక్స్ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఇటీవల గ్రీన్ కార్డ్ నిబంధనలపై చేసిన ఒక కఠినమైన ప్రకటనను ఉటంకిస్తూ శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తాత్కాలికంగా యూఎస్లో ఉంటూ, గ్రీన్ కార్డ్ కోరుకునే ఏ విదేశీయుడైనా సరే.. దరఖాస్తు ప్రక్రియ కోసం ముందుగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. మా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లొసుగులను వాడుకోవడానికి బదులు, చట్టం తన పని తాను చేసుకుపోయేందుకే ఈ విధానాన్ని తెచ్చాం. దేశ వలస విధానాన్ని దుర్వినియోగం చేసే కాలం ఇక ముగిసింది’ అని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.డీహెచ్ఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికాలోని భారతీయ టెక్ ఉద్యోగుల్లో కలకలం రేపాయి. గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లు, ఇమ్మిగ్రేషన్ అనిశ్చితి, హెచ్-1బీ వీసాదారుల భవిష్యత్తుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ వెంబు స్పందిస్తూ భారతీయులకు స్వదేశీ పిలుపునిచ్చారు.నెటిజన్లలో భిన్నాభిప్రాయాలువెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, ఏఐ ఇండస్ట్రీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతంగా వృద్ధి చెందాయని పలువురు వెంబు వ్యాఖ్యలను సమర్థించారు. భారత్లోనే ఇప్పుడు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో అమెరికా తరహా భారీ జీతాలు లేకపోవడం, అధిక పన్నులు, టాక్సిక్ వర్క్ కల్చర్, మౌలిక సదుపాయాల కొరత, జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని కొందరు ఎత్తి చూపారు.‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనాశ్రీధర్ వెంబు కేవలం పిలుపునివ్వడమే కాకుండా స్వయంగా ‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనాను అమలు చేసి చూపిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ తరహా కేంద్రీకృత మోడల్ను వ్యతిరేకించే ఆయన సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జోహో తన కార్యకలాపాలను పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా తమిళనాడులోని తెన్కాసి వంటి చిన్న పట్టణాలకు విస్తరించింది.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
గ్రీన్ కార్డ్ విధానంపై ఇండస్ట్రీలో అలజడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా టెక్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయంగా ఉన్న ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.అమెరికా ఏఐ భవిష్యత్తుకే ముప్పుతాజా గ్రీన్ కార్డ్ మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అమెరికా టెక్ ఎకోసిస్టమ్లో శ్రమిస్తున్న ఏఐ పరిశోధకులు, కీలక ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ సుదీర్ఘ బ్యాక్లాగ్ ప్రక్రియ కోసం దేశాన్ని విడిచి వెళ్లాలా? ఇది టెక్ రంగానికే కాదు, మొత్తం అమెరికా వ్యాపార రంగానికి కోలుకోలేని హాని కలిగించే చర్య’ అని హాఫ్మాన్ విమర్శించారు.ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, కోర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఎన్జీ సైతం ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైట్ హౌస్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమైన వలసలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందన్నారు. కృత్రిమ మేధ రంగంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడే శక్తిని కోల్పోతుందని హెచ్చరించారు.స్టార్టప్లకు ముప్పుఅక్రమ వలసలను అరికట్టే చర్యలను తాము సమర్థిస్తామని, అయితే నైపుణ్యం కలిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్టార్టప్ వ్యవస్థాపకులు అభిప్రాయపడుతున్నారు. బూమ్ సూపర్సోనిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్లేక్ స్కోల్ స్పందిస్తూ..‘ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అమెరికాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ O1 లేదా H1B వీసాలపై పనిచేస్తున్న అత్యున్నత స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, బిలియన్ డాలర్ల కంపెనీల వ్యవస్థాపకులు ఇప్పుడు తమ పనిని ఆపేసి స్వదేశాలకు వెళ్లిపోవాలా? ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ క్లియరెన్స్ కోసం వారు తమ దేశాల్లో వేచి ఉండటం అసాధ్యం. యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం ప్రాణసంకటంగా మారుతుందని డేవిడోవ్ వెంచర్స్ ఫౌండర్, నిక్ డేవిడోవ్ గుర్తుచేశారు.చట్టసభ సభ్యుల ఆగ్రహంఈ కొత్త నిబంధన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కుదేలు చేస్తుందని చట్టసభ ప్రతినిధి యెవెట్ క్లార్క్ మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న కష్టజీవులను దేశం నుంచి తరిమికొట్టడమేనని, విచ్ఛిన్నమైన వ్యవస్థను ఈ నిర్ణయం మరింత సర్వనాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
మిడిల్ మేనేజ్మెంట్ అంతం?
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు ఉద్యోగ మార్కెట్ను తిరగరాస్తున్నాయి. నిన్నటివరకు ఏఐ కేవలం క్లిష్టమైన కోడింగ్ లేదా క్రియేటివ్ పనులను మాత్రమే ప్రభావితం చేస్తుందని భావించిన కార్పొరేట్ లోకానికి క్లౌడ్ ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ షాకింగ్ నిజాలను వెల్లడించారు. ఏఐ కాలగర్భంలో కలిసిపోయే ఉద్యోగాలు ఏవి? భవిష్యత్తులో మనుగడ సాగించే విభాగాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కంపెనీ అద్భుతమైన వృద్ధి రేటుతో దూసుకుపోతున్నప్పటికీ తమ ఉద్యోగుల్లో ఏకంగా 20 శాతానికి పైగా సిబ్బందిని తొలగించామని ప్రిన్స్ ప్రకటించడం ఐటీ రంగాన్ని విస్మయానికి గురిచేసింది.ఆర్థిక సంక్షోభం కాదు.. ఏఐ తెచ్చిన మార్పు!సాధారణంగా ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగించిందంటే దానికి ఆర్థిక నష్టాలు లేదా వ్యాపార మందగమనం కారణం అవుతుంది. కానీ, క్లౌడ్ ఫ్లేర్ కథ వేరు. కంపెనీ 30 శాతానికి పైగా బలమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఉచిత నగదు ప్రవాహం కూడా బలంగా ఉంది. మరి ఈ లేఆఫ్స్కు కారణం ఏమిటి? దీనికి సీఈఓ మాథ్యూ ప్రిన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పష్టతనిచ్చారు.‘అమెరికా వ్యాపార చరిత్రలోనే 30 శాతానికి పైగా వృద్ధి చెందుతున్న ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగుల్లో 20 శాతం కంటే ఎక్కువ మందిని తొలగించిన దాఖలాలు లేవు. ఇది ఆర్థిక పనితీరు వల్ల జరిగింది కాదు.. ఏఐ వల్ల కంపెనీ నిర్వహణ శైలిలో వస్తున్న మార్పుల వల్ల జరిగింది’ అన్నారు.టార్గెట్ మిడిల్ మేనేజ్మెంట్చాలామంది ఎగ్జిక్యూటివ్లు ఏఐ మొదట ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే విషయంలో తప్పుడు అంచనాలతో ఉన్నారని ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. ‘ఏఐ ప్రాథమికంగా బిల్డర్లు (ఉత్పత్తులను తయారు చేసేవారు) లేదా సెల్లర్లు (విక్రయించేవారు) జోలికి వెళ్లడం లేదు. దానికి బదులు వ్యాపార పనితీరును అంచనా వేసే, పర్యవేక్షించే, నివేదికలు ఇచ్చే మెజర్మెంట్ (కొలత/పర్యవేక్షణ) పాత్రలను తుడిచిపెట్టేస్తోంది’ అన్నారు.ఏఐ పర్యవేక్షణ ఎందుకు సమర్థవంతమైనది?గతంలో కంపెనీలు తమ వ్యాపార నష్టాలను, పురోగతిని ప్రతి త్రైమాసికానికి ఒకసారి మాన్యువల్గా సమీక్షించేవి. కానీ ఇప్పుడు ఏఐ సాధనాలు నిరంతరాయంగా కార్యకలాపాలను ఆడిట్ చేయగలవు. గతంలో మానవ మేధస్సుకు కష్టతరమైన సామర్థ్యాలను ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. ఏఐ పుణ్యమా అని పెద్ద టీమ్లను పర్యవేక్షించడం మేనేజర్లకు సులువైంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్మెంట్ అవసరం లేకుండా పోయింది. ‘గత వారం మేము తొలగించిన వారిలో ఎక్కువ మంది ఇలాంటి ‘మెజర్మెంట్’ పాత్రల్లో ఉన్నవారే’ అని ప్రిన్స్ స్పష్టం చేశారు.ఏఐ యుగంలో మనుగడ సాగించేవి ఇవే..మాథ్యూ ప్రిన్స్ విశ్లేషణ ప్రకారం.. ఏఐ ఎంత వేగంగా విస్తరించినప్పటికీ మార్కెట్లో స్థిరంగా నిలబడేవి, భవిష్యత్తులో కంపెనీలకు అత్యంత అవసరమయ్యేవి కేవలం రెండు పాత్రలు మాత్రమే.బిల్డర్లు: కొత్త ఉత్పత్తులు, సేవలు, సాంకేతికతలను సృష్టించేవారు (ఉదాహరణకు: డెవలపర్లు, డిజైనర్లు).సెల్లర్లు: క్లయింట్లతో సంబంధాలను పెంపొందించుకుంటూ కంపెనీ సేవలను మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయించేవారు.కంపెనీ వ్యూహాలకు అద్దం పడుతూ.. క్లౌడ్ ఫ్లేర్ ఈ వేసవిలో 1,111 పెయిడ్ ఇంటర్న్షిప్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన యువ ప్రతిభావంతులను ప్రిన్స్ ఏఐ-నేటివ్స్గా అభివర్ణించారు. వీరంతా ఉత్పత్తులను నిర్మించడం లేదా విక్రయించడం అనే అంశాలపైనే దృష్టి పెట్టనున్నారు.టెక్ ప్రపంచంలో మిశ్రమ స్పందనలుప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు ఆన్లైన్లో చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన విశ్లేషణను సమర్థిస్తున్నారు. సాంప్రదాయ కార్పొరేట్ నిర్మాణాల్లో ఉండే అనవసరమైన మధ్యస్థాయి బ్యూరోక్రసీని తగ్గించడానికి ఏఐ ఉపయోగపడుతుందని వారు వాదిస్తున్నారు. అయితే, నాణేనికి మరోవైపు ఉన్న ప్రమాదాన్ని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఏఐ ఇచ్చే కొలమానాలు, నంబర్లపైనే అతిగా ఆధారపడితే కంపెనీల్లో కొత్త ప్రయోగాలు, దీర్ఘకాలిక ఆవిష్కరణలు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: స్పేస్ ఎక్స్ ఐపీఓ.. మనోడి పంట పండింది! -
SBI సమ్మె వాయిదా.. ఆ రెండు రోజులు బ్యాంక్ ఓపెన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు పెద్ద ఉపశమనం లభించింది. ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె వాయిదా పడింది. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) ఈ సమ్మెను వాయిదా వేసినట్లు ఎస్బీఐ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు బ్యాంక్ ఒక కస్టమర్ అడ్వైజరీ (పత్రికా ప్రకటన) విడుదల చేసింది. మే 25, 26 తేదీలలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖలన్నీ యథావిధిగా పనిచేస్తాయని, బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.సమ్మెకు దారితీసిన కారణాలు ఏమిటి?సిబ్బంది కొరత, అవుట్సోర్సింగ్ విధానం, పెన్షన్ సమస్యలు, వేతన అసమానతలపై 'ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్' సుదీర్ఘకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందని, కార్మిక హక్కులను కాలరాస్తోందని యూనియన్ గతంలో ఆరోపించింది. ఈ క్రమంలోనే ప్రధానంగా 16 డిమాండ్లతో కూడిన చార్టర్ను యాజమాన్యం ముందు ఉంచింది.ప్రధాన డిమాండ్లు ఇవే» ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. మెసెంజర్లు, ఆర్మ్డ్ గార్డుల నియామకాలు చేపట్టాలి.» ఆర్మ్డ్ గార్డుల కొరత వల్ల బ్రాంచ్లలో భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి, వీటిని పరిష్కరించాలి.» శాశ్వత ఉద్యోగాలను అవుట్సోర్సింగ్కు ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపివేయాలి.» నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని కల్పించాలి.» 2019 తర్వాత రిక్రూట్ అయిన ఉద్యోగులకు ఇంటర్-సర్కిల్ బదిలీల అవకాశం కల్పించాలి. కెరీర్ ప్రొగ్రెషన్ ఫ్రేమ్వర్క్ను సమీక్షించాలి.» పరిశ్రమ వ్యాప్తంగా సెటిల్మెంట్లు జరుగుతున్నప్పటికీ, అధికారులు, క్లరికల్/సబార్డినేట్ స్టాఫ్ వేతన పెంపులో తీవ్ర అసమానతలు ఉన్నాయి. వాటిని సరిచేయాలి.వెనక్కి తగ్గిన యూనియన్ఈ సమ్మెను విజయవంతం చేయడం కోసం ఫెడరేషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించింది. అంతేకాకుండా తమ సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు కూడా విజ్ఞాపన పత్రాలు పంపింది.అయితే, సమ్మె తేదీలు దగ్గరపడుతుండటంతో ఎస్బీఐ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిపిన చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో ఫెడరేషన్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్ల మంది ఎస్బీఐ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల పరంగా ఎదురుకాబోయే పెద్ద అంతరాయం తప్పినట్లయింది. -
విరూపాక్ష ఆర్గానిక్స్కి ప్రతిష్టాత్మక గుర్తింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం విరూపాక్ష ఆర్గానిక్స్కి తాజాగా ప్రతిష్టాత్మక త్రీ స్టార్ ఎక్స్పోర్ట్ హౌస్ గుర్తింపు లభించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఈ సర్టిఫికెట్ జారీ చేసింది. గ్లోబల్గా సంస్థ విశ్వసనీయతకి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం తమ కార్యకలాపాల్లో ఎగుమతుల వాటా దాదాపు నలభై శాతం ఉంటోందని సంస్థ ఎండీ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గంగవరం తెలిపారు. దీన్ని యాభై శాతానికి పెంచుకోవడంపై దృష్టి పెట్టినట్లు వివరించారు. ప్రధానంగా యాంటీ అలెర్జిక్, యాంటీ ఫంగల్ వంటి ఔషధాల ఎగుమతులు అధికంగా ఉంటున్నట్లు ఆయన చెప్పారు. -
ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్!
మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, అక్కడి ఉద్యోగాలపై కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మెటా ఉద్యోగులను మొదట్లో AI ఆధారిత టూల్స్ తయారు చేయడానికి ప్రోత్సహించారని, తరువాతే కొన్ని టీమ్స్లో ఉద్యోగ కోతలు జరిగాయని ఆరోపించారు.మెటాలో ఒక ఏఐ వీక్ నిర్వహించారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ సాధారణ పనుల నుంచి కొంత విరామం తీసుకుని, కొత్త AI టూల్స్, ఐడియాలపై ప్రయోగాలు చేయాలని సూచించారట. కొన్ని ప్రోటోటైప్స్ తయారయ్యాయని, వాటిని తర్వాత పెద్ద ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఐడియాలు రూపొందించడంలో సహకరించిన కొంతమంది ఉద్యోగులు తరువాత ఉద్యోగ కోతలకు గురయ్యారని సమాచారం.My wife just got laid off by Meta. We knew the writing was on the wall. But I want to give a little background. Meta a couple months back had a company-wide AI week. During this week Meta halted all day-to-day work and required all employees to familiarize themselves with AI.…— Julian ☽ (@julianblacks_) May 20, 2026మెటా కంపెనీ ఏఐపై ఎక్కువ దృష్టి పెట్టడం నిజమే.. అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సంస్థ తన నిర్మాణాన్ని మరింత సరళంగా మార్చి, సమర్థవంతమైన ఏఐ టీమ్స్ను తయారు చేస్తోంది. ఈ మార్పుల వల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగ కోతలు, పునర్వ్యవస్థీకరణలు జరిగాయి. అంతే కాకుండా.. మెటా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది.ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగులు ఏఐ టూల్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుండగా, మరోవైపు అదే ఏఐ వల్ల వారి ఉద్యోగాలకే ముప్పు వస్తుందా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీర్లు, డిజైనర్లు, అనలిస్టులు వంటి వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందో చూడాలి. -
అరబిందో ఫార్మా లాభం అదుర్స్
ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో సుమారు రూ. 921 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 903 కోట్లతో పోలిస్తే 2 శాతం వృద్ధి చెందింది. ఆదాయం రూ. 8,382 కోట్ల నుంచి రూ. 8,853 కోట్లకు ఎగిసింది. సమీక్షాకాలంలో వ్యయాలు రూ. 7,150 కోట్ల నుంచి రూ. 7,677 కోట్లకు చేరాయి.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 3,503 కోట్లుగా నిల్చింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది రూ. 3,484 కోట్లు. ఆదాయం రూ. 31,724 కోట్ల నుంచి రూ. 33,653 కోట్లకు చేరింది. యూరప్ వ్యాపార విభాగం 1 బిలియన్ యూరోల పైగా ఆదాయం నమోదు చేసినట్లు సంస్థ తెలిపింది. 2030 నాటికి క్యూరాటెక్ విభాగం ప్రధానంగా ఆంకాలజీ ఉత్పత్తులపై దృష్టితో అగ్రగామి బయోసిమిలర్స్ సంస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పేర్కొంది.పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 400 కోట్లు కంపెనీ వెచ్చించింది. త్రైమాసికంతో పాటు పూర్తి ఆర్థిక సంవత్సరంలో పటిష్టమైన పనితీరు కనపర్చినట్లు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె. నిత్యానంద రెడ్డి తెలిపారు. నిర్వహణ సామర్థ్యాలతో పాటు అమ్మకాల పరిమాణం మెరుగుపడటం ఇందుకు దోహదపడినట్లు వివరించారు. -
రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆర్ధిక అస్థిరత నెలకొన్న సమయంలో.. 'దేశీ బ్లింగ్' అనే షో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. స్టాక్ మార్కెట్ పతనం, బంగారం కొనుగోళ్లపై ఆంక్షలు ప్రారంభమైన వేళ ఇలాంటి ఒక కార్యక్రమం ప్రసారం కావడం చాలామంది విమర్శలకు గురవుతోంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం మొత్తం అతి విలాసవంతమైన జీవితం, బంగారం, డబ్బు, ఆడంబరాల చుట్టూనే తిరుగుతుంది.దేశీ బ్లింగ్ కార్యక్రమంలో కనిపించే వ్యక్తులలలో సతీష్ సన్పాల్, ఆయన భార్య తబిందా సన్పాల్ కూడా ఉన్నారు. వీరి జీవితం చాలా విలాసవంతం. నిజానికి సతీష్ భారతదేశంలో పుట్టి పెరిగినప్పటికీ.. దుబాయ్ వెళ్లి వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించారు. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ నుంచి దుబాయ్కు వెళ్లినప్పుడు తనదగ్గర చాలా తక్కువ మొత్తం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు తాను దుబాయ్లో బిలినీయర్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు.40 కేజీల బంగారం!ఈ కార్యక్రమంలో సతీష్ సన్పాల్ బంగారం పట్ల వారికున్న అభిరుచిని చెప్పుకొచ్చారు. ఇప్పటికే 40 కిలోల బంగారం తనవద్ద ఉందని టబిందా సన్పాల్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తన భర్త తనకు 3 కిలోల బంగారం కొనిస్తాడని కూడా వెల్లడించింది. వారి ఇంట్లో బంగారు ఆభరణాలతో నిండిన ప్రత్యేక గది ఉందని, అది ఒక పెద్ద జ్యువెలరీ షోరూమ్లా కనిపిస్తుందని చెప్పారు.తమ కుమార్తె ఇసాబెల్లా కోసం బంగారు పాత్రలు వాడటం, మొదటి పుట్టినరోజుకు 24 క్యారెట్ బంగారంతో ప్రత్యేక దుస్తులు తయారు చేయించడం వంటి విషయాలు వెల్లడించారు. వీరు బుర్జ్ ఖలీఫాలో నివాసం ఉంటున్నారు. ఇవన్నీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి.ఏడాది కుమార్తె కోసం రోల్స్ రాయిస్తమ ఏడాది పాప కోసం గులాబీ రంగులో ఉన్న కస్టమైజ్ రోల్స్ రాయిస్ కొన్న విషయం కూడా ఈ షోలో వెల్లడించారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా విలాసానికి ప్రతీకగా మార్చడం ఈ కుటుంబ జీవనశైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా సతీష్ తన స్నేహితులతో గడపడానికి ప్రత్యేకంగా యాచ్ కొనుగోలు చేసి పార్టీలకు ఉపయోగించడం కూడా షోలో వెల్లడించారు.ఎవరీ సతీష్ సన్పాల్?సతీష్ సన్పాల్ వ్యాపార జీవితం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. నిజానికి ఈయన ఎనిమిదో తరగతి వరకే చదివి, చిన్న వయసులోనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. మొదట తన తల్లి నుంచి రూ.50,000 అప్పుగా తీసుకుని కిరాణా దుకాణం ప్రారంభించాడు. అది చాలా తక్కువ కాలంలోనే విఫలమైపోయింది.ఆ తరువాత దుబాయ్ వెళ్లి.. ప్రారంభంలో స్టాక్ మార్కెట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత దీని గురించి అవగాహన పెంచుకున్నాడు. ఇలా.. 2018లో అనక్స్ హోల్డింగ్ ప్రారంభించాడు. ఇది క్రమంగా భారీ వ్యాపార సమ్మేళనంగా మారింది. ఈ సంస్థకు దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. కాగా ఈయన నికర విలువ మొత్తం రూ.8,000 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం! -
నైకా లాభం.. నాలుగు రెట్లు
ప్రయివేట్ రంగ సంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం నాలుగు రెట్లు జంప్చేసి రూ. 79 కోట్లకు చేరింది. సౌందర్య విభాగం అమ్మకాలు పుంజుకోవడం, ఫ్యాషన్ బిజినెస్ నష్టాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 19 కోట్లు ఆర్జించింది.నైకా బ్రాండ్ ఈరిటైల్ కంపెనీ మొత్తం ఆదాయం సైతం 28 శాతం ఎగసి రూ. 2,648 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,062 కోట్ల టర్నోవర్ అందుకుంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నైకా నికర లాభం మూడు రెట్లు పెరిగి రూ. 204 కోట్లను తాకింది. 2024–25లో రూ. 72 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,950 కోట్ల నుంచి రూ. 10,022 కోట్లకు బలపడింది. సౌందర్య విభాగ ఆదాయం 26 శాతం ఎగసి రూ. 9,139 కోట్లను దాటింది.ఓ మహిళ 50 ఏళ్ల వయసులో ప్రారంభించిన బిజినెస్కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్గా దాదాపు 20 ఏళ్ల పాటు విజయవంతమైన కెరీర్ను కొనసాగించిన ఫాల్గునీ నాయర్ (Falguni Nayar), 2012లో తన 50 ఏళ్ల వయసులో ఆ ఉన్నత ఉద్యోగాన్ని వదిలేశారు. భారతదేశంలో విశ్వసనీయమైన బ్యూటీ రిటైలర్ అవసరమని గుర్తించి, ఎంతో రిస్క్తో కూడుకున్న నిర్ణయాన్ని తీసుకుంటూ 'నైకా' (FSN E-Commerce Ventures) సంస్థను స్థాపించారు. ఐఐఎం అహ్మదాబాద్లో చేసిన ఎంబీఏ చదువు, బ్యాంకింగ్ రంగంలో సంపాదించిన లోతైన మార్కెట్ అవగాహన ఆమె వ్యాపార విజయానికి బలమైన పునాదిగా నిలిచాయి.నైకా మొదట ఆన్లైన్ బ్యూటీ స్టోర్గా ప్రారంభమైనప్పటికీ.. మార్కెట్లో నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న కాలంలో "100% ఒరిజినల్" అనే హామీతో వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇన్ఫ్లూయెన్సర్ల ప్రమోషన్లు, ట్యూటోరియల్స్, రివ్యూల వంటి 'కంటెంట్ + కామర్స్' వ్యూహంతో కస్టమర్లను ఆకర్షిస్తూ దేశవ్యాప్తంగా ఆఫ్లైన్ స్టోర్స్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 'నైకా ఫ్యాషన్' పేరుతో దుస్తులు, యాక్సెసరీల రంగంలోకి కూడా వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరించింది.2021లో నైకా ఐపీఓ (IPO) భారత మార్కెట్లో ఒక సరికొత్త రికార్డు సృష్టించడంతో, ఫాల్గునీ నాయర్ భారతదేశంలోనే స్వయంకృషితో బిలియనీర్ అయిన ఇద్దరు మహిళల్లో ఒకరిగా నిలిచారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యం ఉన్న వ్యాపార రంగంలో బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆమె కథ.. సొంత కలలను నిజం చేసుకోవడానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదని నిరూపిస్తూ ఎంతోమందికి, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోంది. -
మోదీ గిఫ్ట్.. 'మెలొడీ' పెంపునకు సిద్ధం!
ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీకి ప్రధాని నరేంద్ర మోదీ ’మెలొడీ’ టాఫీలను బహుకరించడం వైరల్ కావడంతో వాటికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. దీనితో ఉత్పత్తిని కూడా పెంచుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. బ్రాండ్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ప్రచార కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు.స్వదేశీ బ్రాండ్ వృద్ధి చెందేందుకు మోదీ ఒక చక్కని అవకాశం కల్పించారన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా మెలొడీని మరింత ప్రాచుర్యంలోకి తేవడంపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. మెలొడీ ప్రస్తుతం దాదాపు 100 దేశాల్లో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. పంపిణీదారుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ బట్టి చూస్తుంటే మెలొడీకి వినియోగదారుల్లో డిమాండ్ అనూహ్య స్థాయిలో భారీగా పెరిగినట్లు తెలుస్తోందన్నారు. -
రూ.3.8 లక్షల నుంచి రూ.27 లక్షల ప్యాకేజీ: ఇలా..
నిబద్దతతో.. కష్టపడి పని చేస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అందరూ చెబుతుంటారు. కొందరు దీనిని నిజం చేసుకుంటారు. ఇలాంటి కోవకు చెందిన పూణేకు చెందిన టెకీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువ టెకీ.. కష్టపడి పనిచేసే తత్వం, పట్టుదల, నమ్మకంతో ఎలా జీవితాన్ని మార్చుకున్నాడో వెల్లడించారు. ఇందులో రూ.3.8 లక్షల వార్షిక వేతనంతో ప్రారంభమైన అతని ప్రయాణం చివరకు రూ. 27 లక్షల ప్యాకేజీ వరకు చేరిందని స్పష్టం చేశారు.పూణేలోని ఒక కాలేజీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన టెకీ.. కాలేజీ ప్లేస్మెంట్ల సమయంలో దాదాపు 30 నుంచి 35 ఇంటర్వ్యూలలో విఫలమయ్యాడు. వరుసగా ఎదురైన తిరస్కారాలు అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయినప్పటికీ.. అతనికి కోడింగ్పై ఉన్న ఆసక్తి మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. చివరకు అతనికి ఒక కంపెనీలో రూ.3.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చింది.జాబ్ వచ్చింది కానీ.. కరోనా కారణంగా జాయినింగ్ చాలా ఆలస్యమైంది. 2020లో వచ్చిన ఆఫర్కు 2021 ఫిబ్రవరిలో మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం దొరికింది. మొదటి ఆరు నెలలు జీతం సుమారు రూ.20 వేలు ఉండేది, చేరే తేదీ వరకు కూడా పని చేసే ప్రదేశం గురించి స్పష్టంగా తెలియదని టెకీ పేర్కొన్నారు.మొదటి ఉద్యోగంలోనే ఒకటిన్నర సంవత్సరాలు పని చేసి, చివరికి 6 లక్షల వార్షిక ప్యాకేజీతో మరో కంపెనీకి మారాడు. ఆ సంస్థలో ఒక సంవత్సరం తర్వాత నాకు 25 శాతం జీతం పెంపు లభించింది. కంపెనీ స్థిరంగానే ఉండేది, కానీ కొత్త విషయాలను నిర్మించడంలో పెద్దగా ఉత్సాహం లేదని నేను గ్రహించాడు. అలాంటి సమయంలోనే నెలకు రూ.45 వేల జీతంతో తన స్నేహితుడి స్టార్టప్లో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆ జీతం అంతకు ముందు వచ్చేదానికంటే చాలా తక్కువ.What Helped Me Grow from 3.5 to 27 as a Flutter Developerby u/Presence_Small in developersIndiaస్నేహితులతో కలిసి మొదటి నుంచి ఉత్పత్తులను తయారు చేయాలనే ఆలోచన తనకి బాగా నచ్చింది. నిజానికి.. అక్కడ ఉద్యోగిగా చేరకముందే, తాను ఆ పనిని ఇష్టపడటం వల్ల రాత్రిపూట వారి స్టార్టప్ కోసం పార్ట్టైమ్గా పని చేసేవాడు. ఆ దశలోనే చాలా నేర్చుకున్నాడు. సున్నా నుంచి ఉత్పత్తి వరకు ఉత్పత్తులను ఎలా నిర్మించాలి, క్లయింట్లతో ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒత్తిడి, గడువులను ఎలా ఎదుర్కోవాలి, నాయకత్వం, యాజమాన్యం వంటి వాటితో పాటు.. నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా తెలుసుకున్నాడు.కొంతకాలం తర్వాత.. మళ్లీ ఉద్యోగ మార్పు కోసం సిద్ధమయ్యాడు. ఈసారి అతను ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయ్యాడు. అయినప్పటికీ.. మొదట్లో రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షలు వేతనంతో ఆఫర్లు ఇచ్చే కంపెనీల్లో తిరస్కరణ ఎదురైంది. కారణం కొన్ని టెక్నికల్ విషయాల్లో లోతైన అవగాహన లేకపోవడం, ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం. కానీ ఈసారి అతను నిరుత్సాహపడలేదు. తన తప్పులను గుర్తించి మరింత కష్టపడ్డాడు. మరో 10 నుంచి 15 ఇంటర్వ్యూలు ఇచ్చి చివరకు మూడు కంపెనీల ఏడాదికి రూ. 15 లక్షల ప్యాకేజీ ఆఫర్లు పొందాడు.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!ఇదిలా ఉండగా.. ఒక కంపెనీ వ్యవస్థాపకుడు నా ప్రొఫైల్ చూసి నేరుగా సంప్రదించాడు. చివరకు రూ.27 లక్షల జీతంతో ఉద్యోగ అవకాశం వచ్చింది. ఒకప్పుడు ఆప్టిట్యూడ్ రౌండ్స్ కూడా క్లియర్ చేయలేక ఇబ్బంది పడ్డ వ్యక్తి, తర్వాత కంపెనీ వ్యవస్థాపకులే సంప్రదించే స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయం. దీన్నిబట్టి చూస్తే.. విజయానికి పట్టుదల, కృషి, నేర్చుకునే తపన ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది. -
స్పేస్ ఎక్స్ ఐపీఓ.. మనోడి పంట పండింది!
ప్రపంచ అంతరిక్ష రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన స్పేస్ ఎక్స్ ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లు (రూ.165 లక్షల కోట్ల పైమాటే) మైలురాయిని తాకే అవకాశం ఉంది. సాధారణంగా స్పేస్ ఎక్స్ అనగానే ప్రపంచమంతా ఎలాన్ మస్క్ పేరే వినబడుతుంది. కానీ, లైమ్లైట్కు దూరంగా ఉంటూ ఆధునిక సాంకేతిక చరిత్రలోనే అతిపెద్ద సంపద సృష్టికి కేంద్ర బిందువుగా మారిన ఒక భారతీయ సంతతి వ్యక్తి కథ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఆయనే ఆంటోనియో గ్రేసియాస్.ఎవరీ ఆంటోనియో గ్రేసియాస్?సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉంటూ సందడి చేయడం గ్రేసియాస్ శైలి కాదు. ఆయన నిశ్శబ్దంగా ఉండే వ్యూహకర్త. స్పేస్ ఎక్స్ ఐపీఓ ఫైలింగ్స్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. గ్రేసియాస్, ఆయన పెట్టుబడి సంస్థ ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’ సంయుక్తంగా స్పేస్ ఎక్స్లో 7.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ అంచనాల ప్రకారం 2 ట్రిలియన్లకు చేరితే గ్రేసియాస్ వాటా విలువ మాత్రమే 128 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10.6 లక్షల కోట్లు) అవుతుంది. ఈ సంపద ప్రపంచంలోని ఎన్నో బ్లూ-చిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్ కంటే, పలు చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం.ఆ మూలాలు గోవాలోనే..ఆంటోనియో గ్రేసియాస్ తండ్రి భారతదేశంలోని గోవా నుంచి అమెరికాకు వలస వెళ్లి డెట్రాయిట్లో న్యూరో సర్జన్గా స్థిరపడ్డారు. తల్లి స్పానిష్ ఫార్మసిస్ట్. అమెరికాలోనే పుట్టి పెరిగిన గ్రేసియాస్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, చికాగో యూనివర్సిటీలో లా చదివారు. జపాన్లోని వాసెడా యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య అభ్యసించారు. 1995లో లా స్కూల్లో ఉన్నప్పుడే ‘ఎంజీ క్యాపిటల్’ను స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’గా రూపాంతరం చెందింది.మస్క్ - గ్రేసియాస్ బంధం2008 కాలంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంపై పెట్టుబడి పెట్టడం అంటే అప్పట్లో అదొక పిచ్చి ప్రయోగం. రాకెట్లు వరుసగా పేలిపోతున్న తరుణంలో నాసా ఒప్పందాలు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వని రోజుల్లో గ్రేసియాస్ మస్క్ను నమ్మి పెట్టుబడి పెట్టారు. టెస్లా, స్పేస్ ఎక్స్, తాజాగా ఎక్స్ఏఐ... ఇలా మస్క్ సామ్రాజ్యంలోని ప్రతి కీలక మలుపులోనూ గ్రేసియాస్ భాగస్వామ్యం ఉంది.ఇటీవలి బ్లూమ్బెర్గ్ నివేదికల ప్రకారం, మస్క్కు చెందిన ఎక్స్ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు వాలోర్ ఈక్విటీ భారీగా నిధులు సమకూర్చింది. అత్యంత ఖరీదైన ఏఐ చిప్స్, డేటా సెంటర్ పరికరాలను తానే స్వయంగా కొనుగోలు చేసి వాటిని ఎక్స్ఏఐ సంస్థకు లీజుకు ఇచ్చే వినూత్న వ్యూహాన్ని గ్రేసియాస్ అమలు చేశారు. ఈ ఆర్థిక ఒప్పందాల ద్వారానే 2025, 2026 ప్రారంభ త్రైమాసికాల నాటికి వందల మిలియన్ల డాలర్ల లీజు చెల్లింపులు వాలోర్ ఖాతాలోకి చేరడం విశేషం.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
‘ఉనికిలోలేని సమస్యలు సృష్టిస్తున్నారు’
కార్పొరేట్ ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగుల తొలగింపులు, క్రమశిక్షణా చర్యలు అన్నీ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్) విభాగం పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి. కానీ, ఒక ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలో మాత్రం సీఈఓ ఏకంగా మొత్తం హెచ్ఆర్ విభాగానికే షాక్ ఇచ్చారు. ఉనికిలో లేని సమస్యలను సృష్టిస్తూ, కంపెనీ ప్రగతిని అడ్డుకుంటున్నారనే సంచలన ఆరోపణతో ఆ విభాగంలోని సిబ్బంది మొత్తాన్ని ఇంటికి పంపించేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ప్రముఖ పేమెంట్స్ ఫిన్టెక్ స్టార్టప్ ‘బోల్ట్’లో జరిగిన ఈ ఊహించని పరిణామం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోల్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ర్యాన్ బ్రెస్లో స్పష్టం చేశారు.11 బిలియన్ల నుంచి 300 మిలియన్లకు పతనం!ఒకప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్గా వెలిగిన ‘బోల్ట్’ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీ మార్కెట్ విలువ క్షీణించడమే ఈ భారీ మార్పులకు ప్రధాన కారణం. 2022 నాటికి కంపెనీ విలువ గరిష్ఠంగా సుమారు 11 బిలియన్ డాలర్లు (రూ.91,000 కోట్లకు పైగా)కు చేరింది. అయితే ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం 300 మిలియన్ డాలర్లు (దాదాపు 97% పతనం)గా ఉంది. ఈ తీవ్ర పతనం నుంచి కంపెనీని గట్టెక్కించేందుకు సీఈఓ ర్యాన్ బ్రెస్లో కఠిన సంస్కరణలను ప్రతిపాదించారు.ఉనికిలో లేని సమస్యలుకంపెనీ నుంచి హెచ్ఆర్ విభాగాన్ని పూర్తిగా తొలగించడంపై ర్యాన్ బ్రెస్లో ఘాటుగా స్పందించారు. హెచ్ఆర్ బృందం లేనిపోని సమస్యలను సృష్టించిందని, విచిత్రంగా ఆ విభాగాన్ని తొలగించిన మరుక్షణమే ఆ సమస్యలన్నీ మాయమైపోయాయని ఆయన పేర్కొన్నారు. హెచ్ఆర్ విభాగానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు బోల్ట్ సంస్థ కేవలం ఒక చిన్న పీపుల్ ఆపరేషన్స్ బృందాన్ని మాత్రమే నిర్వహిస్తోందని ఫార్చ్యూన్ నివేదిక వెల్లడించింది.చర్చనీయాంశంగా మారిన సీఈఓ వ్యాఖ్యలు‘కంపెనీ వృద్ధి దశలో ఉన్నప్పుడు ఉద్యోగులు చాలా సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. దీనివల్ల ఉత్పాదకత దారుణంగా పడిపోయింది. సంస్థ అంతటా తాము దేనికైనా అర్హులమనే భావన పెరిగిపోయింది. నైపుణ్యం ఉన్నట్లు నటించేవారే కానీ, వాస్తవానికి కష్టపడి పనిచేసేవారు కాదు. నేను మొదట పోరాడాల్సింది ఈ అసమర్థ సంస్కృతిపైనే. అందుకే చాలా మందికి లేఆఫ్స్ ఇచ్చాం’ అని బోల్ట్ సీఈఓ ర్యాన్ బ్రెస్లో చెప్పారు.లీడర్షిప్ టీమ్ కూడా అవుట్!కంపెనీని తిరిగి పాత స్టార్టప్ తరహా వేగవంతమైన పని సంస్కృతిలోకి తీసుకురావడానికి బ్రెస్లో పాత యాజమాన్యం నియమించిన ఉద్యోగులకు 60 రోజుల గడువు ఇచ్చారు. కొత్తగా మారుతున్న ఏఐ ఆధారిత నిర్మాణానికి అనుగుణంగా మారాలని సూచించారు. అయితే, ఈ పరివర్తనలో దాదాపు 99 శాతం మంది ఉద్యోగులు, మేనేజర్లు విఫలమయ్యారని బ్రెస్లో వెల్లడించారు. క్షేత్రస్థాయిలో కష్టపడకుండా, భారీగా డబ్బులు ఖర్చు పెట్టే కార్పొరేట్ లగ్జరీకి వారు అలవాటు పడ్డారని చెప్పారు. కానీ ఇప్పుడు కంపెనీ దగ్గర అంత బడ్జెట్ లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో దాదాపు మొత్తం లీడర్షిప్ బృందాన్ని తొలగించి స్క్రాచ్ నుంచి కొత్త యాజమాన్యాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
ఆన్లైన్ రిటైల్ మాయాజాలం
దేశీయ ఆన్లైన్ రిటైల్ రంగంలో చోటుచేసుకుంటున్న విపరీత పరిణామాలు, నకిలీ ఉత్పత్తుల అక్రమ రవాణా, అడ్డగోలు ధరల తగ్గింపు (ప్రిడేటరీ ప్రైసింగ్) విధానాలు సాంప్రదాయ చిరు వ్యాపారుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే లక్షలాది మంది జీవనోపాధి దెబ్బతినడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి, వినియోగదారుల నమ్మకానికి గండి పడుతుందని నిపుణులు, విధానకర్తలు హెచ్చరిస్తున్నారు.హైదరాబాద్లో గురువారం ‘ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఫ్రాయ్)-తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో ‘ఆధునిక మార్కెట్లలో అక్రమ వ్యాపారాల నిరోధం’ అనే అంశంపై ఉన్నత స్థాయి సదస్సు నిర్వహించారు. తెలంగాణవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రిటైలర్లకు ప్రాతినిధ్యం వహిస్తూ 10 లక్షల మందికి పైగా వ్యాపారుల జీవనోపాధి కోసం పోరాడుతున్న ఫ్రాయ్ ఈ వేదికపై పలు కీలక అంశాలను లేవనెత్తింది.ఈ-కామర్స్, క్విక్ కామర్స్ చాటున ‘నకిలీ’ల దందానిమిషాల వ్యవధిలోనే వస్తువులను చేరవేసే ‘క్విక్ కామర్స్’, ‘ఈ-కామర్స్’ ప్లాట్ఫామ్లు నేడు మార్కెట్ను శాసిస్తున్నాయి. నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి, సౌందర్య సాధనాల నుంచి మొదలుకొని వేల రూపాయల విలువైన ప్రీమియం మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అన్నీ నిమిషాల్లో ఇంటికి వస్తున్నాయి. అయితే, ఇదే వేగవంతమైన డెలివరీ వ్యవస్థ అక్రమ, నిషేధిత, నకిలీ ఉత్పత్తుల సరఫరాకు కీలకంగా మారుతోందని వ్యాపార సంఘాలు ఆరోపించాయి.భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్ పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తూ, క్వాలిటీ కంటే తక్కువ ధరకే ప్రాధాన్యత ఇచ్చేలా మార్కెట్ను తప్పుదోవ పట్టిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన పర్యవేక్షణ వ్యవస్థల వల్ల నకిలీ వస్తువులు సులభంగా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయని రిటైలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.సామాజిక సంక్షోభంగా మార్కెట్ అసమతుల్యతరోజుకు 14 నుంచి 18 గంటల పాటు కష్టపడుతూ నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేసే స్థానిక కిరాణా, చిరు వ్యాపారులు ఈ అడ్డగోలు పోటీని తట్టుకోలేకపోతున్నారు. ఇది కేవలం వ్యాపార నష్టానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాల మనుగడకు సంబంధించిన సామాజిక సమస్య అని సదస్సులో నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికతను స్వాగతిస్తున్నప్పటికీ మార్కెట్ పోటీ అనేది పారదర్శకంగా, అందరికీ సమాన అవకాశాలు కల్పించేదిగా ఉండాలని స్పష్టం చేశారు.ప్రముఖుల అభిప్రాయాలుతక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి‘అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు మార్కెట్ విధానాలు ప్రామాణికంగా వ్యాపారం చేసే చిరు వ్యాపారులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. నకిలీ వస్తువుల నెట్వర్క్ వల్ల వినియోగదారుల్లో నమ్మకం సడలుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. అక్రమ నెట్వర్క్లపై సమన్వయంతో చర్యలు తీసుకుంటూ వ్యాపారుల హక్కులను కాపాడాలి’ అని తెలంగాణ రాష్ట్ర మైనారిటీల కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ అన్నారు.వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి‘నకిలీ ఉత్పత్తుల చెలామణి అనేది కేవలం ఆర్థిక నష్టమే కాదు, ప్రజారోగ్యానికి, భద్రతకు కూడా పెను ముప్పు. డిజిటల్ ప్లాట్ఫామ్లు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో సైబర్ రిస్క్లు, నకిలీ సరఫరా గొలుసులపై అవగాహన లోపించింది. భారీ డిస్కౌంట్లకు ఆకర్షితులై మోసపోవద్దు. దశాబ్దాలుగా నమ్మకమైన సేవలు అందిస్తున్న స్థానిక చిరు వ్యాపారుల పాత్ర ఆర్థిక వ్యవస్థలో కీలకం. అక్రమ వ్యాపారాల అడ్డుకట్టకు ప్రజలు, అధికారులు సమన్వయంతో ముందడుగు వేయాలి’ అని హైదరాబాద్ సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఆర్.సంజయ్ కుమార్ అన్నారు.సాంప్రదాయ వ్యాపార సంస్కృతికే ముప్పు‘స్థానిక కిరాణా దుకాణాలు కేవలం వ్యాపార కేంద్రాలు కావు. భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక. నేడు క్విక్ కామర్స్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల దూకుడు, అడ్డగోలు ధరల తగ్గింపు విధానాలు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. చిన్న వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే తరతరాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న కోట్లాది కుటుంబాల సాంప్రదాయ వ్యాపార సంస్కృతి నాశనమయ్యే ప్రమాదం ఉంది’ అని ఫ్రాయ్ వైస్ ప్రెసిడెంట్ (ఆల్ ఇండియా ఫ్రాయ్), ప్రెసిడెంట్ (తెలంగాణ చాప్టర్, ఫ్రాయ్) మహమ్మద్ సలావుద్దీన్ దఖ్నీ అన్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్! -
మూడేళ్లలో కొత్తగా వంద ఔట్లెట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యారడైజ్ బిర్యానీ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. వచ్చే మూడేళ్లలో కొత్తగా 100 ఔట్లెట్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ ఎండీ అభీక్ మిత్ర వెల్లడించారు. తొలి దశలో బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ, తదుపరి దశల్లో ముంబై, పుణె, ఢిల్లీ నగరాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 57 ఔట్లెట్స్ ఉన్నాయి. విస్తరణ కోసం వచ్చే ఆరు నెలల్లో రూ. 100 కోట్లు సమీకరిస్తున్నట్లు సంస్థ ప్రమోటర్ అయిన సమారా క్యాపిటల్ ఎండీ నిలయ్ ప్రతీక్ తెలిపారు. ఇందులో సుమారు 50 శాతాన్ని తాము సమకూర్చనుండగా, మరో 40–50 శాతాన్ని బైటి నుంచి సేకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఔట్లెట్స్ విస్తరణ, కొత్త ఔట్లెట్స్ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో సుమారు రూ. 520 కోట్ల ఆదాయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థ ఆదాయం సుమారు రూ. 300 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. -
ఐటీసీ లాభం రూ. 5,470 కోట్లు
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో రూ. 5,470 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 21,018 కోట్ల నికర లాభం సాధించింది. క్యూ4లో ప్రొడక్టుల విక్రయ ఆదాయం రూ. 23,626 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 17,348 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 14,279 కోట్లుకాగా.. విమ్కో, శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ విలీనం పూర్తయినట్లు ఐటీసీ వెల్లడించింది. దీంతో ఫలితాలు పోల్చతగదని పేర్కొంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 8 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 27 రికార్డ్ డేట్కాగా.. ఇప్పటికే(ఫిబ్రవరిలో) రూ. 6.5 చెల్లించిన సంగతి తెలిసిందే. పూర్తి ఏడాదికి రూ. 92,339 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. డైరెక్టర్, స్వతంత్ర డైరెక్టర్గా 2026 డిసెంబర్ 20 నుంచి మరో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించేందుకు హేమంత్ భార్గవను బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 308 వద్ద ముగిసింది. -
సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం.. ఎయిర్టెల్ కొత్త సర్వీస్!
భారతి ఎయిర్టెల్ కంపెనీ తమ వినియోగదారులకు మరింత మెరుగైన మొబైల్ నెట్వర్క్ అనుభవాన్ని అందించేందుకు ''ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్'' అనే కొత్త సర్వీస్ ప్రారంభించింది. చాలామంది జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అంటే.. మార్కెట్లు, ట్రాఫిక్ జామ్లు లేదా పెద్ద ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో, వీడియో కాల్స్ నిలిచిపోవడం, ఫోటోలు అప్లోడ్ కావడంలో ఆలస్యం, లేదా ఈమెయిల్స్ డౌన్లోడ్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎయిర్టెల్ ఈ కొత్త సేవను తీసుకొచ్చింది.ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్పెయిడ్ సర్వీస్ అనేది ప్రత్యేకంగా పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం తీసుకొచ్చారు. దీనిద్వారా నెట్వర్క్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కూడా వినియోగదారులకు స్థిరమైన.. వేగవంతమైన ఇంటర్నెట్ అనుభవం లభిస్తుంది. దీనికి కారణం ఎయిర్టెల్ తమ 5జీ నెట్వర్క్లో చేసిన లేటెస్ట్ టెక్నికల్ అప్గ్రేడ్. ఈ సాంకేతికతను స్లైసింగ్ అని పిలుస్తారు.స్లైసింగ్ అనేది ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఉపయోగంలో ఉన్న నెట్వర్క్ టెక్నాలజీ. ఇప్పుడు అదే సదుపాయాన్ని ఎయిర్టెల్ భారతదేశంలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవను పొందడం చాలా సులభం. ఇప్పటికే ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ వినియోగదారులైతే ఈ సదుపాయం ఆటోమేటిక్గా అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రీపెయిడ్ వాడుతున్న వారు ఎయిర్టెల్ యాప్ ద్వారా లేదా సమీప ఎయిర్టెల్ స్టోర్కి వెళ్లి తమ కనెక్షన్ను పోస్ట్పెయిడ్గా మార్చుకోవచ్చు.అయితే.. ఈ సేవను పూర్తిగా ఉపయోగించాలంటే వినియోగదారుల వద్ద 5G సపోర్ట్ ఉన్న స్మార్ట్ఫోన్ ఉండాలి. అలాగే ఫోన్లో తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండటం అవసరం. ఫోన్లో అప్డేట్ పెండింగ్లో ఉంటే, సెట్టింగ్స్లో నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదనంగా ఎయిర్టెల్ యాప్ ద్వారా కూడా ఫోన్ ఈ సేవకు సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవచ్చు.Entering our priority era 💅 https://t.co/GfN7Qzzkrg— airtel India (@airtelindia) May 19, 2026 -
ఉద్యోగాల కోతలు.. జుకర్బర్గ్ వివరణ
టెక్ రంగంలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మెటా కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ప్రభావం 8000 ఉద్యోగులపై పడింది. మరో 7000 మంది ఉద్యోగులను కొత్త టీమ్స్కు మార్చింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న 6000 పోస్టులను కూడా భర్తీ చేసే యోచన లేదని సంస్థ స్పష్టం చేసింది.ఈ పరిణామాల తరువాత మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులకు ఒక మెమో పంపించారు. అందులో.. ఈ ఏడాది పెద్ద స్థాయి ఉద్యోగ కోతలు ఉండవని స్పష్టం చేశారు. అంటే ప్రస్తుత ఉద్యోగ కోతల తరువాత సంస్థ ఉద్యోగులను తొలగించే ఆలోచనలో లేదని తెలుస్తోంది.మార్క్ జుకర్బర్గ్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా వివరించారు. కంపెనీ కమ్యూనికేషన్ విషయంలో కొంత స్పష్టత లోపించిందని ఆయన అంగీకరించారు. ఉద్యోగులకు సరైన సమాచారం ఇవ్వడంలో మరింత మెరుగుదల అవసరం ఉందని చెప్పారు. ఏఐ సాంకేతికత భవిష్యత్తును పూర్తిగా మార్చబోతుందని అన్నారు. సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, కంపెనీలు నిరంతరం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏఐను మానవ జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే టెక్నాలజీగా ఆయన అభివర్ణించారు.ఇదీ చదవండి: ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!ఉద్యోగం కోల్పోయిన వారికి సంస్థ 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు. యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి దాదాపు ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి. -
తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ నష్టం.. తొలిసారి పాజిటివ్ క్యాష్ ఫ్లో
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఆర్థిక సంవత్సరం (2025–26) నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.500 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో నమోదైన రూ.870 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి నష్టం 42.5 శాతం తగ్గింది. ఆదాయం 57 శాతం క్షీణించి రూ.611 కోట్ల నుంచి రూ.265 కోట్లకు దిగజారింది.ఆదాయం తగ్గినా, స్థూల మార్జిన్లు మెరుగయ్యాయి. ఇవి వార్షిక ప్రాతిపదికన 13.7% నుంచి 38.5 శాతానికి చేరాయి. పీఎల్ఐ ప్రోత్సాహకాలు, మెరుగైన స్థూల మార్జిన్లు, కఠినమైన వ్యయ నియంత్రణ కారణంగా కంపెనీ చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాల నగదు ప్రవాహం పాజిటివ్గా మారి క్యూ4లో రూ.91 కోట్లుగా నమోదైంది. ఆటోమొబైల్ వ్యాపారం నుంచి రూ.213 కోట్ల ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, రూ.173 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్సీఎఫ్) నమోదయ్యాయి.మార్చి త్రైమాసికంలో మొత్తం 20,256 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను కంపెనీ విక్రయించింది. ఇక పూర్తి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ మొత్తం రూ.2,253 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. రూ.1,833 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఓలా ఎలక్ట్రిక్ మొత్తం 1,73,794 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను డెలివరీ చేసింది. -
ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!
ఒకప్పుడు నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ.. పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఎదురైన ఇబ్బందులే అతన్ని జీవితంలో సక్సెస్ సాధించేలా చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఆయన ఒక చైనా మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో నెలకు రూ.5 లక్షల జీతం ఉన్నప్పటికీ.. రూ. 2 కోట్ల హౌస్ లోన్ ఉండేది. ప్రతి నెల జీతం వస్తుండడంతో ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా.. సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.అనుకోకుండా ఉద్యోగం పోవడంతో కవాత్రాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. జీవితంలో అత్యంత కష్టమైన రోజులు ప్రారంభమయ్యాయి. కొత్త ఉద్యోగం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరస్కరణలకు గురయ్యారు. నిరాశ, భయం, ఆర్థిక ఒత్తిడి కవాత్రాను మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తీవ్ర ఆందోళనతో రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును మానుకోవడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టిందని చెప్పారు.ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు.. తన కుమార్తె అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని కవాత్రా తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పొరుగువారు.. ఇంట్లో కూర్చొని ఉన్న తనను చూసినప్పుడు తాను మరింత అవమానంగా ఫీలయ్యేవాడినని చెప్పారు.అయితే.. ఈ అనుభవం అతని జీవితానికి ఒక పాఠం నేర్పింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, అధిక జీతం ఇవన్నీ శాశ్వత భద్రత కాదని కవాత్రా గ్రహించారు. నేను నా జీవితాన్ని ఒక కార్పొరేట్ లోగోకు బానిసలా మార్చుకున్నాను, అని ఆయన అన్నారు. డిగ్రీలు ఒక స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ నైపుణ్యాలు జీవితాంతం విలువనిస్తాయని ఆయన గుర్తించారు.ఈ సంక్షోభం తర్వాత.. ఆయన తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజలను ఎలా నిర్వహించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి వంటి విషయాలను నేర్చుకున్నారు. క్రమంగా ఆయన కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్ను తిరిగి నిర్మించుకున్నారు.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!ప్రస్తుతం ఆయన దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసినట్టు చెబుతున్నారు. రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారని, 19 రాష్ట్రాల్లో 65 కంపెనీలతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకుడిగా మారడం.. ఆయన ప్రయాణంలో గొప్ప విజయం అనే చెప్పాలి. -
థాయ్లాండ్లో హాయిగా.. ఇక కొన్ని రోజులే!!
బ్యాంకాక్: భారతదేశంతో సహా దాదాపు 90 దేశాల ప్రయాణికులకు గతంలో కల్పించిన 60 రోజుల వీసా రహిత (Visa-Free) బస సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో ప్రవేశపెట్టిన ఈ పొడిగించిన వీసా రహిత బస పథకాన్ని రద్దు చేయడానికి థాయ్ క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు 'న్యూస్ రిఫార్మ్' సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.నిర్ణయానికి కారణాలు» ఇటీవలి కాలంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస నేరాలే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. » విదేశీయులు పాల్గొంటున్న మాదకద్రవ్యాల నేరాలు, లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులు పెరిగిపోవడం.» సరైన అనుమతులు లేకుండా హోటళ్లు, పాఠశాలలతో కూడిన వ్యాపారాలను చట్టవిరుద్ధంగా నిర్వహించడం.» కొంతమంది సందర్శకులు ఈ పొడిగించిన వీసా రహిత పద్ధతిని తమ అక్రమ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు థాయ్ అధికారులు గుర్తించారు.భారతీయ ప్రయాణికులకు ఏం మారనుందంటే..ఈ తాజా నిర్ణయంతో భారతీయ ప్రయాణికులు 2024లో తాత్కాలిక 60 రోజుల మినహాయింపు రాకముందు ఉన్న పాత నిబంధనల్లోకి మారిపోతారు. మునుపటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు ఇకపై థాయ్లాండ్లో గరిష్టంగా 30 రోజులు మాత్రమే వీసా లేకుండా ప్రవేశించడానికి, బస చేయడానికి అనుమతి ఉంటుంది.పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంథాయ్లాండ్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10% కంటే ఎక్కువ. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చోదకశక్తిగా ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారు 3.35 కోట్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించాలని భావిస్తోంది. ఇది గత సంవత్సరం నమోదైన దాదాపు 3.3 కోట్ల మంది రాకపోకల కంటే స్వల్ప వృద్ధి. థాయ్లాండ్ పర్యాటక, క్రీడల మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా డేటా ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో విదేశీ రాకపోకలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 2.3% నుండి 3.4% వరకు తగ్గాయి. -
ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు!
‘సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి?’-ఏదైనా ఆఫీసులో ఒక ఉద్యోగి తన పైఅధికారిని అడిగే అత్యంత సాధారణ ప్రశ్న ఇది. కానీ, నోయిడాకు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సీఈవోకు మాత్రం ఈ ప్రశ్న తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎంతలా అంటే, ఆ ప్రశ్న అడిగినందుకు ఏకంగా ఒక సీనియర్ ఉద్యోగినే కొలువులోంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ లింక్డ్ఇన్ వేదికగా కార్పొరేట్ కార్యాలయ సంస్కృతి, నాయకత్వ లక్షణాలపై చర్చకు దారితీసింది. ఆస్ట్రాలజీ స్టార్టప్ ‘ఇన్స్టాఆస్ట్రో’ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ వర్మ స్వయంగా లింక్డ్ఇన్లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.‘నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంది ఇందుకేనా?’లింక్డ్ఇన్ పోస్ట్లో నితిన్ వర్మ ఈ సంచలన నిర్ణయాన్ని పంచుకుంటూ, తానే స్వయంగా ఆ సీనియర్ ఉద్యోగిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించారు. ‘నేను ఒక ఉద్యోగిని తొలగించాను. ఎందుకంటే అతను నా దగ్గరకు వచ్చి.. సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు’ అని వర్మ రాసుకొచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘నేను వెంటనే అతని పనితీరును, ధోరణిని ప్రశ్నించాను. దానికి ఆ ఉద్యోగి సార్, నాకంటే మీకే బాగా తెలుసు కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు నేను.. అసలు నిన్ను ఈ ఉద్యోగంలోకి ఎందుకు నియమించుకున్నట్లు? అని అడిగాను’ అని వర్మ పేర్కొన్నారు.పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా..సదరు ఉద్యోగిని ఒక నిర్దిష్ట విభాగానికి పూర్తి బాధ్యుడిగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి భారీ ప్యాకేజీతో నియమించుకున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో తాను జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఆ నియామకం జరిగిందని తెలిపారు. సదరు సీనియర్ నిపుణుడికి మొదటి రోజు నుంచే ఎలాంటి మైక్రో మేనేజ్మెంట్, అప్రూవల్ చెయిన్ లేకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. వ్యవస్థాపకులు లేదా మేనేజర్ల నుంచి నిరంతరం సూచనల కోసం వేచి చూడకుండా.. సమస్యలను ముందుగానే గుర్తించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే సీనియర్ ఉద్యోగుల బాధ్యత అని వర్మ వాదించారు.అది వ్యక్తిగతంగా రావాల్సింది!కార్యాలయంలో ఓనర్షిప్ (కంపెనీని తనదిగా భావించి పనిచేసే యాజమాన్య మనస్తత్వం) అనేది కాలక్రమేణా నాయకులు ఉద్యోగులకు నేర్పించే నైపుణ్యం కాదని, అది వ్యక్తిగతంగా రావాల్సిన మనస్తత్వమని వర్మ అభిప్రాయపడ్డారు. ‘మీరు యాజమాన్య బాధ్యతను ఎవరికీ బలవంతంగా ఇవ్వలేరు. ఉంటే వారే ఆ బాధ్యతతో ముందుకు పరిగెడతారు, లేదంటే వారు దానిని ఎప్పటికీ చేరుకోలేరు. యాజమాన్య బాధ్యత లేని స్వేచ్ఛ కేవలం గందరగోళానికి దారితీస్తుంది. ఏం ఆలోచించాలో కూడా నేనే చెప్పాల్సి వస్తే.. అలాంటి వ్యక్తులతో నేను సంస్థను నిర్మించలేను’ అని సీఈవో నితిన్ వర్మ స్పష్టం చేశారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ వైరల్ కావడంతో లింక్డ్ఇన్ వినియోగదారులు, హెచ్ఆర్ నిపుణులు సీఈవో నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక సీనియర్ నిపుణుడికి కూడా కంపెనీ ప్రాధాన్యతలు, భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత అవసరమని వాదిస్తున్నారు. ఎంత సీనియర్ అయినా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వ్యవస్థాపకుడి విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఉండాలని భావిస్తారు. అందుకోసమే చర్చలు జరుపుతారు అని కొందరు చెబుతున్నారు. సీనియర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, ప్రతి చిన్న విషయానికి అనుమతులు లేదా స్పష్టత కోసం వ్యవస్థాపకుడిపై ఆధారపడకూడదని ఇంకొందరు అంటున్నారు.ఇదీ చదవండి: భారత్లో మరో స్టోర్కు సన్నాహాలు! -
ఢిల్లీ-ఎన్సీఆర్లో ‘చక్కా జామ్’
జాతీయ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్)లో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా రవాణా ఛార్జీలను పెంచాలనే ప్రధాన డిమాండ్తో గురువారం (మే 21) నుంచి మూడు రోజుల పాటు భారీ ‘చక్కా జామ్’(రవాణా బంద్) నిరసన ప్రారంభమైంది. వాణిజ్య వాహన సంఘాలు పిలుపునిచ్చిన ఈ సమ్మె మే 23 వరకు కొనసాగనుంది. టాక్సీ ఆపరేటర్లు, ఆటో-రిక్షా డ్రైవర్లతో పాటు పలు రవాణా కమ్యునిటీ డ్రైవర్లు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించడంతో ఢిల్లీ వ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.68 యూనియన్లు.. 4 లక్షల టాక్సీలు..ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్, యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్కు చెందిన దాదాపు 68కి పైగా అనుబంధ యూనియన్లు ఈ మూడు రోజుల ఆందోళనలో భాగస్వామ్యం కానున్నాయి. దాదాపు నాలుగు లక్షల మంది రిజిస్టర్డ్ టాక్సీ యజమానులు సమ్మెలో పాల్గొంటున్నారని, ప్రయాణికులను చేరవేసే సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్లు ప్రకటించాయి.ప్రభావితం కానున్న సేవలుఈ సమ్మె కారణంగా సాధారణ ఆటో-రిక్షాలు, కమర్షియల్ టాక్సీ సర్వీసులతో పాటు ప్రముఖ యాప్ ఆధారిత క్యాబ్ ప్లాట్ఫామ్లైన ఓలా, ఉబెర్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. అయితే, ఢిల్లీ మెట్రో, డీటీసీ బస్సుల రాకపోకలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.డిమాండ్లు ఇవే..ఈ వారం ప్రారంభంలోనే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, ముఖ్యమంత్రి రేఖా గుప్తాలకు తమ డిమాండ్లతో కూడిన లేఖలను పంపింది. అందులో తెలిపిన వివరాల ప్రకారం..గత 15 ఏళ్లుగా టాక్సీ ఛార్జీలను పెంచలేదని, తక్షణమే ఛార్జీలను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో నడుస్తున్న వాణిజ్య వాహనాలపై ఉన్న ఆంక్షలను సమీక్షించాలి. ‘గత దశాబ్దంన్నర కాలంగా ఛార్జీల నిర్మాణం మారలేదు. కానీ సీఎన్జీ ధరలు, పర్మిట్లు, ఇన్సూరెన్స్ ఖర్చులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. పదేపదే చర్చలు జరిపినా ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోవడం లేదు’ అని చాలక్ శక్తి యూనియన్ ఉపాధ్యక్షుడు అనుజ్ కుమార్ రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం దిగిరాకపోతే..ట్రావెల్ ఆపరేటర్ల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. రాబోయే రెండు వారాల్లోగా ప్రభుత్వం ఛార్జీల సవరణను ప్రకటించకపోతే ఈ నిరసనను మరింత ఉధృతం చేస్తామని రవాణా సంస్థల ప్రతినిధులు హెచ్చరించారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
శామ్సంగ్ వేతన వివాదానికి తాత్కాలిక బ్రేక్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు గ్లోబల్ సెమీకండక్టర్ (చిప్) సరఫరా గొలుసును కుదిపేస్తుందని భావించిన శామ్సంగ్ కార్మిక సమ్మె ముప్పు తాత్కాలికంగా తొలగిపోయింది. యాజమాన్యంతో కుదిరిన తాత్కాలిక వేతన ఒప్పందం నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ప్రారంభం కావాల్సిన ప్రణాళికాబద్ధమైన సమ్మెను నిలిపివేస్తున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్మిక సంఘం (యూనియన్) ప్రకటించింది.బుధవారం రాత్రి వరకు ఇరు పక్షాల మధ్య చర్చలు పదే పదే విఫలమవడంతో సమ్మె ఖాయమని అందరూ భావించారు. అయితే, దక్షిణ కొరియా కార్మిక మంత్రి కిమ్ యంగ్-హూన్ వ్యక్తిగతంగా రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించడంతో చర్చలు మళ్లీ పుంజుకున్నాయి. చివరి నిమిషంలో యాజమాన్యం, యూనియన్ ఒక అంగీకారానికి వచ్చాయి. మరింత మెరుగైన కార్మిక సంబంధాలను నిర్మించడానికి ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తాత్కాలిక ఒప్పందంపై దాదాపు 48,000 మంది యూనియన్ సభ్యులు మే 22 నుంచి 27 వరకు ఓటింగ్ (రాటిఫికేషన్) జరపనున్నారు.ఉద్యోగుల అసంతృప్తి ఎందుకంటే..శామ్సంగ్ దక్షిణ కొరియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యాలయాల్లో ఒకటిగా పేరుపొందింది. అయితే, తమ ప్రధాన చిన్న ప్రత్యర్థి సంస్థ అయిన ఎస్ కే హైనిక్స్ ఇస్తున్న వేతనాలతో పోలిస్తే శామ్సంగ్ ఉద్యోగుల జీతాలు తక్కువగా ఉండటం వారిలో అసంతృప్తిని రగిల్చింది. కంపెనీలోని వివిధ వ్యాపార విభాగాల మధ్య బోనస్లను పంచే విధానంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా భారీగా లాభాలు ఆర్జించే మెమరీ వ్యాపార విభాగం, నష్టాల్లో నడుస్తున్న లాజిక్ చిప్ విభాగం మధ్య పనితీరు బోనస్లను ఎలా కేటాయించాలనే దానిపై యాజమాన్యానికి, యూనియన్కు మధ్య వివాదం నడిచింది. నష్టపోయే విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా లాభాల వాటా సక్రమంగా దక్కాలన్నది వారి డిమాండ్.బోనస్లపై ఉన్న 50% గరిష్ట పరిమితిని రద్దు చేయాలని, బోనస్లను నేరుగా కంపెనీ సాధించే ఆపరేటింగ్ లాభాలతో ముడిపెట్టాలని ఉద్యోగులు పట్టుబట్టారు. వేతనాలు, సామూహిక బేరసారాలపై యాజమాన్యంతో జరిపిన చర్చలు పలుమార్లు విఫలమయ్యాయి. దాంతో ఇటీవల ప్రపంచవ్యాప్త సరఫరాకు ముప్పు తెచ్చేలా 18 రోజుల పాటు ప్రణాళికాబద్ధమైన సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే చివరి నిమిషంలో కార్మిక మంత్రి మధ్యవర్తిత్వంతో తాత్కాలిక ఒప్పందం కుదిరి సమ్మె విరమించుకున్నారు.ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు! -
మ్యూచువల్ ఫండ్స్పై రుణాలిస్తాం
సాక్షి, బిజినెస్ డెస్క్: యువ రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రిటర్నులు వచ్చే బ్యాంకు డిపాజిట్ల కన్నా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. దీనితో బ్యాంకులకు వస్తున్న డిపాజిట్లపరమైన వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. ప్రజల పొదుపు విధానాలు మారుతున్న నేపథ్యంలో యువ కస్టమర్లను ఆకర్షించేందుకు, రుణాల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త రూటును ఎంచుకుంటున్నాయి. డిజిటల్ విధానంలో ఫండ్స్పై రుణాలివ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ గతేడాదే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాపార విభాగాన్ని మరింతగా విస్తరిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇటీవల మార్చిలో దీన్ని ప్రవేశపెట్టింది. అటు కరూర్ వైశ్యా బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్ కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. నెలా, రెణ్నెల్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలా ఫండ్స్పై లోన్ విధానంలో అధిక వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత రుణాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా రుణగ్రహీతలు తమ దగ్గరున్న ఫండ్ యూనిట్లను తనఖాగా ఉంచి లోన్ తీసుకోవచ్చు. అదే సమయంలో తమ పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 35 ఏళ్ల లోపు వారి పొదుపులో సింహభాగం వాటా మ్యూచువల్ ఫండ్స్దే ఉంటోందని కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అత్యవసరాల కోసం ఇలా ఫండ్స్పై రుణాలు లభిస్తే, తక్కువ లాభాలకో లేదా నష్టాలకో యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి కస్టమర్లు ఈ విధానం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్స్పై రుణాలనేవి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, మార్కెట్ ఆధారిత ఫండ్స్కి ప్రాధాన్యం పెరిగే కొద్దీ వీటికి మరింత ఆదరణ లభించగలదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సంక్లిష్ట ప్రక్రియ .. ఫండ్స్పై రుణాలివ్వడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. తనఖా ఉంచిన ఫండ్ యూనిట్లను పక్కన పెట్టేలా మార్క్ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలతో బ్యాంకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు బ్యాంకులు డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. సాధారణంగా డిపాజిట్ల విలువలో 80–90% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఫండ్ యూనిట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కాబట్టి వాటి విలువ లో 50 శాతమే రుణం ఇచ్చే అవకాశం ఉంటోంది.రూ. 82 లక్షల కోట్లకు ఫండ్స్.. దేశీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) గత దశాబ్దకాలంగా అనేక రెట్లు పెరిగింది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాల ప్రకారం 2016లో ఏప్రిల్ ఆఖరు నాటికి రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి దాదాపు ఆరు రెట్లు ఎగిసి రూ. 82 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం కుటుంబాల వార్షిక పొదుపులో ఈక్విటీ, మ్యుచువల్ ఫండ్స్ వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 15.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్ల వాటా 58 శాతం నుంచి 35 శాతానికి తగ్గింది. -
కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త బ్రాంచ్
ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్కు చెందిన అగ్రగామి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ఏబీహెచ్ఎఫ్ఎల్), దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను విస్తరించే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కడపలో కొత్త బ్రాంచ్ను ప్రారంభించింది. ఈ కొత్త బ్రాంచ్తో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఏబీహెచ్ఎఫ్ఎల్ మొత్తం బ్రాంచ్ల సంఖ్య 13కి చేరింది.వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకోవడానికి, కస్టమర్లకు మరింత చేరువవడానికి ఈ విస్తరణ దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే నిపుణులు, ఇతర వ్యాపారస్తులు, కొత్తగా ఆదాయం ఆర్జిస్తున్న వర్గాల కోసం వారి అవసరాలకు తగ్గట్టుగా ఏబీహెచ్ఎఫ్ఎల్ వివిధ రకాల గృహ రుణాలను అందిస్తోంది.ఈ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్ల కోసం ఏబీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. 2026 మే 20 నుండి మే 31 వరకు ఎలాంటి లాగిన్ ఫీజు (జీరో లాగిన్ ఫీజ్) లేకుండా, రూ. 50 లక్షల వరకు అక్కడికక్కడే రుణాలు మంజూరు (స్పాట్ లోన్ సాంక్షన్) చేయనున్నారు. దీనివల్ల కస్టమర్లకు తక్కువ ఖర్చుతో, వేగంగా రుణాలు పొందే అవకాశం లభిస్తుంది. -
HDFC బ్యాంక్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్'(WFH) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం.. అర్హులైన ఉద్యోగులు వారానికి రెండు రోజుల పాటు ఇంటి నుండి లేదా రిమోట్గా పని చేయడానికి బ్యాంక్ అనుమతినిచ్చింది.ఈ కొత్త పాలసీ తక్షణమే అమలులోకి వచ్చిందని, ప్రాథమికంగా 30 రోజుల పాటు దీన్ని పరిశీలించి, ఫలితాల ఆధారంగా ఈ విధానాన్ని కొనసాగించేది.. లేనిది నిర్ణయించినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారాలు వెల్లడించారు. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంధనాన్ని పొదుపు చేసేందుకు కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వీరికే వర్క్ ఫ్రమ్ హోమ్..బ్యాంకు మౌలిక సదుపాయాలకు సంబంధించిన రెండు ప్రధాన విభాగాలలోని ఉద్యోగులకు ఈ హైబ్రిడ్ వర్క్ మోడల్ వర్తిస్తుంది. బిజినెస్ ఎనేబుల్ ఫంక్షన్లు అంటే ట్రెజరీ ఆపరేషన్స్, క్రెడిట్ అండర్ రైటింగ్ & రిస్క్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ (IT) సేవలు వంటి కీలక కార్యాచరణ విభాగాల్లో పని చేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందుబాటులో ఉంటుంది. అలాగే కార్పొరేట్ ఎనేబుల్ ఫంక్షన్లు అయిన హ్యూమన్ రీసోర్సెస్ (HR), ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్ & కాంప్లయన్స్, అలాగే సెక్రటేరియల్, బోర్డు విధులు నిర్వహించే అధికారులు కూడా రిమోట్ వర్క్ విధానంలో పనిచేస్తారు.అయితే కస్టమర్లతో నేరుగా లావాదేవీలు జరిపే బ్యాంక్ బ్రాంచ్లు (శాఖలు), ఇతర ఫ్రంట్-ఆఫీస్ కార్యకలాపాల్లో నిమగ్నమైన ఉద్యోగుల పని విధానంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆయా విభాగాలు ఎటువంటి అంతరాయం లేకుండా యథావిధిగా కొనసాగుతాయని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పష్టం చేసింది. -
ఎన్ఎంఐఎంఎస్ డిగ్రీ కోర్సులకు రిజిస్ట్రేషన్లు
భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే విద్యకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఎస్వీకేఎం వారి నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ఎంఐఎంఎస్) మల్టీ డిసిప్లైనరీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను రూపొందించింది. విద్యార్థులను పరిశ్రమ-ఆధారిత పాఠ్యాంశాలు, అనుభవపూర్వకమైన అభ్యాసం,విమర్శనాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వాస్తవ-ప్రపంచ అనుభవం కోసం సిద్ధం చేసే ఒక అండర్ గ్రాడ్యుయేట్ అభ్యాస వ్యవస్థను తయారు చేసినట్లు ఎన్ఎంఐఎంఎస్ తెలిపింది.2026—27 విద్యా సంవత్సరానికి గానూ ఎన్ఎంఐఎంఎస్ ముంబై, నవి ముంబై, శిర్పూర్, బెంగళూరు, హైదరాబాదు, ఇండోర్, చండీఘడ్, అహ్మదాబాద్ లోని తమ ప్రాంగణాలలో అండర్ గ్రాడ్యుయేట్ అవకాశాలను అందిస్తోంది. ఎన్పిఏటి (కామర్స్), ఎన్సిఈటి (ఇంజనీరింగ్ & ఫార్మసీ), ఎన్ఎల్ఏటి (లా), ఎన్డిఏటి (డిజైన్), ఎంఎస్టి (మ్యాథమాటిక్స్, స్టాటిస్టిక్స్ & డేటా సైన్సెస్) సహా ఎంచుకున్న కోర్స్ ఆధారంగా వివిధ ప్రవేశ పరీక్షల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ రిజిస్ట్రేషన్లకు గడువు మే 26న ముగుస్తుంది. -
"ఏవియేషన్ రంగానికి చిరునామాగా హైదరాబాద్"
సాక్షి, హైదరాబాద్: వైమానిక, అంతరిక్ష, రక్షణ, డీప్టెక్ రంగాల్లో హైదరాబాద్ వ్యూహాత్మక కేంద్రంగా ఎదుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు తెలిపారు. అమెరికా విమానయాన సంస్థ సౌత్వెస్ట్ హైదరాబాద్లో తన గ్లోబల్ ఇన్నొవేషన్ సెంటర్ (జీఐసీ)ని ఏర్పాటు చేయడం కూడా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోందని ఆయన అన్నారు.హైటెక్ సిటీ ప్రాంతంలో బుధవారం సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ జీఐసీ కేంద్రాన్ని ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ పాతికేళ్ల క్రితమే దేశంలోనే తొలి విమానాశ్రయ నిర్మాణానికి పీపీపీ మోడల్ను ఎంచుకోవడంతో హైదరాబాద్లో వైమానిక రంగానికి పునాది పడిందని తెలిపారు. డీఆర్డీవో, ఆర్సీఐ, డీఎంఆర్ఎల్ వంటి దిగ్గజ రక్షణ రంగ సంస్థలకు కేంద్రమైన హైదరాబాద్ అత్యాధునిక ఇంజినీరింగ్, సృజనలకు కేంద్రంగా అవతరిస్తోందని అన్నారు. గత ఏడాది కాలంలోనే అంతర్జాతీయ కంపెనీలు బోలెడు హైదరాబాద్లో తమ తొలి ఇన్నొవేషన్ సెంటర్ ఏర్పాటు చేశాయని అన్నారు.సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్ మాట్లాడుతూ... ‘‘ఇంజినీరింగ్, అనలిటిక్స్, ఇన్నొవేషన్లకు సంబంధించినంత వరకూ హైదరాబాద్లో అద్భుతమైన నైపుణ్యం అందుబాటులో ఉంది. అందుకే మేము మా తొలి ఇన్నొవేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము’’ అని వ్యాఖ్యానించారు. ఏఐ, డేటా, నెక్స్ట్ జనరేషన్ ఇంజినీరింగ్లతోపాటు బిజినెస్ ఆపరేషన్లను కూడా ఈ కేంద్రం నుంచి నడపనున్నట్లు తెలిపారు.వెయ్యి మందికి కొలువులు...సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ జీఐసీలో ప్రస్తుతం 170 మంది పనిచేస్తూండగా.. దశలవారీగా వెయ్యి మంది వరకూ ఉద్యోగాలు పొందుతారని సంస్థ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లారెన్ వుడ్స్ ‘సాక్షి.కాం’కు తెలిపారు. ఈ కేంద్రంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే ఉద్యోగాలు పొందుతారని, ప్రస్తుతానికి విదేశీయులను నియమించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లోని యూనివర్శిటీలు, తెలంగాణ ప్రభుత్వ స్కిల్ వర్శిటీతోనూ కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ దాదాపు పదేళ్లుగా మెషీన్ లెర్నింగ్పై దృష్టి పెట్టిందని, సంస్థ కార్యకలాపాల నిర్వహణలో ప్రస్తుతం ఏఐ కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్ జీఐసీ ద్వారా సమీప భవిష్యత్తులోనే మరిన్ని ఉపయోగకరమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తామన్నారు.తొలి టికెటింగ్ మెషీన్ మాదే..సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో సృజనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తామని, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్ టికెటింగ్ మెషీన్ను వినియోగించిన సంస్థ తమదేనని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఇన్నొవేషన్ హెడ్ (ఇండియా) కల్లెపల్లి కృష్ణ తెలిపారు. 1971లో ఈ టికెటింగ్ మెషీన్ను ప్రారంభిస్తే 1994లోనే అత్యాధునిక రిజర్వేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తర అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ భవిష్యత్తులో భారత్లోనూ ఎగిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేధ అనేది ప్రస్తుతం ఏ కంపెనీకైనా ఇతర కంపెనీలపై అడ్వాంటేజ్ ఇచ్చేదేనని, అందుకే సౌత్వెస్ట్ కూడా ఈ రంగంలో తగిన చర్యలు తీసుకుంటోందని వివరించారు. -
ఈవీలకు మారే ఉద్యోగులకు హైదరాబాద్ ఐటీ కంపెనీ ఆఫర్
ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు , హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ అజా కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసే తమ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.ఈవీ కార్లు కొనుగోలు చేసే ఉద్యోగులకు రూ.10 వేల ప్రోత్సాహకం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసే వారికి రూ.5 వేల ప్రోత్సాహకం అందజేస్తామని ఆ కంపెనీ సీఈఓ ఫణిరాజ్ జలిగామ ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణ హితమైన ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.ఇటీవల ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయని, దాంతో ప్రధాన మంత్రి కార్ పూలింగ్ను ప్రోత్సహించడంతో పాటు పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఈవీలకు మారాలని, ప్రజా రవాణా వ్యవస్థను విస్త్రృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారని ఫణిరాజ్ తెలిపారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ విదేశీ మారక నిల్వలను ఆదా చేయవచ్చన్నారు.ప్రధాని విజన్కు అనుగుణంగా ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలో ‘గ్రీన్ పాలసీ’ /‘ఈవీ పాలసీ’ను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఉద్యోగులు స్వచ్ఛమైన, ఇంధన పొదుపు కలిగిన రవాణా మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. -
ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - బాంబే’ (ఐఐటీ-బీ) తన సత్తాను చాటుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్లేస్మెంట్ నివేదికను ఐఐటీ బాంబే తాజాగా విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మొత్తం ఉద్యోగ ఆఫర్ల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ విద్యార్థులకు లభించిన సగటు, మధ్యస్థ వేతన ప్యాకేజీలు మాత్రం 10 శాతానికి పైగా పెరగడం విశేషం. జులై 2024 నుంచి జూన్ 2025 మధ్య రెండు విడతలుగా ఈ ప్లేస్మెంట్ ప్రక్రియ సాగింది.తగ్గిన ఆఫర్లు.. పెరిగిన డిమాండ్ఈ ఏడాది ప్లేస్మెంట్ సీజన్లో విద్యార్థులు మొత్తం 1,422 ఉద్యోగ ఆఫర్లను అంగీకరించారు. ఇందులో అంతర్జాతీయ కంపెనీలు ఆఫర్ చేసిన 65 గ్లోబల్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐఐటీ-బీలో ఈసారి రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య స్వల్పంగా 2% పెరిగి 2,469 కి చేరింది. వీరిలో 2,040 మంది విద్యార్థులు రెండు దశల్లోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. అయితే, కొన్ని గ్లోబల్ కంపెనీలు నియామకాల్లో ఆచితూచి వ్యవహరించడంతో మొత్తం ఆఫర్ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 3.5% మేర తగ్గింది. భారీ ప్యాకేజీలు సాధించిన విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగం సాధించిన వారి సగటు వార్షిక వేతనం రూ.26.45 లక్షలుగా ఉంది.రంగాల వారీగా నియామకాలుఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలు ఎప్పటిలాగే సింహభాగాన్ని ఆక్రమించగా.. కన్సల్టింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ప్రొడక్ట్ మేనేజ్మెంట్ రంగాలు గట్టి పోటీనిచ్చాయి.రంగంకంపెనీల సంఖ్యలభించిన ఆఫర్లుఇంజినీరింగ్ విభాగం96429ఐటీ124393గమనిక: ఐటీ రిక్రూటర్లలో 99 కంపెనీలు కేవలం కోర్ సాఫ్ట్వేర్ పాత్రల కోసమే విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.బీటెక్, కంప్యూటర్ సైన్స్దే జోరుకోర్సుల వారీగా చూస్తే బీటెక్, డ్యూయల్ డిగ్రీ విద్యార్థులకు కంపెనీల నుంచి భారీ డిమాండ్ వ్యక్తమైంది. బీటెక్కు సంబంధించి దాదాపు 82 శాతం ప్లేస్మెంట్ రేటు నమోదైంది. డ్యూయల్ డిగ్రీ పరంగా 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు.72 శాతానికి పైగా ఎంటెక్ విద్యార్థులు ప్లేస్మెంట్లు పొందారు. అత్యంత డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో రిజిస్టర్ చేసుకున్న 277 మంది విద్యార్థులలో 258 మంది అత్యుత్తమ ప్యాకేజీలు పొందారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలు కూడా మెరుగైన ప్లేస్మెంట్ గణాంకాలను నమోదు చేశాయి.పీహెచ్డీల చూపు.. స్టార్టప్ల వైపు!ఇతర రెగ్యులర్ కోర్సులతో పోలిస్తే పీహెచ్డీ విద్యార్థుల ప్లేస్మెంట్ గణాంకాలు తక్కువగా ఉన్నాయి. అయితే దీనికి కారణం ఉద్యోగాలు లేకపోవడం కాదు; గ్రాడ్యుయేటింగ్ పరిశోధకులు కార్పొరేట్ ఉద్యోగాల కంటే పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్లు, సొంతంగా స్టార్టప్ వెంచర్లను ప్రారంభించడానికే మొగ్గు చూపడం వల్లనేనని నివేదిక స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు
మహారాష్ట్రకు చెందిన సహకార బ్యాంకింగ్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు చేపడుతోంది. మహారాష్ట్ర, ఫాల్టాన్కు చెందిన ‘యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్’ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం పని వేళలు ముగిసినప్పటి నుంచి ఈ బ్యాంక్ ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు (డిపాజిట్లు స్వీకరించడం, రుణాల చెల్లింపులు వంటివి) నిర్వహించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.లైసెన్స్ రద్దుకు కారణాలుబ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949లోని కీలక నిబంధనలను పాటించడంలో యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్తిగా విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ వద్ద ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులు, సంపాదన సామర్థ్యం దాని ప్రస్తుత డిపాజిటర్లకు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడానికి సరిపోవు. బ్యాంక్ భవిష్యత్తులో లాభాల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ఈ బ్యాంకును ఇంకా కొనసాగనిస్తే అది సామాన్య డిపాజిటర్ల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆర్బీఐ చెప్పింది.తదుపరి చర్యలుబ్యాంకును శాశ్వతంగా మూసివేయడానికి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, అలాగే బ్యాంకు ఆస్తుల అమ్మకం, బాధ్యతల నిర్వహణ కోసం ఒక సమర్థవంతమైన ‘లిక్విడేటర్’(ఒక సంస్థ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరినప్పుడు దాని లిక్విడేషన్ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం లేదా కోర్టు నియమించే ఒక అధికారిక వ్యక్తి)ను నియమించాలని మహారాష్ట్ర సహకార కమిషనర్, సహకార సంఘాల రిజిస్ట్రార్ను ఆర్బీఐ కోరింది.డిపాజిటర్లకు లభించే రక్షణ ఎంత?బ్యాంక్ లైసెన్స్ రద్దు అయినప్పటికీ డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్టం ప్రకారం ప్రతి డిపాజిటర్కు రక్షణ లభిస్తుంది. లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రతి డిపాజిటర్ తన డిపాజిట్ మొత్తానికి గానూ గరిష్టంగా రూ.5,00,000 వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మొత్తాన్ని పొందేందుకు చట్టబద్ధమైన అర్హత కలిగి ఉంటారు. డీఐసీజీసీ ఇప్పటికే సంబంధిత డిపాజిటర్లకు రూ.106.96 కోట్ల మొత్తాన్ని ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ కింద చెల్లించడం గమనార్హం.ఇటీవలి కాలంలో ఆర్థిక మూలాలు బలహీనంగా ఉన్న, నిబంధనలు పాటించని అర్బన్, రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ కఠిన వైఖరి అవలంబిస్తోంది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు కూడా ఇందులో భాగమే. అయితే, ఐదు లక్షల లోపు డిపాజిట్లు ఉన్న ఖాతాదారులకు పూర్తి డబ్బు వెనక్కి వస్తుండటం ఇక్కడ ఊరట కలిగించే అంశం.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
క్రెడిట్ కార్డుల హవా
ముంబై: దేశంలో ఒకవైపు క్రెడిట్ కార్డు లావాదేవీలు దేశంలో శరవేగంగా పెరుగుతుంటే.. మరోవైపు డెబిట్ కార్డు లావాదేవీలు అదే స్థాయిలో తగ్గిపోతున్నాయి. 2021లో 216 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలు 2025 నాటికి 570 కోట్లకు పెరిగాయి. సుమారు 2.6 రెట్లు వృద్ధి నమోదైంది. 2021లో రూ. 8.9 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ 2025 నాటికి రూ. 23.2 లక్షల కోట్లకు చేరినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఐదేళ్ల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో 27 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది. నివేదికలోని అంశాలు.. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల సంఖ్య 2021లో 408.7 కోట్లుగా ఉంటే, 2025 నాటికి 133.6 కోట్లకు పడిపోయాయి. ⇒ డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 7.4 లక్షల కోట్ల నుంచి రూ. 4.5 లక్షల కోట్లకు తగ్గింది. ⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.డిజిటల్ చెల్లింపుల విస్తరణ ⇒ 2016తో పోలిస్తే 2025 నాటికి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల సంఖ్య 33 రెట్లు పెరగ్గా, వాటి విలువ దాదాపు మూడు రెట్లు అధికమైంది. ⇒ ముఖ్యంగా గత ఐదేళ్లలో డిజిటల్ చెల్లింపులు సంఖ్యా పరంగా నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. ⇒ 2025 జూన్లో 6,782 లక్షలుగా ఉన్న క్యూఆర్ కోడ్లు, డిసెంబర్ 2025 నాటికి 7,313 లక్షలకు పెరిగాయి. ⇒ డిజిటల్ చెల్లింపులను స్వీకరించే ఛానళ్లను పరిశీలిస్తే.. గతేడాది జూన్–డిసెంబర్ మధ్య యూపీఐ క్యూఆర్ కోడ్లు, క్రెడిట్ కార్డులు, వ్యాలెట్లలో ఎక్కువ వృద్ధి కనిపించగా, పీవోఎస్ టెరి్మనళన్లు, ఏటీఎంలు, మైక్రో ఏటీఎంల వినియోగం తగ్గింది.⇒ యూపీఐ, డిజిటల్ వాలెట్లు, క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అయితే, ఇప్పటికీ క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఎక్కువ మంది చేతుల్లో ఉన్నాయి. ⇒ ప్రైవేటు రంగ బ్యాంకులు క్రెడిట్ కార్డు మార్కెట్లో తమ వాటాను 2021 చివరికి ఉన్న 67.7 శాతం నుంచి 2025 చివరికి 71.1 శాతానికి పెంచుకున్నాయి. ⇒ ఇక క్రెడిట్కార్డు మార్కెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ వాటాను స్వల్పంగా 23.5 శాతం నుంచి 23.9శాతానికి పెంచుకున్నాయి. ⇒ విదేశీ బ్యాంకుల వాటా 9.3 శాతం నుంచి 3.8కి పడిపోయింది. ⇒ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు డిసెంబర్ 2025 నాటికి మొత్తం 14 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేశాయి. -
భారత్లో రూ. 5,700 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫుడ్, బెవరేజెస్ దిగ్గజం పెప్సీకో 2030 నాటికి భారత్లో రూ. 5,700 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయ నుంది. ప్రధానంగా ఆహారోత్పత్తుల తయా రీ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఈ మొత్తా న్ని వెచ్చించనున్నట్లు సంస్థ ఇండియా, సౌత్ ఏషి యా సీఈవో జాగృత్ కొటేచా తెలిపారు. మధ్యప్రదేశ్లోని కాన్సెంట్రేట్స్ ప్లాంటులో, అస్సాం..తమిళనాడులోని స్నాక్స్ ప్లాంట్లపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవలే స్థలాన్ని కూడా సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆదాయాలు, వినియోగం స్థిరంగా పెరుగుతున్న భారత్ తమకు టాప్ 13 మార్కెట్లలో ఒకటని ఆయ న చెప్పారు.గతేడాది (2025)లో రూ. 9,789 కోట్ల ఆదాయంపై రూ. 905 కోట్ల లాభం ఆర్జించినట్లు జాగృత్ తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా పటిష్టంగా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందినట్లు వివరించారు. ఫుడ్ సెగ్మెంట్లో 11 శాతం వృద్ధి సాధించినట్లు పెప్సీకో ఇండియా, సౌత్ ఏషియా సీఎఫ్వో సవిత బాలచంద్రన్ తెలిపారు. వాతావరణం కారణంగా శీతల పానీయాల విభాగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, పోటీ కూడా పెరిగిందని చెప్పారు. అయినప్పటికీ రెండు విభాగాలు మెరుగ్గా రాణించినట్లు పేర్కొన్నారు. -
Vodafone Idea: రూ.లక్ష కోట్లు సమీకరణపై ఆశలు
వచ్చే మూడేళ్లలో అవసరమయ్యే రూ. 1 లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు కొత్త రుణాలు, ట్యాక్స్ రిఫండ్లు, ప్రమోటర్ల నుంచి మరిన్ని పెట్టుబడులపై టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) భారీగా ఆశలు పెట్టుకుంది. మార్కెట్లో నిలబడే దిశగా నెట్వర్క్ని మెరుగుపర్చుకునేందుకు కంపెనీ దాదాపు రూ. 45,000 కోట్లు వెచ్చించనుంది. అలాగే, వచ్చే మూడేళ్లలో స్పెక్ట్రం చార్జీల కింద సంస్థ రూ. 49,000 కోట్లు, రుణభారానికి సంబంధించిన వడ్డీల కోసం మరో రూ. 5,000-6,000 కోట్లు చెల్లించాల్సి రానుంది.అయితే.. మరింత రుణాన్ని ఈక్విటీ కింద మార్చాల్సిన అవసరం లేకుండానే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించగలమని వీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తేజస్ మెహతా తెలిపారు. తాము రూ. 25,000 కోట్ల నిధులతో పాటు మూడేళ్ల వ్యవధిలో రూ. 60,000 కోట్ల వరకు ఎబిటాను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఇక ట్యాక్స్ రిఫండ్ కింద మరో రూ. 10,000 కోట్లు రావాల్సి ఉంటుందని వివరించారు.కొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలు..పోస్ట్పెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా మరిన్ని ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాకేజీలను ఆవిష్కరించినట్లు వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా తెలిపారు. ఇవి 7 రోజులు, 14 రోజులు, 21 రోజుల కాలవ్యవధితో లభిస్తాయని వివరించారు. దీనితో మొత్తం 1 రోజు నుంచి 30 రోజుల వరకు వేలిడిటీతో 17 రకాల ప్యాక్లను అందిస్తున్నట్లవుతుందన్నారు. -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మాతృ సంస్థ మెటా (Meta) త్వరలో, భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టబోతోందని వచ్చిన సమాచారం.. టెక్ ప్రపంచంలో చర్చకు దారితీసింది. ఈసారి కంపెనీ సుమారు 10 శాతం మందిని తొలగించే అవకాశం ఉంది.మెటా కంపెనీ సుమారు 8,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. 2025 చివరి నాటికి సంస్థలో పనిచేసేవారి సంఖ్య సుమారు 78,000గా ఉండేది. దీన్నిబట్టి చూస్తే లేఆఫ్స్ ప్రభావం సుమారు 10 శాతం ఉద్యోగులపై పడుతుందని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో కొత్త నియామకాలను కూడా నిలిపివేస్తున్నట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఖర్చులు తగ్గించడమే కాకుండా, కంపెనీని కొత్త దిశగా మలచడానికి తీసుకుంటున్న నిర్ణయాలు అని తెలుస్తోంది.మెటా ఇప్పుడు తన సంస్థ నిర్మాణాన్ని పూర్తిగా మార్చుకోవడంలో భాగంగా.. పెద్ద పెద్ద టీమ్లకు బదులుగా చిన్న, వేగంగా పనిచేసే టీమ్లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. కంపెనీ ఇప్పుడు పూర్తిగా ఏఐ కేంద్రంగా మారుతోంది. సంస్థ భవిష్యత్ పెట్టుబడుల్లో భారీ భాగాన్ని ఏఐ డేటా సెంటర్లు, చిప్లు, మోడల్ ట్రైనింగ్ వంటి రంగాల్లో పెట్టనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా.. ఉద్యోగుల తొలగింపు మాత్రమే కాదు, 7000 మంది కొత్త ఏఐ ఆధారిత ప్రాజెక్ట్ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు ఉద్యోగుల్లో అసంతృప్తిని కూడా పెంచుతున్నాయి. దీంతో కంపెనీ అంతర్గత వాతావరణం కొంత ఒత్తిడిగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని AI టూల్స్ ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తాయన్న భయం కూడా ఉంది. కంపెనీ మాత్రం వాటిని కేవలం AI శిక్షణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నామని వివరణ ఇస్తోంది. -
హైదరాబాద్లో ఐసాల్వ్డ్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: మానవ వనరుల నిర్వహణ రంగంలో ప్రసిద్ధి చెందిన అమెరికన్ కంపెనీ ‘ఐసాల్వ్డ్’ హైదరాబాద్లో తన కార్యకలాపాలను భారీగా విస్తరించింది. సుమారు 400 మంది ఉద్యోగులకు అవసరమైన కేంద్రాన్ని మంగళవారం ఆవిష్కరించింది. అమెరికాలో రెండు లక్షల సంస్థలకు చెందిన సుమారు 90 లక్షల మంది ఉద్యోగుల వ్యవహారాలు చూసే ఐసాల్వ్డ్ ఇకపై హైదరాబాద్ కేంద్రంగా సరికొత్త టెక్నాలజీల ఆవిష్కరణ చేపట్టనుంది.కంపెనీ ప్రధాన సాఫ్ట్వేర్ ఉత్పత్తి ‘పీపుల్స్ క్లౌడ్’ ఆధునికీకరణ మొదలుకొని ‘బెట్టర్ బెనిఫిట్స్’, ‘మార్కెట్ప్లేస్’ల నిర్వహణ, కస్టమర్ సపోర్ట్ వ్యవహారాలను ఇండియా కేంద్రం నుంచి నిర్వహించనున్నామని కంపెనీ జనరల్ మేనేజర్ యోగేశ్ మోరె తెలిపారు. కంపెనీ ఆపరేషన్స్లో కృత్రిమ మేధ కూడా కీలకపాత్ర పోషిస్తోందని ఆయన చెప్పారు. హెచ్ఆర్ వ్యవహారాలకు సంబంధించిన మెయిళ్లను చదివి ఆయా సమస్యల పరిష్కారానికి ఏఐ ఒక పద్ధతిని సూచిస్తే... వాటిని ఇంజినీర్లు పరిశీలించి ఓకే చేస్తారని, తద్వారా సంక్లిష్టమైన వ్యవహారాలను కూడా సులువుగా చక్కబెట్ట వచ్చునని ఆయన వివరించారు. ఐసాల్వ్డ్ ఏడాదికి 22 - 25 సీఏజీఆర్తో వృద్ధి చెందుతోందని తెలిపారు.అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వ స్పీడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వల్లభి ‘ఐసాల్వ్డ్’ కార్యాలయాన్ని రిబ్బన్ కత్తిరించి ఆవిష్కరించారు. ఐసాల్వ్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రగ్యా గుప్తా, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అఈమ మోషేర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వల్లభి మాట్లాడుతూ ఐసాల్వ్డ్లో 65 శాతం జెండర్ డైవర్సిటీ ఉండటం తన దృష్టిని ఆకర్శించిందని తెలిపారు. కంపెనీల్లో ఈ స్థాయి జెండర్ డైవర్సిటీ ఉంటం చాలా అరుదని అన్నారు. ఐసాల్వ్డ్ సంస్థ అమెరికా తరువాత అతిపెద్ద కార్యాలయ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకోవడం సంతోషకరమైన విషయమని అన్నారు.హైదరాబాద్ అంతర్జాతీయ సంస్థల జీసీసీ కేంద్రంగా వేగంగా ఎదుగుతోందని, ఇంజినీరింగ్తోపాటు కృత్రిమ మేధ రంగంలోనూ హైదరాబాద్ను గ్లోబల్ కేపిటల్గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. తగిన మౌలిక సదుపాయాలు, పాలన అందించడం, బిజినెస్కు తగ్గ వాతావరణాన్ని అభివృద్ధి చేసిన నేపథ్యంలో ఐసాల్వ్డ్ లక్ష్యాలు కూడా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అంకెల్లో పెరిగినా.. చేతిలో సున్నా! -
భారీగా పెరిగిన వెండి ఆభరణ ఎగుమతులు!
రత్నాభరణాల ఎగుమతుల రంగం ఏప్రిల్లో ప్రతికూలతలను చవిచూసింది. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఎగుమతులు ఢీలా పడ్డాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చి చూసినప్పుడు ఎగుమతులు 9 శాతం తగ్గి 2,226 మిలియన్ డాలర్లకు (రూ.20,825 కోట్లు సుమారు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. క్రితం ఏడాది ఏప్రిల్లో ఎగుమతులు 2,448 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఏప్రిల్లో కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 19.65 శాతం తగ్గి 890.91 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ల్యాబ్లో తయారు చేసిన వజ్రాల ఎగుమతులు సైతం 15 శాతానికి పైనే క్షీణించి 93.28 మిలియన్ డాలర్లకు చేరాయి.బంగారం ఆభరణాల ఎగుమతులు ఏకంగా 21.77 శాతం తగ్గి 841.54 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. సాధారణ బంగారం ఆభరణాల ఎగుమతులు 342 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఏప్రిల్తో పోల్చితే 47 శాతం తక్కువ. స్టడెడ్ (రాళ్లు పొదిగిన) బంగారం ఆభరణాల ఎగుమతులు మాత్రం 16 శాతం వృద్ధి చెంది 500 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక వెండి ఆభరణాల ఎగుమతులు ఏకంగా 444 శాతం ఎగసి 268 మిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే నెలలో వీటి ఎగుమతులు 49 మిలియన్ డాలర్లుగానే ఉండడం గమనార్హం.


