breaking news
Corporate
-
ముడి చమురు స్టోరేజ్ కోసం రూ.5,700 కోట్లతో ప్రాజెక్ట్
భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలు పెంచే లక్ష్యంతో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని పాదుర్లో రూ.5,700 కోట్ల వ్యయంతో వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (ఎస్పీఆర్) యూనిట్ను నిర్మించనున్నట్లు తెలిపింది. దేశంలోని ప్రైవేట్ రంగ సంస్థ ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ చొరవ సాంప్రదాయకంగా ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్న ఇంధన భద్రతలో పరివర్తనాత్మక మార్పును సూచిస్తుంది.వ్యూహాత్మక ముందడుగుఈ ప్రాజెక్ట్ ద్వారా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) ఎస్పీఆర్ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది భారతదేశం అత్యవసర ముడి చమురు నిల్వలకు గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 5.33 ఎంఎంటీ వ్యూహాత్మక నిల్వలను పెంచడానికి ఈ సదుపాయం తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిల్వల ద్వారా పూర్తి సామర్థ్యంతో 8-9 రోజుల జాతీయ ముడి చమురు డిమాండ్ను తీర్చవచ్చు. కొత్త స్టోరేజీ అందుబాటులోకి వస్తే మరిన్ని రోజులు ఇంధన భద్రత ఉంటుందని చెబుతున్నారు.ఇది అమలులోకి వస్తే ప్రపంచ సరఫరా అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లేదా ఊహించని డిమాండ్ పెరిగినా దేశ ఇంధన బఫర్కు తోడ్పడుతుంది. ఈ రిజర్వ్ను నిర్మించడానికి ఎంఈఐఎల్కు ఐదేళ్ల సమయం అవసరం అవుతుందని తెలిపింది. 60 సంవత్సరాల పాటు కంపెనీ దీని నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. ప్రస్తుత ప్రపంచ చమురు ధరల ప్రకారం ఈ కెపాసిటీలో ముడి చమురు నింపే ఖర్చు 1.25 బిలియన్ డాలర్లు (రూ.11,020 కోట్లు)గా అంచనా వేశారు. దాంతో ఇది భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం మౌలిక సదుపాయాల్లో అతిపెద్ద ప్రైవేట్ రంగ పెట్టుబడిగా నిలిచింది. ఈ స్టోరేజ్ యూనిట్ను కంపెనీ నేరుగా నిర్వహించవచ్చు లేదా ఇతర చమురు నిర్వహణ సంస్థలకు లీజుకు ఇవ్వొచ్చు.ప్రత్యేకతలు..మొదటి ప్రైవేట్ ఎస్పీఆర్: ఇంధన నిల్వల్లో ప్రభుత్వ సంస్థల గుత్తాధిపత్యాన్ని వైవిధ్యం చేస్తుంది.పబ్లిక్-ప్రైవేట్ సినర్జీ: జాతీయ భద్రతతో అనుసంధానించిన మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ సంస్థలు పాల్గొనేలా ప్రభుత్వ దృక్పథం మారడాన్ని ప్రతిబింబిస్తుంది.ఇంధన భద్రత: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశ చమురు నిల్వలకు కీలకంగా మారనుంది.వ్యూహాత్మక ప్రదేశం: పదుర్ ఇప్పటికే ఎస్పీఆర్ మౌలిక సదుపాయాలకు కేంద్రంగా ఉంది. ఇది లాజిస్టిక్, కార్యాచరణ సామర్థ్యాలను సులభతరం చేస్తుంది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
హైదరాబాద్లో అంతర్జాతీయ యుఎక్స్ఇండియా సదస్సు
మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. 21వ అంతర్జాతీయ యూఎక్స్ఇండియా25 సదస్సు (UXINDIA 2025) ఈ నెల 18 నుంచి 20 వరకు హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరుగనుంది. ఈ సదస్సులో 1,400 మందికి పైగా ప్రతినిధులు, 80 మందికి పైగా నిపుణులు, 10 మంది ప్రధాన వక్తలు పాల్గొననున్నారు.బెంగళూరులో రెండు ఎడిషన్స్ తర్వాత, యుఎక్స్ఇండియా హైదరాబాద్ను డిజైన్ సంభాషణ, ఆవిష్కరణల ప్రపంచ కేంద్రంగా మార్చడానికి సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం థీమ్, ‘డిజైన్: ఒక జీవన విధానం’ వ్యవస్థాపకత భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు, వెంచర్లను రూపొందించడంలో డిజైన్, కృత్రిమ మేధస్సుల శక్తివంతమైన కలయికను ఇది తెలియజేస్తుంది.ఈ కార్యక్రమంలో డిజైన్ ప్రదర్శనలు ఉంటాయి. వీటిలో కొత్త ఆవిష్కరణలతో కూడిన వ్యాపార ఆలోచనలను యువ వ్యాపారవేత్తలు పెట్టుబడిదారుల ముందు ప్రవేశపెట్టనున్నారు. అలాగే, ప్రపంచ నాయకులు మాత్రమే పాల్గొనే ప్రత్యేక వేదికలో వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా 2030 నాటికి ఒక మిలియన్ మహిళలకు డిజైన్ విద్య అందించాలన్న యూఎంఓ లక్ష్యం దిశగా, మహిళా డిజైనర్ల పాత్రపై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నారు.మైక్రోసాఫ్ట్, క్యాండెసెంట్, కాగ్నిజెంట్, ఫ్రెష్వర్క్స్, ఫిలిప్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు డిజైన్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై చర్చించనున్నారు. అలాగే, ఉత్పత్తులు, ఆవిష్కరణలలో వేగంగా ఎదుగుతున్న కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యం పొందనుంది. “ఈ ఏడాది యూఎక్స్ ఇండియా సదస్సు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు,” అని యూఎంఓ డిజైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాపు కలాధర్ అన్నారు. -
'ది బిగ్ బిలియన్ డేస్ 2025' తేదీలు ప్రకటించిన ఫ్లిప్కార్ట్
భారతదేశపు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తన వార్షిక అట్టహాసమైన షాపింగ్ ఫెస్టివల్ 'ది బిగ్ బిలియన్ డేస్ (TBBD) 2025' తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుండగా, ఫ్లిప్కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు సెప్టెంబర్ 22న అంటే 24 గంటల ముందే ప్రత్యేక యాక్సెస్ లభించనుంది. సెప్టెంబర్ 8న ప్రారంభమైన ‘అర్లీ బర్డ్ డీల్స్’ ఇప్పటికే బ్యూటీ, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఉత్సాహాన్ని కలిగించాయి.ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ను భారత్లోని అత్యంత వేగవంతమైన డెలివరీ సేవ అయిన ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ కూడా భాగస్వామ్యం చేయనుంది. 19 నగరాల్లో 3,000 పిన్కోడ్లకు 10 నిమిషాల్లో డెలివరీ అందించనుంది. అదేవిధంగా, స్మార్ట్ఫోన్లు, ఏఐ ల్యాప్టాప్లు, 4కే టీవీలు, కొరియన్ బ్యూటీ బ్రాండ్స్ వంటి ప్రీమియం ఉత్పత్తులు ఆకర్షణీయమైన ధరలకు లభించనున్నాయి.ఫ్లిప్కార్ట్ ఈ ఫెస్టివ్ సీజన్లో అభివృద్ధి చెందుతున్న నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. షాప్సీ ద్వారా రూ.29/- నుండి ప్రారంభమయ్యే డీల్స్, 100% సూపర్ కాయిన్ల రివార్డ్స్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. సప్లై చైన్ విభాగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, 400 కొత్త మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి, వేగవంతమైన డెలివరీకి మార్గం వేసింది.ఇతర బ్యాంకింగ్ భాగస్వామ్యాలు, క్యాష్బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ, యూపీఐ డిస్కౌంట్లు మొదలైన వాటితో ఫ్లిప్కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేషస్ను ఇండియా డిజిటల్ ఫ్యూచర్కి దారితీసే వేడుకగా మార్చేందుకు సిద్ధమైంది. -
తొలి ప్రైవేట్ స్టార్టప్ పార్క్.. గ్రామీణ యువకుడి ప్రయత్నం
భారతదేశంలో స్టార్టప్లు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిత అవరోధాలను తొలగించేందుకు ఒక యువ పారిశ్రామికవేత్త ముందుకొచ్చాడు. గ్రామీణ కేరళకు చెందిన షఫీ షౌఖత్.. బెంగళూరులో రూ.600 కోట్లు విలువ చేసే స్టార్టప్ పార్క్ను స్థాపించి దేశవ్యాప్తంగా వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయగల నూతన వ్యవస్థను నిర్మిస్తున్నారు.గ్రామం నుంచి గ్లోబల్ దిశగా..స్టార్టప్లకు అవసరమైన మార్గనిర్దేశం, పెట్టుబడులు వంటి వనరులేవీ లేని కేరళలోని ఒక చిన్న గ్రామంలో షఫీ షౌఖత్ పెరిగారు. ఈ అనుభవం కారణంగా, తాను ఏర్పాటుచేసే స్టార్టప్ పార్క్లో ప్రతి సమస్యకు ప్రత్యేక పరిష్కార మార్గాలు ఉండేలా, “ప్రాబ్లం-ఫస్ట్ ఫ్రేమ్వర్క్”ను రూపొందించారు.“సాధారణ ప్రోగ్రామ్స్ తో యూనిక్ సమస్యలు పరిష్కరించలేము” అని చెప్పే షౌఖత్ “ఎగ్జిక్యూషన్ ఆధారంగా, మెజరబుల్ ఇంపాక్ట్ వచ్చే విధంగా వ్యవస్థలు రూపొందించాలి” అంటున్నారు.స్టార్టప్ పార్క్ లక్ష్యాలుదేశవ్యాప్తంగా ఉన్న యువ వ్యవస్థాపకులను అనుసంధానించడంవ్యక్తిగత అవసరాలకు తగిన మెంటార్షిప్, పెట్టుబడి అవకాశం కల్పించడంప్రభుత్వాల కోసం పాలసీ ప్రయోగశాలగా పనిచేయడంపెట్టుబడిదారులకు డేటా ఆధారంగా దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించడంలో సహకారంనెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్షౌఖత్ ప్రారంభించిన నెక్స్ట్ లీడర్స్ ప్రోగ్రామ్కు ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది. ఇందులో హై-పొటెన్షియల్ వ్యక్తుల ఎంపిక, వారి ప్రతిభకు తగ్గ స్టార్టప్ అనుభవం, పరిశ్రమ ప్రముఖుల నుంచి స్రాటెజిక్ మార్గదర్శనం, పెట్టుబడిదారులు, పాలిసీ మేకర్లు ఉన్న నెట్వర్క్ను అందుబాటులోకి తేవడం వంటివి ఉన్నాయి.భారత స్టార్టప్ భవిష్యత్తుకు కొత్త నమూనాసాధారణ ఇంక్యుబేటర్ల కన్నా షౌఖత్ రూపొందిస్తున్న ఈ మోడల్ ఒక కొత్త దిశను సూచిస్తుంది. ఇది సిద్ధాంతాల కంటే కార్యాచరణకు, వెయిన్ గణాంకాల కంటే నిజమైన ప్రభావానికి, పోటీ కంటే భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తోంది.ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఈ మోడల్ను అధ్యయనం చేస్తుండటం గమనార్హం. భారతదేశం 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల స్టార్టప్ ఆర్థికవ్యవస్థగా అభివృద్ధి చెందబోతున్న సమయంలో, షఫీ షౌఖత్ తీసుకుంటున్న అడుగులు దేశం భవిష్యత్తు పారిశ్రామికతకు ఒక శక్తివంతమైన బేస్గా నిలవవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. -
ప్రపంచంలో కార్మిక కొరత.. భారత్కు మంచి అవకాశం
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్ గా ఎదగడానికి భారతదేశానికి సువర్ణ అవకాశం ఉందని గతి (GATI) ఫౌండేషన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నివేదిక పేర్కొంది.ఈ నివేదిక ప్రకారం.. 2047 నాటికి, ప్రపంచ కార్మిక కొరత 200-250 మిలియన్లకు (20 కోట్ల నుంచి 25 కోట్లు) చేరుకుంటుందని అంచనా. అంటే అంత మంది కార్మికుల అవసరం ఏర్పడుతుందని అర్థం. యువ జనాభా, పెరుగుతున్న శ్రామిక శక్తితో భారతదేశం ఈ అంతరాన్ని పూరించడంలో సహాయపడటానికి బలమైన స్థితిలో ఉంది.5 కోట్ల ఉద్యోగ అవకాశాలు యూఎస్, యూకే, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు వృద్ధాప్య జనాభా కారణంగా తక్కువ మంది యువ కార్మికులను చూస్తున్నాయి. దీంతో ఇది మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్లకు పైగా నష్టపోతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. వాటిలో కనీసం కోటి ఉద్యోగాలను భారత్ భర్తీ చేయగలదు.భారత్కు పెద్ద అనుకూలతభారతదేశంలో 18-40 సంవత్సరాల వయస్సు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయస్సు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాలలో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు ఇంటికి పంపుతున్నారు.మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుంది.చేయాల్సిందిదే..ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకోవాలంటే కొన్నింటిని మెరుగుపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేవిధంగా కార్మికుల నైపుణ్యాలు, శిక్షణను మెరుగుపరచడం.వేగవంతమైన, సురక్షితమైన, మరింత పారదర్శక వలస వ్యవస్థలను నిర్మించడం.ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ, తయారీ వంటి రంగాలపై దృష్టి పెట్టడం.విదేశాలకు వెళ్లే కార్మికుల కోసం నైతిక, డిజిటల్-ఫస్ట్ ఉద్యోగ మార్గాలను సృష్టించడం. -
విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం
వలసదారులపై మొదటి నుంచే కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూఎస్ పరిశ్రమల్లో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వెల్లడించారు. అంతే కాకుండా.. అమెరికాలో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలు, తాత్కాలికంగా తమ నిపుణులను తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ చర్య విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. సంక్లిష్ట ఉత్పత్తుల తయారీలో అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.ఓడలు, కంప్యూటర్లు, రైళ్లు, సెమీకండక్టర్లు వంటి క్లిష్టమైన ఉత్పత్తులను నిర్మించే విదేశీ కంపెనీలు.. అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వడానికి సొంత దేశాల నుంచి నిపుణులను తీసుకురావాలని ట్రంప్ అన్నారు. మనం ఇలా చేయకపోతే.. భారీ పెట్టుబడులను అమెరికా కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరికఇతర దేశీయలను.. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. మేము కంపెనీలను మాత్రమే కాకుండా.. వారి ఉద్యోగులను కూడా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. క్లిష్టమైన రంగాల్లో కూడా మన దేశం రాణిస్తుంది. ఇది దేశ భవిష్యత్ కూడా అని పేర్కొన్నారు. -
సాఫ్ట్ డ్రింక్స్పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన
శీతల పానీయాలపై జీఎస్టీని సవరిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటనతో డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విభాగంలోని ఉత్పత్తులపై గతంలో 28 శాతం జీఎస్టీ, 12 శాతం పరిహార సెస్(ఆదాయ నష్టాలను పూడ్చేలా కేంద్రం తిరిగి చెల్లించే పన్ను)ను విధించేవారు. క్రమబద్ధీకరించిన విధానం ప్రకారం పరిహార సెస్ ఊసెత్తకుండా నేరుగా జీఎస్టీనే 40 శాతానికి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగిస్తుంది. అయితే వారి వద్ద ఉన్న పాతస్టాక్పై పరిహార సెస్కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.జీఎస్టీ విధానాలు పాటించాల్సిందే..సెప్టెంబర్ 22 నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత పన్ను నిర్మాణం కింద కొనుగోలు చేసిన, అమ్ముడుపోని స్టాక్ వల్ల పంపిణీదారులకు గణనీయమైన వర్కింగ్ క్యాపిటల్ ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. పరిహార సెస్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో దీనికింద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ-వ్యాల్యూ యాడ్ చేసిన దానికి మాత్రమే ట్యాక్స్ చెల్లింపు) ఖర్చుగానే మిగులుతుందనే వాదనలున్నాయి. ‘ఇప్పటికే ఉన్న ఇన్వెంటరీలపై పరిహార సెస్ చెల్లించిన పంపిణీదారులు, వ్యాపారులు సెస్ తొలగించిన తర్వాత భవిష్యత్తులో జీఎస్టీ విధానాలను పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పరిహార సెస్ను ప్రభుత్వం భర్తీ చేయలేదు’ అని ఒక డిస్ట్రిబ్యూటర్ తెలిపారు.ప్రభుత్వ నిర్ణయంతో సవాళ్లుఆల్ ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో పంపిణీదారులకు గణనీయమైన వర్కింగ్ క్యాపిటల్ నష్టం జరుగుతుందని, ఈ విభాగంలోని చిన్న డిస్ట్రిబ్యూటర్లకు ఇది సవాలుగా మారుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ? -
శీతాకాల సమావేశాల్లో బీమా సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బీమా సవరణ బిల్లును వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బీమా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ) ప్రస్తుత నిబంధనల కింద అనుమతి ఉంది. దీన్ని నూరు శాతానికి పెంచనున్నట్టు 2025–26 బడ్జెట్ సందర్భంగా మంత్రి సీతారామన్ ప్రకటించారు. 100 శాతం ఎఫ్డీఐ అనుమతి అన్నది భారత్లో ఆర్జించిన ప్రీమియంను ఇక్కడే ఇన్వెస్ట్ చేసే కంపెనీలకు అమలు చేయనున్నట్టు చెప్పారు. అలాగే, నిబంధనలు, షరతుల్లోనూ మార్పులు చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. బీమా రంగం ఇప్పటి వరకు రూ.82,000 కోట్ల ఎఫ్డీఐని ఆకర్షించడం గమనార్హం. కాంపోజిట్ లైసెన్స్ (జీవిత, సాధారణ బీమా సేవలకు)తోపాటు చెల్లించిన మూలధనం తగ్గింపు కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా ఉన్నాయి. మొదటిసారి 2015లో బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. తిరిగి 2021లో ఈ పరిమితిని 74 శాతం చేసింది. -
ఇండియా హోమ్ లోన్లో వాటా కొనుగోలు
ఇండియా హోమ్లోన్ లిమిటెడ్లో 24.5% వాటా(34.99 లక్షలకుపైగా షేర్లు) దక్కించుకున్నట్లు స్కైబ్రిడ్జ్ వెంచర్స్ ఎల్ఎల్పీ తెలిపింది. అయితే, ఎంతకు కొనుగోలు చేసేందనే వివరాలు వెల్లడించలేదు. శుక్రవారం బీఎస్ఈలో ఇండియన్ హోమ్ లోన్ షేరు ముగింపు (రూ.42.46)తో లెక్కిస్తే డీల్ విలువ రూ.14.85 కోట్లుగా ఉంటుందని అంచనా.‘‘ఈ వాటా కొనుగోలుతో భారత్లో అందుబాటు ధరల గృహాలు, రిటైల్ ఫైనాన్స్ రంగాల్లో దీర్ఘకాల వృద్ధి అవకాశాలు ఆశిస్తున్నాము. సేవలు విస్తరణకు ఒక బలమైన ఫ్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకున్నాము. సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది’’ అని స్కైబ్రిడ్జ్ వెంచర్స్ తెలిపింది.కాగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా హోమ్ ఫైనాన్స్ రూ.13.60 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.12 కోట్లతో పోలిస్తే 13.14% అధికంగా ఉంది. -
ఫ్లిప్కార్ట్కు నష్టం.. మింత్రాకు లాభం
గత ఆర్థిక సంవత్సరంలో ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఇండియా నష్టం మరింత పెరిగి రూ. 5,189 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు రూ. 4,248 కోట్లుగా నమోదయ్యాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫాం టోఫ్లర్ ప్రకారం.. తాజాగా ఆదాయం రూ. 70,542 కోట్ల నుంచి 17 శాతం పెరిగి రూ. 82,787 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 17 శాతం పెరిగి రూ. 88,121 కోట్లకు చేరాయి. మింత్రా లాభం జూమ్..ఫ్యాషన్, లైఫ్స్టయిల్ ఈ–కామర్స్ సంస్థ మింత్రా డిజైన్స్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 548 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 31 కోట్లతో పోలిస్తే ఇది అనేక రెట్లు అధికం కావడం గమనార్హం. మరోవైపు, సమీక్షాకాలంలో సంస్థ ఆదాయం రూ. 5,122 కోట్ల నుంచి 18 శాతం వృద్ధి చెంది రూ. 6,043 కోట్లకు చేరింది. -
జాబ్ హగ్గింగ్: ప్రమాదంలో ఉద్యోగుల భవిష్యత్!
సాధారణంగా ఉద్యోగం నచ్చకపోతే.. మరో ఉద్యోగంలో చేరుతారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. కొంతమంది ఉద్యోగులకు తాము చేస్తున్న జాబ్ నచ్చకపోయినా.. కొత్త ఉద్యోగంలో చేరడానికి భయపడుతున్నారు. దీనిని 'జాబ్ హగ్గింగ్' అని నిపుణులు చెబుతున్నారు.ఆర్ధిక అనిశ్చితి, ఉద్యోగ భద్రత లేకుండా పోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల్లో ఒకింత భయం మొదలైంది. ఇటీవల కాలంలో అమెరికాలో ఉద్యోగావకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉన్న ఉద్యోగంలోనే సురక్షితంగా ఉంటే చాలనుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొత్త ఉద్యోగాల కోసం వెతికే సమయం కూడా పెరిగిపోయింది.కోవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా లేఆప్స్ ఎక్కువయ్యాయి. లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో జాబ్ హగ్గింగ్ మొదలైంది. జాబ్ హగ్గింగ్ అంటే.. ఉద్యోగులు కంపెనీ పట్ల విధేయతతో ఉన్నట్లు కాదు. అది వాళ్ల భయానికి సూచన అని నిపుణులు చెబుతున్నారు. చేస్తున్న పనిలో సంతృప్తి లేకపోయినా.. పరిస్థితులను చూసి భయపడి ఉద్యోగాన్ని వదిలి వెళ్లలేని పరిస్థితి వాళ్లదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికసంవత్సరాల తరబడి.. ఉద్యోగులు ఉద్యోగాల్లో కొనసాగడం యజమానికి మంచిదిగా అనిపించినా.. ఉద్యోగుల్లో మార్పు, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆలోచన తగ్గిపోతుంది. ఇది సంస్థను మాత్రమే కాదు, ఉద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. భయంతో ఉన్నవారు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండరు. ఇది పని వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి వారిని కంపెనీ గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. -
అందమైన దేశంలో శాశ్వత నివాసం: భారతీయులకు అవకాశం
ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన 'ఫిన్లాండ్'.. భారతీయులకు శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వర్క్, ఎడ్యుకేషన్ ప్రయోజనాల నుంచి ఫ్యామిలీ స్పాన్సర్షిప్ వరకు అన్ని సదుపాయాలను అందించడానికి దేశం సిద్ధంగా ఉంది.అందమైన దేశమే కాకుండా.. జీవించడానికి కూడా ప్రసిద్ధి చెందిన ఫిన్లాండ్, వరుసగా ఎనిమిది సంవత్సరాలు ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ర్యాంక్ సాధించింది. ఈ దేశంలో భారతీయులు శాశ్వతంగా నివాసం ఉండటానికి.. అక్కడి ప్రభుత్వం అర్హతగల అభ్యర్థులకు శాశ్వత నివాస అనుమతి (PR) కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.ప్రయోజనాలు & అర్హతలుఫిన్లాండ్లో శాశ్వత నివాసం ఉండటం వల్ల.. సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్య, పెన్షన్ పథకాల వంటి ప్రయోజనాలు పొందవచ్చు.మీ కుటుంబ సభ్యులను మీతో చేర్చుకోవడానికి మీరే స్పాన్సర్ చేయవచ్చు. కంటిన్యూస్ రెసిడెంట్ పర్మిట్ కోసం ఫిన్లాండ్లో కనీసం నాలుగు సంవత్సరాలు నివసించి ఉండాలి. ఈ వ్యవధి 2026 జనవరి నుంచి ఆరు సంవత్సరాలకు పెరుగుతుంది.●ఫిన్లాండ్లో నివసించడానికి కనీస వార్షిక ఆదాయం 40000 యూరోలు (సుమారు రూ.41.3 లక్షలు). ●2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్తో గుర్తింపు పొందిన మాస్టర్స్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా 3 సంవత్సరాల వర్క్ ●ఎక్స్పీరియన్స్తో ఉన్నత స్థాయి ఫిన్నిష్/స్వీడిష్ లాంగ్వేజ్ స్కిల్స్.●దరఖాస్తుదారులు తప్పనిసరిగా క్లీన్ క్రిమినల్ రికార్డ్ కలిగి ఉండాలి.అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్●చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ & పాస్పోర్ట్ ఫోటోలు●ఆర్థిక స్థిరత్వానికి కావాల్సిన రుజువు●మీ పాస్పోర్ట్ ఐడీ పేజీ కాపీ●విద్య, ఉపాధి లేదా భాషా నైపుణ్యాలను నిరూపించే ఏవైనా డాక్యుమెంట్స్అప్లై చేసుకోవడం ఎలా●ఎంటర్ ఫిన్లాండ్ ద్వారా దరఖాస్తు ఫారమ్ను ఆన్లైన్లో ఫిల్ చేసుకోవచ్చు. పేపర్ దరఖాస్తుకు కూడా అనుమతి ఉంది.దరఖాస్తు ఫీజు చెల్లించాలి●బయోమెట్రిక్స్ ఇవ్వడానికి ఫిన్నిష్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ లేదా వీఎఫ్ఎస్ గ్లోబల్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇవన్నీ ●పూర్తయిన తరువాత అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు.●మీ అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత.. రెసిడెన్సీ కార్డును రాయబార కార్యాలయం లేదా సేవా కేంద్రం నుంచి తీసుకోవచ్చు.శాశ్వత నివాసం కోసం అప్లికేషన్ ఫీజు●ఎలక్ట్రానిక్ అప్లికేషన్: 240 యూరోలు (సుమారు రూ. 24,800)●పేపర్ అప్లికేషన్: 350 యూరోలు (సుమారు రూ. 36,100)●18 ఏళ్లలోపు దరఖాస్తుదారులు: 180 యూరోలు (సుమారు రూ. 18,600)ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక -
ఇంటి అందాన్ని పెంచే టిప్స్
సాక్షి, సిటీబ్యూరో: దీపావళి వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లుతో పాటు ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెలకువలతో ట్రెండీ లుక్ తీసుకు రావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో ఫ్రెండ్లీ దీపావళిగా మారుతుందంటున్నారు.➤సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తుల స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.300.➤ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. వీటి ధర రూ.3 వేల నుంచి ఉన్నాయి.➤పండుగ సీజన్లో ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ ఎంట్రెన్స్ లేదా భవనం మీద ఓం, స్వస్తిక్ వంటి చిహా్నలను పెట్టుకోవచ్చు. ఇవి ఎల్ఈడీ లైట్లతో తయారు చేసిన ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు రూ.200 – 500 మధ్య ఉన్నాయి.➤రంగు రంగుల బాటిల్స్లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. వీటి ధర రూ.400 నుంచి ఉన్నాయి.➤అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్యరశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి.➤ఈ మధ్య కాలంలో నీళ్లలో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్పూల్ వద్ద అమర్చుకోవచ్చు. ఇవి పరిమాణాలను బట్టి 8–10 గంటల వరకు కాంతినిస్తాయి. -
ఫోన్పేకు రూ.21 లక్షల జరిమానా: కారణం ఇదే..
నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఇప్పుడు ఫిన్టెక్ కంపెనీ ఫోన్పేకు భారీ జరిమానా విధించింది. 'ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్' (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫోన్పే లిమిటెడ్కు 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పాటించకపోవడం మాత్రమే కాకుండా.. ఈ విషయంలో సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పాటించలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఫోన్పేకు నోటీస్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. జరిమానా విధించినప్పటికీ.. ఇది యూజర్లపై ఎటువంటి ప్రభావం చూడదని పేర్కొంది.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఫోన్పే వంటి అన్ని నాన్ బ్యాంకింగ్స్, ఎస్క్రో బ్యాలెన్స్లలో ఏదైనా లోటు ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ & సెటిల్మెంట్ సిస్టమ్స్ విభాగానికి (DPSS) నివేదించాలి. ఎస్క్రో ఖాతా నిల్వలు.. రోజు చివరిలో వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయి ఉన్న PPIల విలువ, చెల్లింపుల కంటే తక్కువగా ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: డీజిల్లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనపీపీఐ మార్గదర్శకాలను పాటించనందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఫోన్పేకు 2019లో రూ. కోటి, 2020లో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1.39 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరో సారి రూ. 21 లక్షల జరిమానా విధించింది. -
నౌకల రాకపోకలపై పూర్తి నిషేధం విధించిన అదానీ పోర్ట్స్
భారతదేశం ముడి చమురు దిగుమతిని ప్రభావితం చేసేలా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) చర్యలు చేపట్టింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్గా ఉన్న ఏపీసెజ్ యూఎస్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్ ద్వారా ఆంక్షల్లో ఉండి రాకపోకలు సాగిస్తున్న నౌకలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో అదానీ ఆపరేట్ చేస్తున్న అన్ని ఓడరేవుల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.భారతదేశ ఇంధన పోర్ట్ఫోలియోలో కీలకంగా ఉన్న రష్యన్ ముడి చమురు ప్రవాహంపై ఈ చర్యలు ప్రభావితం చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదానీ కొత్త ఆదేశాల ప్రకారం.. పాశ్చాత్య ప్రభుత్వాల ఆంక్షలకు గురైన నౌకలకు ఏపీసెజ్ టెర్మినల్స్ ప్రవేశం, బెర్తింగ్, పోర్ట్ సర్వీసులను పూర్తిగా నిషేధించింది. అందుకు అనుగుణంగా షిప్పింగ్ ఆపరేటర్లు నామినేట్ చేసిన నౌక ఆంక్షల పరిధిలో లేదని నిర్ధారిస్తూ రాతపూర్వక హామీ సమర్పించాల్సి ఉంటుంది.అంతర్జాతీయ పరిశీలన పెరగడం, షాడో ఫ్లీట్(నిబంధనలకు విరుద్ధంగా విదేశీ చమురు సరఫరా) అధికమవుతుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాలు, వస్తువుల ఎగుమతులు, దిగుమతులపై స్క్రూటినీ పెరుగుతున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈమేరకు చర్యలు చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ చర్యల వల్ల రష్యా చమురుపై సరఫరా పరంగా ఒత్తిడి పెరుగుతుందనే వాదనలున్నాయి.ఏపీసెజ్ ఫ్లాగ్షిప్ టెర్మినల్స్లో ఒకటైన ముంద్రా పోర్ట్ భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 10% నిర్వహిస్తుంది. రష్యన్ చమురు సరఫరాకు కీలక కేంద్రంగా ఉంది.హెచ్పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (హెచ్ ఈఎంఎల్) తన ముడి చమురు దిగుమతుల్లో 100 శాతం ముంద్రా ద్వారానే కొనసాగిస్తోంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా బహుళ శుద్ధి కార్యకలాపాల కోసం ముంద్రాను విస్తృతంగా ఉపయోగిస్తుంది.పోర్ట్ ట్రాఫిక్ డేటా ప్రకారం, ఇటీవలి నెలల్లో ముంద్రాకు 50% రష్యన్ ముడి చమురు బ్యారెళ్లు సరఫరా అవుతున్నాయి.కాండ్లా, ముంబై, పారాదీప్ వంటి ప్రభుత్వ ఓడరేవులకు సరఫరా పెరిగే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పణ -
వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పణ
గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాలో చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేశారనే ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ రిపోర్ట్ను రికార్డ్ చేసింది.దర్యాప్తులో భాగంగా సిట్ బృందం వంతారాలో మూడు రోజులు గడిపింది. విచారణలో భాగంగా బృందానికి సహకరించడానికి అనేక రాష్ట్ర అటవీ శాఖల సీనియర్ అధికారులతో సహా అనేక ఇతర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇన్వెస్ట్గేషన్ సందర్భంగా వంతరా సీనియర్ సభ్యులను సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగి ధ్రువపత్రాలు సేకరించింది.పిటిషనర్ ఆరోపణలు..సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని సిట్.. పిటిషనర్ సీఆర్ జయ సుకిన్ లేవనెత్తిన ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ జరిపింది. వన్యప్రాణుల రెస్క్యూ, పునరావాస సదుపాయాన్ని నిర్వహించే ముసుగులో ఏనుగులు, పక్షులు, అంతరించిపోతున్న జాతులతో సహా చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేసిందని పిటిషన్లో ఆరోపించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, జంతు సంక్షేమ ప్రమాణాలకు వ్యతిరేకంగా జంతువులను కేంద్రంలోకి తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు.వంతారా స్పందనఈ వ్యవహారంపై వంతారా స్పందిస్తూ చట్టపరంగా మూగజీవులను కాపాడేందుకు పక్కాగా చర్యలు పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తున్నాం. పారదర్శకతతో చట్టాన్ని పూర్తిగా పాటించడానికి వంతారా కట్టుబడి ఉంది’ అని వంతారా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25, 2025న సిట్ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 12 లోగా తన ఫలితాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సిట్ తన నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించింది.వంతారాఅనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.ఇదీ చదవండి: జీఎస్టీ కోతతో ఇళ్లకు డిమాండ్ -
స్టార్ హెల్త్కు నగదు రహిత చికిత్సలు బంద్
నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్పీఐ) హెచ్చరిక జారీ చేసింది. స్టార్ హెల్త్ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.చికిత్సల ధరలను తగ్గించాలంటూ ఒత్తిడి చేయడం, డాక్టర్ల క్లినికల్ నిర్ణయాలపై అసంబద్ధమైన ప్రశ్నలు, నగదు రహిత క్లెయిమ్లకు ఆమోదం తెలిపి, తుది బిల్లులో అడ్డమైన కోతలు విధించడం వంటి చర్యలతోపాటు.. నగదు రహిత చికిత్సలను అకస్మాత్తుగా ఉపసంహరించుకోవడం చేస్తున్నట్టు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ దృష్టికి ఏహెచ్పీఐ తీసుకెళ్లింది. కాగా, ఏహెచ్పీఐ నిర్ణయం ఏకపక్షం, దురదృష్టకరంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాఖ్యానించింది. పాలసీదారులు స్టార్ హెల్త్ ద్వారా సేవలు పొందడంపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. -
తొమ్మిది ఎన్బీఎఫ్సీల లైసెన్స్లు సరెండర్
ఫోన్పే టెక్నాలజీ సర్వీసెస్ సహా తొమ్మిది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్/లైసెన్స్లు)ను స్వాధీనం చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఎన్బీఎఫ్సీ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో ఫోన్పే టెక్నాలజీ సర్వీసెస్ సీవోఆర్ను వెనక్కిచ్చేసింది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తన మాతృ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్లో విలీనం కావడంతో లైసెన్స్ను స్వాధీనం చేసింది. ఆర్బీజీ లీజింగ్ అండ్ క్రెడిట్, యషిలా ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.లైసెన్స్లు సరెండర్ చేయడానికి కారణాలు..ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్బీఎఫ్సీ నిర్మాణం ఇకపై వారి వ్యాపార లక్ష్యాలతో సరపోదని కొన్ని కంపెనీలు తెలుసుకున్నాయి. ఉదాహరణకు ఫోన్ పే టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రుణాలు, ఇతర ఆర్థిక సేవల నుంచి వైదొలిగింది. నియంత్రిత విభాగాల్లో వ్యాపారం ముందుకు సాగదని నమ్మి స్పష్టమైన వైఖరితో రిజిస్ట్రేషన్ను తిరిగి ఇచ్చేసింది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తన మాతృ సంస్థతో విలీనం తరువాత లైసెన్స్ను సరెండర్ చేసింది. ఏకీకృత వ్యాపార సంస్థ కింద కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.కొన్ని ఎన్బీఎఫ్సీలు తమ రుణ కార్యకలాపాలను మూసివేయడానికి లేదా ప్రత్యామ్నాయ, అనియంత్రిత ఆర్థిక నమూనాలకు మారడానికి నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఈ రిజిస్ట్రేషన్ అనవసరంగా భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్ -
రిటైల్ రుణాల పట్ల జాగ్రత్త
భవిష్యత్తు రిటైల్ రుణాల విషయంలో బ్యాంక్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ రంగానికి చెందిన వెటరన్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కేవీ కామత్ సూచించారు. పోర్ట్ఫోలియో (రుణ ఆస్తులు) పరంగా అస్థిరతలు లేకుండా చూసుకోవాలని కోరారు. బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కామత్ మాట్లాడారు.కార్పొరేట్లు (కంపెనీలు) నిధుల కోసం బ్యాంకులపై ఆధారపడడం కొంత కాలానికి తగ్గుతుందంటూ.. భవిష్యత్తులో బ్యాంకులకు ప్రధాన వ్యాపారం రిటైల్ విభాగం నుంచే వస్తుందన్నారు. రిటైల్ విభాగంలో ఆస్తుల నాణ్యత వేగంగా క్షీణించే రిస్క్ ఉంటుందని హెచ్చరించారు. ఈ రిస్క్ పోర్ట్ఫోలియో పరంగా అసమానతల రూపంలో ఎదురవుతుందన్నారు. బ్యాలన్స్షీట్లలో లోపాలు చోటుచేసుకుంటే అన్సెక్యూర్డ్ రుణాల్లో అధిక భాగం వసూలు కాకుండా పోతాయంటూ, బ్యాంక్లు ఈ విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు.ఫిన్టెక్లతో బ్యాంకులు పోటీపడక తప్పదన్నారు. తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు ఫిన్టెక్లు రుణ సాయం అందిస్తున్నట్టు చెప్పారు. రిటైల్ రుణ విభాగంలో పరిమితికి మించి రుణ వితరణ (ఒకే వ్యక్తికి) ఉందన్నారు. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్లో రూ.1.75 లక్షల కోట్లు నష్టపోయారన్న ఇటీవలి సెబీ డేటాను కామత్ ప్రస్తావించారు. నియంత్రణ సంస్థలు ఇప్పుడు దీన్ని కఠినతరం చేస్తున్నాయంటూ, ఈ చర్యలు ఫలితాన్నిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే రుణ ఎగవేతలు పెరగొచ్చొని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ బైక్పై రూ.35,000 వరకు ఆఫర్ -
ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: భౌగోళికరాజకీయ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లాంటి ముడి వస్తువులు, ఇతరత్రా టెక్నాలజీలపరమైన సమస్యలను అధిగమించాలంటే ప్రభుత్వం, ఆటో పరిశ్రమ కలిసి పని చేయాల్సి ఉంటుందని ఆటో విడిభాగాల సంస్థల సంఘం ఏసీఎంఏ ప్రెసిడెంట్ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా మల్చుకోవాలని, మొబిలిటీ విడిభాగాలకు భారత్ను విశ్వసనీయమైన హబ్గా నిలబెట్టాలనేదే తమ ఉమ్మడి లక్ష్యమని ఏసీఎంఏ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె వివరించారు. ‘కీలకమైన ముడి వస్తువులు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, సెమీకండక్టర్లు మొదలైన వాటి కొరత పెద్ద సవాలుగా మారింది. దీనిపై జాతీయ స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అపారమైన అవకాశాల కూడలిలో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ అదే స్థాయిలో సవాళ్లు కూడా ఉన్నాయి. వాణిజ్య యుద్ధాలు, భౌగోళికరాజకీయ ఒడిదుడుకులు, టారిఫ్లపరమైన ఉద్రిక్తతలు, ఎగుమతులపరంగా పరిమితుల్లాంటివన్నీ కూడా సరఫరా వ్యవస్థ స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కీలక ముడి వస్తువులను దక్కించుకునేందుకు ప్రభుత్వంతో మరింతగా కలిసి పనిచేయాలి. అలాగే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ప్రపంచవ్యాప్తంగా భాగస్వామ్యాలను పటిష్టం చేసుకోవాలి. అంతర్జాతీయంగా పోటీపడే విధంగా మన పరిశ్రమ బలోపేతం కావాలి‘ అని మార్వా చెప్పారు. సరఫరా వ్యవస్థ పటిష్టం కావాలి: సియామ్ మరోవైపు, సరఫరా వ్యవస్థలనేవి కేవలం వ్యయాలను తగ్గించుకునే అంశానికే పరిమితం కాకుండా వైవిధ్యంగా, ఎలాంటి అవాంతరాలెదురైనా నిలదొక్కుకునే విధంగా పటిష్టంగా మారాలని వాహనాల తయారీ సంస్థల సంఘం సియామ్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర సూచించారు. ఇందుకోసం వనరులు సమృద్ధిగా ఉన్న దేశాలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు ఎంత ముఖ్యమో, అలాగే అలాంటి భాగస్వామ్యాలకు దోహదపడేలా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం కూడా ముఖ్యమేనని చంద్ర చెప్పారు. -
ఈయూతో ఒప్పందం.. ఆ రంగానికి అవకాశాలు
ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు పెద్ద ఎత్తున అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ఎగుమతులను పెంచుకోవచ్చని, 27 దేశాల కూటమికి చెందిన ఆటోమొబైల్ దిగ్గజాలతో కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు లభిస్తాయని చెప్పారు.భారత ప్రజలకు సరైన టెక్నాలజీ, సరైన రవాణా పరిష్కారాలను తీసుకొచ్చేందుకు వీలుంటుందన్నారు. ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయంటూ.. ఆటోమొబైల్ రంగానికి ఇది ఎంతో ముఖ్యమన్నారు. ఈయూలో మార్కెట్ అవకాశాలపై అవగాహన కుదిరిన వెంటనే చర్చలను త్వరగా ముగిస్తామని చెప్పారు.ఈయూ అధికారుల బృందం ఢిల్లీలో 13వ విడత చర్చలు నిర్వహించిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత ఆటోమొబైల్ రంగానికి సంబంధించి సుంకాల్లో రాయితీలు ఇవ్వాలని ఈయూ బృందం డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఈ ఏడాది మే 6న బ్రిటన్తో కుదిరిన ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో ఆ దేశ ఆటోమొబైల్ కంపెనీలకు భారత్ రాయితీలను కల్పించడం తెలిసిందే. దీంతో ఈయూ సైతం ఇదే విధమైన డిమాండ్ చేస్తోంది.బ్రిటన్తో ఒప్పందం వల్ల ఆటోమొబైల్ దిగుమతులపై టారిఫ్లు 100 శాతం నుంచి 10 శాతానికి తగ్గుతాయని అగర్వాల్ చెప్పారు. అది కూడా 10–15 ఏళ్ల కాలంలో క్రమంగా అమలవుతుందన్నారు. సున్నిత రంగాల ప్రయోజనాలను కాపాడేందుకు యూకేతో ఒప్పందంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. భారత ఆటోమొబైల్ రంగం ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా క్రమంగా భారత్ మార్కెట్ అవకాశాలకు తలుపుల తెరిచే నిబంధనలు పెడుతున్నట్టు వివరించారు. -
రూ.2.25 లక్షల బెనిఫిట్: కొరియా బ్రాండ్ బంపరాఫర్
కియా ఇండియా.. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.25 లక్షల వరకు ఫ్రీ-జీఎస్టీ & పండుగ ప్రయోజనాలను కలిపి అందించే ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ 2025 సెప్టెంబర్ 22 వరకు చెల్లుతుంది.ఈ ఆఫర్లో రూ.58,000 వరకు ప్రీ-జీఎస్టీ సేవింగ్స్ & రూ.1.67 లక్షల వరకు ఫెస్టివల్ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు సెల్టోస్, కారెన్స్ క్లావిస్, కారెన్స్ వంటి ప్రసిద్ధ మోడళ్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది. ఆఫర్ అనేది ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చిన్న కారుపై.. భారీ తగ్గింపు: ఏకంగా రూ.3 లక్షలుఈ సందర్భంగా, కియా ఇండియా సీఎస్ఓ జూన్సు చో మాట్లాడుతూ.. పండుగల సమయంలో మా కస్టమర్లకు మరింత ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నాము. ప్రత్యేకమైన ప్రీ-జీఎస్టీ సేవింగ్స్ & పండుగ ప్రయోజనాలతో, కస్టమర్లు ఇప్పుడు తమకు ఇష్టమైన కియాను ఇంటికి తీసుకెళ్లవచ్చు. కియాను సొంతం చేసుకోవడం అంటే కేవలం కారు నడపడం మాత్రమే కాదు, రోజువారీ జీవితానికి సౌకర్యం, ఆనందాన్ని జోడించడం అని మేము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు. -
ఎఫ్డీడీఐ-హైదరాబాద్లో కొత్త కోర్సులు
రాయదుర్గం: ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్–హైదరాబాద్ క్యాంపస్లో కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఫుట్వేర్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్, రిటైల్ అండ్ డిజిటల్ ఫ్యాషన్ వ్యాపారం, లెదర్ యాక్సెసరీస్, బ్యాగ్ల అభివృద్ధి రంగాల్లో పరిశ్రమలు, సిద్ధంగా ఉన్న విద్యార్థుల నైపుణ్యాలను బలోపేతం చేయడానికి, ఉపాధిని పెంచడానికి దోహదం చేసేలా డిప్లొమో కోర్సుల ముఖ్య లక్షణంగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కోర్సులను ఆరు నెలల వ్యవధి గల రెండు మాడ్యూల్లుగా విభజించారు. అభ్యాసకులు ఒక మాడ్యూల్ను అనుసరించి సర్టిఫికెట్ పొందవచ్చు. రెండు మాడ్యూల్లను పూర్తి చేసి పూర్తి సంవత్సరం డిప్లొమో పొందడానికి అవకాశం కల్పిస్తారు. అందుబాటులోకి వచ్చే కోర్సులు ఇవే.. మొదటి విడతలో నూతనంగా డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిలో డిప్లొమో ఇన్ ఫ్యాషన్ డిజైన్, డిప్లొమో ఇన్ ఫుట్వేర్ టెక్నాలజీ, డిప్లొమో ఇన్ లెదర్ యాక్సెసరీస్ అండ్ బ్యాగ్ డెవలప్మెంట్ కోర్సులకు ఒక్కోదానికి ఒక్క మాడ్యూల్కు రూ.45 వేలు, డిప్లొమో ఇన్ రిటైల్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ ఒక్క మాడ్యూల్కు రూ.40 వేలను చెల్లించాల్సి ఉంటుంది.ఈ కోర్సుల కోసం దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. కోర్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తులు వెబ్సైట్ www.fddiindia.comలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 94404 71336, 99667 55563, 99667 55536లలో సంçప్రదించాలని అధికారులు సూచించారు. ఇతర వివరాలకు రాయదుర్గంలోని ఎఫ్డీడీఐ–హైదరాబాద్ క్యాంపస్లో సంప్రదించాలని సూచించారు. -
భారీ ధరల వేళ.. బయటి నుంచి బంగారం ఎంత తెచ్చుకోవచ్చు?
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. భారతదేశంలో అయితే చుక్కలనంటుతున్నాయి. ఈరోజు (సెప్టెంబర్ 12) 10 గ్రాముల ధర రూ.770 మేర పెరిగి రూ.1,11,430లకు చేరింది. అయితే భారత్ కంటే కొన్ని దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బయటి దేశాల్లో ఉంటున్నవారు లేదా ఏదైనా ఏ దేశానికి పర్యటనకు వెళ్లి తిరిగివస్తున్నవారు ఆయా దేశాల్లో బంగారం కొని భారత్కు ఎంత తీసుకుని రావచ్చు.. ఇక్కడ ఆ బంగారంపై ఎంత సుంకం పడుతుంది.. వంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో బంగారం వ్యాపారం భౌతిక, డిజిటల్ సహా అనేక రూపాల్లో జరుగుతుంది. చాలా మంది ఆభరణాలు, నాణేలు, బార్లు , పెట్టుబడి ఆస్తుల రూపంలో బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అదే సమయంలో, ప్రభుత్వం డ్యూటీలు/సుంకాల ద్వారా బంగారం వ్యాపారాన్ని జాగ్రత్తగా నియంత్రిస్తుంది. కస్టమ్ డ్యూటీ అనేది ఒక రకమైన పన్ను, ఇది ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధిస్తారు. ఇదేవిధంగా, ఇతర దేశాల నుండి బంగారాన్ని భారత్కు తీసుకువచ్చినప్పుడు, దానిపై కూడా కస్టమ్స్ సుంకం విధిస్తారు. అయితే కొంత పరిమితి వరకు బయటి నుంచి తెచ్చిన బంగారంపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. అంతకంటే ఎక్కువ బంగారాన్ని తీసుకువస్తే మాత్రం సుంకం చెల్లించాల్సి ఉంటుంది.ఎంత బంగారం తెచ్చారో చెప్పాలి..ఒక వ్యక్తి విదేశాల నుండి ఏ రకమైన బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బార్లను అయినా భారతదేశానికి తీసుకురావచ్చు. కానీ, మీరు ఈ బంగారు వస్తువులను కస్టమ్ డ్యూటీ కియోస్క్ వద్ద డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత, కస్టమ్స్ డ్యూటీ అధికారి బంగారం మొత్తాన్ని బట్టి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని లెక్కిస్తారు. అయితే మీరు ఎంత బంగారం తెచ్చినా కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుందనేది నిజం కాదు. ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఈ రుసుము ఉండదు. ఆ పరిమితి పురుషులు, మహిళలు, పిల్లలకు వేరువేరుగా ఉంటుంది.పురుషులు ఎంత బంగారం తేవచ్చు.. కస్టమ్ డ్యూటీ ఎంత?పురుష ప్రయాణికులు విదేశాల నుంచి 20 గ్రాములు లేదా రూ.50,000 విలువైన డ్యూటీ ఫ్రీ బంగారాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే, బంగారం ధర సుమారు రూ .1 లక్ష కాబట్టి 20 గ్రాముల పరిమితి ఇకపై ఆచరణాత్మకం కాదు. 20 నుంచి 50 గ్రాముల బంగారం తీసుకువస్తే 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 50 నుంచి 100 గ్రాముల బంగారం తీసుకువస్తే 6 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం తీసుకువస్తే 10% కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుంది.మహిళలకు పరిమితి ఇదే..మహిళా ప్రయాణికులు కస్టమ్స్ సుంకం లేకుండా 40 గ్రాములు లేదా రూ .1 లక్ష వరకు విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. కానీ అధిక బంగారం రేటు కారణంగా, 40 గ్రాముల పరిమితి ఇక్కడ కూడా ఆచరణాత్మకంగా లేదు. 40 నుంచి 100 గ్రాముల వరకు బంగారంపై 3 శాతం కస్టమ్స్ సుంకం వర్తిస్తుంది. 100 నుంచి 200 గ్రాముల వరకు బంగారంపై 6 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తారు. 200 గ్రాములు దాటితే 10% కస్టమ్స్ సుంకం విధిస్తారు.పిల్లలకూ పరిమితి..15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా మహిళా ప్రయాణికుల మాదిరిగానే కస్టమ్స్ నియమాలకు లోబడి ఉంటారు. అయితే, వారు కొనుగోళ్లకు రుజువుగా పత్రాలను తీసుకెళ్లాలి. -
పంజాబ్లో వరద బాధితులకు రిలయన్స్ సాయం
పంజాబ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అండగా ఉంటుందని కంపెనీ డైరెక్టర్ అనంత్ అంబానీ భరోసా కల్పించారు. బాధితుల కష్టాలు తీర్చే ఉద్దేశంతో సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. అందులో భాగంగా స్థానిక అధికారులు, రాష్ట్ర పరిపాలన విభాగం, పంచాయతీలు, వివిధ కమ్యూనిటీ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఈమేరకు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా అమృత్సర్, సుల్తాన్పూర్ లోధిలోని 10,000 కుటుంబాలకు సహాయం అందించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.‘ఈ క్లిష్ట సమయంలో పంజాబ్ ప్రజలకు మా మద్దతు ఉంటుంది. తీవ్ర వర్షాభావం వల్ల చాలా కుటుంబాలు ఇళ్లు, జీవనోపాధి, భద్రతను కోల్పోయాయి. రిలయన్స్ కుటుంబం వారికి తోడుగా ఉంటుంది. ఆహారం, నీరు, ఆశ్రయం, పారిశుద్ధ్య కిట్లు.. వంటి వాటితో ప్రజలు, జంతువుల సంరక్షణకు అన్ని చర్యలు అందిస్తోంది. పంజాబ్ ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో వారితో కలిసి ఉంటాం’ అని అనంత్ అంబానీ అన్నారు.రిలయన్స్ అందిస్తోన్న సహాయక చర్యలు..న్యూట్రిషన్ సపోర్ట్వరద బాధితుల కోసం అత్యవసర పోషకాహార అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతుంది. వారికి అవసరమైన ఆహార సామాగ్రి, డ్రై రేషన్ కిట్లను 10,000 కుటుంబాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంటరి మహిళలు, వృద్ధుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5,000 వంతున వోచర్ ఆధారిత సహాయం అందించనున్నారు. తక్షణ పోషణను నిర్దారించేందుకు కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పోర్టబుల్ వాటర్ ఫిల్టర్లను సిద్ధం చేస్తున్నారు.షెల్టర్ సపోర్ట్వరదల నేపథ్యంలో నిర్వాసిత కుటుంబాలను రక్షించడానికి రిలయన్స్ టార్పాలిన్లు, గ్రౌండ్ షీట్లు, దోమతెరలు, తాళ్లతో కూడిన అత్యవసర షెల్టర్ కిట్లను అందిస్తోంది. వరద నీటి నుంచి అత్యవసరంగా ఆశ్రయం అవసరమైన కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ప్రజారోగ్య ప్రమాద నిర్వహణలో భాగంగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి రిలయన్స్ ఆరోగ్య అవగాహన ప్రచారాలను చేపడుతోంది. నీటి వనరుల్లో క్రిమిసంహారక చర్యలకు పూనుకుంది. వ్యాధి వ్యాప్తి ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రతి ప్రభావిత కుటుంబానికి అవసరమైన పారిశుద్ధ్య కిట్లను అందజేస్తున్నారు.పశువుల ఆరోగ్యానికి మద్దతుగా..వరదల వల్ల పశుసంవర్ధక రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశువుల ఆవాసాల్లో నీరు నిలిచిపోవడం వల్ల జంతువుల మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. రిలయన్స్, పశుసంవర్ధక శాఖ సహకారంతో పశువైద్య సర్వేలు నిర్వహిస్తోంది. పశువుల సంరక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రభావిత జంతువులకు మందులు, చికిత్సలు అందిస్తున్నారు. దాదాపు 5,000 పశువులకు ఆహారం ఇవ్వడానికి 3,000 కట్టల సైలేజ్ (పశుగ్రాసం) పంపిణీ చేస్తున్నారు.జంతు సంరక్షణజంతు సంరక్షణ కోసం రిలయన్స్కు చెందిన వంటారాలోని ప్రత్యేక బృందం సహాయక చర్యలను అందిస్తోంది. 50 మందికి పైగా శిక్షణ పొందిన నిపుణులతో ఈ బృందం జంతువులను రక్షించడం, వైద్య సంరక్షణను అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడానికి పని చేస్తోంది.కమ్యునికేషన్ పునరుద్ధరణవరద ప్రభావిత ప్రాంతాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో జియో బృందం కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉండేలా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)తో కలిసి పనిచేస్తోంది. విపత్తు సహాయ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సర్వీసులు అందించేందుకు చర్యలు చేపడుతోంది.రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక వాలంటీర్ల సహకారంతో క్యూరేటెడ్ డ్రై-రేషన్, పారిశుద్ధ్య కిట్లను పంపిణీ చేస్తోంది. పోషణ, పరిశుభ్రత కోసం 21 నిత్యావసర వస్తువులను కలిగి ఉన్న ఈ కిట్లను స్థానిక పంచాయతీల పరిధిలోని ప్రజలకు సరఫరా చేస్తున్నారు. -
రిలయన్స్ భారీ ఫుడ్ పార్క్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆహారోత్పత్తులు, పానీయాల తయారీకి ఏకీకృత ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్(కాటోల్)లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్పై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్.. మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ యూనిట్తో 500మందికిపైగా ఉపాధి కల్పించనుంది. 2026లో తయారీ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సమీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రూ. 40,000 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్కు తెరతీయనున్నట్లు వివరించారు. రిలయన్స్ రిటైల్ నుంచి ఆవిర్భవించిన రిలయన్స్ కన్జూమర్ మూడేళ్లలోనే రూ. 11,000 కోట్ల టర్నోవర్ను సాధించినట్లు ఏజీఎంలో తెలిపారు. -
హైదరాబాద్లో DESRI కొత్త ఆఫీస్
ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ అయిన DESRI.. హైదరాబాద్లోని ఆర్ఎంజెడ్ నెక్సిటీలో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. భారతదేశంలోని అత్యంత నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల నుంచి ప్రయోజనం పొందుతూ, హైదరాబాద్ను తన ప్రపంచ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో కంపెనీ దీనిని ప్రారంభించింది.2014లో హైదరాబాద్లో మొదటిసారి కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి.. కౌంటింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్స్, లీగల్, పెర్ఫార్మెన్స్ అనలిటిక్స్తో సహా వివిధ రంగాలలో తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. నేడు కంపెనీ అనేక కీలకమైన కార్యకలాపాలలో కీలక పాత్రను పోషిస్తోంది.కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా.. DESRI చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ జ్విల్లింగర్ మాట్లాడుతూ, హైదరాబాద్ DESRIకి వ్యూహాత్మక కేంద్రంగా మారింది. అంతే కాకుండా ఆధునిక మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఆర్ఎంజెడ్ నెక్సిటీలో మా కొత్త కార్యాలయం ప్రారంభం, భారతదేశంలో మా ఉనికిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. -
ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎక్కువ శాలరీ తెచ్చుకోవడానికి కంపెనీలను సైతం మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఉద్యోగమే పోతే?, వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యమే. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కంపెనీలో చేరిన రెండు రోజులకే ఉద్యోగం నుంచి తొలగించిన తమ బాధాకరమైన అనుభవాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను గుర్గావ్లోని ఒక చిన్న కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్గా రెండు సంవత్సరాలు పనిచేసానని.. ఈ ఏడాది జూలైలో సాకేత్లోని ఫుడ్ బేస్డ్ కంపెనీలో చేరాను పేర్కొన్నాడు. ఉద్యోగంలో చేరిన రెండో రోజు.. ఆ కంపెనీ బాస్ మరిన్ని బాధ్యతలు చేపట్టగల మేనేజర్ చూస్తున్న కారణంగా.. నన్ను తొలగించారు. చేసేదేమీ లేక నేను ఆఫీసు నుంచి వెళ్ళిపోయాను.ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదని పేర్కొన్నారు. ఇది మానసికంగా నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఇప్పుడు నా మునుపటి కంపెనీకి కూడా వెళ్లలేకపోతున్నాను. ఎందుకంటే నా స్థానంలో కంపెనీ మరొకరిని నియమించుకుంది. ఇప్పుడు నాకు ఏమి చేయాలో తోచడం లేదని, నాకు ఎవరైనా సహాయం చేయగలరా అని అడిగారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాలంటే.. చట్టపరమైన పరిణామాలు ఉండాలి?, మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు కాబట్టి.. మీరు న్యాయవాదిని సంప్రదించండి అని ఒకరు సలహా ఇచ్చారు. వేచి ఉండండి, తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుందని మరొకరు అన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉండండి, ఇంటర్యూలు విఫలమైనా బాధపడకండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్ దన్ను
దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోవడానికి ఈ–కామర్స్ మాధ్యమం దన్నుగా నిలుస్తోంది. సుస్థిర, సమ్మిళిత అభివృద్ధికి దోహదకారిగా ఉంటోంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ కావడానికి, వ్యాపార వృద్ధికి అమెజాన్లాంటి డిజిటల్ మార్కెట్ప్లేస్ల రూపంలో చిన్న వ్యాపారాలకు కొత్తగా మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి.మరోవైపు, ఎఫ్ఎంసీజీ (వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు) అమ్మకాలు, పట్టణ మార్కెట్లలో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో గణనీయ స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీల్లో 60 శాతం వాటా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలదే ఉంటోంది. దీంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు నేరుగా చేరువ చేసే డిజిటల్ మార్కెట్ప్లేస్ల రూపంలో చిన్న సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపార వృద్ధికి దోహదకారి.. ‘భారత ఈ–కామర్స్ వ్యవస్థ, ఎంఎస్ఎంఈలకు కీలకమైన వృద్ధి చోదకంగా మారింది. డిమాండ్ భారీగా ఉండే పండుగల సీజన్లో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటోంది.అలాగే, లోకల్ షాప్లు, ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలు, వినూత్నమైన స్టార్టప్లను ప్రోత్సహించే ప్రోగ్రాంలతో చిన్న వ్యాపారాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలవుతోంది. సీజనల్ నియామకాలు కూడా ఆర్థికంగా సానుకూల ప్రభావం చూపుతున్నాయి. లక్షల కొద్దీ ఉద్యోగాలు కల్పిస్తున్నాయి‘ అని ఇండియా ఎస్ఎంఈ ఫోరం ప్రెసిడెంట్ వినోద్ కుమార్ తెలిపారు.డిజిటల్ మార్కెట్ప్లేస్ల ద్వారా అదే రోజు లేదా మరుసటి రోజే డెలివరీ అప్షన్లతో వినియోగదారులకు సత్వరం సేవలు అందించేందుకు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి -
రిజర్వ్ బ్యాంకు ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయో తెలుసా?
దేశంలోని బ్యాంకులన్నింటికీ బాసు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అదేనండి ఆర్బీఐ. సాధారణంగానే బ్యాంకు ఉద్యోగుల జీతాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. మరి దేశ అత్యున్నత బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంకులో ఆఫీసర్ల జీతాలు ఎంతుంటాయన్నది మరింత ఆసక్తికరం. ఎంట్రీ లెవల్ గ్రేడ్ బి ఆఫీసర్ల నుంచి ఉన్నత స్థాయి డిప్యూటీ జనరల్ మేనేజర్ల వరకు జీతాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందామా?రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే గ్రేడ్ బి ఆఫీసర్ల వేతన స్కేలును అధికారికంగా సవరించింది. 2025 నోటిఫికేషన్ ప్రకారం, ప్రారంభ ప్రాథమిక వేతనం నెలకు రూ .55,200 నుండి రూ .78,450 కు పెంచింది. స్థూల నెలవారీ వేతనం ఇప్పుడు రూ .1,50,374 కు చేరుకుంది.గ్రేడ్ బి ఆఫీసర్ సవరించిన నెలవారీ జీతం బ్రేక్డౌన్ ఇలా..బేసిక్ వేతనం: రూ.78,450స్థూల వేతనం: రూ.1,50,374 (హెచ్ఆర్ఏ మినహాయించి)ఇన్-హ్యాండ్ పే: రూ.1.2 లక్షల - రూ.1.35 లక్షలు (లొకేషన్,మినహాయింపులను బట్టి)పే స్కేల్: 16 ఏళ్లలో రూ.78,450 - రూ.1,41,600వేతనానికి మించిన ప్రోత్సాహకాలుఆర్బీఐ అధికారులు హౌసింగ్ అలవెన్సులు (మెట్రోలలో నెలకు రూ .70,000 వరకు), అభ్యాస రీయింబర్స్మెంట్లు, భోజన రాయితీలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్) కింద ఉదారమైన పెన్షన్ మొత్తాలను పొందుతారు.ఆఫీసర్ హోదానెల జీతంఅసిస్టెంట్ జనరల్ మేనేజర్రూ.2.44 లక్షలు – రూ.4.33 లక్షలుజనరల్ మేనేజర్రూ.2.91 లక్షలు – రూ.4.58 లక్షలుడిపార్ట్ మెంట్ మేనేజర్రూ.2.08 లక్షలు – రూ.3.33 లక్షలుడిప్యూటీ మేనేజర్రూ.1.5 లక్షలు – రూ.2.5 లక్షలుడిస్ట్రిక్ట్ మేనేజర్రూ.1.08 లక్షలు – రూ.2 లక్షలుఆఫీస్ అసిస్టెంట్రూ.43,000 – రూ.1.01 లక్షలుఆఫీస్ అటెండెంట్రూ.27,500 – రూ.66,600గమనిక: ఇక్కడ పేర్కొన్న జీతం గణాంకాలు ఆంబిషన్ బాక్స్, గ్లాస్ డోర్ వంటి థర్డ్ పార్టీ వేదికల్లో నమోదుల ఆధారంగా ఉజ్జాయింపుగా రూపొందించినవి. -
యస్ బ్యాంక్లో మార్పులకు ఆర్బీఐ ఓకే..
బోర్డులో నామినీ డైరెక్టర్ల నియామకానికి తాజాగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందుకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్(ఏవోఏ)లో ప్రతిపాదిత సవరణలకు అనుమతించినట్లు పేర్కొంది. దీంతో సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్(ఎస్ఎంబీసీ) ఇద్దరు నామినీ డైరెక్టర్లను నామినేట్ చేసేందుకు వీలు చిక్కనుంది. మరో నామినీ డైరెక్టర్ను పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) ఎంపిక చేయనుంది.యస్ బ్యాంక్లో ఎస్బీఐసహా ఏడు ఇతర బ్యాంకులకు గల వాటాలను జపనీస్ దిగ్గజం ఎస్ఎంబీసీ సొంతం చేసుకున్నాక బోర్డులో నియామకాలకు తెరలేవనుంది. కాగా.. సెకండరీ కొనుగోళ్ల ద్వారా బ్యాంకులో 20 శాతం వాటాను ఎస్ఎంబీసీ చేజిక్కించుకోనున్నట్లు మే 9న యస్ బ్యాంక్ వెల్లడించిన విషయం విదితమే. దీనిలో భాగంగా ఎస్బీఐ నుంచి 13.19 శాతం వాటాను కొనుగోలు చేయనుండగా.. యాక్సిస్, బంధన్, ఫెడరల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, కొటక్ మహీంద్రా బ్యాంకుల నుంచి మిగిలిన 6.81 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వివరించింది.ఈ నెల మొదట్లో ప్రతిపాదిత డీల్కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో ఆర్బీఐ సైతం ఇందుకు అనుమతిస్తూ ఎస్ఎంబీసీ ప్రమోటర్గా గుర్తింపు పొంబోదని తెలియజేసింది. ప్రస్తుతం యస్ బ్యాంక్లో ఎస్బీఐకు 24 శాతం వాటా ఉంది. తాజా డీల్ తదుపరి 10.81 శాతానికి వాటా పరిమితంకానుంది. -
ఈ దేశంలో శాశ్వతంగా ఉండిపోవచ్చు..
విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే చాలా దేశాలు విదేశీయులకు తమ దేశంలో శాశ్వతంగా ఉండిపోయేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వం ఇప్పుడు రూ.11,500 లోపు ఫీజుతో శాశ్వత నివాస అనుమతిని (Settlement Permit) అందిస్తోంది. ఇది జర్మనీలో శాశ్వతంగా నివసించేందుకు అత్యంత భద్రమైన మార్గం. ఈ అనుమతితో మీరు కుటుంబంతో కలిసి స్వేచ్ఛగా జీవించవచ్చు, ఉద్యోగం చేయవచ్చు లేదా స్వయం ఉపాధి ద్వారా పని చేయవచ్చు.జర్మనీలో స్కిల్డ్ వర్కర్ అంటే..రెసిడెన్స్ యాక్ట్ ప్రకారం వీరు స్కిల్డ్ వర్కర్ కేటగిరీలోకి వస్తారు..- జర్మన్ లేదా గుర్తింపు పొందిన విదేశీ డిగ్రీ కలిగినవారు- జర్మనీలో సమానమైన వృత్తి శిక్షణ పొందినవారు- ఈయూ బ్లూ కార్డ్ కలిగినవారు- ఈయూ డెరెక్టివ్ 2016/801 ప్రకారం అంతర్జాతీయ పరిశోధకులుప్రధాన అర్హతలు- సెక్షన్లు 18ఎ, 18బి, 18డి, 18జి ప్రకారం 3 సంవత్సరాలుగా చెల్లుబాటు అయ్యే నివాస అనుమతి కలిగి ఉండాలి- జీవనాధారం కోసం ప్రభుత్వ సహాయంపై ఆధారపడకుండా ఉండాలి- కనీసం 36 నెలలు పింఛను బీమా (statutory pension)లో చెల్లింపులు చేయాలి- జర్మన్ బి1 సీఈఎఫ్ఆర్ స్థాయిలో భాషా నైపుణ్యం ఉండాలి- “లివింగ్ ఇన్ జర్మనీ” పరీక్ష ద్వారా జర్మన్ సమాజం, చట్టాలపై ప్రాథమిక అవగాహన చూపించాలి- కుటుంబానికి సరిపడిన నివాస స్థలం ఉండాలిత్వరిత ప్రక్రియలుఈ కింది కొన్ని సందర్భాల్లో వేగంగా శాశ్వత అనుమతి పొందవచ్చు..- ఈయూ బ్లూ కార్డ్: 27 నెలల ఉద్యోగం తర్వాత, బి1 జర్మన్ భాష ఉంటే 21 నెలలకే అర్హత-జర్మన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు: 2 సంవత్సరాల ఉద్యోగం తర్వాత అర్హత- అత్యంత నైపుణ్యవంతులు: శాస్త్రవేత్తలు, సీనియర్ టీచర్లు మొదలైనవారు వెంటనే అర్హత పొందవచ్చు- స్వయం ఉపాధి: సెక్షన్ 21 ప్రకారం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం తర్వాత అర్హతజీవిత భాగస్వాములకు..- స్కిల్డ్ వర్కర్ జీవిత భాగస్వామి సెక్షన్ 18సి ప్రకారం శాశ్వత అనుమతి కలిగి ఉండాలి- 3 సంవత్సరాలుగా నివాస అనుమతి కలిగి ఉండాలి- వారానికి కనీసం 20 గంటలు ఉద్యోగం చేయాలి- బి1 స్థాయి జర్మన్ భాషా నైపుణ్యం ఉండాలిఅప్లికేషన్ ఖర్చుజర్మనీలో శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి అయ్యే ఖర్చు సాధారణంగా 113 యూరోల (రూ .11,666) నుండి 147 యూరోల (రూ .15,176) వరకు ఉంటుంది. స్కిల్డ్ వర్కర్ లేదా హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్ వంటి మీ వర్క్ ప్రొఫైల్ ఆధారంగా ఫీజులు మారుతూ ఉంటాయి. ఇక అనువాదాలు, భాషా పరీక్ష రుసుములు, ఆరోగ్య బీమా ప్రీమియంలు వంటి ఇతర ఖర్చులు అదనం.ఇదీ చదవండి: మా దేశం వచ్చేయండి.. శాశ్వతంగా ఉండిపోండి! -
ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు.. ఎలాన్మస్క్. కానీ ఇక నుంచి ఆ స్థానాన్ని ఒరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ భర్తీ చేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లు ఇటీవల కుదేలవ్వడంతో మస్క్కు కేటాయించిన షేర్ల విలువ భారీగా తగ్గిపోవడం ఇందుకు ఒక కారణం. కుబేరుల జాబితాలో మస్క్ తర్వాతి స్థానంలో ఉన్న ఓరాకిల్ చీఫ్ లారీ ఎలిసన్ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సంస్థ విలువ పెరగడం కూడా లారీని ప్రపంచంలోని కుబేరుల జాబితాలో ముందుంచింది.ఎలిసన్ నికర విలువ 393 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొన్న మంగళవారం ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం. ఒరాకిల్లో ఎల్లిసన్కు 40 శాతం వాటా ఉంది. ఇటీవల కంపెనీ షేర్లు పుంజుకోవడంతో ఆయన సంపద సైతం భారీగా పెరిగింది. ఒరాకిల్ ఇటీవల బ్లాక్ బస్టర్ త్రైమాసిక ఆదాయాలను విడుదల చేయడం కలిసొచ్చింది. దాని ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారం దూసుకుపోతుండడంతో ఈమేరకు ఇన్వెస్టర్లు కంపెనీలో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపారు.ఒరాకిల్ ఇటీవల చేసిన ప్రకటనలు..ఓపెన్ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్డ్యాన్స్తో ఒప్పందాలు.2025 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 144 బిలియన్ డాలర్లకు క్లౌడ్ రెవెన్యూ వృద్ధిని అంచనా వేశారు.ఎంటర్ప్రైజ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ద్వారా మెరుగైన మార్జిన్లు ప్రకటన.ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్తో ప్రత్యక్ష పోటీలో ఉంది.పేరునెట్వర్త్ (సెప్టెంబర్ 2025)సంస్థలుఇటీవలి పరిణామాలులారీ ఎలిసన్393 బిలియన్ డాలర్లు41% ఒరాకిల్ఏఐ క్లౌడ్ ఒప్పందాలు, ఓపెన్ఏఐతో డీల్ఎలాన్మస్క్385 బిలియన్ డాలర్లుటెస్లా, స్పేసెఎక్స్ఏడాదిలో కంపెనీల విలువ 13% తగ్గుదల ఇదీ చదవండి: అనిల్ అంబానీపై కేసులు మీద కేసులు.. -
అనిల్ అంబానీపై కేసుల మీద కేసులు..
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్తోపాటు మరికొందరు అధికారులపై రూ.2,929 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈడీ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) కలిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు నష్టం కలిగించాయని, దాంతో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించామని సీబీఐ ఇప్పటికే తెలిపింది.ముంబైలో అనిల్ అంబానీ, ఆర్కామ్కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించారు. అప్పుగా తీసుకున్న బ్యాంకు నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయో, రుణాలు ఎందులోకి మళ్లించబడ్డాయో నిర్ధారించడానికి ఆధారాలను సేకరించే లక్ష్యంతో ఈ సోదాలు నిర్వహించారు. జూన్ 13న ఆర్కామ్, అంబానీలను ఫ్రాడ్ గుర్తించిన ఎస్బీఐ జూన్ 24న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నివేదిక పంపింది.ఇటీవల అనిల్ అంబానీని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) సైతం మోసపూరితం (ఫ్రాడ్)గా వర్గీకరించింది. దాదాపు దశాబ్దం క్రితం ఆర్కామ్ తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ఛేంజీలకు తెలిపిన సమాచారంలో బీవోబీ పేర్కొంది. ఆర్కామ్కు బీవోబీ రూ.1,600 కోట్ల రుణాన్ని, మరో రూ.862.5 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంజూరు చేసింది. ఈ మొత్తం రూ.2,462.5 కోట్లలో ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి రూ.1,656.07 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో కంపెనీతో పాటు ప్రమోటర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ బీవోబీ నుంచి సెప్టెంబర్ 2న లేఖ అందినట్లు ఆర్కామ్ వెల్లడించింది. ఈ లేఖ ప్రకారం.. 2017, జూన్ 5 నుంచి బీవోబీ ఈ ఖాతాను మొండిబకాయిగా కొనసాగిస్తోంది.ఇదీ చదవండి: భారత వృద్ధి అంచనాలు అప్!ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో అంబానీని ఈడీ ప్రశ్నించింది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో రూ.3,000 కోట్లు నిధులు మళ్లించినట్లు ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకు ప్రమోటర్లు కూడా రుణాలు మంజూరు కావడానికి ముందు చెల్లింపులు పొందినట్లు కనుగొంది. ఇది క్విడ్ ప్రో కోకు దారితీసినట్లు సూచిస్తుంది. -
లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ
లంచం, ఇతరత్రా అవకతవకల ఆరోపణల కేసును సెటిల్ చేసుకున్నట్లు సౌర విద్యుదుత్పత్తి సంస్థ అజూర్ పవర్ వెల్లడించింది. ఇందుకోసం 2.3 కోట్ల డాలర్లు చెల్లించినట్లు వివరించింది. కొత్త ప్రాజెక్టులను దక్కించుకునేందుకు కీలక డేటాను తప్పుగా చూపించినట్లు, లంచాలు చెల్లించినట్లు అజూర్ పవర్తో పాటు దాని మాజీ ఎగ్జిక్యూటివ్లు రంజిత్ గుప్తా, మురళి సుబ్రమణియన్, పవన్ కుమార్ అగ్రవాల్పై ఆరోపణలు ఉన్నాయి.అమెరికాలోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అజూర్ షేర్లు లిస్టయి ఉన్నాయి. నిబంధనలను పాటించే విషయంలో వారు తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనలు చేశారని, ఫలితంగా కృత్రిమంగా పెరిగిపోయిన షేర్లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని క్లాస్ యాక్షన్ సూట్ నమోదైంది. దీంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు కంపెనీ నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించింది.ఇదీ చదవండి: రైళ్లకు ‘అద్దె’ చెల్లిస్తున్న భారతీయ రైల్వే! -
తగ్గనున్న పాల ప్యాకెట్ల ధరలు..
ప్రతి ఇంట్లో వాడే పాల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ప్యాకేజ్డ్ మిల్క్ పై 5 శాతం జీఎస్టీ నుంచి మినహాయించాలని ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన వెంటనే దేశంలోని దాదాపు అన్ని బ్రాండ్ల పాల ప్యాకెట్ల ధరలపైనా తక్షణ ఉపశమనం లభించనుంది.ఈ జీఎస్టీ మినహాయింపు నేరుగా సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే పాలపై 5% పన్ను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఉండదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో పాలు వంటి నిత్యావసర వస్తువులను మరింత అందుబాటులో ధరల్లోకి తీసుకురావాలనేది ఈ చర్య ఉద్దేశం.దేశంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న ప్రముఖ పాల ఉత్పత్తుల బ్రాండ్లలో ఒకటైన అమూల్, మదర్ డెయిరీ ప్రస్తుత ధరలు, జీఎస్టీ తొలగింపు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంత తగ్గుతాయన్నది ఈ కింద చూద్దాం. అమూల్ ఉత్పత్తులలో ఫుల్ క్రీమ్ మిల్క్ 'అమూల్ గోల్డ్' ధర ప్రస్తుతం లీటరుకు రూ. 69 కాగా, టోన్డ్ మిల్క్ రూ.57. అదే విధంగా మదర్ డైరీ ఫుల్ క్రీమ్ మిల్క్ రూ. 69, టోన్డ్ మిల్క్ సుమారు రూ.57 ఉంది. గేదె, ఆవు పాలు ధరలు కూడా రూ.50-75 మధ్య ఉన్నాయి.జీఎస్టీ ఎత్తివేసిన తర్వాత ధరలు ఎంత తగ్గుతాయి?ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం పాల ధరలు లీటరుకు రూ.3 నుంచి రూ.4 వరకు తగ్గుతాయి. ఉదాహరణకు, అమూల్ గోల్డ్ ధర సుమారు రూ .65-66 కు తగ్గుతుంది, మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర కూడా అదే స్థాయిలో తగ్గుతుందని భావిస్తున్నారు. టోన్డ్ మిల్ఖ్, గేదె పాలపై కూడా ఇలాంటి ఉపశమనం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వినియోగించే విజయ ప్యాకేజ్డ్ పాలు కూడా జీఎస్టీ మినహాయింపు తర్వాత లీటర్కు రూ.2 నుంచి రూ.3 తగ్గే అవకాశం ఉంది.పాల రకంప్రస్తుత ధర (లీటరుకు)కొత్త ధర (లీటరుకు)అమూల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్)₹69₹65–66అమూల్ ఫ్రెష్ (టోన్డ్)₹57₹54–55అమూల్ టీ స్పెషల్₹63₹59–60అమూల్ గేదె పాలు₹75₹71–72అమూల్ ఆవు పాలు₹58₹55–57మదర్ డైరీ ఫుల్ క్రీమ్₹69₹65–66మదర్ డైరీ టోన్డ్ మిల్క్₹57₹55–56మదర్ డైరీ గేదె పాలు₹74₹71మదర్ డైరీ ఆవు పాలు₹59₹56–57 -
ప్రత్యేక కళాకృతుల ప్రదర్శన.. ఎప్పుడంటే..
ప్రత్యేకమైన కళాకృతులు, ఆభరణాలు, కళలకు సంబంధించి అత్యాధునిక డిజైన్లను అందించే ఆర్ట్ కనెక్ట్, ఎ అండ్ హెచ్ కొలాబ్ సంస్థ సంయుక్తంగా హైదరాబాద్ వేదికగా తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. సెప్టెంబర్ 15న హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్ సమీపంలో స్పిరిట్ కనెక్ట్లో ఈమేరకు ప్రదర్శన ఉంటుందని కంపెనీ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు.ఆర్ట్ కనెక్ట్ కంపెనీని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి భార్య మిహీకా బాజాజ్ దగ్గుబాటి స్థాపించారు. ఏ అండ్ హెచ్ కోలాబ్ వ్యవస్థాపకులుగా అమృతా కిలాచంద్, హీనా ఓమర్ అహ్మద్ ఉన్నారు. ఈ ప్రదర్శన ప్రధానంగా ల్యామ్, వ్యానా అనే థీమ్లతో సాగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇందులో ప్రత్యేక ఆకృతులు, ఆభరణాలు, డిజైనింగ్ వస్తువులు..వంటివి ప్రదర్శనకు ఉంచబోతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మిహీకా బజాజ్ దగ్గుబాటి మాట్లాడుతూ..‘ఆర్ట్ కనెక్ట్ కళాకృతులు, కళాకారులు, వినియోగదారుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. యూజర్లలో పెరుగుతున్న డిజైన్ స్పృహకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. ఇది ఏ అండ్ హెచ్ కొలాబ్ సహకారంతో రూపొందించిన మా ప్రారంభ ఎడిషన్’ అన్నారు. ఏ అండ్ హెచ్ కొలాబ్ వ్యవస్థాపకులు అమృతా కిలాచంద్, హీనా ఓమర్ అహ్మద్ మాట్లాడుతూ..‘ఈ ప్రదర్శన కోసం ఆర్ట్ కనెక్ట్తో కలిసి ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు కళాకృతుల్లో కళను, డిజైన్ను మిళితం చేస్తున్నాం’ అన్నారు. -
రైళ్లకు ‘అద్దె’ చెల్లిస్తున్న భారతీయ రైల్వే!
భారతీయ రైల్వే ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో దేశంలోని పలు మార్గాల్లో సెమీ-హై-స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ను అప్గ్రేడ్ చేస్తోన్న నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓ ప్రభుత్వ సంస్థకు అద్దె చెల్లిస్తుంది. ఇది కొంత ఆకస్తిగా అనిపించినా, రైల్వే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నగదు అప్పుగా ఇచ్చిన ఐఆర్ఎఫ్సీ కంపెనీకి భారతీయ రైల్వే లీజు చెల్లింపులు చేస్తోంది. ఇది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ నిధులను హరించకుండా రైల్వేను ఆధునీకరించడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతోంది. ఇది భారతీయ రైల్వేలు, ఐఆర్ఎఫ్సీ రెండింటికీ మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.ఆర్థికంగా తోడ్పాటు..భారతీయ రైల్వే రైళ్ల తయారీ మౌలిక సదుపాయాలకు అద్దె చెల్లించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఆర్ఎఫ్సీ భారతీయ రైల్వేలకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తోంది. ఇది మార్కెట్లో బాండ్లు, డిబెంచర్లను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సేకరిస్తోంది. దాంతో భారతీయ రైల్వేలకు అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోలింగ్ స్టాక్ (రైళ్లు, ఇంజిన్లు మొదలైనవి)లో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.వాయిదాల్లో చెల్లింపులు..ఈ ఆస్తులను పెద్దమొత్తంలో నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా రైళ్లు, ఇంజిన్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఐఆర్ఎఫ్సీ బాండ్ల రూపంలో వచ్చిన నిధులతో నగదు సమకూరుస్తుంది. వీటిని ఏర్పాలు చేసి తిరిగి రైల్వేలకు లీజుకు ఇస్తోంది. ఉదాహరణకు.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్)ను ఐఆర్ఎఫ్సీ భారతీయ రైల్వేలకు లీజుకు ఇచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్ఎఫ్సీకి చేసే లీజు చెల్లింపులను అద్దెగా పిలుస్తారు. వీటిని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు, వడ్డీ రెండూ ఉంటాయి.ఈ మోడల్ ఎందుకు?వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి హైటెక్ రైళ్ల తయారీకి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ భారీ ఆర్థిక భారాన్ని ముందస్తుగా భరించడానికి బదులుగా భారతీయ రైల్వే కాలక్రమేణా ఖర్చును వైవిధ్య పరుస్తుంది. ఐఆర్ఎఫ్సీ బాండ్ల వేలం ద్వారా సమీకరించిన డబ్బు ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ ఆస్తులను ఉపయోగిస్తూ, తర్వాతి కాలంలో అందుకు అద్దె చెల్లిస్తుంది. భారతీయ రైల్వే తక్షణ బడ్జెట్పై భారీ ఒత్తిడి లేకుండా కార్యాచరణ ఆదాయాలను (ప్రయాణీకుల టిక్కెట్లు, సరుకు రవాణా మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయాలు) ఉపయోగించి క్రమంగా చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వ బడ్జెట్ పరిమితులకు లోబడి పనిచేసే భారతీయ రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థకు ఇది చాలా ముఖ్యమైనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన -
భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన
భారతదేశం అందిస్తోన్న ఐటీ సేవల పరిశ్రమను దెబ్బ తీసేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైర్’ బిల్లు అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లుకు అమెరికాలోని ప్రముఖ కంపెనీల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో భారత సంస్థలు ఎలాంటి విధానాలు పాటించాలో ఐటీ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.హైర్ బిల్లుగ్లోబల్ అవుట్ సోర్సింగ్లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండియా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని విదేశీ ఐటీ సర్వీసులపై 25% సుంకాన్ని హాల్ట్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (HIRE) బిల్లు ప్రతిపాదించింది. ఇది శాసనపరంగా విఫలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిడి మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా లారా లూమర్ వంటి వ్యక్తులు భారత కంపెనీలు అందించే కాల్ సెంటర్ సర్వీస్ ఉద్యోగాలను యూఎస్కు తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత్ దిగమతులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికాకు తలొగ్గని కేంద్ర ప్రభుత్వంపై ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా కంపెనీలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వచ్చి భారత్ ఐటీ సర్వీసులపై ప్రభావం పడితే.. స్థానికంగా యూఎస్ తమ ఉద్యోగులకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే భారత్లో అక్కడితో పోలిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ఈ బిల్లుకు వ్యతిరేకత మొదలైంది.ఎక్కువగా ఆధారపడటం..హైర్ బిల్లు ప్రతిపాదనలో ఉన్న నేపథ్యంలో దేశీయ ఐటీ ఎగుమతులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ నుంచి 60% ఐటీ సర్వీసులు ఉత్తర అమెరికాకు వెళ్తున్నాయి. అందులో టీసీఎస్- 48.2%, ఇన్ఫోసిస్- 57.9%, విప్రో- సుమారు 60% ఎగుమతులు యూఎస్కు చేస్తున్నాయి. అతిగా అమెరికాపై ఆధారపడటంతో భారతదేశ ఐటీ రంగాన్ని యూఎస్ విధాన మార్పుల ద్వారా ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి.చేయాల్సింది ఇదే..భారతదేశం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించాలి. యూరప్, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో మరింత దూకుడుగా విస్తరించాలి. ఏఐ ఆధారిత వ్యవస్థలను నిర్వహించగల అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులపై దృష్టి పెట్టాలి. స్థానికంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి పెట్టాలి. వీటిని పెంచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఐటీ సేవలకు డిమాండ్ నెలకొంటుండడంతో వీటిపై మరింత దృష్టి సారించాలి.ఇదీ చదవండి: పాత స్టాక్పై ఎంఆర్పీ మార్చవచ్చు: కేంద్రం -
నెలకు రూ.18 వేలు జీతం.. ప్రపంచంలోనే రిచ్..
ఒకప్పుడు నెలకు రూ.18,000 వేతనం వస్తున్నా, దేశంలోని ఖరీదైన నగరాల్లో ఒకటైన బెంగళూరులో నివసిస్తూ సంతోషంగా ఉన్నానని ఓ మహిళ ఉద్యోగి తన అనుభవాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం దుబాయ్లో గతంలో కంటే భారీగా జీతం సంపాదిస్తున్నా అప్పటి సంతోషాన్ని, ఆనందాన్ని పొందలేకపోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇదికాస్తా నెటిజన్ల కంటపడి వైరల్గా మారింది.సీమా పురోహిత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్ట్లోని వివరాల ప్రకారం..‘బెంగళూరులో నా మొదటి ఉద్యోగం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నెలకు కేవలం రూ.18,000 సంపాదిస్తూ, దాన్ని అదృష్టంగా భావించి, సంతోషంగా జీవించాను. ఆ సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనిక అమ్మాయిగా నేను ఫీల్ అయ్యాను. తక్కువ జీతంతో కూడా జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాను. బెంగళూరులో పీజీ ఫీజు చెల్లించడానికి, వీధుల్లో షాపింగ్ చేయడానికి, క్యాంటీన్లో తినడానికి, ప్రతి వారాంతంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి పోను ఇంకా కొంచెం డబ్బు మిగిలి ఉండేది’ అని చెప్పారు.‘ప్రస్తుతం దుబాయ్లో పని చేస్తున్నాను. గతంలో కంటే భారీగానే వేతనం వస్తుంది. కానీ జీవితంలో సంతోషం కోల్పోయాను. అప్పటి ఆనందాన్ని చాలా మిస్ అవుతున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చారు. ఆమె మాటలు ఆన్లైన్లో చాలా మందికి కనెక్ట్ అయ్యాయి. దాంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘మీరు చెప్పింది నిజమే.. ఇక్కడి జీవితం నాకు అసంతృప్తిగానే ఉంది’అని ఒకరు రిప్లై ఇచ్చారు. ‘పని-జీవిత సమతుల్యత, మానసిక ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందుతున్నారు’ అని మరొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Seema (@seemapurohit018)ఇదీ చదవండి: అంతకంతకూ పెరుగుతోన్న పసిడి ధర! -
ఇకపై సులువుగా పీఎస్యూ డీలిస్టింగ్
ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్యూ)లు స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్చందంగా వైదొలగేందుకు(డీలిస్టింగ్) వెసులుబాటు కల్పిస్తూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీంతో ప్రభుత్వానికి 90 శాతం లేదా అంతకుమించి వాటా ఉన్న పీఎస్యూలను ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ చేసేందుకు వీలు చిక్కనుంది. డీలిస్టింగ్కి మెజారిటీ సాధారణ వాటాదారులు అనుమతి పొందాల్సిన నిబంధనలను కూడా సెబీ సడలించింది. అలాగే, ఫ్లోర్ ధర మదింపులోనూ మార్పులకు తెరతీసింది. వెరసి ఫ్లోర్ ధరకంటే కనీసం 15 శాతం ప్రీమియంతో, ఫిక్స్డ్ ధర ద్వారా డీలిస్టింగ్కు అవకాశం ఏర్పడనుంది. ఇందుకు లావాదేవీల పరిమాణం తదితరాలను పరిగణనలోకి తీసుకోరు. ప్రభుత్వానికి 90 శాతం పైగా వాటా గల పీఎస్యూలకు ఈ వెసులుబాటును వర్తింపచేసేలా సెపె్టంబర్ 1న సెబీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, బీమా కంపెనీలను దీన్నుంచి మినహాయించింది. ఇన్విట్స్లో కనీస లాట్ తగ్గింపుప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా ఐపీవోలో కేటాయించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (ఇన్విట్స్) కనీస లాట్ పరిమాణాన్ని సెబీ తాజాగా కుదించింది. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ లాట్తో సమానం చేస్తూ రూ. 25 లక్షలకు తగ్గించింది. ఇందుకు నిబంధనలు సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటివరకూ ప్రయివేట్ ప్లేస్మెంట్ చేసే ఇన్విట్లకు అసెట్ మిక్స్ ఆధారంగా కనీస లాట్ రూ. కోటి లేదా రూ. 25 కోట్లుగా అమలవుతోంది. అయితే ఇప్పటికే అసెట్ మిక్స్తో సంబంధంలేకుండా సెబీ సెకండరీ మార్కెట్లో లాట్ పరిమాణాన్ని రూ. 25 లక్షలకు కుదించింది. దీంతో ఐపీవో ప్లేస్మెంట్ లాట్ను అలైన్ చేసింది.ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం -
ప్రైవేటు మూలధన వ్యయాలకు పుష్
స్థిరమైన డిమాండ్ ప్రైవేటు మూలధన వ్యయాలకు ప్రేరణనిస్తుందని ఎస్బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. ప్రభుత్వ మూలధన వ్యయాలు బలంగా ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వరంగ రిఫైనరీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. ఎస్బీఐ రుణ పుస్తకంలో రూ.3–4 లక్షల కోట్లు కార్పొరేట్లవి ఉన్నట్టు చెప్పారు. రిఫైనరీలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక ఇంధన కంపెనీల నుంచి రుణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. స్టీల్, సిమెంట్ కంపెనీలు ఇంకా పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్నారు.‘స్థిరమైన డిమాండ్ రాక కోసం ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు డిమాండ్కు ఊతమిస్తాయి. లిక్విడిటీ తగినంత ఉండేలా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. వడ్డీ రేట్లు తగ్గించింది. ఇవన్నీ కార్పొరేట్లలో (కంపెనీల్లో) విశ్వాసాన్ని పెంచుతాయి’ అని శెట్టి వివరించారు. కంపెనీలు ఇప్పటికే తమ సామర్థ్యంలో 75 శాతం వినియోగ స్థాయికి చేరుకున్నాయంటూ, సామర్థ్య విస్తరణ చేపట్టేందుకు ఇది సరైన సమయంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ రుణదాతల మాదిరే విలీనాలు, కొనుగోళ్లకు నిధులు సమకూర్చే దిశగా బ్యాంక్లను సైతం అనుమతించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కొనుగోళ్లు అన్నవి పారదర్శకతతో కూడిన లావాదేవీలుగా పేర్కొన్నారు. కనుక వీటికి రుణాల రూపంలో మద్దతుగా నిలిచేందుకు బ్యాంకులు మెరుగైన స్థానంలో ఉన్నట్టు చెప్పారు. సమీప కాలంలో యోనో యాప్ లిస్టింగ్ ఆలోచనేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మళ్లీ చక్కెర షేర్లు మధురం -
మళ్లీ చక్కెర షేర్లు మధురం
ఏడాది కాలంగా నేలచూపులకే పరిమితమైన షుగర్ షేర్లు ఇటీవల బలపడుతున్నాయి. ఇందుకు పలు సానుకూల పరిణామాలు తోడ్పాటునిస్తున్నాయి. లక్ష్యానికంటే ముందుగానే పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిక్స్కు ప్రభుత్వ దన్ను, ఇథనాల్ తయారీలో చెరకురసం వినియోగంపై ఆంక్షల ఎత్తివేత, దేశీ మార్కెట్లో చక్కెరకు పెరుగుత్ను డిమాండ్ తదితరాలు షుగర్ కంపెనీలకు జోష్నిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు షుగర్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వివరాలు చూద్దాం.. –సాక్షి, బిజినెస్ డెస్క్భారీగా పెరిగిన సరఫరాలు, మందగించిన మార్కెట్ పరిస్థితులు, ఇథనాల్ తయారీపై ఆంక్షలు తదితర ప్రతికూలతల కారణంగా గత ఏడాది కాలంలో షుగర్ కౌంటర్లు డీలా పడ్డాయి. దీంతో చక్కెర తయారీ కంపెనీల షేర్లు 2025 మార్చికల్లా ఏడాది కనిష్టాలకు చేరాయి. అయితే కొద్ది రోజులుగా షుగర్ పరిశ్రమ టర్న్అరౌండ్ బాట పట్టింది. ఇందుకు పలు అంశాలు దోహదపడుతున్నాయి. చక్కెరతోపాటు ఇథనాల్ తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర బిజినెస్లవైపు దృష్టిపెట్టడం, డిస్టిల్లరీల ఏర్పాటు కంపెనీలకు బలాన్నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా నవంబర్ నుంచి ప్రారంభంకానున్న తాజా సీజన్(2025–26)లో షుగర్కేన్ జ్యూస్, మొలాసిస్ తదితరాల ద్వారా ఇథనాల్ తయారీ చేపట్టడంలో ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. గత సీజన్(2024–25)లో ఇథనాల్ తయారీకి 4 మిలియన్ టన్నులను వినియోగించుకునేందుకు మాత్రమే అనుమతించిన సంగతి తెలిసిందే. వెరసి సవాళ్ల నుంచి సానుకూల పరిస్థితులకు పరిశ్రమ ప్రయాణిస్తున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి.పండుగల సీజన్దేశీయంగా పండుగల సీజన్ ప్రారంభంకావడంతో చక్కెరకు డిమాండ్ పెరుగుతోంది. దీనికితోడు దేశీయంగా 2025–26 మార్కెటింగ్ సీజన్లో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల చక్కెర ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. ఇది 18 శాతం అధికమని దేశీ చక్కెర మిల్లుల అసోసియేషన్ గత నెలలో వెల్లడించింది. దీంతో 2 మిలి యన్ టన్నుల చక్కెర ఎగుమతులకు వీలు చిక్కనున్నట్లు భావిస్తోంది. అంతేకాకుండా ఇథనాల్ ఉత్పత్తికి 5 మిలియన్ టన్నులకుపైగా మళ్లించవచ్చునని తెలియజేసింది. కర్బనాల కట్టడికి వీలుగా 2025–26కల్లా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మిక్స్(ఈ20)ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశీయంగా ఆటో దిగ్గజాలు ఇందుకు అనుగుణమైన వాహనాల ఉత్పత్తిని చేపట్టి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. దీంతో దేశీ పరిశ్రమ చక్కెరసహా.. ఇథనాల్ తయారీ విక్రయాల ద్వారా లబ్ది పొందనుంది. ఈ ఏడాది చెరకు దిగుబడి ఊపందుకోనున్న అంచనాల కారణంగా అక్టోబర్ నుంచి మొదలుకానున్న చక్కెర సీజన్లో ఎగుమతులకు ప్రభుత్వం అనుమతించే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సగటుకంటే అధికంగా నమోదవుతున్న వర్షపాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర కీలక రాష్ట్రాలలో చెరకు సాగుకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు పేర్కొన్నారు.ఇతరత్రా డిమాండ్ఇథనాల్కు ఇంధన రంగంతోపాటు ఇతర పరిశ్రమల నుంచి సైతం డిమాండ్ కనిపించనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. ఔషధాలు, ప్లాస్టిక్స్, పాలిష్లు, కాస్మెటిక్స్ తదితర పరిశ్రమలలోనూ వినియోగం పెరగనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో షుగర్ కంపెనీలకు ఇథనాల్ మనీ స్పిన్నర్గా అవతరించనున్నట్లు విశ్లేషించాయి. వెరసి భవిష్యత్లో షుగర్ కంపెనీలకు ఇథనాల్ అనూహ్య లాభాలను తెచి్చపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డాయి. నిజానికి 2023 ఏప్రిల్ నుంచే ఆటో రంగ దిగ్గజాలు ఈ20 సంబంధిత ఇంజిన్ల తయారీకి శ్రీకారం చుట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ20 పూర్తిస్థాయి అమలుకు వీలుంది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ పలు రంగాలకు ఊతమిస్తూ వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) సంస్కరణలకు తెరతీసింది. ప్రధానంగా 12 శాతం, 5 శాతం శ్లాబులలోకి పలు ప్రొడక్టులను చేర్చడంతోపాటు ఈ నెల 22 నుంచి అమలుకు నిర్ణయించింది. దీంతో ఆటోసహా ఎఫ్ఎంసీజీ, సిమెంట్, ఫుట్వేర్, హోటళ్లు తదితర రంగాలు జోరందుకోనున్నాయి. ఇది వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం ద్వారా విభిన్న రంగాలలో డిమాండ్కు దారి చూపనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా షుగర్ రంగ షేర్లు లాభాల బాటలో సాగుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు వివరించారు.ఏటికి ఎదురీతగతేడాది కాలంలో షుగర్ షేర్లు క్షీణిస్తూ దాదాపు 52 వారాల కనిష్టానికి చేరినప్పటికీ ఈఐడీ ప్యారీ ఇండియా, బన్నారీ అమ్మన్ షుగర్స్, బలరామ్పూర్ చినీ లాభాలతో నిలదొక్కుకోవడం విశేషం! ఇందుకు ఆయా కంపెనీలు షుగర్తోపాటు.. ఇతర విభాగాలలోకి ప్రవేశించడం, అవసరానికి అనుగుణంగా ఉత్పత్తిని చేపట్టగల డిస్టిల్లరీలను ఏర్పాటు చేసుకోవడం సహకరించినట్లు తెలియజేశారు. పటిష్ట ఫైనాన్షియల్స్కుతోడు నామమాత్ర రుణభారం వంటి సానుకూలతలు సైతం వీటికి జత కలిసినట్లు విశ్లేషించారు.ఇదీ చదవండి: ప్రాపర్టీ విక్రయించా.. పెట్టుబడి దారేది? -
ఆఫర్ చూసి క్లిక్ చేసే ముందు.. జాగ్రత్త!
పండుగ సీజన్లో సేల్స్ వస్తే తగ్గింపు ధరలు, ఉచిత డెలివరీ, స్పెషల్ ఆఫర్లు ఇలా ఎన్నో వస్తాయి. వీటిని చూసి ఎవ్వరైనా ఆకర్షితులవుతారు. కానీ అదే సమయంలో సైబర్ మోసాలకు ఇది మంచి అవకాశంగా మారుతుంది. ఒక తప్పుడు క్లిక్ చేసినా మీ డబ్బు, డేటా లేదా ఐడెంటిటీని కోల్పోవచ్చు.ఇప్పుడీ ఫిషింగ్ అనే మోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి నాలుగు సైబర్ దాడులలో ఒకటిగా మారింది. మన దేశంలో గత ఒక్క సంవత్సరంలోనే సైబర్ మోసాల వలన రూ.22,811 కోట్లకు పైగా నష్టం జరిగింది, కాబట్టి జాగ్రత్త! ఆఫర్ చూసి క్లిక్ చేసేముందు, అది నమ్మదగినదేనా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని గ్లోబల్ కొరియర్ సంస్థ ఫెడ్ఎక్స్ సూచిస్తోంది. స్కామర్లు ఉపయోగించే ట్రిక్స్, వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసింది.మోసాలు ఇలా ఉంటాయి..పండుగ సీజన్లో స్కామర్లు వినియోగదారులను మోసగించడానికి కొన్ని సాధారణ ట్రిక్స్ ఉపయోగిస్తారు. ఇవి సక్సెస్ అవుతాయి కూడా ఎందుకంటే.. అవి నిజమైన వాటిగా కనిపిస్తాయి. బ్రాండ్ల లోగోలు, అత్యవసరంగా మాట్లాడే భాష, పరిచయమైన పేర్లు వాడుతూ మిమ్మల్ని త్వరపడేలా చేస్తారు. ఆ ట్రిక్స్ ఇవే..• "మీ ఖాతాను వెరిఫై చేయండి" అంటూ బ్యాంక్ లేదా షాపింగ్ సైట్ పేరుతో ఫేక్ మెసేజ్లు పంపిస్తారు.• కార్డ్ లేదా యూపీఐ వివరాలను దొంగిలించడానికి ఒకేలా కనిపించే వెబ్సైట్లను సృష్టిస్తారు. • నమ్మలేని ఆఫర్లు లేదా క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు చెబుతూ ఫేక్ యాప్స్ లేదా క్యూఆర్ కోడ్లు ఉపయోగిస్తారు.• తాము కొరియర్ కంపెనీల నుంచి అన్నట్టు నటిస్తూ, "మీ పార్సల్ మధ్యలో ఆగిపోయింది" అంటూ లింక్ క్లిక్ చేయమని లేదా ఒక నంబర్కు కాల్ చేయమని చెబుతారు.•వెంటనే ట్రాక్ చేయండి అంటూ ఫేక్ డెలివరీ లింక్స్తో వాట్సాప్/ఎస్ఎంఎస్ మెసేజ్లు పంపుతారు.• “డబ్బు అందుకోవడానికి” క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయమని అడిగి, మీ ఖాతాలోని డబ్బును దొంగలిస్తారు.స్కామ్ల బారినపడకుండా ఎలా జాగ్రత్త పడాలి?ఆన్లైన్ షాపింగ్ సులభమే, అలాగే సైబర్ సురక్షితంగా ఉండడం కూడా సాధ్యం. షాపింగ్ చేస్తుంటే, స్క్రోల్ చేస్తుంటే, కోడ్ స్కాన్ చేస్తుంటే ఈ సులభమైన జాగ్రత్తలు తీసుకోండి..• తెలియని వారి దగ్గర నుండి వచ్చిన లింక్లపై ఎప్పుడూ క్లిక్ చేయకండి, నేరుగా అధికారిక యాప్ లేదా వెబ్సైట్కి వెళ్లండి.• ఎప్పుడూ వెబ్ సైట్ అడ్రస్ చూసుకోండి, నకిలీ సైట్లు చాలా సార్లు స్పెల్లింగ్ తప్పులు లేదా అదనపు పదాలు ఉంటాయి.• ఓటిపి, పాస్వర్డ్స్, కార్డ్ వివరాలను ఫోన్, ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా ఎవరితోనూ పంచుకోకండి• నమ్మకమైన పేమెంట్ యాప్స్ ఉపయోగించండి, వాటిని ఎప్పుడూ అప్డేట్ చేసుకోండి• ఒక ఆఫర్ చాలా బాగా కనిపిస్తే, వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. నిజమైన అమ్మకందారులు మీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేయరు.చివరిగా.. చాలా స్కామ్లు అధునాతన హ్యాకింగ్పై ఆధారపడవు, అవి నమ్మకంపై ఆధారపడతాయి. పండుగ రద్దీ సమయంలో, ఆ నమ్మకాన్నే స్కామర్లు దోపిడీ చేస్తారు. మీరు క్లిక్ చేసే ముందు, ప్రాథమికాలను తనిఖీ చేయడానికి కొంత సమయం కేటాయించండి, సందేశం ఎవరు పంపారు? సైట్ నిజమేనా? ఇది అసాధారణంగా అనిపిస్తుందా? అన్నవి చూసుకోండి. మీరు సైబర్ మోసానికి గురైనా లేదా అనుమానం కలిగినా వెంటనే మీ స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930 కు లేదా వెబ్సైట్ (cybercrime.gov.in) ద్వారా సమాచారం ఇవ్వండి. -
ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు సంబంధించి ‘లోకల్ రెమెడీస్ ఎగ్జాషన్’ నిబంధన వ్యవధిని అయిదేళ్ల నుంచి ప్రస్తుతం మూడేళ్లకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీఐఏ) కుదుర్చుకుంది. ఈ నిబంధన ప్రకారం, వివాదాలేవైనా తలెత్తితే విదేశీ ఇన్వెస్టర్లు ముందుగా ఆతిథ్య దేశంలోని న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్కి వెళ్లాలి.సాధారణంగా భారత్ ఇందుకోసం అయిదేళ్ళ వ్యవధిని నిర్దేశిస్తోంది. తాజాగా కుదుర్చుకున్న బీఐఏలో గతానికి భిన్నంగా పోర్ట్ఫోలియో పెట్టుబడులను కూడా చేర్చారు. యూఏఈతో భారత్ కుదుర్చుకున్న బీఐఏ తరహాలోనే ఇజ్రాయెల్ బీఏఐ కూడా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. భారత్ ఈ డీల్ కుదుర్చుకున్న తొలి ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్, డెవలప్మెంట్) కూటమి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం.ఇటు భారత సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా అటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఈ ఒప్పందం ఉంటుంది. 2000 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు ఇజ్రాయెల్ నుంచి భారత్కి 337.77 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. -
ప్రపంచంలో విలువైన బ్రాండ్స్.. లిస్ట్లోని ఇండియన్ కంపెనీస్
2025 సంవత్సరానికి గాను.. ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్లను కాంటార్ బ్రాండ్జెడ్ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది.. టాప్ 100 గ్లోబల్ బ్రాండ్ల మొత్తం విలువ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో వీటి మొత్తం మొత్తం విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ కథనంలో అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్, ఇండియన్ బ్రాండ్స్ ఏవి?, వాటి విలువ ఎంత అనే వివరాలు చూసేద్దాం.2025 లో టాప్ 10 అత్యంత విలువైన గ్లోబల్ బ్రాండ్స్👉🏻యాపిల్: 12,99,655 మిలియన్ డాలర్స్👉🏻గూగుల్: 9,44,137 మిలియన్ డాలర్స్👉🏻మైక్రోసాఫ్ట్: 8,84,816 మిలియన్ డాలర్స్👉🏻అమెజాన్: 8,66,118 మిలియన్ డాలర్స్👉🏻ఎన్విడియా: 509,442 మిలియన్ డాలర్స్👉🏻ఫేస్బుక్: 3,00,662 మిలియన్ డాలర్స్👉🏻ఇన్స్టాగ్రామ్: 2,28,947 మిలియన్ డాలర్స్👉🏻మెక్డొనాల్డ్స్: 2,21,079 మిలియన్ డాలర్స్👉🏻ఒరాకిల్: 2,15,354 మిలియన్ డాలర్స్👉🏻వీసా: 2,13,348 మిలియన్ డాలర్స్ఇదీ చదవండి: ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా2025లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్➢టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్): 57,333 మిలియన్ డాలర్స్➢హెచ్డీఎఫ్సీ బ్యాంక్: 44,959 మిలియన్ డాలర్స్➢ఎయిర్టెల్: 37,094 మిలియన్ డాలర్స్➢ఇన్ఫోసిస్: 33,096 మిలియన్ డాలర్స్ -
అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందం
పాకిస్తాన్లోని కీలకమైన ఖనిజాలకు సంబంధించి.. పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది."ఈరోజు ప్రధాన మంత్రి నివాసంలో పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయడానికి యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఇస్లామాబాద్ రాయబార కార్యాలయం యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జాచ్ హార్కెన్రైడర్ వచ్చారు" అని ప్రకటన పేర్కొంది."అమెరికా భద్రత, శ్రేయస్సుకు కీలకమైన ఖనిజ వనరుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ పరిపాలనలో ఇటువంటి ఒప్పందాలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్లోని కీలకమైన ఖనిజాలు.. మైనింగ్ రంగంలో యూఎస్ కంపెనీలు, వాటి సహచరుల మధ్య భవిష్యత్తులో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కూడా మేము ఎదురుచూస్తున్నాము" అని ఛార్జ్ డీ అఫైర్స్ నటాలీ బేకర్ అన్నారు.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!యూఎస్ఎస్ఎమ్ అనేది మిస్సోరిలో ఉన్న ఒక సంస్థ. ఇది కోబాల్ట్, నికెల్, రాగి, లిథియం వంటి కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, రీసైక్లింగ్ చేయడం వంటివి చేస్తుంది. ఈ ఖనిజాలను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ.. వివిధ సాంకేతిక పరిజ్ఞానాలలో తమకు అవసరమైనవిగా లేబుల్ చేసుకుంటుంది.Excited to see U.S. companies like USSM deepening economic ties with Pakistan! USSM’s visit to Islamabad marks an important milestone as they sign an MOU to collaborate on critical minerals production. A forward-looking partnership with great potential for both nations. -NB…— U.S. Embassy Islamabad (@usembislamabad) September 8, 2025 -
జాబ్కు అప్లయి చేస్తున్నారా? జాగ్రత్త!
భారతదేశ డిజిటల్ జాబ్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. కానీ ఆన్లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ మోసాలకు ఉద్యోగార్థులు చిక్కకుండా సహాయపడటానికి, లింక్డ్ఇన్ నమ్మకాన్ని పెంపొందించడానికి, మోసాలను తగ్గించడానికి తన ధృవీకరణ సాధనాలను విస్తరిస్తోంది.లింక్డ్ఇన్లో కొత్త మార్పులుకంపెనీల పేజీ వెరిఫికేషన్ విస్తరణ: ఇప్పుడు ప్రీమియం పేజీలతో చిన్న కంపెనీలకు కూడా అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు, ఉద్యోగార్థులు, భాగస్వాములతో నమ్మకాన్ని పెంపొందించడానికి కంపెనీలకు సహాయపడుతుంది.రిక్రూటర్ వెరిఫికేషన్: "రిక్రూటర్" లేదా "టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్" వంటి టైటిల్స్ను జోడించే ముందు రిక్రూటర్లు వారి కార్యాలయాన్ని ధృవీకరించాలి. ఇది ఉద్యోగార్థులు తాము నిజమైన ప్రొఫెషనల్స్తో వ్యవహరిస్తున్నామని నిర్ధారిస్తుంది.ఎగ్జిక్యూటివ్ టైటిల్ వెరిఫికేషన్: సీనియర్ పాత్రలకు (ఉదా. మేనేజింగ్ డైరెక్టర్, వీపీ) ఇప్పుడు వర్క్ ప్లేస్ వెరిఫికేషన్ అవసరం. తాము లీడర్షిప్ రోల్లో ఉన్నామంటూ ఎవరూ మోసం చేయకుండా ఇది నివారిస్తుంది.80 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలుభారత్లో వెరిఫికేషన్ అడాప్షన్ గత ఏడాదిలో 2.4 రెట్లు పెరిగింది. వెరిఫైడ్ యూజర్లు 60% ఎక్కువ ప్రొఫైల్ వ్యూస్, 30% ఎక్కువ కనెక్షన్ రిక్వెస్ట్లు, 13% ఎక్కువ రిక్రూటర్ సందేశాలను పొందుతారు. లింక్డ్ఇన్ కేవలం ఆరు నెలల్లో 80 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలను బ్లాక్ చేసింది.ఈ జాగ్రత్తలు తీసుకోండి..మోసాల బారిన పడకుండా లింక్డ్ఇన్ ఇండియాలో బోర్డ్ డైరెక్టర్, లీగల్ & ప్రభుత్వ వ్యవహారాలకు కంట్రీ హెడ్గా ఉన్న అతిథి ఝా ఉద్యోగార్థులకు ఈ కింది సూచనలు చేశారు.ఆన్బోర్డింగ్కు ముందు బ్యాంక్ వివరాలను పంచుకోవద్దు.అనుమానాస్పద అభ్యర్థనలను నివారించండి-నిజమైన కంపెనీ ప్రతినిధులు డబ్బు లేదా సాఫ్ట్వేర్ డౌన్లోడ్లను అడగరు.మోసపూరిత జాబ్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.అప్డేటెడ్ సెట్టింగ్స్, రికవరీ ఎంపికలతో మీ అకౌంట్ను సురక్షితంగా ఉంచుకోండి.లింక్డ్ ఇన్ సేఫ్టీ టూల్స్వెరిఫైడ్ జాబ్ పోస్టింగ్స్: వెరిఫైడ్ కంపెనీలు లేదా రిక్రూటర్లను చూపించే బ్యాడ్జీలను చూడండి.సందేశ హెచ్చరికలు: హానికరమైన కంటెంట్ను గుర్తించడానికి వీలు కల్పిస్తాయి.జాబ్ ఫిల్టర్లు: వెరిఫైడ్ జాబ్స్ మాత్రమే సెర్చ్ చేయొచ్చు.పాస్కీలు: సురక్షితమైన లాగిన్ కోసం డివైజ్ అన్లాక్ (వేలిముద్ర వంటివి) ఉపయోగిస్తుంది.టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ ఖాతాకు అదనపు రక్షణను జోడిస్తుంది. -
ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు
గ్లోబల్ ట్రావెల్ టెక్ ప్లాట్ ఫామ్ ఓయో (OYO) కంపెనీ పేరు మారింది. ఐపీఓ ముంగిట ఓయో మాతృసంస్థ ఒరావెల్ స్టేస్ తన పేరును ‘ప్రిజం’గా మార్చుకుంది. ఇది దాని అన్ని వ్యాపారాలకు గొడుగు సంస్థగా పనిచేస్తుంది. తమ ప్లాట్ ఫామ్కు సంబంధించిన వివిధ బ్రాండ్లను ఏకతాటిపైకి తీసుకురానుంది. అయితే ఒక బ్రాండ్గా ఓయో పేరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ వెల్లడించింది.ఒరావెల్ స్టేస్ ఇకపై ‘ప్రిజం లైఫ్’ సంక్షిప్తంగా ‘ప్రిజం’గా కొత్త కార్పొరేట్ గుర్తింపును కొనసాగిస్తుందని ఓయో షేర్ హోల్డర్లకు పంపిన లేఖలో బోర్డు చైర్మన్, వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు."ప్రిజం మన విభిన్న వ్యాపారాలన్నింటికీ గొడుగులా పనిచేస్తుంది, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి, మనం ఎవరో స్పష్టంగా తెలియజేయడానికి మనకు సహాయపడుతుంది. ఇది మన వేర్వేరు బ్రాండ్లను విడిపోకుండా కలుపుతుంది" అని అగర్వాల్ లేఖలో పేర్కొన్నారు.కొత్త పేరు ఇలా వచ్చింది..మాతృ సంస్థ పేరు మార్చాలని నిర్ణయించిన యాజమాన్యం కొత్త పేరు సూచించాలని ప్రపంచస్థాయిలో ఓ పోటీ పెట్టింది. ఇందులో 6,000 లకు పైగా వచ్చిన సూచనల్లో నుంచి ప్రిజం పేరును ఎంపిక చేసింది. అగర్వాల్ 2012లో స్థాపించిన ఓయో 35 దేశాల్లో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఓయో, మోటెల్ 6, టౌన్ హౌస్, సండే, ప్యాలెట్ వంటి బ్రాండ్ల కింద హోటళ్లను ఈ గ్రూప్ పోర్ట్ ఫోలియో విస్తరించింది.వెకేషన్ హోమ్స్ విభాగంలో బెల్విల్లా, డాన్ సెంటర్, చెక్ మైగెస్ట్, స్టూడియో ప్రెస్టీజ్ వంటి వివిధ బ్రాండ్లను నిర్వహిస్తోంది. అమెరికాలోని జీ6 హాస్పిటాలిటీ ద్వారా దక్కించుకున్న స్టూడియో 6 ఈ ఎక్స్టెండెడ్ స్టే కేటగిరీకి ప్రాతినిధ్యం వహిస్తోంది. అదనంగా, పోర్ట్ ఫోలియోలో వర్క్ స్పేస్ లు, సెలబ్రేషన్ స్పేస్ లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాగస్వామ్య సాధనాలు, డేటా సైన్స్ ప్లాట్ఫామ్లతో సహా ఆతిథ్య సాంకేతిక పరిష్కారాలను కూడా ఈ గ్రూప్ అందిస్తుంది.ఇదీ చదవండి: ఖరీదైన అపార్ట్మెంట్లు.. బాలీవుడ్ నటులకు భారీ లాభాలు -
'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'
అమెరికా ఉద్యోగ మార్కెట్ పరిస్థితి గురించి.. ప్రముఖ ఆర్ధిక సంస్థ మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ 'మార్క్ జాండీ' ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి ఉద్యోగుల భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ (హెల్త్కేర్), ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగాలపై ఎక్కువగా ఆధారపడుతోందని వెల్లడించారు. ఈ పరిస్థితి ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుందని స్పష్టం చేశారుఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాలలో ఆరు లక్షల ఉద్యోగాలు పుట్టాయి. ఈ రెండు రంగాలు లేకపోతే.. ఇక్కడ ఉద్యోగాల సృష్టి సున్నాకు పడిపోయే అవకాశం ఉందని మార్క్ జాండీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఆర్థికమాంద్యం సమయంలోనే కనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అమెరికా ఉద్యోగ మార్కెట్ మాంద్యం ఎదుర్కొంటుందా?అమెరికా ఉద్యోగ పరిస్థితి మాంద్యంలోకి ప్రవేశించినట్లు జాండీ ట్వీట్ చెబుతోంది. జూన్ నెలలో ఉద్యోగాలు తగ్గినప్పటికీ.. జులై, ఆగస్టు నెలలో స్వల్ప వృద్ధి ఉంది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా?, తగ్గుతుందా?, అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. జీడీపీ, ఆదాయాలు కొంత పెరుగుతున్నప్పటికీ.. తయారీ, మైనింగ్, నిర్మాణం వంటి రంగాల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం మాత్రమే ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తి మాంద్యం కాదని మార్క్ అన్నారు.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!యూఎస్ ఉద్యోగాల డేటాయూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) శుక్రవారం.. ఉద్యోగ డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత రేటు ఆగస్టులో 4.3% ఉంది. జూలై 2025లో 79,000గా ఉన్న ఉద్యోగాల వృద్ధి.. ఆగస్టులో 22,000కు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అవగతం అవుతోంది.What’s perhaps most disconcerting about the flagging job market is how dependent it is on healthcare and hospitality for what little job growth is occurring. Since the beginning of the year, the economy has created a paltry 600k jobs, but without the job growth in these… pic.twitter.com/lmheiipugG— Mark Zandi (@Markzandi) September 7, 2025 -
కృత్రిమ మేధను నడిపిస్తున్న టాప్ 10 అధినేతలు
కృత్రిమ మేధ(ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇందులో సర్వీసులు అందించే కంపెనీల అధినేతల ఆదాయం కూడా అందుకు అనుగుణంగా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం.. ఏఐలో సేవలందిస్తున్న ప్రముఖ కంపెనీల అధినేతల నెట్వర్త్ ఎంత ఉందో.. వారు ఏయే అంశాల్లో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నారో కింద తెలియజేశాం.పేరుపాత్రనికర విలువ (2025)ప్రధానంగా సర్వీసులు అందించే విభాగంమార్క్ జుకర్బర్గ్సీఈఓ, మెటా221.2 బి.డాలర్లుసోషల్ ప్లాట్ఫామ్లు, మెటావర్స్ ఏఐఎలాన్ మస్క్వ్యవస్థాపకుడు ఎక్స్ఏఐ400 బి.డాలర్లుసోషల్ ప్లాట్ఫామ్జెన్సెన్ హువాంగ్సీఈఓ, ఎన్వీడియా150 బి.డాలర్లుఏఐ జీపీయూలుదరియో అమోదీసీఈఓ, ఆంత్రోపిక్3.7 బి.డాలర్లుఅలైన్ AI సిస్టమ్లుమాథ్యూ ప్రిన్స్సీఈఓ, క్లౌడ్ఫేర్5.5 బి.డాలర్లుఏఐ రెగ్యులేషన్, కంటెంట్ ప్రొటెక్షన్శామ్ ఆల్ట్మన్సీఈఓ, ఓపెన్ఏఐ1.2 బి.డాలర్లుగ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాఆండీ జాస్సీసీఈఓ, అమెజాన్500 మి.డాలర్లురిటైల్, క్లౌడ్, రోబోటిక్స్ ఏఐఫిడ్జీ సిమోసీఈఓ, ఓపెన్ఏఐ అప్లికేషన్స్70.75 మి.డాలర్లుఏఐ ఉత్పత్తుల స్కేలింగ్అల్లీ కె.మిల్లర్సీఈఓ, ఓపెన్ మెషిన్36 మి.డాలర్లుయాక్సెసబుల్ ఏఐ టూల్స్ఎస్.రవి కుమార్సీఈఓ, కాగ్నిజెంట్రూ.898.9 కోట్లు (108 మి.డాలర్లు)జనరేటివ్ ఏఐ ఇదీ చదవండి: హైదరాబాద్లో 150 సీసీ స్కూటర్ ఆవిష్కరణ.. ఫీచర్లు ఇవే.. -
రైతులకు శుభవార్త చెప్పిన వియోనా ఫిన్టెక్
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ వియోనా ఫిన్టెక్.. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల వేదికలలో ఒకటి. గ్రామ్పే, వియోనా పే యాప్ల డెవలపర్ అయిన ఈ సంస్థ, థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా పనిచేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుండి ఆమోదం పొందింది.ఈ ఆమోదం వియోనా వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేస్తుంది, తద్వారా భాగస్వామ్య బ్యాంకులతో కలిసి యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలను అందించనుంది. ఇది ముఖ్యంగా టైర్ II, టైర్ III, గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ చెల్లింపుల వాడకాన్ని మరింత విస్తరిస్తుంది.ఈ ఆమోదం ద్వారా గ్రామీణ ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులకు డిజిటల్ చెల్లింపులు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వియోనా ఫిన్టెక్ వ్యవస్థాపకుడు రవీంద్రనాథ్ యార్లగడ్డ తెలిపారు. వియోనా ప్రధాన ఉత్పత్తి గ్రామ్పే, గ్రామీణ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది. ఈ ప్లాట్ఫారమ్ రైతులు, చిన్న వ్యాపారులు మరియు స్థానిక సమాజాలకు డిజిటల్ వసూళ్లు, చెల్లింపులు మరియు UPI లావాదేవీలు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఇది గ్రామీణ ఈ-కామర్స్ను ప్రోత్సహిస్తుంది మరియు గ్రామ స్థాయి వ్యవస్థాపకుల (VLEలు) నెట్వర్క్ ద్వారా ఆర్థిక అక్షరాస్యతను పెంపొందిస్తుంది.వియోనా తన విస్తరణ వ్యూహంలో భాగంగా గ్రామ్పే ప్లాట్ఫారమ్లో రైతుల కోసం ఒక మార్కెట్ప్లేస్ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలుపుతుంది, తద్వారా ధరల పారదర్శకతను మెరుగుపరచడం, చెల్లింపులను వేగవంతం చేయడం, యూపీఐ ఆధారిత చెల్లింపులకు ప్రాప్యతను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది.వియోనా ఫిన్టెక్ పేఇన్, పేఔట్, వర్చువల్ అకౌంట్ నంబర్లు, మరియు UPI స్విచింగ్తో సహా అనేక రకాల UPI-ఆధారిత ఆర్థిక లావాదేవీల సేవలను అందిస్తుంది. దీని ప్లాట్ఫారమ్ వినియోగదారులు చెల్లింపుల వసూళ్లు, పంపిణీలు, మరియు రికన్సిలియేషన్ ప్రక్రియలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. -
గ్లోబల్ ఉద్యోగ సూచిక భారత్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఉద్యోగ ప్రపంచానికి భారత్ ఒక సూచిక(సైన్పోస్ట్)లా నిలవనున్నట్లు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సొంత ప్లాట్ఫామ్ లింకిడిన్ దేశీ మేనేజర్ కుమరేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు. సంస్థకు వేగంగా వృద్ధి చెందుతున్న, రెండో పెద్ద మార్కెట్గా భారత్ అవతరించినట్లు వెల్లడించారు. 16 కోట్లకుపైగా యూజర్లున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత వృద్ధి రేటురీత్యా రెండు, మూడేళ్లలో అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్గా ఆవిర్భవించనున్నట్లు అభిప్రాయపడ్డారు. డిజిటల్ ఫస్ట్ యువతతోపాటు.. నైపుణ్యాలు, లక్ష్యాలుగల వర్క్ఫోర్స్ దేశీ మార్కెట్కు జోష్నిస్తున్నట్లు పేర్కొన్నారు. లింకిడిన్ సభ్యుల సంఖ్య గత రెండేళ్లలో 50 శాతానికిపైగా జంప్చేసినట్లు వెల్లడించారు. 2020 నుంచి ఆదాయం సైతం రెట్టింపునకుపైగా ఎగసినట్లు తెలియజేశారు. దేశీయంగా 16 కోట్లకుపైగా ప్లాట్ఫామ్లో రిజిస్టరైనట్లు పేర్కొన్నారు. -
99 శాతం నిరుద్యోగులవుతారు.. ప్లాన్ బి ఉండదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, తద్వారా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతుంది పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా లూయిస్విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ 'రోమన్ యాంపోల్స్కీ' (Roman Yampolskiy) సంచలన వ్యాఖ్యలు చేశారు.రోమన్ యాంపోల్స్కీ ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) 2030 నాటికి 99 శాతం మంది కార్మికులను నిరుద్యోగులుగా చేస్తుందని అన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏఐ వ్యవస్థలనే ఉపయోగించుకుంటారని హెచ్చరించారు.కోడింగ్ ఉద్యోగులు, ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా.. చాలా రంగాల్లోని ఉద్యోగాలని ఏఐ భర్తీ చేస్తుంది. మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రపంచాన్ని చూడబోతున్నాము. నేను 10 శాతం నిరుద్యోగం గురించి చెప్పడం లేదు. 99 శాతం ఉద్యోగాలు కోల్పోతారని చెబుతున్నానని ప్రొఫెసర్.. ది డైరీ ఆఫ్ ఎ సిఇఓ పాడ్కాస్ట్లో పేర్కొన్నారు. 2027 నాటికి 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (ఏజీఐ) వచ్చే అవకాశం ఉందని అన్నారు.ఇదీ చదవండి: అమెరికాతో కలిసి పనిచేయాలి: అశ్విని వైష్ణవ్ఏజీఐ వచ్చిన మూడేళ్ళ తరువాత.. ఏఐ సాధనాలు, హ్యుమానాయిడ్ రోబోలు వస్తాయి. కంపెనీలు మనుషులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించుకునే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల కార్మిక మార్కెట్ కూలిపోతుందని చెప్పారు. "అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయి, అప్పుడు 'ప్లాన్ బి' ఉండదు. మీరు తిరిగి శిక్షణ పొందలేరు" అని రోమన్ యాంపోల్స్కీ అన్నారు. -
అమెరికాతో కలిసి పనిచేయాలి: అశ్విని వైష్ణవ్
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇండియన్ ఔట్సోర్సింగ్ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రి 'అశ్విని వైష్ణవ్' కీలక వ్యాఖ్యలు చేశారు. సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఐటీ పరిశ్రమను కాపాడుకోవడానికి అమెరికాతో కలిసి పనిచేయాలని, ఇతర మల్టీనేషనల్ కంపెనీలతో కూడా టచ్లో ఉండాలని ఆయన పేర్కొన్నారు.భారతీయ ఐటీ రంగాన్ని మాత్రమే కాకుండా.. ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, దీనికి కావలసిన చర్యలను కేంద్రం తీసుకుంటోందని మంత్రి అన్నారు. ఇటీవల కాలంలో స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇండియా వాటా గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు.మేము ఇప్పటికే అమెరికా, యూరప్, జపాన్, ఆగ్నేయాసియా ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. భారతదేశంలోని పరిశ్రమలు శక్తివంతంగా ఉంచడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ సూచించారు. 5.67 మిలియన్లకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న, ఎగుమతి ఆదాయాలకు గణనీయంగా దోహదపడే భారతదేశ ఐటీ సేవల రంగం చాలా కాలంగా విదేశీ క్లయింట్లపై, ముఖ్యంగా అమెరికాలోని క్లయింట్లపై ఆధారపడింది.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన.. వాటిపై సుంకాలు ఎత్తివేత!దేశంలో ఉద్యోగాలను రక్షించడం, కొత్త అవకాశాలను పెంచడం.. రెండింటినీ లక్ష్యంగా చేసుకుని ప్రస్తుత ఐటీ ఉపాధిని కాపాడటం, దేశీయ తయారీని పెంచడమే ప్రభుత్వం లక్ష్యం అని అశ్వని వైష్ణవ్ అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయం 5.1 శాతం పెరిగి 282.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చే ఆదాయంలో సుమారు 60 శాతం యూఎస్ నుంచే లభిస్తోంది. -
మా దేశం వచ్చేయండి.. శాశ్వతంగా ఉండిపోండి!
బ్రెజిల్ ఇప్పుడు విదేశీయులకు పర్మినెంట్ రెసిడెన్సీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని కోసం భారతీయులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద ఆ దేశంలో శాశ్వతంగా నివసించడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి అవకాశం లభిస్తుంది. బ్రెజిల్ లో స్థిరపడాలనుకునే వారికి ఈ పథకం మంచిదే అయినా అందుకు అవసరమైన కొన్ని అర్హతలు, నియమాలు ఉన్నాయి.బ్రెజిల్ దాని అందం, గొప్ప సంస్కృతికి ప్రసిద్ది చెందింది, కానీ ఇప్పుడు ఈ దేశం విదేశాల్లో నివసించడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి ఇష్టపడేవారికి మంచి ఎంపికగా మారింది. బ్రెజిల్ శాశ్వత నివాస కార్యక్రమాన్ని ప్రారంభించింది, దీని ధర భారతదేశంలో సుమారు రూ .27,000, భారతీయ పౌరులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.శాశ్వత నివాసానికి మార్గాలుబ్రెజిల్ లో శాశ్వత నివాసం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అత్యంత సాధారణ మార్గం బ్రెజిల్లో వ్యాపారం లేదా స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం. ఇది కాకుండా, ఎవరైనా బ్రెజిల్లో ఉద్యోగం కలిగి ఉండి, ఉద్యోగంలో కొనసాగితే శాశ్వత నివాసాన్ని కూడా పొందవచ్చు. బ్రెజిల్ లో వివాహం ద్వారా లేదా పిల్లలను కనడం ద్వారా కూడా రెసిడెన్సీ పొందే అవకాశం ఉంది. రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ పెన్షన్ పొందితే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తంమీద, నెలకు సుమారు 2,000 అమెరికన్ డాలర్ల ఆదాయం ఉన్నవారు తాత్కాలిక నివాసానికి అర్హులు కావచ్చు, తరువాత దీనిని శాశ్వత నివాసంగా మార్చవచ్చు.శాశ్వత నివాసానికి దరఖాస్తుదారు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఎంట్రీ అండ్ స్టే రుజువు, ఉద్యోగం లేదా పెట్టుబడి పత్రాలు వంటి కొన్ని అవసరమైన పత్రాలను సమర్పించాలి. అంతేకాకుండా, రెసిడెన్సీ హోదాను కొనసాగించడానికి వరుసగా రెండు సంవత్సరాలకు మించి బ్రెజిల్ వెలుపల ఉండకూడదు. బ్రెజిల్ లో నివసించడం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రదేశాలలో జీవన వ్యయం ఎక్కువగా ఉంటుంది.అలాగే, పన్ను రేట్లు ఎక్కువగానే ఉంటాయి. జాబ్ మార్కెట్ చాలా పోటీగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ ప్రధాన భాష అయిన పోర్చుగీస్ పరిజ్ఞానం.దరఖాస్తు ఫీజు రూ.27 వేల లోపేదరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. ముందుగా పెట్టుబడి లేదా ఉపాధిని బట్టి సంబంధిత వీసాకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్లో లేదా బ్రెజిల్ రాయబార కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. దరఖాస్తు ఫీజు 100 నుంచి 300 డాలర్ల వరకు ఉంటుంది. అంటే రూ.27 వేల లోపే. దరఖాస్తు ఆమోదించిన తర్వాత, దరఖాస్తుదారు బ్రెజిల్ ఫెడరల్ పోలీసుల నుండి శాశ్వత నివాస ఐడీ కార్డును అందుకుంటారు. మొత్తం ప్రక్రియకు 4-6 నెలలు పట్టవచ్చు. -
ఐపీవోకి మరో రెండు కంపెనీలు
ఇన్సూరెన్స్ టెక్నాలజీ సంస్థ టర్టిల్మింట్ ఫిన్టెక్ తాజాగా పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను ప్రీ–ఫైలింగ్ విధానంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జెఫ్రీస్ ఇండియా తదితర సంస్థలు ఈ ఇష్యూకి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి.2015లో ధీరేంద్ర మాహ్యవంశి, ఆనంద్ ప్రభుదేశాయ్ కలిసి టర్టిల్మింట్ను ప్రారంభించారు. బీమా పాలసీల కొనుగోలు, నిర్వహణ ప్రక్రియను సరళతరం చేసే లక్ష్యంతో కంపెనీ ఏర్పాటైంది. అయిదు లక్షల మంది పైగా అడ్వైజర్లతో సంస్థ దాదాపు 1.6 కోట్ల పాలసీలను విక్రయించింది. ఇందులో అమాన్సా క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ మొదలైన సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి.రూ. 499 కోట్ల సుప్రీత్ కెమికల్స్ ఐపీవోసుప్రీత్ కెమికల్స్ సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 499 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవో పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో ఉంటుందని కంపెనీ తెలిపింది.ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 310 కోట్లను కొత్త ప్రాజెక్టు ఏర్పాటుకు, మరో రూ. 65 కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లింపునకు సంస్థ వినియోగించుకోనుంది. 2025 మార్చి ఆఖరు నాటికి కంపెనీ మొతత్తం రుణభారం రూ. 200 కోట్లుగా ఉంది. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా సుప్రీత్ కెమికల్స్ రూ. 99 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. అలా సమీకరిస్తే తాజా షేర్ల జారీ తగ్గుతుంది.గుజరాత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుప్రీత్ కెమికల్స్ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్ ఇంటరీ్మడియట్స్ను తయారు చేస్తోంది. టెక్స్టైల్స్, ఫార్మా, ఆగ్రో–కెమికల్స్ తదితర పరిశ్రమలకు అవసరమయ్యే ఉత్పత్తులను అందిస్తోంది. 2024లో 1,309 బిలియన్ డాలర్లుగా ఉన్న గ్లోబల్ స్పెషాలిటీ కెమికల్స్ ఇంటరీ్మడియట్స్ మార్కెట్ 2029 నాటికి 1,802 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. -
రిలయన్స్ ఇన్ఫ్రా జేవీలో వాటా పెంపు
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో తాజాగా ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ 2 శాతం వాటాను పెంచుకోనుంది. తద్వారా డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్(జేవీ)లో ప్రస్తుత 49 శాతం వాటాను 51 శాతానికి చేర్చుకోనుంది. ఇందుకు వీలుగా రిలయన్స్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ 2 శాతం వాటాను డసాల్ట్కు బదిలీ చేయనుంది.ప్రస్తుతం జేవీలో రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ వాటా 51 శాతంకాగా.. డసాల్ట్ 49 శాతం వాటా కలిగి ఉంది. వాటా బదిలీ తదుపరి జేవీలో డసాల్ట్ మెజారిటీ వాటా(51 శాతం) పొందనుంది. వెరసి డసాల్ట్ ఏవియేషన్కు అనుబంధ సంస్థగా జేవీ అవతరించనుంది. నవంబర్1కల్లా వాటా బదిలీ పూర్తికానున్నట్లు అంచనా. ఈ డీల్కు రిలయన్స్ ఏరో రూ. 176 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. -
సెలవు ఇవ్వని కంపెనీ.. రాజీనామా చేసిన ఉద్యోగి
అమెరికాలో జరిగే తన సోదరుడి వివాహానికి.. కంపెనీ సెలవు ఇవ్వకపోవడంతో ఉద్యోగం మానేశానని, ఒక భారతీయ ఉద్యోగి రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.అమెరికాలో జరిగే తన సోదరుడి వివాహానికి హాజరుకావడానికి.. మూడు వారాల ముందుగానే, 15 రోజులు సెలవు కావాలని కంపెనీలో పేర్కొన్నాను. అయితే నా అభ్యర్థను కంపెనీ తిరస్కరించింది. ఇప్పుడు నేను పెళ్ళికి హాజరవ్వాలంటే.. రాజీనామా చేయాలి. నాలుగేళ్లు ఎంతో నిజాయితీగా పనిచేసిన నన్ను.. సంస్థ అర్థం చేసుకోలేదు. అందుకే రాజీనామా చేసాను.నాలుగేళ్లు కంపెనీలో అంకితభావంతో.. తక్కువ జీతానికే పనిచేసాను. అయితే కంపెనీ నాకు సహకరించలేదు. అందుకే వెళ్లిపోవాలని (రాజీనామా) నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా.. అని రెడ్డిట్ పోస్ట్లో పేర్కొన్నారు. అయితే నేను రాజీనామా చేసినప్పటికీ.. పెద్దగా ఆర్ధిక భారం (అప్పు) లేదు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. పని కంటే కుటుంబానికే విలువ ఇవ్వడం మంచి నిర్ణయం అని ఒకరు అంటే.. మరొకరు.. జీవితంలో దేన్నైనా రీప్లేస్ చేయొచ్చు, కుటుంబాన్ని రీప్లేస్ చేయలేము అని అన్నారు. -
సీఎఫ్వో మోసం.. తగ్గిన గేమ్స్క్రాఫ్ట్ లాభం
న్యూఢిల్లీ: దాదాపు రూ. 231 కోట్లు స్వాహా చేశారన్న ఆరోపణలతో మాజీ సీఎఫ్వోపై ఆన్లైన్ గేమింగ్ సంస్థ గేమ్స్క్రాఫ్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్నాళ్లుగా ఆయన అనధికారిక ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు అందులో పేర్కొంది. వ్యక్తిగతంగా ఈక్విటీ, డెరివేటివ్స్ ట్రేడింగ్ కోసం కంపెనీ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆయన ఓ ఈమెయిల్లో 'స్వచ్ఛందంగా అంగీకరించారు' అని గేమింగ్క్రాఫ్ట్ వెల్లడించింది.సదరు ఉద్యోగిని ఈ ఏడాది మే నెలలో కంపెనీ తొలగించింది. మాజీ సీఎఫ్వో మోసం నేపథ్యంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,009 కోట్ల ఆదాయంపై కంపెనీ లాభం రూ. 706 కోట్లకు పరిమితమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.28 శాతం జీఎస్టీ శ్లాబు కింద పూర్తి ఆర్థిక సంవత్సరానికి పన్నులు కట్టాల్సి రావడంతో పాటు సుమారు రూ. 231 కోట్ల మొత్తాన్ని ఖాతాల్లో సర్దుబాటు చేయాల్సి రావడం వల్ల లాభం తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3,475 కోట్లు కాగా లాభం రూ. 947 కోట్లుగా నమోదైంది. 2017లో ఏర్పాటైన గేమ్స్క్రాఫ్ట్ దశాబ్దం కన్నా తక్కువ వ్యవధిలోనే దేశీయంగా గేమింగ్ రంగ దిగ్గజంగా ఎదిగింది. -
అమ్మకాల్లో సరికొత్త రికార్డ్!.. ఐదు నెలల్లో 20వేల మంది కొన్నారు
మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. కంపెనీ బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ కార్లు ఐదు నెలల్లోనే 20,000 యూనిట్ల అమ్మకాలను సాధించాయి.భారతీయ విఫణిలో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉండటంతో.. కంపెనీ పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి చకన్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది.సంస్థ జనవరి, జూన్ 2025 మధ్య 19,915 యూనిట్లను తయారు చేసి, డీలర్లకు 19,070 యూనిట్లను సరఫరా చేసింది. ఇప్పుడు ఉత్పత్తిని 8,000 యూనిట్లు పెంచింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది.మొత్తం బుకింగ్లలో XEV 9e వాటా 59 శాతంతో అగ్రస్థానంలో ఉంది. బీఈ 6 సేల్స్ 6.41 శాతం ఉన్నాయి. రెండు SUVలు ప్రీమియం "ప్యాక్ త్రీ" వేరియంట్లకు బలమైన ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇది హై-ఎండ్ ఫీచర్లకు డిమాండ్ను హైలైట్ చేస్తుంది. నెలవారీ అమ్మకాల వృద్ధి బలంగా ఉంది. -
ప్రభుత్వ బ్యాంకులకు రెండు రోజుల మంథన్
ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీలు) రెండు రోజుల మంథన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెల 12, 13వ తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనుంది. ప్రభుత్వరంగ బ్యాంక్ల చీఫ్లు, ఇతర ముఖ్య అధికారులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తదుపరి తరం సంస్కరణలపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.చివరిగా 2022 ఏప్రిల్లో ఇదే తరహా కార్యక్రమం జరిగింది. సేవల అందుబాటును పెంచడం, అత్యుత్తమ సేవలకు సంబంధించి (ఈఏఎస్ఈ) సంస్కరణలను ఆర్థిక సేవల విభాగం మార్గదర్శకంలో చేపట్టొచ్చని పేర్కొన్నాయి. కస్టమర్ సేవలను ఎలా మెరుగుపరచాలి, డిజిటైజేషన్, హెచ్ఆర్ ప్రోత్సాహకాలు, కార్పొరేట్ గవర్నెన్స్, సహకారం విషయమైన తీసుకోవాల్సిన చర్యలను సూచించాలంటూ చివరి పీఎస్బీ మంథన్లో ఆరు వర్కింగ్ గ్రూప్లను ఏర్పాటు చేయడం గమనార్హం. -
డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!
'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం.. సుంకాల నుంచి గ్రాఫైట్, టంగ్స్టన్, యురేనియం, బంగారు కడ్డీలు, ఇతర లోహాలను మినహాయించాలని, సిలికాన్ ఉత్పత్తులపై సుంకాలు విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త మార్పు సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా అధికారుల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడి ఉత్తర్వులో పేర్కొన్నారు.ఈ ప్రకటన తరువాత విమాన భాగాలు, జెనరిక్ ఔషధాలు, దేశీయంగా పండించలేని, తవ్వలేని లేదా సహజంగా ఉత్పత్తి చేయలేని కొన్ని ఉత్పత్తులు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలు, కాఫీ వంటి వాటికి కూడా భవిష్యత్తులో సుంకాల నుంచి విముక్తి కలిగించే అవకాశం ఉంటుందని సమాచారం.కొన్ని రోజుల క్రితం యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ తీర్పు వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బులియన్ దిగుమతి పన్నులకు లోబడి ఉంటుందని సూచించడం కొంత గందరగోళానికి గురిచేసింది. ఆ తరువాత బంగారు కడ్డీలను సుంకాల నుంచి మినహాయించాలనే ఆలోచన తెరమీదకు వచ్చింది.ఇదీ చదవండి: టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్నసుంకాలు మాత్రమే కాకుండా.. కొన్ని ఒప్పందాల విషయంలో కూడా ట్రంప్ సంచనలం సృష్టించారు. ఇవి దేశంలోని కీలకమైన మార్కెట్లకు అంతరాయం కలిగించవచ్చని, అమెరికాలో పండించలేని లేదా ఉత్పత్తి చేయలేని వస్తువుల ధరలను పెంచుతాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ట్రంప్.. అంతరిక్షం, కొన్ని ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించే కీలకమైన పదార్థాలతో సహా అనేక ఖనిజాలపై పరస్పర సుంకాలను ఎత్తివేయడం మొదలుపెట్టారు.సూడోఎఫెడ్రిన్, యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాల వంటి ఫార్మాస్యూటికల్స్ వంటివన్నీ.. ఇప్పటికే వాణిజ్య శాఖ దర్యాప్తుకు లోబడి ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా సుంకాల నుంచి ఉపసమయం పొందుతున్నాయి. అయితే.. సిలికాన్ ఉత్పత్తులతో పాటు, రెసిన్, అల్యూమినియం హైడ్రాక్సైడ్లపై సుంకాలను విధిస్తున్నారు. -
అదానీని వెనక్కి నెట్టిన వేదాంతా
రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేఏఎల్) కొనుగోలు రేసులో అదానీ గ్రూప్ను మైనింగ్ దిగ్గజం వేదాంతా వెనక్కి నెట్టింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ డీల్ విజయవంతం అయ్యే స్థాయిలో రూ.17,000 కోట్ల విలువైన బిడ్ దాఖలు చేసింది. దీంతో జేఏఎల్ నికర విలువ రూ.12,505 కోట్లకు చేరింది.రియల్టీ, సిమెంట్, విద్యుత్, హోటళ్లు, రహదారులు తదితర రంగాలలో కార్యకలాపాలు కలిగిన జేఏఎల్ రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో దివాలా చట్ట(ఐబీసీ) చర్యలకు లోనైన సంగతి తెలిసిందే. మరోపక్క ఐబీసీలో భాగంగా జేఏఎల్ విక్రయంపై రుణదాతలు సమావేశమవుతున్నారు. కాగా.. జేఏఎల్ రుణ పరిష్కార చర్యలలో భాగంగా పలు దిగ్గజాలు బిడ్స్ దాఖలు చేశాయి.అయితే అదానీ, వేదాంతా గ్రూప్లు మాత్రమే ఈ రేసులో ముందువరుసలో నిలిచాయి. జేఏఎల్ మొత్తం రూ.57,185 కోట్ల రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు రుణదాత సంస్థలు పేర్కొంటున్నాయి. పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ అధ్యక్షతన ఏర్పడిన రుణదాతల కన్సార్షియం నుంచి జాతీయ ఆస్తుల పునర్వ్యవస్థీకరణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్) జేఏఎల్ రుణాలను సొంతం చేసుకున్న విషయం విదితమే. దీనిలో భాగంగా రుణదాతల జాబితాను సిద్ధం చేసింది.ఇదీ చదవండి: మన గోప్యత బజారుపాలు! -
ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి సై
ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి నవంబర్కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)కి తెరతీయనున్నట్లు నవరత్న పీఎస్యూ.. రైల్ వికాస్ నిగమ్(ఆర్వీఎన్ఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు ప్రయివేట్ రంగ సంస్థ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్తో ఇటీవలే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా జేవీ ఏర్పాటుకు అవసరమైన చట్టబద్ధ అనుమతులు తీసుకోవడంతోపాటు.. ఇతర కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్లు ఆర్వీఎన్ఎల్ మెకానికల్ విభాగ ప్రధాన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ తెలియజేశారు.తద్వారా నవంబర్కల్లా జేవీ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇకపై దేశ, విదేశాలలో తెరతీయనున్న రైల్వే ప్రాజెక్టులలో జేవీ పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. ఇందుకు రెండు సంస్థలు ప్రాధాన్యతా ప్రాజెక్టులతోపాటు, వ్యాపార అవకాశాలను గుర్తించేందుకు సమాంతరంగా కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. యాడ్వెంట్ గ్రూప్ సంస్థ టెక్స్మాకోతో ఏర్పాటు చేయనున్న జేవీ ద్వారా రైల్వే రంగ తయారీ, డిజైన్ తదితర కార్యకలాపాలు చేపట్టనుంది. వీటిలో భాగంగా సరుకు రవాణా వేగన్ల నిర్వహణ, ప్రయాణికుల కోచ్లు, లోకోమోటివ్స్, మెట్రో కోచ్లు తదితరాల తయారీ, డిజైన్, నిర్వహణకు తెరతీయనుంది. అంతేకాకుండా రైల్వేలుసహా అనుబంధ విభాగాలలో ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనుంది. రూ.200 కోట్లతో జేవీ నెలకొల్పే ప్రణాళికలున్నట్లు మనీష్ వెల్లడించారు.ఇదీ చదవండి: లక్ష మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ -
లక్ష మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ: ఏఎండీ
వచ్చే మూడేళ్లలో 1 లక్ష మంది గ్రాడ్యుయేట్లకు కృత్రిమ మేథ (ఏఐ), గ్రాఫిక్స్ ప్రాసింగ్ యూనిట్ (జీపీయూ) ప్రోగ్రామింగ్ నైపుణ్యాల్లో శిక్షణనివ్వనున్నట్లు కంప్యూటర్ చిప్స్ తయారీ సంస్థ ఏఎండీ తెలిపింది. అలాగే భారతీయ పరిశోధకులు, స్టార్టప్లకు 1 లక్ష గంటల పైగా డెవలపర్ క్లౌడ్ యాక్సెస్ను ఉచితంగా అందిస్తామని పేర్కొంది.కంప్యూటింగ్ సామర్థ్యాలను అందరికీ అందుబాటులోకి తేవడమనేది కొత్త తరం ఆవిష్కర్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని, ఓపెన్–సోర్స్ కమ్యూనిటీని బలోపేతం చేసేందుకు తోడ్పడుతుందని ఏఎండీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్మాస్టర్ తెలిపారు. ప్రతిభావంతులైన భారతీయ ఇంజినీర్లు ఇప్పటికే అంతర్జాతీయంగా హై–పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఏఐని భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దుతున్నారని ఏఎండీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయా జగదీశ్ చెప్పారు. ఇందుకు అవసరమయ్యే అధునాతన సాధనాలు, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని వివరించారు.ఇదీ చదవండి: 20 ఏళ్ల పాత విమానాల దిగుమతికి డీజీసీఏ పరిశీలన -
20 ఏళ్ల పాత విమానాల దిగుమతికి డీజీసీఏ పరిశీలన
అంతర్జాతీయంగా సరఫరా సమస్యల వల్ల విమానాల డెలివరీలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో 20 ఏళ్ల పాత విమానాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించే అంశాన్ని ఏవియేషన్ రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ పరిశీలిస్తోంది. ఇందుకోసం సంబంధిత నిబంధనలను సడలించడంపై దృష్టి సారిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ప్రస్తుతం ప్రెజరైజ్డ్ తరహా విమానాల దిగుమతికి 18 ఏళ్ల వరకు, అన్–ప్రెజరైజ్డ్ విమానాలకు 20 ఏళ్ల వరకు పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను వరుసగా 20 ఏళ్లు, 25 ఏళ్లకు పెంచాలని ముసాయిదా ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు అధికారి వివరించారు. 10,000 అడుగుల పైన అత్యధిక ఎత్తులో ప్రయాణించగలిగే విమానాలను ప్రెజరైజ్డ్ విమానాలుగా, అంతకన్నా దిగువన ప్రయాణించే విమానాలను అన్ప్రెజరైజ్డ్ ఎయిర్క్రాఫ్ట్గా వ్యవహరిస్తారు. దేశీయంగా షెడ్యుల్డ్, నాన్–షెడ్యూల్డ్ కార్యకలాపాల కోసం విమానయాన సంస్థలు లీజుకు తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య 800 పైచిలుకు ఉన్నాయి.ఇటీవలి కాలంలో దేశీ విమానయాన సంస్థలు కార్యకలాపాలను విస్తరించేందుకు 1,400పైగా విమానాలకు ఆర్డర్లిచ్చాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్ అయిన భారత్లో 2030 నాటికల్లా ప్యాసింజర్ల రద్దీ రెట్టింపై 50 కోట్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి.ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం -
అదానీ పవర్ షేర్ల విభజన
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పవర్ షేర్ల విభజనకు వాటాదారులు అనుమతించారు. 1:5 నిష్పత్తిలో విడదీసేందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా మెజారిటీ సభ్యులు అంగీకారం తెలిపినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. వెరసి రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 2 ముఖ విలువగల 5 షేర్లుగా విభజించనుంది. ఇందుకు సెప్టెంబర్ 22 రికార్డ్ డేట్గా ప్రకటించింది. రిటైల్, చిన్న ఇన్వెస్టర్లు సైతం కంపెనీ షేర్లలో లావాదేవీలు చేపట్టేందుకు వీలుగా షేర్ల ముఖ విలువను విభజించేందుకు కంపెనీ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచి్చనట్లు అదానీ పవర్ బోర్డు పేర్కొంది. అదానీ పవర్ షేరు నామమాత్ర లాభంతో రూ. 610 వద్ద ముగిసింది. -
ఈ–కామర్స్లో కొలువుల పండుగ
పండుగ సీజన్లో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాల నేపథ్యంలో దేశీయంగా ఈ–కామర్స్ కంపెనీలు భారీ స్థాయిలో సిబ్బందిని తీసుకుంటున్నాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా సహా దిగ్గజ ఈ–కామర్స్ ప్లాట్ఫాంలు సుమారు 3.8 లక్షలకు పైగా సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించాయి. సరఫరా వ్యవస్థ, లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్ తదితర కార్యకలాపాలవ్యాప్తంగా నియామకాలు చేపట్టాయి. ఫ్లిప్కార్ట్ 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించింది. అలాగే, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పండుగ సీజన్ కోసమే కొత్తగా 650 డెలివరీ హబ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ‘పండుగ సీజన్ సందర్భంగా 28 రాష్ట్రాలవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు, మౌలిక సదుపాయాలు, టెక్ వినియోగాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాం. 2.2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు లాస్ట్–మైల్ డెలివరీల కోసం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఏర్పాట్లు చేశాం‘ అని ఫ్లిప్కార్ట్ తెలిపింది. అటు అమెజాన్ ఇండియా కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణే, బెంగళూరు, లక్నో సహా దేశవ్యాప్తంగా 400 పైగా నగరాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1.5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది. ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు, సోర్టింగ్ కేంద్రాలు, లాస్ట్–మైల్ డెలివరీ స్టేషన్ల నెట్వర్క్లో ఈ మేరకు నియమించుకున్నట్లు వివరించింది. అలాగే కొత్తగా 12 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను (ఎఫ్సీ) ఏర్పాటు చేయడంతో పాటు ఆరు ఎఫ్సీలను విస్తరించినట్లు పేర్కొంది. అటు హుబ్లీ్ల, త్రివేండ్రం, రాజ్పురా, గోరఖ్పూర్, మొరాదాబాద్, ప్రయాగ్రాజ్లో కొత్తగా ఆరు సోర్టింగ్ సెంటర్స్ కూడా నెలకొల్పింది.‘క్విక్’ విస్తరణ...: ఫ్యాషన్, లైఫ్స్టయిల్ ఈకామర్స్ సంస్థ మింత్రా సైతం 11,000 నియామకాలు జరిపినట్లు వివరించింది. లాజిస్టిక్స్, కస్టమర్ సర్వీస్, లాస్ట్–మైల్ డెలివరీ విభాగాల్లో సిబ్బందిని తీసుకున్నట్లు పేర్కొంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ కారణంగా ఎక్కువగా డెలివరీ, లాజిస్టిక్స్ విభాగాల్లో నియామకాలు ఉంటున్నాయి. హైరింగ్ 25 శాతం అప్.. గతేడాదితో పోలిస్తే ఈసారి పండుగ ల్లో సీజనల్ హైరింగ్ 20–25% పెరగవచ్చని క్వెస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ సీఈవో నితిన్ దవే తెలిపారు. పండుగకి సంబంధించి ఈ–కామర్స్ సంస్థల ముందస్తు సన్నాహాలను సూచిస్తూ జూలై, ఆగస్టు మధ్య హైరింగ్ ప్రతిపాదనలు 53 శాతం పెరిగినట్లు వివరించారు. సంప్రదాయ మార్కెట్ల పరిధి దాటి ఇతర ప్రాంతాలకు వ్యాపారాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం మెట్రోలే కాకుండా జైపూర్, కోయంబత్తూర్, ఇండోర్, నాగ్పూర్లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు కూడా హైరింగ్ హబ్లుగా ఎదుగుతున్నాయని దవే చెప్పారు. గత అయిదేళ్లుగా పండుగల సందర్భంగా తాత్కాలిక నియామకాలు చాలా వేగంగా పెరిగి, ప్రస్తుతం నెమ్మదిగా స్థిర స్థాయికి చేరుతున్నాయన్నారు. కరోనా మహమ్మారి అనంతరం ఒక్కసారిగా ఎగిసిన నియామకాల వృద్ధి రేటు ప్రస్తుతం కాస్త నెమ్మదించినప్పటికీ సంఖ్యాపరంగా రిక్రూట్మెంట్ క్రమంగా పెరుగుతూనే ఉందని టీమ్లీజ్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎ. బాలసుబ్రమణియన్ వివరించారు. డెలివరీ సిబ్బందికి అత్యధికంగా డిమాండ్ నెలకొందని, పండుగ సీజన్ నియామకాల్లో వీరి వాటా 40% వరకు ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత స్థానాల్లో వేర్హౌస్ వర్కర్లు (20%), కస్టమర్ సపోర్ట్ (15%), రిటైల్ ఫ్లోర్ సిబ్బంది (10 %), ఫీల్డ్ టెక్నీíÙయన్లు (8 %) ఉన్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక ఆ సమస్యలకు చెక్!
రైలు ప్రయాణికుల సంఖ్య దినదినం పెరుగుతూనే ఉంది. ప్రయాణికులకు భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో.. నార్త్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్లలోని అన్ని ప్యాసింజర్ కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ఆకతాయిల ఆగడాలు, దొంగతనాల నుంచి విముక్తి కల్పిస్తుంది.నార్త్ సెంట్రల్ రైల్వే.. ఈ ప్రాజెక్ట్లో 895 లింకే హాఫ్మన్ బుష్, 887 ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్లలో (మొత్తం 1,782 కోచ్లు).. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ప్రెస్లతో సహా ఎంపిక చేసిన ప్రీమియం రైళ్లలో AI-ఆధారిత కెమెరాలను కూడా మోహరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.మొదటి దశలో.. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్, శ్రమశక్తి ఎక్స్ప్రెస్, ప్రయాగ్రాజ్ - డా. అంబేద్కర్ నగర్ ఎక్స్ప్రెస్, కాళింది ఎక్స్ప్రెస్, ప్రయాగ్రాజ్-లాల్ఘర్ ఎక్స్ప్రెస్, సుబేదర్గంజ్-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్, సుబేదర్గంజ్-మీరట్ సిటీ సంగమ్ ఎక్స్ప్రెస్, మరియు సుబేదర్గంజ్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా జమ్మూ మెయిల్ వంటి అనేక రైళ్లలో కెమెరాలు అమర్చుతారు.ఇదీ చదవండి: రాకెట్లా దూసుకెళ్తున్న బంగారం ధరలు: మూడు కారణాలుప్రతి ఏసీ కోచ్లో నాలుగు కెమెరాలు ఉంటాయి. జనరల్ కంపార్ట్మెంట్లు, స్లీపర్ కోచ్లు, ప్యాంట్రీ కార్లలో ఆరు కెమెరాలు ఫిక్స్ చేస్తారు. సీసీటీవీ యూనిట్లు నాలుగు ఎంట్రీ పాయింట్ల వద్ద, కారిడార్లలో ఏర్పాటు చేస్తారు. ఇవి కోచ్ల లోపల ప్రతి కదలికను కవర్ చేస్తాయి. NCR ప్రధాన కార్యాలయంతో పాటు ఆగ్రా, ఝాన్సీ, ప్రయాగ్రాజ్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) కార్యాలయాలలో పర్యవేక్షణ జరుగుతుంది. అంతే కాకుండా లోకోమోటివ్ క్యాబిన్లలో నిఘా పరికరాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. -
ట్రంప్ విందులో టెస్లా బాస్ మిస్: స్పందించిన మస్క్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓల బృందాలకు ఆతిథ్యం ఇచ్చారు. కానీ ఈ విందులో ట్రంప్ సన్నిహితుడు.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' మిస్ అయ్యారు. ఈ విందుకు ట్రంప్ మస్క్ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా? అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ట్రంప్ విందుకు బిల్గేట్స్ను ఆహ్వానించారు, కానీ ఎలాన్ మస్క్ను పిలవలేదంటూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన మస్క్.. ''నన్ను ట్రంప్ విందుకు ఆహ్వానించారు. దురదృష్టవశాత్తు నేను హాజరు కాలేకపోయారు. నా ప్రతినిధి ఒకరు అక్కడ ఉన్నారు'' అని అన్నారు. కానీ ఈ కార్యక్రమానికి మస్క్.. ప్రతినిధి ఎవరైనా హాజరయ్యారా లేదా అనేది వెల్లడికాలేదు.ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన తరువాత.. కొంత కాలంపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.I was invited, but unfortunately could not attend. A representative of mine will be there.— Elon Musk (@elonmusk) September 4, 2025ట్రంప్ విందుకు హాజరైన సీఈవోలుట్రంప్ విందుకు.. సుందర్ పిచాయ్ (గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈఓ), సంజయ్ మెహ్రోత్రా (మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ), వివేక్ రణదివే (టిబ్కో సాఫ్ట్వేర్ ఛైర్మన్), శ్యామ్ శంకర్ (పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు), టిమ్ కుక్ (యాపిల్ సీఈఓ), మార్క్ జుకర్బర్గ్ (మెటా సీఈఓ), సెర్గీ బ్రిన్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు), సామ్ ఆల్ట్ మన్ (ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు), గ్రెగ్ బ్రోక్ మన్ (ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు), సఫ్రా కాట్జ్ (ఒరాకిల్ సీఈఓ), డేవిడ్ లింప్ (బ్లూ ఆరిజిన్ సీఈఓ), అలెగ్జాండర్ వాంగ్ (స్కేల్ ఏఐ సీఈఓ), జారెడ్ ఐజాక్ మన్ (షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ) హాజరయ్యారు. -
అమెజాన్ కొంప ముంచుతున్న కొత్త రూల్!
ఉద్యోగుల పని విధానానికి సంబంధించి అమెజాన్ అమలుచేస్తున్న కొత్త రూల్ ఆ కంపెనీ కొంప ముంచుతోంది. 2025 జనవరి 2 నుంచి ఉద్యోగులకు ఐదు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు అమెజాన్ గత ఏడాది ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి తర్వాత కంపెనీ అనుసరిస్తున్న హైబ్రిడ్ విధానానికి ఈ కొత్త నిబంధన ముగింపు పలికింది. అయితే ఈ మార్పే ఇప్పుడు టాప్ టాలెంట్ను నియమించుకునే, నిలుపుకునే అమెజాన్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది.టాలెంట్ ఉన్నవారు రావడం లేదుఅమెజాన్ అంతర్గత డాక్యుమెంట్ను ఉటంకిస్తూ బిజినెస్ ఇన్సైడర్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఉద్యోగులు నిర్దేశిత కార్యాలయాలకు సమీపంలోకి రీలొకేట్ కావాలన్న సంస్థ "హబ్ స్ట్రాటజీ" అంశం దాని నియామక బృందాలలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం రిక్రూటర్లను "అధిక డిమాండ్ ఉన్న ప్రతిభావంతులను" తీసుకురావడాన్ని పరిమితం చేస్తుందని, ముఖ్యంగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో నిపుణులను తీసుకురావడాన్ని పరిమితం చేస్తుందని చెబుతున్నారు.తక్కువ జీతమున్నా పర్లేదుగత ఏడాది రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశం తరువాత, ఈ విధానం కారణంగా అభ్యర్థులు ఆఫర్లను తిరస్కరించడం గణనీయంగా పెరిగినట్లు తాము గమనించామని కొంతమంది రిక్రూటర్లు చెప్పినట్లుగా నివేదిక పేర్కొంది. ఎక్కువ సౌలభ్యంతో ఉండటంతో చాలా మంది ప్రొఫెషనల్స్ తక్కువ వేతనానికే పోటీ సంస్థల్లో చేరడానికి ఎంచుకున్నారు. దీని వల్ల టెక్ టాలెంట్ ను కోల్పోతున్నామని ఓ రిక్రూటర్ ఆవేదన వ్యక్తం చేశారు.లాగేసుకుంటున్న పోటీ సంస్థలుఅమెజాన్ రిటర్న్ టు ఆఫీస్ ఆదేశం కేవలం రోజువారీ కార్యాలయ హాజరుకు సంబంధించినది మాత్రమే కాదని నివేదిక వెల్లడించింది. అమెజాన్ 'హబ్స్'కు మారడానికి ఇష్టపడని ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తున్నారు. ప్రమోషన్లు, పనితీరు సమీక్షలను ఈ ఆదేశానికి ముడిపడిపెట్టారు. ఈ కఠిన విధానం అమెజాన్ కు కూడా భారీ నష్టాన్ని మిగిల్చింది. గత రెండేళ్లలో ఒరాకిల్ 600 మందికి పైగా అమెజాన్ ఉద్యోగులను నియమించుకుందని బ్లూమ్బెర్గ్ ఇటీవల నివేదిక పేర్కొంది.అమెజాన్ది మాత్రం అదే మాటఅమెజాన్ ఈ వాదనలను ఖండిస్తోంది. తాము పరిశ్రమ అంతటా టాప్ టాలెంట్ను నియమించుకుంటూనే ఉన్నట్లు పేర్కొంది. బిజినెస్ ఇన్ సైడర్ కు ఇచ్చిన ఒక ప్రకటనలో కంపెనీ ప్రతినిధి ఈ నివేదిక ఆధారాన్ని తోసిపుచ్చారు. రిటర్న్ టు ఆఫీస్ విధానంపై కంపెనీ తన వైఖరిని సమర్థించుకుంది. "ఉద్యోగులు వ్యక్తిగతంగా సహకారంతో పనిచేసినప్పుడు ఉత్తమ ఫలితాలను వస్తాయని మేము నమ్ముతున్నాం. ఇది వాస్తవమని కూడా గమనించాం. ఎందుకంటే మేము కొంతకాలంగా ప్రతిరోజూ చాలా మందిని కార్యాలయంలో చూస్తున్నాం" అని ప్రతినిధి వివరించారు. -
టిమ్.. యాపిల్ పెట్టుబడి ఎంత?: సీఈఓల మధ్య ట్రంప్ ప్రశ్న
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైట్హౌస్లో టెక్ కంపెనీల అధిపతులకు, సీఈఓలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం బయట పెట్టుబడులు పెట్టడం ఆపాలని, ఇక్కడే (అమెరికా) ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సమక్షంలో జరిగిన సంభాషణలో.. ట్రంప్ కుక్ను, "టిమ్, యాపిల్ అమెరికాలో ఎంత డబ్బు పెట్టుబడి పెడుతుంది? అని అడిగారు. దీనికి స్పందించిన టిమ్ కుక్ 600 బిలియన్ డాలర్లు అని అన్నారు. అంతే కాకుండా.. అమెరికాలో యాపిల్ అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడిని కూడా ప్రశంసించారు.ఇతర సీఈఓలను కూడా ట్రంప్ ఇదే ప్రశ్న అడిగారు. దీనికి జుకర్బర్గ్ 600 బిలియన్ డాలర్లు అని చెప్పగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రాబోయే రెండేళ్లలో 200 బిలియన్ల పెట్టుబడి పెడుతున్నట్లు వివరించారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల బదులిస్తూ.. మేము 75 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లు అని అన్నారు. వీరందరికీ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు.డొనాల్డ్ ట్రంప్ విందుకు దేశంలోని దాదాపు దిగ్గజాలందరూ హాజరయ్యారు. కానీ అమెరికా అధ్యక్షునికి అత్యంత సన్నిహితుడు, టెస్లా బాస్ మాత్రం హాజరు కాలేదు. ఈ విందుకు ట్రంప్ మస్క్ను పిలవడం మరిచారా?, లేక పిలిచినా మస్క్ పట్టించుకోలేదా అనేది తెలియాల్సి ఉంది..@Apple CEO @tim_cook: "I want to thank you for setting the tone such that we could make a major [$600 billion] investment in the United States... That says a lot about your focus and your leadership and your focus on innovation." pic.twitter.com/289vkiB6vy— Rapid Response 47 (@RapidResponse47) September 5, 2025 -
ఐపీఓకు సిద్ధమవుతున్న ఫోన్పే
భారత ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఐపీఓ కోసం కాన్ఫిడెన్షియల్ ఫైలింగ్ దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఐపీఓ పరిమాణం రూ.10,000-13,000 కోట్ల మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఐపీఓ ఇప్పటి వరకు భారతదేశం అతిపెద్ద ఫిన్టెక్ లిస్టింగ్ల్లో ఒకటిగా మారుతుందని కొందరు అంటున్నారు.కంపెనీ విస్తరణకు, టెక్నాలజీ అప్గ్రేడ్ల కోసం, కొత్త సర్వీసులు అందించేందుకు మూలధనాన్ని సమీకరించడానికి ఫోన్పేకు ఈ పబ్లిక్ ఇష్యూ సహాయపడుతుంది. ఈ ఆఫర్ ఫర్ సేల్లో ప్రారంభ పెట్టుబడిదారులు తమ వాటాలు విక్రయించే అవకాశం ఉంటుంది.ఫోన్పేలో మెజారిటీ వాటా కలిగిఉన్న వాల్మార్ట్ పెద్దంగా తన వాటాను విక్రయించే అవకాశం లేదనే అభిప్రాయాలున్నాయి. ఇతర ఇన్వెస్టర్లుగా ఉన్న టైగర్ గ్లోబల్, జనరల్ అట్లాంటిక్ వంటివి కొంతమేరకు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చనే అంచనాలున్నాయి. భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఎకోసిస్టమ్లో ఫోన్పే 45% మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది గూగుల్ పే, పేటీఎం వంటి ప్రత్యర్థుల కంటే చాలా ముందంజలో ఉంది. ఏప్రిల్ 2025లో కంపెనీను ఫోన్పే లిమిటెడ్గా పునర్వ్యవస్థీకరించారు.ఇదీ చదవండి: వైట్హౌజ్లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు -
వైట్హౌజ్లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి వైట్హౌజ్లో ప్రముఖ టెక్ కంపెనీ సీఈఓలతో హైప్రొఫైల్ విందును నిర్వహించారు. రోజ్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అమెరికా ప్రతిష్టాత్మక కంపెనీ అధినేతల సరసన అక్కడి సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారత సంతతి సీఈఓలు సైతం పాల్గొన్నారు.విందుకు హాజరైన భారత సంతతి సీఈవోలుసుందర్ పిచాయ్ - గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓసత్య నాదెళ్ల - మైక్రోసాఫ్ట్ సీఈఓసంజయ్ మెహ్రోత్రా - మైక్రాన్ టెక్నాలజీ సీఈఓవివేక్ రణదివే - టిబ్కో సాఫ్ట్వేర్ ఛైర్మన్శ్యామ్ శంకర్ - పాలంటీర్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ఈ విందుకు సంబంధించిన పూర్తి అజెండాను వైట్ హౌజ్ విడుదల చేయనప్పటికీ కింది కీలక అంశాలపై చర్చించినట్లు అంచనాలు వెలువడుతున్నాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాతీయ భద్రతసెమీకండక్టర్, చిప్ తయారీలో అమెరికా పోటీతత్వంఇమ్మిగ్రేషన్ సంస్కరణలు, హైస్కిల్డ్ వీసాలు (హెచ్1-బీ)సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యతయూఎస్-ఇండియా టెక్ సహకారం, సరఫరా గొలుసులపై ప్రభావంఅతిథుల జాబితాలోని ప్రముఖ కంపెనీ సీఈవోలుపేరుకంపెనీబిల్ గేట్స్మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడుటిమ్ కుక్యాపిల్ సీఈఓమార్క్ జుకర్బర్గ్మెటా సీఈఓసెర్గీ బ్రిన్గూగుల్ సహ వ్యవస్థాపకుడుసామ్ ఆల్ట్ మన్ఓపెన్ ఏఐ సీఈఓ, సహ వ్యవస్థాపకుడుగ్రెగ్ బ్రోక్ మన్ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడుసఫ్రా కాట్జ్ఒరాకిల్ సీఈఓడేవిడ్ లింప్బ్లూ ఆరిజిన్ సీఈఓఅలెగ్జాండర్ వాంగ్స్కేల్ ఏఐ సీఈఓజారెడ్ ఐజాక్ మన్షిఫ్ట్ 4 పేమెంట్స్ సీఈఓ ఎలాన్ మస్క్ గైర్హాజరుటెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఈ విందుకు గైర్హాజరయ్యారు. ఒకప్పుడు ట్రంప్తో సన్నిహితంగా మెలిగిన మస్క్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కొద్దికాలంపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) అధిపతిగా పనిచేశారు. కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా ఇచ్చారు. ఇటీవల ట్రంప్తో మస్క్ సంబంధాలను తెంచుకున్నట్లు వార్తలు వచ్చాయి.ఇటీవల అమెరికా దిగ్గజ కంపెనీలకు ట్రంప్ దేశీయంగా పెట్టుబడులు పెంచాలని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇతర దేశాల్లో కాకుండా యూఎస్ చేసే పెట్టుబడులు, మూలధన వ్యయాలు పెంచాలని సూచించారు. అందుకు ఇతర దేశాల్లో కార్యకలాపాలు విస్తరించాలనుకునే కొన్ని కంపెనీలు వెనక్కి తగ్గి యూఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా కంపెనీల సీఈఓలకు విందు ఏర్పాటు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: శాశ్వత నివాసం కోసం ఐర్లాండ్ ఆకర్షణీయ మార్గం -
కొత్త జీఎస్టీతో మందు రేట్లు పెరుగుతాయా?
విస్తృత జీఎస్టీ 2.0 సంస్కరణల కింద సిగరెట్లు, పాన్ మసాలా, ఇతర హానికర వస్తువులను కొత్త 40% పన్ను శ్లాబులోకి జీఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం మద్యంపైనా ఉంటుందా.. ఆల్కహాల్ రేట్లు పెరుగుతాయా? అన్న సందేహం చాలా మందిలో ఉంది.అనేక హానికర వస్తువులను అధిక పన్ను శ్లాబులోకి తీసుకొచ్చినప్పటికీ మద్యం ధరలపై దీనికి ప్రభావం ఉండదు. ఎందుకంటే మద్యం జీఎస్టీ పరిధిలో లేదు. మద్యంపై పన్ను రాష్ట్రాల నియంత్రణలోనే ఉంటుంది. తాజా జీఎస్టీ మార్పుల ప్రకారం.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా వంటి హానికర వస్తువుల కేటగిరీలోకి వచ్చే ఉత్పత్తులపై 40% పన్ను విధిస్తారు. ఇది గతంలో 28% ఉండేది. అంటే 12% పెరిగింది. ఈ ఉత్పత్తులను ప్రజలు వినియోగించకుండా నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నష్టపరిహార సెస్ లేకుండా..ప్రభుత్వ వార్తా సంస్థ పీఐబీ జారీ చేసిన ఎఫ్ఏక్యూల ప్రకారం.. ప్రత్యేక రేటు కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు ప్రధానంగా హానికర వస్తువులు, కొన్ని లగ్జరీ వస్తువులపై మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల ఇది ప్రత్యేక రేటు. వీటిలో చాలా వస్తువులపై ప్రస్తుతం జీఎస్టీతో పాటు నష్టపరిహార సెస్ కూడా విధిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిహార సెస్ రేటును జీఎస్టీలో విలీనం చేస్తున్నారు.నేరుగా జీఎస్టీ లేకున్నా..ఆల్కహాల్ పానీయాలు నేరుగా జీఎస్టీ పరిధిలోకి రానప్పటికీ, దానికి సంబంధించిన అనేక కార్యకలాపాలకు జీఎస్టీ వర్తిస్తుంది. బాటిలింగ్, ప్యాకేజింగ్, రవాణా, లాజిస్టిక్స్, పరికరాల కొనుగోలు, నిర్వహణ, అలాగే ప్రకటనలు, మార్కెటింగ్ వంటి సేవలన్నిటికీ జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఇది ద్వంద్వ పన్ను నిర్మాణాన్ని సూచిస్తుంది. మద్యంపై రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. కానీ దాని చుట్టూ ఉన్న వ్యాల్యూ చెయిన్లో చాలా భాగం జీఎస్టీ పరిధిలోకి వస్తుంది.జీఎస్టీ 2.0 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుండటంతో వినియోగదారులు సిగరెట్లు, సోడాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై విపరీతమైన ధరలను ఎదుర్కోనున్నారు. తాగడానికి వినియోగించే ప్యాకేజ్ చేసిన ఆల్కహాల్ మాత్రమే జీఎస్టీ పరిధిలోకి రాదు. అదే పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే ఆల్కహాల్ మాత్రం కొత్త జీఎస్టీ విధానం కిందకు వస్తుంది.ఇదీ చదవండి: కొత్త జీఎస్టీతో పాప్కార్న్ వివాదానికి ఫుల్స్టాప్ -
అనిల్ అంబానీపై మరో ‘ఫ్రాడ్’ ముద్ర!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ రంగంలో ఓ వెలుగువెలిగిన అనిల్ అంబానీని రుణ ఎగవేత కేసులు వెంటాడుతున్నాయి. దివాలా చర్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) రుణ ఖాతాను, అదేవిధంగా ఆ కంపెనీలో మాజీ డైరెక్టర్ అయిన అనిల్ అంబానీని తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) మోసపూరితం (ఫ్రాడ్)గా వర్గీకరించింది. దాదాపు దశాబ్దం క్రితం ఆర్కామ్ తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సే్చంజీలకు తెలిపిన సమాచారంలో బీవోబీ పేర్కొంది. దేశీ బ్యాంకింగ్ అగ్రగామి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) కూడా ఇవే ఆరోపణలతో ఆర్కామ్, అనిల్ను ‘ఫ్రాడ్’ జాబితాలో చేర్చడం తెలిసిందే. ఆర్కామ్కు బీవోబీ రూ.1,600 కోట్ల రుణాన్ని, మరో రూ.862.5 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్ కింద మంజూరు చేసింది. ఈ మొత్తం రూ.2,462.5 కోట్లలో ఈ ఏడాది ఆగస్ట్ 28 నాటికి రూ.1,656.07 కోట్లు బకాయి పడింది. ఈ నేపథ్యంలో కంపెనీతో పాటు ప్రమోటర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరిస్తూ బీవోబీ నుంచి సెప్టెంబర్ 2న లేఖ అందినట్లు ఆర్కామ్ వెల్లడించింది. ఈ లేఖ ప్రకారం.. 2017, జూన్ 5 నుంచి బీవోబీ ఈ ఖాతాను మొండిబకాయిగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆర్కామ్పై దివాలా చట్టం ప్రకారం ఎన్సీఎల్టీలో కేసు నడుస్తోంది. కాగా, బ్యాంకింగ్ చట్టాల ప్రకారం ఖాతాను ‘ఫ్రాడ్’గా ప్రకటించిన తర్వాత, దానిపై క్రిమినల్ చర్యల నిమిత్తం దర్యాప్తు సంస్థలకు కూడా సంబంధిత బ్యాంక్ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఐదేళ్ల పాటు కొత్తగా ఎలాంటి రుణం పుట్టకుండా రుణగ్రహీతను నిషేధించాలి. ఈ ఏడాది మార్చి నాటికి ఆర్కామ్ మొత్తం అప్పులు రూ.40,400 కోట్లుగా లెక్కతేలింది. మాపై ప్రభావం లేదు: ఆర్పవర్ ఆర్కామ్ ఖాతా విషయంలో బీవోబీ చేపట్టిన చర్యల వల్ల తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎలాంటి ప్రభావం లేదని రిలయన్స్ పవర్ (ఆర్పవర్) పేర్కొంది. ఇది కూడా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీయే. కాగా, తమది ప్రత్యేక, స్వతంత్ర లిస్టెడ్ కంపెనీ అని, ఆర్కామ్తో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు ఏవీ లేవని ఆర్పవర్ స్టాక్ ఎక్సే్చంజీలకు వెల్లడించింది. -
బీమా అందరికీ చేరువ
అన్ని వ్యక్తిగత జీవిత, ఆరోగ్యబీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీ రేటును మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా బీమా పరిశ్రమ పేర్కొంది. వైద్య ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిపోతున్న తరుణంలో తాజా నిర్ణయం పౌరులకు ప్రయోజనం కలిగిస్తుందని, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని జబాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ అభిప్రాయపడ్డారు.వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ధర దిగొస్తుందని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఈడీ, సీఎఫ్వో సమీర్ షా తెలిపారు. ‘పన్ను రేట్లు తగ్గించడం వల్ల ప్రీమియం రేట్లు దొగిస్తాయన్న అంచనాలున్నాయి. కానీ, తాజా రేట్ల తగ్గింపు ప్రయోజనం ఏ మేరకు లభిస్తుందన్నది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుంది’ అని షా వివరించారు. ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో సుబ్రత మోండల్ స్పందిస్తూ.. జీఎస్టీని తొలగించడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు స్థోమత పెరుగుతుందని, మరిన్ని వర్గాల ప్రజలకు బీమా రక్షణ విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. రేట్ల క్రమబద్దీకరణ దూరదృష్టితో తీసుకున్న చర్య. వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై జీఎస్టీ ట తొలగించడం పౌరులు అందరికీ జీవిత బీమాను చేరువ చేసేందుకు, 2047 నాటికి అందరికీ బీమా లక్ష్యాన్ని సాధించే దిశగా వేసిన అడుగు. –ఆర్.దొరైస్వామి, ఎల్ఐసీ సీఈవో, ఎండీ -
‘ఆరోగ్య’ ఉపశమనం
కొన్ని రకాల ఔషధాలు, వైద్య పరికరాలపై జీఎస్టీని తగ్గించడం, ప్రాణాధార ఔషధాలపై లెవీని మినహాయించడం.. రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని ఫార్మా, ఆరోగ్య సంరక్షణ సంస్థలు పేర్కొన్నాయి. ఔషధాల ధరలు దిగొస్తాయని, నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డాయి.ప్రాణాలను కాపాడే క్యాన్సర్ ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించడం బాధిత కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తుందని భారత ఫార్మాస్యూటికల్స్ కూటమి సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. చాలా ఔషధాలపై 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం వల్ల చికిత్సల ధరలు తగ్గుతాయన్నారు. 33 నిత్యావసర ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించడం, కేన్సర్, అరుధైన వ్యాధులు, దీర్ఘకాల వ్యాధుల ఔషధాలపై రేటును 5 శాతానికి తగ్గించడం చరిత్రాత్మక నిర్ణయాలే కాకుండా, దయతో తీసుకున్నవిగా భారత ఫార్మాస్యూటికల్ తయారీదారుల సమాఖ్య (ఓపీపీఐ) డైరెక్టర్ జనరల్ అనిల్ మతాయ్ పేర్కొన్నారు. రోగులు, వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. తాజా చర్యలు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తాయని నాట్హెల్త్ ప్రెసిడెంట్, మెట్రోపొలిస్ హెల్త్కేర్ చైర్పర్సన్ అయిన అమీరా షా తెలిపారు.హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్పై సున్నా జీఎస్టీ అన్నది మాస్టర్ స్ట్రోక్. రక్షణ (బీమా)ను విశేషాధికారం కాకుండా, ఒక హక్కుగా మారుస్తుంది. ఔషధాలపై జీఎస్టీ తగ్గింపుతో ప్రతి ఇంటికీ అందుబాటు ధరలకే ఆరోగ్య సంరక్షణను చేరువ చేస్తుంది. ప్రభుత్వం లక్షలాది మంది గౌరవప్రదంగా ఆరోగ్య సంరక్షణను పొందేలా చేసింది. – శోభన కామినేని, అపోలో హెల్త్ ఈడీ (వీరు రామ్చరణ్ భార్య ఉపాసన మదర్)ఇదీ చదవండి: లక్షలాది కుటుంబాలకు తీపికబురు.. కిరాణా బిల్లులు తగ్గింపు -
ఇక పీవీసీ పైపుల లాభాల ఫ్లో!
సుమారు ఐదు త్రైమాసికాలుగా అంతంతమాత్ర పనితీరు చూపుతూ వచ్చిన ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీలు ఇకపై బలాన్ని పుంజుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) ద్వితీయార్ధం నుంచి రికవరీ బాటలో సాగనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి ప్లాస్టిక్ పైపులు, తదితర ప్రొడక్టుల తయారీ దిగ్గజాలకు ప్రోత్సాహం లభించనున్నట్లు భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం..కొద్ది నెలలుగా నిరుత్సాహకర ఫలితాలు ప్రకటిస్తున్న ప్లాస్టిక్ పైపుల తయారీ కంపెనీలు ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లోనూ ఓమాదిరి పనితీరునే ప్రదర్శించాయి. అయితే పలు సానుకూల అంశాల ప్రభావంతో ద్వితీయార్ధం(2025 అక్టోబర్–మార్చి 2026)లో మెరుగైన ఫలితాలను సాధించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రొడక్టులకు డిమాండ్ పుంజుకోవడం, పాలీవినైల్ క్లోరైడ్(పీవీసీ) ధరలు నిలకడను చూపడం ఇందుకు సహకరించనున్నట్లు తెలియజేశారు. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం పటిష్ట డిమాండ్కు తోడు ముడివయ్యాలు తగ్గడం కంపెనీలకు కలసిరానుంది. ప్రధానంగా ప్రతిపాదిత యాంటీడంపింగ్ డ్యూటీలు దేశీ పరిశ్రమలకు జోష్నివ్వనున్నాయి. ఈ సానుకూలతల కారణంగా ఇటీవల పీవీసీ కంపెనీల షేర్లు పరుగెడుతున్నాయి. ప్రభుత్వ మద్దతు ఇటీవలే వాణిజ్య పరిష్కార సంబంధ చర్యలు తీసుకునే ట్రేడ్ రెమిడీస్ డైరెక్టరేట్ జనరల్(డీజీటీఆర్).. పీవీసీ రెజిన్ దిగుమతులపై తుది పరిశీలనను పూర్తి చేసింది. తద్వారా యాంటీడంపింగ్ డ్యూటీల విధింపునకు దారి చూపనుంది. ప్రధానంగా చైనా, ఇండోనేసియా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, యూఎస్ల నుంచి పీవీసీ రెజిన్ దిగుమతి అవుతోంది. దీంతో దిగుమతులు, దేశీ ఉత్పత్తి మధ్య ధరల్లో వ్యత్యాసం తగ్గనుంది. కాగా.. భారత్ పీవీసీ దిగుమతులపై అధికంగా ఆధారపడుతోంది. దేశీ డిమాండ్ వార్షికంగా 4.7 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ)కాగా.. స్థానిక తయారీ సామర్థ్యం 1.8 ఎంటీపీఏ మాత్రమే. దీంతో పీవీసీ రెజిన్ కోసం విదేశాలవైపు చూపు సారిస్తోంది. ఫలితంగా పరిశ్రమపై అంతర్జాతీయ ధరల ప్రభావం పడుతోంది. అయితే 2027 కేలండర్ ఏడాదిలో దేశీయంగా 2.5 ఎంటీపీఏ సామర్థ్యం అందుబాటులోకి వచ్చే వీలుంది. వెరసి పీవీసీ దిగ్గజాలు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే అవకాశముంది. సానుకూలతలు దేశీయంగా పీవీసీ రెజిన్ సరఫరాలు పుంజుకుంటే పైపుల తయారీ కంపెనీలకు లబ్ది చేకూరనుంది. ముడిసరుకుల స్థానిక లభ్యతపై విశ్వాసం, ధరల హెచ్చుతగ్గులకు చెక్ పెట్టడం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తగ్గడం, నిర్వహణ లాభ మార్జిన్లకు రక్షణ తదితర ప్రయోజనాలకు వీలుచిక్కుతుందని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ నిపుణులు అభిప్రాయపడ్డారు. యాంటీడంపింగ్ చర్యలతో స్థానిక తయారీకి మద్దతు, పీవీసీ రెజిన్ ధరల నిలకడ ద్వారా ఈ రంగంలోని పరిశ్రమల లాభదాయకత మెరుగుపడనున్నట్లు ప్రభుదాస్ లీలాధర్ నిపుణులు తెలియజేశారు. ప్రధానంగా లిస్టెడ్ కంపెనీలు ఆస్ట్రల్, సుప్రీం, ఫినొలెక్స్ లబ్ది పొందనున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు పీవీసీ రెజిన్ ధరలు ఐదు నెలల తదుపరి మే నెలలో తొలిసారి బలపడ్డాయి. కేజీ ధర రూ. 1.5 పుంజుకోగా.. ఆగస్ట్కల్లా మరో రూ. 4.6 పెరిగాయి. పనితీరు డీలా ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ1)లో పీవీసీ రంగ కంపెనీల ఫలితాలు డీలా పడ్డాయి. ఉమ్మడి ఆదాయం వార్షికంగా 3 శాతం నీరసించగా.. ప్రొడక్టులకు ధరలు(రియలైజేషన్లు) 8% క్షీణించాయి. అయితే అమ్మకాలు 3 శాతం వృద్ధి చూపాయి. అయినప్పటికీ నిర్వహణ లాభం(ఇబిటా) వార్షికంగా 27 శాతం వెనకడుగు వేసింది. ఈ కాలంలో కేజీకి ఇబిటా 41 శాతం పడిపోయింది. నిల్వలపై భారీ నష్టాలు ఇందుకు కారణమయ్యాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఢిల్లీ కుబేరులు.. ఇదిగో టాప్ 10 జాబితా
ఢిల్లీ భారతదేశానికి రాజధాని నగరం. ఇది రాజకీయాలకు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రం కూడా. ఇక్కడ ఎంతోమంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఎక్కువ మంది ధనవంతులు నివసిస్తున్న నగరాల్లో కూడా ఢిల్లీ స్థానం సంపాదించుకుంది. ఈ కథనంలో ఢిల్లీలోని అత్యంత ధనవంతులు ఎవరు?, వారి నెట్వర్త్ ఎంత అనే విషయాలు తెలుసుకుందాం.➤శివ్ నాడార్: 40.2 బిలియన్ డాలర్లు➤సునీల్ మిట్టల్ & కుటుంబం: 30.7 బిలియన్ డాలర్లు➤రవి జైపురియా: 17.3 బిలియన్ డాలర్లు➤బర్మన్ కుటుంబం: 10.4 బిలియన్ డాలర్లు➤కపిల్ & రాహుల్ భాటియా: 10.1 బిలియన్ డాలర్లు➤వినోద్, అనిల్ రాయ్ గుప్తా & కుటుంబం: 9.5 బిలియన్ డాలర్లు➤వివేక్ చాంద్ సెహగల్ & కుటుంబం: 8.9 బిలియన్ డాలర్లు➤విక్రమ్ లాల్ & కుటుంబం: 8.8 బిలియన్ డాలర్లు➤కులదీప్ సింగ్ & గుర్బచన్ సింగ్ ధింగ్రా: 7.5 బిలియన్ డాలర్లు➤రమేష్, రాజీవ్ జునేజా & కుటుంబం: 7 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: ఉత్తరప్రదేశ్లో అత్యంత సంపన్నుడు ఎవరంటే?పైన వెల్లడించిన లిస్టులో ఉన్న ప్రముఖులు ఢిల్లీలో మాత్రమే కాదు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించుకున్నారు. వీరందరూ పారిశ్రామిక రంగంలో తమదైన ముద్రవేసి, ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2025 ఆగస్టులో ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు రూ. 5725 కోట్లు అని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే.. దేశ ఆర్ధిక వృద్ధికి ఢిల్లీ ఎంత ముఖ్యమైన నగరమో అర్థం చేసుకోవచ్చు. -
ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..
వినియోగ వస్తువులపై పన్నులను తగ్గించడానికి.. జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తరువాత ఆల్టో ధర రూ.40000 నుంచి రూ. 50,000 & వ్యాగన్ ఆర్ ధరలు రూ.60,000 నుంచి రూ. 67,000 వరకు తగ్గే అవకాశం ఉందని మారుతి సుజుకి చైర్మన్ 'ఆర్ సీ భార్గవ' పేర్కొన్నారు.కార్లను 18 శాతం జీఎస్టీ స్లాబులో చేర్చడం వల్ల ప్యాసింజర్ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతుంది. వడ్డీ రేట్లు తగ్గడం, ఆదాయపు పన్ను ప్రయోజనాలు అన్నే కూడా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కౌన్సిల్ చిన్న కార్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.ఇదీ చదవండి: రాష్ట్రపతి కోసం రూ.3.66 కోట్ల కారు!.. జీఎస్టీ వర్తిస్తుందా?కౌన్సిల్ నిర్ణయం ఆటోమేకర్ల రవాణా ఖర్చులు.. డీలర్ మార్జిన్లపై ప్రభావం చూపదని పరిగణనలోకి తీసుకుంటే కార్ల ధరలు 9 శాతం తగ్గే అవకాశం ఉంది. చిన్న కార్ల మార్కెట్ ఈ సంవత్సరం 10 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు భార్గవ తెలిపారు. కాగా రూ. 20 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లు 5 శాతం స్లాబులో ఉన్నాయి. -
జియో ఫైనాన్షియల్కు భారీగా నిధులు
విస్తరణకు వీలుగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కు ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు తాజాగా రూ. 3,956 కోట్ల పెట్టుబడులు సమకూర్చాయి. ఒక్కో వారంట్కు రూ. 316.5 ధరలో కంపెనీ బోర్డు 50 కోట్ల వారంట్లను జారీ చేసింది. వెరసి ప్రమోటర్ సంస్థలు సిక్కా పోర్ట్స్ అండ్ టెర్మినల్స్, జామ్నగర్ యుటిలిటీస్ అండ్ పవర్కు 25 కోట్లు చొప్పున వారంట్లను అందుకున్నాయి.తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. జియో ఫైనాన్షియల్ రూ. 3,956 కోట్లు అందుకుంది. ఈ ఏడాది జూలైలో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు మార్పిడికివీలయ్యే వారంట్ల జారీకి కంపెనీ బోర్డు అంగీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 15,825 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు వేసింది.ప్రమోటర్లుగా ముకేశ్ అంబానీ కుటుంబంతోపాటు.. ఇతర సంస్థలు ప్రస్తుతం కంపెనీలో ఉమ్మడిగా 47.12 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు జంప్ చేసింది. -
అమెజాన్ ప్రైమ్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్ నిలిపివేత
అమెజాన్ ఇప్పటివరకు కొనసాగిస్తున్న అకౌంట్ షేరింగ్ ప్రోగ్రామ్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అక్టోబర్ 1, 2025 నుంచి అధికారికంగా ప్రైమ్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్ను నిలిపేస్తున్నట్లు పేర్కొంది. ఇది వినియోగదారులు తాము ఎక్కడ నివసిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రైమ్ ప్రయోజనాలను ఎవరితోనైనా పంచుకోవడానికి అనుమతించే దీర్ఘకాలిక ఫీచర్. అయితే ఈ ప్రోగ్రామ్ స్థానంలో ఒకే కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తులు మాత్రమే ప్రైమ్ ప్రయోజనాలను పంచుకునేలా కొత్త ప్రోగ్రామ్(అమెజాన్ హౌజ్హోల్డ్)ను తీసుకురాబోతున్నట్లు తెలిపింది.కొత్త మార్పు తర్వాత ప్రైమ్ ప్రయోజనాలను పంచుకోవాలంటే సభ్యులందరూ ఒకే చిరునామాలో నివసించాలి. దాంతోపాటు ప్రైమ్ సభ్యుడికి కొన్ని ప్రయోజనాలుంటాయి.తనతోపాటు 20 ఏళ్లు నిండిన ఒకరిని మాత్రమే చేర్చుకోవచ్చు.నలుగురు టీనేజర్ల వరకు (ఏప్రిల్ 7, 2025 లోపు చేర్చినట్లయితే మాత్రమే) యాడ్ చేసుకోవచ్చు.నలుగురు పిల్లల వరకు ‘కిండిల్ ఫ్రీటైమ్’ (పూర్తి ప్రైమ్ ప్రయోజనాలను పొందలేరు)వంటి ఫీచర్లను అందించవచ్చు.ప్రైమ్ సభ్యులు వినియోగించుకునే కొన్ని సదుపాయాలను అమెజాన్ హౌజ్హోల్డ్లోనూ కొనసాగించనున్నారు. అవి..ఉచిత రెండు రోజుల డెలివరీప్రైమ్ డే డీల్స్ప్రైమ్ వీడియో (ప్రకటనలతో)అమెజాన్ మ్యూజిక్ (యాడ్-ఫ్రీ షఫుల్ మోడ్ మాత్రమే)ఎంపిక చేసిన గ్యాస్ స్టేషన్లలో డిస్కౌంట్లుఈబుక్, ఆడియోబుక్, కొన్ని అప్లికేషన్లు వాడేందుకు అవకాశం.ప్రత్యేక ఆఫర్దీర్ఘకాలిక వినియోగదారుల కోసం అమెజాన్ ప్రత్యేక లాయల్టీ డిస్కౌండ్ను అందిస్తోంది. 2009-2015 మధ్య ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న ఎవరైనా కేవలం 14.99 డాలర్లకు(సుమారు రూ.1270) 12 నెలలపాటు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్ డిసెంబర్ 31, 2025 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్కు అర్హత కలిగిన సభ్యులకు దీన్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో పూర్తి వివరాలతో ఈమెయిల్ అందుతుందని పేర్కొంది. లేదా ఇప్పటికే ఉన్న ప్రైమ్ మెంబర్ షిప్ కింద అకౌంట్ సెట్టింగ్లను తనిఖీ చేయవచ్చని చెప్పింది.ఎందుకీ మార్పులు?అమెజాన్ షేరింగ్ విధానాన్ని కఠినతరం చేయడం ద్వారా ఎక్కువ మంది భాగస్వామ్య వినియోగదారులను చెల్లింపు చందాదారులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఈ-కామర్స్, స్ట్రీమింగ్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో సభ్యులకు అందిస్తున్న ప్రయోజనాల్లో మార్పులు చేయాలని చూస్తుంది.ఇదీ చదవండి: దేశీయ అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఇండిగో -
బిగ్ దివాలీ గిఫ్ట్.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట
దేశంలో జీఎస్టీ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తూ సెప్టెంబర్ 22 నుండి 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు-రేట్ల వ్యవస్థకు మారాలని జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ వ్యాపార దిగ్గజాలు స్వాగతించారు. రాధికా గుప్తా, హర్ష్ గోయెంకా, ఆనంద్ మహీంద్రా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ చర్యను పౌరులకు "పెద్ద దీపావళి బహుమతి" గా అభివర్ణించారు. 'ప్రతి భారతీయుడికి బిగ్ దీవాలీ గిఫ్ట్. రోజువారీ నిత్యావసరాలు, ఆరోగ్యం, విద్య, వ్యవసాయ ముడి ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించారు. చౌకైన కిరాణా సరుకులు, ఆరోగ్య సంరక్షణలో ఉపశమనం, సరసమైన విద్య, రైతులకు మద్దతు" అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్లో రాసుకొచ్చారు. ఈ సంస్కరణ జీవనాన్ని సులభతరం చేయడం, ఆర్థిక వ్యవస్థను పెంచడం అనే ద్వంద్వ ప్రయోజనాలతో "నెక్ట్స్-జనరేషన్ జీఎస్టీ" దిశగా ఒక అడుగు అని అన్నారు.ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో రాధికా గుప్తా ‘ఎక్స్’ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. "చాలా క్లిష్టమైన సమయంలో చాలా ప్రగతిశీలమైన చర్య, ఇది డిమాండ్, సెంటిమెంట్ రెండింటినీ పెంచడానికి సహాయపడుతుంది! ప్రపంచం మనల్ని ఒక మూలకు నెట్టినప్పుడు, మరింత గట్టిగా పోరాడటానికి మనల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి" అని రాసుకొచ్చారు.మరిన్ని సంస్కరణలు ప్లీజ్...మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మనం ఇప్పుడు యుద్ధంలో చేరాం. మరింత వేగవంతమైన సంస్కరణలు వినియోగాన్ని, పెట్టుబడులను వెలికితీసేందుకు ఖచ్చితమైన మార్గం. ఇవి ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాయి. ప్రపంచంలో భారతదేశ స్వరాన్ని పెంచుతాయి. కానీ స్వామి వివేకానందుని ప్రసిద్ధ ఉపదేశాన్ని గుర్తు చేసుకుందాం: 'లేవండి, మేల్కొనండి. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆపవద్దు'. కాబట్టి, మరిన్ని సంస్కరణలు, ప్లీజ్...’ అంటూ పోస్ట్ చేశారు.చదవండి: జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్నిత్యావసరాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లను భారీగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతమున్న 12 శాతం, 28 శాతం కేటగిరీలను విలీనం చేస్తూ రేట్లను రెండు శ్లాబులుగా హేతుబద్ధీకరించాలని 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. Big Diwali gift 🎁 for every Indian!GST on daily essentials, healthcare, education & farming inputs slashed.🛒 Cheaper groceries💊 Relief in healthcare📚 Affordable education🚜 Support for farmersNext-gen GST = ease of living + boost to economy.— Harsh Goenka (@hvgoenka) September 3, 2025Extremely progressive step at a very critical time that should help boost both demand and sentiment! When the world pushes us into a corner, we push ourselves to fight back harder. pic.twitter.com/DnU7k5tTgq— Radhika Gupta (@iRadhikaGupta) September 3, 2025We have now joined the battle…More and faster reforms are the surest way to unleash consumption and investment.Those, in turn, will expand the economy and amplify India’s voice in the world.But let’s remember the famous exhortation of Swami Vivekananda:“Arise, awake, and… https://t.co/rDoRtjsCw1— anand mahindra (@anandmahindra) September 3, 2025 -
దేశీయ అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఇండిగో
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం 43 విదేశీ నగరాలకు విమానాలు నడుపుతూ ఈ ఘనత దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఎయిరిండియా(స్టాండలోన్-ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను మినహాయిస్తే) 42 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.14 ఏళ్ల క్రితం దిల్లీ-దుబాయ్ మధ్య ఒకే విమానంతో అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇండిగో విమానయాన సంస్థకు ఈ ఘనత ఓ మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ అధికారులు చెప్పారు. ఆసియా, మిడిల్ఈస్ట్, యూరప్ అంతటా కొత్త మార్కెట్లలో దూకుడుగా విస్తరించాలన్న ఇండిగో వ్యూహానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నట్లు తెలిపారు.గతంలో ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిరిండియా ఇటీవల తనకుతాను విధించుకున్న ‘సేఫ్టీ పాజ్’, కొన్ని ప్రాంతాల్లో విమానాల రద్దు కారణంగా అంతర్జాతీయ సేవల్లో అంతరాయం నెలకొంది. ఇది ఇండిగోను ముందుంచేలా చేసిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాఉండగా, ఇండిగో 2025 చివరి నాటికి లండన్, కోపెన్ హాగన్, సీమ్ రీప్తో సహా అనేక కొత్త మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ అంతర్జాతీయ విమాన కార్యకలాపాల్లో ఇండిగో సుమారు 30% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్యను 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 40%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా? -
ప్రైవేటు ఆసుపత్రుల్లో ‘పీఈ’ పాగా
గత ఐదేళ్లుగా దేశ ఆరోగ్య పరిరక్షణ (హెల్త్కేర్) రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గ్లోబల్ పీఈ సంస్థలు దేశీ ఆసుపత్రుల చైన్లో భారీ పెట్టుబడులకు తెరతీస్తున్నాయి. ఫలితంగా ప్రయివేట్ రంగంలోని పలు ఆసుపత్రుల పగ్గాలు టెమాసెక్, బ్లాక్స్టోన్ తదితర పీఈ దిగ్గజాల చేతికి చిక్కుతున్నాయి. వివరాలు చూద్దాం..దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రుల రంగంలో ప్రపంచ ప్రయివేట్ ఈక్విటీ (పీఈ) దిగ్గజాల ఆధిపత్యానికి తెరలేచింది. గత కొన్నేళ్లుగా టెమాసెక్ హోల్డింగ్స్, బ్లాక్స్టోన్, సీవీసీ క్యాపిటల్, కేకేఆర్ తదితర గ్లోబల్ దిగ్గజాలు పలు ప్రయివేట్ ఆసుపత్రుల చైన్లను దేశీయంగా సొంతం చేసుకుంటూ వస్తున్నాయి. మరికొన్నింటిలో మైనారిటీ వాటాలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు వెచ్చిస్తున్నాయి. ఫలితంగా సహ్యాద్రి, మణిపాల్, కేర్, స్టెర్లింగ్ తదితర సుప్రసిద్ధ ఆసుపత్రులు పీఈ సంస్థల పరమవుతున్నాయి. వెరసి 80 బిలియన్ డాలర్ల విలువైన దేశీ హెల్త్కేర్ రంగంలో కన్సాలిడేషన్కు దారి చూపుతున్నాయి. గతంలో పబ్లిక్ సంస్థలు, కుటుంబ ట్రస్ట్ల నిర్వహణలో కార్యకలాపాలు కొనసాగించిన పలు ఆసుపత్రులు ప్రస్తుతం పీఈ దిగ్గజాల కనుసన్నలలో సర్వీసులు అందిస్తున్నాయి. తద్వారా దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులు కుటుంబ యాజమాన్య పరిస్థితుల నుంచి పీఈ సంస్థల నిర్వహణలోకి చేరుతున్నాయి. కోవిడ్–19 తదుపరి కరోనా మహమ్మారి తదుపరి దేశీ హెల్త్కేర్ రంగంపై గ్లోబల్ పీఈ దిగ్గజాలకు ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సింగపూర్ సంస్థ టెమాసెక్, యూఎస్ సంస్థ టీపీజీ, కేకేఆర్ భారీ పెట్టుబడులకు తెరతీశాయి. మణిపాల్, మ్యాక్స్ హాస్పిటల్ చైన్లో వాటాలు కొనుగోలు చేశాయి. నిజానికి 2007లోనే హైదరాబాద్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్లో యూకే సంస్థ ఎపాక్స్ పార్ట్నర్స్ పెట్టుబడులు చేపట్టింది. అయితే సాధారణంగా హెల్త్కేర్ రంగంలో మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితితో పీఈ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతాయని మ్యాక్స్ హెల్త్కేర్ సీఎండీ అభయ్ సోయి పేర్కొన్నారు. ఈ కాలంలో పెట్టుబడుల ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తాయని, మౌలిక సదుపాయాల వృద్ధికి వీలుంటుందని తెలియజేశారు. తదుపరి కార్పొరేట్స్ లేదా యాజమాన్య వ్యక్తులకు నిర్వహణను అప్పగిస్తాయని వివరించారు. 2019లో కేకేఆర్తో కలిసి మ్యాక్స్ హెల్త్కేర్లో నియంత్రిత వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడుల దన్ను పీఈ సంస్థల కారణంగా వృద్ధికి అవసరమైన పెట్టుబడులు, సుపరిపాలన, నిర్వహణ సామర్థ్యం, సర్వీసులలో నాణ్యత మెరుగుపడతాయని గ్రాంట్ థార్న్టన్ భారత్ నిపుణులు భానుప్రకాష్ కల్మాత్ ఎస్జే పేర్కొన్నారు. ఆసుపత్రుల విస్తరణకూ వీలు చిక్కుతుందని తెలియజేశారు. ప్రస్తుతం దేశీ హెల్త్కేర్ రంగంలో సుమారు 20 పీఈ దిగ్గజాలు యాక్టివ్గా ఉన్నట్లు తెలియజేశారు. ఏ ఇతర రంగంతో పోల్చినా ఇది అధికమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ హాస్పిటల్ చైన్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ఆర్వోఐ) మెరుగుపడినట్లు క్వాడ్రా క్యాపిటల్ పార్ట్నర్ సునీల్ ఠాకూర్ పేర్కొన్నారు. సమర్ధ వినియోగం, బెడ్లపై పెరిగిన ఆదాయం, ఉత్తమ వ్యయ నియంత్రణ ఇందుకు దోహదపడినట్లు వివరించారు. విస్తరణకు వీలు తొలి దశలో దేశీయంగా ఆసుపత్రులను ప్రభుత్వాలు లేదా కుటుంబ యాజమాన్య నిర్వహణలో సేవలు అందిస్తుండేవి. తదుపరి దశలో ప్రయివేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఊపిరిపోసుకుంటూ వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం యూఎస్ తరహాలో పీఈ దిగ్గజాల హవా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాయి. యూఎస్లో ప్రయివేట్గా లేదా సంస్థాగత నిర్వహణలో హెల్త్ సర్వీసులు సమకూర్చుతుంటాయని తెలియజేశాయి. అయితే యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్ పేరుతో ప్రభుత్వ అజమాయిషీలోనే హెల్త్కేర్ రంగ నిర్వహణ ఉంటుందని వెల్లడించాయి. కాగా.. గత కొన్నేళ్లలో దేశీయంగా ప్రయివేట్ ఆసుపత్రులను పీఈ దిగ్గజాలు హస్తగతం చేసుకుంటూ వచ్చినట్లు పీడబ్ల్యూసీ ఇండియా అడ్వయిజరీ నిపుణులు సుజయ్ శెట్టి పేర్కొన్నారు. దీంతో మరింత మందికి ఆరోగ్య పరిరక్షణా సేవలు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా తగిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, వృత్తి నైపుణ్యం వంటి సానుకూలతలకు దారి ఏర్పడనున్నట్లు వివరించారు. దేశీయంగా ఆదాయాలతోపాటు.. లైఫ్స్టైల్తరహా వ్యాధులు పెరగడం, ఆరోగ్య పరిరక్షణపట్ల మెరుగైన అవగాహన వంటి అంశాలు హెల్త్కేర్ సర్వీసులకు డిమాండును పెంచుతున్నట్లు తెలియజేశారు. నిజానికి దేశీయంగా ఆసుపత్రులలో తగినన్ని పడకలు, క్రిటికల్ కేర్ సేవల కొరత ఉన్నట్లు వెల్లడించారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
యాక్సిస్ మాక్స్ లైఫ్, పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యం
యాక్సిస్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (గతంలో మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ), ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. టైర్ 1 నగరాలను దాటి గ్రామీణ భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ మార్కెట్లలో అందుబాటు ఖర్చుతో జీవిత బీమా పరిష్కారాలను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.ఈ భాగస్వామ్యం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 650 బ్యాంకింగ్ అవుట్లెట్ల బలమైన నెట్వర్క్ను, పోస్టాఫీసుల ద్వారా 1.64 లక్షలకు పైగా యాక్సెస్ పాయింట్లను ఉపయోగించుకుని, టైర్ 3, టైర్ 4 , గ్రామీణ మార్కెట్లలోని కస్టమర్లకు అవసరాల ఆధారిత జీవిత బీమా పరిష్కారాల సమగ్ర సూట్ను అందిస్తుంది. ఇది ప్రభుత్వ ఆర్థిక చేరిక లక్ష్యాలకు, '2047 నాటికి అందరికీ బీమా' సాధించాలనే ఐఆర్డీఏఐ దార్శనికతకు మద్దతు ఇస్తుంది.జీవిత బీమాను మరింత అందుబాటులోకి, సౌకర్యవంతంగా మారుస్తూ, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ దాని ప్రధాన స్మార్ట్ వెల్త్ అడ్వాంటేజ్ గ్యారెంటీ ప్లాన్ (SWAG), స్మార్ట్ వైబ్ ప్లాన్, వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో సహా వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తుంది. యువ కస్టమర్ల కోసం తక్షణ ఆదాయం, పూర్తి జీవిత ఆదాయ ఎంపికల నుండి అవసరమైన రక్షణ, సమకాలీన పొదుపు లింక్డ్ సొల్యూషన్ల వరకు విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చడానికి వీటిని రూపొందించింది. -
పేదలకు ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ సేవలు
హైదరాబాద్: ఫ్లిప్కార్ట్ గ్రూప్ స్వచ్ఛంద సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్, స్మైల్ ఫౌండేషన్ సహకారంతో, ఇటీవల ఆదిలాబాద్ (తెలంగాణ), బెంగళూరు, ముంబైలలోని పేద వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రుతుక్రమ పరిశుభ్రత విద్య, ఆర్థిక అక్షరాస్యత శిక్షణపై దృష్టి సారించిన ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలైంది.ఫ్లిప్కార్ట్ ఫౌండేషన్ సేవా కార్యక్రమం ద్వారా 9,700 మందికి పైగా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరింది. మరో 26,000 మందికి పైగా సాకుకూల ప్రభావం కలిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సంప్రదింపులు, వ్యాధులపై అవగాహన సెషన్లు, రోగ నిర్ధారణ పరీక్షలు, ఉచిత మందులు అందించే సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. కౌమారదశలో ఉన్న బాలికలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ రక్తహీనత పరీక్షలు, రుతుక్రమ పరిశుభ్రత వర్క్షాప్లు, శానిటరీ ఉత్పత్తుల పంపిణీ వంటివి చేపట్టారు. అలాగే టీనేజర్లకు ఆర్థిక అక్షరాస్యత తరగతులు నిర్వహించారు.“ప్రజలు సమగ్ర జ్ఞానం, అవసరమైన వనరులతో సాధికారత పొందినప్పుడు స్థిరమైన మార్పు పుడుతుందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం” అని ఫ్లిప్కార్ట్ కార్పొరేట్ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ సారా గిడియన్ అన్నారు. “సమగ్ర అభివృద్ధి అనేది పేద వర్గాలు పురోగతి చెందినప్పుడే సాధ్యమవుతుంది” అని స్మైల్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ సంతను మిశ్రా అభిప్రాయపడ్డారు. -
టీసీఎస్ ఉద్యోగులకు తీపికబురు
దేశంలోని ప్రముఖ టెక్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగులకు తీపికబురు అందించింది. టెక్నాలజీ రంగం పుంజుకుంటున్న నేపథ్యంలో కంపెనీ తన ఉద్యోగుల్లో ఎక్కువ మందికి 4.5 శాతం నుంచి 7 శాతం వరకు వేతన పెంపును ప్రకటించింది. స్థూల ఆర్థిక అనిశ్చితి కారణంగా వేతన పెంపు విషయంలో గతంలో జాప్యం జరిగినప్పటికీ మధ్య, దిగువ స్థాయి ఉద్యోగుల్లో 80% మందికి ఈ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందని కంపెనీ హామీ ఇచ్చింది.అస్థిరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ దిద్దుబాట్లను హైలైట్ చేస్తూ టీసీఎస్ ఈ ఏడాది ప్రారంభంలో వార్షిక వేతన పెంపును వాయిదా వేసింది. ఆ సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సతమతమవుతున్న ఐటీ రంగం అంతటా ఆందోళనలు రేకెత్తాయి. కానీ ప్రస్తుతం కంపెనీ పంథా మార్చుకొని పెంపుపై పునరాలోచించినట్లు తెలుస్తుంది. వేతన పెంపు అంశంపై ఓ సీనియర్ ఉద్యోగి మాట్లాడుతూ..‘ఉద్యోగుల ఎదుగుదలకు అనుగుణంగానే ఈ వేతన పెంపు ఉంది. నైపుణ్యం మెరుగుపరుచుకోవడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని నిర్మించడంపై మేము దృష్టి పెట్టాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు 20 శాతం పెంపు -
జొమాటో ప్లాట్ఫామ్ ఫీజు 20 శాతం పెంపు
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? మీరు జొమాటో ద్వారా చేసే ఆర్డర్లపై గతంలో కంటే కాస్త ఎక్కువగా బిల్లు రావడం గమనిస్తున్నారా? అందుకు కంపెనీ వసూలు చేస్తున్న ప్లాట్ఫామ్ ఫీజు కారణం. జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును గతంలో కంటే 20% పెంచింది. సెప్టెంబర్ 2, 2025 నుంచి అన్ని నగరాల్లో ప్రతి ఆర్డర్పై ఈ ఫీజును రూ.10 నుంచి రూ.12కు పెంచింది.డెలివరీ ఫీజులు, పన్నులు, రెస్టారెంట్ ధరలు కాకుండా జొమాటో ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ప్లాట్ఫామ్ ఫీజును ఏప్రిల్ 2023లో మొదటిసారి ప్రవేశపెట్టింది. అయితే ప్రాథమికంగా ఇది రూ.2గా ఉండేది. క్రమంగా జనవరి 2024లో రూ.4కు, అక్టోబర్ 2024లో ఏకంగా రూ.10, ఇప్పుడు దాన్ని రూ.12కు పెంచేసింది.ఇప్పుడే పెంపు ఎందుకు?మార్కెట్ నిపుణులు అంచనాల ప్రకారం.. ఈ సమయంలోనే ప్లాటఫామ్ ఫీజును పెంచేందుకు కారణం లేకపోలేదు. సాధారణంగా ఫుడ్ డెలివరీ వాల్యూమ్స్ గణనీయంగా పెరిగే పండుగ సీజన్కు ముందు ధరలు పెంచితే ఆదాయం పెరుగుతుందని భావించి ఉండవచ్చని చెబుతున్నారు. రోజుకు 2.3–2.5 మిలియన్ల ఆర్డర్లు వస్తుండటంతో ఒక్కో ఆర్డర్పై రూ.2 పెరిగినా త్రైమాసిక ఆదాయంలో అదనంగా రూ.45 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ ఫీజు పెంపుపై జొమాటో ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ..‘ప్లాట్ఫామ్ విస్తరణలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో భాగం’ అని తెలిపారు.Either @zomato thinks that the consumer is stupid or they just don't care anymore. In the past year Iv seen the #PlatformFee increase upto Rs 10 and now its gone up by Rs 2 again bringing it to a total of Rs12. The same order in zomato and @Swiggy has a difference almost Rs 25!! pic.twitter.com/5kemNUZ8Ow— Tarunima Varma (@ForeverFilmy) September 1, 2025ఇదే బాటలో స్విగ్గీ..అధికమవుతున్న నిర్వహణ ఖర్చుల మధ్య లాభాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ఈమేరకు ప్లాట్ఫామ్ ఫీజులు పెంచుతున్నాయి. జొమాటో పోటీ కంపెనీ స్విగ్గీ ఎంపిక చేసిన మార్కెట్లలో ప్లాట్ఫామ్ ఫీజును రూ.14 వరకు విధిస్తుంది. ఇదీ చదవండి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం -
ఏఐతో ఉద్యోగాలు పోతాయా?
కృత్రిమ మేధ(ఏఐ)తో గణనీయంగా ప్రయోజనాలు ఉంటాయని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. లేటెస్ట్ ఏఐ, చాట్జీపీటీ వెర్షన్లను ఉపయోగించాలని తన కార్యాలయంలోని సిబ్బందికి కూడా తాను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని పరిశ్రమ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.ఏఐలాంటి టెక్నాలజీలతో ఉద్యోగాలు పోతాయనే వారి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐని అనైతికంగా ఉపయోగిస్తే తలెత్తే సమస్యలను అరికట్టడానికి మానవ జోక్యం తప్పనిసరిగా అవసరమవుతుంది కాబట్టి, ఆ విధంగా ఉద్యోగాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. కాబట్టి దీన్నొక గొప్ప అవకాశంగా పరిగణించి, అందిపుచ్చుకోవాలని ఆయన వివరించారు.ఏఐని అనైతికంగా ఉపయోగించడం వల్ల స్వల్పకాలికంగా కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ దీర్ఘకాలికంగా భారత్కి ఇది మేలే చేస్తుందన్నారు. డేటా, డాక్యుమెంట్ల భద్రత రీత్యా చాట్జీపీటీ, డీప్సీక్లాంటి టూల్స్ను ఆఫీస్ కంప్యూటర్లు, డివైజ్లలో డౌన్లోడ్ చేయొద్దని ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులకు ఆదేశించింది. అయితే, ఈ కొత్త టెక్నాలజీతో ఒనగూరే ప్రయోజనాలరీత్యా దీని వినియోగంపై ప్రభుత్వ విభాగాల్లో నిషేధమేమీ లేదంటూ మార్చిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. కానీ భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించారు.ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు -
టాటా క్యాపిటల్ రోడ్షోలు షురూ
ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను వేగవంతం చేసింది. అంతర్జాతీయంగా ప్రధాన ఫైనాన్షియల్ కేంద్రాలలో ఇన్వెస్టర్ రోడ్షోలకు తెరతీసింది. తద్వారా ఈ నెల 22న ప్రారంభంకానున్న ఐపీవోకు దారిని ఏర్పాటు చేసుకుంటోంది. నిజానికి ఆగస్ట్లోనే ప్రారంభించిన రోడ్షోలకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పటిష్ట ప్రతిస్పందన లభిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.హాంకాంగ్, సింగపూర్, లండన్, న్యూయార్క్సహా దేశీయంగా కీలక నగరాలలో సీనియర్ మేనేజ్మెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. కంపెనీకిగల డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, పటిష్ట ఫైనాన్షియల్స్, డిజిటల్ ఫస్ట్ వృద్ధి వ్యూహాలను రోడ్షోలలో ప్రదర్శిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో కంపెనీ విలువ 18 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేసినప్పుడు 11 బిలియన్ డాలర్ల విలువను అంచనా వేసిన సంగతి తెలిసిందే.ఐపీవో వివరాలివీఐపీవోలో భాగంగా టాటా క్యాపిటల్ మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా టాటా గ్రూప్ దిగ్గజం 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెప్టెంబర్లో అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ ఆదాయం రూ. 7,692 కోట్లకు చేరగా.. రూ. 1,041 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
భారత్లో నౌకల తయారీపై మిత్సుయి ఓఎస్కే చర్చలు
జపాన్ షిప్పింగ్ దిగ్గజం మిత్సుయి ఓఎస్కే లైనర్స్ (ఎంవోఎల్) భారత్లో నౌకల తయారీకి సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. అలాగే త్వరలో రైల్వే లాజిస్టిక్స్ విభాగంలోకి కూడా ప్రవేశించే యోచనలో ఉంది. ఎంవోఎల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెప్టెన్ ఆనంద్ జయరామన్ ఈ విషయాలు తెలిపారు.141 ఏళ్ల చరిత్ర గల ఎంవోఎల్ ప్రస్తుతం భారత్లో నాలుగో అతి పెద్ద షిప్ఓనర్గా కార్యకలాపాలు సాగిస్తోందని, రెండో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని ఆయన వివరించారు. కొచ్చిన్ షిప్యార్డ్కి త్వరలో మధ్య స్థాయి షిప్ ట్యాంకర్ల కోసం ఆర్డర్లు ఇవ్వనున్నట్లు జయరామన్ చెప్పారు. మరోవైపు, భారత్లో 3–4 స్టార్టప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే యోచనలో ఎంవోఎల్ ఉన్నట్లు ఆయన వివరించారు. భారీగా పెట్టుబడులు అవసరమయ్యే నౌకల నిర్మాణ మార్కెట్లో ప్రస్తుతం చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం ఉండగా, భారత్ వాటా ఒక్క శాతం లోపే ఉంది.ఇదీ చదవండి: ఐపీవోలకు కంపెనీల క్యూ..! -
మెర్క్తో టాటా ఎలక్ట్రానిక్స్ జత
సెమీకండక్టర్ మెటీరియల్ టెక్నాలజీ దిగ్గజం మెర్క్ ఎల్రక్టానిక్స్తో టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా గుజరాత్లోని ధోలెరాలో ఏర్పాటు చేస్తున్న చిప్ ప్లాంటుకి అవసరమైన పూర్తిస్థాయి ప్రొడక్టులు, సర్విసులను ఔట్సోర్సింగ్ చేసుకోనుంది. దీనిలో భాగంగా హైప్యూరిటీ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, అడ్వాన్స్డ్ గ్యాస్, కెమికల్ డెలివరీ సిస్టమ్స్ తదితరాలను సమకూర్చుకోనుంది. 2025 సెమీకాన్ ఇండియా సదస్సు సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో రెండు సంస్థలు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. -
ఐఆర్డీఏఐ చైర్మన్గా అజయ్సేత్
బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) కొత్త చైర్మన్గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి 'అజయ్ సేత్' సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి అయిన సేత్ కేంద్ర ఆర్థిక శాఖలో నాలుగేళ్ల సుదీర్ఘ సేవల అనంతరం ఈ ఏడాది జూన్లోనే పదవీ విరమణ చేశారు.స్వల్ప విరామంతో ఆయన్ని కీలకమైన ఐఆర్డీఏఐ చైర్మన్ బాధ్యతల్లో కేంద్రం కూర్చోబెట్టడం గమనార్హం. బీమా రంగంలో ఆరోగ్యకరమైన పోటీకి, అందరికీ బీమా సేవల విస్తృతికి, ఉత్తమ ప్రమాణాల అమలుకు, పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఐఆర్డీఏఐ కృషి చేస్తుంటుంది. -
10వ తరగతి చదివాడు.. రూ.కోటి కూడబెట్టాడు
అనుకున్నది సాధించాలంటే సంకల్పం, దీక్ష అవసరం. ఈ రోజుల్లో లక్షలు జీతాలు తీసుకునేవారు కూడా మంత్ ఎండ్ వచ్చే సరికి.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే కేవలం 10వ తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదా చేసి.. అందరిచేతా ఔరా అనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.జేబులో రూ. 5000రెడ్దిట్ పోస్టులో వైరల్ అవుతున్న ఓకే పోస్టులో.. తాను దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామం నుంచి ఉండేవాడు. స్వయంగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న తరువాత 2000 సంవత్సరంలో బెంగళూరుకు వచ్చాడు. అప్పుడు అతని వయసు 27 ఏళ్లు. ఆ సమయంలో అతని జేబులో ఉన్న డబ్బు రూ. 5000 మాత్రమే. తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పుకున్నాడు. అతని మొదటి జీతం రూ. 4200 మాత్రమే. చివరగా తీసుకున్న జీతం రూ. 63,000 అని పేర్కొన్నాడు.బెంగళూరు శివార్లలో రూ. 6500లకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందులో అతడు, అతని భార్య, కూతురు మాత్రమే ఉంటారు. వీరి నెలవారీ ఖర్చులు రూ. 25000. గత 25 ఏళ్లలో అతడు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇల్లు మారాడు. అయితే అతడు ఎప్పుడు అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదని వివరించాడు.2024లో పర్సనల్ ఫైనాన్స్.. ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుని అందులో పెట్టుబడి పెట్టడం నేర్చుకున్నాడు. ఇది తన బిడ్డ కోసం దాస్తున్నట్లు పేర్కొన్నాడు. అదృష్టవశాత్తూ వారికి ఎప్పుడూ పెద్ద అనారోగ్యం గానీ.. కష్టాలు గానీ రాలేదని చెప్పాడు.క్రెడిట్ కార్డ్ లేదువివిధ బ్యాంకుల్లో 1 కోటి రూపాయలు. 10,000 రూపాయలు డిపాజిట్లు. ఈక్విటీలో రూ. 65 వేల రూపాయలు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లేదు. 2015 ప్రాంతంలో ఒక స్కూటర్ ఉండేది. చూపు తక్కువగా ఉండటం వల్ల దానిని సరిగ్గా నడపలేకపోవడంతో అమ్మేశాడు. ప్రతిచోటకు నడిచే వెళ్తాడు. ఇప్పటికీ ఒక గుక్క నీరు కూడా తాగకుండా ఐదు కిలోమీటర్లు నడవగలను/జాగింగ్ చేయగలనని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికరాసిన లేదా ప్రింట్ చేసిన రచనలకు ప్రూఫ్ రీడింగ్ పని మాత్రమే చేసేవాడిని. అది తప్పా నేను వేరే ఏ పనీ చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే నా కూతురు చదువు పూర్తయిన తరువాత, పని చేయడం ప్రారంభించాను. నేను ఇప్పటి వరకు కూడబెట్టిన డబ్బుకు కుమార్తె డబ్బు రూ. 2 లక్షలు కలిశాయని చెప్పాడు.నా అనుభవం నుంచే నేను చాలా నేర్చుకున్నాను. విద్య, తెలివితేటలు, ఆరోగ్యం, సమయం అనేవి ఒక వ్యక్తికి పెద్ద ఆస్తులు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా అవసరం అని ఆ వ్యక్తి చెబుతాడు. విలాసాలకు పోకుండా జీవితం గడిపితే ఎవరైనా డబ్బు కూడబెట్టవచ్చు అని చెబుతాడు. -
ఓవైపు జీతాలు పెంపు.. మరోవైపు లేఆప్స్..
దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) 2025 సెప్టెంబర్ 1 నుంచి తన ఉద్యోగులకు వేతనాల పెంపును ప్రారంభించింది. మెజారిటీ సిబ్బందికి 4.5 నుంచి 7 శాతం వరకు జీతాలను పెంచినట్లు తెలుస్తోంది. అత్యుత్తమ పనితీరును కనపరించినవారికి 10 శాతం పెంచినట్లు సమాచారం. ఇంక్రిమెంట్ లెటర్లను కంపెనీ ఉద్యోగులకు అందించే ప్రక్రియను కూడా మొదలుపెట్టేసింది.ఈ ఏడాది టీసీఎస్ తన ఉద్యోగులలో దాదాపు 80% మందికి ఇంక్రిమెంట్లు అమలు చేయనున్నట్లు గత నెలలోనే వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే వేతనాల పెంపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ఆర్ధిక అనిశ్చితులు, సవాలుతో కూడిన వ్యాపార వాతావరణం కారణంగా కొంత ఆలస్యమైంది.ఉద్యోగుల తొలగింపుటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని టీసీఎస్ వెల్లడించింది. ఉద్యోగులలో 2 శాతం.. అంటే సుమారు 12000 మందిని తొలగించే అవకాశం ఉంది. ఇది టెక్ రంగంలో ఆందోళనలు రేకెత్తించింది. ఇలాంటి సమయంలోనే కంపెనీ జీతాలను పెంచి వారికి కొంత ఉపశమనం కల్పించింది. ఉద్యోగులను తొలగించే దిశలో ఇతర టెక్ దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐ కారణంగా భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగులు.. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: డిజిటల్ డైమండ్.. ఈ శతాబ్దం దీనికే!.. నరేంద్ర మోదీ -
ఇండియాలో 600 మాత్రమే!.. అమెరికా బ్రాండ్కు బుకింగ్స్..
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ.. టెస్లా జూలై మధ్యలో భారతదేశంలో అమ్మకాలు ప్రారంభించింది. అప్పటి నుంచి కంపెనీ కేవలం 600 కార్లకు మాత్రమే ఆర్డర్లు పొందింది. అయితే కంపెనీ ఈ ఏడాది 350 నుంచి 500 కార్లను మాత్రమే ఇండియాలో విక్రయించాలని చూస్తోంది. టెస్లా మొదటి బ్యాచ్ సెప్టెంబర్ ప్రారంభంలో షాంఘై నుంచి రానుంది.టెస్లా కంపెనీ ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్ నగరాల్లో మాత్రమే తమ మొదటి డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించనుంది. ఇప్పటికే సంస్థ దేశంలో రెండు డీలర్షిప్లను ప్రారంభించింది. ఛార్జింగ్ స్టేటన్స్ కూడా ఏర్పాటు చేయడంలో టెస్లా నిమగ్నమై ఉంది.టెస్లా మోడల్ వైటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుస్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
ఏఐ ఇన్సూరెన్స్ టూల్స్ను ప్రారంభించిన హైదరాబాద్ కంపెనీ
బీమా రంగాన్ని ఆధునీకరించే దిశగా హైదరాబాద్కు చెందిన టెక్ సంస్థ ఫోరేసాఫ్ట్, అమెరికాకు చెందిన ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్తో చేతులు కలిపింది. బీమా కంపెనీలు, వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత ఆటోమేషన్ టూల్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు ఫోరేసాఫ్ట్ తెలిపింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో రిస్క్ తగ్గించడం, మోసాలను గుర్తించేందుకు ఈ ఏఐ టూల్స్ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చూకూరుస్తాయని పేర్కొంది.ఆరోగ్య బీమా క్లెయిమ్ దాఖలు చేయడం నుంచి ప్రమాదాన్ని నివేదించడం లేదా కొత్తగా క్లెయిమ్ కవరేజీ కోసం దరఖాస్తు చేయడం వరకు వినియోగదారులు ఈ ఏఐ టూల్స్ ద్వారా బీమా సంస్థలతో చర్చించే అవకాశం ఉందని ఫోరేసాఫ్ట్ తెలిపింది. ప్రధానంగా కింది అంశాలపై మెరుగైన సర్వీసులు పొందవచ్చని చెప్పింది.వేగవంతమైన క్లెయిమ్ ప్రాసెసింగ్: ప్రమాదం జరిగిన వెంటనే ఏఐ సిస్టమ్లు ప్రారంభ క్లెయిమ్ అప్లికేషన్ను ఆటోమేట్ చేస్తాయి. మాన్యువల్ పేపర్ వర్క్ను తగ్గిస్తాయి. దాంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.స్మార్ట్ రిస్క్ అసెస్మెంట్: కృత్రిమ మేధ ఇంజిన్లు నిర్మాణాత్మక డేటా (వినియోగదారుల వైద్య చరిత్ర వంటివి)ను విశ్లేషించి ఆ సమాచారాన్ని మదింపు చేస్తాయి.ఫ్రాడ్ డిటెక్షన్: ఏఐ టూల్స్లోని ఇంటిగ్రేటెడ్ ఫ్రాడ్ డిటెక్షన్ మాడ్యూల్స్ అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే పర్యవేక్షిస్తాయి. నిజమైన పాలసీదారులను రక్షిస్తాయి.ఈ సందర్భంగా ఈఎస్ సెర్చ్ కన్సల్టెంట్స్ ప్రెసిడెంట్ మృదుల మునగాల మాట్లాడుతూ..‘ఈ ఏఐ టూల్స్ వల్ల మోసపూరిత క్లెయిమ్లను కట్టడి చేస్తూ.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించవచ్చు’ అని చెప్పారు. ఫోరేసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ వాసు బాబు వజ్జా మాట్లాడుతూ..‘ఇన్సూరెన్స్ కంపెనీల పునరుద్ధరణకు తోడుగా తదుపరి తరం ఏఐ సర్వీసులు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ మరింత స్మార్ట్గా, వేగంగా, పారదర్శకంగా బీమాను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు.ఈ ఒప్పందంలో భాగంగా ఇరుకంపెనీలు ఇన్సూరెన్స్ ఏఐలో నిరంతర ఆర్ అండ్ డీకి మద్దతుగా హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా, మిడిల్ఈస్ట్లో పైలట్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఇంజినీరింగ్, సర్వీస్ డెలివరీలో 100 మందికి పైగా నిపుణులను నియమించుకోవాలని ఫోరేసాఫ్ట్ యోచిస్తోంది.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే..
టెక్ కంపెనీల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లేఆఫ్స్కు బలవుతున్నారు. ఒకే కంపెనీలో 25 ఏళ్లు పని చేసిన 57 ఏళ్ల ఓ వ్యక్తికి లేఆఫ్ ప్రకటించడంతో ఇందుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్లు సంస్థలో పని చేసిన ఆ ఉద్యోగి ఊహించని షాక్కు గురైనట్లు రెడిట్ పోస్ట్లో చెప్పుకొచ్చారు.రెడిట్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘నా వయసు 57 ఏళ్లు. ఒకే కంపెనీలో గత 25 ఏళ్లుగా వివిధ స్థాయుల్లో పనిచేస్తూ ప్రస్తుతం హైరింగ్ మేనేజర్గా ఉన్నాను. నా రిటైర్మెంట్కు ఇంకా కొన్ని నెలల సమయమే ఉంది. కంపెనీ సడెన్గా నాకు లేఆఫ్ ఇస్తున్నట్లు చెప్పింది. ఇది నాకు ఊహించని షాక్. సంస్థ 30 రోజుల నోటీసు పీరియడ్ విధించింది. నన్ను 2-3 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగిగా పరిగణిస్తున్నట్లు అనిపించింది. చాలా వింతగా అనిపిస్తుంది’ అని రాసుకొచ్చారు.ఆ ఉద్యోగి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ను అప్డేట్ చేశాడు. రెజ్యూమెను కస్టమైజ్ చేశాడు. తన పనికి తగినట్లు కాకపోయినా నెలకు రూ.80వేలు–రూ.1లక్ష వేతనం ఉన్న ఉద్యోగం కోసం చూస్తున్నట్లు చెప్పాడు. అతని ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉందని, తక్కువ ఖర్చులతో తన భార్య ఇంటి వ్యవహారాలను చూసుకుంటోందని తెలిపారు. దీనిపై రెడ్డిట్ వినియోగదారులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇప్పుడు ఇదే ఆనవాయితీ..’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘సుదీర్ఘ పదవి విరామం కోసం మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండండి’ అని మరొకరు రిప్లై ఇచ్చారు.ఇదీ చదవండి: లేఆఫ్స్కు వ్యతిరేకమంటూ 4000 మంది ఉద్యోగాల కోత -
లేఆఫ్స్కు వ్యతిరేకమంటూ 4000 మందికి..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతుండడంతో ఉద్యోగాలను ఆటోమేట్ చేస్తూ చాలా కంపెనీలు భారీగా లేఆఫ్స్ విధిస్తున్నాయి. ఇటీవల సేల్స్ఫోర్స్ కంపెనీలో ఏఐ వినియోగం పెరిగిన నేపథ్యంలో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. ఇటీవల లోగాన్ బార్ట్లెట్ పాడ్కాస్ట్లో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ బెనియోఫ్ ఈ లేఆఫ్స్ను ధ్రువీకరించారు. కంపెనీలోని ఉద్యోగులను 9,000 నుంచి 5,000కు తగ్గించినట్లు చెప్పారు.ఉద్యోగుల తొలగింపుపై బెనియోఫ్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగింది. క్లౌడ్ సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తున్న మా కంపెనీ సపోర్ట్ డివిజన్లో దాదాపు 45 శాతం ఉద్యోగాల కోతలు అనివార్యం అయ్యాయి. దాంతో ఈ విభాగంలో గతంలో 9వేల మంది ఉన్న ఉద్యోగులను 5 వేలకు తగ్గించాం. 100 మిలియన్ లీడ్స్ను ఏఐ పరిష్కరిస్తోంది. మానవ శక్తి అవసరం తగ్గింది’ అని చెప్పారు. కంపెనీ అదనపు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు, లీగల్ అడ్వైజర్లను నియమించుకోదని బెనియోఫ్ జులైలో చెప్పారు. కానీ కంపెనీ వినియోగదారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని స్వీకరించడంలో సహాయపడటానికి సేల్స్ సిబ్బందిని చేర్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సేల్స్ఫోర్స్లో జనవరి 2025 నాటికి అన్ని డివిజన్లలో 76,453 మందిని నియమించింది. ఇటీవల 4,000 మందికి లేఆఫ్స్ ప్రకటించడంతో మొత్తం శ్రామిక శక్తిలో ఇది సుమారు 5% ప్రాతినిధ్యం వహించినట్లయింది.అయితే జులై 2025లో ఓ కార్యక్రమంలో బెనియోఫ్ మాట్లాడుతూ.. కృత్రిమ మేధ సామూహిక నిరుద్యోగానికి దారితీయదని చెప్పడం గమనార్హం. కార్మికుల స్థానాన్ని భర్తీ చేయడానికి బదులుగా కృత్రిమ మేధ వాడకం పెరుగుతుందన్నారు. లేఆఫ్స్కు సంబంధించి రెండు నెలల క్రితం బెనియోఫ్ ఆంత్రోపిక్కు చెందిన డారియో అమోడి వంటి ఏఐ స్టార్టప్ సీఈఓలకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఉద్యోగ కోతల పట్ల నిరసన వ్యక్తం చేశారు. అలాంటిది తన కంపెనీలోనే ఇలా 4000 మందికి లేఆఫ్స్ ప్రకటించడం ఏంటని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే.. -
ఆగస్టులో హైరింగ్ 3 శాతం అప్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో దేశీయంగా వైట్–కాలర్ జాబ్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 3 శాతం వృద్ధి చెందింది. ప్రదానంగా ఐటీయేతర రంగాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్నట్లు నౌకరీ జాబ్స్పీక్ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్స్, మేనేజర్లు, అడ్మిని్రస్టేషన్ ఉద్యోగాలను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదిక ప్రకారం ఆగస్టులో అత్యధికంగా 24 శాతం హైరింగ్తో బీమా రంగం అగ్రస్థానంలో నిలి్చంది. ఆతిథ్య (22 శాతం), రియల్ ఎస్టేట్ (18 శాతం) రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీపీవో/ఐటీఈఎస్ (17 శాతం), విద్య (16 శాతం), ఆయిల్..గ్యాస్ (7 శాతం), రిటైల్ (3 శాతం), ఎఫ్ఎంసీజీ (2 శాతం) రంగాల్లో కూడా సానుకూల హైరింగ్ నమోదైంది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. → కొత్త టెక్నాలజీల్లో నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో ఏఐ/ఎంఎల్ ఉద్యోగాలకు హైరింగ్ 54 శాతం ఎగిసింది. అయితే, ఓవరాల్గా ఐటీ/సాఫ్ట్వేర్ సరీ్వసుల రంగంలో నియామకాలు 6 శాతం తగ్గాయి. → బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసుల విభాగంలో హైరింగ్ 11 శాతం, టెలికం/ఐఎస్పీలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. → ఫ్రెషర్ల (0–3 ఏళ్ల అనుభవం) రిక్రూట్మెంట్ 7 శాతం పెరిగింది. ఆతిథ్య, రియల్ ఎస్టేట్, విద్య తదితర ఐటీయేతర రంగాల్లో డిమాండ్ ఇందుకు తోడ్పడింది. → ఓవరాల్గా 10 శాతం హైరింగ్ వృద్ధితో నియామకాలకు సంబంధించి హైదరాబాద్ టాప్ మెట్రో సిటీగా నిలి్చంది. యూనికార్న్లలో (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) రిక్రూట్మెంట్ 45 శాతం ఎగిసింది. -
టారిఫ్ల ప్రభావం.. ఎదుర్కొనేందుకు పరిష్కారం
అమెరికా విధించిన 50% టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. ‘అధిక ఉపాధి కల్పిస్తున్న కొన్ని పరిశ్రమలు అమెరికాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. ఈ ప్రభావం ఎంతన్నది ప్రభుత్వం మదిస్తోంది. తగిన పరిష్కారాల కోసం కృషి చేస్తోంది’ అని చెప్పారు. -
ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎవరంటే.. అందరూ 'ఎలాన్ మస్క్' అని చెబుతారు. అయన ఏం చదువుకున్నారు అంటే మాత్రం.. బహుశా ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో ప్రపంచంలోని ఐదుమంది అత్యంత ధనవంతులు ఏం చదువుకున్నారో తెలుసుకుందాం.ఎలాన్ మస్క్టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల సీఈఓ అయిన ఎలాన్ మస్క్.. తన ప్రాధమిక విద్యను దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలోని పాఠశాలల్లో పూర్తి చేశారు. ఆ తరువాత కెనడాలోని క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్ చదివారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్లో.. పీహెచ్డీ చేయడానికి చేరినప్పటికీ అది పూర్తి చేయలేదని సమాచారం.లారీ ఎల్లిసన్ఒరాకిల్ కో ఫౌండర్ అయిన లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఎలాన్ మస్క్ ఈయనను అత్యంత తెలివైన వ్యక్తిగా ప్రశంసించారు. ఎల్లిసన్ చికాగో యూనివర్సిటీలో చదివారు, కానీ డిగ్రీ పూర్తి చేయలేదు. ఆ తరువాత డిగ్రీ పూర్తి చేయడానికి 'ఇల్లినాయిస్ యూనివర్సిటీ అట్ అర్బనా-షాంపెయిన్'లో చేరారు. కానీ అదే సమయంలో ఆయన తల్లి మరణించడంతో.. డిగ్రీ పూర్తిచేయకుండా ఆపేశారు.మార్క్ జుకర్బర్గ్ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల సమ్మేళనమైన మెటాకు సీఈఓ అయిన.. మార్క్ జుకర్బర్గ్, ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ & సైకాలజీ చదివాడు. కానీ ఫేస్బుక్ను ప్రారంభించిన తరువాత.. డిగ్రీ పూర్తి చేయలేదు.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికజెఫ్ బెజోస్వరల్డ్ టాప్ 10 కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్.. అమెజాన్ వ్యవస్థాపకులు. ఈయన ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ & కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫిజిక్స్ చదవాలనుకున్నారు. కానీ కంప్యూటర్ల పట్ల తనకున్న ఆసక్తితో అతను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు.లారీ పేజ్గూగుల్ కో-ఫౌండర్ అయిన లారీ పేజ్.. ప్రపంచంలోనే ఐదవ ధనవంతుడు. ఈయన మిచిగాన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్.. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశారు. స్టాన్ఫర్డ్లోని పీహెచ్డీ రీసెర్చ్ సమయంలోనే లారీ పేజ్ & సెర్గీ బ్రిన్ కలిసి గూగుల్ సర్చ్ ఆల్గోరిథం అభివృద్ధి చేశారు. -
కనీవినీ ఎరుగని డీల్స్.. ఫెస్టివల్ సేల్స్: ఎప్పుడంటే..
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. ఈ కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ 'ఫెస్టివల్ సేల్స్' ప్రకటించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ వంటి వాటిపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తాయి.అమెజాన్ ఫెస్టివల్ సేల్ తేదీని అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది నవరాత్రి & దీపావళి పండుగ సీజన్లో ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఎప్పటిలాగానే.. ప్రైమ్ సభ్యులకు సేల్ ప్రారంభమయ్యే 24 గంటల ముందు యాక్సెస్ లభిస్తుంది.బ్లాక్బస్టర్ డీల్స్, ట్రెండింగ్ డీల్స్, టాప్ 100 డీల్స్ వంటి అనేక రకాల సదుపాయాలను అమెజాన్ అందించనున్నట్లు తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతో పాటు ఈఎంఐ లావాదేవీలతో సహా ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ కూడా లభించనున్నాయి.ఇదీ చదవండి: ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్టైమ్ రికార్డ్ఇక ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025కి కౌంట్డౌన్ ప్రారంభమైంది. ల్యాప్టాప్లు, టీవీలు, స్పీకర్లు, కెమెరాలు మొదలైనవాటి మీద.. అద్భుతమైన డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సేల్ తేదీకి సంబంధించిన వివరాలను సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ సేల్ ప్రారంభమవ్వనికి ముందే ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యులకు షాపింగ్ చేయడానికి యాక్సెస్ లభిస్తుంది. -
కొత్తవారికే కోటిన్నర జీతం.. కానీ ఒక్కటే కండీషన్..
ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు భారీగా కోటిన్నర జీతమిస్తానంటున్నారు అమెరికాకు చెందిన భారత సంతతి పారిశ్రామికవేత్త దక్ష్ గుప్తా. కానీ ఆయన పెట్టిన కండీషన్ ఒక్కటే. అదేంటంటే తన స్టార్టప్లో ఉద్యోగంలోకి చేరేవాళ్లు వారానికి ఆరు రోజులు, రోజుకు 12-14 గంటలు (9-9-6 rule) పనిచేయాలి.శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ప్రారంభించిన గ్రెప్టైల్ అనే స్టార్టప్ లో పలు ఉద్యోగావకాశాలను దక్ష్ గుప్తా ఇటీవల ప్రకటించారు. ఆయన ప్రకటించిన జీతం బాగానే ఉన్నా రోజుకు అన్నేసి గంటలు పనిచేయాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా 14 గంటల పని అభిప్రాయంపై ఆయన వెనక్కి తగ్గడం లేదు.సిలికాన్ వ్యాలీలో చాలా మంది ప్రొఫెషనల్స్ వారానికి ఆరు రోజులు.. రోజుకు 12 గంటల షిఫ్టులను ఇష్టపూర్వకంగా చేస్తున్నారని గ్రెప్టైల్ ఫౌండర్ దక్ష్ గుప్తా వాదిస్తూనే ఉన్నారు. ఇప్పటి యువతరం వినోదం కంటే క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారని ‘శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్’ వార్తా సంస్థతో జరిగిన సంభాషణలో పేర్కొన్నారు. తన కంపెనీలో జరుగుతున్న పనుల వేగాన్ని ఆయన ఇదివరకే రాకెట్ ప్రయోగంతో పోల్చారు.ఎంట్రీ లెవల్లో, గ్రెప్టైల్లోని ఉద్యోగులు సంవత్సరానికి 140,000 నుండి 180,000 డాలర్లు (సుమారు రూ .1.2–1.5 కోట్లు) మధ్య బేస్ వేతనం పొందవచ్చు. అదనంగా 130,000 నుంంచి 180,000 డాలర్ల విలువైన ఈక్విటీలను పొందవచ్చు. అదే ఏడేళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్కు అయితే బేస్ వేతనం ఏడాదికి 2,40,000 డాలర్ల నుంచి 2,70,000 డాలర్ల వరకు ఉంటుంది.అయితే అన్నీ ఫుల్ టైమ్ ఆఫీసు ఉద్యోగాలు. అంటే రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశమే ఉండదు. తప్పనిసరిగా ఆఫీస్కు వచ్చే పనిచేయాలి. ఇక కాంప్లిమెంటరీ మీల్స్, ట్రాన్స్స్పోర్ట్ ఫెసిలిటీస్, హెల్త్కేర్ కవర్, 401కే కాంట్రిబ్యూషన్ మ్యాచ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. -
ఆగస్టులో రూ.24 లక్షల కోట్లు: యూపీఐ ఆల్టైమ్ రికార్డ్
దేశంలో యూపీఐ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. నేడు ఏ చిన్న వస్తువు కొనాలన్నా.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగస్టులో మాత్రమే 20 బిలియన్ లావాదేవీలు దాటినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది.ఆగస్టులో జరిగిన మొత్తం లావాదేవీలు (20.01 బిలియన్స్).. జులై (19.47 బిలియన్స్) కంటే 2.8 శాతం ఎక్కువ. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. విలువ పరంగా ఆగస్టులో యూపీఐ లావాదేవీలు రూ. 24.85 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 24 శాతం ఎక్కువ అని డేటా చెబుతోంది.సగటున రోజువారీ లావాదేవీల సంఖ్య 645 మిలియన్లకు పెరిగింది. NPCI డేటా ప్రకారం రోజువారీ లావాదేవీ విలువ రూ. 80,177 కోట్లు కావడం గమనార్హం. ఆగస్టు 2న UPI ఒకే రోజులో 700 మిలియన్ లావాదేవీలను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ పెరుగుదల నమోదైంది.ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరికజూన్లో UPI ద్వారా రూ.24.04 లక్షల కోట్ల విలువైన 18.40 బిలియన్ లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత నెలలో ఇది 19.47 బిలియన్ లావాదేవీలకు పెరిగింది, ఇది జూన్తో పోలిస్తే 5.8 శాతం పెరుగుదల, లావాదేవీ విలువ రూ.25.08 లక్షల కోట్లకు పెరిగింది. ఇలా ప్రతి నెలా యూపీఐ లావాదేవీలు పెరుగుతూనే ఉన్నాయి. -
వారెన్ బఫెట్ పంచ సూత్రాలు..
జీవితంలో ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్చుకొని, తన జీవన శైలితో మరెన్నో పాఠాలు నేర్పిస్తున్న బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్ ఇటీవల 94 ఏళ్లు పూర్తి చేసుకొని 95వ వసంతంలోకి ప్రవేశించారు. ఆయన పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని ఆర్థిక సూత్రాలను కింద తెలియజేశాం.బఫెట్ పంచ సూత్రాలుపెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి.నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి.పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది.వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి.ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది.ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్.. -
బ్యాంకులో 14 ఏళ్లు ఎక్స్పీరియన్స్.. రోడ్డుపై బిచ్చగాడిలా..
పైన ఫొటోలో మీరు చూస్తున్న వ్యక్తికి బ్యాంకింగ్ రంగంలో 14 ఏళ్ల అనుభవం ఉందట. కానీ ప్రస్తుతం నిలువ నీడ లేకుండా, చేతిలో చిల్ల గవ్వ లేకుండా రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్నాడు. ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇది జాబ్ మార్కెట్, సామాజిక పరిస్థితులపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది.రోడ్డుపై భిక్షమెత్తుకుంటున్న ఆ వ్యక్తి ఫొటోలను షేర్ చేస్తూ, ఒక రెడ్డిటర్ ఇలా రాసుకొచ్చారు..‘ఈ వ్యక్తిని ఒక ప్రముఖ బెంగళూరు సిగ్నల్ వద్ద చూశాను. ఆయనను చూస్తే ఎంతో హృదయవిదారకంగా ఉంది. ఇది సమాజ వైఫల్యమా లేక వ్యక్తిగత నిర్ణయాల ఫలితమా అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను.’రెడ్డిటర్ షేర్ చేసిన ఫొటోల్లో మొదటి దాంట్లో ఆ వ్యక్తిని రోడ్డు పక్కన ఫుట్పాత్పై బిచ్చగాడిలా కనిపించారు. రెండో ఫొటోలో ఆ వ్యక్తి చేతిలో ఉన్న నోట్ను చూపించారు. అందులో 'నాకు ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, దయచేసి సహాయం చేయండి. నాకు బ్యాంకింగ్ లో 14 ఏళ్ల అనుభవం ఉంది’ అని రాసిఉంది.ఈ పోస్ట్పై రెడ్డిటర్స్ మధ్య చర్చ సాగింది. బెంగళూరు వంటి నగరంలో నిరుద్యోగం ఏంటి అని కొందరు ప్రశ్నించారు. అయితే అతని శారీరక వైకల్యం ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. 'శారీరకంగా సామర్థ్యం ఉంటే డెలివరీ లేదా డ్రైవింగ్ వంటి ఏదో ఒక పని చేసుకోవచ్చని చాలా మంది చెబుతుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉంటే, మానసికంగా విచ్ఛిన్నమై, నిరాశకు గురయ్యే అవకాశం ఉంది’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. -
రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం!
భారతదేశంలో పెరుగుతున్న ప్రైవేట్ విద్య ఖర్చులు పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు అధిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో వార్షిక పాఠశాల ఫీజులు ఏటా విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యను వ్యాపారంగా చూడకూడదనే నియమాన్ని పక్కనపెట్టి చాలా విద్యాసంస్థల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజులు పెంచుతున్నాయి. భారీగా సంపాదన ఉన్న కొద్దిమందికే నాణ్యమైన విద్య పరిమితం అవుతోందా అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. దీనికి ఉదాహరణగా బెంగళూరులో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఓ ప్రముఖ అంతర్జాతీయ పాఠశాల ఫీజుల వ్యవహారం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.బెంగళూరులోని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నట్లు చెబుతున్న ఓ పాఠశాల అధికారిక డాక్యుమెంట్లో అన్ని గ్రేడ్లలో విపరీతమైన ఫీజులున్నట్లు వెల్లడైంది. గ్రేడ్ 1లో పిల్లలను చేర్పించే తల్లిదండ్రులు ఏడాదికి రూ.7.35 లక్షలు, 11, 12 తరగతులకు ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు చెల్లించాలనేలా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. రూ.లక్ష వన్ టైమ్, నాన్ రిఫండబుల్ అడ్మిషన్ ఫీజు కింద చెల్లించాలని స్కూల్ యాజమాన్యం డాక్యుమెంట్లు పేర్కొన్నట్లు చెప్పాయి.It's a free market. Pricing is upto individuals. It's customer choice to pick what they want. All is right in this theory, like most of the theories. Look at the fee structure of one of the good schools in Bengaluru. This is unaffordable even for an IT couple earning a combined… pic.twitter.com/1AvDEQRMyz— D.Muthukrishnan (@dmuthuk) August 31, 2025ఫైనాన్షియల్ ప్లానర్ డి.ముత్తుకృష్ణన్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన పోస్ట్లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. మంచి వేతనం ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఇలాంటి ఖర్చులను నిర్వహించగలరా అని ప్రశ్నించారు. రూ.50 లక్షల ప్రీ ట్యాక్స్ ఆదాయం ఉన్న ఐటీ దంపతులు కూడా ఈ పాఠశాలలో ఇద్దరు పిల్లల ఫీజులు భరించడం కష్టమని ముత్తుకృష్ణన్ అన్నారు.నెటిజన్ల కామెంట్స్..ఈ పోస్ట్పై నెటిజన్లు స్పందిస్తున్నారు. విద్యా ఖర్చులు ఎగువ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థితిగతులను కూడా మార్చేస్తున్నాయని కొందరు తెలిపారు. చాలా మంది దంపతులు పిల్లలను కనడానికి ఎందుకు సంకోచిస్తున్నారో ఇలాంటి ఖర్చుల వల్లే అర్థం అవుతుందని ఒకరు కామెంట్ చేశారు. అయితే ఇంటర్నేషన్ సిలబస్, కేంబ్రిడ్జ్ వంటి అంతర్జాతీయ పాఠ్యాంశాలు, ఆధునిక మౌలిక సదుపాయాల వల్లే ఇలాంటి ఫీజులున్నట్లు కొందరు సమర్థించారు. బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సామాజిక ధోరణులే ఇంత అధిక ఫీజులకు కారణమని ఆరోపించారు.ఇదీ చదవండి: తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఏ ప్రాంతంలో ఎంతంటే.. -
టాటా క్యాపిటల్ ఐపీవో 22న
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఐపీవోలో భాగంగా మొత్తం 47.58 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో 26.58 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచనున్నాయి. తద్వారా 2 బిలియన్ డాలర్లు(రూ. 17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉంది. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లుగా నమోదుకానున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. నెలాఖరు(30)కల్లా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నట్లు అంచనా. కంపెనీలో ప్రస్తుతం టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీ 1.8 శాతం వాటా కలిగి ఉంది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ పెట్టుబడి అవసరాలకుగాను టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. లిస్టింగ్ విజయవంతమైతే దేశీ ఫైనాన్షియల్ రంగంలో అతిపెద్ద ఐపీవోగా రికార్డ్ నెలకొల్పనుంది. 2023 నవంబర్లో టాటా టెక్నాలజీస్ లిస్టయ్యాక, తిరిగి టాటా గ్రూప్ నుంచి మరో దిగ్గజం ఐపీవోకు రానుండటం ప్రస్తావించదగ్గ అంశం! 2022 సెపె్టంబర్లో అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2025 సెపె్టంబర్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంది. ఇప్పటికే అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీలు.. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్(హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సంస్థ), బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
ఏఎఫ్డీతో ఎస్బీఐ ఒప్పందం: ఎందుకంటే?
పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలందించే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ‘ఏజెన్సీ ఫ్రాంకైస్ డి డెవలప్మెంట్’(ఏఎఫ్డీ)తో 100 మిలియన్ యూరోల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాలుష్యకారక ఉద్గారాలను, గ్లోబల్ వార్మింగ్ను, వాతావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గించే దిశగా ఈ నిధులను వినియోగించనున్నట్లు పేర్కొంది. 2030 నాటికి మొత్తం రుణాల పోర్ట్ఫోలియోలో గ్రీన్ ఫైనాన్సింగ్ విభాగం వాటాను 7.5–10 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యానికి ఇది దోహదపడుతుందని ఎస్బీఐ తెలిపింది. -
పేషెంట్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో కొత్త కోర్సు
ముంబయి: పేషెంట్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ లో ‘బాండింగ్’ పేరుతో కొత్త ట్రైనింగ్ మాడ్యూల్ ను ప్రారంభించినట్లు ఎగ్జిక్యూటివ్ కోచింగ్ సంస్థ ఓరియల్ అకాడమీ ప్రకటించింది. హెల్త్ కేర్, మెడికల్, పారామెడికల్, హాస్పిటల్ సపోర్ట్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కోసం ఈ కోర్సును రూపొందించారు.ఆసుపత్రులు అధునాతన వైద్య సంరక్షణ, రోగనిర్ధారణను అందిస్తున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ రోగులతో అర్ధవంతంగా మెలగడంలో కష్టపడుతున్నారు. ఈ అంతరాన్ని పూడ్చడానికి, ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎదుర్కొంటున్న వాస్తవ ప్రపంచ సవాళ్ల చుట్టూ రూపొందించిన ప్రత్యేక శిక్షణ మాడ్యూల్ ‘బాండింగ్’ను ఓరియల్ అకాడమీ ప్రవేశపెట్టింది.‘సమర్థత, సహానుభూతి, రోగి-మొదటి ప్రాధాన్యతగా సేవ సంస్కృతిని పెంపొందించడం ఈ కోర్సు లక్ష్యం. బలమైన సాఫ్ట్ స్కిల్స్ ను పెంపొందించుకోవడం ద్వారా, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. రోగులు, సిబ్బందికి సానుకూల అనుభవాలను సృష్టించవచ్చు" అని ఓరియల్ అకాడమీ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ ఖలీద్ జమాల్ పేర్కొన్నారు. -
రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం..
వ్యాపార ప్రణాళికల్లో భాగంగా వచ్చే అయిదేళ్లలో రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) చైర్మన్ అర్విందర్ సింగ్ సాహ్నీ తెలిపారు. చమురు శుద్ధి, ఇంధన మార్కెటింగ్ విస్తరణతో పాటు పెట్రో కెమికల్స్, రెన్యూవల్ ఎనర్జీ వ్యాపారాలు చేపట్టేందుకు ఈ పెట్టుబడులు వినియోగిస్తామన్నారు.ప్రస్తుతం కంపెనీ రిఫైనింగ్ వార్షిక సామర్థ్యం 80.75 మిలియన్ టన్నులుగా ఉందని షేర్హోల్డర్ల సమావేశంలో ఆయన చెప్పారు. అర్విందర్ సింగ్ సాహ్నీ మాట్లాడుతూ, ‘‘పెట్టుబడుల ద్వారా మేము దేశీయ ఇంధన అవసరాలను స్వయం సమృద్ధిగా తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాం. పెట్రో కెమికల్స్ విభాగంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.అలాగే, రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఐఓసీ కీలక ప్రాజెక్టులను ప్రారంభించనుందని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ పవర్, బయోఎనర్జీ వంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించి, కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు సంస్థ కట్టుబడి ఉందని వివరించారు. -
దేశంలో తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ.. ఎక్కడంటే..
దేశీయంగా తొలి టెంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నోయిడాలో ప్రారంభించారు. అమెరికాకు చెందిన మెటీరియల్ టెక్నాలజీ సంస్థ కార్నింగ్తో కలిసి ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ప్రాథమికంగా రూ. 70 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ప్లాంటు వార్షిక స్థాపిత సామర్థ్యం 2.5 కోట్ల యూనిట్లుగా ఉంటుంది. దీనితో 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ఎల్రక్టానిక్స్ తయారీ పరిశ్రమలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు కీలకంగా ఉంటాయి కాబట్టి రీసెర్చ్ బృందం పరిమాణాన్ని 40 నుంచి 400 మంది సిబ్బందికి పెంచుకునే అవకాశాన్ని పరిశీలించాలని ఆప్టిమస్కి వైష్ణవ్ సూచించారు. వచ్చే ఏడాది వ్యవధిలో రెండో దశ కింద అదనంగా రూ. 800 కోట్ల పెట్టుబడులతో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 20 కోట్లకు పెంచుకోనున్నట్లు ఆప్టిమస్ చైర్మన్ అశోక్ కుమార్ గుప్తా తెలిపారు.దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 16,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రైనోటెక్ బ్రాండ్ పేరిట మేడిన్ ఇండియా టెంపర్డ్ గ్లాస్లను సెప్టెంబర్ నుంచి విక్రయించనున్నట్లు గుప్తా తెలిపారు. అపరిమిత రిప్లేస్మెంట్తో ఏడాది వారంటీ అందించనున్నట్లు వివరించారు. -
ఏఐ టెక్నాలజీ మోసానికి సాధనమవుతోంది: శిఖా గోయెల్
ఐఎస్ఏసీఏ హైదరాబాద్ ఛాప్టర్ 25 సంవత్సరాల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా గవర్నెన్స్, సైబర్సెక్యూరిటీ, ప్రైవసీ నిపుణులను ప్రోత్సహిస్తూ తమ 25వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించింది. ఈ సదస్సు థీమ్: "ట్రస్ట్ ఏఐసీఎస్ - 2025: ఏఐ ఇంటిగ్రేట్స్ గవర్నెన్స్, సైబర్సెక్యూరిటీ, అండ్ ప్రైవసీ" అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరిగింది''.ఈ సదస్సును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్ జనరల్ ఐపీఎస్ శిఖా గోయెల్ ప్రారంభించారు. వారితో పాటు ఐఎస్ఏసీఏ హైదరాబాద్ బోర్డు సభ్యులు, ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సదస్సు కోసం 400 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు. ఇది చాప్టర్ చరిత్రలోనే అత్యధికం. 2024లో జరిగిన సదస్సు విజయం ఈసారి కూడా కొనసాగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో ఐఎస్ఏసీఏ ఒక ముఖ్యమైన నిపుణుల సమూహంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.ఈ సమావేశం గురించి శిఖా మాట్లాడుతూ.. "ISACA హైదరాబాద్ 25 సంవత్సరాల వేడుకలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతిరోజూ కొత్త సైబర్ నేరాలను నివేదిస్తూ మాకు చాలా కాల్స్ వస్తున్నాయి. మన జీవితాన్ని సులభతరం చేయడానికి ఉద్దేశించిన సాంకేతికత ఇప్పుడు మోసానికి ఒక సాధనంగా ఉపయోగించబడుతోంది. నేడు అన్ని ప్రధాన రంగాలలో ఏఐ విస్తృతంగా ఉపయోగించబడుతోంది. ఏఐ వ్యవస్థలను రక్షించడం మరియు జవాబుదారీతనం అనేది ఈ సమయంలో అత్యవసరం. ఏఐని సరిగ్గా, నైతికంగా ఉపయోగించాలనుకుంటే ISACA వంటి వృత్తిపరమైన సంస్థలు చాలా అవసరమని అన్నారు. -
ప్రీ-నర్సరీ ఫీజు రూ.1.85 లక్షలు!.. అవాక్కవుతున్న నెటిజన్లు
భారతదేశంలోని అభివృద్ధి చెందిన నగరాల్లో స్కూల్ ఫీజులు భారీగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ప్రీ-నర్సరీ ఫీజు లక్షల్లో ఉంటుందని ఎప్పుడైనా విన్నారా?.. అయితే ఇప్పుడు తెలుసుకోండి. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.రెడ్డిట్ వినియోగదారు చేసిన పోస్టులో.. బెంగళూరులో చిన్న పిల్లల ప్రీ-నర్సరీ ఫీజు ఏకంగా రూ.1.85 లక్షలు అని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.5,000, వినియోగ వస్తువుల కోసం రూ.28,240 (దీనిని రెండు విడతలుగా విభజించారు). జూన్ నుంచి నవంబర్ కాలానికి ఫీజు రూ.91,200, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మొత్తం రూ.60,800 అని ఉండటం ఇక్కడ గమనించవచ్చు.బెంగళూరులో ప్రీ-స్కూల్ ఫీజు ఇంత మొత్తంలో వసూలు చేయడం సమంజసమేనా? మీ అభిప్రాయం ఏమిటి? ప్రీ-స్కూల్ ఖర్చు ఎంత? నాకు అర్థం కావడం లేదు. ఏది సరైనదో తెలుసుకోవడానికి మీరు నాకు సహాయం చేయగలరా? అని రెడ్దిట్ యూజర్ నెటిజన్లను అడిగారు.ఇదీ చదవండి: బంగారం ధరలు మరింత పెరుగుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని స్కూల్స్ ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఒకరు అన్నారు. నా సోదరి నా మేనకోడలికి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల చెల్లించిందని, దాంతో పోలిస్తే మీ ఫీజు తక్కువే అని మరొకరు అన్నారు. ఫీజులు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా మాయా ఏబీసీడీలు, 123లు నేర్పిస్తున్నారేమో నాకు అర్థం కావడం లేదని ఇంకొకరు అన్నారు. -
భారతీయ కుబేరులు.. కోట్ల విలువైన ప్రైవేట్ జెట్లు
మిలినీయర్ అంటే.. వారు ఎలాంటి విలాసవంతమైన జీవితం గడుపుతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లగ్జరీ వాహనాల నుంచి విశాలమైన భవనాల వరకు.. విలాసవంతగా ఉండేలా చూసుకుంటారు. కొంతమంది ధనవంతులు మరింత ప్రత్యేకంగా ఉండటం కోసం ఖరీదైన ప్రైవేట్ జెట్లను ఉపయోగిస్తారు. ఈ కథనంలో ప్రముఖ భారతీయుల అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ల గురించి తెలుసుకుందాం.ముఖేష్ అంబానీ - బోయింగ్ 737 మ్యాక్స్9బోయింగ్ 737 మ్యాక్స్9 అనేది భారతదేశంలోని ఖరీదైన విమానాల్లో ఒకటి. ఇది ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ జెట్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. బోయింగ్ 737 మ్యాక్స్9 ఎగిరే ప్యాలెస్ లాంటిది. దీని లోపల మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ రూమ్, కిచెన్ వంటివన్నీ ఉన్నాయి. 19 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఈ ప్రైవేట్ జెట్ ధర రూ. 1000 కోట్ల కంటే ఎక్కువని సమాచారం.విజయ్ మాల్యా - ఎయిర్బస్ ఏ319భారతదేశానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా కూడా ఖరీదైన ప్రైవేట్ జెట్ కలిగి ఉండేవారు. 2012 నుంచి ఆర్థిక కుంభకోణాలు.. వివాదాలలో చిక్కుకున్న మాల్యా, ప్రస్తుతం లండన్లో ఉన్నట్లు సమాచారం. ఈయన వద్ద ప్రస్తుతం ఈ జెట్ లేదని తెలుస్తోంది. కానీ ఇది 18 మంది ప్రయాణికులు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక బార్, డైనింగ్ ఏరియా, బెడ్రూమ్ వంటివి కలిగిన ఈ జెట్ ధర రూ. 700 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.అమితాబ్ బచ్చన్ - బాంబార్డియర్ ఛాలెంజర్ 300బాలీవుడ్ నటుడు.. కౌన్ బనేగా కరోడ్పతి హోస్ట్ అమితాబ్ బచ్చన్ వద్ద 'బాంబార్డియర్ ఛాలెంజర్ 300' ఉంది. ఈ జెట్ విశాలమైన క్యాబిన్, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. దీని ధర రూ. 220 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.రతన్ టాటా - డస్సాల్ట్ ఫాల్కన్ 2000టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'రతన్ టాటా' డస్సాల్ట్ ఫాల్కన్ 2000 విమానం ఉపయోగించేవారు. ఇందులో విలాసవంతమైన సదుపాయాలు అందుబాటులో ఉండేవి. ఈ జెట్ ధర రూ. 300 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం.అదార్ పూనవాలా - గల్ఫ్స్ట్రీమ్ G550సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవాలా.. వద్ద గల్ఫ్స్ట్రీమ్ G550 అనే ఖరీదైన విమానం ఉంది. దీని విలువ రూ. 500 కోట్ల కంటే ఎక్కువే. ఇది చాలా స్టైలిష్ జెట్. అదార్ పూనవాలా తన అభిరుచికి తగిన విధంగా దీనిని నిర్మించుకున్నారు. -
పేటీఎం యూపీఐ ఆగిపోతుందా?: గూగుల్ ప్లే అలర్ట్పై కంపెనీ రెస్పాన్స్
పేటీఎం యూపీఐ ఇకపై అందుబాటులో ఉండదని గూగుల్ ప్లే నుంచి వచ్చిన నోటిఫికేషన్ వినియోగదారులలో భయాందోళనలను సృష్టించింది. ఆగస్టు 31 నుంచి యూపీఐ సర్వీసులు నిలిచిపోతాయని గూగుల్ ప్లే హెచ్చరికను జారీ చేసింది. దీనిపై కంపెనీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది.విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని కంపెనీ.. పేటీఎం యూపీఐ సేవలు మూతపడే దశలో ఉన్నాయని వస్తున్న నివేదికలు తప్పుదారి పట్టించేవని స్పష్టం చేసింది. యూజర్లు పేటీఎంలో యూపీఐ చెల్లింపులు చేసినప్పుడు ఎటువంటి అంతరాయం ఉండదు. వినియోగదారులకు.. వ్యాపార లావాదేవీలు రెండూ సజావుగా జరుగుతాయి అని కంపెనీ తెలిపింది.నిజానికి ఇటీవల వచ్చిన నోటిఫికేషన్ యూట్యూబ్ ప్రీమియం లేదా గూగుల్ వన్ స్టోర్ వంటి పునరావృత చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే.. ఒక యూజర్ యూట్యూబ్ ప్రీమియం లేదా గూగుల్ వన్ స్టోరేజ్ ప్లాట్ఫామ్లకు పేటీఎమ్ యూపీఐ చేస్తున్నట్లయితే.. అలాంటి వారు.. తమ పాత @paytm హ్యాండిల్ను.. బ్యాంక్కి లింక్ చేసిన కొత్త హ్యాండిల్కి (@pthdfc, @ptaxis, @ptyes, @ptsbi) మార్చవలసి ఉంటుంది.ఉదాహరణకు మీ యూపీఐ ఐడీ rajesh@paytm అయితే.. అది ఇప్పుడు rajesh@pthdfc లేదా rajesh@ptsbi అవుతుంది. అంటే బ్యాంకు పేరు కూడా చివరి వస్తుందన్నమాట. దీనివల్ల లావాదేవీలకు ఎటువంటి ఆటంకం కలగదు.ఈ అప్డేట్ ఎందుకంటే?నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా పనిచేయడానికి పేటీఎంకు అనుమతి ఇచ్చిన తర్వాత, కొత్త UPI హ్యాండిల్స్కు మారడంలో భాగంగా ఈ అప్డేట్ జరిగింది. ముఖ్యంగా.. కొత్త నిబంధనల ప్రకారం సబ్స్క్రిప్షన్ బిల్లింగ్ సజావుగా సాగడానికి చాలా అనుకూలంగా ఉంటాయి.Paytm UPI continues to work at Google Play ✅ All your regular payments continue to work as usual.You only need to update your UPI handle for recurring payments (like subscriptions). Change it from @paytm to new handles like @pthdfc, @ptaxis, @ptyes or @ptsbi.For example, if…— Paytm (@Paytm) August 29, 2025 -
రూ .303 కోట్ల బోనస్ ప్రకటన.. ఈ టాటా కంపెనీ ఉద్యోగులకు శుభవార్త
టాటా గ్రూప్ సంస్థ టాటా స్టీల్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జంషెడ్పూర్లోని వర్కర్స్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ .303.13 కోట్ల బోనస్ను ఉద్యోగులకు పంపిణీ చేయనున్నట్లు టాటా స్టీల్ తెలిపింది.ఇందులో ట్యూబ్స్ యూనిట్ సహా జంషెడ్పూర్ డివిజన్లకు రూ.152.44 కోట్లు కేటాయించడంతో 11,446 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కంపెనీ తెలిపింది. టాటా వర్కర్స్ యూనియన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, 2024-25 సంవత్సరానికి వార్షిక బోనస్ కింద వర్తించే అన్ని డివిజన్లు, యూనిట్లకు చెందిన అర్హులైన ఉద్యోగులకు మొత్తం రూ .303.13 కోట్లు చెల్లించనున్నట్లు టాటా స్టీల్ ఒక ప్రకటనలో పేర్కొంది.2024-25 సంవత్సరానికి గానూ చెల్లించాల్సిన కనీస బోనస్ (పూర్తి హాజరు వద్ద) రూ .39,004, గరిష్ట బోనస్ (వాస్తవ హాజరు వద్ద) రూ .3,92,213 ఉంటుందని కంపెనీ తెలిపింది. బోనస్ చెల్లింపు (సవరణ) చట్టం, 2015 లో నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ జీతాలు / వేతనాలు స్టీల్ కంపెనీలోని తమ ఉద్యోగులలో ఎక్కువ మంది పొందుతున్నందున, వారు ఈ చట్టం ప్రకారం బోనస్ పొందడానికి అర్హులు కాదని వివరించింది.అయితే తమ పాత సంప్రదాయాలను గౌరవిస్తూ యూనియన్ కేటగిరీలోని ఉద్యోగులందరికీ బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. టాటా స్టీల్ సీఈఓ, ఎండీ టీవీ నరేంద్రన్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ అత్రయీ సన్యాల్, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్లు యాజమాన్యం తరఫున మెమోరాండం ఆఫ్ సెటిల్మెంట్లపై సంతకాలు చేశారు. -
కళ్లుచెదిరే అద్భుతం.. ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇటీవలే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియతుడైన అనంత్ అంబానీ తాజాగా జరిగిన ఆర్ఐఎల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో అరంగేట్రం చేశారు. తొలి ప్రసంగంలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. జామ్నగర్ లో నిర్మిస్తున్న ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్ పురోగతిని తెలియజేస్తూ కళ్లు చెదిరే విషయాలను వెల్లడించారు.టెస్లా ఫ్యాక్టరీకి 4 రెట్లు.. వంద ఈఫిల్ టవర్ల ఉక్కు..ధీరూభాయ్ అంబానీ గిగా ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణ విస్తీర్ణం పరంగా టెస్లా గిగాఫ్యాక్టరీ కంటే నాలుగు రెట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కాంప్లెక్స్ 44 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని అనంత్ అంబానీ తెలిపారు. అంతే కాదు, ఈ కాంప్లెక్స్ 3.4 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 100 ఈఫిల్ టవర్లకు సమానమైన సుమారు 7 లక్షల టన్నుల ఉక్కును నిల్వ చేయగలదని ఆయన ప్రకటించారు.లక్ష కిలోమీటర్ల కేబుల్..అనంత్ ప్రకటించిన గిగా ఎనర్జీ కాంప్లెక్స్ లో చంద్రుడి వద్దకు వెళ్లిరావడానికి ఎంత దూరం ఉంటుందో అంత అంటే దాదాపు లక్ష కిలోమీటర్ల కేబుల్ కూడా ఉంటుంన్నారు. అనంత్ అంబానీ ప్రకారం.. గిగా ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణానికి విస్తృతమైన నిర్మాణ ఆటోమేషన్ మద్దతుతో 50,000 మందికి పైగా కార్మికులు రికార్డు వేగంతో పనిచేస్తున్నారు.కొత్త ప్రాజెక్టులవే.. అనంత్ అంబానీ తన ప్రసంగంలో రూ.75,000 కోట్లకు పైగా విలువైన కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ ప్రాజెక్టులలో నాగోథానేలో 1.2 మెట్రిక్ టన్నుల పీవీసీ ప్లాంట్, దహేజ్లో 2 మిలియన్ పీటీఏ సౌకర్యం, పాల్ఘర్లో 1 మిలియన్ టన్నుల స్పెషాలిటీ పాలిస్టర్ సౌకర్యం ఉన్నాయి. తమ హజీరా కార్బన్ ఫైబర్ ఫెసిలిటీ ప్రపంచంలోని మూడు అతిపెద్ద, ఏరోసాప్స్, డిఫెన్స్ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్లో ఒకటిగా ఉంటుందని అనంత్ అంబానీ వెల్లడించారు. అలాగే జామ్ నగర్ లో స్వయంప్రతిపత్తి కలిగిన రిఫైనరీని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. -
హిటాచీ ఎనర్జీ రూ.300 కోట్ల పెట్టుబడులు
హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ రూ.300 కోట్ల తాజా పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. తద్వారా మైసూరులో ట్రాన్స్ఫార్మర్ ఇన్సులేషన్ మెటీరియల్ తయారీ సామర్థ్యాలను రెట్టింపు చేసుకోనున్నట్టు తెలిపింది. 2024 అక్టోబర్లో ప్రకటించినట్టు భారత్లో మొత్తం రూ.2,000 కోట్ల పెట్టుబడుల్లో ఇది భాగమని పేర్కొంది.తాజా పెట్టబడులతో ట్రాన్స్ఫార్మర్ గ్రేడ్ ప్రెస్బోర్డుల సరఫరాను పెంచుకోనున్నట్టు తెలిపింది. భారత్లో పెరుగుతున్న గ్రిడ్, రెన్యువబుల్ ఎనర్జీ అవసరాలకు మద్దతుగా నిలవడం పట్ల గర్విస్తున్నామని హిటాచీ ఎనర్జీ ఇండియా ఎండీ, సీఈవో ఎన్ వేణు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, వాటి విడిభాగాలకు సంబంధించి భారత్లో, అంతర్జాతీయంగానూ డిమాండ్–సరఫరా మధ్య ఎంతో అంతరం ఉన్నట్టు చెప్పారు.ఈ డిమాండ్ అవసరాలను తీర్చేందుకు వీలుగా విస్తరణ చేపట్టినట్టు తెలిపారు. 2027 సంవత్సరం మధ్య నాటికి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని, భారత్తోపాటు యూఏఈ, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ, ఇండోనేషియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా మార్కెట్లకు సరఫరాను పెంచుకోవచ్చని చెప్పారు. -
కేంద్రానికి రూ.7,324 కోట్లు చెల్లించిన ఎల్ఐసీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి రూ.7,324 కోట్లను డివిడెండ్ కింద ఎల్ఐసీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తానికి చెక్కును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అందజేసినట్టు ప్రకటించింది.ఆగస్ట్ 26న జరిగిన వార్షిక సమావేశంలో డివిడెండ్ పంపిణీకి వాటాదారులు ఆమోదం తెలిపినట్టు వెల్లడించింది. ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ 2025 మార్చి చివరి నాటికి రూ.56.23 లక్షల కోట్లకు చేరుకుందని.. జీవిత బీమా మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్నట్టు తెలిపింది. -
జియో లిస్టింగ్ వచ్చే ఏడాదే..!
వచ్చే ఏడాది(2026) ద్వితీయార్ధంలోగా జియో ప్లాట్ఫామ్స్ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయనున్నట్లు ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ కంపెనీ 48వ ఏజీఎంలో ప్రకటించారు. ఏఐ సంబంధిత భారీ మౌలికసదుపాయాలతో రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరున కొత్త జేవీకి తెరతీయనున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ టెక్ దిగ్గజాలు మెటా, గూగుల్తో భాగస్వామ్యానికి చేతులు కలిపినట్లు వెల్లడించారు. తద్వారా ప్రతి ఒక్కరికీ ఏఐ, ప్రతి చోటా ఏఐ విజన్ను ప్రకటించారు. రిలయన్స్తో కలసి జామ్నగర్ క్లౌడ్ రీజన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఏజీఎంలో వర్చువల్గా పాలుపంచుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్బర్గ్ సైతం రిలయన్స్తో భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. సంస్థ ఓపెన్ సోర్స్ లామా మోడళ్లను జేవీ వినియోగించుకోనున్నట్లు తెలియజేశారు. దేశీ సంస్థలకు ఈ జేవీ గేమ్ చేంజర్గా నిలవనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. రూ. 855 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మెటాతో జేవీకి తెరతీయనున్నారు. జేవీలో ఆర్ఐఎల్కు 70 శాతం, మెటాకు 30 శాతం వాటా లభించనుంది.జియో ప్లాట్ఫామ్స్ ఆర్ఐఎల్కు టెలికం, డిజిటల్ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తున్న జియో ప్లాట్ఫామ్స్లో ఎంతమేర వాటా విక్రయించేదీ ముకేశ్ వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థలో ఆర్ఐఎల్కు 66.3 శాతం వాటా ఉంది. మెటా(ఫేస్బుక్) వాటా 10 శాతంకాగా.. గూగుల్ 7.7 శాతం వాటా కలిగి ఉంది. మిగిలిన 16 శాతం వాటా పీఈ దిగ్గజాల చేతిలో ఉంది. ఐపీవోలో 10 శాతం వాటా ఆఫర్ చేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ విలువను 136–154 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ స్థాయిలో విలువ నమోదైతే ప్రపంచంలోనే ఆరో పెద్ద కంపెనీగా నిలిచే వీలుంది. ఆవిర్భవించిన దశాబ్ద కాలంలో దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించిన జియో వినియోగదారుల సంఖ్య 50 కోట్లను దాటినట్లు సంస్థ చీఫ్ ఆకాశ్ అంబానీ వెల్లడించారు. → జియోఫ్రేమ్స్ పేరుతో జియో స్మార్ట్గ్లాస్లోకి ప్రవేశించింది. చేతులు వినియోగించకుండా కాల్స్, మ్యూజిక్, వీడియో రికార్డింగ్, ఏఐ వాయిస్ అసిస్టెంట్ తదితరాలను వివిధ భాషలతో నిర్వహించవచ్చు.→ వాల్ట్ డిస్నీ ఇండియా విలీనంతో ఏర్పాటైన జియోహాట్స్టార్ రెండో పెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. 34% టీవీ మార్కెట్ వాటా దీని సొంతం.రిలయన్స్ రిటైల్.. 40,000 కోట్లు ఆసియాలోకెల్లా అతిపెద్ద ఏకీకృత ఫుడ్ పార్క్ల ఏర్పాటుకు రిలయన్స్ రిటైల్ రూ. 40,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వీటిలో ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, సస్టెయినబుల్ టెక్నాలజీలు వినియోగించనున్నట్లు సంస్థ ఈడీ ఈషా అంబానీ పేర్కొన్నారు. మూడేళ్లలో వార్షికంగా ఆదాయంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఎఫ్ఎంసీజీ బిజినెస్(ఆర్సీపీఎల్)ను 8 రెట్లు పెంచే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఆదా యాన్ని రూ. లక్ష కోట్లకు చేర్చాలని ఆశిస్తోంది.ఓ2సీ... భారీ విస్తరణఆయిల్ 2 కెమికల్స్ విభాగంలో కొత్త ప్రాజెక్టులపై రూ. 75,000 కోట్ల పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు. ఏజీఎంలో తొలిసారి ప్రసంగించారు. 2035కల్లా నికర కర్బన రహిత లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. మొబిలిటీ విభాగంలో జియో–బీపీ ఇంధన రిటైల్ నెట్వర్క్ను విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవీ చార్జింగ్, బ్యాటరీల స్వాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వేగంగా పెంచుతున్నట్లు అనంత్ తెలియజేశారు. n న్యూ ఎనర్జీ విభాగం రానున్న 5–7 ఏళ్లలో ఓ2సీ బిజినెస్ను అధిగమించనున్నట్లు ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. 2028 కల్లా రెట్టింపు ఇబిటాను సాధించే లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. 2026 కల్లా బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు వేసింది. 2032 కల్లా 3 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యంపై కంపెనీ కన్నేసింది. -
సోదరిని చూడటానికి వెళ్లి గూగుల్ సీఈఓతో.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే
గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ను కలుసుకోవడం కొంత కష్టమే. అపాయింట్మెంట్, టైమ్ వంటి అనేక రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అయితే అనుకోకుండా పిచాయ్ను కలుసుకుంటే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేరు. అలాంటి అనుభవమే ఓ యువకునికి ఎదురైంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో నా సోదరిని.. చూడటానికి వెళ్ళినప్పుడు, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ను కలుసుకున్నారు. ఆ అనుభూతిని మరపురానిది అని ఆకాష్ అనే ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టును దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. సుందర్ పిచాయ్ ని చూస్తున్నావా.. ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడివి అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు సుందర్ పిచాయ్ అద్భుతమైన వ్యక్తి అని అన్నారు.visited my sister @Google HQ today and ran into the head honcho himself! mr @sundarpichai it was a pleasure, do check out @tryramp 🤝 pic.twitter.com/e0ns2MwdEI— Akash (@akashtronaut) August 27, 2025 -
ఏడేళ్లలో మహిళల ఉపాధిరేటు రెట్టింపు: కార్మిక శాఖ
మహిళల ఉపాధి రేటు గత 7ఏళ్లలో దాదాపు రెట్టింపైనట్లు కార్మిక శాఖ తాజాగా పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2017 - 18లో స్త్రీల ఉపాధి రేటు 22 శాతంకాగా.. 2023–24కల్లా 40.3 శాతానికి ఎగసింది. మరోపక్క ఇదే కాలంలో నిరుద్యోగ రేటు 5.6 శాతం నుంచి 3.2 శాతానికి దిగివచ్చింది. 2047కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 70 శాతానికి చేరుకోవడం కీలకంగా నిలవనున్నట్లు తెలియజేసింది.నియమితకాల శ్రామిక శక్తి సర్వే(పీఎల్ఎఫ్ఎస్) గణాంకాల ప్రకారం గత 7ఏళ్లలో మహిళా ఉపాధి రేటు(డబ్ల్యూపీఆర్) దాదాపు రెట్టింపైంది. వెరసి భారత్లో మహిళా ఉద్యోగుల సంఖ్య ప్రస్తావించదగిన స్థాయిలో బలపడింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ రేటు(యూఆర్) సైతం 2017–18లో నమోదైన 5.6 శాతం నుంచి 2023 - 24కల్లా 3.2 శాతానికి వెనకడుగు వేసింది. ఇది స్త్రీలకు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలను ప్రతిబింబిస్తున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది.గ్రామాలలో ఇది మరింత అధికంగా బదిలీ అయినట్లు వెల్లడించింది. పట్టణాలలో ఉపాధి రేటు 43 శాతంకాగా.. గ్రామీణంలో మహిళా ఉద్యోగుల రేటు 96 శాతం జంప్చేసినట్లు తెలియజేసింది. 2025 భారత నైపుణ్య నివేదిక ప్రకారం దేశీ గ్రాడ్యుయేట్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 55 శాతంమందికి ఈ ఏడాది ఉపాధి లభించనున్నట్లు పేర్కొంది. 2024లో ఇది 51.2 శాతంగా నమోదైంది. -
2000 బెడ్లతో మెడికల్ సిటీ.. నీతా అంబానీ కీలక ప్రకటన
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన రిలయన్స్ ఫౌండేషన్.. ముంబై నడిబొడ్డున 2,000 పడకల అత్యాధునిక మెడికల్ సిటీ నిర్మిస్తోంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుందని 'నీతా అంబానీ' రిలయన్స్ ఫౌండేషన్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.సంస్థ నిర్మిస్తున్న మెడికల్ సిటీ, కేవలం మరో హాస్పిటల్ మాత్రమే కాదు. ఇది భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలకు కొత్త మార్గదర్శి. ఇక్కడ ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్, లేటెస్ట్ మెడికల్ టెక్నాలజీ వంటివాటితో పాటు.. ప్రపంచంలోని కొంతమంది అత్యుత్తమ వైద్యులు ఉంటారని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్పర్సన్ నీతా అంబానీ పేర్కొన్నారు.భవిష్యత్ తరాల ఆరోగ్య సంరక్షణ కోసం, నిపుణులను పెంపొందించడమే లక్ష్యంగా.. ఈ మెడికల్ సిటీలో ఒక మెడికల్ కాలేజీ కూడా ఉంటుందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇది మన దేశానికి గర్వకారణమవుతుందని, ప్రపంచమే మనవైపు చూస్తుందని అన్నారు. ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ 10 సంవత్సరాల సేవలను గుర్తుచేసుకుంటున్న సందర్భంగా నీతా అమ్బనీ ఈ ప్రకటన చేశారు.ఇదీ చదవండి: జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీభారతదేశంలోని అగ్రశ్రేణి మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన 'సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్' ఇప్పటివరకు 3.3 మిలియన్లకు పైగా రోగులకు సేవలందించింది. ఇందులో కూడా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి వాటికోసం జీవన్ అనే కొత్త విభాగం ప్రారంభించనున్నట్లు.. లేటెస్ట్ పీడియాట్రిక్ ఆంకాలజీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు నీతా అంబానీ వివరించారు.కోస్టల్ రోడ్డు గార్డెన్లుముంబైవాసులను పకృతికి దగ్గర చేసే మరో ఆసక్తికర అభివృద్ధి కార్యక్రమాన్ని నీతా అంబానీ ప్రకటించారు. నగరంలో కోస్టల్ రోడ్డు గార్డెన్లు తీర్చిదిద్దే కార్యక్రమాన్ని రిలయన్స్ ఫౌండేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సముద్ర తీర రోడ్ల చెంతన సుమారు 130 ఎకరాల్లో పచ్చని, ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యాన వనాలు, వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. 48th #RILAGM | Nita Ambani, Founder Chairperson, Reliance Foundation, addresses the Annual General Meeting. - Reached 87 m people across India through Reliance Foundation in 15 years- New 2,000-bed medical city in Mumbai- Touched the lives of 23 m children- Sir HN Reliance… pic.twitter.com/GEyfsRMfHC— CNBC-TV18 (@CNBCTV18News) August 29, 2025 -
జియో ఐపీఓ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన ముకేశ్ అంబానీ
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో.. 2026 ప్రథమార్థంలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం దాఖలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'ముఖేష్ అంబానీ' ప్రకటించారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు.2026 ప్రథమార్థం నాటికి జియోను లిస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది అన్ని పెట్టుబడిదారులకు చాలా ఆకర్షణీయమైన అవకాశంగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానని ముకేశ్ అంబానీ అన్నారు. అంతే కాకుండా జియో ఇప్పుడు విదేశాలలో కూడా తన కార్యకలాపాలను విస్తరించి.. సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేస్తుందని ఆయన ప్రకటించారు.50 కోట్ల యూజర్లురిలయన్స్ జియో ఇప్పటికి 500 మిలియన్స్ లేదా 50 కోట్ల యూజర్లను కలిగి ఉంది. మరో వారంలో జియో ప్రారంభమైన 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది జియో ఫ్యామిలీ సాధించిన విషయం. ఇది చాలా గర్వంగా ఉందని ముకేష్ అంబానీ అన్నారు. జియో తన సేవలను దేశంలో విస్తృతంగా అందిస్తోంది. నేడు లక్షలాది మంది భారతీయులు ఈ సేవలను పొందుతున్నారని వెల్లడించారు.VIDEO | Reliance Industries Chairman and MD Mukesh Ambani addresses the 48th Annual General Meeting. He says, "Today, it is my proud privilege to announce that Jio is making all arrangements to file for its IPO. We are aiming to list Jio by the first-half of 2026, subject to all… pic.twitter.com/eyw5PI6qMh— Press Trust of India (@PTI_News) August 29, 2025 -
కష్టపడి కార్పొరేట్ టైకూన్గా ఎదిగిన 34 ఏళ్ల యువకుడు
జీవితంలో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యామన్నది ముఖ్యం కాదు. ఎక్కడికి చేరతామన్నదే మన విలువను నిర్ణయిస్తుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి, విద్యార్థి దశ నుంచే కష్టపడుతూ, మూడు విభిన్న రంగాల్లో.. సాఫ్ట్వేర్, ఆటోమొబైల్, మీడియాలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి ముండ్రు ఫణీంద్ర. ఈయన కథ కేవలం వ్యాపార విజయమే కాదు, పట్టుదలతో కలల్ని సాకారం చేసుకున్న ఒక నిజ జీవిత ఉదంతం. జీవితంలో సాధించాలన్న తపన, సాధించేవరకు ఆగని కృషి; ఈ రెండు గుణాలే తనను నేడు విశిష్టమైన వ్యక్తిని చేశాయి.1990 సెప్టెంబర్ 19న జన్మించిన ఫణీంద్ర, చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, విద్య పట్ల గౌరవం వంటి విలువలను అలవాటు చేసుకున్నారు. తండ్రి ముండ్రు అబ్రహం నిబద్ధత, తల్లి ముండ్రు మణి సహనం ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి. సోదరి మాతంగి రమ్యావిద్యాసాగర్ ఎల్లప్పుడూ అండగా నిలిచి, ప్రతి అడుగులో ప్రోత్సాహం అందించారు. ఈ కుటుంబ బంధమే ఆయన ప్రతి విజయానికి పునాది. ఫణీంద్ర చిన్నప్పటి నుంచే కేవలం చదువు మీదే కాకుండా, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించుకున్నారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి, ఏ పని చేసినా నాణ్యతతో చేయాలనే పట్టుదల ఆయన విజయసుత్రాలు. ఈ విలువలు, ఆయన తల్లిదండ్రులు నేర్పిన జీవన సూత్రాలు, ఆయన ప్రతి నిర్ణయంలో ప్రతిఫలించాయి.బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న సమయం నుంచే ఫణీంద్ర స్వతంత్రంగా పనిచేయడం మొదలుపెట్టారు. గూగుల్ ఆఫ్లైన్ అసైన్మెంట్లు చేసి, టెక్నాలజీ ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. ఆ సమయంలోనే దేశ, విదేశాల కస్టమర్ల కోసం అనేక వెబ్సైట్లు డిజైన్ చేసి, సాంకేతిక నైపుణ్యాలలోనూ పట్టు సాధించారు. చదువుతో పాటు చేసిన ఈ ప్రాజెక్టులు ఆయనలో విశ్వాసాన్ని పెంచి, పెద్ద స్థాయి ప్రాజెక్టులను తీసుకునే ధైర్యాన్ని ఇచ్చాయి.దాదాపు పదకొండు సంవత్సరాల కృషి, వ్యూహాత్మక ఆలోచన, నిరంతర శ్రమతో ‘దెనిసా టెక్ సాఫ్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ కస్టమర్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, సమయానికి వినూత్న పరిష్కారాలు అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పారదర్శక విధానాలు, నాణ్యతకు ప్రాధాన్యత, సమయపాలనలో రాజీపడని ధోరణి ఈ సంస్థ విజయానికి కారణమయ్యాయి. ఫణీంద్ర నాయకత్వంతో పాటు నాణ్యతతో కూడిన ప్రమాణాలు, బృందంపై నమ్మకం, సృజనాత్మకతకు ప్రోత్సాహం; కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. టెక్నాలజీ రంగంలో విజయాలను అందుకున్న తర్వాత, ఆటోమొబైల్ రంగంలో కూడా అడుగుపెట్టారు. తన భార్య స్రవంతితో కలిసి అబిగైల్ ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. తమ కుమార్తె పేరుతోనే కంపెనీకి పేరు పెట్టడం ద్వారా వ్యాపారానికి కుటుంబ అనుబంధాన్ని జోడించారు. కస్టమర్ విశ్వాసం, పారదర్శక సేవలు, నాణ్యత.. ఇవే అబిగైల్ విజయానికి ప్రధానమైన మూలాలు.ఫణీంద్ర భార్య స్రవంతి వ్యాపార నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతూ, ప్రతి సందర్భంలో అండగా నిలిచారు. పిల్లలు అబిగైల్, మాల్విన్ అబ్రహం ఆయన ప్రతీ విజయానికి ప్రేరణ. వ్యాపారాల్లో ఎప్పుడూ మార్పులు, పోటీలు, అనిశ్చితి సహజం. ఫణీంద్ర ఈ సవాళ్లను వెనుకడుగు వేయడానికి కారణంగా కాకుండా, కొత్త అవకాశాలుగా మలచుకున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రారంభ దశలో నమ్మకం సంపాదించడం, క్లయింట్లను దీర్ఘకాలంలో ఉండేలా చేయడం పెద్ద సవాల్. కానీ, ప్రతి ప్రాజెక్ట్ను సమయానికి, నాణ్యతతో పూర్తి చేయడం ద్వారా ఆ సవాలును అధిగమించారు. అందుకే క్రమంగా అంతర్జాతీయ క్లయింట్ల వరకు ఈ సంస్థ పరిధి విస్తరించింది.ఫణీంద్ర భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో తన వ్యాపార పరిధిని విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ ఆధారిత సొల్యూషన్లపై దృష్టి సారించడం, ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీసింగ్, కస్టమైజేషన్ విభాగాలను ప్రవేశపెట్టడం ఆయన ప్రణాళికలో ఉన్నాయి. అలాగే, సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులపై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నారు. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, చిన్న వ్యాపారాలకు డిజిటల్ టూల్స్ అందించడం, పర్యావరణ స్నేహపూర్వక వ్యాపార మోడల్స్ను రూపొందించడం ఆయన భవిష్యత్ కార్యాచరణలో భాగం.ముండ్రు ఫణీంద్ర జీవన ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయగాథ కాదు, అది ఒక స్పష్టమైన సందేశం కూడా. పట్టుదల, కృషి, నిజాయితీ, స్పష్టమైన దిశ ఉంటే ఏ కల అయినా నిజం కావచ్చని ఆయన నిరూపించారు. విద్యార్థి దశలోనే అనుభవాన్ని సంపాదించడం నుంచి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థలను స్థాపించడం వరకు, ఆయన ప్రతి అడుగూ ప్రణాళికాబద్ధంగానే కాక, విలువలతో నిండినదే. తన కుటుంబం మద్దతుతో, తన సొంత శ్రమతో, విభిన్న రంగాలలో సుస్థిర స్థానం సంపాదించడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా తన వ్యాపారాలను నడపడం ఆయన ప్రత్యేకత. తరతరాలకు ప్రేరణగా నిలిచే ఈ ప్రయాణం ప్రతి ఒక్కరికీ ‘స్వప్నాలను కేవలం చూడకండి, వాటిని సాధించడానికి శ్రమించండి’ అనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. -
నెట్వర్క్ విస్తరణలో అమెజాన్
పండుగ సీజన్ డిమాండ్కి తగ్గట్లు సర్వీసులు అందించే దిశగా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన నెట్వర్క్ను మరింతగా విస్తరించింది. కొత్తగా 12 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు (స్మార్ట్ గిడ్డంగులు), ఆరు సార్టింగ్ సెంటర్లను ప్రారంభించింది. దీనితో దాదాపు ఒలింపిక్ గేమ్స్ స్థాయి 100 స్విమ్మింగ్ పూల్స్కి సమానమైన 86 లక్షల ఘనపుటడుగుల నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. వైజాగ్, కృష్ణగిరి తదితర అయిదు నగరాల్లో తొలిసారిగా ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు వివరించింది.ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖత్రివేండ్రం, రాజ్పురా తదితర ఆరు ప్రాంతాల్లో సోర్ట్ సెంటర్లను నెలకొల్పినట్లు తెలిపింది. కొనుగోలుదారులకు మరింత వేగంగా ఉత్పత్తులను అందించడానికి విక్రేతలకు ఇవి ఉపయోగపడతాయని వివరించింది. వీటితో ఫుల్ఫిల్మెంట్, సోర్టేషన్ అసోసియేట్స్, టీమ్ లీడ్స్, ప్రాసెస్ అసిస్టెంట్స్లాంటి వేల కొద్దీ ఫుల్టైమ్, పార్ట్టైమ్ ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని అమెజాన్ పేర్కొంది. -
ఎయిర్లైన్స్.. నష్టాలు డబుల్!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వివాదాలు, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశీ విమానయాన రంగం నష్టాలు రెట్టింపు స్థాయిలో ఉండొచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ. 5,500 కోట్ల స్థాయిలో ఉండగా ఈసారి రూ. 9,500–10,500 కోట్ల స్థాయిలో ఉండొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, 2022, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా నమోదైన రూ. 21,600 కోట్లు, రూ. 17,900 కోట్లతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని వివరించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 4–6 శాతం వృద్ధితో 17.2–17.6 కోట్లుగా నమోదు కావచ్చని ఇక్రా తెలిపింది.ఇది గతంలో వేసిన 7–10 శాతం అంచనాల కన్నా తక్కువ కావడం గమనార్హం. ‘ఒకవైపు విమానాల డెలివరీలు పెరుగుతున్న తరుణంలో ప్యాసింజర్ల రద్దీ తగ్గడం వల్ల భారతీయ ఏవియేషన్ పరిశ్రమ నష్టాలు 2025 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 5,500 కోట్లతో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగి రూ. 9,500 – 10,500 కోట్లకు చేరే అవకాశం ఉంది‘ అని ఇక్రా వివరించింది.సీమాంతర ఉద్రిక్తతలతో సర్విసుల్లో అంతరాయాలు, ఫ్లయిట్ల రద్దు, ఎయిరిండియా విమాన దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణాలపై సందిగ్ధతలు తదితర అంశాల వల్ల తొలి త్రైమాసికంలో ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 4.4 శాతానికి పరిమితమైనట్లు తెలిపింది. అలాగే, రాబడులు కూడా 4–5 శాతం తగ్గాయని వివరించింది. సుదీర్ఘ కాలం పాటు వర్షాలు కొనసాగడంతో జూలై–ఆగస్టులో కూడా విమాన ప్రయాణాలపై ప్రభావం పడి ఉంటుందని, ఇక అమెరికా టారిఫ్లతో తలెత్తే వాణిజ్య ఉద్రిక్తతలు సైతం రాబోయే త్రైమాసికాల్లో వ్యాపార సెంటిమెంట్లను దెబ్బతీసి, ప్రయాణాలపై పునరాలోచనలో పడే పరిస్థితి ఏర్పడవచ్చని ఇక్రా తెలిపింది. జూలైలో తగ్గిన ప్రయాణికులు.. దేశీయంగా జూలైలో విమాన ప్రయాణికుల రద్దీ 2.94 శాతం క్షీణించి 1.26 కోట్లకు పరిమితమైంది. గతేడాది జూలైలో 1.29 కోట్ల మంది దేశీ రూట్లలో ప్రయాణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం జనవరి–జూలై మధ్య కాలంలో ప్రయాణికుల సంఖ్య 9.77 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 9.23 కోట్లతో పోలిస్తే 5.9 శాతం పెరిగింది. జూలైలో ఎయిరిండియా గ్రూప్ మార్కెట్ వాటా 26.2 శాతంగా, ఇండిగో 65.2%, ఆకాశ ఎయిర్ 5.5 శాతం, స్పైస్జెట్ వాటా 2 శాతంగా ఉంది. ఇండిగో అత్యధికంగా 82.15 లక్షల మందిని, ఎయిరిండియా గ్రూప్ 33.08 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. -
ఇండియా బుల్లెట్ రైలు: రెడీ అవుతున్న స్టేషన్లు చూస్తారా?
దేశంలో బుల్లెట్ రైలు పరుగులకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రారంభానికి ఇంక ఒక్క అడుగు దూరంలోనే ఉందని, స్టేషన్లు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని పేర్కొంటూ భారతీయ రైల్వే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాటి ఫొటోలను షేర్ చేసింది.ముంబై-అహ్మదాబాద్ కారిడార్కు సంబంధించి గుజరాత్లోని బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు దాదాపు పూర్తయ్యాయని ‘ఎక్స్’లో ఇండియన్ రైల్వేస్ పోస్ట్ చేసింది. ఆధునిక డిజైన్, సాంస్కృతిక గుర్తింపు, అంతరాయం లేని కనెక్టివిటీ, పర్యావరణ అనుకూల లక్షణాలతో, స్టేషన్లు ప్రయాణికుల సౌకర్యాన్ని పునర్నిర్వచిస్తాయని, ప్రయాణంలో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేస్తాయని పేర్కొంది.ఎన్ని స్టేషన్లు, ఎక్కడెక్కడ?ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. అవి ముంబై (బాంద్రా-కుర్లా కాంప్లెక్స్), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి.వీటిలో నాలుగు స్టేషన్లు మహారాష్ట్ర (ముంబై, థానే, విరార్, బోయిసర్), ఎనిమిది గుజరాత్ (సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి)లో ఉన్నాయి.ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో గుజరాత్ లో 348 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ గుండా 4 కిలోమీటర్లు వెళుతుంది.బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలుబుల్లెట్ రైలు గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్లు, మొత్తం ప్రయాణానికి 2 గంటల 7 నిమిషాలు పడుతుందని భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జపనీస్ షింకన్ సేన్ ట్రాక్ సిస్టమ్ ఆధారంగా జె-స్లాబ్ ట్రాక్ సిస్టమ్ ఉంటుంది. ప్రాంతాల వారీగా చూస్తే, కారిడార్లో ఏడు పర్వత సొరంగాలు (మహారాష్ట్రలో ఆరు, గుజరాత్లో ఒకటి), 24 నదీ వంతెనలు (20 గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి) ఉన్నాయి. The #BulletTrain stations on the Mumbai–Ahmedabad corridor in Gujarat are nearing completion. With modern design, cultural identity, seamless connectivity and eco-friendly features, the stations will redefine passenger comfort and set new benchmarks in travel. pic.twitter.com/2olttW6Mnb— Ministry of Railways (@RailMinIndia) August 28, 2025 -
వాటర్ ప్యూరిఫయర్స్పై జీఎస్టీ తగ్గించండి: ఆర్థికశాఖకు వినతి
న్యూఢిల్లీ: నీటి శుద్ధి యంత్రాలు (water purifiers), వాటి ఫిల్టర్లు, సంబంధిత సేవలపై ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని వాటర్ క్వాలిటీ ఇండియా అసోసియేషన్ (WQIA) కోరింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. నీటి శుద్ధి యంత్రాలను సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశమని ఆ లేఖలో పేర్కొంది. సురక్షితమైన తాగునీటిని విలాసవంతమైన వస్తువుగా కాకుండా నిత్యావసర వస్తువుగా పరిగణించాలని కోరింది.లేఖలోని ప్రధాన అంశాలునీటి శుద్ధి యంత్రాలపై 18% జీఎస్టీ విధించడం వల్ల అవి ఎయిర్ కండిషనర్లు, కార్ల మాదిరిగా అధిక పన్ను పరిధిలోకి వస్తున్నాయి. అయితే, ఇవి ప్రజల ఆరోగ్యానికి అత్యంత అవసరం అని వాటర్ క్వాలిటీ ఇండియా అసోసియేషన్ వాదించింది.దేశంలో ఎలక్ట్రిక్ వాటర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించే కుటుంబాల శాతం కేవలం 6% మాత్రమే ఉందని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది దాదాపు 20%గా ఉందని గుర్తు చేసింది. అధిక జీఎస్టీ రేటు తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ప్రజలకు వీటిని కొనేందుకు అడ్డంకిగా మారిందని తెలిపింది.20 లీటర్ల వాటర్ జార్లపై ప్రస్తుతం 12% జీఎస్టీ ఉన్నప్పటికీ, అది 5%కి తగ్గించవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో నీటి శుద్ధి యంత్రాలపై పన్ను 18% వద్దే ఉండటం విధానపరమైన వైరుధ్యాన్ని సృష్టిస్తుందని అసోసియేషన్ పేర్కొంది. -
హైదరాబాద్లో ఇంటర్నెట్ అంతరాయం.. సెల్యులార్ ఆపరేటర్ల ఆగ్రహం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది కొనసాగిస్తున్న, చట్టవిరుద్ధమైన ఫైబర్ కోతలను సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఖండించింది. ఆగస్టు 22న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ ఈ చర్యలు కొనసాగుతున్నాయని అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.నగరంలోని బంజారాహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, కొండాపూర్, హబ్సిగూడ, చంపాపేట్, మణికొండ, సికింద్రాబాద్, కొంపల్లి తదితర ప్రాంతాల్లో ఫైబర్ కోతలు ఎక్కువగా నమోదవుతున్నాయని, దీంతో టెలికాం ఫైబర్ తెగిపోవడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సీఓఏఐ తెలిపింది.గత కొన్ని రోజులుగా ఇది పరిస్థితిని మరింత దిగజార్చిందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన కనెక్టివిటీపై ప్రభావం చూపుతోందని తెలిపింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆగస్టు 25న టీజీఎస్ పీడీసీఎల్ కు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించినప్పటికీ, మళ్లీ ఫైబర్ కోతలతో ఈ ఉత్తర్వును స్పష్టంగా ఉల్లంఘిస్తూనే ఉందని సీఓఏఐ ఆక్రోశించింది.టెలికమ్యూనికేషన్స్ యాక్సెస్ అనేది కేవలం ఒక సేవ మాత్రమే కాదని, ఇది నేటి డిజిటల్ యుగంలో ప్రాథమిక హక్కు, జీవనాధారమని సీఓఏఐ తెలిపింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి, కీలకమైన టెలికాం మౌలిక సదుపాయాల రక్షణను నిర్ధారించడానికి, ఈ పునరావృత ఉల్లంఘనలకు పాల్పడినవారిని చట్ట ప్రకారం బాధ్యులను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని అసోసియేషన్ ప్రకటనలో కోరింది. -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.నిషేధానికి కారణంఅమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.ఆందోళలో వ్యాపార వర్గాలుయూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.Let me remind the US once again - we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.I urge every… pic.twitter.com/PhBsVNSJHe— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025 -
ఎస్బీఐ–ఫ్లిప్కార్ట్ కొత్త క్రెడిట్ కార్డ్.. క్యాష్బ్యాక్ల కోసం..
ఎస్బీఐ కార్డ్ సంస్థ ఫ్లిప్కార్ట్తో కలసి ఒక కో–బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, ఎస్బీఐ ఎండీ అశ్విని కుమార్ తివారీ సమక్షంలో ‘ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్’ను ఆవిష్కరించినట్టు ఎస్బీఐ కార్డ్ ప్రకటించింది.షాపింగ్పై క్యాష్బ్యాక్ ప్రయోజనాలతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. ఈ కార్డుతో మింత్రాపై కొనుగోళ్లు చేస్తే 7.5 శాతం, ఫ్లిప్కార్ట్, షాప్సి, క్లియర్ట్రిప్పై చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చని ఎస్బీఐ కార్డ్ తెలిపింది.రివార్డులను తిరిగి ఫ్లిప్కార్ట్పై కొనుగోళ్లకు, ట్రావెల్ బుకింగ్లకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఫ్లిప్కార్ట్ యాప్, ఎస్బీఐ కార్డ్ డాట్ కామ్ నుంచి ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అదనపు ప్రయోజనాలురూ.1,250 విలువైన వెల్కమ్ బెనిఫిట్స్ (ఇ-గిఫ్ట్ కార్డులు, Cleartrip వౌచర్లు).రూ.3.5 లక్షల వార్షిక ఖర్చుతో రిన్యూవల్ ఫీజు రివర్సల్.1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ (రూ.400 వరకు/స్టేట్మెంట్ సైకిల్). -
సెంచురీ పల్ప్పై సీసీఐకి ఐటీసీ దరఖాస్తు
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ తాజాగా ఆదిత్య బిర్లా రియల్టీ(ఏబీఆర్ఈఎల్) నుంచి పల్ప్, పేపర్ బిజినెస్ కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్ను ఆశ్రయించింది. తద్వారా రూ.3,498 కోట్ల విలువైన ఈ డీల్పై అనుమతిని కోరింది. 1984లో ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో ఏబీఆర్ఈఎల్ నెలకొల్పిన సెంచురీ పల్ప్ అండ్ పేపర్ బిజినెస్ను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ప్రస్తుతం వార్షికంగా 4.8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దేశీ పేపర్ పరిశ్రమలో సుప్రసిద్ధ కంపెనీగా సెంచురీ పల్ప్ అవతరించింది. అయితే ప్రతిపాదిత కొనుగోలు కారణంగా పోటీకి సంబంధించి ఎలాంటి ఆందోళనలు తలెత్తబోవని ఐటీసీ పేర్కొంది.ఇదీ చదవండి: మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?దేశీ పేపర్ మార్కెట్లలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో తాజా డీల్ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని సీసీఐకు వివరించింది. కాగా.. పల్ప్, పేపర్ బిజినెస్ను స్లంప్ సేల్ ప్రాతిపదికన ఐటీసీకి విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు ఈ ఏడాది మార్చిలో ఏబీఆర్ఈఎల్ తెలియజేసింది. ఇందుకు నగదు రూపేణా ఐటీసీ రూ. 3,498 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. తద్వారా తమకు కీలకమైన రియల్టీ విభాగంపై దృష్టిసారించనున్నట్లు పేర్కొంది. 2020–24 మధ్యకాలంలో రూ, 4,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించిన పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ విభాగం ఇకపైనా ఇదే రీతిలో కొనసాగనున్నట్లు ఐటీసీ ఇటీవల అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
అదానీ–జేపీ డీల్కు సీసీఐ సై
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా అదానీ గ్రూప్ను అనుమతించింది. దీంతో ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న జేపీని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ వేసిన బిడ్ గెలుపొందే వీలుంది. తద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లేదా అదానీ గ్రూప్లోని ఏ ఇతర సంస్థ అయినా జేపీలో 100 శాతం వాటా కొనుగోలుకి అనుమతించింది. వెరసి అదానీ గ్రూప్ సంస్థలు జేపీని సొంతం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనలమేరకు ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళిక దాఖలుకు సీసీఐ అనుమతి తప్పనిసరి. కాగా.. జేపీ దివాలా పరిష్కార ప్రణాళికను ప్రస్తుతం రుణదాతల కమిటీ(సీవోసీ) సమీక్షిస్తోంది. సీసీఐ అనుమతి తదుపరి మాత్రమే దివాలా పరిష్కార ప్రణాళికను సీవోసీ సమీక్షించి అంగీకరిస్తుంది. కాగా.. జేపీ కొనుగోలుకి అదానీ గ్రూప్తోపాటు.. దాల్మియా భారత్ ప్రతిపాదనను సైతం తాజాగా సీసీఐ అనుమతించింది. వేదాంతా గ్రూప్, జిందాల్ పవర్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ తదితర సంస్థలు సైతం జేపీ కొనుగోలుకి వీలుగా సీసీఐను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2024 జూన్3న జేపీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్సీఎల్టీ అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఇందుకు కారణంకాగా.. రుణదాతలకు రూ. 57,185 కోట్లు బకాయిపడటం గమనార్హం! -
వొడాఫోన్ ఐడియాకు ఉపశమనంపై స్పష్టత
రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ ఐడియాకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించే యోచన చేయడంలేదని టెలికం శాఖ స్పష్టం చేసింది. కంపెనీ స్థూల సర్దుబాటు ఆదాయం(ఏజీఆర్) బకాయిలపై ప్రస్తుతం తమవద్ద ఎలాంటి ప్రణాళికలు లేదా ఆలోచనలు లేవని కమ్యూనికేషన్స్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.‘ఇటీవల కంపెనీకున్న భారీ రుణ భారాన్ని ఈక్విటీగా మార్పు చేసుకున్నాం. ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇది చేపట్టాం. ప్రభుత్వం చేయదలచినదంతా ఇప్పటికే పూర్తి చేసింది. ప్రస్తుతం వీటిపై ఎలాంటి సమాలోచనలూ చేయడంలేదు’ అంటూ స్పష్టతనిచ్చారు. స్పెక్ట్రమ్ వేలం బకాయిలకుగాను మార్చిలో ప్రభుత్వం రూ. 36,950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోవడం ద్వారా వొడాఫోన్ ఐడియాలో అతిపెద్ద వాటాదారుగా అవతరించిన సంగతి తెలిసిందే. ఇంతక్రితం 2023లోనూ ప్రభుత్వం రూ. 16,000 కోట్ల బకాయిలకుగాను వొడాఫోన్ ఐడియాలో 33 శాతం వాటాను అందుకోవడం గమనార్హం! 2025 జూన్కల్లా కంపెనీ ఏజీఆర్ లయబిలిటీ రూ.75,000 కోట్లుగా నమోదైంది.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
అమెజాన్ కొత్తగా మరో 40 ఆశ్రయ్ కేంద్రాలు
ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తాజాగా తమ ఆశ్రయ్ ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. ప్రభుత్వ రంగ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్)తో కలిసి మరో 40 కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీంతో వీటి సంఖ్య 13 నగరాలవ్యాప్తంగా 65కి చేరింది. 2025 ఆఖరు నాటికి ఇలాంటి 100 సెంటర్స్ ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు అమెజాన్ ఆపరేషన్స్ డైరెక్టర్ (ఇండియా) సలీం మెమన్ తెలిపారు.పెట్రోల్ బంకులు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసే ఈ సెంటర్స్.. అమెజాన్ సొంత నెట్వర్క్లోని వారితో పాటు ఈ–కామర్స్, లాజిస్టిక్స్ వ్యవస్థలోని ఇతరత్రా డెలివరీ అసోసియేట్స్ కూడా కాసేపు సేద తీరేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఎయిర్ కండీషన్డ్ సీటింగ్, తాగు నీరు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, వాష్రూమ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ మొదలైనవి ఉంటాయి. ఉదయం 9 గం.ల నుంచి రాత్రి 9 గం.ల వరకు, ఏడాదిపాడవునా, వారానికి ఏడు రోజులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ మార్పులతో ఇబ్బందిపడే డెలివరీ అసోసియేట్స్ ప్రతి విజిట్లో అరగంట సేపు దీన్ని ఉపయోగించుకోవచ్చు.ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు -
భారత్లో రూ.70 వేలకోట్ల పెట్టుబడి!.. సుజుకి మోటార్ ప్రెసిడెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్లోని హన్సల్పూర్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడంతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఒనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి.. కంపెనీకి చెందిన ఇతర కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.మారుతి సుజుకి ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం తర్వాత.. సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో మాట్లాడుతూ.. జపాన్ తయారీదారు రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో భారతదేశంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా.. భారతదేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. భారతదేశంతో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. భారతదేశం దార్శినికతకు మద్దతు ఇవ్వడానికి.. వికసిత్ భారత్కు దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నామని తోషిహిరో సుజుకి అన్నారు.సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తన ప్రసంగంలో.. కొత్తగా ప్రారంభించిన గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారుతుందని, భారతదేశంలోని వినియోగదారులకు సేవలందిస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు!.. ఈ-విటారా ప్రారంభించిన మోదీఈ ప్లాంట్లో ఉత్పత్తి చేసిన మొదటి వాహనం మారుతి సుజుకి ఇ-విటారా, ఇది బ్రాండ్ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం కూడా. ఈ ఎలక్ట్రిక్ కారును జపాన్.. యూరప్తో సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మొట్టమొదటి లిథియం-అయాన్ బ్యాటరీ.. ఎలక్ట్రోడ్ స్థాయి స్థానికీకరణతో కూడిన సెల్ ఉత్పత్తి ప్రారంభాన్ని కూడా తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. -
కేవలం రూ. 181కే.. హోమ్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ సంస్థ ఫోన్పే కొత్తగా గృహ బీమా పాలసీలను ప్రకటించింది. అగ్ని, వరదలు, భూకంపాలు సహా 20 రిస్కులకు కవరేజీ అందించేలా పాలసీలను ప్రకటించింది. రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 కోట్ల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు.ప్రీమియంలు కవరేజీని బట్టి వార్షికంగా రూ. 181 నుంచి (జీఎస్టీ కూడా కలిపి) ప్రారంభమవుతాయి. గృహ రుణాలకు సంబంధించి ఈ పాలసీలకు అన్ని బ్యాంకులు, రుణ సంస్థల్లో ఆమోదయోగ్యత ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫోన్పే యాప్ ద్వారా యూజర్లు దీన్ని పొందవచ్చు. -
సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్
ముంబై: టారిఫ్ పరమైన అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక సవాళ్లను విసురుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఈ తరుణంలో పెట్టుబడులను ఇతోధికం చేసేందుకు బ్యాంక్లు, కార్పొరేట్లు కలసి రావాలని పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు.అమెరికా - భారత్ వాణిజ్య ప్రతినిధుల మధ్య కొనసాగుతున్న సంప్రదింపులు అంతిమంగా ఒక నిర్ణయానికి దారితీస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు టారిఫ్ల కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం పరిమితం అవుతుందన్నారు. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం టారిఫ్లు విధించగా, ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో టెక్స్టైల్స్, రొయ్యలపై అధిక ప్రభావం పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అవసరమైతే రంగాల వారీ ఆర్థిక చేయూతకు అవకాశం ఉంటుందని మల్హోత్రా సంకేతం ఇచ్చారు.పరపతి విధానంలో భాంగా ద్రవ్యోల్బణంతోపాటు వృద్ధి క్రమాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. ‘‘క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. భౌగోళిక రాజకీయ, టారిఫ్ పరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. కనుక ఆర్థిక విస్తరణ మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్లు, కార్పొరేట్ బ్యాలన్స్ షీట్లు మెరుగ్గా ఉన్నాయి. కనుక అవి పరస్పర సహకారంతో పెట్టుబడుల సైకిల్ను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ కీలక తరుణంలో ఇది ఎంతో అవసరం’’అని పేర్కొన్నారు. రుణ వృద్ధికి చర్యలు..ధరల స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం వృద్ధికి అడ్డుకావని మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బ్యాంకుల రుణ వృద్ధి మూడేళ్ల కనిష్టానికి తగ్గిన తరుణంలో.. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఆర్బీఐ నియత్రణలోని సంస్థల వ్యాపార సులభతర నిర్వహణను పెంచడంపైనా దృష్టి పెట్టినట్టు చెబుతూ, దీనివల్ల వ్యయాలు తగ్గుతాయన్నారు. ఆర్బీఐ ఎన్నో వివరాలు కోరుతుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయని చెబుతూ.. అడిగిన సమాచారం విషయంలో భాగస్వాములు సహకరించాలని కోరారు. దీనివల్ల మెరుగైన నియంత్రణలకు అవకాశం ఉంటుందన్నారు. త్వరలోనే బాసెల్-3 నిబంధనలను అమల్లోకి తెస్తామని చెప్పారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేయడం, చిన్న వ్యాపారులకూ రుణ సాయం చేరువ చేయడం, కస్టమర్ సేవల నాణ్యతను పెంచడం తమ ప్రాధాన్యతలుగా చెప్పారు. -
ఫ్లిప్కార్ట్ బ్లాక్ మెంబర్షిప్: ఏడాది ఫ్రీ యూట్యూబ్..
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఓ కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. 'ఫ్లిప్కార్ట్ బ్లాక్' పేరుతో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.వినియోగదారులు ఫ్లిప్కార్ట్ బ్లాక్ను రూ.1,499 వార్షిక రుసుముతో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ ముందస్తు తగ్గింపును అందిస్తూ.. ఈ నెలాఖరు లోపల రూ. 990 చెల్లించి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇందులో భాగంగానే వినియోగదారులు ఏడాదిపాటు ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ పొందవచ్చు. దీనిద్వారా యాడ్స్ లేకుండా వీడియోలు చూడవచ్చు. ఒక సబ్స్క్రిప్షన్ ఒక యూట్యూబ్ అకౌంటుకు మాత్రమే పనిచేస్తుంది.ఫ్లిప్కార్ట్ వీఐపీ స్థానంలో ఫ్లిప్కార్ట్ బ్లాక్ రానుంది. ఫ్లిప్కార్ట్ వీఐపీ అనేది సంవత్సరానికి రూ. 799 ఖరీదు చేసే ప్రీమియం సబ్స్క్రిప్షన్ సర్వీస్. ఇది ఫ్లిప్కార్ట్ బ్లాక్ మాదిరిగా కాకుండా.. ప్రత్యేకమైన ఆఫర్లను లేదా యూట్యూబ్ ప్రీమియం యాక్సెస్ను అందించలేదు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలుఫ్లిప్కార్ట్ బ్లాక్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు.. సభ్యత్వంతో ప్రతి ఆర్డర్పై రూ. 100 వరకు 5 శాతం సూపర్కాయిన్స్ క్యాష్బ్యాక్ పొందుతారు, అలాగే నెలకు 800 సూపర్కాయిన్ల వరకు సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఈ సూపర్కాయిన్లను రూపాయికి సమానమైన డిస్కౌంట్లుగా లేదా ఆర్డర్లపై క్యాష్బ్యాక్గా రీడీమ్ చేసుకోవచ్చు. -
కంపెనీల కొనుగోళ్లకూ బ్యాంక్ నిధులు!.. ఎస్బీఐ చైర్మన్
ముంబై: లిస్టెడ్ కంపెనీలు చేపట్టే విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) లావాదేవీలకు కూడా నిధులు సమకూర్చడంపై బ్యాంకులు దృష్టి పెడుతున్నాయి. దీనికి అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంకును దేశీ బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) సూత్రప్రాయంగా అభ్యర్తించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయం తెలిపారు.వినియోగాన్ని పెంచేందుకు ఓవైపు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరోపక్క ప్రయివేట్ రంగం సైతం సామర్థ్య విస్తరణపై పెట్టుబడులకు ఉపక్రమించాలని సూచించారు. సాధారణంగా బలవంతపు టేకోవర్లకు తోడ్పడకూడదనే ఉద్దేశమే, ఎంఅండ్ఏ ఫండింగ్కి బ్యాంకులను దూరంగా ఉంచడానికి కారణమని పేర్కొన్నారు.అయితే.. అత్యంత పారదర్శకంగా, వాటాదారుల అనుమతితో లిస్టెడ్ కంపెనీలు చేపట్టే కొనుగోళ్లకైనా నిధులు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ ఆర్బీఐకు విన్నవించనున్నట్లు తెలియజేశారు. దీనితో బలవంతపు టేకోవర్లకు ఫండింగ్ చేసే సందర్భాలు తగ్గుతాయని పేర్కొన్నారు. భారత వాణిజ్య సమాఖ్య, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన 2025 ఎఫ్ఐబీఏసీ సందర్భంగా శెట్టి పలు అంశాలపై స్పందించారు.పెట్టుబడి వ్యయాలు ఇలా..దేశీ కార్పొరేట్ రంగం అంతర్గత వనరులు, ఈక్విటీ, రుణ మార్కెట్ల ద్వారా ప్రస్తుతం పెట్టుబడి వ్యయాలను సమకూర్చుకుంటున్నట్లు ఎస్బీఐ చీఫ్ శెట్టి తెలియజేశారు. ప్రభుత్వ చర్యల కారణంగా వినియోగం పుంజుకోనుందన్న అంచనాలతో కంపెనీలు సామర్థ్య విస్తరణపై పెట్టుబడులు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అయితే నిలకడైన డిమాండ్ వాతావరణం కనిపించినప్పుడు మాత్రమే పెట్టుబడి వ్యయాలు పుంజుకుంటాయని అత్యధికులు చెబుతున్నట్లు ప్రస్తావించారు.జీఎస్టీ రేట్లలో వ్యవస్థాగత సంస్కరణలు, రూ. 12 లక్షల వరకూ ఆదాయ పన్ను మినహాయింపులు తదితర పలు చర్యలకు ప్రభుత్వం తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. నిజానికి డిమాండ్ మళ్లీ భారీస్థాయిలో పుంజుకుంటే కార్పొరేట్లకు పెట్టుబడి వ్యయాలు లేదా తగిన ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులో లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. సామర్థ్య విస్తరణవైపు కంపెనీలు ఇప్పటికిప్పుడు దృష్టి పెడితే అటు క్యాపిటల్ మార్కెట్లు, ఇటు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా రుణ మార్కెట్లు కచ్చితంగా మద్దతిస్తాయని వివరించారు.కస్టమర్ సర్వీసుల పెంపు, సైబర్ సెక్యూరిటీ పటిష్టత, మరింత ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కు దేశీ బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల(ఎంఎస్ఎంఈలు)కు రుణాలందించడంపై ఇటీవల బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ - జూన్(క్యూ1)లో వీటికి 19 శాతం అధికంగా రూ. 5.28 లక్షల కోట్ల రుణాలందించినట్లు వెల్లడించారు. -
గూగుల్ యూటర్న్.. ఇంటర్యూ విధానంలో మార్పు!
ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్'.. ఇంటర్యూ విధానంలో మార్పు తీసుకురావడానికి సిద్దమైంది. మళ్ళీ పేస్ టు పేస్ ఇంటర్వ్యూలను నిర్వహించాలని పేర్కొంది. వర్చువల్ ఇంటర్వ్యూల ద్వారా మోసాలు జరుగుతున్నాయని, ఈ కారణంగానే ముఖాముఖి ఉద్యోగ ఇంటర్వ్యూలను తిరిగి అమలు చేయనున్నట్లు సీఈఓ 'సుందర్ పిచాయ్' వెల్లడించారు.వర్చువల్ విధానంలో ఇంటర్యూలు నిర్వహిస్తుంటే కొందరు అభ్యర్థులు ఏఐను ఉపయోగించి మోసం చేస్తున్నారు. దీనివల్ల నైపుణ్యం ఉన్నవారు ఉద్యోగం తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరిలో జరిగిన ఒక సమావేశంలో.. ఏఐ వినియోగం పెరుగుతున్నందున వర్చువల్ ఇంటర్వ్యూలు సమంజసం కాదని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కాబట్టి అభ్యర్థులు ఇకపై తప్పకుండా ఒక రౌండ్ పేస్ టు పేస్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని పిచాయ్ పేర్కొన్నారు.పిచాయ్ స్పందిస్తూ హైబ్రిడ్ విధానాన్ని సమర్థించారు. మనమందరం హైబ్రిడ్ పద్ధతిలో పని చేస్తున్నాము, కాబట్టి.. ఇంటర్వ్యూలలో కొంత భాగాన్ని స్వయంగా నిర్వహించడం గురించి ఆలోచించాలి. ఇది అభ్యర్థులకు గూగుల్ సంస్కృతిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని నేను భావిస్తున్నానని అన్నారు.ఇదీ చదవండి: కోర్టుకెక్కిన మస్క్ కంపెనీ: యాపిల్, ఓపెన్ఏఐ దావా..వర్చువల్ విధానం ద్వారా.. ఇంటర్యూలను షెడ్యూల్ చేయడం సులభం. అంతే కాకుండా శ్రమ, వ్యయం కూడా తగ్గుతాయి. కోవిడ్ తరువాత ఈ విధానం వల్ల మోసాలు జరుగుతున్నట్లు తెలిసింది. కాబట్టి పద్దతిని తప్పకుండా మార్కకోవాల్సిన అవసరం ఉంది. -
ఫ్లిప్కార్ట్లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల 1.5 లక్షల సీజన్ ఉద్యోగాలను ప్రకటించిన తరువాత.. ఫ్లిప్కార్ట్ 2.2 లక్షల కంటే ఎక్కువ సీజనల్ ఉద్యోగాలను ప్రకటించింది. తమ కస్టమర్లకు సరైన సమయంలో ఉత్పత్తులను అందించడంలో భాగంగానే ఈ చర్య తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది.ప్రతి సంవత్సరం పండుగ సీజన్లో ఈ కామర్స్ సంస్థలు సీజనల్ ఉద్యోగాలను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ ఏడాది కూడా దేశ వ్యాప్తంగా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ తమ సేవలను అందించడానికి ఫ్లిప్కార్ట్ సన్నద్ధమైంది. ముఖ్యంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఎక్కువమంది యువతకు ఉపాధి కల్పించడంపై కంపెనీ ద్రుష్టి పెట్టింది.ఉద్యోగ నియామకాలు.. ప్రధానంగా సప్లైచైన్, లాజిస్టిక్, లాస్ట్ మైల్ డెలివరీ వంటి విభాగాల్లో ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఉద్యోగాలను మహిళలు, దివ్యాంగులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పండుగ సీజన్.. అమెజాన్లో 1.5 లక్షల ఉద్యోగాలు -
టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!
ప్రముఖ టెక్ దిగ్గజం తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త ఆఫీసులను ప్రారంభిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ ఇండియా ఆర్ అండ్ డి హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఫీనిక్స్ సెంటారస్లో 2.65 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఇక్కడ 3, 4వ అంతస్తులలో ఆఫీస్ ఉంటుంది.టేబుల్స్పేస్ టెక్నాలజీస్తో ఒప్పందం ఐదు సంవత్సరాలు కాగా.. నెల అద్దె రూ. 5.4 కోట్ల చొప్పున చెల్లిస్తుంది. ఇది 2025 జులై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ప్రాప్ స్టాక్ వెల్లడించింది. ఈ ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా టెక్ దిగ్గజం రూ.92.94 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.లీజు పత్రాల ప్రకారం.. మొత్తం చెల్లింపు చదరపు అడుగుకు రూ.67 బేస్ అద్దెతో పాటు.. నిర్వహణ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు, మూలధన ఖర్చులు, నిర్వహణ రుసుములు ఉన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది అద్దె 4.8 శాతం పెరుగుతుంది. కాగా కంపెనీ ఐదేళ్ల కాలానికి రూ.42.15 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చేసింది.ఇదీ చదవండి: భారత్లో మొదటి ఆఫీస్: ఓపెన్ఏఐలో జాబ్స్హైదరాబాద్లో ఇతర భారీ ఆఫీస్ డీల్స్హైదరాబాద్లోని ఇతర భారీ డీల్స్ విషయానికి వస్తే.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2024లో 10.18 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. దీని అద్దె నెలకు రూ. 4.3 కోట్లుగా ఉంది. అదేవిధంగా, డిసెంబర్ 2024లో, ఫేస్బుక్ తన హైదరాబాద్ ఆఫీస్ స్థలం కోసం లీజును రెన్యువల్ చేసింది. ఇది మొత్తం 3.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీని అద్దె నెలకు రూ.2.8 కోట్లు. -
భారత్లో మొదటి ఆఫీస్: ఓపెన్ఏఐలో జాబ్స్
ఓపెన్ఏఐ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించడంలో భాగంగా.. భారతదేశంలో తన మొదటి కార్యాలయాన్ని ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పుడు జాబ్స్ కోసం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మూడు ఉద్యోగాలు ఉన్నట్లు స్పష్టం చేసింది.ఓపెన్ఏఐలో జాబ్స్అకౌంట్ డైరెక్టర్, డిజిటల్ నేటివ్స్అకౌంట్ డైరెక్టర్, లార్జ్ ఎంటర్ప్రైస్అకౌంట్ డైరెక్టర్, స్ట్రాటజీస్ఈ ఉద్యోగాలు ఢిల్లీ, ముంబై లేదా బెంగళూరులో ఉండవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఓపెన్ఏఐ కెరీర్ పేజీలో అప్లై చేసుకోవచ్చు.మా మొదటి ఆఫీస్ ప్రారభించడం, దీనికోసం స్థానికంగా ఒక టీమ్ ఏర్పాటు చేసుకోవడం అనేది.. లేటెస్ట్ ఏఐను మరింత అందుబాటులోకి తీసుకురావడం. భారతదేశంలో ఏఐను నిర్మించడానికి మా నిబద్దతతో మొదటి అడుగు అని.. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా.. సెప్టెంబర్లో భారతదేశాన్ని సందర్శించడానికి తాను ఉత్సాహంగా ఉన్నానని అన్నారు.ఇదీ చదవండి: డబ్బు అదా చేయడానికి 10-30-50 రూల్: రాధిక గుప్తాభారతదేశంలో ఆఫీస్ ప్రారభించడం అనేది.. ప్రభుత్వ ఇండియాఏఐ మిషన్కు ఓపెన్ఏఐ మద్దతులో భాగం. కంపెనీ ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు, విద్యావేత్తలు, డెవలపర్లు, నిపుణులకు మెరుగైన సేవలందించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ప్రారంభించి మరింత అందుబాటులో ఉండనుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థ సిద్ధమైంది.