breaking news
Corporate
-
కోలాహలంగా అంబానీ ఇంట్లో గణపతి పూజ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు తమ నివాసమైన యాంటిలియాలో గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా ఈసారి కూడా గణనాథుడిని కొలువుదీర్చి, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, విశిష్ట అతిథుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.యాంటిలియాలో ఆధ్యాత్మిక శోభగణపతి బాప్పా రాకను పురస్కరించుకుని యాంటిలియా ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. అంబానీ కుటుంబ సభ్యులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా దంపతులతో పాటు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. View this post on Instagram A post shared by Peepingmoonofficial (@peepingmoonofficial) -
సంపదలో అదానీని దాటేసిన టిక్టాక్ వ్యవస్థాపకుడు
ఆసియా కుబేరుల జాబితాలో పెద్ద మార్పు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన షార్ట్ వీడియో ప్లాట్ఫామ్ ‘టిక్టాక్’ మాతృ సంస్థ బైట్డాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొత్త రికార్డు సృష్టించారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెలువరించిన నివేదిక ప్రకారం, భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీని అధిగమించి యిమింగ్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.105 బిలియన్ డాలర్ల మైలురాయి43 ఏళ్ల ఝాంగ్ యిమింగ్ నికర సంపద ఒక్కసారిగా 105 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.7 లక్షల కోట్లు) మార్కును దాటింది. ఇటీవల బ్లాక్రాక్, ఫిడెలిటీ ఇన్వెస్ట్మెంట్స్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్ వ్యాల్యుయేషన్ సంస్థలు బైట్డాన్స్ షేర్ల విలువను గణనీయంగా పెంచడంతో యిమింగ్ సంపద కేవలం ఒక్క నెలలోనే 12 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. 2019 మార్చిలో యిమింగ్ సంపద కేవలం 13 బిలియన్ డాలర్లగా ఉండగా, ఇప్పుడు అది ఎనిమిది రెట్లకు పైగా పెరగడం గమనార్హం.ఏఐ సాంకేతికతతో వృద్ధికేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లతోనే కాకుండా బైట్డాన్స్ సంస్థ ఏఐ విభాగంలోకి అడుగుపెట్టడం యిమింగ్ సంపద పెంపునకు ప్రధాన చోదక శక్తిగా మారింది. బైట్డాన్స్ అభివృద్ధి చేసిన ‘దౌబావో’ ఏఐ చాట్బాట్, సీడాన్స్ వంటి ఏఐ వీడియో జనరేషన్ టూల్స్ మార్కెట్లో ఊహించని రీతిలో విజయం సాధించాయి.భారత బిలియనీర్లుమరోవైపు, భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద మార్కెట్ స్థిరత్వం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో కాస్త క్షీణించి రెండో స్థానానికి చేరారు. ముకేశ్ అంబానీ కూడా తదుపరి స్థానాల్లోనే ఉన్నారు. ఆసియాలో ఇప్పటివరకు ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు వంటి సాంప్రదాయ రంగాల నుంచి బిలియనీర్లు అగ్రస్థానంలో నిలవగా ఇప్పుడు సాంకేతికత, ఏఐ-ఆధారిత రంగాలకు చెందిన టెక్ యజమానులు సంపన్నులుగా ఎదగడం గమనార్హం.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
దేశంలోనే తొలి స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు
భారత రైల్వే సరుకు రవాణా విభాగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేచింది. గుజరాత్లోని కచ్ జిల్లా శివలాఖా నుంచి మిఠాపూర్ మధ్య నడిచే దేశంలోనే మొదటి ‘స్టెయిన్లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్గా ప్రారంభించారు. సాధారణ వ్యాగన్లలో ఉప్పును రవాణా చేసే సమయంలో తేమను పీల్చుకోవడం, వ్యాగన్లు త్వరగా తుప్పు పట్టడం, సరుకు కంటే వ్యాగన్ బరువే ఎక్కువగా ఉండటం వంటి ప్రధాన సమస్యలను ఈ కొత్త సాంకేతికత పరిష్కరిస్తుంది.తుప్పు పట్టని డిజైన్ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్, గాలిలోని తేమ కలిసి సాధారణ ఇనుము లేదా ఉక్కు వ్యాగన్లను వేగంగా తుప్పు పట్టేలా చేస్తాయి. అందుకే ఈ కొత్త కంటెయినర్లను అధిక నాణ్యత గల స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. సాధారణ వ్యాగన్లు కొన్ని సంవత్సరాల్లోనే పాడైపోగా స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణం వల్ల వ్యాగన్ల జీవితకాలం భారీగా పెరుగుతుంది. నిర్వహణ వ్యయం తగ్గిపోతుంది.బరువు సమతుల్యతఉప్పు బరువుగా ఉండటం వల్ల పాత మోడల్ వ్యాగన్లలో వ్యాగన్ సొంత బరువు (టేర్ వెయిట్) కంటే మోసే సరుకు నిష్పత్తి సమర్థవంతంగా ఉండేది కాదు. తేలికైన, బలమైన స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించడం ద్వారా కంటెయినర్ బరువు తగ్గి, ఎక్కువ పరిమాణంలో ఉప్పును లోడ్ చేసే వెసులుబాటు లభించింది.వినూత్న లోడింగ్ - అన్లోడ్ విధానంకంటెయినర్ పైభాగం నుంచి నేరుగా ఉప్పును నింపేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్లోడింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కంటెయినర్ను పక్కకు వంచే (టిల్ట్) సదుపాయం ఉంది. దీనివల్ల మానవ శ్రమ లేకుండా వేగంగా సరుకును ఖాళీ చేయవచ్చు.తేమ నిరోధకతరవాణా సమయంలో ఉప్పు వాతావరణంలోని తేమను పీల్చుకుని గడ్డకట్టడం లేదా తడిసిపోవడం జరుగుతుంది. ఈ సీల్డ్ కంటెయినర్ల వల్ల వర్షం లేదా గాలిలోని తేమ లోపలికి చేరకుండా ఉప్పు దాని సహజ స్థితిలోనే ఉంటుంది.सॉल्ट को देश के कोने-कोने तक ले जाने के लिए बनाया गया स्पेशल कंटेनर!#RailInfra4Gujarat#FreightFriendlyRailways pic.twitter.com/QBuIqeWFvd— Ministry of Railways (@RailMinIndia) September 16, 2026మౌలిక వసతుల విస్తరణఈ సందర్భంగా గుజరాత్లోని భీమాసర్, దేవిలియా, చండీసార్, శివలాఖాలలో పూర్తయిన నాలుగు కార్గో టెర్మినల్స్ను కేంద్రమంత్రి జాతికి అంకితం చేయడంతో పాటు, మెహసానాలోని లించ్ వద్ద నూతన గతిశక్తి కార్గో టెర్మినల్కు శంకుస్థాపన చేశారు. 2021లో తీసుకొచ్చిన గతిశక్తి విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 150 కార్గో టెర్మినళ్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, కొత్తగా ప్రారంభించిన గోపాల్పూర్ రైల్వే స్టేషన్ సేవలతో అహ్మదాబాద్-భుజ్ మార్గంలో నడిచే రైళ్లకు గాంధీధామ్ వద్ద ఇంజిన్ రివర్సల్ చేయాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా కానుందని చెప్పారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
సిగరెట్ ప్రియులకు భారీ షాక్ : ఏకంగా 13 శాతం పెంపు
ధూమపాన ప్రియులకు మరోసారి భారీ షాక్ తగిలింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఎంపిక చేసిన సిగరెట్ బ్రాండ్ల రిటైల్ ధరలను మరోసారి పెంచింది. ముఖ్యంగా 'క్లాసిక్ కనెక్ట్' (Classic Connect), 'గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్' (Gold Flake Super Star) ప్యాక్ల ధరలను 12.66శాతం వరకు పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్నులు, సుంకాలను పెంచిన తర్వాత ఈ పెంపులు మొదలయ్యాయి. కొద్ది నెలల వ్యవధిలోనే ఐటీసీ రెండోసారి ధరలను పెంచింది. కొత్త ధరలతో కూడిన సిగరెట్ ప్యాక్లు ఇప్పటికే మార్కెట్లోకి, డిస్ట్రిబ్యూషన్ ఛైన్లోకి రావడం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల వల్ల కంపెనీలు పన్నుల భారాన్ని తగ్గించుకోగలిగినప్పటికీ, వినియోగదారులపై అదనపు భారం పడనుంది.పెరిగిన ధరల వివరాలుడీలర్ల సమాచారం ప్రకారం, 10 సిగరెట్లు ఉండే 'గోల్డ్ ఫ్లేక్ సూపర్ స్టార్' ప్యాక్ ధర రూ. 79 నుండి రూ. 89కి (రూ. 10 పెరిగింది) చేరుకుంది. 20 సిగరెట్ల క్లాసిక్ కనెక్ట్ సిగరెట్ ప్యాక్ ధర గతంలో రూ.390గా ఉంది. ఇప్పుడు ఆ ధర రూ.428కి చేరింది. సుమారు 9.7 శాతం పెరిగింది.ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ (GST) రేటు 40శాతం కి పెరగడంతో పాటు కొత్త ఎక్సైజ్ డ్యూటీ విధానం అమలవుతోంది. ఈ పన్నుల భారాన్ని తట్టుకునేందుకు ITC సంస్థ గతంలో ఫిబ్రవరి, మే నెలల్లో కూడా పలుమార్లు ధరలను పెంచిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!ఐటీసీ షేర్ల లాభాలుసిగరెట్ ధరల పెంపుపై వార్తలు వెలువడిన తర్వాత ఐటీసీ షేర్లలో కదలిక కనిపించింది. బుధవారం ఉదయం ట్రేడింగ్లో ఐటీసీ షేరు 2.13 శాతం వరకు పెరిగింది. ఈ ఏడాదిలో రెండోసారి సిగరెట్ల ధరలను పెంచిన నేపథ్యంలో బుధవారం ITC లిమిటెడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి.ఇదీ చదవండి: మహువాకు మరోసారి చేదు అనుభవం : జస్టిస్ దీపాంకర్కు కౌంటర్ -
క్యాష్ ఉంటేనే పెట్రోల్? యూపీఐ ఛార్జీల ఎఫెక్ట్!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) నిబంధనలు దేశవ్యాప్తంగా ఇంధన రిటైల్ రంగంలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త ఫ్రేమ్వర్క్ ప్రకారం, రూ.2,000 దాటిన యూపీఐ వర్తక లావాదేవీలపై ఎండీఆర్ వర్తిస్తుంది. పెట్రోల్ పంపులు, రైల్వేలు, ఇన్సూరెన్స్ వంటి నిత్యవసర రంగాల్లోని రూ.2,000 పైబడిన చెల్లింపులపై ఫ్లాట్గా రూ.5 ఎండీఆర్ విధించనున్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదని, ఈ భారాన్ని కేవలం వర్తకులే భరించాలని ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేశాయి.పడిపోతున్న లాభాలు.. పెరుగుతున్న భారంప్రభుత్వ నిర్ణయంపై పెట్రోల్ బంక్ డీలర్ల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన విక్రయ వ్యాపారం స్వల్ప లాభ శాతంతో నడుస్తుందని, 2017 తర్వాత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మార్జిన్ల పెంపు లేకపోవడంతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని బంకు నిర్వాహకులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా బంకుల్లో నమోదయ్యే మొత్తం యూపీఐ లావాదేవీల్లో దాదాపు 20 శాతం వరకు రూ.2,000 కంటే ఎక్కువ విలువైనవే. కొత్త ఎండీఆర్ నిబంధనల వల్ల రోజూ దేశంలోని పెట్రోల్ పంపు నిర్వాహకులపై రూ.2.4 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడుతుందని డీలర్లు అంచనా వేస్తున్నారు.‘క్యాష్ ఓన్లీ’ నిరసన హెచ్చరికఈ అదనపు చార్జీని భరించడం సాధ్యం కాదని, తమకు ఈ రుసుము నుంచి మినహాయింపు ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ వినతిని పరిగణనలోకి తీసుకోకపోతే రూ.2,000 దాటిన లావాదేవీలకు డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి కేవలం నగదు ద్వారా మాత్రమే ఇంధన విక్రయాలు జరుపుతామని స్పష్టం చేస్తున్నారు. 2016 డీమోనిటైజేషన్ సమయంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎండీఆర్ సబ్సిడీలను అందించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇప్పుడు కూడా అలాంటి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.వినియోగదారులపై ప్రభావం ఎంత?సాధారణ ప్రజలకు పీ2పీ లావాదేవీలు ఉచితమే అయినప్పటికీ బంకు నిర్వాహకులు నగదు విధానానికి మారితే సామాన్య వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. డిజిటల్ ఇండియా లక్ష్యాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చమురు సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని డీలర్లకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత? -
టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు అందించిన రిలయన్స్
తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత రవాణాకు ప్రోత్సాహం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపడుతున్న గ్రీన్ మొబిలిటీ ఉద్యమానికి మద్దతుగా రిలయన్స్ ఫౌండేషన్ 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని విరాళంగా అందజేసింది.బుధవారం తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో భక్తుల రవాణా అవసరాలను తీర్చేందుకు రిలయన్స్ ఈ సర్వీసులు అందించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.హామీ నెరవేర్చిన అనంత్ అంబానీగత జూన్లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, కొండపై పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు 25 ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, స్వల్ప వ్యవధిలోనే రిలయన్స్ ఫౌండేషన్, టీటీడీ భాగస్వామ్యంతో ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ ఫౌండేషన్, జియో-బీపీ ఉమ్మడి కృషితో సాకారమైంది. రిలయన్స్ ఆర్ధిక సహకారాన్ని అందించగా, జియో-బీపీ సంస్థ అవసరమైన ఈవీ ఛార్జింగ్ వసతులను, సాంకేతిక మౌలిక సదుపాయాలను సమకూర్చింది.ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ, ‘శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో భాగస్వామ్యం కావడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. తిరుమల కొండల్లోని గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడుతూ, భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే మా లక్ష్యం’ అని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాల వాడకాన్ని తగ్గించి, ఏటా తిరుమలను సందర్శించే కోట్లాది మంది భక్తులకు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం -
ఒరాకిల్ను వదిలేసిన టెకీ : ఏకంగా రూ. 9 కోట్ల వ్యాపారం
గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్(Oracle)లో ఉద్యోగాల కోత ప్రకంపనలు రేపుతున్న వేళ, ఆ సంస్థ మాజీ ఉద్యోగి సక్సెస్ స్టోరీ నెట్టింట సందడిగా మారింది. లక్షల జీతం వదులుకొని ఫలూదా బిజినెస్ మొదలు పెట్టి రూ. 9 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుండటం విశేషంగా నిలుస్తోంది. తనలాంటి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.2019లో ప్రదీప్ కన్నన్ (Pradeep Kannan) నెలకు లక్ష రూపాయలు ఆర్జిస్తున్న సమయంలో తన స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. తనకంటూ ఒక సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఆయన ప్రణాళిక. ఈ మాట వినగానే లక్షల జీతం వదులుకొని ఐస్ క్రీం షాపులేంటి?అని అందరూ ఎగతాళి చేశారట. కానీ కల సాకారం కోసం 33 ఏళ్ల వయసులో బెంగళూరు వదిలి తన సొంత ఊరు కరూర్ (తమిళనాడు) వెళ్ళి 'ది ఫలూదా షాప్' (The Falooda Shop) ప్రారంభించారు.నిజానికి ఒరాకిల్కు ముందే ఆయన 'లెట్స్ కుల్ఫీ' (Lets Kulfi) పేరిట ఒక కుల్ఫీ వ్యాపారాన్ని ప్రారంభించి విఫలమయ్యారు. అయితే ఆ వైఫల్యం ద్వారా వ్యాపార మెళకువలు, కస్టమర్ల అభిరుచులు , నిర్వహణలో ఉండే సవాళ్లను బాగా అర్థం చేసుకున్నారు. ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అడుగు ముందుకేశారు. కేవలం రూ. 6 లక్షల పొదుపు , కుటుంబ ఆస్తులతో కరూర్లో 10x10 అడుగుల చిన్న కియోస్క్తో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అంతే ఒక వెనుదిరిగి చూసింది లేదు. కాలక్రమేణా వ్యాపారం దేశవ్యాప్తంగా విస్తరించింది. దుబాయ్లో కలిపి 20కి పైగా అవుట్లెట్లతో ప్రముఖ డెజర్ట్ బ్రాండ్గా అవతరించింది. వివిధ నివేదికల ప్రకారం ఈ వ్యాపార విలువ సుమారు రూ. 9 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!ఉత్పత్తుల్లో నాణ్యత, రుచి ఎక్కడా మారకుండా ప్రామాణిక పద్ధతులను అనుసరిస్తూ ఎన్నోజాగ్రత్తలు పాటించారు. కస్టమర్లే స్వయంగా ఫ్రాంచైజీల కోసం ముందుకు రావడంతో ఈ బ్రాండ్ వేగంగా విస్తరించింది. ప్రస్తుతం సాంప్రదాయ ఫలూదాతో పాటు, డబ్బాలో లభించే (ready-to-eat) క్యాన్ ఫలూదాలను కూడా మార్కెట్లోకి తీసుకువచ్చారు.ఇదీ చదవండి: -
ఒరాకిల్ వెతలు : పండగా పబ్బం లేకుండా 12 ఏళ్లు చాకిరి.. చివరికి!
గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్లోమరో విడత ఉద్యోగ కోత (Layoff) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఉదయం తెల్లవారేసరికి ల్యాప్టాప్లు పనిచేయడం మానివేయడంతో వేల మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన పడిపోయారు.అమెరికాలోనే ఉద్యోగాల కోతలు ఉన్నట్లు భావించినా ఇప్పుడు ఇండియాలో కూడా మరో రౌండ్ లేఆఫ్స్ జరుగుతున్నట్టు టెకీల ద్వారా తెలుస్తోంది. ఇందులో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఈ క్రమంలో ఒరాకిల్ (Oracle) సంస్థలో 12 సంవత్సరాలుగా సీనియర్ ప్రిన్సిపాల్ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసిన ఇండియన్ టెకీ సౌరభ్ (Sourabh), ఇటీవల సంస్థ చేపట్టిన ఉద్యోగ కోతలలో తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఆయన తన వర్క్ సిస్టమ్లోకి లాగిన్ కాలేకపోవడంతో ఉద్యోగం పోయిందని గ్రహించారు. సౌరభ్ భార్య పూజా సాహు లింక్డ్ఇన్ (LinkedIn) వేదికగా తన భర్త సంస్థ పట్ల ఎంతో విధేయత, అంకిత భావంతో పనిచేశారో వివరిస్తూ పోస్ట్ పోట్టారు. సెలవులు, వారాంతాలు లేవు. పండగలు, పబ్బాలు లేకుండా ఎంతో కష్టపడి పనిచేశారనీ చెప్పుకొచ్చారు. హోలీ, దీపావళి వంటి పండుగలు, కుటుంబ వేడుకలు, చివరికి ఆమె ఆసుపత్రిలో శస్త్రచికిత్స సమయంలో కూడా ఆయన పనిచేశారని ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఇంత చేసిని 12 ఏళ్ల అనుభవం ఉన్నా తనకి ఉద్వాసన తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే కష్టపడి పనిచేసే తన భర్తకు తగిన ఉద్యోగ అవకాశాలు చూపించాల్సిందిగా ఆమె తన ప్రొఫెషనల్ నెట్వర్క్ను కోరారు. చివరగా "సౌరభ్ నీకు మంచి రోజులు రాబోతున్నాయి అంటూ తన భర్తకు భరోసా ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఆమె భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరో ఉద్యోగికథపన్నెండేళ్లు అదే సంస్థలో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఒక ఉద్యోగి మాత్రం దీన్ని ఇదోరకమై "విముక్తి"గా అభివర్ణించాడు. భారీ పనిగంటలు,. ఒత్తిడినుంచి మోక్షం లభించిందన్నాడు. రెడ్డిట్ వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ, తాను ఒక కీలకమైన ప్రాజెక్ట్పై పనిచేశానని, రోజుకు 12-13 గంటలు కష్టపడ్డానని తెలిపాడు. అయితే, మేనేజ్మెంట్ నుండి ఎదురైన సూక్ష్మ పర్యవేక్షణ (micromanagement) , అధిక ఒత్తిడి కారణంగా ఈ ఉద్యోగం పోవడం వల్ల తనకు ఉపశమనం కలిగిందని పేర్కొన్నాడు.ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని సంవత్సరాల విశ్వాసపాత్రత చూపించినా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగ కోతలను క్షణాల్లో అమలు చేస్తాయని, ఈ ఘటన మరోసారి నిరూపించిందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలుకాగా 2026 ప్రారంభంలో జరిగిన చాలా పెద్ద కోత తర్వాత ఈ తాజా కోతలు చోటుచేసుకున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 మంది (13 శాతం) తగ్గారు. దీంతో మే నెలాఖరు నాటికి కంపెనీలో దాదాపు 141,000 మంది ఉద్యోగులు మిగిలారు. కంపెనీ AI మౌలిక సదుపాయాలు , డేటా సెంటర్లపై కూడా ఖర్చును గణనీయంగా పెంచుతోంది.విస్తృత సంస్థాగత మార్పులలో భాగంగా సెప్టెంబర్ 14న కంపెనీ కొత్త విడత ఉద్యోగ కోతలను ప్రారంభించింది. ప్రభావిత ఉద్యోగులకు తెల్లవారుజామున ఇమెయిల్స్ అందినట్లు సమాచారం. ఈ తాజా విడతలో ప్రభావితమైన మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఒరాకిల్ బహిరంగంగా వెల్లడించలేదు. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ -
హస్తకళల సోయగంతో అంబానీ గణేష్ చతుర్థి వేడుకలు
అంబానీ కుటుంబం నిర్వహించిన గణేష్ చతుర్థి వేడుకల్లో భారతీయ కళలు, చేతివృత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో మన దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, సంప్రదాయాలను అందంగా ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.నీతా అంబానీ ఆలోచనలకు అనుగుణంగా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయ కళాకారులు ఎంతో శ్రద్ధతో చేతితో తయారు చేసిన ప్రత్యేక వస్తువులు, అలంకరణలను రూపొందించారు.భారతదేశం అనేక రకాల కళలు, చేతివృత్తులకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన కళా సంప్రదాయం ఉంది. ఈ గణేష్ చతుర్థి వేడుకల్లో అలాంటి విభిన్నమైన భారతీయ కళా సంప్రదాయాలకు అంబానీ కుటుంబం గౌరవం ఇచ్చింది.#WATCH | At Ambani family's Ganesh Chaturthi celebrations, Indian artisans from across the country paid homage to the diverse art and craft traditions of the nation through handcrafted installations. pic.twitter.com/VTqycXr8YT— ANI (@ANI) September 15, 2026 -
వడాపావ్ అమ్ముతూ.. బంగ్లా కొనేశాడు: ఎవరీ అనిల్భాయ్?
సూరత్లో ఓ తెల్లటి బంగ్లా పక్కన కనిపించే చిన్న వడాపావ్ బండి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బండి ముందు నిలబడి వడాపావ్ అమ్ముతున్న వ్యక్తిని చూస్తే.. సాధారణ వ్యాపారిలాగే కనిపిస్తారు. కానీ.. ఆ బండి పక్కనే ఉన్న బంగ్లా కూడా ఆయనదే అని తెలిస్తే మాత్రం తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆయన ఎవరు?, ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.30ఏళ్లుగా వ్యాపారందాదాపు 30 ఏళ్లుగా వడాపావ్ అమ్ముతున్న అనిల్భాయ్.. 1997లో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో ఒక్క వడాపావ్ ధర కేవలం రూ.2.50 మాత్రమే. నేడు ఆయనకు సొంత బంగ్లా ఉన్నా.. తన వడాపావ్ బండిని మాత్రం వదల్లేదు. ఇప్పటికీ అవసరమైతే స్వయంగా బండి తీసుకుని ఉదయం 6 గంటలకే వ్యాపారం మొదలుపెడతారు.ఫుడ్ వ్లాగర్ హ్యారీ ఉప్పల్తో జరిగిన సంభాషణలో అనిల్భాయ్ తన జీవితంలోని ఎన్నో విషయాలను పంచుకున్నారు. తన బంగ్లా గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. ''ఆ బంగ్లాను నేను కట్టలేదు.. మాతాజీ ఆశీర్వాదంతో అది వచ్చింది'' అని ఆయన అన్నారు. తన విజయాన్ని తన కష్టంతో పాటు దేవుడి ఆశీస్సులకు, కుటుంబ సభ్యుల కృషికి ఆపాదించారు.వడాపావ్ అమ్మడానికి ముందువడాపావ్ అమ్మకాలు ప్రారంభించడానికి ముందు అనిల్భాయ్ కుటుంబం ఎన్నో రకాల పనులు చేసింది. ఆలయం దగ్గర చెప్పులు చూసుకోవడం, కార్లు పార్క్ చేయించడం, కూరగాయలు అమ్మడం వంటి పనులు చేశారు. తల్లి, సోదరుడు, సోదరితో కలిసి కుటుంబమంతా పనిచేసేది.తర్వాత అనిల్భాయ్కు ఓఎన్జీసీలో ప్యూన్గా ఉద్యోగం వచ్చింది. అయితే అక్కడ 17 నెలలు పనిచేసిన తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాతే వడాపావ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ముంబైలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వడాపావ్ను సూరత్లో విక్రయించాలనే ఆలోచన ఆయన తల్లిదే. తల్లికి వడాపావ్ తయారు చేయడం తెలుసు. ఆమె వడా తయారు చేస్తే.. అనిల్భాయ్ వాటిని తీసుకెళ్లి అమ్మేవారు. అలా మొదలైన చిన్న వ్యాపారం క్రమంగా ఎదిగింది.రూ.2.50 నుంచి1997లో వడాపావ్ను రూ.2.50కే విక్రయించేవారు. మొదట్లో ప్రధాన రహదారి పక్కన బండి పెట్టేవారు. అక్కడ కొన్ని సమస్యలు రావడంతో తర్వాత బండిని ప్రస్తుత ప్రదేశానికి మార్చారు. అయితే.. అప్పట్లో పరిస్థితులు అంత సులభంగా లేవు. సరుకులు తీసుకురావడం నుంచి రోడ్డుపై బండి పెట్టుకుని అమ్మడం వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా వ్యాపారాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.తన వడాపావ్ ప్రత్యేకత ఏమిటని హ్యారీ ఉప్పల్ అడిగినప్పుడు అనిల్భాయ్ చాలా సింపుల్గా సమాధానం ఇచ్చారు. ''మా అమ్మ మసాలా చేస్తుంది. ఆమె చేతుల్లో మాయ ఉంది. ఆమె తయారు చేస్తుంది.. మేము అమ్ముతాం'' అని చెప్పారు. ఈ వ్యాపారం కేవలం తన ఒక్కడిదే కాదని, కుటుంబం మొత్తం కలిసి చేసిన ప్రయాణమని ఆయన చెబుతారు. ఆయన అల్లుడు కూడా ప్రస్తుతం ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు కూడా గతంలో వడాపావ్ వ్యాపారం నిర్వహించేవారు.బంగ్లా నా కల కాదుఅనిల్భాయ్ కథలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఆయన నివసిస్తున్న బంగ్లాకు ఒకప్పుడు ఆయన కూరగాయలు అమ్మేందుకు వెళ్లేవారు. ఆ బంగ్లా అప్పట్లో హితేష్ పారేఖ్ అనే వ్యక్తికి చెందినది. తర్వాత అనిల్భాయ్ ఆ బంగ్లాను కొనుగోలు చేశారు. తాను ఎప్పుడైనా బంగ్లాలో నివసిస్తానని అసలు ఊహించలేదని ఆయన చెప్పారు. ఇది నా కల కాదు. నా తల్లి, నా సోదరుడి కల. నేను బంగ్లాలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదని ఆయన తెలిపారు.అనిల్భాయ్ కథలో అందరికీ నచ్చే విషయం ఏమిటంటే.. ఆర్థికంగా ఎదిగిన తర్వాత కూడా, ఆయన తన పాత వృత్తిని వదిలిపెట్టలేదు. ఇప్పటికీ ఉదయం 6 గంటలకు నేనే బండి తీసుకెళ్తాను, పనివాళ్లు లేకపోతే నేనే చేస్తానని అన్నారు.బంగ్లా పక్కనే వడాపావ్ బండి ఉండటం ఇప్పుడు ఆయన జీవితానికి ఒక ప్రత్యేక గుర్తుగా మారింది. బంగ్లా ఆయన సాధించిన స్థాయిని చూపిస్తే.. బండి ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టారో గుర్తు చేస్తుంది. రోడ్డుపై ఆహారం అమ్మేవారిని చాలామంది పేదలుగా చూస్తారని అనిల్భాయ్ చెప్పారు. కానీ వారి కష్టాన్ని తక్కువగా చూడకూడదని ఆయన అభిప్రాయం.కష్టపడితే మంచిరోజుప్రజలు మమ్మల్ని పేదవాళ్లమని అనుకుంటారు. కానీ ఎవరైనా కష్టపడి పనిచేస్తే.. చిన్నవారైనా, పెద్దవారైనా.. ఏదో ఒకరోజు మంచి ఫలితం పొందుతారు అని అనిల్భాయ్ అన్నారు.రూ.2.50కి వడాపావ్ అమ్ముతూ మొదలైన అనిల్భాయ్ ప్రయాణం.. నేడు సొంత బంగ్లా వరకు చేరింది. అయితే ఆయన కథలో నిజమైన విజయం బంగ్లా సంపాదించడంలోనే లేదు. ఎంత ఎదిగినా తాను మొదలుపెట్టిన పనిని, తన కుటుంబాన్ని, తన మూలాలను మర్చిపోకపోవడంలో ఉంది.ఇదీ చదవండి: ఉదయం 6 గంటలకే మెయిల్.. ఉద్యోగులకు షాక్! -
'బ్రిక్స్ విమెన్ ఎకనామిక్ కారిడార్' ఏర్పాటు చేయాలి: ఉపాసన
మహిళల సాధికారత కేవలం ప్రాతినిధ్యానికే పరిమితం కాకుండా మూలధనం, మార్కెట్లు, ఒప్పందాలు, ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక యాజమాన్యంగా మారాలని అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్, యూఆర్లైఫ్ వ్యవస్థాపకురాలు ఉపాసన కామినేని కొణిదెల పిలుపునిచ్చారు. మహిళా పారిశ్రామికవేత్తలను బ్రిక్స్ దేశాల మధ్య అనుసంధానించేందుకు ‘బ్రిక్స్ విమెన్ ఎకనామిక్ కారిడార్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.న్యూఢిల్లీలో భారత్ బ్రిక్స్ అధ్యక్షతన నిర్వహించిన బ్రిక్స్ విమెన్ బిజినెస్ అలయన్స్ (డబ్ల్యూబీఏ) విమెన్-లెడ్ డెవలప్మెంట్ సమ్మిట్-2026లో ఆమె ప్రత్యేక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మహిళలను ఆర్థిక వృద్ధిలో మరింత కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు విధానాలను పునరాలోచించాల్సిన అవసరం ఉందన్నారు.''వ్యాపార రంగంలో మరింత మంది మహిళలను ఎలా భాగస్వాములను చేయాలన్నదే చర్చగా ఉండకూడదు. వృద్ధి రూపకల్పనలో మహిళలు కేంద్రంగా ఉంటే బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ఎలా మారతాయన్నదే అసలు ప్రశ్న'' అని ఉపాసన పేర్కొన్నారు.ప్రాతినిధ్యం ఉన్నా నిర్ణయాధికారం లేకపోవడం, భాగస్వామ్యం ఉన్నా ఆర్థిక శక్తి లేకపోవడం, ఉద్యోగం ఉన్నా ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం, సాధికారత ఉన్నా యాజమాన్యం లేకపోవడం పూర్తిస్థాయి అభివృద్ధి కాదన్నారు. మహిళా అభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు అనుగుణంగా తదుపరి దశలో స్పష్టమైన ఆర్థిక ఫలితాలను సాధించాలని సూచించారు.మహిళల కోసం ఏర్పాటయ్యే స్టార్టప్ వేదికలు అవార్డులకే పరిమితం కాకుండా పెట్టుబడులకు దారితీయాలని, నెట్వర్కింగ్ కేవలం పరిచయాలకే కాకుండా వ్యాపార ఒప్పందాలకు దోహదపడాలని, ఆర్థిక సమ్మిళితత కేవలం బ్యాంకు ఖాతాలకే పరిమితం కాకుండా ఆస్తులు, పెట్టుబడుల సృష్టికి దారితీయాలని ఆమె సూచించారు.మహిళల ఆర్థిక సాధికారతకు ఆరోగ్యం, సంపద, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు మూడు కీలక అంశాలని ఆమె పేర్కొన్నారు. ''మహిళకు కేవలం బల్ల దగ్గర ఒక స్థానం ఇవ్వడం కాదు.. ఆ బల్లలోనే వాటా ఇవ్వాలి. అప్పుడే నిజమైన ఆర్థిక శక్తి లభిస్తుంది'' అని ఉపాసన అన్నారు. బ్రిక్స్ మహిళా ఆర్థిక కారిడార్ ద్వారా మహిళల ఆధ్వర్యంలోని సంస్థలకు పెట్టుబడులు, కొనుగోలుదారులు, అంతర్జాతీయ మార్కెట్లు, భాగస్వామ్యాలు, సరిహద్దులు దాటి వ్యాపార అవకాశాలు అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు.భారత్ 2021లో బ్రిక్స్ అధ్యక్షత వహించిన సమయంలో బ్రిక్స్ విమెన్ బిజినెస్ అలయన్స్ ఇండియా చాప్టర్కు అధ్యక్షత వహించిన అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి సేవలను, ప్రస్తుత ఇండియా చాప్టర్ చైర్పర్సన్ అవర్ణ జైన్ చేస్తున్న కృషిని ఉపాసన కొనియాడారు.మహిళల నేతృత్వంలోని సంస్థలను ప్రపంచ విలువ గొలుసులతో అనుసంధానించడం, వ్యాపార నెట్వర్క్లను విస్తరించడం, బీ2బీ సహకారాన్ని పెంపొందించడం బ్రిక్స్ విమెన్ బిజినెస్ అలయన్స్ ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. మహిళలు ఎంతమంది పాల్గొంటున్నారు అన్నదే కాకుండా.. ఎంతమంది యాజమాన్యాన్ని చేపడుతున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, నాయకత్వం వహిస్తున్నారు, సంపదను సృష్టిస్తున్నారు అన్నదే మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి కొలమానంగా ఉండాలని ఉపాసన స్పష్టం చేశారు. -
ఉదయం 6 గంటలకే మెయిల్.. ఉద్యోగులకు షాక్!
ఒకరోజు ఉదయం నిద్రలేచి ఈమెయిల్ చూడగానే.. 'ఈరోజే మీ చివరి పని రోజు' అని మెయిల్ వస్తే ఎలా ఉంటుంది?. ఒరాకిల్ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఉదయం సుమారు 6 గంటల సమయంలో వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు.. అదే రోజు చివరి పని దినమని కంపెనీ నుంచి సమాచారం వచ్చింది.ఉద్యోగుల తొలగింపుకు కారణం.. కంపెనీలో జరుగుతున్న విస్తృత సంస్థాగత మార్పులు అని ఈమెయిల్లో పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఉద్యోగులు ఉపయోగిస్తున్న కంపెనీ కంప్యూటర్లు, ఈమెయిల్, వాయిస్మెయిల్, ఫైల్స్ వంటి సిస్టమ్లకు యాక్సెస్ త్వరలో నిలిపివేస్తామని వెల్లడించారు. భవిష్యత్లో సీవరెన్స్ (ఉద్యోగం ముగిసినప్పుడు ఇచ్చే పరిహారం), ఇతర పత్రాల కోసం వ్యక్తిగత ఈమెయిల్ చిరునామా ఇవ్వాలని సూచించారు.ఒరాకిల్ ప్రస్తుతం ఏఐ రంగంలో భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి.. డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఇతర మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ సుమారు 28.5 బిలియన్ డాలర్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఖర్చు చేసిన దానికంటే.. ఇది మూడు రెట్లకంటే ఎక్కువ.అంతేకాకుండా.. మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఒరాకిల్ 90-95 బిలియన్ డాలర్ల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలని అంచనా వేసింది. ఏఐ క్లౌడ్ సేవలకు డిమాండ్ కూడా చాలా బలంగా ఉంది. ఒక్క త్రైమాసికంలోనే 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన అదనపు ఏఐ క్లౌడ్ ఒప్పందాలు కుదిరినట్లు ఒరాకిల్ తెలిపింది.అయితే.. ఇంత భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల కంపెనీపై ఆర్థిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. కాబట్టి ఒరాకిల్ ఒక కఠినమైన సమతుల్యతను పాటించాల్సి వస్తోంది. ఒకవైపు ఏఐ భవిష్యత్తు కోసం భారీగా పెట్టుబడి పెట్టాలి.. మరోవైపు ఖర్చులను నియంత్రించాలి. ఈ కారణంగానే ఉద్యోగాల తొలగింపు చేపట్టినట్లు స్పష్టమవుతుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు షాక్.. టెక్ దిగ్గజంలో మరోమారు లేఆఫ్స్! -
ఐఆర్సీటీసీలో రైలు టికెట్ బుక్ చేసిన చాట్జీపీటీ
కృత్రిమ మేధ సాంకేతికత డిజిటల్ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో చెప్పడానికి ఇదో తాజా ఉదాహరణ. నిత్యం లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ ప్రక్రియను ‘చాట్జీపీటీ అస్ట్రా’ అనే ఏఐ అసిస్టెంట్ అత్యంత సులభంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.కంటెంట్ క్రియేటర్ మంథన్ జేత్వానీ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా జేత్వానీ ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ముంబై నుంచి రాజ్కోట్కు సెప్టెంబర్ 20న, రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య ఏసీ క్లాస్లో ఇద్దరు ప్రయాణికులకు టికెట్లు వెతకాలని చాట్జీపీటీ అస్ట్రాను కోరారు.ఆశ్చర్యకరంగా, ఆ ఏఐ అసిస్టెంట్ మానవ ప్రమేయం లేకుండానే బ్రౌజర్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్లోకి ప్రవేశించింది. స్టేషన్ల పేర్లు, ప్రయాణ తేదీ, సమయం, క్లాస్ వివరాలను నమోదు చేసి రైళ్లను వెతికింది. మొదట వెయిటింగ్ లిస్ట్ కనిపించడంతో మరుసటి రోజుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రయాణికుల వివరాలను కూడా పూర్తి చేసి ఆఖరి పేమెంట్ పేజీ వరకు ప్రక్రియను తీసుకెళ్లింది. వినియోగదారుడు కేవలం డబ్బులు చెల్లించడం మాత్రమే మిగిలింది. ఈ వీడియోపై స్వయంగా చాట్జీపీటీ స్పందిస్తూ ‘అస్ట్రా లా విస్టా.. హ్యాపీ జర్నీ మంథన్’ అని కామెంట్ చేయడం విశేషం.సాంకేతిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. సాధారణ బుకింగ్స్లో ఏఐ ఏజెంట్లు విజయం సాధిస్తున్నప్పటికీ నిమిషాల వ్యవధిలో ముగిసే ఐఆర్సీటీసీ తత్కాల్ బుకింగ్స్, సైట్ క్యాప్చా భద్రతా ప్రాసెస్లలో ఇవి ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయనేది వేచి చూడాలి. నెటిజన్లు కూడా ‘దీపావళి పండుగ సమయాల్లో బిహార్ టికెట్లు బుక్ చేసి చూపిస్తే నమ్ముతాం’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, భవిష్యత్తులో రోజువారీ డిజిటల్ పనులను, సంక్లిష్టమైన ఆన్లైన్ లావాదేవీలను ఏఐ స్వయంప్రతిపత్తితో ఎలా సులభంగా నిర్వహించగలదో ఈ ప్రయోగం స్పష్టం చేస్తోంది. View this post on Instagram A post shared by Manthan Jethwani (@manthanjethwani)ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం -
ఒక్కసారి ఓకే అన్నందుకు..
హైదరాబాద్కు చెందిన రవి కొన్నేళ్ల క్రితం ఓ బ్యాంకులో క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేశాడు. ఆ సందర్భంగానే బ్యాంకు, దాని భాగస్వామ్య సంస్థల నుంచి అడ్వర్టైజ్మెంట్ మెసేజీలు అందుకేనేందుకు ఓకే అన్నాడు. కాలం గడిచింది. రవి ఆ క్రెడిట్ కార్డును మూసివేశాడు. ఇంకో బ్యాంకుకు మారాడు. కొత్తగా ఎలాంటి రుణాలు లేదా క్రెడిట్ కార్డు ఆఫర్లు అవసరం లేదని నిర్ణయించుకున్నాడు. అయినాసరే.. ఏళ్ల తరువాత కూడా రవి ఫోన్కు బ్యాంకింగ్, రుణాలు, క్రెడిట్ కార్డు ఆఫర్ల ఎస్ఎంఎస్లు, ఫోన్కాల్స్, వాట్సాప్ మెసేజీలు వస్తూనే ఉన్నాయి. ఎందుకిలా అని రవి తన టెలికాం ఆపరేటర్ను ప్రశ్నిస్తే... ఏళ్ల క్రితం ఒక్కసారి ఓకే అన్న ఫలితమిది అని తెలిసింది. ఈ సమస్యకు పరిష్కారం?సమ్మతి శాశ్వతం కాదుఒక వినియోగదారుడికి ఇష్టం లేని ప్రచార మెసేజీలు రావడానికి కారణం.. గతంలో ఎప్పుడో ఒకసారి ఓకే అని ఉంటాడన్న భావన. ఖాతా తెరిచేటప్పుడు, సర్వీస్ రిజిస్ట్రేషన్, యాప్ డౌన్లోడ్, లేదా ఫామ్ నింపేటప్పుడు ఓకే అని ఉండవచ్చు. అయితే వినియోగదారుల అభిరుచులు, అవసరాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొత్త విషయాలపై ఆసక్తి పెరగవచ్చు, కొన్ని ఉత్పత్తులను వినియోగించడం మానేయవచ్చు, సర్వీస్ ప్రొవైడర్ను మార్చుకోవచ్చు లేదా ఒక సంస్థ నుంచి ఇకపై ఎలాంటి మెసేజీలు వద్దని నిర్ణయించుకోవచ్చు. అందువల్ల గతంలో ఇచ్చిన అనుమతి.. ప్రస్తుతం వినియోగదారుడి అభీష్టాన్ని ప్రతిబింబించకపోవచ్చు. ‘ఒకానొక సందర్భంలో వినియోగదారుడి ఆసక్తికి అతడిచ్చిన ఒకే అద్దం పట్టవచ్చు. అయితే సందర్భం మారినప్పుడు ఈ సమ్మతి కూడా మారగలగాలి. ఇంకోలా చెప్పాలంటే సమ్మతిని శాశ్వతమైన చారిత్రక రికార్డుగా కాకుండా.. వినియోగదారుడు ఎప్పటికప్పుడు మార్చుకోగలిగే ఎంపికగా చూడాలి.’’ అంటారు భారతి ఎయిర్టెల్ గ్రూప్ కార్పొరేట్ అఫైర్స్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్, డైరెక్టర్ రాహుల్ వత్స్. రవి విషయంలో జరిగింది ఇదే. ఒక్కసారి ఓకే అన్నందుకు.. ఆ తర్వాత కూడా మెసేజీలు వస్తూనే ఉండాలా?ఎవరి బాధ్యత?వాణిజ్య సమాచార నియంత్రణకు సంబంధించి భారత్ పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ (టీసీసీసీపీఆర్), డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ), సంస్థల రిజిస్ట్రేషన్ నిబంధనలు, మెసేజీల టెంప్లేట్ ధ్రువీకరణ విధానాలు, డిజిటల్ కన్సెంట్ అక్విజిషన్ (డీసీఏ) వ్యవస్థ.. ఇవన్నీ కలసి సమగ్ర యాంటీ-స్పామ్ నియంత్రణ వ్యవస్థను రూపొందించాయి. నియంత్రణకు అవసరమైన పునాది ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎదురవుతున్న సవాలు.. మెసేజింగ్ ప్రక్రియలో సమ్మతిని ఏ దశలో, ఎవరు అమలు చేయాలన్నదే.ప్రతిపాదిత డీసీఏ వ్యవస్థలో సమ్మతి సేకరణ, నమోదు, ధ్రువీకరణ వంటి ప్రక్రియలు ప్రధానంగా ప్రారంభ దశలోనే జరుగుతాయి. ఆరిజినేటింగ్ యాక్సెస్ ప్రొవైడర్లు (ఓఏపీలు), మెసేజింగ్ వ్యవస్థలోని ఇతర భాగస్వాములు సంస్థలను నమోదు చేయడం, సమ్మతి వివరాలను నిర్వహించడం, మెసేజీల పంపిణీకి వీలు కల్పించడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తారు. అయితే, మెసేజీని స్వీకరించే వినియోగదారుడితో కొనసాగుతున్న సంబంధాన్ని నిర్వహించే బాధ్యత మాత్రం టెర్మినేటింగ్ యాక్సెస్ ప్రొవైడర్ (ట్యాప్)పై ఉంటుంది. అంటే.. వినియోగదారుడు ఉపయోగిస్తున్న టెలికాం ఆపరేటర్పైనే ఉంటుంది.ట్యాప్ నేరుగా చందాదారుడికి సేవలు అందిస్తుంది. వినియోగదారుల ప్రాధాన్యతలను పర్యవేక్షిస్తుంది. స్పామ్పై వచ్చే ఫిర్యాదులను స్వీకరిస్తుంది. వినియోగదారుల విశ్వాసాన్ని కాపాడే బాధ్యతను కూడా భరిస్తుంది. అనవసరమైన మెసేజీలు వచ్చినప్పుడు చందాదారులు సాయం కోసం ముందుగా సంప్రదించేది తమ సొంత టెలికాం ఆపరేటర్నే. అయినా, ఒక వాణిజ్య మెసేజీని చందాదారుడికి పంపాలా వద్దా అని నిర్ణయించే సమ్మతి ధ్రువీకరణ వ్యవస్థపై ట్యాప్కు పూర్తి నియంత్రణ లేదు.“వినియోగదారుడి సమ్మతిని సేకరించి, నిర్వహించే సంస్థ.. ఆ సందేశాన్ని స్వీకరించే చందాదారుడితో కొనసాగుతున్న సంబంధాన్ని కలిగి ఉండకపోవచ్చు. కానీ చందాదారుడి ప్రాధాన్యతలు, ఫిర్యాదులు, విశ్వాసాన్ని నిర్వహించే బాధ్యత ట్యాప్పైనే ఉంటుంది. బాధ్యత ఒకరి వద్ద, నిర్ణయాధికారం మరొకరి వద్ద ఉండటం వ్యవస్థలో అంతరాన్ని సృష్టిస్తుంది.” అంటారు రాహుల్ వత్స్.ఈ విభజన ప్రభావం డీఎల్టీ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాట్ఫారమ్లో గుర్తించిన 32,095 బ్లాక్లిస్ట్ సంస్థల్లో దాదాపు 87 శాతం కేవలం రెండు ఓఏపీ-మాత్రమే టెలికాం ఆపరేటర్లతో సంబంధం కలిగి ఉన్నాయి. వీటిలో ఒక ఆపరేటర్కు సుమారు 53 శాతం, మరో ఆపరేటర్కు దాదాపు 34 శాతం బ్లాక్లిస్ట్ సంస్థలు అనుబంధంగా ఉన్నాయి. 2026 మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన మొత్తం బ్లాక్లిస్ట్ టెంప్లేట్లలో దాదాపు 40 శాతం ఒకే ఆపరేటర్కు సంబంధించినవే.సమ్మతి ధ్రువీకరణను వినియోగదారుడితో నేరుగా సంబంధం లేని సంస్థల వద్ద ఉంచినప్పుడు ఎదురయ్యే సమస్యను ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మెసేజీల పంపిణీ.. చందాదారుడి ప్రస్తుత అభిరుచులను ప్రతిబింబించని రికార్డులపై ఆధారపడే ప్రమాదం ఉంది.ట్యాప్ ఆధారిత పరిష్కారంసమ్మతి అనేది ఒక నిర్దిష్ట సమయంలో వినియోగదారుడి ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఆ ఉద్దేశం మారినప్పుడు సమ్మతి కూడా మారే అవకాశం ఉండాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న ప్రస్తుత కాలంలో సమ్మతి అనేది గతంలో నమోదైన స్థిరమైన రికార్డుగా కాకుండా.. వినియోగదారుడు ఎప్పుడైనా మార్చుకోగలిగే చురుకైన ఎంపికగా ఉండాలి. అందువల్ల ట్యాప్ ఆధారిత సమ్మతి నిర్వహణను పరిగణనలోకి తీసుకోవాలి. ట్యాప్ ఆధారిత డీసీఏ వ్యవస్థలో చందాదారుడి టెలికాం ఆపరేటర్ సమ్మతిని సేకరించడం, ధ్రువీకరించడం, భద్రపరచడం, అమలు చేయడం వంటి బాధ్యతలను చేపడుతుంది. రవి తన టెలికాం యాప్లో బ్యాంకింగ్, బీమా, రుణాలకు సంబంధించిన ప్రచార మెసేజీలను నిలిపివేశాడనుకుందాం. అదే సమయంలో ఒక ఆర్థిక సంస్థ వద్ద అతని పాత సమ్మతి రికార్డు ఇంకా చెల్లుబాటులో ఉన్నట్లు కనిపించవచ్చు. ట్యాప్ ఆధారిత వ్యవస్థలో మెసేజీ పంపే ముందు ఆపరేటర్ రవి తాజా ప్రాధాన్యతలను పరిశీలించి, ఆ మెసేజీని నిలిపివేయగలదు.దీంతో గతంలో ఇచ్చిన సమ్మతి కంటే.. వినియోగదారుడి ప్రస్తుత నిర్ణయానికే ప్రాధాన్యం లభిస్తుంది. ఈ విధానం వల్ల వినియోగదారుడి ప్రయోజనాలను రక్షించే బాధ్యత ఉన్న ఆపరేటర్కే.. వాణిజ్య మెసేజీలపై నిర్ణయాధికారం ఉంటుంది. అలాగే... వినియోగదారుడి అభిరుచులకు తగ్గట్టు వెంటనే మార్పులు చేసే వీలు ఏర్పడుతుంది. సున్నితమైన వివరాలను స్థానికంగానే భద్రపరచవచ్చు. దీంతో గోప్యత, పర్యవేక్షణ మెరుగుపడతాయి. వినియోగదారులతో నేరుగా సంబంధం ఉన్న ఆపరేటర్లు కొత్త నియంత్రణలు, భద్రతా ఫీచర్లు, రక్షణ చర్యలను వేగంగా ప్రవేశపెట్టగలరు.ప్రస్తుత సమ్మతికే ప్రాధాన్యంస్పామ్ను నియంత్రించేందుకు భారత్ ఇప్పటికే బలమైన పునాదిని నిర్మించింది. ప్రస్తుత చర్యలు టెలికాం వనరుల దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు పటిష్టమైన అనుసరణ వ్యవస్థను ఏర్పాటు చేశాయి. అయితే మోసపూరిత సమాచార ప్రసార పద్ధతులు నిరంతరం మారుతున్నాయి. అందువల్ల సమ్మతి తీసుకున్న సమయంలో మాత్రమే దాన్ని తనిఖీ చేయడం కాకుండా.. వాణిజ్య మెసేజీ వినియోగదారుడికి చేరే సమయంలోనూ సమ్మతిని అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక వసతులను నిర్మించే సామర్థ్యం భారత్కు ఉందని ఇప్పటికే నిరూపితమైంది. ఇకపై వినియోగదారుల రక్షణ, సమ్మతి అమలు, జవాబుదారీతనాన్ని ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావాలి. డిజిటల్ కమ్యూనికేషన్ మరింత విస్తరిస్తున్న కొద్దీ.. చందాదారుడి నేటి అభీష్టాన్ని సమ్మతి ప్రతిబింబిస్తుందా, లేక గతంలో ఎప్పుడో ఇచ్చిన అనుమతినే చూపిస్తుందా అన్నదానిపైనే వినియోగదారుల విశ్వాసం ఆధారపడి ఉంటుంది. వత్స్ మాటల్లో చెప్పాలంటే: “సమ్మతి సేకరించినప్పుడు మాత్రమే కాదు.. మెసేజీ డెలివరీ అయ్యే సమయంలోనూ అర్థవంతంగా ఉండాలి. వినియోగదారుడి ప్రస్తుత నిర్ణయానికే ప్రాధాన్యం లభించే విధంగా వ్యవస్థను రూపొందించాలి.” -
ట్రంప్తో లైవ్ కాల్.. ఏమైందంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థల వల్ల మానవాళికి వినాశనం ఎదురవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఏఐ నియంత్రణ, దానికి సంబంధించిన భయాలు కేవలం ఒక ‘అభూతకల్పన (హోక్స్)’ మాత్రమేనని తేల్చిచెప్పారు.లాస్ ఏంజెలెస్లో జరిగిన ‘ఆల్-ఇన్ సమిట్’ లైవ్ ప్యానెల్లో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతుండగా ట్రంప్ ఊహించని విధంగా ఆయనకు ఫోన్ చేశారు. జెన్సన్ వెంటనే ఆ ఫోన్ కాల్ను స్పీకర్ఫోన్లో పెట్టి సభలోని ప్రతినిధులకు వినే అవకాశం కల్పించారు.ఈ ప్రత్యక్ష సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘రోబోలు లేదా ఏఐ ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఏఐ అభివృద్ధిని వెనక్కు లాగాలనుకునేవారు చైనా వంటి ప్రత్యర్థి దేశాల ప్రయోజనాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు రాబోయే 20-25 ఏళ్లకు సరిపడా అత్యంత కీలకమైన ఇంధనం లాంటివి. ఏఐ రేసులో ఎవరు గెలిస్తే వారే విజేతగా నిలుస్తారు’ అని స్పష్టం చేశారు. పరిశ్రమను ఆపే ఉద్దేశం తమకు లేదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు.MUST SEE: Amazing moment as President Trump calls Nvidia CEO Jensen Huang while he's on stage at the All-In Summit.@POTUS on AI Doomerism: “I'm telling you, it's all a hoax… and we're not going to let that happen.” pic.twitter.com/ZP8cCaSMqG— The All-In Podcast (@theallinpod) September 14, 2026మరోవైపు ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోది, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ వంటి ప్రముఖ సాంకేతిక దిగ్గజాలు ఏఐ రక్షణపై, వేగం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో ఏకీభవించిన జెన్సన్ హువాంగ్, ఏఐ రంగంలో అమెరికా ఆధిక్యతను కొనసాగించేందుకు దేశంలోని ప్రతి పరిశ్రమ ప్రయోజనం పొందేలా చూసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్కి శుభవార్త.. ధరల పతనం -
కాలంతో పోటీపడిన సాంకేతిక శిఖరం.. మోక్షగుండం!
ఆలోచనకు ఆకారం ఇవ్వడమే ఇంజినీరింగ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రగతికి నాంది పలికే వారే ఇంజినీర్లు. సమాజ పురోగతికి అహర్నిశలు శ్రమించే ఈ సాంకేతిక శిల్పుల త్యాగాన్ని, ప్రతిభను స్మరించుకునేందుకు ఏటా సెప్టెంబర్ 15న ‘ఇంజినీర్స్ డే’గా జరుపుకుంటాం. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహించడం ఆయనకు దేశం ఇచ్చే ఘన నివాళి. నేటి డిజిటల్ యుగంలో ‘కూర్చుంటే మాటలు.. నిలబడితే చేతలు’ అన్నట్లు కాలం గడిపే యువతకు విశ్వేశ్వరయ్య జీవితం స్ఫూర్తిమంతం.పేదరికాన్ని గెలిచిన మహోన్నత బాల్యంకర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా ముద్దెనహళ్లిలో ఒక సాధారణ పేద కుటుంబంలో 1861 సెప్టెంబర్ 15న విశ్వేశ్వరయ్య జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా తాను ధైర్యం కోల్పోలేదు. వీధిదీపాల కింద చదువుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ విద్యనభ్యసించారు. కష్టపడేవాడికి కామధేనువు సమకూరుతుంది అన్న చందంగా, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో బీఏ, ఆపై పుణెలోని సైన్స్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ ఫస్ట్ క్లాస్లో పూర్తి చేశారు.వృత్తి ధర్మం.. నిర్మాణాత్మక సేవలుబ్రౌన్/బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రారంభ కెరీర్ (1884 – 1908)పుణెలో ఇంజినీరింగ్ విద్య పూర్తయిన వెంటనే 1884లో బొంబాయి ప్రెసిడెన్సీలోని ప్రజాపనుల శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా చేరారు.ప్రస్తుత పాకిస్థాన్లోని సుక్కూర్ నగరంలో సింధు నది నీరు మురికిగా ఉంటే దానికి ప్రత్యేక ‘ఫిల్ట్రేషన్’ విధానాన్ని రూపొందించి స్వచ్ఛమైన నీటిని అందించారు.బ్లాక్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్: నీటి వృధాను అరికట్టడానికి కాలవల ద్వారా పొలాలకు సమంగా నీరందేలా ‘బ్లాక్ పద్ధతి’ని ప్రవేశపెట్టారు.ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు: పుణె సమీపంలోని ఖడక్వాస్లా జలాశయానికి వరద నీటి నియంత్రణ కోసం పేటెంట్ పొందిన ఆటోమేటిక్ గేట్లను రూపొందించారు. శానిటరీ ఇంజినీర్: 1901లో బొంబాయి ప్రభుత్వంలో శానిటరీ ఇంజినీర్గా సేవలు అందించారు. హైదరాబాద్ నగర రూపశిల్పిగా (1908 – 1909)1908లో హైదరాబాద్ను ముంచెత్తిన మూసీ నది తీవ్ర వరదల తర్వాత ఆనాటి నిజాం ప్రభుత్వం ఆయనను ప్రత్యేక సలహాదారుగా/చీఫ్ కన్సల్టింగ్ ఇంజినీర్గా ఆహ్వానించింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను డిజైన్ చేశారు. నగర రక్షణకు, తాగునీటి అవసరాలకు ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్ జలాశయాల నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేశారు.మైసూర్ సంస్థానంలో కీలక భాధ్యతలు (1909 – 1918)1909లో బ్రిటిష్ సర్వీస్కు స్వచ్ఛంద విరమణ (వీఆర్ఎస్) ఇచ్చి మైసూర్ మహారాజు నాలుగో కృష్ణరాజ ఒడియార్ పిలుపు మేరకు మైసూర్ సంస్థానంలో చేరారు. మైసూర్ రాజ్యంలో ప్రజాపనుల శాఖ కార్యదర్శిగా, ప్రధాన ఇంజినీర్గా బాధ్యతలు నిర్వహించి కృష్ణరాజ సాగర్ (కేఆర్ఎస్) డ్యామ్కు రూపకల్పన చేశారు. 1912లో మైసూర్ 19వ దివాన్ (ప్రధానమంత్రి)గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలో రాజ్యాన్ని పారిశ్రామికంగా, విద్యాపరంగా అగ్రపథంలో నిలిపారు. భద్రావతిలో మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్ స్థాపించారు. బెంగళూరులో యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఏర్పాటు చేశారు. మైసూర్ సోప్ ఫ్యాక్టరీ ప్రారంభించారు.ఉద్యోగ విరమణ అనంతరందివాన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా ఆయన ఖాళీగా ఉండలేదు. దేశ నిర్మాణం కోసం పలు కీలక బోర్డుల్లో, కమిటీల్లో పనిచేశారు. టాటా స్టీల్ డైరెక్టర్ బోర్డులో (1927 – 1955) దాదాపు 28 ఏళ్ల పాటు సభ్యుడిగా ఉంటూ సంస్థ విస్తరణకు సలహాలు ఇచ్చారు. విశాఖపట్నం పోర్ట్లో సముద్రపు కోత నుంచి వైజాగ్ నౌకాశ్రయం దెబ్బతినకుండా రక్షణ వ్యవస్థలను రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్ట్ బోర్డ్ ఆఫ్ ఇంజినీర్స్కు ఛైర్మన్గా వ్యవహరించారు. విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14న బెంగళూరులోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యల (సహజ కారణాల) వల్ల కన్నుమూశారు.దేశం ఇచ్చిన సర్వోన్నత గౌరవంవిశ్వేశ్వరయ్య జీవనశైలి నిరంతరం క్రమశిక్షణకు ప్రతిరూపం. ఆయన ఎప్పుడూ ‘చేప పిల్లకి ఈత నేర్పక్కర్లేదు’ అన్నట్లుగా సమర్థంగా పనిచేస్తూండేవారు. పక్కాగా సమయాన్ని పాటించేవారు. సమాజానికి ఆయన చేసిన అసమాన సేవలకుగానూ 1955లో భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. అలాగే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ‘నైట్హుడ్’(సర్) బిరుదును ప్రదానం చేసింది.నేటి యవతకు ఆయన జీవితమే పాఠంతాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోకుండా యువత క్రమశిక్షణ, నిబద్ధత అలవర్చుకోవాలని ఆయన జీవితం చెబుతోంది. కాలం కరిగిపోయే నీటి లాంటిది; దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అడ్డంకులు ఎదురైతే వెనుకంజ వేయకుండా పరిష్కారం వైపు ఆలోచించాలి. సాంకేతికతను కేవలం స్వార్థానికి కాకుండా సమాజాభివృద్ధికి ఉపయోగించాలని ఆయన జీవితం చెబుతోంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య చూపిన ప్రగతి బాటలో పయనిస్తూ నైపుణ్యాలకు పదును పెట్టుకోవడమే నేటి యువత ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. 102 ఏళ్ల సంపూర్ణ జీవితంలో ప్రతి నిమిషాన్ని దేశ పునర్నిర్మాణానికే అంకితం చేసిన ఈ అపర విశ్వకర్మ భారతజాతికి నిత్యస్మరణీయుడు!ఇదీ చదవండి: గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు! -
గాడిదల వ్యాపారం.. చైనా డిమాండ్.. పాకిస్థాన్ ఆశలు!
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్, చైనాతో ఒక వినూత్నమైన వాణిజ్య ఒప్పందానికి తెరలేపింది. చైనాలో విపరీతమైన డిమాండ్ ఉన్న గాడిద చర్మం (హైడ్), మాంసం ఎగుమతికి పాకిస్థాన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికోసం చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కీలక కేంద్రమైన గ్వాదర్ పోర్ట్ సమీపంలో గాడిదల వధశాల (స్లాటర్ హౌస్), ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.గాడిద చర్మం ఎందుకంటే..ఈ విచిత్రమైన వాణిజ్యం వెనుక చైనా సాంప్రదాయ వైద్య రంగానికి ఉన్న అవసరాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. చైనాలో గాడిద చర్మం నుంచి తయారుచేసే ‘ఎజియావో’ అనే జిలాటిన్ ఆధారిత ఔషధానికి అత్యంత ప్రాచుర్యం ఉంది. రక్తప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మ సంరక్షణ, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుందని చైనీయులు నమ్ముతారు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రాసెస్ చేసిన ఎజియావో కిలో ధర వందల డాలర్లలో పలుకుతుంది. అయితే, చైనాలో వ్యవసాయ యాంత్రీకరణ పెరగడంతో 1990లలో 1.1 కోట్లుగా ఉన్న గాడిదల సంఖ్య ప్రస్తుతం 20 లక్షల కంటే దిగువకు పడిపోయింది. దీంతో వార్షికంగా చైనాకు అవసరమయ్యే దాదాపు 59 లక్షల గాడిద చర్మాల కోసం ఆ దేశం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడం లేదు.ఆఫ్రికాలో నిషేధంగతంలో చైనాకు ప్రధాన వనరుగా ఉన్న ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు గాడిదల ఎగుమతిపై నిషేధం విధించడంతో చైనా దృష్టి ఆసియా వైపు మళ్లింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద గాడిదల జనాభా (సుమారు 58 లక్షలకు పైగా) కలిగిన పాకిస్థాన్, ఈ అవకాశాన్ని విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించే మార్గంగా మార్చుకుంది. గ్వాదర్ ఫ్రీ జోన్లో ప్రాసెసింగ్ సదుపాయాల ద్వారా టన్నుల కొద్దీ ఘనీభవించిన మాంసం, చర్మాలను చైనాకు నౌకల ద్వారా రవాణా చేస్తున్నారు.పాకిస్థాన్ వాదన ఇదే..అయితే ఈ నిర్ణయంపై పాకిస్థాన్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ నియమాల ప్రకారం గాడిద మాంసం వినియోగం నిషిద్ధం కావడంతో, కేవలం ఎగుమతికే పరిమితం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి, రవాణాకు జీవనాధారమైన గాడిదల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుందని స్థానికులు, జంతు సంక్షేమ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా, మారుతున్న అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలకు, ఆర్థిక అవసరాలకు ఈ గాడిదల దౌత్యం ఒక విచిత్ర నిదర్శనంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు షాకిచ్చిన కొత్త రూల్స్! -
అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు షాకిచ్చిన కొత్త రూల్స్!
ఆన్లైన్ షాపింగ్ వేదికల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 10న కొత్త ఈ-కామర్స్ నిబంధనలను ప్రకటించింది. 2027 జనవరి 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల విక్రయ సరళిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, అమలు గడువు 2027 కావడం వల్ల ఈ ఏటి పండగల సీజన్ సేల్స్పై ఎలాంటి తక్షణ ప్రభావం ఉండబోదు.డిస్కౌంట్ల లెక్కింపులో పారదర్శకతఇన్నాళ్లూ కృత్రిమంగా ఎక్కువ ధరలను (ఎంఆర్పీ) చూపిస్తూ భారీ శాతం తగ్గింపులను ప్రకటించే విక్రేతలకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. నూతన నిబంధనల ప్రకారం, ఆఫర్ ధరతో పాటు దానికి ముందు ఉన్న ప్రీయర్ ప్రైస్ను కూడా స్పష్టంగా చూపించాలి. ఆఫర్ ప్రకటించడానికి ముందు 30 రోజుల్లో సదరు వస్తువు లభించిన అతి తక్కువ ధరనే ‘ప్రీయర్ ప్రైస్’గా పరిగణిస్తారు. దీనివల్ల అవాస్తవిక డిస్కౌంట్ ప్రకటనలకు కాలంచెల్లనుంది.మానిప్యులేషన్కు చెక్కొనుగోలుదారులు వెతికే సెర్చ్ ఫలితాలను పక్కదోవ పట్టించేలా అల్గారిథమ్లను మార్చకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ప్రకటనల ద్వారా పొందే స్పాన్సర్డ్ లిస్టింగ్స్ను ప్రత్యేకంగా, స్పష్టంగా వినియోగదారునికి తెలిసేలా ప్రదర్శించాలి. ఆన్లైన్ సంస్థలకు యాడ్స్ కీలక ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో ఆర్గానిక్ సెర్చ్కూ.. పెయిడ్ విజిబిలిటీకీ తేడా చూపించడం తప్పనిసరి కానుంది.వినియోగదారుల హక్కులకు ప్రాధాన్యండార్క్ పాటర్న్స్(అంటే ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, యాప్లు లేదా వెబ్సైట్లు వినియోగదారులను తాము బలవంతంగా నిర్ణయాలు తీసుకునేలా తప్పుదోవ పట్టించడానికి ఉపయోగించే డిజైనింగ్ వ్యవస్థ) అడ్డుకట్టకు వార్షిక సెల్ఫ్-ఆడిట్ సర్టిఫికేషన్, జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్తో అనుసంధానం వంటి చర్యలు ఈ-కామర్స్ స్వేచ్ఛా వ్యాపార ధోరణికి సరైన నియంత్రణలు తేనున్నాయి.ఇదీ చదవండి: పండగ పూట.. బంగారం ప్రియులకు గుడ్న్యూస్! -
సరిగా ‘సిప్’ చేస్తే... చేతికి మరో జీతం!
బంగారం, వెండి ధరలు బాగా పెరిగి పోయాయి. కొనటం కష్టం. ఒకవేళ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే... వడ్డీ ఆశాజనకంగా లేదు. ఈపీఎఫ్లో పెడితే... వడ్డీ బావున్నా దీర్ఘకాలం వేచిచూడాలి. పోస్టాఫీసు స్కీముల్లో అయితే లిమిట్ ఉంటుంది. తక్కువే పెట్టగలం. మరేం చెయ్యాలి? భవిష్యత్తు కోసం అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్మెంట్ మార్గమేంటి? మున్ముందు ఒక జీతంలా నెలనెలా రావాలంటే ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే. సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటం. నెలకు రూ.5వేల చొప్పున ‘సిప్’ చేస్తే స్థిరమైన జీతాన్ని సాధించటం పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఇలా సిప్ చేయటానికి కొన్ని మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అవేంటో వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’నెలకు రూ.5వేలు. అంటే సంవత్సరానికి రూ.60 వేలు. ఈ మొత్తంతో అప్పటికప్పుడు ఒక నిధిని పోగేద్దామనుకుంటే సాధ్యం కాదు. కాకపోతే ఓ 20–25 సంవత్సరాలు గనక ఇలానే ఇన్వెస్ట్ చేస్తే... అర్థవంతమైన నిధి ఏర్పడుతుంది. దీనిపై స్థిరమైన జీతాన్ని పొందొచ్చు. అలా వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోతుంది. చివరి రోజుల్లో ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం తప్పుతుంది. అందుకే... దీన్ని భవిష్యత్లో వచ్చే రెండో జీతంగానే చూడాలి తప్ప ఒక భారీ గ్యారంటీడ్ నిధిగా చూడకూడదు. క్రమం తప్పకుండా విత్డ్రా చేసుకునేట్లుగా పోర్టుఫోలియోను డిజైన్ చేసుకోవచ్చు. రెండో జీతమంటే ఏంటి? ఒక పెద్ద నిధి సమకూరగానే దాన్ని ఖర్చుపెట్టేసేలా ఉండకూడదు. ఆ వచ్చేదాని కోసం ముందే ఖర్చులు సిద్ధం చేసి పెట్టుకోవటం కూడా సరికాదు. ఆ నిధి నుంచి వార్షికంగా కొంత సొçమ్ము తీసుకోవటమే లక్ష్యంగా ఉండాలి. మిగిలింది పెట్టుబడిగానే కొనసాగుతుంది. ఉదాహరణకు ఏడాదికి 4 శాతం విత్డ్రా చేసుకుంటే... ఆ మిగిలిన మొత్తం పెట్టుబడిగా కొనసాగుతుంది కనక సుదీర్ఘకాలం మన లక్ష్యానికి ఢోకా ఉండదు. అదెలాగో చూద్దాం... → రూ.30 లక్షల నిధి గనక సమకూరితే దాని ద్వారా నెలకు రూ.12 వేలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. → రూ.60 లక్షల నిధి గనక సమకూరితే దాన్నుంచి ఈజీగా నెలకు రూ.25వేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. → రూ.కోటి నిధి గనక సమకూరితే రమారమి నెలకు రూ.40 వేలు విత్డ్రా చేసుకున్నా ఇబ్బంది ఉండదు.ప్రతి నెలా ‘సిప్’ రూపంలో రూ.5వేలు చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఎంతవుతుంది? నిజానికి పాతికేళ్లు గనక ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే రూ.కోటి కూడా కావచ్చు. కాకపోతే ఇది పూర్తిగా మార్కెట్ రాబడులపై ఆధారపడి ఉంటుంది. దీర్ఘ కాలానికైతే మార్కెట్లు ఎప్పుడూ మంచి రాబడులే ఇస్తున్నాయి కనక ఇబ్బంది ఉండదు. ఎన్నేళ్లకు ఎంతవుతుందన్నది ఈ పట్టికలో చూద్దాం...నెలకు రూ.5వేలు... ఎంతవుతుంది?పై పట్టికలో 10 శాతం రాబడి లెక్కన చూసుకుంటే రూ.5000 సిప్ 20 ఏళ్లలో 38 లక్షలవుతుంది. దీన్లోంచి ఏటా 4 శాతం చొప్పున నెలకు రూ.22,100 విత్డ్రా చేయొచ్చు. అదే 10 శాతం రాబడి లెక్కన 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సిప్ మొత్తం రూ.66 లక్షలవుతుంది. నెలకు రూ.22,100 చొప్పున విత్డ్రా చేయటానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో తెలుసుకోవాల్సింది ఒక్కటే. తొలి దశాబ్దంలో ఒక మంచి ఇన్వెస్టింగ్ పద్ధతి అలవాటవుతుంది. తరువాతి దశాబ్దాల్లో కాంపౌండింగ్ వల్ల భారీ నిధి సమకూరుతుంది. ద్రవ్యోల్బణాన్ని గమనించక తప్పదు... భవిష్యత్తులో నెలకు రూ.20వేలు వస్తుందనుకోండి. ఆ మొత్తంతో ఇప్పుడు రూ. 20 వేలతో ఏం కొనగలుగుతున్నామో అవన్నీ కొనలేం. ఎందుకంటే ధరలు పెరుగుతాయి. అదే ద్రవ్యోల్బణం. ఇది ఏటా 5 శాతం పెరుగుతుందనుకుంటే ప్రస్తుతం నెలవారీ ఇంటి ఖర్చులకు పెడుతున్న రూ.10వేలు ... 10 ఏళ్లలో రూ.16,300కు చేరుతుంది. 15 ఏళ్లలో ఇది రూ.20,800 అవుతుంది. 20 ఏళ్లలో ఇది ఏకంగా రూ.26,500 అవుతుంది. అందుకే రూ.5,000 నెలవారీ సిప్ అనేది ఒక శుభారంభంగా చూడాలి. అంతే తప్ప ఇదే పూర్తిస్థాయి రిటైర్మెంట్ ప్రణాళిక కాదు. ఇందుకంటే దేశంలో వినియోగ ద్రవ్యోల్బణం ఏటా 4 శాతం వరకూ పెరుగుతున్నట్లు గడిచిన కొన్నేళ్ల డేటా చెబుతోంది. కాకపోతే చదివే చదువు, వెళ్లే ఆసుపత్రి, జీవన స్థాయిని బట్టి కుటుంబాలు ఎవరికివారు అంతకన్నా ఎక్కువ రేటు ద్రవ్యోల్బణాన్ని కూడా భరించాల్సి రావచ్చు. ఏటా ‘సిప్’ పెంచటం... సూపర్ స్టెప్మీరు నెలకు రూ.,5వేలతోనే సిప్ ఆరంభించి ఉండొచ్చు. కానీ ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లటమనేది మీకు భవిష్యత్తులో సమకూరబోయే నిధిని నాటకీయంగా మార్చేస్తుంది. అలా పెంచుతూ వెళితే ఏమవుతుందంటే... ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళితే 25 ఏళ్లలో సమకూరే నిధి వల్ల నెలకు రూ.54,300 విత్డ్రా చేసుకోవటానికి వీలవుతుంది. అందుకనే ఏటా సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లటమనేది తొలి నాళ్ల నుంచీ ఆరంభిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయమేంటంటే జీతం పెరిగినపుడల్లా... దాంట్లో కొంత సిప్కు కేటాయించటం. అలా చేయటం వల్ల పెంపు భారమనిపించదు. ఈ తప్పులు చేయొద్దు.... → మార్కెట్లు పడ్డప్పుడు నిలిపేయటం... చాలామంది ఇన్వెస్టర్లు చేసే తప్పు ఇదే. మార్కెట్లు బాగా పడుతున్న సందర్భాల్లో నష్టాలు వస్తాయనే కారణంతో సిప్ను నిలిపేస్తుంటారు. కానీ ఆ సమయంలో తాము ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయనే వాస్తవాన్ని గ్రహించరు. ఇంకా పడ్డాక కొందాంలే... అనే ధోరణితో ఉంటారు. కానీ మార్కెట్లు పడేటపుడు ఎంతవరకూ పడతాయో... ఎప్పటి నుంచి పెరుగుతాయో ఎవ్వరూ అంచనా వేయలేరు. కాబట్టే ఇలాంటి సందర్భాల్లో సిప్ చాలా ఉపయోగపడుతుంది. లక్ష్యాలు దీర్ఘకాలికం కనక ఈ ఊగిసలాటలు తాత్కాలికమేనని గ్రహించటం అత్యవసరం. → రాబడులకు గ్యారంటీ ఉండదు... ఏటా 10 శాతమో, 12 శాతమో పెరుగుతాయనే ఉద్దేశంతోనే ఇన్వెస్ట్ చేస్తారు కదా!. కాకపోతే అది గ్యారంటీ అని, తమ చేతిలోకి అనుకున్న మొత్తం తప్పనిసరిగా వస్తుందని మాత్రం అనుకోకూడదు. కాలిక్యులేటర్లో లెక్కలు వేసి... ఆ మేరకు మొత్తం తమ చేతిలోకి వస్తుంది కదా అని దాని ఆధారంగా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటం సరికాదు. ఎందుకంటే చివరికి మనం అనుకున్న మొత్తం కన్నా ఎక్కువైనా రావచ్చు. లేదా తక్కువైనా రావచ్చు. కాకపోతే దీర్ఘకాలంలో ఎప్పుడూ మంచి లాభాలే వస్తాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. → ఇన్వెస్ట్మెంట్ కన్నా ముందు పునాది ముఖ్యంఆర్థికంగా ఇబ్బందుల్లేని పరిస్థితులనేవి అన్నిటికన్నా ప్రధానం. ఇబ్బందులు పడుతూ... ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోకుండా దూకుడుగా సిప్లో ఇన్వెస్ట్ చేయటం కూడా అంత తెలివైన నిర్ణయమేమీ కాదు. అందుకే సిప్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ అంశాలు చూసుకోవాలి.... → అత్యవసర ఖర్చులనేవి ఎటునుంచి ఎలా వస్తాయో తెలియదు. కాబట్టి వీటికి తగినంత అత్యవసర నిధి ఉండాలి. → చాలినంత ఆరోగ్య బీమా కవరేజీ ఉండాలి. టర్మ్ లైఫ్ కవరేజీ కూడా ప్రధానమే. → ఎక్కువ వడ్డీ ఉన్న అప్పుల్ని తగ్గించుకోవటానికి ప్రణాళిక ఉండాలి. ప్రత్యేకించి క్రెడిట్ కార్డు రుణాలు, ఖరీదైన వ్యక్తిగత రుణాలు ఈ కోవలోకి వస్తాయి. → దగ్గర్లో చేయాల్సిన పనులకు ప్రత్యేక నిధి అవసరం. వచ్చే ఏడాది చెల్లించాల్సిన స్కూలు లేదా కాలేజీ ఫీజు, వచ్చేనెల చెల్లించాల్సిన గృహ రుణం ఈఎంఐ...ఇలాంటివి దీని పరిధిలోకి వస్తాయి. → ప్రత్యేకించి ఇన్వెస్ట్ చేయటానికి అప్పు తీసుకోవటమనేది ప్రమాదకరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ట్రాప్లో పడొద్దు. ఇదీ... కుటుంబాలకు రోడ్ మ్యాప్ 1 నుంచి 3 సంవత్సరాలు... ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి. నెలకు రూ.5వేల సిప్... కొంత అత్యవసర నిధి... గతేడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం వంటివి కాకుండా దీర్ఘకాలంగా మంచి పనితీరు కనబరుస్తున్నవి ఎంచుకోవటం... జీతం ఖాతాలో పడగానే ఆటోమేటిగ్గా సిప్లోకి కొంత మొత్తం పోయేటట్లు చూసుకోవటం. 4 నుంచి 10 సంవత్సరాలు... జీతం పెరిగినపుడల్లా సిప్ మొత్తాన్ని కూడా పెంచుకుంటూ వెళ్లటం. స్వల్పకాలంలో అవసరమయ్యే మొత్తాన్ని విడిగా ఉంచుకోవటం... దాన్ని దీర్ఘకాల ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లలో కలపకపోవటం... ప్రతి రోజూ కాకుండా ఏడాదికోసారి లక్ష్యాలను సమీక్షించుకోవటం. → 11 నుంచి 20 సంవత్సరాలు.. లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వెళ్లాలి. ప్రధాన లక్ష్యం దగ్గరికొస్తున్న కొద్దీ... కొంత మొత్తాన్ని ఊగిసలాటల మార్కెట్ల నుంచి స్థిరంగా ఉండే సాధనాల్లోకి మళ్లించాలి. చివరి సంవత్సరం వచ్చేదాకా వేచి చూడకుండా... మార్కెట్లు బాగున్నపుడు కొంత మొత్తాన్ని మళ్లిస్తే రిస్కు తగ్గుతుంది. → 20 ఏళ్ల తరవాత... అప్పుడప్పుడూ కావలసినంత మొత్తాన్ని తీసుకోకుండా.. ఒక ప్రణాళిక మేరకు నిర్థ్ధిష్ట కాల వ్యవధుల్లో కొంత మొత్తాన్ని తీసుకుంటే మంచిది. విత్డ్రాయల్స్ను ఏడాదికోసారి సమీక్షించుకుంటే మంచిది. స్వల్పకాలంలో చెల్లించాల్సిన వాటికోసం కొంత సొమ్ము విడిగా ఉంచుకోవాలి. అలా చేస్తే అవసరమైనపుడు ఒకవేళ మార్కెట్లు బాగులేకుంటే తక్కువకే విక్రయించి బయటపడాల్సిన పరిస్థితి ఉండదు. చివరిగా గమనించాల్సింది ఒకటే. రూ.5000 నెలవారీ సిప్ అనేది మరీ చిన్న మొత్తమేమీ కాదు. కాకపోతే దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ ప్రణాళిక పెట్టుకుని, ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళితే అది మరింత అర్థవంతమైన నిధిగా మారుతుంది. నిజానికి మంచి ఫండ్లను వెతకటంలోనే విజయం ఉందనుకోవద్దు. మానకుండా చిరకాలం ఇన్వెస్ట్ చేయటంలోనే అసలు విజయం దాగి ఉంటుంది.రమణమూర్తి మంథా -
కొత్త గ్యాస్ పథకం.. పీఎన్జీ కనెక్షన్లకు మరింత ఊపు
కేంద్ర ప్రభుత్వం దేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు కొత్త ప్రోత్సాహక పథకాన్ని అమల్లోకి తెచ్చింది. 2026 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) కంపెనీలకు తక్కువ ధరకు లభించే దేశీయ గ్యాస్ను అదనంగా కేటాయించనున్నారు. దీంతో ఇళ్లకు కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వడం కంపెనీలకు మరింత లాభదాయకంగా మారనుంది.కొత్త కనెక్షన్కు అదనపు గ్యాస్ప్రతి భౌగోళిక ప్రాంతానికి (GA) ప్రభుత్వం నిర్దేశించిన కనీస స్థాయికి మించి కొత్తగా బిల్లు అయ్యే ప్రతి దేశీయ పీఎన్జీ కనెక్షన్కు 200 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (SCM) అదనపు ధరల నియంత్రణ విధానం పరిధిలోని (APM) గ్యాస్ను అర్హత కలిగిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు కేటాయిస్తారు. అంటే కేవలం పైప్లైన్ వేసి మీటర్ ఏర్పాటు చేయడం కాకుండా, వాస్తవంగా గ్యాస్ వినియోగించి బిల్లు వచ్చే కనెక్షన్లను పెంచినప్పుడే కంపెనీలకు ఈ ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకాన్ని ఆరు నెలల్లో రెండు విడతలుగా అమలు చేయనున్నారు.కంపెనీలకు భారీగా తగ్గనున్న ఖర్చుప్రస్తుతం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తమ సీఎన్జీ-ట్రాన్స్పోర్ట్ విభాగంలో కొంత అవసరాన్ని ఖరీదైన ఎల్ఎన్జీతో భర్తీ చేస్తున్నాయి. కొత్త పథకం కింద లభించే తక్కువ ధర దేశీయ గ్యాస్ను ఎల్ఎన్జీ స్థానంలో ఉపయోగించుకోవడం ద్వారా కంపెనీల మొత్తం గ్యాస్ సోర్సింగ్ వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంటింటికీ పీఎన్జీ కనెక్షన్ ఇచ్చేందుకు పెట్టే మూలధన పెట్టుబడి పదేళ్లలో రికవరీ కావాల్సి ఉండగా కొత్త పథకం వల్ల మూడేళ్లలోనే తిరిగొస్తుందని కేంద్రం తెలిపింది.1.75 కోట్లకు చేరిన పఘెన్జీ కనెక్షన్లుఆగస్టు 18 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. తాజాగా పీఎన్జీఆర్బీ గణాంకాల ప్రకారం 2026 జూలై నాటికి ఈ సంఖ్య 1,75,46,911కు చేరింది. అంటే దేశంలో పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య ఇప్పటికే 1.75 కోట్లను దాటింది. అయితే కనెక్షన్ ఉండటం మాత్రమే కాకుండా అవి క్రియాశీలంగా ఉండేలా చేయడం కూడా ప్రభుత్వ తాజా పథకం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.కొత్త ప్రాంతాల్లోకి పీఎన్జీ నెట్వర్క్ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ విస్తరణను పీఎన్జీఆర్బీ అనుమతించిన భౌగోళిక ప్రాంతాల్లో ఆయా సంస్థలు చేపడుతున్నాయి. 2025లో ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 307 భౌగోళిక ప్రాంతాలకు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అభివృద్ధి కోసం అనుమతులు ఉన్నాయి. 2026లో పీఎన్జీ విస్తరణను మరింత వేగవంతం చేసేందుకు 110 ప్రాధాన్య ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు, పైప్లైన్ నిర్మాణానికి అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేసే చర్యలు చేపట్టింది.పీఎన్జీకి మారేందుకు మరో ఊతంపీఎన్జీకి మారే వినియోగదారులకు ప్రభుత్వం మే 2026లో మరో సౌకర్యాన్ని కూడా ప్రకటించింది. పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న ఎల్పీజీ వినియోగదారులు 30 రోజుల్లో తమ ఎల్పీజీ కనెక్షన్ను సరెండర్ చేయవచ్చు. లేదా భవిష్యత్తులో పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతానికి మారాల్సి వస్తే తిరిగి ఎల్పీజీ కనెక్షన్ పొందేందుకు ట్రాన్స్ఫర్ వోచర్ తీసుకునే అవకాశం కల్పించారు. -
రూ.71,700 కోట్ల షేర్ల అమ్మకం.. ఒరాకిల్ అధినేత యూటర్న్
టెక్ దిగ్గజం ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ లారీ ఎల్లిసన్ తన వాటాల విక్రయంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒరాకిల్లో తనకు ఉన్న వాటాలో 50 మిలియన్ షేర్లను విక్రయించేందుకు గతంలో రూపొందించిన ప్రణాళికను ఆయన రద్దు చేశారు. ఈ షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం సుమారు 7.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.71,700 కోట్లు)గా ఉంది.అంతకు ముందు రోజే ఎల్లిసన్ షేర్ల విక్రయానికి సంబంధించిన ట్రేడింగ్ ప్రోగ్రామ్ను జూన్ 22న ఏర్పాటు చేసినట్లు ఒరాకిల్ వెల్లడించింది. ఈ ప్రణాళిక ప్రకారం అక్టోబర్ 24 వరకు 50 మిలియన్ షేర్లను విక్రయించే అవకాశం ఉండేది. అయితే, ఈ ప్రణాళిక కింద ఇప్పటివరకు ఎలాంటి షేర్లను విక్రయించలేదని, ప్రస్తుతం తన ఒరాకిల్ షేర్లను విక్రయించే ఉద్దేశం ఎల్లిసన్కు లేదని కంపెనీ స్పష్టం చేసింది.జూన్లో ఈ విక్రయ ప్రణాళికను రూపొందించిన సమయంలో ఆ 50 మిలియన్ షేర్ల విలువ సుమారు 8.75 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే అప్పటి నుంచి ఒరాకిల్ షేరు ధర దాదాపు 16 శాతం తగ్గింది. ప్రస్తుతం కంపెనీలో ఎల్లిసన్కు సుమారు 40 శాతం నియంత్రణ వాటా ఉంది.భారీ ఏఐ పెట్టుబడుల ఒత్తిడికృత్రిమ మేధ (AI), క్లౌడ్ విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఒరాకిల్ ఆర్థిక పరిస్థితిపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ఏఐ వంటి సంస్థలతో కుదుర్చుకున్న భారీ క్లౌడ్ ఒప్పందాలను నెరవేర్చేందుకు కంపెనీ భారీగా ఖర్చు చేస్తోంది. దీంతో నగదు నిల్వలను కాపాడుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతకు కూడా శ్రీకారం చుట్టింది.ఉద్యోగుల తగ్గింపునకు సంబంధించిన ఖర్చులు సుమారు 2.8 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఒరాకిల్ అంచనా వేసింది. ఇది గతంలో పేర్కొన్న అంచనా కంటే 700 మిలియన్ డాలర్లు ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ స్థూల లాభ మార్జిన్లు తగ్గడంతో శుక్రవారం ఒరాకిల్ షేరు ధర 1.7 శాతం పడిపోయింది.ఈ నేపథ్యంలో ఎల్లిసన్ తన షేర్లను విక్రయించకూడదని తీసుకున్న నిర్ణయం కంపెనీపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని కొంతమేర తగ్గించే సంకేతంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉండగా, ఎల్లిసన్ తన కుమారుడు డేవిడ్ ఎల్లిసన్ చేపడుతున్న వ్యాపార కార్యక్రమాలకు ప్రధాన ఆర్థిక మద్దతుదారుగా ఉన్నారు. పారామౌంట్ స్కైడాన్స్ కార్ప్ ద్వారా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని సుమారు 110 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే ప్రతిపాదనలోనూ ఆయన కుటుంబం కీలకంగా ఉంది. -
ప్రపంచంలో అత్యధిక జీతం.. ఈ ప్రధానిదే!
సింగపూర్ ప్రధాన మంత్రి లారెన్స్ వాంగ్ వార్షిక వేతన ప్యాకేజీ భారీగా పెరగనుంది. జీతం, బోనస్లతో కలిపి ప్రస్తుతం ఉన్న 2.2 మిలియన్ సింగపూర్ డాలర్ల వార్షిక ప్యాకేజీ 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. సవరించిన వేతన విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నట్లు ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ప్రభుత్వాధినేతగా వాంగ్ స్థానమూ మరింత బలపడనుంది.ప్రజా సేవల వేతనాలపై స్వతంత్ర సమీక్ష కమిటీ చేసిన సిఫార్సులను అంగీకరించినట్లు వాంగ్ తెలిపారు. అయితే రాజకీయ నాయకుల జీతాలను పెంచడం సింగపూర్లో సున్నితమైన అంశంగా కొనసాగుతోంది. అధిక వేతనాలపై దేశంలో చాలాకాలంగా చర్చ, విమర్శలు ఉన్నాయి.తనకు పెరగనున్న వేతనంలో అదనపు మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని వాంగ్ ప్రకటించారు. తాను ప్రధాన మంత్రిగా కొనసాగినంతకాలం, రానున్న ఐదేళ్లలో వేతన పెంపు ద్వారా లభించే అదనపు మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు అందజేస్తానని చెప్పారు.పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడిన వాంగ్.. రాజకీయంగా క్లిష్టమైన అంశం అయినప్పటికీ దీనిని విస్మరించలేమన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన నాణ్యమైన రాజకీయ నాయకత్వాన్ని కొనసాగించడమే అసలు లక్ష్యమని పేర్కొన్నారు.మంత్రులు, ఉప ప్రధానికీ భారీ పెంపుకొత్త వేతన విధానంతో సింగపూర్ ఉప ప్రధాని, మంత్రుల జీతాలు కూడా గణనీయంగా పెరగనున్నాయి. ఉప ప్రధాని వార్షిక వేతన ప్యాకేజీ 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి దాదాపు 3 మిలియన్ సింగపూర్ డాలర్లకు చేరనుంది. క్యాబినెట్ మంత్రులకు వారి సీనియారిటీ, బాధ్యతలను బట్టి 1.8 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 2.8 మిలియన్ సింగపూర్ డాలర్ల వరకు వార్షిక ప్యాకేజీ లభించనుంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టే వారికి కూడా వేతనం సుమారు 1.1 మిలియన్ సింగపూర్ డాలర్ల నుంచి 1.2 మిలియన్ సింగపూర్ డాలర్లకు పెరగవచ్చు.రాజకీయ నాయకుల వేతనాలను నిర్ణయించేందుకు సింగపూర్ ప్రభుత్వం దేశంలోని అత్యధికంగా సంపాదించే 1,000 మంది వ్యక్తుల ఆదాయ స్థాయిలను ఒక బెంచ్మార్క్గా పరిగణిస్తుంది. ప్రైవేట్ రంగం, సివిల్ సర్వీసుల్లో వేతనాలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందని వాంగ్ తెలిపారు.ప్రతిభను ఆకర్షించడమే లక్ష్యంరాజకీయ నాయకులకు అధిక వేతనాలు చెల్లించడం వెనుక ప్రధాన ఉద్దేశం ప్రైవేట్ రంగంలోని ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించడం, అవినీతి ప్రమాదాన్ని తగ్గించడం అని సింగపూర్ ప్రభుత్వం చెబుతోంది. అయితే అధిక వేతనాల వల్ల ప్రజలు–రాజకీయ నాయకుల మధ్య ఆదాయ వ్యత్యాసం పెరుగుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి.సింగపూర్ 2012లో మంత్రివర్గ వేతనాలను భారీగా సవరించింది. అప్పట్లో ప్రజల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో రాజకీయ నాయకుల వేతనాలను 36 శాతం వరకు తగ్గించారు. 2017లో మరోసారి సమీక్ష చేపట్టినప్పటికీ అప్పట్లో వేతనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు.ఇతర దేశాల నేతలతో పోలిస్తే..వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీ ప్రపంచంలోని పలువురు దేశాధినేతలతో పోలిస్తే చాలా ఎక్కువ. అమెరికా అధ్యక్షుడి వార్షిక అధికారిక వేతనం 4 లక్షల డాలర్లు కాగా, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వేతనం కూడా సింగపూర్ ప్రధాని ప్యాకేజీతో పోలిస్తే చాలా తక్కువ. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ వార్షిక వేతన ప్యాకేజీ సుమారు 7.19 లక్షల డాలర్లుగా ఉంది.భారత ప్రధాని మోదీ వేతనం ఎంతంటే?సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కొత్త వార్షిక వేతన ప్యాకేజీతో పోలిస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీకి లభించే వేతనం చాలా తక్కువ. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం భారత ప్రధానికి నెలకు సుమారు రూ.1.66 లక్షల వేతనం, అలవెన్సులు లభిస్తాయి. ఇందులో ప్రాథమిక వేతనం, నియోజకవర్గ భత్యం, రోజువారీ భత్యం, సమ్ప్చువరీ అలవెన్స్ వంటి అంశాలు ఉంటాయి. ఈ లెక్కన నగదు వేతనం, అలవెన్సులు కలిపి ఏడాదికి సుమారు రూ.19.2 లక్షలు అవుతాయి. అయితే ప్రధాని అధికారిక నివాసం, భద్రత, అధికారిక ప్రయాణం, సిబ్బంది వంటి ప్రభుత్వ సౌకర్యాలు వేరుగా ఉంటాయి.ఇదీ చదవండి: భారత రోడ్లపై పుతిన్ కారు.. ప్రత్యేకతలు ఇవే! -
ఉద్యోగులకు షాక్.. టెక్ దిగ్గజంలో మరోమారు లేఆఫ్స్!
అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్.. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం పెద్ద ఎత్తున డేటా సెంటర్లను నిర్మించేందుకు కంపెనీ చేస్తున్న ఖర్చులు, నగదు ప్రవాహంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల కోతలను మరింత పెంచాలని సంస్థ నిర్ణయించింది.కంపెనీ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉద్యోగుల తొలగింపులతో కూడిన 2026 రీస్ట్రక్చరింగ్ ప్లాన్ కోసం మొత్తం ఖర్చు సుమారు 2.8 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇందులో ప్రధానంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి చెల్లించాల్సిన పరిహారం, సెవరెన్స్ ఖర్చులు ఉన్నాయి.ఇప్పటికే ఈ ప్రణాళికకు సంబంధించి సుమారు 2.1 బిలియన్ డాలర్ల ఖర్చును ఒరాకిల్ నమోదు చేసింది. తాజాగా మరో 700 మిలియన్ డాలర్ల మేర అదనపు ఖర్చు ఉంటుందని కంపెనీ తెలిపింది. అంటే.. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.ఏఐ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని.. ఒరాకిల్ భారీ స్థాయిలో డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ముఖ్యంగా ఓపెన్ఏఐ వంటి సంస్థలకు అవసరమైన ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందించేందుకు ఈ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. అయితే.. ఇలాంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి భారీ మొత్తంలో నగదు అవసరం కావడంతో కంపెనీ ఖర్చులను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే.. మే చివరి నాటికి ఒరాకిల్లో అమెరికాలో సుమారు 49,000 మంది, అంతర్జాతీయంగా సుమారు 92,000 మంది పనిచేస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 21,000 తగ్గింది. రానున్న రోజుల్లో మరింత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి ఉంటుందని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. -
లాభాలొచ్చే ప్రాంతాలకు న్యాయం చేయాల్సిందే!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సాంకేతిక సంస్థలు తమ వ్యాపార లాభాలను గడిస్తున్న ప్రాంతాల పట్ల న్యాయబద్ధంగా వ్యవహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ముగింపు సమావేశంలో ఆమె మాట్లాడారు.టెక్ సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా తాము ఏయే దేశాల్లో లేదా ప్రాంతాల్లో లాభాలు ఆర్జిస్తున్నాయో అక్కడ తగిన స్థానిక పన్నులను సమగ్రంగా చెల్లించాలని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ ఆ సమాజ అభివృద్ధికి తిరిగి సహకరించాలని స్పష్టం చేశారు. ‘ఒక చోట పన్ను చెల్లించి లాభాలు పొందే ఇతర ప్రాంతాల్లో బాధ్యతల నుంచి తప్పుకోవడం సరికాదు’ అని ఆమె అభిప్రాయపడ్డారు.టెక్ కంపెనీలకు ఊతమిచ్చేలా..భారతీయ టెక్, ఫిన్టెక్ స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న తరుణంలో వివిధ దేశాల డేటా భద్రత, లైసెన్సింగ్, పన్నులు, వినియోగదారుల రక్షణ విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు భారతీయ టెక్ రంగానికి అంతర్జాతీయంగా ఊతమిచ్చేలా ఒక ఫెడరేటెడ్ ఇండస్ట్రీ వేదిక ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ వేదిక విదేశీ నిబంధనలు కఠినతరం కాకముందే ఆయా ప్రభుత్వాలతో చర్చలు జరపడానికి, సైబర్ సెక్యూరిటీ విధానాలను పంచుకోవడానికి దోహదపడుతుందని వివరించారు.ఏఐ భద్రతపై ఆందోళనమరోవైపు ఏఐ వల్ల కలిగే భద్రతాపరమైన ప్రమాదాలపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక రంగంలో ఏఐ తెస్తున్న మార్పులపట్ల కంపెనీల బోర్డులు, సీనియర్ యాజమాన్యాలు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. ఏఐ నిర్ణయాలకు మానవ, సంస్థాగత బాధ్యతే ప్రాథమికమని ఆమె స్పష్టం చేశారు. ఆర్బీఐ రిటైల్, హోల్సేల్ డిజిటల్ రూపాయి (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ -
ఈ–కామర్స్ నిబంధనలు.. ఇక కఠినంగా..
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ–కామర్స్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కన్జూమర్ ప్రొటెక్షన్ (ఈ–కామర్స్) రూల్స్ 2020ని సవరించింది. ధరల విషయంలో పారదర్శకత, ప్రాయోజిత లిస్టింగ్స్, సెర్చి ఫలితాలను చూపడంలో అవకతవకలకు పాల్పడటం, డార్క్ ప్యాటర్న్స్ మొదలైన వాటిని కట్టడి చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వినియోగదారుల వ్యవహారాల విభాగం వెల్లడించింది.2027 జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. సవరించిన నిబంధనల ప్రకారం ధరల తగ్గింపును ప్రకటించినప్పుడు ‘గత ధర’, ‘తగ్గించిన ధర’ను ఈ–కామర్స్ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. డిస్కౌంటు ప్రకటించడానికి ముందు 30 రోజుల వ్యవధిలో ఆ ఉత్పత్తిని విక్రయించిన కనిష్ట రేటును ‘గత ధర’ గా పరిగణిస్తారు.ఇదీ చదవండి: ఒకప్పుడు తోపు రిచ్.. ఇప్పుడు టాప్ 10 కూడా దక్కలేదు! -
ఫెడరల్ బ్యాంక్-పైసాబజార్ కాంబోలో ‘పైసాబ్యాక్’ కార్డు
ఫిన్టెక్ కంపెనీ పైసాబజార్, ఫెడరల్ బ్యాంకు కలసి వినియోగదారుల కోసం ‘ఫెడరల్ బ్యాంక్ పైసాబజార్ పైసాబ్యాక్ క్రెడిట్ కార్డ్’ను ఆవిష్కరించాయి. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్, పీబీ ఫిన్టెక్ గ్రూప్ సీఈఓ సర్బ్వీర్ సింగ్, ప్రెసిడెంట్ రాజీవ్ గుప్తా, ఎన్పీసీఐ ప్రతినిధుల సమక్షంలో ఈ కార్డ్ను అధికారికంగా విడుదల చేశారు.ఈ రాబోయే పండుగల సీజన్లో గృహ అవసరాల వ్యయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ కో-బ్రాండెడ్ కార్డ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. ముఖ్యంగా నిత్యావసర సరుకుల కొనుగోళ్లపై ఏకంగా 7.5% క్యాష్బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపారు. కార్డు ఆవిష్కరణ సందర్భంగా ఈ కార్డు ప్రయోజనాలను వివరించారు.డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్, స్టార్ బజార్, నేచర్స్ బాస్కెట్ వంటి సూపర్మార్కెట్లతో పాటు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లైన బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్లలో జరిపే కొనుగోళ్లపై 7.5% క్యాష్బ్యాక్ లభిస్తుంది. రూపే నెట్వర్క్పై పనిచేసే ఈ కార్డ్ ద్వారా రూ.2,000 పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.5%, ఇతర ఈ-కామర్స్, పాయింట్ ఆఫ్ సేల్ కొనుగోళ్లపై 1% క్యాష్బ్యాక్ పొందవచ్చు. ప్రతినెల గరిష్టంగా రూ.1,000 విలువైన క్యాష్ పాయింట్స్ పొందే వెసులుబాటు ఉంది. జాయినింగ్/వార్షిక రుసుము రూ.500 కాగా, సంవత్సరానికి రూ.1.5 లక్షలు వెచ్చిస్తే ఈ రుసుము మినహాయింపు లభిస్తుంది.ఇదీ చదవండి: బోణీ కొట్టిన ‘గణేష్’ ఎకానమీ -
ఒకప్పుడు తోపు రిచ్.. ఇప్పుడు టాప్ 10 కూడా దక్కలేదు!
ఫ్రెంచ్ లగ్జరీ దిగ్గజం ఎల్వీఎంహెచ్ (LVMH) వ్యవస్థాపకుడు, చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల టాప్-10 జాబితా నుంచి వైదొలిగారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆర్నాల్ట్ సంపద ప్రస్తుతం సుమారు 143 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీంతో ఆయన కంటే ముందు స్థానంలో బెర్క్షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్ నిలిచారు.మరోవైపు టెక్ రంగానికి చెందిన అమెరికన్ బిలియనీర్లు సంపద ర్యాంకింగ్స్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. 918.8 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత లారీ పేజ్, జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మైఖేల్ డెల్ తదితరులు ఉన్నారు. వెల్త్ ఇండెక్స్ 2012లో ప్రారంభమైన తర్వాత తొలిసారిగా టాప్-10లోని అన్ని స్థానాలను అమెరికన్లే ఆక్రమించడం ఇదే మొదటిసారి.ఈ ఏడాది భారీగా తగ్గిన ఆర్నాల్ట్ సంపదఆర్నాల్ట్ సంపదలో ఈ ఏడాది గణనీయమైన క్షీణత నమోదైంది. జనవరి నుంచి ఆయన నికర సంపద సుమారు 65 బిలియన్ డాలర్లు తగ్గింది. బ్లూమ్బెర్గ్ ట్రాక్ చేస్తున్న ప్రపంచంలోని 500 మంది అత్యంత సంపన్నుల్లో ఇదే అతిపెద్ద సంపద పతనంగా నిలిచింది.ఆర్నాల్ట్ సంపద తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఎల్వీఎంహెచ్ వ్యాపారంపై లగ్జరీ మార్కెట్లో ఏర్పడిన మందగమనం ఒకటి. డియోర్, లూయిస్ విట్టన్, టిఫనీ వంటి ఫ్యాషన్, జ్యువెలరీ బ్రాండ్లతో పాటు డోమ్ పెరిగ్నాన్, హెన్నెస్సీ వంటి ప్రీమియం మద్యం బ్రాండ్లను ఎల్వీఎంహెచ్ నిర్వహిస్తోంది.మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు దుబాయ్ వంటి కీలక షాపింగ్ హబ్లలో అధిక విలువైన వస్తువుల డిమాండ్పై ప్రభావం చూపాయి. అదే సమయంలో చైనాలోనూ లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడం సంస్థకు సవాలుగా మారింది.2017 నుంచి టాప్-10లో..ఆర్నాల్ట్ 2017 మార్చి 22 నుంచి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల టాప్-10లో కొనసాగుతున్నారు. 2022 డిసెంబర్లో కొంతకాలం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కూడా నిలిచారు. టాప్ స్థానానికి చేరుకున్న ఉత్తర అమెరికా వెలుపల వ్యక్తిగా, అలాగే వినియోగ వస్తువుల రంగానికి చెందిన ఏకైక బిలియనీర్గా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.కరోనా తర్వాత చైనాలో పెరిగిన పెంట్-అప్ డిమాండ్ లగ్జరీ పరిశ్రమకు భారీగా కలిసొచ్చింది. అయితే ఆ తర్వాత చైనాలో వినియోగం మందగించడం, అమెరికా సుంకాలపై అనిశ్చితి, కొన్ని మార్కెట్లలో ప్రీమియం మద్యం వినియోగం తగ్గడం వంటి అంశాలు ఎల్వీఎంహెచ్ వ్యాపారంపై ప్రభావం చూపాయి.వారసత్వంపైనా ఆసక్తిఇక ఎల్వీఎంహెచ్లో ఆర్నాల్ట్ వారసత్వంపైనా చర్చ మొదలైంది. రెండు వివాహాలు చేసుకున్న ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరంతా కుటుంబ లగ్జరీ వ్యాపారంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్లో జరిగిన వాటాదారుల సమావేశంలో ఐదుగురు పిల్లలూ తొలిసారిగా మాట్లాడారు. అయితే ఆర్నాల్ట్ తర్వాత ఎల్వీఎంహెచ్ సీఈఓగా ఎవరు బాధ్యతలు చేపడతారనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.శుక్రవారం పారిస్ ట్రేడింగ్లో ఎల్వీఎంహెచ్ షేరు స్వల్పంగా లాభపడినప్పటికీ, కంపెనీ మార్కెట్ విలువపై ఒత్తిడి కొనసాగుతోంది. ఇదే సమయంలో అమెరికా ఎస్అండ్పీ 500 సూచీ ఈ ఏడాది సుమారు 11 శాతం పెరిగింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిమాండ్తో టెక్ కంపెనీల షేర్లు దూసుకెళ్లడం అమెరికన్ బిలియనీర్ల సంపద పెరుగుదలకు దోహదం చేసింది.ఇదీ చదవండి: భారత్ మార్కెట్లోకి అమెరికా రియల్ ఎస్టేట్ కంపెనీ -
నియామకాల్లో భారత్ టాప్
కార్యకలాపాలను విస్తరించే కొద్దీ దేశీయంగా చాలా మటుకు కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో రిక్రూట్మెంట్కి సంబంధించి మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో హైరింగ్ అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. స్టాఫింగ్ సేవల సంస్థ మ్యాన్పవర్ గ్రూప్ విడుదల చేసిన ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది క్యూ4లో నికరంగా వచ్చే ఉద్యోగాల ఔట్లుక్ (ఎన్ఈవో) 54%గా నమోదైంది. ఇది అంతర్జాతీయ సగటుకన్నా 25% అధికం కావడం గమనార్హం.దేశీ గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్న పక్షంలో క్రితం క్వార్టర్తో పోలిస్తే 6%, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11% అధికం. రిపోర్ట్ ప్రకారం.. భారత్లో కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఉద్యోగావకాశాల అంచనాలు పెరిగాయి. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన సర్వేలో 3,055 సంస్థలు పాల్గొన్నాయి. కొత్తగా ఎన్ని సంస్థలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి, ఎన్ని సంస్థలు తగ్గించుకోవాలనుకుంటున్నాయన్న అంశాల ప్రాతిపదికన ఈ డేటాను మాన్పవర్గ్రూప్ సమగ్రపరుస్తుంది.‘ఏఐకి తగ్గట్లుగా సిబ్బందిని మార్చుకోవడం, నైపుణ్యాల కొరత, ఉద్యోగార్థులు సదరు ఉద్యోగ ప్రమాణాలను అందుకోలేకపోతుండటంలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం నియామకాలపై ధీమాగానే ఉన్నాయి’ అని మ్యాన్పవర్గ్రూప్ ఇండియా, మిడిల్ఈస్ట్ ఎండీ సందీప్ గులాటీ తెలిపారు. సర్వేలో ఇతర ప్రధానాంశాలు..అక్టోబర్–డిసెంబర్ మధ్యకాలంలో సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని 65 శాతం సంస్థలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. 11 శాతం సంస్థలు తగ్గించుకోవాలనుకుంటున్నాయి. తమ ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని 24 శాతం సంస్థలు తెలిపాయి. ఉద్యోగ విధులు, నైపుణ్యాలపరమైన అవసరాలు మారుతున్న కొద్దీ దానికి తగ్గట్లుగా నియామకాలు చేపడుతున్నట్లు దాదాపు 70 శాతం సంస్థలు తెలిపాయి. ఫైనాన్స్..బీమా.. ఆతిథ్యం తదితర రంగాల పటిష్ట వృద్ధి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల విస్తరణ మొదలైన అంశాల వల్ల నిపుణులకు బాగా డిమాండ్ ఉంటోంది.గత క్వార్టర్తో పోలిస్తే దేశీయంగా నాలుగు ప్రాంతాల్లోనూ నియామకాలపై సానుకూలత నెలకొంది. తూర్పు భారతంలో ఎన్ఈవో అత్యధికంగా 59 శాతంగా నమోదైంది. గ్లోబల్గా నియామకాలపై ఆశావహంగా ఉన్న దేశాల్లో భారత్ (54 శాతం) టాప్లో ఉండగా, బ్రెజిల్ (53 శాతం), పనామా (49 శాతం), మెక్సికో (41 శాతం), యూఏఈ (41 శాతం), పెరూ (40 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతోంది. దీనితో హైరింగ్కి పట్టే సమయం గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం నైపుణ్యాలు ఉన్న వారు దొరకడం పెద్ద సవాలుగా మారుతోంది. ఉద్యోగానికి అవసరమయ్యే అర్హతలు మారిపోతున్న కొద్దీ, సరైన సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులను తీసుకోవడం కష్టసాధ్యంగా ఉంటోంది.ఇదీ చదవండి: 2030 నాటికి 20 లక్షల కొలువులు..! -
2030 నాటికి 20 లక్షల కొలువులు..!
భారత బ్యాటరీ పరిశ్రమ భారీగా ఉద్యోగాలను సృష్టించే దశలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటివరకు లిథియం–అయాన్ సెల్ల దిగుమతి, అసెంబ్లింగ్పై ఆధారపడిన ఈ రంగం.. సెల్ తయారీ నుంచి బ్యాటరీ ప్యాక్ల తయారీ, రీసైక్లింగ్ వరకు పూర్తిస్థాయి పారిశ్రామిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో 2029–30 నాటికి దేశీయ బ్యాటరీ పరిశ్రమ 15 లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలను సృష్టించనుందని గ్లోబల్ స్టాఫింగ్ సంస్థ ‘అడెక్కో ఇండియా’ నివేదిక తెలిపింది.దేశంలోని 30కి పైగా క్లయింట్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను వెల్లడించింది. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 25 శాతం ప్రత్యక్షంగా, 75 శాతం పరోక్షంగా ఉండనున్నాయి. ఈ రంగంలో నియామకాలు ఏటా 25–30 శాతం పెరగనున్నాయని అడెక్కో ఇండియా జనరల్ స్టాఫింగ్ డైరెక్టర్, హెడ్ దీపేష్ గుప్తా తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లోనే 70 శాతానికి పైగా నియామకాలు గుజరాత్, కర్ణాటక, హర్యానా, తెలంగాణలో గిగాఫ్యాక్టరీల పెట్టుబడులు పెరుగుతుండటంతో బ్యాటరీ రంగ నియామకాల్లో 70 శాతానికి పైగా ఈ క్లస్టర్లలోనే కేంద్రీకృతం కానున్నాయి. రాష్ట్రాల వారీగా కర్ణాటక 24 శాతం, గుజరాత్ 22 శాతం, తెలంగాణ 18 శాతం, హర్యానా 14 శాతం వాటాతో ముందంజలో ఉండనున్నాయి. గిగాఫ్యాక్టరీల చుట్టూ కాంపోనెంట్ పార్కులు, బ్యాటరీ రీసైక్లింగ్ కేంద్రాలు, సరఫరాదారుల వ్యవస్థలు అభివృద్ధి చెందడంతో కొత్త నియామక అవసరాల్లో సుమారు 30 శాతం టైర్–2, టైర్–3 పారిశ్రామిక కారిడార్ల నుంచి వచ్చే అవకాశం ఉంది.నైపుణ్యం ఉన్నవారికి 40 శాతం వరకు అధిక వేతనాలుసాంప్రదాయ తయారీ, ఎల్రక్టానిక్స్ రంగాలతో పోలిస్తే.. బ్యాటరీ ఇంజనీరింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, రీసైక్లింగ్ నైపుణ్యాలు ఉన్న నిపుణులకు 35 శాతం నుండి 40 శాతం వరకు అధిక వేతనాలు లభిస్తాయని నివేదిక స్పష్టం చేసింది. 2030 నాటికి దేశంలో వచ్చే మొత్తం ‘గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్’ ఉద్యోగాల్లో 50 నుండి 60 శాతం వాటా లిథియం బ్యాటరీ తయారీ రంగానిదే కానుండటం విశేషమని అడెక్కో నివేదిక తెలిపింది.సెల్ తయారీకి పెద్దపీటమొత్తం నియామకాల్లో సెల్ తయారీ, బ్యాటరీ విడిభాగాల తయారీ విభాగం 42–45 శాతం వాటాతో అతిపెద్ద భాగంగా ఉండనుంది. బ్యాటరీ రీసైక్లింగ్, మెటీరియల్స్ రికవరీ కూడా కీలక ఉపాధి రంగాలుగా మారుతున్నాయి. ఈ విభాగంలో నియామకాలు ఏటా 25–30 శాతం పెరుగుతాయని అంచనా. ప్రస్తుతం దేశంలో బ్యాటరీ తయారీ సామర్థ్యం సుమారు 60 జీడబ్ల్యూహెచ్గా ఉండగా, 2026 చివరి నాటికి ఇది దాదాపు 100 జీడబ్ల్యూహెచ్కు చేరుతుందని అడెక్కో తెలిపింది. గుజరాత్, కర్ణాటక, హర్యానా, తెలంగాణలో రానున్న గిగాఫ్యాక్టరీ పెట్టుబడులతో ఈ రంగం అసెంబ్లింగ్ స్థాయి నుంచి పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకోసిస్టమ్గా విస్తరించనుంది.రూ.18,100 కోట్ల ప్రభుత్వ మద్దతుఅడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ (ఏసీసీ) తయారీకి సంబంధించిన పీఎల్ఐ పథకం కింద 50 జీడబ్ల్యూహెచ్ దేశీయ తయారీ సామర్థ్యం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.18,100 కోట్లు కేటాయించింది. మరో 5 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని ప్రత్యేక రసాయన సాంకేతికతలకు కేటాయించింది. ఈ స్థానికీకరణ ప్రక్రియ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి దోహదపడటంతో పాటు, దిగుమతి చేసుకునే సెల్స్, శుద్ధి చేసిన ముడి పదార్థాలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించనుందని కంపెనీ తెలిపింది. క్రిటికల్ మినరల్స్ మిషన్, క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్లో భారత్ భాగస్వామ్యం కూడా ఈ ప్రక్రియకు మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొంది.ఇదీ చదవండి: అసలు బ్రిక్స్లో ఏం చర్చిస్తారు? -
రోడ్డు ప్రయాణంలో ‘విమానం’ అనుభూతి
బస్సు ప్రయాణం అనగానే మనకు గుర్తొచ్చేది నెమ్మదిగా సాగే ప్రయాణం, కిక్కిరిసిన సీట్లు, అల్పాహారం కోసం రోడ్డు పక్కన ఆగడం. కానీ, మీరు కేరళలోని బస్సు ఎక్కితే అది విమానంలో బిజినెస్ క్లాస్ అని భ్రమపడాల్సిందే. ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడంలో కేరళ రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. తిరువనంతపురం - కొచ్చిన్ నగరాల మధ్య ఇటీవల ప్రారంభించిన లగ్జరీ బస్సు సర్వీసు ఇప్పుడు రోడ్డు ప్రయాణ రూపురేఖలనే మార్చేస్తోంది. విమాన ప్రయాణానికి దీటుగా అత్యున్నత స్థాయి సౌకర్యాలను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో ఈ బస్సు నెటిజన్లతో పాటు ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఉచిత వై-ఫై, స్క్రీన్లు.. మరెన్నోసుమారు 200-220 కిలోమీటర్ల ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు బిజినెస్ క్లాస్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ బస్సును రూపొందించారు. ఇందులో లగ్జరీ కుషన్ సీట్లతో పాటు ప్రతి సీటుకూ వ్యక్తిగత ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు అమర్చారు. ప్రయాణికుల కోసం ఉచిత వై-ఫై సదుపాయం కూడా ఉంది.ఎన్నో సదుపాయాలో..ఈ సర్వీసులో ప్రధాన ఆకర్షణ క్యాబిన్ హోస్టెస్. విమానాల్లో మాదిరిగానే ప్రయాణికులకు సేవలందించేందుకు క్యాబిన్ హోస్టెస్ను నియమించారు. ప్రయాణంలో వేడి టీ, కాఫీలతో పాటు షావర్మా రోల్స్ వంటి అల్పాహారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా, సుదీర్ఘ ప్రయాణాల్లో ఎంతో ఉపకరించే శుభ్రమైన ఇన్బిల్ట్ వాష్రూమ్ సదుపాయం కూడా బస్సులోనే ఉండటం విశేషం.‘Business Class’ buses now in Kerala! pic.twitter.com/ULLYBknvO4— Harsh Goenka (@hvgoenka) September 11, 2026సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన వీడియోల ద్వారా ఈ బస్సు విశేషాలు ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్నాయి. భారతీయ రైల్వే అధికారులు, రవాణా రంగ నిపుణులు కూడా కేఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. నష్టాల్లో ఉండే ప్రభుత్వ రవాణా సంస్థలు సరైన ప్రాధాన్యతలు, అధునాతన సేవల ద్వారా ప్రయాణికులను ఎలా ఆకట్టుకోవచ్చో కేరళ మోడల్ నిరూపిస్తోంది. సాంప్రదాయ బస్సు ప్రయాణాన్ని అత్యంత విలాసవంతమైన కేఎస్ఆర్టీసీ లగ్జరీ ప్రయాణంగా మార్చిన ఈ ప్రయోగం, మిగిలిన రాష్ట్రాల ఆర్టీసీలకు కూడా దిశా నిర్దేశం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా, ఈ బస్సులో ఎంత దూరం ప్రయాణిస్తూ ఎంత టిక్కెట్ ఉంటుందనే వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: అసలు బ్రిక్స్లో ఏం చర్చిస్తారు? -
ఒకేరోజు 20 లక్షల ట్రైన్ టికెట్స్ బుకింగ్!
పండుగల సీజన్ కావడంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో.. ఐఆర్సీటీ సెప్టెంబర్ 7న సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్సీటీ చరిత్రలో ఒకే రోజులో 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 8న కూడా 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి.గత ఏడాది పండుగల సీజన్లో.. నమోదైన అత్యధిక రోజువారీ బుకింగ్స్ 18,40,203 టికెట్లు కాగా, ఈసారి రికార్డు స్థాయి బుకింగ్స్ దానికంటే దాదాపు 6 శాతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రిజర్వ్డ్ రైల్వే టికెట్లలో సుమారు 89 శాతం ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయని ఐఆర్సీటీ వెల్లడించింది.పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్సీటీ కొత్త సర్వర్లను ఏర్పాటు చేసి ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ప్రయాణికులకు సులభమైన బుకింగ్ అనుభవాన్ని అందించేందుకు ఐఆర్సీటీ జూలై 15, 2026న కొత్త వెబ్సైట్, యూజర్ ఇంటర్ఫేస్ను ప్రారంభించింది. ఇందులో వివిధ తరగతుల్లో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్పై చూసుకునే అవకాశం ఉంది.టికెట్ బుకింగ్లో మోసాలను అరికట్టేందుకు నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. రిజర్వేషన్ ప్రారంభమైన ఉదయం 8 గంటల నుంచి 8:10 గంటల వరకు అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయలేరు. అలాగే రిజర్వేషన్ ప్రారంభమైన సమయంలో టికెట్ బుక్ చేసే వినియోగదారులకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3.04 కోట్ల యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేయగా, మరో 6.33 కోట్ల ఐడీలను రీ-వెరిఫికేషన్ కోసం ఫ్లాగ్ చేశారు.ఇంత భారీ స్థాయిలో టికెట్లు బుక్ అయినప్పటికీ.. కొత్త ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి పెద్ద సమస్య లేదా అవుటేజ్ ఏర్పడలేదని ఐఆర్సీటీ తెలిపింది. పండుగల సమయంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పెరుగుతున్న బుకింగ్ డిమాండ్ను తట్టుకునేందుకు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం, బాట్స్ను నియంత్రించడం వంటి చర్యలు కీలకంగా మారాయి. మొత్తం మీద.. ఒకే రోజులో 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం భారతీయ రైల్వే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.ఇదీ చదవండి: గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు! -
బీమా ఏజెంట్పై నా భర్త వ్యామోహం.. రూ.14 కోట్ల మోసం
చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లోని లియుజౌ నగరానికి చెందిన ఒక కుటుంబంలో చోటుచేసుకున్న వివాహేతర సంబంధం, భారీ ఆర్థిక మోసం చర్చనీయాంశంగా మారింది. గువో అనే వ్యక్తికి బీమా ఏజెంట్తో ఏడేళ్లపాటు సాగిన వివాహేతర సంబంధం న్యాయ వివాదానికి దారితీసింది. భర్య సుమారు రూ.14 కోట్ల మోసాన్ని గుర్తించి తిరిగి ఆ మొత్తాన్ని తనకు చెల్లించాలంటూ బీమా కంపెనీపై దావా వేసింది.గువో తన భార్య జెన్తో కలిసి రెండేళ్ల కుమార్తెతో జీవిస్తున్నాడు. 2017లోనే గువో తనకంటే ఎనిమిదేళ్లు చిన్నదైన బీమా ఏజెంట్ లీతో సన్నిహితంగా ఉంటూ, సందేశాలు పంపుకుంటున్న విషయం భార్య జెన్ గుర్తించింది. ఈ సందేశాల్లో మిస్ యూ వంటి మాటలతోపాటు, చైనీస్ భాషలో ఐ లవ్ యూకు సూచికగా భావించే 520 యువాన్ల మొత్తాన్ని పలుమార్లు బదిలీ చేసినట్లు తేలింది. అప్పట్లో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని జెన్, 2024లో ఆసుపత్రిలో చేరినప్పుడు నిజం బయటపడింది. తనకు, తన కుమార్తెకు గువో ఇప్పటికే వైద్య బీమా పాలసీలు తీసుకున్నట్లు, అవి కూడా అదే బీమా ఏజెంట్ లీ ద్వారానే జారీ అయినట్లు జెన్ కనుగొంది. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఇంకా కొనసాగుతున్నట్లు అనుమానం బలపడింది.లోతుగా విచారించగా ఏడేళ్ల వ్యవధిలో గువో, లీకు 30 లక్షల యువాన్లకు పైగా (సుమారు 4.47 లక్షల డాలర్లు) బదిలీ చేసినట్లు జెన్ లెక్కతేల్చింది. ఇంతటితో ఆగకుండా బీమా రికార్డుల ప్రకారం గువో లీ ద్వారా 50కి పైగా పాలసీలు తీసుకున్నాడని, వాటికి ప్రీమియంల రూపంలో కోటి యువాన్లకు పైగా (సుమారు 15 లక్షల డాలర్లు, రూ.14 కోట్లకు పైగా) చెల్లించినట్లు వెల్లడైంది. జెన్, తన భర్త గువో ఆర్థిక లావాదేవీలను లోతుగా విచారించే క్రమంలో గువో-లీ ఇద్దరూ ఏడేళ్ల వ్యవధిలో 180 సార్లు వేర్వేరు హోటళ్లలో కలుసుకున్నట్లు ఆధారాలు సేకరించింది.దీంతో జెన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి భర్త గువో, ఏజెంట్ లీ, బీమా సంస్థపై దావా వేసింది. ప్రీమియం మొత్తాన్ని తిరిగివ్వాలని, లీ తీసుకున్న 30 లక్షల యువాన్లను వాపసు చేయాలని కోరింది. అయితే లీ మాత్రం అక్రమ సంబంధాన్ని పూర్తిగా ఖండించి 180 సార్లు హోటళ్లలో కలుసుకున్నది కేవలం వ్యాపార చర్చల కోసమేనని వాదిస్తోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి ఫ్లిప్కార్ట్! -
కొత్త బిజినెస్లోకి ఫ్లిప్కార్ట్!
వాల్మార్ట్ అనుబంధ సంస్థ ఫ్లిప్కార్ట్ ఆహార పంపిణీ (ఫుడ్ డెలివరీ) విభాగంలోకి అడుగుపెడుతోంది. ‘ఈట్ ఇన్’ పేరుతో కొత్త సర్వీసును బెంగళూరులో తన ఉద్యోగులతో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. సెప్టెంబర్ 15 నాటికి ఈ సేవను నగరంలోని మొత్తం ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు, ఆ తర్వాత సాధారణ వినియోగదారులకూ విస్తరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఈ సర్వీసు ఫ్లిప్కార్ట్ ప్రధాన యాప్లోనే అందుబాటులో ఉంటుందని, వ్యాపారం విస్తరించిన తర్వాత ప్రత్యేక యాప్ను తీసుకురావచ్చని సంస్థవర్గాలు తెలిపాయి.జొమాటో, స్విగ్గీ ఆధిపత్యంలో ఉన్న ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఫ్లిప్కార్ట్ ప్రవేశించడంతో పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. ఇప్పటికే ర్యాపిడో తన ‘ఓన్లీ’ సర్వీసుతో జీరో కమిషన్ మోడల్ ద్వారా బెంగళూరులో రోజుకు 50 వేలకు పైగా ఆర్డర్లు అందుకుంటుంది. నగరం మొత్తం రోజువారీ ఆర్డర్లలో దాదాపు 10 శాతం వాటా సంపాదించింది. మరోవైపు స్విగ్గీ ‘టోయింగ్’ పేరుతో కొత్త ప్లాట్ఫామ్ను తీసుకురాగా, జొమాటో మాతృసంస్థ ఎటర్నల్ తక్కువ ధరల ఆప్షన్లతో పాటు ‘బిస్ట్రో’ పేరుతో ప్రత్యేక కార్యాచరణ నమూనాను అభివృద్ధి చేస్తోంది.జులైలోనే ఫ్లిప్కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, కంపెనీ ఫుడ్ డెలివరీలోకి ప్రవేశిస్తుందని, తొలుత పరిమిత స్థాయిలో పరీక్షించి వినియోగదారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ధర మాత్రమే కాకుండా ఎంపిక, సేవా నాణ్యత, విశ్వసనీయతపైనా దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) భాగస్వామ్యంతో ‘ఈట్ ఇన్’ను రూపొందిస్తున్న ఫ్లిప్కార్ట్, రెస్టారెంట్లకు కమిషన్ నిర్మాణాన్ని అందించే యోచనలోనూ ఉంది. ఉద్యోగుల పైలట్ దశ విజయవంతమైతే బెంగళూరు తర్వాత ఇతర నగరాలకూ ఈ సేవను విస్తరించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బొజ్జ గణపయ్య రూపంలో బిలియనీర్ సీక్రెట్స్! -
హోటళ్లు హౌస్ఫుల్
దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు దేశ ఆతిథ్య రంగానికి అనూహ్యమైన డిమాండ్ను తెచ్చిపెట్టింది. వివిధ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు, భద్రతా సిబ్బంది, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ప్రముఖ ఫైవ్ స్టార్ లగ్జరీ హోటళ్లన్నీ దాదాపు పూర్తిగా నిండిపోయాయి.రూ.2.5 లక్షలకు పైగానే..మధ్య ఢిల్లీ, ఏరోసిటీ పరిధిలోని తాజ్ మహల్ హోటల్, ఐటీసీ మౌర్య, ది లీలా ప్యాలెస్, ది ఒబెరాయ్, ది లాధి.. వంటి అత్యున్నత స్థాయి హోటల్ గదుల కొరత ఏర్పడింది. డిమాండ్ అనూహ్యంగా పెరగడంతో నిమిషాల్లో గదుల ధరలు ఆకాశాన్నంటాయి. సాధారణంగా రోజుకు రూ.18,000 వరకు ఉండే సూట్ లేదా ప్రీమియం గదుల అద్దెలు సదస్సు సమయంలో రోజుకు రూ.1 లక్ష నుంచి రూ.2.5 లక్షల (పన్నులు అదనం) వరకు పలుకుతున్నాయి. ఐటీసీ మౌర్య, లీలా ప్యాలెస్ వంటి హోటళ్లలో లగ్జరీ సూట్ల అద్దె పన్నులతో కలిపి రూ.2.5 లక్షలకు పైగానే దాటినట్లు పర్యాటక బుకింగ్ ప్లాట్ఫామ్లు వెల్లడించాయి.అన్ని హోటళ్లపై ప్రభావంఈ సదస్సు ప్రభావం కేవలం విలాసవంతమైన హోటళ్లకే పరిమితం కాకుండా ఢిల్లీలోని నాలుగు నక్షత్రాల హోటళ్లు, బడ్జెట్ హోటళ్లపై కూడా తీవ్రంగా పడింది. ట్రావెల్ ప్లాట్ఫామ్స్ డేటా ప్రకారం ఫైవ్ స్టార్ హోటళ్ల కోసం సెర్చ్ 50% పెరగ్గా, హోటల్ బుకింగ్లలో 25-138% వరకు వార్షిక వృద్ధి నమోదైంది. గ్లోబల్ డిప్లొమాటిక్ ఈవెంట్స్ వేళ లగ్జరీ గదుల లభ్యత తగ్గిపోవడంతో ధరల్లో ఈ స్థాయిలో డైనమిక్ ప్రైసింగ్ పెరిగిందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు. జియోపొలిటికల్ ప్రాధాన్యత కలిగిన ఈ అంతర్జాతీయ సదస్సు భారత రాజధానికి అంతర్జాతీయ పర్యాటక, వ్యాపార రంగాల్లో కొత్త ఊపును తెచ్చిపెట్టడమే కాకుండా, స్థానిక ఆతిథ్య పరిశ్రమ ఆదాయానికి అతిపెద్ద తోడ్పాటును అందించింది.ఇదీ చదవండి: బొజ్జ గణపయ్య రూపంలో బిలియనీర్ సీక్రెట్స్! -
ఎన్బీబీఎల్తో సెంట్రల్ బ్యాంక్ జట్టు
ముంబై: దేశీయంగా డిజిటల్ బీ2బీ చెల్లింపుల వ్యవస్థను పటిష్టం చేసే దిశగా భారత్ కనెక్ట్ ఫర్ బిజినెస్ను ఆవిష్కరించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. తద్వారా దీన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా నిల్చినట్లు వివరించింది. ఇందుకోసం ఎన్పీసీఐ భారత్ బిల్పే (ఎన్బీబీఎల్)తో చేతులు కలిపినట్లు తెలిపింది.చిన్న, మధ్య తరహా సంస్థల ఇన్వాయిస్ జనరేషన్, వసూళ్లు, సెటిల్మెంట్స్ మొదలైన వాటికి ఈ ప్లాట్ఫాం ఉపయోగకరంగా ఉంటుందని బ్యాంకు పేర్కొంది. ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 కార్యక్రమం సందర్భంగా బ్యాంక్ ఎండీ కల్యాణ్ కుమార్, ఎన్బీబీఎల్ ఎండీ నూపుర్ చతుర్వేది దీన్ని ఆవిష్కరించారు. -
ఏనుగు మాధురి తిరిగి కొల్హాపూర్కు.. వంతారా కీలక ప్రకటన
జామ్నగర్: కొల్హాపూర్లో మహాదేవిగా ప్రసిద్ధి చెందిన ఏనుగు మాధురిని తిరిగి కొల్హాపూర్కు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని వంతారా ప్రకటించింది. హై పవర్డ్ కమిటీ (HPC) ఆదేశాలను గౌరవిస్తూ.. మాధురి సంక్షేమానికి అవసరమైన చర్యలను కొనసాగిస్తామని తెలిపింది. 2025 జులై 30న మాధురిని జామ్నగర్లోని వంతారాకు తరలించడం తమ నిర్ణయం కాదని, హై పవర్డ్ కమిటీ ఆదేశాల మేరకే ఏనుగును స్వీకరించి సంరక్షణ అందించామని స్పష్టం చేసింది.మాధురిపై కొల్హాపూర్ ప్రజలకు ఉన్న భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకున్నామని వంతారా పేర్కొంది. మహారాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, సంబంధిత వర్గాలు, స్థానికులతో చర్చించిన అనంతరం 2025 ఆగస్టు 6న కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపింది. అధికారుల ఆదేశాలకు తాము కట్టుబడి ఉంటామని అప్పుడే ప్రకటించామని గుర్తుచేసింది.తాజాగా మాధురి విషయంలో తమ వాదనలను హై పవర్డ్ కమిటీ ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం అన్ని వర్గాల వాదనలు విన్న హై పవర్డ్ కమిటీ.. సంబంధిత నివేదికలను పరిశీలించడంతో పాటు నందనిలోని మాధురి పాత వసతి ప్రాంతాన్ని కూడా తనిఖీ చేసింది. 2026 సెప్టెంబర్ 9న మాధురిని తిరిగి కొల్హాపూర్కు తరలించేందుకు అనుమతిస్తూ కారణాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.అయితే మాధురిని ఇకపై ఊరేగింపులు లేదా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించకూడదని హై పవర్డ్ కమిటీ స్పష్టం చేసింది. ఆ ఏనుగుకు 24 గంటలూ సంరక్షణ అందించడంతో పాటు ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని షరతులు విధించింది. ఈ ఆదేశాలను పూర్తిగా పాటిస్తామని వంతారా వెల్లడించింది.ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిమాధురి విషయంలో తమ వైఖరి మొదటి నుంచీ పశువైద్య శాస్త్రం, ఆ ఏనుగు సంక్షేమం ఆధారంగానే ఉందని వంతారా తెలిపింది. నిరంతర వైద్య సంరక్షణతో ఏనుగు ఆరోగ్య పరిస్థితిని స్థిరీకరించగలిగామని, అయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోలేదని పేర్కొంది. ఏనుగుకు నిరంతర వైద్య పర్యవేక్షణ, అవసరమైన చికిత్స, సహాయక సంరక్షణ కొనసాగాల్సిన అవసరం ఉందని తెలిపింది.మాధురి కొల్హాపూర్కు తిరిగి వెళ్లిన తర్వాత కూడా తమ బాధ్యత ముగియదని వంతారా స్పష్టం చేసింది. ఆ ఏనుగుకు తగిన వసతి, వైద్య సదుపాయాలు, అవసరమైన వైద్య పరికరాలు, మందులు తదితర ఏర్పాట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపింది. హై పవర్డ్ కమిటీ ఆదేశాల మేరకు వంతారా పశువైద్యులు ప్రతి రెండు వారాలకు ఒకసారి కొల్హాపూర్కు వెళ్లి మాధురికి వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలను సంబంధిత అధికారులకు సమర్పిస్తారని వెల్లడించింది.నందని వసతిలోనూ ఏర్పాట్లుమాధురి తిరిగి వెళ్లనున్న నందని ప్రాంతంలోని ఎన్క్లోజర్, ఇతర సదుపాయాలను కూడా అందుబాటులో ఉన్న వనరులతో సాధ్యమైనంత మెరుగ్గా తీర్చిదిద్దినట్లు వంతారా తెలిపింది. అయితే పట్టణ ప్రణాళిక పరిమితుల కారణంగా ప్రస్తుతం మరిన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయలేకపోయామని పేర్కొంది. ట్రస్ట్ భూమి మీదుగా రహదారి వెళ్లడం వల్ల అభివృద్ధికి అందుబాటులో ఉన్న స్థలం పరిమితమైందని వివరించింది.మాధురి అక్కడ స్థిరపడిన తర్వాత కూడా వసతి సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు మఠానికి అవసరమైన సహకారం అందిస్తామని వంతారా తెలిపింది. కోర్టులు లేదా సమర్థులైన అధికారులు ఆదేశిస్తే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.జంతు సంక్షేమం అంటే కేవలం భావోద్వేగాలకు పరిమితం కాకుండా వాస్తవాలు, పశువైద్య శాస్త్రం, బాధ్యతాయుత సంరక్షణ, చట్టపరమైన ప్రక్రియను గౌరవించడం, జంతువుల జీవితాలను నిరంతరం కాపాడే నిబద్ధతతో ముందుకు సాగడం అని వంతారా పేర్కొంది.మాధురి విషయంలో ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు, హై పవర్డ్ కమిటీలకు వంతారా కృతజ్ఞతలు తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, అధికారులు అందించిన సహకారాన్ని ప్రశంసించింది. మాధురి కోసం ఆందోళన వ్యక్తం చేసిన కొల్హాపూర్ ప్రజలు, మఠానికి ధన్యవాదాలు తెలిపింది. మాధురి పరిస్థితిని హై పవర్డ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో PETA ఇండియా పోషించిన పాత్రను కూడా గుర్తించింది.మాధురి ఎక్కడ ఉన్నా.. ఆ ఏనుగు ఆరోగ్యం, సంక్షేమం, గౌరవమే తమ ప్రధాన ప్రాధాన్యమని వంతారా స్పష్టం చేసింది. ఆ ఏనుగుకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సంతోషకరమైన దీర్ఘాయుష్షు ఉండాలని ఆకాంక్షించింది. -
IRCTC రైల్వే టికెట్ బుకింగ్కి ఏమైంది? యూజర్ల గగ్గోలు
రైలు టికెట్ బుక్ చేసుకోవాలనుకున్న ప్రయాణికులకు ఐఆర్సీటీసీ (IRCTC) ప్లాట్ఫామ్ శుక్రవారం ఉదయం తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్తో పాటు మొబైల్ యాప్లోనూ టికెట్ బుకింగ్ సమయంలో పదేపదే ఎర్రర్లు రావడం, పేజీలు నెమ్మదిగా లోడ్ కావడం, బుకింగ్ ప్రక్రియ మధ్యలోనే విఫలం కావడం వంటి సమస్యలను పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో వెల్లడించారు. ముఖ్యంగా ఉదయం 8 గంటల సమయంలో బుకింగ్ రద్దీ పెరిగినప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా కనిపించినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.టికెట్ బుకింగ్ ప్రారంభించిన తర్వాత ‘Unable to Process Request’ అనే సందేశం కనిపించిందని పలువురు యూజర్లు ఫిర్యాదు చేశారు. మరికొందరికి వెబ్సైట్ చాలా సేపు లోడ్ అవుతూనే ఉండగా.. చివరకు టికెట్ బుక్ చేసే సమయానికి సీట్లు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపారు.కొంతమంది ప్రయాణికులు ఉదయం 8 గంటల నుంచే ప్రయత్నించినప్పటికీ బుకింగ్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయామని పేర్కొన్నారు. మరికొందరు వెబ్సైట్లో ‘System Overload’ తరహా సందేశాలు కనిపించాయని తెలిపారు. దీంతో అత్యంత కీలకమైన ప్రారంభ నిమిషాల్లోనే టికెట్లు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.పండుగ సీజన్ రద్దీ ప్రభావమేనా?తాజా ఇబ్బందులకు అధిక ట్రాఫిక్ ఒక కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం చేకూర్చేలా భారతీయ రైల్వే ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ (PRS) సెప్టెంబర్ 7న సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆ ఒక్క రోజే 22,26,786 టికెట్లు బుక్ అయ్యాయి. గత రికార్డు 2025 ఆగస్టు 19న నమోదైన 20,45,272 టికెట్లు కాగా.. తాజా సంఖ్య దానికంటే దాదాపు 9 శాతం అధికం. తొలిసారిగా ఒక రోజులో బుకింగ్స్ 22 లక్షల మార్కును దాటాయి.పండుగల సీజన్ సమీపిస్తుండటంతో సుదూర ప్రయాణాలకు రిజర్వేషన్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం పీక్ బుకింగ్ సమయాల్లో భారీ సంఖ్యలో ఏకకాలిక అభ్యర్థనలు రావడం సాంకేతిక ఒత్తిడికి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే తాజా అంతరాయానికి ఇదే కారణమని ఐఆర్సీటీసీ అధికారికంగా ధ్రువీకరించలేదు.కొత్త వెబ్సైట్ వచ్చినా సమస్యలు తప్పలేదా?ఇటీవలే ఐఆర్సీటీసీ తన టికెట్ బుకింగ్ వెబ్సైట్ను ఆధునీకరించే ప్రక్రియను ప్రారంభించింది. జూలై 15న కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ను రైల్వే మంత్రిత్వ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అనవసరమైన క్యాప్చాలు, పాప్అప్లు తగ్గించడం, అన్ని తరగతుల సీట్ల లభ్యతను ఒకే చోట చూపించడం, బుకింగ్లో దశలను తగ్గించడం, తరచూ ప్రయాణించే వారికి ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే అవకాశం వంటి మార్పులను ఇందులో తీసుకొచ్చారు.ఐఆర్సీటీసీ వెబ్సైట్ రోజుకు సగటున సుమారు 14.5 లక్షల టికెట్లను నిర్వహిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో పాత పాసింజర్ రిజర్వేషన్ ఇంజిన్ (PRE)ను కూడా ఆధునీకరిస్తున్నట్లు పేర్కొంది. కొత్త వెబ్సైట్ను ఈ కొత్త రిజర్వేషన్ ఇంజిన్తో అనుసంధానించడం ద్వారా పనితీరు, సామర్థ్యం మెరుగుపడుతుందని రైల్వే శాఖ వెల్లడించింది.ఇదీ చదవండి: UPI కొత్త ఫీచర్లు.. ఫోన్ డేటా లేకున్నా పేమెంట్!అయితే తాజా బుకింగ్ అంతరాయాల నేపథ్యంలో కొత్త ఇంటర్ఫేస్ మాత్రమే సరిపోదని, అధిక ట్రాఫిక్ను తట్టుకునే బ్యాక్ఎండ్ సామర్థ్యం కూడా కీలకమని ప్రయాణికుల అనుభవాలు సూచిస్తున్నాయి.పూర్తి స్థాయి డౌన్ అయిందా?వెబ్సైట్, యాప్, టికెట్ బుకింగ్ సేవలకు సంబంధించి వినియోగదారుల ఫిర్యాదులు గణనీయంగా పెరిగినట్లు ఆన్లైన్ ఫిర్యాదుల వేదిక ‘డౌన్డిటెక్టర్’లోనూ కనిపించింది.పెరుగుతున్న బుకింగ్ డిమాండ్ను ఐఆర్సీటీసీ వ్యవస్థ ఎంత సమర్థంగా నిర్వహించగలదన్నదే ప్రస్తుతం ప్రధాన ప్రశ్న. పండుగల సీజన్లో రిజర్వేషన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా సాంకేతిక మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంచడం ప్రయాణికులకు కీలకం.Though overhauled , still unresponsive. Same issue persists. Trying to book ticket since 8:00 am@irctc @RailwayNorthern @AshwiniVaishnaw pic.twitter.com/XiZXRBZIMV— AKHILESH YADAV (@akhileshyadav29) September 11, 2026@AshwiniVaishnaw @RailMinIndia @IRCTCofficial What is happening on the IRCTC website is extremely frustrating. Despite trying to book tickets, repeated “Unable to Process Request” errors are appearing, while tickets seem to #IRCTC #Railways #TrainTicket #Tatkal #IndianRailways pic.twitter.com/5fJe4v7AY8— ankit raj (@aaankit448) September 11, 2026 -
కార్పొరేట్లకు ముకేశ్ అంబానీ పిలుపు
ముంబై: ఉద్యోగాలు చేసే మహిళలు, మాతృమూర్తులకు సహాయకరంగా ఉండే వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఇందుకోసం కంపెనీలు సమిష్టిగా కలిసి పని చేయాలని సూచించారు. ఎస్బీఐ మాజీ చైర్పర్సన్, సేల్స్ఫోర్స్ దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈవో అరుంధతి భట్టాచార్య రాసిన ‘ఇన్డామిటబుల్: ఎ వర్కింగ్ ఉమన్స్ నోట్స్ ఆన్ వర్క్, లైఫ్ అండ్ లీడర్షిప్’ హిందీ ఎడిషన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. దేశంలోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగినప్పుడే దేశం కూడా తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ముకేశ్ అంబానీ ఉద్ఘాటించారు. అరుంధతి భట్టాచార్య జీవితం ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు. -
గూగుల్ కీలక ప్రకటన.. దేశం కోసం 5 కార్యక్రమాలు!
దేశంలో స్వచ్ఛ ఇంధన పరివర్తనను వేగవంతం చేయడానికి, జాతీయ వాతావరణ ప్రాధాన్యతలకు మద్దతు ఇవ్వడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జియోస్పేషియల్ డేటా మరియు మౌలిక సదుపాయాల పెట్టుబడులను వినియోగిస్తూ, భారతదేశంలో ఐదు కొత్త పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ-ఇంధన కార్యక్రమాలను గూగుల్ ఈరోజు ప్రకటించింది.ఈ ప్రకటనలలో 30 కోట్లకు పైగా భవనాలను కవర్ చేసే డిస్ట్రిబ్యూటెడ్ రూఫ్టాప్ సోలార్ ఇంటెలిజెన్స్, రాజస్థాన్లో కొత్త 150-మెగావాట్ల (MW) యుటిలిటీ సోలార్ ఒప్పందం, పదివేల మంది చిన్న రైతులకు మద్దతుగా మిట్టి ల్యాబ్స్తో కలిసి చేపట్టిన ఒక చారిత్రాత్మక మీథేన్ మరియు నీటి తగ్గింపు కార్యక్రమం, గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీ ద్వారా విస్తరించిన పరిశోధన విభాగాలు ఉన్నాయి."భారతదేశం తమ సాంకేతిక, ఏఐ నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటున్న తరుణంలో, ఈ ఊపు సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధికి దారితీసేలా చూడటం మన ఉమ్మడి భవిష్యత్తుకు కీలకం" అని గూగుల్ క్లైమేట్ ఆపరేషన్స్ డైరెక్టర్ వృషాలి గౌడ్ అన్నారు. "స్థానిక సౌర విద్యుత్ వ్యవస్థాపకులకు రూఫ్టాప్ వినియోగాన్ని పెంచడంలో సహాయపడటానికి జియోస్పేషియల్ ఏఐ ను ఉపయోగించడం నుండి, వాతావరణ అనుకూల నీటి పద్ధతులపై రైతులతో కలిసి పనిచేయడం, జాతీయ గ్రిడ్కు కొత్త స్వచ్ఛమైన విద్యుత్ను జోడించడం వరకు ఈ కార్యక్రమాలు భారతదేశానికి ఆచరణాత్మకమైన, శాశ్వత ప్రభావాన్ని సృష్టించటానికి డిజిటల్ ఆవిష్కరణ మరియు పర్యావరణ పరిరక్షణ కలిసికట్టుగా ఎలా కలిసి పనిచేస్తున్నాయో చూపిస్తున్నాయి" అని అన్నారు.భారతదేశంలోని 30 కోట్లకు పైగా రూఫ్టాప్ల కోసం సోలార్ ఏపిఐను విస్తరించడంగూగుల్ చాలా కాలంగా రూఫ్టాప్ సోలార్ వినియోగాన్ని వేగవంతంగా మరియు సరళంగా చేయడానికి ఏఐ మరియు ఇమేజరీని ఉపయోగిస్తోంది. ఎర్త్ ఏఐ లో భాగమైన సోలార్ ఏపిఐ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1.2 బిలియన్లకు పైగా భవనాలకు మరియు భారతదేశవ్యాప్తంగా 30 కోట్లకు పైగా రూఫ్టాప్లకు అవసరమైన పరిజ్ఞానం అందించగలదు.ఈ సాంకేతికత ద్వారా ఇళ్లపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసే అవకాశాలను ముందుగానే అంచనా వేయొచ్చు. దీంతో ఇన్స్టాలర్లు నేరుగా ఇంటి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆ ఇంటికి ఉన్న సోలార్ సామర్థ్యాన్ని తెలుసుకోవచ్చు. ఫలితంగా కచ్చితమైన డిజైన్లు, తుది కస్టమర్ ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు పట్టే సమయం, ఖర్చు తగ్గుతుంది. పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన వంటి ప్రభుత్వ ప్రోత్సాహక కార్యక్రమాలతో భారతదేశంలో గృహ సౌరశక్తి రంగం దేశవ్యాప్తంగా పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సోలార్ లాడర్ మరియు ఓపెన్సోలార్ వంటి స్థానిక ప్లాట్ఫారమ్లు, 3D సిస్టమ్ లేఅవుట్లను ఆటోమేట్ చేయడానికి, పారాపెట్ మరియు వాటర్ ట్యాంక్ క్లియరెన్స్లను మోడల్ చేయడానికి, మొదటి క్లయింట్ సమావేశంలోనే మొబైల్ ప్రతిపాదనలను రూపొందించడానికి, సోలార్ ఏపిఐ డేటాను తమ సాఫ్ట్వేర్ వర్క్ఫ్లోలలో ఇప్పటికే అనుసంధానిస్తున్నాయి.రూఫ్టాప్ అంచనాలను మరింత వేగంగా, కచ్చితంగా, విస్తృత స్థాయిలో చేపట్టేందుకు సోలార్ ఏపీఐ తోడ్పడుతుంది. మాన్యువల్గా పైకప్పు సర్వేలు నిర్వహించడం, ప్రతి ఇంటికి ప్రత్యేక లేఅవుట్లను రూపొందించడం వంటి ప్రక్రియలను ఆటోమేట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక డేటాను ఇది అందిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇళ్లలో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసుకోవడం మరింత వేగంగా, అందుబాటులో ఉండే ఖర్చుతో, సులభంగా మారుతుంది.గ్రీన్ వర్క్ఫోర్స్ శిక్షణ మరియు తక్కువ-కార్బన్ నిర్మాణ సామగ్రిపై దృష్టి సారించడంతో పాటు, నీటి నిర్వహణ, వ్యర్థాలు మరియు సర్క్యులారిటీపై దృష్టి సారించిన మంథన్ ప్లాట్ఫారమ్ ద్వారా కొత్త అవకాశాలను అందిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏఐ ని ఉపయోగిస్తున్న నాలుగు భారతీయ స్టార్టప్లతో కూడిన 'గూగుల్ డీప్ మైండ్ యాక్సలరేటర్ : ఏఐ ఫర్ ది ప్లానెట్' కార్యక్రమం యొక్క తొలి బృందంతో సహా, స్వదేశీ వాతావరణ-సంబంధిత ఆవిష్కరణలకు గూగుల్ అందిస్తున్న విస్తృత మద్దతుపై ఈ ప్రయత్నాలు ఆధారపడి ఉన్నాయి.భారతదేశ గ్రిడ్కు 150 మెగావాట్ల స్వచ్ఛ ఇంధనాన్ని జోడించడంరాజస్థాన్లో 150-మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ కోసం రీన్యూ పవర్తో చేసుకున్న ఒక కొత్త, దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా భారతదేశ విద్యుత్ గ్రిడ్ పట్ల తమ నిబద్ధతను గూగుల్ విస్తరిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం, గూగుల్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన విద్యుత్కు సంబంధించిన పర్యావరణ లక్షణాలను పొంది, తన విస్తృత వాల్యూ చైన్ అంతటా విద్యుత్ సంబంధిత ఉద్గారాలను పరిష్కరించడంలో సహాయపడటానికి వాటిని వినియోగించుకుంటుంది.స్వచ్ఛ ఇంధన లక్షణాలను నేరుగా సేకరించడం ద్వారా సరఫరా గొలుసు డీకార్బనైజేషన్ను వేగవంతం చేయాలనే గూగుల్ విధానానికి ఈ ఒప్పందం మరింత బలాన్ని చేకూరుస్తుంది. భారతదేశంలో గూగుల్ చేపట్టిన రెండవ స్కోప్ 3-కేంద్రీకృత సౌర ప్రాజెక్ట్ ఇది. దీనితో, రీన్యూతో ఒప్పందం కుదుర్చుకున్న మొత్తం సామర్థ్యం, భారతదేశ జాతీయ గ్రిడ్పై 300 మెగావాట్ల కొత్త సౌర విద్యుత్ ఉత్పాదన సామర్థ్యానికి చేరుకుంది.వరి రైతులకు మీథేన్ను తగ్గించడంలో.. నీటిని సంరక్షించడంలో సహాయంతెలంగాణలోని వేలాది మంది సన్నకారు వరి రైతులు వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అవలంబించడంలో సహాయపడే ఒక ప్రాజెక్ట్ కోసం గూగుల్, మిట్టి ల్యాబ్స్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా, మొత్తం మీథేన్ ఉద్గారాలలో 12% వరకు వరి సాగు నుండే వెలువడుతున్నాయి.వరి సాగు నుండి వెలువడే మీథేన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా లభించే క్రెడిట్స్ కొనుగోలు చేయడానికి, ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించిన ఒప్పందాలలో ఇదే అతిపెద్దది. ఈ కార్యక్రమం 'ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రయింగ్' (AWD) పద్ధతిని పరిచయం చేస్తోంది. పొలాలను నిరంతరం నీటిలో ముంచి ఉంచే బదులు, కాలానుగుణంగా నీటిని తీసివేసి, తిరిగి నీటితో నింపడం ద్వారా, AWD నేలలోకి ఆక్సిజన్ను ప్రవేశపెట్టి, మీథేన్ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులను అడ్డుకుంటుంది. అదే సమయంలో ఇది నీటిపారుదల అవసరాన్ని గణనీయంగా తగ్గించి, నీటిని సంరక్షించి, కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు నేరుగా చెల్లింపులను అందిస్తుంది.ఈ ప్రాజెక్ట్, 20 సంవత్సరాల గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ (GWP20) ప్రాతిపదికన దాదాపు 3 మిలియన్ టన్నుల CO2e (100 సంవత్సరాల GWP100 ప్రాతిపదికన 1 మిలియన్ టన్నులకు సమానం) తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ధృవీకరణకు నాసా-సహాయక ఉపగ్రహ పర్యవేక్షణ మరియు క్షేత్రస్థాయి నెట్వర్క్లు తోడ్పడతాయి.గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీకి కొత్త ప్రాధాన్యతా రంగాలను జోడించడంభారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయంతో భాగస్వామ్యంతో ఫిబ్రవరిలో ప్రారంభించబడిన గూగుల్ సెంటర్ ఫర్ క్లైమేట్ టెక్నాలజీ, పర్యావరణ సవాళ్లకు ఏఐ ని వర్తింపజేసే పరిశోధకులకు , ఆవిష్కర్తలకు మద్దతు ఇస్తుంది. 77 దరఖాస్తుల నుండి, ఈ సెంటర్ తన మొదటి మూడు ప్రారంభ గ్రాంట్ గ్రహీతలను రెండు విభాగాలలో ఎంపిక చేసింది: గ్రీన్ వర్క్ఫోర్స్ శిక్షణ మరియు తక్కువ-కార్బన్ నిర్మాణ సామగ్రి.గూగుల్ ఇప్పుడు భారత ప్రభుత్వ మంథన్ ప్లాట్ఫామ్పై పరిశోధన మరియు ఆవిష్కరణ ప్రతిపాదనల కోసం రెండు కొత్త ప్రాధాన్యతా రంగాలను తెరవడం ద్వారా సెంటర్ పరిధిని విస్తరిస్తోంది.➤జల సంరక్షణ: కీలకమైన పరీవాహక ప్రాంత వనరులను రక్షించడానికి , సంరక్షించడానికి, విస్తరించదగిన సాంకేతికతలు మరియు నిర్వహణ పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా పెరుగుతున్న మంచినీటి డిమాండ్ను పరిష్కరించడం.➤వ్యర్థాలు మరియు వలయాకార వినియోగం: వనరుల వినియోగానికి మరింత వలయాకార పద్ధతులకు మద్దతు ఇవ్వడానికి, ఇ-వ్యర్థాలు మరియు బ్యాటరీ రీసైక్లింగ్ ప్రక్రియలపై పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం.భారతదేశపు క్లైమేట్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్కు మద్దతుక్షేత్రస్థాయి ఆవిష్కరణలకు తమ మద్దతును పునరుద్టాటిస్తూ, గూగుల్ ఇటీవల 'గూగుల్ డీప్మైండ్ యాక్సిలరేటర్: ఏఐ ఫర్ ది ప్లానెట్' యొక్క తొలి బ్యాచ్ను స్వాగతించింది. ఇందులో గ్రహాన్ని రక్షించడానికి ఏఐని ఉపయోగించుకుంటున్న నాలుగు మార్గదర్శక భారతీయ స్టార్టప్లు ఉన్నాయి.➤టెర్రాస్టాక్, వరాహా క్లైమేట్ : చిన్న, సన్నకారు రైతులకు వారి భూమి స్థాయిలో సమగ్ర భూవివరాలు అందించడంతో పాటు, పునరుత్పాదక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, ధ్రువీకరించిన కార్బన్ క్రెడిట్లను అందుబాటులోకి తీసుకురావడంలో తోడ్పడుతున్నాయి.➤ఫార్మర్స్ ఫర్ ఫారెస్ట్స్ మరియు క్లైమిట్రా కార్బన్, అగ్రోఫారెస్ట్రీని విస్తరించడానికి, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి, మరియు హానికరమైన బయోమాస్ను బయోచార్గా మార్చడానికి జియో-ఏఐ, డ్రోన్లు మరియు శాటిలైట్ నమూనాలను ఉపయోగిస్తున్నాయి -
కాగ్నిజెంట్పై వీసా మోసం ఆరోపణలు
అమెరికాకు చెందిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్పై అమెరికా కార్మిక శాఖ (డీవోఎల్) చర్యలు తీసుకుంది. వలస కార్యక్రమాల్లో మోసపూరిత విధానాలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో సంస్థ దాఖలు చేసే ‘పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్’ (పీఈఆర్ఎం) కొత్త దరఖాస్తులను నిలిపివేసింది. ఉద్యోగి ఆధారిత గ్రీన్కార్డు ప్రక్రియలో పీఈఆర్ఎం మొదటి కీలక దశ. కార్మిక శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ ఆంథొనీ డి ఎస్పోసిటో ఎక్స్లో కొన్ని విషయాలు వెల్లడించారు.‘అమెరికన్ కార్మికులకు ముప్పు వాటిల్లితే సహించం. వైట్హౌస్ ఫ్రాడ్ టాస్క్ఫోర్స్తో కలిసి వాస్తవాలు, మోసాలు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆరోపణల వివరాలను గానీ, ప్రభావితమైన దరఖాస్తుల సంఖ్యను గానీ శాఖ వెల్లడించలేదు. క్లౌడెరా అనే మరో టెక్ కంపెనీపై కూడా సమాంతరంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలిపారు.వర్క్ఫోర్స్ను విస్తారిస్తామన్న కంపెనీవిజిల్బ్లోయర్ల నుంచి అందిన పలు ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్య చేపట్టినట్టు ఎస్పోసిటో మీడియాకు తెలిపారు. అయితే, ఇప్పటికే ఆమోదం పొందిన సర్టిఫికేషన్లపై ఈ నిలిపివేత ప్రభావం ఉండదని, హెచ్-1బీ వీసా కార్యక్రమానికి ఇది వర్తించదని స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, ఈ చర్యకు ఒక్కరోజు ముందే కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ 1,500 మంది అమెరికన్ కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని, తమ వర్క్ఫోర్స్ను 15,000కు విస్తరిస్తామని ప్రకటించడం గమనార్హం.ఫెడరల్ కోర్టును ఆశ్రయించే అవకాశంయూఎస్సీఐఎస్ గణాంకాల ప్రకారం, కాగ్నిజెంట్ హెచ్-1బీ పిటిషన్ల ఆమోదం 2020లో 9,413 ఉండగా 2026 నాటికి 3,510కి పడిపోయింది. ఇమిగ్రేషన్ న్యాయవాది పూర్వి చోతానీ మాట్లాడుతూ, కొత్త దరఖాస్తులను నిరోధించే అధికారం డీవోఎల్కు ఉందా అనే అంశంపై స్పష్టత లేదని, కాగ్నిజెంట్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం భారత ఐటీ నిపుణుల దీర్ఘకాలిక ప్రాజెక్టుల డెలివరీ మోడళ్లను ప్రభావితం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ అంశంపై కాగ్నిజెంట్, నాస్కామ్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!
దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, సహకార సంఘాలు, గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు అధికారులు ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెతో పాటు వరుసగా వచ్చే సెలవుల కారణంగా 4 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలగనుంది. శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు, అధికారుల ఒక రోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు నిచ్చారు.శనివారం బ్యాంకులకు సెలవు. ఆ మరసటి రోజు ఆదివారం, ఆతదుపరి రోజు సోమవారం వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ సెలవు. వరుస సెలవులతో చెక్కుల క్లియరింగ్, డిపాజిట్లు, విత్డ్రాయల్స్, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. 4 రోజుల పాటు డిపాజిట్ ప్రక్రియ నిలిచిపోవడంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది.ప్రతి నెలా అన్ని శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవు దినాలుగా ప్రకటించాలనే మూడేళ్ల క్రితం నాటి డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం, ఉద్యోగులు, అధికారుల ఇతర పెండింగ్ డిమాండ్లపై యాజమాన్యం ప్రభుత్వం చర్చలు జరిపి పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ ఒక రోజు సమ్మెకు బ్యాంక్ ఉద్యోగులు సిద్ధమయ్యారు. కాగా, ఈ నెల 28 నుండి 30 వరకు మరో 3 రోజుల సమ్మె సైతం చేపట్టనుండడం గమనార్హం.ఇదీ చదవండి: ఆధార్కు భారీ అప్గ్రేడ్.. ఇక మూడింతలు! -
‘నేనేం పారిపోలేదు.. న్యాయ బంధనాల్లో చిక్కుకున్నా’
కింగ్ఫిషర్ మాజీ అధినేత విజయ్ మాల్యా మరోసారి వార్తల్లో వచ్చారు. తనను ‘పారిపోయిన అప్పులవాడు’ (బగోడా)గా ముద్ర వేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను 1992 నుంచే బ్రిటన్లో శాశ్వత నివాసిగా ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం చట్టపరమైన ఆంక్షల వల్లే యూకే వదిలి రాలేకపోతున్నానని ఎక్స్ వేదికగా వరుస పోస్టుల ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం తనకు ఘోరమైన అన్యాయం చేసిందని ఆరోపించారు.కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గత ఏడాది అక్టోబర్లో లోక్సభలో ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్-2018 కింద 15 మందిని ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించినట్టు, అందులో మాల్యా, నీరవ్ మోదీ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఇప్పుడు మాల్యా మాత్రం ‘నేను తప్పించుకుని తిరగడం లేదు, న్యాయపరమైన బంధనాలే నన్ను ఆపుతున్నాయి’ అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.ఇది కేవలం మాటల యుద్ధంతో ఆగిపోలేదు. బ్యాంకులు, ప్రభుత్వం తన నుంచి కోర్టు తీర్పు ప్రకారం రావాల్సిన రూ.6,203 కోట్లకు గాను రూ.14,100 కోట్లు వసూలు చేసినట్టు అంగీకరించారని మాల్యా చెప్పారు. అయినా తనను మోసగాడిగా చిత్రీకరించడం అన్యాయం అన్నారు. తనకు రావాల్సిన రిఫండ్ సంగతేమిటని ఎదురుదాడికి దిగారు. ఇక ఫిబ్రవరిలో బాంబే హైకోర్టు మాత్రం.. కోర్టు విచారణలకు దూరంగా ఉంటూ న్యాయమైన ఉపశమనం కోరడం భావ్యం కాదు అని మాల్యాను తీవ్రంగా మందలించింది. చివరిసారిగా భారత్ తిరిగొచ్చే ఉద్దేశం ఉందో లేదో స్పష్టం చేయాలని ఆదేశించింది.ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే.. -
పాలసీదారుల హక్కులపై ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు
ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియలో పారదర్శకత, వేగవంతమైన సేవలు కల్పించే దిశగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పలు కీలక నిబంధనలను తప్పనిసరి చేసింది. పాలసీదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే క్లెయిమ్ల విషయంలో అనవసర జాప్యాలు, తిరస్కరణలను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల్లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.నగదు రహిత (క్యాష్లెస్) చికిత్సలకు సంబంధించి ఆసుపత్రి నుంచి అన్ని పత్రాలు అందిన తర్వాత బీమా సంస్థ ఒక గంటలోపే ఆమోదం తెలియజేయాలి. అలాగే డిశ్చార్జ్ సమయంలో మూడు గంటల్లోపే తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రోగులు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ఆసుపత్రి నుంచి బయటకు రాగలుగుతారు.అవసరమైన పత్రాలన్నీ సమర్పించిన తర్వాత సాధారణ క్లెయిమ్లను 30 రోజుల్లోగా, ఇతర పాలసీలను 45 రోజుల్లోగా బీమా సంస్థలు తేల్చాల్సి ఉంటుంది.ఎనిమిదేళ్ల పాటు నిరంతరాయంగా పాలసీని రెన్యువల్ చేసుకున్న పాలసీదారుల క్లెయిమ్లను, మోసం లేదా మినహాయింపు జాబితాలోని అంశాలు మినహా తిరస్కరించే అవకాశం బీమా సంస్థలకు ఉండదు.పాలసీదారులు తమకున్న వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్లు, నో-క్లెయిమ్ బోనస్లను కోల్పోకుండానే ఒక బీమా సంస్థ నుంచి మరో సంస్థకు మారే వెసులుబాటు కలిగి ఉంటారు.క్లెయిమ్ తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని బీమా సంస్థను పాలసీదారు కోరే హక్కు ఉంటుంది. అన్యాయం జరిగిందని భావిస్తే బీమా అంబుడ్స్మన్ను ఆశ్రయించే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే.. -
ట్రైన్ టికెట్ బుకింగ్స్ అక్కడే ఎక్కువ!
భారతదేశంలో రైల్వే టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో ఐఆర్సీటీసీతో పాటు పేటిఎం, మేక్మైట్రిప్, ఇక్సిగో, కన్ఫర్మ్ టికెట్ వంటి థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆన్లైన్లో బుక్ అయ్యే రైల్వే టికెట్లలో దాదాపు 28 శాతం టికెట్లు థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ల ద్వారా బుక్ అవుతున్నాయని ఐఆర్సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ హిమాలియన్ తెలిపారు.89 శాతం ఆన్లైన్లోనేప్రస్తుతం దేశంలో బుక్ అయ్యే రైల్వే టికెట్లలో దాదాపు 89 శాతం ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయి. ఇందులో 53 శాతం టికెట్లు ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ మొబైల్ యాప్ ద్వారా బుక్ అవుతుండగా, మరో 17 శాతం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా బుక్ అవుతున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన బుకింగ్ వ్యవస్థల ద్వారా సుమారు 2 శాతం టికెట్లు బుక్ అవుతున్నాయి. మిగిలిన 28 శాతం టికెట్లు ఐఆర్సీటీసీ బిజినెస్ అసోసియేట్స్ ద్వారా బుక్ అవుతున్నాయి.పేటిఎం వాటా ఎంత?ఇక్కడ 28 శాతం అనేది కేవలం పేటిఎం వాటా మాత్రమే కాదు. ఈ సంఖ్యలో ఐఆర్సీటీసీతో భాగస్వామ్యం ఉన్న అన్ని థర్డ్ పార్టీ సంస్థల బుకింగ్స్ ఉన్నాయి. ఇందులో మేక్మైట్రిప్, ఇక్సిగో, కన్ఫర్మ్ టికెట్ ఉన్నాయి. అయితే వీటిలో ఒక్కో సంస్థకు ఎంత వాటా ఉందనే వివరాలను ఐఆర్సీటీసీ వెల్లడించలేదు.రోజుకు 19 లక్షల బుకింగ్స్దేశంలో రోజుకు సుమారు 18 లక్షల నుంచి 19 లక్షల రైల్వే టికెట్లు బుక్ అవుతున్నాయి. ఇందులో దాదాపు 14.88 లక్షల నుంచి 15 లక్షల వరకు టికెట్లు ఆన్లైన్లోనే బుక్ అవుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రతిరోజూ టికెట్లు బుక్ అవుతుండటంతో.. రైల్వే ప్రయాణం భారతదేశంలోని అతిపెద్ద ఆన్లైన్ ట్రావెల్ కేటగిరీల్లో ఒకటిగా ఉంది.ఐఆర్సీటీసీ కేవలం రైల్వే టికెట్ల బుకింగ్కే పరిమితం కాకుండా.. మరిన్ని ట్రావెల్ సేవలను అందించాలని చూస్తోంది. హోటల్ బుకింగ్, టూరిజం, ఇన్సూరెన్స్, ఫుడ్, క్యాబ్లు, లోకల్ ట్రాన్స్పోర్ట్ వంటి సేవలను కూడా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందించే దిశగా ఐఆర్సీటీసీ ముందుకు వెళ్లాలని భావిస్తోంది.ఇదీ చదవండి: జియో రూ.111 రీఛార్జ్ ప్లాన్: రెండు ఆప్షన్స్! -
శామ్సంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత
వ్యయ నియంత్రణలో భాగంగా చిన్నాచితకా కంపెనీలు ఇటీవలి కాలంలో భారీగా తమ ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. అందులో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఏమీ తీసుపోలేదు. తన భారత విభాగంలో వ్యయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉద్యోగాల కోతకు పూనుకుంది. టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 80-100 మంది ఎగ్జిక్యూటివ్లను ఇప్పటికే బ్యాచ్ల వారీగా విధుల నుంచి తొలగించినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఆధారంగా వెలువడిన సమాచారం స్పష్టం చేస్తోంది. తొలగింపునకు గురైన వారిలో డైరెక్టర్ స్థాయి అధికారులు, ప్రధాన కార్యాలయంలోని టీమ్ లీడర్లతో పాటు బ్రాంచ్, ఏరియా మేనేజర్లు కూడా ఉన్నారు.పెరిగిన ఒత్తడి.. తగ్గిన ఆదాయంగత కొద్ది రోజులుగా చిన్న బ్యాచ్ల్లో టర్మినేషన్ లేఖలు జారీ చేస్తుండగా, కొందరికి నోటీసు పీరియడ్ గడువు కూడా ఇవ్వకుండా వెంటనే వైదొలగాలని కోరినట్టు తెలుస్తోంది. మెమొరీ చిప్ల ధరలు రెట్టింపు కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించడం వల్ల దిగుమతి చేసుకునే విడిభాగాలు, ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. దీనికితోడు ముడిసరుకు వ్యయాలు కూడా అధికమవడంతో శామ్సంగ్ లాభదాయకతపై ఒత్తిడి నెలకొంది. దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ కూడా ఏడాది ప్రాతిపదికన 11-12 శాతం క్షీణించడం సంస్థ ఆదాయంపై ప్రభావం చూపింది.త్వరలో 25 శాతం కోత..ప్రస్తుతానికి ఈ లేఆఫ్స్ టీవీ, అప్లయన్స్ వ్యాపారాలకే పరిమితమైనప్పటికీ రాబోయే రోజుల్లో సేల్స్, మార్కెటింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో మొత్తం సిబ్బందిలో 25 శాతం వరకు కోత విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనిలో ప్రత్యక్ష ఉద్యోగులతో పాటు మ్యాన్పవర్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఆఫ్రోల్ సిబ్బంది కూడా ఉండవచ్చు. శామ్సంగ్ దేశీయ ఎలక్ట్రానిక్స్ సేల్స్ టీంలో దాదాపు 550-600 మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు.పండగ సీజన్పై ఆశలుప్రస్తుత లేఆఫ్స్లో స్మార్ట్ఫోన్ విభాగం ప్రభావితం కాలేదని, దీపావళి సీజన్లో డిమాండ్ కోలుకుంటుందని సంస్థ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విక్రయాలను బట్టి భవిష్యత్తులో మొబైల్ వ్యాపారంపైనా సమీక్ష ఉండవచ్చని ఒక అధికారి తెలిపారు. బ్రాంచ్ నెట్వర్క్ ఏకీకరణతో సహా భారత కార్యకలాపాల సమగ్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
వైద్య పరికరాల టెస్టింగ్కు 100 శాతం నిధులు
దేశీయ వైద్య పరికరాల విభాగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే దిశగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు. వైద్య పరికరాల టెస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుగోలుకు కేంద్రం వందశాతం నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి రోగులకు సేవలందించే విధంగా భారత్ను వైద్య కేంద్రంగా తీర్చిదిద్దాలని ఫార్మా, మెడ్టెక్ పరిశ్రమను కోరారు.టెస్టింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటుఅంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నాణ్యమైన వైద్య పరికరాలను రూపొందించాల్సిన అవసరం ఉందని గోయల్ నొక్కిచెప్పారు. దేశీయంగా కీలక విడిభాగాల తయారీ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ఈ పరికరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి పరీక్షించి, ధ్రువీకరించి, ప్రపంచ కస్టమర్లకు ప్రదర్శించే విధంగా ఉమ్మడి టెస్టింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు.బీఐఎస్ ద్వారా మద్దతుభారత ప్రామాణిక సంస్థ (బీఐఎస్) ద్వారా ఈ మద్దతు అందించనున్నట్టు మంత్రి వెల్లడించారు. అత్యుత్తమ టెస్టింగ్ ఎక్విప్మెంట్ కోసం వందశాతం వ్యయాన్ని బీఐఎస్ భరిస్తుందని చెప్పారు. పరిశ్రమ నుంచి కేవలం డిమాండ్ రావాల్సిందేనని, ప్రతిపాదనలతో పనిలేదని, అత్యాధునిక ల్యాబ్లను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. దేశీయ సంస్థలు సాంకేతిక భాగస్వామ్యాలు, జాయింట్ వెంచర్లను ప్రోత్సహించాలని చెప్పారు. అలాగే గ్లోబల్ ఇన్నోవేటర్లు, పెద్ద ఫార్మా కంపెనీలను భారత్కు ఆహ్వానించాలని కూడా సూచించారు. కొనుగోలుదారులు, విక్రేతల మధ్య మెరుగైన సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.అదనంగా, రోగులకు అందించిన సర్వీసులను మరింత సులభతరం చేసేలా ఉత్పత్తులను రూపొందించాల తెలిపారు. సకాలంలో బీమా క్లెయిమ్ల చెల్లింపులు జరిగేలా చూడాలని బీమా, హెల్త్టెక్ కంపెనీలకు గోయల్ పిలుపునిచ్చారు. ఈ ప్రకటన దేశీయ మెడ్టెక్ రంగంలో నాణ్యత ప్రమాణాలను పెంచడంతో పాటు, ఎగుమతుల విస్తరణకు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
అప్స్టాక్స్తో యూఎస్ స్టాక్స్
న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్టర్లు యూఎస్ స్టాక్స్ కొనుగోలు చేసేందుకు వీలుగా అప్స్టాక్స్ సొంత ప్లాట్ఫామ్ను ఆవిష్కరించింది. దీంతో యూఎస్లో లిస్టయిన 8,000కుపైగా కంపెనీల షేర్ల కొనుగోలుకి వీలు చిక్కనుంది. అంతేకాకుండా మరో 2,000 ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్లు)లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చని ఒక ప్రకటనలో స్టాక్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అప్స్టాక్స్ తెలియజేసింది. యాప్ ద్వారా గ్లోబల్ దిగ్గజాలు యాపిల్, టెస్లా, అమెజాన్, గూగుల్ తదితర షేర్లను సొంతం చేసుకోవచ్చని తెలియజేసింది. దీనిలో భాగంగా ఇన్వెస్టర్లు కనీసం 1 డాలరుతో పెట్టుబడులు ప్రారంభించవచ్చని వెల్లడించింది. తద్వారా పూర్తి షేరుని కాకుండా దీనిలో కొంత భాగాన్ని సైతం కొనుగోలు చేయవచ్చని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులు దేశీ వెల్త్ ఎకోసిస్టమ్ తదుపరి దశ వృద్ధిని ప్రతిబింబిస్తాయని అప్స్టాక్స్ సహవ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఈ ప్లాట్ఫామ్ ద్వారా గ్లోబల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చని తెలియజేశారు. పెట్టుబడులు ఇలా వినియోగదారులు తమ దేశీ బ్యాంక్ ఖాతాల ద్వారా రూపాయలలోనే పెట్టుబడులు చేపట్టవచ్చని అప్స్టాక్స్ పేర్కొంది. ఇవి ఆటోమేటిగ్గా డాలర్లలోకి మారి్పడి అవుతాయని తెలియజేసింది. ఇన్వెస్టర్లు యూఎస్ మార్కెట్ల ట్రేడింగ్ సమయంకానప్పుడు కూడా ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్ల ద్వారా కొనుగోలు ఆర్డర్లు నమోదు చేయవచ్చని వివరించింది. స్పేస్ ఎక్స్ప్లొరేషన్, ఏఐతోపాటు.. ఇతర వర్ధమాన టెక్నాలజీలు, ఇతర రంగాలలో పెట్టుబడులకు యూఎస్ స్టాక్స్ వీలు కలి్పస్తాయని పేర్కొంది. ఆర్బీఐ అనుమతించిన ఎల్ఆర్ఎస్ ద్వారా మార్గదర్శకాలకు లోబడి ఇందుకు అవకాశముంటుందని తెలియజేసింది. -
క్విక్ కామర్స్లో సొంత బ్రాండ్ల జోరు
క్విక్ కామర్స్లో పోటీ ఇప్పుడు వేగంగా డెలివరీ చేయడానికే పరిమితం కావడం లేదు. ఎక్కువ మార్జిన్లు, ధరలపై నియంత్రణ, సరుకుల లభ్యత, కస్టమర్ను తమ ప్లాట్ఫామ్లోనే కొనసాగించడం కోసం సంస్థలు సొంత బ్రాండ్లపై దృష్టి పెడుతున్నాయి. దీంతో క్విక్ కామర్స్ విక్రయాల్లో ప్రైవేటు లేబుల్స్ వాటా గణనీయంగా పెరుగుతోంది. 2025లో ప్రారంభంలో 6 శాతం ఉన్న వాటా ప్రస్తుతం 16 శాతానికి చేరినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. స్టేపుల్స్ నుంచే శ్రీకారం సొంత బ్రాండ్ల విస్తరణకు ముందుగా పప్పులు, బియ్యం, పిండి, నూనెలు వంటి రోజువారీ నిత్యావసరాలనే (స్టేపుల్ ఫుడ్)క్విక్ కామర్స్ కంపెనీలు ఎంచుకుంటున్నాయి. తర్వాత ప్రీమియం స్నాక్స్, కూల్డ్రింక్స్, డ్రైఫ్రూట్స్, వెజిటబుల్స్ విభాగాల్లోకి అడుగుపెడుతున్నాయి. టాటా గ్రూప్నకు చెందిన బిగ్ బాస్కెట్ ఈవిషయంలో పోటీ కంపెనీలకన్నా ముందుంది. ప్రైవేట్లేబుల్స్ మొత్తం ఆదాయంలో దాదాపు 35 శాతం వాటాను బిగ్బాస్కెట్ కలిగి ఉంది. బీబీ పాపులర్, బీబీ రాయల్, బీబీ హోమ్, ఫ్రెషో వంటి బ్రాండ్లు విభిన్న విభాగాల్లో దూసుకుపోతున్నాయి. ఇన్స్టామార్ట్ జోరు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ సొంత బ్రాండ్ల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సుప్రీమ్ హార్వెస్ట్ బ్రాండ్ను 2022లో ప్రారంభించింది. ప్రస్తుతం ఇన్స్టామార్ట్లో విక్రయించే స్టేపుల్స్లో దీని వాటా 25 శాతం. ఏడాది క్రితం ఇది 18 శాతమే. ఉరద్ దాల్ (మినప్పప్పు) అమ్మకాల్లో సుప్రీమ్ హార్వెస్ట్ వాటా 28 శాతం పైగానే. మైదాలో 51 శాతం, రైస్ఫ్లోర్లో 58 శాతం వాటా ఉంది. జెప్టోకు చెందిన డైలీ గుడ్ కూడా స్టేపుల్స్లో 14 శాతం వాటా సాధించింది. ఉరద్ దాల్, పల్లీలు, కిస్మిస్ విక్రయాలు ఈ బ్రాండ్ నుంచే వస్తున్నాయి. సోయాబీన్ నూనెల్లో 16 శాతం, సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో డైలీ గుడ్ 5 శాతం వాటా సాధించింది. ఆచితూచి వ్యవహరిస్తున్న బ్లింకిట్ ఎటర్నల్ (జొమాటో)కు చెందిన బ్లింకిట్ ప్రైవేట్ లేబుల్ ’హోల్ ఫార్మ్’ మాత్రం కొంత నియంత్రిత విధానాన్ని అనుసరిస్తోంది. వినియోగదారులు బ్రాండ్ గురించి పెద్దగా పట్టించుకోని మిల్లెట్స్, ప్రత్యేక స్టేపుల్స్ వంటి విభాగాలపై మాత్రమే దృష్టి పెట్టింది. బార్లీ, వైట్ మటర్ అమ్మకాల్లో హోల్ఫార్మ్ 62 శాతం వాటా సాధించింది. అయితే పప్పులు, డ్రైఫ్రూట్స్ విభాగాల్లో దీని ఉనికి పరిమితంగానే ఉంది. కస్టమర్లకు ఎక్కువ రకాల ఉత్పత్తులను యాప్ ద్వారా అందుబాటులో ఉంచడానికే బ్లింకిట్ ప్రాధాన్యం ఇస్తోంది. రెట్టింపు మార్జిన్లే కీలకం సొంత బ్రాండ్లపై క్విక్ కామర్స్ సంస్థలకు ఎందుకు ఆసక్తి అంటే అధిక లాభాలే..కంపెనీలకు స్టేపుల్స్లో ప్రైవేట్ లేబుల్స్ ద్వారా 15 నుంచి 25 శాతం మార్జిన్లు వస్తున్నాయి. థర్డ్ పార్టీ బ్రాండ్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అదే సమయంలో తక్కువ ధరలతో కస్టమర్లను ఆకర్షించి భారీ విక్రయాలు సాధించే వ్యూహాన్ని కూడా ఇవి అనుసరిస్తున్నాయి. సుప్రీమ్ హార్వెస్ట్ చనా దాల్ కేటగిరీ సగటు ధర కంటే దాదాపు 30 శాతం తక్కువగా ఉంటుంది. డైలీగుడ్ మస్టర్డ్ ఆయిల్ థర్డ్ పార్టీ బ్రాండ్ కన్నా 37 శాతం తక్కువ ధరకు, హోల్ఫార్మ్ రాగి పిండి 29 శాతం తక్కువ ధరకు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. స్నాక్స్, డ్రింక్స్లోనూ ఎంట్రీ క్విక్ కామర్స్ కంపెనీల సొంత బ్రాండ్ల వ్యూహం అధిక విలువ కలిగిన ప్యాకేజ్డ్ ఫుడ్స్కు కూడా చేరింది. ఇన్స్టామార్ట్ ప్రీమియం బ్రాండ్ నాయిస్కు బెవరేజెస్లో 7 శాతం వాటా, స్నాక్స్లో 5.5 శాతం వాటా సాధించింది.46కు పైగా కేటగిరీల్లో ఈ బ్రాండ్ విస్తరించింది. ప్రస్తుతం ఇన్స్టామార్ట్లో వచ్చే ప్రతి 10 కస్టమర్ బాస్కెట్లలో ఒకదానిలో నాయిస్ ఉత్పత్తులు ఉంటున్నాయని స్విగ్గీ తెలిపింది. ఫ్రెష్ ఫుడ్ మరింత పెద్ద లాభం ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయల విభాగం సొంత బ్రాండ్లకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది. ఈ విభాగంలో ప్రైవేట్ లేబుల్స్ ద్వారా 45 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ విక్రేతలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. ఇన్స్టామార్ట్ బెంగళూరులోని ఐదు డార్క్ స్టోర్లలో నెక్టార్ ఫ్రూట్స్, వెజిటబుల్ బ్రాండ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్తో కస్టమర్ల ఖర్చు 10 శాతం పెరిగింది. రీపర్చేజ్ రేటు 12 పాయింట్లు, ప్లాట్ఫామ్ రిటెన్షన్ 7 శాతం పాయింట్లు మెరుగయ్యాయి.జెప్టో కూడా ముంబై, బెంగళూరులోని ప్రీమియం ప్రాంతాల్లో హార్వెస్ట్ స్టోర్ను కస్టమర్లకు ఓపెన్ చేసింది. స్టాక్ ఉంటేనే కస్టమర్ ఉంటాడు ప్రైవేట్ లేబుల్స్ వల్ల అధిక లాభాలే కాదు. ఇన్వెంటరీ, ధర, సరుకుల లభ్యత, ప్లాట్ఫామ్లకు నియంత్రణ లభిస్తుంది. క్విక్ కామర్స్లో ఒక ఉత్పత్తి అందుబాటులో లేకపోతే కస్టమర్ వెంటనే మరో యాప్ కు మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డి మాండ్ను ముందుగానే అంచనా వేసి సొంత బ్రాండ్ల ద్వారా సరుకులను తగినంతగా అందుబాటులో ఉంచడం సంస్థలకు కీలకంగా మారుతోంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
పెంపుడు జంతువులకూ బీమా పాలసీ
పాలసీదారుల కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు జంతువులకు కూడా వర్తించేలా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. దీని పేరు 'మై ఫ్యామిలీ కంప్లీట్'. దీని కింద రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు కవరేజీ తీసుకోవచ్చు.మూడు నెలలు పైబడిన పెంపుడు పిల్లులు, శునకాలను ఇందులో చేర్చవచ్చు. పాలసీదారులకు (మనుషులకు) ఇన్-పేషంట్ హాస్పిటలైజేషన్, రూమ్ రెంట్ మొదలైన వాటికి కవరేజి ఉంటుంది.పెంపుడు జంతువులు తప్పిపోయినప్పుడు ప్రకటనలు, పారితోషికాలు ఇవ్వడానికి, పెట్ పేరెంట్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు ఎమర్జెన్సీ పెట్ అకామడేషన్కి, బీమా ఉన్న పెంపుడు జంతువు ఏదైనా ప్రాపర్టీని ధ్వంసం చేసినా, మరణం మొదలైన వాటికి కారణంగా నిల్చినా థర్డ్ పార్టీ లయబిలిటీ కవరేజీ ఉంటుంది. -
ఈ వారం 11 ఐపీవోలు
ప్రైమరీ మార్కెట్ల జోరు కొనసాగుతోంది. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా 23 కంపెనీలు లిస్టింగ్కాగా.. వచ్చే వారం మరో 11 ఐపీవోలు ప్రారంభకానున్నాయి. 7–15 మధ్య చేపట్టనున్న ఇష్యూల ద్వారా ఇవి ఉమ్మడిగా రూ. 7,055 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. మొత్తం రూ. 7,055 కోట్లలో రూ. 2,722 కోట్లు(39 శాతం) తాజా ఈక్విటీ జారీకాగా.. మరో రూ. 4,333 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మంగళ, బుధ వారాల్లో అధిక ఇష్యూలు మార్కెట్లను పలకరించనున్నాయి. జాబితాలో రియల్టీ డెవలపర్స్, ఇంజినీరింగ్, తయారీ, పేమెంట్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆన్లైన్ రిటైల్ ప్లాట్ఫామ్ తదితర కంపెనీలున్నాయి. వీటితో కలిపి ఈ ఏడాది 75 కంపెనీలు నిధుల సమీకరణ బాటలో సాగినట్లు నమోదుకానుంది. వివరాలు చూద్దాం.. ప్రణవ్ కన్స్ట్రక్షన్స్తో షురూ నేడు(7న) ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీవో ప్రారంభంకానుంది. 9న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 351 కోట్లు సమీకరించనుంది. రేపు(8న) కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, గ్లాస్వాల్ సిస్టమ్స్(ఇండియా) ఇష్యూలు షురూకానుండగా.. 9న స్టీమ్హౌస్ ఇండియా, 10న వీగాలాండ్ డెవలపర్స్ మార్కెట్లను తాకనున్నాయి. ధరల శ్రేణి తీరిలా ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 118–124కాగా.. రూ. 316 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 35 కోట్ల విలువైన మరో 28.57 లక్షల షేర్లను ఆఫర్ చేయనుంది. కనోహర్ ఎలక్ట్రికల్స్ రూ. 601–632 ధరల శ్రేణిలో రూ. 1,056 కోట్ల సమీకరణపై కన్నేసింది. ప్రసోల్ కెమికల్స్ రూ. 643–676 ధరల శ్రేణి నిర్ణయించడం ద్వారా రూ. 500 కోట్లు అందుకోనుంది. ఈక్విటీ జారీతో రూ. 80 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ. 420 కోట్లు సమీకరించనుంది. గ్లాస్వాల్ సిస్టమ్స్ రూ. 172–182 ధరల శ్రేణితో రూ. 428 కోట్ల సమీకరణకు రెడీ అయ్యింది. వీగాలాండ్ సైతం ఆర్సిల్ రూ. 132–139 ధరల శ్రేణిలో రూ. 733 కోట్ల సమీకరణకు సిద్ధపడింది. పూర్తిగా ప్రస్తుత వాటాదారు సంస్థలు షేర్లను విక్రయించనున్నాయి. ఇక రూ. 427 కోట్ల సమీకరణకుగాను ఎల్సీసీ ప్రాజెక్ట్స్ రూ. 139–146 ధరల శ్రేణి నిర్ణయించింది. స్టీమ్హౌస్ ఇండియా ఇష్యూలో భాగంగా రూ. 353 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా రూ. 61 కోట్ల విలువైన షేర్లు ఆఫర్ చేయనుంది. వెరసి రూ. 414 కోట్లు అందుకోవాలని చూస్తోంది. ఈ నెల 10న ప్రారంభమై 15న ముగియనున్న ఐపీవో ద్వారా వీగాలాండ్ డెవలపర్స్ రూ. 210 కోట్లు సమీకరించనుంది. → ఈక్విటీ జారీ నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించడంతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం కేటాయించనున్నాయి. → రేస్ ఆఫ్ బిలీప్, దీపా జ్యువెలర్స్ ఐపీవోలతో ఈ నెల(సెపె్టంబర్)లో ఐపీవోల సందడి జోరందుకున్న విషయం విదితమే. పర్పుల్ ల్యాబ్స్తో ప్రారంభించి నేటి(7) నుంచి రెండు వారాలపాటు వరుసగా ఈ కంపెనీలన్నీ స్టాక్ ఎక్సే్ఛంజీలో లిస్ట్కానుండటం గమనార్హం!రెంటోమోజో @ రూ. 384–404ఐపీవో ద్వారా రూ. 1,256 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టిన రెంటోమోటో రూ. 384–404 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇందుకు రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీ జారీతోపాటు రూ. 1,106 కోట్ల విలువైన 2.73 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. కరంటారా ఇంజినీరింగ్ ఐపీవోకు ధరల శ్రేణి రూ. 241–254కాగా.. రూ. 675 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా రూ. 200 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. మణిపాల్ పేమెంట్ అండ్ ఐడెంటిటీ సొల్యూషన్స్ ఇష్యూకి రూ. 322–339 ధరల శ్రేణి ప్రకటించింది. రూ. 805 కోట్లు సమకూర్చుకోనుంది. ఇందుకు రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీ జారీసహా రూ. 485 కోట్ల విలువైన 1.43 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. -
హైడ్రోజన్ రైలు.. కొత్త వేగానికి కసరత్తు
భారత రైల్వేలో మరో కీలక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన హైడ్రోజన్ ఆధారిత రైలును త్వరలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ రైలు గరిష్ఠంగా 75 కి.మీ వేగంతో నడుస్తుండగా.. ఇప్పటికే 120 కి.మీ వేగంతో హైస్పీడ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సతీష్ కుమార్ వెల్లడించారు.ఇండోర్లో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. 120 కి.మీ వేగంతో ట్రయల్స్ పూర్తయిన నేపథ్యంలో, ఇక 110 కి.మీ వేగాన్ని ఆపరేషనల్ స్పీడ్గా తీసుకురావడంపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. కొత్త హైడ్రోజన్ రైలును ఏయే మార్గాల్లో నడపాలనే అంశంపై సంబంధిత వర్గాలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతిక అంశాలతో పాటు హైడ్రోజన్ ఇంధన సరఫరా మౌలిక వసతులను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.భారత్ తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గత జూలై 17న హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ప్రారంభించారు. ఈ రైలు 89 కిలోమీటర్ల జింద్–సోనిపట్ మార్గంలో నడుస్తోంది. సాధారణ ఎలక్ట్రిక్ రైళ్లు ఓవర్హెడ్ విద్యుత్ లైన్ల నుంచి శక్తిని పొందుతాయి. హైడ్రోజన్ రైలులో మాత్రం హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య ద్వారా రైలులోనే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.వందే భారత్ స్లీపర్పైనా కీలక అప్డేట్వందే భారత్ స్లీపర్ రైళ్ల విషయంలోనూ రైల్వే కీలక విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ హౌరా–కామాఖ్య (గువాహటి) మార్గంలో నడుస్తోంది. మరో నాలుగు రైళ్లు తయారై ఉండగా, వాటిని త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు సతీష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది మరో 11 వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.అంతేకాకుండా పీపీపీ విధానంలో 200 వందే భారత్ స్లీపర్ రైళ్ల తయారీ జరుగుతోందని, ఒక్కో రైలును పూర్తి చేయడానికి సుమారు ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఇక 2028లో ఉజ్జయినిలో జరిగే సింహస్థ మహోత్సవం 100 నుంచి 125 ప్రత్యేక రైళ్లను నడిపే ప్రణాళిక ఉందని తెలిపారు. అదే సమయంలో రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచేందుకు సీసీటీవీ వ్యవస్థలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనుసంధానించే పనులు జరుగుతున్నాయి. రైళ్లలో ఎలుకల సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రస్తుత మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టినట్లు రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారు. -
జియోకు పదేళ్లు.. తెలంగాణలో ఘనంగా దశాబ్ది వేడుకలు
హైదరాబాద్: దేశ డిజిటల్ కనెక్టివిటీ రంగంలో కీలక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో తన ప్రయాణంలో పదేళ్లు పూర్తి చేసుకుంది. 2016లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన జియో.. దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా కోట్లాది మందికి డిజిటల్ సేవలను చేరువ చేసింది. ఈ సందర్భంగా సంస్థ తెలంగాణ విభాగంలో ఉద్యోగులు, నాయకులు, భాగస్వాములతో కలిసి దశాబ్ది వేడుకలను నిర్వహించారు.తెలంగాణలో ప్రారంభ దశ నుంచి క్రమంగా విస్తరించిన జియో.. ప్రస్తుతం మొబిలిటీ, హోమ్, ఎంటర్ప్రైజ్ విభాగాల్లో తన కార్యకలాపాలను బలోపేతం చేసుకుంది. గత పదేళ్లలో సాధించిన విజయాలు, సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు అందించిన సహకారం, ఈ ప్రయాణంలో ఏర్పడిన నైపుణ్యాలు, అనుభవాలను వేడుకల్లో గుర్తుచేసుకున్నారు.ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే.సీ. రెడ్డి మాట్లాడుతూ.. తొలి దశాబ్దంలో సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రానున్న పదేళ్లు మరింత ఉత్సాహభరితంగా ఉండనున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత జీవితం, వ్యాపారంలోని ప్రతి అంశాన్ని మరింతగా మార్చబోతోందని, 5జీ, కనెక్టెడ్ హోమ్స్, డిజిటల్ ఎంటర్ప్రైజెస్, భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే కొత్త సేవల్లో భారీ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: డిజిటల్ విప్లవం జియో పదేళ్ల ప్రస్థానందశాబ్ది వేడుకల్లో ఉద్యోగుల గుర్తింపు కార్యక్రమాలు, స్మారక అవార్డుల ప్రదానం, కేక్ కటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థ అభివృద్ధిలో ఉద్యోగులు, వారి కుటుంబాలు, భాగస్వాములు అందించిన సహకారానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
భారీగా బ్యాంకు ఉద్యోగాలు.. SBI గుడ్ న్యూస్
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగార్థులకు తీపి కబురు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27లో సుమారు 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని బ్యాంకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలోనే ప్రధానంగా నియామకాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.నియామకాల సంఖ్యలో కొంత మార్పు ఉండొచ్చని శెట్టి పేర్కొన్నారు. ఉద్యోగుల పదవీ విరమణలు, బ్యాంకు అవసరాలను బట్టి తుది సంఖ్య నిర్ణయిస్తామని, అయితే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దాదాపు 12 వేల నియామకాలు ఉండొచ్చని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి నియామకాలు తగ్గడానికి ప్రధాన కారణం ఐటీ విభాగంలో గతేడాది మాదిరిగా పెద్ద సంఖ్యలో నిపుణులు అవసరం లేకపోవడమేనని ఆయన తెలిపారు.గతేడాది 25,633 మందికి ఉద్యోగాలు2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మొత్తం 25,633 మందిని నియమించుకుంది. ఇందులో 4,640 మంది అధికారులు, 19,340 మంది అసోసియేట్లు, 1,653 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. ముఖ్యంగా సుమారు 1,500 మంది స్పెషలిస్ట్ ఐటీ అధికారులను గతేడాది నియమించినట్లు శెట్టి చెప్పారు. మార్చి 2026 నాటికి ఎస్బీఐ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.45 లక్షలకు పైగా ఉంది.మరో 250 శాఖలు రావొచ్చుఉద్యోగ నియామకాలతో పాటు బ్యాంకు శాఖల నెట్వర్క్ను కూడా విస్తరించేందుకు ఎస్బీఐ సిద్ధమవుతోంది. కొత్త కాలనీలు ఏర్పడుతున్న ప్రాంతాలు, వాణిజ్య కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఇంకా బ్యాంకింగ్ సేవలకు అవకాశం ఉందని శెట్టి తెలిపారు. కొన్ని శాఖలను హేతుబద్ధీకరించినప్పటికీ, నికరంగా ఏటా 200 నుంచి 250 శాఖలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.ఇదీ చదవండి: ‘బంగారు’ లాభం! ఒక్క లక్ష.. 3.28 లక్షలైంది -
వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇదో కొత్త సమస్య!
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే చాలామంది ఉద్యోగులకు ఇష్టం. ఆఫీసుకు వెళ్లాల్సిన పని ఉండదు. ట్రాఫిక్ టెన్షన్ ఉండదు. ఇంట్లోనే ప్రశాంతంగా పని చేసుకోవచ్చని అనుకుంటాం. కానీ.. ప్రతి ఒక్కరికీ ఈ విధానం నచ్చకపోవచ్చు. ఎందుకంటే.. మోహిని చవాన్ అనే మహిళకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మానసికంగా అలసిపోయేలా చేసిందని పేర్కొంది.శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయడం చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆ అనుభవం తనను మానసికంగా అలసిపోయేలా చేసి, ఒకే రొటీన్లో ఇరుక్కుపోయేలా చేసిందని చవాన్ తన అనుభవాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.ఆమె పనిచేసే సంస్థ సాధారణంగా హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుంది, కానీ.. ఉద్యోగులకు సంవత్సరంలో రెండు వారాల పాటు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఉంటుంది.పని మాత్రం మారలేదు!ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా పని మాత్రం మారలేదు. వర్క్లోడ్ కూడా అలాగే ఉంది. ఉదయం పని మొదలుపెట్టి.. సాయంత్రం వరకు అదే పని చేయాల్సి వచ్చింది. రెండు వారాలు ఇలా గడిచిన తర్వాత తనకు చాలా మానసికంగా అలసిపోయినట్లు అనిపించిందని మోహిని చెప్పింది. అసలు ఇంటి నుంచి బయటకు వచ్చినట్టే అనిపించలేదని తెలిపింది.పర్మినెంట్గా కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తారో నాకు తెలియదు. అలా చేస్తున్న వారికి చవాన్ సెల్యూట్ చేశారు. ఎందుకంటే.. రోజంతా ఇంట్లోనే ఉండటం, అదే పని చేయడం వల్ల ఒక రకమైన బోర్ ఫీల్ వచ్చిందని చెప్పారు. వీకెండ్ వస్తే కాస్త బయటకు వెళ్లి ఫ్రెండ్స్ను కలవడం లేదా ఎక్కడికైనా వెళ్లడం సాధారణమే. కానీ మోహిని ఈ రెండు వారాల్లో వీకెండ్లో కూడా పెద్దగా బయటకు వెళ్లలేకపోయింది.పూర్తిగా అలసిపోయా..ఒక్కరోజు మాత్రమే బయటకు వెళ్లింది. మిగతా సమయంలో కూడా ఇంట్లోనే ఉంది. పని, తినడం, తాగడం.. మళ్లీ అదే రొటీన్ కొనసాగింది. దీంతో రెండు వారాలు పూర్తయ్యేసరికి తన మెదడు పూర్తిగా అలసిపోయినట్లు అనిపించిందని ఆమె చెప్పింది.తిరిగి ఆఫీసుకు వెళ్లే అవకాశం రావడంతో మోహిని హ్యాపీగా ఫీల్ అయింది. తనకు హైబ్రిడ్ వర్క్ మోడల్ చాలా బెటర్ అని చెప్పింది. వారంలో కొన్ని రోజులు ఆఫీసుకు వెళ్లడం వల్ల రొటీన్ నుంచి బయటకు రావచ్చు. సహోద్యోగులను కలవచ్చు. వారితో మాట్లాడవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కలిసి భోజనం చేయవచ్చు. తమ అనుభవాలను పంచుకోవచ్చు. ఇవన్నీ వర్క్ లైఫ్ను కాస్త ఆసక్తికరంగా మారుస్తాయని ఆమె అభిప్రాయపడింది.ఇదీ చదవండి: ఖాతాదారులకు అలర్ట్: 3 రోజులు బ్యాంకులు బంద్!హైబ్రిడ్ మోడల్లో మరో ప్రయోజనం ఏంటంటే.. రోజులో కొంత సమయం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడం, తిరిగి రావడం వల్ల రోజువారీ రొటీన్లో మార్పు వస్తుంది. అదే పూర్తిగా ఇంటి నుంచే పనిచేస్తే ఇల్లు, ఆఫీస్ రెండూ ఒకే చోట అయిపోతాయి. దీంతో పని, వ్యక్తిగత జీవితం మధ్య తేడా తగ్గిపోవచ్చని చెప్పింది. View this post on Instagram A post shared by Mohini Chavan (@pc_corporategirl) -
ఖాతాదారులకు అలర్ట్: 3 రోజులు బ్యాంకులు బంద్!
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. తప్పకుండా బ్యాంకులకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. అయితే ప్రతి నెల, ప్రతి వారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి బ్యాంకులకు వెళ్లి ఏదైనా పనులు చేయాలనుకునే వారు ఈ హాలిడేస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ కథనంలో వచ్చే వారం (సెప్టెంబర్ 7 నుంచి 13వరకు)లో ఎన్ని సెలవులు ఉన్నాయో చూసేద్దాం.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. దేశంలోని బ్యాంకులకు ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది. అలాగే ప్రతి నెల రెండో, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. కాబట్టి సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు మూడు రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నట్లు తెలుస్తోంది.సెప్టెంబర్ 11, శుక్రవారం: జైపూర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి. ఢిల్లీలో కూడా బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతో ఢిల్లీలోని కొన్ని బ్యాంకులపై కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.సెప్టెంబర్ 12, శనివారం: రెండో శనివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అదే రోజున కొన్ని ప్రాంతాల్లో స్థానిక పండుగ కారణంగా కూడా బ్యాంకులు మూసి ఉంటాయి.సెప్టెంబర్ 13, ఆదివారం: సాధారణ వారాంతపు సెలవు.బ్యాంకు బ్రాంచ్లు మూసి ఉన్నప్పటికీ కస్టమర్లకు అన్ని బ్యాంకింగ్ సేవలు పూర్తిగా ఆగిపోవు. యూపీఐ, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే అందుబాటులో ఉంటాయి. అందువల్ల డబ్బు బదిలీ చేయడం, ఆన్లైన్ చెల్లింపులు చేయడం, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వంటి పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చు. -
సుభాష్ చంద్ర కేసులో ట్విస్ట్.. నెట్వర్త్పై CBI దర్యాప్తు!
మాజీ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతో పాటు.. పలువురిపై రూ.980 కోట్ల రుణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. ఈ కేసు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LICHFL) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. ఇందులో నేరపూరిత కుట్ర, మోసం, నమ్మకద్రోహం, అక్రమంగా లాభం పొందడం వంటి ఆరోపణలను సీబీఐ పరిశీలిస్తోంది.నికర ఆస్తుల విలువఈ కేసులో అత్యంత కీలకమైన అంశం సుభాష్ చంద్ర నికర ఆస్తుల విలువ. ఈ వ్యవహారంలో రెండు వేర్వేరు రుణాలు ప్రధానంగా ఉన్నాయి. మొదటిది వసంత్ సాగర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని కో-బారోయర్ పాన్ ఇండియా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చిన సుమారు రూ.500 కోట్ల రుణం. వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ రుణాన్ని 'టేకోవర్ అండ్ టాప్-అప్ ఫెసిలిటీ'గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ మంజూరు చేసింది. ఈ రుణానికి సుభాష్ చంద్ర గ్యారంటర్గా నిలిచారు.రుణం మంజూరు సమయంలో సమర్పించిన నికర ఆస్తుల సర్టిఫికెట్లో సుభాష్ చంద్ర ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సీబీఐ ఫిర్యాదులో ఉంది. 2018 మార్చి 28న సమర్పించిన ఆ సర్టిఫికెట్ ప్రకారం, 2017 మార్చి 31 నాటికి ఆయన నికర విలువ 6,197.62 మిలియన్ డాలర్లు, అంటే అప్పటి లెక్కల ప్రకారం సుమారు రూ.59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు చూపించారు.ఇక రెండో రుణం డిజిటల్ సబ్స్క్రైబర్ మేనేజ్మెంట్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించినది. దాని కో-బారోయర్ అయిన స్పిరిట్ ఇన్ఫ్రా పవర్ అండ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సుమారు రూ.480 కోట్ల రుణం మంజూరైంది. ఈ రుణానికి కూడా సుభాష్ చంద్ర గ్యారంటీ ఇచ్చారు. ఈ సందర్భంలో సమర్పించిన మరో నికర విలువ సర్టిఫికెట్లో ఆయన నికర ఆస్తుల విలువ రూ.40,000 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది.అంటే.. రెండు రుణాలను కలిపితే సుమారు రూ.980 కోట్లు. రుణాలు తీసుకునే సమయంలో సుభాష్ చంద్ర ఆర్థికంగా వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కలిగిన వ్యక్తిగా పత్రాల్లో చూపించారు.ఈ రెండు రుణాలు తరువాత డిఫాల్ట్ అయ్యాయి. అంటే.. రుణాలను తిరిగి చెల్లించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో విషయం మరింత తీవ్రంగా మారి, సుభాష్ చంద్రపై ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (IBC) కింద వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.పత్రాల్లో వేలకోట్లురుణాలు తీసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లో సుభాష్ చంద్ర నికర విలువ వేల కోట్ల రూపాయలుగా చూపించబడింది. అయితే తర్వాత జరిగిన ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఆయన ఆ స్థాయి ఆస్తులు తనకు లేవని పేర్కొన్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో ఉంది. ముఖ్యంగా, 2024 సంవత్సరానికి తన నికర విలువ సుమారు రూ.31.79 కోట్లు మాత్రమేనని ఆయన పేర్కొన్నట్లు ఫిర్యాదులో వెల్లడైంది. అంతేకాకుండా.. 2017-18 కాలంలో కూడా తన నికర విలువ రూ.40,000 కోట్లకు మించలేదని ఆయన చెప్పినట్లు సీబీఐ పేర్కొంది.ఇక్కడే సీబీఐ దర్యాప్తు ప్రధానంగా కేంద్రీకృతమవుతోంది. ఒకవైపు రుణాలు తీసుకునే సమయంలో సమర్పించిన పత్రాల్లో సుభాష్ చంద్ర నికర విలువ రూ.40,000 కోట్ల నుంచి రూ.59,000 కోట్ల స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. ఇన్సాల్వెన్సీ ప్రక్రియలో ఆయన ఆస్తుల విలువ చాలా తక్కువగా ఉందని పేర్కొన్నట్లు సీబీఐ చెబుతోంది. కాబట్టి.. రుణం పొందేందుకు నికర ఆస్తుల విలువను కావాలనే ఎక్కువగా చూపించారా? అనే ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది.ఇదీ చదవండి: SBI స్కీమ్.. డబ్బు దాచుకోవడానికి మంచి మార్గం! -
దశాబ్దం తర్వాత భారత్లోకి కారెఫోర్.. భారీ విస్తరణకు ప్లాన్!
రిటైల్ రంగ ఫ్రెంచ్ దిగ్గజం కారెఫోర్ దశాబ్దం తదుపరి భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది. దుబాయ్కు చెందిన అపారెల్ గ్రూప్తో భాగస్వామ్యం ద్వారా స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఇక్కడ 50,000 చదరపు అడుగులలో కారెఫోర్ స్టోర్ను అపారెల్ గ్రూప్ ఏర్పాటు చేసింది. రానున్న నాలుగు వారాల్లోగా మరో స్టార్ను జత చేయనున్నట్లు వెల్లడించింది.ఈ బాటలో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మరిన్ని స్టోర్లకు తెరతీయనున్నట్లు తెలిపింది. వచ్చే వేసవికల్లా దేశ పశ్చిమ ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు పేర్కొంది. వృద్ధికి దన్నుగా ఇతర సంస్థల కొనుగోళ్లను చేపట్టనున్నట్లు అపారెల్ గ్రూప్ తెలియజేసింది. తొలి దశ విస్తరణలో భాగంగా రానున్న ఐదేళ్లలో 50 ఫుడ్ అండ్ గ్రోసరీ స్టోర్లను తెరవనున్నట్లు తెలియజేసింది.2010లో తొలుత.. కారెఫోర్ ఇంతక్రితం 2010లో క్యాష్ అండ్ క్యారీ(హోల్సేల్) బిజినెస్ ద్వారా దేశీయంగా కార్యకలాపాలకు తెరతీసింది. ఆపై ఆశించిన ఫలితాలు అందుకోలేకపోవడానికితోడు విస్తరణకు వీలైన స్థానిక భాగస్వామి లభించకపోవడంతో 2014లో ఐదు స్టోర్లను మూసివేసింది. కార్యకలాపాలకు ఫుల్స్టాప్ పెట్టేసింది.కాగా.. ప్రస్తుతం అప్రమత్తతతో బిజినెస్ విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్నట్లు అపారెల్ గ్రూప్ యజమాని, చైర్మన్ నీలేష్ వేద్ పేర్కొన్నారు. సొంత స్టోర్లను విస్తరిస్తూనే వృద్ధిని పెంచుకునేందుకు ఇతర సంస్థలను సొంతం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించారు. తొలి దశలో హైపర్మార్కెట్ విధానంపై దృష్టిపెట్టి ముందుకుసాగనున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా 50,000 ఎస్కేయూలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
మనశ్శాంతి కోసం జాబ్ మానేసి.. నెలకు రూ.కోటి టర్నోవర్!
సాధారణంగా బెంగళూరు నగరంలో.. యాక్సెంచర్ వంటి కంపెనీలో ఉద్యోగం వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ సుప్రీత్ కశ్యప్ మాత్రం ఇందుకు భిన్నంగా.. ఉద్యోగం వదిలి మనశ్శాంతి కోసం సొంత ఊరికి వెళ్ళిపోయాడు. నేడు నెలకు కోట్ల రూపాయల ఆదాయం సంపాదించే స్థాయికి చేరాడు. ఇంతకీ కశ్యప్ ఏం చేసాడు?, ఎలా సంపాదిస్తున్నాడు?, అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.యాక్సెంచర్ ఉద్యోగం వదిలి..సుప్రీత్ కశ్యప్ మైసూరులో పుట్టి పెరిగాడు. తాను మైసూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ చదివాడు. చదువు పూర్తయ్యాక, 2017లో యాక్సెంచర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం అతనికి మంచి కెరీర్ ఇచ్చినప్పటికీ.. బెంగళూరులో జీవనశైలి తనకు సరిపోవడం లేదని భావించాడు. నగరంలోని ట్రాఫిక్, రద్దీ, నిరంతర ఒత్తిడి కారణంగా ప్రశాంతత లోపించిందని అనిపించింది.వెల్బీ పేరుతో వ్యాపారం..అందుకే.. 2018లో యాక్సెంచర్లో ఉద్యోగాన్ని వదిలి మైసూరుకు వెళ్ళిపోయాడు. ప్రారంభంలో ఫ్రీలాన్స్ కన్సల్టెంట్గా పనిచేశాడు. అయితే.. తనకు కేవలం ఉద్యోగం చేయడం కాకుండా, మైసూరు నుంచే ఒక సంస్థను నిర్మించి, ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన వచ్చింది.ఈ ఆలోచనతో కశ్యప్ వెల్బీ పేరుతో.. దుస్తుల వ్యాపారాన్ని 2021లో ప్రారంభించాడు. వెల్బీ అనేది ప్రధానంగా సౌకర్యవంతమైన, స్పోర్ట్స్, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే దుస్తులను తయారు చేస్తుంది. సస్టైనబుల్, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్కు కూడా సంస్థ ప్రాధాన్యత ఇస్తుంది.రూ.10 లక్షలు పెట్టుబడిసుప్రీత్ తన వ్యాపారం ద్వారా చాలామందికి ఉద్యోగాలు కూడా కల్పించాలని సంకల్పించాడు. దీంతో.. టైర్2, టైర్3 నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉద్యోగావకాశాలను సృష్టించాలని భావించాడు. వెల్బీలో ఇప్పుడు 15 మందికి పైగా ఫుల్-టైమ్ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 40 మంది చేతివృత్తి కళాకారులతో కలిసి పనిచేస్తున్నారు.వెల్బీని ప్రారంభించడానికి సుప్రీత్ మొదట కుటుంబ సభ్యుల సహాయంతో.. సుమారు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందడంతో మొత్తం పెట్టుబడి రూ.50 లక్షలకు చేరింది. తరువాత సంస్థకు ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.3 కోట్ల పెట్టుబడి లభించింది.కోట్లలో టర్నోవర్కంపెనీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. మొదటి సంవత్సరంలో సుమారు రూ.11 లక్షల ఆదాయం వచ్చింది. తరువాతి సంవత్సరం అది రూ.70 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత రూ.2.4 కోట్లు, తదుపరి సంవత్సరం రూ.5.6 కోట్లు ఆదాయం సాధించింది. ఇప్పుడు సంస్థ ఏడాదికి సుమారు రూ.15-16 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణంలో వెల్బీ నెలకు సుమారు రూ.1 కోటి ఆదాయం సాధించే స్థాయికి చేరుకుంది. కేవలం రూ.10 లక్షలతో ప్రారంభమైన వ్యాపారం, ఇంత పెద్ద స్థాయికి ఎదగడం సుప్రీత్ వ్యాపార ప్రయాణంలో సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి.సుప్రీత్ తనను తాను ఒక యాదృచ్ఛిక పారిశ్రామికవేత్తగా భావిస్తాడు. ఎందుకంటే అతడు అనుకోకుండా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అంతే కాకుండా.. తన కుటుంబానికి కూడా వ్యాపార నేపథ్యం లేదు. అందువల్ల వ్యాపారం ప్రారంభించినప్పుడు.. తనకు అనుభవం కూడా పెద్దగా లేదు. కానీ కాలక్రమంలో అనుభవంతో పాటు అనేక విషయాలు నేర్చుకున్నాడు.మైసూరు నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకిప్రారంభంలో.. మంచి ఫ్యాషన్ ఫొటోషూట్లు చేస్తే అమ్మకాలు పెరుగుతాయని ఆయన అనుకున్నాడు. కానీ.. తర్వాత అసలు విజయం మంచి ఫొటోలలో కాకుండా, మంచి ఉత్పత్తిని తయారు చేయడం, వినియోగదారులకు అది నిజంగా అవసరమా అని తెలుసుకోవడంలో ఉందని గ్రహించాడు.అలాగే ఉద్యోగులను నియమించడంలో కూడా ఆయనకు ఒక ముఖ్యమైన పాఠం తెలిసింది. మొదట ప్రతి పనికి ప్రత్యేక వ్యక్తులను నియమించడం వల్ల సంస్థలో అవసరానికి మించిన పెద్ద టీమ్ ఏర్పడింది. తరువాత ఒకటి కంటే ఎక్కువ పనులు చేయగలిగే మల్టీ టాస్క్ ఉద్యోగులను నియమించడం ద్వారా చిన్న టీమ్తోనే సంస్థను సమర్థవంతంగా నడపవచ్చని తెలుసుకున్నాడు.మైసూరులో ప్రారంభమైన వెల్బీ.. ఇప్పుడు భారతదేశం దాటి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో అమెజాన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.ఇదీ చదవండి: డబ్బు త్వరగా చేతికి రావాలంటే?..కియోసాకి పెట్టుబడి విధానం! -
ప్రపంచ కళలకు భారతీయ వేదిక.. ఎన్మ్యాక్
భారతీయ కళలు, సంస్కృతికి అంతర్జాతీయ వేదికగా.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కళా ప్రదర్శనలు, సంగీత, నాటక ప్రదర్శనలను భారత ప్రేక్షకులకు చేరువ చేసే కేంద్రంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC) తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ముంబైలో 2023 మార్చిలో ప్రారంభమైన ఈ సాంస్కృతిక కేంద్రం మూడేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఘనమైన కళా వేడుకలకు వేదికను పంచింది.మూడేళ్లలో ఎన్మ్యాక్లో 3,500కు పైగా ప్రదర్శనలు జరిగాయి. దాదాపు 25 లక్షల మంది ప్రేక్షకులు సందర్శించగా.. సంగీతం, నాటకం, నృత్యం, దృశ్యకళ తదితర రంగాలకు చెందిన 10,500 మందికి పైగా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. 15కుపైగా భాషల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లోని గ్రాండ్ థియేటర్ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలకు వేదికగా నిలిచింది. ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్, వెస్ట్ సైడ్ స్టోరీ, మమ్మా మియా, ది ఫ్యాంటమ్ ఆఫ్ ఒపేరా, విక్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ ప్రొడక్షన్స్ ఇక్కడ ప్రేక్షకులను అలరించాయి. అదే వేదికపై మొఘల్-ఎ-ఆజమ్: ది మ్యూజికల్, రాజాధిరాజ్: లవ్. లైఫ్. లీలాతో పాటు ఎన్మ్యాక్ ఒరిజినల్ ప్రొడక్షన్ ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్ వంటి భారతీయ ప్రదర్శనలు సైతం ఘనంగా సాగాయి.స్టూడియో థియేటర్, ది క్యూబ్ వేదికలు చిన్న స్థాయి, ప్రయోగాత్మక ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం కల్పించాయి. థియేటర్, సంగీతం, కామెడీ, నృత్యం తదితర విభాగాల్లో హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ సహా పలు భాషల్లో కార్యక్రమాలు నిర్వహించారు.దృశ్యకళల పరంగా ఎన్మ్యాక్లోని ఆర్ట్ హౌస్ అంతర్జాతీయ కళా ప్రపంచాన్ని ముంబైకి తీసుకొచ్చింది. లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంతో కలిసి వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్, దియా ఆర్ట్ ఫౌండేషన్ సహకారంతో లైట్ ఇన్టు స్పేస్, భక్తి, బల్గరీ సెర్పెంటి ఇన్ఫినిటో వంటి ప్రదర్శనలు నిర్వహించింది. ప్రస్తుతం సెకెండ్ నేచర్ పేరుతో కొనసాగుతున్న ప్రదర్శనలో టీమ్ల్యాబ్, ఎ.ఎ.మురకామి, ఈఎస్ డెవ్లిన్, ర్యాండమ్ ఇంటర్నేషనల్ తదితర కళాకారులు, స్టూడియోల తొమ్మిది భారీ స్థాయి ఇన్స్టాలేషన్లు ఉన్నాయి. ఈ ప్రదర్శన 2027 జనవరి వరకు కొనసాగనుంది.అంతర్జాతీయ కళా రంగంతో ఎన్మ్యాక్ అనుబంధం ముంబైకే పరిమితం కాలేదు. 61వ వెనిస్ బియన్నాలేలో ఇండియా పెవిలియన్ను ప్రదర్శించేందుకు భాగస్వామ్యం చేయడం ద్వారా భారత సమకాలీన కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశాన్ని కల్పించింది. ఈ కార్యక్రమంలో ఐదుగురు సమకాలీన భారతీయ కళాకారులను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లింది.ఎన్మ్యాక్ నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ భారతీయ, అంతర్జాతీయ కళా ప్రపంచాల మధ్య ఈ సాంస్కృతిక మార్పిడి మరింత విస్తరించనుంది. రానున్న రోజుల్లో ‘ది గ్రేట్ ఇండియన్ మ్యూజికల్: సివిలైజేషన్ టు నేషన్’ తిరిగి ప్రదర్శితం కానుండగా.. చికాగో రానుంది. అలాగే ఆస్కార్ నామినీ సంగీత దర్శకుడు మ్యాక్స్ రిక్టర్ తొలిసారి భారత్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. దీంతో భారత ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి కళా అనుభవాలను అందించడంతో పాటు, భారతీయ కళలు, కథనాలకు అంతర్జాతీయ వేదిక కల్పించే ఎన్మ్యాక్ పాత్ర మరింత బలోపేతం కానుంది. -
కొత్త బిజినెస్లోకి ఆదిత్య బిర్లా
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఆదిత్య బిర్లా(ఏబీ) గ్రూప్ తాజాగా కేబుళ్లు, వైర్ల బిజినెస్లోకి ప్రవేశించింది. అ్రల్టావోల్డ్ బ్రాండుతో కొత్త బిజినెస్ను ప్రారంభించినట్లు గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. ఇందుకు రూ. 1,800 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.వెరసి గ్రూప్ మూడో పెద్ద బిజినెస్లోకి అడుగు పెట్టినట్లు తెలియజేశారు. ఏబీ గ్రూప్ ఇటీవల పెయింట్లు, బీటూబీ ఈకామర్స్, రిటైల్ జ్యువెలరీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాగా.. కేబుళ్లు, వైర్ల విభాగంలో లీడర్గా ఎదిగే ప్రణాళికలతోనే బిజినెస్కు శ్రీకారం చుట్టినట్లు బిర్లా తెలియజేశారు. అల్యూమినియం, కాపర్ విభాగాలలో తమకున్న లోతైన నైపుణ్యం.. ప్రొడక్టుల నాణ్యత, పనితీరు, నిలకడకు కీలకంగా నిలవనున్నట్లు వివరించారు.దేశీయంగా సిమెంట్ తయారీలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న అ్రల్టాటెక్ మూడో వంతు గృహాలను నిర్మించినట్లు కొత్త బిజినెస్ ప్రారంభం సందర్భంగా ప్రస్తావించారు. కేబుళ్లు, వైర్ల తయారీ వ్యయాలలో కాపర్, అల్యూమినియం వాటా 80 శాతమని, దీనికితోడు సిమెంట్లోనూ కార్యకలాపాలు అ్రల్టావోల్ట్ పురోభివృద్ధికి సహకరించగలవని ఏబీ గ్రూప్ డైరెక్టర్ దిలీప్ గౌర్ వివరించారు. తద్వారా ప్రత్యర్థులకంటే ముందుగానే బిజినెస్ అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డారు. -
రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు
G R Balasubramaniam success journey తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి చిన్న రైతు , వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారి. ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో కడుపు నిండా తిండి తినడానికి ఎన్నో కష్టాలు. అందుకే 13 ఏళ్ల వయసులో బడి మానేసి బెంగళూరులో పనికి కుదిరాడు. కట్ చేస్తే..రూ. 1400 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిన 'జి.ఆర్.బి డెయిరీ ఫుడ్స్' (GRB Dairy Foods) ఫౌండర్ అయ్యాడు. బెంగళూరులోని ఒక చిన్న వెన్న వ్యాపారంగా మొదలైన రూ. 1400 కోట్లకు పైగా ఆదాయం కలిగిన ప్యాకేజ్డ్-ఫుడ్స్ కంపెనీగా ఎదిగింది. ఎంతో స్ఫూర్తిదాయక మైన జీఆర్ బాలసుబ్రహ్మణ్యమ్ విజయప్రస్థానం గురించి తెలుసుకుందాం ఈ కథనంలో.కుగ్రామం నుంచి ప్రారంభమైతమిళనాడులోని పళని సమీపంలోని చిన్న కరాట్టుపట్టి అనే కుగ్రామంలో పుట్టారు బాలసుబ్రహ్మణ్యం. ఆ ఊరి జనాభా కేవలం 300 మంది. సరైన విద్యుత్, రవాణా, నీటి సదుపాయాలు లేవు. తండ్రి పప్పుధాన్యాలు , ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా వ్యాపారం చేసేవారు. ఆయన సైకిల్పై ఊరూరా తిరుగుతూ, పంటను కొని సమీప పట్టణాలలో అమ్మేవారు. ఆ ఆదాయంతో ఎనిమిది మంది సభ్యులున్నకుటుంబాన్ని పోషించాల్సి ఉండేది. దీంతో 8వ తరగతి చదువుతున్న సమయంలోనే, కుటుంబానికి అండగా ఉండేందుకు బెంగళూరుకు బయలుదేరాడు. అక్కడ అక్క బావలకు చేస్తున్న వ్యాపారానికి తోడుగా నిలిచాడు. దాదాపు అతనికి 13 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటింటికీ తిరిగి వెన్న అమ్మడం మొదలుపెట్టాడు. అలా 14 ఏళ్ల పాటు వెన్న వ్యాపారంలో మెళకువలను నేర్చుకున్నాడు. గ్రామాల నుంచి వెన్న సేకరించడం, ఇళ్లకు సరఫరా చేయడం, ఖాతాలు నిర్వహించడం, నెయ్యి తయారీ ప్రక్రియలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. 1984లో 28 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదిలేశారు. సొంతంగా ఏదైనా చేయాలన్నా కుటుంబం ఆర్థికంగా సహాయపడే స్థితిలో లేదు, పైగా సరైన విద్యార్హతలు లేదా వృత్తిపరమైన అర్హతలు లేకపోవడంతో సాధారణ ఉద్యోగం దొరకడం కూడా కష్టంగా ఉండేది. తన వద్ద ఉన్న కేవలం రూ. 6,000 పొదుపు మొత్తంతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన. ఇందులో రూ. 3,000 అద్దెకే పోయాయి. ఎలాంటి బ్యాంక్ రుణాలు లేకుండానే పరిచయస్తులతో ఒక 'చిట్ ఫండ్' సంస్థను ప్రారంభించారు. ఆయన బావగారు గతంలో ఇలాంటి పథకాన్ని నిర్వహించేవారు, కాబట్టి బాలసుబ్రహ్మణ్యంకు ఆ విధానంపై అవగాహన ఉండేది.అలా రెండో నెలలోనే రూ. 50,000 చేతికి వచ్చింది. ఆ డబ్బుతో మొదటిసారి వెన్నను కొనుగోలు చేసి, నెలకు 75 కిలోల చొప్పున డోర్-టు-డోర్ డెలివరీ చేయడం ప్రారంభించారు. అయితే ఈ సమయంతో తాను సరఫరా చేసిన వెన్న త్వరగా పాడైపోతుందని, హోటళ్లు/స్వీట్ షాపులు దీనిని నెయ్యిగా మార్చు కోవడంలో ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. అందుకే వెన్న అమ్మడం కంటే, తానే నెయ్యి కాచి, నాణ్యమైన నెయ్యిని తయారుచేసి ప్యాక్ చేసి అమ్మడం లాభదాయకమని భావించాడు. పెద్ద పెద్ద డైరీ బ్రాండ్లు మార్కెట్ను శాసిస్తున్న 80వ దశకంలో డెయిరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు. ఏడాదిలోనే వారి నెల ఆదాయం రూ. 25వేలకి పెరిగింది. షాపును అద్దెకు తీసుకుని, సిబ్బందిని నియమించుకున్నారు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియోతొలి ఫ్యాక్టరీ1991లో బెంగళూరులో తొలి ఫ్యాక్టరీని ప్రారంభించారు. తరువాత దిండిగల్, హోసూరు (1999)లలో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మెల్లిగా తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించారు. వ్యాపారం వృద్ధి చెందుతున్న క్రమంలో కేవలం డెయిరీ ఉత్పత్తులకే పరిమితం కాకుండా మసాలా మిక్స్లు, ఇన్స్టంట్ మిక్స్లు, స్వీట్లు, స్నాక్స్, ఐస్క్రీమ్ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు.బయటినుంచి ఎలాంటి భారీ పెట్టుబడులు లేకుండానే కేవలం తాను సాధించిన లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ సంస్థ లాభాలను భారీ స్థాయిలో పెంచుకుంటూ వచ్చారు. అనేక దశాబ్దాల పాటు, జీఆర్బీ ఒక ప్రైవేట్ యాజమాన్యం లోని, చాలా వరకు సొంత నిధులతోనే నడిచే వ్యాపారంగా కొనసాగింది. రూ. వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంట్రీ2014లో రూ. 4.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ 2021 నాటికి రూ. 76.67 కోట్ల లాభాన్ని కళ్ల జూసింది. 2024నాటి రూ. 1,011.12 కోట్ల రాబడితో వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. 2025 నాటికి రాబడి రూ. 1,084.47 కోట్లకు చేరగా, నికర లాభం రూ. 75.45 కోట్లుగా నమోదైంది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో 'GRB డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్' బ్రాండ్ 40కి పైగా దేశాల్లో విస్తరించి, ప్రస్తుతం రూ.1,400 కోట్లకు పైగా టర్నోవర్ను సాధించింది.ఎంబీఏలు ఐఐటీలు లాంటి చదువు లేకపోయినా, వ్యాపారంలో సంపాదించిన ఆచరణాత్మక అనుభవం, మార్కెట్ అవసరాలను గుర్తించే చాకచక్యంతో జీఆర్ బాలసుబ్రహ్మణ్యం GRB బ్రాండ్ను భారతదేశంలోనే అగ్రగామి ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలలో ఒకటిగా నిలపడం విశేషం. ఉత్పత్తి నాణ్యత విషయంలో రాజీ పడటం కంటే వ్యాపారాన్ని వదులుకోవడానికే ఆయన మొగ్గు చూపేవారు. ఇది కేవలం ఒక విధానం కాదు, ఆయన దృఢమైన నమ్మకం.,500 మందికి పైగా ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నారు. పట్టుదలతో, నిబద్ధత ఉంటే విజయతీరాలకు చేరడం సాధ్యమేనని నిరూపించి , తనలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. -
భారత కంపెనీలపై కెన్యా ‘సఫారీ’!
కెన్యాలోని కజియాడో కౌంటీలోని మగాడి సరస్సు వద్ద టాటా కెమికల్స్ మగాదీ లిమిటెడ్(టీసీఎంఎల్) సోడా యాష్ గనులను నిర్వహిస్తోంది. శతాబ్దంపైగా చరిత్ర గల ఈ గనులను 2005లో బ్రిటన్కు చెందిన బర్నర్ మాండ్ నుంచి కొనుగోలు చేయడం ద్వారా టాటా కెమికల్స్ కెన్యాలోకి అడుగుపెట్టింది. 100 ఏళ్ల మైనింగ్ హక్కులను దక్కించుకుంది. ఇక్కడ ఉత్పత్తి చేసే సోడా యాష్ను గ్లాస్, డిటర్జెంట్లతో సహా రకరకాల పారిశ్రామిక అవసరాల కోసం వినియోగిస్తుంటారు. ఈ ఖనిజం విదేశాలకూ భారీగా ఎగుమతవుతోంది. అయితే, ఈ ఏడాది జూలై 28న మైనింగ్ క్యాబినెట్ సెక్రటరీ హాసన్ జోహో టీసీఎంఎల్ మైనింగ్ కార్యకలాపాలను సస్పెండ్ చేయడంతో గొడవ మొదలైంది. మైనింగ్ లైసెన్సులతో పాటు ఇతరత్రా నిబంధనలను ఉల్లంఘించిందనేది గనుల శాఖ ఆరోపణ.అంతేకాదు, రాయల్టీలు, ఖనిజ శుద్ధి, ఎగుమతుల రిపోర్టింగ్, కమ్యూనిటీ అభివృద్ధికి సంబంధించి కూడా పలు ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా టాటా కెమికల్స్ ఇక్కడ గనుల నుంచి వెలికితీస్తున్న ఖనిజాన్ని ప్రాసెసింగ్ చేసేందుకు తగినన్ని ఫ్యాక్టరీలను పెట్టకుండా, ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, మైనింగ్ శాఖ సస్పెన్షన్ ఆదేశాలపై కెన్యా హైకోర్టులో సవాలు చేసినా టాటాలకు ఊరటదక్కలేదు.రూటో అల్టిమేటం..కెన్యా అధ్యక్షుడు విలియం రూటో టాటా కెమికల్స్ తమ దేశాన్ని విడిచిపోవాలంటూ అల్టిమేటం జారీ చేయడంతో వివాదం మరింత ముదిరింది. టాటా దశాబ్దాలుగా తమ దేశంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ.. తగినన్ని ఫ్యాక్టరీలను నెలకొల్పలేదని, స్థానికంగా ఎలాంటి పారిశ్రామిక ప్రగతీ లేదని రూటో విరుచుకుపడ్డారు. ప్రజలకు టాటా కెమికల్స్ వల్ల పైసా ప్రయోజనం లేదని, అందుకే ఈ ప్రాంతంలో గ్లాస్, కెమికల్ తయారీ ఫ్యాకర్టీల కోసం ప్రభుత్వం రెండు కంపెనీలను నెలకొల్పుతుందన్నారు. టాటాల వ్యాపారాన్ని ఆ కంపెనీలు టేకోవర్ చేస్తాయని ప్రకటించారు.గతంలో కూడా ఇక్కడ టాటాలతో గొడవ నడిచింది. భూమి ధరలు, రాయల్టీలకు సంబంధించి తమకు 17.4 బిలియన్ కెన్యన్ షిల్లింగ్లను చెల్లించాలంటూ కిజియాడో కౌంటీ కోర్టుకెక్కింది. అయితే, దీనిపై టాటాలకు అనుకూలంగా తీర్చురావడంతో పరిస్థికి కాస్త సద్దుమణిగింది. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే టాటాలను దేశం నుంచి వెళ్లగొట్టే చర్యలకు తెరతీయడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలు, కోర్టులే టాటా కెమికల్స్ కెన్యా వ్యాపార భవిష్యత్తును తేల్చాల్సిన పరిస్థితి నెలకొంది.సమస్యలను పరిష్కరించుకుంటాం టాటా కెమికల్స్ వెల్లడిమగాడి గనుల సస్పెన్షన్ ఆదేశాల నేపథ్యంలో కెన్యా గనుల శాఖ కోరిన సమాచారం, డాక్యుమెంట్లు, రిపోర్టులు అన్నీ ఇప్పటికే సమర్పించామని టాటా కెమికల్స్ శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తదుపరి ఆదేశాల కోసం వేచిచూస్తున్నట్లు తెలిపింది. వివాదాస్పద అంశాల పరిష్కారం కోసం న్యాయపరంగా, నియంత్రణపరంగా కెన్యా ప్రభుత్వంతో కలిసి తగిన చర్యలు చేపట్టడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. తమ ఉద్యోగులు, మగాదీ ప్రజల శ్రేయస్సుతో పాటు కెన్యా ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. మన కంపెనీలపై కన్నెర్ర...టాటాకు ముందు కెన్యాలో వివిధ రకాల ప్రతికూలతలతో దుకాణం సర్దేసిన భారతీయ కంపెనీలు చాలానే ఉన్నాయి.అదానీ: నైరోబీ జోమో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు (జేకేఐఏ) ఆధునీకరణ ప్రాజెక్టును (1.85 బిలియన్ డాలర్లు) 30 ఏళ్ల లీజు ప్రాతిపదికన అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ 2024లో దక్కించుకుంది. వ్యూహాత్మక జాతీయ ఆస్తులను విదేశీ కంపెనీలకు కట్టబెడితే ఉద్యోగాలు పోతాయంటూ కెన్యాలోని విమానయాన యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోపక్క, అదానీ ఎనర్జీ, కెన్యా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీతో 30 ఏళ్ల పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ఒప్పందాన్ని కుదుర్చకుంది. ఈ విద్యుత్ ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు విలువ 736 మిలియన్ డాలర్లు. అమెరికాలో గౌతమ్ అదానీపై లంచాల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత రూటో ఈ రెండు అదానీ ప్రాజెక్టులను రద్దు చేశారు. అయితే, ఎయిర్పోర్టు ప్రాజెక్టు రద్దు వెనుక చైనా హస్తంపై అనుమానాలున్నాయి. ఎందుకంటే 1.2 బిలియన్ డాలర్లతో చైనా రోడ్ అండ్ బ్రిడ్స్ కార్పొరేషన్ జేకేఐఏ విస్తరణకు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.ఎస్సార్: 2008లో ఎస్సార్ తన యూమొబైల్ టెలికం వ్యాపారాన్ని కెన్యాలో ప్రారంభించింది. 40 బిలియన్ కెన్యన్ షిల్లింగ్స్ పెట్టుబడులు పెట్టింది. అయితే, నష్టాల కారణంగా 2014లో దీన్ని ఎయిర్టెల్, సఫరీకామ్లకు విక్రయించింది. ఇక కెన్యా పెట్రోలియం రిఫైనరీస్లో 50 శాతం వాటాను ఎస్సార్ ఎనర్జీ 2016లో కెన్యా ప్రభుత్వానికి 5 మిలియన్ డాలర్లకు వదిలేసి వైదొలగింది. కెన్యా ప్రభుత్వ ప్రతికూల పాలసీలే దీనికి కారణమనేది ఎస్సార్ ఆరోపణ.కరుటూరి గ్లోబల్: బెంగళూరుకు చెందిన ఈ ఫ్లవర్ బిజినెస్ కంపెనీ దాదాపు 383 మిలియన్ డాలర్ల రుణాలు తిరిగి చెల్లించలేక పోవడం, పన్నుల సంబంధ వివాదాదలతో దుకాణం సర్దేసింది.మహీంద్రా: కామ్సన్ మోటార్స్ పేరుతో కెన్యాలో మహీంద్రా వాహన వ్యాపారాన్ని వివాదాస్పద సరఫరా ఒప్పందం కారణంగా మూసేసింది. అయితే, 2012లో స్థానిక పంపిణీ ఒప్పందం ద్వారా మహీంద్రా మళ్లీ కెన్యాలో అడుగుపెట్టింది.ఎయిర్టెల్: కెన్యాలో 2015లో ముగిసిన యూమొబైల్ లైసెన్స్ విషయంలో భారీ ఫీజుల చెల్లింపు డిమాండ్పై అక్కడి టెలికం నియంత్రణ సంస్థలతో ఎయిర్టెల్ తీవ్ర పోరాటమే చేయాల్సి వచ్చింది. కెన్యాలో రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా నిలుస్తున్న ఎయిర్టెల్ గత నెలలోనే కోర్టు వెలుపల సెటిల్మెంట్ ద్వారా మళ్లీ 25 ఏళ్ల కొత్త లైసెన్స్ దక్కించుకుంది.అయితే, ప్రభుత్వంతో వివాదాలు నెలకొంటున్నా... కెన్యాలో ఇప్పటికీ 200 భారతీయ కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తుండటం విశేషం. ఇందులో గోద్రెజ్, థెర్మాక్స్, యూపీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు పలు ఐటీ, ఫార్మా సంస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చాలా కంపెనీలు నేరుగా ప్లాంట్ల ఏర్పాటు కంటే వాణిజ్యపరమైన లావాదేవీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. కాగా, అదానీతో డీల్ రద్దు తర్వాత 311 మిలియన్ డాలర్ల విలువైన ట్రాన్స్మిషన్ కాంట్రాక్టు కోసం ప్రభుత్వ రంగ పవర్గ్రిడ్ కార్పొరేషన్తో కెన్యా ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: జీతం మొత్తం ఈఎంఐలకే సరిపోతోందా? -
ఎన్ఎస్ఈ ఐపీఓ వచ్చేస్తోంది!
న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దకాలంగా పెండింగ్లో ఉన్న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం లిస్టింగ్కు ఎట్టకేలకు తెరలేచింది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పచ్చ జెండా ఊపింది. ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్సే్ఛంజీగా నిలుస్తున్న ఎన్ఎస్ఈ.. సెబీ ఆమోదంతో లిస్టింగ్ ప్రణాళికలను వేగవంతం చేయనుంది. వచ్చే వారమే ధరల శ్రేణిని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఈ నెల 15కల్లా ఐపీవోకు తెరతీయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.టాప్–10లోకి...ఐపీవోలో భాగంగా ఎన్ఎస్ఈ వాటా మూలధనంలో 6 శాతానికి సమానమైన 14.89 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 30,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎల్ఐసీ, పేటీఎమ్, టాటా క్యాపిటల్, కోల్ ఇండియా ఇష్యూలను అధిగమించి అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. మరోపక్క జియో ప్లాట్ఫామ్స్ సైతం రూ. 37,700 కోట్ల మెగా ఐపీవో కోసం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఎన్ఎస్ఈ లిస్టయితే దేశీయంగా మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రీత్యా టాప్–10లో నిలిచే అవకాశముంది. 1.8 లక్షలమంది వాటాదారులతో రూ. 5 లక్షల కోట్లకుపైగా మార్కెట్ విలువను అందుకోవచ్చని అంచనా. 2016లో చెక్...ఎన్ఎస్ఈ తొలుత 2016 డిసెంబర్లో పబ్లిక్ ఇష్యూ(రూ. 10,000 కోట్ల సమీకరణ)కు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. అయితే లిస్టింగ్ ప్రణాళికలకు నియంత్రణ, న్యాయ, పాలనా సంబంధ వివాదాలు అడ్డుపడుతూ వచ్చాయి. ఆపై అవాంతరాల కారణంగా 2019, 2020, 2024లో ఎన్వోసీ కోసం పత్రాలు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో వివాద పరిష్కారాలకుగాను సెబీకి రూ. 1,491 కోట్లకుపైగా చెల్లించింది. ఎప్పటినుంచో నడుస్తున్న కోలొకేషన్, డార్క్ఫైబర్ కేసులపై ఈ వారం సుప్రీం కోర్టు సెబీ అప్పీల్ను కొట్టివేసిన నేపథ్యంలో ఎన్ఎస్ఈకి ఉపశమనం లభించింది. ఆపై తాజాగా సెబీ నుంచి అనుమతి పొందింది.వాటాదారులు ఇలా...ఐపీవోలో ప్రస్తుత వాటాదారు సంస్థలు ఈక్విటీ వాటాలను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా తమ వాటాలను విక్రయించేందుకు(మానిటైజ్) వీలు చిక్కనుంది. దీంతో నిధులు ఎక్సే్చంజీకి చేరబోవు. బ్యాంకర్ల అంచనా ప్రకారం ఎన్ఎస్ఈ ఐపీవో ధర రూ. 2,000గా ఉండవచ్చు. ఈ నెల 11కల్లా ధరల శ్రేణిని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈ ఐపీవోలో బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 2.48 కోట్ల షేర్లు, ఎంఎస్ స్ట్రాటజిక్(మారిషస్) 1.6 కోట్ల షేర్లు చొప్పున ఆఫర్ చేయనున్నాయి. ఈ జాబితాలో కెనడా పెన్షన్ ప్లాన్, అరండా ఇన్వెస్ట్మెంట్స్, బీవోబీ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, జీఐసీసహా ఇతర బీమా కంపెనీలు చేరాయి. అయితే అతిపెద్ద వాటాదారు(10.72 శాతం) ఎల్ఐసీ షేర్లను విక్రయించడం లేదు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐ వాటా 3.23 శాతంకాగా.. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్కు 4.33 శాతం, స్టాక్ హోల్డింగ్కు 4.44 శాతం చొప్పున వాటా ఉంది. డెరివేటివ్స్ కింగ్ దేశీయంగా ఈక్విటీ డెరివేటివ్స్ మార్కెట్లో ఎన్ఎస్ఈ ఆధిపత్యం వహిస్తోంది. ట్రేడవుతున్న కాంట్రాక్టులరీత్యా ప్రపంచంలోనే అత్యంత రద్దీగల ఎక్సే్ఛంజీగా నిలుస్తోంది. ఇక గతేడాది(2025–26)లో మొత్తం ఆదాయం రూ. 18,713 కోట్లుకాగా.. నికర లాభం 15 శాతం తగ్గి రూ. 10,302 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) ఆదాయం రూ. 19,177 కోట్లుకాగా.. రూ. 12,188 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 3,120 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 9 శాతం ఎగసి రూ. 5,252 కోట్లకు చేరింది. ఈ షేర్లకు పండుగ ఎన్ఎస్ఈ లిస్ట్కానుండటంతో ఐఎఫ్సీఐ, న్యూ ఇండియా ఎస్యూరెన్స్ కంపెనీ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. దీంతో తాజాగా ఐఎఫ్సీఐ షేరు 6 శాతం జంప్చేసి రూ. 101ను దాటింది. తొలుత రూ. 107కు ఎగసింది. ఇక న్యూ ఇండియా 17.5 శాతం దూసుకెళ్లి రూ. 230కు చేరింది. ఇవి 52 వారాల గరిష్ట ధరలుకాగా.. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్లో 52.86 శాతం వాటా కలిగిన ఐఎఫ్సీఐ ఎన్ఎస్ఈ లిస్టింగ్తో లబ్ధి పొందనుంది. స్టాక్ హోల్డింగ్కు ఎన్ఎస్ఈలో 4.44% వాటా ఉంది. ఈ బాటలో ఎన్ఎస్ఈలో 1.42% వాటా కలిగిన న్యూ ఇండియా సైతం వాటా విక్రయం ద్వారా లాభపడనుంది. గత నెల రోజుల్లో ఐఎఫ్సీఐ 42%, న్యూ ఇండియా 33% చొప్పున బలపడటం గమనార్హం! బంపర్ లిస్టింగ్.. ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్, ప్రయారిటీ జ్యువెల్స్ షేర్లు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే లాక్ అయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే తొలి రోజే ఈఎస్డీఎస్ షేరు 109%, ప్రయారిటీ జ్యువెల్స్ షేరు 18 శాతం లాభాలు ఇన్వెస్టర్లకు పంచాయి. → ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిస్టింగ్ ఇష్యూ ధర (రూ.429)తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 74 శాతం ప్రీమియంతో రూ.746 వద్ద ప్రారంభమైంది. మార్కెట్ ర్యాలీలో భాగంగా ఇంట్రాడేలో 109 శాతం ఎగసి రూ.895.55 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే లాక్ అయింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.10,647 కోట్లుగా నమోదైంది. → ప్రయారిటీ జ్యువెల్స్ ఇష్యూ ధర (రూ.200)తో పోలిస్తే 12 శాతం ప్రీమియంతో రూ.225 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 18 శాతం ఎగసి రూ.236 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి, అక్కడే స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.426 కోట్లుగా నమోదైంది. -
అడోబ్ కొత్త సీఈఓ.. ఎవరీ అనిల్ చక్రవర్తి?
అడోబ్ సంస్థకు కొత్త సీఈఓగా అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. డిసెంబర్ 1 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 18 ఏళ్లుగా సంస్థకు నాయకత్వం వహించిన శంతను నారాయణ్ ఎగ్జిక్యూటివ్ చైర్గా కొనసాగనున్నారు.అనిల్ చక్రవర్తి జనవరి 2020లో అడోబ్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, దాని డిజిటల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ జనరల్ మేనేజర్గా చేరారు. సంవత్సరం తరువాత.. అతను కంపెనీ ఉత్పత్తి పోర్ట్ఫోలియో అంతటా ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు సేవలు అందించే అడోబ్ యొక్క ప్రపంచవ్యాప్త ఫీల్డ్ కార్యకలాపాల బాధ్యతను కూడా స్వీకరించారు. డిసెంబర్ 2021లో, ఆయన డిజిటల్ ఎక్స్పీరియన్స్, ప్రపంచవ్యాప్త ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగానికి అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు.అడోబ్లో చేరడానికి ముందు, చక్రవర్తి నాలుగు సంవత్సరాల పాటు ఇన్ఫర్మాటికా సీఈఓగా పనిచేశారు. ఆయన తొలుత 2013లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఈ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీలో చేరారు. తన కెరీర్ ప్రారంభంలో, ఆయన సిమాంటెక్ అండ్ వెరిసైన్లలో ఎగ్జిక్యూటివ్ పదవులను నిర్వహించారు. మెకిన్సీ & కంపెనీలో కూడా పనిచేశారు. దీనివల్ల ఆయనకు టెక్నాలజీ పరిశ్రమలోని వివిధ రంగాలలో అనుభవం లభించింది.చక్రవర్తి భారతదేశంలోని వారణాసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పట్టా పొందారు. ఆయన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్, పిహెచ్.డి. పట్టాలను కూడా పొందారు. -
ఎప్పుడూ విమానంలో ఉంటారు.. ఎంత సంపాదిస్తారు?
విమానంలో ఉద్యోగం చాలామందికి డ్రీమ్ జాబ్. ముఖ్యంగా విమానంలో ప్రయాణికులందరినీ చిరునవ్వుతో పలకరించే క్యాబిన్ క్రూ ఉద్యోగం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రయాణాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, విమానయాన రంగంలో కెరీర్.. ఇలా ఎన్నో ఆకర్షణలు ఈ ఉద్యోగంలో ఉన్నాయి. దేశంలో వేగంగా విస్తరిస్తున్న విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగోలో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్నవారు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2026లో అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవాన్ని బట్టి ఇండిగో క్యాబిన్ క్రూ సంపాదనలెంతో ఈ కథనంలో తెలుసుకుందాం..కొత్తగా చేరేవారికి ఇలా..ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం, ఇండిగోలో కొత్తగా క్యాబిన్ క్రూగా చేరినవారు సాధారణ ఫ్లయింగ్ డ్యూటీలు ప్రారంభించిన తర్వాత నెలకు సుమారు రూ.40,000 నుంచి రూ.55,000 వరకు సంపాదించవచ్చు. అయితే ఇది స్థిరమైన జీతంగా భావించకూడదు. ఫ్లయింగ్ గంటలు, నెలవారీ రోస్టర్, రూట్, ప్రోత్సాహకాలు, పనిచేసే బేస్ లొకేషన్ వంటి అంశాల ఆధారంగా అసలు నెలవారీ ఆదాయం మారవచ్చు.అనుభవం పెరిగితే..రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల అనుభవం, ఎక్కువ ఫ్లయింగ్ యాక్టివిటీ ఉన్న క్యాబిన్ క్రూకు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న పరిశ్రమ అంచనాల ప్రకారం అనుభవజ్ఞులైన సిబ్బంది నెలకు రూ.60,000–రూ.85,000 వరకు సంపాదించవచ్చు. ఇందులో ఫ్లయింగ్ అలవెన్సులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు, రూట్ అసైన్మెంట్లు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి నెలా వచ్చే మొత్తం ఒకేలా ఉండకపోవచ్చు.సీనియర్ స్థాయిలో రూ.1.2 లక్షల వరకు..కెరీర్లో ముందుకు వెళ్లి లీడ్ క్యాబిన్ అటెండెంట్ లేదా ఇన్ఫ్లైట్ సూపర్వైజర్ వంటి బాధ్యతలు చేపట్టినవారికి ఆదాయం మరింత ఎక్కువగా ఉండొచ్చని ఏవియేషన్ A2Z అంచనా వేసింది. బలమైన ఫ్లయింగ్ షెడ్యూల్, అధిక బాధ్యతలు ఉన్న సమయంలో వీరి నెలవారీ సంపాదన సుమారు రూ.90,000 నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండొచ్చు.జీతంతో పాటు మరిన్ని ప్రయోజనాలుక్యాబిన్ క్రూ ఆదాయం కేవలం బేసిక్ పేకు పరిమితం కాదు. ఫ్లయింగ్ అలవెన్సులు, కొన్ని సందర్భాల్లో లేఓవర్ సంబంధిత ప్రయోజనాలు, స్టాఫ్ ట్రావెల్ వంటి సదుపాయాలు మొత్తం ప్యాకేజీలో భాగం కావచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ రూట్, డ్యూటీ స్వభావం కూడా ఆదాయంపై ప్రభావం చూపే అంశంగా మారుతోంది.మూడు నెలల శిక్షణ తప్పనిసరిఇండిగో అధికారిక సమాచారం ప్రకారం, విమానంలో ఫ్లయింగ్ క్రూగా విధులు ప్రారంభించే ముందు క్యాబిన్ క్రూ సిబ్బంది మూడు నెలలపాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ పొందుతారు. ప్రయాణికుల భద్రత, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, సేవా ప్రమాణాలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. -
ఆ రాత్రి పంపిన సందేశం.. రూ.కోటి సంపాదనకు మార్గం!
జీవితాన్ని మార్చడానికి కొన్నిసార్లు పెద్ద పెట్టుబడి, డిగ్రీ లేదా భారీ పరిచయాలు అవసరం ఉండకపోవచ్చు. సరైన సమయంలో వేసే ఒక్క అడుగు కూడా కెరీర్కు కొత్త దారిని చూపించొచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది యువ రచయిత, ఫ్రీలాన్సర్ ఆదిత్య బన్సాల్ కథ. 17 ఏళ్ల వయసులో పోడ్కాస్టర్, ఎంట్రాప్రెన్యూర్ రాజ్ షమానీకి ఓ అర్ధరాత్రి పంపిన డీఎం (సందేశం).. తన కెరీర్ను మలుపుతిప్పిందని బన్సాల్ తాజాగా వెల్లడించారు. ఆ అవకాశంతో మొదలైన ప్రయాణంలో 22 ఏళ్ల వయసుకే రూ.1 కోటి సంపాదించినట్లు ఆయన పేర్కొన్నారు.జేఈఈ ప్రిపరేషన్ నుంచి ఆన్లైన్ కంటెంట్ వైపు..2021లో బన్సాల్ జేఈఈకి సిద్ధమవుతున్నారు. పరీక్ష అక్టోబర్కు వాయిదా పడిన సమయంలో యూట్యూబ్లో స్వయంవృద్ధి, ఆదాయ మార్గాలకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా చూడటం మొదలుపెట్టారు. అందులో భాగంగానే రాజ్ షమానీ వీడియోలను కూడా ఫాలో అయ్యేవారు. అప్పటికే డబ్బు సంపాదించేందుకు గ్రాఫిక్ డిజైన్, వెబ్సైట్ డెవలప్మెంట్ వంటి మార్గాలను ప్రయత్నించినా అవి సఫలం కాలేదని బన్సాల్ చెప్పారు.అప్పటికి తన ముందున్న సాధారణ మార్గం జేఈఈ రాయడం.. ఇంజినీరింగ్ చదవడం.. ఆ తర్వాత ఉద్యోగం చేయడమేనని ఆయన గుర్తుచేసుకున్నారు. కానీ ఆ దారిలో తన భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందే ఊహించగలిగానని, అది తనకు నచ్చలేదని తెలిపారు.రాత్రి పంపిన డీఎం..ఒకరోజు షమానీ ఆదాయ మార్గాలపై చేసిన వీడియోను చూసిన బన్సాల్.. అందులోని ఆలోచనలను ట్విట్టర్ (ప్రస్తుతం ‘ఎక్స్’) థ్రెడ్గా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గూగుల్ డాక్లో గంటల తరబడి పనిచేసి, ఎలాంటి ఉద్యోగం లేదా డబ్బు ఆశించకుండా ఆ థ్రెడ్ను షమానీకి నేరుగా పంపించారు.రాత్రి 10:41 గంటలకు పంపిన ఆ డీఎంకు తెల్లవారుజామున 3:53 గంటలకు సమాధానం వచ్చింది. థ్రెడ్ను ముందుగా పోస్ట్ చేసి స్పందన ఎలా వస్తుందో చూస్తానని, మంచి ఫలితం వస్తే తన ట్విట్టర్ థ్రెడ్ల కోసం బన్సాల్ను నియమించుకుంటానని షమానీ చెప్పినట్లు ఆయన వెల్లడించారు.17 ఏళ్లకే తొలి పెయిడ్ వర్క్..బన్సాల్ పంపిన థ్రెడ్కు సుమారు 1,200 లైక్స్ వచ్చాయి. తాను అప్పటికి పెద్దగా అనుభవం లేని రచయితనని, ఆ థ్రెడ్ తన అత్యుత్తమ రచన కూడా కాదని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ షమానీ అతనిలోని సామర్థ్యాన్ని గుర్తించి అవకాశం ఇచ్చారు.ఆ తర్వాత బన్సాల్ షమానీ కోసం సుమారు 5–6 ట్విట్టర్ థ్రెడ్లు రాశారు. అప్పటికి తనకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో అమెజాన్ గిఫ్ట్ కార్డుల రూపంలో చెల్లింపులు అందుకున్నట్లు తెలిపారు. అయితే ఈ అనుభవంలో తనకు లభించిన అసలు విలువ డబ్బు కాదని బన్సాల్ చెప్పారు. కంటెంట్ కోసం అవసరమైన సమాచారం, సోర్సులు, మెటీరియల్ను షమానీ అందించడంతో పాటు తనను టీమ్లో ఒకరిగా చూసేవారని గుర్తుచేసుకున్నారు.ఒక్క టెస్టిమోనియల్తో మరో అవకాశం..తర్వాత షమానీకి పూర్తి స్థాయి టీమ్ అవసరం కావడంతో ఈ పని ఆగిపోయింది. అయితే వెళ్లే ముందు బన్సాల్కు ఆయన ఇచ్చిన టెస్టిమోనియల్ మరో కీలక అవకాశానికి దారితీసింది. అదే సిఫార్సుతో తన తొలి రిటైనర్ క్లయింట్ను సంపాదించుకున్నట్లు బన్సాల్ తెలిపారు.అక్కడి నుంచి ఫ్రీలాన్స్ రచయితగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పటివరకు 45 మందికి పైగా ఫౌండర్లతో పనిచేశానని, 22 ఏళ్ల వయసులో రూ.1 కోటి సంపాదనను దాటానని ఆయన పేర్కొన్నారు. మధ్యలో క్లయింట్లు లేకపోయినా, ఆదాయం లేని దశలు ఎదురైనా.. 17 ఏళ్ల వయసులో లభించిన తొలి అవకాశం తనపై నమ్మకాన్ని పెంచిందని చెప్పారు.‘‘ఆ డీఎం ఇప్పటికీ నా బెస్ట్.. ’’తన కెరీర్లో ఆ ఒక్క అవకాశానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెబుతూ బన్సాల్ షమానీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఆ డీఎం ఇప్పటికీ నేను రాసిన అత్యుత్తమ విషయం’’ అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
డిజిటల్ విప్లవంలో జియో పదేళ్ల ప్రస్థానం!
అది 2016 సెప్టెంబర్ 5. భారతదేశపు టెలికాం చరిత్రలో ఒక సంచలన ఘట్టానికి తెరలేచిన రోజు. మొబైల్ డేటా అంటే అదొక నిత్యావసర సరుకు కాదు, కేవలం శ్రీమంతుల విలాసవంతమైన వస్తువు అనే భావన బలంగా ఉన్న రోజులు అవి. డేటా ఆన్ చేస్తే పైసలు ఖర్చయిపోతాయేమో అని ఇంటర్నెట్ వాడటానికి కూడా జంకే పరిస్థితుల నుంచి పరిమిత సబ్స్క్రిప్షన్తో అపరిమిత డేటా అనే దిశగా భారత టెలికాం రంగాన్ని శాసించిన సంస్థ రిలయన్స్ జియో. సరిగ్గా పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ డిజిటల్ ప్రస్థానం నేడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో సాంకేతిక, సామాజిక విప్లవాన్ని తీర్చిదిద్దింది. జియో పుట్టి పదేళ్లు అయిన నేపథ్యంలో ‘సాక్షి.కామ్ బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనం..జియో దెబ్బకు భారీగా పడిన డేటా ధరలుపదేళ్ల క్రితం ఒక జీబీ (1 GB) డేటా కొనాలంటే కనీసం రూ.228 వెచ్చించాల్సి వచ్చేది. సగటు భారతీయుడు నెలకు కనీసం 200 మెగాబైట్లు (0.2 GB) వాడటానికి కూడా వెనుకాడేవాడు. అటువంటి రోజుల్లో డేటా అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అనే సూత్రంతో జియో మార్కెట్లోకి అడుగుపెట్టింది. జియో దెబ్బకు నేడు డేటా ధర 97 శాతం పడిపోయి ఒక్క జీబీ రూ.7.9 కి లభిస్తుండగా సగటు వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం ఏకంగా 42.3 జీబీకి చేరింది.జియో సిమ్ కోసం 2016లో బారులు తీరిన జనంతెలుగు నేలపై వృద్ధి పరుగులుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ (తెలంగాణ, ఏపీ) సరసన జియో మెరుగైన వృద్ధి సాధించింది. అప్పటివరకు ఏళ్ల తరబడి రాజ్యమేలిన పాత సంస్థల పునాదులను కదిలిస్తూ జియో దూసుకెళ్లింది.2016 ఆగస్టు నాటికి ఒక్క వినియోగదారుడు కూడా లేని చోట 2026 జూన్ నాటికి జియో చందాదారుల సంఖ్య 325.8 లక్షలకు (3.258 కోట్లు) చేరింది. ఇది ఏటా 39.9 శాతం సంయుక్త వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్).ఇరు రాష్ట్రాల్లో మొత్తం వైర్లెస్ కనెక్షన్లలో 36.9% మార్కెట్ షేర్తో జియో రెండో అతిపెద్ద శక్తిగా నిలిచింది. 2024 జూన్ నాటికి అత్యధికంగా 3.307 కోట్ల చందాదారుల రికార్డును నెలకొల్పింది.ఆపరేటర్ఆగస్టు 2016 (లక్షల్లో)జూన్ 2026 (లక్షల్లో)నికర మార్పు (లక్షల్లో)10 ఏళ్ల వార్షిక వృద్ధి (సీఏజీఆర్)రిలయన్స్ జియో—325.8+313.439.9%భారతీ ఎయిర్టెల్241.7394.1+152.45.1%వొడాఫోన్ ఐడియా228.687.3-141.3-9.3%బీఎస్ఎన్ఎల్97.575.8-21.7-2.5%ఇతరులు164.10.0-164.1నిష్క్రమించాయి(మూలం: ట్రాయ్ నివేదికలు, సెప్టెంబర్ 2016 నుంచి పరిగణలోకి తీసుకున్న జియో గణాంకాలు)మార్కెట్ ఏకీకరణ2016లో ఎనిమిదికి పైగా ఆపరేటర్లతో రద్దీగా ఉన్న టెలికాం మార్కెట్, జియో రాకతో కేవలం నలుగురికి పరిమితం అయింది. టాటా టెలికాం, ఆర్కామ్, ఎయిర్సెల్ వంటి చిన్న సంస్థలు అడుసు తొక్కనేల.. కాలు కడగనేల అన్నట్లుగా పోటీ తట్టుకోలేక తట్టాబుట్టా సర్దేసాయి. ఇక వొడాఫోన్, ఐడియాలు కలిసినా కూడా కస్టమర్ల వలసను అడ్డుకోలేక 2.2 కోట్ల నుంచి 87.3 లక్షలకు పడిపోయాయి. జియో రాక కేవలం కస్టమర్లను సంపాదించుకోవడమే కాకుండా కొత్తగా కోట్లాది మందిని డిజిటల్ పరిధిలోకి తెచ్చింది. ట్రాయ్ అధికారిక లెక్కల ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్లో (ఏపీ, తెలంగాణ) మొత్తం వైర్లెస్ చందాదారుల సంఖ్య 7.47 కోట్ల నుంచి 8.83 కోట్లకు పెరిగింది.పెరిగిన వినియోగదారులుచౌకైన ఇంటర్నెట్ నేడు ఆర్థిక చక్రానికి ఇంధనంగా మారింది. విజయవాడలోని వీధి వ్యాపారి నుంచి వరంగల్లోని టీ కొట్టు యజమాని వరకు ప్రతి ఒక్కరి చేతిలో క్యూఆర్ కోడ్ ఉంది. దేశంలో డిజిటల్ వ్యాలెట్ వినియోగదారులు 2016లో స్వల్ప సంఖ్య నుంచి 2026 నాటికి 55.6 కోట్లకు చేరారు. ఓటీటీ విభాగంలో 3 కోట్ల నుంచి 60.1 కోట్ల వీక్షకులకు ఎగబాకింది. ముంబైలోని జియో ప్రధాన కార్యాలయం5G స్వదేశీ పరిజ్ఞానంతో.. 6G వైపు అడుగులు4G లో ప్రపంచ దేశాల కంటే వెనుకబడిన భారత్, 5G విషయంలో జియో వేగంతో ప్రపంచంతో పోటీపడింది. కేవలం 15 నెలల్లోనే దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్ను విస్తరించి 26.8 కోట్ల 5G కస్టమర్లను సంపాదించింది. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా ‘మేక్ ఇన్ ఇండియా’ పద్ధతిలో సొంతంగా క్లౌడ్-నేటివ్ 5G ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేసింది. 11,303 మంది పరిశోధకులతో, 6,817 పేటెంట్ల బలం తోడైన జియో రాబోయే 6G ప్రమాణాలను సైతం శాసించే స్థాయికి ఎదిగింది.జియోభారత్ చౌక ఫోన్లు..జియోభారత్ చౌక ఫోన్ల ద్వారా మిగిలిన 2G వినియోగదారులను 4G వైపు మళ్లించడం, ఎయిర్ ఫైబర్ ద్వారా 2.7 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో జియో డిజిటల్ అసమానతలను అధిగమించింది. 2026 నాటికి రూ.1,46,885 కోట్ల ఆదాయం ఆర్జించిన జియో కేవలం టెలికాం కంపెనీగా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ రంగాలను నడిపించే ఒక దేశీయ సాంకేతిక దిగ్గజంగా రూపాంతరం చెందింది.ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్లెస్ రోబోటాక్సీ! -
డిజిటల్ వ్యాపారులకు ఆర్బీఐ నిబంధనల తలనొప్పి!
చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన రీ-కేవైసీ నిబంధనలు ఇప్పుడు దేశీయ ఫిన్టెక్ రంగానికి కొత్త తలనొప్పిగా మారినట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేమెంట్ అగ్రిగేటర్లు తమ వద్ద నమోదైన పాత వ్యాపారుల (మర్చంట్ల) అందరి కేవైసీని పూర్తి చేయడానికి ఆర్బీఐ విధించిన సెప్టెంబరు 15 గడువు సమీపిస్తుండటంతో ఫిన్టెక్ సంస్థల్లో తీవ్ర కలకలం రేగుతోంది.ఈ గడువులోగా వివరాలు నవీకరించకపోతే లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. చిన్న స్థాయి క్యూఆర్ కోడ్ వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది, ఆన్లైన్లో సేవలు అందించే సుమారు 10 లక్షల మంది మైక్రో వ్యాపారులు ఈ గడువును మిస్ అయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది ఆర్బీఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్స్ ప్రకారం ఆన్లైన్, ఫిజికల్ (ఆఫ్లైన్), క్రాస్-బోర్డర్ పేమెంట్ అగ్రిగేటర్లు తమ వ్యాపారుల వివరాలను సమగ్రంగా పునపరిశీలించాలి. అయితే వీధి వ్యాపారులు, చిన్న కిరాణా కొట్టు నిర్వాహకుల వద్ద అధికారిక వ్యాపార ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది.మరోవైపు, కేవైసీ ప్రక్రియ కోసం థర్డ్-పార్టీ ఏజెన్సీలను కాకుండా తమ సొంత సిబ్బందిని మాత్రమే వినియోగించాలని ఆర్బీఐ ఆదేశించడంతో పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే వంటి సంస్థలపై నిర్వహణ భారం పెరిగింది. లక్షలాది మంది వ్యాపారుల వద్దకు క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి భౌతిక పరిశీలన చేయడం ఆకాశానికి నిచ్చెన వేయడమేనని పేమెంట్ సంస్థల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సౌండ్బాక్స్ వినియోగించే మర్చంట్లలో 85-90% వరకు ప్రక్రియ పూర్తవుతున్నప్పటికీ చిన్న క్యూఆర్ వ్యాపారుల(మైక్రో) కేవైసీ మాత్రం మందకొడిగా సాగుతోంది. ఆర్థిక వ్యవస్థ సురక్షితంగా ఉండటం ముఖ్యమే అయినప్పటికీ క్షేత్రస్థాయి సమస్యలను, ఆటంకాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఈ గడువును కొంతకాలం పొడిగించాలని లేదా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని డిజిటల్ చెల్లింపుల వ్యాపారులు కోరుతున్నారు.ఇదీ చదవండి: టెస్లా డ్రైవర్లెస్ రోబోటాక్సీ! -
10 రూపాయల పవర్ చూపిస్తున్న అంబానీ!
భారత ఎఫ్ఎంసీజీ (FMCG) మార్కెట్లో రిలయన్స్ మరోసారి తన ‘తక్కువ ధర–భారీ పంపిణీ’ వ్యూహాన్ని ప్రయోగిస్తోంది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తాజాగా ‘బాంబే క్రీమరీ’ పేరుతో ఐస్క్రీమ్ బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బ్రాండ్లో ఐస్క్రీమ్ ధరలు కేవలం రూ.10 నుంచే ప్రారంభం కావడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం బాంబే క్రీమరీ ఉత్పత్తులు పశ్చిమ భారతదేశంలో అందుబాటులోకి వచ్చాయి. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించాలని రిలయన్స్ ప్రణాళిక వేసింది. కప్పులు, కోన్స్, టబ్లు, బార్లు, స్టిక్స్ వంటి విభిన్న రూపాల్లో ఉత్పత్తులను అందించనుంది. కంపెనీ ప్రకారం వీటిని రియల్ డెయిరీ క్రీమ్తో తయారు చేస్తున్నారు. అంటే కేవలం తక్కువ ధరపైనే కాకుండా, డెయిరీ ఆధారిత నాణ్యతను కూడా బ్రాండ్ ముందుకు తెస్తోంది.అమూల్ నుంచి క్వాలిటీ వాల్స్ వరకు పోటీ..ఐస్క్రీమ్ మార్కెట్లో ఇప్పటికే అమూల్, వడిలాల్, మదర్ డెయిరీ, క్వాలిటీ వాల్స్, అరుణ్ వంటి బలమైన బ్రాండ్లు ఉన్నాయి. వీటితో పాటు మ్యాగ్నమ్, బాస్కిన్ రాబిన్స్ వంటి ప్రీమియం బ్రాండ్లు కూడా పోటీలో ఉన్నాయి. ఇలాంటి పోటీ వాతావరణంలో రూ.10 ప్రారంభ ధరతో రిలయన్స్ ప్రవేశించడం మార్కెట్లో ధరల పోటీ మరింత పెరిగే అవకాశాలను సూచిస్తోంది.రిలయన్స్కు ఈ వ్యూహం కొత్తది కాదు. టెలికాం రంగంలో జియో ప్రవేశం, పానీయాల విభాగంలో కాంపా పునరాగమనం సమయంలోనూ తక్కువ ధర, భారీ పంపిణీ వ్యవస్థ, అధిక రిటైల్ చేరువ వంటి అంశాలను కలిపి ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు అదే మోడల్ను ఐస్క్రీమ్ మార్కెట్లోనూ అమలు చేయాలని చూస్తోంది.కాంపాతో ఇప్పటికే సక్సెస్..రిలయన్స్ ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో కాంపా ఈ వ్యూహానికి తాజా ఉదాహరణ. రిలయన్స్ అధికారిక గణాంకాల ప్రకారం FY26లో కాంపా రూ.4,700 కోట్లకు పైగా గ్రాస్ సేల్స్ సాధించింది. దీంతో దేశంలోని కార్బొనేటెడ్ సాఫ్ట్డ్రింక్స్ బ్రాండ్లలో నాలుగో అతిపెద్ద బ్రాండ్గా ఎదిగింది. కీలక మార్కెట్లలో డబుల్ డిజిట్ మార్కెట్ షేర్ను కూడా సాధించినట్లు కంపెనీ తెలిపింది.ఇదే సమయంలో ఆర్సీపీఎల్ మొత్తం గ్రాస్ రెవెన్యూ FY26లో సుమారు రూ.22,000 కోట్లకు చేరింది. కాంపా, ఇండిపెండెన్స్, ప్యాకేజ్డ్ వాటర్ వంటి విభాగాల్లో విస్తరణతో రిలయన్స్ ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది.క్వాలిటీ వాల్స్కు షాక్..బాంబే క్రీమరీ ప్రకటన ప్రభావం స్టాక్ మార్కెట్లోనూ కనిపించింది. రిలయన్స్ ఐస్క్రీమ్ మార్కెట్లోకి ప్రవేశించిన నేపథ్యంలో క్వాలిటీ వాల్స్ ఇండియా షేరు సెప్టెంబర్ 2న ఇంట్రాడేలో దాదాపు 3 శాతం పడిపోయి రూ.43 స్థాయికి చేరింది. వరుసగా ఏడో సెషన్లోనూ షేరు నష్టాల్లో ముగిసింది. ఈ ఏడు సెషన్లలో మొత్తం క్షీణత సుమారు 11 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: ‘ఏటీఎం’ కీలక మార్పులు.. కెనరా, ఎస్బీఐ కొత్త రూల్స్ ఇవే.. -
విమాన ప్రయాణికులకు తీపి కబురు
నిత్యం విమానాల్లో ప్రయాణించే పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ‘పైసాబజార్’ తీపి కబురు అందించింది. ప్రయాణ సమయంలో ఎయిర్పోర్ట్ లాంజ్లలో విశ్రాంతి తీసుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా ‘పీబీ పాస్’ను ఆవిష్కరించింది. పైసాబజార్ ప్లాట్ఫామ్ ద్వారా కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునే వినియోగదారులకు ఏడాది పాటు అపరిమిత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.కార్డు పొందిన వినియోగదారులు పైసాబజార్ యాప్ ద్వారా తమ మొదటి చెల్లింపును పూర్తి చేయగానే ఈ కాంప్లిమెంటరీ పాస్ అన్లాక్ అవుతుంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'కాలిన్సన్' భాగస్వామ్యంతో, 'లాంజ్కీ' సహకారంతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ పాస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 800 పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని 1,800కు పైగా లగ్జరీ ఎయిర్పోర్ట్ లాంజ్లను ఉపయోగించుకోవచ్చు.ఈ సందర్భంగా పైసాబజార్ సీఈఓ సంతోష్ అగర్వాల్ మాట్లాడుతూ ‘వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యం. క్రెడిట్ కార్డు వినియోగదారులు ఎక్కువగా కోరుకునేది ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్. సాధారణంగా కార్డులపై ఉండే ఖర్చుల పరిమితులు, విజిట్ల లెక్కింపులతో సంబంధం లేకుండా అపరిమిత యాక్సెస్ కల్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్! -
ఎల్అండ్టీ ఫైనాన్స్ ‘పసిడి పరుగులు’
డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఎల్అండ్టీ ఫైనాన్స్ మరింత విస్తారంగా బంగారు రుణాల విడుదలను చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఐదేళ్లపాటు.. ఏడాదికి కనీసం 500 చొప్పున బంగారు రుణ బ్రాంచీలను జత చేసుకోవాలని ప్రణాళికలు వేసింది. తద్వారా ఐదేళ్లలో 2,500–3,000కు బ్రాంచీలను పెంచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ హోల్టైమ్ డైరెక్టర్, సీవోవో రాజు దొడ్తి పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 343 గోల్డ్ లోన్ బ్రాంచీల నెట్వర్క్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ముగిసేలోగా 800కు చేరుకోగలమని భావిస్తున్నట్లు తెలియజేశారు.2025 జూన్లో చండీగఢ్ కంపెనీని సొంతం చేసుకోవడం ద్వారా 130 బ్రాంచీలతో గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. 2026 మార్చికల్లా వీటికి అదనంగా 200 బ్రాంచీలను జత చేసినట్లు తెలియజేశారు. రానున్న 4–5 ఏళ్లలో ప్రతీ ఏటా కనీసం 500 బ్రాంచీలను ఏర్పాటు చేయడం ద్వారా భారీ విస్తరణపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. వెరసి ఐదేళ్లలో 3,000 బంగారు రుణ బ్రాంచీల నెట్వర్క్ను సాధించాలని ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు. బంగారు రుణాలలో వృద్ధికి సుప్రసిద్ధ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో కొత్తగా మార్కెటింగ్ను ప్రారంభించిన సందర్భంగా రాజు కంపెనీ విస్తరణ ప్రణాళికలను వివరించారు. దేశం నలువైపులా.. తొలుత దేశ తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాలపై దృష్టి పెట్టిసాగుతున్నామని, తదుపరి ఉత్తరాదిలోనూ మరింత విస్తరించేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నట్లు రాజు వెల్లడించారు. అయితే విస్తరణలో ఒక ప్రాంతం తదుపరి మరో ప్రాంతంఅనికాకుండా వేగంగా దేశమంతటా కార్యకలాపాలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. గుజరాత్లో వార్షికంగా 50–60 బ్రాంచీలను తెరిచే వీలున్నట్లు పేర్కొన్నారు. 500 బ్రాంచీల ప్రణాళికలలో కనీసం 100 బ్రాంచీలను పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.2026 జూన్కల్లా కంపెనీ మొత్తం లోన్బుక్ రూ. 1.29 లక్షల కోట్లుకాగా.. గోల్డ్ ఫైనాన్స్ బుక్ విలువ రూ. 3,800 కోట్లను అధిగమించినట్లు వెల్లడించారు. బంగారు రుణ పోర్ట్ఫోలియో వార్షిక ప్రాతిపదికన ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో 182 శాతం జంప్చేసి రూ. 3,829 కోట్లకు చేరినట్లు తెలియజేశారు. గతేడాది(2025–26) ఇదే కాలంలో ఈ విలువ రూ. 1,360 కోట్లుగా నమోదైనట్లు ప్రస్తావించారు. లోన్బుక్ వార్షికంగా 20–25 శాతం పుంజుకోవచ్చని, అయితే బంగారు రుణాల్లో వృద్ధి మరింత అధికంగా 50 శాతం చొప్పున నమోదుకావచ్చని అంచనా వేశారు. -
అమెజాన్ కొలువుల ‘పండుగ’
న్యూఢిల్లీ: పండుగ సీజన్ డిమాండ్ కోసం ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ వ్యాపారం కోసం నెట్వర్క్వ్యాప్తంగా 1,60,000 పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వెల్లడించింది. వారణాసి, కొచ్చి, ఘాజియాబాద్, జలంధర్, రాంచీ, సేలం, గోరఖ్పూర్లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి భారీ మెట్రోల వరకు దేశవ్యాప్తంగా 400 నగరాల్లో ఈ మేరకు నియామకాలు చేసినట్లు పేర్కొంది. ఇప్పటికే పండుగ సీజన్ కోసం మెజారిటీ ఉద్యోగాలను తీసుకుని, వారికి శిక్షణ ప్రారంభించినట్లు వివరించింది. కొత్త అసోసియేట్స్ దేశవ్యాప్తంగా పికప్, ప్యాకింగ్, షిప్పింగ్, డెలివరీ తదితర విభాగాల్లో సేవలు అందించనున్నట్లు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) అభినవ్ సింగ్ తెలిపారు. సీజనల్ అసోసియేట్స్కి కూడా ఇతర ఉద్యోగుల తరహాలోనే భద్రత, సంక్షేమ ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు వివరించారు. సాధారణంగా ఈ అసోసియేట్స్లో కొందరు పండుగ సీజన్ ముగిశాక కూడా తమ సంస్థలోనే కొనసాగుతుంటారని, మిగతావారు మళ్లీ ఏడాది తర్వాత తిరిగి చేరుతుంటారని ఆయన చెప్పారు. ఈ–కామర్స్ జోరు.. సాధారణంగా పండుగ సీజన్లో భారీ కొనుగోళ్ల కారణంగా ఈ–కామర్స్, క్విక్ కామర్స్కి గణనీయంగా డిమాండ్ ఉంటుంది. ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, గిఫ్టింగ్, నిత్యావసరాలు, గృహోపకరణాలు మొదలైన వాటి కొనుగోళ్లు పెరుగుతాయి. సౌలభ్యానికి పండుగ ఆఫర్లు కూడా తోడు కావడంతో గత కొన్నేళ్లుగా ఆన్లైన్ ఆర్డర్లు గణనీయంగా ఉంటున్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా ఈ–కామర్స్ ప్లాట్ఫాంలు దీనితో లబ్ధి పొందుతుండగా, ప్రస్తుతం క్విక్ కామర్స్ సంస్థలు కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. పండుగ సీజన్ సందర్భంగా తమ సెల్లర్, లాజిస్టిక్స్ వ్యవస్థవ్యాప్తంగా 10 లక్షల పైచిలుకు సీజనల్ ఉద్యోగావకాశాలు రానున్నట్లు ఈ–కామర్స్ మార్కెట్ప్లేస్ మీషో ఇటీవల వెల్లడించింది. విక్రేతల నెట్వర్క్లో దాదాపు 6.5 లక్షలు, లాజిస్టిక్స్లో సుమారు 3.75 లక్షల వరకు నియామకాలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దాదాపు 1.3 లక్షల మంది విక్రేతలు.. ప్యాకేజింగ్, తయారీ, వేర్హౌసింగ్, నిల్వల నిర్వహణ మొదలైన అవసరాల కోసం సీజనల్ వర్కర్లను పెద్ద ఎత్తున నియమించుకోవచ్చనే అంచనాలు ఉన్నట్లు మీషే తెలిపింది. -
నో ఫుడ్, నో మనీ : కట్ చేస్తే కంపెనీ సీఈవోగా
Abhishek Agarwal Success story ముంబైకి చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు అభిషేక్ అగర్వాల్ జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనుభవించిన కష్టాల గురించి పంచుకున్న వివరాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ప్రతీ మనిషి జీవితంలో కష్టాలు అనుభవించి తీరాలనీ, కడుపు మాడే కష్టాల్లోంచే ఎదగాలనే కసి పుట్టుకొస్తుందని, జీవితంలో అట్టడుగు స్థాయికి పడిపోయినప్పుడు మాత్రమే ఒక రకమైన ధైర్యం వస్తుందన్న ఆయన వ్యాఖ్యలు పలువుర్ని ఆలోచింప చేస్తున్నాయి.అభిషేక్ అగర్వాల్ లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆయన 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వరుసగా 7 రోజుల పాటు కనీసం తినడానికి తిండికి డబ్బులు లేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో కేవలం బ్రెడ్ తింటూ, నీళ్లు తాగుతూ పొట్ట నింపుకున్న వైనాన్నిగురించి వివరించారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితిని ఎదుర్కోవాల్ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ డబ్బుల్లేకపోవడం అంటే సరదాగా టూర్లకు వెళ్లకపోవడం లేదా షాపింగ్ చేయకపోవడం కాదనీ కనీసతినడానికి కూడా డబ్బులు లేని పేదరికమని స్పష్టం చేశారు.కాలే కడుపు నేర్పిన పాఠంఆ 7 రోజుల ఆకలి కంటే, ఆ సమయంలో కలిగిన 'నిస్సహాయత' తన మనసుపై తీవ్రమైన ముద్ర వేసిందని చెప్పారు. ఒకప్పుడు అత్యంత కష్టకాలంగా భావించిన ఆ రోజులు, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, జీవితం పట్ల తన దృక్పథాన్ని తీర్చిదిద్దిన అనుభవాలలో ఒకటిగా మారాయన్నారు. అయితే జీవితంలో అత్యంత దిగువ స్థాయికి పడిపోయినా, తాను దానిని తట్టుకుని బ్రతకగలననే నమ్మకం, ధైర్యం తనకు ఆ సందర్భంలోనే పుట్టిందన్నారు.ఇదీ చదవండి: ఎర్రకోట పేలుడుకు నిధులిచ్చారంటూ రూ. 30 లక్షలు దోచేశారుఅంతేకాదు ఆ అనుభవం ఇచ్చిన ధైర్యమే ఆ తర్వాత వ్యాపారంలో ఎదురైన నష్టాలు, రిస్కులు, ఓటములను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసిందని తెలిపారు. అయితే, కష్టాల నుండి స్థైర్యాన్ని నేర్చుకోవడానికి, పేదరికాన్ని ఆదర్శంగా భావించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఆయన వివరించారు.పేదరికాన్ని లేదా బాధలను గొప్పగా చూపించడం తన ఉద్దేశం కాదని, కానీ జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లను తట్టుకునే శక్తి మనకు ఉందనే విషయం అట్టడుగుకి పడిపోయినప్పుడే తెలుస్తుందని వివరించారు.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్సాగుతో నెలకు రూ. 4 లక్షలునెటిజన్ల స్పందనఅగర్వాల్ పోస్ట్పై అనేకమంది నెటిజన్లు స్పందించారు. గొప్ప పోస్ట్. కొన్నిసార్లు అత్యంత కఠినమైన క్షణాలు, విజయం ఎప్పటికీ నేర్పలేని ఒక విషయాన్ని మనకు నేర్పిస్తాయి: మనం అనుకున్నదానికంటే చాలా ఎక్కువ తట్టుకోగలమని ఒకరు, తమ జీవితాల్లో కూడా ఇలాంటి కష్ట సమయాలను ఎదుర్కొన్నామని, ఆ రోజులు ఇచ్చిన ధైర్యమే తమను ఇప్పుడు ఏ సమస్యనైనా ఎదుర్కొనేలా చేస్తోందని మరొకరు కామెంట్స్ చేశారు.'దివాలా' అనే పదానికి నిర్వచనాన్ని స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు అంటూ మరికొందరు ఫన్నీగా స్పందించారు.ఇదీ చదవండి: సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ దిశ కేసు : సీబీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు -
‘ఆమె’ అప్పు పెంచింది!
భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన 2026 జూన్ త్రైమాసిక నివేదిక ప్రకారం, బ్యాంకు రుణాలను పొందడంలో మహిళలు ముందుంజలో ఉన్నారు. జూన్ 2026 నాటికి మహిళా రుణగ్రహీతలకు బ్యాంకులు అందించిన అప్పు గత ఏడాదితో పోలిస్తే 19.7 శాతం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. గతేడాది జూన్లో ఈ వృద్ధి 12.9 శాతంగా ఉండగా ఈసారి గణనీయంగా పుంజుకోవడం విశేషం.రుణ రంగంలో సమగ్ర పురోగతిఆర్బీఐ గణాంకాల ప్రకారం, దేశంలో మొత్తం బ్యాంక్ రుణ వృద్ధి 16.5 శాతంగా నమోదు కాగా, మహిళా రుణగ్రహీతల వృద్ధి రేటు (19.7%) అంతకంటే అధికంగా ఉండటం గమనార్హం. వడ్డీ రేట్లు తగ్గడం కూడా రుణాలు పెరగడానికి ప్రధాన కారణమైంది. బ్యాంకుల బకాయి రుణాలపై సగటు వడ్డీ రేటు గతేడాది 9.71 శాతం నుంచి 9.26 శాతానికి దిగివచ్చింది. 9 శాతం కంటే తక్కువ వడ్డీకే లభించే రుణాల వాటా 54.1 శాతం నుంచి ఏకంగా 64.1 శాతానికి చేరింది.గ్రామీణ, చిన్న పట్టణాల ఆధిపత్యంమెట్రో నగరాల కంటే కూడా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రుణాల డిమాండ్ వేగంగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 21.1% వృద్ధి, అర్బన్/సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 21.4% నుంచి 21.6% వృద్ధి, మెట్రోపాలిటన్ నగరాల్లో 13.1% వృద్ధి నమోదైంది. ఈ గణాంకాలు కేవలం సాధారణ వ్యక్తిగత రుణాలకు మాత్రమే పరిమితం కాకుండా మహిళలు స్వయం ఉపాధి, వ్యాపార వేత్తలుగా నిలదొక్కుకోవడానికి నిధి సదుపాయాలను వినియోగించుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి. వర్కింగ్ క్యాపిటల్ రుణాలు 18 శాతం చొప్పున పెరగడం దేశీయ ఆర్థిక రంగంలో స్థిరమైన పురోగతికి సంకేతం.ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ! -
వోడాఫోన్ ఐడియా బ్రాండ్ ప్రచారకర్తగా షారూఖ్ ఖాన్
రుణ సంక్షోభంతో సతమతమవుతున్న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కొత్త బ్రాండ్ ప్రచారానికి బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ను తీసుకుంది. ‘వీఐ మారుతోంది.. సిద్ధంగా ఉండండి’ అనే పేరుతో త్వరలో ప్రారంభించనున్న ప్రచారానికి ఆయన ప్రాతినిధ్యం వ్యవహరించనున్నట్లు కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.కొత్త బ్రాండ్ రూపంలో భాగంగా వీఐ తన లోగోలోనూ మార్పులు చేసింది. ఇంతకుముందు ‘ఐ’ కింద ఉన్న పసుపు చుక్కను ఇప్పుడు పైకి మార్చి, గోళాకారంలో తీర్చిదిద్దింది. ‘‘ఇది కేవలం లోగోలో మార్పు మాత్రమే కాదు. వీఐ బ్రాండ్లో తీసుకొస్తున్న పరిణామానికి ఇది తొలి సంకేతం. టెలికం సేవల ద్వారా వినియోగదారుల జీవితాలను మరింత ఆహ్లాదకరంగా, అవకాశాలతో నింపాలన్న మా ఆశయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది’’ అని వీఐ సీఈవో అభిజిత్ కిశోర్ తెలిపారు.ఇదీ చదవండి: కుప్పకూలిన బంగారు కొండ! -
ఐస్క్రీమ్ మార్కెట్లోకి రిలయన్స్
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ అనుబంధ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్(ఆర్సీపీఎల్) దేశీ ఐస్క్రీమ్ మార్కెట్లోకి ప్రవేశించింది. బాంబే క్రీమరీ బ్రాండుతో ప్రొడక్టులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కంపెనీకున్న పంపిణీ మౌలికసదుపాయాలు, రిటైల్ షాపులు, వినియోగదారులు ఇందుకు మద్దతివ్వనున్నట్లు ఆర్సీపీఎల్ తెలియజేసింది. బాంబే క్రీమరీ ప్రొడక్టులను వాస్తవిక డెయిరీ క్రీమ్తో రూపొందిస్తున్నట్లు ఆర్సీపీఎల్ పేర్కొంది. బాంబే క్రీమరీ ప్రొడక్టుల ద్వారా అందుబాటు ధరలలో అసలైన ఐస్క్రీమ్ రుచిని అందించనున్నట్లు ఆర్సీపీఎల్ డైరెక్టర్ టి.కృష్ణకుమార్ తెలియజేశారు.రూ.10 ప్రారంభ ధరతో కోన్లు, కప్పులతోపాటు.. టబ్స్, స్టిక్స్, బార్స్ విక్రయించనున్నట్లు వివరించారు. తొలుత పశ్చిమ భారత్లో అమ్మకాలు ప్రారంభించి తదు పరి దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. 2025కల్లా దేశీ ఐస్క్రీమ్ మార్కెట్ విలువను సుమారు రూ. 31,276 కోట్లుగా మదింపు చేశారు. ఐబీఈఎఫ్ నివేదిక ప్రకారం 2034కల్లా సగటున 11–14 శాతం వార్షిక వృద్ధితో రూ. 63,941 కోట్లను తాకగలదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.దేశీ ఐస్క్రీమ్ మార్కెట్లో 40% వాటాతో అముల్ అగ్రభాగాన నిలుస్తుంటే.. యూనిలీవర్ సంస్థ క్వాలిటీ వాల్స్, వడీలాల్ తదుపరి ర్యాంకును ఆక్రమించాయి. ఈ బాటలో హ్యావ్మోర్, మదర్ డెయిరీ ప్రొడక్టులు సైతం 9–6 % మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. ప్రీమియం ధరల విభాగంలో క్రీమ్ బెల్, నేచురల్స్, బస్కిన్ రాబిన్స్ పోటీ పడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: బెర్త్ బుక్ చేసినా.. పడుకోకూడదు! -
ఏయే పథకాలకు డిమాండ్ ఉందంటే..
ఆర్థిక ప్రగతి, ఆదాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికాంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో బీమా వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి తెలిపారు. ప్రొటెక్షన్, సేవింగ్స్, రిటైర్మెంట్ పథకాలకు డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు ఉన్నట్లు చెప్పారు. ఇవే ఎల్ఐసీ తదుపరి దశ వృద్ధి అధ్యాయాన్ని లిఖిస్తాయని కంపెనీ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన తెలిపారు. పార్లమెంటు చట్టం ద్వారా 1956 సెప్టెంబర్ 1న ఎల్ఐసీ ఏర్పాటైంది. 70 ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఘనత ఉన్నంత మాత్రాన సవాళ్లు లేకుండా పోవని దొరైస్వామి పేర్కొన్నారు.ప్రజలకు నేడు మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంటున్నాయని, టెక్నాలజీ కారణంగా ఆకాంక్షల్లోనూ మార్పులు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా యువ కస్టమర్లు.. బీమా అనేది సరళతరమైనదిగా, తమ తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా, తక్షణం అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా తనను తాను మల్చుకునేందుకు ఎల్ఐసీ కృషి చేస్తోందని .. ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోని, టెక్నాలజీని, పంపిణీ విధానాలను మెరుగుపర్చుకుంటోందని చెప్పారు. రూ. 5 కోట్లతో ప్రారంభమై..ఏడు దశాబ్దాల క్రితం రూ. 5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్ఐసీ నేడు ఆర్థిక దిగ్గజంగా ఎదిగిందని దొరైస్వామి చెప్పారు. ఈ విజయాన్ని రూపాయల్లో కొలవలేమని, దీనికి ప్రజల నమ్మకమే సరైన కొలమానమని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక ఒడిదుడుకులు పెరుగుతున్న తరుణంలో పాలసీదారులకు పోటీ సంస్థలతో పోలిస్తే దీటైన ప్రయోజనాలు అందించేలా తమ ఫండ్స్పై రాబడులను పెంచుకునేందుకు అసెట్ మేనేజ్మెంట్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నట్లు దొరైస్వామి వివరించారు. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం ఆదాయం ర. 5,35,984 కోట్లకు చేరగా, లాభం రికార్డు స్థాయిలో రూ. 57,419 కోట్లకు ఎగియడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. రెండు కొత్త పథకాలు ..70వ వార్షికోత్సవం సందర్భంగా దొరైస్వామి రెండు కొత్త పథకాలను ఆవిష్కరించారు. బీమా ప్లాటినం, జీవన్ రక్షా పాలసీలు వీటిలో ఉన్నాయి. బీమా ప్లాటినం అనేది పొదుపు, ప్రొటెక్షన్ మేళవింపుగా ఉంటుంది. ఇది పరిమిత ప్రీమియం ప్లాన్. వార్షికంగా చెల్లించే ప్రతి రూ. 1,000కి రూ. 70 జతవుతుంది. ప్రస్తుత ఎల్ఐసీ పాలసీదారులు, మరణించిన పాలసీదారుల నామినీలు/లబ్ధిదారులకు రిబేటు లభిస్తుంది. ఇక జీవన్ రక్ష అనేది ప్యూర్ రిస్క్ ప్లాన్గా ఉంటుంది. కనిష్ట, గరిష్ట సమ్ అష్యూర్డ్లు వరుసగా రూ.5 లక్షలు, రూ.24 లక్షలుగా ఉంటాయి.ఇదీ చదవండి: బెర్త్ బుక్ చేసినా.. పడుకోకూడదు! -
బెర్త్ బుక్ చేసినా.. పడుకోకూడదు!
రైలు ప్రయాణంలో మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్ ప్రయాణికుల నడుమ వివాదాలు రావడం సర్వసాధారణం. ఇటీవల సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ఒక రైలులో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. సురేష్ అనే ప్రయాణికుడు లోయర్ బెర్త్ బుక్ చేసుకోగా, రమేష్ అనే వ్యక్తి మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమేష్ తన మిడిల్ బెర్త్ను ఓపెన్ చేసి పడుకుంటానని పట్టుబట్టగా లోయర్ బెర్త్లో కూర్చోవాలనుకున్న సురేష్ దానికి నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి టీటీఈ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ రైల్వే నిబంధనలు స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తున్నాయి.రైల్వే నిబంధనలు - వేళలురాత్రి పూట 10:00 నుంచి ఉదయం 6:00 వరకు నిద్రపోయే వేళగా రైల్వే వర్గీకరించింది. ఈ సమయంలో మిడిల్ బెర్త్ ప్రయాణికుడు తన బెర్త్ను తెరచి పడుకునే పూర్తి హక్కు కలిగి ఉంటాడు.పగటి పూట అంటే ఉదయం 6:00 నుంచి రాత్రి 10:00 వరకు సీటింగ్ (కూర్చోవడానికి) కోసం కేటాయించారు. ఈ సమయంలో మిడిల్ బెర్త్ను తప్పనిసరిగా కిందకు దించి ఉంచాలి (ఫోల్డ్ చేయాలి). మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ ప్రయాణికులు లోయర్ బెర్త్పై కూర్చోవడానికి అవకాశం ఇవ్వాలి.పైన పేర్కొన్న ఉదాహరణలో మధ్యాహ్నం 2 గంటలకు మిడిల్ బెర్త్ తెరవాలని రమేష్ కోరడం రైల్వే నిబంధనలకు విరుద్ధం. సురేష్ ఆ సమయంలో లోయర్ బెర్త్పై కూర్చునే హక్కు కలిగి ఉంటాడు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మిడిల్ బెర్త్ ప్రయాణికుడు పడుకోవాలని భావిస్తే అది లోయర్ బెర్త్ ప్రయాణికుడి పరస్పర అంగీకారంతో మాత్రమే జరగాలి.అలాగే, గర్భిణులు, వయోవృద్ధులు లేదా అనారోగ్యంతో ఉన్న ప్రయాణికులకు అనధికారికంగా సీట్లు సర్దుబాటు చేసుకోవడంలో తోటి ప్రయాణికులు మానవత్వంతో సహకరించాలని రైల్వే కోరుతోంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే టీటీఈ దృష్టికి తీసుకెళ్తే ఆయన నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరిస్తారు. ప్రయాణికులు ఈ ప్రాథమిక నిబంధనలు తెలుసుకోవడం వల్ల అనవసర గొడవలను నివారించి సుఖవంతమైన ప్రయాణాన్ని సాగించవచ్చు.ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
ఉద్యోగుల్లో టెన్షన్! కారణం ఇదేనా?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న విప్లవాత్మక మార్పులు ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతకు కారణమవుతున్నాయి. ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త లేఆఫ్స్ విడతలో ప్రపంచ వ్యాప్తంగా 7,000 నుంచి 10,000 మంది వరకు ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇందులో భారత్లోని ఇంజినీరింగ్, క్లౌడ్ సేవల విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది టెక్కీలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.తగ్గిన ఉద్యోగులుసరికొత్త క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి బిలియన్ల కొద్దీ డాలర్లను తరలిస్తున్న ఒరాకిల్, ఇతర విభాగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గడిచిన ఏడాది కాలంలోనే కంపెనీ తన గ్లోబల్ హెడ్కౌంట్ను 1,62,000 నుంచి 1,41,000కి (సుమారు 21,000 ఉద్యోగాలు) తగ్గించుకుంది.ఏఐ ప్రభావమే..కంపెనీ వార్షిక నివేదికలో సైతం ‘ఏఐ సాంకేతికత వినియోగం కారణంగా భవిష్యత్తులో ఉద్యోగుల తగ్గింపులు కొనసాగవచ్చు’ అని ఒరాకిల్ స్పష్టం చేయడం గమనార్హం. డేటా సెంటర్ల విస్తరణ, ఏఐ టెక్నాలజీ పోటీలో నిలదొక్కుకోవడానికి భారీ పెట్టుబడులు పెడుతున్న కంపెనీ, అందుకు అయ్యే వ్యయాన్ని భర్తీ చేయడానికి ఈ తొలగింపులను సాధనంగా వాడుతోంది. భారతదేశంలోని క్లౌడ్, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 2,000 నుంచి 3,000 మంది టెక్కీలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.అతి త్వరలో నిర్ణయంఈ సెప్టెంబర్ నెలలోనే (ముఖ్యంగా సెప్టెంబర్ 15 నాటికి) ఈ నిర్ణయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 11న వెలువడనున్న కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వేళ ఈ తొలగింపుల ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. తీవ్ర వ్యయ నియంత్రణల దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడం, సాంప్రదాయ ఐటీ సేవల స్థానంలో ఏఐ వేగంగా వస్తుండటంతో భారతీయ టెక్ రంగానికి రాబోయే రోజుల్లో సవాళ్లు తప్పవని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: సెప్టెంబర్లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. -
కమిట్ అయితే.. పిప్పి పిండి చేస్తారు!
కార్పొరేట్ ప్రపంచంలో పదోన్నతి, భారీ వేతన పెంపుల కోసం ఉద్యోగులు నిత్యం శ్రమిస్తుంటారు. ఏటా 10-15 శాతం వేతన పెంపు కోసమే కంపెనీలు మారే సంస్కృతి పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో బెంగళూరుకు చెందిన ఒక ఐటీ నిపుణుడు తీసుకున్న నిర్ణయం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏడాదికి ఇప్పటికే రూ.45 లక్షల ప్యాకేజీ పొందుతున్న 31 ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ కంపెనీ ఆఫర్ చేసిన మరో రూ.20 లక్షల అదనపు వేతన పెంపును (మొత్తం రూ.65 లక్షల ప్యాకేజీ) నిరాకరించాడు.‘యు-ఎబిలిటీ’(UAbility) వ్యవస్థాపకుడు రోహన్ ధావన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు టెకీకి లభించిన పదోన్నతితో బాధ్యతలు, పని ఒత్తిడి రెట్టింపు కానున్నాయి. వారంలో నాలుగు రోజులు రాత్రి వేళల్లో అమెరికా బృందాలతో సమావేశాలు, నిరంతర ప్రయాణాలు, ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు బృందాన్ని పర్యవేక్షించడం వంటి కఠినమైన షరతులు ఆ ఆఫర్లో ఉన్నాయి. చివరకు వారాంతపు సెలవుల్లో కూడా పని చేయాల్సి వస్తుంది.వచ్చే ఏడాది పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న ఆ నిపుణుడు మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, కుటుంబ జీవితానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పాడు. వారానికి ఐదు రోజులు వ్యాయామం, తల్లిదండ్రులతో గడిపే సమయం ఈ ఒత్తిడి వల్ల కోల్పోవాల్సి వస్తుందని ఆఫర్ను తిరస్కరించాడు.ఈ నిర్ణయం అతడి తండ్రిని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ‘రూ.20 లక్షల భారీ అదనపు ఆదాయాన్ని ఎవరు వదులుకుంటారు?’ అని ఆయన ప్రశ్నించారు. అయితే, సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మాత్రం ఈ నిర్ణయానికి విశేష మద్దతు లభించింది. ఒక పరిమితి దాటిన తర్వాత లభించే అదనపు ఆదాయం కంపెనీల జేబుల నుంచి కాదు, ఉద్యోగి వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం నుంచే వస్తుందనే నిజం ఈ ఘటనతో మరోసారి రుజువైందని కొందరు చెబుతున్నారు. ఆర్థిక ప్రయోజనాల కంటే జీవన నాణ్యత, మానసిక ఆరోగ్యానికే ఆధునిక యువత ప్రాధాన్యం ఇస్తోందని ఈ ఘటన చెబుతోంది.ఇదీ చదవండి: 600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు! -
600 దరఖాస్తులు.. 10 ఇంటర్వ్యూలు!
కంపెనీలలో లేఆఫ్ల పర్వం కొనసాగుతున్న తరుణంలో ఐటీ, కార్పొరేట్ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతకు రెడిట్లోని ఒక అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజర్ అనుభవం నిదర్శనంగా నిలిచింది. ఉద్యోగం కోల్పోయిన అనంతరం 600కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే కేవలం 10 కంపెనీల నుంచే తిరిగి స్పందన వచ్చిందని అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటన గ్లోబల్ టెక్ ఇండస్ట్రీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను అద్దం పడుతోంది. అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్స్ కూడా నెలల తరబడి నిరుద్యోగులుగా మిగిలిపోవడానికి ప్రధాన కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.రిక్రూట్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్స్ (ఏటీఎస్) వినియోగం పెరగడంతో వేలాది రెజ్యూమెలను సాఫ్ట్వేర్లే తిరస్కరిస్తున్నాయి. కంపెనీలు బ్రాండ్ ఇమేజ్ కోసం నిజమైన ఖాళీలు లేకపోయినా ఉద్యోగ ప్రకటనలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. లేఆఫ్ల వల్ల సీనియర్ మేనేజర్లు కూడా తక్కువ స్థాయి ఉద్యోగాలకు పోటీ పడుతుండటంతో 1-3 ఏళ్ల అనుభవం ఉన్న యువత తీవ్రంగా నష్టపోతోంది. గ్లోబల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడుతున్నారు.మార్కెట్ సవాళ్లుమాంద్యం భయాలు, కంపెనీల వ్యయ నియంత్రణల మధ్య ఉద్యోగ నియామకాల వేగం గణనీయంగా తగ్గింది. కొన్ని నివేదికల ప్రకారం ఒకప్పుడు ప్రతి 10 దరఖాస్తులకు ఒక కాల్ వస్తే, ఇప్పుడు అది ప్రతి 100 దరఖాస్తులకు ఒకటిగా పడిపోయింది. మాస్ అప్లికేషన్ల (బల్క్ దరఖాస్తులు) కంటే నిర్దిష్ట నెట్వర్కింగ్, రెఫరల్స్ సాధించడం, లోకల్/హైబ్రిడ్ ఉద్యోగాలపై దృష్టి పెట్టడం, ఏఐ టూల్స్ సహాయంతో రెజ్యూమెను నిరంతరం అప్డేట్ చేసుకోవడమే ప్రస్తుత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: మెస్సీ సంపద చూస్తే మతి పోవాల్సిందే! -
కరూర్ వైశ్యా బ్యాంక్ కీలక నిర్ణయం!
రిటైల్, వ్యవసాయ, ఎంఎస్ఎంఈ (ఆర్ఏఎం) రుణాల విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ ఎండీ, సీఈవో రమేష్ బాబు వెల్లడించారు. కార్పొరేట్ రుణాల విషయంలో మాత్రం ఆచితూచి ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ లోన్ పోర్ట్ఫోలియోలో ఆర్ఏఎం వాటా దాదాపు 86 శాతంగా, కార్పొరేట్ రుణాల వాటా సుమారు 14 శాతంగా ఉన్నట్లు చెప్పారు.సోమవారం అయిదు రాష్ట్రాలవ్యాప్తంగా ఒకే రోజున 16 శాఖలను ప్రారంభించిన సందర్భంగా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. వ్యవసాయ రుణాల్లో దాదాపు 90 శాతం గోల్డ్ లోన్స్ రూపంలోనే ఉండటం వల్ల, ఎల్నినోపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పోర్ట్ఫోలియోకు సమస్య ఉండబోదని రమేష్ బాబు చెప్పారు. కార్యకలాపాల విస్తరణ దన్నుతో ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమకు మించి రుణ వృద్ధిని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.కార్పొరేట్ రంగం క్రమంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటం వల్ల చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కూడా ఊతం లభిస్తోందని, ఫలితంగా ఆ విభాగంలో రుణాలకు డిమాండ్ పెరుగుతోందని రమేష్ బాబు వివరించారు. ఇటీవలి కాలంలో మార్కెట్ వైపు మళ్లుతున్న కస్టమర్లను, బ్యాంకింగ్ వైపు ఆకర్షించే దిశగా మ్యూచువల్ ఫండ్స్పై రుణాల్లాంటి వినూత్న సొల్యూషన్స్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. స్టార్టప్ల కోసం త్వరలో ప్రత్యేక పథకం ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ.. కొత్తగా ప్రారంభించిన శాఖల్లో 5 ఆంధ్రప్రదేశ్లో, 3 తెలంగాణలో ఉన్నట్లు రమేష్ బాబు చెప్పారు. దేశవ్యాప్తంగా బ్రాంచీల సంఖ్య 919కి చేరగా, ఏడాది వ్యవధిలో దీన్ని 1,000కి పెంచుకోనున్నట్లు వివరించారు. తాము ప్రతి మూడు, నాలుగేళ్ల వ్యవధిలో రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపార వృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. 2026 జూన్ 30 నాటికి బ్యాంకు మొత్తం వ్యాపారం రూ. 2,27,267 కోట్లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే తెలంగాణలో మొత్తం 66 శాఖలు, రూ. 23,000 కోట్ల వ్యాపారం, ఆంధ్రప్రదేశ్లో 154 శాఖలు రూ. 24,600 కోట్ల మేర వ్యాపారం ఉంది. -
NCLT సంచలన నిర్ణయం.. రూ.22 వేల కోట్లకు రూ.6.25 కోట్లేనా?
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర.. వ్యక్తిగత దివాలా కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆగస్టు 25న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఇచ్చిన ఆదేశం ప్రకారం.. బ్యాంకులకు, రుణ సంస్థలకు బకాయి ఉన్న రూ.22,006.57 కోట్ల మేర రుణాలకు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకోవడానికి అవకాశం లభించింది. కానీ.. తాజాగా ఆ నిర్ణయాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన స్పెషల్ ఎన్సీఎల్టీ బెంచ్ తాత్కాలికంగా నిలిపివేసింది. కేసు తేలే వరకు చంద్ర తన ఆస్తులను అమ్మడం లేదా ఇతరులకు బదిలీ చేయకూడదని ఆదేశించింది.నిజానికి సుభాష్ చంద్ర చెల్లించాల్సిన మొత్తం క్లెయిమ్లు రూ.22,006.57 కోట్లు. కానీ ఆయన ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్ ప్రకారం కేవలం రూ.6.25 కోట్లు మాత్రమే చెల్లించాలి. మొదట ఈ ప్లాన్ను ఇద్దరు సభ్యుల ఎన్సీఎల్టీ బెంచ్ పరిశీలించింది. అయితే ఇద్దరు సభ్యులు ఒకే అభిప్రాయానికి రాలేదు. ఒకరు ప్లాన్కు మద్దతు ఇచ్చిన రుణదాతలకు మాత్రమే దాన్ని వర్తింపజేయాలని భావించగా, మరొకరు ఈ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని చెబుతూ ప్లాన్ను తిరస్కరించారు. దీంతో కేసు మూడో సభ్యుడి వద్దకు వెళ్లింది.ఆగస్టు 25న మూడో సభ్యుడు సుభాష్ చంద్ర రీపేమెంట్ ప్లాన్కు ఆమోదం తెలిపారు. ఈ ప్లాన్కు వ్యతిరేకంగా ఓటు వేసిన రుణదాతలకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు. అయితే.. ఆ తర్వాత కేసు మళ్లీ మొదటి బెంచ్ వద్దకు వచ్చినప్పుడు ముగ్గురు సభ్యుల అభిప్రాయాల్లో స్పష్టమైన మెజారిటీ లేదని తేలింది. దీంతో ఎన్సీఎల్టీ అధ్యక్షుడు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ప్రత్యేక బెంచ్ కేసును మరోసారి పూర్తిగా పరిశీలించనుంది.నిజానికి రూ.22,006.57 కోట్ల మొత్తం, హామీదారుగా ఉన్న చంద్ర వ్యక్తిగత దివాలా ప్రక్రియలోని క్లెయిమ్లకు సంబంధించినది. అయితే తాను బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి వ్యక్తిగతంగా అప్పు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎస్సెల్ గ్రూప్కు చెందిన కంపెనీలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు కూడా ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నట్లు వెల్లడించారు.సుభాష్ చంద్ర హామీదారుగా ఉన్న కంపెనీలు తీసుకున్న రుణాలను చెప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో తనపైన వ్యక్తిగత దివాలా కేసులో రూ.22,006.57 కోట్ల క్లెయిమ్లు నమోదయ్యాయని అన్నారు. అయితే ప్రస్తుతం ఆగస్టు 25న ఇచ్చిన రూ.6.25 కోట్ల రీపేమెంట్ ప్లాన్ ఆమోదం నిలిచిపోయింది.అంటే.. సుభాష్ చంద్ర రూ.6.25 కోట్లు చెల్లించి కేసు ముగించుకోవడానికి కుదరదు. స్పెషల్ ఎన్సీఎల్టీ బెంచ్ అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకు చంద్ర తన ఆస్తులను నేరుగా లేదా పరోక్షంగా బదిలీ చేయకూడదు. మొత్తానికి.. రూ.22 వేల కోట్ల క్లెయిమ్లకు కేవలం రూ.6.25 కోట్లతో పరిష్కారం దొరుకుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఎన్సీఎల్టీ తీసుకునే తరువాత నిర్ణయం మీద ఆధారపడి ఉంది. -
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
సెప్టెంబర్ 1 నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు మాత్రమే కాకుండా.. విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరలు పెరిగాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వంటి వ్యాపారాల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలపై కూడా ఇంధన భారం పెరగనుంది.19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.9.50 పెంచారు. దీంతో రూ.2,738గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,747.50కి చేరింది. 5 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.2 పెరిగి రూ.764కి చేరింది. గత రెండు నెలల్లో కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ పెరగడం గమనార్హం. ఆగస్టు 1న రూ.192, జూలై 1న రూ.183.50 చొప్పున ధరలు తగ్గాయి.ఇక విమాన ఇంధనం ధర కూడా భారీగా పెరిగింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.6.28 పెరిగి రూ.121.28కి చేరింది. అంటే దాదాపు 5.46 శాతం పెంపు జరిగింది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ATFకు పెద్ద వాటా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొత్తం ఆపరేటింగ్ ఖర్చుల్లో ఇది 40 శాతం వరకు ఉండొచ్చు. కాబట్టి ఇంధన ధర పెరగడం వల్ల విమాన సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.అయితే సాధారణ ప్రజలు వంటకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇది రూ.942 వద్దనే ఉంది.పెట్రోల్, డీజిల్ ధరలలో కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. కమర్షియల్ ఎల్పీజీ, ఏటీఎఫ్ ధరలను సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లోని ధరలు, విదేశీ మారకపు విలువ వంటి అంశాలను బట్టి సవరించుతారు. రాష్ట్రాలను బట్టి స్థానిక పన్నుల కారణంగా ధరల్లో కొంత తేడా ఉండొచ్చు. -
CEOగా చివరి రోజు.. టిమ్ కుక్ భావోద్వేగం!
టెక్ దిగ్గజం యాపిల్కు సుమారు 15 సంవత్సరాలు సీఈఓగా నాయకత్వం వహించిన టిమ్ కుక్ (Tim Cook) ఇప్పుడు ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తన చివరి రోజు సందర్భంగా.. ఉద్యోగులకు ఆయన ఒక భావోద్వేగమైన సందేశం పంపారు.ఇంతకాలం తనకు ఇచ్చిన సహకారం, ప్రేమ, మద్దతుకు ఉద్యోగులందరికీ టిమ్ కుక్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరినీ ఒక అద్భుతమైన టీమ్గా ఆయన ప్రశంసించారు. సీఈఓగా తన విజయానికి తాను మాత్రమే కారణం కాదని, తనతో కలిసి పనిచేసిన ఉద్యోగుల వల్లే అది సాధ్యమైందని చెప్పారు. యాపిల్ సంస్కృతిని గురించి కూడా ప్రస్తావిస్తూ.. స్టీవ్ జాబ్స్కు నివాళులర్పించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సీఈఓ జాన్ టెర్నస్కు స్వాగతం పలికారు.2011లో సీఈఓగా బాధ్యతలుకుక్ 2011 నుంచి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. యాపిల్ సహ వ్యవస్థాపకుడు జాబ్స్ మరణించడానికి కేవలం కొన్ని వారాల ముందు ఆయన సంస్థ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అనేక విజయాలు సాధిస్తూ.. సంస్థను అభివృద్ధి చేశారు. ఈయన సారథ్యంలో అనేక కొత్త ఉత్పత్తులు లాంచ్ అయ్యాయి.అయితే.. టిమ్ కుక్ యాపిల్ కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగడం లేదు. ఆయన సీఈఓ పదవి నుంచి మాత్రమే తప్పుకుంటున్నారు. కానీ కంపెనీలో మరో కొత్త బాధ్యతలో కొనసాగనున్నారు. సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టనున్నారు.ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తులను తయారు చేయడంలో జాన్ టెర్నస్కు మంచి అనుభవం, సామర్థ్యం ఉందని కుక్ ప్రశంసించారు. తన తర్వాత సంస్థను చాలా బాగా నడిపిస్తారని ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.టిమ్ కుక్ సందేశంయాపిల్ కంపెనీ నేడు ఈ స్థాయికి చేరుకుందంటే.. అది కేవలం ఒక వ్యక్తి వల్ల రాలేదని, మొత్తం టీమ్ కలిసి పనిచేయడం వల్లే వచ్చిందని కుక్ చెప్పారు. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం, కష్టాల్లో సహాయం చేసుకోవడం, చేసే పనిపై బాధ్యతతో ఉండటం యాపిల్ సంస్కృతిలో ముఖ్యమైన భాగాలని వివరించారు. యాపిల్ ద్వారా ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రతి ఉద్యోగికి అవకాశం ఉందని, ఆ అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దని ఆయన సూచించారు. -
సెమీకాన్ 2.0 వచ్చేసింది!
న్యూఢిల్లీ: దేశీయంగా సెమీకండక్టర్ల డిజైన్, తయారీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సోమవారం రూ.1,27,500 కోట్లతో సెమీకాన్ 2.0 ప్రోగ్రాంను నోటిఫై చేసింది. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ) జారీ చేసిన నోటిఫికేషన్లో ఆరు మూల స్తంభాలు, 10 కేటగిరీలను పొందుపర్చారు. చిప్ డిజైన్, సెమీకండక్టర్ పరికరాలు, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలు, నిపుణులను తయారు చేసుకోవడమనే ఆరు కీలకాంశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో దాదాపు పది శాతం మార్కెట్ వాటాను భారత్ దక్కించుకుంటుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ పరికరాలు, కెమికల్..గ్యాస్ తయారీ సంస్థల నుంచి ’సూపర్ స్పందన’ వచి్చందని చెప్పారు. సెమీకాన్ 2.0 ప్రోగ్రాం అనేది దేశీయంగా ఈ వ్యవస్థ మరింతగా వేళ్లూనుకునేందుకు దోహదపడుతుందన్నారు. తొలి విడత స్కీమును ప్రకటించిన తర్వాత ఈ పరిశ్రమలోని రిసు్కలపై అభిప్రాయాలు మారిపోయాయని, అనిశ్చితి తొలగి సెమీకండక్టర్ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటూ ఉండటమనేది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోందని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ పేర్కొన్నారు. ఏఐ బూమ్తో అధునాతన చిప్స్, మెమొరీలకు అసాధారణ డిమాండ్ ఏర్పడటం, అంతర్జాతీయంగా సెమీకండక్టర్లు కీలక వనరుగా మారడం లాంటి పరిస్థితుల్లో చిప్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు, స్టారప్లను ప్రోత్సహించేందుకు కేంద్రం తాజా ప్రోగ్రాంను ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2026 జూలై 15న ఈ స్కీమును క్యాబినెట్ ఆమోదించగా, సోమవారం నోటిఫికేషన్లో దీని తీరుతెన్నులు, అర్హతా ప్రమాణాలను పొందుపర్చారు. ఈ స్కీము కింద రూ. 50 కోట్ల నుంచి రూ. 20,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్తో చేపట్టే చిప్ తయారీ, అసెంబ్లీ ప్లాంట్ల పెట్టుబడి వ్యయాల్లో 25–40 శాతం వరకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుంది. అధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నిర్వహించే ప్రాజెక్టులకు అత్యధికంగా 75 శాతం వరకు మద్దతు లభిస్తుంది. రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఊతం: ఐఈఎస్ఏ తాజా స్కీము వచ్చే ఐదేళ్లలో సెమీకండక్టర్ వ్యవస్థలో రూ. 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఊతమిస్తుందని పరిశ్రమ సమాఖ్య ఐఈఎస్ఏ తెలిపింది. వచ్చే ఏడేళ్ల వ్యవధిలో 5–7 చిప్ తయారీ యూనిట్లు (వేఫర్ ఫ్యాబ్లు) భారత్లో రాగలవని పేర్కొంది. స్కీము కాలవ్యవధిలో రూ. 2 లక్షల కోట్లపైగా విలువ చేసే సెమీకండక్టర్ల ఉత్పత్తికి తోడ్పడేలా రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా స్కీము ఉందని మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థల సమాఖ్య ఐసీఈఏ తెలిపింది.సెమీకాన్ 2.0 కొన్ని విశేషాలు.. → స్కీములో పేర్కొన్న ఆరు మూల స్తంభాల్లో డిజైన్కి తొలి ప్రాధాన్యం ఉంటుంది. దీని కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే సంస్థలు భారతీయుల యాజమాన్యంలో ఉంటూ, భారత్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించేవై ఉండాలి. ప్రోడక్ట్ డిజైన్ ఆధారిత ప్రోత్సాహకాల కింద స్టార్టప్లు, చిన్న సంస్థలు (ఎంఎస్ఎంఈలు) రూ. 15 కోట్ల వరకు లేదా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం సీడ్ ఫండింగ్ పొందవచ్చు. → వినియోగానికి సంబంధించి డిప్లాయ్మెంట్ ఆధారిత ప్రోత్సాహకం కింద, కొత్తగా విక్రయాలు మొదలైన చిప్లు, ఎస్వోసీల నికర అమ్మకాలపై ఐదేళ్ల పాటు 9 శాతం రీయింబర్స్మెంట్ లభిస్తుంది. ఒక్కో ప్రోడక్టు దరఖాస్తుకు గరిష్టంగా గరిష్టంగా రూ. 30 కోట్లు, ఒక్కో కంపెనీకి గరిష్టంగా రూ. 120 కోట్ల పరిమితి వర్తిస్తుంది. → సిలికాన్ సెమీకండక్టర్ వేఫర్ ఫ్యాబ్లకు సంబంధించి, కనీస పెట్టుబడి ప్రమాణం రూ. 20,000 కోట్లు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఏదైనా ఒక సంవత్సరంలో కనీసం రూ. 7,500 కోట్ల ఆదాయం కలిగి ఉండాలి. అర్హత కలిగిన ఫ్యాబ్ యూనిట్లకి నెలకు కనీసం 40,000 వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యాలు, టెక్నాలజీ లైసెన్సు ఉండాలి. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాల్లో దాదాపు సగభాగానికి సమానంగా రాష్ట్రాలు కూడా తోడ్పాటు అందిస్తున్నందున.. ఈ తరహా ఫ్యాబ్రికేషన్ సంస్థలకు అందించే ఆర్థిక మద్దతును 40 శాతానికి కేంద్రం తగ్గించింది. గత స్కీములో ఇది 50 శాతంగా ఉండేది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇచ్చేది కలిపితే సుమారు 60 శాతం ప్రభుత్వ మద్దతు లభించినట్లవుతుంది. → కాంపౌండ్ సెమీకండక్టర్లు, ఫొటానిక్స్ మొదలైన ఫ్యాబ్రికేషన్ యూనిట్లకు 35 శాతం మేర ఆర్థిక మద్దతు లభిస్తుంది. దీనికి కనీస పెట్టుబడి పరిమాణం రూ. 500 కోట్లుగా, ఆదాయం రూ. 200 కోట్లుగా నిర్దేశించారు. → డిస్ప్లే ఫ్యాబ్లకు కూడా 35 శాతం మద్దతు లభిస్తుంది. టెక్నాలజీని బట్టి పెట్టుబడి పరిమితులు మారతాయి. ఓఎల్ఈడీ, ఎల్సీడీ ఫ్యాబ్లకు కనీసం రూ. 10,000 కోట్ల పెట్టుబడి, రూ. 5,000 కోట్ల ఆదాయం అర్హతా ప్రమాణాలుగా ఉంటాయి. మైక్రో ఎల్ఈడీ ప్రాజెక్టులకు కనీసం రూ. 1,500 కోట్ల పెట్టుబడి, రూ. 600 కోట్ల ఆదాయం ఉండాలి. -
సీఈఓగా టిమ్ కుక్కు నేడే చివరి రోజు!
యాపిల్లో చాలా ఏళ్ల తర్వాత కీలకమైన నాయకత్వ మార్పు జరగబోతోంది. 2011 నుంచి కంపెనీ సీఈఓగా ఉన్న టిమ్ కుక్ సెప్టెంబర్ 1 నుంచి సీఈఓ పదవి నుంచి తప్పుకుని, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతారు. కొత్త సీఈఓగా యాపిల్ హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టనున్నారు.టిమ్ కుక్ తరువాత బాధ్యతలుసీఈఓగా రోజువారీ వ్యవహారాల నుంచి టిమ్ కుక్ తప్పుకున్నప్పటికీ.. యాపిల్లో ఆయన పాత్ర పూర్తిగా ముగియదు. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం, వైట్ హౌస్, చైనా ప్రభుత్వంతో కంపెనీకి ఉన్న సంబంధాల విషయంలో ఆయన కీలకంగా కొనసాగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం యాపిల్ వాణిజ్య విధానాలు, ప్రభుత్వ నిబంధనలు, సరఫరా వ్యవస్థ వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో కుక్ అనుభవం కంపెనీకి తప్పకుండా ఉపయోగపడుతుంది.ఎవరీ జాన్ టెర్నస్?జాన్ టెర్నస్ గత 20 ఏళ్లకు పైగా యాపిల్లో పనిచేస్తున్నారు. 2021 నుంచి హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఐఫోన్ సహా యాపిల్కు చెందిన పలు కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారు. టిమ్ కుక్ కూడా టెర్నస్ను మంచి ఇంజినీర్, ఆలోచనాపరుడిగా ప్రశంసించారు. అందుకే.. ఆయన నియామకంతో యాపిల్లో ప్రొడక్ట్ డిజైన్, హార్డ్వేర్, కొత్త ఆవిష్కరణలకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.టెర్నస్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. యాపిల్ ఉత్పత్తుల డిజైన్లో కొన్ని పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం యాపిల్ ముందున్న సవాళ్లు.. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, సప్లై చైన్ సమస్యలు, స్మార్ట్ఫోన్ మార్కెట్లో పోటీ. వీటిని ఎదుర్కొంటూనే కంపెనీ కొత్త ఉత్పత్తులు, కొత్త డిజైన్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: జొమాటో కీలక నిర్ణయం.. ఆ వంటకాలపై నిషేధం! -
జొమాటో కీలక నిర్ణయం.. ఆ వంటకాలపై నిషేధం!
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో, నకిలీ పనీర్తో తయారు చేసినటువంటి అనలాగ్ పాల ఉత్పత్తులను తన ప్లాట్ఫామ్ నుంచి నిషేధించింది. అనలాగ్ పాల ఉత్పత్తులు కలిగిన వంటకాల అమ్మకాల పట్ల తాము జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సంస్థ తెలిపింది.సాధారణ పనీర్ పాలతో తయారవుతుంది. కానీ అనలాగ్ పనీర్ వెజిటబుల్ ఆయిల్స్, స్టార్చ్, ఎమల్సిఫయర్లు వంటి పదార్థాల ద్వారా తయారవుతుంది. అయితే బయటకు చూస్తే అసలైన పనీర్లాగే కనిపించినా, రెండింటి తయారీ విధానం మాత్రం వేరు.రెస్టారెంట్లకు కొత్త నిబంధనలురెస్టారెంట్లు ఇకపై అనలాగ్ డెయిరీ ఉత్పత్తులను ఉపయోగించే వంటకాలను జొమాటోలో ఉంచకూడదు. వీలైనంత త్వరగా సహజమైన పాల ఉత్పత్తులకు మారాలని కంపెనీ సూచించింది. అంతే కాకుండా.. రెస్టారెంట్లు తమ సప్లయర్ల నుంచి వచ్చే లేబుల్స్, ఇంగ్రిడియెంట్స్ను చెక్ చేసి, మెనూలో సరైన వివరాలు ఇవ్వాలని తెలిపింది. నిబంధనలు పాటించని రెస్టారెంట్లను ప్లాట్ఫామ్ నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.అమ్మకాలపై చర్యలుజొమాటో ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. కస్టమర్లకు తాము తింటున్న ఆహారం గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వడం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఫేక్ పనీర్ తయారీ, అమ్మకాలపై చర్యలు జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఈ అంశంపై నిఘా కూడా పెరిగింది.జొమాటో తీసుకున్న ఈ నిర్ణయంతో రెస్టారెంట్లు తమ ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. కస్టమర్లు కూడా తాము ఆర్డర్ చేస్తున్న వంటకంలో నిజంగా ఏ పదార్థాలు ఉపయోగిస్తున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ''కస్టమర్ తాను ఏం తింటున్నాడో అతనికి స్పష్టంగా తెలియాలి'' అనే ఉద్దేశంతో జొమాటో ఈ నిర్ణయం తీసుకుంది. -
HDFC బ్యాంక్కు కొత్త బాస్.. సీఈఓ జగదీశన్ కీలక నిర్ణయం!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ ఎండీ, సీఈఓ అయిన శశిధర్ జగదీషన్ తన పదవీకాలాన్ని కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన అక్టోబర్ 26న రిటైర్ కానున్నారు. కొత్త సీఈఓను ఎంపిక చేసే ప్రక్రియను బ్యాంక్ వేగవంతం చేసింది.శశిధర్ జగదీశన్ను కొనసాగించేందుకు బ్యాంక్ బోర్డు ప్రయత్నించినప్పటికీ.. ఆయన మాత్రం రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోలేదని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. బ్యాంక్ అభివృద్ధి, స్థిరత్వానికి ఆయన అందించిన సేవలను బోర్డు ప్రశంసించింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.జగదీశన్ 2020 అక్టోబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరు సంవత్సరాల పదవీకాలంలో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనంతో దేశంలోని అతిపెద్ద ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూపుల్లో ఒకటి ఏర్పడటాన్ని ఆయన పర్యవేక్షించారు. అంతకుముందు రెండు దశాబ్దాలకు పైగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో పనిచేసిన జగదీశన్.. సీఎఫ్ఓగా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.ఇక ఇటీవల రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు సంబంధించిన ఎంఎస్ఆర్డీసీ కేసులో జగదీశన్తో పాటు మరో ఇద్దరు సీనియర్ అధికారులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. అయితే ఆయన రిటైర్మెంట్ నిర్ణయానికి ఈ ఇదే కారణమా అనే విషయాన్ని.. బ్యాంక్ వెల్లడించలేదు. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివిన జగదీశన్.. చార్టర్డ్ అకౌంటెంట్తో పాటు యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్ నుంచి ఎకనామిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్లో మాస్టర్స్ చేశారు. బ్యాంకింగ్ రంగంతో పాటు వంట చేయడం, కర్ణాటక సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, సైక్లింగ్ చేయడం ఆయనకు ఇష్టమైన విషయాలు. -
ఖాతాదారులకు అలర్ట్.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్!
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లి కొన్ని పనులను పూర్తిచేసుకుని ఖాతాదారుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ప్రతి నెల, ప్రతి వారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. కాబట్టి బ్యాంకులకు వెళ్లి ఏదైనా పనులు చేయాలనుకునే వారు ఈ హాలిడేస్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.బ్యాంకు సెలవులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించే హాలిడే క్యాలెండర్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. అందుకే బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లే ముందు సెలవు ఉందో లేదో తెలుసుకుంటే సమయం వృథా కాకుండా ఉంటుంది.ఆగస్టు 30న బ్యాంకులకు సెలవుఆగస్టు 30న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. దీంతో ఆ రోజు బ్యాంకు బ్రాంచ్లు పనిచేయవు. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఏం వంటి డిజిటల్ సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి.సెప్టెంబర్ 4న జన్మాష్టమి సెలవుసెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్టక్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోల్కతా, లక్నో, పాట్నా, రాయ్పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే.. బ్యాంకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. కాబట్టి బ్రాంచ్కు వెళ్లే ముందు స్థానిక బ్యాంకు నుంచి సమాచారం తెలుసుకోవడం మంచిది.సెప్టెంబర్ 5న బ్యాంకులు పనిచేస్తాయిసెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉన్నప్పటికీ బ్యాంకులకు సెలవు లేదు. RBI హాలిడే క్యాలెండర్ ప్రకారం ఆ రోజు బ్యాంకులు సాధారణంగానే పనిచేస్తాయి. దీంతో ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను యథావిధిగా పూర్తి చేసుకోవచ్చు.ఈ తేదీల్లో బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయిఆగస్టు 31 సోమవారం, సెప్టెంబర్ 1 మంగళవారం, సెప్టెంబర్ 2 బుధవారం, సెప్టెంబర్ 3 గురువారం బ్యాంకులు సాధారణంగా పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఖాతాదారులు బ్యాంకు బ్రాంచ్లను సందర్శించి తమ పనులు పూర్తి చేసుకోవచ్చు.సెప్టెంబర్లో మొత్తం 14 రోజులు సెలవులుసెప్టెంబర్ నెలలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు మొత్తం 14 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి వంటి పండుగలతో పాటు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. ముందు చెప్పుకున్నట్లుగా.. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవుల సంఖ్య, తేదీల్లో మార్పులు ఉండొచ్చు. అందుకే బ్యాంకు బ్రాంచ్కు వెళ్లే ముందు సెలవు వివరాలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.ఇదీ చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్స్! -
ముంబైలో పాలు మరింత ప్రియం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త ధరలు
ముంబై నగరవాసులకు పాలు మరింత ప్రియం కానున్నాయి. స్థానిక పశువుల షెడ్లు, డెయిరీల నుంచి నేరుగా సరఫరా చేసే ‘టబెలా’ పాల టోకు ధరను పెంచాలని ముంబై మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (MMPA) నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి లీటర్ టోకు ధరను ప్రస్తుతం ఉన్న రూ.93 నుంచి రూ.102కు పెంచనుంది. అంటే లీటర్పై రూ.9 పెరుగుదల. ఈ ధరలు 2027 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటాయి.టోకు ధర పెరగడంతో వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సుమారు రూ.100కు లభిస్తున్న ఈ పాలు.. కొత్త ధరల అమలుతో రిటైల్ మార్కెట్లో లీటర్కు దాదాపు రూ.110 వరకు చేరొచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.ఎందుకు పెంచారంటే..పశువుల పెంపకం, పాల ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు భారీగా పెరగడమే ధరల సవరణకు ప్రధాన కారణమని అసోసియేషన్ వెల్లడించింది. పశుదాణాలో ఉపయోగించే ధాన్యాలు, చుని, శనగ చుని, మొక్కజొన్న, నూనెగింజల పిండి (ఆయిల్ కేక్స్), పచ్చి గడ్డి వంటి వాటి ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. కొన్ని దాణా పదార్థాల ధరలు ఏడాది వ్యవధిలో దాదాపు 25 శాతం వరకు పెరిగినట్లు అసోసియేషన్ పేర్కొంది. పశువుల నిర్వహణ, రవాణా తదితర ఖర్చులు కూడా పెరగడంతో పాత ధరలకు పాలు విక్రయించడం కష్టంగా మారిందని తెలిపింది.పండుగల వేళ మరింత భారంసెప్టెంబర్లో గణేశ్ చతుర్థి సహా పండుగల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు రావడం గమనార్హం. ఈ సమయంలో పాలు, పెరుగు, స్వీట్లు, లస్సీ, ఇతర పాల ఉత్పత్తులకు డిమాండ్ సాధారణంగా పెరుగుతుంది. దీంతో పాలు మాత్రమే కాకుండా పాల ఆధారిత ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. -
మన్మథుడు.. వ్యాపార జగత్తులోనూ ‘కింగ్’
తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసి ‘మన్మథుడు’గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అక్కినేని నాగార్జున కేవలం రంగుల ప్రపంచానికే పరిమితం కాలేదు. వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెట్టి ఏకంగా సుమారు రూ.3,000 కోట్లకు పైగా సంపదతో భారతదేశంలోనే ధనిక కథానాయకుల్లో ఒకరిగా నిలిచినట్లు కొన్ని సంస్థలు తెలియజేస్తున్నాయి. నాగార్జున హీరోగా, రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ‘కింగ్100’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈరోజు ‘బాస్’ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ను మూవీ టీం విడుదల చేసింది.అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి స్పోర్ట్స్ క్లబ్ వరకు..నటనతో పాటు పక్కా వ్యాపార వ్యూహాలతో అడుగులు వేశారు. ప్రతిష్టాత్మక ‘అన్నపూర్ణ స్టూడియోస్’, ఎన్ కన్వెన్షన్ వంటి వ్యాపారాలతో పాటు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ‘కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ’ ఫుట్బాల్ టీమ్ భాగస్వామ్యం ఆయనకు నిరంతరం ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. గతంలో ‘మాచ్ 1 రేసింగ్’ మోటార్ స్పోర్ట్స్ టీమ్లోనూ పెట్టుబడులు పెట్టారు. బిగ్ బాస్ వ్యాఖ్యాతగా, బ్రాండ్ అంబాసిడర్గా ఆయన బ్రాండ్ విలువ రోజురోజుకీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది.అబ్బురపరిచే ఆస్తులుహైదరాబాద్లోని జూబ్లీహిల్స్ వర్గాల్లో ఆకాశమే హద్దు అన్న రీతిలో నిర్మించిన సుమారు రూ.45 కోట్ల విలాసవంతమైన బంగ్లా నాగార్జున రాజసానికి నిదర్శనం. ఆయన వద్ద ఉన్న రేంజ్ రోవర్ వోగ్, పోర్షే కయాన్, బీఎమ్డబ్ల్యూ ఎం6, ఆడి ఏ7, టొయోటా వెల్ఫైర్ వంటి కార్ల కలక్షన్తో వాహన ప్రియులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. గతంలో ‘మా టీవీ’ నెట్వర్క్లో కీలక వాటాదారుగా ఉండి ఆ తర్వాత స్టార్ నెట్వర్క్కు విక్రయించడం ద్వారా గణనీయమైన లాభాలను గడించారు. ఇవి కాకుండా వివిధ బ్రాండులను ఎండార్స్ చేసినప్పుడు వచ్చే ఆదాయం అదనం.ఇదీ చదవండి: బంగారం కొంటున్నారా..? బిగ్ అలర్ట్ -
గెయిల్ భారీ విస్తరణ బాట
ప్రభుత్వ రంగ సంస్థ ‘గెయిల్ (ఇండియా) లిమిటెడ్’ సహజవాయువు పైప్లైన్ నెట్వర్క్ విస్తరణ, ఎల్ఎన్జీ సరఫరా వనరుల విభిన్నీకరణ, పెట్రోకెమికల్స్, ఎల్పీజీ మౌలిక వసతుల పెంపుతో పాటు స్వచ్ఛ ఇంధన (క్లీన్ ఎనర్జీ) సాంకేతికతల్లో భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం అత్యంత కీలకమని స్పష్టం చేసింది. గెయిల్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ దీపక్ గుప్తా మాట్లాడుతూ, ‘‘ఇంధన పరివర్తన ఎంత ముఖ్యమో, ఇంధన భద్రత కూడా అంతే కీలకం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి గుండా ఎల్ఎన్జీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు ప్రపంచ ఇంధన మార్కెట్లలోని బలహీనతలను బయటపెట్టాయి’’ అని పేర్కొన్నారు.తర్వలో 20 వేల కి.మీ పైప్లైన్ నెట్వర్క్ దేశంలోనే అతిపెద్ద సహజవాయువు రవాణా నెట్వర్క్ను నిర్వహిస్తున్న గెయిల్ పైప్లైన్ల మొత్తం పొడవు ఇప్పటికే 18,690 కి.మీ.లకు చేరిందని తెలిపారు. మరో 1,500 కి.మీ.ల పైప్లైన్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. అవి పూర్తయితే సంస్థ నెట్వర్క్ దాదాపు 20 వేల కి.మీ.లకు చేరుతుందని చెప్పారు. జామ్నగర్–లోని మధ్య ఉన్న 1,427 కి.మీ ఎల్పీజీ పైప్లైన్ సామర్థ్యాన్ని ఏడాదికి 32.5 లక్షల టన్నుల నుంచి 65 లక్షల టన్నులకి రెట్టింపు చేస్తున్నారు. దీనికి తోడు మొత్తం 1,775 కి.మీ.ల పొడవుతో మూడు కొత్త ఎల్పీజీ పైప్లైన్ల అభివృద్ధికి పీఎన్జీఆర్బీ అనుమతి ఇచ్చింది.భారీ పెట్రోకెమికల్ ప్రాజెక్టులు మహారాష్ట్రలోని ఉసార్లో ఏడాదికి 5 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్రొపేన్ డీహైడ్రోజనేషన్–పాలీప్రొపిలీన్ (పీడీహెచ్–పీపీ) ప్రాజెక్టును గెయిల్ అభివృద్ధి చేస్తోంది. దేశంలోనే తొలి పీడీహెచ్ ఆధారిత పాలీప్రొపిలీన్ కాంప్లెక్స్గా దీన్ని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుపై సుమారు రూ.11,256 కోట్ల పెట్టుబడి అంచనా. అలాగే పటా ప్లాంట్లో ఏడాదికి 60 వేల టన్నుల సామర్థ్యంతో కొత్త పాలీప్రొపిలీన్ యూనిట్ను ప్రారంభించారు. దీంతో ఆ కాంప్లెక్స్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 8.10 లక్షల టన్నుల నుంచి 8.70 లక్షల టన్నులకు పెరిగింది. మంగళూరులో ఏడాదికి 12.5 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్యూరిఫైడ్ టెరెఫ్తాలిక్ యాసిడ్ (పీటీఏ) ప్లాంట్ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి.ఎరువుల రంగంలోకి అడుగులుగ్యాస్ ఆధారిత ఎరువుల తయారీ రంగంలోనూ గెయిల్ అడుగుపెట్టనుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో రెండు ఎరువుల ప్లాంట్ల ఏర్పాటుకు సంస్థ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టులపై కలిపి సుమారు రూ.21,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సహజవాయువు వినియోగం పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి, దేశ ఆహార భద్రతకు తోడ్పాటు లభిస్తుందని గుప్తా తెలిపారు. ఎల్ఎన్జీ సరఫరా, రవాణా విస్తరణ గెయిల్ ఎల్ఎన్జీ సోర్సింగ్ పోర్ట్ఫోలియో ప్రస్తుతం ఏడాదికి 16.56 మిలియన్ టన్నులుగా ఉందని తెలిపారు. దీర్ఘకాలిక ఒప్పందాలతో పాటు మార్కెట్ ఆధారిత కొనుగోళ్లను సంస్థ చేపడుతోందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో గెయిల్ 132 ఎల్ఎన్జీ కార్గోలను దిగుమతి చేసుకుంది. వీటిలో ఏడు స్పాట్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినవని తెలిపారు. ఎల్ఎన్జీ రవాణా సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నట్లు చెప్పారు. దీర్ఘకాలిక చార్టర్ ఒప్పందాల కింద రెండు ఎల్ఎన్జీ నౌకలను వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం సంస్థకు ఎల్ఎన్జీ రవాణా కోసం గెయిల్ వద్ద 9 భారీ షిప్మెంట్ నౌకలు అందుబాటులో ఉన్నాయి.దాభోల్లో ఏడాదంతా కార్యకలాపాలుబ్రేక్వాటర్ నిర్మాణం పూర్తికావడంతో దాభోల్ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏడాది పొడవునా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యాన్ని సాధించిందని గుప్తా తెలిపారు. వర్షాకాలంలోనూ తొలిసారి ఎల్ఎన్జీ కార్గోను స్వీకరించడంతో పాటు, ఈ టెర్మినల్ తన 1,000వ ఎల్ఎన్జీ కార్గోను కూడా అందుకున్నట్లు చెప్పారు. కొంకణ్ ఎల్ఎన్జీ లిమిటెడ్ను గెయిల్లో విలీనం చేసేందుకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.ఇదీ చదవండి: యూట్యూబ్తో అమెజాన్ చేతులు -
నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ
నేపాల్లో సంభవించిన వరదలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. భారత్కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ (ఐపీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లక్ష్మీనాథ్ గోపిశెట్టి(లక్ష్ గోపిశెట్టి) ఈ వరదల ధాటికి ఆచూకీ లేకుండా పోయారు. ఆయనతో సంప్రదింపులు తెగిపోవడంతో ప్రస్తుతం ఆయన జాడ కనిపించకుండా పోయిందని ఇన్ఫోసిస్ అధికారికంగా ధ్రువీకరించింది.గోపిశెట్టి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ ప్రాంతానికి వెళ్లినట్లు సంస్థ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఆయనను గుర్తించి సంప్రదించేందుకు స్థానిక యంత్రాంగం, సంబంధిత దౌత్య వర్గాలతో కలిసి శ్రమిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయన భద్రత, క్షేమానికే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్న ఇన్ఫోసిస్, గోపిశెట్టి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నట్లు తెలిపింది.అమెరికా, కెనడాల్లోని పబ్లిక్ సెక్టార్ రంగానికి ఐటీ మౌలిక వసతులు, డిజిటల్ సొల్యూషన్స్ అందించే ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ విభాగానికి గోపిశెట్టి నాయకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన యాక్సెంచర్, ఐబీఎమ్, హెచ్సీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పదవులు నిర్వహించారు.ఇదీ చదవండి: యూట్యూబ్తో అమెజాన్ చేతులు -
రూ.8.86 లక్షల కోట్లకు చేరిన జీవిత బీమా రంగం
భారతీయ జీవిత బీమా రంగానికి గత ఆర్థిక సంవత్సరం (2024-25) కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కాలంలో బీమా పరిశ్రమ మొత్తం రూ.8.86 లక్షల కోట్ల ప్రీమియం వసూలు చేసి మునుపటి ఏడాదితో పోలిస్తే 6.73 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. అయితే, వ్యాపార పరిమాణంలో ఈ తరహా పురోగతి కనిపించినప్పటికీ దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో బీమా శాతం మాత్రం 2.7 శాతానికి తగ్గడం గమనార్హం. ఇది కేవలం ప్రీమియం కలెక్షన్లు పెరిగినంత మాత్రాన బీమా రక్షణ సమగ్రంగా విస్తరించినట్లు కాదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.ఆకర్షణీయమైన పాలసీ బెనిఫిట్స్, డిజిటల్ సౌలభ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ క్లెయిమ్ల చెల్లింపు సమయమే బీమా సంస్థలకు అసలైన పరీక్షగా మారుతుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దూరమైనప్పుడు తక్షణ ఆర్థిక సంక్షోభం రాకుండా కాపాడటమే బీమా ముఖ్య ఉద్దేశం. అందువల్ల క్లెయిమ్ల పరిష్కార నిష్పత్తి కేవలం ఒక గణాంకం కాదని, అది పాలసీదారుల నమ్మకానికి అసలైన కొలమానమని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ క్రమంలో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వరుసగా ఐదేళ్ల పాటు 99 శాతానికి పైగా వ్యక్తిగత డెత్ క్లెయిమ్ల పరిష్కార నిష్పత్తిని నమోదు చేస్తున్నట్లు కంపెనీ అధికారులు చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 99.34 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి 2025-26 నాటికి 99.80 శాతానికి మెరుగుపడిందని తెలిపారు. ఆ ఒక్క సంవత్సరంలోనే సంస్థ 20,529 క్లెయిమ్ల ద్వారా రూ.1,641 కోట్లను అందించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: యూట్యూబ్తో అమెజాన్ చేతులు -
ఎయిరిండియాకు మరో 1.5 బిలియన్ డాలర్లు కావాలి
న్యూఢిల్లీ: నష్టాల్లో కొనసాగుతున్న ఎయిరిండియా అదనపు మూలధనం కోసం సహ యజమానుల నుంచి టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ (ఎస్ఐఏ) నుంచి 1.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.14,000 కోట్లకుపైగా) నిధులను కోరాలని యోచిస్తోంది. ఈ వార్తలపై స్పందించిన సింగపూర్ ఎయిర్లైన్స్... ఎయిరిండియా నుంచి వచ్చే అదనపు మూలధన అభ్యర్థనలను తమ బోర్డు జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపింది. అదనపు నిధుల కేటాయింపు నిర్ణయం తీసుకునేటప్పుడు గ్రూప్ ఇతర పెట్టుబడి అవసరాలతో పాటు ఎయిరిండియా వ్యాపార వ్యూహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఎయిరిండియాలో ప్రస్తుతం సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా ఉంది.సింగపూర్ ఎంపీ అభ్యంతరంఎయిరిండియాకు అదనపు నిధులు సమకూర్చే అంశంపై సింగపూర్ పార్లమెంటు సభ్యుడు కెన్నెత్ టియాంగ్ బూన్ కియాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఎయిరిండియా నష్టాలను భరించడానికి సింగపూర్ పౌరులు బాధ్యులు కాదు. సింగపూర్ ఎయిర్లైన్స్లో సింగపూర్ ప్రభుత్వ సార్వ¿ౌమ సంపద నిధి (సావరిన్ వెల్త్ ఫండ్) ‘టెమాసెక్’కు ప్రధాన వాటా ఉంది. కావున, టెమాసెక్ నిధులను ఎయిరిండియా కోసం మళ్లించకూడదు.సింగపూర్ ఎయిర్లైన్స్ స్వతంత్రంగానే దీనిపై నిర్ణయం తీసుకోవాలి’’ అని ఆయన సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. ఈ అంశంపై సింగపూర్ రవాణా శాఖ మంత్రిని ప్రశ్నిస్తూ పార్లమెంటులో ప్రశ్న కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. ఆ ప్రశ్న సెపె్టంబర్ 8న జరిగే సింగపూర్ పార్లమెంట్ సమావేశంలో చర్చకు రానుంది. అయితే, అదనపు నిధుల అవసరం, సింగపూర్ ఎంపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎయిరిండియా నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.పునరుద్ధరణకు అయిదు నుంచి పదేళ్లుఎయిరిండియా పునరుద్ధరణ ప్రక్రియకు అయిదు నుంచి పదేళ్లు సమయంపట్టవచ్చని టాటా సన్స్ చైర్మన్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇటీవల పేర్కొన్నారు. పాత వ్యవస్థలు, సంస్థాగత సంస్కృతి, విమానాల సముదాయాన్ని ఆధునికీకరించడంతో పాటు భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన విమానయాన నిపుణులను తీర్చిదిద్దాల్సి ఉందని చెప్పారు. ఎయిర్స్పేస్ ఆంక్షలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన ఇంధన ధరలు, విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు వంటి అంశాలు ఎయిరిండియా పునరుద్ధరణ ప్రయాణానికి సవాళ్లుగా మారాయని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా నష్టాలు 3.56 బిలియన్ సింగపూర్ డాలర్లకు చేరాయి. ఇది మే 14 నాటి మారకం విలువ ప్రకారం రూ.26,700 కోట్లకుపైగా ఉంది. ఎయిరిండియా నష్టాలు సింగపూర్ ఎయిర్లైన్స్ గ్రూప్ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపాయి. అలాగే, విస్తారా విలీనంతో గత ఏడాది ఒకసారి నమోదైన అకౌంటింగ్ లాభం ఈసారి లేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. దీంతో గ్రూప్ నికర లాభం 57 శాతం తగ్గి 1.184 బిలియన్ సింగపూర్ డాలర్లకు చేరింది. -
‘ఓయో’ ఆదాయం జంప్.. నాలుగు రెట్లు లాభం
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న ఆతిథ్య రంగ కంపెనీ ప్రిజమ్ గత ఆర్థిక సంవత్సర(2025–26) ఫలితాలను విడుదల చేసింది. అంతక్రితం ఏడాది(2024–25)తో పోలిస్తే కన్సాలిడేటెడ్ ఆదాయం 50 శాతం జంప్చేసి రూ. 9,358 కోట్లను తాకింది. ఓయో బ్రాండుతో ఆతిథ్య రంగ సేవలందించే కంపెనీ నికర లాభం మరింత అధికంగా నాలుగు రెట్లు ఎగసి రూ. 994 కోట్లకు చేరింది.నిర్వహణ లాభం(ఇబిటా) రెట్టింపై రూ. 2,594 కోట్లను తాకింది. 2025–26లో రూ. 245 కోట్ల నికర లాభంమాత్రమే ప్రకటించింది. అయితే గతేడాది నికర లాభాల్లో రూ. 678 కోట్లమేర పన్ను లాభం(డిఫర్డ్ ట్యాక్స్) కలసి ఉంది. కాగా.. రుణాలపై రూ. 1,414 కోట్ల వడ్డీ చెల్లించినట్లు వార్షిక నివేదిక పేర్కొంది.వెరసి ఐపీవో నిధులను కంపెనీ ప్రధానంగా రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు సెబీకి జూన్లో దాఖలు చేసిన అప్డేటెడ్ ప్రాస్పెక్టస్లో వెల్లడించింది. కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 6,650 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. -
రైల్వే కొత్త రూల్.. ఇక రూ.1,000 ఫైన్!
దేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణించే రైళ్లలో ఎక్కువ మందికి ఏదైనా అసౌకర్యం ఉందంటే అది అపరిశుభ్రతే. ఈ దురవస్థను కాస్తయినా తగ్గించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారాలు, రైళ్లలో చెత్త వేయడం, ఉమ్మడం వంటి పనులు చేసేవారిని కట్టడి చేసేందుకు పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించే వారికి విధించే జరిమానాను ఏకంగా రెట్టింపు చేసింది. ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.500గా ఉన్న జరిమానాను రూ.1,000కు పెంచుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.కొత్త నిబంధనల ప్రకారం రైల్వే ప్రాంగణాలు, ప్లాట్ఫారాలు లేదా రైలు బోగీల్లో నిర్దేశిత ప్రదేశాలు మినహా ఎక్కడపడితే అక్కడ చెత్తను విసరడం, పడేయడం లేదా వదిలిపెట్టడం నిషేధం. ఇలాంటి ఉల్లంఘనలకు రూ.1,000 జరిమానా విధించవచ్చు. కేవలం చెత్త వేయడమే కాదు.. రైల్వే ప్రాంగణాల్లో పరిశుభ్రతకు భంగం కలిగించే మరికొన్ని చర్యలపైనా నిబంధనలు వర్తిస్తాయి.చెత్త వేయడమే కాదు.. వీటిపైనా నిఘానిబంధనల ప్రకారం.. రైల్వే ప్రాంగణాల్లో అనుమతించిన సదుపాయాలు మినహా వంట చేయడం, స్నానం చేయడం, ఉమ్మివేయడం, మూత్ర విసర్జన, మలవిసర్జన, జంతువులు లేదా పక్షులకు ఆహారం వేయడం వంటి చర్యలు కూడా నిషేధం. అలాగే వాహనాలు, పాత్రలు, లేదా ఇతర వస్తువులను కడగడం, బట్టలు ఉతకడం, రైల్వే ప్రాంగణంలో వస్తువులను నిల్వ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే.అదేవిధంగా, రైల్వే అధికారుల అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, రైలు బోగీలు లేదా రైల్వే ఆస్తులపై రాయడం, గీయడం, వాటిని ధ్వంసం చేయడం కూడా చర్యలకు దారితీయవచ్చు. 2012లో రూపొందించిన ఈ నిబంధనల్లో గతంలో గరిష్ఠ జరిమానా రూ.500గా ఉండేది. తాజా సవరణతో ఆ మొత్తాన్ని రూ.1,000కు పెంచారు.ఫైన్ కట్టకపోతే ఏం జరుగుతుంది?కొత్త నిబంధనల్లో మరో కీలక అంశం ఉంది. విధించిన రూ.1,000 జరిమానాను చెల్లించకపోతే, సంబంధిత వ్యక్తిని అధికార పరిధి ఉన్న కోర్టు ముందు హాజరుపరచవచ్చు. అక్కడ రూ.2,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.జరిమానా ఎవరు వసూలు చేస్తారు?నిబంధనల ప్రకారం స్టేషన్ మాస్టర్ లేదా స్టేషన్ మేనేజర్, కమర్షియల్ విభాగానికి చెందిన టికెట్ కలెక్టర్ స్థాయి లేదా అంతకంటే పైస్థాయి అధికారులు, ఆపరేటింగ్ విభాగంలో సమాన హోదా కలిగిన అధికారులు, అలాగే రైల్వే పరిపాలన ప్రత్యేకంగా అధికారం ఇచ్చిన ఇతర అధికారులు జరిమానా వసూలు చేయవచ్చు.ఇదీ చదవండి: రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్ -
యూట్యూబ్తో అమెజాన్ చేతులు
డిజిటల్ కంటెంట్ క్రియేషన్ రంగంలో మరో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్ఫారమ్ యూట్యూబ్, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పరస్పర భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. యూట్యూబ్ షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్లో భాగంలో అమెజాన్ను అనుసంధానించడం ద్వారా అమెరికాలోని ఎంపిక చేసిన క్రియేటర్లకు బంపర్ ఆఫర్ దక్కింది.ఇకపై క్రియేటర్లు తమ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్, లైవ్స్ట్రీమ్ల్లో అమెజాన్ ఉత్పత్తులను నేరుగా టాగ్ చేయవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో ఎక్స్టర్నల్ లింక్లు వెతుక్కునే పనిలేకుండా వీక్షకులు స్క్రీన్పై ఉన్న ‘షాపింగ్’ బటన్ క్లిక్ చేసి నేరుగా అమెజాన్లో కొనుగోలు చేయవచ్చు. తద్వారా జరిగే అమ్మకాలపై క్రియేటర్లు మరింత కమిషన్ పొందుతారు.ఈ సౌలభ్యం పొందేందుకు క్రియేటర్లు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్తో పాటు అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ లేదా అసోసియేట్స్ ప్రోగ్రామ్లో సభ్యులై ఉండాలి. అంతేకాకుండా తమ యూట్యూబ్ ఛానెల్ను అమెజాన్ అకౌంట్తో లింక్ చేయాల్సి ఉంటుంది. వీడియోలలో ప్రోడక్ట్ టాగింగ్తో పాటు యూట్యూబ్ ఆటో-టాగింగ్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. క్రియోటర్ల రాబడి గణాంకాలు ‘యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్’లో నమోదుకాగా, ఫైనల్ అయిన కమిషన్లు నేరుగా యాడ్సెన్స్ ఖాతా ద్వారా జమ అవుతాయి.సాధారణ ప్రకటనల రాబడిపై మాత్రమే ఆధారపడకుండా కంటెంట్ ద్వారా వాణిజ్యాన్ని విస్తరించే దిశగా ఈ నిర్ణయం కీలక పరిణామం. టిక్టాక్ షాప్ వంటి ప్లాట్ఫారమ్ల పోటీని తట్టుకునేందుకు యూట్యూబ్ వేసిన ఈ వ్యూహాత్మక అడుగు గ్లోబల్ ఈ-కామర్స్ స్వరూపాన్నే మార్చనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విధానం భారతదేశం సహా ఇతర దేశాలకు విస్తరించే అవకాశముంది.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు! -
‘షార్క్ ట్యాంక్’ తరహా సిరీస్ చేయాలి
టోక్యో: భారత్–జపాన్ అంకుర సంస్థలను అనుసంధానం చేసేందుకు ’షార్క్ ట్యాంక్’ తరహా సిరీస్ను చేయొచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుుష్ గోయల్ తెలిపారు. తద్వారా ఇరు దేశాల స్టార్టప్లను ఇన్వెస్టర్లు, వ్యాపార భాగస్వాములతో కలిపేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.డిజిటల్ కనెక్టివిటీని ఉపయోగించుకుని ఇలాంటి సెషన్లను వర్చువల్గా ఏర్పాటు చేయొచ్చని స్టార్టప్లతో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో మంత్రి వివరించారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్య అవకాశాలను దక్కించుకునేందుకు వీటి ద్వారా భారత్, జపాన్ స్టార్టప్లు ఇరు దేశాల ఇన్వెస్టర్లకు తమ ఐడియాలను వివరించవచ్చని చెప్పారు. తద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలు కూడా మరింత బలోపేతమవుతాయని తెలిపారు.భారత్తో కలిసి పని చేయాలంటూ జపాన్ వ్యాపార సంస్థలు, స్టార్టప్లను మంత్రి ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం బలోపేతం అయితే సమగ్రాభివృద్ధికి విస్తృత అవకాశాలు లభిస్తాయని గోయల్ చెప్పారు. అలాగే, యూనివర్సిటీలు, ఇన్క్యుబేటర్లు, వెంచర్ ఫండ్స్ మధ్య కూడా పరస్పర సహకారం మరింత పెరగాలని పేర్కొన్నారు. -
రూ. 7,600 కోట్ల ఐపీవోకు అవాడా ఎలక్ట్రో రెడీ
న్యూఢిల్లీ: సోలార్ తయారీ కంపెనీ అవాడా ఎలక్ట్రో లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను సిద్ధం చేసింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా వీటిని దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ రూ. 7,600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఐపీవోలో భాగంగా రూ. 1,600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది.మరో రూ. 6,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ అవాడా వెంచర్ విక్రయానికి ఉంచనుంది. పీఈ దిగ్గజం బ్రూక్ఫీల్డ్కు పెట్టుబడులున్న అవాడా గ్రూప్ ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,200 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కంపెనీ తొలుత 2025 అక్టోబర్లో గోప్యతా మార్గంలో ఐపీవోకు దరఖాస్తు చేసింది. 2026 ఏప్రిల్లో అనుమతి పొందింది. కంపెనీ వివరాలివీ 2021లో ఏర్పాటైన అవాడా ఎలక్ట్రో ప్రధానంగా సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీని చేపడుతోంది. వీటిని ఎన్ల్యూమ్, ఇంటెగ్లో బ్రాండ్లతో వీటిని మార్కెటింగ్ చేస్తోంది. 2026 జూలై31కల్లా కంపెనీ 8.5 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ నిర్వహణా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా మరో 3 గిగావాట్ల నిర్వహణా టాప్కాన్ సోలార్ సెల్ తయారీని సైతం చేపడుతోంది. 2027–28కల్లా సోలార్ మాడ్యూల్ సామర్థ్యాన్ని 13.6 గిగావాట్లకు, సోలార్ సెల్ సామరŠాధ్యన్ని 12 గిగావాట్లకు పెంచుకునే యోచనలో ఉంది.ఈ బాటలో 3 గిగావాట్ల ఇన్గాట్, వేఫర్ సామర్థ్యాలను అందుకోవాలని భావిస్తోంది. తద్వారా సమీకృత తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కు తెరతీసే లక్ష్యంతో ఉంది. వీటితోపాటు అవాడా హాలో బ్రాండుతో ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్లు అందించే ప్రణాళికల్లో ఉంది. ఈపీసీ, ఓఅండ్ఎం కార్యకలాపాలలోకి సైతం ప్రవేశించాలని చూస్తోంది.యూపీలోని దాద్రిలో, మహారాష్ట్రలోని నాగ్పూర్లో తయారీ యూనిట్లను నిర్వహిస్తోంది. గతేడాది(2025–26) ఆదాయం రూ. 5,304 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 889 కోట్లను తాకింది. ఏడాది కాలంలోనే కంపెనీ మాడ్యూల్ సామర్థ్యం 1.5 గిగావాట్ల నుంచి 8.5 గిగావాట్లకు జంప్చేయగా.. ఆర్డర్బుక్ 7 రెట్లు ఎగసి 2,555 మెగావాట్ల నుంచి 19,106 మెగావాట్లకు చేరింది. -
రూ.22 వేల కోట్ల అప్పులు.. రూ.6.5 కోట్లతో చెల్లు!
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎస్సెల్ గ్రూప్ మాజీ అధినేత సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు, రుణ సంస్థలకు బకాయి ఉన్న రూ.22,006.57 కోట్ల మేర రుణాలకు బదులుగా కేవలం రూ.6.5 కోట్లు చెల్లించి పరిష్కరించుకునే రీపేమెంట్ ప్లాన్ను ట్రిబ్యునల్ ఆమోదించింది. దీంతో రుణదాతలు దాదాపు 99.97 శాతం నష్టపోవాల్సి వస్తోంది. అంటే క్లెయిమ్ చేసిన ప్రతి రూ.100కు సుమారు 3 పైసలు మాత్రమే తిరిగి వచ్చే పరిస్థితి.అందరూ ఒప్పుకొన్నారు కానీ..సుభాష్ చంద్ర ప్రతిపాదించిన రీపేమెంట్ ప్లాన్కు 2024 నవంబర్లో జరిగిన రుణదాతల ఓటింగ్లో 80.814 శాతం ఓటింగ్ షేర్ మద్దతు లభించింది. అయితే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర సంస్థలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. వ్యతిరేకించిన రుణదాతల ఓటింగ్ వాటా మాత్రం 20 శాతం కంటే తక్కువగా ఉంది.ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్కు ఎంత రావాలి?ఈ వ్యవహారంలో అత్యంత నష్టపోతోంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. ఈ సంస్థకు సుమారు రూ.1,322.39 కోట్ల ఆమోదిత క్లెయిమ్ ఉండగా, రీపేమెంట్ ప్లాన్ ప్రకారం దానికి అందేది కేవలం రూ.38.09 లక్షలు మాత్రమే. అంటే దాని క్లెయిమ్లో దాదాపు 0.028 శాతం మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రతిపాదనను సంస్ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తీవ్రంగా వ్యతిరేకించింది.ప్లాన్ను ఎన్సీఎల్టీ ఎందుకు ఆమోదించింది?ఈ కేసులో మొదటి ఇద్దరు ఎన్సీఎల్టీ సభ్యుల మధ్య విభేదాలు రావడంతో విషయం మూడో సభ్యుడు నీలేశ్ శర్మ వద్దకు వెళ్లింది. ఆయన ఐబీసీలోని సెక్షన్ 114 కింద రీపేమెంట్ ప్లాన్కు ఆమోదం తెలిపారు. రుణదాతలు మెజారిటీతో తీసుకున్న వాణిజ్య నిర్ణయాన్ని, అది చట్టపరమైన నిబంధనల పరిధిలో ఉన్నంత వరకు, ట్రిబ్యునల్ తన సొంత అంచనాతో భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.ట్రిబ్యునల్ పరిశీలనలో మరో కీలక అంశం సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తుల విలువ. రీపేమెంట్ ప్లాన్లో ప్రతిపాదించిన మొత్తంతో పోలిస్తే ఆయన ఆస్తుల నుంచి వచ్చే రికవరీ పరిమితంగానే ఉంటుందని ఎన్సీఎల్టీ పేర్కొంది. ప్లాన్ను తిరస్కరించి చంద్రను దివాలా ప్రక్రియలోకి నెట్టడం వల్ల రుణదాతలకు మరింత తక్కువ మొత్తమే దక్కే అవకాశం ఉందని కూడా ట్రిబ్యునల్ అభిప్రాయపడింది.నాకు మాత్రం అన్యాయం: విజయ్ మాల్యాసుభాష్ చంద్ర రుణాల రీపేమెంట్ ప్లాన్కు ఎన్సీఎల్టీ ఆమోదం వార్తలపై వ్యాపారవేత్త విజయ్ మాల్యా స్పందించారు. అదే నిజమైతే సుభాష్ చంద్రకు అభినందనలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసి.. దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా.. రూ.6203 కోట్ల బకాయిలకు గానూ బ్యాంకులు, ప్రభుత్వం తన దగ్గర నుంచి 14,100 కోట్లు వసూలు చేశాయన్నారు. చాలామంది రుణగ్రహీతలు తక్కువ మొత్తాలు చెల్లించి, తమ రుణాలను పరిష్కరించుకుంటున్నారని, తనకు మాత్రం అన్యాయం జరిగిందన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. -
జపాన్లో విదేశీయులకు బిగ్ షాక్.. ఫీజులు భారీగా పెంపు
జపాన్లో దీర్ఘకాలికంగా స్థిరపడాలని, శాశ్వత నివాస హోదా పొందాలని భావిస్తున్న విదేశీయులకు భారీ షాక్ తగలనుంది. 2026 అక్టోబర్ 1 నుంచి విదేశీయుల రెసిడెన్సీ సంబంధిత దరఖాస్తుల ఫీజులను గణనీయంగా పెంచేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా శాశ్వత నివాసం (Permanent Residence) కోసం దరఖాస్తు చేసే వారు ఇప్పటివరకు చెల్లిస్తున్న 10,000 యెన్లకు (సుమారు రూ.6 వేలు) బదులుగా 200,000 యెన్లు (సుమారు రూ.1.2 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఫీజు ఏకంగా 1900 శాతం లేదా 20 రెట్లు పెరగనుంది.అక్టోబర్ 1 నుంచే కొత్త ఫీజులుజపాన్ కేబినెట్ ఆగస్టు 25న కొత్త ఫీజుల విధానాన్ని అధికారికంగా ఆమోదించింది. నివాస హోదాను మార్చుకోవడం లేదా ప్రస్తుత రెసిడెన్సీ వ్యవధిని పొడిగించుకోవడానికి చేసే దరఖాస్తుల్లో ఇకపై ఒకే ఫీజు కాకుండా, మంజూరయ్యే నివాస కాలాన్ని బట్టి రుసుము నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇలాంటి దరఖాస్తులకు కౌంటర్ ద్వారా చేస్తే సాధారణంగా 6,000 యెన్ల ఫీజు ఉంది.కొత్త ఫీజుల వివరాలు ఇవే..మూడు నెలల వరకు నివాస కాలానికి: 10,000 యెన్లుఒక సంవత్సరం కాలానికి: 33,000 యెన్లుమూడు నుంచి ఐదేళ్లలోపు కాలానికి: 64,000 యెన్లుఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి: 75,000 యెన్లుశాశ్వత నివాస అనుమతి కోసం: 200,000 యెన్లుఅంటే ప్రస్తుతం 6,000 యెన్లుగా ఉన్న రెసిడెన్సీ పొడిగింపు లేదా హోదా మార్పు ఫీజు గరిష్ఠంగా 75,000 యెన్లకు చేరనుంది. శాశ్వత నివాస దరఖాస్తు ఫీజు మాత్రం 10,000 నుంచి 200,000 యెన్లకు పెరుగుతుంది.ఆన్లైన్ దరఖాస్తులకు కొంత తక్కువకౌంటర్లో నేరుగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే ఆన్లైన్లో చేసే కొన్ని రెసిడెన్సీ దరఖాస్తులకు తక్కువ ఫీజు ఉంటుంది. మంజూరయ్యే కాలాన్ని బట్టి ఆన్లైన్ ఫీజు 10,000 నుంచి 65,000 యెన్ల మధ్య ఉండనుంది. అయితే శాశ్వత నివాస అనుమతి దరఖాస్తు మాత్రం ఆన్లైన్లో కాకుండా సంబంధిత కార్యాలయంలోనే చేయాల్సి ఉంటుంది.ఫీజుల పెంపునకు కారణమేంటి?జపాన్లో విదేశీ నివాసితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్కు సంబంధించిన పరిపాలనా వ్యయాలను భర్తీ చేయడమే ఫీజుల పెంపు వెనుక ప్రధాన కారణంగా ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులకు మార్గం సుగమం చేస్తూ జపాన్ పార్లమెంట్ మే 2026లో ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సవరించింది. ఆ చట్టం ద్వారా నివాస హోదా మార్పు లేదా పొడిగింపు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 100,000 యెన్లకు, శాశ్వత నివాస దరఖాస్తు ఫీజుకు గరిష్ఠ పరిమితిని 300,000 యెన్లకు పెంచారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం అమల్లోకి తీసుకురానున్న వాస్తవ ఫీజులు వరుసగా 75,000, 200,000 యెన్లుగా ఉన్నాయి.అందరికీ ఒకే భారం కాదుఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, మానవతా కారణాలతో ప్రత్యేక పరిగణన అవసరమైనవారికి ఫీజు తగ్గింపునకు అవకాశం కల్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తగ్గింపు ఫీజులకు అర్హత పొందే వర్గాలను కూడా ప్రభుత్వం విస్తరించింది. ఇందులో కొంతమంది జపాన్ పౌరుల లేదా ప్రత్యేక శాశ్వత నివాసితుల పిల్లలను ఒంటరిగా పెంచుతున్న విదేశీయులు, అలాగే నివాస అనుమతి నిరాకరణ మానవతా దృష్ట్యా అనుచితంగా భావించబడే వ్యక్తులు కూడా ఉన్నారు.ఈ ఫీజుల మార్పు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా కొత్త ఫీజులు దరఖాస్తు తేదీ ఆధారంగా వర్తిస్తాయి. అంటే అక్టోబర్ 1కు ముందే దరఖాస్తు చేసిన వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. నిర్ణయం అక్టోబర్ 1 తర్వాత వెలువడినా కొత్త ఫీజు వర్తించదు.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్.. -
అమెరికాలో క్లాస్ యాక్షన్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లపై ఒత్తిడి!
భారతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బ్యాంక్తో పాటు దాని టాప్ ఎగ్జిక్యూటివ్లపై న్యూయార్క్ కోర్టులో ‘క్లాస్ యాక్షన్’ సెక్యూరిటీస్ దావా నమోదవడంతో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. జులై 17, 2023 నుంచి మే 26, 2026 మధ్య కాలంలో బ్యాంక్ అమెరికన్ డిపాజిటరీ షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్ల తరఫున ఈ పిటిషన్ దాఖలైంది.ఈ వ్యాజ్యంలో బ్యాంక్ సీఈఓ శశిధర్ జగదీశన్, సీఎఫ్ఓ శ్రీనివాసన్ వైద్యనాథన్ల పేర్లను నిందితులుగా చేర్చారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్డీసీ) నుంచి భారీ కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించేందుకు సాధారణ సేవింగ్స్ రేటు (3.5%) కంటే అధికంగా 6.01% వడ్డీని ఆఫర్ చేశారనేది ప్రధాన ఆరోపణ. అదనంగా చెల్లించిన ఈ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా మార్కెటింగ్ ఖర్చులు (సుమారు రూ.45 కోట్లు) కింద దాచిపెట్టారని, తద్వారా నికర వడ్డీ ఆదాయాన్ని తప్పుగా చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో లీడ్ ప్లాంటిఫ్గా చేరేందుకు ఇన్వెస్టర్లకు అక్టోబర్ 13, 2026 వరకు గడువు ఉంది.బ్యాంకు స్పందనఅయితే ఈ ఆరోపణలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్పందిస్తూ అమెరికా మార్కెట్లలో షేరు ధర తగ్గినప్పుడు ఇలాంటి క్లాస్ యాక్షన్ దావాలు సర్వసాధారణమని కొట్టిపారేసింది. ఈ పిటిషన్లో ఎటువంటి వాస్తవం లేదని, ఈ వ్యవహారంపై న్యాయస్థానంలో పోరాడతామని స్పష్టం చేసింది. ఇటీవలే బ్యాంక్ గిఫ్ట్ సిటీ బ్రాంచ్ ద్వారా 1.75 బిలియన్ డాలర్ల నోట్ల జారీని విజయవంతంగా పూర్తి చేసిందని, ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని తెలిపింది.ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు ధర 2 శాతానికి పైగా క్షీణించి ఒత్తిడికి లోనైంది. ఎల్ఐసీ తన వాటాను పెంచుకోవడానికి ఆర్బీఐ ఆమోదం లభించడం సానుకూలాంశమైనప్పటికీ కార్పొరేట్ గవర్నెన్స్ ఆందోళనల కారణంగా సమీప భవిష్యత్తులో షేరు పరిమిత శ్రేణిలోనే కదిలే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.. -
‘మోసం.. అని చెప్పేముందు జాగ్రత్త’
పన్ను చెల్లింపుదారులకు జారీ చేసే సెక్షన్ 74 జీఎస్టీ షోకాజ్ నోటీసులపై అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. నోటీసులో ‘మోసం, వాస్తవాలను సమర్పించలేకపోవడం లేదా దాగిన సత్యాలు’ అనే చట్టబద్ధమైన పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. పన్ను ఎగవేతకు పన్ను చెల్లింపుదారులు ఎలాంటి కుట్ర పన్నారో ప్రాథమిక సాక్ష్యాధారాలతో నోటీసులోనే స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.జస్టిస్ బె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ‘మోసం లేదా దాగిఉన్న వాస్తవాలు’ అనే సందేహస్పద పదజాలాన్ని ప్రయోగించినంత మాత్రాన గడువు పొడిగింపు నిబంధనలను సవరించే వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. అసెస్సింగ్ ఆఫీసర్ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడే ఎక్ట్సెండెడ్ లిమిటేషన్ వ్యవధిని వర్తింపజేయాలని పేర్కొంది.మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్పై విచారణ సందర్భంగా.. నోటీసులోని శబ్దజాలం అసెస్సింగ్ ఆఫీసర్ల అనిశ్చితిని స్పష్టం చేస్తోందని, ‘మోసం లేదా కప్పిపుచ్చడం’ అనే పదాల వాడకంలో స్పష్టమైన నిర్ధారణ లేదని కోర్టు పేర్కొంది.ఈ తీర్పుపై స్పందించిన డెలాయిట్ పార్టనర్ హర్ప్రీత్ సింగ్.. ‘ఇది పన్ను చెల్లింపుదారులకు దక్కిన గొప్ప ఉపశమనం. చట్టపరమైన పదాలను కేవలం పునరావృతం చేస్తూ నోటీసులు పంపే ధోరణికి ఈ తీర్పు చెక్ పెడుతుంది’ అని వ్యాఖ్యానించారు. అధికారులు తమ నిర్లక్ష్య వైఖరిని వదిలి ఆధారాలతో సహా వివరమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తీర్పు ద్వారా పన్ను యంత్రాంగంలో బాధ్యత, పారదర్శకత పెరుగుతాయని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు భావిస్తున్నారు. నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఈ తీర్పు రక్షణ కల్పిస్తుందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.లక్షల కోట్ల ఆదా సరే.. మైలేజ్ కోతకు పరిష్కారమేది? -
కార్పొరేట్ కొనుగోళ్లు రెట్టింపు
ముంబై: ఇతర కంపెనీల కొనుగోళ్లలో దేశీ కార్పొరేట్ దిగ్గజాలు భారీ ఆసక్తి చూపుతున్నట్లు దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే కొనుగోళ్లు రెట్టింపైనట్లు వెల్లడించింది. అయితే వీటిలో మూడోవంతు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయినట్లు తెలియజేసింది. విభిన్న కారణాలతో కంపెనీలు ఇతర సంస్థల కొనుగోళ్లను చేపడుతున్నట్లు క్రిసిల్ ఎండీ సుబోధ్ రాయ్ తెలియజేశారు. వృద్ధిని పెంచుకోవడంలో వేగం, మార్కెట్లలో మరింత విస్తరించడం, కొనుగోళ్ల సామర్థ్యాలకు పదును పెట్టుకోవడం తదితరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. నివేదిక విశ్లేషణ ప్రకారం 2017 నుంచి డీల్స్ సంఖ్య రెట్టింపైంది. 20 రంగాల నుంచి విడిగా రూ. 500 కోట్లకుపైగా విలువైన 600 డీల్స్ను నివేదిక విశ్లేషించింది. అయితే విశ్లేషణలో ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరీ్వసుల రంగాలలోని లావాదేవీలను మినహాయించింది. ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) దిగ్గజాలు దేశీయంగా చేపట్టే డీల్స్కు సైతం చోటివ్వలేదు. కారణాలు వేరువేరు.. క్రిసిల్ నివేదిక ప్రకారం ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, కన్జూమర్ బిజినెస్లు టెక్నాలజీల అనుసంధానం, నైపుణ్యాలు, మేథోసంపత్తిని సమకూర్చుకోవడం తదితరాల కోసం కొనుగోళ్లను చేపడుతున్నాయి. సిమెంట్, మెటల్స్ రంగాలలోని పరిశ్రమలు.. కన్సాలిడేషన్, ప్లాంట్ల నిర్మాణ సమయాన్ని తగ్గించుకోవడం తదితరాలపై దృష్టితో కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. తద్వారా 4–6 ఏళ్ల కాలాన్ని ఏడాది నుంచి మూడేళ్లకు తగ్గించుకుంటున్నాయి. రుణ సమీకరణతో చేపట్టిన 100కుపైగా భారీ డీల్స్ మూడింటిలో రెండు అంచనాలను అందుకున్నట్లు రాయ్ పేర్కొన్నారు. కొన్ని డీల్స్ ఏకీకృతంకావడంలో విఫలంకాగా.. నియంత్రణ సంస్థల ఆలస్యాలు, దేశ సరిహద్దులనుదాటి(క్రాస్బోర్డర్) చేపట్టే కొనుగోళ్లు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నట్లు వివరించారు. కొనుగోళ్లు, విలీనాలనేవి వ్యూహాత్మక నిర్ణయాలతోనే విజయవంతంకాబోవని, క్రమశిక్షణాయుత ఏకీకృత చర్యలు, సమయానుగుణంగా సొంతం చేసుకోవడం, వనరుల సమర్థవంత వినియోగం తదితరాలు ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. -
కొత్త రంగంలోకి రిలయన్స్.. అదానీకి పోటీగా భారీ ప్లాన్!
న్యూఢిల్లీ: దేశీయంగా అల్యూమినియం ఉత్పత్తి విభాగంలో పోటీ తీవ్రతరమవుతోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ 11.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రతిపాదించగా, తాజాగా మరో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఎంట్రీ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒడిస్సాలోని కర్లాపట్ బాక్సైట్ బ్లాక్ టెండర్ డాక్యుమెంట్లను కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 3,100 హెక్టార్లలో విస్తరించిన ఈ బ్లాకులో 200 మిలియన్ టన్నులకు పైగా బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు అంచనా. వాస్తవానికి రిలయన్స్, అదానీ గ్రూప్ తదితర కంపెనీలు దీనిపై ఆసక్తిగా ఉన్నప్పటికీ 175 శాతం ప్రీమియంను ఆఫర్ చేయడం ద్వారా వేదాంత అల్యూమినియం అనుబంధ సంస్థ బాల్కో ప్రిఫర్డ్ బిడ్డరుగా నిలిచింది.కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు దన్ను..రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే తొలి సమగ్ర అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంటును చేపడుతోంది. వచ్చే 30 ఏళ్లలో దీనిపై రూ. 2.73 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. అల్యూమినియం పరిశ్రమలో శుద్ధి, స్మెలి్టంగ్ తదితర ప్రక్రియలకు చాలా భారీ స్థాయిలో విద్యుత్ అవసరమవుతుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల్లో బొగ్గును సింథసిస్ గ్యాస్ (సిన్గ్యాస్)గా మార్చి, విద్యుత్తును ఉత్పత్తిచేసేందుకు లేదా పారిశ్రామిక ఇంధనంగాను ఉపయోగిస్తారు.లోహాల మార్కెట్లో ఎంట్రీకి దీన్నొక అవకాశంగా మల్చుకోవాలని రిలయన్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ను లోహాల తయారీకి ఉపయోగించుకోవడం ద్వారా లాభదాయకతను పెంచుకోవచ్చనే ఆలోచనతోనే అల్యూమినియంపై కంపెనీ దృష్టి పెడుతుండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ను భారీ స్థాయి లోహాలు, ఖనిజాల ప్రాసెసింగ్ కోసం వినియోగించుకునేందుకు అవకాశం ఉందని వివరించాయి. అయితే, కంపెనీ ఇంకా అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని, ఇంకా ఏదీ ధృవీకరణ కాలేదని వివరించాయి.ఇప్పటికే భారీగా ఉత్పత్తి...ఇప్పటికే అల్యూమినియం రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం బోలెడంత ఉన్న తరుణంలో మరో రెండు దిగ్గజాలు కూడా బరిలోకి దిగనుండటంతో పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం 25 లక్షల టన్నుల వార్షిక తయారీ సామర్థ్యంతో వేదాంత అల్యూమినియం ప్రస్తుతం భారత్లో అతి పెద్ద ఉత్పత్తి సంస్థగా కార్యకలాపాలు సాగిస్తోంది.ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ ఉత్పత్తి సామర్థ్యం 14 లక్షల టన్నులుగా ఉండగా, ప్రభుత్వ రంగ నాల్కో సామర్థ్యం 5 లక్షల టన్నులుగా ఉంది. ఈ పరిస్థితుల్లో యూఏఈకి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీతో కలిసి ఒడిశాలో 20 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్య అల్యూమినియం ప్రాజెక్టును చేపడుతున్నట్లు, ఇందుకోసం 11.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ సంస్థ జూలైలో ప్రకటించడం గమనార్హం. -
ఎస్బీఐ హోమ్ లోన్స్లో సరికొత్త రికార్డు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) గృహ రుణ పోర్ట్ఫోలియో రూ. 10 లక్షల కోట్ల మైలురాయిని దాటనున్నట్లు చైర్మన్ సీఎస్ శెట్టి తాజాగా వెల్లడించారు. హౌసింగ్ ఫైనాన్స్కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్రస్తుత త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో మార్టిగేజ్ పోర్ట్ఫోలియో ఈ ఫీట్ను సాధించే వీలున్నట్లు తెలియజేశారు.గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో ఎస్బీఐ రూ. 9 లక్షల కోట్ల హోమ్ లోన్ పోర్ట్ఫోలియోను అధిగమించినట్లు ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. గృహ రుణ విభాగంలో ఎస్బీఐ మార్కెట్ వాటా 28 శాతంకాగా.. దేశవ్యాప్తంగా వీటిని అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.దేశవ్యాప్తంగా 460కుపైగా గృహ రుణ ప్రాసెసింగ్ కేంద్రాలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా హౌసింగ్ ఫైనాన్స్ ప్రొడక్టుల అందుబాటును విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. పారదర్శకత, వడ్డీ రేట్లలో బ్యాంక్ విధానాలపట్ల కస్టమర్లకు విశ్వాసమున్నట్లు పేర్కొన్నారు. డాక్యుమెంటేషన్, బిల్డర్లపై నివేదికలు తదితరాలు కస్టమర్లను బ్యాంకువైపు ఆకర్షిస్తున్నట్లు తెలియజేశారు.ఆర్థిక వ్యవస్థకు దన్నుగా..గృహ రుణాలనేవి కేవలం బ్యాంకింగ్ ప్రొడక్టులగానే చూడకూడదని, వీటివల్ల ఆర్థికపరమైన యాక్టివిటీకితోడు సంబంధిత పలు పరిశ్రమలపైనా సానుకూల ప్రభావం పడుతుందని ఎస్బీఐ చైర్మన్ శెట్టి వివరించారు. ఆర్థిక వ్యవస్థకు హోమ్ లోన్ అత్యంత కీలక విభాగమని అభిప్రాయపడ్డారు. రెసిడెన్షియల్, కమర్షియల్ రియల్టీ రంగంపై 200కుపైగా పరిశ్రమలు ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు.వెరసి హోమ్ లోన్ స్టాండెలోన్ ప్రొడక్ట్గా కాకుండా దేశ ఆర్థిక వృద్ధిలో భాగంగా భావించాలని వ్యాఖ్యానించారు. గృహ రుణాల సెక్యూరిటైజేషన్పై స్పందిస్తూ పరిశ్రమస్థాయిలో రూ. 30 లక్షల కోట్లకుపైగా ఔట్స్టాండింగ్ రుణాలున్నట్లు తెలియజేశారు. అయితే ఇవి లిక్విడ్ ఆస్తులుకావని, దీంతో రీసైకిల్ క్యాపిటల్ను సమకూర్చుకోవడం, విస్తారిత రుణ మంజూరీ వంటి అంశాలలో బ్యాంకుల అవకాశాలు పరిమితమవుత్నుట్లు వివరించారు. అంతర్జాతీయంగా మారి్టగేజ్ బుక్ అత్యంత లిక్విడిటీని కలిగి ఉన్నప్పటికీ దేశీయంగా కొద్దిపాటి సెక్యూరిటైజేషన్కు వీలున్నప్పటికీ అత్యధికశాతం ఇల్లిక్విడ్ కిందకే వస్తాయని తెలియజేశారు. -
మీ తోబుట్టువుకు ఉపయోగపడే క్రేజీ గిఫ్ట్స్ ఇవే!
అనురాగానికి ఆప్యాయత తోడై అన్నాతమ్ముళ్లు-అక్కాచెల్లెళ్ల అనుబంధాన్ని పండగలా జరుపుకునే వేడుక రాఖీ పౌర్ణమి. కాలం మారింది. దాంతోపాటు బంధాల వ్యక్తీకరణ తీరూ మారింది. ఒకప్పుడు రాఖీ కట్టి తీపి తినిపిస్తే సరిపోయేది. ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్లు, గ్రీటింగ్ కార్డ్ల కాలం వచ్చింది. కానీ నేటి డిజిటల్ యుగంలో తోబుట్టువుకు ఇచ్చే బహుమతి కేవలం ఒక వస్తువుగా మిగిలిపోకూడదు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా, వారి జీవితంలో భాగమయ్యేలా ఉండాలన్నది నేటి యూత్ ఆలోచన. ఈ పండుగ మరింత గుర్తుండిపోయేలా ఉండేలా కొన్ని వినూత్న, ఉపయోగకరమైన గిఫ్టింగ్ ఐడియాలు చూద్దాం.ఆర్థిక భద్రతనిచ్చే బహుమతులుతీపి పదార్థాలు ఇచ్చే సంతోషం తాత్కాలికమే, కానీ ఆర్థిక భద్రత ఇచ్చే ధీమా శాశ్వతం.చెల్లెలి లేదా తమ్ముడి పేరిట ప్రతి నెలా చిన్న మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ఎస్ఐపీని ప్రారంభించవచ్చు.సాంప్రదాయ బంగారానికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి.మీ సోదరి, సోదరుడి పేరిట ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించడం ద్వారా వారికి ఆరోగ్య భద్రతను బహుమతిగా ఇవ్వవచ్చు.స్మార్ట్ అండ్ గాడ్జెట్ వేవ్సాంకేతికతతో ముడిపడిన జీవితంలో రోజువారీ పనులను సులభతరం చేసే స్మార్ట్ బహుమతులకు ప్రాధాన్యం పెరుగుతోంది.ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే స్మార్ట్వాచ్లు నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.పుస్తకపఠనంపై ఆసక్తి ఉన్నవారికి ఈ-బుక్ సబ్స్క్రిప్షన్లు అందించడం అద్భుతమైన ఎంపిక.ఆఫీస్ పనులు, ప్రయాణాలు లేదా ఆన్లైన్ క్లాసులకు నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ఫోన్స్ / ఇయర్బడ్స్ ఎంతో సహాయపడతాయి.అనుభూతులను పంచే గిఫ్ట్స్నిరంతరం పనులతో అలసిపోయే అక్క లేదా చెల్లెలికి ఒక చిన్న సోలో ట్రిప్ లేదా వెకేషన్ ప్యాకేజీ గిఫ్ట్గా ఇవ్వడం.వారికి ఇష్టమైన ఫోటోగ్రఫీ, కోడింగ్, ఫారిన్ లాంగ్వేజ్ లేదా మ్యూజిక్ కోర్సులకు సంబంధించి ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఇవ్వొచ్చు.అనుబంధానికి వెలకట్టలేం. కానీ, ఇచ్చే బహుమతిలో వారి పట్ల మనకున్న శ్రద్ధ, వారి భవిష్యత్తు పట్ల మనకున్న బాధ్యత ప్రతిబింబించాలి. ఈ రాఖీ పౌర్ణమికి కేవలం ఒక బహుమతినే కాదు.. వారి ఎదుగుదలకు తోడ్పడే నమ్మకాన్ని కానుకగా ఇద్దాం.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
ప్రపంచస్థాయి కంపెనీలను ఏలుతున్న ఇండియన్స్
సిలికాన్ వ్యాలీ నుంచి వాల్స్ట్రీట్ వరకు ప్రపంచ వాణిజ్య యవనికపై భారత్, భారత సంతతికి చెందిన నాయకులు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, బిలియన్ డాలర్ల విలువైన బహుళ జాతి సంస్థలకు నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేస్తున్నారు.సాంకేతిక రంగంలో గూగుల్ (అల్ఫాబెట్) అధిపతి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల, ఐబీఎమ్ చీఫ్ అరవింద్ కృష్ణ, యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్, అడోబ్ నాయకుడు శంతను నారాయణ్ గ్లోబల్ టెక్ వ్యూహాలను శాసిస్తున్నారు. సైబర్ భద్రత, క్లౌడ్, నెట్వర్కింగ్ రంగాల్లో నికేష్ అరోరా (పాలో ఆల్టో), జయశ్రీ ఉల్లాల్ (అరిస్టా), జార్జ్ కురియన్ (నెట్యాప్) ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక భారతీయ ఐటీ రంగానికి ఐకాన్గా నిలిచిన ఇన్ఫోసిస్ సీఈఓగా సలీల్ పరేఖ్, కాగ్నిజెంట్ సారథిగా రవికుమార్ ఎస్ ఐటీ సేవల విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.భారతీయ, భారత సంతతికి చెందిన ప్రముఖ కంపెనీలు, సీఈఓల వివరాలుAlphabet (Google): సుందర్ పిచాయ్Microsoft: సత్య నాదెళ్లYouTube: నీల్ మోహన్Adobe: శంతను నారాయణ్Procter & Gamble (P&G): శైలేష్ జెజూరీకర్T-Mobile US: శ్రీని గోపాలన్World Bank Group: అజయ్ బంగా (ప్రెసిడెంట్ & సీఈఓ)IBM: అరవింద్ కృష్ణInfosys: సలీల్ పరేఖ్NetApp: జార్జ్ కురియన్Palo Alto Networks: నికేష్ అరోరాArista Networks: జయశ్రీ ఉల్లాల్Novartis: వసంత్ నరసింహన్Micron Technology: సంజయ్ మెహ్రోత్రాHoneywell: విమల్ కపూర్Flex: రేవతి అద్వైతిWayfair: నీరజ్ షాChanel: లీనా నాయర్Cognizant: రవికుమార్ ఎస్Vertex Pharmaceuticals: రేష్మా కేవల్రమణిMolson Coors Beverage Company: రాహుల్ గోయల్ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
భారత్లో షుగర్ ఎక్కువ.. విదేశాల్లో తక్కువ ఎందుకు?
చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి దొంగ పనులు అన్నట్లుగా దిగ్గజ బహుళజాతి కంపెనీలు భారత వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. లండన్లో విక్రయించే ఒక ఫాంటా క్యాన్లో కేవలం 63 క్యాలరీలు, తక్కువ పంచదార ఉంటే అదే మనదేశంలో లభించే పానీయంలో మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా షుగర్ను దట్టించి విక్రయిస్తున్నారు. యూరోప్లో కృత్రిమ రంగుల (E110 Sunset Yellow) వాడకంపై సీసాల ముందు భాగంలోనే హెచ్చరిక బొమ్మలు తప్పనిసరి చేశారు. కాగా, మన దేశంలో మాత్రం ప్యాకెట్ వెనుక వైపు కంటికి కనిపించనంత చిన్న అక్షరాలతో సరిపెట్టడం గమనార్హం.ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని బహుళజాతి కంపెనీల వ్యవహారంపై ప్రజారోగ్య నిపుణులు స్పందిస్తూ బాటిళ్ల ముందు భాగంలోనే ఎరుపు, పచ్చ రంగుల నాణ్యతా ముద్రలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే చర్యలు తీసుకోవాల్సిన 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్ఎస్ఎస్ఏఐ), కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హెచ్చరికల ప్రతిపాదనను పక్కనబెట్టడం తీవ్ర ఆందోళనకరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎలాంటి రంగులు లేని సాధారణ పట్టికలతో వీటి గుర్తింపును సరిపెడతామని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొనడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారత పౌరుల ఆరోగ్యం పట్ల దేశానికి శ్రద్ధ ఉందనే విషయం ప్రపంచానికి తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్పొరేట్ ధోరణులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో భారత్ తీవ్ర ఊబకాయం, మధుమేహ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: మొదటిసారి ఇల్లు కొంటున్నారా? -
H-1B ఫీజు షాక్.. నాస్కామ్ కీలక వ్యాఖ్యలు!
గత ఐదేళ్లుగా అమెరికన్ హెచ్-1బీ వీసాలపై భారతీయ టెక్నాలజీ సంస్థలు ఆధారపడటం గణనీయంగా తగ్గిందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తెలిపింది. మన కంపెనీలు అక్కడి స్థానికులనే నియమించుకోవడం పెరిగిందని పేర్కొంది. వీసాల ఫీజుల పెంపు అంశాన్ని అమెరికాలో నిపుణుల కొరతను పరిష్కరించే దిశగా తీసుకుంటున్న చర్యల కోణంలో చూడాలని వివరించింది. భారతీయ టెక్నాలజీ పరిశ్రమ అమెరికాలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంపై 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసినట్లు నాస్కామ్ వివరించింది.ఈ క్రమంలో 29 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు, 2.55 లక్షల మంది ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు 130 పైగా యూనివర్సిటీలు, కాలేజీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పేర్కొంది. తమ దేశ వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలు చేసేందుకు తొలిసారిగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై అదనంగా 1,03,265 డాలర్ల ఫీజును విధించేలా అమెరికా ప్రతిపాదించిన నేపథ్యంలో నాస్కామ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో ఆమోదం పొందిన హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల వాటా ఏకంగా 71 శాతంగా ఉంది. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొత్త రూల్స్.. సెల్లర్లకు కొత్త టెన్షన్!
పండుగల సీజన్ షాపింగ్ మొదలవుతున్న తరుణంలో ఈ–కామర్స్ సంస్థలు తమ ప్లాట్ఫాంలపై విక్రయించే సెల్లర్స్కి షాకిచ్చాయి. ఆర్డర్ల రద్దుకు సంబంధించి సెల్లర్ ఫీజులు, పెనాల్టీలు పెరిగే విధంగా విధానాలను సవరించాయి. అమెజాన్ ఇండియా తమ సెల్లర్ ఫోరంలో ఉంచిన నోటీసు ప్రకారం కంపెనీ తమ ఈజీ షిప్, సెల్ఫ్ షిప్ సర్వీసులను ఉపయోగించుకునే సెల్లర్లకు సంబంధించి ఆర్డర్ క్యాన్సిలేషన్ ఫీజులను లెక్కించే విధానాన్ని మార్చింది. ఇది ఆగస్టు 17 నుంచి అమల్లోకి తెచ్చింది.ఈజీ షిప్ కింద విక్రేతలు తమ ఉత్పత్తులను తామే నిల్వ చేసుకుని, ఆర్డరు వచ్చినప్పుడు ప్యాక్ చేసి, ఈజీ షిప్ పికప్ ఎగ్జిక్యూటివ్కి అందిస్తారు. వారు ఆ ప్రోడక్టును సకాలంలో డెలివరీ అయ్యేలా చూస్తారు. ఇక సెల్ఫ్ షిప్ విషయానికొస్తే విక్రేత స్వయంగా తమ కొరియర్ లేదా డెలివరీ సర్వీసును ఉపయోగించి కొనుగోలుదారులకు ప్రోడక్టును చేరవేస్తారు. ఇందులో అమెజాన్ లాజిస్టిక్స్ ప్రమేయమేమీ ఉండదు. ఇప్పటివరకు కేటగిరీ రిఫరల్ చార్జీ ఆధారంగా ఉండే ఫీజులు, ఇకపై ఆర్డరు విలువలో ఇంత శాతం అని లెక్కించనున్నట్లు అమెజాన్ ఇండియా పేర్కొంది.సవరించిన విధానం ప్రకారం రూ. 10,000 లోపు విలువ చేసే ఆర్డర్లపై 10 శాతం చార్జీ ఉంటుంది. రూ. 10,001 నుంచి రూ. 50,000 వరకు ఆర్డర్లపై 8 శాతంగా, అక్కడి నుంచి రూ. 1,00,000కు విలువ చేసే ఆర్డర్లపై 5 శాతం, అంతకు మించిన వాటిపై 2 శాతంగా చార్జీలు ఉంటాయి. 18 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది. కొనుగోలు అభ్యర్ధన మేరకు కాకుండా ఇతరత్రా ఏవైనా కారణాల వల్ల విక్రేత క్యాన్సిల్ చేసినా ఈ చార్జీలు వర్తిస్తాయి. ముందుగా పేర్కొన్న షిప్పింగ్ తేదీకి 24 గంటల్లోపల విక్రేత పంపించకపోతే ఆర్డర్ ఆటోమేటిక్గా రద్దయిపోతుంది.క్లోజింగ్ ఫీజు పెంపు..ఫుల్ఫిల్మెంట్ సెంటర్, ఈజీ షిప్, సెల్లర్ ఫ్లెక్స్ మాధ్యమాలవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి క్లోజింగ్ ఫీజులను పెంచనున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఉత్పత్తి ధర శ్రేణిని బట్టి అమెజాన్లో ఉత్పత్తిని విక్రయించిన ప్రతిసారి క్లోజింగ్ ఫీజును కంపెనీ విధిస్తుంది. రూ. 500 వరకు ధర ఉండే ఉత్పత్తులపై ఫీజు రూ. 1 చొప్పున, రూ. 500కి మించిన ధర ఉండే వాటిపై రూ. 3 చొప్పున పెంపు ఉంటుంది. ఇంధన, లాజిస్టిక్స్ వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని సంస్థ తెలిపింది.మరోవైపు, ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్లో లోపాలకు సంబంధించి మూడంచెల పెనాల్టీ విధానానాన్ని ఫ్లిప్కార్ట్ ఆగస్టు 23 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం హామీ ఇచ్చిన డిస్పాచ్ డేట్ (డీబీడీ) కల్లా పికప్ చేసుకోవడానికి ఉత్పత్తిని సిద్ధం చేయకపోతే, ప్రతి షిప్మెంట్పై రూ. 30 జరిమానా ఉంటుంది. ఆర్డరును విక్రేత క్యాన్సిల్ చేసినా, లేదా మూడు సార్లు డిస్పాచ్ గడువు దాటిపోయి క్యాన్సిల్ అయిపోయినా ఒక్కో షిప్మెంట్కి రూ. 60 పెనాల్టీ ఉంటుంది. ఒకవేళ ఆర్డరులో జాప్యం జరిగి, తదుపరి రద్దయిపోతే పెనాల్టీ రూ. 90కి పెరుగుతుంది. గతంలోనైతే డీబీడీని ఉల్లంఘిస్తే కొంత సమయం పాటు విక్రేత అకౌంటును లాక్ చేసేసేవారు.ఫలితంగా విక్రేత వ్యాపారంపై గణనీయంగా ప్రభావం పడేది. ఫ్లిప్కార్ట్లో కొత్తగా చేరిన విక్రేతలకు తాజా విధానం వర్తించదు. సెల్లర్లు మరింత మెరుగ్గా ప్లాన్ చేసుకునేందుకు, కస్టమర్ అనుభూతిని మరింత మెరుగుపర్చేందుకే ఈ మార్పులు, చేర్పులను ఉద్దేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీబీడీ నిబంధనలు సరిగ్గా పాటించే వారికి వేగంగా చెల్లింపులు జరపడం, కాంప్లిమెంటరీగా అడ్వరై్టజింగ్ క్రెడిట్స్ ఇవ్వడం మొదలైన రూపాల్లో ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించాయి.‘మా ప్లాట్ఫాం ద్వారా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్లను విక్రేతలు విశ్వసనీయంగా డెలివరీ చేయాలని మేము ఆశిస్తాం. సకాలంలో, విశ్వసనీయతతో ఫుల్ఫిల్మెంట్ ఉండేలా చూసేందుకే ఈజీ షిప్, సెల్ఫ్–షిప్ సెల్లర్లకు సంబంధించిన క్యాన్సిలేషన్ ఫీజులను సవరించాం. దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆర్డరును విక్రేత క్యాన్సిల్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. అమెజాన్డాట్ఇన్లో వచ్చే ఆర్డర్లలో వీటి వాటా 1 శాతం కన్నా తక్కువే. విక్రేతల పరిధిలో లేని అంశాల వల్ల ఆర్డరు రద్దయిన పక్షంలో వారు నష్టపోకుండా చూసేందుకు తగు జాగ్రత్త చర్యలు కూడా అమలు చేస్తున్నాం‘ అని అమెజాన్ ప్రతినిధి తెలిపారు.మాపై భారం సరికాదు.. ఒకోసారి డెలివరీ సిబ్బంది సకాలంలో రాకపోవడం వల్ల కూడా ఆర్డరు రద్దయ్యే అవకాశం ఉంటుందని, ఇలా తమ పరిధిలో లేని అంశాలకు కూడా తమనే బాధ్యులను చేస్తే ఎలా అని కొత్త విధానాలను కొందరు విక్రేతలు అంటున్నారు. అలాంటి సందర్భాల్లో క్యాన్సిలేషన్ ఫీజులను తమపైనే మోపడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఒకే ఉత్పత్తికి సంబంధించి అమెజాన్కి చెందిన ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ను ఉపయోగించుకునే విక్రేతలు, ఈజీ షిప్ని ఉపయోగించుకునే సెల్లర్లు కట్టే ఫీజుల మధ్య ఒక్కో యూనిట్కి దాదాపు రూ.45 మేర వ్యత్యాసం ఉంటుందని, దీనివల్ల విక్రేతలకు సమాన అవకాశాలు లభించవని వారు పేర్కొన్నారు.అత్యుత్తమ సర్వీస్ ప్రమాణాల ఆవశ్యకతను విక్రేతలు అర్థం చేసుకోగలరని, కాకపోతే సరిగ్గా పండుగ సీజన్ ముందు క్యాన్సిలేషన్ తదితర పెనాల్టీలను ఈ–కామర్స్ సంస్థలు పెంచేయడమనేది ఆందోళనకరమైన విషయమని ఫోరం ఫర్ ఇంటర్నెట్ రీసెల్లర్స్, సెల్లర్స్ అండ్ ట్రేడర్స్ (ఫస్ట్ ఇండియా) ట్రస్టీ వినోద్ కుమార్ తెలిపారు. చాలా తక్కువ మార్జిన్లు, పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న చిన్న, మధ్య తరహా సంస్థలపై దీని ప్రభావం భారీగా ఉంటుదన్నారు. ఆర్డర్లు రద్దు కావడానికి, జాప్యానికి సంబంధించి ప్రతి దానికీ విక్రేతే కారణం కాబోరని.. లాజిస్టిక్స్ వైఫల్యం, ప్లాట్ఫాంలో సమస్యలు, డిమాండ్ ఒక్కసారిగా పెరగడం, కస్టమర్ల వైపు నుంచి ఉండే సవాళ్లు కూడా కారణంగా ఉంటాయని వివరించారు. -
తెలంగాణలో పెట్టుబడులు.. జపాన్ కంపెనీలకు మంత్రి ఆహ్వానం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కంపెనీలు ముందుకు రావాలని శక్తి మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ఆహ్వానించారు. జపాన్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే అవసరమైన సహకారం, మార్గదర్శకత్వాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తెలంగాణలో జపాన్ కంపెనీల పెట్టుబడులు సురక్షితంగా, లాభదాయకంగా ఉండేలా అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.ఒసాకాలో Career Consultz వ్యవస్థాపకుడు, సీఈఓ రోహిత్ రావు నిర్వహించిన ‘Leveraging Indian Talent’ ఇండియా-జపాన్ వర్క్ఫోర్స్ రౌండ్టేబుల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జపాన్ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ, విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులు, నైపుణ్య మానవ వనరులు, ఉపాధి అవకాశాలు, టాలెంట్ మొబిలిటీపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలతో పాటు నైపుణ్యవంతులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఐటీ, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో రాష్ట్రానికి బలమైన టాలెంట్ పూల్ ఉందన్నారు. జపాన్ కంపెనీలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కోరారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సహకారం అందిస్తూ వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.తెలంగాణలో సుమారు 600 ఎకరాల్లో కొత్త ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు జపాన్ సంస్థలు ఆసక్తి చూపుతున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఇది తెలంగాణపై జపాన్ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మరిన్ని జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.పెట్టుబడులతో పాటు తెలంగాణ యువతకు జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జపాన్ సంస్థలతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. జపాన్లో పెరుగుతున్న నైపుణ్య మానవ వనరుల అవసరాలను తెలంగాణ టాలెంట్తో అనుసంధానం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.తెలంగాణ యువత కొత్త దేశాలకు, కొత్త వాతావరణాలకు త్వరగా అలవాటు పడే స్వభావం కలిగి ఉంటారని మంత్రి అన్నారు. కష్టపడి పనిచేయడం, కొత్త విషయాలను వేగంగా నేర్చుకోవడం, పనిచేసే సంస్థలు, దేశాల సంస్కృతికి అనుగుణంగా మారడం తెలంగాణ యువత ప్రత్యేకతలని తెలిపారు. జపాన్ కంపెనీల అభివృద్ధికి తెలంగాణ యువత గణనీయంగా దోహదపడగలరని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే యువతకు ఆయా దేశాల భాషపై పరిజ్ఞానం ఎంతో కీలకమని పేర్కొన్నారు. అందుకే టామ్కామ్ ద్వారా నైపుణ్య శిక్షణతో పాటు భాషా శిక్షణ, ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, పని సంస్కృతిపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తద్వారా తెలంగాణ యువత అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో సులభంగా ఉపాధి పొందేలా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే జర్మనీతో నైపుణ్య మానవ వనరుల రంగంలో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుందని మంత్రి తెలిపారు. ఇటీవల జర్మనీ బృందం తెలంగాణలో పర్యటించినప్పుడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. తెలంగాణ చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధులు ప్రశంసించారని తెలిపారు. జర్మనీలో నైపుణ్య మానవ వనరులకు డిమాండ్ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణ యువతకు మరిన్ని అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు.నైపుణ్య మానవ వనరుల నియామకం, శిక్షణ, ఉపాధి కల్పనలో జపాన్ సంస్థలతో మరింత బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. భారత్–జపాన్ సంబంధాల్లో వర్క్ఫోర్స్ మొబిలిటీ కీలక అంశంగా మారుతోందని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు, అంతర్జాతీయ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో భారత్–జపాన్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ రౌండ్టేబుల్ సమావేశం దోహదపడుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. -
మరో ఆరు రోజుల్లో చౌకగా విమాన ప్రయాణం
నింగిలో విహరించాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ) తీపి కబురు అందించింది. అందినంత పిండుకో అనే దోరణికి చెక్ పెడుతూ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి పయనమయ్యే ప్రయాణికులపై యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) భారాన్ని గణనీయంగా తగ్గించింది. సెప్టెంబరు 1, 2026 నుంచి ప్రారంభమయ్యే నాలుగో పర్యవేక్షణ కాలానికి (2026-2031) గాను ఈ సవరించిన టారిఫ్లు అమలులోకి రానున్నాయి.ఇప్పటివరకు దేశీయ విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న రూ.750 యూడీఎఫ్ను ఏఈఆర్ఏ రూ.515కు తగ్గించింది. విమానాశ్రయ నిర్వాహక సంస్థ జీఎంఆర్(బీహెచ్ఐఏఎల్) రూ.580 కోరినప్పటికీ ప్రయాణికుల ప్రయోజనాలే పరమావధిగా భావించి రూ.515 వద్దే నిర్ణయించడం విశేషం. అలాగే, అంతర్జాతీయ ప్రయాణికుల రుసుమును రూ.1,500 నుంచి రూ.1,030కి తగ్గించింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో దాదాపు 82 శాతం మంది దేశీయ ప్రయాణికులే కావడంతో ఈ నిర్ణయం వారికి ఊరటనివ్వనుంది.ముందుగానే నియంత్రణ!బీహెచ్ఐఏఎల్ ఏకంగా రూ.27,851 కోట్ల ఆదాయ అవసరాలు ప్రతిపాదించగా ఏఈఆర్ఏ పక్కాగా సమీక్షించి రూ.11,683.49 కోట్లకు కుదించి ఆమోదముద్ర వేసింది. విమానాల ల్యాండింగ్ చార్జీలను టన్నుకు రూ.435 (దేశీయ), రూ.630 (అంతర్జాతీయ)గా నిర్ణయించింది. విమానయాన సంస్థలను ప్రోత్సహించేందుకు వేరియబుల్ టారిఫ్ ప్లాన్ (వీటీపీ) పేరుతో ల్యాండింగ్ ప్రోత్సాహకాలను సైతం తీసుకొచ్చింది. మొత్తానికి, విమాన ప్రయాణం కేవలం సంపన్నులకే కాకుండా సగటు మానవుడికి సైతం చేతికందే పండులా మారనుండటం హర్షణీయం.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
కార్బోసల్ఫాన్పై పూర్తి నిషేధం.. కేంద్రం ప్రతిపాదన
రైతులకు వాతావరణ సవాళ్లు ఒకవైపు చుట్టుముడుతుంటే, పంటలను ఆశించే పురుగుల సంహారానికి వాడే రసాయనాలు మరొకవైపు ప్రాణసంకటంగా మారుతున్నాయి. వ్యవసాయ రంగంలో విరివిగా ఉపయోగిస్తున్న కార్బోసల్ఫాన్ (Carbosulfan) కీటకనాశిని ఉత్పత్తి, దిగుమతి, విక్రయం, వాడకంపై పూర్తి నిషేధం విధించాలని కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. 1968 కీటకనాశినుల చట్టం ప్రకారం ఈ విషపూరిత రసాయనాన్ని శాశ్వతంగా రద్దు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.నిపుణుల కమిటీ నివేదికనిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్బోసల్ఫాన్ భూమిలోకి లేదా మొక్కల్లోకి చేరిన తర్వాత అత్యంత ప్రమాదకరమైన 'కార్బోఫ్యూరాన్'గా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల మానవులతో పాటు పెంపుడు జంతువులకు తీవ్రమైన విషప్రయోగం జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ఈ రసాయనం ప్రభావానికి గురైతే తక్షణమే కోలుకోవడానికి నిర్దిష్టమైన విరుగుడు కూడా అందుబాటులో లేదు. ముందు జాగ్రత్త కన్నా నివారణే మేలు అన్న చందంగా జీవవైవిధ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఈ రసాయనానికి స్వస్తి పలకడమే శ్రేయస్కరమని సర్కారు భావించింది.వరి, పత్తి పంటల్లో..ముఖ్యంగా వరి, పత్తి పంటలలో నివారణకు వాడే ఈ మందును నిషేధిస్తే ప్రత్యామ్నాయంగా రసాయన రహిత పురుగుమందులను (బయో ఫెస్టిసైడ్స్) ప్రోత్సహించాల్సి ఉంటుంది. పర్యావరణానికి వినాశకరంగా మారిన కార్బోసల్ఫాన్పై పడుతున్న ఈ ఎఫెక్ట్ వల్ల యూపీఎల్ వంటి ప్రముఖ అగ్రోకెమికల్ కంపెనీల మార్కెట్పై ప్రభావం పడనుంది. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవడం మంచిది కాబట్టి విషపూరిత పురుగుమందుల స్థానే పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
రూ.1.4 కోట్ల జీతం ఉన్నా.. ప్రశాంతత సున్నా!
‘అడియాసలు మోయలేక అల్లాడిపోవుటకంటే.. ఆశలు తగ్గించుకొని ప్రశాంతంగా బతకడం మేలు!’ అన్న సామెత నేటి కార్పొరేట్ రంగానికి చక్కగా సరిపోతుంది. ఆకాశమే హద్దుగా జీతభత్యాలు పెంచుకోవాలనే తపనతో రేయింబవళ్లు శ్రమిస్తున్న నేటి యువతరానికి రెడిట్ వేదికగా ఒక టెక్ ఉద్యోగి పంచుకున్న అనుభవం చర్చనీయాంశంగా మారింది.కేవలం మూడేళ్ల వ్యవధిలోనే తన వార్షిక వేతనాన్ని రూ.9 లక్షల నుంచి ఏకంగా రూ.1.4 కోట్లకు (16 రెట్లు) పెంచుకున్నట్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెల్లడించారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్లుగా నిరంతరం కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం, చురుకైన ఆఫర్లు సాధించడంతో ఆర్థికంగా అసాధారణ ప్రగతి సాధించినట్లు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియలో అత్యధిక జీతం అందుకుంటున్నప్పటికీ తీవ్రమైన బర్నౌట్ (మానసిక ఒత్తిడి, అలసట)కు గురయ్యానని, మనశ్శాంతి కరువైందని సదరు ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.జీతం ఊరిస్తున్నా.. నాణేనికి మరోవైపు..కార్పొరేట్ జగత్తులో ఐదంకెల జీతం నుంచి కోట్లలో ప్యాకేజీకి ఎదగడం వినడానికి ఎంతో ఊరిస్తున్నా నాణేనికి మరోవైపున్న చేదు నిజాన్ని ఈ కథనం ఎత్తిచూపుతోంది. వారాంతాల్లో సైతం విశ్రాంతి లేని పని గంటలు, లక్ష్యాల ఒత్తిడి, స్థిరమైన ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అంశాలు నిద్రలేమి, తీవ్ర ఆందోళనలకు దారితీస్తున్నాయని బాధిత ఉద్యోగి పేర్కొన్నారు. చేతిలో డబ్బున్నా.. అనుభవించడానికి ఆరోగ్యం, సమయం లేకపోతే ఆ సంపాదన నిరుపయోగం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ప్యాకేజీల పరుగు పందెంలో పడి..కెరీర్ నిర్మాణంలో ఆర్థిక పురోగతి ఎంత ముఖ్యమో శారీరక, మానసిక ఆరోగ్యాల మధ్య సమతుల్యత సాధించడం అంతకంటే ప్రధానం. జీతం ప్యాకేజీల పరుగు పందెంలో పడి జీవితాన్ని గుల్ల చేసుకోవడం చేతులారా చేసుకున్న చేటు అవుతుంది. కార్పొరేట్ కంపెనీలు సైతం ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చేలా పని సంస్కృతిని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
పైలట్లకు డోపింగ్ పరీక్షలు!
భారత విమానయాన రంగాన్ని భద్రతా పరంగా మరింత బలాపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విమాన పైలట్లు, క్యాబిన్ క్రూ సభ్యుల శారీరక, మానసిక ద్రుడత్వాన్ని, ప్రయాణికుల సురక్షిత ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని 100 శాతం ర్యాండమ్ డోపింగ్ (ఆల్కహాల్/మత్తు పదార్థాలు) పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ముమ్మరంగా అడుగులు వేస్తోంది. 'పాము చావకుండా, కర్ర విరగకుండా' ఉన్న పాత నిబంధనలకు స్వస్తి పలికి భద్రతలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడమే దీని ప్రధాన ఉద్దేశం.ఇప్పటివరకు కేవలం కొంత శాతం సిబ్బందికి మాత్రమే పరిమితమైన ప్రీ-ఫ్లైట్ లేదా పోస్ట్-ఫ్లైట్ పరీక్షలను నిర్వహించేవారు. ఇకపై విమానాశ్రయాల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు రోడ్మ్యాప్ సిద్ధమవుతోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రతిపాదించిన ఈ కొత్త మార్గదర్శకాలు అగ్నికి ఆజ్యం తోడైనట్లు కొన్నిసార్లు పైలట్ల నిర్లక్ష్యం వల్ల ఎదురయ్యే ముప్పును ప్రాథమిక దశలోనే తుంచేస్తాయి. తీగ లాగితే డొంక కదిలినట్లు ఒకసారి సిబ్బంది అలసత్వం వహిస్తే వేలమంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతాయనే హెచ్చరికలతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అత్యంత వేగంగా పరిశీలిస్తోంది.ఈ కొత్త నిబంధనల ప్రకారం... నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత కచ్చితత్వంతో కూడిన ల్యాబ్ టెక్నాలజీ ద్వారా రక్త, ఉమ్మి, మూత్ర నమూనాలను సేకరించి డ్రగ్స్, ఆల్కహాల్ ప్రభావాన్ని గుర్తిస్తారు. కాలం చెల్లిన పద్ధతులకు పాతరేసి పారదర్శకమైన డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని తీసుకురానున్నారు. ఒకవేళ ఏ పైలట్ అయినా ఈ పరీక్షల్లో దోషిగా తేలితే అతడి లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేయడం నుంచి తీవ్రమైన సందర్భాల్లో శాశ్వతంగా రద్దు చేసే వరకు కఠిన చర్యలు ఉంటాయి.ప్రయాణికుల క్షేమమే పరమావధిగా సాగుతున్న ఈ కసరత్తు ఏవియేషన్ రంగంలో నూతన శకానికి నాంది పలకనుంది. ముందు జాగ్రత్త కన్నా మించిన మందు లేదు అనే నానుడిని నిజం చేస్తూ భారత ఆకాశ మార్గాల్లో సురక్షిత ప్రయాణానికి ఈ 100 శాతం ర్యాండమ్ పరీక్షలు ఓ రక్షణ కవచంలా నిలవనున్నాయి.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
లెన్స్కార్ట్లో సాఫ్ట్బ్యాంక్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసే సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ తాజాగా లెన్స్కార్ట్ సొల్యూషన్స్లో వాటాలను మరింతగా తగ్గించుకుంది. ఓపెన్ మార్కెట్లో 2.6 శాతం వాటాలను రూ. 2,888 కోట్లకు విక్రయించింది. జూన్లో 3.25 శాతం వాటాలను సాఫ్ట్బ్యాంక్ రూ. 2,873 కోట్లకు విక్రయించింది.తాజాగా ఒక్కో షేరుకి సగటున రూ. 641.75 రేటుతో తమ అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ టూ లైట్బల్బ్ (కేమ్యాన్) ద్వారా మొత్తం 4.5 కోట్ల షేర్లను అమ్మేసింది. దీనితో కంపెనీలో సాఫ్ట్బ్యాంక్ వాటా 9.86 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చింది. -
రూ.999కే ఇంటిపై సోలార్.. టాటా పవర్ కొత్త స్కీమ్
పెరుగుతున్న విద్యుత్ బిల్లులకు ప్రత్యామ్నాయంగా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. అయితే భారీగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావడం అడ్డంకిగా మారుతోంది. ఈ నేపథ్యంలో టాటా పవర్ బీహార్లో ‘ఘర్ ఘర్ సోలార్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న గృహ వినియోగదారులు కేవలం రూ.999 ప్రారంభ చెల్లింపుతో రూఫ్టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.టాటా పవర్ సోలార్ రూఫ్ (Solaroof) ద్వారా అందిస్తున్న ఈ ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయంలో సిస్టమ్ ఖర్చుకు 100 శాతం వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉండొచ్చు. రుణ కాలపరిమితి గరిష్ఠంగా 60 నెలల వరకు ఉంటుంది. అయితే వడ్డీ రేటు, అర్హత, ఈఎంఐ వంటి అంశాలు వినియోగదారుడి ప్రొఫైల్, సిస్టమ్ సామర్థ్యం, ఫైనాన్సింగ్ భాగస్వామిని బట్టి మారవచ్చు. టాటా పవర్ ప్రస్తుతం సోలార్ ఫైనాన్సింగ్ కోసం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేస్తోంది.5 ఏళ్ల వరకు ఈఎంఐబీహార్లో ప్రకటించిన ఈ ఆఫర్లో రూ.999ను ప్రారంభ చెల్లింపుగా చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉంది. కొన్ని సోలార్ సిస్టమ్లపై 60 నెలల వరకు కాలపరిమితి ఉండొచ్చు. ఫైనాన్సింగ్ నిబంధనలు, వడ్డీ, సబ్సిడీ, సిస్టమ్ ధర ఆధారంగా వాస్తవ ఈఎంఐ మారుతుంది.టాటా పవర్ తాజా బీహార్ కార్యక్రమం ద్వారా రాబోయే మూడేళ్లలో 5 లక్షల ఇళ్లకు రూఫ్టాప్ సోలార్ చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీహార్లో ఇప్పటివరకు సుమారు 25 వేల రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు జరిగిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కంపెనీ భావిస్తోంది. ఇందుకోసం 18 బ్యాంకులతో భాగస్వామ్యం చేసుకున్నట్లు, సుమారు 100 మంది భాగస్వాములు, రిటైలర్లతో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది.కేంద్ర, రాష్ట్ర సబ్సిడీతో మరింత ప్రయోజనంరూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన కింద సబ్సిడీ అందిస్తోంది. ప్రస్తుతం 1 కిలోవాట్ సోలార్ సిస్టమ్కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యానికి గరిష్ఠంగా రూ.78,000 వరకు కేంద్ర సబ్సిడీ లభిస్తుంది.బీహార్ ప్రభుత్వం కూడా అదనపు సాయం ప్రకటించినట్లు టాటా పవర్ తెలిపింది. రాష్ట్ర సబ్సిడీ 1 కిలోవాట్కు రూ.10,000, 2 కిలోవాట్లకు రూ.20,000గా ఉండగా, కేంద్ర-రాష్ట్ర సబ్సిడీలతో కలిపి 1 కిలోవాట్కు రూ.40,000, 2 కిలోవాట్లకు రూ.80,000, 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువకు రూ.98,000 వరకు మొత్తం ప్రయోజనం లభించవచ్చని కంపెనీ వెల్లడించింది.ఇదీ చదవండి: పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్ -
క్విక్ కామర్స్ సంస్థల ఫుడ్ లైసెన్సులు సస్పెండ్
క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లపై విషపూరిత దతూర (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి అనువైన ఆహార ఉత్పత్తులుగా విక్రయించినట్లు గుర్తించిన కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలనా విభాగం కీలక చర్యలు తీసుకుంది. అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్లకు జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.విషపూరిత ఉత్పత్తులను క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో అధికారులు దతూర ఉత్పత్తుల విక్రయం, ఆన్లైన్ లిస్టింగ్లపై విచారణ చేపట్టారు. దర్యాప్తులో కొన్ని ప్లాట్ఫామ్లలో దతూర పండ్లు, విత్తనాలు ఆహార ఉత్పత్తులుగా కనిపించడంతో పాటు వాటిపై FSSAI ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్యాకెట్లను గిడ్డంగుల్లో నిల్వ ఉంచి ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా విక్రయించేందుకు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడైంది.తింటే తీవ్ర ఆరోగ్య ముప్పుదతూరను సాధారణంగా ‘థోర్న్ యాపిల్’గా పిలుస్తారు. ఇందులో సహజంగా విషపూరిత ఆల్కలాయిడ్లు ఉండటంతో దీనిని తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అధికారులు ప్రత్యేకంగా శుద్ధి చేయని దతూరను వినియోగించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. తీవ్రమైన విషప్రభావం ఏర్పడితే కోమా వంటి పరిస్థితులు, అత్యంత తీవ్ర సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశం ఉందని వైద్యపరమైన హెచ్చరికలు ఉన్నాయి.కంపెనీల వివరణలపై అసంతృప్తిఈ వ్యవహారంపై సంబంధిత సంస్థల ప్రతినిధులు అధికారుల ఎదుట హాజరయ్యారు. ఉత్తర్వుల ప్రకారం, అమెజాన్ తన వివరణను సమర్పించలేదు. ఇన్స్టామార్ట్ తనవైపు తీసుకున్న చర్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించేందుకు మరింత సమయం కోరింది. మరోవైపు బిగ్బాస్కెట్ దతూర పండ్ల ఆన్లైన్ విక్రయాన్ని నిలిపివేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తులపై ‘మానవ వినియోగానికి కాదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించేలా లేబులింగ్ను సరిచేస్తామని పేర్కొంది. అయితే ఈ వివరణలు సంతృప్తికరంగా లేవని ఆహార భద్రతా విభాగం తేల్చింది.సెల్లర్లపైనా చర్యలుదతూరను ఆహారంగా నిల్వ చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్లాట్ఫామ్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న విక్రేతలు, సరఫరాదారుల ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లను కూడా తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే దతూర పండ్లు లేదా విత్తనాలను ఆహారం/మానవ వినియోగం కోసం అందిస్తున్న అన్ని ఆన్లైన్ లిస్టింగ్లు, ప్రకటనలను తొలగించాలని లేదా నిలిపివేయాలని సంబంధిత ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లను ఆదేశించారు.ఇదీ చదవండి: ఈ జలుబు మందులు బ్యాన్.. నిషేధించిన కేంద్రం -
వారానికి ఐదు రోజుల పనేనా?
దేశంలోని బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాల ఉమ్మడి వేదికైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) వారానికి 5 రోజుల పనిదినాల అమలు డిమాండ్తో మరోసారి సమ్మెకు సిద్ధమైంది. 12వ ద్వైపాక్షిక ఒప్పందం (12th Bipartite Settlement), 9వ జాయింట్ నోటిఫై 2024పై మార్చి 8నే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యూనియన్లు సంతకాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఇంకా లభించకపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.ఈ ఒప్పందం ప్రకారం శని, ఆదివారాలు సెలవు దినాలుగా ప్రకటిస్తూ దానికి పరిహారంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాల అదనపు పనివేళలను పెంచేందుకు యూనియన్లు అంగీకరించాయి. అయితే ప్రభుత్వ ఆలస్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ యూఎఫ్బీయూ మూడు దశల ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల సమ్మె, అప్పటికీ డిమాండ్లు నెరవేరకపోతే అక్టోబర్ 26 నుంచి అనిశ్చిత కాల సమ్మె చేపడతామని స్పష్టం చేసింది.వారానికి 5 రోజుల బ్యాంకింగ్తో పాటు ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) తీసుకొచ్చిన విచక్షణాయుతమైన పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, దానికి సమానమైన పీఎల్ఐని వర్తింపజేయాలని యూనియన్లు కోరుతున్నాయి. అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, పెన్షన్ అప్డేషన్, డీఏ ఫార్ములాను ఏకీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.నేటి డిజిటల్ యుగంలో నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినందున బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పనిదినాల అమలు వల్ల కస్టమర్ సేవలకు ఎటువంటి విఘాతం కలగదని బ్యాంకింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా, ఉద్యోగులలో వర్క్-లైఫ్ సమతుల్యత పెరిగి వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఈ సుదీర్ఘ డిమాండ్పై నిర్ణయం తీసుకోకుంటే పండుగల సీజన్లో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
ఐపీఓకి సిద్ధమవుతున్న ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ సంస్థ
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ వంటనూనెల తయారీ సంస్థ ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ కంపెనీ ‘జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ఎల్)’ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సిద్ధమవుతోంది. పరిశ్రమ దిగ్గజం ప్రదీప్ కుమార్ చౌదరి సారథ్యంలో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ ఐపీవోలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 4.115 కోట్ల షేర్లను విక్రయించనుంది.విక్రయదారుల్లో బ్లాక్ రివర్ ఫుడ్ 2 (3.086 కోట్ల షేర్లు), ఇన్వెస్ట్మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ (61.7 లక్షల షేర్లు), ప్రమోటర్ అల్కా చౌదరి, జీఏఐఈ (చెరో 20.6 లక్షల షేర్లు) ఉన్నారు.ఆర్థిక వృద్ధి.. తయారీ సామర్థ్యంవంటనూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, ట్రేడింగ్, మార్కెటింగ్లో పట్టు సాధించిన జీఈఎఫ్ఎల్ వినియోగ ఉత్పత్తుల సమగ్ర ప్లాట్ఫామ్గా ఎదిగేందుకు మసాలా దినుసులు, కన్వీనియెన్స్ ఫుడ్స్ను పోర్ట్ఫోలియోలోకి తెచ్చింది. డీఆర్హెచ్పీలోని సమాచారం ప్రకారం, 2020-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య బ్రాండెడ్ ఆదాయం ఏటా 20.5% కాంపౌండ్ వృద్ధిని నమోదు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,053.84 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 16.83% వార్షిక వృద్ధితో రూ.12,650 కోట్లకు చేరుకుంది.ఉత్పత్తి కేంద్రాలు..ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ (రెండు ప్లాంట్లు), కృష్ణపట్నం (ఒక ప్లాంట్)ల్లో ఉన్న మూడింటి ఉమ్మడి రిఫైనింగ్ సామర్థ్యం వార్షికంగా 12.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2026 నివేదిక ప్రకారం 6.66 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది.తదుపరి వ్యూహందక్షిణాది ప్యాకేజ్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ రిటైల్ విపణిలో ఆదాయంపరంగా 22.2% వాటాతో జీఈఎఫ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. 1,600 డిస్ట్రిబ్యూటర్లు, 3 లక్షలకు పైగా రిటైల్ ఔట్లెట్లు, 60కి పైగా వేర్హౌస్ల బలమైన నెట్వర్క్తో దాదాపు 31.8 కోట్ల మంది వినియోగదారులకు కంపెనీ చేరువైందని ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో మార్కెట్ లీడర్షిప్ను కాపాడుకుంటూనే తెలంగాణ, కర్ణాటకలతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు తమ నెట్వర్క్ను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ సొంత ‘రైడ్-హెయిలింగ్’ యాప్!
తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కావడంతో డ్రైవర్లు సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల సంక్షేమం, ఆదాయ మార్గాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలను వెల్లడించింది.సొంత యాప్ రూపకల్పనఓలా, ఊబర్ వంటి ప్రైవేట్ అగ్రిగేటర్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక 'రైడ్-హెయిలింగ్ యాప్'ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనిద్వారా ప్రైవేట్ యాప్ల కమిషన్ల భారం తగ్గి డ్రైవర్ల నికర ఆదాయం పెరిగే అవకాశముందని చెప్పారు.2012 తర్వాత తొలిసారిగా ఛార్జీల పెంపురవాణా రంగ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2012 తర్వాత మొదటిసారిగా ఆటో ఛార్జీల సవరణకు ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ఆమోదం తెలిపింది. కొత్త ఛార్జీలకు సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.ఈవీ కన్వర్షన్కు రూ.1.50 లక్షల సాయంహైదరాబాద్లో కాలుష్య నియంత్రణతో పాటు ఇంధన భారాన్ని తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు (రెట్రోఫిట్టింగ్) ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు.బైక్ ట్యాక్సీలు.. సంక్షేమంపై స్పష్టతవాణిజ్య అవసరాలకు మాత్రమే ఉపయోగించే ‘పసుపు రంగు నంబర్ ప్లేట్’ ఉండే ద్విచక్రవాహనాలను మాత్రమే బైక్ ట్యాక్సీలుగా అనుమతించే అంశంపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే, ఎన్నికల హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సహాయం అందించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వివరించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
ఇండోనేషియా ప్రభుత్వంతో వంతారా భాగస్వామ్యం
ఆసియా ఖండంలో వన్యప్రాణుల ఆరోగ్య రక్షణ, క్షేత్రస్థాయి సంరక్షణ దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణి సంరక్షణ సంస్థ వంతారా ఇండోనేషియా ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానిక ‘ఫౌనా ల్యాండ్ గ్రూప్’ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ వివరాలను ఇండోనేషియా అటవీ శాఖ మంత్రి రాజా జూలీ ఆంటోనీ జకార్తాలోని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.కీలక సంస్కరణలు.. ఆధునిక మౌలిక వసతులుఈ భాగస్వామ్యం కింద వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..అడవుల్లోని వన్యప్రాణులకు తక్షణ వైద్యం అందించేందుకు 10 సంచార జంతు ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నారు.వే కాంబస్ ప్రాంతంలోని ఏనుగుల ఆసుపత్రిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ఎలిఫెంట్ ట్రీట్మెంట్ అండ్ కేర్ సెంటర్’గా ఆధునీకరిస్తున్నారు. ఇది సంరక్షణలో ఉన్న 62 సుమత్రన్ ఏనుగులతో పాటు, పరిసర ప్రాంతాల్లోని దాదాపు 100 అడవి ఏనుగులకు సేవలందిస్తుంది.ఏనుగుల సంరక్షకులు, పశువైద్యులు, అటవీ శాఖ అధికారులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.‘వన్యప్రాణుల రక్షణ మా ప్రాథమిక బాధ్యత. వంతారా అనుభవం, వనరుల సహకారంతో మా సొంత మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో ఇండోనేషియా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తాయి’ అని రాజా జూలీ ఆంటోనీ తెలిపారు.అంతర్జాతీయ స్థాయిలో వంతారా విస్తరణవంతారా ఇటీవల ప్రకటించిన ఐదేళ్ల ప్రణాళికలో భాగంగా జూమ్నగర్ కేంద్రంగా అభివృద్ధి చేసిన వైద్య నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. CITES నిబంధనలకు కట్టుబడి వన్యప్రాణుల సహజసిద్ధ ఆవాసాల్లోనే వాటి సంరక్షణకు (in-situ) శ్రీకారం చుట్టింది. వంటార సీఈఓ వివాన్ కరానీ మాట్లాడుతూ, ఇండోనేషియా జీవవైవిధ్యాన్ని కాపాడటంలో భాగస్వామ్యం కావడం గర్వకారణమని పేర్కొనగా, ఫౌనా ల్యాండ్ సీఈఓ డెన్నీ గుణలెన్ ఈ నిర్ణయం స్థానిక అటవీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు! -
ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యం నిరంతరం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ శారీరక పరిమాణం, బరువు పెరుగుదల, ఆరోగ్య ముప్పులపై అంతర్జాతీయ మీడియాలో భిన్న కథనాలు వెలువడుతున్నాయి. కొన్నేళ్లుగా ఆయన బరువులో చోటుచేసుకున్న మార్పులపై వెలువడుతున్న వార్తల నేపథ్యంలో వైట్ హౌస్ విడుదల చేసిన అధికారిక వైద్య నివేదికలు ఏం చెబుతున్నాయో చూద్దాం.హెల్త్ రిపోర్టులు.. నిజనిజాలుమే నెలలో ట్రంప్ బరువు 238 పౌండ్లు, అంటే సుమారు 107.9 కిలోలు అని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. జార్జియాలో ఎన్నికల జోక్యం కేసులో ఆయనపై అభియోగాలు మోపినప్పుడు ఆగస్టు 2023లో నమోదైన 215 పౌండ్లు, అంటే సుమారు 97.5 కిలోల బరువుతో పోలిస్తే అధికం. మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో సుమారు 23 పౌండ్లు లేదా 10.4 కిలోగ్రాముల పెరుగుదలను ఇది సూచిస్తుంది.గుండె ఆరోగ్యం.. జీవక్రియల పనితీరువైద్య పరీక్షల్లో ఆయన రక్తపోటు (సుమారు 128/74), కొలెస్ట్రాల్, గ్లూకోజ్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం ఆయన రెగ్యులర్గా 'రోసువాస్టాటిన్', గుండె ఆరోగ్య రక్షణకు తక్కువ మోతాదు 'యాస్ప్రిన్' ఉపయోగిస్తున్నారు. కొరోనరీ సీటీ యాంజియోగ్రామ్, ఎకోకార్డియో గ్రామ్ పరీక్షల్లో ఎలాంటి గుండె నరాల అడ్డంకులు లేవని, గుండె సమర్థవంతంగా పనిచేస్తోందని తేలింది.వైద్య నిపుణుల హెచ్చరికలుట్రంప్ ఎత్తు (6 అడుగుల 3 అంగుళాలు) ప్రకారంగా ఆయన ప్రస్తుత బీఎంఐ సుమారు 28 నుంచి 29.5 వద్ద ఉంది. వైద్య పారామితుల ప్రకారం 25 దాటిన బీఎంఐని అధిక బరువుగా పరిగణిస్తారు. వయోవృద్ధులలో అధిక బరువు ఉండటం వల్ల భవిష్యత్తులో కార్డియోవాస్క్యులర్ సమస్యలు, మధుమేహం లేదా కీళ్ల నొప్పుల ముప్పు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మాంట్రీల్ కాగ్నిటివ్ అసెస్మెంట్ పరీక్షలో 30/30 స్కోరు సాధించడంతో పాటు అన్ని రకాల న్యూరోలాజికల్, శారీరక పరీక్షల్లో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, దేశాధినేత బాధ్యతలను నిర్వర్తించడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిరంతర ఆహార నియమాలు, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా బరువును మరింత అదుపులో ఉంచుకోవడం అవసరమని వైద్యులు సూచించారు.ఇదీ చదవండి: టాటా సన్స్.. ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ -
టాటా సన్స్.. ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ
భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ 17న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశాన్ని నిర్వహించనుంది. ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవీ కాలం ముగిసిన తర్వాత (ఫిబ్రవరి 2027) మరొకసారి ఆ పదవిలో కొనసాగడానికి మొగ్గు చూపడం లేదని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రతిపాదిత సమావేశం నేపథ్యంబాంబే హౌస్లో జరగనున్న ఈ భేటీలో చంద్రశేఖరన్ వైదొలగే ప్రకటనను బోర్డు అధికారికంగా నమోదు చేయడంతో పాటు తదుపరి అధికారి ఎంపిక ప్రక్రియపై కీలక చర్చలు జరగనున్నాయి. ఆగస్టు 12న చంద్రశేఖరన్ బోర్డుకు లేఖ రాస్తూ.. ఫిబ్రవరి 2027తో ముగిసే తన పదవీ కాలం నాటికి కొత్త నాయకుడికి బాధ్యతలు అప్పగించేందుకు వీలుగా ముందస్తుగా ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.టాటా ట్రస్ట్స్ ప్రభావం.. ఐపీఓ సవాళ్లుఈ నాయకత్వ మార్పులో ముఖ్య వాటాదారులైన నోయెల్ టాటా నాయకత్వంలోని టాటా ట్రస్ట్స్ కీలక పాత్ర పోషించనుంది. అంతర్గత వర్గాల ప్రకారం, గత పాలనాపరమైన విధానాలు, నిర్ణయాల్లో ఏకగ్రీవ మద్దతు లభించకపోవడమే చంద్రశేఖరన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరొకవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం టాటా సన్స్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా ఐపీఓకు వెళ్లాల్సి ఉండగా దాని నుంచి మినహాయింపు పొందేందుకు అప్పులను తీర్చివేసే ప్రక్రియలో కంపెనీ ఉంది.భవిష్యత్తు దిశసెప్టెంబర్ 17 భేటీలో బోర్డు సభ్యులు చంద్రశేఖరన్ను తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని కోరతారా లేదా కొత్త చైర్మన్ ఎంపిక కోసం 5 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక ప్యానెల్ను ఏర్పాటు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రశేఖరన్ పదేళ్ల నాయకత్వంలో టాటా గ్రూప్ ఈ-కామర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు వంటి సరికొత్త రంగాలలోకి వేగంగా విస్తరించింది. ఈ దృష్ట్యా, రాబోయే కొత్త నాయకత్వం టాటా గ్రూప్ భవిష్యత్తు వ్యూహాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనే అంశంపై స్టాక్ మార్కెట్ నిపుణులు, కార్పొరేట్ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం -
SBI: రూ. 200 లక్షల కోట్ల టర్నోవర్!
న్యూఢిల్లీ: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2030లో 75వ వ్యవస్థాపక దినోత్సవం (ప్లాటినం జూబ్లీ) జరుపుకునే నాటికి మొత్తం వ్యాపారం రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి చెప్పారు. ప్రస్తుత వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే టర్నోవర్ రెట్టింపయ్యే అవకాశం ఉందన్నారు. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాల బదిలీ సహా ఇతర అంశాల కోసం పార్లమెంటులో చట్టం ద్వారా 1955 జూలై 1న ఎస్బీఐ ఆవిర్భవించింది.దేశంగా అతిపెద్ద బ్యాంకుగా నిలుస్తున్న ఎస్బీఐ మొత్తం వ్యాపారం (మొత్తం రుణాలు, అడ్వాన్సులు) గత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో తొలిసారి రూ.100 లక్షల కోట్ల మైలురాయిని దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ నాటికి ఇది రూ.110.01 లక్షల కోట్లకు ఎగబాకింది. కాగా, ప్లాటినం జూబ్లీ నాటికి నిర్దిష్ట టార్గెట్ ఏదీ బ్యాంకు నిర్దేశించుకోలేదని, అయితే, ప్రస్తుత వృద్ధి ప్రకారం చూస్తే టర్నోవర్ రూ.170–180 లక్షల కోట్లుగా ఉండొచ్చని, గరిష్టంగా రూ.200 లక్షల కోట్లను కూడా తాకే చాన్సుందని చెప్పారు. అది మరో కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.ఎకానమీతో పాటే... ఎస్బీఐ కార్యకలాపాలు భారత ఎకానమీ పనితీరుతో ముడిపడి ఉన్నాయని శెట్టి పేర్కొన్నారు. ‘మన ఆర్థిక వ్యవస్థ ఏటా 7–8 శాతం మేర గనుక వృద్ధి చెందితే, ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ కూడా 11–12 శాతం వార్షిక వృద్ధి రేటును సాధించే సామర్థ్యం ఉంటుంది. అంటే, ప్రతి ఆరేళ్లకు బ్యాలెన్స్ షీట్ రెట్టింపవుతుంది. దీని ప్రకారం చూస్తే 2030 కల్లా ఎస్బీఐ మొత్తం బిజినెస్ రూ. 200 లక్షల కోట్లకు చేరవచ్చు‘ అని ఆయన వివరించారు. కస్టమర్లు, ఉద్యోగులు, వాటాదారులు, అలాగే ఆర్బీఐతో సహా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు... ఈ నాలుగు పక్షాల ప్రయోజనాలు లేదా అవసరాలను తీర్చేవిధంగా బ్యాంకు కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో విజన్ 2030పై ఫోకస్ చేస్తున్నామని కూడా ఎస్బీఐ చైర్మన్ తెలిపారు. -
పసిడి రుణాలు @ రూ. 1.5 లక్షల కోట్లు
చెన్నై: గోల్డ్ లోన్స్కి డిమాండ్ గణనీయంగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తమ పసిడి రుణాల పోర్ట్ఫోలియో రూ. 1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1.25 లక్షల కోట్లుగా ఉన్నట్లు వివరించారు.పసిడి రుణాల సెగ్మెంట్ 20 శాతం మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మొత్తం రుణాల్లో ఆర్ఏఎం (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ) వాటా 65 శాతంగా ఉండగా, మిగతా 35 శాతం వాటా కార్పొరేట్ రంగానిది ఉంటోందని వివరించారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈల దన్నుతో ఆర్ఏఎం విభాగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్) 15.30 శాతం వృద్ధి చెందినట్లు చెప్పారు. సేవింగ్స్ డిపాజిట్లు 13.54 శాతం, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 26.33 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. -
రూ.2 లక్షల జీతం.. అయినా కష్టాలే!
సాధారణంగా నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల జీతం అంటే చాలామందికి మంచి ఆదాయమే. ఇలాంటి జీతం వస్తే హాయిగా జీవించొచ్చని అనుకుంటారు. కానీ.. పెద్ద నగరాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందని ఓ మహిళ చెబుతోంది. నెలకు రూ.1-2 లక్షలు సంపాదిస్తున్నా.. ఖర్చులు పోగా చేతిలో పెద్దగా డబ్బు మిగలడం లేదని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఏమిటీ 'శాలరీ ట్రాప్'ఇన్స్టాగ్రామ్లో నిధి కుష్వాహా అనే మహిళ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. టైర్-1 నగరాల్లో నెలకు రూ.1-2 లక్షలు సంపాదించే వాళ్లు కూడా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు.ఆమె చెప్పిన లాజిక్ కూడా చాలామందికి కనెక్ట్ అవుతోంది. ఈ జీతం తక్కువ ఆదాయంతో జీవించే స్థాయి నుంచి బయటపడటానికి సరిపోతుంది. కానీ.. ఖరీదైన జీవనశైలిని ఎలాంటి ఆలోచన లేకుండా కొనసాగించడానికి మాత్రం సరిపోదు. అంటే.. జీతం బాగానే ఉంటుంది, కానీ నెలాఖరుకు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది.పెద్ద నగరాల్లో ఖర్చులుఇక్కడ ప్రధాన సమస్య జీవన వ్యయం. టైర్-1 నగరాల్లో ఇంటి అద్దె ఒక్కటే జీతంలో పెద్ద భాగాన్ని తీసుకుపోతుంది. దానికి తోడు కరెంట్, ఇంటి ఖర్చులు, కారు లేదా బైక్ ఈఎంఐ, పెట్రోల్, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం, బయట తినడం, షాపింగ్ ఇలా ఒక్కో ఖర్చు కలుస్తూ పోతుంది.ఉదాహరణకు నెలకు రూ.1.5 లక్షలు జీతం వస్తే.. అందులో రూ.30-40 వేలు ఇంటి అద్దెకే వెళ్లొచ్చు. పిల్లలున్న కుటుంబాల్లో స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు అదనంగా ఉంటాయి. కారు ఈఎంఐ లేదా హోమ్ లోన్ ఉంటే మరో పెద్ద మొత్తం అక్కడే పోతుంది. చివరికి పొదుపు చేయడానికి అనుకున్న డబ్బు చాలా తక్కువగా మిగలొచ్చు.జీతం పెరిగితే ఖర్చులు కూడాఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం లైఫ్స్టైల్ ఇన్ఫ్లేషన్. జీతం పెరిగినప్పుడు మన అవసరాలు మాత్రమే కాదు.. మన కోరికలు కూడా పెరుగుతాయి.మంచి జీతం రావడంతో ఖరీదైన ఇల్లు, కొత్త కారు, ఎక్కువ ట్రావెల్స్, రెస్టారెంట్లు, బ్రాండెడ్ వస్తువులు ఇలా ఖర్చులు పెరగొచ్చు. మొదట్లో ఇవన్నీ చిన్న ఖర్చుల్లానే అనిపిస్తాయి. కానీ నెలాఖరుకు చూస్తే మొత్తం పెద్దదైపోతుంది. అందుకే కొంతమందికి జీతం రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెరిగినా.. పొదుపు మాత్రం పెద్దగా పెరగదు.ఇతరులతో పోల్చుకోవడం మరో సమస్యసోషల్ మీడియా వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మన చుట్టూ ఉన్నవాళ్లు కొత్త కారు కొంటున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్తున్నారు అని చూసి మనం కూడా అదే స్థాయిలో జీవించాలనుకుంటాం. కానీ వాళ్ల ఆదాయం ఎంత?, వాళ్ల అప్పులు ఎంత?, వాళ్లు ఎంత పొదుపు చేస్తున్నారు?, అనేది మనకు తెలియదు. అయినా వాళ్ల జీవనశైలిని చూసి మన ఆర్థిక పరిస్థితికి సరిపోని ఖర్చులు చేస్తే సమస్యలు మొదలవుతాయి.నెటిజన్ల స్పందననిధి కుష్వాహా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె చెప్పింది నిజమేనని అన్నారు. తమ స్నేహితులు కూడా ఇలాంటి ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని కొందరు చెప్పారు. అయితే.. మరికొందరు మాత్రం సమస్య జీతంలో కంటే మన ఖర్చు చేసే విధానంలో ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మనకు నిజంగా ఏం అవసరమో తెలుసుకోకుండా ఇతరుల జీవనశైలిని అనుసరించడం ఆర్థికంగా ఇబ్బందులకు దారితీయొచ్చని అన్నారు. View this post on Instagram A post shared by Nidhi Kushwaha | Money, Mindset & Real Perspectives (@nidhi_kushwaa) -
సంతకం చేయనందుకు ఉద్యోగం పోయిందా?
మెటా ప్లాట్ఫామ్స్కు చెందిన మాజీ ప్రొడక్ట్ డిజైన్ మేనేజర్ 'జేమ్స్ టిల్లింగ్హాస్ట్'.. తనను కంపెనీ అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. తన సహోద్యోగి గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన ఒక ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయడానికి నిరాకరించిన తర్వాతే సమస్యలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు.వివాదం ఎలా మొదలైంది?న్యూజెర్సీ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన దావా ప్రకారం.. 2024లో మెటా ఇమ్మిగ్రేషన్ లీగల్ టీమ్, తన విభాగంలోని ఒక ఉద్యోగికి సంబంధించిన గ్రీన్ కార్డ్ దరఖాస్తుకు (EB-2 నేషనల్ ఇంటరెస్ట్ వేవర్) మద్దతుగా ఒక సిఫార్సు లేఖపై సంతకం చేయమని టిల్లింగ్హాస్ట్ను కోరడంతో ఈ వివాదం ప్రారంభమైంది.ముసాయిదా లేఖలో ఆ ఉద్యోగి మెటా కోసం సుమారుగా 638 మిలియన్ డాలర్ల అదనపు ప్రకటనల ఆదాయాన్ని సంపాదించిపెట్టాడని, కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గారిథం సాధనాలను నేరుగా అభివృద్ధి చేశాడని, పెద్ద బహుళ-కార్యాత్మక బృందాలకు నాయకత్వం వహించాడని ఆరోపించినట్లు తెలుస్తోంది.లేఖలోని విషయాలపై అభ్యంతరంఆ లేఖలోని కొన్ని విషయాలు అతిశయోక్తిగా, వాస్తవ ఆధారాలు లేనివిగా టిల్లింగ్హాస్ట్కు అనిపించాయి. అందుకే తాను నిజమని నమ్మి ధృవీకరించగలిగే అంశాలను మాత్రమే ఉంచేలా లేఖను మార్చినట్లు ఆయన చెబుతున్నారు. అయినప్పటికీ, ఆ లేఖపై సంతకం చేయడానికి ఆయన నిరాకరించారు. తరువాత మరో మేనేజర్ ఆ లేఖను అప్రూవ్ చేసినట్లు సమాచారం.USCISకి తప్పు సమాచారం ఇవ్వకూడదని నిర్ణయంటిల్లింగ్హాస్ట్ తన నిర్ణయం వెనుక ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశం లేదని చెబుతున్నారు. తనకు నిజం కాదని తెలిసిన సమాచారాన్ని యూఎస్సీఐఎస్ (యూ.ఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్)కు సమర్పించే ఇమ్మిగ్రేషన్ ప్రొసీడింగ్స్లో ధృవీకరించడం సరైనది కాదని భావించానని ఆయన పేర్కొన్నారు.ఆ తర్వాత ఉద్యోగంలో ఏమైంది?తన అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొద్దికాలానికే మెటాలోని తన ఇంటర్నల్ యాక్సెస్ తొలగించినట్లు టిల్లింగ్హాస్ట్ పేర్కొన్నారు. ఆ తరువాత సెప్టెంబర్ 2024లో ఉద్యోగం కోల్పోయారు.మెటా తనను పర్ఫామెన్స్ ఇస్స్యూ కారణంగా తొలగించిందని చెప్పినప్పటికీ, టిల్లింగ్హాస్ట్ మాత్రం ఆ కారణం నిజం కాదని అంటున్నారు. తనకు ఇంతకుముందు ఎలాంటి నెగిటీవ్ పర్ఫామెన్స్ రికార్డ్స్ లేదని, ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయడానికి నిరాకరించినందుకు ప్రతీకార చర్యగా తనను తొలగించారని ఆయన ఆరోపిస్తున్నారు.తనకు జరిగిన ఆర్థిక నష్టానికి 1 మిలియన్ కంటే ఎక్కువ నష్టపరిహారం కావాలని టిల్లింగ్హాస్ట్ కోర్టును కోరుతున్నారు. ఇందులో ఉద్యోగం కోల్పోవడం వల్ల వచ్చిన శాలరీ లాస్ మాత్రమే కాకుండా స్టాక్ ఈక్విటీకి సంబంధించిన నష్టాలు కూడా ఉన్నాయి.అయితే ఈ కేసులో అసలు ప్రశ్న.. టిల్లింగ్హాస్ట్ పనితీరు సరిగా లేకపోవడం వల్లనే కంపెనీ తొలగించిందా?, లేదా ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్ మీద సంతకం చేయకపోవడమే కారణమా?, అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.ఇదీ చదవండి: EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్న్యూస్! -
5G కోసం బెస్ట్ రీఛార్జ్ ఏది? జియో, ఎయిర్టెల్ ప్లాన్స్ ఇవే!
స్మార్ట్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ.. మంచి స్పీడ్తో పాటు తక్కువ ధరలో, ఎక్కువ డేటా, ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటారు. భారత్లో 5జీ సేవలు అందిస్తున్న ప్రధాన టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ ముందున్నాయి. అయితే జియోలో రూ.198 ప్లాన్, ఎయిర్టెల్లో రూ.349 ప్లాన్ తీసుకుంటే ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది?, రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? ఇప్పుడు చూద్దాం.జియో రూ.198 ప్లాన్తక్కువ బడ్జెట్లో 5జీ కావాలనుకునే వారికి జియో రూ.198 ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్ 14 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ రీఛార్జ్తో రోజుకు 2జీబీ డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయి. ఎక్కువగా వీడియోలు చూసేవారు, సోషల్ మీడియా ఉపయోగించేవారు, భారీ ఫైళ్లను డౌన్లోడ్ చేసేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. అదనంగా.. జియో టీవీ, జియోఏఐక్లౌడ్ వంటి ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్లో ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ ధర జిఓ కంటే ఎక్కువే, అయితే ఇందులో వ్యాలిడిటీ 28 రోజులు లభిస్తుంది. ఇందులో రోజుకు 1.5జీబీ డేటా, 100 SMSలు, అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే.. 12 నెలల పాటు అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే యాపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్లో భాగంగా అందుతోంది.జియో, ఎయిర్టెల్ మధ్య తేడా!రెండు ప్లాన్లను పరిశీలిస్తే.. ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. జియో రూ.198 ప్లాన్ చౌకగా ఉండటంతో పాటు రోజువారీ డేటా కూడా ఎక్కువగా ఇస్తుంది. కానీ దీని వ్యాలిడిటీ కేవలం 14 రోజులు. అదే.. ఎయిర్టెల్ రూ.349 ప్లాన్కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంది. అంటే జియో ప్లాన్తో పోలిస్తే రెట్టింపు కాలం రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అయితే రోజువారీ డేటా 1.5GB మాత్రమే.మరి ఏ ప్లాన్ తీసుకోవాలి?మీకు తక్కువ ధరలో 5జీ కావాలి, ఎక్కువగా 5జీ డేటా ఉపయోగించాలి అనుకుంటే.. జియో రూ.198 ప్లాన్ గురించి ఆలోచించవచ్చు. తక్కువ కాలానికి రీఛార్జ్ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చన్నమాట. అయితే 28 రోజుల వ్యాలిడిటీ, రోజువారీ డేటా, అదనపు సబ్స్క్రిప్షన్లు కావాలంటే ఎయిర్టెల్ రూ.349 ప్లాన్ మెరుగైన ఎంపిక అనే చెప్పాలి. -
బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే!
సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాలను అందించే తల్లి మేనమామ బంగారు ఉంగరం పథకం (Thaimaman Thanga Mothiram Scheme) కొనుగోలు ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎన్ఎంఎస్సీ) 70:30 నిష్పత్తిలో జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్కు 1,28,499 బంగారు ఉంగరాలు సరఫరా చేసేందుకు వర్క్ ఆర్డర్లను జారీ చేసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రకటించిన ఈ పథకం ప్రకారం జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రులలో పుట్టిన శిశువులకు ఈ పథం వర్తిస్తుంది. ఈ మేరకు జ్యుయల్లరీ సంస్థలకు 70:30 నిష్పత్తిలో వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జూన్ నుండి సెప్టెంబర్ నాలుగు నెలల వరకు ఉన్న లబ్ధిదారుల కోసం మొదటి విడతలో జూన్ నుండి లబ్ధిదారులకు 1,28,499 బంగారు ఉంగరాలను ఈ రెండు సంస్థలు సరఫరా చేస్తాయి.టెండర్ ప్రక్రియలో జాయ్ అలుక్కాస్ సంస్థ 1 గ్రాము బంగారు ధర మినహాయించి, తయారీ, రవాణా, ఇన్సూరెన్స్, BIS హాల్మార్కింగ్ చార్జీల కోసం కేవలం 0.01 (1 పైసా) అత్యల్ప ధరగా బిడ్ దాఖలు చేసింది. తమిళనాడు పారదర్శక టెండర్ల చట్టం ప్రకారం, కళ్యాణ్ జువెలర్స్ కూడా అతి తక్కువ ధరకు అంగీకరించడంతో 30శాతం వాటా దక్కించుకుంది. ఇదీ చదవండి: రూ. 150 కోట్ల అవినీతి : బార్ కౌన్సిల్ ఛైర్మన్పై సంచలన ఆరోపణలు కాగా తమిళ సంస్కృతిలో పుట్టిన బిడ్డకు మేనమామ బంగారు ఉంగరం తొడగడం ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఈ సెంటిమెంట్ను గౌరవిస్తూ,మగ లేదా ఆడ అనే లింగ బేధం లేకుండా, అలాగే ఎన్నో కాన్పు అనే పరిమితి లేకుండా పుట్టిన ప్రతి బిడ్డకు ఈ ఉంగరాన్ని అందిస్తారు.ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ. 755.83 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ వైద్య విధానంపై ప్రజలకు నమ్మకాన్ని పెంచడం , ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని సీఎం విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: దారుణం బిల్పై బాడీ షేమింగ్ వివాదం : స్పందించిన కెఫే -
ఈ జలుబు మందులు బ్యాన్.. నిషేధించిన కేంద్రం
చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్లోర్ఫెనిరామైన్ మేలేట్ (Chlorpheniramine Maleate), ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నాలుగేళ్లలోపు పిల్లలకు వినియోగించకుండా కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ రెండు పదార్థాలతో కూడిన మందుల తయారీ, విక్రయం, పంపిణీపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్ జారీ చేసింది.ఇక ప్యాక్పై హెచ్చరిక తప్పనిసరితాజా ఆదేశాల ప్రకారం.. ఈ కాంబినేషన్తో కూడిన మందుల తయారీదారులు లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార సామగ్రిపై ‘నాలుగేళ్లలోపు పిల్లలకు ఈ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ను ఉపయోగించకూడదు’ అనే హెచ్చరికను స్పష్టంగా ముద్రించాలి. ఈ నోటిఫికేషన్ అధికారిక గెజిట్లో ప్రచురితమైన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.2025లోనే తొలిసారి ఆంక్షలుఈ నిర్ణయం పూర్తిగా కొత్తదేమీ కాదు. 2025 ఏప్రిల్ 15న కేంద్రం ఇదే క్లోర్ఫెనిరామైన్ మేలేట్–ఫినైలెఫ్రైన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్పై ఆంక్షలు విధించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB) సిఫార్సుల మేరకు నాలుగేళ్లలోపు పిల్లల్లో వీటి వినియోగం వల్ల ప్రమాదాలు ఉండొచ్చని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అప్పట్లో పేర్కొంది.తాజా చర్య ద్వారా గత ఆంక్షల పరిధిని మరింత స్పష్టం చేస్తూ ఈ రెండు పదార్థాలు కలిగిన అన్ని సంబంధిత ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఫార్ములాలకు నాలుగేళ్లలోపు పిల్లల విషయంలో ఇదే నిషేధం/వినియోగ పరిమితిని వర్తింపజేశారు.జలుబు, ముక్కుదిబ్బడకు ఉపయోగించే కాంబినేషన్క్లోర్ఫెనిరామైన్ మేలేట్ అనేది యాంటీహిస్టమైన్ కాగా, ఫినైలెఫ్రైన్ ముక్కులోని రక్తనాళాల వాపును తగ్గించేందుకు ఉపయోగించే డీకంజెస్టెంట్. ఈ రెండింటినీ కలిపిన మందులను సాధారణంగా జలుబు, ముక్కు కారడం, ముక్కుదిబ్బడ వంటి లక్షణాల ఉపశమనానికి ఉపయోగిస్తారు. అయితే చిన్నారుల్లో ఇలాంటి కాంబినేషన్ మందులను ఉపయోగించే విషయంలో వయస్సు, మోతాదు, వైద్యుడి సూచనలను అత్యంత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది.నిపుణుల సిఫార్సుల ఆధారంగా నిర్ణయంఈ కాంబినేషన్ వల్ల నాలుగేళ్లలోపు పిల్లలకు సంభావ్య ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉండవచ్చని నిపుణుల కమిటీ, DTAB అభిప్రాయపడటంతో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పిల్లలకు అందుబాటులో ఉన్న సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆంక్షలను డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26A కింద ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం అమలు చేస్తోంది.ఇదీ చదవండి: భారీగా పెరిగిన చక్కెర ధరలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
1 పైసా బిడ్తో రూ.755 కోట్ల కాంట్రాక్ట్
తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తాయ్మామన్ తంగ మోదిరం’ (మేనమామ బంగారు ఉంగరం) పథకానికి సంబంధించి నిర్వహించిన గ్లోబల్ టెండర్లలో ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ సంచలన బిడ్తో ఎల్1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సుమారు రూ.755.83 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్లో ఒక గ్రామ్ 22 క్యారెట్ల బంగారు ఉంగరానికి కేవలం ‘1 పైసా’ మాత్రమే సర్వీస్ / తయారీ రుసుము (మేకింగ్ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్, హాల్మార్కింగ్)గా ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ పోటీలో పాల్గొన్న 11 ప్రముఖ సంస్థల్లో జీఆర్టీ జ్యువెలర్స్ రూ.410.97 (L2), వుమ్మిడి బంగారు జ్యువెలర్స్ రూ.822.97 (L3) ప్రతిపాదించగా జోయాలుక్కాస్ కోట్ చేసిన వ్యయం ఎవరికీ ఊహకందని విధంగా నిలిచింది. తమిళనాడు టెండర్ల పారదర్శకత చట్టం ప్రకారం, తక్కువ ధరను మ్యాచ్ చేసేందుకు ఇతర కంపెనీలకు అవకాశం ఇవ్వగా ఒక్క కల్యాణ్ జ్యువెల్లర్స్ మాత్రమే ముందుకు వచ్చింది. దాంతో ఈ మొత్తం ఆర్డర్లో 70 శాతం కోటాను జోయాలుక్కాస్కు, మిగిలిన 30 శాతాన్ని కల్యాణ్ జ్యువెలర్స్కు కేటాయిస్తూ టీఎన్ఎంఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే దాదాపు 4.41 లక్షల మంది నవజాత శిశువులకు ఒక్కో గ్రాము బంగారు ఉంగరాన్ని సెప్టెంబర్ 15 నుంచి పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం బంగారం అసలు ధరకు అయ్యే వ్యయాన్ని భరిస్తుండగా తయారీ, పంపిణీ బాధ్యతలను ఈ సంస్థలు నిర్వర్తిస్తాయి. వాణిజ్య లాభాల కంటే ప్రజారోగ్య సంక్షేమ పథకానికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూపాయి రహిత లాభాల మార్జిన్తో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోయాలుక్కాస్ అధినేత జోయ్ ఆలుక్కాస్ వెల్లడించారు.మరోవైపు, ఒక పైసాకే ఎలా పనులు చేపడతారంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఈ ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేయగా, తమిళనాడు ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా అత్యంత నాణ్యమైన బీఐఎస్ హాల్మార్క్ బంగారాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం -
అనలాగ్ పన్నీర్పై నిషేధం
కల్తీ ఆహార ఉత్పత్తులు, నకిలీ డెయిరీ పదార్థాల బారి నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రత ప్రాధికారిక సంస్థ (ఎఫ్డీఏ) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. పాలు, పాల పదార్థాల స్థానంలో వృక్షసంబంధిత కొవ్వులు (పాల్మ్ ఆయిల్), మైదా, స్టార్చ్, ఎమల్సిఫైయర్లు ఉపయోగించి కృత్రిమంగా తయారుచేసే ‘అనలాగ్ పన్నీర్’ (కృత్రిమ/నాన్-డెయిరీ పన్నీర్) తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలపై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ నిర్ణయం వెలువడింది.వినియోగదారుల హక్కులు - ఆరోగ్య సమస్యలుసాధారణంగా స్వచ్ఛమైన పన్నీర్ పాలలోని ప్రొటీన్లు, క్యాల్షియం కలిగిన అత్యంత పోషకాహారం. అయితే, ఖర్చు తగ్గించుకోవడమే లక్ష్యంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సర్వీసులు, క్లౌడ్ కిచెన్లు కస్టమర్లకు తెలియకుండా అనలాగ్ పన్నీర్ను అసలైన పన్నీర్గా వడ్డిస్తున్నాయి. ఇది ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం తీవ్రమైన అనుచిత వ్యాపార విధానం కిందకు వస్తుంది. నాసిరకం నూనెలు, ప్రాసెస్ చేసిన కెమికల్స్ వాడటం వల్ల గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం, జీర్ణకోశ వ్యాధులు వస్తాయని పోషకాహార నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కఠిన చర్యలు.. జరిమానాలువినియోగదారులను మోసం చేస్తూ అనలాగ్ పన్నీర్ను అసలు పన్నీర్గా విక్రయించే రెస్టారెంట్లు, వ్యాపారులపై అధికారులు సర్ప్రైజ్ రైడ్లు నిర్వహించనున్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి చట్టపరంగా ఆరు నెలల నుంచి జీవిత ఖైదు వరకు శిక్షలతో పాటు రూ.10 లక్షల వరకు భారీ జరిమానా విధించే అవకాశముంది. ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అనలాగ్ ఉత్పత్తుల విక్రయాలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి స్పష్టత కోరడం ఈ అంశం ప్రాధాన్యతను చాటుతోంది.ప్రజలు తాము కొనుగోలు చేసే పన్నీర్ నాణ్యతను గుర్తించి గుర్తింపు పొందిన బ్రాండ్లు, సురక్షితమైన ప్రదేశాల నుంచే కొనుగోలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆహార భద్రతలో రాజీ పడేది లేదని, ప్రజారోగ్య రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఎఫ్డీఏ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు! -
పండుగ షాపింగ్కు ధరల షాక్!
పండుగ సీజన్ వస్తోందంటే దేశంలో కొనుగోళ్ల సందడి మొదలవుతుంది. అయితే ఈసారి స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాల (కన్జూమర్ డ్యూరబుల్స్) ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ తరుణంలో ‘వినియోగదారుల కొనుగోలు ఉత్సాహం కొనసాగుతుందా’ అనేది పరిశ్రమకు అసలు పరీక్షగా మారింది. అయినప్పటికీ డిస్కౌంట్లు, సులభమైన ఈఎంఐ ఫైనాన్సింగ్, ప్రీమియం ఉత్పత్తులపై పెరుగుతున్న ఆసక్తి అమ్మకాలకు ఊతమిస్తాయని రిటైలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ పండుగ సీజన్లో 8–10 శాతం వృద్ధి నమోదవుతుందని విజయ్ సేల్స్ అంచనా వేస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ సేల్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని సంస్థ తెలిపింది. ధరల పెరుగుదల ప్రభావం అన్ని వర్గాల వినియోగదారులపై ఒకేలా ఉండదని క్రోమా స్టోర్లను నిర్వహించే ఇని్ఫనిటీ రిటైల్ తెలిపింది. అధునాతన ఫీచర్లు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాంకేతికత కలిగిన ప్రీమియం ఉత్పత్తులపై వినియోగదారుల ఆసక్తి బలంగానే ఉందని పేర్కొంది.ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు అమెజాన్ ఇండియా జూన్లో నిర్వహించిన ‘ప్రైమ్ డే సేల్’లో రూ.35,000కు పైబడిన ప్రీమియం టీవీల అమ్మకాలు గత ఏడాది(2025)తో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా 65 అంగుళాలు, అంతకంటే పెద్ద స్క్రీన్లకు డిమాండ్ పెరిగింది. ఈ సేల్లో అమ్ముడైన ప్రతి అయిదు విండోస్ ల్యాప్టాప్లలో ఒకటి ఏఐ ఆధారిత పీసీ కావడం విశేషం. రోబోటిక్ వాక్యూమ్లు, కాఫీ మెషీన్లు, ఐస్ మేకర్ల వంటి కొత్త తరహా వంటగది ఉత్పత్తుల డిమాండ్ 4.3 రెట్లు పెరిగింది. స్మార్ట్ఫోన్లు, ఎల్రక్టానిక్స్, హోమ్, కిచెన్ విభాగాల్లో కొనుగోళ్లు సాధారణ రోజు కంటే రెండింతలకు పైగా నమోదయ్యాయని అమెజాన్ ఇండియా తెలిపింది. వినియోగదారులు మరింత ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని అమెజాన్ ఇండియా తెలిపింది.పెరిగిన ధరల సవాల్ స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఇతర గృహోపకరణాల ధరలు పెరగడం ఈ పండుగ సీజన్లో పరిశ్రమకు ప్రధాన సవాలుగా మారింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం చివరి నాటికి స్మార్ట్ఫోన్ల ధరలు సుమారు 15 శాతం పెరిగాయని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ తెలిపింది. భారత మొబైల్ మార్కెట్లో సగటు విక్రయ ధర కూడా 2026 రెండో త్రైమాసికంలో 14.4 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 315 డాలర్లకు(సుమారు రూ.30,000) చేరినట్లు ఐడీసీ పేర్కొంది. కన్జూమర్ డ్యూరబుల్స్లోనూ ధరల పెంపు కనిపిస్తోంది. ఏప్రిల్–జూన్ మధ్య ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా రెండు దఫాల్లో తన ఉత్పత్తుల ధరలను 16–17 శాతం పెంచగా, బ్లూ స్టార్ 5 శాతం మేర పెంచింది. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ కూడా పలు ఉత్పత్తుల ధరలను పెంచింది.కొనుగోళ్లపై ప్రభావం ఎంత? ధరలు పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకునే అవకాశం లేదు, అయితే ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యస్థాయి, ఎంట్రీ–లెవల్ విభాగాల్లోని, టైర్–2, ఇతర చిన్న పట్టణాల వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద స్క్రీన్ టీవీలు, సైడ్–బై–సైడ్ రిఫ్రిజిరేటర్ల వంటి ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొంతవరకు పండుగ సీజన్కు వాయిదా పడ్డాయని సత్య ఏజెన్సీస్ తెలిపింది. అయితే ఎక్సే్చంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఫైనాన్సింగ్ పెరిగిన ధరల భారాన్ని కొంత తగ్గించవచ్చని అంచనా. మరోవైపు, కిచెన్ అప్లయెన్సులు, ఎంట్రీ–లెవల్ స్మార్ట్ఫోన్ల డిమాండ్ కొంత స్థిరంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్సుదీర్ఘమైన పండగ సీజన్పై ఆశలు ఈ ఏడాది దీపావళి నవంబర్లో రావడం పరిశ్రమకు మరో అనుకూల అంశంగా కనిపిస్తోంది. సాధారణంగా ఆగస్టులో స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్తో ప్రారంభమయ్యే పండుగ సీజన్ దీపావళి వరకు కొనసాగుతుంది. ఈసారి సెపె్టంబర్ నుంచి నవంబర్ మధ్య వరకు సుదీర్ఘంగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్రాండ్లు, ఆన్లైన్ మార్కెట్ప్లేస్లు, రిటైలర్లకు ఎక్కువ సమయం లభించనుంది. ‘దీపావళి నవంబర్లో వచ్చిన ప్రతిసారీ సేల్స్ విపరీతంగా పెరిగాయి’ అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ సంజయ్ చిత్రకారా తెలిపారు. గత ఏడాది ప్రధాన గృహోపకరణాలపై జీఎస్టీ తగ్గింపు పరిశ్రమకు కొంత ఊరటనిచ్చింది. అయితే ప్రస్తుతం రాగి, అల్యూమినియం వంటి ముడిసరుకుల ధరల పెరుగుదల తయారీ సంస్థలపై ఒత్తిడి పెంచుతోంది.గత ఏడాదితో పోలిస్తే రాగి ధరలు సుమారు 45 శాతం, అల్యూమినియం ధరలు 25 శాతం పెరిగాయని పరిశ్రమ అంచనా. దీంతో కంపెనీలు ధరల పెంపుతో పాటు కొత్త ఫీచర్లు, ఏఐ ఆధారిత సాంకేతికత కలిగిన ప్రీమియం ఉత్పత్తులను ప్రవేశపెట్టి వినియోగదారులను అప్గ్రేడ్ కొనుగోళ్ల వైపు మళ్లించేందుకు ప్రయతి్నస్తున్నాయి. మొత్తంగా, పెరిగిన ధరలు పండుగ సీజన్లో పరిశ్రమకు సవాలుగా ఉన్నప్పటికీ, ప్రీమియం ఉత్పత్తులపై కొనసాగుతున్న ఆసక్తి, డిస్కౌంట్లు, ఈఎంఐ సదుపాయాలు, సుదీర్ఘ సేల్స్ సీజన్ అమ్మకాలకు ఊతమిస్తాయని పరిశ్రమ ఆశిస్తోంది. సెప్టెంబర్ నుంచి దీపావళి వరకు కొనుగోళ్లు ఎంత మేర పుంజుకుంటాయన్నదే ఈ ఏడాది కన్జూమర్ డ్యూరబుల్స్ రంగం వృద్ధిని నిర్ణయించనుంది. -
వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు!
వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత అనుబంధాలకు నడుమ స్పష్టమైన సరిహద్దులు ఎంత అవసరమో చెప్పే ఆసక్తికర సంఘటన ఇది. ముంబైకి చెందిన డిజిటల్ క్రియేటర్, పారిశ్రామికవేత్త అవంతి నగ్రాల్ తన తల్లిని బిజినెస్ మేనేజర్గా నియమించుకుంది. కేవలం రెండు వారాల్లోనే ఆ పదవి నుంచి తల్లిని తొలిగించినట్లు వెల్లడించిన వివరాలు ఇప్పుడు కార్పొరేట్, స్టార్టప్ వర్గాల్లో చర్చకు దారితీసింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేరడానికి ముందు సంగీతం, నాటకరంగం, వినోద రంగానికి సంబంధించిన ప్రోగ్రామ్లతో బిజీగా ఉన్న సమయంలో తన షెడ్యూళ్లు, ఒప్పందాలు, ఈమెయిళ్లు చూసుకోవడానికి అవంతి తన తల్లిని మేనేజర్గా నియమించుకున్నారు. విభిన్న రంగాల్లో అనుభవం ఉన్న తల్లి సరైన నిర్ణయాలు తీసుకోగలదని భావించినా అది రెండు వారాల కంటే ఎక్కువ కాలం సాగలేదు.రక్షణే అడ్డంకిగా మారిన వేళతల్లిని బాధ్యతల నుంచి తప్పించడానికి కారణం ఆమె నిర్లక్ష్యం కాదని, కుమార్తెపై ఉన్న అమితమైన ప్రేమేనని అవంతి పేర్కొన్నారు. ‘నా తల్లి కెరీర్ను మేనేజ్ చేయడం లేదు, నాకు రక్షణగా నిలుస్తోంది’ అని గ్రహించడమే దీనికి ప్రధాన కారణం. రాత్రివేళల్లో జరిగే షోలు, తెలియని నగరాల్లో టూర్లు, భద్రత అంచనా వేయలేని ప్రదేశాలకు వెళ్లే అవకాశాలను తల్లి తిరస్కరించడం వల్ల వ్యాపార పురోగతికి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో బాధ్యతల నుంచి తల్లిని తప్పించి ప్రొఫెషనల్ ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది.సృజనాత్మక రంగంలో మౌలిక వసతుల కొరతఈ అనుభవం ద్వారా క్రియేటివ్ రంగానికి చెందిన వారు ఎదుర్కొంటున్న ప్రధాన లోపాన్ని అవంతి ఎత్తిచూపారు. భారతదేశంలో కళాకారులకు, స్వతంత్ర క్రియేటర్లకు వృత్తిపరమైన మేనేజ్మెంట్ సపోర్ట్, కాంట్రాక్ట్ చర్చలు నడిపే సరైన వ్యవస్థలు లేకపోవడంతో చాలామంది బంధువులు లేదా స్నేహితులపైనే ఆధారపడుతున్నారు. ఇది తరచూ వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడానికి లేదా వ్యాపార నష్టాలకు దారితీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రొఫెషనల్ వ్యాపారంలోనైనా భావోద్వేగాల కంటే ప్రాక్టికాలిటీ, మార్కెట్ అవసరాలు ముఖ్యాంశాలకు పెద్దపీట వేయాలి.ఇదీ చదవండి: ఓణం పండగొచ్చె.. టీ ధరలకు రెక్కలొచ్చె! -
బ్లూకాలర్ బూమ్!
ఒకప్పుడు డిగ్రీ ఉంటేనే భవిష్యత్ అనేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్ అనే కొత్త వాస్తవం రూపుదిద్దుకుంటోంది. ఏఐ యుగంలో ఉద్యోగాలు అంతరించిపోవడం కాదు, వాటి స్వరూపం మారుతోంది. కంప్యూటర్ను ఆదేశించే వ్యక్తికన్నా ఆ కంప్యూటర్ పనిచేసే వ్యవస్థను నిర్మించే, నిర్వహించే ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, రోబోటిక్స్ నిపుణులే రేపటి ఉద్యోగ మార్కెట్లో అత్యంత విలువైన వ్యక్తులుగా నిలవనున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ మరో కీలక పరిణామం నిశ్శబ్దంగా చోటుచేసుకుంటోంది. కంప్యూటర్ ముందు కూర్చునే ఉద్యోగాలకంటే చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలున్న బ్లూకాలర్ ఉద్యోగాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఎల్రక్టీషియన్స్, ప్లంబర్లు, రోబోటిక్స్ టెక్నీషియన్లు, హెచ్వీఏసీ నిపుణులు, యంత్రాల నిర్వహణ సిబ్బంది వంటి వృత్తి నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏఐ విప్లవం వెనక అసలు బలం మానవ నైపుణ్యాలేనని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఏఐకి వెన్నెముకగా బ్లూకాలర్ ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా సెంటర్లు, ఆటోమేటెడ్ ఫ్యాక్టరీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే భారీ విద్యుత్ వ్యవస్థలు, శీతలీకరణ యంత్రాంగం, రోబోటిక్ పరికరాలు, నిర్వహణ సిబ్బంది అవసరం. అందుకే ఎల్రక్టీషియన్లు, మెకానిక్లు, వెల్డర్లు, ప్లంబర్లు, రోబోటిక్స్ నిపుణుల అవసరం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. టాలెంట్ సంస్థ రాండ్స్టాడ్ విశ్లేషణ ప్రకారం 5 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను పరిశీలించి విశ్లేషించగా గత నాలుగేళ్లలో ఎలక్ట్రిషియన్ల డిమాండ్ 242%, హెచ్వీఏసీ టెక్నీషియన్ల డిమాండ్ 200%, రోబోటిక్స్ టెక్నీషియన్ల అవసరం గణనీయంగా పెరిగినట్లు తేలింది. 93 శాతం ఉద్యోగాల పెరుగుదల 2022 నుంచి 2026 మధ్య కాలంలో భారత దేశంలో బ్లూకాలర్ ఉద్యోగాల సంఖ్య 93% పెరిగింది. అదే సమయంలో వైట్ కాలర్ ఉద్యోగాల వృద్ధి 40% వద్దే నిలిచింది. ఇది దేశ కారి్మక మార్కెట్లో పెద్ద మార్పునకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు డిగ్రీ, ఐటీ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సెమీకండక్టర్ యూనిట్లు, ఎలక్టిక్ వెహికిల్ (ఈవీ) తయారీ కేంద్రాలు పెరగడంతో సాంకేతిక నైపుణ్యాలున్న కార్మికుల అవసరం మరింత పెరిగింది. వేతనాల్లోనూ బ్లూకాలర్ ఆధిక్యం ఉద్యోగాల్లోనే కాదు వేతనాల్లో కూడా బ్లూకాలర్ ఉద్యోగులు ముందంజలో ఉన్నారు. బ్లూకాలర్ ఉద్యోగుల జీతాలు ఏటా సగటున 5.7 శాతం పెరుగుతున్నాయి. ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగాల్లో పెరుగుదల 4 శాతం మాత్రమే నమోదైంది. రోబోటిక్స్ నిర్వహణ, ప్రత్యేక యంత్రాల మెయింటినెన్స్ మెకానిక్ల వార్షిక వేతనం సగటున రూ. 8లక్షలకు పైగా ఉండగా ప్లాంట్ ఆపరేటర్లు రూ.7 లక్షలు, నిర్మాణ రంగ సిబ్బంది రూ.5 లక్షలు, ఎల్రక్టీషియన్లు సుమారు రూ.3 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. దీనికి విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్ అకౌంటింగ్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో వేతనాలు తక్కువగా ఉండడమే కాకుండా వారిపై ఆటోమేషన్ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. భారత్కు డబుల్ ధమాకా అమెరికా, యూరప్ వంటి దేశాల్లోని కంపెనీల్లో కార్యాలయ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ భారత్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు బ్లూకాలర్ ఉద్యోగాలు వేగంగా పెరుగుతుండగా, మరోవైపు వైట్ కాలర్ రంగంలోనూ 40 శాతం వృద్ధి నమోదవుతోంది.అయితే భవిష్యత్తులో డేటా ఎంట్రీ, ప్రాథమిక అకౌంటింగ్, సాధారణ పరిపాలనా ఉద్యోగాలపై మాత్రం ఏఐ ప్రభావం ఉండొచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాండ్స్టాండ్ సీఈఓ విశ్వనాధ్ పీఎస్ అభిప్రాయం ప్రకారం ‘ ప్రతి ఏఐ ఆవిష్కరణ వెనక ఒక భౌతిక వ్యవస్థ ఉంటుంది. విద్యుత్ గ్రిడ్లు అప్ గ్రేడ్ కావాలి, కూలింగ్ సిస్టమ్లు నిర్మించాలి, ఫ్యాక్టరీలు ఆటోమేట్ కావాలి, ప్రతి స్మార్ట్ యంత్రం వెనక అత్యంత నైపుణ్యం కలిగిన మనుషులే ఉంటారు.బ్లూకాలర్కి డిమాండ్ ఎందుకు? ఏఐ అంటే కేవలం సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, దానికి భారీ మౌలిక సదుపాయాలు అవసరం. ఉదాహరణకు డేటా సెంటర్లకు అధిక విద్యుత్ సరఫరా అవసరం సర్వర్లను చల్లబరిచేందుకు భారీ హెచ్వీఏసీ(హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషన్) వ్యవస్థలు కావాలి. తయారీ రంగంలో రోబోట్ల వినియోగం పెరుగుతోంది. ఈవీ పరిశ్రమల్లో ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్లు విస్తరిస్తున్నాయి స్మార్ట్ ఫ్యాక్టరీ నిర్వహణకు ప్రత్యేక నైపుణ్యాలున్న వ్యక్తుల అవసరం విపరీతంగా పెరుగుతోంది.అందువల్ల ఏఐ ఎంత అభివృద్ధి చెందినా వాటిని నిర్మించే, నిర్వహించే, మరమ్మతులు చేసే మానవ నైపుణ్యం అవసరం అంతే స్థాయిలో పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఓణం పండగొచ్చె.. టీ ధరలకు రెక్కలొచ్చె!
కేరళలో అతిపెద్ద పండుగైన ‘ఓణం’ సమీపిస్తున్న తరుణంలో దక్షిణాది టీ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది. కొచ్చి టీ వేలం(ఆక్షన్)లో డస్ట్, ఆర్థోడాక్స్(సాంప్రదాయ పద్ధతిలో తేయాకు రెమ్మలను యంత్రాల ద్వారా నలిపి, ఎండబెట్టి తయారుచేసే టీ రకం) రకాల ధరలు స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నాయని తాజా అధికారిక వేలం వర్గాలు వెల్లడించాయి.డిమాండ్తో పుంజుకున్న ధరలుకొచ్చి కేంద్రంగా జరిగిన విక్రయాల్లో సీటీసీ డస్ట్తో పాటు ఆర్థోడాక్స్ రకం కేజీకి రూ.10 నుంచి రూ.15 వరకు పెరిగింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల తేయాకు తోటల ఉత్పత్తి తగ్గడం ఒక కారణమైతే, పండుగ వేళ స్థానిక ప్రాసెస్ డ్రింక్ తయారీదారులు, రిటైల్ ప్యాకేజింగ్ కంపెనీలు అధికమొత్తంలో కొనుగోళ్లు చేయడం మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.ఎగుమతులు, ప్రాసెస్డ్ డిమాండ్స్థానిక అవసరాలతో పాటు పశ్చిమాసియా (గల్ఫ్) దేశాల నుంచి ఆర్థోడాక్స్ రకం తేయాకుకు లభించిన ఎగుమతి ఆర్డర్లు మార్కెట్కు మరింత ఊతమిచ్చాయి. వ్యాపారులు ముందస్తుగా నిల్వలు పెంచుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో వేలంలో కొనుగోలు వ్యూహాలు వేగవంతమయ్యాయి. అధిక ధరలు నమోదైనప్పటికీ విక్రయాలు శాతంలో ఎలాంటి క్షీణత కనిపించకపోవడం గమనార్హం.మార్కెట్ భవిష్యత్ సరళిరాబోయే రెండు మూడు వారాల పాటు పండుగ సీజన్ డిమాండ్ కొనసాగే అవకాశం ఉన్నందున టీ బోర్డ్ నియంత్రణలోని దక్షిణాది లీలాం కేంద్రాల్లో (కూర్గ్, కొచ్చి, కొయంబత్తూర్) ధరల శ్రేణి ఇదే రీతిలో స్థిరంగా లేదా స్వల్ప వృద్ధితో కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తేయాకు ఉత్పత్తి పెరిగి కొత్త సరఫరాలు ఊపందుకునే వరకు కొనుగోలుదారులకు అధిక ధరల భారం తప్పకపోవచ్చని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
సెంట్రల్ బ్యాంక్ నుంచి బంపర్ లోన్ ఆఫర్లు!
తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ రుణ వ్యాపారాన్ని బలోపేతం చేయడం, ఖాతాదారులతో నేరుగా అనుసంధానం కావడం లక్ష్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున రిటైల్ అవుట్రీచ్ కార్యక్రమాలను నిర్వహించింది. హైదరాబాద్, విజయవాడ, నరసరావుపేటల్లో శుక్రవారం నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమాల్లో భారీగా రుణ మంజూరు పత్రాలు అందించడంతో పాటు కీలకమైన పండుగ ఆఫర్లను బ్యాంక్ అధికారులు ప్రకటించారు.హైదరాబాద్ రీజియన్లో..హైదరాబాద్లో నిర్వహించిన మెగా అవుట్రీచ్ కార్యక్రమంలో బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ ఏ.డి. శ్రీనివాస్, రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కాలంలో ఇన్-ప్రిన్సిపల్ ఆమోదాలతో కలిపి మొత్తం రూ.172 కోట్ల రిటైల్ రుణాలు మంజూరు చేయగా అందులో రూ.125 కోట్లు నేరుగా ఖాతాదారులకు పంపిణీ చేశారు. అదనంగా రూ.24 కోట్ల విలువైన తాజా బిజినెస్ లీడ్స్ సాధించారు.‘మాకున్న బలమైన ‘సీఏఎస్ఏ’ బేస్, తగిన నిధుల లభ్యత కారణంగానే పరిశ్రమలోనే అత్యంత పోటీ వడ్డీ రేట్లను అందించగలుగుతున్నాం. గృహలక్ష్మి, హోమ్, గోల్డ్, వెహికల్ లోన్లలో ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్తమ పథకాలు అందుబాటులో ఉన్నాయి’ అని ఏ.డి. శ్రీనివాస్ చెప్పారు.విజయవాడ, నరసరావుపేటల్లో..విజయవాడలో రీజినల్ హెడ్ ఈ.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రుణ అవగాహన క్యాంప్ జరిగింది. ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడమే కాకుండా పారదర్శకమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.అలాగే, నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రీజినల్ హెడ్ జి.రమణారావు పాల్గొని, అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్ల విలువైన గృహ రుణ మంజూరు పత్రాలను అందజేశారు. రాబోయే పండుగ సీజన్ను పురస్కరించుకుని డిసెంబర్ 2026 వరకు గృహ రుణాలు, కారు రుణాలపై 100 శాతం ప్రాసెసింగ్ ఛార్జీల మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.సులభతర బ్యాంకింగ్‘మీ కలలకు మా సంకల్పం’ అనే నినాదానికి కట్టుబడి రిటైల్ బ్యాంకింగ్ విస్తరణలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిబద్ధతను మరోసారి చాటుకుంటున్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు. అర్హులైన ప్రజలంతా సమీప శాఖలను సంప్రదించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
ఎయిర్లిఫ్ట్ ద్వారా వంతారాలో ‘జాయ్మతి’కి వైద్యం
ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో కొట్టుకుపోయి తీవ్రంగా గాయపడిన 53 ఏళ్ల ‘జాయ్మతి’ అనే ఆడ ఏనుగుకు అత్యవసర వైద్యం అందించేందుకు వంతారా రంగంలోకి దిగింది. నాగాలాండ్లోని నామ్సాంగ్ ప్రాంతంలో దికో నదిలో వరద ఉధృతికి కొట్టుకుపోయి, అస్సాంలోని శివసాగర్ జిల్లా బిహుబోర్ వద్ద ఒడ్డుకు చేరిన ఈ ఏనుగును అధికారులు, స్థానికులు కాపాడారు. అయితే, వరద ఉధృతి కారణంగా జాయ్మతి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి.ఎయిర్లిఫ్ట్ ఎందుకంటే..వరద నీటిలో కొట్టుకుపోవడం వల్ల జాయ్మతి నుదురు, చెవులు, పొత్తికడుపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని అవయవాల వద్ద తీవ్రమైన పుండ్లు ఏర్పడగా, కుడి కన్ను దెబ్బతిని దృష్టి కోల్పోయింది. అంతేకాకుండా, గతంలో ఎడమ కాలు విరగడం వల్ల నడవలేక ఇబ్బంది పడుతోంది. వయసు పైబడటం, తీవ్రమైన గాయాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో సుదీర్ఘ ప్రయాణం ఏనుగుకు మరింత శ్రమ కలిగిస్తుందని నిపుణులు భావించారు. దాంతో అత్యవసర వైద్యం కోసం గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వంతారా ఏనుగుల ఆస్పత్రికి ఎయిర్లిఫ్ట్ ద్వారా తరలించాలని నిర్ణయించారు.అస్సాంలో వైద్య కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనవంతారా ప్రతినిధులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. జాయ్మతి తరలింపు కేవలం తాత్కాలిక అత్యవసర వైద్యం కోసమేనని, కోలుకున్నాక తాన భద్రతను పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈశాన్య ప్రాంతంలో ఇటువంటి అత్యవసర పరిస్థితులను స్థానికంగానే ఎదుర్కొనేందుకు అస్సాం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్వతంత్రంగా పనిచేసేలా మూడు ప్రత్యేక వన్యప్రాణి వైద్య కేంద్రాలను (ప్రత్యేకంగా ఏనుగుల కోసం ఒక కేంద్రాన్ని) ఏర్పాటు చేయడానికి వంతారా ముందుకు వచ్చింది.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
రూ.62,500 కోట్లతో మేక్ ఇన్ ఇండియా ధమాకా
భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను అమల్లోకి తెచ్చింది. రూ.62,500 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ప్రకటించిన ‘మొబైల్ ఫోన్ మేన్యుఫాక్చరింగ్ స్కీమ్’ (ఎంపీఎంఎస్) మార్గదర్శకాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ పథకం 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.ఈ మార్గదర్శకాల ప్రకారం, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) పొందడానికి ప్రస్తుత మొబైల్ తయారీ సంస్థలు, కాంట్రాక్ట్ తయారీదారులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో (FY26) కనీసం రూ.10,000 కోట్ల టర్నోవర్ కలిగి ఉండటం తప్పనిసరి. అదే సమయంలో 51 శాతం స్వదేశీ భాగస్వామ్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ (ఈఎంఎస్) కంపెనీలకు టర్నోవర్ పరిమితిని రూ.1,000 కోట్లుగా నిర్దేశించారు.భారతీయ బ్రాండ్లకు ప్రోత్సాహకాలుకేవలం అసెంబ్లీ రంగానికే పరిమితం కాకుండా దేశీయ బ్రాండ్లను ప్రోత్సహించడం, డిజైన్, పరిశోధన-అభివృద్ధి రంగాల్లో భారత్ సాధికారత సాధించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ మార్గదర్శకాల్లో భాగంగా.. మార్కెట్లో ఉన్న బ్రాండ్లు తమ ఐదేళ్ల కాలవ్యవధిలో ఏటా FY26 విక్రయాల కంటే అదనంగా రూ.5,000 కోట్ల విక్రయాల వృద్ధి (ఇంక్రిమెంటల్ సేల్స్) నమోదు చేయాలి. కొత్తగా వచ్చే బ్రాండ్లు రూ.10,000 కోట్ల వార్షిక విక్రయాలు సాధించాలి. అర్హత సాధించిన విక్రయాలపై 2.25%-2.75% వరకు ప్రోత్సాహక సాయం అందుతుంది. డిస్ప్లే మోడ్యూల్స్, బ్యాటరీలు, ఛార్జర్లు వంటి భాగాలను దేశీయంగా సేకరిస్తే అదనంగా 1.5% ప్రోత్సాహకం, డిజైన్, ఆర్ అండ్ డీ చేపట్టే భారతీయ బ్రాండ్లకు మరో 3% అదనపు ప్రయోజనం కల్పిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో దేశంలో రూ.39 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి సాధించడం, అలాగే దాదాపు 60,000 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
రూ.35 లక్షల వేతనం.. అయినా మానసిక క్షోభ!
ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. వార్షిక ప్యాకేజీ రూ.35 లక్షలు.. మౌలిక వసతులు.. ఇవన్నీ చూసి ఆ ఉద్యోగి కెరీర్ అత్యున్నత దశలో ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే! అధిక వేతనాలు అందుతున్నప్పటికీ కార్పొరేట్ రంగంలో విపరీతంగా పెరుగుతున్న టాక్సిక్ వర్క్ కల్చర్ (విషతుల్యమైన పని వాతావరణం) ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా పాతాళానికి నెట్టివేస్తోంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక టెక్కీ వేదన ఈ చేదు నిజాలను మరోసారి హైలైట్ చేసింది.టెక్కీ పంచుకున్న వివరాలు..‘సుదీర్ఘ పని గంటలు, శని-ఆదివారాలు కూడా పనిచేయడంపై నా మేనేజర్లతో మాట్లాడగా.. రోజుకు 14 గంటలు పనిచేయడమే ఈ కంపెనీ సంస్కృతి.. అని తేల్చి చెప్పారు. నెలల తరబడి కష్టపడి నేను విజయవంతంగా పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ను ఉన్నతాధికారుల వద్ద మేనేజర్ ప్రదర్శిస్తూ.. నేను 3 నెలల పాటు ఏ పనీ చేయలేదని, అతనే ప్రతిదీ సరిచేశాడని అబద్ధాలు చెప్పారు. అంతేకాకుండా, నేను రూపొందించిన మోడల్ వల్ల కంపెనీకి 10కి పైగా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. కానీ ఆ శ్రమనంతటినీ వారి ఖాతాలో వేసుకున్నారు’ అని చెప్పాడు.‘తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మూడు రోజులు చికిత్స పొందుతున్న సమయంలోనూ విశ్రాంతి ఇవ్వలేదు. కేటీ (Knowledge Transfer) ఇచ్చి ఆ తర్వాత నీ పనులు చేసుకో అంటూ 10 సార్లు ఫోన్ చేసి వేధించారు. వన్-ఆన్-వన్ సమావేశాల్లో ప్రోత్సహించాల్సింది పోయి, 'నువ్వు కేవలం ఫిర్యాదులు చేస్తావు.. ఏ పనీ చేయవు' అని నిందించారు. నన్ను తప్పుగా చిత్రీకరిస్తూ బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని వెల్లడించారు.ప్యాకేజీలు భారీగానే ఉన్నాయి.. ఆరోగ్యం ఏది?సాధారణంగా భారీ జీతాలు లభించే ఉద్యోగాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయని భావిస్తారు. కానీ, నిరంతర ఒత్తిడి, అపరిమితమైన పని గంటలు, సెలవు రోజుల్లో కూడా పనులు చేయడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి రావడం వంటి అంశాలు ఉద్యోగులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు పండుగల వేళల్లో కూడా విశ్రాంతి లేకపోవడం, హెచ్ఆర్ విభాగాల కఠిన వైఖరి ఉద్యోగుల్లో భయాందోళనలు, తీవ్రమైన మానసిక అలసట, ఆందోళనకు దారితీస్తున్నాయి.లేఆఫ్ల భయం.. అనిశ్చితిలో భవిష్యత్తుఅధిక వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మరో వైపు లేఆఫ్ భయం ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక 10-15 నిమిషాల హెచ్ఆర్ సంభాషణతో ఏళ్ల శ్రమ తుడిచిపెట్టుకుపోతోందని, ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ కంపెనీ బడ్జెట్ గణాంకాల ముందు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ జీతాలు మానసిక ప్రశాంతతకు ప్రత్యామ్నాయం కాజాలవు. ఉద్యోగులు తమ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అత్యవసర నిధులు, ప్రత్యామ్నాయ రంగాలు, బలమైన నెట్వర్కింగ్ను పెంపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
స్విగ్గీపై కస్టమర్ రివేంజ్
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ సేవలపై వినియోగదారుల అసంతృప్తి మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. గతంలో ఆర్డర్ చేసిన ఆహారం సుమారు రెండు గంటలు ఆలస్యంగా డెలివరీ కావడంతోపాటు కస్టమర్ కేర్ నుంచి సరైన స్పందన లభించకపోవడంతో ఆగ్రహానికి గురైన ఓ వినియోగదారుడు, ప్లాట్ఫామ్పై వినూత్న రీతిలో రివేంజ్ తీర్చుకున్న ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.సదరు కస్టమర్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.500 విలువైన మునుపటి ఆర్డర్ గంటల తరబడి ఆలస్యమైనప్పటికీ ఆర్డర్ రద్దుకు యాప్ యాజమాన్యం నిరాకరించింది. పైగా బాధ్యతనంతా వినియోగదారుడిపైనే నెడుతూ వంద శాతం క్యాన్సిలేషన్ ఛార్జీలు విధిస్తామని తెలిపింది. ఆటోమేటెడ్ చాట్బాట్లు, సరిగా స్పందించని కస్టమర్ సపోర్ట్ కారణంగా మానసిక క్షోభకు గురైన సదరు వ్యక్తి మరుసటి రోజు రూ.1,400 విలువైన క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ను ఉంచాడు. డెలివరీ ఏజెంట్ రాగానే దాన్ని నిరాకరించి రద్దు చేయడం ద్వారా తన నిరసన వ్యక్తం చేశాడు.ఈ ఘటన క్విక్ కామర్స్, ఫుడ్ టెక్ రంగంలో పడిపోతున్న సేవా ప్రమాణాలను, కస్టమర్ కేర్ వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఒకవైపు వినియోగదారులు సంస్థల బాధ్యతారాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు ఈ తరహా ప్రతీకార చర్యల వల్ల స్థానిక రెస్టారెంట్లు, అల్పదాయక డెలివరీ భాగస్వాములే ఆర్థికంగా దెబ్బతింటారని రంగానికి చెందిన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల హక్కులను కాపాడటంతో పాటు సంస్థల జవాబుదారీతనాన్ని నిర్దేశించే కఠిన నిబంధనలు తక్షణ అవసరమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్ -
టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తమ ఉద్యోగులకు కేటాయించిన ల్యాప్టాప్ల్లో ‘డిజిటల్ యూజర్ ఎక్స్పీరియన్స్ మానిటరింగ్’ (డీఈఎం) టూల్ను ఏర్పాటు చేయడం ఐటీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దీనిపై కంపెనీ, ఉద్యోగుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరిగింది?ఉద్యోగులు ఏయే అప్లికేషన్లను ఉపయోగిస్తున్నారు, వాటిపై ఎంత సమయం వెచ్చిస్తున్నారు అనే వివరాలను ఈ కొత్త సాఫ్ట్వేర్ సేకరిస్తుందని సమాచారం. డేటా లీకేజీలను అరికట్టడం, ఐటీ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడం, సాంకేతిక సమస్యలను వేగంగా గుర్తించడమే లక్ష్యంగా సంస్థ ఈ చర్యలు చేపట్టినట్లు భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇటీవల ‘జీస్కేలర్’ భాగస్వామ్యాన్ని విస్తరించి డిజిటల్-మానిటరింగ్ పరిష్కారాలను ప్రారంభించినప్పటికీ అదే సాంకేతికతను ఇక్కడ వాడుతున్నారా లేదా అనేది అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళనఈ నిర్ణయంపై టీసీఎస్ ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఐటీ భద్రతకే పరిమితం కాకుండా తమ వ్యక్తిగత పనితీరు, దైనందిన కార్యకలాపాలను పర్యవేక్షించే సర్వైలెన్స్ టూల్గా మారుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ఈ సాఫ్ట్వేర్ పేరు, దాని వెండర్ వివరాలు, అది ఎలాంటి డేటా సేకరిస్తుంది, ఆ సమాచారాన్ని ఎవరు చూడగలరనే అంశాలపై టీసీఎస్ స్పష్టత ఇవ్వలేదు. ఈ డేటాను వ్యక్తిగత ఉద్యోగి ఐడీతో అనుసంధానిస్తున్నారా లేదా భద్రతా బృందాల విశ్లేషణ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారా అనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.డేటా నిర్వహణ సవాలుప్రస్తుతం టీసీఎస్లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంత భారీ సంఖ్యలో ఉన్న ఉద్యోగుల ల్యాప్టాప్ల నుంచి నిరంతరం వచ్చే కార్యకలాపాల సమాచారాన్ని క్రోడీకరించడం, భద్రపరచడం, విశ్లేషించడం ఐటీ బృందాలకు పెద్ద సాంకేతిక సవాలుగా మారనుంది. యాజమాన్యం తమ స్పష్టమైన విధివిధానాలను వెల్లడించి పారదర్శకతను పాటిస్తేనే సంస్థ భద్రతతో పాటు ఉద్యోగుల విశ్వాసాన్ని కాపాడుకోవడం సాధ్యమవుతుందని కొందరు భావిస్తున్నారు.ఇదీ చదవండి: సైబర్ ముఠాల ఆన్లైన్ దోపిడీకి కేంద్రం చెక్ -
సోలార్ సెల్స్ కొరత తాత్కలికమే..!
న్యూఢిల్లీ: దేశీయంగా సోలార్ సెల్స్ లభ్యతలో ఎదురవుతున్న కొరత కేవలం తాత్కాలిక సవాలేనని, స్థానిక తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా పెంచుతుండటంతో త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని పరిశ్రమ రంగానికి చెందిన ప్రముఖులు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో సోలార్ సెల్ తయారీ సామర్థ్యం 32 గిగావాట్లుగా ఉండగా, డిసెంబర్ 2027 నాటికి ఇది ఏకంగా 100 గిగావాట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.అలాగే సోలార్ ప్యానెళ్ల (మాడ్యూల్స్) తయారీ సామర్థ్యం ఇప్పటికే 200 జీడబ్ల్యూ దాటిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సౌర సెల్లను కలిపి మాడ్యూళ్లు లేదా సోలార్ ప్యానెళ్లను తయారు చేస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్ అండ్ మాన్యుఫాక్చరర్స్’ ఫర్ సోలార్ సెల్స్ (ఏఎల్ఎంఎ లిస్ట్– ఐఐ) నేపథ్యంలో దేశీయంగా తయారైన సెల్స్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రూఫ్టాప్, ఇతర స్థానిక కంటెంట్ నిబంధనల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమ నిపుణులు స్పందించారు.స్థానిక తయారీతోనే ఆత్మనిర్భరత ‘‘మొత్తం మాడ్యూల్ సామర్థ్యంతో దేశీయ సెల్స్ సామర్థ్యాన్ని పోల్చి చూడటం సరైనది కాదు. ఎందుకంటే అన్ని మాడ్యూల్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయవు. ఇది సాంకేతికత, స్పెసిఫికేషన్లు సరిపోలడానికి పడుతున్న స్వల్పకాలిక సమయం మాత్రమే. విదేశాలపై ఆధారపడటం తగ్గించి, కీలక విడిభాగాలను ఇక్కడే తయారు చేసుకున్నప్పుడే నిజమైన ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధ్యమవుతుంది’’ అని అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్ తెలిపారు. అవాడా తన సౌర సెల్ల తయారీ సామర్థ్యాన్ని 6 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, దేశీయ మాడ్యూల్ తయారీదారులకు హాఫ్కట్ సెల్లను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ధీర్ఘకాలిక ఇంధన భద్రతఏఎల్ఎంఎ లిస్ట్– ఐఐ నిబంధన దేశీయ సౌర రంగాన్ని మాడ్యూళ్ల అసెంబ్లింగ్ నుంచి పూర్తిస్థాయి స్వదేశీ తయారీ వైపు నడిపిస్తోందని విక్రమ్ సోలార్ ఎండీ జ్ఞానేష్ చౌదరి తెలిపారు. విక్రమ్ సోలార్ కంపెనీ 2026–27 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 9 గిగావాట్ల దేశీయ సౌర సెల్ తయారీ సామర్థ్యాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. విధానపరమైన నిర్ణయాలు స్పష్టంగా ఉండటంతో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఎస్పీడీఏ ప్రతినిధి రవివర్మ అభిప్రాయపడ్డారు. కాగా, క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా 2025 నవంబర్లో చేసిన అంచనా ప్రకారం.. ఏఎల్ఎంఎం లిస్ట్– ఐఐ తర్వాత పెరుగుతున్న పెట్టుబడుల కారణంగా దేశీయ సౌర సెల్ల తయారీ సామర్థ్యం డిసెంబర్ 2027 నాటికి సుమారు 100 గిగావాట్లకు చేరవచ్చు. మాడ్యూల్ తయారీ సామర్థ్యం మార్చి 2027 నాటికి 165 గిగావాట్లను అధిగమించే అవకాశం ఉందని తెలిపింది. అయితే చిన్న తరహా మాడ్యూల్ తయారీదారులు విలీనాల వైపు వెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. -
బంగారం రుణాల్లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్
ముంబై: పసిడి రుణాల విభాగంలోకి వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 300 శాఖలను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ సింగ్ తెలిపారు. మొత్తం మూడేళ్లలో 1,000 గోల్డ్ లోన్ శాఖలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పసిడి ధర పెరుగుదలతో బంగారంపై రుణాలు కూడా భారీగా ఎగిసినట్లు సింగ్ చెప్పారు. జూన్ గణాంకాలు చూస్తే బంగారం ఆభరణాలపై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఇచి్చన రుణాలు వార్షికంగా దాదాపు 69.3 శాతం పెరిగాయి. 2026 జూన్ ఆఖరు నాటికి పసిడి ఆభరణాలపై ఎన్బీఎఫ్సీల మొత్తం రుణాల పోర్ట్ఫోలియో 69 % వృద్ధితో రూ. 3.42 లక్షల కోట్లకు చేరింది. -
భారీగా షేర్లు అమ్మేసిన పేటీఎమ్
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల దిగ్గజం ‘పేటీఎమ్’ మాతృ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్’లో విదేశీ, దేశీయ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు భారీగా వాటాలను కొనుగోలు చేశాయి. గోల్డ్మెన్ శాక్స్, బీఎన్పీ పారిబాస్, సొసైటీ జెనరల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో పాటు పలు భారతీయ మ్యూచువల్ ఫండ్ దిగ్గజాలు ఓపెన్ మార్కెట్ ‘బ్లాక్ డీల్’ ద్వారా సుమారు రూ.2,949 కోట్ల విలువైన 3 శాతం వాటాను సొంతం చేసుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) బ్లాక్ డీల్ సమాచారం ప్రకారం.. ఈ సంస్థలు సగటున ఒక్కో షేరుకు రూ.1,535.10 చొప్పున మొత్తం 1,92,10,110 ఈక్విటీ షేర్లను (3% వాటాకు సమానం) కొనుగోలు చేశాయి. పేటీఎమ్ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన ‘రెసిలెంట్ అసెట్ మేనేజ్మెంట్’ ఈ 3% వాటాను విక్రయించింది. వాటా కొనుగోలు చేసిన ప్రధాన సంస్థలు: కొనుగోళ్లు చేసిన విదేశీ పోర్ట్ఫోలియో సంస్థలో గోల్డ్మెన్ శాక్స్, బీఎన్పీ పారిబాస్, సొసైటీ జెనరల్, ఘిసాల్లో క్యాపిటల్, ఆక్స్బో క్యాపిటల్, నార్త్ రాక్ క్యాపిటల్, విరిడియన్ అసెట్ మేనేజ్మెంట్, విక్టోరియా ఫండ్–ఓసీ, ఇంటెగ్రేటెడ్ కోర్ స్ట్రాటజీస్ (ఆసియా) ఉన్నాయి. అలాగే ఎస్బీఐ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఎంఎఫ్, హెచ్ఎస్బీసీ ఎంఎఫ్, సుందరం ఎంఎఫ్, టాటా ఎంఎఫ్ తదితర దేశీయ మ్యూచువల్ ఫండ్లున్నాయి. వీటితో పాటు బీమా రంగానికి చెందిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలున్నాయి. -
జస్ట్ రూ.500 ఖర్చుతో ఎగిరిన విమానం!
విమాన ప్రయాణం అంటే భారీ ఇంధన వ్యయంతో కూడుకున్న వ్యవహారమనే భావన చాలా మందికి ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా, అమెరికాలో జరిగిన ఓ ప్రయోగాత్మక విమాన ప్రయాణం భవిష్యత్ ఎలక్ట్రిక్ ఏవియేషన్పై ఆసక్తిని పెంచుతోంది. అమెరికాకు చెందిన హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన X1 బ్యాటరీ-ఎలక్ట్రిక్ విమానం ఈ నెల 12న తొలిసారి గాల్లోకి ఎగిరింది. 27 నిమిషాల ఈ పరీక్షా ప్రయాణానికి సుమారు 5 డాలర్లు (రూ.500 లోపే) విలువైన విద్యుత్ మాత్రమే వినియోగించినట్లు కంపెనీ వెల్లడించింది.1,100 అడుగుల ఎత్తుకు..న్యూయార్క్లోని ప్లాట్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన X1.. 27 నిమిషాల పాటు ప్రయాణించింది. ఈ సమయంలో 1,100 అడుగుల (సుమారు 335 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. ఒక పైలట్తో నిర్వహించిన ఈ పరీక్షలో ప్రయాణికులను ఎవరినీ తీసుకెళ్లలేదు. టేకాఫ్, పైకి ఎగరడం, మలుపులు, ల్యాండింగ్ వంటి దశలను పరీక్షించారు. విమానం పూర్తిగా బ్యాటరీలతో నడిచింది. దీని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థ ఒక మెగావాట్కు పైగా శక్తిని అందించింది.చిన్న విమానం కాదు..X1ను సాధారణ చిన్న ప్రయోగాత్మక విమానంగా భావించడానికి వీల్లేదు. దీని రెక్కల వెడల్పు 106 అడుగులు (32.3 మీటర్లు), పొడవు 76 అడుగులు (23.2 మీటర్లు). టేకాఫ్ సమయంలో దీని బరువు 25,000 పౌండ్లకు పైగా అంటే సుమారు 11.3 టన్నులు. ఈ పరిమాణంతో X1 ఇప్పటివరకు గాల్లోకి ఎగిరిన అతిపెద్ద బ్యాటరీ-ఎలక్ట్రిక్ విమానంగా హార్ట్ ఏరోస్పేస్ పేర్కొంది.టికెట్ కూడా అంత చౌకేనా?ఇక్కడ రూ.500 ఖర్చుతోనే విమానం ప్రయాణించింది అంటే ఆ మొత్తం కేవలం 27 నిమిషాల పరీక్షా ప్రయాణంలో వినియోగించిన విద్యుత్ విలువ మాత్రమే. పైలట్ జీతం, నిర్వహణ, బీమా, విమానాశ్రయ రుసుములు, విమానం కొనుగోలు లేదా ఫైనాన్సింగ్ ఖర్చులు, బ్యాటరీల తయారీ, వాటి క్షీణత వంటి వ్యయాలు ఇందులో లేవు. అందువల్ల భవిష్యత్తులో విమాన టికెట్ రూ.500కు లభిస్తుందని దీన్ని బట్టి చెప్పలేం. అయితే విమానాన్ని నడిపే ఇంధన వ్యయం గణనీయంగా తగ్గే అవకాశం ఎలక్ట్రిక్ విమానాల ప్రధాన ఆకర్షణల్లో ఒకటి.అసలు లక్ష్యం 30 సీట్ల హైబ్రిడ్ విమానంX1ను కేవలం రికార్డు కోసం రూపొందించలేదు. హార్ట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న ES-30 అనే 30 సీట్ల హైబ్రిడ్-ఎలక్ట్రిక్ ప్రాంతీయ విమానానికి అవసరమైన సాంకేతికతలను పరీక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. ES-30కు 2031లో సేవల్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం, ES-30 పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్లో సుమారు 200 కిలోమీటర్లు, హైబ్రిడ్ మోడ్లో గరిష్ఠంగా 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రూపొందిస్తున్నారు. సుమారు 30 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి చేసే లక్ష్యమూ ఉంది.నిర్వహణ ఖర్చులు 40 శాతానికి పైగా తగ్గుతాయటసాంప్రదాయ ప్రాంతీయ విమానాలతో పోలిస్తే ES-30 నిర్వహణ వ్యయం 40 శాతానికి పైగా తగ్గవచ్చని హార్ట్ ఏరోస్పేస్ అంచనా వేస్తోంది. తక్కువ విద్యుత్ వ్యయం, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ వ్యవస్థలో తక్కువ కదిలే భాగాలు, సరళమైన నిర్వహణ, విమానం ఎక్కువ సమయం అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని చెబుతోంది. యునైటెడ్ ఎయిర్లైన్స్, ఎయిర్ కెనడా, జేఎస్ఎక్స్ వంటి సంస్థలు ES-30పై ఇప్పటికే ఆసక్తి లేదా కమిట్మెంట్లు వ్యక్తం చేశాయి.మరి చౌక విమాన ప్రయాణం ఎప్పుడు?ఎలక్ట్రిక్ విమానాలు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గే అవకాశం లేదు. టికెట్ ధరలో ఇంధనం లేదా విద్యుత్ ఖర్చుతో పాటు సిబ్బంది, విమానాశ్రయ రుసుములు, పన్నులు, నిర్వహణ, విమాన కొనుగోలు వ్యయం, మార్గంలో డిమాండ్ వంటి అనేక అంశాలు ఉంటాయి. అయితే సాంకేతికత ఆశించిన స్థాయికి చేరుకుంటే తక్కువ దూరం, ప్రాంతీయ మార్గాల్లో ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న విమానాలను తక్కువ ఇంధన ఖర్చుతో నడపగలిగితే ప్రస్తుతం ఆర్థికంగా అనుకూలంగా లేని కొన్ని ప్రాంతీయ మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు విమానయాన సంస్థలకు అవకాశం లభించవచ్చు.ఇదీ చదవండి: భారీ సంఖ్యలో టెక్ సిబ్బంది అవసరం..


