Corporate
-
రిలయన్స్ రిటైల్ చేతికి ప్రియాంక చోప్రా అనోమలి
రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (RRL) సంస్థ.. ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్కేర్ బ్రాండ్ 'అనోమలి'(Anomaly)ని, దాని ట్రేడ్మార్క్లు, బ్రాండ్ ఆస్తులు, డిజిటల్ ప్రాపర్టీలతో సహా కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కంపెనీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.అనోమలి కొనుగోలు.. రిలయన్స్ రిటైల్ బ్యూటీ పోర్ట్ఫోలియోను గణనీయంగా విస్తరించనుంది. అంతేకాకుండా, భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంస్థ తన వృద్ధిని సాధించే బ్రాండ్లను నిర్మించి, విస్తరించాలనే దాని నిబద్ధతను కూడా ఇది బలపరుస్తుంది.అనోమలి బ్రాండ్ను 2021లో ప్రముఖ నటి, వ్యాపారవేత్త ప్రియాంక చోప్రా ప్రారంభించారు. ఇది అందుబాటు ధరలో లభించే ఒక పాపులర్ హెయిర్కేర్ బ్రాండ్. ప్రారంభం నుంచే అత్యధిక ప్రజాదరణ పొందిన ఈ బ్రాండ్.. కొద్ది కాలంలోనే బలమైన అంతర్జాతీయ ఉనికిని ఏర్పరచుకుంది.ఈ కొనుగోలుతో రిలయన్స్ రిటైల్ తమ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ రంగంలో ఉన్న పోర్ట్ఫోలియోను మరింత విస్తరించింది. ఈ సంస్థ ఇప్పటికే భారతదేశంలో పెద్ద రిటైల్ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్ఫారమ్లను కలిగి ఉంది. ముఖ్యంగా టీరా వంటి ఓమ్నీచానల్ బ్యూటీ ప్లాట్ఫారమ్ ద్వారా వినియోగదారులకు విభిన్న బ్రాండ్లను అందిస్తోంది. ఇప్పుడు అనామలీ కూడా ఈ వ్యవస్థలో చేరడంతో, బ్రాండ్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ కొనుగోలు గురించి మాట్లాడుతూ.. అనోమలి తమ బ్యూటీ పోర్ట్ఫోలియోలో ఒక ముఖ్యమైన భాగమవుతుందని చెప్పారు. ప్రత్యేకంగా భారత మార్కెట్పై దృష్టి పెట్టి.. జుట్టు, చర్మ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాగా ప్రియాంక చోప్రా బ్రాండ్ క్రియేటివ్ డైరెక్టర్గా కొనసాగుతారని వెల్లడించారు.Reliance Retail Acquires Priyanka Chopra Jonas’s Anomaly, Accelerating Expansion of Its Beauty Portfolio~ Acquires ‘Anomaly’ trademarks and digital assets to drive India and global growth ~~ To accelerate Omnichannel scale-up across retail network and Tira ~Reliance Retail… pic.twitter.com/UjIAQCHWzQ— Reliance Industries Limited (@RIL_Updates) April 30, 2026 -
అదానీ పవర్ మెరుపులు.. మెరిపించిన ప్రాఫిట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం అదానీ పవర్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 64 శాతం జంప్చేసి రూ. 4,271 కోట్లను అధిగమించింది. ఆదాయంలో వృద్ధి, తగ్గిన పన్ను వ్యయాలు ఇందుకు దోహదపడ్డాయి.అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2,599 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 14,535 కోట్ల నుంచి రూ. 15,989 కోట్లకు ఎగసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 12,971 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 12,750 కోట్ల లాభం అందుకుంది. 2026 మార్చి31కల్లా మహన్(1,600 మెగావాట్లు), రాయ్పూర్(1,600 మెగావాట్లు), రాయ్గఢ్(1,600 మెగావాట్లు) రెండో దశల పనులు 86–47 శాతం మధ్య పూర్తయినట్లు కంపెనీ వెల్లడించింది.సొంత అనుబంధ కంపెనీ కోబ్రా పవర్ 1320 మెగావాట్ల రెండో దశ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27)లో పూర్తికాగలదని పేర్కొంది. 2031–32కల్లా 23.7 గిగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది క్యూ4లో మహారాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 25ఏళ్లపాటు 1,600 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ఎల్వోఏను అందుకుంది. -
ఐటీ రంగాన్ని మార్చనున్న ఏఐ: ఇన్ఫోసిస్ సీఈఓ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై పలువురు ప్రముఖులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ తన అభిప్రాయం వెల్లడించారు. కృత్రిమ మేధస్సు.. భారతదేశ ఐటీ రంగంలో చాలా పెద్ద మార్పులను తీసుకురానుంది. అయితే, ఈ మార్పులు ఉద్యోగాలను తగ్గించవని, ప్రతిగా మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయని ఆయన స్పష్టం చేశారు.భారతీయ ఐటీ కంపెనీలు ఇప్పటివరకు.. ఎక్కువగా కొత్తగా కాలేజీ నుంచి వచ్చిన యువతను పెద్ద సంఖ్యలో నియమించుకొని, అనుభవజ్ఞులను తక్కువగా ఉంచే పిరమిడ్ నిర్మాణాన్ని అనుసరించాయి. కానీ AI ప్రభావంతో ఈ నిర్మాణం “డైమండ్” ఆకారంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే.. మధ్యస్థ, ఉన్నత నైపుణ్యాలు కలిగిన నిపుణుల అవసరం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.ఈ పరిణామం ఒక్కసారిగా జరిగేది కాదు. ఉదాహరణకు.. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 20,000 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించగా, ఈ సంవత్సరం కూడా దాదాపు అదే స్థాయిలో నియామకాలు కొనసాగనున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పటికే AI ఆధారిత భవిష్యత్తుకు తగిన విధంగా తన వ్యూహాలను మార్చుకుంటోందని తెలుస్తోంది.కొత్తగా చేరే ఉద్యోగులకు కంపెనీ సాధారణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు, ఫౌండేషన్ మోడల్ టూల్స్పై కూడా శిక్షణ ఇస్తోంది. సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకారం.. ఏఐ సేవలలో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ తన సేవలను విస్తరించడమే కాకుండా, ఇప్పటికే ఉన్న సేవల్లో AIని సమీకరిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే అవకాశాలు పొందుతున్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం'' -
జియో దూకుడు.. ట్రాయ్ పరీక్షల్లో అగ్రస్థానం!
టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్లో.. వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా స్పీడ్, వాయిస్ క్వాలిటీ, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్లోడ్ వేగం నమోదు కాగా.. కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ఈ ఫలితాలు తెలంగాణ టెలికాం వినియోగదారుల అనుభవంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. 5జీ నెట్వర్క్ పనితీరును అంచనా వేయడంలో డ్రైవ్ టెస్ట్లు అత్యంత విశ్వసనీయ పద్ధతి.ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జియో నెట్వర్క్ సగటు డౌన్లోడ్ వేగం 260.01 Mbpsగా నమోదైంది. అదే సమయంలో ఎయిర్టెల్ 161.18 Mbps, వోడాఫోన్ ఐడియా 27.83 Mbps, బీఎస్ఎన్ఎల్ 8.32 Mbps వద్ద నిలిచాయి. అంటే ఒక వినియోగదారుడు వీడియో స్ట్రీమింగ్ లేదా గేమింగ్ చేస్తే జియో వినియోగదారుడు మిగతా నెట్వర్క్లతో పోలిస్తే రెండు రెట్లు వేగంగా సేవలు పొందుతున్నాడని అర్థం.నగరంలోని హాట్స్పాట్ ప్రాంతాల్లో వేగం మరింత పెరిగింది. హనుమకొండ బస్ స్టాండ్ వద్ద 471.60 Mbps పీక్ స్పీడ్ నమోదు కాగా రెడ్డి కాలనీలో 456.67 Mbps నమోదైంది. ఈ సంఖ్యలు కేవలం టెక్నికల్ డేటా కాదు, రోజువారీ డిజిటల్ జీవితంలో వేగవంతమైన మార్పుకు సూచికగా నిలుస్తున్నాయి.ట్రాయ్ అధికారిక నివేదిక ప్రకారం.. వాయిస్ కాల్ నాణ్యతలో కూడా జియో ముందంజలో ఉంది. మీన్ ఓపీనియన్ స్కోర్ 4.46గా నమోదైందని మార్చి 2026 పరీక్షలో వెల్లడైంది. ఎయిర్టెల్ 3.98, వోడాఫోన్ ఐడియా 3.76, బీఎస్ఎన్ఎల్ 2.97 వద్ద నిలిచాయి. అంటే పది కాల్లలో ఎక్కువ భాగం జియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి.ట్రాయ్ డేటా ప్రకారం జియో లేటెన్సీ 21.94 msగా ఉండగా ఇతర నెట్వర్క్లు 38 ms పైగా నమోదయ్యాయి. లేటెన్సీ తగ్గడం వల్ల గేమింగ్, వీడియో కాలింగ్ అనుభవం మెరుగుపడుతుంది. 20 మిల్లీసెకన్లకు దగ్గరగా ఉండే లేటెన్సీ వినియోగదారుడికి రియల్ టైమ్ అనుభూతి ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం వేగం మాత్రమే కాకుండా స్థిరత్వం కూడా పెరిగిందని సూచిస్తున్నాయి. కాల్ డ్రాప్ రేటు 0%గా నమోదు కావడం నెట్వర్క్ విశ్వసనీయతకు నిదర్శనం.తెలంగాణలో 5జీ విస్తరణ గత రెండు సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. 2024లో ప్రారంభమైన సేవలు 2026 నాటికి ప్రధాన నగరాల్లో స్థిరపడ్డాయి. వరంగల్ వంటి టియర్-2 నగరాల్లో కూడా హైస్పీడ్ నెట్వర్క్ అందుబాటులోకి రావడం డిజిటల్ విస్తరణకు కీలక సూచనగా మారింది. ట్రాయ్ వంటి నియంత్రణ సంస్థలు ఈ పరీక్షలను కొనసాగించడం వల్ల నెట్వర్క్ నాణ్యతపై కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది. వినియోగదారుల కోసం ఇది ప్రయోజనకరం. భవిష్యత్తులో 5జీ ఆధారిత సేవలు పెరగడంతో డేటా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వం డిజిటల్ ఇండియా లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 5జీ విస్తరణపై దృష్టి పెట్టింది. టెలికాం కంపెనీలు తమ మౌలిక సదుపాయాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్లో నమోదైన ఈ ఫలితాలు ఒక నగరానికి మాత్రమే పరిమితం కావు. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ మౌలిక వసతుల దిశను సూచిస్తున్నాయి. రాబోయే నెలల్లో ఇతర నగరాల్లో కూడా ఇలాంటి పరీక్షలు జరిగితే పోటీ మరింత స్పష్టమవుతుంది. -
2032 వరకు అన్ని హక్కులు మావే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతున్న మైక్రోసాఫ్ట్ తన భాగస్వామ్య సంస్థ ఓపెన్ఏఐతో కుదుర్చుకున్న సవరించిన ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఓపెన్ఏఐ సాంకేతికతను, మేధో సంపత్తిని (ఐపీ) అత్యున్నత స్థాయిలో వినియోగించుకోవడమే తమ తదుపరి లక్ష్యమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. టెక్ విశ్లేషకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యూహాత్మక మార్పులపై వివరణ ఇచ్చారు.విజేతల్లా నిలిచే ఒప్పందంఓపెన్ఏఐతో కుదిరిన తాజా మార్పుల గురించి నాదెళ్ల మాట్లాడుతూ, ఇది ఇరు సంస్థలకు ప్రయోజనకరమైన విన్-విన్ ఒప్పందమని అభివర్ణించారు. ‘ఏదైనా భాగస్వామ్యంలో రెండు పక్షాలకు సమాన ప్రయోజనం ఉండాలని నేను కోరుకుంటాను. ఓపెన్ఏఐతో మా అనుబంధం విషయంలో కూడా అదే సూత్రాన్ని పాటిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. సామ్ ఆల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం 20 శాతం వాటాను కలిగి ఉంది. సవరించిన ఒప్పందం ప్రకారం ఈ వాటా 2032 వరకు కొనసాగుతుంది. ఇది సంస్థకు దీర్ఘకాలిక ఆర్థిక, సాంకేతిక భద్రతను కల్పిస్తుంది.2032 వరకు ప్రత్యేక హక్కులుఓపెన్ఏఐ ఇకపై తన మోడళ్లను కేవలం మైక్రోసాఫ్ట్కే పరిమితం చేయకుండా అమెజాన్ వంటి ఇతర దిగ్గజ సంస్థలతోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. దీనిపై వస్తున్న ఆందోళనలను నాదెళ్ల తోసిపుచ్చారు. 2032 వరకు ఓపెన్ఏఐ రూపొందించే సరిహద్దు నమూనాలు (ఫ్రంటీర్ మోడల్స్), ఏజెంట్ టూల్స్, అన్ని ఐపీ హక్కులపై మైక్రోసాఫ్ట్కు పూర్తి అవకాశం ఉంటుందన్నారు. ‘మా దగ్గర అత్యాధునిక మోడల్స్ ఉన్నాయి. 2032 వరకు మాకు లభించిన ఈ సాంకేతిక హక్కులను వ్యాపార పరంగా పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని నాదెళ్ల ధీమా వ్యక్తం చేశారు.పెరుగుతున్న పోటీఓపెన్ఏఐ తన సేవలను అమెజాన్ వెబ్ సర్వీసెస్కు కూడా విస్తరించడం వల్ల మైక్రోసాఫ్ట్ ఆధిపత్యం తగ్గుతుందా? అన్న ప్రశ్నకు నాదెళ్ల ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఏదో ఒక సంస్థే దీనిని శాసించే రోజులు పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘కంప్యూటింగ్ అవసరాలకు సంబంధించి ఓపెన్ఏఐ మాకు అతిపెద్ద కస్టమర్. వారికి అత్యుత్తమ సేవలు అందించడం మా బాధ్యత’ అని ఆయన గుర్తుచేశారు.ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్ -
తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు బ్యాంకు సెలవులు
డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎంత పెరిగినా నేరుగా బ్యాంకు బ్రాంచికి వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇలా ఈ మే నెలలో బ్యాంకు పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నవారి కోసం ఈ కథనం. ఏప్రిల్ నెల ముగుస్తున్న తరుణంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2026 నెలవారీ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. మే నెలలో వివిధ రాష్ట్రాల్లో పండుగలు, జయంతి కార్యక్రమాలు, వారాంతపు సెలవులు కలుపుకుని మొత్తం 13 రోజులు బ్యాంకులు పనిచేయవు.తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులుఈ మే నెలలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు వారాంతపు సెలవులు, పండుగలతో కలిపి మొత్తం 9 రోజులు మూతపడనున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్తించే బ్యాంకు సెలవుల పూర్తి జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ముందస్తు ప్రణాళిక లేకపోతే మీ అత్యవసర లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి, సెలవుల జాబితాను ఒకసారి పరిశీలించండి..సెలవుల వివరాలుమే 1 - శుక్రవారం - మే డే (కార్మిక దినోత్సవం) / బుద్ధ పూర్ణిమమే 3 - ఆదివారం - సాధారణ సెలవుమే 9 - శనివారం - రెండో శనివారంమే 10- ఆదివారం- సాధారణ సెలవు మే 17- ఆదివారం - సాధారణ సెలవుమే 23 - శనివారం - నాలుగో శనివారంమే 24 - ఆదివారం - సాధారణ సెలవుమే 27 - బుధవారం- బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా)మే 31 - ఆదివారం - సాధారణ సెలవుఅయితే చంద్రుని దర్శన ఆధారంగా బక్రీద్ సెలవు తేదీలో మార్పు ఉండవచ్చు.డిజిటల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో..బ్యాంకు శాఖలు భౌతికంగా మూసివేసినప్పటికీ, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు (ATM) యధావిధిగా పనిచేస్తాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా నిధుల బదిలీ (NEFT/RTGS/IMPS) చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి. -
రైలు టికెట్ బుకింగ్లోకి ఫ్లిప్కార్ట్ ‘క్లియర్ట్రిప్’
ముంబై: ఫ్లిప్కార్ట్కు చెందిన ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారమ్ క్లియర్ట్రిప్ రైలు టికెట్ బుకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ట్రైన్ టికెటింగ్ సెగ్మెంట్లో సింగిల్ డిజిట్ మార్కెట్ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రూట్లలో ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించింది.రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు జనరల్, తత్కాల్ కోటాల్లో కూడా టికెట్లు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. అలాగే రియల్టైమ్ సీట్ల లభ్యత, చార్జీల వివరాలు, పీఎన్ఆర్ స్టేటస్ ట్రాకింగ్, బెర్త్ ఎంపికలు, సురక్షిత డిజిటల్ చెల్లింపులు వంటి సేవలను ఒకే ప్లాట్ఫారమ్పై అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో ప్రతి ఏటా 80 కోట్లకు పైగా రిజర్వేషన్ ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇది భారీ మార్కెట్ అవకాశమే కాకుండా, వినియోగదారులకు భిన్నమైన సేవా అనుభవాన్ని అందించే అవకాశం కూడా ఉందని క్లియర్ట్రిప్ ఎయిర్ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గౌరవ్ పట్వారీ తెలిపారు.ఈ ఏడాది ముగిసేలోపు ఆన్లైన్ ట్రావెల్ సర్వీసెస్ (ఓటీఎస్) విభాగంలో సింగిల్ డిజిట్ మార్కెట్ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైలు ప్రయాణం భారత మొబిలిటీ ఎకోసిస్టమ్లో కీలక భాగమని, ఈ ప్రారంభం సమగ్ర బహుళ రవాణా సేవల వేదికగా ఎదగాలన్న సంస్థ లక్ష్యానికి కీలక అడుగని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మంజరీ సింఘాల్ తెలిపారు. దీంతో సంస్థ వృద్ధి వేగవంతమవడంతో పాటు పోటీ సామర్థ్యం పెరుగుతుందన్నారు. మొత్తం వ్యాపారంలో రైలు టికెట్ బుకింగ్ వాటా 5 నుంచి 10 శాతానికి చేరుతుందని, రాబోయే కొన్నేళ్లలో ఈ విభాగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతుందని సింఘాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
సాఫ్ట్వేర్ రంగం అంటేనే నిరంతర మార్పులకు వేదిక. ఇందులో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే వెనుకబడిపోతామన్నది జగమెరిగిన సత్యం. అయితే, ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి కొనసాగుతూ మనం నిజంగా ఎదుగుతున్నామా లేదా అని తెలుసుకోవడం ఎలా? ప్రమోషన్ వచ్చే వరకు వేచి చూడాలా? లేక మనకు మనమే ఒక గీటురాయిని నిర్ణయించుకోవాలా? దీనిపై మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన సీనియర్ ఇంజినీర్ కున్ చెన్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు.ప్రమోషన్ అనేది ‘లాగింగ్ ఇండికేటర్’చాలామంది ఉద్యోగులు తమ ఎదుగుదలను ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లతో కొలుస్తారు. కానీ, కున్ చెన్ అభిప్రాయం ప్రకారం.. ప్రమోషన్ రాకపోవడం అనేది మీరు ఎదగడం లేదని చెప్పే, చాలా ఆలస్యంగా తెలిసే ఒక ‘లాగింగ్ ఇండికేటర్’ (వెనుకబడిన సూచిక) మాత్రమే. స్టీవ్ హుయిన్ నిర్వహించే ‘ఎ లైఫ్ ఇంజనీర్డ్’ పాడ్కాస్ట్లో చెన్ మాట్లాడుతూ కెరీర్ స్తబ్దతను గుర్తించడానికి ప్రమోషన్ల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఆ ఒక్క ప్రశ్నతో కెరీర్ అంచనా!తన కెరీర్ ప్రారంభం నుంచి కున్ చెన్ ‘గత నెలలో నేను చేయలేని పనిని, ఈ నెలలో కొత్తగా ఏం చేయగలుగుతున్నాను?’ అనే సరళమైన, అత్యంత శక్తివంతమైన ప్రశ్న తనకు తాను వేసుకునేవారట. ఈ ప్రశ్నకు వరుసగా కొన్ని నెలల పాటు సమాధానం దొరకకపోతే మీరు నేర్చుకునే ప్రక్రియ ఆగిపోయిందని అర్థం. మైక్రోసాఫ్ట్లో సుమారు ఆరు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తన పని పునరావృతం అవుతోందని, కొత్తగా నేర్చుకోవడానికి ఏమీ లేదని ఈ పరీక్ష ద్వారానే ఆయన గ్రహించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే మైక్రోసాఫ్ట్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నారు.రాజీనామానే మార్గమా?నేర్చుకోవడం ఆగిపోయిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెన్ సూచిస్తున్నారు. కంపెనీని వీడకముందే కొన్ని అంతర్గత మార్గాలను అన్వేషించాలని ఆయన సలహా ఇచ్చారు. మేనేజర్లతో చర్చించి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. కంపెనీలోనే ఎక్కువ లెర్నింగ్ స్కోప్ ఉన్న మరో టీమ్కు బదిలీ అవ్వొచ్చన్నారు. చెన్ కూడా మైక్రోసాఫ్ట్ లో అంతర్గత మార్పును ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్పట్లో వేగంగా ఎదుగుతున్న ‘ఫేస్బుక్’ (మెటా) వైపు వెళ్లడమే సరైనదని భావించారు. వేగవంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుందని ఆయన నమ్మినట్లు చెప్పారు.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు నిరంతరం తమను తాము ప్రశ్నించుకోవాలని చెన్ హెచ్చరిస్తున్నారు. ప్రతి నెల మనలో కొత్త నైపుణ్యం తోడవ్వకపోతే ఈ వేగవంతమైన పరిశ్రమలో మనుగడ ప్రశ్నార్థకమే. కాబట్టి, ప్రమోషన్ల కోసం ఎదురుచూడకుండా మీరు ఏమేరకు కొత్త అంశాలు నేర్చుకుంటున్నారో ప్రతి నెలా చెక్ చేసుకోండి!ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలి తాలుసాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 89 శాతం దూసుకెళ్లి రూ. 9,352 కోట్లను తాకింది. అంతర్జాతీయంగా మెటల్ ధరలు బలపడటం, అమ్మకాల పరిమాణంలో వృద్ధి, రూపాయి మారకపు విలువ క్షీణత ఇందుకు దోహదపడ్డాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,961 కోట్లు ఆర్జించింది. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం 29 శాతం జంప్చేసి రూ. 51,524 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 39,789 కోట్ల టర్నోవర్ అందుకుంది. అయితే మొత్తం వ్యయాలు రూ. 13,702 కోట్ల నుంచి రూ. 19,119 కోట్లకు పెరిగాయి. విడదీయనున్న కంపెనీల లిస్టింగ్కు వీలుగా వచ్చే వారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు దరఖాస్తు చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో జూన్మధ్యకల్లా ఆయా బిజినెస్లు ప్రత్యేక కంపెనీలుగా లిస్టయ్యే అవకాశమున్నట్లు కంపెనీ పేర్కొంది. రూ. 14,918 కోట్ల పెట్టుబడులు కొత్త సామర్థ్యాల వినియోగం, పటిష్ట నిర్వహణా సామర్థ్యాలను ప్రతిఫలిస్తూ 2.9 మిలియన్ టన్నుల(ఎంటీ) అల్యూమినా, 2.46 ఎంటీ అల్యూమినియం, 1.1 ఎంటీ మైన్డ్ మెటల్ను డెలివరీ చేసినట్లు వేదాంతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరుణ్ మిశ్రా పేర్కొన్నారు. గతేడాది వృద్ధికి వీలుగా రూ. 14,918 కోట్ల పెట్టుబడులను వెచ్చించినట్లు వెల్లడించారు. 2026 మార్చి31కల్లా కంపెనీ స్థూల రుణ భారం రూ. 81,470 కోట్లుగా నమోదైంది. నికర రుణ భారం రూ. 53,254 కోట్లుకాగా.. క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయం, నిర్వహణ లాభం, నికర లాభాలను సాధించినట్లు వేదాంతా సీఎఫ్వో అజయ్ గోయెల్ పేర్కొన్నారు. వేదాంతా లిమిటెడ్ నుంచి అల్యూమినియం(వీఏఎంఎల్), మర్చంట్ పవర్(టీఎస్పీఎల్), ఆయిల్ అండ్ గ్యాస్(ఎంఈఎల్), ఇనుప ఖనిజ(వీఐఎస్ఎల్) బిజినెస్లను నాలుగు లిస్టెడ్ కంపెనీలుగా విడదీస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు మే 1 రికార్డ్ డేట్గా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 4.7 శాతం జంప్చేసి రూ. 773 వద్ద ముగిసింది. -
‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్టమన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య సాగుతున్న న్యాయపోరాటం కీలక దశకు చేరుకుంది. మస్క్ దాఖలు చేసిన దావాపై కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ కోర్టులో వాదోపవాదాలు హోరెత్తుతున్నాయి. ఓపెన్ఏఐ సంస్థ స్థాపన లక్ష్యాలను తుంగలో తొక్కారన్న మస్క్ ఆరోపణలు, మరోవైపు మస్క్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారన్న ఓపెన్ ఏఐ వాదనలతో ఈ కేసు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.2015లో ఓపెన్ ఏఐ స్థాపన సమయంలో ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్మన్ వంటి దిగ్గజాలు ఒక్కటయ్యారు. అప్పట్లో మానవాళికి ప్రయోజనం చేకూర్చే ఏజీఐ అభివృద్ధి, లాభాపేక్ష లేని పరిశోధనలు అనేవి ప్రధాన సూత్రాలుగా ఉండేవి. 2018 వరకు బోర్డులో చురుగ్గా ఉన్న మస్క్, ఆ తర్వాత సంస్థ విధానాలను వ్యతిరేకిస్తూ అందులో నుంచి వైదొలిగారు. ప్రస్తుతం కోర్టులో సాక్ష్యమిచ్చిన మస్క్, సంస్థ మూల సూత్రాల నుంచి తప్పుకుందని మండిపడ్డారు. ‘నేనే ఈ ఆలోచనను ప్రారంభించాను, పేరు పెట్టాను, కీలక నిపుణులను నియమించాను, భారీగా నిధులు సమకూర్చాను. ఇది నా బ్రెయిన్ చైల్డ్. కానీ ఇప్పుడు దాని తీరుతెన్నులే మారిపోయాయి’ అన్నారు.మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు..మస్క్ నిష్క్రమణ తర్వాత 2019లో ఓపెన్ ఏఐ ‘క్యాప్డ్ ప్రాఫిట్’ (పరిమిత లాభాపేక్ష) విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి బిలియన్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. అజూర్, కోపైలట్ వంటి ఉత్పత్తుల్లో ఓపెన్ ఏఐ సాంకేతికతను వాడటంపై మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓపెన్ ఏఐ మళ్లీ పాత లాభాపేక్షలేని మోడల్కు మారాలి. దాదాపు 134 బిలియన్ డాలర్ల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ప్రస్తుత నాయకత్వంలో మార్పులు జరగాలి’ అని మస్క్ అంటున్నారు.ఓపెన్ ఏఐ కౌంటర్మస్క్ ఆరోపణలను ఓపెన్ ఏఐ తరపు న్యాయవాది విలియం సావిట్ తీవ్రంగా ఖండించారు. సంస్థ లాభాపేక్షలేనిదిగా ఉండటానికి ఎలాంటి రాతపూర్వక ఒప్పందం లేదని ఆయన వాదించారు. ఆధునిక ఏఐ వ్యవస్థలను నిర్మించడానికి బిలియన్ల కొద్దీ నిధులు, భారీ మౌలిక సదుపాయాలు అవసరమని అందుకే నిర్మాణంలో మార్పులు చేశామని స్పష్టం చేశారు. ‘మిస్టర్ మస్క్ కోరుకున్నట్లుగా సంస్థపై నియంత్రణ దక్కలేదు కాబట్టే ఈ దావా వేశారు. గతంలో ఆయనే స్వయంగా సంస్థపై ఎక్కువ నియంత్రణ కోసం ఒత్తిడి చేశారు. ఇప్పుడు దొంగ ఏడుపు నటిస్తున్నారు’ అని సావిట్ కోర్టుకు వివరించారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సైతం తన పాత ప్రకటనలను సమర్థించుకుంటూ.. ‘ప్రపంచస్థాయి మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి సాధారణంగా సేకరించే నిధుల కంటే ఎక్కువ మూలధనం అవసరం. మా లక్ష్యం ఎప్పుడూ మానవాళి శ్రేయస్సే’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్..
కార్పొరేట్ ప్రపంచంలో నియామక ప్రక్రియలు ఒక్కోసారి వింత పోకడలకు వేదికవుతున్నాయి. ఒక అభ్యర్థికి ఆఫర్ లెటర్ ఇచ్చి, అతను దానికి అంగీకారం తెలిపి, ఇక విధుల్లో చేరతాడు అనే సమయానికి.. చివరి నిమిషంలో భారీ ప్యాకేజీ డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'నాట్ డేటింగ్' (Knot Dating) స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జస్వీర్ సింగ్ తన కంపెనీలో ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఇది పూర్తిగా ‘నాన్ సెన్స్’ అన్నారు.అసలేం జరిగింది?జస్వీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక బ్యాకెండ్ డెవలపర్ నియామకం కోసం తమ సంస్థ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఓ అభ్యర్థి ప్రస్తుతం రూ.21 ఎల్పీఏ సంపాదిస్తున్నారు. తనకు కంపెనీ సుమారు 33 శాతం పెంపుతో ఏటా రూ.28 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసింది. అభ్యర్థి ఈ ఆఫర్ను సంతోషంగా అంగీకరించి కంపెనీలో చేరతానని ధ్రువీకరించారు. కానీ, ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. విధుల్లో చేరడానికి కేవలం రెండు రోజుల ముందు ఆ అభ్యర్థి కంపెనీకి ఒక ఈమెయిల్ పంపారు. తనకు మరో సంస్థ నుంచి రూ.32 లక్షలు ఆఫర్ వచ్చిందని, కాబట్టి తన జీతాన్ని రూ.36 లక్షలకి పెంచితేనే చేరుతానని డిమాండ్ చేశారు.‘మనం చివరిసారి మాట్లాడుకున్నప్పుడు రూ.28 లక్షలకి అంగీకరించాను. కానీ ఇప్పుడు రూ.32 లక్షలు ఆఫర్ వచ్చింది. నాకు మీ కంపెనీ అంటే ఇష్టమే అందుకే నా ప్యాకేజీని రూ.36 లక్షలకు సవరించే వెసులుబాటు ఉందేమో చూడండి. అలాగే, నేను వారాంతాల్లో పని చేయను’ అని ఆ అభ్యర్థి నిస్సంకోచంగా మెయిల్లో పేర్కొన్నారు.‘ఇది ప్రొఫెషనలిజం కాదు’ఈ మెయిల్ చూసి విస్మయానికి గురైన జస్వీర్ సింగ్ అభ్యర్థి ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్యాకేజీ గురించి చర్చలు జరపడం సహజమే కానీ, ఒక ఆఫర్ను అంగీకరించిన తర్వాత ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. ‘ప్రస్తుత కంపెనీలో నోటీసు పీరియడ్ ముగిసే వరకు వేచి చూసి కొత్త కంపెనీలో చేరడానికి రెండు రోజుల ముందు ఇలా డిమాండ్ చేయడం వల్ల కంపెనీ సమయం, వనరులు వృథా అవుతాయి. ఇంకా ఆఫర్ల కోసం వెతుకుతుంటే ఆ విషయాన్ని ముందే చెప్పాలి. ఇది నాన్సెన్స్’ అని జస్వీర్ అన్నారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ‘ఎక్కడ ఎక్కువ జీతం వస్తే అక్కడికి వెళ్లడం సహజం. కంపెనీలు కూడా అవసరం తీరాక ఉద్యోగులను తొలగిస్తాయి కదా, అప్పుడు లేని నైతికత ఇప్పుడెందుకు?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ‘ఒక మాట ఇచ్చాక తప్పడం సరికాదు. మరిన్ని ఆఫర్లు కావాలనుకుంటే అసలు ఆఫర్ లెటర్ మీద సంతకం చేయకూడదు. ఇది రిక్రూటర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని మరికొందరు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’ -
‘ఎండీ పదవీకాలం పొడిగించవద్దు’
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) సందీప్ బక్షి పదవీకాలం పొడిగింపుపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. బక్షి నాయకత్వంలో బ్యాంక్ వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు, నియంత్రణ ఉల్లంఘనలు, మోసాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త ప్రశాంత్ భూషణ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి లేఖ రాశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించవద్దని, అది బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధమని భూషణ్ తన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.నియంత్రణ ఉల్లంఘనల పరంపరసాధారణంగా మూడేళ్ల పాటు ఉండే పదవీకాలాన్ని కాదని వారసత్వ ప్రణాళికలో భాగంగా సందీప్ బక్షికి రెండేళ్ల పొడిగింపు ఇవ్వాలని ఐసీఐసీఐ బ్యాంక్ జనవరిలో ఆర్బీఐని కోరింది. ఈ నేపథ్యంలో భూషణ్ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్లు 35A, 35B, 36AA, 10B కింద ఆర్బీఐ తన చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించాలని ఆయన కోరారు.‘బక్షి హయాంలో నిరంతర నియంత్రణ ఉల్లంఘనలు జరిగాయి. ఆయనను కొనసాగించడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అని భూషణ్ హెచ్చరించారు. ముఖ్యంగా 2020-21 కాలంలో (చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత) రుణాల వ్యవహారం, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ రక్షణ వంటి అంశాలలో విఫలమైనందుకు బ్యాంక్పై ఆర్బీఐ రూ.12 కోట్ల జరిమానా విధించడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.రూ.245 కోట్ల మోసాలు.. డేటా ఉల్లంఘనలు2024 నుంచి ఇప్పటివరకు సుమారు 23 ఆర్థిక మోసాలు జరిగినట్లు భూషణ్ తన లేఖలో జాబితా చేశారు. ‘22 శాఖల్లో సుమారు రూ.245 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కస్టమర్ల గోప్యతకు సంబంధించిన డేటా ఉల్లంఘనలు కూడా చోటుచేసుకున్నాయి’ అన్నారు. అయితే, ఈ నష్టాలు బ్యాంకు నికర లాభంలో కేవలం 0.25% మాత్రమేనని, పైగా వీటిలో బక్షి వ్యక్తిగతంగా నిందితుడు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, ఒక విపత్తు సంభవించే వరకు ఆర్బీఐ వేచి చూడకూడదని భూషణ్ వాదించారు.కార్మిక చట్టాల ఉల్లంఘన.. ఉద్యోగుల ఆత్మహత్యలుబ్యాంకులో పని ఒత్తిడి, ఉద్యోగుల వేధింపులపై భూషణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘2024 జనవరి - జూన్ మధ్య సుమారు 800 మంది ఉద్యోగులు పని మానేసినట్లు సమాచారం. ఇది మొత్తం సిబ్బందిలో 0.39%. పని ఒత్తిడి కారణంగా ఇటీవల నలుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కార్మిక అధికారులు కోరినప్పటికీ క్రమశిక్షణా చర్యలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, రికార్డులు అందించడంలో బ్యాంక్ విఫలమైంది’ అని ఆరోపించారు. దీనిపై బక్షిపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరడానికి చర్యలు ప్రారంభించినట్లు లేఖలో పేర్కొన్నారు.రూ.1,224 కోట్ల జీఎస్టీ డిమాండ్లుపన్ను చెల్లింపుల్లో కూడా బ్యాంక్ విఫలమైందని భూషణ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి సుమారు రూ.1,224 కోట్లకు పైగా జీఎస్టీ డిమాండ్ నోటీసులు రావడం అంతర్గత ఆడిట్ నియంత్రణలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు.చందా కొచ్చర్ నిష్క్రమణ తర్వాత బ్యాంకును గాడిలో పెట్టిన బక్షి తన చిరకాల ప్రత్యర్థి హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో ఉన్న అంతరాన్ని గణనీయంగా తగ్గించగలిగారు. మరి ఈ ఆర్థిక విజయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఆయనకు పదవి పొడిగింపు ఇస్తుందా? లేక ప్రశాంత్ భూషణ్ లేవనెత్తిన నియంత్రణ లోపాలపై విచారణ చేపడుతుందా? అన్నది ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
దేశంలో 16.77 కోట్ల మంది విమానమెక్కారు..
ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అంచనాలకు అనుగుణంగా పెరిగింది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 0–3 శాతం అంచనా వేయగా 1.4 శాతం వృద్ధి నమోదైంది. 16.77 కోట్ల మంది ప్రయాణికులను దేశీ ఎయిర్లైన్స్ గమ్యస్థానాలకు చేర్చాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది 16.54 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మార్చిలో దేశీయంగా విమాన ప్రయాణికుల ట్రాఫిక్ 1 శాతం పెరిగి 1.47 కోట్లుగా ఉంది.మార్చిలో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ 89.5 శాతంగా ఉన్నట్లు, గతేడాది ఇదే వ్యవధిలో ఇది 86 శాతంగా ఉన్నట్లు ఇక్రా పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడిచమురు రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా విమాన ఇంధనం రేట్ల పెంపు భారం తక్కువగా ఉన్నట్లు వివరించింది. నెలవారీగా చూస్తే మార్చిలో క్రూడాయిల్ రేట్లు 45.5 శాతం పెరిగినా, ఏటీఎఫ్ ధరలపై కేంద్ర పౌర విమానయాన శాఖ 25 శాతం పరిమితి విధించినట్లు తెలిపింది.దేశీయంగా ఏవియేషన్ రంగంపై ప్రభావం పడకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సీక్వెన్షియల్గా ఏప్రిల్లో ఏటీఎఫ్ రేట్లను 9.2 శాతం మాత్రమే పెంచాయి. అయితే, క్రూడాయిల్ ధరలు అధిక స్థాయిలోనే కొనసాగుతున్నందున భవిష్యత్తులో ఏటీఎఫ్ రేట్లపై ప్రభావం పడొచ్చని, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుండటం మరో ఆందోళనకరమైన విషయమని ఇక్రా తెలిపింది. -
ఒక ప్రీమియం.. జీవితాంతం ఆదాయం!
అవివా ఇండియా.. అవివా సెక్యూర్ నెస్ట్ యాన్యుటీ ప్లాన్ను ప్రారంభించింది. ఇది పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేక పథకం. ఈ స్కీమ్ ద్వారా ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లించి.. జీవితాంతం నిరంతర ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది రిటైర్మెంట్ తరువాత ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకునే వ్యక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. 80 సంవత్సరాల వయస్సు వరకు ప్రవేశం లభిస్తుంది. అంటే, జీవితంలో ఏ దశలో ఉన్నవారైనా తమ భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని ఎంచుకోవచ్చన్నమాట. దీనిలో వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వివిధ యాన్యుటీ ఎంపికలు ఉన్నాయి. వీటిలో సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ కవరేజ్ ఉన్నాయి.అంతే కాకుండా.. అనువైన చెల్లింపు వ్యవధులతో హామీతో కూడిన జీవితకాల ఆదాయం, నామినీల వారసత్వాన్ని రక్షించడానికి కొనుగోలు ధర వాపసు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) నిబంధనలకు కూడా అనుగుణంగా ఉంది, అందువల్ల ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులకు ఒక సరైన ఎంపికగా నిలుస్తుంది. -
ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. మొబిక్విక్కు NBFC లైసెన్స్!
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)గా సేవలు అందించేందుకు వన్ మొబిక్విక్ సిస్టమ్స్ చేసుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్బీఎఫ్సీ లైసెన్స్ జారీ చేసేందుకు ఆర్బీఐ అనుమతించినట్టు సంస్థ ప్రకటించింది. దీంతో రుణ విభాగం ‘మొబిక్విక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్’ను ఆరంభించేందుకు అవకాశం లభించిందని, తమ రుణ వ్యాపార అవకాశాల విస్తరణకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.వర్తకులు, వినియోదారులకు మరింత విస్తృతమైన సేవలకు వీలు కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నాలుగు నెలల్లోనే తమ దరఖాస్తుకు ఆర్బీఐ ఆమోదం తెలిపిందని, తమ గ్రూప్ విశ్వసనీయతకు ఇది నిదర్శనమని మొబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు, ఈడీ ఉపాసనా టకు పేర్కొన్నారు. తమ గ్రూప్నకు ఉన్న 18.6 కోట్ల యూజర్ల బేస్, బలమైన టెక్నాలజీ వసతులు, వసూలు సామర్థ్యాల పునాదులపై ఎన్బీఎఫ్సీని నిర్మించనున్నట్టు చెప్పారు. -
డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!
బ్రిటన్లో యువ ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ ఖాలెద్ షరీఫ్ వెల్లడించారు. లండన్ శివార్లలోని కింగ్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ మీడియా టెక్నాలజీలో డిస్టింక్షన్తో పట్టభద్రుడైనప్పటికీ, అతనికి ఉద్యోగం దొరకలేదు.ఖాలెద్ షరీఫ్ సుమారు 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటి కూడా సాధించలేకపోవడం అతని నిరాశను పెంచింది. 100,000 పౌండ్లకు (రూ. కోటి కంటే ఎక్కువ) పైగా ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా అవకాశాలు లభించకపోవడం.. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే భావన కలిగించింది.ఈజిప్టులో జన్మించి, ఖతార్లో పెరిగి, 18 ఏళ్ల వయసులో లండన్కు వెళ్లిన షరీఫ్, బ్రిటిష్ రాజధాని తనకు వృత్తిపరంగా అవకాశాలను కల్పిస్తుందని ఆశించాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కోవిడ్19 ప్రభావం, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాల తగ్గుదలకు కారణమని అతను అభిప్రాయపడ్డాడు.కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగులను నియమించడాన్ని తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకోవడం కంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖాలెద్ వెనుకడుగు వేయలేదు. ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ తన సృజనాత్మకతను కొనసాగిస్తున్నాడు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''అంతే కాకుండా.. ''జోక్'' అనే దుస్తుల బ్రాండ్ను ప్రారంభించి, తన ఆసక్తులను వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం.. యూనివర్సిటీలో నేర్చుకున్నదానికంటే.. స్వయంగా నేర్చుకున్న నైపుణ్యాలే వృత్తిలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. -
'ఆ 80 హిప్పోలను చంపకండి': అనంత్ అంబానీ లేఖ
కొలంబియాలోని మగ్డలేనా నది పరివాహక ప్రాంతంలో.. ఒక పర్యావరణ సమస్య తలెత్తింది. ఇక్కడ సుమారు 200 వరకు హిప్పోపొటమస్లు జీవిస్తున్నాయి. వీటి వల్ల స్థానిక జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, మనుషుల భద్రతపై ప్రభావం పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. కొలంబియా ప్రభుత్వం 80 హిప్పోలను చంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆపాలని అనంత్ అంబానీ కొలంబియా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వంతారా స్థాపకులు అయిన అనంత్ అంబానీ.. హిప్పోలను చంపాలనే నిర్ణయం సరికాదని వెల్లడించారు. జంతువులను చంపడం కంటే, వాటిని సురక్షితంగా మరో ప్రదేశానికి తరలించడం ఒక మంచి పరిష్కారం అని అన్నారు. ఈ విషయంపై కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్కు ఒక లేఖ రాశారు.అనంత్ అంబానీ రాసిన లేఖలో.. 80 హిప్పోపొటమస్లను గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వంతారాకు తరలించవచ్చని, ఇక్కడ జంతువులకు అనుకూలమైన సహజ వాతావరణం, వైద్య సదుపాయాలు, శాశ్వత సంరక్షణ అందుబాటులో ఉంటాయని చెప్పారు. జంతువులను చంపడం కంటే.. ఇది సరైన ప్రత్యామ్నాయం అని అన్నారు.''ఆ ఎనభై హిప్పోలు తాము ఎక్కడ పుట్టాలో ఎంచుకోలేదు, అలాగే తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా సృష్టించుకోలేదు'' కాబట్టి వాటిని చంపడం తగదు. సురక్షితమైన పరిష్కారం ద్వారా వాటిని కాపాడే సామర్థ్యం మనకు ఉంటే, ప్రయత్నించాల్సిన బాధ్యత మనపై ఉందని అనంత్ అంబానీ అన్నారు.వంతారా గురించిగుజరాత్లోని జామ్నగర్లో ఉన్న వంతారా, ప్రపంచంలోనే అతిపెద్ద. అత్యంత అధునాతన వన్యప్రాణుల రక్షణ, సంరక్షణ.. పరిరక్షణ కేంద్రాలలో ఒకటి. అనంత్ అంబానీ దీనిని 3000 ఎకరాల్లో (కృత్రిమ అడవి) ఏర్పాటు చేసి.. జంతువులకు రక్షిస్తున్నారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా.. సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్లు, హైపర్బారిక్ ఆక్సిజన్ ఛాంబర్తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి. -
ఎల్పీజీ మార్పులు.. మే 1 నుంచి కొత్త రూల్స్
దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మే 1వ తేదీ నుంచి కొత్త మార్పులు రానున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వినియోగదారులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం నేరుగా ఇంధన ధరలపై పడుతోంది. ధరల పెంపుతో పాటు, మే నెల నుంచి గ్యాస్ బుకింగ్, డెలివరీ నిబంధనల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.ఆకాశాన్నంటుతున్న ధరలుఅమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ధరల భారాన్ని వినియోగదారులపై గత నెలలోనే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరపై సుమారు రూ. 60పెరిగింది. ఇక కమర్షియల్ వినియోగదారులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా రూ. 196 పెరిగింది. మే 1వ తేదీన చమురు సంస్థలు నిర్వహించే నెలవారీ సమీక్షలో ధరలు మరోసారి సవరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.కొత్త బుకింగ్ నిబంధనలు ఇవే!కేవలం ధరలే కాకుండా, సిలిండర్ల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తోంది.బుకింగ్ గ్యాప్: నగరాల్లో నివసించే వారు ఒక బుకింగ్కు, మరో బుకింగ్కు మధ్య కనీసం 25 రోజుల విరామం పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువు 45 రోజులుగా నిర్ణయించారు.OTP తప్పనిసరి: గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ఆధారిత ప్రామాణీకరణ ఇకపై శాశ్వతం కానుంది. సిలిండర్ల మళ్లింపును అరికట్టేందుకు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.ఆన్లైన్ బుకింగ్: ప్రస్తుతం 98% బుకింగ్లు ఆన్లైన్ ద్వారానే జరుగుతుండగా, మే నెల నుంచి డెలివరీ వ్యవస్థను మరింత డిజిటలైజ్ చేయనున్నారు.ఆధార్ ఈ-కేవైసీ ఎవరికి అవసరం?గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ-కేవైసీపై (e-KYC) సామాన్యుల్లో ఉన్న గందరగోళానికి అధికారులు స్పష్టత ఇచ్చారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఆర్థిక సంవత్సరంలో ఏడు రీఫిల్స్ పూర్తయ్యాక, ఎనిమిదో సిలిండర్ నుండి సబ్సిడీ పొందాలంటే ఈ ప్రామాణీకరణ అవసరం. ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసిన సాధారణ వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. -
సన్ ఫార్మా మెగా డీల్..!
న్యూఢిల్లీ: దేశీ ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా మరో భారీ డీల్కి తెరతీసింది. అమెరికాకు చెందిన ఆర్గానాన్ అండ్ కంపెనీని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సంస్థ విలువను 11.75 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 1.10 లక్షల కోట్లు) లెక్క కట్టారు. ఒక్కో షేరుకు 14 డాలర్ల చొప్పున చెల్లించి ఆర్గానాన్ను సన్ ఫార్మా కొనుగోలు చేయనుంది. ఇది పూర్తిగా నగదు రూపంలో ఉంటుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి 2027 తొలినాళ్లలో ఒప్పందం పూర్తవుతుందని అంచనా. దీనికి కావాల్సిన మొత్తాన్ని 2–2.5 బిలియన్ డాలర్లను అంతర్గతంగాను, మిగతా 9.25–9.75 బిలియన్ డాలర్లను రుణం రూపంలో సన్ ఫార్మా సమకూర్చుకోనుంది. కాస్త ఆనందం.. కాస్త ఉత్కంఠ.. ఇరు కంపెనీల కలయికతో మరింత శక్తివంతమైన సంస్థ ఏర్పడుతుందని సన్ ఫార్మా చైర్మన్ దిలీప్ సంఘ్వీ తెలిపారు. ‘ఈ డీల్ విషయంలో కాస్త ఆనందంగాను, ఉత్తేజంగాను, కాస్త ఉత్కంఠగాను ఉంది. ఇది చాలా భారీ ఒప్పందం కావడం, పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాల్సి రానుండటమే ఇందుకు కారణం. మేము రుణానికే తప్ప రిస్కుకు వ్యతిరేకం కాదు. అయితే, ఇప్పుడు తీసుకుబోయే రుణం భారీగానే ఉన్నప్పటికీ ఉమ్మడి సంస్థ ఎబిటాకు 2.3 రెట్లు మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను బట్టి దీన్ని త్వరలోనే తగ్గించుకోగలమనే ధీమా ఉంది. గతంలో ర్యాన్బాక్సీ డీల్ని ఇది గుర్తు తెస్తోంది. అప్పట్లో మాది చిన్న కంపెనీ అయినప్పటికీ చాలా పెద్ద సంస్థను కొన్నాం. ఇప్పుడు అర్గానాన్ దాదాపు సన్ ఫార్మా స్థాయిదే అయినప్పటికీ సుమారు 25 శాతం తక్కువ వేల్యుయేషన్కే లభిస్తోంది‘ అని ఆయన పేర్కొన్నారు. ‘వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలన్నింటినీ పరిశీలించిన మీదట నగదు రూపంలో ఉండే ఈ లావాదేవీ మా వాటాదారులకు గణనీయంగా ప్రయోజనకరంగా ఉంటుందని బోర్డు నిర్ణయించింది. అంతర్జాతీయంగా మా వ్యాపారాలు, ఉద్యోగులు, పేషెంట్లకు సన్ ఫార్మా దన్నుగా ఉంటుందని ఆశిస్తున్నాం‘ అని ఆర్గానాన్ ఎగ్జిక్యూటివ్ చెయిర్ క్యారీ కాక్స్ తెలిపారు. ఆర్గానాన్ కథ ఇదీ... 2021లో దిగ్గజ సంస్థ మెర్క్ నుంచి విడగొట్టడం ద్వారా ఏర్పాటైన గ్లోబల్ హెల్త్కేర్ కంపెనీ ఆర్గానాన్. మెర్క్ని అమెరికా, కెనడా వెలుపల ఎంఎస్డీగా వ్యవహరిస్తారు. ఆర్గానాన్కి యూరోపియన్ యూనియన్, వర్ధమాన మార్కెట్లలో ఆరు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మహిళల ఆరోగ్యానికి సంబంధించిన ఔషధాల్లో గ్లోబల్ లీడరుగా కార్యకలాపాలు సాగిస్తోంది. మహిళల హెల్త్, జనరల్ మెడిసిన్స్ విభాగాల్లో బయోసిమిలర్స్ సహా 70కి పైగా ఉత్పత్తులు ఉన్నాయి. 140 దేశాల్లో విక్రయిస్తోంది. అమెరికా, యూరప్, చైన్, కెనడా, బ్రెజిల్ మొదలైనవి భారీ మార్కెట్లుగా ఉన్నాయి. 2025 డిసెంబర్ 31తో ముగిసిన సంవత్సరంలో కంపెనీ 6.2 బిలియన్ డాలర్ల ఆదాయం, 1.9 బిలియన్ డాలర్ల ఎబిటాను (సవరించిన) ఆర్జించింది. 8.6 బిలియన్ డాలర్ల రుణభారం, 574 మిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇటీవలే ఒక ఉత్పత్తి విక్రయానికి గాను ముందస్తుగా 440 మిలియన్ డాలర్లు అందుకుంది. డీల్స్ కింగ్.. సన్ .. సన్ ఫార్మా గతంలో కూడా పలు భారీ స్థాయి కొనుగోళ్లు చేసింది. 2014లో ర్యాన్బాక్సీని 4 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. అలాగే 2007లో ఇజ్రాయెల్కి చెందిన టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని 454 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. దేశీ దిగ్గజాల భారీ షాపింగ్.. అంతర్జాతీయంగా మన కంపెనీల భారీ కొనుగోళ్ల ఒప్పందాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. 2007లో కోరస్ను టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. తర్వాత 2010లో కువైట్ దిగ్గజం జెయిన్ టెలికంనకు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని భారతి ఎయిర్టెల్ 10.7 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. సన్ ఫార్మాకు ప్రయోజనాలు.. → 12.4 బిలియన్ డాలర్ల ఉమ్మడి ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ 25 ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సంస్థ నిలుస్తుంది. → గ్లోబల్గా మహిళల ఆరోగ్య సంరక్షణ ఔషధాలకు సంబంధించి టాప్ 3 కంపెనీల్లో ఒకటిగా చోటు దక్కుతుంది. → బయోసిమిలర్స్ మార్కెట్లో 7వ పెద్ద సంస్థగా ఉంటుంది. → 150 దేశాలు, 18 భారీ మార్కెట్లలో కార్యకలాపాలు. ఒక్కో మార్కెట్ నుంచి 100 మిలియన్ డాలర్ల కు పైగా ఆదాయం లభిస్తుంది.షేరు 7 శాతం అప్.. సోమవారం బీఎస్ఈలో సన్ ఫార్మా షేరు 7 శాతం ఎగిసింది. రూ. 1,733.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ. 27,307 కోట్లు పెరిగి రూ. 4,15,987 కోట్లకు చేరింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో అత్యధికంగా లాభపడిన షేరుగా నిల్చింది. అమెజాన్ నౌ 100 నగరాల్లోకి విస్తరణలిస్టులో హైదరాబాద్, వైజాగ్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ అమెజాన్ నౌ క్విక్ కామర్స్ సరీ్వసులను దేశవ్యాప్తంగా 100 నగరాల్లోకి విస్తరించనుంది. హైదరాబాద్, వైజాగ్తో పాటు పుణే, చెన్నై, కోల్కతా, జైపూర్, లక్నో తదితర నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం బెంగళూ రు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లో (నేషన ల్ క్యాపిటల్ రీజియన్) అమెజాన్ నౌ సేవ లు లభిస్తున్నాయి. అమెజాన్ ఇండి యా ఇటీవల ప్రకటించిన రూ. 2,800 కోట్ల పెట్టుబడుల ప్రణాళికల్లో ఈ విస్తరణ భాగంగా ఉండనుంది. 1,000కి పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు తమ క్విక్ కామర్స్ కార్యకలాపాలకు దన్నుగా ఉంటాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఎవ్రీడే ఎజెన్షియల్స్) హర్‡్ష గోయెల్ తెలిపారు. క్విక్ కామర్స్ విస్తరణతో 16,000 మందికి పైగా రైతులు తమ టెక్నాలజీ, నెట్వర్క్ని ఉపయోగించుకుని, ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. -
అమ్మానాన్నలతో గడపాలని.. OpenAIకి రాజీనామా!
ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్ విభాగపు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) అయిన శ్రీనివాస్ నారాయణన్ సంచనల నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని వీడి భారతదేశానికి రానున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మూడు సంవత్సరాలు సంస్థలో పనిచేసిన తరువాత.. శ్రీనివాస్ నారాయణన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల వరుసగా కొత్త ఉత్పత్తులను విడుదల చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముందుగా ఈ విషయాన్ని కంపెనీకి తెలియజేసి ఈ ప్రయాణాన్ని "అద్భుతమైన అనుభవం"గా అభివర్ణించారు.నారాయణన్ తన తదుపరి ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోకముందు భారత్కు వెళ్లి తన వృద్ధ తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా.. సామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రాక్మాన్లకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పారు. టెక్నాలజీ, సమాజంలో కీలక మార్పులు జరుగుతున్న ఈ కాలంలో సంస్థలో పని చేయడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు. మీ అందరికీ భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''ఎవరీ శ్రీనివాస్ నారాయణన్?శ్రీనివాస్ నారాయణన్ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి. విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పట్టా పొంది, ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్లో తన వృత్తిని ప్రారంభించారు. తరువాత మెటాలో దశాబ్దానికి పైగా పని చేసి, ఫేస్బుక్ ఫోటోస్ వంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఓపెన్ఏఐలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అప్లైడ్ ఇంజనీరింగ్ బృందాన్ని నిర్మించి, విస్తరించారు. ఈ బృందమే పరిశోధనను లక్షలాది మంది ఉపయోగించే ఉత్పత్తులుగా మారుస్తుంది.After 3 incredible years, I am leaving OpenAI at the end of next week.I shared my decision with the OpenAI leadership team at the start of the month and here is a shorter version of what I shared with my team earlier this week.===Hi Team,I have decided to leave OpenAI. The…— Srinivas Narayanan (@snsf) April 17, 2026 -
ఇన్వెస్కో కొత్త ఫండ్స్!
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ కొత్తగా రెండు ఫండ్స్ని ఆవిష్కరించింది. ఇన్వెస్కో ఇండియా బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్ వీటి లో ఉన్నాయి.మొదటిది సెన్సెక్స్ ఇండెక్స్లోని కంపెనీలు, రెండోది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్లోని సంస్థల ఈక్విటీలు, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ప్యాసివ్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఎన్ఎఫ్వో వ్యవధిలో ఏకమొత్తంగా నైతే కనీసం రూ.100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ విధానంలో ఎంచుకున్న వ్యవధిని బట్టి రూ. 20 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ న్యూ ఫండ్స్ ఆఫర్లు మే 7న ముగుస్తాయి. -
"దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''
జోహో కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీధర్ వెంబు.. అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆయన ఇండియాకు తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. దీనికి సంబంధించిన ట్వీట్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.తన 37 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. అమెరికాలో చదువు, అవకాశాలు పొందిన తర్వాత తాను భారత్లోనే టెక్ రంగంలో ఎదిగినట్లు చెప్పారు. అమెరికాలో భారతీయులు పడుతున్న అవస్థలు కూడా చాలా ఉన్నాయి. రాజకీయంగా జరుగుతున్న అనేక వివాదాల్లో ప్రవాస భారతీయులు ఇరుక్కుపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.భారతీయుల గౌరవం ప్రపంచ స్థాయిలో పెరగాలంటే కేవలం విదేశాల్లో విజయాలు సాధించడం కాదు. మన దేశంలో స్వయంగా, ఆర్థికంగా ఎదగడం. భారత్లో తగినంత ప్రతిభ ఉన్నప్పటికీ, చాలామంది విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ ప్రతిభను తిరిగి దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని, భారత యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!ప్రపంచంలో గౌరవం, భద్రత, అభివృద్ధి అన్నీ టెక్నాలజీపైనే ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. దయచేసి ఇంటికి (ఇండియా) తిరిగి రండి. భారతమాతకు మీ ప్రతిభ అవసరం. మీలో చాలా మందికి దీని గురించి ఆలోచించడం కష్టమైనప్పటికీ, దేశంలోనే కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.Open letter to Indians in America.--Dear brothers and sisters from Bharat:Like I did 37 years ago, you arrived in America with no money but with a good education and cultural heritage from Bharat. You achieved outstanding success. America was good to us. For that we must…— Sridhar Vembu (@svembu) April 27, 2026 -
బ్యాంకింగ్ రంగంలో ఏఐ: 3000 ఉద్యోగాల కోత!
యాక్సిస్ బ్యాంక్ ఇటీవల తన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రకటనలో బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు వెల్లడించింది. గత సంవత్సరం 1.04 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య సుమారు 1.01 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 3,000 మంది ఉద్యోగులు తగ్గారు.బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాభ్ చౌదరీ తెలిపిన ప్రకారం.. ఈ తగ్గింపు ప్రత్యేకంగా ఏ విభాగాన్ని లక్ష్యంగా చేసుకొని జరగలేదు. ఇది మొత్తం సంస్థలో సాధారణంగా జరిగిన మార్పు మాత్రమే. ముఖ్యంగా.. డిజిటల్ టెక్నాలజీపై చేసిన దీర్ఘకాలిక పెట్టుబడుల ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.గత మూడు, నాలుగు సంవత్సరాలుగా యాక్సిస్ బ్యాంక్ తన ఆపరేటింగ్ ఖర్చులలో 9% నుంచి 10% వరకు టెక్నాలజీ కోసం ఖర్చు చేస్తోంది. ఈ పెట్టుబడుల వల్ల ఇప్పుడు పనితీరు మెరుగుపడి, ఉత్పాదకత కూడా పెరిగింది. కొంతమంది ఉద్యోగులు తమ పనులను ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా వేగంగా చేయగలుగుతున్నారు.ఇదీ చదవండి: వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!పెద్ద స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరగలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. కృత్రిమ మేధస్సు (AI) కూడా ఇంకా ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించలేదని, అది కేవలం ప్రక్రియలను వేగవంతం చేయడానికి మాత్రమే ప్రస్తుతం ఉపయోగపడుతోందని తెలిపింది. ఇదే సమయంలో, యాక్సిస్ బ్యాంక్ తన భౌతిక విస్తరణను కూడా కొనసాగిస్తోంది. గత సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించింది. అంటే ఒకవైపు టెక్నాలజీ ద్వారా సామర్థ్యం పెంచుకుంటూ, మరోవైపు కస్టమర్ల కోసం శాఖలను కూడా పెంచుతోంది. -
వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!
టెక్ దిగ్గజం ఒరాకిల్.. ఇటీవలి భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుంచి 30,000 మందిని తొలగించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులకు.. తెల్లవారుజామున పంపిన ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఈ కోతలు అమెరికా, భారతదేశం, కెనడా, లాటిన్ అమెరికా దేశాలలో జరిగాయి.దిగ్గజ కంపెనీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో.. టెక్ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. తొలగింపులు ప్రభావం సీనియర్ ఉద్యోగుల మీద కూడా పడింది. అంటే చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఒరాకిల్ తొలగించిందన్నమాట.దీనికి ఉదాహరణ.. ఒరాకిల్లో 33 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ సెక్యూరిటీ నిపుణురాలు నీనా లూయిస్ను కూడా తొలగించడం. ఈమె డేటాబేస్, సెక్యూరిటీ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ నిర్ణయం తనకు షాక్గా అనిపించిందని తెలిపారు.ఇలాంటి షాకింగ్ లేఆఫ్స్ కేవలం ఒరాకిల్లో మాత్రమే జరగలేదు. ఎందుకంటే మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దిగ్గజ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం అని తెలుస్తోంది.ఏఐ టెక్నాలజీతో చాలా పనులు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. దీని వల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతో.. ఎక్కువ పనిని చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా, ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. ముఖ్యంగా సాధారణ కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి పనులు AI చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఇది ఉద్యోగ మార్కెట్పై పెద్ద ప్రభావం చూపుతోంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?మరోవైపు.. ఎక్కువ జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీలకు భారంగా మారుతున్నారు. అందువల్ల, కంపెనీలు తక్కువ జీతంతో పనిచేసే యువ ఉద్యోగులను లేదా AI టూల్స్ను ఉపయోగించడం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిస్థితులు ఉద్యోగులలో భయాన్ని రేకెత్తించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులు కూడా తమ పనితీరును AIతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. -
ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు
బ్యాంక్ ఆఫ్ బరోడా ‘బీవోబీ సీనియర్ సిటిజన్ విశేష్ సమ్మాన్’ పేరుతో వృద్ధులైన ప్రీమియం కస్టమర్ల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను తీసుకొచ్చింది. ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలకు అదనంగా ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవలను ఈ ఖాతా ద్వారా అందుకోవచ్చు.60 ఏళ్లు నిండిన వారి కోసం ఈ ఖాతాను ప్రత్యేకంగా రూపొందించినట్టు ప్రకటించింది. కుటుంబంలో ఆరుగురు సభ్యుల కోసం ఉచిత ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్లను పొందొచ్చు. అలాగే, ఆన్లైన్లో ఔషధాల కొనుగోలుపై 15 శాతం, డయాగ్నోస్టిక్స్ సేవల చార్జీల్లో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. రివర్స్ మార్ట్గేజ్ రుణంపై ప్రాసెసింగ్ చార్జీల్లో 50 శాతం రాయితీ ఉంటుంది. లాకర్ అద్దెల్లోనూ 20 శాతం తగ్గింపు పొందొచ్చని సంస్థ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ ప్రకటించారు. ఈ ఖాతాలో కనీస నిల్వ రూ.లక్ష ఉంచాలి. -
అమెజాన్లో మామిడి జాతర.. ఏఐతో నచ్చిన పండు
వేసవి కాలం రాగానే అందరికీ గుర్తుకు వచ్చేది మామిడి పండ్ల మధురమైన రుచి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అమెజాన్ ఇండియా 'ఆమ్-ఎజింగ్' పేరిట ప్రత్యేక మామిడి పండ్ల విక్రయాలను ప్రారంభించింది. పొలాల నుండి నేరుగా సేకరించిన అల్ఫోన్సో, కేసర్, సఫేదా, తోతాపురి వంటి మేలైన రకాలను అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ ద్వారా అందిస్తోంది. పండ్లతో పాటు మామిడి ఐస్ క్రీములు, ఆమ్రస్, ఊరగాయలు, పానీయాలపై 30% నుండి 70% వరకు భారీ తగ్గింపులను ప్రకటించింది. బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్సిఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన ప్రాంతాలకు నిమిషాల వ్యవధిలోనే లేదా గరిష్టంగా 2 గంటల్లోపు డెలివరీ చేసే సదుపాయాన్ని కల్పించింది.ఈ సీజన్ షాపింగ్లో ప్రధాన ఆకర్షణ అమెజాన్ వారి ఏఐ-ఆధారిత షాపింగ్ అసిస్టెంట్ 'రూఫస్' (Rufus). వినియోగదారులు తమ మూడ్కు తగిన మామిడి పండును ఎంచుకోవడానికి రూఫస్ సహాయపడుతుంది. "రూ. 500 లోపు అల్ఫోన్సో చూపించు" లేదా "స్మూతీకి ఏ రకం బాగుంటుంది?" వంటి ప్రశ్నలకు ఇది తక్షణమే సమాధానాలిస్తుంది. అంతేకాకుండా, గత 30 నుండి 90 రోజుల ధరల చరిత్రను విశ్లేషించి, వినియోగదారులు సరైన డీల్ పొందుతున్నారో లేదో తెలియజేస్తుంది. ధర తగ్గినప్పుడు అలర్ట్లు పంపడం, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు చేయడం ద్వారా ఈ ఏఐ అసిస్టెంట్ షాపింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్గా మారుస్తోంది.ప్రతి వినియోగదారుని అవసరానికి తగినట్లుగా ఐదు రకాల కేటగిరీలను అమెజాన్ రూపొందించింది. తీపి కోరికలను తీర్చుకోవడానికి అల్ఫోన్సో రకాలు, వంటల కోసం తోతాపురి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఆమ్రస్, క్యాండీలు, ఆరోగ్య స్పృహ ఉన్నవారి కోసం ఫ్రీజ్ డ్రైడ్ చిప్స్, ప్రోటీన్ షేక్ వంటి ఉత్పత్తులను అందుబాటులో ఉంచింది. -
ఈ వారం బ్యాంకు సెలవులు ఇవే..
బ్యాంకులు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఎంత డిజిటైలేజన్, ఆన్లైన్ సేవలు పెరిగిప్పటికీ నిత్యం ఏదో పని నిమిత్తం బ్యాంకులను సందర్శిస్తున్నవారు చాలా మందే ఉంటారు. అలా బ్యాంకులకు వెళ్లే వారికి ముఖ్య గమనిక. మే నెల ప్రారంభంలోనే బ్యాంకులకు సెలవులు రానున్నాయి.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం, ఈ వారం మే 1న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. మే 1వ తేదీ (శుక్రవారం) నాడు మహారాష్ట్ర దినోత్సవం, మే డే (కార్మిక దినోత్సవం) సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో బుద్ధ పూర్ణిమ, పండిట్ రఘునాథ్ ముర్ము జయంతి వేడుకలు కూడా అదే రోజు ఉండటంతో సెలవు వర్తించనుంది.మే నెలలో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ వారంలో సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి..మే 1 శుక్రవారం - మే డే / మహారాష్ట్ర దినోత్సవం (మెజారిటీ రాష్ట్రాల్లో)మే 3 ఆదివారం - వారాంతపు సెలవుసెలవు లేని రాష్ట్రాలుగుజరాత్, ఒడిశా, చండీగఢ్, సిక్కిం, రాజస్థాన్, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో మాత్రం మే 1న బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.భారతదేశంలో మే డే అనేది జాతీయ సెలవు దినం కాదు. బ్యాంకుల సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 'నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్' కింద ప్రకటిస్తాయి. గుజరాత్, రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ట్రాలు మే డేని అధికారిక బ్యాంకు సెలవుగా గుర్తించలేదు.కస్టమర్లకు టెన్షన్ అక్కర్లేదుబ్యాంకు భౌతిక శాఖలు మూతపడినప్పటికీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) సేవలు 24/7 అందుబాటులో ఉంటాయి.అలాగే నగదు విత్ డ్రా కోసం ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. అయితే చెక్కుల క్లియరెన్స్ లేదా ఇతర ముఖ్యమైన లావాదేవీలు ఉన్నవారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. -
కల్లోల మార్కెట్లకు క్రమశిక్షణే జవాబు
ఒక్క ట్వీట్తో మార్కెట్లు ఒకటిరెండు శాతం పడిపోవటం... అలాగే పెరిగిపోవటం జరుగుతోంది. అసలు మార్కెట్ల డైరెక్షన్ ఎటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం ఎలా ముగుస్తుందో, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. చమురు ధరలు బీభత్సంగా పెరుగుతున్నాయి. రూపాయి దారుణంగా పడిపోయింది. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ తరహా ఊగిసలాటలో సొమ్ము చేసుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్టర్లకది సాధ్యం కాదు. మరేం చెయ్యాలి? దీన్నుంచి పోర్టుఫోలియోను కాపాడుకోవటమెలా? దీనిపై ఫోకస్ చేస్తున్నదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...మ్యూచ్వల్ ఫండ్ల ద్వారా కావచ్చు... నేరుగా కావచ్చు. మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిందొక్కటే. ఊగిసలాటలు, కల్లోలాలు మార్కెట్కు సహజం. అసాధారణమేమీ కాదు. మనం ఆలోచించాల్సిందేంటంటే మార్కెట్లు ఇంకా ఎంత పడతాయనేది కాదు. దానికి మనమెలా స్పందించాలనేదే. మార్కెట్లు శాశ్వతం... హెచ్చుతగ్గులు తాత్కాలికం మార్కెట్ కరెక్షన్లు నాటకీయంగా ఉంటాయి. ఇక కోలుకోవేమో అనేంత భయం పుట్టిస్తాయి. పోర్టుఫోలియో విలువ పడిపోతుంది. వార్తలన్నీ నిరాశాజనకంగానే ఉంటాయి. ఇదిగో... ఇలాంటి దశలోనే చాలామంది ఇన్వెస్టర్లు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను (సిప్) తాత్కాలికంగానో, శాశ్వతంగానో నిలిపేస్తుంటారు. కాకుంటే ఇది చాలా ఖరీదైన పొరపాటు. ఎందుకంటే తెలివైన ఇన్వెస్టరుకు ఇవన్నీ తాత్కాలికమని, సంపద సృష్టి అనేది దీర్ఘకాలికమని స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లు పతనమైనపుడే సిప్ బలంగా మారుతుంది. → అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. → దీనివల్ల సగటు ఖరీదు ధర తగ్గుతుంది. → మార్కెట్లు రికవరీ అవుతున్నపుడు పెరుగుదల వేగంగా ఉంటుంది. → ఈ రుపీ కాస్ట్ యావరేజింగ్ అనేదే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంజిన్లా పనిచేస్తుంది.అసలైన మంత్రం... అసెట్ అలొకేషన్ డైవర్సిఫైడ్ పోర్టుఫోలియో ఉంటే రిస్కు పూర్తిగా పోకున్నా తగ్గుతుంది. ఎందుకంటే ఈ అసెట్లు రకరకాలుగా పనిచేస్తాయి. ఈక్విటీ వృద్ధికి తోడయితే డెట్ ఫండ్లు స్థిరత్వాన్ని ఇస్తాయి. బంగారం అనేది ఈ రెండింటికీ హెడ్జ్గా పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ డైవర్సిఫికేషన్ అనేది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. లైఫ్సైకిల్ ఫండ్స్లో క్రమశిక్షణే ‘పెట్టుబడి’ లైఫ్సైకిల్ ఫండ్స్... ఇవి ఏం చేస్తాయనేది వీటి పేరులోనే ఉంది. ఇవి మన జీవితానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అంటే.. తొలినాళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ మొత్తాన్ని పెడతాయి. మెల్లగా తగ్గించుకుంటూ వెళతాయి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ... డెట్లో మొత్తాన్ని పెంచుకుంటూ వెళతాయి. ఉదాహరణకు... → లక్ష్యంలోని తొలి 20–30 ఏళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాయి. → తరువాతి 5–10 ఏళ్లు బ్యాలెన్స్డ్గా ముందుకెళతాయి. → మెచ్యూరిటీకి దగ్గరయ్యేటపుడు డెట్పై ఫోకస్ పెంచుతాయి. → ఇలా ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ల సమయంలో భావోద్వేగాలకు తావుండదు. → అలాగని ఇవేమీ రిసు్కలేకుండా ఉండవు. లైఫ్సైకిల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ అలొకేషన్ నిర్ణయాలను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి. ఖర్చుల నిష్పత్తిని, పన్ను ప్రభావాన్ని, మెచ్యూరిటీకి దగ్గర పడుతున్నపుడు పోర్టుఫోలియో తీరును నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒకేరకమైన స్ట్రక్చర్ ఉన్నా... ఫండ్ మేనేజర్ల కారణంగా ఫండ్ల పనితీరు మాత్రం వేరుగా ఉండొచ్చు. సిప్ నిలిపేయటమే అసలు తప్పుఅన్నిటికన్నా సంపద సృష్టికి అడ్డంపడేది మార్కెట్ల పతనం కాదు. ఇన్వెస్టర్ల వైఖరే. ఎందుకంటే భయం తారస్థాయికి వెళ్లినపుడు... → ఇన్వెస్టర్లు సిప్ను నిలిపేస్తారు. → ఈక్విటీ ఫండ్ల నుంచి పూర్తిగా వైదొలుగుతారు. క్లారిటీ కోసం దీర్ఘకాలం వేచిచూస్తారు. కాకపోతే... ఈ క్లారిటీ వచ్చేసరికి మార్కెట్లు పెరిగిపోయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సాధారణ ఇన్వెస్టర్లెపుడూ తక్కువ ఖరీదులో అమ్మేసి బాగా పెరిగాక కొంటుంటారు. తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అదే తేడా.మార్కెట్ టైమింగ్ ముఖ్యమేనా? చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఎంట్రీ, ఎగ్జిట్ల కోసం సరైన సమయం కోసం చూస్తుంటారు. నిజానికి నిపుణులకు కూడా ఇవి సరిగ్గా తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ ఉండటం... క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ పోవటం... మన అసెట్ అలొకేషన్కు కట్టుబడి ఉండటం తప్పనిసరి. నిపుణులు చెప్పేదేంటంటే మార్కెట్లలో సమయం కోసం ఎదురుచూడటం కన్నా... ఎక్కువ సమయం ఉండటమే లాభాన్నిస్తుందని.ఇన్వెస్టర్లు ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు పరిస్థితులేమీ అంత స్థిరంగా లేవు. క్రమశిక్షణతోనే దీనికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. అందుకని చేయాల్సిందేంటంటే... → సిప్లను ఆపేయకుండా నిరంతరం కొనసాగించండి. → పోర్టుఫోలియో విలువను చూడకుండా... అసెట్ అలొకేషన్ను సమీక్షించుకోండి. → భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే భయం, ఆశ సంపద సృష్టికి శత్రువులుగా మారతాయి. → లక్ష్యాలకు తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్లు కొనసాగించండి. షార్ట్టర్మ్ ట్రెండ్ను బట్టి కాకుండా దీర్ఘకాల పనితీరు ఆధారంగా ఫండ్లను ఎంచుకోండి. → మీకు క్రమశిక్షణ లేదని మీరు భావిస్తే లైఫ్సైకిల్ ఫండ్స్ను ఎంచుకోండి. వాటిలో ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ఉంటుంది... భావోద్వేగాల పరమైన తప్పులు జరగవు. -
ఐసీఎఫ్, ఎల్హెచ్బీ కోచ్లు: ఏది సేఫ్? ఏది బెస్ట్?
రైళ్ల గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ వీటి పరిణామ క్రమం గురించి తెలిసినవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కథనంలో భారతీయ రైల్వేలోని కోచ్ల గురించి తెలుసుకుందాం.ఐసీఎఫ్ కోచ్లుభారతీయ రైల్వేలోని ఐసీఎఫ్ (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) కోచ్లు పాత సాంకేతికతను ఉపయోగిస్తాయి. వీటిని 1952 నుంచి చెన్నైలోని ఒక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇవి నీలం రంగులో ఉంటాయి, స్టీల్తో నిర్మితమై ఉంటాయి. ఈ కారణంగా.. వీటి బరువు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు అధికం, ప్రయాణికుల సామర్థ్యం తక్కువ. ప్రమాదం జరిగినప్పుడు ఈ కోచ్లు ఒకదానిపై ఒకటి టెలిస్కోప్లాగా ఎక్కేస్తాయి. దీనివల్ల ఊహకందని నష్టం జరుగుతుంది.ఐసీఎఫ్ కోచ్లలో.. స్లీపర్ క్లాస్లో 72 బెర్త్లు, థర్డ్ ఏసీ క్లాస్లో 64 బెర్త్లు మాత్రమే ఉంటాయి. ఇవి LHB కోచ్ల కంటే 1.7 మీటర్లు పొట్టిగా ఉంటాయి. వీటిలో ప్రయాణీకుల సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. అంతే కాకుండా.. ఇవి చాలా బరువుగా ఉండటం వల్ల.. రైలు వేగం కూడా తక్కువగా ఉంటుంది.ఐసీఎఫ్ కోచ్లకు ప్రతి 18 నెలలకు ఒకసారి పూర్తిస్థాయి మరమ్మత్తు అవసరం. కాబట్టి వీటికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం, ఐసీఎఫ్ రేక్లతో కూడిన 740 రైళ్లు నడుస్తున్నాయి, వీటన్నింటినీ 2029 నాటికి పూర్తిగా మార్చాలని రైల్వే యోచిస్తోంది.ఎల్హెచ్బీ కోచ్లుఇక ఎల్హెచ్బీ (లింకే హాఫ్మన్ బుష్) కోచ్లు లేటెస్ట్ జర్మన్ సాంకేతికత ఆధారంగా నిర్మితమయ్యాయి. వీటిని 2000వ సంవత్సరంలో భారతదేశంలో ప్రవేశపెట్టారు. పంజాబ్లోని కపుర్తలాలో తయారు చేస్తారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. రాజధాని ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో వినియోగిస్తారు.ఎల్హెచ్బీ కోచ్లు స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మితమై ఉండటం వల్ల.. ఇవి చాలా తేలికగా ఉంటాయి. ఇలాంటి రైళ్లలో.. స్లీపర్ క్లాస్లో 80 బెర్త్లను, థర్డ్ ఏసీ క్లాస్లో 72 బెర్త్లు ఉంటాయి. ఇవి ICF కోచ్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లగలవు. గంటకు 200 కిలోమీటర్ల వరకు వేగాన్ని అందుకోగలవు.ఎల్హెచ్బీ కోచ్ల నిర్వహణ కూడా తక్కువే. వీటికి 24 నెలలకు ఒకసారి మరమత్తులు చేస్తారు. ప్రమాదం జరిగినప్పుడు, LHB కోచ్లు ఒకదానిపై ఒకటి కుప్పకూలిపోవు. ప్రయాణికులకు భద్రతను అందిస్తుంది. కాబట్టి అన్ని విధాలా ఈ కోచ్లు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా? -
గూగుల్ క్లౌడ్తో కోవాసెంట్ జట్టు
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా గూగుల్ క్లౌడ్తో చేతులు కలిపింది. జెమిని ఎంటర్ప్రైజ్ వినియోగాన్ని వేగవంతం చేసే దిశగా ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది. వచ్చే ఏడాది వ్యవధిలో నియంత్రిత పరిశ్రమల్లో ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్ ద్వారా ఏఐ ఆధారిత పరివర్తనను తెచ్చేందుకు ఇరు సంస్థలు కలిసి పని చేయనున్నాయి.తమ ఏజెంట్ మేనేజ్మెంట్ సూట్ని జెమిని ఎంటర్ప్రైజ్, గూగుల్ క్లౌడ్ ఏఐ మౌలిక సదుపాయాలతో మేళవించడం ద్వారా సంస్థలు ప్రయోగ స్థాయి నుంచి ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు తోడ్పడనున్నట్లు కోవాసెంట్ టెక్నాలజీస్ సీఈవో శ్రీకాంత్ చక్కిలం తెలిపారు. -
అంబానీ ఇంటికి పాప్ స్టార్ రిహన్నా..
ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ రిహన్నా భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చారు. తన బృందంతో కలిసి అంబానీ కుటుంబాన్ని వారి నివాసంలో కలిశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన మధ్యాహ్న విందులో ఆమె పాల్గొన్నారు.ఇషా అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చంట్, అనంత్ అంబానీ దంపతులు స్వయంగా రిహన్నాకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రిహన్నాకు భారతీయ నృత్య రీతులు, సంప్రదాయ కళలు, మన సంస్కృతికి సంబంధించిన విశేషాలను అంబానీ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విందులో రిహానా భారతీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించడమే కాకుండా, ఇక్కడి సంప్రదాయాల పట్ల తన ఆసక్తిని కనబరిచారు.రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో రిహానా తన సొంత బ్యూటీ బ్రాండ్ 'ఫెంటీ బ్యూటీ'(Fenty Beauty) ప్రమోషన్ కోసమే ఆమె భారత్కు వచ్చారు. ఈ ఉత్పత్తులు ప్రస్తుతం భారతదేశంలో కేవలం తీరా (Tira) సెఫోరా (Sephora) స్టోర్లలో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉండనున్నాయి. View this post on Instagram A post shared by Bollywood Bubble Television (@bollywoodbubbletelly) -
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్కు తగ్గని లాభాలు
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 319 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది క్రితం క్యూ4లో నమోదైన రూ. 304 కోట్లతో పోలిస్తే సుమారు 5 శాతం అధికం. సమీక్షాకాలంలో బ్యాంకు వడ్డీ ఆదాయం రూ. 9,413 కోట్ల నుంచి 12 శాతం వృద్ధి చెంది రూ. 10,553 కోట్లకు చేరింది.నికర వడ్డీ ఆదాయం (చెల్లించినది పోగా) రూ. 4,907 కోట్ల నుంచి రూ. 5,677 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 2 బేసిస్ పాయింట్లు క్షీణించి 5.95 శాతం నుంచి 5.93 శాతానికి నెమ్మదించింది. వ్యాపారం 19 శాతం వృద్ధితో రూ. 5.75 లక్షల కోట్లకు ఎగిసింది. మొత్తం అసెట్స్లో మొండి పద్దులకు ప్రొవిజనింగ్ క్యూ1లో నమోదైన 1.92 శాతం నుంచి క్యూ4లో 1.52 శాతానికి తగ్గింది.మైక్రో ఫైనాన్స్ విభాగం మినహా అసెట్ క్వాలిటీ స్థిరంగా ఉందని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్ తెలిపారు. పరిశ్రమవ్యాప్తంగా సూక్ష్మ రుణాల విభాగంలో సవాళ్లు ఎదురైనట్లు వివరించారు. ప్రస్తుతం స్థూల మొండిబాకీలు, నికర మొండిబాకీలు వరుసగా 1.61 శాతం, 0.48 శాతానికి దిగి వచ్చినట్లు చెప్పారు.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో గత ఫిబ్రవరిలో బయటపడిన రూ.590 కోట్ల ఫ్రాడ్ ఉదంతం మార్చి త్రైమాసిక ఫలితాలపై (Q4FY26) ఎటువంటి ప్రభావం చూపలేదని బ్యాంకు ఎండీ వి. వైద్యనాథన్ తెలిపారు. ఇతర బ్యాంకులలో ఇలాంటి సంక్షోభాలు సద్దుమణగాలంటే దాదాపు సంవత్సరం పడుతుందని, కానీ ఇక్కడ అలా జరగలేదని పేర్కొన్నారు. -
ఆర్బీఎల్ బ్యాంక్ లాభం మూడు రెట్లు జంప్
ముంబై: అస్తుల నాణ్యత మెరుగుదల, ప్రొవిజన్లకు పరిమిత కేటాయింపులు కారణంగా ఆర్బీఎల్ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం(2025–26) మార్చి త్రైమాసికంలో రూ.230 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఏడాది(2024–25) ఇదే త్రైమాసికంలో నమోదు చేసిన రూ.69 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా పెరిగింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 7% పెరిగి రూ.1,563 కోట్ల నుంచి రూ.1,671 కోట్లకు ఎగసింది.అయితే నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.89% నుంచి 4.41%కు తగ్గింది. త్రైమాసిక ప్రాతిపదికన కూడా 4.63% నుంచి క్షీణించింది. త్రైమాసికంలో ప్రొవిజన్లు 14% తగ్గి రూ.678 కోట్లకు పరిమితమవడంతో నిర్వహణ లాభం 11% పెరిగి రూ.955 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) నిష్పత్తి 2025 మార్చి చివరినాటి 2.60% నుంచి, 2026 మార్చి చివరికి జీఎన్పీఏ నిష్పత్తి 1.18 శాతానికి దిగివచ్చింది.ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా ఎండీ, సీఈవో ఆర్ సుబ్రమణ్యకుమార్ మాట్లాడుతూ, ఆస్తుల నాణ్యత పరంగా బ్యాంకు లోన్బుక్లో నిరంతర మెరుగుదల కొనసాగుతోంది అన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై 2027)లో కూడా వృద్ధి నిలకడగా ఉంటుందన్నారు.ఎమిరేట్స్ ఎన్బీడీ నుంచి వచ్చే మూలధన పెట్టుబడి మార్జిన్ల పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. ఇక విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఖర్చుల నియంత్రణపై కూడా బ్యాంకు దృష్టి సారించిందన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు, విస్తరణ ఖర్చులు మినహా ఇతర వ్యయాలు తగ్గే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
రైలు మిస్ అయితే.. సేమ్ టిక్కెట్టుతో ఇంకో రైలు ఎక్కొచ్చా?
ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఒక్కోసారి ట్రాఫిక్ జాంలు లేదా ఇతర అనివార్య కారణాల వల్ల రైలు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల్లో ఒకటే ఆందోళన.. "నేను కొన్న టిక్కెట్టు ఏమవుతుంది..? దీనితో మరో రైలులో ప్రయాణించవచ్చా?" అని ఆందోళన కలుగుతుంది. అయితే, దీనిపై ఇండియన్ రైల్వేస్కు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..ఒకవేళ మీరు తీసుకున్నది జనరల్ టిక్కెట్టు అయితే, రైలు మిస్ అయినా అదే టిక్కెట్టుతో నెక్స్ట్ అందుబాటులో ఉన్న రైలులో ప్రయాణించే వీలుంటుంది. కానీ, ఇక్కడ ఒక షరతు ఉంది. సాధారణంగా జనరల్ టిక్కెట్లు కొనుగోలు చేసిన సమయం నుంచి 3 గంటలు లేదా ఆ మార్గంలో వెళ్లే మొదటి రైలు వచ్చే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆ సమయం దాటితే ఆ టిక్కెట్టు చెల్లదు.ఒకవేళ రిజర్వేషన్ టిక్కెట్టు ఉంటే కుదరదు..ఒకవేళ మీరు స్లీపర్, ఏసీ లేదా ఏదైనా కేటగిరీలో ముందస్తుగా బెర్త్ రిజర్వ్ చేసుకుని, ఆ రైలును మిస్ అయితే మాత్రం అదే టిక్కెట్టుతో మరో రైలు ఎక్కడానికి వీల్లేదు. మరో టిక్కెట్టు తప్పనిసర..తదుపరి రైలులో వెళ్లాలంటే మీరు కొత్తగా టిక్కెట్టు తీసుకోవాల్సిందే. రీఫండ్ అవ్వదు..రైలు మిస్ అయిన సందర్భంలో రిజర్వేషన్ టిక్కెట్టుపై రీఫండ్ పొందే హక్కు ప్రయాణీకుడికి ఉండదు.కేటగిరీ మారినా.. మీ దగ్గర ఉన్నది ఆర్డినరీ రైలు టిక్కెట్టు అయి ఉండి, మీరు మెయిల్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ లేదా రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించాలనుకుంటే ఆ టిక్కెట్టు చెల్లదు. ఆయా రైళ్ల కేటగిరీని బట్టి మీరు అదనపు రుసుము చెల్లించి కొత్త టిక్కెట్టు తీసుకోవాలి.టీటీఈ చెకింగ్లో దొరికితే జరిమానా!..చెల్లని టిక్కెట్టుతో లేదా పాత రిజర్వేషన్ టిక్కెట్టుతో మరో రైలులో ప్రయాణిస్తూ టీటీఈ కి దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.ఒకవేళ జరిమానా చెల్లించడానికి నిరాకరిస్తే, రైల్వే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడా పడవచ్చని రైల్వే నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.కాబట్టి, రైలు ప్రయాణానికి కనీసం గంట ముందే స్టేషన్కు చేరుకోవడం ఉత్తమం. ఒకవేళ పొరపాటున రైలు మిస్ అయితే, రిస్క్ తీసుకోకుండా నిబంధనల ప్రకారం కొత్త టిక్కెట్టు తీసుకోవడమే బెటర్.. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. -
వీధి చివరి పానీపూరీ వాలా కనిపించట్లేదని..
మనం రోజూ ఆగే పానీపూరీ బండి ఒక వారం రోజులు కనిపించకపోతే ఏమనుకుంటాం? బహుశా ఆ పానీపూరీ వాలా ఊరెళ్లాడనో లేక తనకు ఆరోగ్య సమస్యనో అనుకుని మరో బండి వద్దకు వెళ్తాం. కానీ ఒక కస్టమర్ మాత్రం తాను రెగ్యులర్గా వెళ్లే పానీపూరీ బండి వ్యక్తి ఎందుకు రావట్లేదో ఆరా తీశాడు. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో కింద చూద్దాం.ఎక్స్ (ట్విట్టర్) యూజర్ అంకిత్ పాండే నిత్యం ఒకే బండి దగ్గర పానీపూరీ తినేవాడు. వరుసగా పది రోజుల పాటు ఆ బండి కనిపించకపోవడంతో అంకిత్ అనుమానం వచ్చి పాత గూగుల్పే లావాదేవీల ద్వారా సదరు బండి నిర్వాహకుడి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేశాడు. అవతలి నుంచి వచ్చిన సమాధానం అంకిత్ను కలిచివేసింది.తన భార్య తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆ వైద్య ఖర్చుల కోసం తన జీవనోపాధి అయిన పానీపూరీ బండిని అమ్మేసుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చేయడానికి పని లేదు. ‘సార్, నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి’ అని అతను అడిగిన ఆ ఒక్క మాట అంకిత్ ఆలోచనను మార్చేసింది.సహాయం కాదు.. భాగస్వామ్యం!కేవలం కొంత ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకోవడం కంటే అతనికి మళ్లీ ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని అంకిత్ నిర్ణయించుకున్నాడు. రోడ్డు పక్కన బండి పెట్టే స్థాయి నుంచి అతడిని ఒక గౌరవప్రదమైన షాపు యజమానిని చేసేలా మాస్టర్ ప్లాన్ వేశాడు.కొత్త బిజినెస్ మోడల్ ఇలాఅంకిత్ పాండే రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ప్రధాన కూడలిలో నెలకు రూ.15,000 అద్దెతో ఒక షాపు లీజుకు తీసుకున్నాడు. పానీపూరీ బండి వ్యక్తితో నెలకు రూ.20,000 వేతన ఒప్పందం చేసుకున్నాడు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షాపు ఓపెన్ ఉండేలా ప్లాన్ చేశాడు.నమ్మకమే పెట్టుబడిగా..‘ఈ షాపు ద్వారా రోజుకు కనీసం రూ.5 వేల రూపాయల వ్యాపారం జరుగుతుంది. అంటే నెలకు రూ.1.5 లక్షల ఆదాయం. ఖర్చులన్నీ పోను మీరు రూ.60 నుంచి 70 వేల వరకు లాభం పొందవచ్చు’ అని ఆ బండి వ్యక్తి గణాంకాలతో సహా వివరించడం అంకిత్ను ఆశ్చర్యపరిచింది. ‘అన్నీ కోల్పోయిన వ్యక్తిలో ఇంకా ఎదగాలనే తపన కనిపిస్తోంది. ఇది సానుభూతితో చేస్తున్న సాయం కాదు, ఒక వ్యక్తి మనస్తత్వానికి నేను పెడుతున్న పెట్టుబడి’ అని అంకిత్ పేర్కొన్నారు.My panipuri wala disappeared 10 days ago. No cart, no sign. I used to go there almost daily, so it felt strange.Today I found his number from old GPay payments and called him.He said he sold his entire cart because his wife was admitted to the hospital.Everything gone. No…— Ankit Pandey (@iamankitpande) April 23, 2026నెటిజన్ల రియాక్షన్ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఒకరిలో ఉన్న ఎదుగుదలను గుర్తించి భాగస్వామిగా చేర్చుకోవడం గొప్ప విషయం’ అని ఒక యూజర్ కొనియాడారు. ‘వ్యాపారం పుంజుకున్నాక సదరు వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా అనేది గమనించాలి. డబ్బు మనుషులను మారుస్తుంది’ అని మరొకరు హెచ్చరించారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనివ్వడం గొప్ప విషయమే, కానీ ఆ వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించి అతడిని తిరిగి ఒక వ్యాపారస్థుడిగా మార్చడం నిజమైన సామాజిక బాధ్యత అని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..
నేటి ఆధునిక సమాజంలో సక్సెస్ అంటే ఏంటి? ఆరంకెల జీతం, ఏటా పెరిగే బోనస్లు, సమాజంలో హోదా పెంచే కార్పొరేట్ పదవులు.. ఇదే కదా అందరి లెక్క! కానీ, వీటన్నింటినీ కాదని ఆత్మసంతృప్తి కోసం ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ భార్య రుచి వారికూ కార్పొరేట్ కంపెనీలో వార్షికంగా రూ.20 లక్షల ప్యాకేజీని వదులుకొని నెలకు కేవలం రూ.20 వేలు వచ్చే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కలల కొలువు నుంచి బ్రేక్వైరల్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. రుచి వారికూ కెరీర్ ప్రారంభం నుంచి ఒక మూస పద్ధతిలో ఆలోచించలేదు. 19 ఏళ్ల వయస్సులోనే ఆమెకు భవిష్యత్తుపై స్పష్టమైన, భిన్నమైన ఆలోచనలు ఉండేవని అంకుర్ గుర్తు చేసుకున్నారు. కాలేజీ పూర్తి కాగానే ఒక మ్యాగజైన్లో చేరిన ఆమె ఆ తర్వాత తన కలల సంస్థ అయిన డిస్కవరీ ఛానెల్లో ఉద్యోగం సంపాదించారు. 2005 నుంచి 2010 వరకు అక్కడే పనిచేస్తూ ఏటా రూ.20 లక్షల ఆదాయంతో అత్యున్నత స్థాయిలో నిలిచారు.జీవితం మలుపు తిరిగింది ఇలా..తమకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రుచి తన ప్రాధాన్యతలను మార్చుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే తన కుమారుడి పెంపకం కోసం ఉద్యోగానికి విరామం ప్రకటించారు. నాలుగు ఏళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆమె మళ్లీ కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు అందరిలా తిరిగి కార్పొరేట్ రంగానికి వెళ్లలేదు. ‘నా భార్య సంవత్సరానికి రూ.20 లక్షల సంపాదన నుంచి నెలకు రూ.20 వేల సంపాదనకు మారింది. 2014లో ఆమె సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపింది. నెలకు కేవలం రూ.20 వేలు మాత్రమే అందుతున్నా ఆమె పొందిన సంతృప్తి వెలకట్టలేనిది’ అని అంకూర్ లింక్డ్ఇన్ పోస్ట్లో అన్నారు.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లులింక్డ్ఇన్లో షేర్ చేసిన ఈ పోస్ట్పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘విజయం కేవలం ఆదాయం గురించి కాదు, ఆ దశలో మీకు ఏది ముఖ్యమో దానితో కలిసి ప్రయాణించడం’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘కెరీర్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి మారుతుంటుంది’ అని మరొకరు పేర్కొన్నారు. డబ్బు కంటే మానసిక ప్రశాంతత, కుటుంబం, వ్యక్తిగత ఆసక్తి ముఖ్యమని నిరూపించిన రుచి వారికూ కథ, కెరీర్ రేసులో పరుగెడుతున్న నేటి యువతకు గొప్ప పాఠం.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
కండోమ్ ధరల పెంపు! ఎంతంటే..
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కండోమ్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మలేషియాకు చెందిన ‘కారెక్స్’ సంస్థ కీలక ప్రకటన చేసింది. ముడి పదార్థాల కొరత, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలను 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది.ధరల పెంపునకు కారణాలుప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 500 కోట్ల (5 బిలియన్ల) కండోమ్లను ఉత్పత్తి చేసే కారెక్స్, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ‘ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం వల్ల చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కండోమ్ తయారీలో వాడే నైట్రైల్, సింథటిక్ రబ్బర్, సిలికాన్ ఆయిల్, ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం షీట్ వంటి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ సరుకు రవాణా రేట్లు పెరగడంతో పాటు సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది’ అని చెప్పింది.‘కొన్ని రకాల ముడి పదార్థాల ధరలు ఏకంగా 100 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధరల సవరణ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని కారెక్స్ సీఈఓ గోహ్ మియా కియాట్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం..ప్రపంచ కండోమ్ అవసరాల్లో దాదాపు 20 శాతం వాటాను కారెక్స్ ఒక్కటే భర్తీ చేస్తోంది. ఆసియా, యూరప్ దేశాల నుంచి సేకరించే 100కు పైగా రసాయనాలపై ఈ పరిశ్రమ ఆధారపడి ఉంటుంది. ఒక్క కెమికల్ లేదా ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోయినా మొత్తం ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని గోహ్ హెచ్చరించారు. మలేషియా, థాయ్లాండ్లోని కంపెనీ ప్లాంట్లలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగ కోతలు తప్పవని యాజమాన్యం సంకేతాలిస్తోంది.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
తాన్లా లాభం రూ. 134 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తాన్లా ప్లాట్ఫామ్స్ లాభం రూ. 134 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 117 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14.5 శాతం అధికం. అటు ఆదాయం రూ. 1,024 కోట్ల నుంచి సుమారు 15 శాతం వృద్ధితో రూ. 1,178 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 509 కోట్లగా, ఆదాయం రూ. 4,418 కోట్లుగా నమోదైంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి ఏప్రిల్ 30 రికార్డు తేదీగా ఉంటుంది. విశ్వసనీయమైన ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్ల ద్వారా సవాళ్లను పరిష్కరిస్తూ, కస్టమర్ల వ్యాపార వృద్ధికి తోడ్పడుతున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఉదయ్ రెడ్డి తెలిపారు. -
రిలయన్స్ లాభం డీలా
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 16,971 కోట్లకు పరిమితమైంది. టెలికం, రిటైల్ యూనిట్లు పుంజుకున్నప్పటికీ ప్రపంచ ఇంధన సంక్షోభం కారణంగా చమురు, కెమికల్స్(ఓ2సీ) విభాగాలు నీరసించడం ప్రభావం చూపింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 19,407 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 2.69 లక్షల కోట్ల నుంచి రూ. 3.03 లక్షల కోట్లకు బలపడింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం ఎగసి రూ. 95,610 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 13 శాతం పుంజుకుని రూ. 2.07 లక్షల కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 11.75 లక్షల కోట్లకు చేరింది. వెరసి కంపెనీ చరిత్రలోనే అత్యధిక నికర లాభం, ఇబిటా, ఆదాయం అందుకుంది. క్యూ4లో విభాగాలవారీగా రిలయన్స్ రిటైల్ లాభం రూ. 3,563 కోట్లుకాగా.. క్యూ4లో 333 కొత్త స్టోర్లను తెరిచింది. అయితే ఓ2సీ బిజినెస్ ఇబిటా 4 శాతం క్షీణించి రూ. 14,520 కోట్లకు పరిమితమైంది. కాగా, వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.జియో ప్లాట్ఫామ్స్ గుడ్ క్యూ4లో లాభం రూ. 7,935 కోట్లు ఆర్ఐఎల్ టెలికం, డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫామ్స్ క్యూ4లో పటిష్ట పనితీరు చూపింది. జనవరి–మార్చిలో నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 7,935 కోట్లను తాకింది. వినియోగదారుల సంఖ్య, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) తదితర అంశాలు ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2024–25) ఇదే కాలంలో రూ. 7,022 కోట్లు ఆర్జించింది. ఇబిటా 18 శాతం జంప్చేసి రూ. 20,060 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 38,259 కోట్లయ్యింది. ఏఆర్పీయూ 3.8 శాతం మెరుగై రూ. 214కు చేరింది. కస్టమర్ల సంఖ్య 7 శాతం పెరిగి 52.44 కోట్లయ్యింది. కాగా, 2025–26 పూర్తి ఏడాదికి జియో ప్లాట్ఫామ్స్ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 30,053 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 15 శాతం పెరిగి రూ. 1,46,885 కోట్లుగా నమోదైంది.లిస్టింగ్ బాటలో...జియో ప్లాట్ఫామ్స్ లిస్టింగ్వైపు స్థిరంగా ముందడుగు వేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాం. ఇది కంపెనీ ప్రయాణంలో మైలురాయిగా నిలవనుంది. సరికొత్త ఎత్తులకు చేరడంతోపాటు.. దేశీ డిజిటల్ భవిష్యత్కు మద్దతిస్తుంది. మరోపక్క రాజకీయ, భౌగోళిక సవాళ్లు, ఇంధన ధరల ఆటుపోట్లు, ప్రపంచ వాణిజ్య పరిస్థితుల మధ్య ఆర్ఐఎల్ వృద్ధి పథంలో సాగుతోంది. ఇందుకు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, దేశీయంగా పటిష్ట బిజినెస్ తోడ్పాటునిస్తున్నాయి. – ముకేశ్ అంబానీ, చైర్మన్, ఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ షేరు బీఎస్ఈలో 1.15 శాతం నష్టంతో రూ.1,328 వద్ద ముగిసింది. -
బిల్గేట్స్ను వెనక్కి నెట్టిన అదానీ
అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా స్టాక్ మార్కెట్లో అస్థిరత ఉన్నప్పటికీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద మాత్రం గణనీయంగా పెరిగింది. గురువారం ఆయన నికర సంపద పెరగడంతో.. 100 బిలియన్ డాలర్ల క్లబ్లో తిరిగి ప్రవేశించడమే కాకుండా, ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ను కూడా అధిగమించారు.బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద ఒక్క రోజులోనే 7.16 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ పెరుగుదలతో, ఆయన మొత్తం సంపద 106 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 17వ స్థానానికి ఎగబాకారు. అంటే 2026లో, గౌతమ్ అదానీ నికర సంపద 21.4 బిలియన్ డాలర్లు పెరిగింది.నికర సంపద పెరగడంతో అదానీ బిల్గేట్స్ (104 బిలియన్ డాలర్స్)ను అధిగమించారు. కాగా.. 90.2 బిలియన్ డాలర్ల నికర సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 20వ స్థానంలో ఉన్నారు. -
పేటీఎం పేమెంట్ బ్యాంక్పై ఆర్బీఐ కీలక నిర్ణయం
ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి (ఏప్రిల్ 24) అమల్లోకి వస్తుందని తెలిపింది.పేటీఎం పేమెంట్ బ్యాంక్లో డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో వ్యాపారం జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. తమకు జారీ చేసిన పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులోని నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని సంస్థ వెల్లడించింది.ఆర్బీఐ ఇవాళ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్ 22(4) కింద రద్దు చేసింది.ఆంక్షలు విధించడంతో ఈ రోజు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇక చెల్లదు. ఇకపై బ్యాంకింగ్ వ్యాపారం (సెక్షన్ 5(b)) లేదా అదనపు వ్యాపారాలు (సెక్షన్ 6) నిర్వహించడానికి వీలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు, తదుపరి చర్యలు ప్రకటించనుంది. -
ఏఐ యుగంలో భారత్: నాస్కామ్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు!
ఐటీ సంస్థల ఆదాయ వృద్ధి మెరుగుపడేలా చూడటం, అలాగే కంపెనీల్లో కృత్రిమ మేథ, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యతనివ్వనున్నట్లు నాస్కామ్ కొత్త చైర్మన్గా నియమితులైన శ్రీకాంత్ వెలమకన్ని తెలిపారు. ఏఐ యుగంలో భారత్ మరింత మెరుగ్గా, దూకుడుగా పోటీపడేలా చూసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.టెక్నాలజీపై కంపెనీలు ప్రస్తుత స్థాయికి మించి వెచ్చించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. టెక్నాలజీ పురోగతి వల్ల మనుషుల కన్నా మెషిన్లు మెరుగ్గా పనులు పూర్తి చేయగలిగినా, మనుషులు పోషించాల్సిన పాత్ర ప్రాధాన్యత తగ్గిపోదని తెలిపారు.ఏఐ ఆధిపత్యం కనిపిస్తున్న తరుణంలో కూడా గత ఏడాది నికరంగా ఉద్యోగుల సంఖ్య పెరగడం సానుకూలాంశమని ఆయన పేర్కొన్నారు. ఏఐ పురోగతితో చిన్నా, పెద్ద కంపెనీలు తమ వ్యాపారాలను సరికొత్తగా తీర్చిదిద్దుకునేందుకు అసాధారణ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని శ్రీకాంత్ వివరించారు. -
పెరిగిన యూనియన్ బ్యాంక్ లాభం.. రూ.5 డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 5,504 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడానికితోడు ఆస్తుల(రుణాలు) నాణ్యత మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్ నికర లాభం సైతం 7 శాతం పుంజుకుని రూ. 5,316 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు బ్యాంక్ వెల్లడించింది. ట్రెజరీ వీక్ తాజా క్యూ4లో యూనియన్ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 1 శాతం క్షీణించి రూ. 9,406 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 2.87 శాతం నుంచి 2.64 శాతానికి నీరసించడం ప్రభావం చూపింది. ట్రెజరీ ఆదాయం మందగించడంతో 3 శాతం తక్కువగా రూ. 5,412 కోట్ల వడ్డీయేతర ఆదాయం అందుకుంది. ఈ కాలంలో రుణ నాణ్యత మెరుగుపడటంతో స్లిప్పేజీలు, రుణ వ్యయాలు తగ్గినట్లు బ్యాంక్ వెల్లడించింది.దీంతో ప్రొవిజన్లు 3 శాతం తగ్గి రూ. 2,640 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో ఇవి రూ. 2,715 కోట్లుగా నమోదయ్యాయి. అంతేకాకుండా స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 3.6 శాతం నుంచి 2.82 శాతానికి దిగివచ్చాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,483 కోట్ల నుంచి రూ. 2,023 కోట్లకు వెనకడుగు వేశాయి. ప్రధానంగా ఎంఎస్ఎంఈల నుంచి రూ. 895 కోట్లు నమోదయ్యాయి. -
ఉద్యోగి కోసం బాస్ చేసిన పని.. నెటిజన్లు ఫిదా!
ఒక కంపెనీలో బాస్ అంటే.. కేవలం ఉద్యోగులతో పనిచేయించుకోవడం మాత్రమే కాదు, వారి కష్టాలను కూడా గుర్తించాలి. అవసరమైన సహాయం చేయాలి. ఇలాంటి కోవకు చెందిన వ్యక్తులలో ఒకరు ప్రదీప్ కన్నన్. ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన చేసిన సహాయం ఏమిటి అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.తమిళనాడుకు చెందిన స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రదీప్ కన్నన్.. తన కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి, కొన్ని రోజులుగా ఆఫీసులో చాలా నీరసంగా ఉండటం, పనిపై ఏకాగ్రత చూపించకపోవడం వంటివి గమనించారు. అతను ఆలా ఉండటానికి కారణం ఏమిటని ఆరాతీస్తే.. భారీ ఎండల కారణంగా రాత్రివేళల్లో సరిగ్గా నిద్రపోవడం లేదని తెలిసింది. అయితే.. ఇది ఉద్యోగి వ్యక్తిగత సమస్య అని వదిలేయకుండా, ప్రదీప్ అతనికి ఒక ఎయిర్ కూలర్ కొని ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.Our employee was struggling to sleep in this heat.Next day, we bought him an air cooler.Not posting this to brag.Posting this because many founders miss the real math:The cost of an air cooler is small.The cost of a:- tired mind- low energy, - bad work, and- feeling… pic.twitter.com/o6TQnuB9co— Pradeep Kannan (@Pradeepkannanj) April 21, 2026ఎయిర్ కూలర్ విలువ, కంపెనీ విలువతో పోలిస్తే చాలా తక్కువ. అయితే ఉద్యోగి సమస్యకు స్పందించిన బాస్ అని పలువురు నెటిజన్లు 'ప్రదీప్ కన్నన్'ను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.నిజానికి చాలా కంపెనీలలో ఉద్యోగులు జాబ్ వదిలేయడానికి కారణం, జీతం సరిపోకపోవడం కాదు. సంస్థలో వారికి విలువ ఇవ్వకపోవడం లేదా పట్టించుకోకపోవడం అని ప్రదీప్ పేర్కొన్నారు. మీ టీమ్ కేవలం పనిచేసే ఉద్యోగులు కాదు. వారు మీతో కలిసి వ్యాపారాన్ని నిర్మించే భాగస్వాములు అని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: అంబానీ ఇంట్లో చెఫ్ జీతం ఎంతో తెలుసా? -
నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు!
‘1980వ దశకంలో దేశం విడిచి వెళ్లేటప్పుడు నా మనసులో ఒకటే ప్రశ్న.. మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం? కానీ నేడు అదే భారత్ ప్రపంచానికి టాలెంట్ హబ్గా మారింది. ఒకప్పుడు సంస్థను స్థాపించడం గగనమైతే, నేడు అది అత్యంత సులభతరమైంది’ ఇవి ప్రముఖ ఐటీ దిగ్గజం, జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వ్యక్తం చేసిన భావాలు. సోషల్ మీడియా వేదికగా ఆయన పంచుకున్న తన జీవిత అనుభవాలు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.నిరాశ నిండిన కాలం అది..శ్రీధర్ వెంబు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, 1989లో తాను ఐఐటీ మద్రాస్ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పటి పరిస్థితులను వివరించారు. ఆ సమయంలో పంజాబ్, కశ్మీర్, అస్సాం వంటి రాష్ట్రాలు అశాంతితో రగులుతుండేవన్నారు. ‘అప్పట్లో ఐఐటీయన్లు దేశం దాటి వెళ్లడమే ఏకైక మార్గంగా భావించేవారు. నేను దేశాన్ని వదిలి వెళ్తున్నప్పుడు చాలా బాధపడ్డాను. కానీ ఇక్కడ నిరాశ తప్ప వేరే మార్గం కనిపించలేదు’ అని ఆయన ఆనాటి సామాజిక, రాజకీయ స్థితిగతులను గుర్తుచేశారు.వృథా అవుతున్న ప్రతిభఇంజినీరింగ్ చదువుతున్నప్పటికీ వెంబు దృష్టి అంతా ఆర్థికశాస్త్రం, తత్వశాస్త్రంపైనే ఉండేది. ‘మనం ఎందుకు పేదవాళ్లం?’ అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆయన దశాబ్దాల పాటు అన్వేషించారు. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘భారతదేశం పేద దేశంగా ఉండటానికి కారణం మనం మన ప్రతిభను భారీ స్థాయిలో వృథా చేయడమే’ అని విశ్లేషించారు. జోహో సంస్థను ఏ గొప్ప నేపథ్యం లేని సామాన్య భారతీయులతోనే నిర్మించామని, అటువంటి ప్రతిభ భారత్లో ప్రతిచోటా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ టాలెంట్ను సరైన దిశలో ఉపయోగిస్తే దేశం అద్భుతమైన సంపదను సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సంస్కరణల పర్వం1989 నాటికే తాను సోషలిస్టు విధానాలకు వ్యతిరేకిగా మారానని వెంబు తెలిపారు. 1991 సంక్షోభం సమయంలో విదేశీ మారక నిల్వలు అడుగంటి, ఐఎంఎఫ్ వద్ద బంగారం కుదువ పెట్టాల్సిన దుస్థితి నుంచి మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వరకు ఆయన ప్రస్తావించారు. సోవియట్ యూనియన్ పతనం, చైనాలో అశాంతి వంటి అంశాలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని చెప్పారు.In the 1980s, most IITians would go abroad. In 1989, when I graduated from IIT Madras, I remember feeling extremely dejected about our country. Punjab, Kashmir and Assam were all burning. My heart was not in engineering. I was mostly reading books in Economics and Philosophy -…— Sridhar Vembu (@svembu) April 22, 2026నేటి భారతం అవకాశాల గనిప్రస్తుత పరిస్థితులపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సంస్థను ప్రారంభించడం చాలా సులభమని, తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రపంచ స్థాయి కంపెనీలను నిర్మించవచ్చని ఆయన ఉదహరించారు. ‘మనం ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో కూడిన జీవన ప్రమాణాలు ఉన్న చోట నుంచి కూడా కంపెనీలను మొదలు పెట్టవచ్చు. మీ దగ్గర ప్రతిభ ఉంటే భారతదేశంలో ఏదైనా సాధించవచ్చు’ అని చెప్పారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ‘బైఅవుట్’!
ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 51 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలతో టెక్ పరిశ్రమ రూపురేఖలు మారుతున్న తరుణంలో అమెరికాలోని తన సిబ్బంది కోసం మైక్రోసాఫ్ట్ ‘వాలంటరీ బైఅవుట్’ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకుంటూనే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని పునర్వ్యవస్థీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేసింది.ఏమిటీ బైఅవుట్?సాధారణంగా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కొన్ని విభాగాలను మూసివేస్తున్నప్పుడు లేఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు) ప్రకటిస్తాయి. కానీ, బైఅవుట్ అనేది దీనికి భిన్నమైనది. కంపెనీ బలవంతంగా ఉద్యోగం తీసివేయడం కాకుండా, ఉద్యోగులే స్వచ్ఛందంగా తప్పుకునేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధపడే వారికి ఒకేసారి భారీ నగదు, పొడిగించిన బీమా సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలను ఆఫర్ చేస్తారు. లేఆఫ్స్ వల్ల వచ్చే వ్యతిరేకతను నివారించడానికి ఉద్యోగులకు గౌరవప్రదమైన రీతిలో వీడ్కోలు పలికేందుకు కంపెనీలు ఈ మార్గాన్ని ఎంచుకుంటాయి.మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఎవరికి? అర్హతలు ఏమిటి?కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ వన్ టైమ్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో దాదాపు 7% మందికి వర్తించనుంది. సీనియర్ డైరెక్టర్ స్థాయి, అంతకంటే తక్కువ కేడర్లోని ఉద్యోగులు దీనికి అర్హులు. ఇన్సెంటివ్ ఆధారిత సేల్స్ విభాగాల్లో ఉన్నవారికి ఈ అవకాశం లేదు. ‘అర్హులైన ఉద్యోగులు తమ భవిష్యత్తు నిర్ణయాలను సొంతంగా, కంపెనీ అందించే ఆఫర్ను తమ ఇష్టపూర్వకంగా పొందేలా ఈ కార్యక్రమం రూపొందించారు’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ పేర్కొన్నారు.అసలు సమస్య ఏమిటి?టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ఏర్పాటుపై భారీ పెట్టుబడులు అవసరమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ తన వనరులను పాత తరం సాఫ్ట్వేర్ సేవల నుంచి ఏఐ వైపు మళ్లించాల్సి ఉంది. ఈ క్రమంలో వేగంగా పెరుగుతున్న ఏఐ పెట్టుబడుల భారాన్ని తగ్గించుకోవడానికి శ్రామిక శక్తిని సర్దుబాటు చేస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ వల్ల ప్రభావితమయ్యే పాత్రల నుంచి సిబ్బందిని తగ్గించి, కొత్త టెక్నాలజీకి అనుగుణంగా టీమ్స్ను పునర్నిర్మిస్తున్నారు. పనితీరు సమీక్షలను సరళీకృతం చేస్తూనే నైపుణ్యం గలవారిని నిలుపుకోవడానికి స్టాక్ ఆధారిత రివార్డులను ఇస్తున్నారు.జూన్ 2025 నాటికి మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,28,000 మంది ఉద్యోగులను కలిగి ఉండగా అందులో 1,25,000 మంది అమెరికాలోనే ఉన్నారు. ఇప్పటికే కొన్ని దఫాలుగా తొలగింపులు చేసిన ఈ కంపెనీ ఇప్పుడు బైఅవుట్ ద్వారా మానవీయ కోణంలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఖర్చుల తగ్గింపుతోపాటు ఏఐ భవిష్యత్తు కోసం ఒక కంపెనీ తనను తాను సిద్ధం చేసుకుంటున్న తీరుకు ఇది నిదర్శనం.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
ఏఐ డేంజర్.. బ్యాంకులకు ఆర్థిక మంత్రి కీలక సూచన
కృత్రిమ మేథ (ఏఐ) సరికొత్త నమూనాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రభుత్వరంగ బ్యాంక్ల ముఖ్య అధికారులతో భేటీ అయ్యారు. ఫైనాన్షియల్ సిస్టమ్లలో లోపాలను ఆంథ్రోపిక్ మైథోస్ ఏఐ మోడల్ సులభంగా గుర్తించగలదన్న ఆందోళనల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్లలో లోపాలను గుర్తించినట్టు ఆంథ్రోపిక్ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ఏఐ రూపంలో ఆర్థిక వ్యవస్థకు వచ్చే రిస్క్లను ఎదుర్కొనే చర్యలు, సైబర్ భద్రతపై ఈ సమావేశంలో లోతుగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ సిస్టమ్లను మరింత పటిష్టంగా మార్చుకునే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సీతారామన్ సూచించినట్టు చెప్పాయి.ఆర్బీఐ, కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, బ్యాంక్ల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉల్లంఘనల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఎదురయ్యే రిస్క్లపై ఆర్థిక శాఖ, ఆర్బీఐ అధ్యయనం చేస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్లు, వెబ్ బ్రౌజర్లలో 27 ఏళ్ల నాటి లోపాలతో సహా వేలాది బగ్స్ను గుర్తించి, వాటిని వినియోగించుకునే విషయంలో మనుషుల కంటే మెరుగ్గా ‘మైథోస్’ ఏఐ మోడల్ రాణించగలదని ఆంథ్రోపిక్ పేర్కొనడం గమనార్హం. దీంతో యూఎస్ ఫెడ్ సహా పలు కేంద్ర బ్యాంక్లు ఏఐ ముప్పులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై సమాలోచనలు చేస్తుండడం తెలిసిందే. -
రిలయన్స్తో జతకట్టిన ‘టైమ్’
ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీల వ్యక్తులను గుర్తించడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘టైమ్’, భారతీయ యువశక్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు సిద్ధమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో తన ప్రతిష్టాత్మక ‘టైమ్ 100 నెక్స్ట్’ ఫ్రాంచైజీని తొలిసారిగా భారత్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ పేరుతో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. న్యూయార్క్లో గురువారం జరిగిన వార్షిక ‘టైమ్ 100 గాలా' వేదికగా టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఈమేరకు ప్రకటన చేశారు.ఏమిటీ టైమ్ 100 నెక్స్ట్ ఇండియా?భారతదేశ భవిష్యత్తును దిశానిర్దేశం చేయగల 100 మంది అసాధారణ యువ నాయకులను ఈ జాబితా ద్వారా టైమ్ ఎడిటర్లు ప్రపంచానికి పరిచయం చేస్తారు. కళలు, సైన్స్, వ్యాపారం, క్రీడలు.. వంటి విభిన్న రంగాల్లో రాణిస్తున్న వారిని ఎంపిక చేస్తారు. కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను కూడా ఈ జాబితాలో పరిగణనలోకి తీసుకుంటారు. ఈ జాబితాను ఆన్లైన్లో విడుదల చేయడంతో పాటు డిసెంబర్ 2026లో ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో అట్టహాసంగా నిర్వహించే గాలా ఈవెంట్లో వీరిని సత్కరిస్తారు.భారతీయ ప్రతిభకు ప్రపంచ గుర్తింపుఈ భాగస్వామ్యంపై రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది భారతీయ యువతకు లభించే గొప్ప గౌరవమని పేర్కొన్నారు. ‘తర్వాతి తరం ప్రతిభను, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా నవ భారతాన్ని నిర్మించేందుకు రిలయన్స్ కట్టుబడి ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ అంశాలను భారత్కు తీసుకురావడం, భారత్లోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పడమే మా లక్ష్యం. ఈ క్రమంలో టైమ్తో కలిసి ముంబైలో ఈ వేడుకను నిర్వహించాలనుకోవడం గర్వంగా ఉంది’ అన్నారు. టైమ్ సీఈఓ జెస్సికా సిబ్లీ మాట్లాడుతూ, భారతీయ పరిశ్రమల్లో వస్తున్న మార్పులను, ప్రపంచ పురోగతిని నడిపిస్తున్న నాయకులను గుర్తించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
మస్క్ కంపెనీలో జాబ్ కావాలా?
నేటి యువతకు ఎలాన్ మస్క్ ఒక ఐకాన్. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది టెక్ నిపుణులకు మస్క్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం అనేది ఒక కల. అయితే, అక్కడ సీటు దక్కించుకోవడం సులభమా? మస్క్ తన కంపెనీలో పని చేసే అభ్యర్థుల్లో ఏం ఆశిస్తారు? జీతభత్యాలు ఏ స్థాయిలో ఉంటాయి? అనే అంశాలను కింద చూద్దాం.మస్క్ కంపెనీల వైవిధ్యంఎలాన్ మస్క్ కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు. ఆయన నాయకత్వంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అగ్రశ్రేణి సంస్థలు ఉన్నాయి.టెస్లా.. ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ.స్పేస్ ఎక్స్.. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాలు.ఎక్స్ గతంలో(ట్విట్టర్).. సోషల్ మీడియా దిగ్గజం.న్యూరాలింక్.. బ్రెయిన్-చిప్ టెక్నాలజీ.ఎక్స్ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు.టాలెంట్కే పెద్దపీట!మస్క్ నియామక ప్రక్రియలో ఒక విప్లవాత్మక మార్పు ఉంది. ‘మీకు పేరుమోసిన యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా పర్వాలేదు. కానీ పని పట్ల అంకితభావం, అసాధారణమైన నైపుణ్యం ఉండాలి’ అని ఆయన స్వయంగా పలుమార్లు ప్రకటించారు.ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉంది?టెక్నికల్ రోల్స్.. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.నాన్-టెక్నికల్ రోల్స్.. హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్), సేల్స్, ఆపరేషన్స్, ఫ్రంట్ డెస్క్ మేనేజ్మెంట్.దరఖాస్తు, ఎంపిక విధానంమస్క్ కంపెనీల్లో చేరాలనుకునే వారు థర్డ్ పార్టీ వెబ్సైట్ల కంటే అధికారిక పోర్టల్స్ ద్వారా వెళ్లడం ఉత్తమం. దరఖాస్తు కోసం Tesla Careers.. https://www.tesla.com/careers లేదా SpaceX Careers.. https://www.spacex.com/careers వంటి అధికారిక వెబ్సైట్లలో మీ ప్రొఫైల్ను అప్లోడ్ చేయాలి.స్క్రీనింగ్: రెజ్యూమెను షార్ట్లిస్ట్ చేసిన తర్వాత సాంకేతిక పరీక్షలు ఉంటాయి.ఇంటర్వ్యూలు: ఇక్కడ కేవలం ప్రశ్నలు మాత్రమే ఉండవు, ప్రాక్టికల్ టాస్క్లు కూడా ఇస్తారు. కొన్ని కీలక పోస్టుల కోసం మస్క్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని కొందరు మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తులు చెబుతున్నారు.జీతాలు ఎలా ఉంటాయి? (సుమారుగా)మస్క్ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రపంచ స్థాయి వేతనాలను అందిస్తాయి. అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ప్యాకేజీలు మారుతుంటాయి.కంపనీహోదావార్షిక వేతనం (అంచనా)టెస్లాసాఫ్ట్వేర్ ఇంజినీర్రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్లుస్పేస్ ఎక్స్ఇంజినీర్రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్లుఇంటర్న్షిప్ఫ్రెషర్లు (స్టైఫండ్)నెలకు సుమారు రూ.1 లక్ష గమనిక: పైన పేర్కొన్న వేతనాల్లో స్టాక్ ఆప్షన్స్ కూడా అంతర్భాగంగా ఉంటాయని గమనించాలి.ఫ్రెషర్లకు అవకాశంమీరు రీసెంట్గా డిగ్రీ పూర్తి చేశారా? అయితే ఇంటర్న్షిప్ ద్వారా మస్క్ సామ్రాజ్యంలో అడుగు పెట్టవచ్చు. టెస్లా, స్పేస్ ఎక్స్ ప్రతి సంవత్సరం వేలమంది విద్యార్థులకు ఇంటర్న్షిప్లను అందిస్తాయి. ఇక్కడ ప్రతిభ కనబరిస్తే నేరుగా పూర్తిస్థాయి ఉద్యోగిగా మారే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
ఇన్ఫోసిస్ లాభం జూమ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21% జంప్చేసి రూ. 8,501 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 7,033 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 13% బలపడి రూ. 46,402 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 40,925 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 25 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. గైడెన్స్ ఓకే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఆదాయంలో 1.5–3.5 శాతం మధ్య పురోగతిని సాధించగలమని ఇన్ఫోసిస్ తాజాగా అంచనా(గైడెన్స్) ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా ఫైనాన్షియల్ సర్వీసులు, యుటిలిటీస్, ఏఐ సర్వీసులు దోహదపడగలవని పేర్కొంది. కొత్త ఏడాది పటిష్టంగా ప్రారంభమైనట్లు కంపెనీ తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు కుదురుకుంటున్నాయని తెలియజేసింది. పూర్తి ఏడాదికి గుడ్: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇన్ఫోసిస్ నికర లాభం 10 శాతం ఎగసి రూ. 29,440 కోట్లను తాకింది. 2024–25లో రూ. 26,713 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం వృద్ధితో రూ. 1,78,650 కోట్లకు చేరింది. ఇతర విశేషాలు...→ క్యూ4లో 3.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ పొందింది. పూర్తి ఏడాదికి 14.9 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు(టీసీవీ) కుదుర్చుకుంది. వీటిలో 55 శాతం కొత్త డీల్స్. → క్యూ4లో 8,440 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,28,594కు పరిమితమైంది. అయితే 2024–25 క్యూ4 సంఖ్య(3,23,578)తో పోలిస్తే 5,016 మంది పెరిగారు. → గతేడాది మొత్తం 20,000 మంది ఫ్రెషర్స్ను నియమించుకున్నట్లు కంపెనీ సీఎఫ్వో జయేష్ ఎస్. తెలియజేశారు. → ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 20,000 మంది ఫ్రెషర్స్కు ఉపాధి కల్పించనున్నట్లు జయేష్ వెల్లడించారు. → ఏఐ సంప్రదాయ ఐటీ సర్వీసులు, బీపీవో మోడల్స్కు చెక్ పెడుతున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. అయితే ఏఐ ద్వారా ఇతర సర్వీసులు పుంజుకుంటున్నట్లు పరేఖ్ పేర్కొన్నారు. → ప్రస్తుత సీఈవో పరేఖ్ ఐదేళ్ల పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 2% క్షీణించి రూ. 1,242 వద్ద ముగిసింది. కాగా.. యూఎస్ మార్కెట్లో ఇన్ఫీ ఏడీఆర్ 4.5% పతనమై 12.87 డాలర్లను తాకింది.పటిష్ట వృద్ధి ఫైనాన్షియల్, కమ్యూనికేషన్స్, తయారీ విభాగ సర్వీసులతోపాటు.. ప్రాంతాలవారీగా చూస్తే యూరప్లో పటిష్ట వృద్ధి సాధించాం. 2026–27లో ఏఐ సర్వీసులలో భారీ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఫైనాన్షియల్, ఎనర్జీ, యుటిలిటీ, రీసోర్సెస్ విభాగాలలో వృద్ధికి వీలుంది. – సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్ -
'పని ఇష్టం లేనప్పుడే.. వర్క్ లైఫ్ బ్యాలెన్స్'
గత కొన్నేళ్లుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బూప హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సీఈవో 'ఇనాకీ ఎరెనో' తన అభిప్రాయాన్ని వెల్లడించారు.ఇనాకీ ఎరెనో ప్రకారం.. జెన్ జీ తరానికి చెందిన యువత ఎక్కువగా పని ఒత్తిడిని తగ్గించుకుని, వ్యక్తిగత జీవితం, మానసిక ఆరోగ్యం, కుటుంబ సమయం వంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే కొంతమంది పెద్ద వ్యాపార నాయకులు ఈ ఆలోచనతో ఏకీభవించడం లేదు.ఒక ఉద్యోగి తరచుగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి అని ఆలోచిస్తే.. అది ఆ ఉద్యోగం తనకు సరిపడటం లేదని అర్థం. ఒక వ్యక్తి తన పనిని నిజంగా ఇష్టపడితే, పని - జీవితం మధ్య కఠినమైన సరిహద్దులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదని ఎరెనో పేర్కొన్నారు.ఎరెనో తన అనుభవాన్ని కూడా ఉదాహరణగా చెప్పారు. ఆయన ఒక పెద్ద కంపెనీని నిర్వహిస్తున్నప్పటికీ.. వీకెండ్స్లో నా కుమారుడితో కలిసి జిమ్కు వెళ్తున్నప్పుడు కూడా వ్యాపార ఆలోచనలు చేయడం, ఈమెయిల్స్ చూడడం వంటివి తనకు ఒత్తిడిగా అనిపించదని చెప్పారు. తన పనిని ఆనందంగా చేసుకుంటే, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన భారంగా చూడాల్సిన అవసరం ఉండదని ఆయన అభిప్రాయం. తమకు నచ్చిన పని ఎంచుకుంటేనే పని–జీవిత సమతుల్యత అనే సమస్యే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక స్కేల్ ఏఐ కో-ఫౌండర్ లూసీ గువో (Lucy Guo) కూడా ఇదే తరహా అభిప్రాయం చెప్పారు. పని–జీవిత సమతుల్యత అవసరం అనిపిస్తే, ఆ ఉద్యోగం సరైనది కాకపోవచ్చు అని అన్నారు. తాను తన పనిని ఎంతో ఇష్టపడతానని, అందుకే అలాంటి సమస్య ఎదురుకాదని చెప్పారు. -
అదరగొట్టిన ఇన్ఫీ : 20 వేల కొత్త ఉద్యోగాలు
సాక్షి, ముంబై : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో తన ఉద్యోగుల సంఖ్య 8,440 మేర తగ్గినట్లు తెలిపింది. వరుసగా ఆరు త్రైమాసికాల పాటు కంపెనీలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉన్న తర్వాత ఈ భారీ తగ్గుదల చోటుచేసుకుంది.అయితే ఈ ఏడాది మరో 20వేల మంది ఫ్రెషర్స్ను నియమించుకోనున్నట్టు వెల్లడించింది.ఇన్ఫోసిస్ ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘరాజ్కా మాట్లాడుతూ, వరుసగా తమ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఇది 5,000 మంది పెరిగిందన్నారు. త్రైమాసికంలో ఎప్పుడూ కొంత కాలానుగుణత ఉంటుంది. ఈ త్రైమాసికంలో వాల్యూమ్లు తక్కువగా ఉన్నాయి, దానికి తోడు సిస్టమ్లోకి వచ్చిన కొత్తవారిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.జనవరి-మార్చి కాలం ముగిసే నాటికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,28,594గా ఉంది, గత పన్నెండు నెలల ప్రాతిపదికన చూస్తే, ఈ త్రైమాసికంలో ఉద్యోగుల వలస రేటు (అట్రిషన్) మునుపటి త్రైమాసికంలోని 12.3 శాతం నుండి 12.6 శాతానికి పెరిగిందని తెలిపారు.భారతదేశపు రెండవ అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు ఇప్పటికే 18,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంది. కాగా, గత త్రైమాసికంలో (Q3FY26) దాని నికర ఉద్యోగుల సంఖ్య 5,000 మందికి పైగా పెరిగింది. అలాగే 2026 చివరి నాటికి, 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని ఇది అంచనా వేస్తోంది.WEF దావోస్ సదస్సు సందర్భంగా ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, జనవరి 2026లో FY27లో తమ కంపెనీ 20 వేల మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకుంటుందని మీడియాకు తెలిపారు. ఇదీ చదవండి: ఆ పగతోనే ఢిల్లీలో దారుణ హత్యాచారం, షాకింగ్ విషయాలుఅంచనాలను ఇన్ఫోసిస్ ఫలితాలు28 శాతం లాభాలతో ఇన్ఫోసిస్ మార్కెట్ అంచనాలను అధిగమించింది. క్యూ4లో ఇన్ఫోసిస్ నికర లాభం 27.8 శాతం పెరిగి రూ. 8,501 కోట్లకు చేరిం. ఆదాయం త్రైమాసికం ప్రాతిపదికన (QoQ) 2 శాతం పెరిగి రూ. 46,402 కోట్లకు చేరింది 2026-27ఆర్థిక సంవత్సరాకి గాను తన ఆదాయ వృద్ధి అంచనా (guidance) 1.5 శాతం నుండి 3.5 శాతం పరిధిలో ఉంటుందని తెలిపింది. కాగా 2026కి ఈ అంచనా 3 నుండి 3.5 శాతంగా ఉంది.ఇదీ చదవండి: ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా! -
అంబానీ ఇంట్లో చెఫ్.. రోజుకు 4000 రోటీలు!
ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతదేశంలో అత్యంత సంపన్నుడు అయిన ముఖేష్ అంబానీ.. కుటుంబంతో కలిసి అత్యంత ఖరీదైన యాంటిలియాలో నివాసం ఉంటున్నారు. రాజప్రాసాదంలా ఉండే ఈ భవనం లోపల జరిగే ప్రతి పని ఒక పెద్ద సంస్థలో జరిగేలా క్రమబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడి కిచెన్ పని విధానం చూస్తే.. అదొక 7-స్టార్ హోటల్ స్థాయి నిర్వహణలా ఉంటుంది.యాంటిలియాలో పనిచేసే సుమారు 600 మంది సిబ్బందికి ప్రతిరోజూ భోజనం అందించాలి. దీనికోసం రోజుకు సుమారు 4000 రోటీలు తయారు చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ పనిచేసే చెఫ్ బాధ్యత చాలా కీలకమైనది. ఎందుకంటే.. అతను కేవలం వంట చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఒక మేనేజర్, ఒక ప్లానర్ కూడా.అంబానీ ఇంట్లో పనిచేసే చెఫ్ జీతం ఏడాదికి సుమారు 24 లక్షల రూపాయలు (నెలకు రూ.2 లక్షలు) అని సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటేనే ఎక్కువ జీతం వస్తుందనే మాట ఒక అపోహ మాత్రమే అవుతుంది. ఒక రంగంలో ప్రతిభ, నైపుణ్యం ఉంటే.. ఎక్కడైనా మంచి జీతం లభిస్తుంది.యాంటిలియాలోని చెఫ్ పని ఎంతో ఒత్తిడితో కూడుకున్నదనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు ఒకే రుచి, ఒకే నాణ్యతతో ఆహారం తయారు చేయాల్సి ఉంటుంది. పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలి. సరుకులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలి. తన టీమ్ను సమర్థవంతంగా నడిపించాలి. ముఖ్యంగా.. సమయానికి అన్నీ సిద్ధం చేయాలి. ఇంత పెద్ద స్థాయిలో ఒక చిన్న పొరపాటు జరిగినా, అది వెంటనే కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. View this post on Instagram A post shared by StartupShivay (@startupshivay) -
ఐదేళ్లు.. ఐదు లక్షల కోట్లు
ముంబై, సాక్షి బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ ఇండస్ట్రీస్ వచ్చే ఐదేళ్లకు భారీ ప్రణాళికను ప్రకటించింది. 2031 నాటికి రూ. 5 లక్షల కోట్ల మేర దాదాపు రెండింతల మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మరో రెండు కంపెనీలను లిస్ట్ చేయడం, అన్ని వ్యాపారాల్లో డబుల్ డిజిట్ వృద్ధి సాధించడం ద్వారా ఈ టార్గెట్ చేరుకోవాలని భావిస్తోంది.సంవత్సరానికి 15 శాతానికి మించి అమ్మకాల వృద్ధి, 20 శాతం కంటే ఎక్కువ ఈపీఎస్ వృద్ధి, ప్రతి వ్యాపారంలో 18 శాతం కంటే ఎక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం గ్రూప్ కొత్త బ్రాండ్ గుర్తింపు, లోగో ఆవిష్కరణ సందర్భంగా త్వరలో కొత్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న పిరోజ్ షా గోద్రెజ్ ఈ విషయాలు తెలిపారు. లిస్ట్ చేయబోయే సంస్థల్లో గోద్రెజ్ క్యాపిటల్ ఉంటుందని చెప్పారు.సస్టైనబిలిటీ, ఉద్యోగుల ప్రాతినిధ్యం అంశాలపై కూడా సంస్థ దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు.2031 నాటికి మహిళలు, ఎల్జీబీక్యూటీ వర్గాలు, దివ్యాంగుల ప్రాతినిధ్యాన్ని 40 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వ్యాపార వృద్ధి వ్యూహంలో భాగంగా, లిస్టెడ్ సంస్థలు తమకు అవసరమయ్యే నిధులను తామే సమకూర్చుకుంటాయి. లిస్ట్ కాని వ్యాపారాల్లో వచ్చే ఐదేళ్లలో రూ. 5,000 నుంచి రూ. 7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని గోద్రెజ్ తెలిపారు. -
ఇంటింటా ఇండక్షన్ స్టవ్.. ప్రభుత్వం కీలక ఆలోచన!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలతో వంటగ్యాస్ సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో, దేశీయంగా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ల వినియోగాన్ని ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇండక్షన్ స్టవ్ల తయారీ పెంపుతో పాటు ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. ఓడల రవాణాకు ఆటంకం ఏర్పడి గ్యాస్ సరఫరా తగ్గడం తెలిసిందే. దీంతో ప్రజలు తాత్కాలికంగా ఇండక్షన్ స్టవ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. కీలక మార్పులు.. ఇండక్షన్ స్టవ్ల తయారీలో వినియోగించే కీలక విడిభాగాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ భావిస్తోంది. అలాగే, ప్రస్తుతం ఉన్న 18% జీఎస్టీని 5%కి తగ్గించాలని సిఫారసు చేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 21 మధ్య 467 సీఎన్జీ, బయో గ్యాస్ స్టేషన్ల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా, వెంటనే పరిష్కరించారు. ఇందులో 157 స్టేషన్లకు తుది లైసెన్సులు సైతం మంజూరయ్యాయి. ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా ఏప్రిల్ 2న కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. -
‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
భారతీయ ఐటీ రంగంలో ‘మూన్లైటింగ్’ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు చేయడం) అనేది ఎప్పుడూ ఒక చర్చనీయాంశమే. కంపెనీలు దీన్ని అనైతికం అని కొట్టిపారేస్తున్నా కొందరు టెక్కీలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా కాసులు సంపాదిస్తున్నారు. అయితే, ఈ సంపాదన వెనుక ఎంతటి మానసిక సంఘర్షణ, సామాజిక దూరం ఉందో వివరిస్తూ ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడ్డిట్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.‘ఏడాదికి రూ.70 లక్షలకు పైగా సంపాదన.. రూ.1.3 కోట్ల ఇల్లు.. కానీ నా సామాజిక జీవితం శూన్యం’ అంటూ సదరు టెక్కీ వెళ్లగక్కిన ఆవేదన ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.అప్పు చేయకుండా రూ.1.3 కోట్ల ఇల్లు!టైర్-3 సిటీలో 2022 బ్యాచ్ నాన్-ట్రెడిషనల్ ఇంజినీరింగ్ విభాగంలో చదివిన ఈ యువకుడు కేవలం నాలుగేళ్లలోనే కళ్లు చెదిరే స్థాయికి ఎదిగాడు. పైథాన్, బ్యాకెండ్ సిస్టమ్స్, ప్లాట్ఫాం ఇంజినీరింగ్లో నైపుణ్యం సాధించి ఒకేసారి రెండు రిమోట్ (వర్క్ ఫ్రం హోం) ఉద్యోగాలను సంపాదించాడు. అందులో ఒకటి భారతీయ స్టార్టప్దికాగా, మరొకటి అమెరికాకు చెందిన ఎంఎన్సీ. తన సంపాదన ఏడాదికి రూ.74.5 లక్షలు. ఏ విధమైన హోమ్ లోన్ లేకుండా రూ.1.3 కోట్లతో సొంత ఇల్లు కొనుగోలు చేశాడు.తీవ్ర పని ఒత్తిడి!తన జీవితం పైకి అంతా కలర్ ఫుల్గా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ టెక్కీ నరకం చూస్తున్నాడు. ఒక ఉద్యోగానికి రోజుకు నాలుగు గంటలు, రెండో ఉద్యోగానికి 10 గంటలకు పైగా సమయం వెచ్చించాల్సి వచ్చేది. ‘రెండు రిమోట్ ఉద్యోగాలే కాబట్టి మేనేజ్ చేయగలిగాను కానీ, నా సామాజిక జీవితం కనుమరుగైపోయింది. ఫ్యామిలీకి, స్నేహితులకు సమయం ఇవ్వలేకపోయాను. నేను కొనుక్కున్న జిమ్ సామాగ్రిని వాడే తీరిక కూడా లేదు’ అని అతను ఆందోళన వ్యక్తం చేశాడు. చివరికి ఆరోగ్యం దెబ్బతినడం, ఒంటరితనం వేధించడంతో ఒక ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. పని ఒత్తిడితోపాటు ఆదాయ పన్ను లెక్కలు కూడా తన నిర్ణయానికి కారణమయ్యాయి.నెటిజన్ల మిశ్రమ స్పందనఈ పోస్ట్పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతని కష్టాన్ని చూసి లెజెండ్ అని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ‘ఇంత డబ్బు ఉండి ఏం లాభం? యవ్వనాన్ని గదిలోనే గడిపేస్తే జీవితానికి అర్థం ఏముంది?’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతం భారతీయ టెక్ ప్రపంచంలో పెరుగుతున్న హస్టిల్ కల్చర్ (విశ్రాంతి లేకుండా పని చేయడం)కు నిదర్శనం. ఆస్తులు కూడబెట్టడం ముఖ్యం కాదని ఎవరూ అనరు, కానీ అది మానసిక ఆరోగ్యానికి సమాధి కట్టేలా ఉండకూడదు. డబ్బు కంటే లైఫ్ ముఖ్యమని గుర్తించిన ఈ టెక్కీ నిర్ణయం అతిగా కష్టపడే యువతకు ఒక హెచ్చరిక లాంటిదే!ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు -
టెక్కీ ఖర్చుల చిట్టా వైరల్!
దేశపు సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో జీవన వ్యయం చుక్కలు చూపిస్తోంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువగా ఉండే ఈ మహానగరంలో భారీ జీతాలు తీసుకుంటున్న యువ నిపుణులు సైతం పొదుపు చేయడం గగనమైపోతోంది. తాజాగా, ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థ జేపీ మోర్గాన్ చేజ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఆరుషి గార్గ్ అనే 23 ఏళ్ల యువతి తన నెలవారీ ఖర్చులను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.నెలవారీ బడ్జెట్ ఇలా..ఇన్స్టాగ్రామ్లో ఆరుషి పంచుకున్న లెక్కల ప్రకారం, ఆమె జీవనశైలికి నెలకు సుమారు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చవుతోంది. ఈ వ్యయంలో సింహభాగం ఇంటి అద్దెకే వెళ్తుండటం గమనార్హం. ఖర్చు వివరాలుఅంచనా మొత్తం (నెలవారీ.రూ ల్లో)ఇంటి అద్దె17,000కిరాణా సామాగ్రి5,000బయట భోజనం3,000 - 6,000షాపింగ్3,000 - 7,000మెడిసిన్స్, గిఫ్ట్స్2,000 - 6,000పని మనిషి2,000రవాణా1,000 - 2,000మొత్తం ఖర్చు30,000 - 35,000 ‘నేను మరీ ఎక్కువగా ఖర్చు చేస్తున్నానా?’ అంటూ ఆమె అడిగిన ప్రశ్న నెటిజన్లలో చర్చనీయాంశమైంది.నెటిజన్ల రియాక్షన్ఆరుషి పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె బడ్జెట్ చాలా పొదుపుగా ఉందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మెట్రో నగరాల్లోని ఆర్థిక ఒత్తిడిని ఏకరువు పెడుతున్నారు. ‘నేను రూ.50 వేలు సంపాదిస్తే.. అందులో రూ.48 వేలు ఖర్చులకే పోతున్నాయి. అసలు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో అర్థం కావడం లేదు’ అని ఒక యూజర్ చెప్పారు. ‘ఇది ఒక మెట్రో సిటీలో ఉండాల్సిన సాధారణ బడ్జెట్. బెంగళూరు వంటి నగరాల్లో ఇంతకంటే తక్కువ ఖర్చుతో జీవించడం కష్టం’ అని ఇంకొకరు చెప్పారు.ఆదాయం ఉన్నా ఆదా సున్నాఐటీ ఉద్యోగులతోపాటు అధిక జీతాలు తీసుకునే వారు కూడా ఆర్థికంగా ఎందుకు వెనుకబడుతున్నారో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ విశ్లేషించారు. లింక్డ్ఇన్లో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ‘నెలకు రూ.1.2 లక్షలు సంపాదిస్తున్నా రూపాయి కూడా పొదుపు చేయలేని వారిని నేను చూశాను. దీనికి కారణం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ (జీవనశైలి ద్రవ్యోల్బణం). ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా అనవసరమైన ఖర్చులు కూడా పెంచుకుంటూ పోవడమే పెద్ద సమస్య’ అని మీనాల్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు -
నీతా అంబానీ ‘జమ్దానీ’ మెరుపులు
అంతర్జాతీయ వేదికలపై భారతీయ సంస్కృతిని, కళా వారసత్వాన్ని చాటిచెప్పడంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా న్యూయార్క్లో జరిగిన ప్రతిష్టాత్మక ‘టైమ్ 100’ శిఖరాగ్ర సదస్సులో ఆమె ధరించిన చేనేత వస్త్రం ఇప్పుడు చర్చనీయాంశమైంది. భారతీయ హస్తకళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలిచిన ఆ ‘జమ్దానీ’ చీర వెనుక రెండేళ్ల కష్టం దాగి ఉండటం విశేషం.పశ్చిమ బెంగాల్లోని ఫులియాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత బీరేన్ కుమార్ బసక్ ఈ చీరను రూపొందించారు. దీని తయారీకి దాదాపు 24 నెలల సమయం పట్టింది. భారతదేశంలోని అత్యంత పురాతనమైన, క్లిష్టమైన ‘జమ్దానీ’ నేత పద్ధతిలో దీన్ని తయారు చేశారు. మీనకారీ జమ్దానీ టెక్నిక్ ఉపయోగించి రూపొందించిన ఈ వస్త్రంపై విభిన్న రకాల డిజైన్లు చేశారు.కళాత్మకత - సంస్కృతీ చిహ్నాలుఈ చీర పల్లూ (కొంగు) ఒక దృశ్య కావ్యంగా కనిపిస్తుంది. ఇందులో భారతీయ జీవనశైలిని ప్రతిబింబించే ఉత్సవ దృశ్యాలు, మానవ ఆకృతులు, జంతువులు, ప్రకృతి సౌందర్యాన్ని చాటే పచ్చని ఆకులు అల్లారు. చీర అంచు వెంబడి ఉన్న చేపల ముద్రలు భారతీయ సంప్రదాయం ప్రకారం శుభానికి, శ్రేయస్సుకు చిహ్నాలుగా నిలుస్తాయి. ఈ చీర రాజసానికి, హుందాతనానికి ప్రతీకగా నిలిచింది. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online)నీతా అంబానీ సందేశంఏప్రిల్ 22న జరిగిన ఈ సదస్సులో టైమ్ మ్యాగజైన్ సీఈఓ జెస్సికా సిబ్లీ నీతా అంబానీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా నీతా అంబానీ భారతీయ విలువల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుత ప్రపంచానికి హార్డ్ పవర్ కంటే, సున్నితమైన శక్తి(సాఫ్ట్ పవర్) ఎంతో అవసరం. భారతదేశం ఆ మృదువైన శక్తికి నిలువెత్తు ప్రతిరూపం’ అని ఆమె పేర్కొన్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం
టెక్నాలజీలో వేగంగా మార్పులొస్తున్నాయి. అందుకు అనుగుణంగా ప్రస్తుతం ఆఫీసుల్లో కొత్తగా చేరే ఉద్యోగుల తీరు విభిన్నంగా ఉంది. గతంలో బాస్ ఏదైనా చెబితే చాలా వరకు ఎదురు చెప్పకుండా దాన్ని పాటించేవారు. కానీ ఇప్పుడు యువత ముఖ్యంగా జెన్ జీ తీరు మారింది. ఇది పని పట్ల వారికున్న కొత్త ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది. వారిలోని మార్పును నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారో చూద్దాం.హోదాను చూసి కాదు..ఒకప్పుడు ఆఫీసులో ఎవరైనా పెద్ద పోస్టులో ఉంటే వారు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు సీన్ మారింది. కార్యాలయాల్లో ఇంటర్నల్ మీటింగ్స్ జరిగినప్పుడు ‘ఈ పని ఎందుకు చేయాలి?’ అని యువ ఉద్యోగులు అడుగుతున్నారు. కేవలం మేనేజర్ అని గౌరవం ఇవ్వడం కాకుండా తనకు విషయం తెలిసి స్పష్టంగా సమస్యను, పరిష్కారాన్ని వివరిస్తేనే నిజమైన గౌరవం దక్కుతోంది. అంటే, అధికారం అనేది ఇప్పుడు కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టి వస్తోంది.పనిలో క్లారిటీ ఉండాల్సిందే!‘నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీనివల్ల కంపెనీకి లేదా నాకు వచ్చే లాభం ఏంటి?’ అని జెన్జీ యువత ఆలోచిస్తున్నారు. పని గురించి సరిగ్గా వివరించకపోతే ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఇది తిరుగుబాటు కాదు, అర్థం లేని పని చేయలేక వస్తున్న విసుగు అని గమనించాలి. మనం చేసే పనికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉందని తెలిస్తేనే నేటి ఉద్యోగులు ఉత్సాహంగా పని చేస్తున్నారు.అప్పటికప్పుడు ప్రోత్సాహం కావాలి!పాత కాలంలో ఏ ఏడాదికో ఒకసారి ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పటి డిజిటల్ కాలంలో అంత ఓపిక ఎవరికీ లేదు. ‘నేను చేస్తున్న పని బాగుందా? లేదా?’ అని ఉద్యోగులు అప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. బాస్ ఏమీ చెప్పకుండా గమ్మున ఉంటే.. అది తమకు ఇష్టం లేదనో లేదా తనను పట్టించుకోవడం లేదనో ఉద్యోగి ఫీలవుతున్నారు. చిన్న మెచ్చుకోలు అయినా సరే అది పనిని రెట్టింపు వేగంతో చేయిస్తుంది.జీతం కోసం మాత్రమే కాదు!నేటి తరం పనిని కేవలం నెల నెలా వచ్చే జీతం కోసం చేయడం లేదు. వారు చేసే పనిలో ఒక తృప్తిని వెతుక్కుంటున్నారు. ‘నేను చేస్తున్న పని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నేను ఎదగడానికి ఇది పనికొస్తుందా?’ అనేదే వారి మెయిన్ పాయింట్. అందుకే ఇప్పుడు ఆఫీసుల్లో కంట్రోల్ చేయడం కంటే ఉద్యోగులతో కలిసి ప్రయాణించడం ముఖ్యం. బాస్లు ఆదేశాలు ఇచ్చే వారిగా కాకుండా దారి చూపే వారిగా మారినప్పుడే ఏ కంపెనీ అయినా సక్సెస్ అవుతుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
డీ2సీ బ్రాండ్లకు చిన్న నగరాల్లో ఆదరణ
న్యూఢిల్లీ: డైరెక్ట్ టు కన్జ్యూమర్ బ్రాండ్లు (డీ2సీ) మెట్రో నగరాలను దాటి, ద్వితీయ (టైర్–2), తృతీయ శ్రేణి (టైర్–3) నగరాల్లో కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. ప్రముఖ ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ యూనికామర్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డీ2సీ బ్రాండ్లకు వచి్చన కొత్త ఆర్డర్లలో 66 శాతం వాటా ఈ చిన్న పట్టణాల నుంచే ఉండడం విశేషం. ఆన్లైన్ షాపింగ్లో వస్తున్న మార్పులను ఇది ప్రతిఫలిస్తోంది. 2025–26లో డీ2సీ బ్రాండ్లకు నికరంగా పెరిగిన గ్రాస్ మర్చండైజ్ వ్యాల్యూ (జీఎంవీ/ స్థూల ఉత్పత్తుల విక్రయ విలువ)లో 60 శాతం చిన్న నగరాల నుంచే ఉంది. మెట్రో నగరాలకు వెలుపల డీ2సీ బ్రాండ్లకు పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. సంప్రదాయ బ్రాండ్ల మాదిరి డీలర్లు, హోల్సేలర్లు, రిటైల్ సంస్థల ప్రమేయం లేకుండా.. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, సొంత ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయించే ఉత్పత్తులను డీ2సీ బ్రాండ్లుగా చెబుతారు. చిన్న నగరాలే ఆశాకిరణం.. డీ2సీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన పనితీరు చూపించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో (2024–25) పోలి్చతే ఆర్డర్ల పరంగా 33 శాతం, విక్రయాల విలువలో 32 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం 10–12 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.1.11 లక్షల కోట్లు) ఉన్న భారత డీ2సీ మార్కెట్, 2030 నాటికి 60 బిలియన్ డాలర్లకు (రూ.5.58 లక్షల కోట్లు) చేరుకుంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా నాలుగు రెట్లు పెరగనుంది. డెలివరీ వ్యవస్థలో మెరుగుదల వల్ల ఆర్డర్లు వెనక్కి రావడం 39 శాతం నుంచి 21 శాతానికి తగ్గనున్నట్టు పేర్కొంది. టెక్నాలజీతో చేరువ.. ఆర్డర్ల నిర్వహణలో కృత్రిమ మేధ (ఏఐ), చాట్ ఆధారిత సేవల వాడకం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవం వల్ల బ్రాండ్ల పట్ల కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఆన్లైన్ వ్యాపారం ఇకపై కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాబోదని, మారుమూల ప్రాంతాలు వృద్ధి చోదకాలుగా నిలుస్తాయని విశ్లేషించింది. సుమారు 40 కోట్ల ఆర్డర్ల డేటాను విశ్లేషించి యూనికామర్స్ ఈ నివేదికను రూపొందించింది. -
భారత్లో 500 హోటల్స్ లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్లో 2030 నాటికి ప్రాపర్టీల సంఖ్యను 500కి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాడిసన్ హోటల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎలీ యూనిస్ తెలిపారు. దీనితో 60,000–80,000 వరకు ఉద్యోగావకాశాలు లభించగలవని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. స్థానికంగా రిక్రూట్ చేసుకోవడం కోసం ఉద్యోగార్థులకి శిక్షణ కలి్పంచేందుకు టూరిజం, హాస్పిటాలిటీ స్కిల్ కౌన్సిల్, స్థానిక వర్సిటీలు, ప్రభుత్వాలతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాడిసన్కి 200 పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. ప్రథమ నుంచి నాలుగో శ్రేణి నగరాలవ్యాప్తంగా కొత్త హోటల్స్ని ఏర్పాటు చేయనున్నట్లు యూనిస్ చెప్పారు. వీటిల్లో 15 శాతం ఫైవ్ స్టార్వి, 45–50 శాతం అప్స్కేల్, త్రీ–స్టార్, ఫోర్–స్టార్ హోటల్స్ ఉంటాయని వివరించారు. కొత్తగా చేపట్టే వాటిల్లో 55 శాతం ప్రాజెక్టులు ప్రథమ శ్రేణి, 25 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉంటాయని యూనిస్ వివరించారు. 10 శాతం రిసార్టుల్లో, ఇంకో 10 శాతం ఆధ్యాతి్మక కేంద్రాల్లో ఉంటాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ప్రస్తుతం భారత్లో వ్యాపారం యథావిధిగానే నడుస్తోందని యూనిస్ వివరించారు. దుబాయ్, సౌదీ అరేబియాలాంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. తమకు అంతర్జాతీయంగా టాప్ 3 కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. -
టిమ్ కుక్పై ట్రంప్ ప్రశంసల జల్లు
టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. యాపిల్ సంస్థను ప్రస్తుత స్థాయికి చేర్చడంలో టిమ్ పాత్ర అనిర్వచనీయమన్నారు. స్టీవ్ జాబ్స్ హయాంలో కూడా యాపిల్ ఈ స్థాయికి చేరుకునేది కాదని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ ఈ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.స్టీవ్ జాబ్స్ కంటే కుక్ మేటి!సాధారణంగా యాపిల్ అంటే స్టీవ్ జాబ్స్ పేరు గుర్తొస్తుంది. కానీ, ట్రంప్ తన విశ్లేషణలో టిమ్ కుక్కు అగ్రతాంబూలం ఇచ్చారు. ‘నేను ఎల్లప్పుడూ టిమ్ కుక్, స్టీవ్ జాబ్స్ ఇద్దరికీ పెద్ద అభిమానిని. అయితే, ఒకవేళ స్టీవ్ జాబ్స్ అకాల మరణం చెందకుండా టిమ్ కుక్ బదులుగా ఆయనే సంస్థను నడిపించి ఉంటే.. యాపిల్ కచ్చితంగా బాగా పనిచేసేది, కానీ టిమ్ హయాంలో ఉన్నంత ఉన్నత స్థితికి మాత్రం చేరుకునేది కాదు’ అని ట్రంప్ అన్నారు.సమస్యల పరిష్కర్తగా కుక్..తమ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తుచేసుకుంటూ టిమ్ కుక్ పనితీరును ట్రంప్ కొనియాడారు. తన మొదటి టర్మ్ ప్రారంభంలో టిమ్ చేసిన ఒక ఫోన్ కాల్ తమ స్నేహానికి పునాది వేసిందని ఆయన తెలిపారు. ‘సాధారణంగా కంపెనీలు కన్సల్టెంట్లకు మిలియన్ల డాలర్లు చెల్లిస్తాయి, కానీ పని పూర్తి కాదు. కానీ కుక్ నేరుగా నాకు కాల్ చేసి సమస్యను వివరించేవారు. ఆయన అడిగే విధానం, సమస్యలోని తీవ్రత నాకు నచ్చేవి. నేను వెంటనే వాటిని పరిష్కరించేవాడిని’ అని ట్రంప్ పేర్కొన్నారు. టిమ్ కేవలం తన పనే కాకుండా కంపెనీ ప్రయోజనాల కోసం ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో ట్రంప్ గుర్తుచేశారు. కుక్ ఒక నమ్మశక్యం కాని వ్యక్తి అని, ఆయన కెరీర్ సాటిలేనిదని ప్రశంసించారు.15 ఏళ్ల ప్రస్థానం..దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పాటు యాపిల్ సామ్రాజ్యాన్ని ఏలిన టిమ్ కుక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టనున్నారు.ఇంజినీర్ నుంచి గ్లోబల్ లీడర్ వరకు..టిమ్ కుక్ ప్రయాణం ఆబర్న్ విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్తో మొదలైంది. ఐబీఎంలో 12 ఏళ్లు, ఆపై కాంపాక్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. తర్వాత యాపిల్ చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్న సమయంలో కంపెనీ సరఫరా గొలుసును క్రమబద్ధీకరించి, లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తర్వాత స్టీవ్జాబ్స్ మరణానంతరం సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం యాపిల్ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక శక్తివంతమైన విభాగం. అటువంటి సంస్థను విజయవంతంగా నడిపిన కుక్, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
‘ఇండిగో స్ట్రెచ్’కు అంతర్జాతీయ అవార్డు
భారతీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ ఇండిగో అంతర్జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటుకుంది. జర్మనీలోని హ్యాంబర్గ్లో జరిగిన ‘వరల్డ్ ట్రావెల్ క్యాటరింగ్ అండ్ ఆన్బోర్డ్ సర్వీసెస్ ఎక్స్పో (డబ్ల్యూటీసీఈ) 2026’ వేదికగా ఇండిగో ప్రవేశపెట్టిన ప్రీమియం బిజినెస్ క్లాస్ సర్వీస్ ‘ఇండిగో స్ట్రెచ్’ పలు ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకుంది. వినియోగదారులకు అందించే అత్యుత్తమ సౌకర్యాలు, వినూత్న డిజైన్లు, ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచిన తీరుకు గాను ఈ గుర్తింపు లభించినట్లు కంపెనీ తెలిపింది.ప్రధాన విభాగాల్లో అగ్రస్థానం‘ట్రావెల్ప్లస్ ఎయిర్లైన్ ఎమెనిటీ అవార్డ్స్ 2026’లో ఇండిగో ప్రవేశపెట్టిన ‘బ్లాంకెట్ కలెక్టబుల్ - ఇండిగో స్ట్రెచ్ ఓవర్లే’కు స్వర్ణ పతకం లభించింది. ప్రాంతీయ కళలు, సాంప్రదాయక డిజైన్లతో రూపొందించిన ఈ ఓవర్లేలు కేవలం ప్రయాణ సమయంలోనే కాకుండా ప్రయాణికులు జ్ఞాపికలుగా ఇంటికి తీసుకెళ్లేలా డిజైన్ చేయడం విశేషం. దీనితో పాటు లభించే బుక్లెట్, రియూజబుల్ ఫ్యాబ్రిక్ బ్యాగ్ ఇండిగో వినూత్న శైలిని ప్రతిబింబిస్తాయి.ఆన్బోర్డ్ హాస్పిటాలిటీ అవార్డ్స్ 2026లో భాగంగా ‘బెస్ట్ ఆన్బోర్డ్ టెక్స్టైల్స్’ విభాగంలో ఇండిగో ‘హైలీ కమెండెడ్’ గౌరవాన్ని పొందింది. బిజినెస్ క్లాస్లో అందించే జాక్వర్డ్ ఓవర్లేలు, గ్లోబల్ మ్యాప్ డిజైన్తో కూడిన పిల్లో కవర్లు, ఐ-మాస్క్లు, యాంటీ-స్కిడ్ సాక్స్ల నాణ్యత, సౌకర్యానికి గాను ఈ పురస్కారం దక్కింది. పాక్స్ ఇంటర్నేషనల్ రీడర్షిప్ అవార్డ్లో భాగంగా సుమారు 15,500 మందికి పైగా ఏవియేషన్ నిపుణులు పాల్గొన్న ఓటింగ్లో ‘బెస్ట్ బిజినెస్ క్లాస్ బెడ్డింగ్/సాఫ్ట్ ప్రొడక్ట్ – సౌత్ ఆసియా’ విభాగంలో ఇండిగో విజేతగా నిలిచింది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
రిలయన్స్ కమ్యూనికేషన్స్పై సీబీఐ పంజా
ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్రగామిగా వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కు జారీ చేసిన బాండ్లు, రుణ పత్రాల (డిబెంచర్స్) వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం కంపెనీకి చెందిన వివిధ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.రికార్డుల స్వాధీనం - సోదాల వివరాలురిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన నవీ ముంబై ప్రధాన కార్యాలయంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా 2009 నుంచి 2016 మధ్య కాలంలో ఎల్ఐసీకి జారీ చేసిన బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్స్కు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నవీ ముంబై కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగే కీలక ప్రాంతాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎల్ఐసీ పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, అంతర్గత ఈమెయిల్స్, ఆర్థిక లావాదేవీల చిట్టాను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ దర్యాప్తు ప్రధానంగా 2009-2016 మధ్య జరిగిన లావాదేవీలపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ సమయంలో కంపెనీ నిధుల సేకరణ కోసం అనుసరించిన మార్గాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన ఆరోపణ.దర్యాప్తు వెనుక అసలు కారణం?ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ మొత్తంలో నిధులను సేకరించింది. అయితే ఈ డిబెంచర్లు, బాండ్ల జారీ సమయంలో కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపించిందా? లేదా నిధుల మళ్లింపు జరిగిందా? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా పబ్లిక్ మనీ ఉన్న ఎల్ఐసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కంపెనీ వైఫల్యం చెందడం, అంతకుముందు జరిగిన ఒప్పందాల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఈ సోదాలకు దారితీశాయి.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
సామ్ ఆల్ట్మాన్ ఇంటిపై దాడి
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ నివాసంపై జరిగిన దాడి అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి చేసిన ఉన్మాద చర్య మాత్రమే కాదని, ఏఐ పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థలు ప్రచారం చేస్తున్న భయానక కథనాల ఫలితమేనని ఆల్ట్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తన పోటీ కంపెనీ ఆంత్రోపిక్ తీరును ఆయన తప్పుబట్టారు.ఏం జరిగింది?శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్మాన్ నివాసమే లక్ష్యంగా ఈ నెల ప్రారంభంలో ఒక దుశ్చర్య జరిగింది. టెక్సాస్కు చెందిన డేనియల్ మోరెనో-గామా అనే వ్యక్తి మోలోటోవ్ కాక్టెయిల్ (పెట్రోల్ బాంబు)తో ఆల్ట్మాన్ ఇంటిపై దాడికి దిగాడు. అనంతరం ఓపెన్ఏఐ ప్రధాన కార్యాలయం సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో తేలిన కీలక అంశాలునిందితుడు ఆల్ట్మాన్కు హాని కలిగించే ఉద్దేశంతోనే టెక్సాస్ నుంచి కాలిఫోర్నియాకు వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించారు.నిందితుడి వద్ద ఏఐ విధానానికి వ్యతిరేకంగా ఉన్న పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలువురు ఏఐ పరిశ్రమ దిగ్గజాల పేర్లు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం నిందితుడు హత్యాయత్నంతో పాటు పలు తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.పరిశ్రమ విమర్శలే కారణంఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఘటనపై స్పందించిన సామ్ ఆల్ట్మాన్ ఇది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని పేర్కొన్నారు. ఏఐ వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందంటూ కొన్ని సంస్థలు చేస్తున్న అతివాద ప్రచారం సామాన్యులలో అనవసర భయాందోళనలు కలిగిస్తోందని ఆయన వాదించారు. ‘ఏఐ ప్రమాదాల గురించి ప్రత్యర్థి సంస్థలు, ముఖ్యంగా ఆంత్రోపిక్ వంటి ల్యాబ్స్ అనుసరిస్తున్న తీరు ఏమాత్రం సహేతుకం కాదు. ఇది ప్రజల్లో విద్వేషాన్ని పెంచుతోంది’ అని ఆల్ట్మాన్ విమర్శించారు.ఓపెన్ఏఐ vs ఆంత్రోపిక్ఓపెన్ఏఐ నుంచి విడిపోయి డారియో అమోడి నేతృత్వంలో స్థాపించబడిన ఆంత్రోపిక్ సంస్థకు, ఆల్ట్మాన్ సంస్థకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఓపెన్ఏఐ అనుసరిస్తున్న విధానాలను అమోడి గతంలో ‘సేఫ్టీ థియేటర్’ (ప్రదర్శన కోసం చేసే భద్రత) అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఆంత్రోపిక్ తన వ్యాపార ప్రయోజనాల కోసం భయాన్ని పెట్టుబడిగా పెడుతోందని ఆల్ట్మాన్ ఆరోపిస్తున్నారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
హెచ్డీఎఫ్సీ లైఫ్ సీఈవోగా ఇంకొన్నేళ్లు ఈమే..
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా విభా పడల్కర్ పదవీ కాలాన్ని మరో అయిదేళ్ల పాటు పొడిగించాలని నిర్ణయించింది. నామినేషన్, రిమ్యూనరేషన్ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం జరిగిన సమావేశంలో పడల్కర్ పునర్నియామకానికి బోర్డు సభ్యులు ఆమోదం తెలిపారు.2026 సెప్టెంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చేలా ఆమెను అయిదేళ్లపాటు కొనసాగించనున్నట్లు సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ఈ పునర్నియామకం అమలుకు రానున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో షేర్హోల్డర్ల ఆమోదంతో పాటు ఐఆర్డీఏఐ అనుమతి అవసరమని పేర్కొంది.హెచ్డీఎఫ్సీ లైఫ్లో పడ్కలర్ 2008లో చేరారు. సంస్థలో పలు కీలక నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ కంపెనీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. 2017లో హెచ్డీఎఫ్సీ లైఫ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్లోనూ కీలకంగా వ్యవహరించారు. తర్వాత 2018 సెప్టెంబర్ 12 నుంచి మూడేళ్ల కాలానికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లాభం హైజంప్
హైదరాబాద్: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2025–26)లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 90 శాతం జంప్చేసి రూ. 1,283 కోట్లకు చేరింది. మొత్తం డిపాజిట్లు 8 శాతం బలపడి రూ. 34,605 కోట్లను తాకాయి. స్థూల అడ్వాన్సులు(రుణాలు) 12 శాతంపైగా పెరిగి రూ. 46,548 కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు 3.99 శాతం నుంచి 4.33 శాతానికి మెరుగుపడ్డాయి.స్థూల మొండిబకాయిలు(జీఎన్పీఏలు) 2.1 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు నమోదుకాలేదు. రిటర్న్ ఆన్ అసెట్స్(ఆర్వోఏ) 2.13 శాతంకాగా.. ఆర్వోఈ 14.1 శాతంగా నమోదైంది. గతేడాది బ్యాంక్ అత్యుత్తమ పనితీరు చూపినట్లు సంస్థ చైర్మన్ కె.ప్రతాప రెడ్డి పేర్కొన్నారు. నికర లాభం దాదాపు రెట్టింపైనట్లు తెలియజేశారు. -
ఓఎన్జీసీ ‘జాక్-అప్ రిగ్’ టెండర్ రద్దు!
ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ సముద్ర గర్భంలో చమురు అన్వేషణ కోసం నిర్వహించిన జాక్-అప్ రిగ్(సముద్ర తీర ప్రాంతాల్లో చమురు బావులను తవ్వడానికి ఉపయోగించే తేలియాడే ప్లాట్ఫామ్) టెండర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బిడ్డింగ్ ప్రక్రియలో ధరల అసాధారణ పెరుగుదల, గుత్తాధిపత్య ధోరణులు కనిపిస్తున్నాయనే అనుమానాల నేపథ్యంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.ధరల పెరుగుదలపై అనుమానాలుఈ టెండర్ ప్రక్రియను నిశితంగా పరిశీలించినప్పుడు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని ఓఎన్జీసీ తెలిపింది. ‘కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే బిడ్డింగ్ ధరలు సుమారు 60% మేర పెరిగాయి. గతంలో రోజుకు 35,606 డాలర్లుగా ఉన్న రేటు తాజా బిడ్డింగ్లో ఏకంగా 56,195 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, అంచనాలతో పోల్చి చూస్తే ఈ స్థాయి పెరుగుదల ఏమాత్రం సహేతుకం కాదని, ఇది ఆరోగ్యకరమైన పోటీ మార్కెట్ పరిమితులను మించి ఉందని సంస్థ స్పష్టం చేసింది.కుట్ర కోణంపై ఆందోళనటెండర్లలో పాల్గొన్న సంస్థల మధ్య కుట్ర పద్ధతులు ఉండవచ్చనే ఓఎన్జీసీ ఆందోళన వ్యక్తం చేసింది. బిడ్ల నమూనాను విశ్లేషించగా సంస్థల మధ్య రహస్య ఒప్పందాలు ఉండవచ్చని, తద్వారా కృత్రిమంగా ధరలను పెంచే ప్రయత్నం జరిగిందని సంస్థ భావిస్తోంది. ‘ప్రజా సేకరణ నిబంధనలకు కట్టుబడి ఉండటం, ప్రభుత్వ నిధులను వివేకవంతంగా వినియోగించడం మా బాధ్యత. ఈ టెండర్ ప్రక్రియలో సమగ్రత లోపించిందని భావించినందుకే రద్దు నిర్ణయం తీసుకున్నాం’ అని ఓఎన్జీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది.పారదర్శకతకే ప్రాధాన్యతమీడియాలో వస్తున్న కథనాలపై స్పందించిన ఓఎన్జీసీ తమ నిర్ణయం పూర్తిగా సంస్థాగత ప్రయోజనాలు, పారదర్శకతపై ఆధారపడి ఉందని స్పష్టం చేసింది. ‘ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లు లేవు. ప్రభుత్వ సేకరణ సూత్రాలను కచ్చితంగా పాటిస్తూ అక్రమాలకు తావులేకుండా చూడటమే లక్ష్యం. పరిశ్రమలో గుత్తాధిపత్యాన్ని లేదా సిండికేట్గా ఏర్పడి ధరలను శాసించే ధోరణులను అడ్డుకుంటాం’ అని కంపెనీ తెలిపింది.భవిష్యత్తు కార్యాచరణపరిశ్రమ వర్గాలతో పారదర్శకమైన, నిర్మాణాత్మకమైన సంబంధాలను కొనసాగిస్తామని ఓఎన్జీసీ తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే బిడ్ల సేకరణ ప్రక్రియల్లో న్యాయమైన, పోటీతత్వంతో కూడిన భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తామని తద్వారా ప్రాజెక్టుల వ్యయం పెరగకుండా జాగ్రత్త పడతామని సీనియర్ అధికారులు వెల్లడించారు.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
యాపిల్ సీఈఓ.. టిమ్ కుక్ సంపద ఎంతో తెలుసా?
ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా నిలిచిన యాపిల్ కంపెనీ ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. 2026 సెప్టెంబర్లో ప్రస్తుత సీఈఓ 'టిమ్ కుక్' తన పదవి నుంచి వైదొలగి.. బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.టిమ్ కుక్ 1998లో యాపిల్లో చేరి.. కంపెనీ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఎదిగారు. స్టీవ్ జాబ్స్ ఆరోగ్య కారణాల వల్ల తప్పుకున్న తర్వాత, 2011లో ఆయన కంపెనీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి యాపిల్ సంస్థను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థలలో ఒకటిగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ విలువ సుమారు 4 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అలాగే ఐఫోన్ తయారీకి అవసరమైన ఉత్పత్తి కేంద్రాలను చైనాలో విస్తరించడం ద్వారా గ్లోబల్ సరఫరా వ్యవస్థను బలపరిచారు. ఫాక్స్కాన్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం యాపిల్ విజయానికి ప్రధాన కారణమైంది.టిమ్ కుక్ సంపద - ఆదాయంటిమ్ కుక్ సంపద సుమారు 2.9 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.27 వేలకోట్లు) ఉంటుందని అంచనా. కాగా ఈయన వద్ద యాపిల్ కంపెనీ షేర్లు 3 మిలియన్లకు పైగా ఉన్నాయి.ప్రారంభంలో సీఈఓగా టిమ్ కుక్ జీతం 9,00,000 డాలర్లుగా ఉండేది. తర్వాత ఇది 3 మిలియన్ డాలర్ల బేస్ సాలరీగా స్థిరపడింది. అయితే ఆయన మొత్తం ఆదాయం స్టాక్ అవార్డులు, బోనస్ల ద్వారా భారీగా పెరిగింది. 2022లో ఆయన మొత్తం ఆదాయం సుమారు 99.4 మిలియన్ డాలర్లకు చేరింది. 2023లో షేర్హోల్డర్ల అభిప్రాయాలను గౌరవిస్తూ తన వేతనాన్ని స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. కానీ కంపెనీ పనితీరు, స్టాక్ పెరుగుదల కారణంగా 2024లో మళ్లీ ఆయన ఆదాయం సుమారు 74.6 మిలియన్ డాలర్లకు పెరిగింది.ఆపిల్ వృద్ధిలో టిమ్ కుక్ పాత్రటిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ కంపెనీ ఆదాయం 108 బిలియన్ డాలర్ల నుంచి 416 బిలియన్ డాలర్లకు పెరిగింది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఆధిపత్యం సాధించింది. ఐఫోన్, మ్యాక్బుక్, ఐప్యాడ్ వంటి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందాయి. దీన్నిబట్టి చూస్తే కుక్ సారథ్యంలో కంపెనీ ఎంతగా ఎదిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: '2026లో సురక్షితమైన ఆస్తులు ఇవే': రాబర్ట్ కియోసాకి -
అందరిచూపు.. ఆసియా దేశాలవైపు!
భారతీయ ప్రయాణికులు ఈ వేసవిలో ఎక్కువగా ఆసియా దేశాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నట్లు ఎయిర్బీఎన్బీ వెల్లడించింది. ఇప్పటి యువత, ముఖ్యంగా Gen Z తరం, కొరియన్ డ్రామాలు, జపనీస్ సంస్కృతి, ఆసియన్ స్ట్రీట్ ఫుడ్ వంటి వాటికి ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ఆసియా టూరిజం మీద ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.ఎయిర్బీఎన్బీ గణాంకాల ప్రకారం.. ఈ వేసవిలో 40 శాతం కంటే ఎక్కువ జెన్ జీ వర్గానికి చెందిన వారు ఆసియా దేశాలకు ట్రావెల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రయాణాలు కేవలం కేవలం విశ్రాంతి కోసం కాకుండా అనుభవాల కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంగీత కచేరీలు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన అనుభవాలు వంటి అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.జపాన్, దక్షిణ కొరియా, దక్షిణ - తూర్పు ఆసియా దేశాల్లోని నగరాలు భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఓసాకా, టోక్యో, బుసాన్ వంటి నగరాల్లో సెర్చ్లు గణనీయంగా పెరిగాయి. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్ వంటి నగరాలు కూడా తమ సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయాలు, పరిచయంతో కూడిన వాతావరణం వల్ల ప్రజాదరణ పొందుతున్నాయి.ప్రయాణం ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా కుటుంబంతో, స్నేహితులతో కలిసి చేసే అనుభవంగా మారుతోంది. దాదాపు 60 శాతం మంది గ్రూప్ లేదా ఫ్యామిలీ ట్రావెల్ చేసినట్లు గణాంకాల ద్వారా తెలిసింది. దేశీయంగా కూడా కొత్త ట్రెండ్లు కనిపిస్తున్నాయి. ప్రజలు సాధారణంగా వెళ్లే ప్రదేశాలకంటే భిన్నమైన, ప్రకృతి, సంప్రదాయం, సంస్కృతి కలిగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా తిరువనంతపురం, పూరి, జైపూర్, మేఘాలయ వంటి ప్రదేశాలు ఉన్నాయి. -
నార్వే ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ
లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆయా రంగాల్లో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసేలా నార్వే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని కోరారు.డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం ఆ దేశ రాయబారి మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ‘తెలంగాణ - నార్వే’ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించింది.రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, అవకాశాలను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆఫ్షోర్ విండ్, క్లైమేట్ ఇన్నోవేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థలలో ‘నార్వే’ గ్లోబల్ లీడర్ గా కొనసాగుతోందని కొనియాడారు.ఏఐ, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్, డీప్ టెక్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డీ కార్బనైజేషన్, గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ హెల్త్, బయోటెక్, మెడికల్ డివైజెస్ తదితర అంశాల్లో కలిసే పని చేసేందుకు గల అవకాశాలపై ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేసుకుని ముందుకెళ్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ - నార్వే వర్కింగ్ గ్రూప్’ను ఏర్పాటు చేద్దామని మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించారు.‘తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేలా అడుగు ముందుకేస్తాం. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం’ అని నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్వే ఇన్నోవేషన్ హెడ్ బ్యోర్న్ ఐవర్సన్, ఫస్ట్ సెక్రటరీ సిల్జే క్రిస్టీన్ ఆండర్సన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సిరి వెసెత్ మెలింగ్ తదితరులు పాల్గొన్నారు. -
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్లో ఉద్యోగాలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్వర్క్లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్మెంట్, కంప్యూటింగ్ హార్డ్వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
ఇతరుల ఆకాంక్షలకు బందీ కావొద్దు!
‘మీ సమయం పరిమితం. కాబట్టి వేరొకరి జీవితం కోసం దాన్ని వృథా చేయవద్దు’ అని స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో మరింత ఎక్కువగా వినిపిస్తోంది. సమాజం నిర్ణయించిన బాటలోనే నడవాలా? లేక మనకంటూ ఒక కొత్త పంథాను నిర్మించుకోవాలా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టీవ్జాబ్స్ తత్వాన్ని విశ్లేషిస్తూ ప్రత్యేక కథనం.పరిమిత సమయం.. అపరిమిత లక్ష్యాలుజీవితం అనేది ఒకసారి మాత్రమే లభించే అవకాశం. స్టీవ్ జాబ్స్ తన కోట్లో ‘సమయం పరిమితం’ అని నొక్కి చెప్పడంలో అంతరార్థం ఏమిటంటే.. మరణం అనేది తథ్యం, కాబట్టి ఉన్న కొద్ది కాలంలోనే మనం ఎంచుకున్న రంగంలో ప్రత్యేకంగా నిలవాలి. కెరీర్ ఎంపికల నుంచి వ్యక్తిగత నిర్ణయాల వరకు మనకు నచ్చని పనులను కేవలం ఇతరుల కోసం చేస్తూ పోతే మన అంతరాత్మను చంపుకున్నట్లే.మన దేశంలో ముఖ్యంగా విద్య, వృత్తి పరమైన విషయాల్లో కుటుంబం, సమాజం ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. ఫలానా చదువే చదవాలి, ఫలానా ఉద్యోగమే చేయాలి అనే నిబంధనల మధ్య వ్యక్తిత్వం మరుగున పడిపోతోంది. స్టీవ్ జాబ్స్ ఈ విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఇతరుల సలహాలను వినడం తప్పు కాదు, కానీ వాటిని విమర్శనాత్మకంగా అంచనా వేయాలి. సమాజం నిర్ణయించిన విజయ సూత్రాలను ప్రశ్నించినప్పుడే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి’ అన్నారు.స్వీయ అవగాహన.. విజయానికి తొలిమెట్టుమన బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? మనకు అసలు ఏం కావాలి? అనే విషయాలపై స్పష్టత లేనప్పుడు ఇతరుల అభిప్రాయాలే మన నిర్ణయాలను శాసిస్తాయి. స్వీయ అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే బాహ్య ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలడు. సోషల్ మీడియా యుగంలో తోటివారిని పోల్చుకొని బతుకుతున్న నేటి యువతకు తమను తాము తెలుసుకోవడం అత్యంత అవసరం.స్టీవ్ జాబ్స్ జీవితం ఆచరణాత్మక పాఠంజాబ్స్ జీవితమే ఆయన సిద్ధాంతానికి నిదర్శనం. రీడ్ కాలేజీ నుంచి డ్రాపౌట్ అయినప్పటికీ కాలిగ్రఫీ వంటి కోర్సులను నేర్చుకోవడం ద్వారా డిజైనింగ్లో కొత్త ఒరవడిని సృష్టించారు. యాపిల్ సంస్థ నుంచి బహిష్కరణకు గురైనా నీరసించకుండా ‘నెక్స్ట్’, ‘పిక్సర్’ వంటి సంస్థలను స్థాపించి మళ్లీ శిఖరాగ్రానికి చేరారు.నిర్ణయాధికారానికి కావాల్సిన నైపుణ్యాలుభావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవాలను విశ్లేషించడం.పరిస్థితులు మారినప్పుడు మనల్ని మనం మలచుకోవడం.వైఫల్యాలు ఎదురైనప్పుడు విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగడం.‘డిజైన్ అంటే కేవలం అది ఎలా కనిపిస్తుంది అనేదే కాదు, అది ఎలా పనిచేస్తుంది అనేదే ముఖ్యం’ అని జాబ్స్ అన్నట్లుగా.. మన జీవితం కూడా బయటకు ఎలా కనిపిస్తుందనే దానికంటే, లోపల మనమెంత తృప్తిగా ఉన్నామనేదే ముఖ్యం. నిరంతరం నేర్చుకుంటూ, మనకంటూ ఒక సొంత మార్గాన్ని ఏర్పరచుకోవడమే స్టీవ్ జాబ్స్కు మనం ఇచ్చే నిజమైన నివాళి.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
5 కంపెనీలుగా వేదాంతా!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా మే 1 నుంచి 5 కంపెనీలుగా విడిపోనుంది. దీంతో అల్యూమినియం, మర్చంట్ పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, ముడిఇనుము విభాగాలు ప్రత్యేక లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనున్నాయి. వెరసి స్వతంత్ర కంపెనీలుగా వేదాంతా అల్యూమినియం మెటల్ (వీఏఎంఎల్), తల్వాండి సాబో పవర్ (టీఎస్పీఎల్), మాల్కో ఎనర్జీ(ఎంఈఎల్), వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ (వీఐఎస్ఎల్) ఏర్పాటు కానున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత వేదాంతా (మాతృ సంస్థ) లిస్టెడ్ కంపెనీగా కొనసాగనుంది. విడదీత (డీమెర్జర్) మే 1నుంచి అమల్లోకి వచ్చేందుకు సోమవారం సమావేశమైన బోర్డు అనుమతించినట్లు వేదాంతా వెల్లడించింది. విడదీయనున్న బిజినెస్లతో సంప్రదించాక రికార్డ్ డేట్ను నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ పథకం ప్రకారం అర్హులైన వేదాంతా వాటాదారులకు 1:1 నిష్పత్తిలో ఇతర కంపెనీల షేర్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలియజేసింది. స్వతంత్ర బిజినెస్లుగా ఏర్పాటుకావడం ద్వారా సంబంధిత రంగాలపైనే దృష్టి సారించేందుకు వీలుంటుందని వేదాంతా పేర్కొంది. దీంతో వెల్త్ ఫండ్స్ తదితర గ్లోబల్ ఇన్వెస్టర్లు, రిటైలర్లు, వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు ప్రత్యేకించిన రంగాలలో పెట్టుబడులకు అవకాశం ఉంటుందని వివరించింది. ఇతర వివరాలివీ...అల్యూమినియం సంబంధిత మారి్పడిరహిత డిబెంచర్లను(ఎన్సీడీలు) వీఏఎంఎల్కు బదిలీ చేయనున్నట్లు వేదాంతా వెల్లడించింది. వీటితోపాటు భారత్ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో వాటాలు సైతం బదిలీ చేయనుంది. అంతేకాకుండా తల్వాండీ సాబో పవర్ను వేదాంతా పవర్(వీపీఎల్)గా, మాల్కో ఎనర్జీని వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్(వీఓజీఎల్)గా మార్పు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 771 వద్ద ముగిసింది. -
ప్రయాణం ప్రత్యేకం.. ఈ మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్లు!
భారతదేశంలో ట్రైన్ జర్నీ అనేది కేవలం గమ్యస్థానాలను చేరుకోవడానికి మాత్రమే కాకుండా.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే.. దాదాపు అందరూ కూడా సాధారణ రైళ్లలో ప్రయాణం చేసి ఉంటారు. కానీ డబుల్ డెక్కర్ రైలు ప్రయాణం చాలా అరుదు. ఈ రకమైన ట్రైన్ జర్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విశాలమైన కిటికీల (విండోస్) గుండా బయట ప్రపంచాన్ని చూడటం ఆ థ్రిల్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ కథనంలో మన దేశంలోని డబుల్ డెక్కర్ రైలు మార్గాలు ఏవి? అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.ముంబై - అహ్మదాబాద్డబుల్ డెక్కర్ రైలు అనగానే చాలామందికి గుర్తొచ్చేది ముంబై - అహ్మదాబాద్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఎందుకంటే ఇది అత్యంత పురాతనమైన, అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. ఇది రెండు ముఖ్యమైన నగరాలను కలుపుతూ వ్యాపారవేత్తలు, తరచూ ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఒకరోజులో జర్నీ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. సౌకర్యవంతమైన చైర్ కార్ సీటింగ్, పెద్ద కిటికీలు ఉండటం వల్ల మీ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది.ఢిల్లీ - జైపూర్ఢిల్లీ-జైపూర్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ దేశ రాజధాని ఢిల్లీని రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్తో కలుపుతుంది. ఈ మార్గంలో ఏడాది పొడవునా పర్యాటకులు, రోజువారీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ సమయం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇందులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతారు.చెన్నై - బెంగళూరుచెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ దక్షిణ భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ప్రయాణించే రైళ్లలో ఒకటి. ఉద్యోగులు, విద్యార్థులు, వారాంతపు ప్రయాణికులు ఎక్కువగా ఈ రైలును ఉపయోగిస్తారు. పరిమితమైన స్టాప్లు, సమర్థవంతమైన షెడ్యూలింగ్ వంటివి ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ రైలుకు అధిక డిమాండ్ ఉండటం వల్ల.. టికెట్లు త్వరగా అమ్ముడవుతాయి.విశాఖపట్నం - విజయవాడవిశాఖపట్నం - విజయవాడ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన నగరాలను కలుపుతుంది. ఈ సర్వీసు సాధారణ ప్రయాణికులకు, ఆఫీసులకు వెళ్లేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. విశాఖ పట్టణం, విజయవాడలకు ప్రయాణించాలనుకునే వారికి ఈ డబుల్ డెక్కర్ మంచి ఎంపిక.హౌరా - ధన్బాద్హౌరా-ధన్బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్.. కోల్కతాను జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాలతో కలుపుతూ నడుస్తుంది. దీనిని వ్యాపారులు, ఉద్యోగస్తులు మాత్రమే కాకుండా.. రోజువారీ ప్రయాణికులు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.సాధారణ రైళ్లు మాదిరిగా.. డబుల్ డెక్కర్ ట్రైన్స్ అన్ని మార్గాలలో అందుబాటులో ఉండవు. దీనికి కారణం ప్రత్యేకమైన మౌలిక వసతులు. ఉదాహరణకు.. ప్లాట్ఫారమ్ ఎత్తు, ట్రాక్ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందువల్ల భారతీయ రైల్వేలు అధిక డిమాండ్ ఉన్న కొన్ని మార్గాలలో మాత్రమే వీటిని ప్రవేశపెట్టాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు!
తవ్వే కొద్దీ వస్తున్నట్లు.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మత మార్పుకు సంబంధించిన సంఘటనలు మాత్రమే కాకుండా.. స్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు కూడా బయటపడింది.టీసీఎస్ నాసిక్ యూనిట్లో అసోసియేట్గా పనిచేసిన ఒక మహిళకు ఎదురైన అనుభవం వివరించారు. బాధితురాలు కొత్తగా వివాహం చేసుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత సహోద్యోగుల నుంచి అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు, శారీరక వేధింపులు ఎదుర్కొన్నట్లు పోలీసులకు తెలిపింది.ఆమె ప్రకారం.. కొంతమంది సహోద్యోగులు వ్యక్తిగత, దాంపత్య జీవితంపై అసభ్యంగా మాట్లాడడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా.. అనుమతి లేకుండా తాకడానికి ప్రయత్నించడం, ఆన్లైన్లో కూడా వేధించడం జరిగింది. ఈ చర్యలు మహిళలపై కార్యాలయాల్లో జరుగుతున్న లైంగిక వేధింపుల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. బాధితురాలు భయంతో మొదట్లో ఎవరికి చెప్పలేకపోయినప్పటికీ, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఒకరోజు ''నేను చీర కట్టుకుని.. లాబీ గుండా, ప్యాంట్రీకి ఎదురుగా నడుస్తుండగా, ఎవరో నా చీర కొంగును లాగినట్లు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి, నా కొంగు అక్కడే పనిచేస్తున్న పురుష ఉద్యోగి చేతిలో ఉంది. నేను వెంటనే నా కొంగును వెనక్కి లాక్కున్నాను, దాంతో అతను నా వైపు చూసి నవ్వాడు'' అని ఆమె ఆరోపించింది.ఈ కేసులో నాసిక్ పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ మేనేజర్ కూడా ఉన్నారు. మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఘటన సంస్థలోని అంతర్గత వ్యవస్థలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది, ఎందుకంటే సంస్థకు ముందుగా ఈ తరహా ఫిర్యాదులు అందలేదని టీసీఎస్ తెలిపింది.మరోవైపు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుని, దీనిపై మరింత సమగ్రమైన విచారణ జరపాలని కోరుకున్నారు. కాగా టీసీఎస్ కంపెనీ నాసిక్ యూనిట్లో తప్పుడు కార్యకలాపాలకు పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: 'ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు': IMF రిపోర్ట్ -
వంద కోట్ల సామ్రాజ్యం.. ఆటోలో ప్రయాణం
నేటి గ్లామర్ లోకంలో కొంచెం డబ్బు రాగానే విలాసవంతమైన కార్లు, ఖరీదైన బంగ్లాలు, బ్రాండెడ్ వస్తువుల వెంట పడటం సహజం. కానీ, సుమారు రూ.100 కోట్ల నికర విలువ కలిగి ఉండి కూడా సామాన్యుడిలా ఆటోల్లో ప్రయాణిస్తూ బడ్జెట్ హోటళ్లలో బస చేసే ఒక పారిశ్రామికవేత్త కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.ప్రముఖ నూడిల్ బ్రాండ్ ‘నేచురల్లీ యువర్స్’ వ్యవస్థాపకుడు వినోద్ చెంధిల్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పంచుకున్న ఒక సంఘటన ఈ చర్చకు దారితీసింది. తన స్నేహితుడైన ఒక ముంబై పారిశ్రామికవేత్త జీవనశైలి గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు.‘నా స్నేహితుడి నికర ఆస్తి విలువ రూ.100 కోట్లకు పైమాటే. కానీ అతను ముంబైకి వచ్చినప్పుడల్లా ఆటోరిక్షాల్లోనే తిరుగుతాడు. వీలైతే షేర్ ఆటోలు, టాక్సీలను ఆశ్రయిస్తాడు. బస చేయడానికి సాధారణ హోటళ్లనే ఎంచుకుంటాడు. ఇప్పటికీ అతనికి ఎలాంటి లగ్జరీ కార్లు లేవు’ అని చెంధిల్ పేర్కొన్నారు.చెంధిల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ పారిశ్రామికవేత్త ఉద్దేశపూర్వకంగానే విలాసాలకు దూరంగా ఉంటున్నారు. ఆర్థికంగా ఎంత ఎదిగినా తన మూలాలను మర్చిపోకుండా ఆచరణాత్మకమైన జీవనశైలినే ఇష్టపడుతున్నారు. సంపద పెరిగిన తర్వాత ఆయన జీవితంలో సెలవుల కోసం కేటాయించే సమయం, వ్యక్తిగత స్వేచ్ఛలో మాత్రమే మార్పులొచ్చాయి.My founder friend who has 100cr net worth. Travels by auto whenever in Mumbai, takes share auto/taxi wherever possible, stays at simple hotels, has not bought an expensive vehicle.Only thing that has changed is that he has more vacations/free time now. https://t.co/Ieoy5AmPE5— Vinod Chendhil (@vinodchendhil) April 19, 2026నెటిజన్ల రీయాక్షన్ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘డబ్బు ఉన్నా గర్వం లేకపోవడం గొప్ప విషయం. భౌతిక సంపద కంటే మానసిక ప్రశాంతత, సమయం ముఖ్యం అని ఆయన నిరూపించారు’ అని కొందరు కొనియాడుతున్నారు. ‘సంపాదించిన డబ్బును సౌకర్యాల కోసం ఖర్చు చేయకపోతే ఆ సంపాదనకు అర్థం ఏముంది? కనీసం సమయాన్ని ఆదా చేసుకోవడానికైనా కారు వాడాలి కదా!’ అని మరికొందరు వాదిస్తున్నారు. దీనికి సమాధానంగా, తన స్నేహితుడు ఈ జీవనశైలితో చాలా సంతోషంగా ఉన్నారని చెంధిల్ స్పష్టం చేశారు.మినిమలిజం.. స్టార్టప్ ప్రపంచంలో కొత్త ట్రెండ్?ప్రస్తుతం స్టార్టప్ సర్కిల్స్లో మినిమలిజం లేదా కనీస అవసరాలతో జీవించడం అనే ధోరణి పెరుగుతోంది. కేవలం ఆడంబరాల కోసం ఖర్చు చేయకుండా ఆ సంపదను తిరిగి వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం లేదా అర్థవంతమైన అవసరాల కోసం (ప్రయాణాలు, కుటుంబంతో గడపడం) ఉపయోగించడంపై యువ వ్యవస్థాపకులు మొగ్గు చూపుతున్నారు.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
ఎన్బీఎఫ్సీ నిధుల భారం బ్యాంకులపైనే
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) బ్యాంకుల నుంచి నిధుల సమీకరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) మరింత పెరగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. బ్యాంకుల్లో రుణ రేట్లు తక్కువగా ఉండడమే కారణమని పేర్కొంది.ఎన్బీఎఫ్సీ నిధుల సమీకరణలో బ్యాంకుల వాటా 2026 మార్చి నాటికి 43 శాతానికి చేరిందని, 2027 మార్చి నాటికి 45 శాతానికి పెరగొచ్చని తెలిపింది. 2025–26 మొదటి ఆరు నెల్లలో క్యాపిటల్ మార్కెట్ ఇనుస్ట్రుమెంట్లపై నిధుల సమీకరణకు ఎన్బీఎఫ్సీలు మొగ్గు చూపించగా, తదుపరి ఆరు నెలల్లో తక్కువ వడ్డీ రేట్ల కారణంగా బ్యాంకుల వైపు మొగ్గు చూపించినట్టు వివరించింది.‘‘బ్యాంకు రుణ రేట్లు గత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. బాండ్ ఈల్డ్స్ మాత్రం ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో తగ్గగా, తర్వాతి కాలంలో మళ్లీ పెరగడం మొదలైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో కరెన్సీ మారకం విలువల్లో అనిశ్చితుల ఫలితంగా ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ (ఈసీబీ) జారీ వాటా కూడా సమీప కాలంలో స్దబ్దుగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీల నిధుల సమీకరణకు సెక్యూరిటైజేషన్ (చెల్లింపుల్లేని రుణాలను విక్రయించడం) కొంత మద్దతునివ్వొచ్చు. స్థూల ఆర్థిక అనిశి్చతుల నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలు (జీ–సెక్లు), కార్పొరేట్ బాండ్ ఈల్డ్స్ సమీప కాలంలో గరిష్టాల్లోనే ఉండొచ్చు. కార్పొరేట్ బాండ్ వడ్డీ రేట్లు బ్యాంక్ రుణ రేట్ల కంటే అధికంగానే కొనసాగొచ్చు’’అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. -
రూ.3 లక్షల కోట్లు దాటిన యస్ బ్యాంక్ డిపాజిట్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో యస్ బ్యాంక్ నికర లాభం స్టాండెలోన్ ప్రాతిపదికన 45 శాతం ఎగిసి రూ.1 ,068 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 739 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 9,356 కోట్ల నుంచి రూ. 9,381 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 7,616 కోట్ల నుంచి రూ. 7,650 కోట్లకు పెరిగింది.మొండిబాకీలకు ప్రొవిజనింగ్ 41 శాతం తగ్గి రూ. 187 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్ రుణాల విభాగం దన్నుతో రుణ వృద్ధి 10.7 శాతం మేర పెరిగింది. నికర వడ్డీ మార్చిన్ 2.5 శాతం నుంచి 2.7 శాతానికి మెరుగుపడింది. డిపాజిట్లు రూ. 3 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) డిపాజిట్లు రూ. 1 లక్ష కోట్లకు చేరుకున్నాయి. కొత్త ఎండీ, సీఈవోగా వినయ్ ఎం టోన్సే బాధ్యతలు చేపట్టాక బ్యాంకు ఆర్థిక ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని గైడెన్స్కి అనుగుణంగా పటిష్టమైన ఫలితాలతో ముగించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండు, మూడేళ్లలో మార్జిన్లను 3.25 – 3.50 శాతం స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు.నికర వడ్డీ మార్జిన్లు 20 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడినట్లు చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరం మొండిపద్దులు అత్యంత కనిష్ట స్థాయికి నెమ్మదించాయని పేర్కొన్నారు. మరింత మెరుగైన వృద్ధిని సాధించడంపై ప్రధానంగా దృష్టి పెడుతూ ముందుకు సాగనున్నట్లు వివరించారు. -
అంబానీ మీడియా సంస్థకు భారీ నష్టాలు
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 2025–26 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.29.61 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.29.09 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదిన కార్యకలాపాల ద్వారా ఆదాయం 9.7% పెరిగి రూ.561.32 కోట్ల నుంచి రూ.615.78 కోట్లు చేరింది.టీవీ న్యూస్ రంగంలో ప్రకటనల డిమాండ్ 10 శాతం తగ్గినా, కంపెనీ ప్రకటన ఇన్వెంటరీ 4.5 శాతం పెరగడం ద్వారా పరిశ్రమ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఎబిటా రూ.30 కోట్లుగా ఉండగా, ఎబిటా మార్జిన్ 4.9 శాతంగా నమోదైంది. మొత్తం వ్యయాలు 6.47 శాతం పెరిగి రూ.670.89 కోట్లకు చేరాయి. 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.155.20 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మొత్తం సమీకృత ఆదాయం రూ.2,148.46 కోట్లుగా నమోదైంది.‘‘ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ నవంబర్ 14, 2024 నుంచి, స్టూడియో 18 మీడియా డిసెంబర్ 30, 2024 నుంచి అనుబంధ సంస్థల జాబితా నుంచి తప్పుకోవడంతో, 2024–25 ఆర్థిక సంవత్సర గణాంకాలను 2025–26 గణాంకాలతో నేరుగా పోల్చడం సాధ్యం కాదు’’ అని కంపెనీ తెలిపింది.అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లోనూ కంపెనీ మంచి ఫలితాలతో ఆర్థిక సంవత్సరాన్ని ముగించిందని కంపెనీ చైర్మన్ అదిల్ జైనుల్భాయ్ తెలిపారు. సంచలనాల కంటే నిజమైన వార్తలపై దృష్టి పెట్టామన్నారు. కొత్త వ్యాపారాలతో ఆదాయం విభిన్నంగా మారుతోందని, న్యూస్ వ్యాపారాన్ని బలోపేతం చేస్తూనే, విస్తరణ కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంక్కి ప్రొవిజనింగ్ దన్ను
ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 9.28 శాతం వృద్ధి చెంది రూ. 14,755 కోట్లకు చేరింది. మొండిబాకీలు మొదలైన వాటికి కేటాయింపులు ఏకంగా 90 శాతం తగ్గడం ఇందుకు దోహదపడింది. శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం గతేడాది క్యూ4లో రూ. 891 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్ ఈ మార్చ్ క్వార్టర్లో రూ. 96.16 కోట్లకు తగ్గింది. డిసెంబర్ క్వార్టర్లో ఇది రూ. 2,556 కోట్లుగా ఉంది. సమీక్షాకాలంలో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ. 22,979 కోట్లకు చేరింది. అసెట్స్ 15 శాతం వృద్ధి చెందడం, నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా 4.32 శాతానికి పెరగడం ఇందుకు ఉపయోగపడింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఆరోగ్యకరమైన ఫలితాలు సాధించగలిగినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు. ఎకానమీ మెరుగుపడే కొద్దీ మరింతగా రుణాలిచ్చేందుకు తమ దగ్గర తగినన్ని నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భవిష్యత్ అంచనాలను వెల్లడించడం కష్టమని బాత్రా చెప్పారు. తమ రిస్కు సామర్థ్యాల పరిధికి లోబడి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. క్యూ4లో అసెట్ క్వాలిటీ, రికవరీలు మెరుగుపడటం వల్ల ప్రొవిజనింగ్ తగ్గిందని, అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించిన రూ. 13,100 కోట్ల నిధి అలాగే ఉందని ఆయన పేర్కొన్నారు. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు ఒక్కో షేరుకి రూ. 12 చొప్పున తుది డివిడెండు ప్రకటించింది. ఫలితాల్లో కీలకాంశాలు.. → క్యూ4లో వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ కాకుండా) 5.6 శాతం పెరిగి రూ. 7,415 కోట్లకు చేరింది. రూపాయిపై అతి స్పెక్యులేషన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇటీవల తీసుకున్న చర్యలతో ట్రెజరీ విభాగానికి సంబంధించి రూ. 106 కోట్ల నష్టం వచ్చింది. → నిర్వహణ వ్యయాలు 12 శాతం పెరిగి రూ. 12,089 కోట్లకు చేరాయి. → అసెట్ క్వాలిటీ విషయానికొస్తే స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి డిసెంబర్లో 1.53 శాతంగా, గతేడాది మార్చి క్వార్టర్లో 1.67 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.40 శాతానికి తగ్గింది. స్థూల స్లిప్పేజీలు రూ. 4,242 కోట్లుగా ఉన్నాయి. → బిజినెస్ బ్యాంకింగ్ దన్నుతో రుణ వృద్ధి 24 శాతం మేర నమోదైంది. గ్రామీణ రుణాల పోర్ట్ఫోలియో 25 శాతం మేర పెరగగ్గా, రిటైల్ వాటా 41 శాతానికి నెమ్మదించింది. దేశీయంగా కార్పొరేట్ రుణాలు 9 శాతం పెరిగినప్పటికీ, పోర్ట్ఫోలియోలో వీటి వాటా 20 శాతానికి పరిమితమైంది. రాబోయే రోజుల్లో ఇది కొంత పెరిగే అవకాశం ఉంది. → మార్చి 31 నాటికి బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ 17.18 శాతంగా ఉంది. → స్టాండెలోన్ ప్రాతిపదికన నికర లాభం రూ. 13,702 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 12,630 కోట్లతో పోలిస్తే 8.5 శాతం పెరిగింది. → 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం 6.2 శాతం వృద్ధి చెంది రూ. 50,147 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 47,227 కోట్లు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 20,351 కోట్లు
ముంబై: దేశీ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 20,351 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 18,835 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 1,16,920 కోట్లుగా నిల్చింది. క్రితం క్యూ4లో ఇది రూ. 1,20,269 కోట్లు. వడ్డీ ఆదాయం రూ. 86,779 కోట్ల నుంచి రూ. 87,182.50 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై రూ. 13 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. గతేడాది ఆగస్టు 11న ప్రకటించిన రూ. 2.50 మధ్యంతర డివిడెండుతో కలిపి మొత్తం రూ. 15.5 మేర డివిడెండు ఇచ్చినట్లవుతుందని సంస్థ తెలిపింది. క్యూ1లో చిన్న రుణగ్రహీతలపై పశ్చిమాసియా ప్రభావం.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల చిన్న, మధ్య తరహా రుణగ్రహీతలపై ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభావం పడొచ్చని బ్యాంక్ సీఈవో, ఎండీ శశి జగదీశన్ తెలిపారు. యుద్ధం ముగిశాక పరిస్థితి చక్కబడటానికి రెండు నెలలు పట్టొచ్చని వివరించారు. అయితే, అసెట్ క్వాలిటీపరంగా ప్రతికూల పరిస్థితులేమీ లేవని చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ శాఖ బాండ్ల మిస్–సెల్లింగ్ వ్యవహారం నేపథ్యంలో నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామాపై వ్యాఖ్యానించేందుకు జగదీశన్ నిరాకరించారు. మిస్–సెల్లింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే, విచారణ నివేదిక ఎప్పట్లోగా రావొచ్చనేది కూడా చెప్పడానికి నిరాకరించారు. దర్యాప్తులో భాగంగా భారీ స్థాయిలో డేటాను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చక్రవర్తి రాజీనామా అనంతరం బ్యాంకు పట్ల సానుకూలంగా వ్యవహరించడంపై ప్రభుత్వం, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాత్కాలికంగా చైర్పర్సన్గా ఉన్న కేకి మిస్త్రీ పూర్తి కాలం కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు కోరుకుంటున్నామని, అయితే నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) ముందు ఈ ప్రతిపాదన ఉంచడానికి ముందుగా నిర్దిష్ట ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. జగదీశన్ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో ఆయన పునర్నియామకం విషయాన్ని ఎన్ఆర్సీ పరిశీలిస్తుందని, ఇందుకు నిర్దిష్ట కాలవ్యవధిని చెప్పలేమని డిప్యుటీ ఎండీ కైజాద్ భరూచా తెలిపారు. ఇతర విశేషాలు.. → పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ. 4,95,463 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4,70,916 కోట్లు. → స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4లో నికర లాభం రూ. 19,221 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో ఇది రూ. 17,616 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 89,488 కోట్ల నుంచి రూ. 89,809 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 62,951 కోట్ల నుంచి రూ. 62,006 కోట్లకు తగ్గాయి. → వడ్డీ ఆదాయం రూ. 77,460 కోట్ల నుంచి రూ. 76,610 కోట్లకు నెమ్మదించింది. → స్థూల మొండిబాకీల నిష్పత్తి 2025 మార్చి క్వార్టర్లో 1.33 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 1.24 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.15 శాతానికి తగ్గింది. నికర మొండిబాకీల నిష్పత్తి 0.38 శాతంగా ఉంది. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 19.7 శాతంగా ఉంది. → 2026 మార్చి 31 నాటికి 9,689 శాఖలు, 21,172 ఏటీఎంలు ఉన్నాయి. 2025 మార్చి 31న 9,455 శాఖలు, 21,139 ఏటీఎంలు ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య 2,14,521 నుంచి 2,11,178కి తగ్గింది. -
రైలు టికెట్ రహస్యం తెలుసా?
భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడుతుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? మనం బుక్ చేసుకునే ప్రతి రిజర్వేషన్ టికెట్పైనా 10 అంకెల పీఎన్ఆర్ (PNR) సంఖ్య ఉంటుంది. అసలు ఈ నంబర్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అది కేవలం ఒక సంఖ్యేనా లేక అందులో ఏవైనా వివరాలు దాగి ఉన్నాయా?ఏమిటీ పీఎన్ఆర్?పీఎన్ఆర్ అంటే 'ప్యాసింజర్ నేమ్ రికార్డ్'. ఇది రైల్వే డేటాబేస్లో ప్రయాణికుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య. సీటు కన్ఫర్మ్ అయిందా లేదా? ఏ కోచ్లో బెర్త్ కేటాయించారు? ప్రయాణ తేదీ, రైలు వివరాలు వంటి కీలక సమాచారమంతా ఈ 10 అంకెల వెనుక నిక్షిప్తమై ఉంటుంది.పది అంకెలే ఎందుకంటే..లక్షల కొద్దీ బుకింగ్స్ జరిగే మన దేశంలో, తక్కువ అంకెలు ఉంటే నంబర్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎక్కువ అంకెలు ఉంటే గుర్తుంచుకోవడం కష్టం. అందుకే, నిర్వహణకు సులభంగా ఉంటూనే, బిలియన్ల కొద్దీ ప్రత్యేకమైన కాంబినేషన్లను సృష్టించేందుకు 10 అంకెల ఫార్మాట్ను రైల్వే ఎంచుకుంది.ఈ 10 అంకెలు యాదృచ్ఛికంగా ఇచ్చేవి కావు. ఇందులో ప్రతి అంకెకు ఒక అర్థం ఉంది.మొదటి అంకె: ఇది టికెట్ ఏ రైల్వే జోన్ లేదా ఏ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) ద్వారా బుక్ అయిందో సూచిస్తుంది. ఉదాహరణకు 2 లేదా 3 తో మొదలైతే అది సికింద్రాబాద్ (SCR) వంటి జోన్లకు సంబంధించినదిగా గుర్తించవచ్చు.మొదటి 3 అంకెలు: ఇవి రిజర్వేషన్ జరిగిన జోనల్ క్లస్టర్ను తెలియజేస్తాయి.చివరి 7 అంకెలు: ఇవి సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యే యూనిక్ నంబర్లు. ఇవి ఒకే ప్రయాణంలో ఇద్దరు వ్యక్తులకు ఒకే నంబర్ రాకుండా అడ్డుకుంటాయి.పీఎస్ఆర్ వ్యవస్థ ఎందుకు కీలకం?కోట్లాది మంది డేటాను గందరగోళం లేకుండా నిర్వహించడానికి పీఎన్ఆర్ వ్యవస్థ వెన్నెముకలా పనిచేస్తుంది. దీని ద్వారా వెయిటింగ్ లిస్ట్ (WL) లేదా RAC లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకే సీటు ఇద్దరికి కేటాయించకుండా ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది.అత్యవసర సమయాల్లో ప్రయాణికుల పూర్తి వివరాలను రైల్వే అధికారులు త్వరగా సేకరించేందుకు ఇది తోడ్పడుతుంది.మనం సాధారణంగా చూసే ఆ 10 అంకెల కోడ్ వెనుక ఇంతటి భారీ సాంకేతిక వ్యవస్థ దాగి ఉంది. భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశంలో రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడంలో పీఎన్ఆర్ నంబర్ పోషిస్తున్న పాత్ర అమోఘం. ఈ సారి మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ వివరాలన్నీ మీ పీఎన్ఆర్లో గమనించండి. -
రూ.కోట్లు కాజేశాడు.. జల్సా చేస్తున్నాడు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరుగా నిలిచే మోడీ, తన కుమారుడికి ఇచ్చే ఖరీదైన బహుమతుల గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఇటీవల మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన కుమారుడి వద్ద ఉన్న అరుదైన కార్ల సేకరణ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ!తన చిన్నతనంలో తండ్రి తనకు కారు కొనివ్వలేదన్న వెలితిని గుర్తు చేసుకుంటూ తన కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలిపారు. ‘నేను ఎదుగుతున్న క్రమంలో మా నాన్న నాకు ఫెరారీ కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. అది చాలా వేగంగా వెళ్తుందని, ప్రమాదకరమని ఆయన భావించేవారు. కానీ నాకు ఫెరారీ అంటే ప్రాణం. నా 40వ పుట్టినరోజున మా బంధువు నాకు మొదటి కారును బహుమతిగా ఇచ్చారు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ కారును బహుమతిగా ఇస్తున్నాను’ అన్నారు.ప్రస్తుతం మోడీ కుమారుడి వయస్సు 32 ఏళ్లు. అంటే, గత 11 ఏళ్లుగా వరుసగా ఆయనకు ఫెరారీ కార్లు అందుతూనే ఉన్నాయి. ఫలితంగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ, ఎక్కువ ఫెరారీ కార్ల సేకరణ కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.లండన్లో తలదాచుకుంటున్న మోడీఒకవైపు కొడుకు కోసం కోట్లు కుమ్మరిస్తూ వార్తల్లో నిలుస్తున్న లలిత్ మోడీ, మరోవైపు భారత చట్టాల నుంచి తప్పించుకుని లండన్లో తలదాచుకుంటున్నారు. వివిధ అంచనాల ప్రకారం మోడీ నికర ఆస్తి విలువ 500 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,000 - రూ.5,000 కోట్లు) వరకు ఉంటుందని సమాచారం. అయితే విదేశాల్లో ఉన్న పెట్టుబడుల కారణంగా దీనిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేవు.ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2013లో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. 2010 నుంచి లండన్లో నివసిస్తున్న మోడీ తనపై ఉన్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆయనను భారత్ రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారనే ఆరోపణలు ఒకవైపు, విదేశీ గడ్డపై విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్ల వేలంపాటలు మరోవైపు.. లలిత్ మోడీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత చట్టాలకు చిక్కకుండా ఆయన సాగిస్తున్న ఈ రాయల్ జీవితంపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
మూడు నెలల్లో 73 వేల ఉద్యోగాలు ఉఫ్!
ప్రపంచ టెక్నాలజీ రంగంలో కొలువుల కోత పరంపర 2026లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ ప్రక్రియ ఈ ఏడాదిలో మరింత వేగం పుంజుకుంది. లేఆఫ్స్.ఎఫ్వైఐ (Layoffs.fyi) సేకరించిన తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది ప్రారంభ నెలల్లోనే సుమారు 73,200 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 95 దిగ్గజ టెక్ కంపెనీలు ఈ తొలగింపుల్లో భాగమయ్యాయి. కరోనా కాలంలో అవసరానికి మించి జరిగిన నియామకాలు, ప్రస్తుతం మారుతున్న మార్కెట్ పరిస్థితులు ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.కొలువుల కోతకు దారితీసిన కీలక అంశాలు2021 నుంచి ఇప్పటివరకు టెక్ రంగంలో సుమారు పది లక్షల ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. ప్రస్తుత సంక్షోభానికి వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. కంపెనీలు తమ వ్యయాన్ని సాంప్రదాయ విభాగాల నుంచి ఏఐ, ఆటోమేషన్, మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి. మానవ వనరుల కంటే సాంకేతికతపై పెట్టుబడి పెట్టడమే లాభదాయకమని సంస్థలు భావిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్, సాస్ విభాగాల్లో అత్యధికంగా తొలగింపులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత స్థానంలో ఈ-కామర్స్ రంగం ఉంది. ఈ ప్రభావం అత్యధికంగా అమెరికాపై కనిపిస్తోంది. యూరప్, ఆసియా దేశాల్లోని సెమీకండక్టర్, టెలికాం, ఐటీ సేవల విభాగాల్లోనూ గణనీయమైన స్థాయిలో ఉద్యోగాల కోత నమోదైంది.ఏఐ భర్తీ చేస్తోందా?సాధారణంగా ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయనే భయం ఉన్నప్పటికీ నిపుణుల విశ్లేషణ మరోలా ఉంది. ప్రస్తుతానికి ఏఐ నేరుగా ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే కంపెనీలు ముందస్తుగా ఖర్చులను తగ్గించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో నియామకాలు, తొలగింపుల నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేసే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. టెక్ కంపెనీలు ఇప్పుడు ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే సూత్రాన్ని పాటిస్తున్నాయి. ఏఐ వంటి కొత్త వృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కోసం పాత విభాగాల్లో కోతలు విధిస్తున్నాయి.ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే ఈ ఏడాది ముగిసే సమయానికి ఉద్యోగ కోతలు మరిన్ని వేలల్లో ఉండవచ్చని డేటా సూచిస్తోంది. టెక్ నిపుణులు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడమే ఈ సంక్షోభం నుంచి బయటపడే ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
జియో ఫైనాన్షియల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గతేడాది(2025–26) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 14 శాతం క్షీణించి రూ. 272 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2024–25) క్యూ4లో రూ. 316 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం దాదాపు రెట్టింపై రూ. 1,020 కోట్లకు చేరింది. అంతక్రితం ఇదే కాలంలో కేవలం రూ. 518 కోట్ల టర్నోవర్ అందుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ. 169 కోట్ల నుంచి రూ. 720 కోట్లకు భారీగా పెరిగాయి. రాజకీయ, భౌగోళిక అనిశ్చితి ట్రెజరీ ఆదాయంపై ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. పూర్తి ఏడాదికి రూ. 1,561 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2024–25లో రూ. 1,613 కోట్లు ఆర్జించింది. కాగా.. వాటాదారులకు షేరుకి రూ. 0.6 డివిడెండ్ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 1.1% బలపడి రూ. 244 వద్ద ముగిసింది. -
డిజిటల్ యాడ్స్ డబుల్
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో దాదాపు రెట్టింపు కానుంది. 2030 నాటికి 19–22 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2025లో ఇది 11 బిలియన్ డాలర్లుగా ఉండగా రాబోయే రోజుల్లో ఏటా 10–15 శాతం మేర వృద్ధి చెందనుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ కన్సల్టింగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా కూడా డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. గతేడాది ప్రకటనలపై చేసిన మొత్తం వ్యయాల్లో 70–75 శాతం వాటాను ఆక్రమించింది. నివేదికలో ఇతర ముఖ్యాంశాలు.. → భౌగోళికంగా చూస్తే గ్లోబల్ డిజిటల్ యాడ్లపై చేసే వ్యయాల్లో 46 శాతం మార్కెట్ వాటాతో అమెరికా అగ్రస్థానంలో, 24% వాటాతో చైనా రెండో స్థానంలో ఉన్నాయి. భారత్ వాటా ప్రస్తుతం 1 శాతంగా ఉంది. → 2030 నాటికి అంతర్జాతీయంగా డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్ 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. → డిజిటల్ ప్రకటనల్లో మొబైల్ యాడ్స్ వాటా అత్యధికంగా 65–70 శాతంగా ఉంటోంది. అమెరికాలో ఇన్–యాప్ అడ్వర్టైజింగ్ వాటా 80–85 శాతంగా ఉంది. → అల్గోరిథమ్ ఆధారిత డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యయాల్లో 70–80 శాతం వాటాతో కొన్ని సంస్థల ఆధిపత్యమే ఉంటోంది. తమకంటూ సొంత వ్యవస్థలు ఉన్న అల్ఫాబెట్, మెటా, అమెజాన్, యాపిల్, బైట్డ్యాన్స్ తదితర దిగ్గజాలు వీటిలో ఉన్నాయి. → ఇక ఓపెన్ వ్యవస్థలోని సంస్థల వాటా మిగతా 20–30 శాతంగా ఉంది. ఇన్మొబి, యూనిటీ యాడ్స్, ఓపెన్ఎక్స్ మొదలైన బ్రాండ్లు వీటిలో ఉన్నాయి. → వేగంగా అందిపుచ్చుకునే వారు, వెనుకబడిన వారి మధ్య అంతరం పెరిగిపోతున్న నేపథ్యంలో... తదుపరి దశ అడ్వర్టైజింగ్ అంతా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారితమైనదిగా ఉండనుంది. భవిష్యత్తులో ఏఐని విస్తృతంగా వినియోగించుకునే సంస్థలు విజేతలుగా నిలుస్తాయి. -
మహిళలకు ‘లీడర్షిప్’.. ఆదిత్య బిర్లా కొత్త ప్రోగ్రామ్
ముంబై: ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ఏబీసీఎల్), తన ఫిన్టెక్ విభాగం ఇన్ఫినైట్ కింద మహిళల కోసం మహిళలే నిర్వహించే ‘లీడర్షిప్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్థిక సేవలు ఫిన్టెక్ రంగాల్లో ప్రారంభ దశలో ఉన్న మహిళా వ్యాపారవేత్తలకు దీని కింద మద్దతు ఇస్తుంది. అలాగే, వారికి అవసరమైన వనరులు అందించడంతోపాటు వేగంగా తమ సామర్థ్యాలను పెంచుకునేందుకు, వ్యాపార విస్తరణకు స్థిరమైన అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని సంస్థ ప్రకటించింది.ఈ 'లీడర్షిప్' కార్యక్రమం ద్వారా ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు ఆదిత్య బిర్లా క్యాపిటల్లోని అగ్రశ్రేణి నిపుణుల నుండి ప్రత్యక్ష పర్యవేక్షణ (Mentorship) లభిస్తుంది. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, మార్కెట్ యాక్సెస్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్కింగ్ అవకాశాలను కల్పించడం ద్వారా వారి స్టార్టప్లను విజయవంతమైన సంస్థలుగా తీర్చిదిద్దనున్నారు. ముఖ్యంగా ఫిన్టెక్ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో లింగ వివక్షను తొలగించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఏబీసీఎల్ ప్రతినిధులు పేర్కొన్నారు.అంతేకాకుండా, ఈ వేదిక ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వీలవుతుంది. వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించడం ద్వారా వ్యాపార నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా వారిని సిద్ధం చేస్తారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, సుస్థిరమైన, సమ్మిళిత వ్యాపార వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఆదిత్య బిర్లా గ్రూప్ ఈ ముందడుగు వేసింది. -
ఆసియాకు కొత్త కుబేరుడు.. ముఖేష్ అంబానీ నెం.2
ఆసియా అత్యంత సంపన్నుడుగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నిలిచారు. ఇప్పటి వరకూ ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆయన స్థానాన్ని అదానీ ఆక్రమించారు. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం.. గౌతమ్ అదానీ నికర సంపద 92.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన అత్యంత సంపన్నుల్లో ఆసియాలో అగ్ర స్థానానికి, ప్రపంచంలో 19 ప్లేస్కు చేరుకున్నారు.చాలా కాలం ఆసియా అత్యంత సంపన్నుడుగా కొనసాగిన ముఖేష్ అంబానీ 90.8 బిలయన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి, ప్రపంచవ్యాప్తంగా 20వ స్థానానికి పరిమితమయ్యారు. వీరి సంపద మధ్య అంతరం తక్కువగా ఉన్నప్పటికీ, ఈ మార్పు ప్రపంచ సంపద కదలికల అస్థిర స్వభావాన్ని తెలియజేస్తోంది.అంబానీ vs అదానీ: లాభాలు.. నష్టాలుఈ సంవత్సరం తన గ్రూప్ స్టాక్ పనితీరులో స్థిరమైన లాభాలు అదానీ సంపద పెరుగుదలకు కలిసొచ్చాయి. సంపదకు 8.1 బిలియన్ డాలర్లు జత కలిశాయి. దీనికి విరుద్ధంగా, అంబానీ అదే కాలంలో తన నికర సంపదలో 16.9 బిలియన్ డాలర్లను కోల్పోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఫ్లాట్ మార్కెట్ పనితీరును కనబరిచింది. దీంతో అంబానీ సంపద 76.7 మిలియన్ డాలర్ల స్వల్ప పెరుగుదలను చూసింది. అదే సమయంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లాభాలను నమోదు చేశాయి. దీంతో కేవలం ఒక రోజులో అదానీ సంపదకు 3.56 బిలియన్ డాలర్లు జత కలిశాయి.ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే..ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, లారీ పేజ్ 286 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ 10 లో జెఫ్ బెజోస్, సెర్గీ బ్రిన్, మార్క్ జుకర్ బర్గ్, లారీ ఎల్లిసన్, మైఖేల్ డెల్, జెన్సన్ హువాంగ్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జిమ్ వాల్టన్ ఉన్నారు. -
ఇరాన్ వార్ : బడ్జెట్ ఎయిర్లైన్స్ దివాలా
అమెరికాకు చెందిన ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ స్పిరిట్ ఎయిర్లైన్స్ (Spirit Airlines) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పెరిగిన ఇంధన ధరలు, భారీ అప్పుల కారణంగా ఈ సంస్థ నేటి నుండే తన కార్యకలాపాలను నిలిపివేసే దిశగా పయనిస్తోంది.CBS న్యూస్ రిపోర్ట్ ప్రకారం అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో జెట్ ఇంధన ధరలు పెరగడం వల్ల, రాబోయే రుణ చెల్లింపులు చేయగల సామర్థ్యం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విమానయాన సంస్థ రుణదాతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ నివేదిక పేర్కొంది.త్వరలోనే మూత పడుతుందా? అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2026లో గాలన్ ఇంధనం ధర 2.24 cగా ఉంటుందని కంపెనీ అంచనా వేయగా, ప్రస్తుతం అది 4.24 డాలర్లకు చేరింది. ఇది కంపెనీ అంచనాల కంటే రెట్టింపు. దీనికి తోడు భారీగా పేరుకుపోయిన అప్పులు తీర్చగల కంపెనీ సామర్థ్యంపై రుణదాతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంస్థను లిక్విడేట్ (ఆస్తులు విక్రయించి మూసివేయడం) చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.రుణదాతలతో జరుగుతున్న చర్చల ఫలితాన్ని బట్టి ఈ వారం లోపే కంపెనీ భవిష్యత్తుపై స్పష్టత రానుంది.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిదివాలా ప్రక్రియ (Bankruptcy)స్పిరిట్ ఎయిర్లైన్స్ ఇప్పటికే రెండుసార్లు దివాలా రక్షణ కోరింది. గత ఏడాది ఆగస్టులో 214 విమానాలతో రెండోసారి దివాలా దరఖాస్తు చేసింది. సంస్థను బతికించుకునే ప్రయత్నంలో భాగంగా విమానాల సంఖ్యను భారీగా తగ్గించాలని (సుమారు 80 జెట్లకు) నిర్ణయించింది. ఇది గతంలో ఉన్న విమానాల సంఖ్యలో మూడింట ఒక వంతు మాత్రమే.ఇదీ చదవండి: టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యంప్రయాణికులకు హెచ్చరికప్రస్తుతానికి స్పిరిట్ ఎయిర్లైన్స్ టిక్కెట్లు విక్రయిస్తున్నప్పటికీ, నిపుణులు ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు కంపెనీ కార్యకలాపాలు ఎప్పుడైనా హఠాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రయాణికులు ముందే 'బ్యాకప్ ప్లాన్' సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.కాగా ఒకప్పుడు 200 పైగా విమానాలతో వెలిగిన ఈ సంస్థ, ఇప్పుడు మనుగడ కోసం పోరాడుతోంది. తక్కువ ధరకే ప్రయాణించే వారు ఎక్కువగా స్పిరిట్ను ఎంచుకునేవారు. ఒకవేళ ఇది మూతపడితే, ఇతర విమాన సంస్థల్లో పోటీ లేక టిక్కెట్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం -
29 ఏళ్ల తర్వాత నెట్ఫ్లిక్స్కు బైబై చెప్పిన కోఫౌండర్
ఆన్లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ను దాదాపు మూడు దశాబ్దాల పాటు అగ్రపథంలో నడిపిన సహ-వ్యవస్థాపకుడు, ప్రస్తుత ఛైర్మన్ రీడ్ హేస్టింగ్స్ (65) తన 29 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన సంస్థ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ కీలక పరిణామం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. బలమైన ఆదాయ గణాంకాలు నమోదైనప్పటికీ హేస్టింగ్స్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తతో సంస్థ షేరు విలువ ఒక్కరోజులో ఏకంగా 9% పడిపోయింది.కీలక సమయంలో వీడ్కోలువార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో కంపెనీ విలీన చర్చలు విఫలమై పోటీ పెరిగిన క్లిష్ట సమయంలో హేస్టింగ్స్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. రాబోయే జూన్ వార్షిక సమావేశంలో ఆయన తిరిగి ఎన్నికలకు నిలబడబోరని, ఇకపై తన సమయాన్ని దాతృత్వ కార్యక్రమాలకు, ఇతర వ్యాపారేతర కార్యకలాపాలకు కేటాయిస్తానని స్పష్టం చేశారు.డీవీడీ అద్దె నుంచి స్ట్రీమింగ్ సామ్రాజ్యం వరకు..1997లో ఒక చిన్న డీవీడీ-బై-మెయిల్ సర్వీస్గా నెట్ఫ్లిక్స్ను ప్రారంభించిన హేస్టింగ్స్ ప్రపంచ వినోద రంగం గమనాన్ని మార్చేశారు. 2011లో ‘క్విక్ స్టార్’ నిర్ణయం వంటి వైఫల్యాలు ఎదురైనా, కొవిడ్ మహమ్మారి వంటి కీలక సమయాల్లో సంస్థను లాభాల బాట పట్టించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పుస్తకం ‘నో రూల్స్ రూల్స్’లో పేర్కొన్నట్లుగా ఉత్పాదకతతో కూడిన పని సంస్కృతిని ఆయన సృష్టించారు.భవిష్యత్తు లక్ష్యాలుహేస్టింగ్స్ వారసుడు కంపెనీ కో-సీఈఓ గ్రెగ్ పీటర్స్ సంస్థ వృద్ధిపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక బిలియన్ మంది ప్రేక్షకులను చేరుకునే సామర్థ్యం తమకుందని ఆయన పేర్కొన్నారు. 2026 నాటికి ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం 3 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కేవలం సినిమాలు, సిరీస్ లే కాకుండా జపాన్ వరల్డ్ బేస్ బాల్ క్లాసిక్ వంటి ప్రత్యక్ష క్రీడలు, వీడియో పాడ్కాస్ట్లపై సంస్థ దృష్టి పెడుతోంది.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి! -
వేదాంత ఛైర్మన్పై ఎఫ్ఐఆర్ నమోదు
ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో ఉన్న వేదాంత గ్రూప్ విద్యుత్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్తో పాటు పలువురు ఉన్నతాధికారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏప్రిల్ 14న జరిగిన ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. సింగితరై గ్రామంలోని ప్లాంట్లో బాయిలర్ నుంచి టర్బైన్కు అధిక పీడనంతో ఆవిరిని తీసుకెళ్లే స్టీల్ ట్యూబ్ ఒక్కసారిగా పేలడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.చట్టపరమైన చర్యలుశక్తి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రఫుల్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం, దబ్రా పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. ప్లాంట్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కొన్ని సెక్షన్లను నమోదు చేశారు.సెక్షన్ 106: నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం కావడం.సెక్షన్ 289: యంత్రాల నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించడం.సెక్షన్ 3(5): కామన్ ఇంటెన్షన్‘ఎఫ్ఐఆర్లో ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సహా 8 నుంచి 10 మంది వ్యక్తుల పేర్లను చేర్చాము. దర్యాప్తులో మరింత మంది బాధ్యుల పేర్లు వెలుగులోకి వస్తే వారిని కూడా నిందితులుగా చేరుస్తాం’ అని ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ వెల్లడించారు.దర్యాప్తు ముమ్మరంఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను విశ్లేషించేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పేలుడు కారణాలను అన్వేషించడానికి నిపుణులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతుల పోస్టుమార్టం నివేదికలు, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ విశ్లేషణ, పారిశ్రామిక భద్రతా విభాగం ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ నివేదికలు అందిన తర్వాత అవసరమైతే మరిన్ని కఠిన సెక్షన్లను జోడించే అవకాశం ఉంది.ఈ ప్రమాదంపై రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ప్లాంట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేవలం ఎఫ్ఐఆర్ నమోదుతో సరిపెట్టకుండా ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని పట్టుబట్టింది. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం అందించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరింది.ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట! -
విప్రో బంపర్ బైబ్యాక్!
ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు తెరతీసింది. ఇందుకు కంపెనీ చరిత్రలోనే అత్యధిక స్థాయిలో రూ. 15,000 కోట్లు వెచ్చించనుంది. మరోపక్క క్యూ4లో నికర లాభం 2 శాతం నీరసించి రూ.3,502 కోట్లకు చేరింది. సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో భారీస్థాయిలో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను ప్రకటించింది. ఒక్కో షేరుకీ రూ. 250 ధరలో 5 శాతానికిపైగా వాటా(దాదాపు 60 కోట్ల షేర్లు) కొనుగోలు చేయనుంది. ఇందుకు ఏకంగా రూ. 15,000 కోట్లు కేటాయించింది. గురువారం మార్కెట్ ధర రూ. 210తో పోలిస్తే 18 శాతం ప్రీమియంతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ను చేపట్టనుంది. చెల్లించిన మూలధనంలో 5.7 శాతం వాటాను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు విప్రో సీఎఫ్వో అపర్ణ అయ్యర్ తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో బైబ్యాక్ పూర్తికాగలదని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేశారు. బైబ్యాక్లో ప్రమోటర్, సంబంధిత గ్రూప్ పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2026–27) తొలి త్రైమాసికంలో ఐటీ సర్వీసుల బిజినెస్ నామమాత్ర క్షీణత(2 శాతం) లేదా యథాతథంగా 259.7–265.1 కోట్ల డాలర్లమధ్య నమోదుకాగలదని విప్రో తాజాగా అంచనా(గైడెన్స్) వేసింది. లాభం ఫ్లాట్గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో విప్రో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం వార్షికంగా 2 శాతం నీరసించి రూ. 3,502 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2025–26) ఇదే కాలంలో రూ. 3,570 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 24,236 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 22,504 కోట్ల టర్నోవర్ అందుకుంది. త్రైమాసికవారీగా క్యూ4లో విప్రో నికర లాభం 12 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున బలపడ్డాయి.ఇతర విశేషాలుక్యూ4లో ఐటీ సర్వీసుల ఆదాయం 2 శాతం వార్షిక వృద్ధితో 265.1 కోట్ల డాలర్లకు చేరింది.3 శాతం వృద్ధితో 345.5 కోట్ల డాలర్ల విలువైన బుకింగ్స్(డీల్స్) నమోదయ్యాయి.మార్చితో ముగిసిన 2025–26లో ఫ్లాట్గా రూ. 13,197 కోట్ల నికర లాభం ఆర్జించింది.మొత్తం ఆదాయం 4 శాతం పుంజుకుని రూ. 92,624 కోట్లను తాకింది.కంపెనీ సిబ్బంది సంఖ్య 2,33,346 నుంచి 2,42,156కు బలపడింది.మొత్తం 7,500 మంది ఫ్రెషర్స్ను నియమించుకుంది. క్యూ4లో 3,000 మందికి చోటిచ్చింది.లాభాలకు సవాళ్లు...లాభాలపై రాజకీయ, భౌగోళిక, పాలసీ సంబంధ సవాళ్లు ప్రభావం చూపాయి. అయితే ఐటీ వ్యయాలు నిలకడగా నమోదవుతున్నాయి. సాధారణ రీతిలోనే ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్) ఫలితాలు బలహీనంగా వెలువడనున్నాయి. ఇందుకు యూఎస్ డీల్స్ ఆలస్యం, క్లయింట్ సమస్యలు ప్రభావం చూపనున్నాయి. – విప్రో సీఈవో, ఎండీ శ్రీని పాలియాఐటీ దిగ్గజాల బైబ్యాక్ తీరిలావిప్రో తాజా బైబ్యాక్కు టెండర్ మార్గంలో తెరతీయనుంది. ఇంతక్రితం 2023లోనూ రూ. 12,000 కోట్లతో ఈక్విటీ షేర్ల బైబ్యాక్ చేపట్టింది. ఇక ఇన్ఫోసిస్ గతేడాది బైబ్యాక్కు రూ. 18,000 కోట్లు వెచ్చించింది. వెరసి అతి భారీ బైబ్యాక్ చేపట్టిన దేశీ కంపెనీగా రికార్డ్ నెలకొల్పింది. 2023 డిసెంబర్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 17,000 కోట్లతో బైబ్యాక్ను పూర్తి చేసింది. మరో ఐటీ కంపెనీ సైయెంట్ సైతం బైబ్యాక్ ప్రతిపాదన పరిశీలనకు ఈ నెల 23న బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం!ఇదీ చదవండి: ‘న్యూడిఫై’ యాప్లతో కాసుల వేట! -
పీఎఫ్సీలో మెజారిటీ వాటాకు సై
న్యూఢిల్లీ: విద్యుత్ రంగ ఎన్బీఎఫ్సీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ)లో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకునే యోచనలో ఉంది. విద్యుత్ రంగ పీఎస్యూ దిగ్గజాలు పీఎఫ్సీతోపాటు.. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ)లో పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026–27 బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం పీఎఫ్సీలో ఆర్ఈసీ విలీనాన్ని చేపట్టనుంది. అయితే అతిపెద్ద పీఎస్యూ ఎన్బీఎఫ్సీ దిగ్గజంగా ఆవిర్భవించనున్న విలీన సంస్థలో ప్రభుత్వం మెజారిటీ వాటా నిలుపుకోవాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇందుకు అనుగుణంగా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రమోటర్గా 51 శాతం వాటాను కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వానికి పీఎఫ్సీ ప్రిఫరెన్స్ షేర్ల జారీసహా.. వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకున్న మరో అవకాశం ప్రభుత్వానికి కొత్తగా ఈక్విటీ షేర్ల జారీకాగా.. తద్వారా మెజారిటీ వాటాను నిలుపుకోవచ్చని తెలియజేశారు. ప్రభుత్వ వాటా ఇలా కంపెనీల చట్టం ప్రకారం పీఎస్యూగా గుర్తించేందుకు చెల్లించిన మూలధనంలో ప్రభుత్వానికి కనీసం 51 శాతం వాటా ఉండాలి. ప్రస్తుతం పీఎఫ్సీలో ప్రభుత్వ వాటా 55.99 శాతంకాగా.. ఆర్ఈసీలో 52.63 శాతం వాటా కలిగి ఉంది. రెండు సంస్థలలోనూ మిగిలిన వాటా సాధారణ వాటాదారుల(పబ్లిక్) వద్ద ఉంది. 2025 డిసెంబర్31కల్లా పీఎఫ్సీ కన్సాలిడేటెడ్ లోన్ అసెట్ బుక్ రూ. 11.51 లక్షల కోట్లను తాకగా.. ఆర్ఈసీ రూ. 5.82 లక్షల కోట్ల అసెట్ బుక్ను కలిగి ఉంది. విద్యుత్ రంగ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ సౌకర్యాలు కల్పించే పీఎఫ్సీ 20 శాతం మార్కెట్ వాటాను ఆక్రమిస్తోంది. విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్ఈసీ ఫైనాన్సింగ్ సర్వీసులు అందించే సంగతి తెలిసిందే. -
ఆతిథ్యం, ఎయిర్లైన్స్పై వార్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 తర్వాత నుంచి చూస్తే 15–20 శాతం మేర విదేశీ పర్యాటకులు తగ్గిపోయారు. దీని ఫలితంగా ఒక్క ఎయిర్లైన్స్ రంగమే రూ.18,000 కోట్ల వ్యాపారాన్ని నష్టపోతుందన్నది అంచనా. అతిథ్య పరిశ్రమపైనా ప్రభావం ఉంటుందని తాజాగా విడుదలైన ఒక నివేదిక అంచనా వేసింది. విమాన ప్రయాణాలను రద్దు చేసుకోవడం, గగనతలంపై ఆంక్షలతో అంతర్జాతీయ ఎయిర్లైన్ సర్వీసులు మార్గాలను మార్చుకుని వెళ్లాల్సి వస్తుండడం ఇవన్నీ ఎయిర్లైన్స్ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. దీని ఫలితంగా ప్రయాణ సమయం 2–4 గంటలు పెరుగుతోందని, ఇంధన, నిర్వహణ ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తోందని ఈ నివేదిక అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తతను అనుసరిస్తున్నారు. తమ పర్యటలను వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు సుదూర ప్రాంతాల కంటే థాయ్లాండ్, సింగపూర్, వియత్నాం వంటి తక్కువ దూరంలోని ప్రాంతాలకు వెళ్లి రావడానికే మొగ్గు చూపుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. రెస్టారెంట్లకూ కష్టాలు.. రెస్టారెంట్, ఫుడ్ సర్వీసెస్ (ఆహార విక్రయ సంస్థలు) సంస్థలు సైతం పశ్చిమాసియా యద్ధం తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా వీటి వ్యయాలు 10–15 శాతం మేర పెరిగాయి. దిగుమతి చేసుకుంటున్న ముడి పదార్థాలు, రవాణా, ఇంధన ధరలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) అంచనా. ముఖ్యంగా వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో సమస్యలు రెస్టారెంట్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నట్టు ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ సాగర్ దర్యాని తెలిపారు. 10 శాతం రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయని, 60–70 శాతం రెస్టారెంట్లు ఇండక్షన్ కుకింగ్, ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లినట్టు పేర్కొన్నారు. పరిమిత సరఫరా నేపథ్యంలో మెనూ తగ్గించుకుని, తక్కువ సమయం పాటు కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఉపాధిపైనా ప్రభావం.. రెస్టారెంట్ల రంగంలో రోజువారీ రూ.2,650 కోట్ల కార్యకలాపాలు కొనసాగుతుంటాయని ఈ నివేదిక పేర్కొంది. అంటే నెలవారీ రూ.79,000 కోట్లు. ఈ రంగంలో 85 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎక్కువ కాలం పాటు ఈ ప్రతికూలతలు కొనసాగితే 5–7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. అంతేకాదు రెస్టారెంట్ల విస్తరణపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది. కాగా, ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు గాను.. మరిన్ని అంతర్జాతీయ మార్గాలకు ఎయిర్లైన్స్ కార్యకలాపాలను విస్తరించడంతోపాటు, ఎంఎస్ఎంఈలకు మరింత సులభంగా రుణాలు అందేలా చూడాలని ఈ నివేదిక సూచించింది. దేశీ పర్యాటకం మెరుగ్గానే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పర్యాటకం తిరిగి పూర్వపు స్థితికి రావడానికి మరో 6 నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
TCS నాసిక్ కేసు: వెలుగులోకి సంచలన విషయాలు!
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నాసిక్ శాఖకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణల ప్రకారం.. అక్కడ కొంతమంది టీమ్ లీడర్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మహిళా ఉద్యోగులపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.మహిళలను టీమ్ లీడర్ల డెస్క్ దగ్గరకు పిలిచే సమయంలో అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించేవారని చెప్పారు. ఒక ప్రొఫెషనల్ కార్యాలయంలో ఊహించలేని విధంగా అసభ్య ప్రవర్తన కొనసాగిందని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా తౌసిఫ్ అత్తర్ అనే వ్యక్తి హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని, పండుగల సమయంలో చీరలు లేదా బొట్టులు ధరించిన మహిళలను అవమానించేవాడని ఆరోపించారు.ఒక సహోద్యోగి కృష్ణ రుద్రాక్ష మాలను ధరించేవాడని, తరువాత మత మార్పిడి చేసుకున్నాడని కూడా ఆమె పేర్కొన్నారు. నిదా ఖాన్ అనే ఉద్యోగి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె హెచ్ఆర్ కాకపోయినా, ఇతర విభాగాలకు మారేందుకు ప్రయత్నించడం అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు.ఆఫీసులో భద్రత పేరుతో ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లు, బ్యాగులు, లంచ్ బాక్సులు బయట ఉంచాల్సి వచ్చేదని, దీని వల్ల లోపల జరిగే కార్యకలాపాలు రికార్డు కాకుండా ఉండేవని తెలిపారు. డానిష్, రాజా వంటి ఉద్యోగులు వీకెండ్లలో హోటళ్లు బుక్ చేసి మహిళలను ఒత్తిడి చేసి తీసుకెళ్లేవారని కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనల వల్ల కార్యాలయ వాతావరణం పూర్తిగా విషపూరితంగా మారిందని, ఉద్యోగం వదిలిన తర్వాత మాత్రమే తాను సురక్షితంగా ఉన్నానని ఆ మహిళ తెలిపారు. ఇంత పెద్ద సంస్థలో ఉన్న ఉన్నతాధికారులకు ఈ వ్యవహారాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆమె ప్రశ్నించారు.ఈ కేసు ఒక్క వ్యక్తి ఆరోపణలతో మాత్రమే కాకుండా.. మొత్తం ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2026 వరకు జరిగిన మానసిక, లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయబడింది.ఇప్పటివరకు ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో తౌసిఫ్ అత్తర్, డానిష్ షేఖ్, రాజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేఖ్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ, నిదా ఖాన్ ఉన్నారు. ఇంకా ఒక మహిళా ఉద్యోగి అదృశ్యంగా ఉండటం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మారుస్తోంది. కాగా అరెస్టు అయిన వారిని సంస్థ సస్పెండ్ చేసింది. -
విప్రో భారీ ఆఫర్: రూ.15,000 కోట్లతో షేర్ల బైబ్యాక్
ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో తన వాటాదారులకు తీపి కబురు అందించింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక (Q4FY26) ఫలితాల సందర్భంగా ఏకంగా రూ. 15,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.బైబ్యాక్ ముఖ్యాంశాలువిప్రో బైబ్యాక్ చేసే షేర్ల మొత్తం విలువ రూ. 15,000 కోట్లు. బైబ్యాక్ ధర ఒక్కో షేరుకు రూ. 250. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 210.15 తో పోలిస్తే ఇది 19 శాతం అధికం. మొత్తం 60 కోట్ల షేర్లను (మొత్తం ఈక్విటీలో 5.7 శాతం) కంపెనీ వెనక్కి తీసుకోనుంది. 'టెండర్ ఆఫర్' మార్గంలో దామాషా పద్ధతిలో ఈ బైబ్యాక్ ప్రక్రియ జరగనుంది. రికార్డు తేదీ నాటికి షేర్లు కలిగిన వారు, ఏడీఆర్ (ADR) హోల్డర్లు ఇందులో పాల్గొనవచ్చు.క్యూ4 ఫలితాలుమార్చి 2026తో ముగిసిన త్రైమాసికంలో విప్రో ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నికర లాభం గత ఏడాది ఇదే కాలంలో రూ. 3,569.6 కోట్లుగా ఉండగా, ఇప్పుడు 1.89 శాతం తగ్గి రూ. 3,501.8 కోట్లుగా నమోదైంది. మరోవైపు కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ. 24,236.3 కోట్లకు చేరింది. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 13,197.4 కోట్ల నికర లాభాన్ని, రూ. 92,624 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.ఏఐ దిశగా అడుగులుఫలితాల సందర్భంగా విప్రో సీఈఓ, ఎండీ శ్రీని పల్లియా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వస్తున్న మార్పులు క్లయింట్ల ప్రాధాన్యతలను మారుస్తున్నాయని తెలిపారు. ‘మేము 'ఏఐ-ఫస్ట్' వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. మా ఏఐ నేటివ్ బిజినెస్ యూనిట్ ద్వారా 'సర్వీసెస్-యాజ్-ఎ-సాఫ్ట్వేర్' మోడల్కు పెద్దపీట వేస్తున్నాం. ఓలం గ్రూప్తో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం మా భవిష్యత్తు పెట్టుబడులకు నిదర్శనం’ అని ఆయన పేర్కొన్నారు.గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి విప్రో షేరు ధర స్వల్పంగా పెరిగి రూ. 210.20 వద్ద స్థిరపడింది. -
ఇన్ఫోసిస్కు బ్రాండ్ అంబాసిడర్గా అల్కరాజ్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ ఏడు సార్లు గ్రాండ్ శ్లామ్ చాంపియన్గా నిల్చిన టెన్నిస్ దిగ్గజం కార్లోస్ అల్కరాజ్ని తాజాగా తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. దీనితో పాటు ఏఐ ఆధారిత మ్యాచ్ అనలిటిక్స్, మ్యాచ్ల కోసం సన్నద్ధం కావడానికి వ్యక్తిగత స్థాయిలో పనితీరును మదింపు చేసేందుకు ఉపయోగపడే అప్లికేషన్ని ఆయన తో కలిసి తమ ఏఐ సాంకేతికత టొపాజ్ సహా యంతో అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది.అలాగే సామాజిక ప్రయోజనాల కోసం టె క్నాలజీని ఉపయోగించుకునే దిశగా ఇన్ఫోసిస్, అల్కరాజ్ ఫౌండేషన్ సంయుక్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఏఐ ద్వారా టెన్నిస్ స్థాయిని మరింతగా పెంచాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఆయనతో భాగస్వామ్యం కీలకమని ఇన్ఫీ తెలిపింది. -
కంపెనీల్లో ఇదేం నీతి? దెబ్బకు హెచ్ఆర్ సైలెంట్!
కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల రాజీనామాలు, నోటీసు పీరియడ్ల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన కంటెంట్ స్ట్రాటజిస్ట్ నిషాంత్ జోషి పంచుకున్న ఒక ఘటన ఇందుకు ఆజ్యం పోసింది. తన సహోద్యోగికి కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు, 90 రోజుల నోటీసు పీరియడ్ తగ్గించాలని కోరగా.. అది ‘వృత్తిపరమైన నైతికత’ (Professional Ethics) అని హెచ్ఆర్ విభాగం బదులిచ్చింది. దీనికి ఆ ఉద్యోగి స్పందిస్తూ.. ‘గత నెలలో కంపెనీ మొత్తం డిజైన్ టీమ్ను ఉన్నపళంగా తొలగించినప్పుడు ఈ నైతికత ఏమైంది?’ అని ప్రశ్నించడంతో హెచ్ఆర్ నోట మాట రాలేదని జోషి పేర్కొన్నారు.ద్వంద్వ నీతిపై ఆగ్రహంఉద్యోగులు వెళ్లేటప్పుడు మూడు నెలల సమయం కావాలని కోరే కంపెనీలు, వారిని తొలగించేటప్పుడు మాత్రం కనీస సమయం కూడా ఇవ్వకపోవడంపై నిషాంత్ జోషి విమర్శలు గుప్పించారు. ‘సంస్థ మిమ్మల్ని తీసివేయాలనుకున్నప్పుడు తెల్లవారుజామునే మీ ఆఫీస్ అకౌంట్లు అన్నీ డిసేబుల్ అవుతాయి.. అక్కడ అప్పగింతలు (Handover) ఉండవు, గౌరవం ఉండదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది పని సజావుగా సాగడం కోసం కంటే, ఉద్యోగి వేరే అవకాశాలకు వెళ్లకుండా అడ్డుకోవడానికే ఎక్కువగా ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.నెటిజన్ల మద్దతుఈ పోస్ట్పై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. అనేకమంది తమ సొంత అనుభవాలను పంచుకుంటూ, కొత్తగా చేర్చుకునే అభ్యర్థి వెంటనే రావాలని కోరుకునే సంస్థలు, పాత ఉద్యోగిని మాత్రం 90 రోజులు వదలకపోవడం విడ్డూరమని మండిపడుతున్నారు. ఐటీ కన్సల్టింగ్ రంగంలో మొదలైన ఈ 90 రోజుల నిబంధన ఇప్పుడు అన్ని రంగాలకు పాకి ఉద్యోగులను వేధించే సాధనంగా మారిందని మరికొందరు విమర్శించారు. వృత్తిపరమైన నైతికత అనేది కేవలం ఉద్యోగులకే కాదు, సంస్థలకు కూడా వర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మార్పు అవసరంఈ చర్చ ద్వారా కార్పొరేట్ నిబంధనల్లో మార్పు రావాల్సిన అవసరాన్ని నెటిజన్లు నొక్కి చెప్పారు. 90 రోజుల నోటీసు పీరియడ్ అనేది కాలం చెల్లిన పద్ధతి అని, ఇది ఉత్పాదకతను తగ్గించడమే కాకుండా ఉద్యోగి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీలు తమ ప్రయోజనాలతో పాటు ఉద్యోగుల కెరీర్ వృద్ధిని కూడా దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకృతం చేయాలని, పరస్పర అవగాహనతో కూడిన పని వాతావరణం ఉండాలని ఈ చర్చ సారాంశం.ఇదీ చదవండి: ‘టెక్ మహీంద్రా’పైనా తీవ్ర ఆరోపణలు.. -
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్.. సీఈఓ వివరణ
ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ ప్రస్తుతం తీవ్రమైన సోషల్ మీడియా విమర్శలను ఎదుర్కొంటోంది. కంపెనీకి చెందిన ‘స్టాఫ్ యూనిఫాం అండ్ గ్రూమింగ్ గైడ్’ పేరుతో వైరల్ అవుతున్న ఒక డాక్యుమెంట్ మతపరమైన వివక్షకు తావిచ్చేలా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. హిందూ సంప్రదాయాలైన బిందీ, తిలకంపై నిషేధం విధిస్తూ హిజాబ్కు అనుమతినివ్వడంపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఈ వివాదం ముదరడంతో సంస్థ వ్యవస్థాపకుడు పీయూష్ బన్సాల్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.వివాదానికి కారణం ఏమిటి?ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం.. లెన్స్కార్ట్ అంతర్గత మార్గదర్శకాల్లో స్టోర్ ఉద్యోగులకు సంబంధించి కొన్ని వివాదాస్పద నిబంధనలు వెలుగులోకి వచ్చాయి. ముస్లిం మహిళా ఉద్యోగులు విధుల్లో ఉన్నప్పుడు నలుపు రంగు హిజాబ్, అలాగే సిక్కు ఉద్యోగులు నల్లటి తలపాగాలను ధరించవచ్చని గైడ్లో పేర్కొన్నారు. అదే సమయంలో మహిళా ఉద్యోగులు బిందీలు (స్టిక్కర్లు) పెట్టుకోకూడదని, పురుషులు లేదా మహిళలు ఎవరూ మతపరమైన తిలకం లేదా టిక్కా ధరించకూడదని నిబంధనలు స్పష్టం చేశాయి. భారతీయ సంస్కృతిలో భాగమైన బిందీ, తిలకాలను నిషేధించి ఇతర మతపరమైన గుర్తులను అనుమతించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.I want to speak directly that this document does not reflect our present guidelines.Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…— Peyush Bansal (@peyushbansal) April 15, 2026పీయూష్ బన్సాల్ సంజాయిషీఈ వివాదంపై ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించిన కంపెనీ సీఈఓ పీయూష్ బన్సాల్, వైరల్ అవుతున్న పత్రం తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నారు. ‘మా వస్త్రధారణ విధానం సంవత్సరాలుగా మారుతూ వస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్నది పాత డాక్యుమెంట్. ఇది మా కంపెనీ ప్రస్తుత వైఖరిని ప్రతిబింబించదు. బిందీ లేదా తిలకం ధరించడంపై మా ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. దీనివల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు కోరుతున్నాం’ అని ఆయన వివరించారు. -
బీబీసీలో 2,000 మంది ఉద్యోగులపై వేటు!
ప్రపంచ ప్రఖ్యాత ప్రసార సంస్థ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఈ సంస్థ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దాదాపు 500 మిలియన్ పౌండ్ల (677 మిలియన్ డాలర్లు) వార్షిక బడ్జెట్లో 10 శాతం మేర పొదుపు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.దశాబ్ద కాలంలోనే భారీ కోతలుబీబీసీ చరిత్రలో గత పదేళ్ల కాలంలో ఇవే అతిపెద్ద తొలగింపులు. తాత్కాలిక డైరెక్టర్ జనరల్ రోడ్రి తల్ఫాన్ డేవిస్ సిబ్బందికి పంపిన ఈమెయిల్లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘ఈ నిర్ణయం సిబ్బందిలో అనిశ్చితిని సృష్టిస్తుందని నాకు తెలుసు. కానీ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పట్ల మేము పారదర్శకంగా ఉండాలనుకుంటున్నాం’ అని డేవిస్ పేర్కొన్నారు.కారణాలు ఏమిటి?అదుపులో లేని ద్రవ్యోల్బణం.లైసెన్స్ ఫీజు, వాణిజ్య ఆదాయంపై పెరిగిన ఒత్తిళ్లు.ప్రపంచవ్యాప్తంగా అస్థిరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ.నాయకత్వ మార్పుగత జనవరి 6న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎడిటింగ్లో జరిగిన పొరపాట్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో న్యూస్ హెడ్ డెబోరా టర్నెస్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రంప్ ఇప్పటికే బీబీసీపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేయడం సంస్థకు మరింత తలనొప్పిగా మారింది. ఈ సంక్షోభ పరిస్థితుల్లో గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాట్ బ్రిటిన్ వచ్చే నెలలో కొత్త డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 1, 2027 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో మరింత కఠినమైన పొదుపు చర్యలు ఉంటాయని సంస్థ సంకేతాలిచ్చింది.ఇదీ చదవండి: కాకమీదున్న పసిడి ధరలు -
కార్పొరేట్ మిడ్ లెవెల్ మంత్ర
న్యూఢిల్లీ: అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) పెరుగుతున్న నేపథ్యంలో దేశీ కార్పొరేట్ కంపెనీలు నియామకాల విషయంలో విభిన్న పంథాలో వెళ్తున్నాయి. ప్రధానంగా మధ్య స్థాయి నిపుణులను రిక్రూట్ చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. స్టాఫింగ్ సర్వీసెస్, హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ జీనియస్ హెచ్ఆర్టెక్ నివేదిలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న సంస్థల్లో 49 శాతం కంపెనీలు తాము మిడ్ లెవెల్ ప్రొఫెషనల్స్ని హైర్ చేసుకోవడంపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిపాయి. సిబ్బందిని పెంచుకోవడానికి సంబంధించి 10–15 శాతానికి మించి గణనీయంగా రిక్రూట్ చేసుకోనున్నట్లు 28 శాతం సంస్థలు, 0–5 శాతం వరకు పెంచుకునే అవకాశాలున్నట్లు 43 శాతం సంస్థలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వివిధ పరిశ్రమల నుంచి 2,359 మంది సీఎక్స్వో స్థాయి లీడర్లు, సీనియర్ ప్రొఫెషనల్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. దీని ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనాల పెంపు ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా. 34 శాతం సంస్థలు వేతనాల పెంపు 10 శాతానికి మించి ఉండేలా ప్రణాళికలు వేసుకుంటుండగా, 46 శాతం సంస్థల్లో ఒక మోస్తరుగా 5–10 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. రిపోర్టులోని మరిన్ని కీలకాంశాలు.. → వేతనాల పెంపు విషయంలో రెగ్యులేటరీ, కార్మిక చట్ట సంస్కరణలు కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది. మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశం 48 శాతంగా ఉండగా, జూనియర్, సీనియర్ స్థాయుల్లో వరుసగా 26, 22 శాతంగా నమోదైంది. → అట్రిషన్ అంశం చాలా సంస్థలకు ఆందోళనకర విషయంగా ఉంటోంది. మెజారిటీ 55 శాతం సంస్థలు 10–20 శాతం మేర అట్రిషన్ ఉంటుందని అంచనా వేస్తుండగా, ఇది 20 శాతానికి మించి ఉంటుందని 15 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగుల సెగ్మెంట్లో ఇది ఎక్కువగా ఉంటుందని 67 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. ప్రాంతీయంగా చూస్తే దక్షిణాది జోన్లో అత్యధికంగా అట్రిషన్ ఉంటుందని 55 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. ఉద్యోగుల ఆకాంక్షలు కూడా దీన్ని ప్రభావితం చేస్తున్నాయి. పనిపరంగా వెసులుబాట్లు, లక్ష్యాలు, కెరియర్లో వేగంగా పురోగమించేందుకు అవకాశాలు మొదలైన విషయాల్లో 50 శాతం పైగా ఉద్యోగుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి. ముఖ్యంగా జెన్ అల్ఫా, జెన్ జెడ్ తరానికి చెందిన యువ ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. ఉద్యోగులను అట్టే పెట్టుకోవాలంటే నిరంతరం వారితో ఎంగేజ్ కావడం, ఫీడ్బ్యాక్ ఇస్తుండటం, నేర్చుకునే అవకాశాలు కల్పించడంలాంటివి కీలకాంశాలుగా ఉంటున్నాయని 38 శాతం కంపెనీలు పేర్కొన్నాయి. → ఉద్యోగ భద్రత గురించి ఆందోళనపై మిశ్రమాభిప్రాయాలు నెలకొన్నాయి. వేతనం, వృద్ధి అంశాలతో పోలిస్తే అట్రిషన్పై దీని ప్రభావం ఒక మోస్తరుగానే ఉంటుందని లేదా పరిమిత స్థాయిలోనే ఉంటోందని చెరి 43 శాతం సంస్థలు వెల్లడించాయి. → 2026–27లో డేటా ఆధారిత వ్యూహాలతో, మిడ్ లెవెల్ నిపుణులు, డిజిటల్ సామర్థ్యాలపై ప్రధానంగా దృష్టి పెడుతూ, మారే వ్యాపార అవసరాలకు అనుగుణంగా హైరింగ్ ఆచితూచి ఉంటుంది. అట్రిషన్ రేటు పెరుగుతుండటమనేది మరింత పటిష్టమైన ప్లానింగ్, రిటెన్షన్ (ఉద్యోగులు వీడిపోకుండా అట్టే పెట్టుకోవడం) ఆవశ్యకతను తెలియజేస్తోంది. → పరిస్థితి, అవసరాలను బట్టి హైర్ చేసుకోవడం, పర్మనెంట్–ప్రాజెక్ట్ ఆధారిత నియామకాల మధ్య సమతౌల్యత పాటించే దిశగా పరిశ్రమ మళ్లుతోంది. వేగం, నైపుణ్యాలు, టెక్నాలజీని అందిపుచ్చుకునే సామర్థ్యాలు, సంస్థ నిలకడగా వృద్ధి చెందేందుకు తోడ్పడే సామర్థ్యాలు మొదలైనవి హైరింగ్ని ప్రభావితం చేస్తున్నాయి. → డైవర్సిఫికేషన్కి పెద్ద పీట వేస్తూ పురుషులు, మహిళా ఉద్యోగుల హైరింగ్లో పురుషులు, మహిళల నిష్పత్తి 50:50 స్థాయిలో ఉండేలా 27 శాతం కంపెనీలు చూసుకుంటున్నాయి. ఇది 60:40 స్థాయిలో ఉండేలా చూసుకునేందుకు 31 శాతం కంపెనీలు ప్రయతి్నస్తున్నాయి. అయితే, ఇప్పటికీ పురుషులను రిక్రూట్ చేసుకోవడం వైపే చాలా మటుకు పరిశ్రమలు ఒకింత ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. → చెరో 32 శాతం వాటాతో పశ్చిమ, ఉత్తరాదిలో హైరింగ్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండనున్నాయి. తూర్పు, దక్షిణాది ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
దుబాయ్లో ‘బంగారు పండుగ’.. ఆఫర్లే ఆఫర్లు!
ప్రపంచ పసిడి రాజధానిగా పిలిచే దుబాయ్లో అక్షయ తృతీయ సందడి మొదలైంది. ఏప్రిల్ 19న రానున్న ఈ శుభదినాన్ని పురస్కరించుకుని, అక్కడి ప్రముఖ జ్యువెలరీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. భారతీయ సమాజానికి ఎంతో ముఖ్యమైన ఈ పండుగ నాడు బంగారం కొనుగోలు చేయడం శ్రేయస్కరమని భావిస్తారు కాబట్టి, కస్టమర్లను ఆకర్షించేందుకు జీరో మేకింగ్ ఛార్జీలు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ వోచర్లతో మార్కెట్ కళకళలాడుతోంది.ముఖ్యంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్, మీనా జ్యువెలర్స్ వంటి బ్రాండ్లు ప్రత్యేక అక్షయ తృతీయ కలెక్షన్లను పరిచయం చేశాయి. మలబార్ గోల్డ్ వజ్రాల ఆభరణాలపై 40% వరకు తగ్గింపుతో పాటు, పాత బంగారం మార్పిడిపై 'జీరో-లాస్' పథకాన్ని అందిస్తోంది. అలాగే, మీనా జ్యువెలర్స్ వజ్రాలు, పోల్కీ ఆభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణేలను, భారీ కొనుగోళ్లపై గోల్డ్ బార్లను బహుమతిగా ఇస్తోంది.మరోవైపు, సిరోయా జ్యువెలర్స్ వజ్రాల ఆభరణాలపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్ ప్రకటించగా, అరక్కల్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై 80% వరకు తగ్గింపును ఇస్తోంది. మే 5వ తేదీ వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు, కస్టమర్లకు ధరల పరంగా భారీ ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్లు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్నందున నేరుగా షోరూమ్లను సంప్రదించాలని వ్యాపారులు సూచిస్తున్నారు.ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అక్షయ తృతీయ సెంటిమెంట్ వల్ల దుబాయ్లోని భారతీయ ప్రవాసుల నుండి మంచి స్పందన లభిస్తుందని రిటైలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంప్రదాయంతోపా దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో, ఈ ఏడాది కూడా విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రూ.22 వేల కోట్ల లాస్.. ‘టాటా’ ఆదుకోవాల్సిందే..!
ప్రభుత్వ రంగం నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కూడా 'ఎయిర్ ఇండియా' కష్టాలు తీరడం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (మార్చి 31తో ముగిసిన కాలానికి) ఈ విమానయాన సంస్థ ఏకంగా రూ. 22,000 కోట్లకు (2.7 బిలియన్ డాలర్లు)పైగా నష్టాన్ని చవిచూసినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థను గట్టెక్కించేందుకు వాటాదారుల నుంచి భారీగా నిధుల సమీకరణకు ఎయిర్ ఇండియా సిద్ధమవుతున్నట్లు సమాచారం.అంతర్జాతీయ పరిణామాలు, సాంకేతిక సమస్యలు ఎయిర్ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ సమస్యలు, పాకిస్తాన్ తన గగనతలాన్ని భారత విమానాలకు మూసివేయడం వల్ల పెరిగిన ఇంధన ఖర్చులు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం సంస్థను ఆర్థికంగా దెబ్బతీశాయి. ఇవి ఆపరేటింగ్ ఖర్చులను భారీగా పెంచడమే కాకుండా, ఆదాయ మార్గాలను కూడా ప్రభావితం చేశాయి.సంక్షోభ నివారణకు మెజారిటీ వాటాదారు అయిన టాటా గ్రూప్, 25.1 శాతం వాటా కలిగిన సింగపూర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ చర్చలు జరుపుతున్నట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఎయిర్ ఇండియాకు అవసరమైన నగదును ఇన్ఫ్యూషన్ (నగదు ఇంజెక్షన్) రూపంలో అందించే విషయమై ఈ రెండు సంస్థలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భాగస్వామ్య సంస్థల నుండి అందే నిధులు అవసరానికి సరిపోతాయా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.నిధుల సమీకరణ పరిమాణంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వాటాదారుల నుండి వచ్చే మొత్తం సరిపోకపోతే, ఎయిర్ ఇండియా ఇతర ఫైనాన్సింగ్ మార్గాలను వెతకాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అటు టాటా గ్రూప్ గానీ, ఇటు ఎయిర్ ఇండియా ప్రతినిధులు గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
‘వందేభారత్ స్టైల్’ లోకల్ రైలు వచ్చేసింది..
లోకల్ రైళ్లలో సరికొత్త విప్లవం రాబోతోంది. సెమీ హైస్పీడ్ రైలు 'వందే భారత్' తరహాలో, అత్యాధునిక హంగులతో రూపొందించిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలు ముంబై చేరుకుంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, ఆటోమేటిక్ డోర్ వ్యవస్థతో రూపొందించిన ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సిద్ధం చేసింది. ఈ కొత్త రైలుకు సంబంధించిన విశేషాలు మీకోసం..ఆటోమేటిక్ డోర్ క్లోజ్ ముంబై లోకల్ రైళ్లంటేనే తెరచి ఉండే తలుపులు, ఫుట్బోర్డ్ ప్రయాణాలు గుర్తొస్తాయి. ఈ లోకల్ రైళ్లను ముంబై జీవనరేఖగా పేర్కొంటారు. నిత్యం అత్యంత రద్దీగా ఈ రైళ్లు నడుస్తుంటాయి. అయితే, ఇలాంటి ప్రయాణాల కారణంగా ఏటా వందలాది మంది ప్రయాణికులు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా 2025లో ముంబ్రా సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన తర్వాత, రైల్వే శాఖ ఈ ఆటోమేటిక్ డోర్ క్లోజ్ వ్యవస్థపై సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో వందేభారత్ రైలు తరహాలో అన్ని తలుపులు మూసుకుంటే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదు. తలుపుల వద్ద వేలాడుతూ ప్రయాణించే ప్రమాదకర సంస్కృతికి దీనితో అడ్డుకట్ట పడనుంది.ఏసీ లేకపోయినా.. గాలికి డోకా లేదు!నాన్-ఏసీ రైలులో తలుపులు మూసివేస్తే ఉక్కపోత పెరుగుతుందనే ఆందోళనపై రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం మూడు రకాల సాంకేతిక మార్పులు చేశారు. హై-కెపాసిటీ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రైళ్ల కంటే రెట్టింపు సామర్థ్యంతో గంటకు 10,000 క్యూబిక్ మీటర్ల తాజా గాలిని ఇవి లోపలికి పంపిస్తాయి.అలాగే కిటికీల వెడల్పును 900 మిమీ నుంచి 1,900 మిమీకి పెంచారు. దీనివల్ల ప్రయాణికులకు మంచి వ్యూతో పాటు వెలుతురు లభిస్తుంది. ఇక తలుపులకు ప్రత్యేకమైన గాలి రంధ్రాల (లౌవర్స్) అమరిక ఉంటుంది. తద్వారా తలుపులు మూసి ఉన్నా గాలి ప్రసరణ నిరంతరం జరుగుతుంది.ప్రయాణికులకు మరిన్ని ఫీచర్లుకేవలం భద్రతే కాకుండా, ప్రయాణ అనుభవాన్ని మార్చేలా మరిన్ని హంగులను ఈ రైలులో జోడించారు. ఒక కోచ్ నుంచి మరో కోచ్లోకి లోపలి నుంచే వెళ్లేలా వెస్టిబ్యూల్ సౌకర్యం ఉంది. దీనివల్ల రద్దీ ఒకే చోట ఉండకుండా సమానంగా పంపిణీ అవుతుంది. ప్రయాణికుల కోసం లెగ్రూమ్ పెంచి, సీట్లను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. తదుపరి స్టేషన్ వివరాలు, భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు తెలిపే డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు.12 కోచ్ల ఆటోమేటిక్ డోర్ క్లోజ్నాన్ ఏసీ రైలు ప్రస్తుతం కుర్లా కార్ షెడ్కు చేరుకుంది. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) దీనిపై కఠినమైన భద్రతా పరీక్షలు నిర్వహించనుంది. ట్రయల్స్ పూర్తయి, సర్టిఫికేషన్ లభించిన వెంటనే ఈ 'వందే భారత్' స్టైల్ లోకల్ రైలు ముంబై వాసులకు అందుబాటులోకి రానుంది. -
పాటలు వింటూ రైలులో ప్రయాణిస్తున్నారా? జాగ్రత్త!
రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ పాటలు వినే అలవాటు మీకు ఉందా? అయితే ఇకపై మీ పద్ధతి మార్చుకోవాల్సిందే. లేదంటే మీరు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రధానంగా రాత్రి సమయాల్లో ప్రయాణికుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు.. క్వైట్ అవర్స్రైల్వే శాఖ ఉత్తర్వుల ప్రకారం, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కింది నిబంధనలు అమల్లో ఉంటాయి.మొబైల్ ఫోన్లలో పాటలు వినాలన్నా లేదా వీడియోలు చూడాలన్నా కచ్చితంగా ఇయర్ఫోన్స్ లేదా హెడ్ఫోన్స్ వాడాలి. లౌడ్ స్పీకర్ ఆన్ చేయడం నిషిద్ధం.ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు పక్కవారికి ఇబ్బంది కలగకుండా తక్కువ స్వరంతో మాట్లాడాలి. గట్టిగా అరుస్తూ మాట్లాడితే రైల్వే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు.వ్యక్తిగత బెర్త్ లైట్లు మినహా కోచ్లోని మిగిలిన అన్ని లైట్లు ఆపివేయాలి. తద్వారా తోటి ప్రయాణికులకు నిద్రాభంగం కలగకుండా చూడాలి.ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలుఈ నిబంధనలు రిజర్వ్డ్ కోచ్ల్లో ప్రయాణించే అందరికీ వర్తిస్తాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే బాధిత ప్రయాణికులు వెంటనే రైలులో అందుబాటులో ఉండే ఆర్పీఎస్ఎఫ్/ ఆర్పీఎఫ్ సిబ్బందికి లేదా టికెట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. ‘ప్రయాణికుల ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలి. నిబంధనలు అతిక్రమించే వారిపై రైల్వే చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు’ అని రైల్వే ఉన్నతాధికారుల ప్రకటనలో తెలిపారు.రైలు ప్రయాణాన్ని సుఖమయం చేయడంలో తోటి ప్రయాణికుల సహకారం ఎంతో అవసరం. కాబట్టి ప్రయాణికులు ఈ నియమాలను పాటించి చిక్కుల్లో పడకుండా జాగ్రత్త వహించాలని రైల్వే శాఖ కోరుతోంది. రాబోయే రోజుల్లో ఈ నిబంధనల అమలుపై మరింత నిఘా పెంచనున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల! -
కో-ఆపరేటివ్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా
నిబంధనల ఉల్లంఘన విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కఠినంగా వ్యవహరించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్పై రూ.7.50 లక్షల నగదు జరిమానాను విధిస్తూ కేంద్ర బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఖాతాల నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో బ్యాంక్ వైఫల్యం చెందడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్బీఐ స్పష్టం చేసింది.తనిఖీలో వెలుగుచూసిన లోపాలునేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) 31 మార్చి 2025 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయి. తనిఖీ నివేదిక ప్రకారం.. ఖాతాదారుల రిస్క్ ప్రొఫైల్ను కాలానుగుణంగా సమీక్షించే పటిష్టమైన వ్యవస్థను అమలు చేయడంలో బ్యాంక్ విఫలమైంది. ఆర్బీఐ నిర్దేశించిన కేవైసీ, ఇతర నియంత్రణ ప్రమాణాలను పాటించలేదు.ఆర్బీఐ చర్యల నేపథ్యంనిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరుతూ ఆర్బీఐ ఇదివరకే సదరు బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం, వ్యక్తిగత విచారణలో ప్రతినిధులు చేసిన మౌఖిక వాదనలు, వారు సమర్పించిన అదనపు పత్రాలను ఆర్బీఐ క్షుణ్ణంగా పరిశీలించింది. అయితే, బ్యాంక్ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆరోపణలు వాస్తవమని నిర్ధారణ కావడంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.‘ఈ చర్య కేవలం రెగ్యులేటరీ వ్యవస్థలో లోపాలపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. దీనికి బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు లేదా అది జరిపే లావాదేవీల చెల్లుబాటుకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే, ఈ జరిమానా విధించడం వల్ల బ్యాంకుపై భవిష్యత్తులో తీసుకునే ఇతర చట్టపరమైన చర్యలకు ఎటువంటి ఆటంకం కలగదు’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు!
ఐటీ రంగంలో మానవీయ విలువలకు, గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేస్తుందని పేరున్న ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ‘జోహో’లోనూ లేఆఫ్స్ కలకలం రేపుతున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దాదాపు 300 మంది ట్రైనీలను కంపెనీ ఒక్కసారిగా విధుల్లోంచి తొలగించినట్లు తెలుస్తోంది. టెక్ నిపుణుల వేదిక ‘బ్లైండ్’లో బాధిత ఉద్యోగి ఒకరు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఏం జరిగింది? ఈ నిర్ణయానికి కారణమేంటి?బాధితుడి కథనం ప్రకారం.. కంపెనీలో అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాలే ఈ తొలగింపులకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఒక సీనియర్ ఉద్యోగి, ‘మీరు మమ్మల్ని (అనుభవజ్ఞులను) తీసేసి తక్కువ జీతానికే వచ్చే ట్రైనీలతో ఖాళీలు భర్తీ చేయాలని చూస్తున్నారా?’ అని యాజమాన్యాన్ని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ చర్చ జరిగిన కొద్ది రోజుల్లోనే ఫ్రెషర్లను భర్తీ చేస్తున్నారనే అపవాదు పోగొట్టుకోవడానికి కంపెనీ ఏకంగా 300 మంది ట్రైనీలను తొలగించిందని సదరు యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఫ్రెషర్ల ఆవేదన‘నేను ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చాను. ఈ ఉద్యోగం నాకు కెరీర్తోపాటు నా కుటుంబానికి జీవనాధారం. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలను వదులుకుని జోహోలో చేరాను. అక్కడైతే కనీసం బెంచ్ మీద ఉన్నా భద్రత ఉండేది. ఇక్కడ కనీసం నోటీసు పీరియడ్ కూడా ఇవ్వకుండా రోడ్డున పడేశారు’ అని ఒక బాధిత యువకుడు ‘బ్లైండ్’లో వాపోయాడు.వెంబు మాటలకు, చేతలకు పొంతన లేదు!జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తరచుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, చిన్న పట్టణాల నుంచి ప్రతిభను వెలికితీయడం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని బాధితులు విమర్శిస్తున్నారు. ‘చిన్న పట్టణాల నుంచి నియామకాలు చేపడుతున్నామని గొప్పగా చెప్పుకోవడం కాదు, వివరణ లేకుండా వందలాది మంది యువత భవిష్యత్తును దెబ్బతీయడం ఏ రకమైన సంస్కృతి?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.టెక్ వర్గాల్లో తీవ్ర నిరసనఈ వ్యవహారంపై గూగుల్, గోల్డ్మన్ సాక్స్, హెచ్పీ వంటి దిగ్గజ సంస్థల ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘300 మంది కెరీర్లతో ఆటలాడటం దారుణం. ఫ్రెషర్లను పావులుగా వాడుకుంటున్నారు’ అని గోల్డ్మన్ సాక్స్లో పనిచేసే ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు. ‘అంతర్గత రాజకీయాల క్రాస్ఫైర్లో ఎప్పుడూ అమాయక ఫ్రెషర్లే బలిపశువులవుతున్నారు’ అని మరొకరు పేర్కొన్నారు.కంపెనీ స్పందన కోసం నిరీక్షణఈ ఆరోపణలపై వివరణ కోరుతూ జోహో సంస్థకు కొన్ని మీడియా సంస్థలు ఈమెయిల్ పంపాయని తెలుస్తుంది. అయితే దీనిపై కంపెనీ నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించలేకపోయినా, సోషల్ మీడియాలో వస్తున్న వరుస పోస్టులు మాత్రం ఐటీ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
యాపిల్ పెట్టుబడిపై నీలినీడలు!
‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్షైర్ హాత్వే సీఈఓ బాధ్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకున్నప్పటి నుంచి యాపిల్ పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన అర్ధ శతాబ్దపు ప్రస్థానంలో బెర్క్షైర్ క్లాస్-ఏ షేర్లను ఏకంగా 61,00,000 శాతం వృద్ధి పథంలో నడిపించిన బఫెట్, ఆ పగ్గాలను ఇటీవల తన వారసుడు గ్రెగ్ అబెల్కు అప్పగించారు. అయితే, అబెల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెర్క్షైర్ అత్యంత కీలకమైన యాపిల్ పెట్టుబడి బఫెట్ నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.విలువే ప్రాణం.. కానీ..వారెన్ బఫెట్ పెట్టుబడి శైలిలో అత్యంత ముఖ్యమైన నియమం ‘వాల్యుయేషన్’. ఒక సంస్థకు తిరుగులేని మార్కెట్ పట్టు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఆ సంస్థ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే బఫెట్ అటువైపు చూడరు. గ్రెగ్ అబెల్ తాను రాసిన మొదటి వార్షిక లేఖలో యాపిల్ను తన ‘ఫరెవర్ హోల్డింగ్స్’ (ఎప్పటికీ కొనసాగించే పెట్టుబడులు) జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యాపిల్ షేరు ధర బఫెట్ సూత్రాలకు విరుద్ధంగా చాలా ఖరీదుగా కనిపిస్తోంది.స్తంభించిన వృద్ధిఇటీవలి కాలంలో యాపిల్ అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల ఆదాయం మందగించింది. కేవలం సర్వీసెస్ విభాగం మాత్రమే స్వల్ప వృద్ధిని కనబరుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి యాపిల్ షేర్లు తమ ఆర్జన కంటే 33 రెట్లు (33 రెట్లు ఈపీఎస్-ఎర్నింగ్ పర్ షేర్) ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. 2016లో బఫెట్ తొలిసారి యాపిల్లో వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ స్టాక్ కేవలం 10 నుంచి 15 రెట్ల పీఈ రేషియోలో లభించేది. బఫెట్ సీఈఓగా ఉన్న చివరి తొమ్మిది త్రైమాసికాల్లోనే యాపిల్లోని సుమారు 75 శాతం వాటాను (687.6 మిలియన్ షేర్లు) విక్రయించడం గమనార్హం. కేవలం వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఏఐ ఆశలు వర్కౌట్ అవుతాయా?యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది తక్షణ ఆదాయ వృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకమే. యాపిల్ తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం(బైబ్యాక్) కోసం 2013 నుంచి 841 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ఆదాయ వృద్ధి లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది.ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలా?గ్రెగ్ అబెల్ యాపిల్ను దీర్ఘకాలిక సంపద సృష్టికర్తగా చూస్తున్నప్పటికీ బఫెట్ మార్గంలోనే నడిస్తే మాత్రం రాబోయే త్రైమాసికాల్లో బెర్క్షైర్ తన యాపిల్ వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం బ్రాండ్ విలువను చూసి పెట్టుబడి పెట్టడం కంటే, ఆ సంస్థ ఇచ్చే రాబడి, వాల్యుయేషన్ మధ్య సమతుల్యతను గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలే వృద్ధి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోను పునసమీక్షించుకోవడం ఉత్తమం.గమనిక: పై కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
మహిళలకూ ఉండాలి టర్మ్ పాలసీ
మరింత మంది మహిళలు ఉద్యోగాల్లోకి చేరుతున్న నేపథ్యంలో వారికి కూడా టర్మ్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ప్రణాళికల ఆవశ్యకత నెలకొందని ఇన్సూరెన్స్ ఎవేర్నెస్ కమిటీ (ఐఏసీ–లైఫ్) సభ్యులు రుషభ్ గాంధీ, పరాగ్ రాజా తెలిపారు. కుటుంబ సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించేందుకు వారు తాత్కాలికంగా గానీ శాశ్వతంగా గానీ ఉద్యోగాలకు దూరం కావడం వల్ల పొదుపు, రిటైర్మెంట్ నిధిపై ప్రభావం పడుతుందన్నారు.పురుషులతో పోలిస్తే మహిళల జీవితకాలం సగటున నాలుగేళ్లు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి తమతో పాటు తమపై ఆధారపడే వారి కోసం కూడా దీర్ఘకాలికమైన, మెరుగైన పొదుపు ప్రణాళికలు అవసరమవుతాయని తెలిపారు. ఆదాయార్జన వ్యవధి తక్కువగా ఉండటం, జీవితకాలం అధికంగా ఉండటమనేది మహిళలు ఎదుర్కొనే విశిష్టమైన సవాలని వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక అక్షరాస్యత దన్నుతో వారు ఆర్థిక ప్రణాళికల్లో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు. యాన్యుటీలు, గ్యారంటీడ్ ఇన్కం ప్లాన్లు వారు స్థిరమైన ఆదాయాన్ని అందుకునేందుకు తోడ్పడతాయని వారు చెప్పారు. తమ ఆర్థిక ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు బీమా పరిశ్రమ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఫ్లెక్సిబుల్ ఐటీ ఉద్యోగాల్లో మహిళల జోరు
ఐటీ, ఐటీ ఆధారిత రంగాల(ఐటీఈఎస్) రంగంలో కాంట్రాక్ట్, ఫ్లెక్సిబుల్ ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరీర్ నెట్ నివేదిక తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే నాటికి ఇది 40 శాతానికి చేరిందని వెల్లడించింది. ఎఫ్వై 2026లో కాంట్రాక్టు ఉద్యోగాల్లో జరిగిన 3,000 నియామకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఎఫ్వై22 – ఎఫ్వై26 మధ్య మహిళల నియామకాలు 10 శాతం పాయింట్లు పెరిగి ఎఫ్వై26లో 40 శాతానికి చేరుకున్నాయని తెలిపింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల గణాంకాలతో దీనిని పోల్చి ట్రెండ్లను విశ్లేషించినట్లు వెల్లడించింది. కెరీర్నెట్ నివేదికలోని ముఖ్యాంశాలుఫైనాన్స్–అకౌంటింగ్లో (43%) విభాగంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ (34%), యూఎక్స్, డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ (31%), ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ (29%), ఇంజినీరింగ్–సాఫ్ట్వేర్, క్యూఏ (27%) రంగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కన్సలి్టంగ్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంతో తక్కువగా ఉంది. ఈ విభాగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని నివేదిక సూచించింది.మహిళల భాగస్వామ్యం మెట్రో నగరాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉంది. బెంగళూరు (21%), హైదరాబాద్ (20%), పుణే (17%) ముందుండగా, ఢిల్లీ ఎన్సీఆర్ (13%), చెన్నై (9%) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై (7%), కోల్కతా (2 శాతం) చివరి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. టైర్–2 నగరాల్లో మహిళల భాగస్వామ్యం 11 శాతంగా మాత్రమే ఉన్నట్లు నివేదిక తెలిపింది.కెరీర్ వ్యవధి పరంగా చూస్తే.., మహిళల భాగస్వామ్యం ‘ప్రారంభ, మధ్య దశ’ల్లో గణనీయంగా ఉంది. రెండేళ్లలోపు అనుభవం ఉన్న ‘ప్రారంభ దశ’ ఉద్యోగుల్లో మహిళల వాటా 30%గా ఉంది. 5 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న ‘మధ్య దశ’లో అది 31% గా నమోదైంది. సీనియర్ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది. 9–14 సంవత్సరాల అనుభవం ఉన్నవారి వాటా 13 శాతంగా, 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారి వాటా కేవలం 4 శాతంగా నమోదైంది. ఇది మహిళలను ఉద్యోగాల్లో నిలుపుదల (రిటెన్షన్) చేయడం, ఉన్నత స్థాయిలకు ఎదగడంలో (అడ్వాన్స్మెంట్) ఇంకా లోటుపాట్లు ఉన్నాయని నివేదిక సూచిస్తోంది.‘‘గత ఐదేళ్లలో ఐటీ/ఐటీఈఎస్ రంగంలో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, వారు ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగాల స్వరూపంలో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫైనాన్స్– అకౌంటింగ్ విభాగం ముందంజలో ఉండటం, మహిళలు ఇకపైనా ప్రాధాన్యం లేని పాత్రల్లో మాత్రమే కాకుండా కీలక రంగాల్లోకి అడుగు పెడుతున్నారనే సంకేతాలను సూచిస్తోంది. వ్యాపార ఫలితాలపై నేరుగా ప్రభావం చూపే ప్రధాన విభాగాల వైపు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు’’ అని కెరీర్ నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ఫార్మా వృద్ధికి పరిశోధనలు కీలకం
న్యూఢిల్లీ: బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై మరింతగా దృష్టి పెడుతూ అంతర్జాతీయంగా ఫార్మా రంగానికి సారథ్యం వహించేలా భారత్ పటిష్టమైన స్థితిలో ఉందని కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఇందుకోసం పరిశోధనలు–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు పెరగడం మొదలైన అంశాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఫార్మా 2026 కార్యక్రమానికి పంపిన వీడియో సందేశంలో మంత్రి ఈ విషయాలు చెప్పారు. నాయకత్వ సామర్థ్యాలు, అందుబాటు ధరలో జనరిక్ ఔషధాలతో అనేక సంవత్సరాలుగా ప్రపంచానికి ఫార్మసీగా భారత్ గుర్తింపు పొందిందని మంత్రి వివరించారు. ప్రస్తుతం గ్లోబల్ ఫార్మా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయని బయోలాజిక్స్, బయోసిమిలర్స్, స్పెషాలిటీ మెడిసిన్పై ఫోకస్ పెరుగుతోందన్నారు. దీనికి అనువుగా భారత్ తనను తాను మల్చుకోవడంతో పాటు సారథ్యం కూడా వహించేందుకు స్థితిలో ఉందని నడ్డా వివరించారు. దేశీ ఫార్మా పరిశ్రమను గ్లోబల్ లీడరుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అయిదేళ్ల వ్యవధి కోసం రూ. 10,000 కోట్లతో బయోఫార్మా శక్తి కార్యక్రమాన్ని కూడా ప్రకటించినట్లు చెప్పారు. బల్క్ డ్రగ్ పార్కుల అభివృద్ధి, బల్క్ డ్రగ్స్ స్కీము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ)లాంటి కార్యక్రమాలతో దేశీయంగా తయారీ కార్యకలాపాలకు ఊతమిస్తున్నట్లు నడ్డా పేర్కొన్నారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని (సీడీఎస్సీవో) పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు, 1,500 మంది నిపుణులతో సైంటిఫిక్ సమీక్ష కోసం బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. -
గోద్రెజ్ చైర్మన్గా పిరోజ్షా
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ నాయకత్వ మార్పిడికి సన్నాహాలు ప్రారంభించింది. ప్రస్తుత చైర్పర్శన్, బంధువు నాదిర్ నుంచి ఈ ఏడాది ఆగస్ట్లో పిరోజ్షా గోద్రెజ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తదుపరి నాదిర్ గోద్రెజ్ కంపెనీ గౌరవ చైర్మన్గా సేవలు అందించనున్నట్లు గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ పేర్కొంది. తరాలవారీ నాయకత్వ మార్పిడి ప్రణాళిక ప్రకారం ఇతర ఎంపికలు సైతం చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇది ఇటు అధికారం, అటు బాధ్యతల సమయమని పిరోజ్షా పేర్కొన్నారు. తరతరాలుగా నిర్మించుకున్న గ్రూప్ వారసత్వ సంపదతోపాటు విలువలను నిలుపుకుంటూనే ముందుకు సాగవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. 2026 ఆగస్ట్లో నాదిర్ వయసు 75ఏళ్లకు చేరనుండటంతో పదవీ విరమణ చేయనున్నారు. ఫలితంగా గ్రూప్లోని గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఆగ్రోవెట్, కన్జూమర్ ప్రొడక్ట్స్సహా గోద్రెజ్ ప్రాపర్టీస్ బోర్డుల నుంచి తప్పుకోనున్నారు. సోమవారం(13) నుంచి ఆస్టెక్ లైఫ్సైన్సెస్ కంపెనీ చైర్మన్, నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాధ్యతలకు టాటా చెప్పారు. కొత్త తరంతో.. తదుపరి తరం నాయకత్వంలో గోద్రెజ్ గ్రూప్ మరింత పటిష్ట వృద్ధిని అందుకోనున్నట్లు ఈ సందర్భంగా నాదిర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గోద్రెజ్ గ్రూప్నకు పలు దశాబ్దాలుగా నాదిర్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. నాదిర్ సోదరుడు ఆది, పరమేశ్వర్ గోద్రెజ్ కుమారుడు పిరోజ్షా గోద్రెజ్ ఆగస్ట్ 14 నుంచి గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, గోద్రెజ్ ఇండస్ట్రీస్కు చైర్పర్శన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గోద్రెజ్ ఆగ్రోవెట్ చైర్మన్గా నాదిర్ కుమారుడు బుర్జీస్ గోద్రెజ్ ఆగస్ట్ 14న బాధ్యతలు స్వీకరించడంతోపాటు.. గోద్రెజ్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేరనున్నారు. ఆస్టెక్ లైఫ్సైన్సెస్ ఎండీ పదవి నుంచి వెనువెంటనే తప్పుకుని బోర్డులో నాన్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. ఆస్టెక్ లైఫ్ చైర్పర్శన్గా గోద్రెజ్ కెమికల్స్ సీఈవో విశాల్ శర్మ వెనువెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆస్టెక్ లైఫ్ ప్రస్తుత సీవోవో ఆరిజిత్ ముఖర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. -
ఉజ్జీవన్ బ్యాంక్ దరఖాస్తు తిరస్కరించిన ఆర్బీఐ
మైక్రోఫైనాన్స్ రంగం నుంచి పూర్తిస్థాయి బ్యాంకింగ్ వైపు అడుగులు వేస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) షాక్ ఇచ్చింది. యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం బ్యాంక్ సమర్పించిన దరఖాస్తును ఆర్బీఐ తిరస్కరించింది. రుణాల పంపిణీలో మరింత వైవిధ్యం అవసరమని పేర్కొంటూ కేంద్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆర్బీఐ అభ్యంతరం ఏమిటి?స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో ఉజ్జీవన్ బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ లోన్ పోర్ట్ఫోలియోపై ఆర్బీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉజ్జీవన్ రుణాలు ఎక్కువగా ఒకే రకమైన విభాగాలకు (ప్రధానంగా అన్ సెక్యూర్డ్ మైక్రో లోన్స్) పరిమితమై ఉన్నాయి. రుణాలను వైవిధ్యపరచడానికి బ్యాంక్ ఇటీవల చేసిన ప్రయత్నాలను ఆర్బీఐ గుర్తించినప్పటికీ ఒక యూనివర్సల్ బ్యాంక్కు ఉండాల్సిన సమతుల్య లోన్ బుక్ ఇంకా సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో రుణాల పంపిణీని మరింత విస్తృతం చేసిన తర్వాతే తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ సలహా ఇచ్చింది.యూనివర్సల్ బ్యాంక్ హోదా ఎందుకు ముఖ్యం?స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్థాయి నుంచి యూనివర్సల్ బ్యాంక్గా మారితే బ్యాంకుకు కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అందులో.. చిన్న రుణాలు, తక్కువ సేవలందించే విభాగాలకే పరిమితం కాకుండా కార్పొరేట్ బ్యాంకింగ్ వంటి అన్ని రకాల ఆర్థిక సేవలను అందించవచ్చు. ప్రాధాన్యత రంగ రుణ నిబంధనల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. యూనివర్సల్ బ్యాంక్గా మారితే కస్టమర్లలో నమ్మకాన్ని పెంచడంతో పాటు తక్కువ వడ్డీ రేటుకే నిధులను సేకరించడానికి దోహదపడుతుంది.ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు -
ఫీచర్ ఫోన్తో సులువుగా ఆన్లైన్ లావాదేవీలు
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో చేతులు కలిపి డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు వేసింది. స్మార్ట్ఫోన్ లేని సామాన్యులకు కూడా అత్యాధునిక బ్యాంకింగ్ సేవలను చేరువ చేస్తూ ఫీచర్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సమగ్ర మొబైల్ బ్యాంకింగ్ యాప్ ‘బాబ్ వరల్డ్ లైట్’ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది.ముంబైలో జరిగిన ఈ కార్యక్రమంలో జియోఫోన్ ‘ప్రైమా 4జీ’ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం, ఆర్బీఐ ఆశిస్తున్న ఆర్థిక సమగ్రత లక్ష్య సాధనలో ఈ పరిణామం ఒక కీలక మలుపుగా నిలవనుంది.సాధారణంగా మొబైల్ బ్యాంకింగ్ యాప్లు కేవలం హై-ఎండ్ స్మార్ట్ఫోన్లకే పరిమితమవుతుంటాయి. కానీ, 'బాబ్ వరల్డ్ లైట్' దీనికి భిన్నం. బ్యాంకు, జియో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ ఇంటర్నెట్ వేగం ఉన్నా ఈ యాప్ నిరాటంకగా పనిచేస్తుంది. టచ్ స్క్రీన్ అవసరం లేకుండా కీప్యాడ్తోనే సులభంగా ఆపరేట్ చేయవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా సులభమైన నమోదు ప్రక్రియ ద్వారా ఈ సేవలను పొందవచ్చు.ఏయే సేవలు అందుబాటులో ఉంటాయంటే..యూపీఐ ఆధారిత స్కాన్ అండ్ పేమనీ ట్రాన్స్ఫర్ (డబ్బు పంపడం)బిల్లుల చెల్లింపులు, రీచార్జ్లుప్రొఫైల్ మేనేజ్మెంట్జియోఫోన్ ప్రైమా 4జీ పరికరాల్లో ఈ యాప్ ముందే లోడ్ చేయబడి ఉంటుంది. పాత వినియోగదారులు జియో స్టోర్ ద్వారా దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘డిజిటల్ బ్యాంకింగ్ను కోట్లాది మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు చేరవేయడమే మా ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో ఈ ‘లైట్’ వెర్షన్ కీలక పాత్ర పోషిస్తుంది’ అని దేవదత్త చంద్ర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ తెలిపారు.ఈ భాగస్వామ్యం గురించి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ, ‘జియో ఎప్పుడూ సామాన్యుడికి డిజిటల్ సేవలను అందుబాటు ధరలో అందించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిపి మేము అందిస్తున్న ఈ సేవలు దేశవ్యాప్తంగా ఉన్న జియోఫోన్ వినియోగదారులకు సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు -
‘ఉద్యోగుల దుష్ర్పవర్తనపై రాజీ పడబోం’
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ బ్రాంచ్లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణల కలకలంపై టాటా గ్రూప్ కఠినంగా స్పందించింది. ఉద్యోగుల దుష్ప్రవర్తన, వేధింపుల విషయంలో సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సోమవారం స్పష్టం చేశారు.విచారణాధికారిగా సీఓఓఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరిపి బాధ్యులైన వారిని గుర్తించేందుకు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ‘ఈ ఘటనలు మమ్మల్ని తీవ్రంగా కలచివేశాయి. నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవసరమైన చోట సంస్థాగత మార్పులు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.అసలేం జరిగింది?గత మార్చి నెలలో టీసీఎస్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని, పెళ్లి పేరుతో తనను శారీరకంగా లొంగదీసుకున్నారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఇది కేవలం వ్యక్తిగత నేరం కాదని వ్యవస్థీకృత వేధింపులని తేలింది. ఎనిమిది మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారు. బాధితులను బలవంతంగా మతమార్పిడికి ప్రేరేపించడం, మాంసం తినాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేవతలను అవహేళన చేస్తూ ఉద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.ఏడుగురు అరెస్ట్..నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితులను ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మెమన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్లుగా గుర్తించారు. వీరిపై లైంగిక వేధింపులు, మత విద్వేషాల ప్రేరేపణ వంటి సెక్షన్ల కింద 8 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.హెచ్ఆర్ అధికారుల వైఫల్యంపై విచారణబాధితులు గతంలోనే కంపెనీకి చెందిన హెచ్ఆర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు సరైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పుణెకు చెందిన టీసీఎస్ హెచ్ఆర్ అధికారిణిని పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆమె నిందితులకు పరోక్షంగా సహకరించారా అనే కోణంలో నోటీసులు జారీ చేశారు.ప్రభుత్వం సీరియస్.. సిట్ ఏర్పాటుమహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించారు. ‘ఇది సమాజంలో విద్వేషాలు నింపే అత్యంత తీవ్రమైన విషయం. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో లోతైన కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. నాసిక్ పోలీసులు తీసుకున్న వేగవంతమైన చర్యలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల భద్రత, నైతిక విలువలపై ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు -
దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన..
దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలోని నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో సోమవారం కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు ఫేజ్-2, సెక్టార్-60 పరిసరాల్లో వాహనాలను తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. దశాబ్దాలుగా పరిష్కరించలేని కార్మికుల డిమాండ్లు ఈ నిరసనలకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి కార్మికులు డిమాండ్లు కింద తెలియజేశాం.వేతనాల పెంపుప్రస్తుతం నోయిడాలోని పారిశ్రామిక కార్మికులు నెలకు రూ.13,000 నుంచి రూ.15,000 మధ్య చెల్లిస్తున్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువుల దృష్ట్యా ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని వారు వాపోతున్నారు. కనీస వేతనాన్ని రూ.20,000కు పెంచాలని పట్టుబడుతున్నారు. ‘పదేళ్లుగా ధరలు పెరిగాయి కానీ, మా శ్రమకు దక్కే ఫలితం మాత్రం దక్కడం లేదు’ అని ఒక కార్మిక నేత ఆవేదన వ్యక్తం చేశారు.హరియాణాతో పోలికఈ నిరసనలకు ప్రధాన ప్రేరణ పొరుగు రాష్ట్రమైన హరియాణా తీసుకున్న నిర్ణయం. అక్కడి ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.14,000 నుంచి రూ.19,000కు (సుమారు 35 శాతం) పెంచింది. ఒకే పని చేస్తున్నా ఉత్తరప్రదేశ్ (నోయిడా) కార్మికులు హరియాణా కార్మికుల కంటే దాదాపు రూ.6,000 తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ వ్యత్యాసమే అశాంతికి ఆజ్యం పోసింది.12 గంటల షిఫ్టులకు స్వస్తి పలకాలిహోసియరీ కాంప్లెక్స్ వంటి ప్రాంతాల్లో కార్మిక చట్టాలను తుంగలో తొక్కి బలవంతంగా 12 గంటల పాటు పని చేయిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పని గంటలను చట్టబద్ధమైన 8 గంటలకే పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదనపు పనిని 'నిబంధన'గా కాకుండా, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.ఓవర్ టైం, బోనస్ బకాయిలుకార్మిక చట్టాల ప్రకారం, అదనపు గంటలు పనిచేసినప్పుడు సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. వార్షిక బోనస్ల విషయంలో యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు.పని ప్రదేశంలో భద్రత - గౌరవంఫ్యాక్టరీ లోపల కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని, మహిళా కార్మికులపై వేధింపులు అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన యంత్రాంగం దీనికి స్పందిస్తూ, మహిళా అధికారిణి నేతృత్వంలో ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అయితే, ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా కచ్చితంగా అమలు కావాలని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.పెండింగ్ బకాయిల తక్షణ చెల్లింపుఅనేక కంపెనీలు నెలల తరబడి వేతన బకాయిలను, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన సెటిల్మెంట్లను నిలిపివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ కష్టార్జితం తమకు దక్కకుండా యాజమాన్యాలు తాత్సారం చేస్తున్నాయని, ఈ బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
లండన్లో ఓపెన్ఏఐ శాశ్వత కార్యాలయం
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిగ్గజం చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ బ్రిటన్ రాజధాని లండన్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంటోంది. యూకేలో తన మొట్టమొదటి శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సుమారు 500 మంది సభ్యుల సామర్థ్యంతో కూడిన ఈ కార్యాలయం కోసం సోమవారం లీజు ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయి.కీలక కేంద్రంగా లండన్..లండన్లోని ప్రముఖ ‘కింగ్స్ క్రాస్’ ప్రాంతంలో సుమారు 88,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నూతన కార్యాలయం ఏర్పాటు కానుంది. గూగుల్ డీప్మైండ్, మెటా, సింథెసియా, వేవ్ వంటి అగ్రశ్రేణి ఏఐ కంపెనీలకు ఈ ప్రాంతం ఇప్పటికే నిలయంగా ఉంది. ‘యూకేలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ఏఐ రంగంలో బ్రిటన్కు బలమైన చరిత్ర ఉంది’ అని ఓపెన్ఏఐ లండన్ సైట్ లీడ్ ఫోబ్ థాకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం లండన్లో 200 మంది ఉద్యోగులు ఉండగా, అమెరికా వెలుపల తమ అతిపెద్ద పరిశోధనా కేంద్రంగా లండన్ను తీర్చిదిద్దుతామని కంపెనీ గతంలోనే వెల్లడించింది.స్టార్ గేట్ ప్రాజెక్ట్కు బ్రేక్.. కారణం అదేనా?ఒకవైపు కార్యాలయ విస్తరణ జరుగుతున్నప్పటికీ మరోవైపు మౌలిక సదుపాయాల విషయంలో యూకేకు కొంత నిరాశ ఎదురైంది. భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ అయిన ‘స్టార్ గేట్’ను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఓపెన్ఏఐ ధ్రువీకరించింది. ప్రపంచంలోనే పారిశ్రామిక ఇంధన ధరలు యూకేలో అత్యధికంగా ఉండటం, విద్యుత్ గ్రిడ్ను యాక్సెస్ చేయడంలో జరుగుతున్న జాప్యం, లండన్లోని కఠినమైన నిబంధనలు కూడా ప్రాజెక్ట్ పురోగతికి అడ్డంకిగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ భాగస్వామి అయిన ‘ఎన్ స్కేల్’తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
కొరియా చిన్నది.. కోట్ల సంపదలో పెద్దది!!
సాంకేతిక రంగం అంటేనే సృజనాత్మకతకు, అపారమైన సంపదకు నిలయం. తాజాగా ఈ రంగంలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. దక్షిణ కొరియాకు చెందిన 22 ఏళ్ల కిమ్ జంగ్-యున్ (Kim Jung-youn) ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా టెక్ బిలియనీర్గా ఫోర్బ్స్-2026 జాబితాలో నిలిచారు. గేమింగ్ రంగంలో ఆమె కుటుంబం సృష్టించిన సామ్రాజ్యం, నేడు ఆమెను ఈ అత్యున్నత స్థానంలో నిలబెట్టింది.వారసత్వ సంపద.. అంతర్జాతీయ గుర్తింపుగేమింగ్ దిగ్గజం 'నెక్సాన్' (Nexon) వ్యవస్థాపకుడు, దివంగత కిమ్ జంగ్-జు కుమార్తె జంగ్-యున్. 2022లో తన తండ్రి మరణం తర్వాత, నెక్సాన్ హోల్డింగ్ కంపెనీ అయిన NXCలో ఆమెకు, ఆమె సోదరి జంగ్-మిన్కు భారీగా వాటాలు దక్కాయి. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 12, 2026 నాటికి జంగ్-యున్ నికర ఆస్తి విలువ 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,520 కోట్లు)ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో నివసిస్తున్నారు. సంపద పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం, సంస్థ నిర్వహణ విషయాల్లో చాలా గోప్యంగా ఉండటానికే మొగ్గు చూపుతారు.నెక్సాన్.. గేమింగ్ రంగంలో ట్రెండ్ సెట్టర్1994లో ప్రారంభమైన నెక్సాన్, ఆన్లైన్ గేమింగ్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. మాపుల్ స్టోరీ (MapleStory), డంజియన్ & ఫైటర్ (Dungeon & Fighter) వంటి ప్రపంచ ప్రసిద్ధ గేమ్స్ ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఏటా బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఆసియా డిజిటల్ గేమింగ్ మార్కెట్లో నెక్సాన్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ బలమైన పునాదే నేడు జంగ్-యున్ సంపదకు ప్రధాన వనరు.2026లో యువ బిలియనీర్ల హవాఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది 30 ఏళ్లలోపు వయస్సున్న బిలియనీర్ల సంఖ్య 35కు చేరింది. వీరి మొత్తం ఆస్తి విలువ సుమారు 92.4 బిలియన్ డాలర్లు. వీరిలో అత్యధికులు వారసత్వంగా ఆస్తులు పొందిన వారే అయినప్పటికీ, AI (కృత్రిమ మేధ) వంటి రంగాల్లో సొంతంగా ఎదిగిన వారు (Self-made) కూడా 12 మంది ఉండటం విశేషం. టెక్ రంగంలో జంగ్-యున్తో పాటు లువానా లోపెస్ లారా(కల్షి), లూసీ గువో (స్కేల్ ఏఐ) వంటి యువ మహిళామణులు కూడా సత్తా చాటుతున్నారు. -
టెక్ దేశానికి వీసా ఫీజులు పెరుగుతున్నాయ్..!
జపాన్లో నివసిస్తున్న విదేశీయులకు, అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఆ దేశ ప్రభుత్వం షాకింగ్ వార్త చెప్పింది. ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్కు సవరణలు చేయడం ద్వారా వీసా పునరుద్ధరణ (Renewal), శాశ్వత నివాస (Permanent Residency) రుసుములను భారీగా పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఏజెన్సీ ప్రతినిధి జపాన్ పార్లమెంటు దిగువ సభలో వివరాలను వెల్లడించారు.ప్రతిపాదిత కొత్త ఫీజుల వివరాలుప్రస్తుత నిబంధనల ప్రకారం వీసా గడువుతో సంబంధం లేకుండా పునరుద్ధరణకు కేవలం 6,000 యెన్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సవరణల ప్రకారం ఈ ధరలు ఆకాశాన్నంటనున్నాయి. 5 ఏళ్ల వీసా రెన్యువల్ కోసం ప్రస్తుతమున్న ఫీజు ఏకంగా 70,000 యెన్లకు పెరగనుంది. స్వల్పకాలిక వీసా (3 నెలలు అంతకంటే తక్కువ) పునరుద్ధరణకు సుమారు 10,000 యెన్లు ఖర్చవుతుంది. ఇక శాశ్వత నివాసం (PR) ఫీజు అత్యంత భారీగా పెంచుతున్నారు. ప్రస్తుతం 10,000 యెన్లు ఉన్న పీఆర్ రుసుము, ఏకంగా 2,00,000 యెన్లకు పెరగనుంది.గరిష్ట పరిమితులు ఖరారు చేసిన ప్రభుత్వంఫీజుల పెంపుపై ప్రభుత్వం కేబినెట్ ఆమోదం కోసం ఇమ్మిగ్రేషన్ కంట్రోల్ యాక్ట్ సవరణలను సమర్పించింది. ఇందులో భాగంగా గరిష్ట ఫీజు పరిమితులను కూడా నిర్ణయించింది. శాశ్వత నివాసం కోసం గరిష్టంగా 3,00,000 యెన్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఇతర వీసా కేటగిరీలకు గరిష్టంగా 1,00,000 యెన్ల వరకు పరిమితి విధించారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. అర్హతను బట్టి వారికి ఫీజులో తగ్గింపు లేదా పూర్తి మినహాయింపు ఇచ్చే నిబంధనలను కూడా అధికారులు పొందుపరిచారు.పెంపునకు కారణం ఏంటి?మారుతున్న పరిపాలనా అవసరాలు, ఇమ్మిగ్రేషన్ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో ఈ ఫీజుల సర్దుబాటు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, పర్యవేక్షణ ఖర్చులను భర్తీ చేయడానికి ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. -
TCSలో కలకలం.. రంగంలోకి పోలీసులు
ప్రముఖ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన నాసిక్ యూనిట్లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఘటనలు జరిగాయని ఆరోపిస్తూ.. తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఏ రూపంలోనైనా వేధింపులు, బలవంతం పట్ల తమకు ‘జీరో-టాలరెన్స్’ విధానం ఉందని టీసీఎస్ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్టయిన ఆరుగురితో సహా, విచారణలో ఉన్న ఉద్యోగులను ఆ సంస్థ ఇప్పటికే సస్పెండ్ చేసింది.దీనిపై టీసీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ.. “నాసిక్లో ఈ విషయం మా దృష్టికి రాగానే, మేము తక్షణ చర్యలు తీసుకున్నాము. విచారణలో ఉన్న ఉద్యోగులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశాము. మేము అధికారులకు సహకరిస్తున్నాము, ఈ విచారణ ముగింపు ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటాము” అని అన్నారు.దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్.. ఈ కేసును సుమోటోగా స్వీకరించి, ఈ ఘటన "చాలా తీవ్రమైనది" అని అభివర్ణించారు. అంతే కాకుండా త్వరితగతిన స్పందించిన నాసిక్ పోలీసులను ప్రశంసించారు.ఇదీ చదవండి: టీసీఎస్లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?ఈ కేసు దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నాసిక్ పోలీసులు ప్రస్తుతం పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ కంపెనీ హెచ్ఆర్ అధికారిని విచారిస్తున్నారు, ఇప్పటివరకు, కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన నిఘా సమాచారం ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. అరెస్టు అయిన వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. -
టీసీఎస్లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు! -
వజ్రాలకు పెరుగుతున్న డిమాండ్
ముంబై: దేశీయంగా సహజసిద్ధమైన వజ్రాభరణాల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2030 నాటికి ఇది రూ. 1.50 లక్షల కోట్లకు చేరనుంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు ఇందుకు దోహదపడనున్నాయి. డిబీర్స్ గ్రూప్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.భారత్లో నేచురల్ డైమండ్ జ్యుయలరీ మార్కెట్ భారీ వృద్ధి దశలోకి ప్రవేశిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. డైమండ్స్ అనేవి వివాహంలాంటి సంప్రదాయ సందర్భాలకే పరిమితం కాకుండా రోజువారీ ధరించేందుకు కొనుగోలు చేసే ఉత్పత్తుల కేటగిరీలోకి చేరుతున్నాయని వివరించింది. మహిళల్లో ఆర్థిక స్వాతంత్రం పెరుగుతుండటం, జనరేషన్ జెడ్, మిలీనియల్స్ ఆకాంక్షలు ఇందుకు తోడ్పడుతున్నాయి.ఈ వర్గం వాటా మొత్తం మార్కెట్ విలువలో 86 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. వజ్రాలకు డిమాండ్ కేవలం మెట్రోల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా గణనీయంగా కనిపిస్తోంది. వ్యక్తిగత ఆదాయాలు పెరిగే కొద్దీ కొత్త తరం వినియోగదారులు సిసలైన, అరుదైన, సహజసిద్ధమైన వజ్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని డిబీర్స్ గ్రూప్ గ్లోబల్ ఎస్వీపీ శ్వేతా హరిత్ తెలిపారు. -
దివాలా తీసిన జేఏఎల్ కొనుగోలు.. అదానీకే ‘జై’!
న్యూఢిల్లీ: దివాలా తీసిన తమ సంస్థ జేఏఎల్ కొనుగోలుకి సంబంధించి అదానీ గ్రూప్ వైపై జేపీ గ్రూప్ వ్యవస్థాపకుడు జైప్రకాశ్ గౌర్ మొగ్గు చూపారు. గౌతమ్ అదానీ సారథ్యంలో గ్రూప్ పురోగమించగలదని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణదాతల కమిటీ (సీవోసీ), దివాలా పరిష్కార నిపుణుడు పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గౌర్ పేర్కొన్నారు.ఇందులో పాల్గొన్నందుకు అదానీ గ్రూప్, వేదాంత గ్రూప్నకు ధన్యవాదాలు తెలిపారు. అదానీ గ్రూప్ను సీవోసీ ఎంపిక చేయడాన్ని తాను గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. బిడ్డింగ్లో తాము గెల్చినట్లు రాతపూర్వకంగా ధృవీకరించిన తర్వాత, దానికి భిన్నంగా అదానీ గ్రూప్ను విజేతగా ప్రకటించారంటూ పోటీ సంస్థ వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ ఆరోపించిన నేపథ్యంలో గౌర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.రూ. 57,185 కోట్ల రుణాలు బాకీ పడటంతో 2024 జూన్లో జేఏఎల్పై దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. రూ. 14,535 కోట్ల అదానీ గ్రూప్ బిడ్కు గతేడాది నవంబర్లో సీవోసీ ఆమోదించగా, మార్చి 17న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (అలహాబాద్ బెంచ్) కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, రూ. 17,926 కోట్లకు బిడ్ చేసిన వేదాంత, దీన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపై ఎన్సీఎల్ఏటీ విచారణ చేపట్టినప్పటికీ, ఎన్సీఎల్టీ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించడానికి నిరాకరించింది. -
మన ఆయిల్, గ్యాస్.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం
న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన సరఫరాల కోసం పశ్చిమాసియా దేశాలపై అధికంగా ఆధారపడడంపై అప్రమత్తత అవసరమని ఓఎన్జీసీ చైర్మన్, సీఈవో అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ తన చమురు దిగుమతుల్లో సగం మేర, గ్యాస్ అవసరాల్లో 30 శాతం, ఎల్పీజీ అవసరాల్లో 85–90 శాతాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచి సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు.పశ్చిమాసియాలో సంఘర్షణల కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అరుణ్ కుమార్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం నెలకొంది. పశ్చిమాసియా మనకు సమీపంలో ఉండడంతో అక్కడి వనరులను సులభంగా పొందొచ్చనుకోవడాన్ని కొంత సందేహంగానే చూడాలన్నారు. ఇంధన భద్రతపై పీఎన్జీఆర్బీ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ క్రమం మారుతోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన భద్రతపై దీర్ఘకాలం నుంచి ఉన్న అంచనాలు మారిపోతున్నాయంటూ హెచ్చరించారు. కనుక దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఆయిల్, గ్యాస్ ఉన్నా.. ఎంత ఖర్చు అయినా దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటూ.. సంక్షోభంలో మనకు ఎవరూ సాయం చేయరన్నారు. అలాగే, దేశంలో ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
క్విక్–కామర్స్లో భారత్ హవా!
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ రిటైల్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2025లో ఈ మాధ్యమం ద్వారా అమ్ముడైన ఉత్పత్తుల స్థూల విలువ (జీఎంవీ) దాదాపు 65–66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని బెయిన్ అండ్ కంపెనీ, ఫ్లిప్కార్ట్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. విలువపరంగా 19–21 శాతం వృద్ధి నమోదైందని రిపోర్టు పేర్కొంది. ఈ క్రమంలో క్విక్–కామర్స్ విభాగానికి సంబంధించి ప్రపంచంలోనే భారత్ అగ్రగామిగా ఎదిగినట్లు వివరించింది. ఈ–కామర్స్ జీఎంవీలో దాదాపు 16–17 శాతం ఈ క్విక్ కామర్స్ ద్వారానే వచి్చనట్లు తెలిపింది. ఇది చైనా సహా చాలా మార్కెట్లలో నమోదైన దానికంటే అధికమని వివరించింది. ఆన్లైన్ షాపింగ్, అందుకోసం చేసే వ్యయం పెరుగుతుండటంతో ఏటా 20 శాతం వృద్ధితో 2030 నాటికి భారత ఈ–రిటైల్ మార్కెట్ 170–180 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. రిపోర్టులోని మరిన్ని విశేషాలు.. → స్థూల ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో గతేడాది పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. జీఎస్టీ కోతలు, ఆదాయ పన్నుపరమైన ఊరట, నెమ్మదిస్తున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల తగ్గింపు తదితర సానుకూలాంశాలతో ప్రైవేట్ వినియోగం పెరిగింది. 2022–24 మధ్య 8 శాతంగా ఉన్న ప్రైవేట్ వినియోగం 2025లో 10.5 శాతానికి చేరింది. 2026 తొలి త్రైమాసికంలోనూ ఇదే ఊపు కొనసాగడంతో 23–25 శాతం వృద్ధి చెందింది. → గత రెండేళ్లుగా క్విక్ కామర్స్ విభాగం రెట్టింపయ్యింది. 2025లో ఈ సెగ్మెంట్ జీఎంవీ 10–11 బిలియన్ డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో 2030 నాటికి ఇది 65–70 బిలియన్ డాలర్లకు చేరనుంది. అదనంగా నమోదయ్యే ఈ–రిటైల్ జీఎంవీలో దీని వాటా 45–50 శాతానికి చేరొచ్చు. అప్పటికి మొత్తం ఆన్లైన్ షాపింగ్లో సంప్రదాయ ఈ–రిటైల్ విభాగం వాటా 60–65 శాతంగా ఉండవచ్చు. → అంతర్జాతీయంగా వినియోగానికి భారత్ కీలక చోదకంగా నిలుస్తోంది. వచ్చే అయిదేళ్లలో వినియోగంపై అదనంగా వెచి్చంచే ప్రతి 8 డాలర్లలో భారత్ వాటా 1 డాలరుగా ఉండనుంది. → గతేడాది ఈ–రిటైల్ మార్కెట్ భారీగా వృద్ధి చెందినా, ఆఫ్లైన్ మాధ్యమాన్ని ప్రాధాన్యతను కొట్టిపారేసేందుకు వీలు లేదు. మెజారిటీ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఇప్పటికీ ఇది కీలకంగా ఉంటోంది. దీని దన్నుతోనే 2030 నాటికి మొత్తం రిటైల్ పరిశ్రమ 1.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోనుంది. → గడిచిన అయిదేళ్లలో భారత్లో ఆన్లైన్ షాపింగ్ మార్కెట్ రెట్టింపయ్యింది. షాపింగ్ చేసే వారి సంఖ్య 2025లో రెట్టింపయ్యి 29–30 కోట్లకు చేరింది. విక్రేతల వ్యవస్థ విస్తరించడం (గత అయిదేళ్లలో మూడు రెట్లు), భౌగోళికంగా మరిన్ని ప్రాంతాల్లోకి సేవలు అందుబాటులోకి రావడం ఇందుకు దోహదపడుతోంది. → జెన్ జెడ్ తరం కీలకంగా మారింది. ఈ–రిటైల్ షాపర్స్లో వీరి వాటా 40–45 శాతంగా ఉంటోంది. 2025లో అదనంగా వచ్చి ఈ–రిటైల్ ఆర్డర్లలో 50 శాతం ఈ వర్గం నుంచే వచ్చింది. లైఫ్స్టయిల్, బ్యూటీ, ఎల్రక్టానిక్స్ తదితర కేటగిరీలవ్యాప్తంగా ఈ విభాగం కస్టమర్ల షాపింగ్ ప్రాధాన్యతలు చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, వీడియోలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, సత్వర రుణ సదుపాయం వినియోగించుకోవడం ఎక్కువగా ఉంటోంది. → ఇంటర్నెట్ యూజర్లలో షాపింగ్ చేసే వారి సంఖ్య 25–30 శాతంగానే ఉన్నప్పటికీ (మెట్రోలు/ప్రథమ శ్రేణి నగరాల్లో ఇది 45–50 శాతంగా ఉంది), గతేడాది అదనంగా నమోదైన ఆన్లైన్ ఆర్డర్లలో ద్వితీయ శ్రేణి నగరాల వాటా దాదాపు 50 శాతంగా ఉంది. → పరిశ్రమ గణనీయంగా ఎదుగుతున్నప్పటికీ భారత్లో ఇప్పటికీ ఈ–రిటైల్ విస్తరణ చాలా తక్కువగానే జీడీపీలో 1.6 శాతం మాత్రమే ఉంది. అదే చైనాలో 13–14 శాతంగా, ఇండొనేషియాలో 4–4.5 శాతంగా ఉంది. ఇంటర్నెట్ యూజర్లలో 30 శాతం మంది మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. చైనాలో ఇది 92 శాతంగా, అమెరికాలో 74 శాతంగా ఉంది. ఇవన్నీ భారత్లో ఈ రంగం మరింత వృద్ధి చెందడానికి గల అవకాశాలను సూచిస్తున్నాయి. → వచ్చే అయిదేళ్లలో ఈ–రిటైల్ మార్కెట్ తదుపరి వృద్ధి దశలోకి అడుగుపెట్టనుంది. క్యూ–కామర్స్ ఇందుకు దన్నుగా నిలవనుంది. నిత్యావసరాలు, అలాగే డిస్క్రెషనరీ ఉత్పత్తులకు సంబంధించి సౌకర్యవంతమైన మాధ్యమంగా క్యూ–కామర్స్ నిలుస్తోంది. ప్రస్తుతం 200 పైగా నగరాల్లో 7,000 పైగా మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ పని చేస్తున్నాయి. భారీ స్థాయిలో కార్యకలాపాల నిర్వహణ వల్ల లాభదాయకత మెరుగుపడింది. అయితే, టాప్ మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాల పరిధిని దాటి ఇతర ప్రాంతాల్లో దీని వినియోగం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. -
''ఒరాకిల్ ఉద్యోగం పోయింది.. మేకలు పెంచాలనుకుంటున్నా''
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న తరుణంలో.. టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో సలహాలు కోరాడు.''ఒరాకిల్లో సీనియర్ SDEగా ఉద్యోగం కోల్పోయాను. మా సొంత ఊరిలో ఏదైనా జాబ్ చేద్దామంటే? వచ్చే జీతం నేను ఇంతకుముందు పొందుతున్న దానికి ఏమాత్రం సరిపోదు, ఆ డబ్బుతో ప్రతి నెలా నా కార్ లోన్ కూడా కట్టలేను. నేను సుమారు 15 లక్షల రూపాయలు పొదుపు చేశాను. నేను భారతదేశంలో ఏ వ్యాపారం చేయగలను? నేను మేకల పెంపకం చేయవచ్చా? నేను కష్టపడి పనిచేసే వ్యక్తిని, ఒక చిన్న చవకైన భూమి కొని ఒక చిన్న ఆఫీసు పెట్టుకుని, ఫ్రీలాన్స్గా పని వెతుక్కుంటూ, మేకలను పెంచుకుంటూ జీవించగలను. నాకు ఏం చేయాలో పాలుపోవడం లేదు, దయచేసి సహాయం చేయండి'' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీనిపై స్పందించిన కొందరు నెటిజన్లు, అతను టెక్నాలజీ రంగంలోనే కొనసాగాలని సూచించారు. ముఖ్యంగా AIపై నైపుణ్యాలు పెంచుకుని, కొత్త అవకాశాలను వెతకాలని సూచించారు. మరికొందరు గోట్ ఫార్మింగ్ మంచి వ్యాపారమని చెప్పినప్పటికీ, అందులో స్థిరపడడానికి ఒకటి.. రెండు సంవత్సరాలు పట్టవచ్చని హెచ్చరించారు.ఇంకొంత మంది మరింత జాగ్రత్తగా ఆలోచించాలని సూచిస్తూ, ముందుగా ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించి, ఆ తర్వాత మీ పొదుపును అదనంగా ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. మీ అనుభవంతో, దాన్ని నడపడానికి మీరు వ్యక్తులను నియమించుకోవచ్చు. ఆ వ్యాపారం మీ జీతం కంటే ఎక్కువ స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించిన తర్వాత, మీరు దానిని పూర్తికాల ఉద్యోగంగా పరిగణించవచ్చు'' అని సూచించారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో భారీ మార్పు: ఏడు రోజుల్లో ఇంతలా.. -
తొలగించిన కంపెనీ.. మళ్లీ పిలిచింది: చివరికి అవమానమే!
ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీల తీరు చాలా మారిపోయింది. సంస్థలు ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు మరో ఘటన తెరమీదకు వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఒక మహిళ తన ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న ఒక బాధాకరమైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది.రెడ్దిట్ పోస్టు ప్రకారం.. గత సంవత్సరం ఒక కంపెనీలో పనిచేస్తూ ఆమె పనిని ఎంతో నిబద్ధతతో, 100 శాతం కృషితో నిర్వహించారు. అయినప్పటికీ, తనకు మొదటి నుంచే అక్కడ ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. కొత్తగా చేరిన ఉద్యోగులను టీమ్లో అధికారికంగా పరిచయం చేసే విధానం ఉన్నప్పటికీ, తనను మాత్రం ఎప్పుడూ సరైన రీతిలో పరిచయం చేయలేదు. ఇది చిన్న విషయంగా అనిపించినప్పటికీ.. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కలిగించిందని పేర్కొన్నారు.ఇతర ఉద్యోగులను సమావేశాలకు పిలిచినప్పుడు, తనను మాత్రం తరచూ పక్కన పెట్టేవారు. కొంతమంది సహచరులు కూడా “మీరు మీటింగ్లో ఎందుకు లేరు?” అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఆమెకు అసౌకర్యంగా మాత్రమే కాకుండా.. అవమానకరంగా అనిపించాయని అన్నారు.కొంతకాలం తర్వాత.. కంపెనీ తనను ఉద్యోగం నుంచి తొలగించింది. సంస్థ నిర్ణయాన్ని ప్రశాంతంగా స్వీకరించింది. కానీ తర్వాత.. అదే పని కోసం ఇద్దరిని కొత్తగా నియమించుకున్నారని తెలుసుకున్నప్పుడు ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అంతే కాకుండా.. కొన్ని నెలల తర్వాత అదే కంపెనీ తనను మళ్లీ సంప్రదించి, తాత్కాలికంగా తిరిగి రావాలని కోరింది. కొత్తగా చేరిన ఉద్యోగులకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో గ్యాప్ రాకుండా ఉండాలని భావించి, ఆమె తిరిగి ఆ ఆఫర్ను అంగీకరించారు.ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే.. ''నా తర్వాత నియమితులైన వారికి నేను సహాయం చేస్తున్నాను, వారే నాకు రోజువారీ పనులు అప్పగిస్తూ ఏమి చేయాలో చెబుతున్నారు''.ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆమె తనకు తాను నిలబడాల్సిందని, కంపెనీ వద్ద తిరిగి చేరినప్పుడు కఠినమైన షరతులు పెట్టాల్సిందని సూచించారు. కొందరు కన్సల్టింగ్ ఫీజులు తీసుకోవాలని కూడా అభిప్రాయపడ్డారు. మరికొందరు.. తన స్వభావం కారణంగా తాను మృదువుగా ఉండటం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని అభిప్రాయపడ్డారు. -
IRCTC కొత్త రూల్.. ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు!
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రైల్వే ఒక కీలక మార్పు ప్రవేశపెట్టింది. చివరి నిమిషంలో ప్రయాణానికి సంబంధించిన బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ను, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు వరకు మార్చుకోవచ్చు. గతంలో బోర్డింగ్ స్టేషన్ను మార్చుకోవాలంటే.. ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల చాలామందికి ఇబ్బందులు కలిగేవి.బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవడంలో IRCTC కొంత స్వేచ్ఛ కల్పించింది. ముఖ్యంగా ట్రాఫిక్, ఆలస్యం వంటి కారణాల వల్ల ఎంపిక చేసుకున్న స్టేషన్కు సమయానికి చేరుకోలేని పరిస్థితుల్లో ఈ సదుపాయం సహాయపడుతుంది. ఈ సదుపాయం ప్రధానంగా IRCTC ద్వారా బుక్ చేసిన టికెట్లకు వర్తిస్తుంది. ఒకసారి స్టేషన్ మార్చిన తర్వాత, తప్పనిసరిగా కొత్తగా ఎంచుకున్న స్టేషన్ నుంచే రైలులో ఎక్కాలి.ఈ సౌకర్యాన్ని ఉపయోగించేటప్పుడు.. కొత్తగా ఎంపిక చేసిన స్టేషన్ నుంచి కూడా రైలును మిస్ అయితే, టికెట్ రద్దు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం అవసరం. ఈ విషయాన్ని వినియోగదారులు తప్పకుండా గమనించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం' -
ఓపెన్ ఏఐ నిపుణులను తన్నుకుపోయిన మెటా!
కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోరు కొత్త మలుపు తిరుగుతోంది. చాట్జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐకు గట్టి షాక్ ఇస్తూ ఆ సంస్థలోని అత్యంత కీలకమైన నిపుణులను మెటా ప్లాట్ఫారమ్స్ తన గూటికి చేర్చుకుంటోంది. సూపర్ కంప్యూటింగ్, భారీ డేటా సెంటర్ల నిర్మాణంలో ఆరితేరిన కొందరు అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ టీమ్లో చేరడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.మెటా గూటికి స్టార్గేట్ వ్యూహకర్తలుఓపెన్ ఏఐ మౌలిక సదుపాయాల విభాగంలో కీలకంగా నిలిచిన పీటర్ హోషెల్, షమీజ్ హేమానీ, అనుజ్ సహారాన్ ఇప్పుడు మెటాలో చేరారు. వీరు ఓపెన్ ఏఐ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘స్టార్గేట్’ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన వారు. ఈ ప్రాజెక్ట్ను వందల బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ సామర్థ్యాన్ని నిర్మించే లక్ష్యంతో చేపట్టారు. ఇప్పుడు ఈ నిపుణులు మెటా సొంత సూపర్ కంప్యూటింగ్ ప్రయత్నాలకు, ముఖ్యంగా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ విస్తరణకు కీలకంగా మారనున్నారు.జుకర్బర్గ్ భారీ స్కెచ్: రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడి!ఏఐ రేసులో వెనుకబడకూడదనే పట్టుదలతో ఉన్న మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం ఈ ఏడాదిలోనే సుమారు 135 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.11.25 లక్షల కోట్లు) మూలధన వ్యయాన్ని మెటా అంచనా వేస్తోంది. దీర్ఘకాలికంగా వందల బిలియన్ డాలర్లను ఏఐ హార్డ్వేర్, చిప్స్, డేటా సెంటర్ల కోసం వెచ్చించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ భారీ సామ్రాజ్యాన్ని నడిపించడానికి ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన నిపుణులు దిక్సూచిగా మారనున్నారు.రక్షణలో ఓపెన్ ఏఐ..మరోవైపు, ఓపెన్ ఏఐ తన దూకుడుకు కాస్త బ్రేకులు వేసినట్లు కనిపిస్తోంది. కంపెనీ తన మౌలికసదుపాయాల వ్యూహాలను పునసమీక్షిస్తోంది. బ్రిటన్లో చేపట్టాలనుకున్న ‘స్టార్గేట్’ ప్రాజెక్టును కంపెనీ తాత్కాలికంగా పక్కన పెట్టింది. త్వరలో పబ్లిక్ లిస్టింగ్కు వెళ్లే ఆలోచనలో ఉన్న ఓపెన్ ఏఐ అపరిమితమైన ఖర్చులను నియంత్రించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సైట్లను లీజుకు తీసుకోవడాన్ని కూడా వాయిదా వేసింది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
ఎయిరిండియా ఉద్యోగులకు ఛైర్మన్ హెచ్చరిక
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని, రాబోయే కాలం మరింత సవాలుతో కూడుకున్నదని టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. రికార్డు స్థాయి నష్టాలు, నిరంతర కార్యాచరణ వైఫల్యాల నేపథ్యంలో సంస్థను గాడిలో పెట్టేందుకు ఉద్యోగులందరూ అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల గురుగ్రామ్లోని ఎయిరిండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థ భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేస్తూనే ప్రస్తుత ఇబ్బందులను చంద్రశేఖరన్ హైలైట్ చేశారు.ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘గతంలో ఎయిరిండియా సిబ్బంది కంపెనీ క్లిష్ట సమయాల్లో ఎంతో పట్టుదల చూపారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. సంస్థ ఆశయాలకు అనుగుణంగా బలమైన పునాది వేసినప్పటికీ, విమానయాన రంగంలో వస్తున్న మార్పులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం మన నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెట్టాలి. పనితీరు అమలు, ఖర్చుల నియంత్రణలో రాజీ పడకూడదు’ అని సూచించారు.ఎయిరిండియాకు సవాళ్లు..టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఎయిరిండియాను పునరుద్ధరించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ పలు అంశాలు సంస్థను వేధిస్తున్నాయి. ఈ ఏడాది కంపెనీ తన అతిపెద్ద వార్షిక నష్టాన్ని నివేదించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్యాంప్బెల్ విల్సన్ కంపెనీ నుంచి నిష్క్రమిస్తుండడం మరో ఎదురుదెబ్బ. విస్తారాతో విలీనం తర్వాత ఏకీకరణ ప్రక్రియకు అవుతున్న భారీ ఖర్చులు, కొత్త విమానాల కొనుగోలు వ్యయం సంస్థపై భారాన్ని పెంచాయి.బాహ్య కారణాల ప్రభావంఅంతర్జాతీయ పరిణామాలు కూడా ఎయిరిండియా లాభదాయకతను దెబ్బతీస్తున్నాయి. పెరుగుతున్న విమాన ఇంధన ధరలు నిర్వహణ వ్యయాన్ని పెంచాయి. పాకిస్థాన్ గగనతలంపై ఆంక్షలు, మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానాలను ఇతర మార్గాల్లో మళ్లించాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా కీలకమైన అమెరికా, యూరప్ మార్గాల్లో కంపెనీ తన ఆధిక్యతను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.టాటా గ్రూప్ పూర్తి మద్దతుఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్థ పునరుద్ధరణకు టాటా గ్రూప్ కట్టుబడి ఉందని చంద్రశేఖరన్ భరోసా ఇచ్చారు. ‘టాటా గ్రూప్ బోర్డు సంస్థకు పూర్తి మద్దతు ఇస్తుంది. మేనేజ్మెంట్ టీమ్తో కలిసి నిరంతరం పనిచేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్బై.. తప్పుకొంటున్న కోఫౌండర్
ప్రముఖ ఫుడ్, గ్రొసరీ డెలివరీ దిగ్గజం 'స్విగ్గీ' (Swiggy)లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, ఇన్నోవేషన్ హెడ్ నందన్ రెడ్డి తన ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తన సొంత వెంచర్ను ప్రారంభించే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.వ్యవస్థాపక త్రయంలో మిగిలింది ఒక్కరే..శ్రీహర్ష మజేటీ, రాహుల్ జైమినిలతో కలిసి నందన్ రెడ్డి స్విగ్గీని స్థాపించారు. వీరిలో రాహుల్ జైమిని ఇప్పటికే 2020లో కంపెనీ నుంచి తప్పుకోగా, ఇప్పుడు నందన్ రెడ్డి కూడా వైదొలగడంతో వ్యవస్థాపక బృందంలో శ్రీహర్ష మజేటీ మాత్రమే మిగిలారు. "బెంగళూరులో ఒక చిన్న ప్రాంతంలో మొదలైన స్విగ్గీ నేడు దేశవ్యాప్తంగా విస్తరించడంలో నందన్ కృషి వెలకట్టలేనిది. ఆయన దార్శనికత మా కంపెనీ డీఎన్ఏలోనే ఉంది" అని కంపెనీ సీఈవో శ్రీహర్ష ఈ సందర్భంగా కొనియాడారు.బోర్డులో కొత్త ముఖాలునందన్ రెడ్డి నిష్క్రమణతో పాటు బోర్డు సభ్యుల్లోనూ స్విగ్గీ పలు మార్పులు చేపట్టింది. గతంలో 'ఇన్స్టామార్ట్' బాధ్యతలు చూసిన ఫణి కిషన్ అడెపల్లి ఇప్పుడు బోర్డు డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈయన చీఫ్ గ్రోత్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) రాహుల్ బోత్రా కూడా బోర్డులో చేరనున్నారు. మరోవైపు రెనాన్ డి కాస్ట్రో అల్వెస్ పింటో ప్రోసస్ వెంచర్స్ ప్రతినిధిగా బోర్డులోకి రానున్నారు.పెట్టుబడిదారుల హక్కుల్లో మార్పులుకంపెనీ తన 'ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్'ను సవరిస్తూ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కీలక విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. గతంలో డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉన్న యాక్సెల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి సంస్థల హక్కులను కంపెనీ తొలగించింది. గ్రూప్ సీఈఓ శ్రీహర్ష మజేటీకి బోర్డు సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని కల్పించారు. దీనివల్ల కంపెనీ నిర్ణయాధికారాల్లో మేనేజ్మెంట్కు పట్టు పెరగనుంది.ప్రస్తుతం ప్రతిపాదించిన ఈ మార్పులన్నీ వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి వస్తాయి. ఐపీఓ (IPO) దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో స్విగ్గీలో జరుగుతున్న ఈ అంతర్గత మార్పులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ ఒలెక్ట్రా కొత్త బ్రాండ్ ఐడెంటిటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్సుల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్టెక్ ‘ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే’ అనే ట్యాగ్లైన్తో తమ నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ స్థాయి నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏకీకృత మొబిలిటీ, పరిష్కారాలను అందించే ఆవిష్కరణల ఆధారిత సంస్థగా కంపెనీ పరిణామక్రమాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.పర్యావరణహిత మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా బాధ్యతాయుతమైన భవిష్యత్తువైపు ప్రపంచాన్ని నడిపించాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా ఇది ఉంటుందని సంస్థ ఎండీ మహేశ్ బాబు తెలిపారు. నిర్మాణాత్మక సమగ్రత, లక్ష్యంతో కూడుకున్న దిశను సూచించేలా త్రిభుజాకారంలో ఒలెక్ట్రా ప్రిజం, దాని చుట్టూ ఒలెక్ట్రా యూనివర్స్ని సూచించే వృత్తంతో లోగో ఉంటుంది. వాటాదారులు, నగరాలు, కంపెనీ అందించే సేవల విస్తృత వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తుంది. -
'అమెరికాలో కష్టం.. ఇండియా వస్తున్నాం'
అమెరికాలో నివసిస్తున్న ఒక ఎన్నారై జంట.. తాము పనిచేసే కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత భారతదేశానికి తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నారు. 2025 అక్టోబర్లో మహిళ ఉద్యోగం కోల్పోగా, ఇటీవల ఒరాకిల్ లేఆఫ్స్ సమయంలో ఆమె భర్తకు కూడా ఉద్యోగం పోయింది. 60 రోజుల గడువులో.. ఇండియాకు రావాలనుకుంటున్న సమయంలో జాబ్ కోసం నెటిజన్ల సలహాలు అడిగారు. దీనికి సంబంధించిన రెడ్దిట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన తరువాత నుంచి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, H4 వీసా కోసం ఎదురుచూశానని ఆమె పోస్టులో వెల్లడించారు. అయితే సరైన అవకాశాలు లేకపోవడంతో పరిస్థితి కష్టంగా మారింది. ఇదే సమయంలో తన భర్త కూడా ఉద్యోగం కోల్పోయారు. అతని H1B వీసాకు సంబంధించి PERM, I-140 ప్రాసెస్ లేకపోవడంతో, వీసా రిన్యూవల్ లేదా దీర్ఘకాలికంగా అమెరికాలో ఉండే అవకాశం లేకుండా పోయింది. దీంతో అతనికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే మిగిలింది.ఈ పరిస్థితుల్లో.. ఆ దంపతులు అమెరికాలో కొనసాగడం సాధ్యం కాదని భావించి, భారతదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూలై నాటికి ఇండియాకు వెళ్లి అక్కడ కొత్తగా జీవితం ప్రారంభించాలని వారు ఆలోచిస్తున్నారు. “ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఉద్యోగం ఎలా దొరుకుతుంది? ఎంత సమయం పడుతుంది? కెరీర్ను ఎలా మళ్లీ ప్రారంభించాలి?” వంటి ప్రశ్నలు అడిగారు. దీనికి నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.ఇదీ చదవండి: 'యాప్లు మాయం.. ఏఐ చేతికి జీవితం': నథింగ్ సీఈఓకొంతమంది ''భారతదేశంలో స్కిల్స్ ఉంటే ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి'' అని ప్రోత్సహించారు. మరికొందరు ''ఇక్కడ కూడా ఉద్యోగ మార్కెట్ కఠినంగానే ఉంది, కానీ అమెరికాతో పోలిస్తే స్థిరత్వం మెరుగ్గా ఉండొచ్చు'' అని చెప్పారు. ఇంకొందరు మాత్రం ''ముందు మానసికంగా స్థిరపడండి, తర్వాత ప్లానింగ్ చేసుకోండి'' అని సలహా ఇచ్చారు. -
అనంత్ బర్త్డే, స్పెషల్ కేక్, అంబానీ ముద్దు వైరల్
Anant Ambani Birthday Celebrations రిలయన్స్ వారసుడు, వ్యాపారవేత్త అనంత్ అంబానీ 31వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించు కున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఈ రోజు (ఏప్రిల్ 10) బర్త్డే జరుపుకుంటున్నారు. గుజరాత్లోని జామ్నగర్లోని వంతారా యూనివర్సిటీలో తండ్రి ముఖేష్ అంబానీ, భార్య రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అంబానీ కుటుంబం ఒక వేడుకను నిర్వహిస్తే, అది చాలా ఘనంగా ఉండాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆహార పంపిణీ కార్యక్రమాలతో ఈ సందర్భాన్ని జరుపుకోగా, అనంత్ స్వయంగా భోజనాలు వడ్డించడం దగ్గర్నించి, ఈ రాజరాజేశ్వర ఆలయ పునరుద్ధరణకు మద్దతు ప్రకటించడం వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.వంతారా యూనివర్సిటీఅలాగే తన తన కలల ప్రాజెక్ట్ 'వంతర'కు విస్తరణగా వంతర విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయడం మరో విశేషం. తన సన్నిహిత కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్ , తండ్రి ముఖేష్ అంబానీతో కలిసి విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?స్పెషల్గా కేక్ముఖ్యంగా ఈ వేడుకలో కేక్ అందరి దృష్టిని ఆకర్షించింది ప్రత్యేకమైన, పుస్తకం ఆకారంలో ఉన్న పుట్టినరోజు కేక్. ఇందులో అమర్చిన పేజీలపై "వన్యప్రాణులు, జ్ఞానానికి ఒక కొత్త అధ్యాయం," "వన్యప్రాణుల విద్యకు ఒక వారసత్వాన్ని ప్రారంభించడం," , "ప్రకృతి జ్ఞానాన్ని కలిసే చోట" వంటి పదబంధాలు ఉన్నాయి, ఇవి ప్రకృతి పట్ల అనంత్కున్న దార్శనికత , నిబద్ధతకు ప్రతిబింబంగా నిలుస్తుంది అంటున్నారు అభిమానులు. Anant Ambani celebrating his birthday with Ranveer Singh, Mukesh Ambani and Radhika at Vantara University.❤️The way Mukesh Ambani kissed Anant at the end… pure gold.👌🏻And honestly Ranveer is just on another level lately, literally the main character wherever he walks in.🔥 pic.twitter.com/NNzQZjqVRj— Rohan💫 (@rohann__45) April 10, 2026 ఆన్లైన్ వైరల్గా మారిన వీడియో ప్రకారం కేక్ కట్ చేసిన తరువాత ముఖేష్ అంబానీ అనంత్ను ముద్దు పెట్టుకున్న తీరు మరింత హృద్యంగా నిలిచింది. ఈ వేడుకుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సందడి చేశారు. జాహ్నవి కపూర్, రణ్వీర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితోపాటు వరుణ్ ధావన్, శిఖర్ పహారియా కూడా సరదాగా గడుపుతూ కనిపించారు. అలాగే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రితేష్ దేశ్ముఖ్ , షెహనాజ్ గిల్ ఈ వేడుకలకు హాజరైనట్టు సమాచారం. ఇదీ చదవండి: నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే! -
స్పెయిన్లో ఉద్యోగం.. ఇల్లు కూడా ఫ్రీ!
ఉన్న ఊరిలో లేదా నగరంలో కాకుండా.. ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే?, తప్పకుండా నివాసం (ఇల్లు) వెతుక్కోవాల్సిందే. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అయితే.. ఇంటి అద్దెలకు వేలరూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే.. వచ్చే జీతంలో ఇంటికోసం కొంత వెచ్చించాల్సి వస్తుంది. కానీ స్పెయిన్ దేశంలో ఒక చిన్న గ్రామం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.ఉద్యోగం ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా ఇల్లు కూడా ఇస్తామంటోంది స్పెయిన్లోని అరెనిల్లాస్. ఈ గ్రామం స్పెయిన్లోని సొరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ ప్రస్తుతం 40 మంది మాత్రమే శాశ్వత నివాసం ఉంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా గ్రామాల నుంచి పట్టణాలకు ప్రజలు వలస వెళ్తుండటంతో, ఈ ప్రాంతం 'ఎంప్టీ స్పెయిన్' అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ పరిస్థితిని మార్చడానికి ఈ ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది.షరతులుఈ ఆఫర్ ప్రకారం, ఒక కుటుంబానికి పూర్తిగా పునరుద్ధరించిన ఇల్లు ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా వారికి ఒక స్థిరమైన ఉద్యోగం కూడా కల్పిస్తారు. గ్రామంలో శాశ్వతంగా నివసించే అవకాశం కూడా ఉంటుంది. అయితే.. ఈ అవకాశానికి కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. ఆ కుటుంబానికి పాఠశాల వయస్సు ఉన్న పిల్లలు ఉండాలి. వారు గ్రామంలో పూర్తిగా నివసిస్తూ, గ్రామంలోని బార్ను నిర్వహించాలి. అదేవిధంగా భవనాల నిర్వహణ వంటి మున్సిపల్ పనులు కూడా చేయాలి.100 కంటే ఎక్కువ దరఖాస్తులు!నిజానికి ఎక్కడైనా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇల్లు కూడా ఇవ్వడం అనేది చాలా అరుదు. కానీ ఇలాంటి ఆఫర్ అరెనిల్లాస్ అందించడం చాలా ప్రత్యేకమైన విషయం. ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చాక.. ఇప్పటివరకు 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.అరెనిల్లాస్ గ్రామం పర్వత ప్రాంతంలో ఉండటం వల్ల ప్రకృతి అందాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. వసంత కాలంలో సుమారు 24°C వరకు ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ఇది ఒక అందమైన ప్రదేశంలా కనిపిస్తుంది.ఇబ్బందులూ ఉంటాయ్!ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉండటం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. శీతాకాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ప్రజా రవాణా సదుపాయాలు తక్కువగా ఉండటంతో, సొంత వాహనం అవసరం అవుతుంది. సమీప పాఠశాల సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అయితే పిల్లలకు ఉచిత రవాణా ఉంటుంది. ఆరోగ్య సేవలు కూడా ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటాయి.ఇదీ చదవండి: WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్ -
ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి దారి దొరికిందా?
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్ విక్రయ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఇద్దరు కొనుగోలుదారులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్ ధరకంటే తక్కువకు దాఖలు చేసిన బిడ్స్ సవరణను కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. బ్యాంక్లో వ్యూహాత్మక వాటా విక్రయంపై ప్రస్తుతం సాంకేతిక మదింపు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్, అసెట్ మానిటైజేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. ప్రపంచ అనిశి్చతుల ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థకు రక్షణగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వివరించారు. తద్వారా ద్రవ్యపరమైన దన్నుకు దారి ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలియజేశారు. మూడేళ్ల ప్రయత్నాల తదుపరి ఐడీబీఐ బ్యాంక్లో మెజారిటీ వాటా విక్రయ చర్యలు ఫైనాన్షియల్ బిడ్ స్థాయికి చేరిన విషయం విదితమే. వెరసి ప్రభుత్వం మళ్లీ తొలి నుంచీ మొదలుపెట్టేందుకు సిద్ధంగా లేదని ప్రభుత్వ అధికారి వెల్లడించారు.ఇది బ్యాంక్ విక్రయాన్ని మరింత ఆలస్యం చేసే వీలుండటంతో తాజా యోచనకు తెరతీస్తున్నట్లు పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటా 45.48 శాతంకాగా.. పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. దీంతో ప్రభుత్వం, ఎల్ఐసీ సంయుక్తంగా 60.72 శాతం వాటా విక్రయించేందుకు 2022 అక్టోబర్లో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్(ఈవోఐ)కు ఆహ్వానం పలికాయి. ప్రేమ్వత్సా సంస్థ ఫెయిర్ఫాక్స్, ఎమిరేట్స్ ఎన్బీడీ ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలు చేశాయి. బ్యాంక్లో ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం చొప్పున వాటా విక్రయించనున్నాయి. -
భారత్ పెట్రోలియం సీఎండీగా సంజీవ్ ఖన్నా
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కొత్త చైర్మన్, ఎండీగా (సీఎండీ) సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బీపీసీఎల్లోనే రిఫైనరీస్కు ఆయన డైరెక్టర్గా పనిచేశారు. సీఎండీగా జి.కృష్ణకుమార్ పదవీ కాలం 2025 ఏప్రిల్30తో ముగిసింది.అప్పటి నుంచి సీఎండీగా అదనపు బాధ్యతలను సైతం ఖన్నాయే చూశారు. పెట్రోలియం శాఖ నుంచి నియామకం సమాచారం రావడంతో సీఎండీ బాధ్యతలను ఖన్నా స్వీకరించినట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు బీపీసీఎల్ సమాచారం ఇచ్చింది. ఆయన నియామకం ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది.2029 మే 31 వరకు (పదవీ విరమణ) లేదంటే తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయన ఈ బాధ్యతలు చూస్తారని తెలిపింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లిలో ఖన్నా కెమికల్ ఇంజనీర్ చదివారు. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్లో పోస్ట్గ్రాడ్యుయేషన్ సైతం పూర్తి చేశారు. -
WFH అడిగిన ఉద్యోగి.. జాబ్ నుంచి తొలగించిన బాస్
కొన్ని కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగం నీటి మీద బుడగ మాదిరిగా అయిపోయింది. ఎప్పుడు జాబ్ పోతుందో?, ఎందుకు పోతుందో? తెలియక చాలామంది ఇప్పటికి కూడా భయం గుప్పెట్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఒకరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ కోరిన ఉద్యోగిని, బాస్ రెండు నిమిషాల్లోనే తొలగించారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గురుగ్రామ్కు చెందిన స్టార్టప్ ఫౌండర్ నిఖిల్ రాణా.. కంపెనీ The 15లో, ఒక ఉద్యోగిని కేవలం రెండు నిమిషాలలో తొలగించేసారు. దీనికి కారణం ఆ ఉద్యోగి ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడగడమే అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా షేర్ చేశారు.నిఖిల్ రాణా.. ఉద్యోగిని తొలగించడమే కాకుండా, ఆ విషయాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేసారు. అంతే కాకుండా కంపెనీలో ఉద్యోగుల నుంచి తాను ఏమి కోరుకుంటున్నాడనే విషయాన్ని కూడా వెల్లడించారు. నోటిస్ పీరియడ్ అనేది సమయం వృధా అని కూడా పేర్కొన్నారు.''స్వంత బాధ్యత తీసుకునే వ్యక్తులు, ఫౌండర్లపై ఆధారపడగలిగే వ్యక్తులు, ‘హై ఏజెన్సీ’ కలిగిన వ్యక్తులు, సరిగ్గా సమయం కోసం వేచి కూడదు, పనిని పూర్తి చేయగల వ్యక్తులు'' తనకు కావాలని నిఖిల్ రాణా చెప్పారు. నైపుణ్యాలకు ఎవరూ చిల్లిగవ్వ కూడా విలువ ఇవ్వరు. ఎందుకంటే అవి ఇప్పుడు సాధారణమయ్యాయి అని అన్నారు.నిఖిల్ రాణా తీరుపై చాలామంది విమర్శిస్తున్నారు. సానుభూతి లేకుండా ప్రవర్తించాడని, కేవలం ఒక రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగినందుకు తక్షణమే తొలగించడం అన్యాయం అని అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఉద్యోగుల నిబద్ధతకు మరింత ఖచ్చితమైన ప్రమాణాలు ఉండాలనేది రాణా ఫీప్రాయమని కొందరు మద్దతు ఇచ్చారు. -
‘హెక్టాకార్న్’గా మారిన రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ ప్రపంచంలో అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్ట్అప్ కంపెనీల గ్లోబల్ జాబితాలో 7వ స్థానాన్ని సాధించింది. స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ చేసిన పరిశోధన ప్రకారం.. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువతో ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. అత్యంత విలువైన టాప్ 100 స్టార్టప్ కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. అందులో రిలయన్స్ రిటైల్ అత్యున్నత ర్యాంక్ సాధించి, భారతదేశం బలమైన ప్రాతినిధ్యాన్ని చాటింది.రిపోర్ట్ ప్రకారం.. రిలయన్స్ రిటైల్ పోస్ట్ మనీ విలువ 100 బిలియన్ డాలర్లకు మించి ఉంది. దీంతో ఇది ప్రపంచంలో ‘హెక్టాకార్న్’గా పిలవబడే ఏడు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లను ‘హెక్టాకార్న్’ అని అంటారు. టాప్ 7 కంపెనీల్లో రిటైల్ రంగానికి చెందిన ఏకైక సంస్థ రిలయన్స్ రిటైల్ మాత్రమే.ఈ సంస్థకు ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కెకేఆర్, సిల్వర్ లేక్, జీఐసీ, టీపీజీ, ముబాదాలా వంటి ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు లభించాయి. ఇన్వెస్టర్లు నిర్ణయించిన కంపెనీ విలువనే ఈ ర్యాంకింగ్కు ప్రధాన ప్రమాణంగా తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యొక్క వెంచర్ క్యాపిటల్ ఇనిషియేటివ్ పరిశోధన ఆధారంగా, జనవరి 2026 వరకు ఉన్న డేటాతో రూపొందించబడింది.జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్, ఆంత్రోఫిక్ ఉన్నాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్స్లో టెక్నాలజీ, ఏఐ కంపెనీల పెరుగుతున్న ఆధిపత్యాన్ని సూచిస్తుంది.ఈ రిపోర్ట్లో మొత్తం మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా 24 బిలియన్ డాలర్ల విలువతో 27వ స్థానంలో ఉంది. టాటా ఈవీ మొబిలిటీ 9 బిలియన్ డాలర్ల విలువతో 93వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 65 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, కాగా చైనా నుంచి 21 కంపెనీలు ఉన్నాయి. భారత్, బ్రిటన్ నుంచి తలో మూడు కంపెనీలు చోటు సంపాదించాయి. -
4 రోజులే పని.. నచ్చినప్పుడే చేయొచ్చు..
కార్పొరేట్ ప్రపంచంలో 'హస్టిల్ కల్చర్' (నిరంతరం కష్టపడటం) పేరుతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వేళ, యూకేకి చెందిన ఒక పారిశ్రామికవేత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పని గంటల సంఖ్య కంటే, ఇచ్చే 'ఫలితాల'కే (Results-Only) ప్రాధాన్యతనిస్తూ తన సంస్థలో సరికొత్త పని వాతావరణాన్ని సృష్టించారు.ఒక్క మెసేజ్తో మొదలైన చర్చ'స్పైసీ మార్గరిటా' అనే ఎస్ఈఓ (SEO) కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు బెన్ గూడీ, ఇటీవల తన లింక్డ్ఇన్ పోస్ట్లో ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు. తన బృందంలోని ఒక సభ్యుడు, "ఈ రోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఈ పనిని వారాంతంలో పూర్తి చేయనా?" అని అడగడానికి ఇబ్బంది పడటం చూసి బెన్ ఆశ్చర్యపోయారు."నా సంస్థలో ఎవరినైనా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పని చేసుకోవచ్చు. పని పూర్తవుతుందా లేదా అన్నదే ముఖ్యం" అని బెన్ స్పష్టం చేశారు.బర్న్ అవుట్ నేర్పిన పాఠంతానూ గతంలో సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పుడు తీవ్రమైన 'బర్న్ అవుట్' (మానసిక, శారీరక అలసట) అనుభవించానని బెన్ గుర్తు చేసుకున్నారు. కేవలం పై అధికారులను మెప్పించడానికి, ఆఫీసులో ఎక్కువ గంటలు గడపడానికి ప్రయత్నించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత కంపెనీలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు.బెన్ గూడీ కంపెనీలో ప్రత్యేకతలువారానికి 4 రోజుల పని: రీఛార్జ్ అవ్వడానికి తగినంత సమయం.వర్క్ ఫ్రమ్ ఎనీవేర్: ప్రపంచంలో ఎక్కడి నుండైనా పని చేసే వెసులుబాటు.నిర్ణీత గంటలు లేవు: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కూర్చోవాలనే నిబంధన లేదు.అనవసర సమావేశాలకు స్వస్తి: సమయాన్ని వృధా చేసే మీటింగ్స్ను దాటవేసే స్వేచ్ఛ.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లుబెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "చాలా ఆఫీసుల్లో డెస్క్ దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నారనే లెక్కిస్తారు కానీ, ఎంత పని చేశారనేది చూడరు. మీ ఆలోచన చాలా బాగుంది" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "అనుమతి అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారంటే, అది పాత కార్పొరేట్ వ్యవస్థలు వారికి నేర్పిన భయం. దాన్ని పోగొట్టడానికి సమయం పడుతుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు.బెన్ గూడీ నేపథ్యంలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన బెన్ గూడీ, వివిధ రంగాల్లో అనుభవం గడించిన తర్వాత 2024లో 'స్పైసీ మార్గరిటా'ను స్థాపించారు. ప్రస్తుతం ఆయన తన సంస్థలో స్ట్రాటజీ లీడ్గా ఉంటూనే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. -
ఒక వైపు 30వేల లేఆఫ్స్.. మరోవైపు రూ.270 కోట్ల ఆఫర్!
ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించి వార్తల్లో నిలిచింది. ఇలాంటి సమయంలో కంపెనీ చీప్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (CFO)గా హిలరీ మ్యాక్సన్ను భారీ వేతనంతో నియమించింది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చకు దారితీసింది.ఒరాకిల్ కొత్త సీఎఫ్ఓ హిలరీ మ్యాక్సన్కు కంపెనీ 9,50,000 డాలర్ల జీతం ఇవ్వనుంది. అదనంగా పనితీరు ఆధారంగా 2.5 మిలియన్ డాలర్ల వరకు బోనస్ పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా 26 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ (షేర్లు) కూడా సంస్థ అందిస్తుంది. వీటిలో 80 శాతం సమయానికి అనుసంధానమైనవి కాగా, 20 శాతం పనితీరుపై ఆధారపడి ఉంటాయి.మ్యాక్సన్ తన ఈక్విటీని పూర్తిగా స్టాక్ ఆప్షన్ల రూపంలో లేదా స్టాక్ ఆప్షన్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల రూపంలో తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కంపెనీ ఆమెకు 2,50,000 విలువైన రీలోకేషన్ అలవెన్స్ కూడా అందిస్తోంది. ఇవన్నీ కలిగి ఆమె మొత్తం ప్యాకేజీ సుమారు 29.7 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.273 కోట్లు) చేరుకుంటుంది.హిలరీ మ్యాక్సన్ ఒరాకిల్లో చేరడానికి ముందు.. ష్నైడర్ ఎలక్ట్రిక్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ సీఎఫ్ఓగా పనిచేశారు. అంతే కాకుండా ఆమె ఏఈఎస్ కార్పొరేషన్లో 12 సంవత్సరాలు పాటు ఫైనాన్స్, స్ట్రాటజీ మొదలైన విభాగాల్లో పాటు కీలక బాధ్యతలు నిర్వహించారు.కంపెనీ భారీ లేఆఫ్స్ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ భారీ లేఆఫ్ ప్రభావం భారతదేశంలో సుమారు 12,000 మంది ఉద్యోగులపై పడింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం.. కంపెనీ నిర్మాణ మార్పులు, ఖర్చు తగ్గింపు చర్యలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని తెలుస్తోంది. ఈ కోతలు ఒరాకిల్ హెల్త్, సేల్స్, క్లౌడ్, కస్టమర్ సక్సెస్, నెట్సూట్లోని సిబ్బందిని ప్రభావితం చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు! -
అనంత్ అంబానీ బర్త్డే స్పెషల్.. గజరాజులకు విందు..
వన్యప్రాణుల పట్ల తనకున్న అమితమైన ప్రేమను అనంత్ అంబానీ మరోసారి చాటుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు రాజస్థాన్ రాజధాని జైపూర్ శివార్లలోని హాథీ గావ్లో జరిగాయి. మూగజీవాల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా స్థానిక ‘హాథీ గావ్ వికాస్ సమితి’ ఈ వినూత్న వేడుకను నిర్వహించింది.ఈ వేడుకలో ఏనుగుల కోసం ఏర్పాటు చేసిన భారీ ‘ఫ్రూట్ బఫే’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 3,000 కిలోల బరువున్న వివిధ రకాల పండ్లను ఏనుగులకు విందుగా వడ్డించారు. ఈ బఫేలో అరటిపండ్లు, యాపిల్స్, పుచ్చకాయ, బొప్పాయి, నారింజ వంటి కాలానుగుణ ఫలాలతో పాటు ఏనుగులకు ఇష్టమైన చెరకు, బెల్లం, పచ్చి పశుగ్రాసాన్ని భారీగా సిద్ధం చేశారు. రాజస్థానీ సాంప్రదాయ శైలిలో అలంకరించిన గజరాజులు ఈ విందును ఆస్వాదించాయి.మావత్ కుటుంబాలకు అండగా..వన్యప్రాణుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే మావత్ (ఏనుగుల సంరక్షకులు)లను ఈ సందర్భంగా సమితి గౌరవించింది. ఏనుగుల సంక్షేమం కోసం శ్రమించే వారికి నిత్యావసర వస్తువులతో కూడిన రేషన్ కిట్లు, దుస్తులు, టోపీలు, పాదరక్షలు, రోజువారీ వినియోగ వస్తువులను పంపిణీ చేశారు.అనంత్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్లో 3,500 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి వన్యప్రాణి పునరావాస కేంద్రం వంతారాను స్థాపించిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో వేధింపులకు గురైన, అనారోగ్యంతో ఉన్న సుమారు 200 జాతులకు చెందిన జంతువులకు వంతారాలో ఆశ్రయం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లోని ఏనుగుల సంరక్షణకు ఆయన అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల స్ఫూర్తి పొంది ఈ వేడుకను నిర్వహించినట్లు హాథీ గావ్ వికాస్ సమితి అధ్యక్షుడు షఫీక్ బల్లు ఖాన్ తెలిపారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ? -
డిస్నీలో లేఆఫ్స్?
ప్రపంచ వినోద రంగ దిగ్గజం ‘వాల్ట్ డిస్నీ’ తన ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది వారాల్లో సుమారు 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ప్రధానంగా కంపెనీలోని మార్కెటింగ్ విభాగంపై ఈ ప్రభావం అధికంగా ఉండనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.మార్కెటింగ్ విభాగమే లక్ష్యంగా..డిస్నీలో జరుగుతున్న ఈ తాజా పరిణామాలు సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగమని తెలుస్తోంది. కొత్తగా నియమితులైన చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ) అసద్ అయాజ్ కంపెనీ మార్కెటింగ్ గ్రూపును ఏకీకృతం చేసే పనిలో ఉన్నారు. ‘ప్రాజెక్ట్ ఇమాజిన్’ అనే రహస్య కోడ్ పేరుతో వ్యయ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జనవరిలో బాధ్యతలు చేపట్టిన అయాజ్ సంస్థలోని అన్ని మార్కెటింగ్ కార్యకలాపాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు.కొత్త చేపట్టబోయే లేఆఫ్స్ డిస్నీ మొత్తం శ్రామిక శక్తిలో 1 శాతం కంటే తక్కువే. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి డిస్నీలో సుమారు 2,31,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జోష్ డి అమారో డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు స్వీకరించక ముందే ఈ ఉద్యోగాల తగ్గింపు ప్రణాళికలు సిద్ధమైనట్లు సమాచారం.స్పందించని డిస్నీ యాజమాన్యంఈ వార్తలపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టత కోరగా, డిస్నీ యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆఫీస్ పనివేళలు ముగిసిన తర్వాత ఈ నివేదిక బయటకు రావడంతో కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించడానికి అందుబాటులోకి రాలేదు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్కి ప్రత్యేక వర్గీకరణ
నిర్వర్తించే విధులను బట్టి బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్స్ని రెండు కేటగిరీలుగా వర్గీకరించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. వారికి ఇచ్చే కమీషన్ లేదా రెమ్యూనరేషన్ ఒకే విధంగా ఉండేలా ప్రతిపాదించింది. బ్రాంచ్ ఆథరైజేషన్కి సంబంధించి విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం మూడు డెలివరీ పాయింట్లను ఆర్బీఐ ప్రతిపాదించింది.ఇందులో బ్యాంక్ శాఖలతో పాటు బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ అవుట్లెట్ (బీసీ–బీవో), బిజినెస్ కరెస్పాండెంట్–బ్యాంకింగ్ టచ్పాయింట్ (బీసీ–బీటీ) ఉన్నాయి. ప్రస్తుతమున్న బిజినెస్ ఫెసిలిటేటర్ల స్థానంలో, బీసీలని నియమించుకోవడాన్ని సులభతరం చేయడం ఈ నిబంధనల ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంది. దీనిపై ప్రజలు, సంబంధిత వర్గాలు మే 5 నాటికి తమ అభిప్రాయాలను నియంత్రణ సంస్థకి తెలియజేయాల్సి ఉంటుంది. మారు మూల ప్రాంతాల్లో కూడా ఆర్థిక సేవలను విస్తరించే దిశగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు ..రిటైల్ బ్యాంకింగ్ సేవలు అందిస్తుంటారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
డిస్కౌంట్లకన్నా సౌకర్యానికే ఓటు
దేశీయంగా క్విక్ కామర్స్ వినియోగదారులు డిస్కౌంట్ల కన్నా సౌకర్యానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. డిస్కౌంట్లు తగ్గించినా సరే సదరు ప్లాట్ఫాంలను వినియోగించడాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా వినియోగదారుల ధోరణుల్లో వస్తున్న మార్పులను సూచించేలా గ్రాంట్ థార్న్టన్ భారత్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో 1,600 మంది వినియోగదారులు, 1,000కి పైగా కిరాణా స్టోర్స్ ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. దీని ప్రకారం రోజువారీ కొనుగోళ్ల విషయంలో ధర కన్నా వేగం, లభ్యతకు ప్రాధాన్యత పెరుగుతోంది. డిస్కౌంట్లను తగ్గించినా కూడా క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలను వినియోగించడాన్ని కొనసాగిస్తామంటూ 70 శాతం మంది తెలిపారు. సంప్రదాయ రిటైల్ ఫార్మాట్ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేయడం కాకుండా, నిర్దిష్ట సందర్భాల కోసం మాత్రమే క్విక్ కామర్స్ని ప్రజలు వినియోగిస్తున్నారు. ఆఖరు నిమిషపు, అర్జంట్ ఆర్డర్ల కోసం 45 శాతం మంది వినియోగదారులు వీటిని ఎంచుకుంటున్నారు. ఇక 24 శాతం మంది పాలు, బ్రెడ్లాంటి ప్రతి రోజు అవసరమయ్యే వాటి కోసం ఉపయోగిస్తున్నారు. 19 శాతం మంది అప్పటికప్పుడు తినాలని, తాగాలనిపించే స్నాక్స్, పానీయాల్లాంటి కోసం క్విక్ కామర్స్ ప్లాట్ఫాలంను వినియోగిస్తున్నారు. నివేదికలో మరిన్ని విశేషాలు..గత ఏడాది వ్యవధిలో కిరాణా స్టోర్స్పై ఆధారపడటాన్ని తగ్గించుకున్నట్లు 51 శాతం మంది తెలిపారు. అయితే, 27 శాతం మంది ఈ విషయంలో చెప్పుకోతగ్గ మార్పేమీ లేదనగా, 13 శాతం మంది మాత్రం ఇప్పుడు వీటిని మరింతగా ఎంచుకుంటున్నట్లు చెప్పారు.మార్జిన్లపరంగా ఒత్తిడి పెరుగుతుండటం, వినియోగదారుల్లో మారుతున్న ధోరణులకు అనుగుణంగా సంప్రదాయ రిటైలర్లు వ్యాపారాన్ని తీర్చిదిద్దుకునేందుకు సుముఖంగా ఉంటున్నారు.40 శాతం మంది కిరాణా రిటైలర్లు, క్విక్ కామర్స్ ప్లాట్ఫాంలతో జట్టు కట్టడంపై ఆసక్తి వ్యక్తం చేశారు.32 శాతం మంది తమకు ఆసక్తిగా ఉన్నా, ఇలాంటి భాగస్వామ్యాలు ఎలా పని చేస్తాయనేది తెలియడం లేదని పేర్కొన్నారు. తమకు నిర్వహణపరమైన లేదా సాంకేతికపరమైన మద్దతు లభిస్తే తప్పకుండా జట్టు కడతామని 20 శాతం కిరాణా రిటైలర్లు తెలిపారు. ద్వితీయ శ్రేణి, వర్ధమాన పట్టణ మార్కెట్లు రాబోయే రోజుల్లో రిటైల్ రంగ తదుపరి వృద్ధి చోదకాలుగా ఉండనున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
త్వరలో 14 వేల మందిపై వేటు? అమెజాన్ స్పందన ఇదే!
అమెరికన్ దిగ్గజం, ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో భారీ విడత ఉద్యోగ కోతలకు ప్రణాళిక రచిస్తున్నట్లువార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలలో 14 వేల మందిని ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందా? ఈ ఏడాది జనవరిలో 16 వేల మందికి ఉద్వాసన పలకడం, ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా 30వేలమందిని తొలగించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల్లో భారీ ఆందోళన నెలకొంది. దీనిపై అమెజాన్ ఎలా స్పందించింది?అమెజాన్ వచ్చే మే నెలలో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించనుందన్న వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అమెజాన్ 2026 మే నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14వేల మందినితొలగించాలని యోచిస్తున్నట్లు బిజినెస్ అవుట్లుక్ తెలిపింది. ముఖ్యంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, మానవ వనరుల వంటి విభాగాలలో మధ్య-స్థాయి మేనేజర్లు,వైట్-కాలర్ ఉద్యోగులతో సహా కార్పొరేట్ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేసింది. ఇదీ చదవండి: కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్ చంద్రశేఖర్!అమెజాన్ స్పందనఈ వార్తలపై అమెజాన్ స్పందించింది. ఇవన్నీ పుకార్లే నని కొట్టి పారేసింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ ప్రచారం విశ్వసించవద్దని అమెజాన్ ప్రతినిధి కోరారు. ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి -
38 ఏళ్ల నాటి రికార్డ్.. ఆకాశంలో తపాలా సేవలు
ఇప్పుడంటే సాంకేతిక పరిజ్ఙానం అందుబాటులోకి రావడంతో కేవలం సింగిల్ క్లిక్ లో వాట్సాప్ మెసేజెస్ , ఫొటోస్, వీడియోస్ ఎక్కడ నుంచి ఎక్కడికైనా పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు వీడియో కాల్స్ ద్వారా ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకునే అవకాశం ఉంది. దేశ, విదేశాలనుంచి కాకుండా పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు సైతం టక్కుమని క్లిక్ చేస్తే ఈ-మెయిల్ వెళ్ళిపోతుంది, సెకన్లలో అవతలి వ్యక్తికి సందేశం చేరుతుంది. కానీ, ఒకప్పుడు మారుమూల దీవులకు ఉత్తరం చేరాలంటే రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఆ నిరీక్షణకు తెరదించుతూ, సరిగ్గా 38 ఏళ్ల క్రితం భారత తపాలా శాఖ ఆకాశ మార్గాన చేపట్టిన ఒక సాహసోపేత ప్రయోగం 'హెలికాప్టర్ పోస్టల్ సర్వీస్'. కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన ఆ విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..హెలికాప్టర్ పోస్టల్ సేవలు.. భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ పోస్టల్ సేవలు 1988, జనవరి 27న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అగాధమైన సముద్రం, దట్టమైన అడవులతో కూడిన అండమాన్ నికోబార్ దీవులను ఈ చారిత్రక ఘట్టానికి వేదికగా ఎంచుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ నుంచి హావ్లాక్ దీవుల మధ్య సాగిన ఈ మొదటి ప్రయాణం తపాలా వ్యవస్థలో ఒక మైలురాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని విజయవంతం చేయడానికి భారత తపాలా శాఖ, పవన్ హాన్స్ లిమిటెడ్తో జతకట్టింది.మెయిల్ బస్తాలను చేరవేయడానికి శక్తివంతమైన 'డౌఫిన్' హెలికాప్టర్లను రంగంలోకి దించారు. గతంలో పడవలు లేదా ఇతర మార్గాల ద్వారా ఉత్తరాలు చేరడానికి రెండు మూడు రోజులు పట్టే చోట, హెలికాప్టర్ పుణ్యమా అని గంటల వ్యవధిలోనే సందేశాలు చేరడం ప్రారంభమైంది. ఈ తొలి ప్రయాణాన్ని స్మరిస్తూ విడుదల చేసిన 'ఫస్ట్ డే కవర్లు', ప్రత్యేక స్టాంపులు నేటికీ తపాలా బిళ్ళల సేకరణకర్తలకు నిధి లాంటివి.ఆకాశ మార్గాన తపాలా సేవలు.. ఆకాశ మార్గాన తపాలా సేవలు అందించాలనే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచంలోనే తొలి హెలికాప్టర్ మెయిల్ సర్వీస్ 1947, అక్టోబర్ 1న అమెరికాలో మొదలైంది. లాస్ ఏంజిల్స్ ఎయిర్వేస్ సహకారంతో 'సికోర్స్కీ ఎస్-51' హెలికాప్టర్ ద్వారా ఈ సేవలు అందించారు. అమెరికా బాటలోనే నడుస్తూ బ్రిటన్ కూడా 1948లో తన సొంత హెలికాప్టర్ పోస్టల్ సేవలను ప్రారంభించి ఐరోపాలో రికార్డు సృష్టించింది.సాంకేతికత ఎంత పెరిగినా, ఆనాడు మారుమూల ప్రాంతాల ప్రజలను అనుసంధానించడానికి భారత తపాలా శాఖ చేసిన ఈ 'గగన విహారం' ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. మేఘాలను చీల్చుకుంటూ వచ్చిన ఆ ఉత్తరం వెనుక ఎన్నో కుటుంబాల అనురాగాలు, ఆప్యాయతలు ఉండేవి.. అలాంటివాటిని ఏమాత్రం చెక్కుచెదరకుండా వారికి అందించిన ఘనత భారత తపాలా శాఖకు దక్కుతుంది. -పసుపులేటి వెంకటేశ్వరరావు. -
BMWలో అమ్మడికి జాక్పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!
బీఎండబ్ల్యూ (BMW) వంటి దిగ్గజ సంస్థలో 19 ఏళ్ల యువతి డిగ్రీ లేకుండానే ఉద్యోగం సాధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా బీఎండబ్ల్యూ వంటి మల్టీనేషనల్ కంపెనీలో మార్కెటింగ్ రోల్ సాధించాలంటే కనీసం డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. కానీ, గౌరీ ఎమ్ అనే 19 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ ఎలాంటి ఫార్మల్ డిగ్రీ లేకుండానే, డిజిటల్ స్పేస్లో ఆమెకున్న పర్సనల్ బ్రాండింగ్ పవర్ కారణంగా ఆ సంస్థలో పర్సనల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.ఎలాంటి డిగ్రీ లేకుండానే ప్రపంచంలోనే ప్రీమియం కార్లు, మోటార్సైకిళ్లను ప్రతిష్టాత్మక కంపెనీ బీఎండబ్ల్యూలో ఉద్యోగం సంపాదించిందంటూ ఒక లింక్డ్ఇన్ పోస్ట్ వైరల్ అవుతోంది. అకడమిక్ అర్హతలతో సంబంధం లేకుండా, కేవలం బలమైన వ్యక్తిగత బ్రాండ్ను, సోషల్ మీడియా ఉనికి ద్వారా కంటెంట్ క్రియేటర్ గౌరీ ఎం పూర్తికాల పర్సనల్ మార్కెటింగ్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. వివిధ ప్లాట్ఫామ్లలో గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లింక్డ్ఇన్లో 65,000 మందికి పైగా, ఇన్స్టాగ్రామ్లో 35 వేల మందికి పైగా ఉన్నారని ఆ పోస్ట్ ద్వారా తెలుస్తోంది.పైగా ఆమె ఏ కంపెనీకి దరఖాస్తు చేసుకోలేదు, కనీసం కోల్డ్ ఈమెయిల్స్ కూడా పంపలేదు. ఆమె కంటెంట్ చూసి కంపెనీ ప్రతినిధులే స్వయంగా ఆమెను సంప్రదించడం విశేషం."నేను కేవలం 19 ఏళ్ల అమ్మాయిని, నాకున్న వనరులతో ఏదైనా సాధించాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ నన్ను గుర్తించి ఉద్యోగం ఆఫర్ చేయడం నమ్మలేకపోతున్నాను" అని ఆమె లింక్డ్ఇన్లో పోస్ట్లో వెల్లడించింది.నెటిజన్ల స్పందన ఈ విషయంలో నెటిజన్లు రెండు రకాలుగా స్పందించారు. ప్రస్తుతకాలంలో కేవలం డిగ్రీల కంటే నైపుణ్యం (Skills) , పర్సనల్ బ్రాండింగ్ ముఖ్యమని, సోషల్ మీడియాను కెరీర్ ఎదుగుదలకు ఎలా వాడుకోవాలో గౌరీ నిరూపించిందని కొందరు ప్రశంసించారు. మరోవైపు ఇలాంటివి అరుదుగా జరుగుతాయి, అన్ని రంగాల్లో డిగ్రీ లేకుండా ఉద్యోగాలు రావడం సాధ్యం కాదు అంటూ ఉద్యోగార్థులను హెచ్చరించారు. సంప్రదాయ విద్యా విధానం ప్రాముఖ్యతను తక్కువ చేయకూడదని సూచించడం గమనార్హం.ఇదీ చదవండి: షార్ట్కట్ జర్నీ : కుటుంబంలో 9 మంది సజీవ సమాధి -
విమానయాన రంగానికి భారీ ఊరట
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. విమానశ్రయాలలో వసూలు చేసే ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 3 నెలల పాటు 25 శాతం తగ్గిస్తూ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఈఆర్ఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.రంగంలోకి ఏఈఆర్ఏకేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఈఆర్ఏ ఈ తాత్కాలిక తగ్గింపును తక్షణమే అమలులోకి తెచ్చింది. రాబోయే మూడు నెలల వరకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఛార్జీల తగ్గింపు వల్ల విమానాశ్రయాలకు కలిగే ఆదాయ లోటును భవిష్యత్తులో చేపట్టే టారిఫ్ సమీక్షల ద్వారా సర్దుబాటు చేస్తామని రెగ్యులేటర్ ఏఈఆర్ఏ చేసింది.దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాశ్రయ రుసుములను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ సంస్థలు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పాకిస్థాన్ గగనతలంపై నిషేధం ఉండటంతో భారత విమానాలు ఇప్పటికే చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. ఇరాన్ యుద్ధ మేఘాల వల్ల పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాల ఇంధన ఖర్చులు, నిర్వహణ వ్యయం భారీగా పెరిగింది. ‘ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలకు ఇంధనం, సిబ్బంది వేతనాల తర్వాత విమానాశ్రయ, ఎయిర్ నావిగేషన్ సర్వీస్ ఛార్జీలే అధిక ఖర్చులుగా ఉన్నాయి’ అని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) తెలిపింది.మరోవైపు, అంతర్జాతీయంగా చోటుచేసుకున్న సానుకూల పరిణామాలు విమానయాన రంగ షేర్లకు ఊపునిచ్చాయి. ఇరాన్తో అమెరికా రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన వార్తలతో బుధవారం ట్రేడింగ్లో ఇండిగో షేర్లు లాభపడ్డాయి. యుద్ధం సద్దుమణిగితే ఇంధన ధరలు దిగివస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్లు విమానయాన రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..


