Corporate
-
యూఎస్లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికంగా తయారీని పునరుద్ధరించడానికి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా వంటి దేశాల్లో భారీగా తయారవుతున్న యాపిల్ వంటి అమెరికన్ కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కంపెనీ కూడా చాలాకాలంగా ఈమేరకు సుంకాల నుంచి మినహాయింపు కావాలని యూఎన్ను కోరుతుంది. దాంతో అమెరికా ఇటీవల ఫోన్లు, కంప్యూటర్లను ప్రతీకార సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అసలు యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను ఎందుకు యూఎస్లో తయారు చేయదో నిపుణులు విశ్లేషిస్తున్నారు.అమెరికాలో ఐఫోన్ల తయారీ అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. 2011 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ సహా సిలికాన్ వ్యాలీలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులు పాల్గొన్నారు. అందులోని సారాంశాన్ని 2012లో న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్లో మరణించడానికంటే కొన్ని నెలల ముందు ఈ సమావేశం జరిగింది. అందులో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతున్న సమయంలో అమెరికాలో ఐఫోన్లు తయారు చేయడానికి ఏమి కావాలని ఒబామా ఒక ప్రశ్న అడిగారు. దానికి స్పందించిన స్టీవ్జాబ్స్ నిర్మొహమాటంగా యాపిల్ తయారీకి యూఎస్ కంటే ఇతర దేశాలే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.ఇదీ చదవండి: డజను మంది మాజీ ఉద్యోగులు న్యాయపోరాటంయాపిల్ ఇతర దేశాల్లో ఉత్పత్తులను తయారు చేసేందుకు గల కొన్ని కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చైనా వంటి దేశాలు దశాబ్దాలుగా అత్యంత ప్రత్యేకమైన తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఇందులో నైపుణ్యం కలిగిన కార్మికులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాయి. యూఎస్లో లేబర్, ఉత్పత్తి ఖర్చులు ఇతర దేశాలతో పోలిస్తే అధికంగా ఉంటాయి. అమెరికాలో ఐఫోన్లు తయారైతే వాటి ధర మూడింతలు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్లో కూడా ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల ద్వారా యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు మార్జిన్లు అంతంతే..
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ సంస్థలకు 2024–25 సంవత్సరం మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. ఆదాయం సగటున 5 శాతం వృద్ధి చెందినట్టు కంపెనీలు తెలిపాయి. అదే సమయంలో మార్జిన్లలో ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్గానే ఉండడం గమనార్హం. గోద్రేజ్ కన్జ్యూమర్, ఇమామీ మినహా మిగిలిన కంపెనీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) ఆదాయం అంచనాలను బీఎన్పీ పారిబా తగ్గించింది.ముడి చమురు ధరలు తగ్గడం, గ్రామీణ వృద్ధి కోలుకోవడం వంటి సానుకూలతలతో 2025–26లో సానుకూల బేస్ ఏర్పడుతుందని పేర్కొంది. 2024–25 క్యూ4లో (మార్చి త్రైమాసికం) అధిక శాతం కమోడిటీల ధరలు గరిష్ట స్థాయిలోనే ఉన్నట్టు బీఎన్పీ పారిబా నివేదిక వెల్లడించింది. ఇది కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. పామాయిల్, టీ ధరలు మాత్రం తగ్గినట్టు తెలిపింది. స్టాపుల్స్ (నిత్యావసరాలు) విక్రయాలకు క్యూ4 బలహీన క్వార్టర్గా ఉంటుందని పేర్కొంది.10 ఎఫ్ఎంసీజీ కంపెనీలకు గాను 9 కంపెనీల స్థూల మార్జిన్లు బలహీనంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అగ్రి ముడి పదార్థాల ధరల ఒత్తిళ్లు వీ టిపై ఉన్నట్టు వివరించింది. టైటాన్, జుబిలెంట్ ఫు డ్స్ వంటి విచక్షణా రహిత వినియోగ ఆధారిత కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయని పేర్కొంది. 1–8 శాతం మద్య వృద్ధి.. ‘‘2025–26 ఆర్థిక సంత్సరంలో మేము అధ్యయనానికి పరిగణనలోకి తీసుకున్న 10 కంపెనీలకు గాను 8 కంపెనీలకు ఆదాయం వృద్ధి 1–8 శాతం మధ్యే ఉంటుంది. గోద్రేజ్ కన్జ్యూమర్, ఇమామీ కంపెనీలకు వృద్ధి కాస్త మెరుగ్గా ఉండొచ్చు’’అని బీఎన్పీ పారిబా నివేదిక తెలిపింది. ఈ సంస్థ పరిగణనలోకి తీసుకున్న మిగిలిన కంపెనీల్లో హెచ్యూఎల్, బ్రిటానియా, డాబర్, ఐటీసీ, మారికో, నెస్లే ఇండియా, జుబిలెంట్ ఫుడ్స్, టైటాన్ ఉన్నాయి. -
డజను మంది మాజీ ఉద్యోగులు న్యాయపోరాటం
ఓపెన్ఏఐ లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభమై క్రమంగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోందని కంపెనీకి చెందిన 12 మంది మాజీ ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని ఉద్ధృతం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ ఉద్యోగులు సైతం ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.లాభాపేక్షలేని సంస్థగా ప్రారంభమైన ఓపెన్ఏఐ ప్రస్తుత మార్కెట్ విధానాలతో ప్రాథమికంగా దాని లక్ష్యాన్ని ఉల్లంఘిస్తుందని మాజీ ఉద్యోగులు ఇటీవల ఫెడరల్ కోర్టు ఫైలింగ్లో వివరాలు వెల్లడించారు. ఇది నాన్ప్రాఫిట్ ఏఐ అభివృద్ధి సంస్థ నిబంధనలను అతిక్రమిస్తుందని తెలిపారు. సంస్థలో తాము చాలాకాలం పాటు సాంకేతిక, పాత్రలను నిర్వహించామని చెప్పారు. లాభాపేక్షలేని పర్యవేక్షణ అనేది గతంలో మొత్తం కంపెనీ వ్యూహానికి కీలకంగా మారిందని చెప్పారు. దాంతో చాలామందికి కంపెనీ ప్రతిపాదన నచ్చి రిక్రూట్మెంట్ ఊపందుకుందని తెలిపారు. కానీ సంస్థ క్రమంగా తన వైఖరి మార్చుకుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: పరిశ్రమ వర్గాల వ్యతిరేకత.. స్థిరంగా ప్రభుత్వంఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ గతంలో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు. మరోవైపు ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించడానికి లాభాపేక్షలేని సంస్థ పాత్రను తొలగించాల్సిన అవసరం ఉందని ఓపెన్ఏఐ వాదిస్తుంది. -
పరిశ్రమ వర్గాల వ్యతిరేకత.. స్థిరంగా ప్రభుత్వం
భారతదేశం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్) సరైన విధంగా నిర్వహించాలని తీసుకొచ్చిన ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీని పరిశ్రమ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. మెరుగైన పర్యావరణం కోసం ఈ పాలసీని ప్రవేశపెట్టినా కంపెనీల ప్రతికూలతతో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ విధానం వల్ల కంపెనీల ఆదాయాలు ప్రభావితం చెందుతున్నాయని సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో పర్యావరణ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది. కాగా, డైకిన్, హిటాచీ, శామ్సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు సహా ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఈ పాలసీలోని అంశాలను వ్యతిరేకిస్తున్నాయి.ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను లక్ష్యంగా చేసుకుని ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఈ విధానం కఠినమైన ఆదేశాలను ప్రవేశపెట్టింది. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ఎకోసిస్టమ్ను క్రమబద్ధీకరించడానికి రూపొందించిన విధానాల కోసం కంపెనీలు అధిక మొత్తంలో వెచ్చించాల్సి రావడమే దీని వ్యతిరేకతకు కారణం. కొన్ని సందర్భాల్లో రీసైక్లింగ్ ఖర్చులు మూడింతలు అవుతుండడంతో ఆయా కంపెనీల ఆదాయాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.మెరుగైన ఈ-వేస్ట్ నిర్వహణే లక్ష్యంగాప్రపంచవ్యాప్తంగా భారతదేశం మూడో అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. పట్టణీకరణ వేగంగా విస్తరించడం, సాంకేతికత పెరుగుతుండడంతో ఈ-వేస్ట్ కూడా అందుకు అనుగుణంగానే అధికమవుతుంది. దాంతో పర్యావరణ పరిణామాలను పరిష్కరించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ-వేస్ట్ నిర్వహణ కోసం అధిక రీసైక్లింగ్ ఫీజులను అమలు చేయడం ద్వారా బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది.అనవసరమైన ఆర్థిక ఒత్తిడిఈ విధానంపై ఎలక్ట్రానిక్స్ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన ఖర్చులు వ్యాపారాలపై అనవసరమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయని చెబుతున్నాయి. దీనికితోడు ఈ పాలసీలోని నిబంధనల అమలు కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని తెలుపుతున్నాయి. ఇది వినియోగదారులకు కంపెనీ ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారితీస్తాయని వాదిస్తున్నాయి. ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొన్ని కంపెనీలు న్యాయపరమైన సవాళ్లను కూడా దాఖలు చేశాయి. ఈ ఆకస్మిక మార్పులు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తాయని తెలిపాయి. అధిక పోటీ మార్కెట్లో సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తాయని భావిస్తున్నాయి.ఇదీ చదవండి: ఈవీలపై మహిళలకు రూ.36,000 రాయితీ.. లిమిటెడ్ ఆఫర్పాలసీ ప్రతిపాదకుల వాదన ఇదే..ఈ పాలసీపై కంపెనీల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభుత్వ విధానాల్లో ఎలాంటి మార్పులు లేవు. పెరుగుతున్న ఈ-వ్యర్థాల సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం నొక్కి చెప్పింది. స్వల్పకాలిక ఆర్థిక భారాల కంటే దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయని ఈ విధానం ప్రతిపాదకులు తెలుపుతున్నారు. ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం వల్ల ఉద్యోగాలు సృష్టించబడతాయని చెబుతున్నారు. కార్మికుల భద్రత మెరుగుపడుతుందని, హానికర పదార్థాలను సరిగ్గా నిర్వహించేలా చూడవచ్చని అభిప్రాయపడుతున్నారు. -
అదానీ గ్రూప్లో రూ. 2,165 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ చేపట్టిన బాండ్ల జారీలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. అదానీ గ్రూప్ 75 కోట్ల డాలర్ల(రూ. 6,500 కోట్లు) విలువైన బాండ్ల జారీని చేపట్టగా.. 25 కోట్ల డాలర్ల(సుమారు రూ. 2,165 కోట్లు)తో సబ్స్క్రయిబ్ చేసినట్లు తెలుస్తోంది.సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 3–5ఏళ్ల కాలపరిమితితో అదానీ గ్రూప్ ఈ బాండ్లు విడుదల చేసింది. కాగా.. గతేడాది నవంబర్లో లంచం ఆఫర్ చేసిన కేసు నమోదుకావడంతో అదానీ గ్రూప్పై యూఎస్ న్యాయశాఖ పరిశోధనకు తెరతీసింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ బాండ్లలో బ్లాక్రాక్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ @ రూ.22,150 కోట్లు
న్యూఢిల్లీ: డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ స్థిరమైన వృద్ధిని చూస్తోంది. పరిశ్రమ విలువ 2024 మార్చి నాటికి రూ.22,150 కోట్లకు చేరుకున్నట్టు ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడీఎస్ఏ) ప్రకటించింది. ఈ రంగంలో 470 వరకు చిన్న, పెద్ద సంస్థలు దేశంలో సేవలు అందిస్తుండగా, వీటి పరిధిలో కొత్తగా 1.86 లక్షల మంది ప్రత్యక్ష విక్రేతలు (డైరెక్ట్ సెల్లర్స్) 2023–24లో నమోదైనట్టు తెలిపింది. గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24) డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ఏటా 7.15 శాతం చొప్పున వృద్ధి చెందుతూ.. రూ.16,800 కోట్ల నుంచి రూ.22,142 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. ఈ రంగంలో ఆరోగ్య సంరక్షణ, పోషకాహార ఉత్పత్తులు అధిక అమ్మకాలతో 64.15 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐడీఎస్ఏ వార్షిక నివేదిక తెలిపింది. కాస్మెటిక్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల అమ్మకాల వాటా 23.75 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. ఈ రెండు విభాగాల వాటా 2023–24 మొత్తం అమ్మకాల్లో 87.9 శాతంగా ఉన్నట్టు తెలిపింది. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో ఉత్తరాది 29.8 శాతం వాటాతో ముఖ్య పాత్ర పోషిస్తోంది. తూర్పు భారత్ నుంచి 24.2 శాతం అమ్మకాలు కొనసాగగా, ఇందులో పశ్చిమబెంగాల్ నుంచే 11.3 శాతం సమకూరింది. పశ్చిమ భారత్లో అమ్మకాలు 22.4 శాతంగా ఉంటే, దక్షిణాదిన 15.3 శాతం అమ్మకాలు కొనసాగాయి. ఎనిమిది రాష్ట్రాలతో కూడిన ఈశాన్య భారత్లో అమ్మకాలు 8.3 శాతంగా ఉన్నాయి. మహారాష్ట్ర ప్రధాన మార్కెట్.. 13 శాతం వాటాతో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ అమ్మకాల్లో (2023–24) మహారాష్ట్ర అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, యూపీ, బీహార్, కర్ణాటక, ఒడిశా, హర్యానా, ఢిల్లీ, అసోం, గుజరాత్ టాప్ 10 రాష్ట్రాలుగా ఉన్నాయి. పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70 శాతం ఈ రాష్ట్రాల నుంచే వచి్చంది. 2023 మార్చి నాటికి మొత్తం డైరెక్ట్ సెల్లర్స్ 88.06 లక్షలుగా ఉంటే, 2024 మార్చి నాటికి 86.2 లక్షలకు పెరిగారు. చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే ప్రత్యక్ష విక్రేతల్లో 56 శాతం మంది పురుషులు కాగా, 44 శాతం మహిళలు ఉన్నారు. మొత్తం విక్రేతల్లో 73.2 శాతం 25–54 ఏళ్ల వయసులోని వారు కావడం గమనార్హం. అంతేకాదు విక్రేతల్లో అత్యధికులకు ఉన్నత విద్యార్హతలున్నాయి. 52 శాతం మంది గ్రాడ్యుయేషన్, 26 శాతం మందికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారే. ప్రత్యక్ష విక్రయాల్లో ఇళ్ల నుంచి చేసేవి అధికంగా ఉన్నాయి. డిజిటల్ ఛానళ్ల ద్వారా అమ్మకాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. 17 శాతం విక్రేతలు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర వాటి సాయంతో అమ్మకాలు పెంచుకుంటుంటే, 15 శాతం మంది వాట్సాప్, మెస్సేజింగ్ యాప్స్ సాయం తీసుకుంటున్నారు. -
హైరింగ్ ప్రణాళికల్లో కంపెనీలు...
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున కంపెనీలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. వర్క్ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్ఆర్ సేవల సంస్థ జీనియస్ కన్సల్టెంట్స్ నిర్వహించిన ’హైరింగ్, కాంపన్సేషన్, అట్రిషన్ మేనేజ్మెంట్ అవుట్లుక్ సర్వే 2025–26’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా 1,520 మంది సీఎక్స్వోలు, సీనియర్ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నివేదిక ప్రకారం 45 శాతం సంస్థలు కొత్తగా పర్మనెంట్ ఉద్యోగులను తీసుకువాలని భావిస్తుండగా 13 శాతం కంపెనీలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు లేక ఖాళీ కాబోతున్న పోస్టులను భర్తీ చేసుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. కానీ మరికొన్ని సంస్థలు హైరింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ ప్రణాళికలేమీ లేవని 16 శాతం సంస్థలు తెలిపాయి. తాత్కాలిక స్టాఫింగ్ వైపు మొగ్గు.. తాత్కాలిక కొలువులకు కూడా డిమాండ్ పెరుగుతోంది. 26 శాతం కంపెనీలు టెంపొరరీ, కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ ఆధారిత పనుల కోసం ఉద్యోగులను తీసుకునే యోచనలో ఉన్నాయి. గిగ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అధారిత ఉద్యోగులు, అడ్వైజరీ సేవలందించే వారిని హైరింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు బదులుగా తాత్కాలిక సిబ్బందిని తీసుకునే ధోరణి పెరుగుతోందనడానికి ఇది నిదర్శనమని సర్వే పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 37 శాతం కంపెనీలు మిడ్–లెవెల్ నిపుణులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. మరోవైపు, 19 శాతం కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తుండగా, 18 శాతం సంస్థలు సీనియర్ లీడర్షిప్ స్థానాల్లోకి సిబ్బందిని నియమించుకునే యోచనలో ఉన్నాయి. ‘ఆర్థిక అనిశ్చితులను దాటుకుంటూ కంపెనీలు ముందుకెళ్తున్న క్రమంలో ప్రతిభావంతులైన నిపుణులకు డిమాండ్ నెలకొంది. మిడ్–సీనియర్ ప్రొఫెషనల్స్కి భారీగా డిమాండ్ ఉండటంతో అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రిసు్కలను అధిగమించి, సిబ్బందిని అట్టే పెట్టుకోవడంపై కంపెనీలు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2025–26లో కంపెనీలు సమర్ధవంతమైన విధంగా హైరింగ్ ప్రణాళికలను వేసుకునేందుకు ఈ విశేషాలు ఉపయోగపడతాయి‘ అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్ ఆర్పీ యాదవ్ చెప్పారు. మరిన్ని విశేషాలు.. → 53 శాతం కంపెనీలు హైరింగ్ వృద్ధి ఒక మోస్తరుగా 5–10 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నాయి. మరోవైపు 33 శాతం కంపెనీలు 10–15 శాతం అధికంగా నియామకాలు చేపట్టాలని భావిస్తున్నాయి. → పరిశ్రమలవారీగా చూస్తే రిటైల్, క్యూ–కామర్స్లో అత్యధికంగా 21 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ విభాగాల్లోనూ సుమారు 9 శాతం సంస్థలు సిబ్బందిని తీసుకోనున్నాయి. → ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వాహనాల విభాగాల్లో రిక్రూట్మెంట్ అధికంగా ఉంటుందని 15 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. రెన్యూవబుల్స్, ఎనర్జీ, ఇంజినీరింగ్ ప్రాజెక్టుల విభాగాల్లో 11 శాతం కంపెనీలు రిక్రూట్మెంట్ చేపట్టనున్నాయి. → ఐటీ సర్వీసులు, టెలికం, టెక్నాలజీ విభాగాల్లో 13 శాతం, తయారీ, ఇంజినీరింగ్లో 11 శాతం, ఇన్ఫ్రా, రవాణా, రియల్ ఎస్టేట్లో 10 శాతం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా)లో 9 శాతం సంస్థలు హైరింగ్ యోచనలో ఉన్నాయి. → ఇక, ఎఫ్ఎంసీజీ, హెల్త్కేర్, హాస్పిటాలిటీ, మీడియా..ఎంటర్టైన్మెంట్, విద్య తదితర రంగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హైరింగ్ ఒక మోస్తరుగానే ఉండవచ్చని అంచనా. -
నేపాల్కి ఒకేఒక్కడు.. ఈ బిలియనీర్
సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఇన్స్టంట్ ఫుడ్ సెక్షన్లో ప్రసిద్ధ వాయ్ వాయ్ నూడుల్స్ (Wai Wai noodles) ప్యాక్లను చూస్తుంటాం. అయితే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ నూడుల్స్ వెనుక ఎవరున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనే బినోద్ కుమార్ చౌదరి (Binod Kumar Chaudhary). నేపాల్కు చెందిన ఈయన "నూడుల్స్ కింగ్" గా ప్రసిద్ధి చెందారు. బినోద్ కుమార్ చౌదరి ఎవరు.. భారత్తో ఆయనకున్న సంబంధం ఏంటి.. ఆసక్తికరమైన ఈ బిజినెస్మ్యాన్ కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.రాజస్థాన్ నుంచి నేపాల్కు..70వ ఏట అడుగుపెడుతున్న బినోద్ కుమార్ చౌదరి 1955 ఏప్రిల్ 14న నేపాల్ రాజధాని ఖాట్మండులో మార్వాడీ కుటుంబంలో జన్మించారు. ఆయన తాత భూరమల్ దాస్ చౌదరి భారత్లోని రాజస్థాన్ నుండి నేపాల్ కు వలస వచ్చి వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. బినోద్ కుమార్ చౌదరి తండ్రి లుంకరణ్ దాస్ చౌదరి ఆ వ్యాపారాన్ని దేశంలో మొట్టమొదటి డిపార్ట్మెంటల్ స్టోర్గా విస్తరించారు. బినోద్ కుమార్ చౌదరికి సారిక చౌదరితో వివాహం కాగా వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరు కూడా వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.వ్యాపారాలుడజన్ల కొద్దీ దేశాల్లో 160కి పైగా కంపెనీలను కలిగి ఉన్న బహుళజాతి సంస్థ చౌదరి గ్రూప్ (సీజీ కార్ప్ గ్లోబల్)కు చౌదరి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీ పేరుతో 120కి పైగా బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 15,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ గ్రూప్నకు చెందిన వాయ్ వాయ్ బ్రాండ్ నూడుల్స్ నేపాల్, భారత్లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతవుతున్నాయి. బినోద్ కుమార్ చౌదరికి రియల్ ఎస్టేట్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ, టెలికాం, బయోటెక్నాలజీ రంగాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి.రాజకీయాలు, దాతృత్వంబినోద్ కుమార్ చౌదరి నేపాలీ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ ప్రముఖులతో ఆయనకు అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఆయన దాతృత్వ కార్యక్రమాలు కూడా చురుగ్గా నిర్వహిస్తుంటారు. 1995లో చౌదరి ఫౌండేషన్ను స్థాపించిన ఆయన 2015లో నేపాల్ లో భూకంపం సంభవించినప్పుడు 10,000 ఇళ్లు, 100 పాఠశాలల పునర్నిర్మాణానికి రూ.20 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. లక్షలాది ఆహార పొట్లాలు, ఇతర సామగ్రిని అందించారు.ఏకైక నేపాలీ బిలియనీర్పలు నివేదికల ప్రకారం.. బినోద్ కుమార్ చౌదరి నెట్వర్త్ 2 బిలియన్ డాలర్లు (రూ .17,200 కోట్లకు పైగా). నేపాల్లో మొదటి, ఏకైక బిలియర్ ఈయనే కావడం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బినోద్ కుమార్ చౌదరి కఠినమైన శాఖాహారి. దీంతో ఆయన ప్రసిద్ధి చెందిన తమ వాయ్ వాయ్ బ్రాండ్ చికెన్ నూడుల్స్ ఎప్పుడూ రుచి చూడలేదు. -
ఫ్లిప్కార్ట్కు గట్టిదెబ్బ.. రూ.కోటికి పైగా జరిమానా..
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆన్లైన్ బీమా పంపిణీకి సంబంధించిన ఈ-కామర్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫ్లిప్కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్ఐపీఎల్)కు ఐఆర్డీఏఐ రూ.1.06 కోట్ల జరిమానా విధించింది.ఫ్లిప్కార్ట్ పాల్పడిన ఉల్లంఘనలు ఇవే.. ఫ్లిప్కార్ట్ పలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. పాలసీ కొనుగోలుదారులను నేరుగా బీమా కంపెనీకి కాకుండా బీమా మధ్యవర్తికి మళ్లించడం ద్వారా ఐఆర్డీఏఐ మార్గదర్శకాలను ఉల్లంఘించింది. గడువు ముగిసిన రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీమా పాలసీలను విక్రయించడం వల్ల అదనపు జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. తగినంత నైపుణ్యం లేకపోవడం అంటే కేవలం ఒకేఒక శిక్షణ పొందిన బీమా నిపుణుడితో 70,000 కంటే ఎక్కువ బీమా పాలసీలను విక్రయించింది. ఇది వినియోగదారుల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది.పాలసీదారులపై ప్రభావంరెగ్యులేటరీ చర్య పాలసీ చెల్లుబాటు, క్లెయిమ్ సెటిల్మెంట్లు, కస్టమర్ మద్దతుపై ఆందోళనలను లేవనెత్తుతుంది. తప్పుడు అమ్మకం ప్రమాదాల కారణంగా కొనుగోలుదారులు పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడంలో అడ్డంకులను ఎదుర్కొంటారు. అయితే రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన తర్వాత జారీ చేసిన పాలసీలు చట్టపరమైన అనిశ్చితులను ఎదుర్కోవచ్చు. అదనంగా, శిక్షణ పొందిన సిబ్బంది పరిమిత లభ్యత పాలసీదారు సహాయం, వివాద పరిష్కారాన్ని ప్రభావితం చేస్తుంది.కఠినంగా బీమా అమ్మకాలుజరిమానాను అంగీకరించిన ఫ్లిప్కార్ట్, పరిశ్రమ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిస్తూ ఐఆర్డీఏఐ ఉత్తర్వులను పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఈ చర్య ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా బీమా అమ్మకాలను కఠినంగా అమలు చేయడానికి సంకేతం. పాలసీ కొనుగోలుదారులు ఆన్లైన్లో బీమా కొనుగోలు చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ వివరాలను ధృవీకరించడం, పాలసీ నిబంధనలను జాగ్రత్తగా చదవడం, సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ నుండి మార్గదర్శకత్వం పొందడం మంచిది. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
2025లో కూడా లేఆప్స్ సర్వ సాధారణం అయిపోయాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం లెక్కలు మించిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ (GM) చేరింది.జనరల్ మోటార్స్ కంపెనీ.. ఆల్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ జీరో ప్లాంట్ నుంచి 200 మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీరిని మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకుంటారు అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా.. ఉత్పత్తి సర్దుబాటులో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపుకు.. టారిఫ్ల ప్రభావం కాదని సంస్థ స్పష్టం చేసింది.కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఫ్యాక్టరీ జీరోలో దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్లో సంస్థ హై ప్రొఫైల్ ఈవీ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో చేవ్రొలెట్ సిల్వరాడో, జీఎంసీ సియెర్రా ఈవీ, హమ్మర్ ఈవీ పికప్ వంటి వాటితో పాటు రాబోయే కాడిలాక్ ఎస్కలేడ్ ఐక్యూ ఉన్నాయి.ఇదీ చదవండి: యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్పీసీఐ -
ప్రపంచానికి మహీంద్రా హెచ్చరిక.. ట్వీట్ వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రపంచ వాణిజ్య డైనమిక్స్ వేగంగా మారుతున్నాయని హెచ్చరించారు. ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఎగుమతిదారుల ఇన్ఫోగ్రాఫిక్ ర్యాంకింగ్స్ను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. దాంతోపాటు బాబ్ డైలాన్ రాసిన పాటలోని సారాంశాన్ని కూడా పోస్ట్ చేశారు. ప్రపంచంలోని విభిన్న దేశాల ఎగుమతుల ఆధిపత్యం ఎక్కువ కాలం ఉండకపోవచ్చని సూచించారు.‘ఈ చార్ట్ చూడండి. ఎందుకంటే ఈ క్రమం మీరు ఊహించిన దానికంటే వేగంగా మారబోతోంది. ఇప్పుడు ఎగుమతుల్లో ముందువరుసలో ఉన్న కొన్ని దేశాలు కొంతకాలానికి తర్వాతి స్థానాలకు పడిపోతాయి’ అని తెలియజేస్తూ బాబ్డైలాన్ గీతాన్ని కోట్ చేశారు. ఆయన షేర్ చేసిన ఛార్ట్లో ఎగుమతుల పరంగా చైనా (3.51 ట్రిలియన్ డాలర్లు), యునైటెడ్ స్టేట్స్ (3.05 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (2.10 ట్రిలియన్ డాలర్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. తరువాత జపాన్, యూకే, ఫ్రాన్స్, భారతదేశం వంటి దేశాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేతమైన టారిఫ్ నిర్ణయాల కారణంగా ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమదైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్?Take a good look at this chart. Because the order is going to change faster than you may imagine. “The line it is drawnThe curse it is castThe slow one nowWill later be fastAs the present nowWill later be pastThe order is rapidly fadin'And the first one nowWill later… pic.twitter.com/FhO8r0vlZ5— anand mahindra (@anandmahindra) April 11, 2025ప్రపంచ ఎగుమతులకు సంబంధించి మెకానికల్ ఇంజినీరింగ్ వరల్డ్ రూపొందించిన ఛార్ట్ను మహీంద్రా షేర్ చేసిన క్రమంలో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రపంచంలోని టాప్ 10 ఎగుమతిదారులను ప్రదర్శించే జాబితాలో భారతదేశం ఉనికి పట్ల కొందరు ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది దేశం కొన్ని సంవత్సరాలలో రెండో లేదా మూడో స్థానానికి చేరుకోవచ్చని సూచించారు. -
విదేశీ కంపెనీలకు ఆహ్వానం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్లో ఇన్వెస్ట్ చేయమంటూ ఆస్ట్రియన్ కంపెనీలకు తాజాగా ఆహ్వానం పలికారు. నూతన, వర్ధమాన రంగాలలో ఇందుకు పలు అవకాశాలున్నట్లు పేర్కొ న్నారు. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఇండియా– ఆస్ట్రియా బిజినెస్ రౌండ్టేబుల్ సందర్భంగా భారత్లో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవలసిందిగా సూచించారు.ఆర్థిక పురోభివృద్ధి, సులభతర బిజినెస్ నిర్వహణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశం వేగంగా ముందుకెళుతున్నట్లు తెలియజేశారు. వర్ధమాన రంగాలలో పలు అవకాశాలు పుడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజెన్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్లను ప్రస్తావించారు. ఆసియా, దక్షిణ ప్రపంచానికి భారత్ అద్భుతమైన గేట్వేగా అభివర్ణించారు.ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్?ఇండియా–ఆస్ట్రియా ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందని, అత్యధిక అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. భారత్లో విస్తరించిన తయారీ, సామర్థ్యాలను ప్రస్తావిస్తూ ఆస్ట్రియన్ కంపెనీలు కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. తద్వారా దేశీయంగా లభించే అత్యున్నత ఐటీ, డిజిటల్ నైపుణ్యాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. -
కష్టపడి పనిచేయాలనుకుంటే?: బిల్గేట్స్ సమాధానమిదే..
జెరోధ ఫౌండర్ 'నిఖిల్ కామత్' పాడ్కాస్ట్ సిరీస్ 'పీపుల్ బై డబ్ల్యుటీఎఫ్'లో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ 'బిల్గేట్స్' కనిపించారు. ఈ కార్యక్రమంలో ఏఐ గురించి, భారతదేశంతో ఉన్న సంబంధం గురించి విషయాలను బిల్గేట్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ కార్యక్రమంలో నిఖిల్ కామత్.. గేట్స్తో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నప్పుడల్లా తొందరపడుతున్నట్లు కనిపిస్తారని, మీపై మీరు కఠినంగా ఉంటారా అని అడిగారు. దీనికి సమాధానమిస్తూ.. ఆలా ఉండటం నాకు ఇష్టం. తమను తాము మోసం చేసుకోకుండా కష్టపడి పనిచేయాలనుకుంటే.. చాలా కఠినంగా ఉండాలని బిల్గేట్స్ వెల్లడించారు.ఏఐ గురించి మాట్లాడుతూ.. భవిష్యత్ శ్రామిక శక్తిని ఎలా పునర్నిర్మించగలదో కూడా గేట్స్ ప్రస్తావించారు. ఇరవై సంవత్సరాల తరువాత ఏఐ బ్లూ-కాలర్ కార్మికులుగా పనిచేస్తుందని అన్నారు. ఏఐ అనేది మేధో, శారీరక పనులను ఒకే విధంగా నిర్వహిస్తుందని గేట్స్ వివరించారు.గేట్స్ తన తొలినాటి తెలివితేటల చాలా సరళంగా ఉండేవని అంగీకరించారు. మీరు లెక్కలు (గణితం) బాగా చేయగలిగితే, ఏదైనా చేయగలరు. మీరు గణితం సరిగ్గా చేయలేకపోతే, ఏమీ చేయలేరని తన అనుభవాలను వెల్లడించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్లో నా అనుభవం, ఆలోచనను మార్చింది. ఫౌండేషన్ పనికి వివిధ విభాగాలు.. సంస్కృతులలో సహకారం అవసరం. ఇది విభిన్న నైపుణ్యాలు, దృక్పథాల విలువను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని అన్నారు.ఇదీ చదవండి: తత్కాల్ బుకింగ్ టైమింగ్స్లో మార్పు లేదు: ఐఆర్సీటీసీ క్లారిటీభారతదేశాన్ని అనేకమార్లు సందర్శించిన బిల్గేట్స్.. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పూరి, జితేంద్ర సింగ్ మొదలైనవారిని కలుసుకున్నారు. గత మార్చిలో కూడా గేట్స్ ఇండియాను సందర్శించారు. భారత్ సందర్శనం చాలా అద్భుతంగా ఉంటుందని గేట్స్ అన్నారు. వచ్చే ఏడాది కూడా మరోసారి భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని సమాచారం.Full Episode 8, @BillGates Part 2Live now: https://t.co/M4ha3oFWko pic.twitter.com/buX16cgTZa— Nikhil Kamath (@nikhilkamathcio) April 11, 2025 -
థియేటర్ల పంట పండుతుందిలా..
ప్రముఖ మూవీ మల్టీప్లెక్స్ పీవీఆర్ ఐనాక్స్ గురుగ్రామ్, బెంగళూరు వంటి ఎంపిక చేసిన నగరాల్లో కొత్త సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపింది. సినిమా చేసే సమయంలో ప్రేక్షకులు థియేటర్ల్లో మద్యం సేవించడానికి లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. థియేటర్లలో తగ్గుతున్న ప్రేక్షకులను ఆకర్షించేందుకు, అదే సమయంలో మరింత వ్యాపారాన్ని పెంచుకునేందుకు కంపెనీ ఈమేరకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్లు కేవలం సినిమాలు చూడటానికి మాత్రమే వేదికలు కాదు. వినోదం, ఆతిథ్యం, రిటైల్, సాంకేతికతను మిళితం చేసి ప్రేక్షకులకు మెరుగైన సర్వీసులు అందించే డైనమిక్ వ్యాపార కేంద్రాలుగా తయారవుతున్నాయి. మల్టీప్లెక్స్లో ఎలాంటి వ్యాపారం సాగుతుందో కింద తెలుసుకుందాం.సినిమాయే కోర్ బిజినెస్ఏ మల్టీప్లెక్స్కైనా సినిమాలను ప్రదర్శించడమే ప్రధాన వ్యాపారం. స్టూడియోల నుంచి పంపిణీ హక్కులను పొందడం, మల్టీ స్క్రీన్లలో షోటైమ్లను షెడ్యూల్ చేయడం, ప్రేక్షకులకు టిక్కెట్లను విక్రయించడం ఇందులో భాగంగా ఉంటాయి. మల్టీప్లెక్స్లు హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ నుంచి చిన్న, ప్రాంతీయ సినిమాలు వరకు దాదాపు అన్ని రకాల సినిమాలను ప్రదర్శిస్తూ టికెట్ ఫేర్ ద్వారా డబ్బు సంపాదిస్తాయి.ఫుడ్ సర్వీస్సినిమా థియేటర్ ఆవరణలో కూల్డ్రింక్స్, పాప్కార్న్, ఇతర ఆహార పదార్థాలు దర్శనమిస్తాయి. మల్టీప్లెక్స్లో వీటి ధర కూడా సాధారణం కంటే అధికంగానే ఉంటాయి. ఈమేరకు ఆయా సంస్థలు లైసెన్స్లు పొందాల్సి ఉంటుంది. స్నాక్స్, పానీయాలు, కాంబో డీల్స్ అమ్మకాలు, పిజ్జా, బర్గర్లు, సుషీ వంటి డైన్ ఇన్ సర్వీసులతో థియేటర్లు కొంత సంపాదిస్తాయి. కొన్ని మల్టీప్లెక్స్ల్లో ఇన్-హౌస్ రెస్టారెంట్లు లేదా ఫుడ్ కోర్టులు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నేరుగా థియేటర్ యాజమాన్యమే వీటిని నిర్వహిస్తుంది. ఇంకొన్ని ప్రాంతాల్లో థర్డ్ పార్టీ విక్రేతలకు లీజుకు ఇస్తాయి. దానివల్ల సమకూరే అద్దె లేదా ప్రాఫిట్లో భాగస్వామ్యం ద్వారా అదనపు ఆదాయంగా ఉంటుంది.లగ్జరీ ఏర్పాట్లుమల్లీప్లెక్స్లో ప్రీమియం ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. మల్టీప్లెక్స్లు వీఐపీ ఆడిటోరియంలు, రెక్లైనర్ సీటింగ్ లేదా ప్రైవేట్ స్క్రీనింగ్ గదులు వంటి ప్రీమియం సర్వీసులు అందిస్తున్నాయి. వీటికి ప్రేక్షకులు ప్రత్యేకంగా ధర చెల్లించాల్సి ఉంటుంది.అడ్వర్టైజింగ్ అండ్ స్పాన్సర్షిప్స్మల్టీప్లెక్స్లు ప్రధాన అడ్వర్టైజింగ్ ప్లాట్ ఫామ్లు, ప్రీ-షో వాణిజ్య ప్రకటనలు, ఇన్-లాబీ ప్రమోషన్లు, బ్రాండింగ్ పార్ట్నర్షిప్ల కోసం కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. నేషనల్ సినీమీడియా (ఎన్సీఎం) లేదా స్క్రీన్విజన్ వంటి సంస్థలచే తరచుగా నిర్వహించబడే ప్రీ-మూవీ స్లైడ్లు, వాణిజ్య ప్రకటనలు ఆదాయ వనరుగా ఉంటున్నాయి. థియేటర్లలోని డిజిటల్ సైనేజ్, పోస్టర్లు, ఇంటరాక్టివ్ డిప్ప్లేల ద్వారా స్థానిక వ్యాపారాలు లేదా కార్పొరేట్ స్పాన్సర్లను ఆకర్షిస్తుంటారు. కస్టమర్ల బిజినెస్ విస్తరణ కోసం ఇది ఎంతో తోడ్పడుతుంది.ఇదీ చదవండి: డాలర్కు ట్రంప్ గండంరిటైల్ అండ్ మర్కండైజింగ్మల్టీప్లెక్స్లు పాపులర్ సినిమాలకు సంబంధించిన దుస్తులు, బొమ్మలు, పోస్టర్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. స్టార్ వార్స్ లేదా మార్వెల్ థీమ్.. వంటి హాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థలు కొన్ని సినిమాలకు చెందిన లిమిటెడ్ ఎడిషన్ వస్తువులను థియేటర్లలో విక్రయిస్తుంటాయి. అందులో నుంచి కూడా మల్టీప్లెక్స్కు ఆదాయం వస్తుంది. -
అనంత్ లవ్యూ, సర్ప్రైజ్ కేక్ కట్, వీడియో వైరల్
దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ సామ్రాజ్యవారసుడు, బిలియనీర్ అనంత్ అంబానీ పుట్టిన రోజంటే ఓ రేంజ్ ఉండాలి. అతిరథమహారథులు, సెలబ్రిటీలు, విశిష్ట అతిథులు..ఇలా బోలెడంతా హంగామా, హడావిడి ఉండాలి అనుకోవడంలో, ఉండటంలో సందేహం లేదు. కానీ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా, అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఈసారి ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన పుట్టిన రోజు వేడుకల్లో అభిమానులందర్నీ సర్ప్రైజ్ చేశాడు. దీనికి సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఏమిటబ్బా అది? నెట్టింట వైరల్గా మారిన ఆ వీడియో విశేషాలేంటో తెలుసుకుందాం రండి! అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవల (ఏప్రిల్ 10న) తన 30వ పుట్టినరోజును జరుపుకున్నారు. గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకాధీశ ఆలయానికి అనంత్ అంబానీ 170 కి.మీల పాదయాత్ర చేసిన మరీ తన బర్త్డే వేడుకలకు ఒక ఆధ్మాత్మిక వైభవాన్ని తీసుకొచ్చారు. తనకెంతో విశ్వాసమైన భద్రతా సిబ్బంది మధ్య కేక్ కట్ చేయడం విశేషంగా నిలిచింది. అనేకమంది నెటిజన్ల ప్రశంసలందుకుంది. ఆ క్షణం అనంత్ చూపించిన ఆప్యాయత, సర్ప్రైజ్ అందరినీ ఆకర్షించింది. నల్లటి పట్టు కుర్తా పైజామాలో మెరిసిపోతున్న బర్త్డే బోయ్కి పూల బొకేను అందించింది సెక్యూరిటీ టీం (Security guards). వారి అభినందనలు, కేరింతల మధ్య అనంత్ ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అంబానీ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. భారతదేశంలోని అత్యంత ధనిక కుటుంబ వారసుడు ఇలా నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం నెటిజనులకు తెగ నచ్చేసింది. వీడియో అంబానీ కుటుంబానికి, అతని బాడీ గార్డులకు మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయతలకు నిదర్శనం అంటున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)అనంత్ అంబానీ మాజీ నానీ భావోద్వేగ పుట్టినరోజు శుభాకాంక్షలుఅనంత్కి వచ్చిన అనేక పుట్టినరోజు సందేశాలలో మరో ప్రత్యేకమైంది ఉంది. అదేంటీ, అంటే తనకి చిన్నప్పుడు నానీగా పనిచేసిన లలితా డిసిల్వా, చిన్న అనంత్ సాంప్రదాయ దుస్తులు ధరించి, ఛాతీపై చిన్న భారతీయ జెండాను ధరించి ఉన్న అనంత్ చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేశారామె. ఆ ఫోటోతో పాటు, లలిత ఒక భావోద్వేగ అభినందను రాసుకొచ్చారు.“నా అనంత్కి బోలెడన్ని పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతన్ని దీవించుగాక. నా అనంత్ ఇప్పుడు చాలా పెద్దవాడు. అతను జంతువులను అమితంగా ప్రేమించే తీరు నిజంగా మెచ్చుకోదగ్గది. జంతువుల భద్రత కోసం మీరు చేసిన కృషికి అనంత్, లవ్యూ...మీ రోజును ఆస్వాదించండి, అందమైన పుట్టినరోజు. శుభాకాంక్షలు’’ -
ఎయిర్పోర్ట్ ఆపరేటర్ల ఆదాయాలు రయ్..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానాశ్రయాల ఆపరేటర్ల ఆదాయాలు 18–20 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ప్యాసిజర్ల ట్రాఫిక్ పెరుగుతుండటం, టారిఫ్ల పెంపుతో పాటు ఏరోనాటికల్యేతర ఆదాయాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం నమోదైన 10 శాతం వృద్ధిని బట్టి చూస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ల ట్రాఫిక్ (దేశీ, విదేశీ రూట్లలో ప్రయాణించేవారు కలిపి) సుమారు 7–9 శాతం పెరిగి 44–45 కోట్లకు చేరనుంది. గత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య 41.2–41.5 కోట్ల స్థాయిలో నమోదైంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నవి, అలాగే పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్ కింద నిర్వహించే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచి్చన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు సహా వివిధ విమానాశ్రయాల శాంపిల్ సెట్ ఆధారంగా ఇక్రా ఈ నివేదికను రూపొందించింది. కొత్తగా భోగాపురం (ఆంధ్రప్రదేశ్), పరందూర్ (చెన్నై), నవీ ముంబై, జేవర్ (నోయిడా) వంటి విమానాశ్రయాలు వస్తుండటంతో రాబోయే 4–5 ఏళ్లలో రూ. 1 లక్ష కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇంటర్నేషనల్ ట్రాఫిక్ దన్ను.. ‘కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడటం, అంతర్జాతీయంగా టూరిజం పుంజుకోవడంలాంటి అంశాల దన్నుతో దేశీ రూట్లలో ప్రయాణించే ప్యాసింజర్ల రద్దీని మించి ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. అంతర్జాతీయ ట్రాఫిక్ 7–11 శాతం, దేశీ ట్రాఫిక్ 6–8 శాతం పెరగొచ్చు’ అని ఇక్రా సెక్టార్ హెడ్ (కార్పొరేట్ రేటింగ్స్) జి. వినయ్ కుమార్ తెలిపారు. దేశీ ట్రాఫిక్తో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన ట్రాఫిక్ మరింత లాభదాయకంగా ఉంటుందన్నారు. ఇది పెరగడమనేది ఎయిర్పోర్ట్ ఆపరేటర్లకు సానుకూలాంశమని వివరించారు. -
వొడాఫోన్ ఐడియా రుణాలు అప్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం వొడాఫోన్ఐడియా రుణ భారం 2024 డిసెంబర్కల్లా 7 శాతం పెరిగి రూ. 2.17 లక్షల కోట్లకు చేరింది. చట్టబద్ధ లయబిలిటీల కారణంగా గత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికాని(అక్టోబర్–డిసెంబర్)కల్లా రుణ భారం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 2,03,400 కోట్లుగా నమోదైనట్లు ఇన్వెస్టర్లకు తెలి యజేసింది. తాజా రుణ భారంలో ప్రధానంగా రూ. 2,14,700 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసిన బకాయిలుకాగా.. రూ. 2,300 కోట్లు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలుగా పేర్కొంది. గత రెండేళ్లలో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 10,700 కోట్లమేర తగ్గినట్లు వెల్లడించింది. కాగా.. ఇటీవల ప్రభుత్వం గత టెలికం ప్యాకేజీలో భాగంగా రూ. 36,950 కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్పు చేసుకునేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో వొడాఫోన్ఐడియాలో ప్రభుత్వ వాటా 22.6 శాతం నుంచి 48.99 శాతానికి బలపడనుంది. ఇవి 2025–26, 2027 –28లో చెల్లించవలసిన స్పెక్ట్రమ్ బకాయిలుకాగా.. ప్రభుత్వ నిర్ణయానికంటే ముందున్న రుణ భార పరిస్థితిని వొడాఫోన్ఐడియా వాటాదారులకు వెల్లడించింది. తాజాగా వాటా పెంపు మంగళవారం(8న) కంపెనీ ప్రభుత్వానికి ఈక్విటీ షేర్ల కేటాయింపును పూర్తి చేయడంతో రుణ భారం తగ్గడంతోపాటు.. వొడాఫోన్ఐడియాలో ప్రభుత్వ వాటా 48.99 శాతాన్ని తాకింది. కంపెనీలో ప్రస్తు తం ప్రమోటర్లుగా వొడాఫోన్ గ్రూప్ 16.07 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ 9.5 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. గతంలో ప్రభుత్వం రూ. 16,130 కోట్ల రుణాలను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడంతో వొడాఫోన్ఐడియాలో 22 శాతానికిపైగా వాటా పొందిన విషయం విదితమే. -
కాంపా ప్రచారకర్తగా ‘పెద్ది’
రిలయన్స్ ఆధ్వర్యంలోని ప్రముఖ బేవరేజ్ బ్రాండ్ కాంపా హీరో రామ్ చరణ్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. ఈ భాగస్వామ్యం బ్రాండ్ కొత్త మార్కెటింగ్కు ఎంతో తోడ్పడుతుందని కంపెనీ తెలిపింది. కాంపా కొత్త వేరియంట్ ‘వలీ జిడ్’ ప్రచారానికి ఈ నియామకం సహకరిస్తుందని పేర్కొంది. జెన్ జెడ్, మిలినియల్స్లో బ్రాండ్ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. రామ్ చరణ్ నటుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా తెరకెక్కనుంది.ప్రమోషన్లో స్టార్లు అవసరమేనా..?సంస్థలు తమ ఉత్పత్తులను వినియోగదారుల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం సెలబ్రిటీల బ్రాండ్ ఎండార్స్మెంట్లు కంపెనీలకు కీలకంగా మారాయి. అయితే బ్రాండ్ ప్రమోషన్ కోసం సంస్థలు సెలబ్రిటీలను ఎందుకు ఎంచుకుంటున్నాయో తెలుసుకుందాం.నమ్మకం, విశ్వసనీయతను పెంపొందించడం: సెలబ్రిటీలను తరచుగా రోల్ మోడల్స్ లేదా ఇన్ఫ్లుయెన్సర్లుగా భావిస్తారు. కాబట్టి తాము ప్రచారం చేస్తున్న బ్రాండ్ పట్ల వినియోగదారులకు సానుకూలత రావడానికి, దాన్ని వినియోగించేందుకు అవకాశం ఉంటుంది. ఇది కంపెనీల సేల్స్ పెరిగేందుకు దోహదం చేస్తుంది.బ్రాండ్ విజిబిలిటీని పెంచడం: సెలబ్రిటీ ప్రమోషన్ల ద్వారా స్టార్ల ఫాలోయింగ్ను కంపెనీలు ఆసరాగా చేసుకుంటాయి. దాంతో బ్రాండ్ ఉత్పత్తుల విజిబిలిటీని పెంచాలని లక్ష్యంగా చేసుకుంటాయి. ముఖ్యంగా ఫ్యాషన్, స్పోర్ట్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ఇది ప్రభావం చూపుతుంది.ఎమోషనల్గా కనెక్ట్ చేయడం: అభిమానులు తరచుగా తమ ఫెవరెట్ స్టార్లతో పరోక్షంగా భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. సెలబ్రిటీలు ఒక బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆయా ఉత్పత్తులపై వినియోగదారుల భావోద్వేగాలు తోడవుతాయి. దాంతో కంపెనీ సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..సవాళ్లు లేవా..సెలబ్రిటీల బ్రాండ్ ప్రమోషన్లలో కంపెనీలకు ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. స్టార్ల జీవన విధానం బ్రాండ్లపై ప్రభావం చూపుతుంది. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత ఆ సెలబ్రిటీలు ఏదైనా వివాదాల్లో చిక్కుకుంటే కంపెనీ ఉత్పత్తులపై దాని ప్రభావంపడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది బ్రాండ్ ప్రతిష్ఠను దెబ్బతీయవచ్చు. అందువల్ల సెలబ్రిటీ ఎంపిక కీలకంగా మారుతుంది. -
పెట్రోల్ పంపులో ఉచిత సదుపాయాలివే..
పెట్రోల్ కొట్టించేందుకు వచ్చిన మహిళ పెట్రోల్ పంపులో టాయిలెట్ కోసం వెళితే తాళం వేసి ఉంది. ఆ రెస్ట్రూమ్కు సంబంధించిన తాళం పెట్రోల్ పంపు మేనేజర్ ఇంటికి తీసుకెళ్లడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే పోలీసులు స్పందించి తాళం పగులగొట్టి రెస్ట్రూమ్ తెరిపించారు. అనంతరం ఆ మహిళ వినియోగదారుల ఫోరమ్లో సంబంధిత ఘటనపై ఫిర్యాదు చేశారు. 2024లో కేరళలోని పయ్యోలిలో జరిగిన ఈ సంఘటనపై ఫోరమ్ విచారణ జరిపి పెట్రోల్ పంపు యాజమాన్యంపై రూ.1.65 లక్షలు జరిమానా విధించారు. పెట్రోల్ పంపులో వినియోగదారులకు ఉచితంగా ఎలాంటి వసతులుంటాయో కింద తెలుసుకుందాం.ఇదీ చదవండి: ప్రయాణంలో రైలు టికెట్ చిరిగిపోతే ఫైన్ కట్టాలా?దేశంలోని పెట్రోల్ బంకులు వినియోగదారులకు భద్రతను పెంచడానికి వారి సౌలభ్యం కోసం అనేక సదుపాయాలు అందిస్తాయి.ప్రతి పెట్రోల్ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్ పేపర్ ఉంచుకోవాలి. వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నప్పుడు పెట్రోల్ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్ పేపర్ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్ గన్ ద్వారా 2-3 డ్రాప్స్ పెట్రోల్ వేయాలి. కాసేపు ఆ ఫిల్టర్ పేపర్ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్ పోసినచోట పేపర్పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్గా పరిగణించవచ్చు.పెట్రోల్ బంకులు వాహనాల్లో సరైన టైర్ ప్రెజర్ ఉండేందుకు వీలుగా ఉచిత ఎయిర్ ఫిల్లింగ్ సేవలను అందిస్తాయి.అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో ఉండాలి.పెట్రోల్ బంకులు అవసరమైతే ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతించాలి.ప్రయాణీకుల కోసం శుభ్రమైన, భద్రత కలిగిన వాష్రూమ్లు అందుబాటులో ఉండాలి.శుభ్రమైన త్రాగునీరు తరచుగా ఉచితంగా అందించాలి. -
హైదరాబాద్లో క్విక్ కామర్స్ హవా
కిరాణా సరుకులు కావాలా? 10 నిమిషాల వ్యవధిలోనే ఇంటి వద్దకే వచ్చేస్తాయి! సొంత మొబైల్లోని క్విక్ కామర్స్ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన తరువాత నిమిషాలలోపే ఇంటికి అవసరమైన బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు వంటి కిరాణా సరుకులన్నీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్ ఈ కామర్స్ యాప్స్ ద్వారా క్విక్ కామర్స్ (త్వరిత వాణిజ్యం) దేశంలో ప్రస్తుతం 31.33 శాతం వార్షిక వృద్ధిరేటుతో వేగంగా విస్తరిస్తోంది. కాగా 2025–2030 మధ్య సంవత్సరానికి 44.9 శాతం వృద్ధి రేటుతో ఈ రంగం దూసుకుపోనుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్లో టెక్ జనం ఎక్కువ కావడంతో తెలంగాణలో క్విక్ కామర్స్ (Quick Commerce) మరింత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బిగ్బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్, డంజో లాంటి సంస్థలు రాష్ట్రంలో హైదరాబాద్తో పాటు మరిన్ని నగరాల్లో వినియోగదారుల ఇళ్లకే గ్రోసరీని తీసుకెళ్తూ ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వేర్హౌజ్ ఏర్పాటు చేసుకొని ఈ–కామర్స్ వ్యాపారంలో దూసుకుపోతున్న అమెజాన్ సంస్థ ‘అమెజాన్ తేజ్’ పేరుతో క్విక్ కామర్స్ రంగంలో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ‘జెప్టో’ సంస్థ అత్యధిక వృద్ధిరేటుతో హైదరాబాద్ మార్కెట్ను ఆక్రమించుకుంటోంది. కాగా ‘అమెజాన్ తేజ్’ రంగంలోకి దిగితే పరిస్థితి ఆ సంస్థకు అనుకూలంగా మారుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కాగా రాష్ట్రంలో హైదరాబాద్లో మొదలైన క్విక్ కామర్స్ జోరు వరంగల్, కరీంనగర్ (Karimnagar) వంటి నగరాలకు కూడా విస్తరిస్తోంది. – సాక్షి, హైదరాబాద్ఎక్కడికక్కడ గోడౌన్లతో...క్విక్ కామర్స్ అంటే కిరాణా సరుకులు, చిరుతిండ్లు, ఇంటి సామగ్రి కొన్ని నిమి షాల్లోనే వినియోగదారుని ఇంటికి చేర్చడ మే. తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున గోడౌన్లు ఏర్పాటు చేసుకొని బిగ్బాస్కెట్ (బీబీ నౌ), అమెజాన్ (తేజ్), జెప్టో, స్విగ్గీ (ఇన్స్టా మార్ట్), బ్లింకిట్, డంజో మొదలైన సంస్థలు క్విక్ కామర్స్ రంగంలో పనిచేస్తున్నాయి. బిగ్ బాస్కెట్ సంస్థకు హైదరాబాద్లో దాదాపు 400 వరకు చిన్న గిడ్డంగులు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉండే వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే 24 గంటల్లో సేవలు అందించేలా ఈ కామర్స్ (e Commerce) వ్యాపారంలో దూసుకుపోతుండగా, కొత్తగా హైదరాబాద్ కేంద్రంగా ‘తేజ్’ సేవలను ప్రారంభించ నుంది. తద్వారా కిరాణా, చిన్నస్థాయి విద్యుత్ సామగ్రి, పండ్లు వంటి వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. జెప్టో సంస్థ కిరాణా, చిరుతిండ్లు, సౌందర్య సామగ్రితో పాటు గృహావసరాలకు అవసరమైన అన్నింటినీ 10 నిమిషాల్లో సరఫరా చేసే హామీతో దూసుకుపోతుంది.గచ్చిబౌలి, హైటెక్సిటీ, బంజారాహిల్స్ (Banjara hills) మొదలుకొని హైదరాబాద్ లోని అడ్డగుట్ట, పాతబస్తీ వంటి వందలాది ప్రాంతాల్లో గ్రోసరీ గోడౌన్లను ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తుంది. ఇక హోటళ్ల నుంచి ఆహారాన్ని వినియోగదారులకు అందించే సేవల్లో ఉన్న స్విగ్గీ కూడా క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. స్విగ్గీ ఇన్స్టా మార్ట్ పేరుతో కిరాణా, ఇంటి సామగ్రితో పాటు మెడికల్స్ను కూడా 15 నుంచి 20 నిమిషాల్లో సరఫరా చేస్తోంది. హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్లోనూ ఈ సంస్థ విస్తరించడం గమనార్హం. గ్రోఫర్స్ పేరుతో దశాబ్దం క్రితం ప్రారంభమై పేరు మార్చుకొని ‘బ్లింకిట్’గా సేవలందిస్తున్న మరో సంస్థ కూడా హైదరాబాద్లో జొమాటో సహకారంతో పెద్దఎత్తున గోడౌన్లను ఏర్పాటు చేసుకొని వినియోగదారులకు సేవలు అందిస్తోంది. డంజో అనే మరో సంస్థ కూడా క్విక్ కామర్స్ రంగంలో హైదరాబాద్లో సేవలు అందిస్తోంది.హైదరాబాద్లో క్విక్ కామర్స్ వాటా 10 శాతం 2024 చివరి నాటికి భారతదేశంలో క్విక్ కామర్స్ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లు. ఇది 2025 చివరి నాటి కి 6–7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్లో రిటైల్ మార్కెట్ (Retail Market) సుమారు రూ. 20,000 –25,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తే, క్విక్ కామర్స్ వాటా దాదాపు 8 నుంచి 10 శాతం ఉంటుంది. అంటే రూ. 8,000 కోట్ల నుంచి రూ. 2,500 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ వాటా యువత, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కామర్స్ సంస్థలకు వచ్చే ఆర్డర్లు ప్రతిరోజూ లక్ష నుంచి లక్షన్నర వరకు ఉండొచ్చని అంచనా. వీటి విలువ రూ. 5 కోట్లకు పైనే ఉండొచ్చు. కాగా ఈ క్విక్ కామర్స్ మార్కెట్లో కూడా బిగ్ బాస్కెట్ (Big Basket) సంస్థ ప్రధాన వాటాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.చదవండి: మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ ఇవే30 నుంచి 40 శాతం వాటా ఈ సంస్థకే ఉండగా, ఇప్పుడు జెప్టో, బ్లింకిట్ సంస్థలు పోటీ పడుతున్నాయి. జెప్టో 5 నుంచి 10 నిమిషాల్లో నిత్యా వసర వస్తువులు, కూరగాయలు, పండ్లతో పాటు వినియోగదారుడు కోరిన వస్తువులన్నింటినీ అందిస్తూ ఇప్పటికే 20 శాతం వాటాను సొంతం చేసుకొని మరింత వేగంగా విస్తరిస్తోంది. వినియోగదారులకు ఆఫర్లతో ఈ సంస్థ హైదరాబాద్లో క్విక్ కామర్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని పెంచుకుంటోంది. అమెజాన్ (Amazon) సంస్థ ‘తేజ్’ ద్వారా క్విక్ కామర్స్ రంగంలో 20 శాతం వా టాను సొంతం చేసుకునే అవకాశం ఉంది. స్విగ్గీ ఇన్స్టా మార్ట్, బ్లింకిట్, డంజో వంటి సంస్థల వాటా మరో 20 శాతం వరకు ఉంటుంది.భవిష్యత్తులో చిన్న నగరాలకు విస్తరణతెలంగాణలో క్విక్ కామర్స్ రంగం మరింతగా విస్తరించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి నగరాలతో పాటు హైదరాబాద్ను ఆనుకొని ఉన్న కొన్ని పట్టణాలకు కూడా ఈ సేవలు అందనున్నాయి. అమెజాన్ ‘తేజ్’ రాకతో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. వేగం, నాణ్యత, తక్కువ ధరలు ఇచ్చే సంస్థలే ఈ రంగంలో పైచేయి సాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
ప్రపంచంలోని టాప్ 20 ఎయిర్పోర్ట్లు
ప్రపంచంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ విమానాశ్రయంగా సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ నిలిచిందని స్కైట్రాక్స్ ప్రకటించింది. ఈ విమానాశ్రయం రికార్డు స్థాయిలో 13వసారి ఈ టైటిల్ గెలుచుకోవడం గమనార్హం. జ్యువెల్ కాంప్లెక్స్, ఇండోర్ జలపాతం, ఆకర్షణీయ గార్డెన్లకు చాంగి ఎయిర్పోర్ట్ ప్రసిద్ధి చెందింది. తర్వాతి స్థానాల్లో హమద్ (దోహా), హనేడా (టోక్యో) విమానాశ్రయాలు నిలిచాయి. దక్షిణాసియాతోపాటు ఇండియాలో ఉత్తమ విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నిలిచింది.చాంగి ఎయిర్పోర్ట్చాంగి ఎయిర్పోర్ట్ 2024లో 8 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేసింది. ఇందులో 10 అంతస్తుల జ్యువెల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో బటర్ఫ్లై పార్క్, ఇండోర్ గార్డెన్లు, జలపాతాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఆవరణలో స్పాలు, హోటళ్లు, కళా ప్రదర్శనలు, మ్యూజియం, సినిమా థియేటర్, అమ్యూజ్మెంట్ పార్క్లు ఉన్నాయి. దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం గతంలో మూడుసార్లు ప్రపంచ ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. అయితే ఈ సంవత్సరం ఇది రెండో స్థానానికి చేరింది. టోక్యోలోని హనేడా విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. దాంతోపాటు ప్రపంచంలోనే ఉత్తమ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్గా, పీఆర్ఎమ్ & యాక్సెసబుల్ సౌకర్యాలను అందించడంలో టాప్లో నిలిచింది.భారత విమానాశ్రయాల ర్యాంకింగ్స్..ప్రపంచంలోని టాప్ 20 విమానాశ్రయాల జాబితాలో ఏ భారతీయ విమానాశ్రయం లేనప్పటికీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంతోపాటు దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇండియా, దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సర్వీస్ అవార్డును అందుకుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఇండియా, దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా అవార్డును గెలుచుకుంది. గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఐదు మిలియన్ల కంటే తక్కువ ప్రయాణీకుల విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు సాధించింది.ఇదీ చదవండి: టెస్లా కొత్త సైబర్ట్రక్ విడుదల.. ధర ఎంతంటే..2025లో 20 ఉత్తమ విమానాశ్రయాల జాబితాసింగపూర్ చాంగి విమానాశ్రయంహమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దోహాటోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం (హనేడా)ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం, దక్షిణ కొరియానరిటా అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్హాంగ్ కాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంపారిస్ చార్లెస్ డి గాల్ విమానాశ్రయంరోమ్ ఫియుమిసినో విమానాశ్రయంమ్యూనిచ్ విమానాశ్రయంజ్యూరిచ్ విమానాశ్రయందుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంహెల్సింకి-వాంటావా విమానాశ్రయంవాంకోవర్ అంతర్జాతీయ విమానాశ్రయంఇస్తాంబుల్ విమానాశ్రయంవియన్నా అంతర్జాతీయ విమానాశ్రయంమెల్బోర్న్ విమానాశ్రయంచుబు సెంట్రైర్ అంతర్జాతీయ విమానాశ్రయం, జపాన్కోపెన్ హాగన్ విమానాశ్రయంఆమ్ స్టర్ డామ్ షిపోల్ విమానాశ్రయంబహ్రయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం -
మారిన తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు
ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది.. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.తత్కాల్ అనేది ప్రయాణీకులకు.. తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ.. తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.కొత్త టైమింగ్ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి 'సమయం' అనే చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్ ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ / స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే.. ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.IRCTC వెబ్సైట్ & మొబైల్ యాప్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్గ్రేడ్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించవచ్చు..➤ IRCTC అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లోకి లాగిన్ అవ్వండి➤ ట్రైన్, క్లాస్ ఎంచుకోండి (ఏసీ/నాన్ ఏసీ)➤ డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోండి➤ ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నెంబర్ను ఎంటర్ చేయండి➤ చెల్లింపు పేజీకి వెళ్లి బుకింగ్ పూర్తి చేయండికొత్త మార్పులు➤ సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణీకుల వివరాలను స్వయంచాలకంగా నింపడం.➤ చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.➤ బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేసారు.➤ యాప్ లేదా వెబ్సైట్ రెండింటికీ ఒకేవిధమైన లాగిన్ సిస్టమ్➤ ఒక తత్కాల్ PNR కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.➤ తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు.➤ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.గమనిక: కొన్ని ఆంగ్ల మీడియా కథనాల ఆదరణ ఈ వార్త ప్రచురించడం జరిగింది. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని IRCTC అధికారికంగా వెల్లడించింది. పాఠకులు గమనించగలరు. -
గూగుల్ డొమైన్ కొనేసిన ఇండియన్: తర్వాత ఏం జరిగిందంటే?
2015లో గుజరాత్లోని మాండ్వికి చెందిన మాజీ గూగుల్ ఉద్యోగి 'సన్మయ్ వేద్' గూగుల్ డొమైన్ (Google Domain) కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని గ్రహించి.. కేవలం 12 డాలర్లకు కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.2015 సెప్టెంబర్ 29 తెల్లవారుజామున 1:20 గంటలకు ఒక వింత జరిగింది. నేను Google Domains ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుంటూ ఉన్న సమయంలో.. గూగుల్.కామ్ అని టైప్ చేసి, సెర్చ్ డొమైన్లపై క్లిక్ చేసాను. అప్పుడు గూగుల్.కామ్ కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నట్లు చూసి ఆశ్చర్యపోయాను.నేను డొమైన్ పక్కన ఉన్న యాడ్ టు కార్ట్ ఐకాన్ను క్లిక్ చేసాను (డొమైన్ అమ్మకానికి అందుబాటులో లేకపోతే అది కనిపించకూడదు). ఆకుపచ్చ చెక్-బాక్స్ ద్వారా కనిపించే విధంగా డొమైన్ నా కార్ట్కు యాడ్ అయింది. బహుశా లావాదేవీల సమయంలో ఎర్రర్ వస్తుందేమో అనుకున్నాను, కానీ ఎలాంటి సమస్య లేకుండా నా క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు కట్ అయ్యాయి. నేను గూగుల్.కామ్ డొమైన్ కొనుగోలు చేసినట్లు రెండు ఈ మెయిల్స్ కూడా వచ్చాయి.గూగుల్ డొమైన్ కొనుగోలు విజయవంతంగా పూర్తయిన తరువాత.. గూగుల్ డొమైన్స్ నుంచి ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు ఈ మెయిల్ వచ్చింది. నేను ఉపయోగించిన రిజిస్ట్రేషన్ సర్వీస్ (aka Google Domains) గూగుల్కు చెందినది కావడంతో.. కంపెనీ దీనిని రద్దు చేయగలిగింది.ఇదీ చదవండి: ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?డొమైన్ క్యాన్సిల్ అయిన తరువాత గూగుల్ కంపెనీ నాకు.. కొంత మొత్తంలో రివార్డును ప్రకటించింది. ఆ డబ్బును ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇండియా ఫౌండేషన్కు ఛారిటీకి విరాళంగా ఇవ్వమని చెప్పాను. నా అభ్యర్థన మేరకు వారు సరే అన్నారు. రివార్డు మొత్తాన్ని కూడా రెట్టింపు చేశారు. -
మైక్రోసాఫ్ట్లో మరోమారు లేఆఫ్స్!.. ఎఫెక్ట్ వారిపైనే..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. మరోమారు ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ప్రాజెక్ట్ బృందాలలో ఇంజనీర్ల నిష్పత్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ కోతలు ఉంటాయి. ఈ ప్రభావం వల్ల ప్రధానంగా మిడిల్ మేనేజ్మెంట్, నాన్-టెక్నికల్ ఉద్యోగులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. మే నెలలో ఈ లేఆప్స్ ఉండే అవకాశం ఉంది. ఎయితే ఈ ఎఫెక్ట్ ఎంతమందిపై ప్రభావం చూపుతుందని విషయం అధికారికంగా వెల్లడికాలేదు.అమెజాన్, గూగుల్ కంపెనీల మాదిరిగానే.. మైక్రోసాఫ్ట్ కూడా నిర్వాహక పాత్రల కంటే సాంకేతిక ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ లేఆప్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఆదాయ, వ్యయాలను సమతుల్యం చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకుంది.మైక్రోసాఫ్ట్ గతంలో కూడా.. తక్కువ పనితీరు కనపరచిన 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీన్ని బట్టి చూస్తుంటే.. త్వరలో జరగనున్న ఉద్యోగాల తొలగింపు ప్రభావం కూడా పనితీరు తక్కువగా ఉన్న ఉద్యోగుల మీదనే పడే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.ఏఐలో శిక్షణభవిష్యత్ ఆవిష్కరణలలో ఏఐ కీలకం. కాబట్టి 2030 నాటికి 10 మిలియన్ల (కోటి మందికి) మందికి ఏఐలో శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని గూగుల్ సీఈఓ సత్యనాదెళ్ళ గతంలోనే వివరించారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం చెలాయిస్తోంది. దీనిని మరింత అభివృద్ధి చేయడానికి, తమ ఉద్యోగులకు కూడా ఇందులో శిక్షణ ఇవ్వడానికి దిగ్గజ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి.ఇదీ చదవండి: వ్యభిచార గృహాలతో సంబంధాలు:.. అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్ -
ఈ యూట్యూబర్.. బిలియనీర్!
అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన ఆన్ లైన్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన ‘మిస్టర్ బీస్ట్’ సంపాదనలో కొందరు హాలీవుడ్ టాప్ స్టార్లనే మించిపోయాడు. ఆయన సంపాదన, సంపద గురించి వివరాలు పూర్తిగా బహిరంగంగా లేనప్పటికీ, ఫోర్బ్స్, సెలబ్రిటీ నెట్ వర్త్ వంటి అనేక పరిశ్రమ నివేదికలు మిస్టర్ బీస్ట్ తన డిజిటల్ సామ్రాజ్యం ద్వారా అపారమైన సంపదను కూడబెట్టినట్లు సూచిస్తున్నాయి.భారీ పాపులారిటీయూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ పాపులారిటీ, ఫైనాన్షియల్ సక్సెస్ మిస్టర్ బీస్ట్ అసాధారణ ఆర్థిక విజయానికి ప్రధాన చోదకాలలో ఒకటి యూట్యూబ్ లో అతని అపారమైన పాపులారిటీ. 2025 మార్చి నాటికి మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానెల్కు 383 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీంతో ఆయన ప్రపంచంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న కంటెంట్ క్రియేటర్లలో ఒకడిగా నిలిచాడు. ఈ భారీ ఆదరణే యాడ్ రెవిన్యూ, బ్రాండ్ సహకారాల వంటి వాటి ద్వారా భారీ సంపాదనను తెచ్చిపెట్టింది. మెయిన్స్ట్రీమ్లోని సెలబ్రిటీలకు కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ లేదంటే అతిశయోక్తి కాదు.మిస్టర్ బీస్ట్ నెట్వర్త్ఫోర్బ్స్ (2025 మార్చి) నివేదిక ప్రకారం 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు మిస్టర్ బీస్ట్ సంపాదన 85 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.700 కోట్లు). దీన్ని చూస్తే అర్థమవుతుంది యూట్యూబ్లో ఆయన ఎంత భారీ మొత్తంలో సంపాదిస్తున్నాడో. అంతేకాక, ప్రముఖుల సంపదలను అంచనా వేసే సెలబ్రిటీ నెట్ వర్త్ (2025 ఫిబ్రవరి) అయితే మిస్టర్ బీస్ట్ నెట్వర్త్ను సుమారు 1 బిలియన్ డాలర్లుగా (రూ.8,300 కోట్లు) అంచనా వేసింది. కొన్ని అంచనాలు మిస్టర్ బీస్ట్ నెలవారీ ఆదాయాన్ని సుమారు 50 మిలియన్ డాలర్లుగా పేర్కొన్నాయి. -
ప్రపంచంలోనే అత్యంత భారీ నౌక.. భారత్లోకి..
తిరువనంతపురం: ప్రపంచంలోనే అత్యంత భారీ కంటైనర్ షిప్లలో ఒకటైన ఎంఎస్సీ తుర్కియే తాజాగా కేరళలోని విఝింజం ఇంటర్నేషనల్ సీపోర్టుకు వచ్చింది. భారతీయ పోర్టుకు ఇంత భారీ నౌక రావడం ఇదే ప్రథమమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఏపీసెజ్కి) నిర్వహిస్తోంది.మెడిటేరేనియన్ షిప్పింగ్ కంపెనీ (ఎంఎస్సీ)కి చెందిన ఈ నౌక ఒక అధునిక ఇంజినీరింగ్ అద్భుతం. 399.9 మీటర్ల పొడవు, 61.3 మీటర్ల వెడల్పు, 33.5 మీటర్ల ఎత్తు ఉంటుంది. 24,346 టీఈయూల (ట్వెంటీ–ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్లు) సామర్థ్యం దీని సొంతం. ఇంధనాన్ని అత్యధికంగా ఆదా చేయడం ద్వారా ఇది కర్బన ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది. -
TCS Q4 results: టీసీఎస్ తడబాటు.. లాభం, ఆదాయాలు ఇలా..
దేశ ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి (Q4FY25) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభంలో స్వల్ప క్షీణతను నివేదించింది. అయినప్పటికీ బలమైన ఒప్పంద విజయాలు, స్థిరమైన ఆదాయ వృద్ధి పథాన్ని ప్రదర్శించింది.టీసీఎస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.12,434 కోట్ల నుంచి 1.69 శాతం తగ్గి రూ.12,224 కోట్లుగా నమోదైంది. ఈ స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ, త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.3% పెరిగి రూ .64,479 కోట్లకు చేరుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దాని స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోంది. ఇక వాటాదారుల ఆమోదానికి లోబడి, టీసీఎస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ .30 తుది డివిడెండ్ను ప్రకటించింది.పూర్తి సంవత్సరానికి పనితీరును పరిశీలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ నికర లాభం రూ.45,908 కోట్లతో పోలిస్తే 5.76 శాతం పెరిగి రూ.48,553 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ.2,59,286 కోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,45,315 కోట్లతో పోలిస్తే 5.69 శాతం పెరిగింది.ఈ నివేదికలోని ముఖ్యమైన గణాంకాల్లో ఒకటి టీసీఎస్ డీల్ పైప్ లైన్. క్యూ3లో 10.2 బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెరిగి 12.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కంపెనీ పొందింది. ఇది దాని డిజిటల్ పరివర్తన సేవలు, క్లౌడ్ పరిష్కారాలకు బలమైన డిమాండ్ను సూచిస్తోంది.లాభాల తగ్గుదల కొన్ని ఆందోళనలను లేవనెత్తినప్పటికీ, టీసీఎస్ స్థిరమైన డీల్ వేగం, బలమైన ఆర్డర్ బుక్ 2026 ఆర్థిక సంవత్సరంలో ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై కంపెనీ దృష్టి పెట్టడం వృద్ధిని కొనసాగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
హైదరాబాద్ కంపెనీ ఒలెక్ట్రాకు రూ. 424 కోట్ల డీల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఒలెక్ట్రా గ్రీన్టెక్కు హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (హెచ్ఆర్టీసీ) నుంచి 297 బస్సుల సరఫరా, నిర్వహణకు భారీ ఆర్డరు లభించింది. కాంట్రాక్ట్ ప్రకారం లెటర్ ఆఫ్ అవార్డ్ (ఎల్వోఏ) తేదీ నుంచి 11 నెలల్లో బస్సులను అందించాల్సి ఉంటుంది.ఈ డీల్ విలువ సుమారు రూ. 424.01 కోట్లని కంపెనీ వివరించింది. హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో నడిపేందుకు ప్రత్యేకంగా రూపొందిన ఈ బస్సులు 30 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో ఉంటాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 180 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి.ఒక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇన్ని విద్యుత్ బస్సులను నేరుగా కొనుగోలు చేయడం దేశీయంగా ఇదే తొలిసారని ఒలెక్ట్రా సీఎండీ కేవీ ప్రదీప్ చెప్పారు. ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి దేశీయంగా అతి పెద్ద ఆర్డరును అందుకోవడం తమకు గర్వకారణమని తెలిపారు. -
అమెరికాకు 600 టన్నుల ఐఫోన్లు.. అదీ చార్టెడ్ ఫ్లైట్లలో..!
విదేశీ దిగుమతులపై ప్రతీకార సుంకాల ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లో వాణిజ్య ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో అక్కడ తయారీ నిర్వహిస్తున్న కంపెనీలు ఇరుకున పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్రంప్ టారిఫ్ల నుంచి బయటపడేందుకు ఉపాయం ఆలోచించింది. భారత్ నుంచి 600 టన్నులు లేదా సుమారు 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు తరలించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో యాపిల్కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో పాపులర్ ఐఫోన్ల తగినంత స్టాక్ను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రమైన చైనా నుంచి దిగుమతులపైనే యాపిల్ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. చైనాపై విధించే టారిఫ్ రేటు ప్రస్తుతం 125 శాతంగా ఉంది. ఇక భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ సుంకం 26 శాతం. అయితే చైనా మినహా ఇతర అన్ని దేశాలపై ఈ సుంకాల అమలును 90 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఏర్పాట్లుభారత్లోని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన సమయాన్ని 30 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించేలా విమానాశ్రయ అధికారులతో కంపెనీ లాబీయింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. "గ్రీన్ కారిడార్" పేరుతో చైనాలోని కొన్ని విమానాశ్రయాలలో చేస్తున్న ప్రత్యేక ఏర్పాటునే చెన్నై ఎయిర్పోర్ట్లోనూ యాపిల్ చేయించినట్లు తమకు లభించిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ ఒక్కొక్కటి 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు కార్గో జెట్ విమానాలు అమెరికా వెళ్లాయని, వాటిలో ఒకటి ఈ వారంలోనే అంటే కొత్త టారిఫ్లు ప్రకటించాకే బయలుదేరిందని ఓ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఐఫోన్ 14, దాని ఛార్జింగ్ కేబుల్ ప్యాకేజ్డ్ బరువు సుమారు 350 గ్రాములు (12.35 ఔన్స్) ఉంటుందని, ఇలా మొత్తం 600 టన్నుల కార్గోలో సుమారు 15 లక్షల ఐఫోన్లు వెళ్లి ఉంటాయని రాయిటర్స్ అంచనా వేస్తూ రాసుకొచ్చింది. అయితే దీనిపై యాపిల్ సంస్థ గానీ, భారత విమానయాన మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు. -
రూ. 1,000 కోట్ల ల్యాప్టాప్ ప్లాంటు.. 5,000 ఉద్యోగాలు
చెన్నై: ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల దిగ్గజం డిక్సన్ టెక్నాలజీస్, చెన్నైకి దగ్గర్లోని ఒరగాడంలో రూ. 1,000 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనితో ప్రాంతీయంగా 5,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ప్లాంటు నెలకొల్పడానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ప్లాంటులో ఇతర కంపెనీల కోసం ల్యాప్టాప్లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు మొదలైన వాటిని ఉత్పత్తి చేయనుంది. ఇందులో త్వరలోనే హెచ్పీ ల్యాప్టాప్ల తయారీ ప్రారంభమవుతుందని తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా తెలిపారు.తమిళనాడు ప్రభుత్వం 100 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. డిక్సన్ టెక్నాలజీస్ 1993లో ఏర్పాటైంది. శాంసంగ్, షావోమీ, మోటరోలా, బోట్, వన్ప్లస్ తదితర సంస్థల కోసం కాంట్రాక్ట్ తయారీ సేవలను అందిస్తోంది. -
రూ.4 కోట్ల కారు.. ₹46 లక్షల నెంబర్ ప్లేట్
భారతదేశంలో ఖరీదైన లంబోర్ఘిని కార్లను ఉపయోగించే వారి సంఖ్య నానాటికి ఎక్కువవుతోంది. ఇటీవల కేరళకు చెందిన ఒక వ్యాపారవేత్త సరికొత్త ఉరుస్ పెర్ఫార్మాంటే కొనుగోలు చేశారు. కాగా ఈ కారు ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 46 లక్షలు ఖర్చు చేశారు.లంబోర్గిని ఉరుస్ కొనుగోలు చేసిన వేణు గోపాలకృష్ణన్.. మోటారు వాహనాల శాఖ (MVD) నిర్వహించిన ఆన్లైన్ వేలంలో KL07 DG 0007 అనే ఫ్యాన్సీ నెంబర్ కోసం 45.99 లక్షల రూపాయలు వెచ్చించారు. కేరళలో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన నోటిఫైడ్ ఫ్యాన్సీ వెహికల్ నెంబర్గా ఇది రికార్డ్ క్రియేట్ చేసింది.వేణు గోపాలకృష్ణన్ కొనుగోలు చేసిన లంబోర్గిని ఉరుస్ ధర రూ. 4 కోట్లు. దీనిని ఆయన బెంగళూరులోని లంబోర్గిని డీలర్షిప్ నుంచి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: Delhi EV Policy 2.0: పెట్రోల్ బైకులు, సీఎన్జీ ఆటోలు బ్యాన్!ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని భారతదేశంలోని పరిమిత నగరాల్లో మాత్రమే డీలర్షిప్లను కలిగి ఉంది. అతను బహుశా SUVని బుక్ చేసుకుని, ముందుగానే అన్ని కస్టమైజేషన్లను చేసి ఉండవచ్చు. ఈ వీడియోలో యజమాని, అతని కుటుంబం డెలివరీ తీసుకోవడానికి డీలర్షిప్ను సందర్శించారు.లంబోర్గిని ఉరుస్ పెర్ఫార్మాంటే 4.0 లీటర్, ట్విన్ టర్బో వీ8 ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 666 పీఎస్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు.. మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు. View this post on Instagram A post shared by Flywheel Official (@flywheel_official) -
ప్రముఖ కంపెనీలో 1600 ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ తమ నెదర్లాండ్స్ ప్లాంటు కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. మేనేజ్మెంట్, సపోర్ట్ విధులకు సంబంధించి 1,600 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు సంస్థ తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్జిన్లను మెరుగుపర్చుకోవడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.స్థానిక మేనేజ్మెంట్ బోర్డులో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాలను సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్తో పాటు ట్రేడ్ యూనియన్లకు కూడా తెలియజేసినట్లు కంపెనీ వివరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో నెదర్లాండ్స్ ప్లాంటు 6.75 మిలియన్ టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేసింది.భౌగోళిక.. రాజకీయ పరిణామాల వల్ల యూరప్లో డిమాండ్ నెమ్మదించడం, వాణిజ్యం.. సరఫరా వ్యవస్థల్లో అవాంతరాలు ఏర్పడటం తదితర అంశాలు నిర్వహణ వ్యయాలపైనా, అంతిమంగా ఆర్థిక పనితీరుపైనా ప్రభావం చూపాయి. నెదర్లాండ్స్ ప్లాంటులో హరిత టెక్నాలజీలను అమల్లోకి తేవడానికి కట్టుబడి ఉన్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు బ్లాస్ట్ ఫర్నేస్ల స్థానంలో అధునాతన పర్యావరణహిత ఫర్నేస్లను ఏర్పాటు చేయనున్నట్లు, దీనితో ఏటా 5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నట్లు వివరించారు. -
సీనియర్ సిటిజన్లకు రూ. 990కే బీమా పాలసీ
న్యూఢిల్లీ: అరవై ఏళ్లు పైబడిన వారి కోసం తమ యాప్ ద్వారా తక్కువ ప్రీమియంలతో వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జెన్ఎస్ లైఫ్ ఫౌండర్ మీనాక్షీ మీనన్ తెలిపారు. సిల్వర్ ప్లాన్ కింద కేవలం రూ. 990కే రూ. 2.5 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ, ప్రమాదం బారిన పడి ఆస్పత్రిలో చేరితే రూ. 50 వేల నగదు లభిస్తుందని పేర్కొన్నారు.ప్రత్యేక రేట్లపై రూ. 10 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ టాప్ అప్లు, క్రిటికల్ ఇల్నెస్ కవరేజీలను పొందవచ్చని తెలిపారు. ఇక గోల్డ్ ప్లాన్లో రూ. 4,900 వార్షిక ప్రీమియంకు రూ. 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, ఆస్పత్రిలో చేరితే రూ. 1 లక్ష నగదు, రూ. 5 లక్షల వరకు సైబర్ ఇన్సూరెన్స్ లభిస్తుందని మీనాక్షి వివరించారు. -
మందులపైనా టారిఫ్లు.. ఆందోళనలో ఫార్మా కంపెనీలు
ఫార్మాస్యూటికల్స్పై త్వరలోనే భారీ సుంకాన్ని ప్రకటించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హౌస్ రిపబ్లికన్ల కోసం ఫండ్ రైజింగ్ గాలాలో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేవీ ఆయన బయటపెట్టలేదు.‘ఒకసారి మనం అలా చేస్తే (సుంకాలు విధిస్తే) వారు (ఔషధ కంపెనీలు) తిరిగి మన దేశంలోకి వస్తారు. ఎందుకంటే మనమే వాళ్లకు పెద్ద మార్కెట్" అని ట్రంప్ అన్నారు. "మనది పెద్ద మార్కెట్ కావడమే అందరి కంటే మనకు ఉన్న అవకాశం" పేర్కొన్నారు.బ్లూమ్బర్గ్ నివేదికల ప్రకారం.. దేశీయ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తి లేకపోవడంపై ట్రంప్ చాలా కాలంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోకి మరింత సామర్థ్యాన్ని తీసుకురావడానికి సుంకాలు విధిస్తామని ఆయన పదేపదే హామీ ఇచ్చారు. త్వరలోనే ఫార్మాస్యూటికల్స్పై సుంకాలు ఉంటాయని మార్చిలోనే ట్రంప్ సంకేతాలిచ్చారు.పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడం అమెరికా, ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఒకవేళ ఫార్మాస్యూటికల్ ఔషధాలపై సుంకాలు ప్రకటిస్తే అమెరికాకు ఎగుమతి చేసే భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అమెరికాకు భారత ఫార్మా ఎగుమతుల్లో ఎక్కువగా జనరిక్స్ లేదా పాపులర్ ఔషధాల చౌక వెర్షన్లు ఉన్నాయి. అక్కడ వీటిపై ప్రస్తుతం దాదాపు ఎలాంటి సుంకాలు లేవు. కానీ భారత ప్రభుత్వం యూఎస్ ఫార్మా దిగుమతులపై 10% పన్నును విధిస్తోందని పరిశ్రమ నిపుణులను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది.ఈ కంపెనీలపైనే ఎక్కువ ప్రభావంరాయిటర్స్ ప్రకారం, భారతదేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అమెరికాకే ఉంటున్నాయి. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బెంగళూరుకు చెందిన బయోకాన్, ముంబైకి చెందిన లుపిన్ సంస్థలు తమ ఆదాయంలో 44 శాతం, 37 శాతం అమెరికా నుంచే ఆర్జించాయి.హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత బహుళజాతి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ కంపెనీ లారస్ ల్యాబ్స్ కూడా ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి 17 శాతం వాటాను ఆర్జించింది. రాయిటర్స్ ప్రకారం, భారతదేశపు అతిపెద్ద ఔషధ తయారీ సంస్థ సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయంలో 32% యూఎస్ అమ్మకాల ద్వారానే సంపాదించింది. వీటితో పాటు డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్సైన్సెస్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు అమెరికాకు గణనీయంగా ఎగుమతులు చేస్తున్నాయి. -
ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ. 500 కోట్ల సమీకరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్, డిబెంచర్ల జారీ ద్వారా రూ. 500 కోట్ల వరకు సమీకరించనున్నట్లు వెల్లడించింది. వీటిపై కూపన్ రేటు వార్షికంగా 10.25 శాతం వరకు ఉంటుంది. ఈ నిధులను వ్యాపారరీత్యా క్లయింట్లకు రుణాలు ఇచ్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనుంది. ఈ ఇష్యూ ఏప్రిల్ 23న ముగుస్తుంది. 15 నెలల నుంచి 60 నెలల వరకు కాల వ్యవధులకు కంపెనీ ఈ డిబెంచర్లను జారీ చేయనుంది. శ్రీరామ్ ఏఎంసీలో వాటాకు ఓకే శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఎస్ఏఎంసీ)లో సంయుక్తంగా వాటా కొనుగోలు చేసేందుకు దక్షిణాఫ్రికా సంస్థ సన్లామ్తోపాటు శ్రీరామ్ క్రెడిట్ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించింది. ఎస్ఏఎంసీ విస్తారిత వోటింగ్ వాటా మూలధనంలో 23 శాతానికి సమానమైన వాటాను ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా సన్లామ్ గ్రూప్నకు చెందిన సంస్థ సన్లామ్ ఎమర్జింగ్ మార్కెట్(మారిషస్) సొంతం చేసుకోనుంది.ఎస్ఏఎంసీ ఈక్విటీ షేర్లలో సబ్స్క్రిప్షన్ ద్వారా వాటా పొందనుంది. ఇదేవిధంగా ఎస్ఏఎంసీ పబ్లిక్ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి సన్లామ్ ఎమర్జింగ్తోపాటు శ్రీరామ్ క్రెడిట్ కంపెనీకి సీసీఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. -
ఎయిర్బస్ హెలికాప్టర్లో ‘మేకిన్ ఇండియా’
మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్పీఎల్) ఎయిర్బస్ నుంచి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును పొందింది. ఎయిర్బస్కు చెందిన హెచ్ 130 లైట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్లేజ్ తయారీ, అసెంబుల్ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇది భారతదేశ 'మేక్ ఇన్ ఇండియా' విజన్కు ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో నమ్మకమైన భాగస్వామిగా మహీంద్రా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ కార్యదర్శి వుమ్లన్మాంగ్ వుల్నామ్, భారత్, దక్షిణాసియాలో ఎయిర్బస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్, మహీంద్రా గ్రూప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీష్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్ 130 హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్లేజ్ అసెంబ్లీని మహీంద్రా ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఐరోపాలోని ఎయిర్ బస్ హెలికాప్టర్ల కేంద్రానికి రవాణా చేస్తారు. ఉత్పత్తి వెంటనే ప్రారంభం కానుంది. మొదటి క్యాబిన్ అసెంబ్లీ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది.మహీంద్రా ఇప్పటికే ఎయిర్ బస్ వాణిజ్య విమాన కార్యక్రమాల కోసం వివిధ రకాల విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్ లను సరఫరా చేస్తోంది. విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్లే కాకుండా భారీ, మరింత సంక్లిష్టమైన ఏరో స్ట్రక్చర్ తయారీ, సరఫరాకు మహీంద్రా తన సామర్థ్యాల పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్న క్రమంలో తాజా ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.ఎయిర్ బస్ కు భారత్ ప్రధాన మార్కెట్, వ్యూహాత్మక వనరుల కేంద్రంగా ఉంది. ప్రతి ఎయిర్ బస్ వాణిజ్య విమానంలోనూ భారతదేశంలో తయారైన విడిభాగాలు, సాంకేతికతలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ బస్ భారత్ నుంచి విడిభాగాలు, సేవల కొనుగోలు విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది.హెచ్ 130 అనేది ప్రయాణికుల రవాణా, పర్యాటకం, ప్రైవేట్, వ్యాపార విమానయానం, అలాగే మెడికల్ ఎయిర్ లిఫ్ట్, నిఘా మిషన్ల కోసం రూపొందించిన ఇంటర్మీడియట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో విశాలమైన, అడ్డంకులు లేని క్యాబిన్ ఉంటుంది. పైలట్, మరో ఏడుగురు ఇందులో ప్రయాణించవచ్చు. చుట్టూ పెద్ద విండ్ స్క్రీన్, వెడల్పాటి కిటికీల ద్వారా అద్భుతమైన విజిబిలిటీ ఉంటుంది. -
గ్లోబల్ కంపెనీల కోసం వేదాంతా అన్వేషణ
విస్తరణ ప్రాజెక్టులకు దన్నునిచ్చేందుకు వీలుగా మైనింగ్ దిగ్గజం వేదాంతా గ్లోబల్ భాగస్వామికోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. వివిధ విభాగాలలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మద్దతిచ్చే దిగ్గజంతో జత కట్టే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇది కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు ఎంతో తోడ్పడుతుందని చెప్పింది.రానున్న మూడేళ్లలో భారీ విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్న కంపెనీ ఇందుకు ప్రపంచస్థాయిలో అనుభవమున్న ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్(ఈపీసీఎం) దిగ్గజం కోసం చూస్తున్నట్లు వెల్లడించింది. గ్రూప్ బిజినెస్లను వేదాంతా అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఐరన్ అండ్ స్టీల్ పేరుతో నాలుగు విభాగాలుగా విడదీయనుంది.ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..రానున్న మూడేళ్లలో మెటల్స్, మైనింగ్, హైడ్రోకార్బన్స్పై 20 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు ఆసక్తిగల కంపెనీల నుంచి ఈ ఏప్రిల్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఇంతక్రితం ప్రకటించిన విడదీత ప్రణాళికలను జూన్–జులైకు వాయిదా వేసింది. -
సీఈవోల సగటు వేతనం ఎంతంటే..
న్యూఢిల్లీ: దేశీయంగా ప్రమోటర్యేతర చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ప్రొఫెషనల్ సీఈవోల సగటు వేతనం గతేడాదితో పోలిస్తే 13 శాతం పెరిగి రూ.10 కోట్లకు చేరింది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా రూపొందించిన ఎగ్జిక్యూటివ్ పర్ఫార్మెన్స్, రివార్డ్స్ సర్వే 2025 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం సీఈవో వేతనాల్లో 40 శాతం భాగం మాత్రమే స్థిరమైనదిగా ఉంటోంది. మిగతా 60 శాతం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటోంది. ఇందులో స్వల్పకాలిక ప్రోత్సాహకాలు, వార్షిక బోనస్ల రూపంలో 25 శాతం, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల రూపంలో మిగతా 35 శాతం ఉంటోంది.మరోవైపు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లు, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు వంటి సీఎక్స్వోల వేతనాలు 7 నుంచి 11 శాతం మేర పెరిగాయి. వీరి వేతనాల్లో 60 శాతం స్థిరమైనదిగా ఉండగా, మిగతాది స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల రూపంలో ఉంటోంది. సీఈవోల తర్వాత సీవోవోలు, సీఎఫ్వోల వేతనాలు అత్యధికంగా రూ.4 కోట్ల స్థాయిలో ఉంటున్నాయి. ఈ సర్వేలో 400 పైచిలుకు సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో ప్రభుత్వ రంగ సంస్థలేవీ లేవు. సీఎక్స్వోలకు డిమాండ్ భారీగా ఉండటంతో వారి వేతనాలు గణనీయంగా పెరుగుతున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనందోరూప్ ఘోష్ తెలిపారు. సీఎక్స్వోల వేతనాలపై ఈక్విటీ మార్కెట్ల కరెక్షన్ ప్రభావం వచ్చే ఏడాది మాత్రమే తెలుస్తుందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు..సీఎక్స్వోల స్థాయిలో స్వల్పకాలిక ప్రోత్సాహకాలనేవి కేవలం ఆర్థికాంశాలతోనే ముడిపడినవి కాకుండా సమగ్రంగా వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటున్నాయి. అయితే, దీర్ఘకాలిక ప్రోత్సాహకాలకు మాత్రం ఆర్థిక పనితీరే ప్రాతిపదికగా ఉంటోంది. చాలా మటుకు కంపెనీలు సీఈవో, సీఎక్స్వోల పనితీరును మదింపు చేసేందుకు ఆర్థిక, వ్యూహాత్మక ప్రాధాన్యతలకు సంబంధించిన స్కోర్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. వీటిని చేరుకోవడంలో విఫలమైన సీఎక్స్వోలకు అంతక్రితం ఏడాదితో పోలిస్తే తక్కువ బోనస్లు ఇస్తున్నాయి. పలు కంపెనీల్లో దీర్ఘకాలికంగా షేర్ల ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చే ధోరణి పెరుగుతోంది. ఇలా వేతనంలో షేర్ల రూపంలో ఇచ్చే పరిమాణం అధికమవుతోంది. అయితే, షేర్ల ఆధారిత ప్రణాళికలను ప్రాక్సీ–అడ్వైజరీ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. మేనేజ్మెంట్ నిర్ణయాలను సవాలు చేస్తున్నాయి. ఓటింగ్ ఫలితాలనూ ప్రభావితం చేస్తున్నాయి. షేర్హోల్డర్లు ఇలాంటి ప్రతిపాదనలను తిరస్కరించడం గత ఏడాది వ్యవధిలో నాలుగు రెట్లు పెరిగింది. ఇదీ చదవండి: మొబైల్ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్దే..సీఈవోలు, సీఎక్స్వోల వ్యవధి తగ్గుతూ ఉండగా, పనితీరుపై అంచనాలు, షేర్హోల్డర్ల యాక్టివిజం గణనీయంగా పెరుగుతోంది. దీంతో జీతభత్యాలపరంగా కాంట్రాక్టుల్లో భారీగా బేరసారాలు జరుగుతున్నాయి. -
మొబైల్ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు.. అధిక వాటా ఈ బ్రాండ్దే..
గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ.1.5 లక్షల కోట్ల వాటా యాపిల్ ఐఫోన్లదే ఉన్నట్లు వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 54 శాతం పెరిగినట్లు వివరించారు.గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ అయిదు రెట్లు, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగినట్లు వైష్ణవ్ చెప్పారు. వివిధ పరికరాలు తయారు చేసే చిన్నా, పెద్ద సంస్థలన్నీ కలిపి 400 పైగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ను ఆయన ఆవిష్కరించారు. దీని కింద ఏప్రిల్ 1 నుంచి ఆరేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయని వైష్ణవ్ తెలిపారు. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల లెక్కింపునకు 2024–25 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్గా ఉంటుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకేకన్జూమర్ ఎల్రక్టానిక్స్, మెడికల్ ఎల్రక్టానిక్స్, పవర్ ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్ తదితర ప్రతి టెక్నాలజీ ప్రోడక్టుల్లో ఉపయోగించే ఎల్రక్టానిక్ పరికరాలన్నింటికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఫెరైట్లు, స్పెషాలిటీ సెరామిక్స్, కాయిల్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల కోసం కంపెనీలు రూ. 10 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రోత్సాహకాలు 1 నుంచి 10 శాతం వరకు ఉంటుంది. -
సెమీకండక్టర్ల తయారీలోకి సైయెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ టెక్నాలజీ దిగ్గజం సైయెంట్ తాజాగా సెమీకండక్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ’సైయెంట్ సెమీకండక్టర్స్’ పేరిట ప్రత్యేక కంపెనీని ప్రారంభించింది. దీనిపై 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు వెల్లడించారు. దీనికి సుమన్ నారాయణ్ సీఈవోగా వ్యవహరిస్తారని తెలిపారు. దేశవిదేశాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు, డిస్కంలు సహా వివిధ పరిశ్రమలకు అవసరమైన సిలికాన్ చిప్ సొల్యూషన్స్ను అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు కృష్ణ వివరించారు. కంపెనీ విస్తరణ కోసం సెపె్టంబర్ నాటికి ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని నిధులు సమీకరించే యోచనలో ఉన్నట్లు కృష్ణ వివరించారు. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియపై కొనసాగుతోందన్నారు. ఇలా సమీకరించిన నిధుల్లో సింహభాగం వాటా పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలు, నిపుణుల నియామకాలపై వెచ్చించనున్నట్లు కృష్ణ చెప్పారు. ప్రస్తుతం సెమీకండక్టర్ల సంబంధ విధులు నిర్వర్తిస్తున్న సుమారు 400 మంది సిబ్బందిని, కొత్త కంపెనీకి బదలాయించనున్నట్లు తెలిపారు. కొత్త సంస్థను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేసే యోచన ఉన్నట్లు కృష్ణ పేర్కొన్నారు. సెమీకండక్టర్ వ్యవస్థలో భారత్ స్వావలంబన సాధించడంలో తమ వంతు తోడ్పాటు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు. -
షేర్లపై జియో ఫైనాన్స్ రుణాలు
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో భాగమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ జియో ఫైనాన్స్ (జేఎఫ్ఎల్) తాజాగా డిజిటల్ విధానంలో సెక్యూరిటీస్పై రుణాల (ఎల్ఏఎస్) విభాగంలోకి ప్రవేశించింది. షేర్లు, మ్యూచువల్ ఫండ్లపై తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను పొందడానికి ఈ సాధనం ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రక్రియంతా పూర్తి డిజిటల్ రూపంలో పది నిమిషాల్లోనే పూర్తవుతుందని వివరించింది. జియోఫైనాన్స్ యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. దీని ద్వారా రూ. 1 కోటి వరకు, గరిష్టంగా మూడేళ్ల కాలపరిమితికి రుణాలు పొందవచ్చు. వ్యక్తిగత రిస్క్ సామర్థ్యాలను బట్టి వడ్డీ రేటు 9.99 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఫోర్క్లోజర్ చార్జీలు ఉండవు. షేర్లను విక్రయించాల్సిన అవసరం లేకుండా తనఖా పెట్టి, అవసరమైన నిధులను పొందేందుకు ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని జియో ఫైనాన్స్ ఎండీ కుశల్ రాయ్ తెలిపారు. యూపీఐ చెల్లింపులు, నగదు బదిలీ సర్విసులు, డిజిటల్ గోల్డ్ మొదలైన వాటిల్లో పెట్టుబడులు తదితర సేవలను కూడా జియోఫైనాన్స్ యాప్తో పొందవచ్చు. -
రుణ చెల్లింపుల్లో కాఫీ డే వైఫల్యం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తాజాగా 2025 మార్చి31 కల్లా రూ. 425.38 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. వీటిలో అసలు, వడ్డీ కలసి ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలుసహా అన్లిస్టెడ్ రుణ సెక్యూరిటీలు(ఎన్సీడీ, ఎన్సీఆర్పీఎస్) ఉన్నట్లు తెలియజేసింది.అసెట్ రిజల్యూషన్ ద్వారా రుణాలు తగ్గించుకుంటున్న కంపెనీ లిక్విడిటీ సంక్షోభం కారణంగా రుణ చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు వివరించింది. చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో రుణదాతలు లోన్ రీకాల్ నోటీసుల జారీతోపాటు.. చట్టపరమైన చర్యలు సైతం చేపడుతున్నట్లు పేర్కొంది. లోన్ రీకాల్ నోటీసులు, న్యాయ వివాదాలు, వన్టైమ్ సెటిల్మెంట్ పెండింగ్లో ఉండటం వంటి అంశాల కారణంగా 2021 ఏప్రిల్ నుంచి వడ్డీ మదింపు చేపట్టలేదని వెల్లడించింది. -
చైనా కంపెనీని వద్దన్నారు.. అమెరికా బ్రాండ్ను రమ్మన్నారు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విదేశీ కంపెనీలు మనదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో చైనీస్ కంపెనీ 'బీవైడీ' ఉంది. తాజాగా ఈ జాబితాలో ఎలాన్ మస్క్ టెస్లా కూడా చేరింది.బీవైడీ కంపెనీ దేశంలో ఒక బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడతామన్నప్పుడు భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికన్ కంపెనీ టెస్లాను మాత్రం ఆహ్వానిస్తోంది. ఈ వైఖరికి కారణాన్ని కేంద్ర వాణిజ్య మంత్రి 'పియూష్ గోయల్' ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో వెల్లడించారు.రెండు దేశాల మధ్య ఉన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగానే చైనా పెట్టుబడులను కాదన్నట్లు వెల్లడించారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థకు కూడా ఈ కారణాల చేతనే అనుమతి ఇవ్వలేదని పియూష్ గోయల్ వివరించారు.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?అమెరికా, భారత్ సంబంధాల దృష్ట్యా.. టెస్లాను ఇండియా ఆహ్వానిస్తోంది. త్వరలోనే టెస్లా కంపెనీ భారతదేశంలో తమ కార్లను విక్రయించడానికి సన్నద్ధమవుతోంది. యూఎస్ కంపెనీ తన అమ్మకాల గురించి వెల్లడించింది.. కానీ స్థానికంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తుందా? లేదా అనేదానికి సంబంధించిన విషయాలను వెల్లడించలేదు. టెస్లా ఇండియాలో తన ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే.. భారతదేశం ఆటోమొబైల్ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్తుందని నిపుణులు చెబుతున్నారు.టెస్లా మోడల్ వైటెస్లా (Tesla) కంపెనీ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది. దీని రేటు రూ. 21 లక్షల వరకు ఉంటుందని సమాచారం. -
అదానీ కొలంబో టెర్మినల్ షురూ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ తాజాగా శ్రీలంకలోని కొలంబో పశ్చిమ అంతర్జాతీయ టెర్మినల్ (సీడబ్ల్యూఐటీ)ను ప్రారంభించినట్లు వెల్లడించింది. పబ్లిక్ ప్రయివేట్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన సీడబ్ల్యూఐటీని కన్సార్షియం నిర్వహించనున్నట్లు తెలియజేసింది.కంపెనీ అధ్యక్షతన శ్రీలంక దిగ్గజం జాన్ కీల్స్ హోల్డింగ్స్ పీఎల్సీ, శ్రీలంక పోర్ట్స్ అథారిటీ కన్సార్షియంలో భాగమైనట్లు పేర్కొంది. 35ఏళ్ల కాలానికి నిర్మించు, నిర్వహించు, బదిలీ చేయి(బీఓటీ) పద్ధతిలో ఒప్పందం అమలుకానున్నట్లు వివరించింది.80 కోట్ల డాలర్ల పెట్టుబడులతో 1,400 మీటర్ల పొడవు, 20 మీటర్ల లోతుతో అభివృద్ధి చేసిన కొలంబో టెరి్మనల్ వార్షికంగా 3.2 మిలియన్ టీఈయూను హ్యాండిల్ చేయగలదని తెలియజేసింది. కొలంబోలో ఇది తొలి డీప్వాటర్ టెరి్మనల్కాగా.. పూర్తి ఆటోమేటెడ్గా ఏర్పాటైన్నట్లు పేర్కొంది. తద్వారా కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాలు మెరుగుపడటం, వెస్సల్ టర్న్అరౌండ్ సమయం తగ్గడం వంటి సౌకర్యాలకు వీలు కలగనున్నట్లు తెలియజేసింది. -
‘మైక్రోసాఫ్ట్లో డిజిటల్ ఆయుధాల తయారీ’
వాషింగ్టన్లో ఇటీవల జరిగిన మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవ వేడుకలకు పాలస్తీనా అనుకూల ఉద్యోగులు అంతరాయం కలిగించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో మైక్రోసాఫ్ట్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఇందులో కొందరు రాజీనామా చేశారు. వీరిలో మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగానికి చెందిన ఇండో అమెరికన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు. గాజాలో హింసాకాండకు ఈ సంస్థ సహకరిస్తోందని ఆరోపిస్తూ మైక్రోసాఫ్ట్ను ‘డిజిటల్ ఆయుధాల తయారీదారు’గా అభివర్ణించారు. బహిరంగంగానే రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తూ నినాదాలతో సమావేశం నుంచి బయటకు వచ్చారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న 133 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అగర్వాల్ ఖండించారు. కంపెనీ ఏఐ, అజూర్ క్లౌడ్ సేవలు పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు మద్దతుగా నిలిస్తున్నాయని పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్, కృత్రిమ మేధ గాజాలో ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత ప్రాణాంతకంగా, విధ్వంసకరంగా మార్చేందుకు వీలు కల్పిస్తున్నాయి’ అని అగర్వాల్ కంపెనీకి సమర్పించిన ఈమెయిల్లో రాశారు. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలు, యుద్ధ మౌలిక సదుపాయాలతో ముడిపెట్టిన నివేదికలను ఆమె ఉదహరించారు.ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీఅమెజాన్లో మూడేళ్లకు పైగా పనిచేసిన తర్వాత 2023 సెప్టెంబర్లో మైక్రోసాఫ్ట్లో చేరిన అగర్వాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల్లో అసమ్మతి పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఆమె నిరసన తెలపడం తాజాగా చర్చనీయాంశం అయింది. ఫిబ్రవరిలో సీఈఓ సత్య నాదెళ్లతో జరిగిన ఒక సమావేశంలో ఇలాంటి ఆందోళనల కారణంగా అంతరాయం కలగడంతో ఐదుగురు సిబ్బందిని తొలగించారు. ఈ ఆరోపణలపై గానీ, అగర్వాల్ రాజీనామాపై గానీ మైక్రోసాఫ్ట్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. -
తగ్గిన భోజనం ధరలు
వెజిటేరియన్లూ.. మీ భోజనం ఖర్చులు తగ్గాయ్! నాన్ వెజిటేరియన్లూ.. మీకో శుభవార్త. నాన్ వెజ్ మీల్స్ ఖర్చు కూడా తగ్గింది. క్రిసిల్ రేటింగ్ సంస్థ ఈమేరకు రిపోర్ట్ వెలువరించింది. ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణం.. వెజిటేరియన్ అన్ని వంటల్లో దాదాపుగా వాడే టమాటా ధరలు తగ్గడమేనని నివేదిక తెలిపింది. నాన్వెజ్ మీల్స్ తగ్గింపునకు చికెన్ ధరలు దిగిరావడమే కారణమని పేర్కొంది.క్రిసిల్ నివేదికలోని వివరాల ప్రకారం.. మార్చిలో ఇంట్లో వండిన థాలీ ధర వరుసగా ఐదోసారి తగ్గింది. దాంతో ఇది రూ.26.6కు చేరుకుంది. ముఖ్యంగా టమాటా ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. మార్చిలో బ్రాయిలర్ చికెన్ ధరలు తగ్గడంతో మాంసాహార థాలీ ధర కూడా రూ.54.8కి చేరింది. శాఖాహార థాలీలో రోటీ, అన్నం, పప్పు, కూరగాయలు..వంటివి ఉంటాయి. ఈ భోజనాన్ని ఇంట్లో తయారు చేయడానికి సగటు ఖర్చు మార్చిలో రూ.26.6కు పడిపోయింది.ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీభోజన ఖర్చులు క్షీణించడం కొన్ని వర్గాల వారికి ఆహార ద్రవ్యోల్బణం విస్తృతంగా తగ్గేలా చేసింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గడంతో ఈమేరకు ఉపశమనం కలిగినట్లయింది. ఇంట్లో వండిన భోజనంపై ఆధారపడే కుటుంబాలకు ఇది ఎంతో మేలు కలిగిస్తుంది. నాన్ వెజిటేరియన్ థాలీ ధరలు ప్రధానంగా చికెన్పై ఆధారపడి ఉంటాయి. బ్రాయిలర్ చికెన్ ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. మార్చిలో బర్డ్ఫ్లూ భయాలు అధికం కావడంతో భారీగా ధరలు తగ్గాయి. ఇది నాన్వెజ్ థాలీ తగ్గుదలకు కారణమైంది. మధ్యలో చికెన్ ధరలు ఒడిదొడుకులకులోనైనా చౌకగా కూరగాయలు లభ్యత ఉండడంతో ఖర్చులను భర్తీ చేసేందుకు తోడ్పడింది. -
త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న టారిఫ్లు టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచ టాప్ టెక్ కంపెనీ యాపిల్పై ఈ సుంకాల ప్రభావం భారీగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ఎలాగైనా కంపెనీ ఐఫోన్ ధరలు పెంచుందనే ఉద్దేశంతో వినియోగదారులు ముందుగానే కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఐఫోన్లు అధికంగా తయారవుతున్న చైనాపై యూఎస్ ఏకంగా 54 శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల కంపెనీ షేర్లు ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయాయి. అదేసమయంలో త్వరలో ధరలు పెరుగుతాయని ఊహాగానాలతో ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు యూజర్లు బారులు తీరుతున్నారు.టారిఫ్ల అమలు తర్వాత అనూహ్యంగా వ్యయ పెరుగుదల ఉంటుందని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు అమల్లోకి రాకముందే ఐఫోన్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడడంతో అమెరికా వ్యాప్తంగా యాపిల్ రిటైల్ స్టోర్ల వద్ద రద్దీ కనిపించింది. చైనా తయారీపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఈ సుంకాలు యాపిల్పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.భారత్పైనా ప్రభావం..విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గుఐఫోన్ రూ.రెండు లక్షలు!చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు. -
సాఫ్ట్వేర్ సృష్టి కంటే నిర్వహణవైపే మొగ్గు
ప్రముఖ మెసేజింగ్ టూల్ హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా ఇటీవల భారతదేశ ఇంజినీరింగ్ వ్యవస్థ గురించి, ఆవిష్కరణల సామర్థ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత ఆవిష్కరణలో చైనా సాధించిన విజయాలతో సరితూగే భారతదేశ సామర్థ్యానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. చాలా మంది భారతీయ ఇంజినీర్లు కొత్త సాంకేతికత సృష్టించడానికి బదులుగా వాటి నిర్వహణ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.99 శాతం భారతీయ ఇంజినీర్లు అపార జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. కానీ చాలావరకు స్పష్టమైన ఉత్పత్తులను సృష్టించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మనస్తత్వం మెరుగైన ఆవిష్కరణలను ప్రోత్సహించే భారతదేశ సామర్థ్యాన్ని అణచివేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ సాఫ్ట్వేర్ సృష్టి కంటే ఔట్ సోర్సింగ్పై దృష్టి సారించే వ్యాపారవేత్తలపై భారత్ ప్రశంసలు కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిటికల్ థింకింగ్, ప్రాక్టికల్ స్కిల్స్ను ప్రోత్సహించేందుకు భారత్ తన విద్యావ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని భాటియా వ్యాఖ్యానించారు. దీన్ని చైనా సమ్మిళిత విద్యా విధానాలతో పోల్చారు. ఇది సృజనాత్మకత, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వారి విజయానికి దోహదపడిందని తెలిపారు.ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..ఇంజినీరింగ్ విద్య, వర్క్ కల్చర్ విషయంలో భారత్ పునరాలోచించుకోవాలని భాటియా పిలుపునిచ్చాయి. సాంకేతిక నైపుణ్యాలకు విలువనివ్వడం, సృజనాత్మకత వృద్ధి చెందేలా తగిన వాతావరణాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించారు. -
ఐటీ రంగానికి సవాళ్లు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ టారిఫ్లతో తలెత్తిన వాణిజ్య భయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ సాఫ్ట్వేర్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు యూరోపియన్ దేశాలపైనా టారిఫ్ల అంశం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు వివరించారు. వెరసి ఐటీ పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్లుగా నిలుస్తున్న యూఎస్, యూరప్లలో ప్రతీకార టారిఫ్లు మందగమనం లేదా ఆర్థిక మాంద్యానికి దారి చూపనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్త ఆందోళనలకు కారణమవుతున్నట్లు ఐటీ నిపుణులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు నిరాశపరచవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఏడాది(2025–26) ఆదాయ అంచనాలు(గైడెన్స్) నీరసించవచ్చని భావిస్తున్నారు.ఫలితాలకు రెడీఇకపై సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజాలు 2024–25 క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాలపై అంచనాలు(గైడెన్స్) ప్రకటించనున్నాయి. తొలుత టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ 10న ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో విప్రో 15న, ఇన్ఫోసిస్ 17న, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 22న, టెక్ మహీంద్రా 24న పనితీరు వెల్లడించనున్నాయి.ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలువ్యయాలు తగ్గవచ్చుఐటీ సేవలకు అతిపెద్ద విభాగం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ)తోపాటు.. కీలకమైన రిటైల్, తయారీ రంగాలలో కంపెనీల వ్యయాలు తగ్గనున్నట్లు భావిస్తున్నారు. విచక్షణాధారిత వ్యయాలపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చని చెబుతున్నారు. దీంతో సమీప భవిష్యత్లో రికవరీకి చాన్స్ తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. రానున్న రెండు త్రైమాసికాలలో ఐటీ కంపెనీల ఫలితాలు నిరాశరపచడానికితోడు ఆదాయ అంచనాలలో కోతలకు వీలున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత టారిఫ్ వార్ కారణంగా రిటైల్, తయారీ రంగాలు డీలా పడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే సర్వైవల్ వ్యయాలు తప్పకపోవచ్చని, జెన్ఏఐకు సైతం పెట్టుబడుల కేటాయింపులు పెరగవచ్చని మరికొంతమంది నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది(2025–26) ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో ఆర్థిక స్థిరత్వం, ఏఐ సేవలకు డిమాండ్ వంటి అంశాలు తిరిగి ఐటీ సేవలకు సానుకూలతను తీసుకువచ్చే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. -
టాయ్ పరిశ్రమకు ‘టారిఫ్’ల ప్రయోజనం!
న్యూఢిల్లీ: ట్రంప్ టారిఫ్ వార్ సెగ అన్ని దేశాలకూ గట్టిగానే తగులుతోంది. అయితే భారత్తో పోలిస్తే చైనా, వియత్నాం తదితర పోటీ దేశాలపై అధిక సుంకాలు విధించడం మన టాయ్ పరిశ్రమ దీన్ని సదావకాశంగా మలుచుకోవడానికి సిద్ధమవుతోంది. ఇతర దేశాల సంస్థలతో జాయింట్ వెంచర్ల ఏర్పాటు ద్వారా తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు దేశీ కంపెనీలు ఇప్పటికే పని మొదలు పెట్టాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. ఇతర దేశాలపై అధిక టారిఫ్ల ప్రభావంతో మన ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుందని, దీంతో ఈ వాణిజ్య యుద్ధంలో భారత్ విజయం సాధించనుందని కూడా వారు అంటున్నారు.ఆసియాలో చైనాపై 54 శాతం, బంగ్లాదేశ్పై 37 శాతం, థాయ్లాండ్పై 36 శాతం, ఇండోనేషియాపై 32 శాతం చొప్పున ట్రంప్ భారీగా సుంకాలను వడ్డించిన సంగతి తెలిసిందే. భారత్పై మాత్రం 26 శాతం టారిఫ్లతో సరిపెట్టారు. ‘ఇది మనకు భారీగా అవకాశాలను అందించనుంది. ఎందుకంటే వియత్నాం 6 బిలియన్ డాలర్లు, చైనా 80 బిలియన్ డాలర్ల చొప్పున ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. భారతీయ టాయ్స్తో పోలిస్తే వారి వస్తువులకు అధిక సుంకాలు పడతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బడా టాయ్ సంస్థలన్నీ భారత్లో ప్లాంట్ల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తున్నాయి’ అని ప్లేగ్రో టాయ్స్ ఇండియా సీఈఓ మను గుప్తా పేర్కొన్నారు.34.8 కోట్ల డాలర్ల ఎగుమతులు..పరిశ్రమ వర్గాల గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లుగా భారత్ నుంచి 32.6–34.8 కోట్ల డాలర్ల విలువైన టాయ్ ఎగుమతులు జరుగుతున్నాయి. అమెరికాతో వీలైనంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారతీయ టాయ్ సంస్థలు యూఎస్కు తమ ఎగుమతులను పెంచేందుకు దోహదం చేస్తుందని కూడా గుప్తా అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా ఇప్పుడు రంగాల వారీగా పాలసీలను రూపొందిస్తున్నాయన్నారు. కాగా, బడ్డెట్లో టాయ్ పరిశ్రమ కోసం ప్రకటించిన జాతీయ యాక్షన్ ప్లాన్ ఈ రంగానికి మరింత దన్నుగా నిలవనుందని సన్లార్డ్ గ్రూప్ ప్రమోటర్ అమితాభ్ ఖర్బందా పేర్కొన్నారు.ఇదీ చదవండి: అప్పుల కుప్పలుగా రాష్ట్రాలుఇతర దేశాల ఆధిపత్యంతో భారత్ అనేక ఏళ్లుగా నికర టాయ్స్ దిగుమతిదారుగానే కొనసాగుతోంది. గడిచిన దశాబ్దకాలానికి పైగా చైనా పైనే పూర్తిగా ఆధారపడుతూ 76 శాతం మేర టాయ్స్ దిగుమతి చేసుకుంటోంది. అయితే, ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. 2012–13లో భారత్ చైనా నుంచి 21.4 కోట్ల డాలర్ల టాయ్స్ దిగుమతి చేసుకోగా, 2023–24లో ఇది 4.16 కోట్ల డాలర్లకు దిగొచి్చంది. అంటే దాదాపు 94 శాతం దిగుమతలు కాస్తా, 64 శాతానికి తగ్గాయి. అంతర్జాతీయ టాయ్ మార్కెట్లో భారత్ పోటీతత్వానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
‘నా అప్పు 6 వేల కోట్లు.. వసూలు చేసింది14 వేల కోట్లు’
న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులు తన ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా తాను కట్టాల్సిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని రాబట్టుకున్నాయని పరారీలో ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ చీఫ్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. ఇందుకు 2024–25 ఆర్థిక శాఖ వార్షిక నివేదికలోని గణాంకాలే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను రూ.6వేల కోట్లు బకాయి పడితే, భారతీయ బ్యాంకులు నా నుంచి రూ.14వేల కోట్లు వసూలు చేశాయి. ఇది నేను చెల్లించాల్సిన మొత్తం కంటే 2 రెట్లు ఎక్కువ’ అని విజయ్ మాల్యా అన్నారు. Finally against a DRT judgement debt of Rs 6203 crores, admitted recovery of Rs 14,131.8 crores which will be evidence in my UK Bankruptcy annulment application. Wonder what Banks will say in an English Court. pic.twitter.com/oRSMhm4nx2— Vijay Mallya (@TheVijayMallya) April 6, 2025ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రాబట్టిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ, మాల్యా కేసులో రూ. 14,131.8 కోట్లు రికవర్ అయ్యిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నివేదికలో పేర్కొన్నట్లు మాల్యా వివరించారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశించిన రూ. 6,203 కోట్ల రికవరీకి ఇది రెట్టింపు మొత్తం అని ఆయన చెప్పారు. తనను భారత్కు అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టులో నడుస్తున్న కేసులో ఇది కీలక సాక్ష్యంగా ఉండబోతోందన్నారు.బ్యాంకులు దీన్ని ఏ విధంగా కోర్టులో సమర్థించుకుంటాయో చూడాలని వ్యాఖ్యానించారు. వివిధ బ్యాంకులకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ. 9,000 కోట్లు బాకీపడిన కేసుకు సంబంధించి 2016 మార్చిలో మాల్యా బ్రిటన్కు పారిపోయారు. దీంతో మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా పరిగణిస్తున్నారు. ఆయన్ను స్వదేశం రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.ముందస్తు ఆలోచనలతోనే.. బఫెట్ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్లో 9.29 శాతం, ఇటోచు కార్ప్లో 8.53 శాతం, మరుబెని కార్ప్లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి. -
ఐపీఓకు రెండు కంపెనీలు రెడీ
ఐపీఓ ద్వారా నిధుల సమీకరించేందుకు రెండు కంపెనీలు సిద్ధమయ్యాయి. సాయి ఇన్ఫినియం, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు అనుమతులు కోరుతూ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించాయి. ఈ రెండు ఇష్యూలు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లేకుండానే జరగనున్నాయి.సాయి ఇన్ఫినియం 1.96 కోట్ల తాజా ఈక్విటీలు జారీ చేయనుంది. సమీకరించిన నిధుల్లో 17.4 మెగావాట్ల హైబ్రిడ్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.130 కోట్లు, రోలింగ్ మిల్లు కొనుగోలుకు రూ.65 కోట్లు, కార్గో వెసెల్ కొనుగోలుకు రూ.19 కోట్లు ఉపయోగించనుంది.అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ అగ్రోకెమికల్ తయారీ కంపెనీ ‘అడ్వాన్స్ అగ్రోలైఫ్’ 1.92 కోట్ల తాజా ఈక్విటీ షేర్ల ద్వారా నిధులు సమీకరించనుంది. అర్హులైన కంపెనీ ఉద్యోగులకు రిజర్వేషన్ సదుపాయం కల్పించింది. అలాంటి వారికి డిస్కౌంట్తో షేర్లు కేటాయించనుంది. సమీకరించిన నిధుల్లో రూ.135 కోట్లు మూలధన అవసరాలకు మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
దేశవ్యాప్తంగా రూ.50 పెరిగిన వంట గ్యాస్ ధరలు
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన వెంటనే.. గ్యాస్ ధరల పెంపు కూడా జరిగింది. ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. ఇది ఉజ్వల పథకం సిలిండర్లకు వర్తిస్తుంది. ఈ ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి.ధరల పెరుగుదల గురించి కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 500 నుంచి రూ. 550కు పెరిగింది. ఈ ధర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇతరులు రూ. 853 చెల్లించాల్సి (ధరల పెరుగుదలకు ముందు ఈ ధర రూ. 803గా ఉండేది) ఉంటుంది.ఈ సందర్బంగా పెట్రోల్, డీజిల్ పై ఇటీవల ఎక్సైజ్ సుంకం పెంపు వినియోగదారులపై భారం మోపడానికి ఉద్దేశించినది కాదు. సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న 43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.#WATCH | Delhi | Union Minister for Petroleum and Natural Gas, Hardeep Singh Puri says, "The price per cylinder of LPG will increase by Rs 50. From 500, it will go up to 550 (for PMUY beneficiaries) and for others it will go up from Rs 803 to Rs 853. This is a step which we will… pic.twitter.com/KLdZNujIwK— ANI (@ANI) April 7, 2025 -
వాట్సాప్ ద్వారా ఫండ్స్లో పెట్టుబడులు
ముంబై: హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ పరిశ్రమలోనే తొలిసారిగా ట్యాప్2ఇన్వెస్ట్ ఫీచరును ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీనితో కేవైసీ ధృవీకరణ పూర్తి చేసుకున్న ఇన్వెస్టర్లు వాట్సాప్ (నంబరు 8270682706) ద్వారా ఇన్వెస్ట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.ఇన్వెస్ట్మెంట్ యాప్ తరహాలోనే ఇది పనిచేస్తుందని తెలిపింది. దీనితో కేవలం ఆయా ఆప్షన్లపై క్లిక్ చేయడం ద్వారా తమ స్కీముల్లో ఏకమొత్తంగా లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చని సంస్థ వివరించింది. యూపీఏ ఆటోపే, నెట్బ్యాంకింగ్, ఇతరత్రా డిజిటల్ చెల్లింపు విధానాలను ఇది సపోర్ట్ చేస్తుందని కంపెనీ ఎండీ నవనీత్ మునోట్ తెలిపారు. -
అతివలకు అడ్వైజర్లుగా మంచి కెరియర్..
చాలా మంది మహిళలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి బడ్జెట్లు చూసుకోవడం, ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడమనేది దైనందిన చర్యగానే ఉంటుంది. ఈ బాధ్యతలే ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడం, కమ్యూనికేషన్, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యాల్లాంటి అమూల్యమైన నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఉపయోగపడతాయి. విజయవంతమైన జీవిత బీమా అడ్వైజరు/ కన్సల్టెంటుగా మారాలంటే అచ్చంగా ఇలాంటి నైపుణ్యాలే అవసరం.అడ్వైజరు, కన్సల్టెంటుగా మారడమనేది, జీవిత లక్ష్యాలకు సంబంధించి ప్రణాళికలు వేసుకోవడంలో ఇతరులకు తోడ్పడటంతో పాటు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం కూడా కృషి చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఆర్డీఏఐ ప్రకారం 2022 మార్చి నాటికి దేశీయంగా మొత్తం జీవిత బీమా ఏజెంట్లలో మహిళల వాటా 29 శాతంగా ఉంది. సుమారు 24.43 లక్షల మంది ఏజంట్లలో దాదాపు 7 లక్షల మంది మహిళా ఏజంట్లు ఉన్నారు. మహిళలు ముందుకొచ్చి, అవకాశాలను అందిపుచ్చుకుంటే, ఈ సంఖ్య మరింతగా పెరగొచ్చు.అడ్వైజరుగా ఇలా మారొచ్చు..1. ప్రాథమిక అర్హతలు, శిక్షణ: బీమా పథకాలు, విక్రయించేందుకు టెక్నిక్లు, ఆర్థిక ప్రణాళిక సూత్రాలు మొదలైన విషయాల్లో అభ్యర్థులకు అవగాహన కల్పించేలా చాలా మటుకు కంపెనీలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. సమర్ధవంతంగా క్లయింట్లకు మార్గదర్శకత్వం వహించేందుకు మహిళలకు అవసరమయ్యే సాధన సంపత్తిని వీటి ద్వారా సమకూర్చుకోవచ్చు.2. నెట్వర్కింగ్: క్లయింట్ల నమ్మకాన్ని చూరగొనాలంటే సంభాషించే నైపుణ్యాలు, ఇతరులతో కలిసి పని చేయగలగడం, అవసరమైతే సారథ్య బాధ్యతలు చేపట్టడం, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకోగలిగే సామర్థ్యాల్లాంటివి చాలా ముఖ్యం. తాము అడ్వైజరుగా వ్యవహరించే సంస్థల సహాయంతో మహిళలు సామర్థ్యాలను మెరుగుపర్చుకుని, దీర్ఘకాలిక ప్రొఫెషనల్ కనెక్షన్లను ఏర్పర్చుకోవచ్చు.3. డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకోవడం: డిజిటల్ యుగంలో భావి కస్టమర్లను చేరుకునేందుకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ అనేవి శక్తివంతమైన సాధనాలుగా ఉంటున్నాయి. తమ అనుభవాన్ని తెలియజేసేందుకు, భావి కస్టమర్లలో అవగాహనను పెంపొందించేందుకు మహిళలు ఈ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకోవచ్చు. 4. నిరంతరం నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం: పరిశ్రమలో వచ్చే కొత్త పోకడలు, కొత్త ప్రోడక్టులు, నియంత్రణ నిబంధనలపరమైన మార్పుల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటే దీర్ఘకాలికంగా విజయాలకు దోహదపడుతుంది. సంబంధిత సర్టిఫికేషన్ల పొందితే కెరియర్లో పురోగమించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. చివరగా చెప్పేదేమిటంటే మహిళలు, ముఖ్యంగా గృహిణులు తమకు అంతర్గతంగా ఉండే నైపుణ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని, కెరియర్ను నిర్మించుకోవడానికి జీవిత బీమా రంగం అవకాశం కల్పిస్తుంది.సరైన శిక్షణ, సంకల్పం, నెట్వర్కింగ్ సామర్థ్యాలను అలవర్చుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా మహిళలూ విజయవంతగా రాణించగలరు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు కావడం ద్వారా ఆర్థిక స్వాతంత్య్రం, వర్క్–లైఫ్ సమతుల్యత, ఇతరులకు సాధికారత కల్పించే సంతృప్తిని పొందవచ్చు.ఇదీ చదవండి: ఇక ఒక రాష్ట్రం–ఒక ఆర్ఆర్బీ!జీవిత బీమాలో కెరియర్తో ఆర్థిక స్వాతంత్య్రంజీవిత బీమా రంగంలో మహిళలు కెరియర్పరంగా పురోగమించడంతో పాటు ఆర్థికంగా సాధికారతను కూడా పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కన్సల్టెంటుగా కెరియర్ ఇటు వ్యక్తిగత బాధ్యతలు, అటు ప్రొఫెషనల్ ఆకాంక్షల మధ్య సమతౌల్యం పాటిస్తూ, ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. స్థిరమైన ఆదాయార్జన పొందడంతో పాటు అర్థవంతమైన ప్రభావాన్ని చూపేందుకు ఇందులో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. తద్వారా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవడంలో తోడ్పడటమే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం పొందేందుకు కూడా ఇది ఉపయోగపడగలదు.-సమీర్ జోషి, చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ -
టెస్లా రాకపై బీఎండబ్ల్యూ ఇండియా కీలక వ్యాఖ్యలు
అమెరికన్ బ్రాండ్ టెస్లా.. భారతదేశంలో ప్రవేశిస్తుందనే వార్త దేశీయ విఫణిలో కొంతమంది వాహన తయారీదారులను ఒకింత భయానికి గురి చేసింది. అయితే బీఎండబ్ల్యూ ఇండియా మాత్రం.. మాకు ఏమాత్రం భయం లేదని స్పష్టం చేసింది.టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం వల్ల ఎలక్ట్రిక్ వాహన విభాగం మరింత అభివృద్ధి చెందుతుందని బీఎండబ్ల్యూ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ 'విక్రమ్ పవాహ్' స్పష్టం చేశారు. ఈవీ మార్కెట్ పెరగాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ పోటీ ఉన్నప్పుడే.. ఆ విభాగం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.టెస్లా కంపెనీ పోటీపై మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో మా ఉనికి ఉంది. ప్రతి ఏటా బీఎండబ్ల్యూ నమోదు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహన విభాగం కూడా ఆశాజనకంగానే ఉందని విక్రమ్ పవాహ్ పేర్కొన్నారు. 2024లో బీఎండబ్ల్యూ గ్రూప్ నాలు లక్షల కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇది అంతకు ముందు అమ్మకాలతో పోలిస్తే 13.5 శాతం ఎక్కువ.ఇదీ చదవండి: చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్స్ రెండూ.. కూడా వరుసగా 3,68,523 యూనిట్లు.. 56,181 యూనిట్ల అమ్మకాలను సాధించాయని పవాహ్ చెప్పారు. 2025 జనవరి, మార్చి కాలంలో భారతదేశంలో కార్ల అమ్మకాలు 7 శాతం పెరిగి 3,914 యూనిట్లకు చేరుకున్నాయని వెల్లడించారు. ఈ ఏడాది కూడా కంపెనీ అమ్మకాలలో వృద్ధి కనపరచడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. -
ఏడు పదాల్లోనే రాజీనామా చేసిన ఉద్యోగి - ఫోటో వైరల్
సాధారణంగా ఒక ఉద్యోగి రాజీనామా చేస్తున్నాడంటే.. ఒక వివరణతో కూడిన సమాచారం ఉంటుంది. కానీ ఒక ఉద్యోగి కేవలం ఏడు పదాల్లోనే రాజీనామా చేస్తున్నా అంటూ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.రెడ్డిట్లో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. 'ఛారిటీ అకౌంటింగ్ నాది కాదు, నేను క్విట్ అవుతున్నాను' అని ఒక కాగితంపై చేతితో రాసిన రాత ఏడు పదాలతో ఉండటం గమనించవచ్చు. దీనిని మా కొత్త ఉద్యోగి.. అతని డెస్క్ మీద కనుగొన్నాడు, అనే క్యాప్షన్తో పోస్ట్ చేశారు.ఈ రెడ్డిట్ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అందులో నిజాయితీ ఉందని చెబితే.. మరికొందరు ఎవరో మొరటుగా లేదా ఆకస్మికంగా రాసినట్లు ఉందని అన్నారు. నిజానికి ఇలాంటి రాజీనామా లేఖలు చాలా అరుదుగా వెలుగులోకి వస్తుంటాయనే చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఉద్యోగులు అసహనానికి గురైతే.. ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని తెలుస్తోంది.ఇదీ చదవండి: అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్ -
జియో కొత్త రీచార్జ్ ప్లాన్: రోజుకు 2జీబీ డేటా
భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో.. తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించేవారికోసం రూ. 1049 ప్లాన్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రిలయన్స్ జియో రూ.1,049 ప్లాన్ ద్వారా.. 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. అంతే కాకుండా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా ఈ ప్లాన్లో 50జీబీ జియోఏఐ క్లౌడ్ స్టోరేజ్, 90 రోజుల పాటు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా జీ5, సోనీలివ్ వంటి వాటికి కూడా యాక్సెస్ లభిస్తుంది.ఇదీ చదవండి: అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్460 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో రిలయన్స్ జియో భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్గా నిలిచింది. ఈ కంపెనీ అపరిమిత కాలింగ్, ఎస్ఎమ్ఎస్, డేటా వంటి వాటికోసం విభిన్న శ్రేణి రీఛార్జ్ ప్లాన్లను అందిస్తుంది. ప్రస్తుతం సంస్థ 5జీ, 4జీ, 4జీ ప్లస్ అనే సర్వీసులను అందిస్తోంది. -
ముగ్గురు ఖాన్లనూ మించిన కుబేరుడు!
ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా 2025 ఎడిషన్ ఇటీవల విడుదలైంది. ఈ జాబితాలో భారత్కు చెందిన బిలియనీర్లు 205 మంది ఉన్నారు. వీరిలో వినోదం, మీడియా ప్రపంచానికి చెందినవారు కొంతమంది ఉండగా ఇందులో బాలీవుడ్ నుంచి ఉన్న ఏకైక బిలియనీర్ రోనీ స్క్రూవాలా (Ronnie Screwvala). ఒకప్పుడు టూత్ బ్రష్లు అమ్మిన ఆయన ఇప్పుడు పరిశ్రమలోని అతిపెద్ద సూపర్ స్టార్ల కంటే ధనవంతుడైన పారిశ్రామికవేత్త.బాలీవుడ్ అపర కుబేరుడుఫోర్బ్స్ ప్రకారం.. హిందీ చిత్ర పరిశ్రమ నుండి ఒక బిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ఏకైక వ్యక్తి మూవీ మాగ్నెట్, పారిశ్రామికవేత్త రోనీ స్క్రూవాలా. ఫోర్బ్స్ కొత్త జాబితా ప్రకారం ఈ మీడియా మొఘల్ నికర విలువ 1.5 బిలియన్ డాలర్లు. దీంతో ఇండస్ట్రీలో సూపర్ స్టార్లుగా ఉన్న ఖాన్ త్రయం కంటే ధనవంతుడు. ఎలాగంటే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) (770 మిలియన్ డాలర్లు), సల్మాన్ ఖాన్ (Salman Khan) (390 మిలియన్ డాలర్లు), అమీర్ ఖాన్ (Aamir Khan) (220 మిలియన్ డాలర్లు) మొత్తం నెట్వర్త్ 1.38 బిలియన్ డాలర్లు కాగా ఆ ముగ్గురి సంపద కంటే రోనీ స్క్రూవాలా సంపద అధికం. రోనీ వ్యాపార ప్రస్థానం1956లో బొంబాయిలో జన్మించిన స్క్రూవాలా 70వ దశకం చివర్లో టూత్ బ్రష్ ల తయారీ ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారు. 80వ దశకం ప్రారంభంలో ఆసియా క్రీడల పుణ్యమా అని కలర్ టీవీ దేశంలోకి ప్రవేశించినప్పుడు అ బూమ్ను స్క్రూవాలా అందిపుచ్చుకున్నారు. అలా ఎంటర్టైన్ మెంట్ రంగంలోకి ప్రవేశించి 1990లో యూటీవీని స్థాపించారు. అదే తరువాత యూటీవీ మోషన్ పిక్చర్స్గా మారింది. తరువాతి రెండు దశాబ్దాలలో ఈ నిర్మాణ సంస్థలు స్వదేశ్, రంగ్ దే బసంతి, ఖోస్లా కా ఘోస్లా, జోధా అక్బర్, ఫ్యాషన్, ఢిల్లీ బెల్లీ, బర్ఫీమ్ వంటి ఐకానిక్ చిత్రాలను అందించాయి. అలాగే శాంతి, హిప్ హిప్ హుర్రే, షకా లకా బూమ్ బూమ్, కిచిడి, షరారత్ వంటి టీవీ షోలను అందించాయి.తర్వాత రోనీ స్క్రూవాలా 2012లో యూటీవీని డిస్నీకి బిలియన్ డాలర్ల ఒప్పందంలో అమ్మేశారు. అనంతరం ఐదు సంవత్సరాలకు ఆర్ఎస్వీపీ మూవీస్ సంస్థను స్థాపించారు. అలా ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కేదార్నాథ్, ఉరీ, ది స్కై ఈజ్ పింక్, సామ్ బహదూర్ చిత్రాలను నిర్మించారు. 2024లో స్క్రూవాలా షార్క్ ట్యాంక్ ఇండియాలో షార్క్లలో ఒకరిగా వెండితెర అరంగేట్రం చేశారు. రోనీ స్క్రూవాలాకు సినిమాలే ఏకైక ఆదాయ వనరు కాదు. అప్ గ్రాడ్, యూనిలాజర్, యూఎస్ స్పోర్ట్స్ వంటి పలు స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా కొన్నింటిని స్థాపించారు. ఈ సంస్థల విజయం, తన సినిమా వ్యాపారం ఆయన భారీ సంపదను పోగుచేసుకోవడానికి దోహదపడ్డాయి. -
IPO: ఎన్ఎస్డీఎల్ లిస్టింగ్కు గడువు పెంపు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్)కు వెసులుబాటు లభించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా 2025 జులై 31వరకూ గడువు పెంచింది. ఎన్ఎస్డీఎల్ అభ్యర్ధనమేరకు గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయ్యేందుకు మరింత గడువును సెబీ అనుమతించింది. దీంతో మార్కెట్ల పరిస్థితులు అనుకూలించేటంతవరకూ కంపెనీ లిస్టింగ్కు వెసులుబాటు లభించింది.నిజానికి 2024 సెప్టెంబర్లోనే ఎన్ఎస్డీఎల్ ఐపీవోకు సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోలో భాగంగా ఎన్ఎస్డీఎల్ ప్రస్తుత వాటాదారులు ఎన్ఎస్ఈ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 5.72 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నాయి. దేశీయంగా తొలి సెక్యూరిటీల డిపాజిటరీగా కార్యకలాపాలు ప్రారంభించిన ఎన్ఎస్డీఎల్ 2024 సెప్టెంబర్కల్లా 6 ట్రిలియన్ డాలర్ల(సుమారు 500 లక్షల కోట్లు) విలువైన ఆస్తులను నిర్వహిస్తోంది. కాగా.. 2017లోనే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) ఎన్ఎస్ఈలో లిస్ట్కావడం గమనార్హం!టాన్బో ఇమేజింగ్ రూ. 175 కోట్ల సమీకరణ బెంగళూరు: డిఫెన్స్ టెక్నాలజీలను రూపొందించే టాన్బో ఇమేజింగ్ తాజాగా రూ. 175 కోట్లు సమీకరించింది. తమ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో భాగంగా డీ–సిరీస్ కింద ఫ్లోరిన్ట్రీ అడ్వైజర్స్, టెనాసిటీ వెంచర్స్, ఎగ్జిమ్ బ్యాంక్ తదితర సంస్థల నుంచి ఈ మొత్తాన్ని సేకరించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు అరవింద్ లక్ష్మీకుమార్ తెలిపారు.ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు, అత్యంత శక్తిమంతమైన మైక్రోవేవ్ టెక్నాలజీస్ మొదలైనవాటిని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే క్వాల్కామ్, ఆర్టిమాన్ వంటి ఇన్వెస్టర్ల నుంచి రూ. 300 కోట్లు సమకూర్చుకున్నట్లు వివరించారు. భారత రక్షణ శాఖ, నాటో, అమెరికా నేవీ సీల్స్ సహా 30 దేశాల రక్షణ బలగాలకు సేవలు అందిస్తున్నట్లు అరవింద్ చెప్పారు. -
రూ.1400 కోట్ల డీల్.. డెల్హివరీ చేతికి ఈకామ్ ఎక్స్ప్రెస్
ముంబై: లాజిస్టిక్స్ సర్వీసు ప్రొవైడర్ డెల్హివరీ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈకామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు సుమారు రూ.1400 కోట్లు వెచ్చించనుంది. పూర్తి నగదు రూపంలోనే చెల్లింపు చేసేలా ఒప్పందం ఖరారు చేసుకుంది. ‘‘ఈకామ్ ఎక్స్ప్రెస్లో మెజారిటీ వాటా కొనుగోలుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము. 99.4 శాతం వాటాను రూ.1407 కోట్లకు కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది’’ అని డెల్హివరీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.గురుగ్రామ్కు చెందిన ఈకామర్స్ ఎక్స్ప్రైస్ 2012 ఆగస్టులో ప్రారంభమైంది. అప్పటి నుంచి 200 కోట్ల షిప్మెంట్లు డెలివరీ చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,607.3 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.2,548.1 కోట్లుగా ఉంది. విలీన ప్రక్రియకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంది.ఈ డీల్ ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని డెల్హివరీ అంచనా వేస్తోంది. ఈ విలీనంతో కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించే అవకాశం లభిస్తుందని కంపెనీ ఎండీ, సీఈఓ సాహిల్ బారువా తెలిపారు. డెల్హివరీతో భాగస్వామ్యం వల్ల మరింత వృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుందని ఈకామ్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకులు కే సత్యనారాయణ పేర్కొన్నారు. -
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. బ్రిటన్లో తయారయ్యే కార్లను యూఎస్కు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.అమెరికా అధ్యక్షుడు విధించిన 25 శాతం దిగుమతి సుంకం ఖర్చును ఎలా తగ్గించాలో పరిశీలిస్తున్న సమయంలో.. బ్రిటన్లోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకరైన జేఎల్ఆర్ (JLR) సోమవారం నుంచి ఈ చర్య తీసుకుంటున్నారని ది టైమ్స్ తెలిపింది. బ్రిటన్లో ఈ కంపెనీ సుమారు 38000 మందికి ఉపాధి కల్పిస్తోంది.జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ట్రంప్ ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడంలో భాగంగానే తమ కార్ల ఎగుమతులను ఒక నెల రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రెండు నెలలకు సరిపోయే కార్లను కంపెనీ ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్మార్చి 2024 వరకు 12 నెలల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4,30,000 వాహనాలను విక్రయించిందని, వాటిలో దాదాపు నాల్గో వంతు ఉత్తర అమెరికాలో ఉన్నాయని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అయితే ట్రంప్ సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ షేర్లు గణనీయంగా పతనమయ్యాయి. -
మెడ్ప్లస్తో స్టార్టూన్ ల్యాబ్స్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ రిటైల్ దిగ్గజం మెడ్ప్లస్తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు మెడికల్ డివైజ్ల తయారీ అంకుర సంస్థ స్టార్టూన్ ల్యాబ్స్ వెల్లడించింది.మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో ఫీజీ పరికరంతో కండరాలు, కీళ్ల సంబంధ వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. ఫిజియోథెరపీ తీసుకుంటున్న పేషంట్ల రికవరీని పర్యవేక్షించేందుకు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం పొందిన ఈ డివైజ్ తోడ్పడుతుందని తెలిపింది. కండరాలు, నరాల సంబంధ సమస్యలు ఉన్న వారు ఈ పరీక్ష చేయించుకోవచ్చని వివరించింది. -
పేటీఎమ్ మహాకుంభ్ సౌండ్బాక్స్
పేటీఎమ్ బ్రాండ్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ తాజాగా డిస్ప్లేతోకూడిన మహాకుంభ్ సౌండ్బాక్స్ను విడుదల చేసింది. దేశీయంగా తయారైన డిస్ప్లే సౌండ్బాక్స్ను కంపెనీ సీఈవో విజయ్ శేఖర్ శర్మ శుక్రవారం విడుదల చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ లాభాల్లోకి ప్రవేశించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకు కీలక బిజినెస్లు దోహదం చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త విభాగాలలో పెట్టుబడులు చేపడుతున్నట్లు తెలియజేశారు.ప్రీమియం మర్చంట్ల అభిప్రాయాలమేరకు కస్టమర్ల చెల్లింపులను ఇతరులు వినకుండా డిస్ప్లేతోకూడిన సౌండ్బాక్స్ను రూపొందించినట్లు వివరించారు. అధిక విలువగల కొనుగోళ్లకు వీలున్న భారీ మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్లు తదితర పెద్ద షాపులు లక్ష్యంగా వీటిని తయారు చేసినట్లు తెలియజేశారు. -
'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్గేట్స్ ఎదుటే నిరసన (వీడియో)
శుక్రవారం జరిగిన 50వ మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఇజ్రాయిల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందిస్తుండటాన్ని వారు వ్యతిరేకించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ 'ముస్తఫా సులేమాన్' ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో ఈ పరిణామ చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ముస్తఫా సులేమాన్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగి ఇబ్తిహాల్ అబౌసాద్ వేదిక వద్దకు వచ్చి ఆయన వ్యాఖ్యలకు అంతరాయం కలిగించారు. ముస్తఫా.. ఇది నీకు సిగ్గుచేటు. ఏఐను మంచి కోసం ఉపయోగిస్తున్నామని మీరు చెబుతున్నారు. కానీ గాజా ఘర్షణ సమయంలో ఇజ్రాయెల్ మిలటరీకి ఏఐ టెక్నాలజీని అందించి.. 50వేల మంది మరణానికి కారణమైంది. మైక్రోసాఫ్ట్ మారణహోమానికి సహాయం చేసిందని అన్నారు.నేను మీ మాటలు వింటున్నాను, థాంక్యూ అంటూ.. ఆమె మాటలకు ముస్తఫా స్పందించారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్, సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్ఇబ్తిహాల్ అబౌసాద్ నిరసన తెలిపిన తరువాత.. మరో ఉద్యోగి వానియా అగర్వాల్ కూడా నీరసం తెలిపారు. మైక్రోసాఫ్ట్ వార్షికోత్సవ వేడుకలో వీరు నిరసన తెలిపినందుకు వారు తమ వర్క్ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినట్లు సమాచారం. బహుశా వారిని ఉద్యోగంలో నుంచి తొలగించి ఉండొచ్చని తెలుస్తోంది.An employee disrupted Microsoft’s 50th anniversary event to protest its use of AI.“Shame on you,” said Microsoft worker Ibtihal Aboussad, speaking directly to Microsoft AI CEO Mustafa Suleyman. “You are a war profiteer. Stop using AI for genocide. Stop using AI for genocide in… pic.twitter.com/cfub3OJuRv— PALESTINE ONLINE 🇵🇸 (@OnlinePalEng) April 4, 2025 -
ఆ పాన్ కార్డులకు కొత్త డెడ్లైన్..
పాన్ కార్డులకు (PAN Card) సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కొత్త డెడ్లైన్ను ప్రకటించింది. ఆధార్ ఎల్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డులు పొందినవారందరూ వచ్చే డిసెంబర్ 31 లోగా దానిని తమ ఒరిజినల్ ఆధార్ నంబర్తో భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.సీబీడీటీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2024 అక్టోబర్ 1 లేదా అంతకుముందు తమ ఆధార్ దరఖాస్తు నమోదు ఐడీని ఇచ్చి పాన్ కార్డులు వారందరూ తమ ఆధార్ నంబర్ను 2025 డిసెంబర్ 31 లోగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 3న విడుదలైంది. అయితే సదరు పాన్కార్డుదారులు తమ ఆధార్ నంబర్ను ఆదాయపు పన్ను శాఖకు ఎలా తెలియజేయాలన్న దానిపై మాత్రం స్పష్టత లేదు.ఆధార్-పాన్ లింకింగ్ లాగేనా?నిర్దిష్ట పాన్ హోల్డర్లు ఆధార్ సంఖ్యను ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయడానికి పాన్-ఆధార్ లింకింగ్ పద్ధతిని ఉపయోగించవచ్చంటున్నారు ట్యాక్స్మన్.కామ్ అడ్వైజరీ అండ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా. పాన్ హోల్డర్లు ఈ-ఫైలింగ్ పోర్టల్ను సందర్శించి పాన్-ఆధార్ లింకింగ్ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందన్నారు. నిర్దేశిత పాన్ హోల్డర్లు పాన్-ఆధార్ లింక్ చేస్తే ఎలాంటి పెనాల్టీ వర్తించదని భావిస్తున్నారు. అయితే, దీని గురించి ఆదాయపు పన్ను శాఖ నుంచి మరింత స్పష్టత వస్తే ఇలాంటి పాన్ హోల్డర్లకు ఉపయోగపడుతుందన్నారు.మరో ప్రత్యామ్నాయ మార్గంలో పన్ను చెల్లింపుదారులు ఎన్ఎస్డీఎల్ ఈగవ్ లేదా యూటీఐఐటీఎస్ఎల్ నిర్దేశిత పాన్ సేవా కేంద్రాన్ని సందర్శించి పాన్ కార్డు, ఆధార్ కార్డు, నిర్దేశిత రుసుము కాపీతో పాటు నిర్దేశిత ఫారాన్ని నింపవచ్చని ట్యాక్స్ కన్సల్టింగ్ సంస్థ భూటా షా అండ్ కో ఎల్ఎల్పీ పార్టనర్ స్నేహ పాధియార్ చెబుతున్నారు. సర్వీస్ సెంటర్లో బయోమెట్రిక్ ద్వారా కూడా ఆధార్ను ధృవీకరించవచ్చని, పాన్, ఆధార్ డేటాలో పొంతన లేకపోతే బయోమెట్రిక్ అథెంటికేషన్ తప్పనిసరి అని తెలియజేశారు.ప్రస్తుతం, పాన్ను ఆధార్తో లింక్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పాన్-ఆధార్ లింక్ కోసం సాధారణ పాన్ హోల్డర్లకు గడువు 2023 జూన్ 30తో ముగిసింది. అందువల్ల పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయని ఏ పాన్ హోల్డర్ అయినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేవలం ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించి పాన్ కార్డు పొందినవారు ఆ సమయంలో ఒరిజినల్ ఆధార్ నంబర్ లేదు కాబట్టి గడువులోగా రెండింటినీ లింక్ చేయలేరు. కాబట్టి, ఈ పాన్ హోల్డర్లకు ఇప్పుడు ఈ పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం నుండి మినహాయింపు ఇవ్వాలి.డిసెంబర్ 31 తర్వాత ఏమి జరుగుతుంది?పాన్ హోల్డర్లు తమ ఆధార్ నంబర్ను 2025 డిసెంబర్ 31 లోగా లేదా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మరేదైనా తేదీలోగా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే, పాన్ హోల్డర్లు తమ ఆధార్ నంబర్ను ఆదాయపు పన్ను శాఖకు అందించడంలో విఫలమైతే ఏమి జరుగుతుందో మాత్రం పేర్కొనలేదు. గడువు తేదీలోగా ఆదాయపు పన్ను శాఖకు ఆధార్ నంబర్ తెలియజేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్ పనిచేయకపోవచ్చు. అయితే ఈ విషయంలో ఆదాయపు పన్ను శాఖ నుంచి మరింత స్పష్టత వస్తే బాగుంటుందని వాధ్వా పేర్కొన్నారు. -
రూ.కోట్లు కురవాలంటే ఇవి చేయాల్సిందే..
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ‘స్టార్టప్ మహాకుంబ్ 2025’లో చేసిన వ్యాఖ్యలు భారత స్టార్టప్ ఎకోసిస్టమ్లో చర్చకు దారితీశాయి. సంస్థలు డీప్టెక్ ఇన్నోవేషన్పై దృష్టి సారించడం లేదని, ఈ విభాగానికి వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు తగ్గిపోతున్నాయన్నారు. 2023లో డీప్టెక్ వీసీ ఒప్పందాల్లో 11%, పెట్టుబడి విలువలో 13% వాటాను కలిగి ఉన్నాయని, అయితే ఈ గణాంకాలు 2024లో వరుసగా 9%, 6%కు పడిపోయాయని తెలిపారు. 2025 ప్రారంభం నాటికి డీప్టెక్ వెంచర్లు మొత్తం వీసీ పెట్టుబడుల్లో 9% మాత్రమే ఆకర్షించాయని పేర్కొన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వంటి అద్భుతమైన టెక్నాలజీలపై దృష్టి సారించే డీప్టెక్ రంగంలోని స్టార్టప్లు వెంచర్ క్యాపిటలిస్టులను ఆకర్షించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ విభాగంలోని స్టార్టప్లు తమ విలువను ప్రదర్శించడానికి, నష్టాలను తగ్గించడానికి పెట్టుబడిదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యూహాత్మక చర్యలను అవలంబించాలి. వెంచర్ క్యాపిటలిస్టులను ఆకర్షించడానికి ఈ రంగంలోని స్టార్టప్లు ఎలాంటి విధానాలు అనుసరించాలో నిపుణులు సూచిస్తున్నారు.సాంకేతిక, వ్యాపార నైపుణ్యాలను మెరుగుపరచడండీప్టెక్ రంగంలోని వీసీలు లోతైన శాస్త్రీయ లేదా సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తారు. ఈమేరకు స్టార్టప్లు వ్యవస్థాపక బృందాన్ని ఏర్పాటు చేయాలి. సంబంధిత టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన పీహెచ్డీలు, ఇంజినీర్లు లేదా శాస్త్రవేత్తలు (ఉదా.క్వాంటమ్ కంప్యూటింగ్ స్టార్టప్కు క్వాంటమ్ ఫిజికల్ శాస్త్రవేత్త) అవసరం. మార్కెట్ వ్యూహంలో అనుభవం ఉన్న వ్యక్తులు సృజనాత్మకతను జోడిస్తారు. అలాంటివారికి ప్రాధన్యం ఇవ్వాలి. వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించే పరిశ్రమ అనుభవజ్ఞులను కంపెనీలో చేర్చుకోవాలి.సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు చూపేలా..డీప్టెక్ స్టార్టప్లు తరచుగా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తుంటాయి. వీసీలను ఆకర్షించాలంటే సమస్యను స్పష్టంగా నిర్ధారించాలి. సామాజిక అవసరాలతో ముడిపడి ఉన్న సవాళ్లను స్పష్టంగా తెలియజేయాలి. ఇప్పటికే ఉన్న ప్రత్యామ్నాయాలతో సమస్యను అధిగమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలపాలి. సమస్యల పరిష్కారానికి ఇన్నోవేటివ్ సమాధానాలు ఆలోచించాలి.కనీస ఆచరణీయ ఉత్పత్తి (ఎంవీపీ)డీప్టెక్లో సాంకేతిక ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని వీసీలు తరచుగా స్పష్టమైన పురోగతికి పెద్దపీట వేస్తారు. స్టార్టప్లు ప్రతి ఇన్నోవేషన్లో ఎంవీపీ(మినిమమ్ వయబుల్ ప్రొడక్ట్)ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉత్పత్తుల తయారీకి, సాధ్యాసాధ్యాలను ప్రదర్శించడానికి వర్కింగ్ ప్రోటోటైప్లను సిద్దం చేయాలి. గతంలో విజయవంతమైన ప్రయోగాలు, దాఖలు చేసిన పేటెంట్లు లేదా పీర్-రివ్యూ ప్రచురణలను హైలైట్ చేయవచ్చు.ఇదీ చదవండి: అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (ఐపీ)కి రక్షణయాజమాన్య సాంకేతికత ప్రతి కంపెనీకి ప్రధానంగా నిలుస్తుంది. పోటీదారులకు ధీటుగా పేంటెంట్లకు రక్షణ కల్పించాలి. వీసీలకు దీర్ఘకాలిక విలువ, ప్రత్యేకతను తెలియజేడానికి పేటెంట్ల వివరాలు తెలిజేయవచ్చు. ఇప్పటికే ఉన్న ఐపీని యాక్సెస్ చేయడానికి లేదా కొత్త పేటెంట్లను అభివృద్ధి చేయడానికి విశ్వవిద్యాలయాలు లేదా ప్రయోగశాలలతో భాగస్వామ్యం కుదుర్చుకోవచ్చు. -
అంబానీ ఇంటి కరెంటు బిల్లు ఎంతో తెలుసా..?
వేసవికాలంలో ఎండలు మండిపోతుంటాయి. ఇంట్లో కరెంటు బిల్లులు భారీగానే వస్తుంటాయి. ఉక్కపోత తాలలేక ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరుగుతుంది. దాంతో విద్యుత్తు బిల్లులు పెరుగుతాయి. సామాన్యులకైతే ఈ బిల్లులు రూ.వందల్లోనో లేదా మహాఅయితే రూ.వేలల్లోనో ఉంటాయి కదా. ఓ వ్యక్తి ఇంటికి ఏకంగా రూ.70 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. అయితే దానికి ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇల్లుగా గుర్తింపు ఉంది. ఇంతకీ ఆ ఇల్లు ఎవరిదో తెలుసా? ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేశ్ అంబానీది. ముంబయిలోని తన నివాసం ‘అంటిలియా’ ఇటీవల నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.70,69,488గా ఉందని కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ నెల బిల్లుతో ఒక కుటుంబం జీవితాంతం ఓ మోస్తారుగా జీవనంగా సాగించవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సకాలంలో బిల్లు చెల్లిస్తుండడంతో అంబానీకి రూ.48,354 డిస్కౌంట్ కూడా లభించిందని రిపోర్ట్లు చెబుతున్నాయి.ఇదీ చదవండి: గిగ్ వర్క్ర్ల సంక్షేమానికి సెస్అంటిలియా ప్రత్యేకతలు..ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో 27 అంతస్తులతో ఈ అంటిలియాను నిర్మించారు.ఈ భవనం సుమారు 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.50 సీట్ల థియేటర్, బహుళ స్విమ్మింగ్ పూల్స్, ఒక స్పా, ఆలయం, మరియు కృత్రిమ మంచుకొండల నుంచి మంచు కురిసేలా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.ఇందులో 168 కార్లు నిలిపే గ్యారేజీ ఉంది.మూడు హెలిప్యాడ్లు ఉన్నాయి.అమెరికన్ ఆర్కిటెక్చర్ సంస్థ పెర్కిన్స్ & విల్ దీన్ని రూపొందించింది.2006-2010 మధ్య నిర్మించిన ఈ భవనానికి ఆ సమయంలోనే సుమారు 2 బిలియన్ డాలర్లు(సుమారు రూ.15,000 కోట్లు) వ్యయం అయిందని అంచనా.రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా ఈ నివాసాన్ని రూపొందించారు. -
గిగ్ వర్క్ర్ల సంక్షేమానికి సెస్
గిగ్ వర్కర్ల సంక్షేమానికి ఊతమిచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై 5 శాతం సెస్ వసూలు చేసి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఇటీవల ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సమగ్ర గిగ్ వర్కర్స్ బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదం కోసం ప్రవేశపెడతామని తెలిపారు.ఈ బిల్లు అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఉబర్, డన్జో సహా 12 ప్రధాన కంపెనీల్లో పనిచేసే కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. గిగ్ వర్కర్లు సరుకులను డెలివరీ చేయడానికి లేదా సేవలను అందించడానికి ప్రయాణించిన దూరం ఆధారంగా కొంత మొత్తాన్ని ఈ చట్టం కింద ఏర్పాటు చేయబోయే సంక్షేమ నిధికి మళ్లిస్తామని సీఎం చెప్పారు. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, ఐటీ అండ్ బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే, పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్తో ఈమేరకు చర్చించి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.ప్రతిపాదనలు ఇవే..ఈ సమావేశంలో గిగ్ కార్మికుల సంక్షేమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడం; అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా అందుబాటులో లేని ఆరోగ్య బీమా, విద్యా మద్దతు, ఇతర రక్షణలు వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడం; ఈ-కామర్స్, అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ల ద్వారా గిగ్ వర్కర్లకు చేసే చెల్లింపులపై 5 శాతం సెస్ను బోర్డుకు కేటాయించడం వంటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సామాజిక భద్రత కోడ్ 2020 నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సంక్షేమ పథకాలను నిర్ధారించడానికి ఈ విధానాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు గిగ్ వర్కర్లకు రుణాలు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తామని స్పష్టం చేశారు. గతంలో ఈ చట్టం కింద ప్రతి లావాదేవీకి 1-2 శాతం సెస్ను ప్రతిపాదించినప్పటికీ అంతర్గత విభేదాల కారణంగా దీని అమలు రెండుసార్లు నిలిచిపోయింది.ఇదీ చదవండి: క్యాష్యూను క్యాష్ చేసుకునేలా టారిఫ్లుపారిశ్రామిక వర్గాల ఆందోళనఈ ప్రకటన నాస్కామ్, ఐఏఎంఏఐ వంటి పారిశ్రామిక సంస్థల నుంచి విమర్శలకు దారితీసింది. ఇది ఈ-కామర్స్ సంస్థలపై, ముఖ్యంగా ఇప్పటికే తక్కువ మార్జిన్లతో కొట్టుమిట్టాడుతున్న స్టార్టప్లపై భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటకలో గణనీయమైన కార్యకలాపాలు కలిగిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థల నిర్వహణ వ్యయాలు పెరుగుతాయని తెలిపాయి. తిరిగి వినియోగదారులపై ఈ భారం పడుతుందని అంచనా వేస్తున్నాయి. -
క్యాష్యూను క్యాష్ చేసుకునేలా టారిఫ్లు
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సుంకాలు విధించడం ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాలకు ప్రతికూలంగా మారితే, ఇంకొన్ని విభాగాలకు అవకాశంగా పరిణమించింది. భారత్లోని జీడిపప్పు వ్యాపారులకు ఈ సుంకాలు అమెరికాలో తమ మార్కెట్ను విస్తరించుకునేందుకు మార్గాన్ని చూపిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే యూఎస్కు పెద్దమొత్తంలో జీడీపప్పు ఎగుమతి చేస్తున్న వియత్నాంపై 46 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 26 శాతం సుంకానికి లోబడి భారతీయ జీడిపప్పు అక్కడి మార్కెట్లో పోటీపడే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.చాలా ఏళ్లుగా వియత్నాం యూఎస్ జీడిపప్పు మార్కెట్లో ఆధిపత్యం సాగిస్తోంది. అమెరికా దిగుమతుల్లో సుమారు 90 శాతం వాటా వియాత్నాందే కావడం విశేషం. భారత్ వాటా ఈ విభాగంలో చాలా తక్కువగా ఉంది. ఇది సంవత్సరానికి 7,000-8,000 టన్నుల ఎగుమతులకు పరిమితమైంది. కొత్త టారిఫ్ విధానాలు అమెరికాలో భారతీయ జీడిపప్పు మార్కెట్ను విస్తరించుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. వియత్నాం కంటే భారత్పై విధించిన సుంకాలు 20 శాతం తక్కువగా ఉండడం ఇందుకు కారణం. దాంతో యూఎస్ మార్కెట్లో ఇండియా క్యాష్యూ చౌకగా అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇది అక్కడి మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలుప్రాసెసింగ్ సామర్థ్యాలు పెంచుకోవాలి..ఆల్ ఇండియా క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బోలా రాహుల్ కామత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘భారతీయ ఎగుమతిదారులకు ఈ టారిఫ్ విధానాలు స్వల్పకాలిక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే ఇండియాపై తక్కువ టారిఫ్ ఉండడం ఇందుకు కారణం. అమెరికా జీడిపప్పు మార్కెట్లో వాటాను పెంచుకునేందుకు ఇండియాతో పాటు తక్కువ సుంకాలను ఎదుర్కొంటున్న ఆఫ్రికా దేశాలు కూడా పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం తన ప్రాసెసింగ్ సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి సారించాలి’ అని చెప్పారు. -
సుంకాల పెంపులోనూ ఎన్నో అవకాశాలు
అమెరికా విధించిన సుంకాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని విభిన్న సెక్టార్లలో ఆందోళనలు కలిగిస్తున్నాయి. అయితే భారతీయ తోలు(లెదర్) పరిశ్రమ యూఎస్కు తన ఎగుమతులను విస్తరించడానికి ఈ సుంకాలు ఎంతో అవకాశాన్ని కల్పించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య కాలంలో భారత్ 870 మిలియన్ డాలర్ల(సుమారు రూ.7,221 కోట్లు) విలువైన తోలు, తోలు ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇండియన్ లెదర్ వస్తువులకు అమెరికాలో ఉన్న మార్కెట్ను ఈ గణాంకాలు హైలైట్ చేస్తున్నాయి.ఈ విభాగంలో భారత్కు పోటీగా ఉన్న వియత్నాం, చైనా, కంబోడియా వంటి దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడం ఈ అవకాశాన్ని ప్రేరేపించే ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. భారత్పైనా యూఎస్ సుంకాలు ఉన్నప్పటికీ ఇక్కడి ఎగుమతులపై విధించిన సుంకాల కంటే కనీసం 20% అధిక సుంకాలను ఆయా దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఇది భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, యూఎస్ మార్కెట్లో వారి పట్టును బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తుంది.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈఓ) మాజీ వైస్ ప్రెసిడెంట్, ఫరీదా గ్రూపు ఉన్నతాధికారి ఇస్రార్ అహ్మద్ మాట్టాడుతూ.. ‘తోలు పరిశ్రమ వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భారతీయ ఎగుమతిదారులు తమ ఉత్పత్తుల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారించాలి. తమ మార్కెట్ పరిధిని వైవిధ్యపరచుకోవడంపై ఆసక్తిగా ఉండాలి’ అన్నారు.ఇదీ చదవండి: రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?పరిమిత సమయమే..?పోటీ దేశాలు అమెరికా సుంకాలు విధించినంత మాత్రాన నిమ్మకుండిపోకుండా ఆ దేశంతో చర్చలు జరిపి తమ రేట్లను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతో వృద్ధిని కొనసాగించడానికి ఈ టారిఫ్ ప్రయోజనం ఆరు నుంచి తొమ్మిది నెలలకు మించకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. భారతీయ తోలు పరిశ్రమ దాని బలమైన సరఫరా గొలుసును ఆసరాగా చేసుకుని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తితో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని చెబుతున్నారు. -
ఎల్ఐసీకి ఎలాంటి అనుచిత లబ్ధి అందడం లేదు
న్యూఢిల్లీ: భారత బీమా మార్కెట్లో ఎల్ఐసీ అసమంజసమైన పోటీ ప్రయోజనం పొందుతోందంటూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) చేసిన ఆరోపణలను ప్రభుత్వరంగ బీమా సంస్థ తోసిపుచ్చింది. గత 25 ఏళ్లుగా పోటీతో కూడిన మార్కెట్లో 24 ప్రైవేటు బీమా కంపెనీల మాదిరే ఎల్ఐసీ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తుస్తోందని స్పష్టం చేసింది. యూఎస్టీఆర్ అభిప్రాయాలు భారత బీమా నియంత్రణలు, ఎల్ఐసీ పనితీరు గురించి సమగ్రంగా అర్థం చేసుకోకుండా చేసినవిగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఐఆర్డీఏఐ, సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఏ ఇతర నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేదని వివరించింది. భారత్లో ఆర్థిక సేవల విస్తృతికి, పాలసీదారుల ప్రయోజనం విషయంలో ఎల్ఐసీ చేసిన కృషిపై మరింత తటస్థ, వాస్తవిక ప్రశంసను తాము కోరుకుంటున్నట్టు పేర్కొంది. హామీని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు.. ‘‘ప్రైవేటు బీమా సంస్థల కంటే చాలా మంది కస్టమర్లు ఎల్ఐసీ పాలసీలనే ఎంపిక చేసుకుంటున్నారు. తద్వారా ఎల్ఐసీకి అనుచిత పోటీ ప్రయోజనం లభిస్తోంది’’అని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయిన యూఎస్టీఆర్ తన తాజా నివేదికలో విమర్శించడం గమనార్హం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పాలన, సేవలు, కస్టమర్ల విశ్వాసాన్ని కొనసాగించేందుకు ఎల్ఐసీ కట్టుబడి ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి ప్రకటించారు. 1956లో ఎల్ఐసీని ఏర్పాటు చేసినప్పు డు ప్రభుత్వం కలి్పంచిన హామీ అన్నది.. జాతీయీకరణ ఆరంభ కాలంలో ప్రజా విశ్వాసాన్ని పొందడం కోసమే. అంతేకానీ దీన్ని ఎప్పుడూ మార్కెటింగ్ సాధనంగా ఎల్ఐసీ ఉపయోగించుకుని ప్రయోజనం పొందలేదని ఎల్ఐసీ తెలిపింది. -
గోఫస్ట్ లిక్విడేషన్కు మార్గం సుగమం
న్యూఢిల్లీ: కార్యకలాపాలు నిలిచిపోయిన ఎయిర్లైన్స్ సంస్థ ‘గోఫస్ట్’ లిక్విడేషన్ (ఆస్తుల విక్రయానికి)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. గోఫస్ట్ లిక్విడేషన్కు అనుకూలంగా జనవరి 20న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్ ఇచి్చన ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్ సమరి్థంచింది. నాటి ఆదేశాల్లో ఎలాంటి తప్పును తాము గుర్తించలేదని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ఎన్సీఎల్ఏటీ బెంచ్ వ్యాఖ్యానించింది. గోఫస్ట్ లిక్విడేషన్ అనుకూల ఉత్తర్వులను బిజీ బీ ఎయిర్వేస్, భారతీయ కామ్గార్ సేన (ముంబై), కెపె్టన్ అర్జున్ ధానన్ ఎన్సీఎల్ఏటీ వద్ద సవాలు చేశారు. డీజీసీఏ లైసెన్స్ సహా విలువైన ఆస్తులున్న గోఫస్ట్ను ఉన్నది ఉన్నట్టు స్థితిలో కొనుగోలు చేసేందుకు సమ్మతిస్తూ బిజీ బీ ఎయిర్వేస్ దరఖాస్తు సమరి్పంచింది. ఈజీమై ట్రిప్ ప్రమోటర్ నిశాంత్ పిట్టీ బిజీ బీ ఎయిర్వేస్లో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. కంపెనీ ఆస్తులను విక్రయించేస్తే 5,000 మంది కారి్మకులు నష్టపోతారంటూ భారతీయ కామ్గార్ సేన తన పిటిషన్లో పేర్కొంది. -
సేవల్లో మందగమనం
న్యూఢిల్లీ: సేవల రంగం కార్యకలాపాలు మార్చి నెలలో నిదానించాయి. డిమాండ్ నిదానించడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమని హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సర్వే తెలిపింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఫిబ్రవరిలో 59 పాయింట్ల వద్ద ఉంటే, మార్చి నెలలో 58.5కు తగ్గింది. అయినప్పటికీ దీర్ఘకాల సగటు అయిన 54.2కు పైనే కొనసాగడం గమనార్హం. పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగా, దిగువన క్షీణతగా పరిగణిస్తుంటారు. ‘‘మార్చి నెలలో భారత సేవల పీఎంఐ స్వల్పంగా తగ్గి 58.5 వద్ద నమోదైంది దేశీ, అంతర్జాతీయ డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నా, ముందటి నెల కంటే కాస్త తగ్గింది’’అని హెచ్ఎస్బీసీ ఇండియా చీఫ్ ప్రంజుల్ భండారీ తెలిపారు. అంతర్జాతీయ విక్రయాలు బలహీనపడడం పీఎంఐ తగ్గడానికి కారణమని ఈ సర్వే పేర్కొంది. విదేశీ ఆర్డర్లు 15 నెలల కనిష్టానికి చేరాయని తెలిపింది. రానున్న కాలంలో కంపెనీల వృద్ధికి పోటీ ప్రధాన సవాలు కానుందని ఈ సర్వే అంచనా వేసింది. సానుకూల సెంటిమెంట్ ఏడు నెలల కనిష్టానికి చేరింది. కన్జ్యూమర్ సర్వీసెస్ సంస్థలు బలమైన పనితీరు చూపించాయి. ఆ తర్వాత ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ సర్వీసెస్, రవాణా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ రంగాల్లోనూ పనితీరు మెరుగుపడింది. ఇక హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ (తయారీ, సేవలు కలిపి) ఏడు నెలల గరిష్టమైన 59.5కు మార్చిలో చేరుకుంది. ఫిబ్రవరిలో ఇది 58.8గా ఉంది. -
భారత్ సార్వభౌమత్వం నిలుపుకోవాలి
న్యూఢిల్లీ: భారత్ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవాలని నితి ఆయోగ్ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాల సాంకేతికతల కాలనీగా మారొద్దంటూ స్టార్టప్ మహాకుంభ్ ప్రసంగంలో సూచించారు. తెలివైన.. చౌక ఆవిష్కరణల ఆవశ్యకత ఉన్నట్లు నొక్కి చెప్పారు. పశ్చిమ దేశాల మోడళ్లను అవలంబించడంవల్ల దేశీ సంప్రదాయాలు, సంస్కృతి, గుర్తింపులను కోల్పోతామని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతలలో దేశ సార్వభౌమత్వాన్ని కొనసాగించవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. ముందుండి నడిపించడంలో పశ్చిమ దేశాల లేదా ప్రపంచంలోని ఏ ఇతర ప్రాంతాల కాలనీగా మారకూడదని వ్యాఖ్యానించారు. అతితక్కువ ఇంధన వినియోగం, తక్కువ వ్యయాలతోకూడిన చురుకైన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు తెలియజేశారు. పశ్చిమ ప్రభావానికి లోనుకాకుండా సొంత డేటా ఆధారంగా దేశ సార్వభౌమత్వానికి అనుగుణమైన మోడళ్లను ఆవిష్కరించవలసి ఉన్నట్లు వివరించారు. 22 ప్రాంతీయ భాషలుగల దేశ భిన్నత్వానికి అనుగుణంగా వివిధ భాషల ఏఐ మోడళ్లకు తెరతీయవలసి ఉన్నట్లు తెలియజేశారు. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం సేవలు అందించగలుగుతామని సూచించారు. స్వీయనియంత్రణ స్టార్టప్లు భారీ కార్పొరేట్లుగా ఎదగాలంటే స్వీయనియంత్రణకుతోడు.. సుపరిపాలనకు చోటు ఇవ్వాలని అమితాబ్ కాంత్ తెలియజేశారు. ఒకప్పుడు స్టార్టప్గా ప్రారంభమై భారీ మల్టీనేషనల్ ఐటీ దిగ్గజంగా అవతరించిన ఇన్ఫోసిస్ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. నైతిక పాలన, ఆడిట్లు, పటిష్ట ఫైనాన్షియల్ మేనేజ్మెంట్సహా స్వీయనియంత్రణ స్టార్టప్లకు కీలకమని వివరించారు. కాంత్ శుక్రవారం ఫిన్టెక్ పరిశ్రమకు స్వీయనియంత్రణ సంస్థ(ఎస్ఆర్వో) అయిన ఇండియా ఫిన్టెక్ ఫౌండేషన్(ఐఎఫ్ఎఫ్)ను ప్రారంభించారు. ఎస్ఆర్వో– ఫిన్టెక్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఎస్ఆర్వోఎఫ్టీ–డీఎఫ్)గా పేర్కొనే సంస్థ ఆవిర్భావం సందర్భంగా ప్రతిపాదిత ఎస్ఆర్వో బోర్డులో ఇప్పటికే 100మంది సభ్యులున్నట్లు వెల్లడించారు. డిజిటల్ లెండింగ్ పేమెంట్స్, వెల్త్టెక్, ఇన్సూర్టెక్, అకౌంట్ అగ్రిగేషన్సహా డెఫీ, వెబ్3 తదితర వర్ధమాన టెక్నాలజీల నుంచి సభ్యులు చేరినట్లు పేర్కొన్నారు. పరిశ్రమకు ప్రమాణాలు నెలకొల్పడంలో ఎస్ఆర్వో కీలకపాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. నియంత్రణ సంస్థలు, ఫిన్టెక్ కంపెనీల మద్య వారధిగా వ్యవహరించనున్నట్లు వివరించారు.విమర్శించడం సులభం దేశీ స్టార్టప్ కమ్యూనిటీ గ్రోసరీ డెలివరీలు, ఐస్క్రీమ్, చిప్స్ తయారీ నుంచి దృష్టి మరల్చాలని వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పలువురు ఎంట్రప్రెన్యూర్స్ స్పందించారు. సెమీకండక్టర్, మెషీన్ లెరి్నంగ్, రోబోటిక్స్, ఏఐ తదితర హైటెక్ రంగాలపై దృష్టి పెట్టాలని స్టార్టప్ మహాకుంభ్ సందర్భంగా గోయల్ సూచించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా లోతైన సాంకేతిక నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న యూఎస్, చైనాతో పోల్చి దేశీ కన్జూమర్ ఇంటర్నెట్ స్టార్టప్లను విమర్శించడం సులభమేనని పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జెప్టో సీఈవో ఆదిత్ పలీచా లింక్డ్ఇన్ పోస్ట్లో వ్యాఖ్యానించారు. నిండా మూడున్నరేళ్ల వయసుకూడా లేని జెప్టో ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. క్విక్కామర్స్ సంస్థలు ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకుంటున్నాయని తెలియజేశారు. ఇంటర్నెట్ కన్జూమర్ కంపెనీలు టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు. మంత్రి వ్యాఖ్యలు వేలెత్తి చూపడం అనికాకుండా.. ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు సవాళ్లు విసురుతున్నట్లు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. మంత్రులు విశ్వాసాన్ని ఉంచాలని, డీప్టెక్ స్టార్టప్లకు సహాయసహకారాలు అందించాలని, సమస్యలను తొలగించాలని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో మోహన్దాస్ పాయ్ సూచించారు. చైనాతో పోలిక సరికాదని, పరిశ్రమ దేశీయంగా సైతం చిన్నస్థాయిలో స్టార్టప్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది నెలల్లో పలు డీప్టెక్ కంపెలతో సమావేశమైనట్లు షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ తెలిపారు. -
తుప్పు దరిచేరని ఉక్కు
హైదరాబాద్: ప్రముఖ ఉక్కు ఉత్పాదక సంస్థ ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ ఆధునాతన సాంకేతికత సాయంతో తుప్పు నిరోధక, బలీయమైన ఉక్కు ఉత్పాదనకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్లో జరిగిన ప్రత్యేక లాంచ్ ఈవెంట్లో ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ నూతన ఉత్పత్తి ఎంఎస్ లైఫ్ 600+ సీఆర్ఎస్ (తుప్పు నిరోధక స్టీల్)ను ఆవిష్కరించింది.అలాగే రాబోయే 3–4 సంవత్సరాలలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచడానికి రూ1,200 కోట్ల పెట్టుబడితో విస్తరణ ప్రణాళికను కంపెనీ ప్రకటించింది. ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ దేశవ్యాప్తంగా 1000కిపైగా డీలర్లతో తమ వ్యాపార పరిధిని విస్తరించేలా ప్రణాళికలు రూపొందించింది. రూ.1200కోట్లకు పైగా పెట్టుబడులతో 1.2 మిలియన్ టీపీఎ ఉత్పత్తి చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 18–20 నెలల్లో దేశవ్యాప్తంగా 1,000+ యాక్టివ్ డీలర్లకు విస్తరించనున్నారు. విస్తరణ ద్వారా 5,000+ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. -
‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’.. రూ. 25,000 వరకు డిస్కౌంట్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ ‘డిజిటల్ డిస్కౌంట్ డేస్’ సేల్ను ప్రకటించింది. ఇందులో భాగంగా బ్యాంకు కార్డులపై, పేపర్ ఫైనాన్స్ పై రూ. 25000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఏప్రిల్ 4 నుండి 20 వరకు అన్ని రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, ఆన్లైన్లో సంస్థ వెబ్సైట్లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.అన్ని ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఆఫర్లు చెల్లుతాయని, సులభ ఫైనాన్సింగ్, ఈఎమ్ఐ ఎంపికలు, వేగవంతమైన డెలివరీ, ఇన్స్టాలేషన్ వంటి సదుపాయాలు ఉంటాయని కంపెనీ తెలిపింది. వేసవి నేపథ్యంలో ఏసీలు, విస్తృత శ్రేణి ఏయిర్ కూలర్స్ పైనా మంచి డీల్స్ ఉన్నాయి.ల్యాప్టాప్స్, సరికొత్త స్మార్ట్ ఫోన్స్, టీవీలపై భారీగా తగ్గింపులు అందిస్తోంది. ఇక యాపిల్ ఏయిర్ పాడ్స్, యాపిల్ వాచ్ వంటి ప్రీమియం గ్యాడ్జెలను తక్కువ ఈఎమ్ఐలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే గృహోపకరణాలు, కిచెన్ పరికరాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. -
ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్
చదువుకుని డిగ్రీలు తెచ్చుకోవడం ఒక ఎత్తైతే.. ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో నచ్చిన ఉద్యోగాలు దొరక్క కొందరు సతమవుతుంటే.. అసలు ఉద్యోగాలే లభించనివారు చాలామందే ఉన్నారు. మూడేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది.బెంగళూరుకు చెందిన 'ప్రశాంత్ హరిదాస్' అనే వ్యక్తి.. మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విసుగెత్తిపోయి.. తనకు తానే లింక్డ్ఇన్లో 'రెస్ట్ ఇన్ పీస్' అని ఒక పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. మేమున్నాం అంటూ రిప్లై ఇస్తున్నారు.పరిశ్రమ నాయకులారా, నన్ను దెయ్యంలా చూసి రిజెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు. నేను ఎంత మంచి వాడిని అయినా.. ఎన్ని రెకమెండేషన్స్ పెట్టినా.. ఈ పోస్ట్ పెట్టిన తరువాత నాకు జాబ్ ఇవ్వరని తెలుసు. నేను ఆత్మహత్య చేసుకోను. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రుచి చూడాల్సిన వంటకాలు, సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అయితే సుమారు మూడు సంవత్సరాలు నిరుద్యోగిగా.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం అని ప్రశాంత్ పోస్ట్ చేసాడు.ఈ పోస్టుపై పలువురు స్పందించారు. నేను మీ మాటలు విన్నాను, మీ ప్రయాణం ఎంత కఠినంగా ఉందో ఊహించగలను. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఒంటరిగానే ఉంటాయి. కానీ మీ ప్రయత్నాలు వృధా కాదు. పట్టు వదలకుండా శ్రమించండి, అని ఒకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, మీ పట్ల సానుభూతి ఉంది. కరోనా మహమ్మారి మనందరినీ ఒంటరిని చేసింది. ప్రస్తుతం జాబ్ మార్కెట్ మునుపటిలా లేదు. తల పైకెత్తి చూడండి. నా నెట్వర్క్.. అనుభవం మీకు సహాయం చేయగలితే సంతోషిస్తాను అని ఇంకొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో.. వారు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. -
ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?
ఎక్కువ జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో 'సుందర్ పిచాయ్' ఒకరు. ఈయన నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఒక సలహా అని, ఆ సలహా ఇచ్చిన వ్యక్తి తన భార్య 'అంజలి పిచాయ్' అని బహుశా చాలామందికి తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో అంజలి పిచాయ్ గురించి వివరంగా తెలుసుకుందాం.రాజస్థాన్లో జన్మించిన అంజలి, ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ సమయంలో సుందర్ పిచాయ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తరువాత పిచాయ్ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళిపోయాడు, అంజలి మాత్రం ఇండియాలోనే ఉద్యోగంలో చేరింది.ఆ తరువాత సుందర్ పిచాయ్, అంజలి పెళ్లి చేసుకున్నారు. మొదట అంజలి తన కెరీర్ను యాక్సెంచర్లో బిజినెస్ అనలిస్ట్గా ప్రారంభించింది. ఈ ఉద్యోగంలో మూడేళ్లు ఉన్న తరువాత.. ప్రముఖ ఆర్థిక సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇంట్యూట్కు మారింది, ప్రస్తుతం ఆమె అక్కడ కీలక నిర్వహణ పాత్రను పోషిస్తోంది. అంజలి పిచాయ్.. ఇంట్యూట్లో కెమికల్ ఇంజనీర్ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు.చాలామందికి సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓగా మాత్రమే తెలుసు, కానీ ఒకానొక సందర్భంలో ఆయన గూగుల్ కంపెనీ వదిలేయాలనుకున్నారు. గూగుల్ సంస్థలో ఉన్నత ఉద్యోగిగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ పోస్ట్ ఆఫర్ చేసింది, ట్విటర్ కంపెనీ కూడా మంచి జాబ్ ఆఫర్ ఇచ్చింది.మైక్రోసాఫ్ట్, ట్విటర్ కంపెనీలలో జాబ్ ఆఫర్ రావడంతో.. సుందర్ పిచాయ్ గూగుల్ జాబ్ వదిలేయాలకున్నాడు. ఆ విషయాన్ని తన భార్య అంజలికి చెప్పినప్పుడు.. ఆమె వద్దని వారిస్తూ.. గూగుల్ సంస్థలోనే మంచి ఫ్యూచర్ ఉందని సలహా ఇచ్చింది. ఆ సలహా తీసుకున్న పిచాయ్.. ఆ తరువాత కంపెనీ సీఈఓగా ఎంపికయ్యాడు.సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన టెక్ లీడర్లలో ఒకరిగా ఎదగడానికి అంజలి మద్దతుగా నిలిచారు. సుందర్ తదుపరి చదువుల కోసం అమెరికాకు వెళ్లినప్పుడు చాలా కాలం విడిపోయిన తర్వాత కూడా.. అంజలికి అతనిపై ఉన్న దృఢమైన నమ్మకం అతని విజయంలో కీలక పాత్ర పోషించింది.ఇదీ చదవండి: రతన్ టాటా వీలునామా.. ఎవరికి ఎంత కేటాయించారంటే?సుందర్ పిచాయ్, అంజలి.. ఇప్పుడు కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ హిల్స్లో వారి ఇద్దరు పిల్లలు కావ్య, కిరణ్లతో నివసిస్తున్నారు. 2023లో ఆమె వృత్తిపరమైన విజయాలు.. సహకారాలకు గాను ఐఐటీ ఖరగ్పూర్ ఆమెను విశిష్ట పూర్వ విద్యార్థి అవార్డుతో సత్కరించింది. ప్రస్తుతం అంజలి మొత్తం సంపద రూ.830 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. -
రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?
భారతీయ రైల్వే వివిధ తరగతుల్లోని ప్రయాణీకులకు లగేజీ నిబంధనలను సవరించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రయాణీకులను నియంత్రించడం, భద్రతను మెరుగుపరచడం, రైలులో స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా చూడటం దీని లక్ష్యమని అధికారులు తెలిపారు. మారిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లాలి..ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలో కింద తెలుసుకుందాం.ఎంత లగేజీని తీసుకెళ్లాలి?కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు అదనపు ఛార్జీలు లేకుండా 70 కిలోల లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారు 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత అలవెన్స్లో భాగంగా 40 కిలోలను అనుమతిస్తారు.సెకండ్ క్లాస్ నాన్ ఏసీకి ఉచిత లగేజీ పరిమితిని 35 కిలోలుగా నిర్ణయించారు.ప్రయాణికులు రైల్వే అనుమతించిన బరువు కంటే అధికంగా లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. లగేజీ బరువుగా లేదా భారీగా ఉంటే దానిని కంపార్ట్మెంట్లోకి అనుమతించరు. బదులుగా ప్రత్యేక లగేజీ వ్యాన్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిమాణానికి సంబంధించి కూడా రైల్వే స్పష్టమైన వివరాలు వెల్లడించింది.లగేజీ కొలతలు ఇలా..లగేజీకి గరిష్టంగా అనుమతించిన కొలత (పొడవు + వెడల్పు +ఎత్తు) 160 సెం.మీ (62 అంగుళాలు) మించకూడదు. కెమెరాలు, గొడుగులు లేదా బ్రీఫ్కేస్ వంటి వ్యక్తిగత వస్తువులకు 185 సెం.మీ (72 అంగుళాలు) వరకు పరిమితి విధించారు. అలా ఉంటేనే లగేజీని సీట్ల కింద లేదా ఓవర్ హెడ్ ర్యాక్ల్లో సరిగ్గా స్టోర్ చేయవచ్చని రైల్వే తెలిపింది. రైలు దిగిన తర్వాత కూడా నిర్దిష్ట పరిమాణంలో లగేజీ ఉంటే నడక మార్గాల్లో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యాపిల్కు టారిఫ్ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశంనిషేధిత వస్తువులురైలు బోగీల్లో తీసుకెళ్లలేని నిషేధిత వస్తువులపై కూడా ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, తుపాకులు, లీకైన ద్రవాలు, ప్రమాదకరమైన లేదా అభ్యంతరకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా లేదా రైలు నుంచి వెంటనే తొలగించవచ్చు. లగేజీ ప్యాకింగ్ చేయడానికి ముందు ప్రయాణికులందరూ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలని లేదా స్టేషన్ అధికారులను సంప్రదించాలని భారతీయ రైల్వే సూచించింది. -
విజయవాడలో టీ కెటిల్ నుంచి సంగీతం.. హెచ్యూఎల్ ఈవెంట్
హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) ప్రత్యేకంగా రూపొందించిన బ్రూక్ బాండ్ తాజ్ మహల్ ‘చాయ్-బన్సురి’ని ఆవిష్కరించింది. విజయవాడలోని భవానీ ద్వీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈమేరకు చాయ్-బన్సురిని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ను మైండ్షేర్, ఒగిల్వీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నట్లు హెచ్యూఎల్ పేర్కొంది.ఇదీ చదవండి: యాపిల్కు టారిఫ్ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశంఇందుకోసం ప్రత్యేకంగా టీ కెటిల్ను సిద్ధం చేశారు. వేడిగా ఉన్న టీ ఆవిరి ఆ కెటిల్ నుంచి బయటకు వచ్చేప్పుడు బన్సురి (వేణువు)గా శబ్దం చేస్తుంది. భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని టీ తయారీతో ముడిపెట్టి హంసధ్వని రాగం క్రియేట్ అయ్యేలా ఈవెంట్లో ఏర్పాట్లు చేశారు. హెచ్యూఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫుడ్స్ అండ్ రిఫ్రెఫ్మెంట్) శివ కృష్ణమూర్తి మాట్లాడుతూ..‘తాజ్ మహల్ టీ ఉత్తమ భారతీయ టీ. గొప్ప భారతీయ శాస్త్రీయ సంగీతానికి పర్యాయపదం. 2023 సెప్టెంబర్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన తాజ్ మేఘ్ సంతూర్కు సీక్వెల్గా ఈ చాయ్-బన్సురి ఈవెంట్ను తీసుకొచ్చాం. దీన్ని కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. -
యాపిల్కు టారిఫ్ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశం
విదేశాలతోపాటు చైనా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల కారణంగా యాపిల్ ఐఫోన్ ధరలు 40 శాతం వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్ల ధరలు భారతదేశంలో రూ.2 లక్షలకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.చైనాలో మౌలికసదుపాయాలు, ఉద్యోగులు అధికంగా ఉండడంతో అమెరికా కంపెనీలు తయారీ యూనిట్లను ప్రారంభించాయి. అందులో భాగంగా యాపిల్ సంస్థ కూడా చైనాలో తయారీని మొదలు పెట్టింది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేతపట్టిన తర్వాత చైనా వంటి దేశాల్లో తయారీని ప్రారంభించిన యూఎస్ కంపెనీలు స్వదేశంలో ప్లాంట్లు పెట్టేలా తాజా సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఈ సుంకాలు యాపిల్ను ఇరకాటంలో పడేశాయి. కంపెనీ ఇప్పటికీ ఐఫోన్లను చైనాలో అసెంబుల్ చేస్తోంది. అమెరికా సుంకాలతో సంస్థ 54 శాతం క్యుములేటివ్ టారిఫ్ రేటును ఎదుర్కోనుంది. యాపిల్ ఈ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటే ప్రస్తుతం 799 (సుమారు రూ.68,000) ధర ఉన్న ఎంట్రీ-లెవల్ ఐఫోన్ 16, 1,142 డాలర్లకు (సుమారు రూ.97,000) పెరుగుతుంది. ఇది 43 శాతం పెరిగే అవకాశం ఉంది. అధునాతన ఏఐ సామర్థ్యాలు, 1 టీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వంటి ప్రీమియం మోడళ్లు 2,300 డాలర్లు (సుమారు రూ.1.95 లక్షలు) చేరుకోవచ్చు.యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త ఫీచర్లకు ఆదరణ అంతంతమాత్రంగా ఉండటంతో ఇప్పటికే ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. అధిక ధరలు డిమాండ్ను మరింత తగ్గిస్తాయి. ఇది చైనా వెలుపల ఎక్కువ ఫోన్లను తయారు చేసే, టారిఫ్ల వల్ల తక్కువ ప్రభావితమయ్యే శామ్సంగ్ వంటి ప్రత్యామ్నాయ కంపెనీ ఉత్పత్తుల వైపు వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రూ.44 కోట్ల విలువైన గోల్డ్ కార్డు ప్రదర్శించిన ట్రంప్అమెరికా ప్రభుత్వం నుంచి యాపిల్ గతంలో టారిఫ్ల నుంచి మినహాయింపులను పొందగలిగినప్పటికీ, ఈసారి అటువంటి సౌలభ్యం లేదని ఇప్పటికే అధికార వర్గాలు స్పష్టతనిచ్చాయి. వియత్నాం, ఇండియాలోనూ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అయితే వియత్నాంపై 46 శాతం సుంకాన్ని, భారతదేశంపై 26 శాతం సుంకాన్ని విధించారు. ఇవి చైనా సుంకాల కంటే తక్కువగానే ఉన్నాయి. అయితే కంపెనీ ఇండియా వంటి దేశాల్లో ఉత్పత్తిని పెంచుతుందా లేదా అనే విషయంపై ప్రకటన రావాల్సి ఉంది. -
వజ్రాల వ్యాపారం గతి తప్పుతుందా..?
ప్రపంచ లగ్జరీ మార్కెట్కు ప్రతీకగా ఉన్న జెమ్స్ అండ్ జువెలరీ పరిశ్రమ ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు కళాత్మకత, ఆర్థిక సహకారం, ఉపాధి కల్పనకు ప్రసిద్ధి చెందిన ఈ రంగం ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు, మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య సమస్యలతో పోరాడుతోంది. దాంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఈ రంగంలో ఉద్యోగ కల్పన కరువవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విభాగంలో ఉపాధి పొందుతున్న కళాకారులు, రిటైలర్లు సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సవాళ్లు ఇవే..రత్నాలు, ఆభరణాల పరిశ్రమ చాలాకాలంగా లగ్జరీకి సింబల్గా ఉంది. భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థలకు బిలియన్ డాలర్ల కొద్దీ సహకారం అందిస్తుంది. ఈ విభాగంలో భారతదేశం ప్రపంచ మార్కెట్లో గణనీయమైన వాటాను కలిగి ఉంది. సూరత్లోని వజ్రాల పాలిషింగ్ కేంద్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితులు తలకిందులవుతున్నాయి.ఈ రంగంలో వినియోగిస్తున్న ముడిసరుకుల ధరలు పెరగడం ప్రధాన సవాలుగా మారింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సరఫరా గొలుసు అడ్డంకుల కారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరిగాయి. అదేవిధంగా సహజమైన, ప్రయోగశాలలో అభివృద్ధి(ల్యాబ్ గ్రోన్ డైమండ్స్) చేసిన రత్నాల ఖర్చు విపరీతంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. మైనింగ్ అంతరాయాలు, ఇతర ప్రత్యామ్నాయాలకు పెరిగిన డిమాండ్ కారణంగా ఈ పరిస్థితులు దాపరించాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చిన్న నగల వ్యాపారులు, తయారీదారులకు పెరుగుతున్న ఖర్చులు తక్కువ మార్జిన్లను అందిస్తున్నాయి. దాంతో పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది.మారుతున్న వినియోగదారుల ధోరణిఈ విభాగంలో వినియోగదారుల ధోరణి మారుతుంది. యువకులు ముఖ్యంగా మిలీనియల్స్(1995 తర్వాత పుట్టినవారు), జెన్ జెడ్(2000 తర్వాత జన్మించినవారు) జువెలరీ కంటే వాటిని చౌకగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసి దాని నుంచి పొందే అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తరచుగా సాంప్రదాయ ఆభరణాలను ఎంచుకుంటున్నారు. దాంతో సహజ డైమండ్లను పోలి ఉండి, చౌకగా లభించే ప్రయోగశాలలో తయారు చేసిన వజ్రాల పెరుగుదల మార్కెట్ను మరింత దెబ్బతీసింది. వ్యాపారాల ఆర్థిక సమస్యను మరింత జఠిలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా డిస్పోజబుల్ ఆదాయాల(ఖర్చులపోను మిగిలిన డబ్బు) ఖర్చును ప్రభావితం చేసింది. ఇది ఆభరణాలు వంటి లగ్జరీ కొనుగోళ్లను వాయిదా వేసేందుకు కారణమైంది.భౌగోళిక అనిశ్చితులు, సరఫరా గొలుసు సమస్యలురత్నాలు, ఆభరణాల పరిశ్రమ ప్రపంచ వాణిజ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఈ వ్యాపారాన్ని మరింత బలహీన పరిచాయి. రఫ్ డైమండ్స్ ప్రధాన సరఫరాదారు అయిన రష్యాపై ఆంక్షలు సప్లై-చెయిన్ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ప్రభుత్వ యాజమాన్యంలోని వజ్రాల దిగ్గజం అల్రోసాపై ఆధారపడిన సంస్థలకు ఈ సమస్య ఎక్కువైంది. ఇంతలో ఆఫ్రికా వంటి రత్నాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో సంఘర్షణలు, అస్థిరత వల్ల విలువైన రాళ్ల సరఫరాకు పరిమిత అవకాశం ఉంది. ఇది ఖర్చులను పెంచి కొరతను సృష్టిస్తుంది.ఉద్యోగ నష్టాలువ్యాపారులకు పెద్దగా మార్జిన్లు లేకపోవడంతో చేసేదేమిలేక ఉద్యోగులను తొలగిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ జెమ్స్ అండ్ జువెలరీ రంగం మైనర్లు, కట్టర్లు, డిజైనర్లు, సేల్స్ పర్సన్ల వంటి లక్షలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. ఒక్క భారతదేశంలోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదు మిలియన్లకు(50 లక్షలు) పైగా ఉద్యోగులు ఈ రంగంలో పని చేస్తున్నారు. వీరిలో చాలా మంది కొలువులు ప్రమాదంలో పడనున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.కొత్త పంథాఈ రంగంలో కొద్దిమంది వ్యాపారులు రీసైకిల్ చేసిన లోహాలను మార్కెటింగ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. మరికొందరు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఖర్చులను తగ్గించడానికి, కస్టమర్ అనుభవాలను పెంపొందించడానికి 3డీ ప్రింటింగ్, వర్చువల్ ట్రై-ఆన్ సాధనాలను(ఇమేజ్ సాయంతో కస్టమర్లకు నప్పే ఆభరణాలు ఎంచుకోవడం) ఉపయోగిస్తున్నారు. ఫిజికల్ స్టోర్ల జోలికి పోకుండా తమ బ్రాండ్లు ప్రపంచ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు వీలు కల్పిస్తూ ఈ-కామర్స్ను వాడుతున్నారు.ఇదీ చదవండి: భారత్కు స్టీల్ దిగుమతుల ముప్పుభారత్లో ఈ రంగానికి ఊతమిచ్చేందుకు పన్ను రాయితీలు, సబ్సిడీలు, ఎగుమతి ప్రోత్సాహకాలు ఇవ్వాలని పారిశ్రామిక సంఘాలు కోరుతున్నాయి. సరఫరా గొలుసులను స్థిరీకరించడానికి, వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి అంతర్జాతీయ సహకారం మరింత ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నాయి. -
కంపెనీల రేటింగ్ భేష్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతోంది. వాటి పరపతి రేటింగ్ బలపడుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ కంపెనీల రేటింగ్లు అప్గ్రేడ్ కావడం దీన్ని తెలియజేస్తోంది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా 2024–25 సంవత్సరంలో 301 కంపెనీల రేటింగ్లను అప్గ్రేడ్ (అప్పటి వరకు ఉన్న రేటింగ్ కంటే మెరుగైనది) చేయగా, 150 కంపెనీల రేటింగ్ను డౌన్గ్రేడ్ చేసినట్టు తెలిపింది. కంపెనీల రుణ పరపతి మెరుగుపడడం వరుసగా నాలుగో ఏడాది కావడం గమనార్హం. ‘‘బ్యాలన్స్ షీట్ల బలోపేతం వల్ల భారత కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ మెరుగుపడడం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. గత దశాబ్ద కాలంలో మేము విశ్లేషించిన 6,000 లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీల నిర్వహణ లాభం ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్గా పెరిగింది. వాటి మొత్తం రుణం కేవలం 4 శాతమే పెరిగింది’’అని ఇక్రా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కె.రవిచంద్రన్ తెలిపారు. ఇక ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) సైతం 2024–25లో కార్పొరేట్ రుణ పరపతి మెరుగుపడినట్టు తెలిపింది. రేటింగ్ల డౌన్గ్రేడ్–అప్గ్రేడ్ నిష్పత్తి వరుసగా నాలుగో సంవత్సరంలోనూ చారిత్రక కనిష్ట స్థాయిలో ఉన్నట్టు ప్రకటించింది. 2023–24లో ఉన్న 0.37 నుంచి 0.28కి మెరుగుపడినట్టు వెల్లడించింది. ఇండియా రేటింగ్స్ గత ఆర్థిక సంవత్సరంలో 330 కంపెనీల ఇష్యూలకు రేటింగ్లను అప్గ్రేడ్ చేయగా, 94 డెట్ ఇష్యూల రేటింగ్లను డౌన్గ్రేడ్ చేసింది. బలమైన బ్యాలన్స్ షీట్ల కారణంగా కార్పొరేట్ కంపెనీలు రుణ పరపతి ప్రయోజనం పొందుతున్నట్టు ఇండియా రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అరవింద్ రావు తెలిపారు. సానుకూల దృక్పథం మరో ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ సైతం గత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో 423 కంపెనీలకు రేటింగ్ అప్గ్రేడ్ ఇవ్వగా, 160 కంపెనీలకు డౌన్గ్రేడ్ ఇచ్చినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో క్రిసిల్ రేటింగ్స్ క్రెడిట్ రేషియో 2.75గా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 2.64 రెట్లకు తగ్గింది. భారత కంపెనీలకు సంబంధించి రుణ నాణ్యత పరంగా సానుకూల దృక్పథంతో ఉన్నట్టు తెలిపింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో డౌన్గ్రేడ్లను మించి అప్గ్రేడ్లు ఉంటాయన్న అంచనా వ్యక్తం చేసింది. ‘‘బడ్జెట్లో పన్ను తగ్గింపులు, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు పట్టణ వినియోగాన్ని పెంచనున్నాయి. దీన్నుంచి కార్పొరేట్ ఇండియా ప్రయోజనం పొందుతుంది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై చేస్తున్న మూలధన వ్యయాలు అనుబంధ రంగాలపై ఎన్నో అంచల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ సుబోధ్ రాయ్ వివరించారు. తాను రేటింగ్ ఇస్తున్న కంపెనీల మధ్యస్థ ఆదాయ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8 శాతానికి పెరగొచ్చని క్రిసిల్ తెలిపింది. దేశీ డిమాండ్ బలోపేతంతో క్యాపిటల్ గూడ్స్, నిర్మాణ రంగం, రిటైల్ ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానమైన రసాయనాలు, డైమండ్ పాలిషర్స్, ఆగ్రోకెమికల్స్ పనితీరును పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. -
ఐపీఓ అరంగేట్రం.. రిక్రూట్మెంట్ కంపెనీ సన్నాహాలు
రిక్రూట్మెంట్ అండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ ఎక్స్ఫెనో మరింత వృద్ధిపై దృష్టి సారించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.300 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఉత్సాహంతో 2026 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.500 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రాబోయే ఐపీఓ అరంగేట్రం కోసం కంపెనీ సన్నాహాలు చేస్తోంది.ఐపీవో సన్నాహాల్లో భాగంగా సీనియర్ లీడర్ షిప్లో కీలక మార్పులు చేసింది. గతంలో సహ వ్యవస్థాపకులు కమల్ కారంత్, అనిల్ ఎథనూర్ నిర్వహించిన బాధ్యతలను క్రమబద్ధీకరిస్తూ ఫ్రాన్సిస్ పడమడన్ను కాబోయే సీఈఓగా ప్రకటించింది. ఈ నాయకత్వ మార్పుతో కంపెనీ స్పెషలిస్ట్ సిబ్బంది, వ్యూహాత్మక గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ భాగస్వామ్యాల అభివృద్ధి, కొత్త ప్రాంతాలకు విస్తరించడంపై దృష్టి పెడుతోంది."ఎదుగుదలలో మేమిప్పడు కీలక దశలో ఉన్నాం. ఫ్రాన్సిస్ నాయకత్వంలో మా నాయకత్వ బృందం నడవడం స్పెషలిస్ట్ స్టాఫింగ్ స్పేస్లో ఆధిపత్య కంపెనీగా మారడానికి ఒక కీలకమైన దశ" అని ఎక్స్ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కారంత్ అన్నారు.భారతదేశ 6 బిలియన్ డాలర్ల స్పెషలిస్ట్ స్టాఫింగ్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏటా 40 కి పైగా కొత్త జీసీసీలు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ఐటీ టాలెంట్ పూల్స్ నుండి సుమారు 20,000 కొత్త నియామకాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా సాఫ్టవేర్ ఇంజనీర్లు భారత్ నుండి వలసపోతున్నారని, ఇది ప్రత్యేకమైన సిబ్బంది అవకాశాలను సృష్టిస్తుందని కంపెనీ తెలిపింది.2017లో స్థాపించిన ఎక్స్ఫెనో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ. ఇది జీసీసీలు, పెద్ద సంస్థల కోసం 23,000 మందికి పైగా టెక్ నిపుణులను నియమించింది. ఢిల్లీ, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ సహా ముఖ్యమైన భారతీయ నగరాలతో పాటు అంతర్జాతీయంగా యూఎస్లోనూ ఉనికిని కలిగి ఉంది. -
ఇక రిలయన్స్ గేమ్స్.. బ్లాస్ట్ ఈస్పోర్ట్స్తో జేవీ
న్యూఢిల్లీ: దేశీయంగా ఈస్పోర్ట్స్ బిజినెస్ నిర్వహించేందుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. సొంత అనుబంధ సంస్థ రైజ్ వరల్డ్వైడ్ ద్వారా బ్లాస్ట్ ఈస్పోర్ట్స్తో ఇందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. తద్వారా జేవీకి తెరతీయనుంది.రిలయన్స్, బ్లాస్ట్ జత కట్టడం(జేవీ) ద్వారా దేశీయంగా అత్యున్నత ఐపీలను అభివృద్ధి చేయనున్నట్లు సంయుక్త ప్రకటనలో రెండు సంస్థలు పేర్కొన్నాయి. అంతేకాకుండా అభిమానులు, క్రీడాకారులు, బ్రాండ్ల కోసం బ్లాస్ట్కున్న గ్లోబల్ ఐపీలను సైతం దేశీయంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశాయి.బ్లాస్ట్ ఏపీఎస్(డెన్మార్క్) ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద టోర్నమెంట్ నిర్వాహక సంస్థలలో ఒకటికాగా.. గేమ్ పబ్లిషింగ్ గ్లోబల్ దిగ్గజాలు ఎపిక్ గేమ్స్, వాల్వ్, రియట్ గేమ్స్, క్రాఫ్టన్, యూబిసాఫ్ట్ తదితరాలతో కలసి పనిచేస్తోంది. తద్వారా గ్లోబల్ ఈస్పోర్ట్స్ ప్రాపరీ్టలను ఆవిష్కరిస్తోంది. -
ఫార్ములా ఈ రేస్ ఫ్యాన్స్కు ఇన్ఫోసిస్ గుడ్న్యూస్
ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్షిప్కి సంబంధించిన టీమ్లు, డ్రైవర్లు, ఇతరత్రా వివరాలన్నీ అభిమానులకు సమగ్రంగా అందించేలా ’ఫార్ములా ఈ–స్టాట్స్ సెంటర్’ను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆవిష్కరించింది. తొలి ఎలక్ట్రిక్ ఎఫ్ఐఏ ప్రపంచ కాంపిటీషన్ అయిన ‘ఏబీబీ ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ చాంపియన్షిప్’తో భాగస్వామ్యం ద్వారా కంపెనీ దీన్ని రూపొందించింది.సంక్లిష్టమైన డేటాను సరళతరంగా అందించేందుకు, అభిమానులు–చాంపియన్షిప్ మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ–స్టాట్స్ సెంటర్ ఉపయోగపడుతుందని ఇన్ఫీ తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత ’ఇన్ఫోసిస్ టొపాజ్’ సొల్యూషన్తో దీన్ని తీర్చిదిద్దినట్లు వివరించింది. దీనితో ఫ్యాన్స్.. వివిధ సీజన్లవ్యాప్తంగా తమ అభిమాన డ్రైవర్లు, టీమ్ల పనితీరును ట్రాక్ చేయొచ్చని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డాడ్స్ తెలిపారు. ఆసక్తికరమైన క్యూరేటెడ్ ప్రశ్నలతో ట్రెండింగ్ బబుల్ చాట్ ఫార్మాట్ను ఉపయోగించి ప్రస్తుత, గత సీజన్లలో డ్రైవర్లు, జట్ల గణాంకాలను ప్రదర్శించడం ద్వారా ఇది యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫీచర్ సంక్లిష్టమైన డేటాను సులభంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఫార్ములా ఈ సెంట్రల్ డేటా పూల్ను ఇన్ఫోసిస్ గూగుల్ క్లౌడ్ కు తరలించి తద్వారా ఫార్ములా ఈ మార్కెటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, క్రీడా కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే సురక్షితమైన ఏర్పాటు చేసింది. -
ఎగుమతులకు టారిఫ్ల గండం
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్ల ప్రతిపాదనలతో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు ప్రతికూలంగా ఉంటుందని ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. దీని వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు.10 శాతం వరకు సుంకాలు ఫర్వాలేదని, అంతకు మించితే మాత్రం ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్పై టారిఫ్ల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. దిగుమతి సుంకాలపై అనిశ్చితి వల్ల ఇప్పటికే కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లివ్వకుండా తాత్కాలికంగా ఆపి ఉంచారని రాల్హన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిస్థితిని సరిదిద్దాలని, టారిఫ్ల సమస్యను ఎదుర్కొనడంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. -
ఆకాశవీధిలో..
ముంబై: పౌర విమానయానం వృద్ధి వేగాన్ని అందుకుంది. విమాన ప్రయాణికుల సంఖ్య 2024 మార్చి నుంచి ఏటా 9 శాతం చొప్పున పెరుగుతూ.. 2027 మార్చి నాటికి వార్షికంగా 48.5 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ ఎడ్జ్’ ఒక నివేదిక రూపంలో వెల్లడించింది. 2025–26 నుంచి మరింత పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తుండడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ మరింత వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. అదే సమయంలో దేశీ విమాన ప్రయాణికుల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తుందని తెలిపింది. కరోనా అనంతరం విమానయాన రంగం ‘వి’ ఆకారపు రికవరీని (పడిపోయినట్టుగానే పెరగడం) చూసిందని.. కరోనా ముందు నాటి ప్రయాణికులతో పోల్చితే 1.10 రెట్లకు రద్దీ చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. విమాన ప్రయాణికుల రద్దీ 2025 మార్చి నాటికి 42.5 కోట్లకు చేరుకుంటుందని లోగడ వేసిన అంచనాలను కేర్ఎడ్జ్ సవరించింది. విమానాల డెలివరీలో జాప్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 4 శాతం వృద్ధితో 41 కోట్లకు చేరుతుందని పేర్కొంది. మహాకుంభ మేళా సమయంలో (2024–25 జనవరి–మార్చి) విమానయాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో తక్కువ వృద్ధిని భర్తీ చేస్తుందని తెలిపింది. ఏరో, నాన్ ఏరో ఆదాయాల్లో వృద్ధి.. 11 విమానాశ్రయాల ఏరో ఆదాయం (విమాన సర్వీసులు, వాటి అనుబంధ సేవలు) 2024 మార్చి నుంచి 2027 మార్చి మధ్య ఏటా 42 శాతం వృద్ధి చెందుతుందని కేర్ఎడ్జ్ నివేదిక అంచనా వేసింది. ఇదే కాలంలో నాన్ఏరో ఆదాయం ఏటా 12–14 శాతం చొప్పున పెరుగుతుందని పేర్కొంది. డ్యూటీ ఫ్రీ షాపులు, ఫుడ్, బెవరేజెస్ విక్రయాలు, లాంజ్ సేవల రూపంలో ఈ ఆదాయం ఉంటుందని వివరించింది. భారత ఎయిర్పోర్టుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి వచ్చే నాన్ ఏరో ఆదాయం కంటే.. అంతర్జాతీయంగా విమానాశ్రయాలకు రెట్టింపు ఆదాయం వస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే భారత విమానాశ్రయాలకు నాన్ ఏరో ఆదాయం వృద్ధికి చక్కని అవకాశాలున్నట్టు పేర్కొంది. కొన్ని ఎయిర్పోర్ట్ల్లో చార్జీల పెంపు, ప్రయాణికుల సంఖ్య పెరుగుదల రూపంలో ఈ ఆదాయం 2024–25 నుంచి వృద్ధి వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది. విస్తరణపై భారీ పెట్టుబడులు ‘‘ప్రయాణికుల రద్దీ ఏటా 9 శాతం వృద్ధికి.. విమాన ప్రయాణానికి బలమైన డిమాండ్కుతోడు విమానాశ్రయాలు, ఎయిర్లైన్స్ సంస్థలు సామర్థ్యాల విస్తరణ మద్దతుగా నిలవనుంది’’అని కేర్ఎడ్జ్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ వివరించారు. దేశీ ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా కలసి 2020 మార్చి తర్వాత నుంచి 2024 డిసెంబర్ మధ్య రూ.80,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడాన్ని కేర్ఎడ్జ్ తన నివేదికలో ప్రస్తావించింది. ఇందులో 42 శాతం పెట్టుబడులను నాలుగు ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల కోసం (కొత్తవి) వెచ్చించినట్టు తెలిపింది. 2025–26 నుంచి 2029–30 మధ్యకాలంలో ఈ రంగంలో మరో రూ.30,000 కోట్ల పెట్టుబడులను కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ప్రధానంగా బ్రౌన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల (ప్రస్తుత ఎయిర్పోర్టులు) విస్తరణపై ఈ పెట్టుబడులను వెచ్చించొచ్చని అంచనా వేసింది. రూ.25,000 కోట్లతో నిర్మించే రెండు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు 2025–26లో కార్యకలాపాలు ప్రారంభించొచ్చని తెలిపింది. పెట్టుబడుల్లో 18 శాతాన్ని నాన్ఏరోనాటికల్ అభివృద్ధిపై (ఎయిర్పోర్ట్ పరిసరాల్లో వాణిజ్య రియల్ ఎస్టేట్) వెచ్చించొచ్చని అంచనా వేసింది. ఈ విషయంలో సింగపూర్ ఛాంగి విమానాశ్రయాన్ని ఉదహరణగా పేర్కొంది. నాన్ ఏరోనాటికల్ సదుపాయాలపై చేస్తున్న పెట్టుబడుల నుంచి వచ్చే ప్రతిఫలం వాటి రుణ పరపతిని నిర్ణయిస్తుందని తెలిపింది. -
బిర్లాన్యూ రూ. 1,300 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: సీకే బిర్లా గ్రూప్లో భాగమైన నిర్మాణ రంగ మెటీరియల్స్ సొల్యూషన్స్ విభాగం బిర్లాన్యూ వచ్చే 3–4 ఏళ్లలో అమ్మకాలను రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా రూ. 1,200 కోట్లు – రూ. 1,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ అవంతి బిర్లా తెలిపారు. అలాగే, అధిక వృద్ధి సాధన దిశగా ఇతర సంస్థలను కొనుగోలు చేసే అవకాశాలనూ పరిశీలిస్తున్నట్లు వివరించారు.పైపులు, నిర్మాణ రంగంలో ఉపయోగించే రసాయనాల వ్యాపార విభాగాలు కీలక వృద్ధి చోదకాలుగా ఉంటాయని, అంతర్జాతీయ ఇంటీరియర్స్ బ్రాండ్ పారాడోర్ వ్యాపారం కూడా వచ్చే మూడు, నాలుగేళ్లలో రెట్టింపు కాగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ గతేడాదే పైపులు, ఫిట్టింగ్స్ తయారీ సంస్థ క్రెస్టియా పాలిటెక్తో పాటు దాని నాలుగు అనుబంధ సంస్థలను రూ. 265 కోట్లకు కొనుగోలు చేసింది.ఏజీఐ గ్రీన్ప్యాక్ రూ. 700 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటైనర్ గ్లాస్ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్ప్యాక్ కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. మధ్యప్రదేశ్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ సందీప్ సోమాని తెలిపారు. ఈ ప్లాంటు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 500 టన్నులుగా ఉంటుందని, దీనితో తమ తయారీ సామర్థ్యం సుమారు 25 శాతం పెరుగుతుందని వివరించారు. ఫార్మా, బెవరేజెస్ తదితర రంగాల కోసం ఉత్పత్తులు తయారు చేసే ఈ ప్లాంటు, 24 నెలల్లో అందుబాటులోకి రాగలదని చెప్పారు. -
ఆదిత్య బిర్లా ఫైనాన్స్ విలీనం పూర్తి.. కంపెనీ ఇకపై..
పూర్తి అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ను విలీనం చేసుకునే ప్రక్రియ పూర్తయినట్లు ఆదిత్య బిర్లా క్యాపిటల్ (ఏబీసీఎల్) వెల్లడించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశాల మేరకు ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది.ఆదిత్య బిర్లా ఫైనాన్స్ను మాతృ సంస్థలో విలీనం చేయాలని గతేడాది మార్చిలో నిర్ణయం తీసుకున్నారు. విలీన సంస్థకు ఎండీ, సీఈవోగా విశాఖ మూల్యే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాకేశ్ సింగ్ వ్యవహరిస్తారు. దీంతోపాటు నగేష్ పింగే, సునీల్ శ్రీవాస్తవ్ లను కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.2024 డిసెంబర్ 31 నాటికి రూ .5.03 లక్షల కోట్లకుపైగా ఆస్తులు ఏబీసీఎల్ నిర్వహణలో ఉన్నాయి. వీటిలో రూ .1.46 లక్షల కోట్లకు పైగా ఏకీకృత రుణాలు ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 9 నెలల కాలంలో కంపెనీ జీవిత, ఆరోగ్య బీమా వ్యాపారాలలో రూ .16,942 కోట్ల స్థూల ప్రీమియంను ఆర్జించింది. అదే సమయంలో రూ.28,376 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని, రూ.2,468 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. 2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ అన్ని వ్యాపారాలలో 1,482 శాఖలు, 2 లక్షలకు పైగా ఏజెంట్లు / ఛానల్ భాగస్వాములతో పాటు అనేక బ్యాంక్ భాగస్వాములతో దేశవ్యాప్త ఉనికిని కలిగి ఉంది. -
ఏడాదిలో రూ.1.33 లక్షల కోట్ల సమీకరణ
దేశీ కార్పొరేట్లు అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం భారీగా నిధులు సమీకరించాయి. ప్రధానంగా దేశీ స్టాక్ మార్కెట్ల దూకుడు ప్రభావంతో 2024–25లో 85 కంపెనీలు రూ.1,33,251 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. అంతక్రితం ఏడాది(2023–24)లో 64 కంపెనీలు క్విప్ ద్వారా అందుకున్న రూ.71,306 కోట్లతో పోలిస్తే ఇవి 87 శాతం వృద్ధికావడం గమనార్హం! ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం ఈక్విటీ మార్కెట్ దన్నుతో కంపెనీలు బ్యాలెన్స్ షీట్ను పటిష్టపరచుకోవడంతోపాటు.. విస్తరణకు అవసరమైన నిధులను సమకూర్చుకున్నాయి. వెరసి గతేడాది అటు విలువలోనూ, ఇటు సంఖ్యలోనూ దేశీ కార్పొరేట్లు క్విప్ నిధులలో సరికొత్త రికార్డుకు తెరతీసినట్లు జేఎమ్ ఫైనాన్షియల్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ నేహా అగర్వాల్ పేర్కొన్నారు. క్విక్గా..లిస్టెడ్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు వేగవంతంగా పెట్టుబడులను సమకూర్చుకునేందుకు క్విప్ మార్గాన్ని ఎంచుకుంటాయి. ప్రధానంగా సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపుల ద్వారా నిధులు సమీకరించే సంగతి తెలిసిందే. ఇందుకు సెబీ తదితర మార్కెట్ నియంత్రణ సంస్థలకు ముందస్తుగా దరఖాస్తు చేయవలసిన అవసరంలేకపోవడంతో లిస్టెడ్ కంపెనీలు ఆసక్తి చూపుతుంటాయని విశ్లేషకులు వివరించారు. గతేడాది ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్స్, ఆటోమొబైల్స్, యుటిలిటీస్, రియల్ ఎస్టేట్ రంగాల కంపెనీలు అధికంగా క్విప్ చేపట్టాయి. నిధుల సమీకరణకు ఈక్విటీ ప్రధాన వనరుగా మారడంతో లిస్టెడ్ కంపెనీలు క్విప్నకు ఆసక్తి చూపినట్లు నిపుణులు తెలియజేశారు. తద్వారా వృద్ధి, విస్తరణ, ఇతర కంపెనీల కొనుగోళ్లు తదితరాలకు నిధులను వెచ్చించనున్నట్లు తెలియజేశారు. జేఎమ్ జోరుక్విప్ నిధుల సమీకరణలో డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత గ్రూప్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో అగ్ర స్థానంలో నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెండు కంపెనీలు విడిగా రూ.8,500 కోట్లు చొప్పున సమీకరించాయి. ఈ బాటలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ రూ. 8,373 కోట్లు, వరుణ్ బెవరేజెస్ రూ. 7,500 కోట్లు, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ రూ. 6,438 కోట్లు, గోద్రేజ్ ప్రాపరీ్టస్ రూ. 6,000 కోట్లు, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ రూ. 5,000 కోట్లు చొప్పున అందుకున్నాయి. ఇదీ చదవండి: తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?పీఎస్యూలుగతేడాది క్విప్ ద్వారా పీఎస్యూ బ్యాంకులు పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో, ఐఓబీ, సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ సైతం ఉమ్మడిగా రూ.14,000 కోట్లకు పైగా సమీరించాయి. అంతేకాకుండా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, బ్రూక్ఫీల్డ్ ఇండియా రీట్, టొరెంట్ పవర్, భారత్ ఫోర్జ్ సైతం క్విప్ మార్గాన్ని ఎంచుకున్నాయి. అత్యధిక క్విప్ల నిర్వహణ ద్వారా జేఎమ్ ఫైనాన్షియల్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రైమ్ డేటాబేస్ వివరాల ప్రకారం ఫిబ్రవరివరకూ చూస్తే జేఎమ్ 15 ఇష్యూలను నిర్వహించింది. తద్వారా 4.5 బిలియన్ డాలర్లు(రూ. 38,693 కోట్లు) సమీకరణలో సహకారం అందించింది. ప్రస్తుత ఆ ర్థిక సంత్సరం(2025–26)లో క్విప్లు, ఐపీవోల ద్వారా రూ. 3 లక్షల కోట్లకుపైగా నిధుల సమీకరణకు వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అసోసియేషన్(ఏఐబీఐ) అంచనాల వేయడం విశేషం! -
తండ్రి అయినంత మాత్రాన ఉద్యోగం ఇవ్వాలా?
వ్యాపారాల్లో కోట్ల రూపాయలు సంపాదించిన తండ్రులు తమ కుమారుల చదువు అయిపోయిన వెంటనే ఆస్తులు పంచి, వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇచ్చి, దర్జాగా తమ పక్క సీట్లో కుర్చోబెట్టుకుంటున్న రోజులివి. ప్రముఖ రియల్ఎస్టేజ్ వ్యాపారి, బిలియనీర్ జార్జ్ పెరెజ్ మాత్రం అందుకు భిన్నంగా తన కుమారులకు సొంత కంపెనీలో ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. తన కంపెనీలో ఉన్నత స్థానం కావాలంటే సొంతంగా ఎదగాలని సూచించి కఠిన నిబంధనలు పెట్టారు.జార్జ్ పెరెజ్ కుమారుడు జాన్ పాల్ పెరెజ్ కాలేజీ చదువు పూర్తి చేసుకొని తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ రిలేటెడ్ గ్రూప్లో ఉద్యోగం చేయాలనుకున్నాడు. కానీ అందుకు తన తండ్రి నిరాకరించారు. తండ్రి-కొడుకుల బంధం ఉన్నంత మాత్రాన తన 60 బిలియన్ డాలర్ల(సుమారు రూ.5 లక్షల కోట్లు) ఆస్తిని, కంపెనీ ప్రతిష్టను కుమారుడి సామర్థ్యం తెలియకుండా పణంగా పెట్టదలుచుకోలేదని జార్జ్ తెలిపారు. అందుకు బదులుగా కుమారుడి సామర్థ్యాలను నిరూపించడానికి జాన్ పాల్ను జార్జ్ సన్నిహిత స్నేహితుడి వద్దకు పని చేయడానికి పంపారు. దాంతో జాన్ పాల్ పెరెజ్ మియామి విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత కెరియర్లో ఎదిగేందుకు న్యూయార్క్ వెళ్లాడు.కనీసం ఐదేళ్లు అనుభవంతనతో కలిసి పని చేయాలంటే జార్జ్ తన పిల్లలందరికీ కఠినమైన నిబంధనలు విధించారు. న్యూయార్క్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కనీసం ఐదు సంవత్సరాలు అనుభవం సంపాదించాలని చెప్పారు. ఒక టాప్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందాలని తెలిపారు. పిల్లలు సులువుగా తన కెరీర్ మార్గాన్ని అనుసరించకుండా ఈ విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు.నచ్చని పనిచేస్తే విజయం సాధించలేరు..‘నేను రియల్ ఎస్టేట్లో విజయం సాధించినంత మాత్రాన తమకు అభిరుచి లేనిదాన్ని ఎంచుకోవద్దని పిల్లలకు చెప్పాను. ఎందుకంటే జీవితం చాలా కఠినంగా ఉంటుంది. ప్రతిరోజూ డబ్బు సంపాదన కోసం నచ్చని పని చేస్తే విజయం సాధించలేరు. నాకు సమాజంలో ఉన్న ప్రతిష్టతోనే పిల్లలను మార్కెట్లోకి తీసుకొచ్చారని మిగతా కంపెనీ సభ్యులు భావించడం నాకు ఇష్టం లేదు’ అని జార్జ్ పెరెజ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆల్టైమ్ గరిష్ఠానికి పసిడి.. బంగారం ధరలు ఇలాచివరకు సీఈఓగా..తన తండ్రి స్నేహితుడు, జార్జ్ కంపెనీలో మైనారిటీ వాటాదారుగా ఉన్న స్టీఫెన్ రాస్ యాజమాన్యంలోని సంస్థలో జాన్ పాల్ విశ్లేషకుడిగా కెరియర్ ప్రారంభించాడు. తరువాత ఉన్నత విద్యను అభ్యసించి నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ సంపాదించాడు. 2012 నాటికి తండ్రికి చెందిన రిలేటెడ్ గ్రూప్లో చేరడానికి తగినంత అనుభవం సంపాదించినట్లు భావించాడు. కానీ, అతని తండ్రి తనకు ఉన్నత పదవి మాత్రం ఇవ్వలేదు. దాంతో జాన్ పాల్ కంపెనీలో జూనియర్ స్థాయి ఉద్యోగిగా చేరారు. తండ్రి మార్గంలోనే పనిచేశాడు. జాన్ పాల్ ప్రస్తుతం తన సోదరుడు నిక్తో కలిసి రిలేటెడ్ గ్రూప్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. తండ్రి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్నారు. దశాబ్దానికి పైగా కంపెనీలో విభిన్న బాధ్యతాయుతమైన పదవుల్లో పనిచేసిన వీరిద్దరూ ఉన్నత పదవులు అందుకున్నట్లు జార్జ్ పెరెజ్ సౌత్ ఫ్లోరిడా బిజినెస్ జర్నల్కు తెలిపారు. -
దేశంలోని బిలియనీర్లలో ఒకరిగా నిర్మల్ మిండా
కృషి, పట్టుదల ఉంటే మనిషి దేన్నైనా సాధించగలడు. తాను ఏ స్థితిలో ఉన్నా భవిష్యత్తులో ఉన్నత స్థానానికి చేరగలడు. అందుకు ప్రముఖ వ్యాపారవేత్త నిర్మల్ మిండా(66) జీవితమే ఉదాహరణ. తన తండ్రికి చెందిన చిన్న మెకానిక్ షాపులో వాహనాలకు ఎలక్ట్రిక్ పరికరాలను తయారు చేసే నిర్మల్ మిండా క్రమంగా వ్యాపారంలో ఎదిగి ఏకంగా రూ.66,904 కోట్ల విలువైన యునో మిండా కంపెనీకి సారథిగా నిలిచారు. తాను ఇంత స్థాయికి ఎలా ఎదిగారో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇంజినీరింగ్లోనే కారు ఉత్పత్తి అంశాలపై దృష్టినిర్మల్ మిండా హరియాణాలో జన్మించారు. తనకు చిన్నతనం నుంచి ఇంజినీరింగ్ పట్ల అభిరుచి ఉండేది. తన తండ్రి షాదీలాల్ మిండాకు ఢిల్లీలోని కమలానగర్లో మోటారు సైకిళ్లకు అవసరమైన ఎలక్ట్రికల్ విడిభాగాలను తయారు చేసే ఓ చిన్న షాపు ఉంది. ఇక్కడే ఆయన విజయానికి పునాది పడింది. నిత్యం తండ్రి చేస్తున్న పనిని గమనిస్తూ ఈ రంగంలో కీలక మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆటోమోటివ్ ప్రొడక్షన్లో కెరీర్ ప్రారంభించాలని భావించి మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇంజినీరింగ్లో ఉన్నప్పుడే తాను కారు ఉత్పత్తికి అవసరమైన అన్ని అంశాలను నేర్చుకున్నారు. 1977లో తన 20వ ఏట తన తండ్రి కంపెనీలో చేరారు. అప్పటికే తన ఆలోచనలతో చిన్న షాపుగా ఉన్న వారి కుటుంబ వ్యాపారం కాస్తా చిన్నపాటి కంపెనీగా రూపాంతరం చెందేందుకు కృషి చేశారు. ఆయన మొదట్లో సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పనిచేసి కొత్త ఆలోచనలు, ఆశయాలను పంచుకున్నారు.వ్యూహాత్మక దూరదృష్టి1990ల్లో నిర్మల్ తన సోదరుడితో విడిపోయి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. గతంలో మిండా ఇండస్ట్రీస్ అని పిలువబడే యునో మిండాకు పునాది వేశారు. అతని వ్యూహాత్మక దూరదృష్టితో కేవలం మోటారుసైకిల్ భాగాల్లో మాత్రమే కాకుండా ఇతర విడిభాగాలను తయారు చేయడం ప్రారంభించారు. సెన్సార్లు, లైట్లు, అల్లాయ్ వీల్స్తో సహా విస్తృత శ్రేణి ఆటోమోటివ్ భాగాలను మార్కెట్లో ప్రవేశపెట్టారు. ఇవి ద్విచక్ర వాహనాలు, కార్లు రెండింటి అవసరాలను తీర్చాయి. దాంతో కొద్ది కాలంలోనే కంపెనీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగింది. ప్రస్తుతం యునో మిండా హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో వంటి ప్రధాన ఒరిజినల్ పరికరాలతోపాటు అంతర్జాతీయ బ్రాండ్లకు సరఫరాదారుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 73 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది.అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా..ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) రంగంలోకి ప్రవేశించడం యునో మిండా వృద్ధికి కీలకంగా మారింది. 2020 నుంచి కంపెనీ సెన్సార్లు, లైటింగ్ వంటి విభాగాల్లో అధునాతన విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం చైనాకు చెందిన సుజౌ ఇనోవాన్స్ ఆటోమోటివ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు తోడ్పడుతుందని కంపెనీ నమ్ముతుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.50,268 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఆటో కాంపోనెంట్స్ రంగంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా నిలిచింది.బిలియనీర్గా..నిర్మల్ మిండా వ్యక్తిగత సంపద అతని వ్యాపార విజయాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకు అతని సంపద నికర విలువ 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది సుమారు రూ.30,000 కోట్లకు సమానం. దాంతో గురుగ్రామ్లోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. దాంతోపాటు భారతదేశంలోని బిలియనీర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. గురుగ్రామ్లోని రెండో అత్యంత ధనవంతుడైన దీపిందర్ గోయల్ సంపద కంటే మిండా సంపద మూడు రెట్లు ఎక్కువ. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం మిండా సంపద 2018లో ఒక బిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 3.5 బిలియన్ డాలర్లకు చేరింది.ఇదీ చదవండి: జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..దాతృత్వ కార్యక్రమాలతో సేవనిర్మల్ మిండా కేవలం బిజినెస్ టైకూన్ మాత్రమే కాదు. ఆయన పరోపకారిగా కూడా గుర్తింపు పొందారు. సామాజిక అభ్యున్నతికి సుమన్ నిర్మల్ మిండా ఫౌండేషన్ (ఎస్ఎన్ఎమ్ఎఫ్) స్థాపించి దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సుమన్ మిండాను వివాహం చేసుకున్న అతను నిత్యం వందల సంఖ్యలో పిల్లలకు ఆహారం, ఆశ్రయంతోపాటు విద్యను అందించేలా మిండా బాల్ గ్రామ్ అనే అనాథాశ్రమాన్ని స్థాపించారు. నిరుపేద పిల్లల కోసం ప్రాథమిక పాఠశాల మిండా విద్యా నికేతన్ను ఏర్పాటు చేశారు. అతని కృషికి ‘హరియాణా రత్న’ అవార్డు, ఇండియా యమహా మోటార్స్ నుంచి ‘గోల్డ్ అవార్డు ఫర్ క్వాలిటీ’ వంటి ప్రశంసలు లభించాయి. నిర్మల్, సుమన్ దంపతులకు పరిధి, పల్లక్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
జొమాటోలో ఉద్యోగాల కోత.. కారణం..
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గత ఏడాది ప్రారంభించిన అసోసియేట్ ప్రోగ్రామ్ నుంచి దాదాపు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించింది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (జాప్)లో భాగంగా గత ఏడాది 1,500 మందిని కస్టమర్ సర్వీస్ రోల్స్ కోసం నియమించుకుంది. ఈ ఉద్యోగులను ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్, సప్లై చైన్తో సహా వివిధ విభాగాల్లో సేవలకు ఉపయోగించుకుంది. ప్రస్తుతం జాప్లో ఉన్న వారిలో 1,000 మందిని కొనసాగించాలని, మిగతావారి(సుమారు 33 శాతం మంది) పనితీరు సరిగా లేదనే కారణంతో లేఆఫ్స్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.లేఆఫ్స్కు కారణంపనితీరు సరిగా లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగం కోల్పోయిన వారికి నష్టపరిహారంగా రెండు నెలల వేతనం ఇచ్చినట్లు చెప్పాయి. అయితే కొందరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగం నుంచి తొలగించారని సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.పెరుగుతున్న పోటీఈ పరిణామంపై జొమాటో స్పందించలేదు. ఇటీవల తన మాతృసంస్థ పేరును ఎటర్నల్గా మార్చిన జొమాటోకు పెరుగుతున్న పోటీ, క్విక్ కామర్స్లో వస్తున్న మార్పుల వల్ల లాభాలు క్షీణిస్తున్నాయి. 2024 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 57 శాతం క్షీణించి రూ.59 కోట్లకు పరిమితమైంది. క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ జొమాటోకు అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న ఫుడ్ డెలివరీ విభాగం వృద్ధి మందగిస్తుంది. ఫుడ్ డెలివరీలో వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి కంపెనీ చర్యలు తీసుకుంటుందని కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.ఇదీ చదవండి: మార్చిలో వాహన విక్రయాలు ఎలా ఉన్నాయంటే..ఈ త్రైమాసికంలో జొమాటో ఉద్యోగుల బెనిఫిట్ వ్యయాలు(హెల్త్కేర్, రిటైర్మెంట్ ప్లాన్లు, వెల్నెస్ ప్రోగ్రామ్లు, పెయిడ్ లీవ్లు..) ఏడాది ప్రాతిపదికన 63 శాతం పెరిగి రూ.689 కోట్లకు చేరాయి. మూడు నెలల కాలంలో కార్యకలాపాల ద్వారా రూ.5,405 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2024 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 31, 2024 నాటికి 8,244 మంది ఉద్యోగులు ఉన్నారు. -
ఫార్మాకు చేదు మందు?
సాక్షి బిజినెస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై ఇతరత్రా రంగాల్లాగే భారత ఫార్మా కంపెనీలకూ టెన్షన్గానే ఉంది. ఎందుకంటే మన ఫార్మా కంపెనీల ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా అమెరికాదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరం ఆ దేశానికి భారత ఫార్మా ఎగుమతులు 16 శాతం పెరిగి దాదాపు 9 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతయ్యే ఔషధాలు సుమారు 800 మిలియన్ డాలర్లే. అమెరికాకు మన చౌక ఔషధాల అవసరం ఎంత ఉందో, మనకూ కీలకమైన అమెరికా మార్కెట్ అవసరం అంతగానూ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.దీంతో సుంకాల వడ్డింపనేది ఎవరికి లాభదాయకం, ఎవరికి నష్టదాయకమనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలోలాగే ఫార్మా మీద టారిఫ్పై ఇరు దేశాలు మళ్లీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు. అమెరికా హెల్త్కేర్ వ్యవస్థలో మన జనరిక్స్కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మినహాయింపుల కోసం భారత్ ప్రయత్నించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. సవాళ్ల మధ్య అవకాశాలు.. వాస్తవానికి చైనాలాంటి దేశాలపై ప్రధాన దృష్టితో టారిఫ్లను ప్రతిపాదించినప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న మన ఫార్మాపైనా ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఔషధాల దిగుమతులపై భారత్ 10% సుంకాల వరకు విధిస్తుండగా, మన ఎగుమతులపై అక్కడ టారిఫ్లు లేవు. ఒకవేళ ప్రతీకారంగా మనలాగే టారిఫ్ విధించినా సుమారు 10% స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.గ్లాండ్ ఫార్మా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, జైడస్, లుపిన్లాంటి ఫార్మా కంపెనీల ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 50–37% వరకు ఉండటంతో వాటిపై టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఒకవేళ భారాన్ని కస్టమర్లకు బదలాయించకపోతే వివిధ కంపెనీల స్థూల లాభంపై సుమారు 12% వరకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే 50% బదలాయిస్తే, ఇది 7% దాకా ఉండొచ్చు. మొత్తం మీద ఆదాయనష్టంతో పాటు మిగతా దేశాలతో పోటీపడి మార్కెట్ను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది. దేశీ ఫార్మాకు కాస్త కలిసి వచ్చే అంశాలూ ఉన్నాయి. అమెరికా మీదే ఆధారపడకుండా మన కంపెనీలు ఇతర మార్కెట్లకూ విస్తరించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేలా ఆర్అండ్డీ సామర్థ్యాలను పెంచుకోవచ్చు. అమెరికాపై ఎఫెక్ట్ .. ఫార్మా దిగుమతులపై టారిఫ్లతో అమెరికాకూ కొన్ని ప్రతికూలతలు తప్పవు. భారతీయ జనరిక్స్పై సుంకాల వడ్డింపు వల్ల, ఫార్మా కంపెనీలు ఔషధాల రేట్లను పెంచితే, అమెరికా వినియోగదారులకు మందుల ఖర్చులు పెరిగిపోతాయి. ఇక, మన ఫార్మాపై అమెరికా భారీగానే ఆధారపడుతోంది. టారిఫ్లతో సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడి, ఔషధాలకు కొరత నెలకొనవచ్చు. ఫలితంగా పేషెంట్లకు చికిత్స విషయంలో సమస్యలు ఏర్పడవచ్చు. అటు అమెరికాకూ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. టారిఫ్తో ఇతర దేశాల ఫార్మా కంపెనీలు అమెరికాలోనూ తయారీ కార్యకలాపాలు చేపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో, దేశీయంగా తయారీకి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. అలాగే దిగుమతి చేసుకునే ఔషధాల నాణ్యతపరమైన సవాళ్లకు చెక్ పెట్టేలా, దేశీయంగా తయారీ ప్రమాణాలపై అమెరికా మరింత నియంత్రణ సాధించవచ్చు. -
2030 నాటికి ఆ రంగంలో అగ్రగామిగా భారత్: నితిన్ గడ్కరీ
భారతదేశం 2030 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ వాహనాల (EV) తయారీదారుగా అవతరిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల భవిష్యత్తును ఆయన హైలైట్ చేశారు.మా ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు.. నేను ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడాను. ఆ సమయంలో ఎవరూ దానిని నమ్మలేదు, కానీ నేడు అది నిజమైందని గడ్కరీ అన్నారు. అప్పట్లో, భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు దీని విలువ 22 లక్షల కోట్లకు పెరిగింది.భారత్.. అమెరికా, చైనా తర్వాత జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్గా అవతరించింది. ఇప్పుడు 2030 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుగా ఉండాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామని నితిన్ గడ్కరీ అన్నారు. లిథియం అయాన్ బ్యాటరీల ధర తగ్గుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణపై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. -
రతన్ టాటా వీలునామా: ఎవరికి ఎంత కేటాయించారంటే?
ఒక మనిషి చనిపోయినా.. అతడు చేసిన మంచి ఎప్పుడూ బతికే ఉంటుంది. ఇలాంటి కోవకు చెందిన వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి, దివంగత పారిశ్రామికవేత్త 'రతన్ టాటా' (Ratan Tata) ఒకరు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ.. లెక్కకు మించిన డబ్బును అనేక సేవా కార్యక్రమాల కోసం ఉదారంగా వెచ్చించారు. రతన్ టాటా మరణించిన తరువాత.. ఆయన ఆస్తులు, సంపద ఎవరికి చెందుతాయి? అనే ప్రశ్న.. ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి ఇప్పుడు సమాధానం లభించింది.టాటా సామ్రాజ్యాన్ని ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించిన రతన్ టాటా ఆస్తి సుమారు రూ. 10వేలకోట్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సుమారు రూ.3800 కోట్ల సంపదను.. తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ వంటి వాటికి కేటాయించారు.తన సవతి సోదరీమణులైన శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్ పేరుమీద రూ.800 కోట్లు రాసినట్లు తెలుస్తోంది. వీటికి కేటాయించిన ఆస్తులలో ఫిక్డ్స్ డిపాజిట్లు, ఖరీదైన పెయింటింగ్స్, వాచ్లు వంటివి ఉన్నాయి. రతన్ టాటాకు సన్నిహితుడైన.. మోహిన్ ఎం దత్తాకు కూడా రూ.800 కోట్లు రాశారు.జిమ్నీ నావల్ టాటాకు.. రతన్ టాటాకు చెందిన జుహూలోని బంగ్లాలో కొంత షేర్, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను కేటాయించారు. మెహిల్ మిస్త్రీ పేరు మీద అలీబాగ్లోని బంగ్లా, మూడు పిస్టోళ్లను కేటాయించారు.ఇదీ చదవండి: EPFO విత్డ్రా లిమిట్ రూ.5 లక్షలకు పెంపు!రతన్ టాటాకు కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే శునకాల సంరక్షణ కోసం కూడా రూ. 12 లక్షల ఫండ్ కేటాయించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 30వేలు చొప్పున వాటికి ఖర్చుచేసే విధంగా నిధులను కేటాయించారు. రతన్ టాటాకు విదేశాల్లో కూడా రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇవి కాకుండా ప్రముఖ కంపెనీలలో షేర్స్, ఖరీదైన 65 వాచీలు కూడా ఉన్నాయి.ఇక అందరూ తెలుసుకోవాలనుకునే విషయం.. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు ఏమి కేటాయించారు అని. అయితే శంతను నాయుడుకు తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. అది కాకుండా.. స్టూడెంట్ లోన్ మాఫీ చేశారు. ఇది కాకుండా రతన్ టాటా పక్కింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి అప్పుగా ఇచ్చిన రూ. 23 లక్షలు కూడా మాఫీ చేశారు. -
అమ్మకాల్లో దేశీయ దిగ్గజం హవా: భారీగా పెరిగిన సేల్స్
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా 2025 మార్చి నెలలో మొత్తం అమ్మకాలను వెల్లడించింది. కంపెనీ గత నెలలో మొత్తం 83894 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఈ సంఖ్య 2024 మార్చి (68413 యూనిట్లు) కంటే 23 శాతం ఎక్కువ.కంపెనీ మొత్తం అమ్మకాలలో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ 48,048 యూనిట్లు, కమర్షియల్ వాహనాల సేల్స్ 31,703 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 4143 యూనిట్లతో 163 శాతం వృద్ధిని నమోదు చేసింది. యుటిలిటీ వెహికల్స్ విభాగంలో, మహీంద్రా దేశీయ మార్కెట్లో 48048 వాహనాలను విక్రయించింది. 50835 వాహనాలను ఎగుమతి చేసింది.ఇదీ చదవండి: ఈ రూల్ అతిక్రమిస్తే.. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్!: నితిన్ గడ్కరీకార్ల విక్రయాలు మాత్రమే కాకుండా.. ట్రాక్టర్ అమ్మకాల సంఖ్యను కూడా ప్రకటించింది. మార్చి 2025లో దేశీయ అమ్మకాలు 32,582 యూనిట్లుగా ఉన్నాయి. ఈ అమ్మకాలు మార్చి 2024లో 24,276 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం మీద మహీంద్రా కంపెనీ అమ్మకాలు 2024 మార్చి కంటే కూడా 2025 మార్చిలో గణనీయంగా పెరిగాయి. -
రెనో చేతికి నిస్సాన్ వాటా
న్యూఢిల్లీ: దేశంలోని జపనీస్ కంపెనీ నిస్సాన్ వాటాను ఫ్రెంచ్ ఆటో రంగ దిగ్గజం రెనో కొనుగోలు చేయనుంది. దాంతో దేశీ భాగస్వామ్య కంపెనీ(జేవీ) రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్(ఆర్ఎన్ఏఐపీఎల్)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ జేవీలో నిస్సాన్కుగల 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెనో తాజాగా పేర్కొంది. తద్వారా జేవీలో 100 శాతం వాటా పొందనున్నట్లు, కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదిరినట్లు తెలియజేసింది. అయితే వాటా విలువను వెల్లడించలేదు. ఈ లావాదేవీ తదుపరి రెనో నిస్సాన్ జేవీలో రెనో గ్రూప్ వాటా 100 శాతానికి చేరనుంది. చెన్నైలోగల ప్లాంటు ద్వారా రెనో, నిస్సాన్ బ్రాండ్ల వాహనాలను జేవీ రూపొందిస్తోంది. ఈ ప్లాంటు 6,300 ఉద్యోగులతో వార్షికంగా 4.8 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం సీఎంఎఫ్ఏ, సీఎంఎఫ్ఏ ప్లస్ ప్లాట్ఫామ్లపై కైగర్, ట్రైబర్, క్విడ్ వాహనాలను తయారు చేస్తున్నట్లు రెనో గ్రూప్ సీఎఫ్వో డంకన్ మింటో పేర్కొన్నారు.ఐటీసీ గూటికి సెంచరీ పల్ప్డీల్ విలువ రూ.3,498 కోట్లున్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ (ఏబీఆర్ఈఎల్)లో భాగమైన సెంచరీ పల్ప్ అండ్ పేపర్ను డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ తాజాగా కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 3,498 కోట్లు. దీనితో కీలకమైన రియల్ ఎస్టేట్ విభాగంపై మరింతగా దృష్టి పెట్టేందుకు వెసులుబాటు లభిస్తుందని ఏబీఆర్ఈఎల్ ఎండీ ఆర్కే దాల్మియా తెలిపారు. అలాగే ఏబీఆర్ఈఎల్ వాటాదార్లకు అధిక విలువ చేకూర్చేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: నేటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు -
హల్దీరామ్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఫాస్ట్ఫుడ్ కంపెనీ హల్దీరామ్ స్నాక్స్ ఫుడ్ తాజాగా యూఏఈ సంస్థ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ(ఐహెచ్సీ)తోపాటు ఇన్వెస్ట్మెంట్ సంస్థ అల్ఫా వేవ్ గ్లోబల్కు మైనారిటీ వాటా విక్రయించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం రెండు సంస్థలు సంయుక్తంగా హల్దీరామ్లో 6 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. స్నాక్, ఫుడ్ బ్రాండ్ హల్దీరామ్స్లో ఇప్పటికే టెమాసెక్ ఈక్విటీ పెట్టుబడులకు సిద్ధపడగా.. మరో రెండు సంస్థలు ఐహెచ్సీ, అల్ఫా వేవ్ గ్లోబల్ సైతం వాటా కొనుగోలు చేయనున్నట్లు హల్దీరామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే డీల్ వివరాలు వెల్లడించలేదు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమాసెక్కు ఇప్పటికే మైనారిటీ వాటా విక్రయించేందుకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హల్దీ రామ్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. 10 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 85,000 కోట్లు) విలువలో హల్దీరామ్ లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. -
యాపిల్పై రూ.1,350 కోట్లు జరిమానా
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ యాప్ ట్రాకింగ్ ప్రైవసీ ఫీచర్ కంపెనీ ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా లేదని ఫ్రెంచ్ యాంటీట్రస్ట్ అధికారులు 150 మిలియన్ యూరోలు (సుమారు రూ.1,350 కోట్లు) జరిమానా విధించారు. ఇతర యూరోపియన్ దేశాలు కూడా ఈమేరకు జరిమానా విధించాలనే పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.యాపిల్ యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ(ఏటీటీ) సాఫ్ట్వేర్ను అమలు చేసిన విధానం.. వినియోగదారు డేటాను రక్షించేలా కంపెనీ ప్రకటించిన లక్ష్యానికి అనుగుణంగా లేదని ఫ్రెంచ్ యాంటీట్రస్ట్ అధికారులు తెలిపారు. దాంతో థర్డ్ పార్టీ పబ్లిషర్గా ఉన్న యాపిల్పై జరిమానా విధించారు. దీంతోపాటు యాపిల్ తన నిర్ణయాన్ని ఏడు రోజుల్లో తన వెబ్సైట్లో ప్రచురించాల్సి ఉంటుంది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, పోలాండ్ అధికారులు కూడా వినియోగదారుల గోప్యతకు సంబంధించి యాపిల్ ప్రమోట్ చేసే ఏటీటీపై దర్యాప్తు ప్రారంభించారు.నిరాశకు గురయ్యాం: యాపిల్ఫ్రెంచ్ అధికారులు తీసుకున్న నిర్ణయంతో తాము నిరాశకు గురయ్యామని, ఫ్రెంచ్ కాంపిటీషన్ అథారిటీ ఏటీటీలో ఎలాంటి నిర్దిష్ట మార్పులు సూచించాల్సిన అవసరం లేదని యాపిల్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021లో యాపిల్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ను ఇతర అప్లికేషన్లు, వెబ్సైట్లో కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇందుకోసం ముందుగా పాప్-అప్ విండో ద్వారా యూజర్లు అనుమతివ్వాల్సి ఉంటుంది. అది నిరాకరిస్తే యాప్ ఆ వినియోగదారునికి సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయదు. ఈ క్రమంలో యాజర్లకు టార్గెట్ యాడ్స్ వస్తున్నట్లు అధికారులు ఆరోపించారు. యాడ్ విభాగంలో పోటీదారులను పరిమితం చేస్తూ యాపిల్ తన సొంత ప్రకటనల సేవలను ప్రోత్సహించడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తోందని చెబుతున్నారు.ఇదీ చదవండి: తెల్లవారితే మారే రూల్స్ ఇవే!ప్రైవసీపై మరింత నియంత్రణఏటీటీ ఫీచర్ ఐఫోన్లు, ఐప్యాడ్లలో థర్డ్ పార్టీ యాప్స్ కోసం అధిక సంఖ్యలో పర్మిషన్ విండోలు వచ్చేలా చేస్తుందని ఫ్రాన్స్ కాంపిటీషన్ అథారిటీ తన నిర్ణయంలో పేర్కొంది. ఈ ఫీచర్ యాడ్ పబ్లిషర్లు, యాడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని తెలిపింది. యాపిల్ అనుసరిస్తున్న విధానం చిన్న ప్రచురణకర్తలను ప్రభావితం చేస్తుందని, వారు తమ వ్యాపారాలకు నిధులు సమకూర్చడానికి థర్డ్ పార్టీ డేటా సేకరణపై ఎక్కువగా ఆధారపడేలా ఉందని అథారిటీ పేర్కొంది. -
అంకురా ఆసుపత్రికి ఏడీబీ రూ.165 కోట్ల నిధులు
మహిళలు, చిన్నారులకు హెల్త్కేర్ సర్వీసులు అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంకురా ఆసుపత్రికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) నుంచి రూ.165 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను ఆసుపత్రి కార్యకలాపాలను విస్తరించేందుకు ఖర్చు చేయబోతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పీడియాట్రిక్, ప్రసూతి, గైనకాలజీ సేవలను విస్తరించడానికి, దేశం అంతటా ఆరోగ్య సంరక్షణను పెంపొందించేందుకు ఏడీబీ నిధులు తోడ్పడుతాయని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా అంకురా హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ ఉన్నం మాట్లాడుతూ..‘ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి సమకూరిన ఈ నిధులు భారతదేశంలో మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్న సంస్థ నిబద్ధతకు నిదర్శనం. ఈ నిధులు పీడియాట్రిక్, ప్రసూతి, గైనకాలజీ సేవలను పెంచడానికి, ఆసుపత్రి సౌకర్యాలను విస్తరించడానికి, మరిన్ని కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఎంతో దోహదం చేస్తాయి’ అని తెలిపారు. విస్తరణ వ్యూహంలో భాగంగా అంకుర హాస్పిటల్స్ దేశం అంతటా ప్రధాన నగరాల్లో కొత్త అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించిందని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: తెల్లవారితే మారే రూల్స్ ఇవే!తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 15 హెల్త్కేర్ సెంటర్ల నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయాలని ఆసుపత్రి యాజమాన్యం యోచిస్తోంది. అందులో భాగంగా పడకల సామర్థ్యాన్ని పెంచడం, అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం, పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి అదనపు ప్రత్యేక సిబ్బందిని నియమించడంపై దృష్టి పెడుతుంది. -
పీఎల్ఐను మించిన విధానాల రూపకల్పన
భారతదేశం గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా నిలదొక్కుకుంటున్నందున ప్రభుత్వం ఉద్యోగ కల్పన, మూలధన వ్యయం (క్యాపెక్స్) అనే రెండు కీలక లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన వైఖరితో కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) వంటి ప్రస్తుత పథకాల ఫలితాలను పరిగణలోకి తీసుకొని కొత్త విధానంలో పరిమితులను పెంచేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ తయారీలో భారతదేశ వాటాను పెంచుతూ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నందున ఈ వ్యూహాత్మక మార్పు అవసరమని భావిస్తున్నారు. దీన్ని రూపొందించడంలో కీలక అంశాలపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.తయారీలో పురోగతిభారత్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారం, పీఎల్ఐ పథకం వంటి కార్యక్రమాల ద్వారా ఉత్పాదక శక్తి కేంద్రంగా మారాలని దీర్ఘకాలిక లక్ష్యంగా ఏర్పరుచుకుంది. అందుకోసం కొన్ని విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుత ప్రయత్నాలు ఆశించిన ఆర్థిక పరివర్తనను పూర్తిగా అందించలేదు. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాల్లో ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన పీఎల్ఐ పథకం నిర్దిష్ట విభాగాల్లో ప్రొడక్షన్ను పెంచింది. కానీ, చైనా వంటి ప్రపంచ పోటీదారులకు ధీటుగా అవసరమైన విస్తృతమైన పారిశ్రామిక వృద్ధిని సృష్టించడంలో విఫలమైంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉత్పత్తి లక్ష్యాల కంటే ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చే కొత్త విధానాన్ని తీసుకురావాలని పరిశీలనలో పడింది.పెద్ద మొత్తంలో ఉద్యోగాలు..కొత్తగా రానున్న విధానానికి ఉపాధి కల్పన కీలకం కానుంది. దేశంలో పెరుగుతున్న యువ శ్రామిక శక్తితో స్థిరమైన, మంచి వేతనంతో ఉద్యోగాలను సృష్టించడం చాలా ముఖ్యం. ఇది ఆర్థిక అవసరంతోపాటు పార్టీలకు అతీతంగా రాజకీయంగా కూడా లబ్ధి చేకూరే అంశం. దేశంలో కొన్ని పరిశ్రమలు లక్షలాది మందికి ఉపాధిని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, తోలు వస్తువులు.. వంటి తయారీ పరిశ్రమలు పెద్దమొత్తంలో ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతాయి. వీటికి ప్రోత్సాహకాలను అనుసంధానం చేయడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో దీనివల్ల భారీగా లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తుంది.ఇదీ చదవండి: తెల్లవారితే మారే రూల్స్ ఇవే!మూలధన వ్యయానికి పెద్దపీటమెరుగైన ఉత్పాదకతకు పటిష్టమైన మౌలిక సదుపాయాలు అవసరం. దీన్ని గ్రహించిన ప్రభుత్వ వర్గాలు మూలధన వ్యయానికి పెద్దపీట వేసింది. కొత్త ఫ్రేమ్వర్క్లో పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్వర్క్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లోకి గణనీయమైన పెట్టుబడులను మళ్లించాలని భావిస్తుంది. క్యాపెక్స్కు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, సరఫరా గొలుసు సామర్థ్యాన్ని మెరుగుపరచడం, భారతీయ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా మరింత ఆదరణ పెరిగేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త విధానంలో భాగంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలకు మరింత మూలధనాన్ని సమకూర్చవచ్చు. ఇది ప్రైవేట్ పెట్టుబడులు పెంచుతూ ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. -
ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు
ప్రముఖ రిటైల్ కార్పొరేషన్ వాల్మార్ట్కు చెందిన ఆలిస్ వాల్టన్ 102 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.46 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలుగా నిలిచారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం వాల్మార్ట్ షేరు ధర పెరగడం వల్ల ఆమె సంపద గత సంవత్సరంతో పోలిస్టే 46 శాతం పెరిగింది. దాంతో 75 ఏళ్ల ఆలిస్ వాల్టన్ ప్రపంచ మహిళ కుబేరులు జాబితాలో టాప్లో నిలిచారు. వాల్మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె అయిన ఆలిస్ తన సోదరులు రాబ్, జిమ్ వాల్టన్ మాదిరిగా కాకుండా ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తనకు వారసత్వంగా సమకూరిన అపారమైన సంపదను వ్యక్తిగత అభిరుచులకు, దాతృత్వం కోసం ఖర్చు చేస్తున్నారు. వాల్టన్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ట్రస్ట్ అండ్ వాల్టన్ ఎంటర్ ప్రైజెస్ ద్వారా కంపెనీలో సుమారు 11.5 శాతం వాటాను కలిగి ఉన్నారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.వాల్టన్కు చిన్నతనం నుంచే కళలపట్ల ఉన్న ఇష్టంతో వాటిని సేకరించి పరిరక్షిస్తున్నారు. వాల్టన్ తన పదో ఏటే పికాసో రిన్యూవేట్ పెయింటింగ్ను రెండు డాలర్లకు కొనుగోలు చేశారు. ఆండీ వార్హోల్, నార్మన్ రాక్వెల్, జార్జియా ఓకీఫ్ వంటి ప్రసిద్ధ అమెరికన్ కళాకారుల ఒరిజినల్ కళాకృతులను ఆమె సేకరించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఆమె 2011లో అర్కాన్సాస్లోని బెంటన్విల్లేలో 50 మిలియన్ డాలర్లతో క్రిస్టల్ బ్రిడ్జెస్ మ్యూజియం ఆఫ్ అమెరికన్ ఆర్ట్ అని పిలువబడే మ్యూజియంను కూడా ప్రారంభించారు. టెక్సాస్ గుర్రాల సంతానోత్పత్తి వ్యాపారంలోనూ తనకు ప్రవేశం ఉంది. ఆమె 2017లో రాకింగ్ డబ్ల్యు రాంచ్ అని పిలువబడే టెక్సాస్లోని గుర్రాల స్థావరాన్ని 16.5 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు సమాచారం. ఇది 250 ఎకరాలకు పైగా పచ్చిక బయళ్లు, పశువులు, గుర్రాల పరిరక్షణ కోసం వీలుగా ఉన్న ప్రాంతం. తన సంపదను అభిరుచులు తీర్చుకోవడానికి, కళలను కాపాడేందుకు ఖర్చు చేస్తున్నారు.ఇదీ చదవండి: మరో ఆరు నెలల్లో దేశీయ తొలి మైక్రోకంట్రోలర్ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు, పీఏసీలకు మద్దతుగా నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2016లో హిల్లరీ క్లింటన్ విక్టరీ ఫండ్కు 3,53,400 డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో వాల్టన్ మొదటిస్థానంలో నిలువగా, 67 బిలియన్ డాలర్ల సంపదతో లోరియల్కు చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్, 60 బిలియన్ డాలర్లతో కోచ్ ఇండస్ట్రీస్కు చెందిన జూలియా కోచ్ అండ్ ఫ్యామిలీ, 53 బిలియన్ డాలర్ల సంపదతో మార్స్కు చెందిన జాక్వెలిన్ మార్స్, 40 బిలియన్ డాలర్ల సంపదతో హెచ్సీఎల్కు చెందిన రోష్ని నాడార్ అండ్ ఫ్యామిలీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
బ్యాంక్టెక్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: బ్యాంక్టెక్ రంగంలోకి పెట్టుబడులు 2027 నాటికి బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8,600 కోట్లు) చేరతాయని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘సెడార్–ఐబీఎస్ఐ క్యాపిటల్’ తన అంచనాను వెల్లడించింది. 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో వృద్ధిని నడిపించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.విప్లవాత్మక టెక్నాలజీలు భారత్లో బ్యాంకింగ్ సేవలను సమూలంగా మార్చేస్తున్నట్టు సెడార్ ఐబీఎస్ఐ వ్యవస్థాపకుడు, ఎండీ సాహిల్ ఆనంద్ తెలిపారు. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల్లో 80 శాతాన్ని ప్రస్తుతం డిజిటల్గా నిర్వహిస్తున్నట్టు ఓ పరిశోధన వివరాలను గుర్తు చేశారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.వీటి ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోని వారికీ బ్యాంకింగ్ సేవలు అందుతున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని డిజిటల్గా మార్చడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలకంగా పనిచేస్తోందంటూ.. సేవల విస్తరణ, చురుకుదనం, వ్యయాల కట్టడి ప్రయోజనాలు దీంతో లభిస్తున్నట్టు వివరించారు. సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీలకు బ్లాక్చైన్ టెక్నాలజీ సాయపడుతన్నట్టు ఆనంద్ వెల్లడించారు.ముఖ్యంగా సప్లయ్ చైన్ ఫైనాన్స్, గుర్తింపు నిర్వహణలో ఇది ఎంతో మార్పును తీసుకొస్తున్నట్టు చెప్పారు. సెడార్–ఐబీఎస్ఐ క్యాపిటల్ ఇప్పటికే బ్యంక్టెక్ రంగంలో రెండు లావాదేవీలతో మొత్తం రూ.240 కోట్ల పెట్టుబడులు పెట్టిందని.. తమ పోర్ట్ఫోలియోని 10–15 స్టార్టప్లకు విస్తరించనున్నట్టు ఆనంద్ ప్రకటించారు. -
ఇండస్ఇండ్పై ఆర్క్యాప్ రుణదాతల పిటిషన్ వాపస్
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)పై దాఖలు చేసిన పిటిషన్ను రిలయన్స్ కాపిటల్ రుణదాతల కమిటీ (సీఓసీ) ఉపసంహరించుకుంది. పూర్తిగా చెల్లింపులు జరిపి ఇందుకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసినందున, ఐఐహెచ్ఎల్పై పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు అపీలేట్ ట్రిబ్యునల్కు ఆర్క్యాప్ సీఓసీ తెలిపింది. సీఓసీ పిటిషన్ను జస్టిస్ యోగేష్ ఖన్నా, జస్టిస్ అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ట్రిబ్యునల్ ద్విసభ్య థర్మాసనం ఆమోదించింది. కేసు వివరాల్లోకి వెళితే, దివాలా కోడ్ చట్టం కింద ఐఐహెచ్ఎల్ ఆర్థిక సేవల సంస్థ– రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు 2023 ఏప్రిల్లో రూ.9,650 కోట్లతో అత్యధిక బిడ్ను నమోదుచేసింది. దీని ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళికను ఐఐహెచ్ఎల్ 2924 మే 27 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అటు తర్వాత ఈ కాల పరిమితిని 2024 ఆగస్టు 10 వరకూ పొడిగించడం జరిగింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా పీఎం విద్యాలక్ష్మీ రుణాలు
న్యూఢిల్లీ: ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి విద్యాలక్ష్మీ (పీఎం–విద్యాలక్ష్మీ) పథకాన్ని అందుబాటులోకి తెచి్చనట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. దేశంలోని టాప్ 860 నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో (క్యూహెచ్ ఈఐ) ప్రవేశం పొందిన విద్యా ర్థులు ఈ పథకం కింద రుణం కోసం అర్హులు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు 75% క్రెడిట్ గ్యారంటీ కూడా ఉంటుంది. విద్యార్థులు లేదా వారి కుటుంబాలు ఎటువంటి ఆస్తులను తన ఖాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు పీఎం–విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి విద్యా రుణం కోసం డిజిటల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్కు 8,300కి పైగా బ్రాంచ్లు, 12 ప్రత్యేక విద్యా రుణ ఆమోద కేంద్రాలు, 119 రిటైల్ అస్సెట్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఉన్నాయి. అర్హులైన వి ద్యార్థులందరూ నాణ్యమైన విద్య పొందేందుకు అవ సరమైన ఆర్థిక తోడ్పాటు అందించ డం తమ లక్ష్యమని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ తెలిపారు. -
రక్షణ శాఖలోకి 2978 ఫోర్స్ గూర్ఖా కార్లు!
ఫోర్స్ మోటార్స్ లిమిటెడ్ భారత రక్షణ దళాల నుంచి ఏకంగా 2,978 ఫోర్స్ గూర్ఖా వాహనాల కోసం ఆర్డర్ పొందింది. త్వరలోనే ఈ వాహనాలు రక్షణ శాఖలోకి చేరనున్నాయి. కంపెనీ ఈ కార్లను సైనిక కార్యకలాపాలకు అనుగుణంగా తయారు చేయనుంది.ఫోర్స్ గూర్ఖా కార్లు.. ఇండియన్ ఆర్మీ, వైమానిక దళాలలో చేరనున్నాయి. ఈ కార్లు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగల సత్తా, మంచి ఆఫ్ రోడింగ్ కెపాసిటీ కలిగి ఉండటం వల్లనే సైనిక దళాలకు ఉపయోగకరంగా ఉంటాయి. కంపెనీ లైట్ స్ట్రైక్ వెహికల్ (LSV) వేరియంట్ రక్షణ శాఖకు డెలివరీ చేయనున్నట్లు సమాచారం.భారతదేశంలో ఫోర్స్ మోటార్స్ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం ఫోర్స్ గూర్ఖా (3-డోర్, 5-డోర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది), ఫోర్స్ ట్రావెలర్, ఫోర్స్ ట్రాక్స్, ఫోర్స్ అర్బానియా, ఫోర్స్ సిటీలైన్, ఫోర్స్ మోనోబస్ మొదలైనవి ఉన్నాయి. గూర్ఖా 2.6-లీటర్ డీజిల్ ఇంజిన్తో 138bhp, 320Nm ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. -
బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ప్రభుత్వరంగ బీమా సంస్థ టైఅప్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా సంస్థ న్యూ ఇండియా అష్యూరెన్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం కింద బ్యాంక్ ఇఫ్ ఇండియా కస్టమర్లకు న్యూ ఇండియా అష్యూరెన్స్ బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది.న్యూ ఇండియాకు చెందిన హెల్త్ ఇన్సూరెన్స్, మోటారు, వ్యక్తిగత ప్రమాద, హోమ్, వాణిజ్య ఇన్సూరెన్స్ ఉత్పత్తులను బీవోఐ కస్టమర్లు సులభంగా పొందొచ్చు. సమగ్రమైన బీమా ఉత్పత్తులను అందించేందుకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని బ్యాంక్ ఇఫ్ ఇండియా ఎండీ, సీఈవో రజనీష్ కర్ణాటక్ తెలిపారు.ఈ ఒప్పందంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బీమా ఉత్పత్తులు చేరువ అవుతాయని, నాణ్యమైన సేవలు, రక్షణ అందుతాయని న్యూ ఇండియా అష్యూరెన్స్ చైర్మన్, ఎండీ గిరిజా సుబ్రమణ్యం పేర్కొన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 5,200 శాఖలున్నాయి. -
ఇండిగోకు రూ.944 కోట్ల జరిమానా
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్కు ఆదాయపు పన్ను శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో శనివారం ఈ ఆర్డర్ను అందుకుంది. పెనాల్టీ ఆర్డర్ను సంస్థ ఖండిస్తూ.. చట్టపరమైన చర్యలతోనే ముందుకు వెళ్తామని సవాలు చేసింది.ఆదివారం జరిగిన రెగ్యులేటరీ ఫైలింగ్లో.. ఆదాయపు పన్ను అథారిటీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ జరిమానా విధించబడిందని ఇండిగో స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు ఇండిగో చేసిన అప్పీల్ కొట్టివేయబడిందని అథారిటీ తప్పుగా భావించింది. అయితే అప్పీల్ ఇప్పటికీ క్రియాశీలంగా ఉంది. తీర్పు కూడా పెండింగ్లో ఉంది. ఈ ఆర్డర్ చట్ట పరిధిలోకి రాలేదని కంపెనీ వెల్లడిస్తూ.. ఈ జరిమానాను ఎదుర్కోవడానికి చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తామని ఇండిగో స్పష్టం చేసింది.ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఆర్డర్ వల్ల.. కంపెనీ ఆర్థిక, కార్యకలాపాలు లేదా మొత్తం వ్యాపార కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఇండిగో స్పష్టం చేసింది. ఇప్పటికే పలు ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ఇండిగో ఇప్పుడు తాజాగా జరిమానాకు సంబంధించిన పెనాల్టీ ఆర్డర్ను అందుకుంది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడువిమానయాన సంస్థ ఇటీవల FY25 మూడవ త్రైమాసికంలో దాని నికర లాభంలో 18.6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఆదాయాలు కూడా రూ.2,998.1 కోట్ల నుంచి రూ.2,448.8 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా ఆదాయం తగ్గడానికి కారణమైందని కంపెనీ వెల్లడించింది. -
రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడు
కేవలం 33 సంవత్సరాల వయసులోనే.. 'వినయ్ హిరేమత్' (Vinay Hiremath).. లూమ్ కంపెనీ స్థాపించి, దానిని అట్లాసియన్ (Atlassian)కు సుమారు 975 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 8092.5 కోట్లు)కు విక్రయించారు. ఆ తరువాత ''నేను ధనవంతుడిని.. నా జీవితాన్ని ఏమి చేయాలో తెలియడం లేదు'' అనే శీర్షికతో తన భావాలను పంచుకున్నారు. ఇప్పుడు అతడే రోజుకు 5 నుంచి 8 గంటలు ఫిజిక్స్ (భౌతికశాస్త్రం) చదువుతూ.. ఇంటర్న్షిప్ల కోసం చూస్తున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.వినయ్ హిరేమత్ ఇప్పుడు మరొక స్టార్టప్ను ప్రారంభించడానికి బదులుగా, భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో తన సమయాన్ని పూర్తిగా గడుపుతున్నారు. పాడ్కాస్ట్ హోస్ట్ సామ్ పార్ ప్రకారం.. హిరేమత్ రోజుకు 5-8 గంటలు భౌతిక శాస్త్రాన్ని చదువుతున్నాడు, అంతే కాకుండా 18 ఏళ్ల వయస్సు గల డిస్కార్డ్ గ్రూపులలో తిరుగుతున్నాడు. మెకానికల్ ఇంజనీర్గా ఇంటర్న్ కావాలని చూస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లూమ్ను విక్రయించిన తర్వాత అక్కడే ఉండాలా?, వద్దా?.. అనే దానితో హిరేమత్ కొంత సతమతమయ్యాడు. ఆ సమయంలోనే నేను ఆ కంపెనీలో పనిచేయడం సరైంది కాదని అనుకున్నాను. అయితే 60 మిలియన్ డాలర్ల (రూ. 500 కోట్ల కంటే ఎక్కువ) ప్యాకేజీని వదులుకోవడం కష్టంగానే అనిపించిందని గత మార్చిలోనే పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?లూమ్ను విడిచిపెట్టిన కొన్ని రోజులకే.. హిరేమత్ పెట్టుబడిదారులను, రోబోటిక్స్ నిపుణులను కలిసి, రోబోటిక్స్ కంపెనీని ప్రారంభించాలని భావించాడు. కానీ అది సాధ్యం కాదని తొందరగానే గ్రహించాను. నేను నిజంగా కోరుకునేది ఎలాన్ మస్క్ మాదిరిగా కనిపించడమేనని నాకు అర్థమైంది. కానీ అది చాలా భయంకరంగా ఉంది. క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్పై మస్క్, వివేక్ రామస్వామితో కలిసి నాలుగు వారాలు పనిచేసాను. ఆ అనుభవాలు వ్యాపార ఆవశ్యకతపై అవగాహనను మరింత పటిష్టం చేశాయి.ప్రస్తుతం.. హిరేమత్ మరొక స్టార్టప్ను ప్రారంభించడం కంటే నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఇంటర్న్ చేయాలనుకుంటున్నాను. దీంతో నేను ఏమి చేయాలో నాకు నిజంగా తెలియదని అన్నాడు. ఇప్పుడు ఏదైనా స్టార్టప్ స్టార్ట్ చేయడానికంటే.. చదువుకోవాలి అని నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోంది.The co-founder of Loom sold his biz for ~$1B, made $50-70M personally, then walked away from an extra $60MHe has “no income right now” and is “looking for internships”...@vhmth has a wild post-exit story. we talked about it on Moneywise:-Turned down $60M in retention… pic.twitter.com/uTdS5blabz— Sam Parr (@thesamparr) March 25, 2025 -
జిబ్లీ ఎఫెక్ట్: శామ్ ఆల్ట్మాన్ రిక్వెస్ట్
సోషల్ మీడియా.. ఏఐ జనరేటెడ్ స్టూడియో జిబ్లీ స్టైల్ చిత్రాలతో నిండిపోతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఏది ఓపెన్ చేసినా.. జిబ్లీ ఫొటోలే కనిపిస్తున్నాయి. దీనిపైన ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ స్పందిస్తూ.. ఇక విరామం తీసుకోండి అని ట్వీట్ చేశారు.జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉంది. యూజర్లు ఫోటోలను రూపొందించడంలో కొంత విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మా సిబ్బందికి కూడా నిద్ర అవసరం కదా అంటూ శామ్ ఆల్ట్మాన్ ట్వీట్ చేశారు.can yall please chill on generating images this is insane our team needs sleep— Sam Altman (@sama) March 30, 2025సాయం ఆల్ట్మాన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫీచర్ వెనుక పనిచేసే బృందాన్ని తొలగించి, కొత్త టీమ్ ఏర్పాటు చేసుకోండి అంటూ.. ఒక యూజర్ కామెంట్ చేశారు. దీనికి ఆల్ట్మాన్ సమాధానమిస్తూ.. ఈ బృందం ప్రపంచంలోనే అతిపెద్ద వెబ్సైట్ను నిర్మించే పనిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ టీమ్ అని అన్నారు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే ఒకరోజు సంపాదన ఎంతో తెలుసా?నిజానికి ఓపెన్ఏఐ కొన్ని రోజులకు ముందు.. యూజర్లను ఆకట్టుకోవడానికి చాట్జీపీటీలో 'జిబ్లీ'ని తీసుకొచ్చింది. దీనిని యూజర్లకు ఎక్కువగా వినియోగించడం మొదలుపెట్టారు. దీనివల్ల జీపీయూ సిస్టంపై అధిక ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే దీనికి ఒక లిమిట్ పెడుతున్నట్లు సీఈఓ వెల్లడించారు. అయితే ఈ లిమిట్ ప్రీమియమ్ యూజర్లకు వర్తించదు.no thanksin addition to building agi this team is on trajectory to build the biggest website in the world from a cold start 2.33 years agobest team in the world, it's just hard— Sam Altman (@sama) March 30, 2025 -
స్పెషల్ ఆఫర్: 16 రూపాయలకే స్మార్ట్ఫోన్!
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్' తన 16వ వార్షికోత్సవాన్ని పురుస్కరిచుకుని ఒక్క రోజు (మార్చి 30) స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ఫోన్స్, స్మార్ట్వాచెస్, ఇయర్ బడ్స్, పవర్ బ్యాంక్ వంటి వాటిమీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. అయితే మొదటి 100 మంది కస్టమర్లకు.. కేవలం 16 రూపాయలకే స్మార్ట్ఫోన్ (లావా అగ్ని 3), స్మార్ట్వాచ్ (లావా ప్రోవాచ్ V1) అందిస్తుంది.కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ ఈ రోజు (మార్చి 30) మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే సాయంత్రం 7:00 గంటలకు ప్రోవాచ్ వీ1 సేల్ జరుగుతుంది. దీనిని కొనుగోలు చేయడానికి ప్రోవాచ్ అనే కూపన్ కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది.లావా అగ్ని 3ఇండియన్ మార్కెట్లో లావా అగ్ని 3 స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ. 19999. ఇది 6.78 ఇంచెస్ డిస్ప్లే, క్వర్డ్ స్క్రీన్ పొందుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 500 mAh బ్యాటరీ పొందుతుంది. ఇది 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఈ ఛార్జర్ కావాలనుకుంటే.. కస్టమర్లు కొంత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే 16 రూపాయలకు ఎవరైనా సొంతం చేసుకుంటే.. వారికి ఈ ఛార్జర్ లభిస్తుందా? లేదా అనేది వెల్లడికాలేదు.లావా ప్రోవాచ్ వీ1ఈ ఏడాది ప్రారంభంలో 2,399 రూపాయల ధర వద్ద లాంచ్ అయిన లావా ప్రోవాచ్ వీ1.. ఈ రోజు ఆఫర్ కింద 16 రూపాయలకు లభిస్తుంది. ఈ వాచ్ 1.85 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే కలిగి.. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ పొందుతుంది. ఇది జీపీఎస్ న్యావిగేషన్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. -
రెండున్నరేళ్లలోనే 20 లక్షల క్రెడిట్ కార్డులు..
న్యూఢిల్లీ: సుమారు రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే 20 లక్షల పైచిలుకు టాటా న్యూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. కొత్తగా జారీ అయిన కార్డుల్లో ఇవి సుమారు 13 శాతం వాటా దక్కించుకున్నట్లు టాటా న్యూ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించాయి.వివిధ ఉత్పత్తులు, సేవల కొనుగోళ్ల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లన్నీ సమగ్రంగా అనుసంధానమవుతాయని పేర్కొన్నాయి. ఈ క్రెడిట్ కార్డుతో 10% వరకు ఆదా, ట్రావెల్.. ఫ్యాషన్ మొదలైన వాటి షాపింగ్లో ప్రత్యేక ప్రాధాన్యత తదితర ప్రయోజనాలను పొందవచ్చని టాటా డిజిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఫైనాన్షియల్ సర్వీసెస్) గౌరవ్ హజ్రతి తెలిపారు. -
UPI లాంటి మరో విప్లవం.. ఆధార్ సృష్టికర్త అంచనా
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) తరహాలో తదుపరి విప్లవాన్ని భారత ఇంధన రంగం చూస్తుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ సృష్టికర్త నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజలే విద్యుత్ ఉత్పత్తిదారులుగా, వినియోగదారులుగా ఎదిగేందుకు వీలుగా ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను విస్తృతంగా అమలు చేస్తున్న విషయాన్ని పారిశ్రామికవేత్తలనుద్దేశించి ప్రసంగిస్తూ వివరించారు."మనం సాధారణంగా తక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తుంటాం.. నిల్వ చేస్తుంటాం. మీరు ఎల్పీజీ సిలిండర్ కొంటున్నారంటే ప్యాకేజింగ్ చేసిన ఇంధనాన్ని కొంటున్నట్టు. కానీ విద్యుత్ మాత్రం గ్రిడ్ నుంచి వస్తుందని ఎప్పుడూ అనుకునేవాళ్లం. విద్యుత్ అందుబాటులో లేకపోతే జనరేటర్ కొనుక్కోవడమో, నూనె దీపాలు వెలిగించడమో చేస్తుంటాం'' అని నీలేకని చెప్పుకొచ్చారు.ఇప్పుడు ‘రూఫ్ టాప్ సోలార్ ఉండటం వల్ల ప్రతి ఇంటికి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈవీ బ్యాటరీ ఉండటం వల్ల ప్రతి ఇల్లు ఎనర్జీ స్టోర్ అవుతుంది. కాబట్టి, ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారు, అమ్మకందారు అలాగే కొనుగోలుదారు కూడా. కాబట్టి, యూపీఐ మాదిరిగా, మీరు ఇప్పుడు విద్యుత్ను కొనుగోలు చేయవచ్చు. విక్రయించవచ్చు" అన్నారాయన. ఇంధన ఉత్పత్తి, వినియోగం వికేంద్రీకరణ వల్ల లక్షలాది మంది సూక్ష్మ ఇంధన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తారని, ఇది ఆర్థిక ఆవిష్కరణలు, వృద్ధికి దోహదపడుతుందని నీలేకని అన్నారు.యూపీఐ విజయ ప్రస్థానందశాబ్దం క్రితం ప్రారంభించిన యూపీఐ భారతదేశ డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు మూలస్తంభంగా మారింది. దేశవ్యాప్తంగా 80 శాతం రిటైల్ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతన్నాయి. గత జనవరిలో మొత్తం యూపీఐ లావాదేవీలు 16.99 బిలియన్లు దాటాయి. అలాగే వాటి విలువ రూ .23.48 లక్షల కోట్లు దాటింది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లతో సహా ఏడు దేశాల్లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఫోన్పే రూ.696 క్యాష్ బ్యాక్.. నిజమేనా?
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ ఫోన్పేకి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ ప్రమోషన్ క్యాంపెయిన్లో భాగంగా ఫోన్పే రూ.696 క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోందంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు ఓ పోస్ట్ పెట్టారు. అయితే దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆ పోస్టు ఫేక్ అని, ఫోన్పే అలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదీ ప్రకటించలేదని తేలింది.అసలేముంది ఆ పోస్ట్లో?ఈ ఐపీఎల్ సీజన్లో ఫోన్పే రూ.696 క్యాష్బ్యాక్ ఆఫర్ చేస్తోందని 'ఐపీఎల్-హబ్' అనే ఫేస్బుక్ యూజర్ మార్చి 22న పోస్ట్ చేశారు. ఈ ఆఫర్ను ఉపయోగించుకోవడానికి యూజర్ల కోసం రిజిస్ట్రేషన్ లింక్ను కూడా పోస్ట్లో పొందుపరిచారు. హిందీలో రాసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. నిజమేనేమోనని చాలా మంది యూజర్లు దీన్ని షేర్ చేస్తుండటంతో వైరల్గా మారింది.మరి ఏం తేలింది?ఇన్విడ్ అనే టూల్ ద్వారా ఈ వైరల్ పోస్ట్ను పరీక్షించగా ఇలాంటివే మరికొన్ని ఫేక్ పోస్టులు కనిపించాయి. ఫోన్పే అటువంటి క్యాష్బ్యాక్ పథకాన్ని ఏమైనా ప్రారంభించిందా అని తదుపరి ధ్రువీకరణ కోసం ఫోన్పేకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ను పరిశీలించినా అటువంటి ఆఫర్ ఏదీ కనిపించలేదు. ఈ పక్రియలో ఫోన్పే అధికారిక వెబ్సైట్లో ఒక బ్లాగ్ కనిపించింది. క్యాష్బ్యాక్ మోసాల నుండి అప్రమత్తంగా ఉండండి" అంటూ పేర్కొంది. ఫోన్ కాల్స్ లేదా లింక్ల ద్వారా ఫోన్పే క్యాష్ బ్యాక్లు, రివార్డులను అందించదని అందులో వివరించింది. -
హెచ్ఆర్ కంపెనీ చేతికి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ సంస్థ
న్యూఢిల్లీ: టెక్నాలజీ ఆధారిత మానవ వనరుల సేవల సంస్థ సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ తాజాగా బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ సేవలు అందించే వైబ్రెంట్ స్క్రీన్ను కొనుగోలు చేసింది. తమ స్టాఫింగ్ సొల్యూషన్స్ పోర్ట్ఫోలియోను మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు.సీఐఈఎల్ హెచ్ఆర్ ఇటీవల జాంబే, ఆర్జీ స్టాఫింగ్, కోర్స్ప్లే, థామస్ అసెస్మెంట్స్ / పీపుల్ మెట్రిక్స్ మొదలైన సంస్థలను కొనుగోలు చేసింది. వైబ్రెంట్ స్క్రీన్ సుమారు 24 సంవత్సరాలుగా ఉద్యోగాలు, విద్య, క్రిమినల్ రికార్డులు, డేటాబేస్ లిస్టింగ్, క్రెడిట్ హిస్టరీ, ఐడెంటిటీ ధృవీకరణ మొదలైన వాటి కోసం వెరిఫికేషన్ సేవలు అందిస్తోంది. ఫార్చూన్ 500 కంపెనీలతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల్లో కంపెనీకి 240 పైచిలుకు క్లయింట్లు ఉన్నాయి.మరోవైపు, సీఐఈఎల్ హెచ్ఆర్కి ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. ఇష్యూ కింద తాజాగా షేర్ల జారీ ద్వారా రూ. 335 కోట్లు సమీకరించనుండగా, ప్రమోటర్లు..ఇతరత్రా షేర్హోల్డర్లు 47.4 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద విక్రయించనున్నారు. -
రూ. 1,460 కోట్ల షేర్లను అమ్మేసిన కేకేఆర్
న్యూఢిల్లీ: ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా కంపెనీ ప్రమోటర్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్ తాజాగా జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లో 5.8 శాతం వాటా విక్రయించింది. బల్క్డీల్ గణాంకాల ప్రకారం వీటి విలువ రూ. 1,460 కోట్లు. అనుబంధ సంస్థ టౌ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఒక్కో షేరుకి రూ. 1,625 సగటు ధరలో 89.83 లక్షలకుపైగా షేర్లను అమ్మివేసింది.ఈ లావాదేవీ తదుపరి కేకేఆర్ వాటా 53.66 శాతం నుంచి 47.88 శాతానికి క్షీణించింది. కొటక్ మహీంద్రా ఎంఎఫ్ రూ. 200 కోట్లు వెచ్చించి 0.8 శాతం వాటాకు సమానమైన 12.3 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జేబీ కెమికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 6.2% పతనమై రూ. 1,604 వద్ద ముగిసింది. -
ఎన్సీఎల్ఏటీలో గూగుల్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో టెక్ దిగ్గజం గూగుల్కు ఎదురుదెబ్బ తగిలింది. యాప్ స్టోర్ బిల్లింగ్ విధానం సమంజసంగా లేదని, డెవలపర్లకు పరిమితులు విధించేదిగా ఉందని జరిమానా విధిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచి్చన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ సమర్ధించింది. అయితే, పెనాల్టీ పరిమాణాన్ని రూ. 936.44 కోట్ల నుంచి రూ. 216 కోట్లకు తగ్గించింది. గుగుల్ తన గుత్తాధిపత్యాన్ని దురి్వనియోగం చేసిందంటూ 104 పేజీల ఆర్డరులో వ్యాఖ్యానించింది. కానీ, వివిధ అంశాల ప్రాతిపదికన యాప్లపై 15 నుంచి 30 శాతం వరకు సరీ్వస్ ఫీజులను వసూలు చేయడంలో టెక్ దిగ్గజం ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని ఎన్సీఎల్ఏటీ పేర్కొంది. గూగుల్ ఇప్పటికే పెనాలీ్టలో 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేసిందన, మిగతా మొత్తాన్ని 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
190 బిలియన్ డాలర్లకు ఈ–రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశీ ఈ–రిటైల్ మార్కెట్ ఏటా 18 శాతం వృద్ధి చెందనుంది. 2030 నాటికి 170–190 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఓ నివేదిక ప్రకారం స్థూల ఆర్థికాంశాలు, వినియోగంపరమైన సవాళ్ల కారణంగా 2024లో ఈ–రిటైల్ రంగ వృద్ధి చారిత్రక గరిష్టమైన 20 శాతం నుంచి నెమ్మదించి సుమారు 10–12 శాతానికి మందగించింది. అయితే, ఇటీవల ద్రవ్య పరపతి విధానాన్ని సరళతరం చేయడంతో వృద్ధి క్రమంగా పుంజుకోనుంది. ముఖ్యంగా 2025 పండుగ సీజన్ నుంచి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ‘దీర్ఘకాలికంగా మార్కెట్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయి. ఈ–రిటైల్ రంగం వచ్చే ఆరేళ్లు 18 శాతం వృద్ధి చెంది 170–190 బిలియన్ డాలర్లకు చేరవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. ముఖ్యావసరయేతర ఉత్పత్తులు, సేవలపై ప్రజలు మరింతగా ఖర్చు చేయనుండటం ఇందుకు దోహదపడనుంది. రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు.. → గత దశాబ్దకాలంలో రిటైల్కి సంబంధించి భారత్ శక్తివంతమైన కేంద్రంగా మారింది. 2024లో అంతర్జాతీయంగా మూడో అతి పెద్ద రిటైల్ మార్కెట్గా ఎదిగింది. → ఇటీవలి కాలంలో వినియోగం, ముఖ్యావసరాలు కాకుండా ఇతరత్రాల ఉత్పత్తులు, సేవలపై ఖర్చు చేయడం కాస్త నెమ్మదించింది. ప్రైవేట్ వినియోగం కోవిడ్ పూర్వం (2017–19లో) 11 శాతంగా ఉండగా దానితో పోలిస్తే కోవిడ్ తర్వాత (2022–24) 8 శాతానికి తగ్గింది. వేతనాలు పెద్దగా పెరగకపోవడం, ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటం మొదలైన అంశాలు ఇందుకు కారణం. → ఇటీవల ద్రవ్యపరపతి విధానాన్ని సరళతరం చేయడంతో ఈ–రిటైల్ వృద్ధి మళ్లీ పుంజుకోనుంది. నిత్యావసరాలు, దుస్తులు.. ఎల్రక్టానిక్స్ వంటి ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు దోహదపడనున్నాయి. 2030 నాటికి ప్రతి మూడు డాల ర్లలో వీటి వాటా రెండు డాలర్లుగా ఉంటుంది. → ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఈ–రిటైల్ వినియోగం పెరుగుతోంది. 2020 నుంచి చూస్తే కొత్తగా షాపింగ్ చేస్తున్న ప్రతి అయిదుగురిలో ముగ్గురు ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నారు. అలాగే, 2021 నుంచి చూస్తే కొత్త విక్రేతల్లో 60 శాతం మంది ద్వితీయ శ్రేణి లేదా అంతకన్నా చిన్న పట్టణాలకు చెందినవారే ఉంటున్నారు. → క్విక్ కామర్స్, హైపర్ వేల్యూ కామర్స్ మొదలైన విభాగాలు తదుపరి ఈ–రిటైల్ వృద్ధికి దోహదపడనున్నాయి. -
SEBI: 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: రెన్యువల్ ఫీజును కట్టనందుకు గాను 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్ ఇక చెల్లుబాటు కాదు. గడువు తీరిపోయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్న ప్రతి రీసెర్చ్ అనలిస్టు అయిదేళ్లకోసారి రెన్యువల్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ 72 అనలిస్టులు రెన్యువల్ ఫీజులు చెల్లించలేదని, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిపోయిందని సెబీ గుర్తించింది. దీంతో నిబంధనల ఉల్లంఘనకు గాను వారికి షోకాజ్ నోటీసులు పంపించి, తాజా నిర్ణయం తీసుకుంది. అటు లిక్విడిటీ ఉండని స్టాక్ ఆప్షన్లలో మోసపూరిత ట్రేడింగ్ ఆరోపణలపై సహదేవ్ పైక్ హెచ్యూఎఫ్, పరితోష్ సాహా హెచ్యూఎఫ్, త్రిప్తా ష్రాఫ్, దక్ష్ షేర్ బ్రోకర్స్ మొదలైన వర్గాలపై జరిమానా విధించింది. -
ఐపీవోలపై కంపెనీల కసరత్తు..
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించుకునేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేస్తున్నాయి. తాజాగా స్టడ్స్ హెల్మెట్స్, పార్క్ మెడి వరల్డ్, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ మొదలైన సంస్థలు తమ ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ఇక ఐపీవో సన్నాహాల్లో ఉన్న ఒక్కొక్క సంస్థ వివరాలను చూస్తే.. రూ. 1,260 కోట్ల పార్క్ మెడి వరల్డ్ ఇష్యూ.. పార్క్ బ్రాండ్ కింద హాస్పిటల్ చెయిన్ నిర్వహించే పార్క్ మెడి వరల్డ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ కింద రూ. 900 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 192 కోట్లు సమీకరించే యోచనలో కంపెనీ ఉంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 410 కోట్ల మొత్తాన్ని రుణాలను తీర్చేసేందుకు, రూ. 110 కోట్లను కొత్త ఆస్పత్రి నిర్మాణం, అనుబంధ సంస్థలైన పార్క్ మెడిసిటీ (ఎన్సీఆర్), బ్లూ హెవెన్స్కి చెందిన ప్రస్తుత ఆస్పత్రుల విస్తరణ కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 3,000 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఉత్తరాదిలో పార్క్ మెడి వరల్డ్ రెండో అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్గా కార్యకలాపాలు సాగిస్తోంది. న్యూఢిల్లీ, జైపూర్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో కంపెనీకి 13 మల్టీ–సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఎస్ఐఎస్.. షేర్ల జారీతో రూ. 100 కోట్లు.. క్యాష్ లాజిస్టిక్స్ సేవల సంస్థ ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీవో కింద రూ. 100 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ సంస్థలు ఎస్ఐఎస్ లిమిటెడ్, ఎస్ఎంసీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ 37.15 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. తాజా షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో రూ. 37.59 కోట్లను వాహనాల కొనుగోళ్లు, ఫ్యాబ్రికేషన్కు, రూ. 30 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపరంగా 17–18 శాతం మార్కెట్ వాటాతో పరిశ్రమలో రెండో అతి పెద్ద సంస్థగా ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్ నిలుస్తోంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 530 కోట్ల ఆదాయాన్ని రూ. 39 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సందిగ్ధంలో కొన్ని.. మరోవైపు, ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వర్క్స్పేస్ ఆపరేటర్ వుయ్వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఐపీవో ప్రతిపాదనను సెబీ పక్కన పెట్టింది. ఇందుకు నిర్దిష్ట కారణాలేమీ వెల్లడి కాలేదు. ఇష్యూ కింద ప్రమోటర్ సంస్థ ఎంబసీ బిల్డ్కాన్, 1 ఏరియల్ వే టెనెంట్ అనే ఇన్వెస్టరు 4.37 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద విక్రయించే యోచనలో ఉన్నాయి. అటు ఫెర్టిలిటీ క్లినిక్ చెయిన్ ఇందిరా ఐవీఎఫ్ తమ ఐపీవో ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీవో సన్నాహాల సమయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ మూర్దియాపై బాలీవుడ్ బయోపిక్ విడుదల కావడమనేది ఇష్యూను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని సెబీ అభిప్రాయం వ్యక్తం చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ఐవీఎఫ్ ఐపీవో పత్రాలను దాఖలు చేసిన సుమారు నెల రోజుల్లో మార్చి 21న చిత్రం విడుదలైంది. ఇందులో అనుపమ్ కేర్, ఈషా డియోల్ నటించారు.ఓఎఫ్ఎస్ మార్గంలో స్టడ్స్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించడంపై హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ రెండోసారి కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం 2018లో ఇందుకు సంబంధించి సెబీ నుంచి అనుమతులు పొందినప్పటికీ, అప్పట్లో ముందుకెళ్లలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్, ఇతరత్రా షేర్హోల్డర్లు 77.9 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఐపీవో ద్వారా సమీకరించిన నిధులేమీ కంపెనీకి లభించవు. స్టడ్స్ యాక్సెసరీస్ సంస్థ ’స్టడ్స్’, ’ఎస్ఎంకే’ బ్రాండ్ల కింద టూ–వీలర్ హెల్మెట్లను తయారు చేస్తోంది. అలాగే స్టడ్స్ బ్రాండ్ కింద గ్లవ్స్, హెల్మెట్ లాకింగ్ డివైజ్లు, రెయిన్ సూట్లు వంటి యాక్సెసరీలను ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా 70 పైచిలుకు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికాలో ఓ’నీల్ అనే సంస్థకు, ’డేటోనా’ బ్రాండ్ పేరిట జే స్క్వేర్డ్ అనే సంస్థకు హెల్మెట్లు తయారు చేసి అందిస్తోంది. 2024 సెప్టెంబర్తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ రూ. 285 కోట్ల ఆదాయంపై రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది. పేస్ డిజిటెక్ అదే బాటలో..న్యూఢిల్లీ: టెలికం టవర్, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల విభాగంలో సొల్యూషన్లు అందించే పేస్ డిజిటెక్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావిస్తోంది. తద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. టెలికం మౌలిక సదుపాయాల విభాగంలో సేవలందించే కంపెనీ ఐపీవోకు ముందు రూ. 180 కోట్ల ప్లేస్మెంట్ చేపట్టే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 630 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. 2024 సెప్టెంబర్తో ముగిసిన 6 నెలల్లో రూ. 1,188 కోట్ల ఆదాయం, రూ. 152 కోట్ల నికర లాభం సాధించింది. -
రెండు ఫార్మా కంపెనీల విలీనానికి ఆమోదం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోహ్యాన్స్ లైఫ్సైన్సెస్ను తమ సంస్థలో విలీనం చేసుకునే ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసినట్లు సువెన్ ఫార్మా వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యాలు మరింతగా మెరుగుపడతాయని సువెన్ ఫార్మా చైర్మన్ వివేక్ శర్మ చెప్పారు. ఉమ్మడి సామర్థ్యాల దన్నుతో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్ల ఆదాయం స్థాయికి చేరుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇందులో కాంట్రాక్ట్ డెవలప్మెంట్, మాన్యుఫాక్చరింగ్ సేవల వాటా గణనీయంగా ఉంటుందని పేర్కొన్నారు. -
బ్యాంకులకు రంజాన్ సెలవు లేదా?
ముస్లింలకు పర్వదినమైన రంజాన్ మార్చి 31న వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. అయితే బ్యాంకులకు మాత్రం ఆరోజు సెలవు లేదు. ఎందుకంటే ఆరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి రోజు. ఈ నేపథ్యంలో మార్చి 31న బ్యాంకులు క్లియరింగ్ ఆపరేషన్లో పాల్గొనాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీల అకౌంటింగ్ను సులభతరం చేస్తుంది. పండుగలు, వారాంతపు సెలవులతో సంబంధం లేకుండా దేశం అంతటా ఆదాయపు పన్ను, సీజీఎస్టీ కార్యాలయాలు మార్చి 29 నుండి మార్చి 31 వరకు తెరిచి ఉంటాయి.భారతదేశంలో సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మరుసటి ఏడాది మార్చి 31న ముగుస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏజెన్సీ బ్యాంకులు నిర్వహించే అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో నమోదు చేయాలని ఆర్బీఐ గతంలో పేర్కొంది. ప్రభుత్వ రశీదులు, చెల్లింపులను నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు, శాఖలు మార్చి 31న సాధారణ పని గంటలు ముగిసే వరకు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన ఓవర్ ది కౌంటర్ లావాదేవీల కోసం తెరిచి ఉండాలని అపెక్స్ బ్యాంక్ కోరింది.చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద స్టాండర్డ్ క్లియరింగ్ టైమింగ్స్ మార్చి 31న వర్తిస్తాయని ఆర్బీఐ తాజాగా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను మార్చి 31 నాటికి లెక్కించడానికి వీలుగా మార్చి 31న ప్రభుత్వ చెక్కుల కోసం ప్రత్యేకంగా సీటీఎస్ కింద ప్రత్యేక క్లియరింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సర్క్యులర్లో పేర్కొంది. అన్ని బ్యాంకులు ఈ ప్రత్యేక క్లియరింగ్ ఆపరేషన్లలో పాల్గొనాలని సర్క్యులర్లో ఆదేశించింది. -
అదానీతో పోటీకి వేదాంతా సై!
న్యూఢిల్లీ: మౌలిక రంగ సంస్థ జేపీ అసోసియేట్స్(జేఏఎల్)పై తాజాగా డైవర్సిఫైడ్ గ్రూప్ వేదాంతా దృష్టి పెట్టింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ గ్రూప్ సంస్థ జేఏఎల్ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2024 జూన్ 3న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశాల ప్రకారం జేఏఎల్ దివాలా చట్ట పరిధిలోకి చేరింది. దీంతో దివాలా పరిష్కార చర్యలకు తెరలేచింది.ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్ సైతం ఈవోఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. బిజినెస్లను విడదీయకుండా ఏకమొత్తంగా కంపెనీ(జేఏఎల్)పై దివాలా పరిష్కార ప్రక్రియను చేపట్టేందుకు ఎన్సీఎల్టీ ఈ నెల మొదట్లో ఆదేశించింది. రుణాల బదిలీ 2025 ఫిబవ్రరి 20కల్లా జేఏఎల్ చెల్లించవలసిన రుణాల విలువ రూ. 55,493 కోట్లను దాటింది. చెల్లించవలసిన రుణాలను జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్)కు రుణదాతల కన్సార్షియం బదిలీ చేసినట్లు ఇటీవల జేఏఎల్ వెల్లడించింది. రుణదాతల కన్సార్షియంలో బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యాక్సిస్, కెనరా, పీఎన్బీ, యుకో, బీవోఎం, కరూర్ వైశ్యా, బీవోఐ, ఇండస్ఇండ్, బీవోబీ, ఎగ్జిమ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి.అయితే ఎన్ఏఆర్సీఎల్కు బదిలీ చేసిన రుణాల విలువ వెల్లడికాలేదు. జేఎల్ఎల్ దివాల పరిష్కార ప్రక్రియను నిర్వహించేందుకు భువన్ మదన్ ఎంపికయ్యారు. కాగా.. జేపీ గ్రూప్ సంస్థ జేపీ ఇన్ఫ్రాటెక్ను దివాల ప్రక్రియ ద్వారా ఇంతక్రితం ముంబైకి చెందిన సురక్షా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే. -
ముకేశ్ అంబానీ రూ.1000 కోట్ల ప్రైవేట్ జెట్ ఇదే..
భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ విలాసవంతమైన జీవితం గడుపుతారని అందరికీ తెలుసు. వీరు విలాసవంతమైన నివాసంలో ఉంటూ.. ఖరీదైన కార్లను ఉపయోగిస్తుంటారు. ఇవి కాకుండా ఈయన వెయ్యి కోట్ల రూపాయల ఓ ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారు.ముకేశ్ అంబానీ కొనుగోలు చేసిన ప్రైవేట్ జెట్ బోయింగ్ 737 మ్యాక్స్ 9. దీని విలువ రూ.1000 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన విమానం భారతదేశంలోని ఏ వ్యాపారవేత్త దగ్గరా లేదు. దీంతో అత్యంత ఖరీదైన విమానం కలిగిన వ్యాపారవేత్తగా అంబానీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు.బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్ను.. వాషింగ్టన్లోని రెంటన్లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేసి ఇండియాకు డెలివరీ చేశారు. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ కాస్త ఆలస్యం అయింది. మొత్తానికి అంబానీ భారతదేశపు మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 యజమానిగా నిలిచారు.ఇదీ చదవండి: అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..బోయింగ్ 737 మ్యాక్స్ 9 ప్రైవేట్ జెట్ను ముకేశ్ అంబానీ ప్రేత్యేకంగా తయారు చేసుకున్నారు. ఈ జెట్ మాత్రమే కాకుండా.. బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ERJ-135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేట్ విమానాలు అంబానీ వద్ద ఉన్నాయి. -
మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్కు X అమ్మకం!
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫారమ్ Xను అమ్మకానికి ఉంచారు. అయితే ఆ కొనుగోలు చేస్తున్న కంపెనీ కూడా ఆయనదే కావడం గమనార్హం. మస్క్ ఆధీనంలోని కంపెనీలలో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ'.. సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ప్లాట్ఫారమ్ను సొంతం చేసుకుంది. రెండు కంపెనీలు ఏకీకృతమైనట్లు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.రెండు సంవత్సరాల క్రితం స్థాపించినప్పటి నుంచి.. xAI వేగంగా ప్రపంచంలోని ప్రముఖ AIలలో ఒకటిగా మారింది. X అనేది సోషల్ మీడియా దిగ్గజం. ఇక్కడ 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంపెనీలలో ఒకటిగా రూపాంతరం చెందింది. కాగా ఇప్పడు ఈ సంస్థను ఎక్స్ఏఐ సొంతం చేసుకుంది. ఎక్స్ఏఐ, ఎక్స్ భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మస్క్ పేర్కొన్నారు.ఎక్స్ఏఐ, ఎక్స్ కలయిక ఏఐ సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడుతుంది. వినియోపగదారులకు గొప్ప అనుభవాలను అందించడానికి సంస్థ కృషి చేస్తోందని మస్క్ అన్నారు. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని కూడా వేగవంతం చేయడానికి ఉపయోగపడే వేదికను నిర్మించడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.ఈ కంపెనీలు అన్నీ స్టాక్లతో కూడిన ఒప్పందంలో విలీనం చేయబడుతున్నాయి. ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లు కాగా.. ఎక్స్ విలువ 33 బిలియన్ డాలర్లు. రెండు కంపెనీ కలయికతో 113 బిలియన్ డాలర్ల సంస్థ అవతరించింది.ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రంనిజానికి 2022 చివరలో మస్క్ ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన లావాదేవీల్లో అప్పు కూడా ఉందని తెలుస్తోంది. ఆ మరుసటి సంవత్సరమే ఎక్స్ఏఐ ప్రారంభమైంది. ఇప్పుడు ఏఐలో ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.@xAI has acquired @X in an all-stock transaction. The combination values xAI at $80 billion and X at $33 billion ($45B less $12B debt). Since its founding two years ago, xAI has rapidly become one of the leading AI labs in the world, building models and data centers at…— Elon Musk (@elonmusk) March 28, 2025 -
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
ముంబై: ఇటీవల కొద్ది నెలలుగా ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజాలు షాపింగ్లో బిజీగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. ప్రధానంగా ఆధునికతరం డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చిన్నతరహా కంపెనీలు లక్ష్యంగా షాపింగ్ను చేపడుతున్నాయి. జెన్జెడ్ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్టు కన్జ్యూమర్ బ్రాండ్స్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పరిమిత పంపిణీ వ్యవస్థ, నిధులలేమి కారణంగా పలు కంపెనీలు కార్యకలాపాలను విస్తరించలేకపోతున్నాయి. కొనుగోళ్ల బాటలో దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు హెచ్యూఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ చిన్న సంస్థలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో చిన్నతరహా సంస్థలు తమ ప్రొడక్టులను విస్తారిత మార్కెట్లో పరిచయం చేసేందుకు వీలు కలుగుతోంది. ఇటీవల స్కిన్కేర్ బ్రాండ్ మినిమలిస్ట్ను హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) సొంతం చేసుకోగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్లైన్ డెయిరీను కొనుగోలు చేసింది. హెచ్యూఎల్ తెలంగాణలో పామాయిల్ క్షేత్రాన్ని కొనుగోలు చేసింది. తద్వారా సబ్బులు తదితర ప్రొడక్టుల తయారీలో పామాయిల్ అవసరాలను సర్దుబాటుచేసుకోనుంది. ఈ బాటలో తాజా గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ.. లుక్రో ప్లాస్టిసైకిల్లో వాటా కొనుగోలు చేసింది. తద్వారా భవిష్యత్లో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు తప్పనిసరికానున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ నిబంధనల అమలుకు హెచ్యూఎల్ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. మామాఎర్త్ లిస్టింగ్.. దశలవారీగా 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్న డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ గూటికి.. ఫ్రోజెన్, రెడీటు ఈట్ ఆహార ప్రొడక్టుల కంపెనీ ప్రసుమ చేరనుంది. తొలుత 43.8 శాతం వాటాతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి వాటాను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ.. పురుషుల సౌందర్య పోషక సంస్థ హీలియోస్ లైఫ్స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా చింగ్స్ సీక్రెట్, స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్ను టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ చేజిక్కించుకుంది. తద్వారా ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కాగా.. మామాఎర్త్ బ్రాండ్ ప్రొడక్టుల డీటూసీ కంపెనీ హోనసా కన్జ్యూమర్ డిజిటల్ మార్గంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్లైన్లో విస్తరించడంలో సవాళ్ల కారణంగా వృద్ధి పరిమితమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కంటే ఎఫ్ఎంసీజీ దిగ్గజాల ద్వారా అధిక నిధులు, విస్తరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఇందులేఖను హెచ్యూఎల్ కొనుగోలు చేయడంతో పరిమితస్థాయి నుంచి బయటపడి భారీస్థాయిలో అమ్మకాలు సాధిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మినిమలిస్ట్ ప్రొడక్టులు సైతం వేగవంత వృద్ధి సాధించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు కొంతకాలంగా ప్రత్యేక తరహా చిన్నకంపెనీలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా జెన్జెడ్ వినియోగదారులకూ చేరువ అవుతున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సమ్మె అయినా గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగదు
హైదరాబాద్: సదరన్ రీజియన్ బల్క్ ఎల్పీజీ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్కు చెందిన బల్క్ ఎల్పీజీ రవాణాదారుల సమ్మె నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) తమ ఎల్పీజీ వినియోగదారులకు తగినంత సిలిండర్ సరఫరా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల బాట్లింగ్ ప్లాంట్లలో బల్క్ ఎల్పీజీ నిల్వలు తగినంత ఉన్నాయన్నారు. ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రవాణా టెండర్ను అన్ని ప్రాంతాల ట్రాన్స్పోర్టర్లతో విస్తృత చర్చల తర్వాత తుది రూపం ఇచ్చారన్నారు. ఈ ప్రక్రియలో రవాణాదారుల వివిధ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమైన సందేహాలను నివృత్తి చేసేందుకు వివరణలు ఇచ్చారన్నారు.చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా, గువాహటి నగరాల్లో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశాల ద్వారా వారి అభిప్రాయాలను కూడా కలుపుకున్నారన్నారు. ఈ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు, కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పాటిస్తూ పూర్తిగా పారదర్శకంగా రూపొందించారని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పీఈఎస్ఓ, పీఎన్జీఆర్బీ, ఓఐఎస్డీ వంటి చట్టబద్ధ సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందాయన్నారు. ఎల్పీజీ రవాణా భద్రత, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మా ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త టెండర్ నిబంధనలను తీసుకు వచ్చామన్నారు.ఈ చర్యలు తీసుకున్నప్పటికి కొంతమంది రవాణాదారులు సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. ప్రధానంగా భద్రతా ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఈ భద్రతా సంబంధిత చర్యలు ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు, వినియోగదారులు సహా అన్ని స్టేక్హోల్డర్లకు లాభదాయకంగా ఉంటాయని తెలిపారు. అవి మరింత భద్రతా ప్రమాణాలు కలిగిన, విశ్వసనీయమైన ఎల్పీజీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.మా స్టేక్హోల్డర్ల నుంచి బాధ్యతాయుతమైన చర్యలు, అవగాహనను ఆశిస్తున్నామన్నారు. తద్వారా అవసరమైన భద్రతా ప్రోటోకాల్స్ను పాటిస్తూ ఎల్పీజీ సిలిండర్ల నిరంతర సరఫరాను నిర్ధారించవచ్చన్నారు. రవాణాదారులకు సమ్మెను విరమించాలని, అత్యవసరమైన ఎల్పీజీ సరఫరా నిల్వలను ప్రభావితం చేసే చర్యలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడవచ్చన్నారు.ఓఎంసీలు ప్రధాన రవాణాదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుందన్నారు. త్వరలో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలుగా గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలు తీర్చేందుకు ఎల్పీజీ సరఫరాను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
ఎయిర్బస్ కొత్త విమానాలు వస్తున్నాయ్
వాహన రంగంలో దాదాపు అన్ని సంస్థలు అప్డేట్ వెహికల్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే విమానాయాన రంగంలోని ఎయిర్బస్ మాత్రం దశాబ్దాలుగా చెప్పుకోదగ్గ రీతిలో పెద్ద మార్పులు చేయలేదు. అయితే ఇప్పుడు ఈ సంస్థ రేపటి కోసం (భవిష్యత్తు కోసం) సరికొత్త విమానాలను రూపొందిస్తోంది. టౌలౌస్లో జరిగిన ఎయిర్బస్ సమ్మిట్ 2025లో కొత్త టెక్నాలజీతో రూపొందించనున్న విమానాలను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎయిర్బస్ విమానాలు చాలా ఏళ్లుగా చెప్పుకోదగ్గ మార్పులకు గురి కాలేదు. అయితే రాబోయే రోజుల్లో విమానయాన సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకెళ్లనున్నాయి. కాబట్టి ఎయిర్బస్ తన వేగాన్ని పెంచింది. తదుపరి తరం ఎయిర్బస్ విమానాలలో పక్షుల రెక్కలను అనుకరించే రెక్కలు ఉంటాయి. ఇవి తేలికగా, సన్నగా, పొడవుగా ఉంటాయి.వింగ్ ఆఫ్ టుమారో (WoT) పరిశోధన అండ్ టెక్నాలజీ కార్యక్రమానికి నిలయంగా ఉన్న ఇంగ్లాండ్లోని ఫిల్టన్లోని ఎయిర్బస్ వింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన పని ఆధారంగా, కొత్త రెక్కలు తక్కువ డ్రాగ్ కోసం ఎక్కువ లిఫ్ట్ను ఉత్పత్తి చేస్తాయి. పొడవైన రెక్కలను ఆఫ్సెట్ చేయడానికి ఉపయోగపడతాయికి. ఇవి ఫోల్డ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి.ఎయిర్బస్ కొత్త జెట్ ఇంజిన్ను కూడా ఆవిష్కరించనుంది. ఇది ఇప్పుడున్న వాటికంటే పెద్దవిగా ఉండటమే కాకుండా.. ఇంధన వినియోగాన్ని కూడా 20 శాతం తగ్గిస్తాయి. కొత్త ఇంజిన్లతో పాటు, ఎయిర్బస్ హైబ్రిడైజేషన్ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మరోవైపు కార్బన్-ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ (CFRP) స్థానంలో కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ థర్మోప్లాస్టిక్ పాలిమర్ కాంపోజిట్స్ (CFRTP) ఉపయోగించాలని అనుకుంటోంది.Source: Airbus -
నాన్న ఇచ్చిన గిఫ్ట్.. ప్రపంచంలో టాప్ 10లోకి..
హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా చరిత్ర సృష్టించారు. మహిళల హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు. రూ.3.5 లక్షల కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు.నాన్న గిఫ్ట్హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, తన తండ్రి శివ్ నాడార్ నుంచి 47 శాతం వాటా బదిలీ కావడంతో ఆమె ర్యాంకింగ్స్లో ఎదిగారు. ఈ బదిలీతో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రమోటర్ సంస్థలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (వామ ఢిల్లీ), హెచ్సీఎల్ కార్ప్ నియంత్రణలోకి వచ్చాయి. ఫలితంగా 12 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ దిగ్గజానికి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు రోషిణి నాడార్ మల్హోత్రా చేతిలోకి వచ్చాయి.ఈ బదిలీతో రోష్ని నాడార్ మల్హోత్రా ఇప్పుడు వామా ఢిల్లీ 44.17 శాతం వాటా, హెచ్సీఎల్ టెక్నాలజీస్లో హెచ్సీఎల్ కార్ప్ 0.17 శాతం వాటా, వామా ఢిల్లీ 12.94 శాతం వాటా, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లో హెచ్సీఎల్ కార్ప్ 49.94 శాతం వాటాపై ఓటింగ్ హక్కులపై నియంత్రణ కలిగి ఉన్నారు.వాటాల బదిలీకి ముందు శివ్ నాడార్ కు వామా ఢిల్లీ, హెచ్ సీఎల్ కార్పొరేషన్ రెండింటిలోనూ 51 శాతం వాటా ఉండగా, రోష్ని నాడార్ మల్హోత్రాకు ఈ రెండు సంస్థల్లో 10.33 శాతం వాటా ఉండేది. 2020 జూలైలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్స్గా రోషిణి నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అగ్రశ్రేణి విద్యా సంస్థలను స్థాపించిన శివ్ నాడార్ ఫౌండేషన్ కు ఆమె ట్రస్టీగా కూడా ఉన్నారు. -
బ్రిటన్ వీడనున్న బిలియనీర్?: కారణం ఇదే..
చాలామంది ధనవంతులు పన్ను మినహాయింపులు కల్పించే దేశాలలో స్థిరపడటానికి మక్కువ చూపిస్తారు. ఇప్పటికే కొంతమంది బ్రిటన్లో స్థిరపడ్డారు. అయితే అక్కడి ప్రభుత్వం.. ఇప్పటి వరకు అమలులో ఉన్న 'నాన్-డోమ్' పన్ను విధానాన్ని రద్దు చేసే దిశగా ఆలోచిస్తోంది. ఇదే జరిగితే ప్రముఖ పారిశ్రామికవేత్త 'లక్ష్మీ మిత్తల్' (Lakshmi Mittal) యూకే వీడనున్నారు.నాన్-డోమ్ పన్ను విధానం అమలులో ఉన్నంత వరకు.. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ పన్ను విధానాన్ని రద్దు చేస్తే.. ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. సుమారు రెండు శతాబ్దాలకంటే ఎక్కువ కాలంగా ఈ పన్ను విధానం బ్రిటన్లో అమలులో ఉంది. కానీ ఇప్పుడున్న అక్కడి ప్రభుత్వం ఈ పన్ను విధానానికి మంగళం పాడనుంది.యూకేలో కొత్త పన్ను విధానం అమలులోకి వస్తే, ధనవంతులు.. పన్ను విధించని యూఏఈ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలలో ఎదో ఒకదానికి వెళ్లే అవకాశం ఉంది.లక్ష్మి మిత్తల్ విషయానికి వస్తే.. స్టీల్ టైకూన్గా ప్రసిద్ధి చెందిన ఈయన యూకేలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు. గత సంవత్సరం సండే టైమ్స్ రిచ్ లిస్ట్లో 14.9 బిలియన్ ఫౌండ్లతో ఏడవ స్థానంలో నిలిచారు. ఈయనకు లండన్లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్లో ఒక భవనం, స్విస్ రిసార్ట్ పట్టణం సెయింట్ మోరిట్జ్లో ఒక ఛాలెట్తో సహా యూరప్, యుఎస్, ఆసియా అంతటా విలువైన ఆస్తులు ఉన్నాయి. అంతే కాకుండా ఈయన దుబాయ్ రియల్ ఎస్టేట్లో కూడా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. -
న్యూట్రోజెనా ప్రచారకర్తగా శ్రద్ధా కపూర్
న్యూఢిల్లీ: హెల్త్కేర్ ఉత్పత్తుల సంస్థ కెన్వ్యూ తమ స్కిన్కేర్ బ్రాండ్ న్యూట్రోజెనా కింద కొత్తగా హైడ్రోబూస్ట్ సన్స్క్రీన్ ఎస్పీఎఫ్ 50 ఉత్పత్తిని ఆవిష్కరించింది.శక్తివంతమైన ఫలితాలను అందించేందుకు అధునాతన ఫార్ములేషన్స్తో దీన్ని రూపొందించినట్లు కెన్వ్యూ మార్కెటింగ్ వీపీ మనోజ్ గాడ్గిల్ తెలిపారు. తమ కొత్త ప్రచారకర్తగా బాలీవుడ్ నటి 'శ్రద్ధా కపూర్'ని నియమించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా బ్యూటీ విత్ నో కాంప్రమైజ్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.న్యూట్రోజెనా 'బ్యూటీ విత్ నో కాంప్రమైజ్'లో చేరడంపై శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. నేను ఉపయోగించిన బ్రాండ్ న్యూట్రోజెనాతో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. అందం, చర్మ సంరక్షణ సరళంగా ఉండాలి కానీ ప్రభావవంతంగా ఉండాలి. మహిళలు ఎంతగానో ఉపయోగకరమైన ఉత్పత్తులను అందిస్తూ ముందుకు సాగుతున్న న్యూట్రోజెనాతో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. -
జీతాల పెంపు.. కంపెనీపై ఉద్యోగుల అసంతృప్తి
ఈ సంవత్సరం జీతాల పెంపుపై గూగుల్ ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని, ఇటీవల జరిగిన అన్ని వర్గాల సమావేశంలో వారు ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేసినట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. కంపెనీ బలమైన ఆర్థిక పురోగతిని నమోదు చేసినప్పటికీ.. జీతాల పెరుగుదల మాత్రం స్వల్పంగానే ఉందని పేర్కొన్నారు.మంగళవారం (మార్చి 25) కంపెనీలో జరిగిన ఒక సమావేశంలో జీతాల పెంపు విషయం చర్చకు దారితీసింది. ఇందులో చాలామంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై కంపెనీ గ్లోబల్ కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ వైస్ ప్రెసిడెంట్ 'జాన్ కేసీ' స్పందిస్తూ.. 2025లో 80 శాతం కంటే ఎక్కువ మంది సిబ్బందికి వేతనాలు గత సంవత్సరంతో పోలిస్తే పెరిగాయని అన్నారు.నాన్-టెక్నికల్ విభాగంతో పాటు కొన్ని విభాగాల్లోని వారు మాత్రమే తక్కువ పెంపును పొందినట్లు స్పష్టం చేశారు. తక్కువ పెంపును పొందిన ఉద్యోగులకు.. మరింత మెరుగైన వేతనం అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు జాన్ కేసీ వెల్లడించారు. ఈ పెంపు మంచి పనితీరును కనపరిచినవారిని ప్రోత్సహించేలా ఉంటుందని అన్నారు.ఇదీ చదవండి: ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది 15 రోజులే!.. ఎందుకంటే? -
కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదు
ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటి.. 6,00,000 మంది ఉద్యోగులు.. దాదాపు 46 దేశాల్లో కార్యకలాపాలు.. సృజనాత్మక పనితనానికి పెట్టింది పేరు.. ఐటీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురించి తెలియనివారుండరు. టాటా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రతన్ టాటా, జేఆర్డీ టాటాలు. టీసీఎస్ను స్థాపించడం కూడా వారిలో ఒకరి ఆలోచనే అని చాలామంది అనుకుంటారు. కానీ భారతదేశాన్ని ఐటీ రంగంలో ప్రపంచంలో ముందుంచేలా చేసిన టీసీఎస్ స్థాపన ఆలోచన ఒక పాకిస్థానీదని తక్కువ మందికే తెలిసుంటుంది. ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం.భారత ఐటీ పితామహుడుమార్చి 2025 నాటికి రూ.12.92 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ప్రపంచ ఐటీ పరిశ్రమలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పుట్టుకకు ప్రస్తుతం పాకిస్థాన్కు చెందిన ‘భారత ఐటీ పితామహుడు’గా పిలువబడే ఫకీర్ చంద్ కోహ్లీ అనే వ్యక్తి. ఆయన చేసిన కృషి టీసీఎస్ను ఇండియాలో ఐటీ పవర్ హౌజ్గా మార్చేందుకు కారణమైంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా మారేందుకు తోడ్పడింది.అప్పటి భారత్.. ఇప్పటి పాకిస్థాన్లో పుట్టి..భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు 1924లో (అప్పుడు పాకిస్థాన్ భారత్లోనే ఉండేది) ప్రస్తుత పాకిస్థాన్లోని పెషావర్లో ఫకీర్ చంద్ కోహ్లీ జన్మించారు. అతని విద్యాభ్యాసం లాహోర్లో జరిగింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో డిగ్రీలు పొందారు. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి సిస్టమ్ ఇంజినీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.టీసీఎస్ పుట్టిందిలా..కోహ్లీ 1951లో భారతదేశానికి తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. తాను కంప్యూటర్ ఆధారిత ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను ఆధునీకరించడంలో నిష్ణాతుడు. దాంతో త్వరగా సంస్థలో ఎదిగారు. అతడి వినూత్న విధానాలు అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా దృష్టిని ఆకర్షించాయి. ఆయన కొత్త వెంచర్కు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కోహ్లీలో చూశారు. ఒకరోజు భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనను జేఆర్డీతో పంచుకుంటూ.. అందుకుగల కారణాలను కోహ్లీ విశ్లేషించారు. దాంతో 1968లో టీసీఎస్ ఆవిర్భవించింది. కోహ్లీ దాని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కంపెనీకి తొలి సీఈఓగా నియామకం అయ్యారు.కొత్త శిఖరాలకు టీసీఎస్భారత సాంకేతిక మౌలిక సదుపాయాలు అంతగా లేని సమయంలో సాఫ్ట్వేర్ సర్వీసుల్లో దేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని కోహ్లీ ఊహించారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్ ఒక మోస్తరు కార్యకలాపాల నుంచి దేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా అభివృద్ధి చెందింది. సాఫ్ట్వేర్ ఎగుమతులకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై దేశాన్ని విశ్వసనీయ సంస్థగా నిలిపింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ వంటి దిగ్గజ సంస్థలతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కోహ్లీ వ్యూహాత్మక దూరదృష్టి ఎంతో తోడ్పడింది. ఇది టీసీఎస్ను కొత్త శిఖరాలకు చేర్చింది. 2003 నాటికి కంపెనీ బిలియన్ డాలర్ల(రూ.8,300 కోట్లు) ఆదాయాన్ని సాధించడంలో సహాయపడింది.నాస్కామ్కు అధ్యక్షుడు, ఛైర్మన్గా..భారతదేశం అభివృద్ధి చెందాలంటే బలమైన ఐటీ ఎకోసిస్టమ్ అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశపు ప్రముఖ ఐటీ అడ్వకసీ సంస్థ(న్యాయ కార్యకలాపాలు నిర్వహణ) నాస్కామ్కు 1995-1996 కాలంలో అధ్యక్షుడిగా, ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఐటీ విధానాలను రూపొందించడంలో, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఆర్థిక తారతమ్యాల భారతం!పద్మభూషణ్తో సత్కారంకోహ్లీ ప్రభావం కార్పొరేట్ విజయాలకే పరిమితం కాలేదు. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా భావి నాయకులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. 1999లో పదవీ విరమణ చేసిన తరువాత కూడా వయోజన అక్షరాస్యత, ప్రాంతీయ ల్యాంగ్వేజీ కంప్యూటింగ్ వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైలైట్ చేశారు. 2002లో భారతదేశపు మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్ను అందుకున్నారు. వినియోగదారుల హక్కుల కార్యకర్త, న్యాయవాది స్వర్ణ్ కోహ్లీని వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు సంతానం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చిన ఆయన 2020 నవంబర్ 26న తన 96వ ఏట కన్నుమూశారు. -
తగ్గుముఖం పట్టిన హోమ్ లోన్స్: క్రెడిట్ కార్డుల్లోనూ..
ముంబై: గృహ రుణాలు డిసెంబర్ త్రైమాసికంలో సంఖ్యా పరంగా చూస్తే 9 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 3 శాతం క్షీణించినట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెల్లడించింది. ఎక్కువ రిస్క్తో కూడిన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్లోనూ రుణాల సంఖ్య తగ్గినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది.అన్ సెక్యూర్డ్ రుణాల విషయంలో దూకుడు తగ్గించి, నిదానంగా వెళ్లాలంటూ ఆర్బీఐ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలను కొన్ని త్రైమాసికాలుగా సూచించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అదే సమయంలో సెక్యూర్డ్ రుణ విభాగం, ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తూ, బ్యాంక్లకు కీలకంగా ఉన్న గృహరుణాల్లోనూ స్తబ్దత నెలకొనడాన్ని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.గృహ రుణాల్లో బాకీలు (మొత్తంగా జారీ అయి, తిరిగి వసూలు కావాల్సిన మొత్తం) క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి 15 శాతంగా ఉంటే, అవి 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి 13 శాతానికి తగ్గినట్టు తెలిపింది. రుణ వితరణ పరంగా 2024 అక్టోబర్-డిసెంబర్ కాలం రెండేళ్లలోనే అతి తక్కువ డిమాండ్ను చూసినట్టు పేర్కొంది. మెట్రోల్లో రుణ విచారణలు తగ్గాయి.చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాయి. మొదటిసారి రుణ గ్రహీతలు, ప్రధాన కస్టమర్ల (ఎన్టీసీ)కు రుణ వితరణ 2023 డిసెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంటే, 2024 డిసెంబర్ చివరికి 17 శాతానికి తగ్గింది. ఎన్టీసీ రుణ గ్రహీతల్లో 41 శాతం మంది జెనరేషన్ జెడ్ వారు (1995 తర్వాత జని్మంచిన వారు) కావడం గమనార్హం. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలను వీరు ఎక్కువగా తీసుకున్నారు. -
నెలకు రూ.25,432 స్టైపెండ్తో ఇంటర్న్షిప్
పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో యువ ప్రొఫెషనల్స్కు శిక్షణ కల్పించడంపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో గత మూడేళ్లలో ఇంటర్న్షిప్ అవకాశాలు రెట్టింపు అయినట్లు గ్లోబల్ జాబ్సైట్ ఇండీడ్ ఒక నివేదికలో వెల్లడించింది.ఇండీడ్ తెలిపిన డేటా ప్రకారం 2022 ఫిబ్రవరి నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో దేశీయంగా ఇంటర్న్షిప్ పోస్టింగ్స్ 103 శాతం పెరిగినట్లు తెలిపింది. ఏఐ, డేటా అనలిటిక్స్, డిజిటలీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా ఉద్యోగ విధుల నిర్వహణపరమైన అనుభవాన్ని అందించడంతో పాటు ప్రతిభావంతులను గుర్తించి, వారికి ముందు నుంచే శిక్షణ కల్పించేందుకు కంపెనీలు ఇంటర్న్షిప్లను ఉపయోగించుకుంటున్నాయి.ఇదీ చదవండి: అనిశ్చితులున్నా ఎగుమతులు మిన్నఇంటర్న్షిప్ సెర్చ్లో ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నాయి. మొత్తం సెర్చ్లలో వీటి వాటా వరుసగా 7.2 శాతం, 6.8 శాతం, 6.2 శాతంగా ఉంది. దేశీయంగా సగటున ఇంటర్న్షిప్ స్టైపెండ్ నెలకు రూ.25,432గా ఉంది. అయితే, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గుర్గావ్ వంటి నగరాల్లో సంస్థలు జాతీయ సగటుకు మించి స్టైపెండ్లు అందిస్తున్నాయి. ఈ విషయంలో చెన్నై, కోల్కతా తదితర నగరాలు చివరి వరుసలో ఉన్నాయి. -
ఉద్యోగం–జీవితం...సమతుల్యంపై అసంతృప్తి
ముంబై: ఉద్యోగులు పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకునే విషయంలో సంతృప్తిగా లేనట్టు మానవ వనరుల పరిష్కారాలు అందించే జీనియస్కన్సల్టెంట్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. పని వేళలు సౌకర్యంగా లేకపోవడంతో రెండింటిని సమతుల్యం చేసుకోలేకపోతున్నామని 52 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంతృప్తిని వ్యక్తం చేసిన ఉద్యోగులు 36 శాతమే ఉన్నారు. అంటే ప్రతి ముగ్గురిలో ఒక్కరే ఉద్యోగం–వ్యక్తిగత బాధ్యతల నిర్వహణ పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న 2,763 మంది ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని జీనియస్ కన్సల్టెంట్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ఉద్యోగుల మనోగతం.. → వ్యక్తిగత బాధ్యతల నిర్వహణకు వీలుగా సౌకర్యవంతమైన పనివేళలు/రిమోట్ వర్కింగ్కు (ఉన్నచోట నుంచే పనిచేయడం) యాజమాన్యాలు అనుమతించడం లేదని 40 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. → వ్యక్తిగత జీవితంపై ఉద్యోగ బాధ్యతల తాలూకు ఒత్తిడి ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు 79 శాతం మంది చెప్పారు. మెరుగైన విధానాలు, వ్యవస్థల ఏర్పాటు ద్వారా యాజమాన్యాలు పని ప్రదేశాల్లో ఒత్తిడిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో యాజమాన్యాలు తగినంత వెసులుబాటు ఇస్తున్నట్టు 50 శాతం మంది ఉద్యోగులు చెప్పగా.. 10 శాతం మంది ఏదీ చెప్పలేకున్నారు. → కెరీర్లో పురోగతికి వీలుగా తాము పనిచేసే చోట తగిన అవకాశాల్లేవని 47 శాతం ఉద్యోగులు వెల్లడించారు. → తమ మానసిక ఆరోగ్యం, శ్రేయస్సుకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తే మరింత సంతోíÙస్తామని 89 శాతం ఉద్యోగులు చెప్పారు. → ఉద్యోగం కోసం తాము వెచ్చిస్తున్న సమయం, కృషికి తగ్గ వేతనాలను కంపెనీలు చెల్లించడం లేదని 68 శాతం మంది భావిస్తున్నారు. ఇది పనిలో అసంతృప్తికి దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది. కంపెనీలు సమీక్షించుకోవాల్సిందే.. ‘‘ఉద్యోగులకు సౌకర్యవంతమైన పనివేళలు, కెరీర్లో పురోగతి, మానసిక ఆరోగ్యపరమైన మద్దతు విషయంలో కంపెనీలు తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఈ సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. పని–ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఉద్యోగుల శ్రేయస్సుకే కాకుండా, దీర్ఘకాలంలో కంపెనీ వ్యాపార విజయానికి తోడ్పడుతుంది’’అని జీనియస్ కన్సల్టెంట్స్ చైర్మన్, ఎండీ ఆర్పీ యాదవ్ తెలిపారు. -
ఆసియా కుబేరుల జాబితా విడుదల
ముంబై: ఆసియా కుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఆయన సంపద రూ.లక్ష కోట్ల మేర తరిగిపోయినప్పటికీ.. రూ.8.6 లక్షల కోట్ల నికర సంపదతో మొదటి స్థానాన్ని కాపాడుకున్నారు. కానీ, ప్రపంచ టాప్–10లో స్థానాన్ని కోల్పోయారు. ఇదే కాలంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద 13 శాతం పెరిగి (రూ.లక్ష కోట్లు) 8.4 లక్షల కోట్లకు చేరుకోవడంతో ముకేశ్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది కాలంలో సంపదను ఎక్కువగా పెంచుకున్నది అదానీయే కావడం గమనార్హం. గత ఏడాది కాలంలో 13 మంది బిలియనీర్లు దేశంలో కొత్తగా పుట్టుకొచ్చారు. మొత్తం బిలియనీర్లు (బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువ సంపద) 284 మంది కాగా, వీరి ఉమ్మడి సంపద ఏడాది కాలంలో 10 శాతం పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరుకుంది. దేశ జీడీపీలో వీరి సంపద మూడింట ఒక వంతుగా ఉంది. ఈ వివరాలతో హరూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ (కుబేరుల జాబితా) 2025 విడుదలైంది. వీరి సంపద లెక్కింపునకు ఈ ఏడాది జనవరి 15ను కటాఫ్ తేదీగా హరూన్ పరిగణనలోకి తీసుకుంది. → హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ రూ.3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితాలోకి తొలిసారి వచ్చి చేరారు. కంపెనీలో 47 శాతం వాటాను ఆమె పేరిట తండ్రి శివ్నాడార్ బదిలీ చేయడం ఇందుకు దారితీసింది. ప్రపంచంలో టాప్–10 మహిళా కుబేరుల్లో 5వ స్థానం సొంతం చేసుకుని, ఈ గుర్తింపు సాధించిన తొలి భారత మహిళగా నిలిచారు. → రేజర్పే సహ వ్యవస్థాపకులైన శశాంక్ కుమార్ (34), హర్షిల్ మాథుర్ (34) చెరో రూ.8,463 కోట్ల నెట్వర్త్తో భారత్లోనే యువ బిలియనీర్లుగా ఈ జాబితాకెక్కారు. → సంపద అంతా కొద్ది మంది చేతుల్లోనే బందీ అవుతోందన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. ఒక్కో బిలియనీర్ సగటు సంపద (రూ.34,514 కోట్లతో) విషయంలో భారత్ ప్రపంచంలో ముందుంది. రెండో స్థానంలో ఉన్న చైనాలో ఒక్కో బిలియనీర్ సగటు సంపద విలువ రూ.29,027 కోట్లు. → గడిచిన ఏడాది కాలంలో 175 మంది భారతీయ బిలియనీర్ల సంపద నికరంగా పెరగ్గా.. 109 మంది సంపద అంతకు ముందు ఏడాదితో పోల్చితే తగ్గింది. → అత్యధికంగా 90 మందితో దేశంలో బిలియనీర్ల రాజధానిగా ముంబై నిలిచింది. కానీ, 92 మంది బిలియనీర్లతో ఆసియాలో బిలియనీర్ల రాజధానిగా షాంఘై నిలిచింది. 129 మంది బిలియనీర్లతో ప్రపంచ రాజధానిగా న్యూయార్క్ వరుసగా రెండో ఏడాది తన స్థానాన్ని కాపాడుకుంది. → టెస్లా సీఈవో ఎలాన్మస్క్ 420 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా నిలిచారు. → అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ 266 బిలియన్ డాలర్లతో, మెటా చీఫ్ జుకెర్బర్గ్ 242 బి.డాలర్లతో ప్రపంచంలో 2,3 స్థానాల్లో ఉన్నారు. → ఈ ఏడాది హరూన్ ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్కు 18వ ర్యాంక్ లభిస్తే, అదానీ 27వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. → 870 మంది బిలియనీర్లతో అమెరికా ప్రపంచ కుబేరుల కేంద్రంగా నిలిస్తే, 823 మందితో చైనా రెండో స్థానంలో ఉంది. → మొత్తం 9 మంది భారత మహిళలకు ప్రవేశం లభించగా, వీరి ఉమ్మడి సంపద రూ.9 లక్షల కోట్లు. -
అమెరికా ఎంబసీ షాక్.. భారత్లో 2 వేల వీసా దరఖాస్తులు రద్దు
భారత్లోని యూఎస్ ఎంబసీ ఇటీవల వేల సంఖ్యలో వీసా దరఖాస్తులను రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాలను నిరోధించే చర్యల్లో సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా కొత్త ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాన్ని చేపట్టింది. కారణం ఇదే.. వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్లో అవకతవకలపై యూస్ ఎంబసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా "బ్యాడ్ యాక్టర్స్" (అక్రమార్కలు) లేదా బాట్స్ (మెషీన్లు) ద్వారా అపాయింట్మెంట్ సిస్టమ్లో జరుగుతున్న ఉల్లంఘనల గుర్తించిన రాయబార కార్యాలయం ఆయా ఖాతాలను సస్పెండ్ చేసింది. ఇలా చేసిన సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. తక్షణమే ఈ నియామకాలను రద్దు చేస్తున్నామని, అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నామని పేర్కొంది.భారతీయులే ఎక్కువవిద్య, ఉద్యోగం, పర్యాటకం.. ఇలా వివిధ పనుల కోసం యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించే అతి ఎక్కువ మందిలో భారతీయులు ప్రముఖంగా ఉంటున్నారు. భారత్ లో అమెరికా వీసా దరఖాస్తులు గణనీయంగా బ్యాక్ లాగ్ లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బీ1, బీ2 దరఖాస్తుదారుల్లో జాప్యం ఎక్కువ ఉంటోంది. ఈ వీసాలు వ్యాపారం, పర్యాటకం కోసం ఉద్దేశించినవి. 2022-23లో దరఖాస్తు చేసుకున్నవారు 800 నుంచి 1000 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.ఇలాంటి సుదీర్ఘ నిరీక్షణ సమయాన్ని ఎదుర్కోవడానికి, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, థాయ్ రాజధాని బ్యాంకాక్లో భారతీయ దరఖాస్తుదారులకు అమెరికా వీసా అపాయింట్మెంట్లను తెరిచింది. వీసా వెయిటింగ్ టైమ్ గురించి భారత ప్రభుత్వం ఎప్పకప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. 2022లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో వీసా జాప్యంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అప్పటి బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇటీవల జనవరిలో వాషింగ్టన్ వెళ్లిన జైశంకర్ కొత్త విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. -
రక్షణ మంత్రిత్వ శాఖతో భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఒప్పందం
భారత్ ఫోర్జ్ లిమిటెడ్, దేశీయంగా అభివృద్ధి చేసిన 184 అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్ (ATAGS) సరఫరా కోసం రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 4,140 కోట్ల విలువైన ఈ ఒప్పందం.. 155mm/52 క్యాలిబర్ ఆర్టిలరీ సిస్టమ్ కోసం మొత్తం రూ. 6,900 కోట్ల సేకరణ కార్యక్రమంలో 60 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది.భారత్ ఫోర్జ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ 'బాబా కళ్యాణి', రక్షణ తయారీలో ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు నిదర్శనంగా ఈ ఒప్పందం జరిగిందని అన్నారు. ఈ ఒప్పందం రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాబా కళ్యాణి మాట్లాడుతూ, ఇది కంపెనీకి గర్వకారణమైన క్షణం అని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అనే దార్శనికతకు ఇది నిదర్శనం. రక్షణ మంత్రిత్వ శాఖ, భారత సైన్యం, డీఆర్డీఓ, ఏఆర్డీఈ, భారత్ ఫోర్జ్లోని మా బృందం వారి అమూల్యమైన ప్రయత్నాలు.. సహకారాన్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని అన్నారు.#MoD has signed contracts with #BharatForge Limited and #Tata Advanced System Limited for the procurement of 155mm/52 Calibre Advanced Towed Artillery Gun Systems (#ATAGS) and High Mobility Vehicle 6x6 Gun Towing Vehicles respectively at a total cost of about Rs 6,900 crore.… pic.twitter.com/3keBkqh2e8— Defence Production India (@DefProdnIndia) March 26, 2025 -
‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’కు సుంకాలతో ముప్పు
భారత్కు ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’ అనే బిరుదును తెచ్చిపెట్టిన ఇండియా ఫార్మా రంగానికి అమెరికా పరస్పర సుంకాల ముప్పు పొంచి ఉందని హెటిరో గ్రూప్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు బి.పార్థసారధిరెడ్డి పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఔషధాలపై భారత్ ప్రస్తుతం 10 శాతం దిగుమతి సుంకం విధిస్తుండగా, అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ ఔషధాలపై ఎలాంటి సుంకాలు విధించడం లేదు. యూఎస్ ప్రభుత్వం ఈ అంతరాన్ని పూడ్చేందుకు సుంకాలు విధిస్తే భారత్కు నష్టం కలుగుతుందన్నారు.2023-24లో భారత మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అమెరికా 31 శాతం లేదా 9 బిలియన్ డాలర్లు (రూ.74,000 కోట్లు) వాటాను కలిగి ఉందని పార్థసారధిరెడ్డి తెలిపారు. అమెరికా ఏవైనా పరస్పర సుంకాలు భారతీయ ఫార్మా ఉత్పత్తులపై విధిస్తే పోటీతత్వాన్ని తగ్గించడంతోపాటు అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమకు నష్టం చేకూరుతుందన్నారు. దీని వల్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. ధరల పెరుగుదల భారత ఫార్మా కంపెనీలకు, ముఖ్యంగా తక్కువ ధరలకు లభించే జనరిక్ మందుల మార్కెట్ వాటాను కోల్పోవడానికి దారితీస్తుందని చెప్పారు. దీనివల్ల లాభాల మార్జిన్లు తగ్గుతాయని, అనేక పెట్టుబడులు లాభసాటిగా ఉండవన్నారు.సామరస్య పరిష్కారానికి చర్యలు‘భారత ఫార్మా రంగం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గణనీయంగా దోహదం చేస్తోంది. ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులకు అంతరాయం ఏర్పడితే విదేశీ ఇన్వెస్టర్ల ఆదాయాలు తగ్గుతాయి. ఫార్మా పరిశ్రమతో ముడిపడి ఉన్న తయారీ, పరిశోధన, పంపిణీ, ఇతర రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదుర్చుకోవాలి. ప్రపంచ పోటీతత్వాన్ని కొనసాగించడానికి, ప్రపంచవ్యాప్తంగా సరసమైన మందులను సరఫరా చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ఫార్మా కంపెనీలకు సబ్సిడీలు, పన్ను మినహాయింపుల ద్వారా భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతును అందించాలి’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్పై యూఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా..?బడ్జెట్లోనే కీలక నిర్ణయంఅమెరికా నుంచి ఏటా ఫార్మా దిగుమతులు ప్రస్తుతం 800 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నందున అమెరికా ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను సున్నాకు తగ్గించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ (ఐపీఏ) ఇప్పటికే ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలి బడ్జెట్లో ఇప్పటికే అనేక కీలక ఔషధాలపై దిగుమతి సుంకాన్ని తొలగించారు. -
నోటీసు లేకుండానే వందల ఉద్యోగాలు కట్
ప్రస్తుత ఏడాదిలోనూ చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా జొమాటో కూడా చేరింది. దీనికి సంబంధించినా ఒక సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే.. 300 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా తొలగించారని, జొమాటో మాజీ ఉద్యోగి ఆరోపించారు. మంచి పర్ఫామెన్స్, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ నన్ను కూడా కంపెనీ తొలగించిందని బాధితుడు పేర్కొన్నాడు. అయితే గత మూడు నెలలలో 28 నిమిషాలు ఆలస్యమైన కారణంగా తొలగించినట్లు మాజీ ఉద్యోగి చెప్పుకొచ్చాడు.జొమాటో లేఆఫ్స్ ప్రభావం కేవలం నా మీద మాత్రమే కాదు, సుమారు 300 మందిపై ప్రభావం చూపిందని మాజీ ఉద్యోగి / బాధితుడు పేర్కొన్నాడు. పనిలో ఏమైనా లోపం ఉంటే.. దాన్ని సరిచేసుకోవడానికి సంస్థ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. మేము చేసిన కృషి, మేము అందించిన ఫలితాలు కంపెనీ పట్టించుకోలేదు. ఒక్కసారిగా వందల మందిని బయటకు పంపింది.జొమాటో తన నేడు ఈ స్థాయిలో ఉందంటే.. దీనికి కారణం సంస్థ కోసం పనిచేస్తున్న ఉద్యోగులే అని చెప్పవచ్చు. అలంటి ఉద్యోగులనే సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండానే ఉద్యోగంలో నుంచి తీసేయడం అనేది బాధాకరం అని బాధితుడు పేర్కొన్నాడు. చాలా కంపెనీలు ఉద్యోగులను వ్యక్తులుగా కాకుండా.. కేవలం సంఖ్యగా మాత్రమే చూస్తున్నాయని అన్నాడు.ఇదీ చదవండి: వరుసగా తగ్గి.. మళ్ళీ పెరిగిపోతున్న బంగారం ధరలుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెడ్దిట్ పోస్టు మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జొమాటో తీసుకున్న ఈ నిర్ణయం 300 మందిపై ప్రభావం చూపిందని అన్నారు. కంపెనీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేఖంగా పోరాటం చేయండని మరొకరు సలహా ఇచ్చారు. -
ఎయిర్టెల్ కీలక నిర్ణయం: ముందుగానే..
న్యూఢిల్లీ: గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంనకు సంబంధించి అదనంగా రూ. 5,985 కోట్ల మొత్తాన్ని టెల్కో భారతి ఎయిర్టెల్, దాని అనుబంధ సంస్థ భారతి హెక్సాకామ్ చెల్లించాయి. రుణాలు, వడ్డీ వ్యయాల భారాన్ని తగ్గించుకుని, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో భాగంగా ఈ మేరకు చెల్లించినట్లు ఎయిర్టెల్ తెలిపింది.దీనితో అధిక వడ్డీ భా రం ఉండే స్పెక్ట్రం బాకీలకు సంబంధించి ఎయిర్టెల్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,981 కోట్లు, ఇప్పటివరకు మొత్తం రూ. 66,665 కోట్లు చెల్లించినట్లయింది. ముందస్తుగా చెల్లించిన మొత్తం లయబిలిటీలపై సగటు వడ్డీ రేటు 9.74 శాతంగా ఉంది. అటు మరో అనుబంధ సంస్థ నెట్వర్క్ ఐ2ఐ కూడా 1 బిలియన్ డాలర్ల పర్పెచ్యువల్ డెట్ సెక్యూరిటీలను చెల్లించేసింది. కంపెనీ వీటిని 2020లో జారీ చేసింది. -
మరో కంపెనీపై అదానీ కన్ను
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ తాజాగా మౌలిక రంగ సంస్థ జేపీ అసోసియేట్స్(జేఏఎల్)పై దృష్టి పెట్టింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా జేపీ గ్రూప్ సంస్థ జేఏఎల్ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2024 జూన్3న జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) అలహాబాద్ బెంచ్ ఆదేశాల ప్రకారం జేఏఎల్ దివాల చట్ట పరిధిలోకి చేరింది. దీంతో దివాలా పరిష్కరా చర్యలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంబుజా వంటి కంపెనీల్లో అదానీ గ్రూప్ వాటాలు పెంచుకుంది.బిజినెస్లను విడదీయకుండా ఏకమొత్తంగా కంపెనీ(జేఏఎల్)పై దివాల పరిష్కార ప్రక్రియను చేపట్టేందుకు ఎన్సీఎల్టీ ఈ నెల మొదట్లో ఆదేశించింది. 2025 ఫిబవ్రరి 20కల్లా జేఏఎల్ చెల్లించవలసిన రుణాల విలువ రూ. 55,493 కోట్లను దాటింది. చెల్లించవలసిన రుణాలను జాతీయ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ(ఎన్ఏఆర్సీఎల్)కు రుణదాతల కన్సార్షియం బదిలీ చేసినట్లు ఇటీవల జేఏఎల్ వెల్లడించింది. రుణదాతల కన్సార్షియంలో బ్యాంకింగ్ దిగ్గజాలు ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, యాక్సిస్, కెనరా, పీఎన్బీ, యుకో, బీవోఎం, కరూర్ వైశ్యా, బీవోఐ, ఇండస్ఇండ్, బీవోబీ, ఎగ్జిమ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి. అయితే ఎన్ఏఆర్సీఎల్కు బదిలీ చేసిన రుణాల విలువ వెల్లడికాలేదు. జేఎల్ఎల్ దివాల పరిష్కార ప్రక్రియను నిర్వహించేందుకు భువన్ మదన్ ఎంపికయ్యారు. కాగా.. జేపీ గ్రూప్ సంస్థ జేపీ ఇన్ఫ్రాటెక్ను దివాల ప్రక్రియ ద్వారా ఇంతక్రితం ముంబైకి చెందిన సురక్షా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం విదితమే.ఇదీ చదవండి: ఐటీ షేర్లకు ఏమైంది?యూకే అండ్ కోతో రీపోస్ మ్యాట్రెస్ ఒప్పందంహైదరాబాద్: మిడ్–టు–ప్రీమియం పరుపుల తయారీ సంస్థ రీపోస్ మ్యాట్రెస్.. కుటుంబ వ్యాపార సలహా సంస్థ ‘యూకే అండ్ కో’తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వ్యాపార అభివృద్ధి, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఒప్పందాన్ని చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది. యూకే అండ్ కో సంస్థ విలువైన సలహాలు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయని రీపోస్ మ్యాట్రెస్ మేనేజింగ్ డైరెక్టర్ బాలచందర్ ఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒప్పంద కార్యక్రమంలో యూకే అండ్ కో వ్యవస్థాపకుడు ఉల్లాస్ కామత్, రీపోస్ మ్యాట్రెస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామనాథ్ భట్ ఇతర అధికారులు పాల్గొన్నారు.