breaking news
Corporate
-
అనిల్ అంబానీకి భారీ విజయం
చాలా ఏళ్ల తర్వాత అనిల్ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డ్ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో కంపెనీ పేర్కొంది.రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు‘ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్ ఇన్ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఏమిటీ వివాదం?రిలయన్స్ ఇన్ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.ఆర్ఇన్ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్ఫ్రా ప్రతిస్పందనను కోరింది.విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్ఇన్ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది. -
రైలు టిక్కెట్లపై 45 శాతం సబ్సిడీ
మన దేశంలో అత్యంత చవకైన ప్రజారవాణా అంటే రైల్వేలే! సుదూర ప్రాంతాలకు కూడా చాలా తక్కువ ఖర్చుతో తీసుకెళ్తాయి. ప్రయాణికుల కోసం రైలు సర్వీసులను కూడా ఏటా పెంచుతూ వస్తోంది రైల్వే శాఖ. ఈ క్రమంలో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఏటా కొన్ని వేల కోట్ల రూపాయల సబ్సిడీని అందిస్తోంది.ఉదాహరణకు ప్యాసింజర్ రైళ్లు అందిస్తున్న సేవ విలువ రూ.100 అనుకుంటే, టిక్కెట్టు ధర రూ.55 మాత్రమే. మిగతా 45% సబ్సిడీ రైల్వే శాఖే భరిస్తోంది. మరోపక్క రైలు ప్రయాణాల్లో భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేసే ఖర్చు ఏటా పెరుగుతోంది.కొన్ని గణాంకాలు2019–20లో దేశంలో రోజుకు సగటున నడిచిన ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,169.2024–25లో ఈ ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 13,940.2025–26లో... 2025 జూలై వరకు ప్రారంభమైన కొత్త రైలు సర్వీసులు 86దేశంలో 2025 ఆగస్ట్ 7 నాటికి నడుస్తున్న వందేభారత్ రైళ్లు 1442023–24లో ప్యాసింజర్ టిక్కెట్ల మీద ఇచ్చిన మొత్తం సబ్సిడీ రూ. 60,466 కోట్లురైలు ప్రయాణాలు, స్టేషన్లలో భద్రతకు సంబంధించి 2023–24లో రైల్వే శాఖ చేసిన వ్యయం రూ. 1,14,022 కోట్లు -
స్టాక్ మార్కెట్లో నిండా మునిగాడు.. ఇప్పుడు రూ.2.4 కోట్ల వేతనం!
జీవితమంటేనే కష్టాలు, కన్నీళ్లు. వీటికి భయపడకుండా పట్టుదలతో కృషి చేస్తేనే.. సక్సెస్ సాధ్యమవుతుంది. దీనిని నిరూపించినవాళ్ల గురించి గతంలో చాలానే తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా ఇదేకోవకు చెందిన మరో వ్యక్తి గురించి.. అతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం.2008లో ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి స్టాక్ మార్కెట్లో సర్వసం కోల్పోయాడు. కానీ కొడుకు దశాబ్దానిపైగా కృషి చేసి.. కెరీర్ను అద్భుతంగా నిర్మించుకున్నాడు. ఏడాదికి రూ. 2.4 కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఢిల్లీలో మధ్య తరగతిలో పుట్టి పెరిగిన ఆ వ్యక్తి (కొడుకు).. ప్రారంభ జీవితం చాలా సాఫీగా సాగింది. అయితే 2008లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ చదువుకునే రోజుల్లోనే.. పాఠశాలలో నాటకాలు, డ్యాన్స్ ఇతర కార్యకలాపాలలో పాల్గొనేవాడు. ఇంటర్మీడియట్లో సైన్స్ ఎంచుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో తన బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.చదువు పూర్తయిన తరువాత 2014లో నెలకు రూ. 35,000 జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 2016లో తన స్నేహితురాలికి దగ్గరగా ఉండాలని ఉద్యోగం మారాడు. అప్పుడు అతని జీతం రూ. 60,000లకు పెరిగింది. 2017లో మరొక ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతని జీతం రూ. 90,000లకు చేరింది. ఐదేళ్లు అదే కంపెనీలు ఉంటూ.. 2021 నాటికి నెలకు రూ. 2 లక్షల జీతం సంపాదించే స్థాయికి ఎదిగాడు.ఇదీ చదవండి: వెండి నగలు కొంటున్నారా?: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!2022లో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ఆఫర్ వచ్చింది. అక్కడ అతని వార్షిక వేతనం 202000 డాలర్లు (రూ.1.7 కోట్ల కంటే ఎక్కువ). 2025 నాటికి అతని వేతనం రూ. 2.4 కోట్ల కంటే ఎక్కువ అయింది. కేవలం రూ. 35000 జీతంతో మొదలైన వ్యక్తి.. రూ.2.4 కోట్ల వేతనం వరకు ఎదిగాడంటే.. దాని వెనుక అతని శ్రమ ఎంత ఉంటుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఉద్యోగం చేసే సమయంలో.. జీవితాన్ని ఆస్వాదించడం కొనసాగించారు. మొత్తం నాలుగు ఖండాల్లో 17 దేశాలు ప్రయాణించాడు. తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పుడు ఎడ్ల బండిలో ప్రయాణించిన ఇతడు.. లగ్జరీ విమానాలలో ప్రయాణించే వరకు ఎదిగాడు. డబ్బు ఒక నిర్దిష్ట స్థాయి వరకు ముఖ్యమైనదని, కానీ దానికి మించి, ఆరోగ్యం, సంబంధాలు, అనుభవాలు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వ్యక్తి చెబుతాడు. జీవితంలో ఏ దశలోనైనా డబ్బు సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి పొందలేమని పేర్కొన్నారు. -
అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం: ఇండిగో
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిన వెంటనే చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇండిగో సిద్ధమవుతోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కొవిడ్-19 పరిణామాల కారణంగా 2020 ప్రారంభంలో నిలిపివేసిన చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆంక్షలకు ముందు ఈ సంస్థ న్యూఢిల్లీ నుంచి చెంగ్డూ, కోల్కతా-గ్వాంగ్ జౌ మధ్య రోజువారీ సర్వీసులను నడిపేది.ద్వైపాక్షిక ఒప్పందంపై ఆశలు..ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పునరుద్ధరించడానికి భారత్, చైనాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, అధికారిక అనుమతులు ఇంకా ఖరారు కాలేదు. ప్రత్యక్ష సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గాలను అన్వేషించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. కొవిడ్-19కు ముందు తాము చైనాకు విమానాలు నడిపేవారమని, ప్రభుత్వం ఒక ఒప్పందానికి వస్తే వాటిని పునప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్బర్స్ చెప్పారు. 2020 ప్రారంభం నుంచి భారతదేశం-చైనా మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ లేదు. ఆ ఏడాది చివర్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది దౌత్య, ఆర్థిక సంబంధాలపై ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం భారతదేశం-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుంచి చైనాకు వెళ్లాల్సి ఉంటుంది.ప్రధాన సమస్యప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భారత విమానయాన సంస్థలపై చైనా విధించిన విమాన ఛార్జీల నిబంధనల అంశం ప్రాధానమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తూ, అధిక ధరల స్వేచ్ఛ కోసం భారత్ ఒత్తిడి తెస్తోంది. చైనాలో తమ గత నిర్వహణ అనుభవాలపై భారత ప్రభుత్వం విమానయాన సంస్థల నుంచి ఫీడ్బ్యాక్ కోరిందని సీనియర్ అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వంఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే భారత విమానయాన మార్కెట్లోకి చైనీస్ చౌక ధరల విమానయాన సంస్థల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇది ద్వైపాక్షిక పర్యాటకం, వ్యాపార ప్రయాణాన్ని పెంచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం ఐదేళ్ల విరామం తర్వాత ఇటీవల చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. -
మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వం
అమెరికా బహుళజాతి సంస్థ ఒరాకిల్ తన క్లౌడ్ యూనిట్లో ఉద్యోగాలను తొలగిస్తోందని బ్లూమ్బర్గ్ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మేరకు కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. తమ కొలువులు కోల్పోయామని కొందరు ఉద్యోగులు సైతం చెప్పినట్లు బ్లూమ్బర్గ్ తెలిపింది. అయితే ఎంతమందికి లేఆఫ్స్ ఇచ్చారో మాత్రం తెలియరాలేదు. ఈ విషయంపై కంపెనీ అధికారులు స్పందిస్తూ ఈ లేఆఫ్స్ పూర్తిగా పనితీరుపై ఆధారపడినవేనని చెప్పారు.వ్యూహాత్మక మార్పులు, పునర్వ్యవస్థీకరణలు, ఉద్యోగుల పనితీరు కారణంగా తమ సిబ్బంది సంఖ్యలో మార్పులు చేస్తామని ఒరాకిల్ జూన్ ఫైలింగ్లోనే చెప్పింది. చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు విభిన్న కారణాలతో లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు, పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడానికి మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమెజాన్, మెటా ప్లాట్ఫామ్స్ వంటి కంపెనీలు కూడా కృత్రిమ మేధ అభివృద్ధికి ఎక్కువ ఖర్చు చేస్తుండడంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?గత నెలలో అమెరికాలో 4.5 గిగావాట్ల డేటా సెంటర్ పవర్ కోసం ఓపెన్ఏఐ ఓరాకిల్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒరాకిల్ డేటా సెంటర్ల నుంచి భారీ మొత్తంలో కంప్యూటింగ్ పవర్ను అద్దెకు తీసుకునేందుకు ఓపెన్ఏఐ అంగీకరించింది. తర్వాత ఒరాకిల్ స్టాక్ ఆల్టైమ్ గరిష్టానికి దగ్గరగా చేరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల్లో 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒరాకిల్ సాఫ్ట్బ్యాంక్ గ్రూప్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ లేఆఫ్స్ తరుణంలో ఉద్యోగులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుని, మెరుగైన పనితీరు కనబరచాలని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు ఏఐపై ఆధారపడబోతోందని స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన స్కిల్స్పై ఎక్కువ దృష్టి సారించాలని చెబుతున్నారు. -
భారత మార్కెట్పై మరింత ఫోకస్
బెంగళూరు: దీర్ఘకాలికంగా తమ వ్యాపార వృద్ధికి భారత మార్కెట్ గణనీయంగా దోహదపడుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి మార్కెట్పై మరింతగా దృష్టి పెడుతోంది. భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ సమీర్ కుమార్ ఈ విషయాలు వెల్లడించారు. భారత్లో తమ కార్యకలాపాలకు సంబంధించి మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకునేందుకు అమెజాన్ ఈ ఏడాది రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ కార్యకలాపాలు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని కుమార్ చెప్పారు. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ పెరగడానికి మరింతగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ఇక్కడ యూజర్లు ఆన్లైన్లో ఉత్పత్తులు కొంటున్నారు. వీడియోలను వీక్షిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ పెరిగేందుకు ఇంకా భారీగా అవకాశాలున్నాయి. దాదాపు వంద కోట్ల మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. కానీ 10 కోట్ల మంది మాత్రమే ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేము మరో 20 కోట్ల మందికి చేరువ కావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని కుమార్ చెప్పారు. ఎకానమీ పెరిగే కొద్దీ వినియోగం కూడా పెరుగుతుందన్నారు. చిన్న పట్టణాల్లో అవకాశాలు.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఆన్లైన్ షాపింగ్ చేసే వారు పెరుగుతున్నారని కుమార్ చెప్పారు. ఇటీవల ముగిసిన ప్రైమ్ డే గణాంకాలు చూస్తే కొత్త, పాత ప్రైమ్ కస్టమర్లలో 70 శాతం మంది చిన్న పట్టణాల నుంచే ఉన్నారని వివరించారు. ఈ నేపథ్యంలో, ఈ ప్రాంతాల్లో ఆన్లైన్ షాపింగ్ పెరిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ చెప్పారు. వారు ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు, మెరుగైన డీల్స్ను .. వేగవంతమైన డెలివరీలను పొందేందుకు అనువైన పరిస్థితులు కలి్పంచడంపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. క్విక్ కామర్స్కి మంచి స్పందన.. ఇటీవల బెంగళూరు, ఢిల్లీలో ప్రవేశపెట్టిన క్విక్ కామర్స్ కార్యకలాపాలకు విశేష స్పందన లభిస్తోందని కుమార్ చెప్పారు. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని వివరించారు. పోటీపై స్పందిస్తూ, మార్కెట్లో ఎన్ని సంస్థలున్నా అంతిమంగా కస్టమర్లకు ఎంత మెరుగ్గా సరీ్వసులు అందిస్తున్నామనే అంశమే కీలకంగా ఉంటుందని కుమార్ చెప్పారు. -
కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్పై సెబీ వేటు
న్యూఢిల్లీ: కంపెనీ ఖాతాలను వండి వార్చడం, నిధుల మళ్లింపు చర్యలకు పాల్పడిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్, మరో నలుగురిపై సెబీ కఠిన చర్యలకు దిగింది. ఐదేళ్ల పాటు సెక్యూరిటీల మార్కెట్లలోకి ప్రవేశించకుండా వీరిపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. లిస్టెడ్ కంపెనీల్లో ఎలాంటి పదవులూ చేపట్టకుండా నిషేధించింది. అలాగే రూ.120 కోట్ల పెనాల్టీని విధించింది. కపిల్, ధీరజ్తోపాటు డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాకేశ్ వాధ్వాన్, మాజీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సారంగ్ వాధ్వాన్, మాజీ జాయింట్ ఎండీ, సీఈవో హర్షిల్ మెహతా, మాజీ సీఎఫ్వో సంతోష్ శర్మపై ఈ చర్యలు ప్రకటించింది. 181 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. 2006 నుంచి డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు, కీలక పదవుల్లో ఉన్న వారు మోసపూరితంగా కంపెనీ నిధులను ప్రమోటర్లకు చెందిన ‘బాంద్రా బుక్ ఎంటిటీస్’(బీబీఈలు)కు బదిలీ చేసినట్టు.. 2019 మార్చి 31 నాటికి బీబీఈలకు డీహెచ్ఎఫ్ఎల్ మంజూరు చేసిన రుణాలు రూ.14,040 కోట్లకు చేరినట్టు సెబీ తేల్చింది. ఎలాంటి వ్యాపారం, ఆస్తుల్లేని ప్రమోటర్ల సంస్థలకు పెద్ద ఎత్తున అన్సెక్యూర్డ్ రుణాలను మంజూరు చేశారని.. ఇందుకు ఎలాంటి ముందస్తు మదింపు విధానాలను అనుసరించలేదని గుర్తించింది. పైగా వీటిని రిలేటెడ్ పార్టీ లావాదేవీలుగా కాకుండా రిటైల్ హౌసింగ్ రుణాలుగా పేర్కొన్నట్టు తేలింది. ఆయా సంస్థలు (బీఈఈలు) రుణాలపై వడ్డీ చెల్లించకపోయినప్పటికీ.. కల్పిత వడ్డీ ఆదాయాన్ని చూపిస్తూ 2007–08 నుంచి 2015–16 మధ్య కాలంలో నష్టాలకు బదులు లాభాలు పెరుగుతున్నట్టు చూపించారని సెబీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 39 బీఈఈలకు ఇచ్చిన రూ.5,662 కోట్ల రుణాల్లో.. 40 శాతాన్ని ప్రమోటర్లకు చెందిన సంస్థలకు తిరిగి మళ్లించినట్టు తేలి్చంది. -
ఫ్రీ సర్వీస్.. మరి ఆదాయం ఎలా వస్తుంది?
పాలప్యాకెట్ నుంచి పిజా వరకు ఏం కొన్నాలన్నా ఫోన్తో క్యుఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తున్నాం. జేబులో రూపాయి లేకపోయినా యూపీఐ ద్వారా కావాల్సినవి కొనేస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) అందుబాటులోకి వచ్చాక ఆర్థిక లావాదేవీలు చకచకా జరిగిపోతున్నాయి. ఎటువంటి సర్వీసు చార్జి లేకుండానే చెల్లింపులు జరుగుతుండడంతో మనోళ్లు యూపీఐ సేవలను విరివిగా వాడేస్తున్నారు. దీంతో మన దేశంలో ప్రతిరోజు కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి.రూపాయి నుంచి లక్ష వరకు ఎటువంటి చార్జీలు లేకుండానే యూపీఐ ద్వారా నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ వంటి డిజిటల్ యాప్ల సేవలను యూపీఐ (UPI) కోసం ఎక్కువగా వాడుతున్నారు. వినియోగదారుల నుంచి ఎటువంటి రుసుములు వసూలు చేయకుండానే ఈ కంపెనీలు సర్వీస్ అందిస్తున్నాయి. నగదు లావాదేవీలపై ఎలాంటి చార్జీలు తీసుకోకుండా ఈ సంస్థలు ఎలా మనగలుగుతున్నాయి? అంతేకాకుండా ప్రతి సంవత్సరం కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఏవిధంగా ఆర్జిస్తున్నాయి? కస్టమర్లకు ఉచితంగా సేవలు అందించాల్సిన అవసరం ఏముంది? ఈ కంపెనీలు నడపడానికి అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వినియోగదారుల నుంచి రుసుములు వసూలు చేయకుండా, ఉత్పత్తులేవీ విక్రయించకుండా ఎలా సంపాదిస్తున్నాయి? ఉచితంగా ఉపయోగించే ఈ డిజిటల్ యాప్లు ఏ ఉత్పత్తిని అమ్మకుండానే ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాయంటే.. దానికి కారణం కస్టమర్ల నమ్మకం. నమ్మకం ఆధారంగా ఏర్పడిన ప్రత్యేకమైన వ్యాపార నమూనా నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. డిజిటల్ యాప్ల నుంచి చెల్లించిన సొమ్ములు ఎక్కడికి పోవన్న భరోసాతోనే వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు.స్పీకర్ సర్వీస్తో..డిజిటల్ యాప్ల ఆదాయంలో ఎక్కువ భాగం చిన్న కిరాణా దుకాణాల్లో ఉపయోగించే వాయిస్- ఆపరేటింగ్ స్పీకర్ సర్వీస్ ద్వారా వస్తుంది. మనం దుకాణం నుండి వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు చేసినప్పుడల్లా.. డబ్బులు వచ్చాయని చెప్పే వాయిస్ వినబడుతుంది. ఈ స్పీకర్ను కంపెనీ నెలకు రూ.100కి దుకాణదారులకు అద్దెకు ఇస్తుంది. మన దేశంలో దాదాపు 30 లక్షలకు పైగా స్పీకర్లు దుకాణాలకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏటా రూ.360 కోట్ల వరకు సంపాదిస్తున్నాయి.స్క్రాచ్ కార్డులతో ఖుష్దీంతో పాటు స్క్రాచ్ కార్డుల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి. ఈ కార్డులు క్యాష్బ్యాక్ లేదా కూపన్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో పాటు వివిధ బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలను జనాల్లోకి తీసుకెళుతున్నాయి. అందుకే స్క్రాచ్ కార్డులకు ఆయా బ్రాండ్లే సొమ్ములు చెల్లిస్తాయి. ఫలితంగా జీపే, ఫోన్పే (Phone pay) వంటి డిజిటల్ యాప్లు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతాయి. ఒకవైపు కస్టమర్లకు ఆకర్షణీయ ఆఫర్లు, మరోపక్క బ్రాండ్ల ప్రమోషన్తో డిజిటల్ యాప్లు దూసుకుపోతున్నాయి.చదవండి: డిబ్బి డబ్బులతో కాలేజీ ఫీజులు కట్టేస్తున్న స్కూల్ విద్యార్థులుపెరుగుతున్న ఆదరణ తక్షణ నగదు లావాదేవీలు, బిల్లుల చెల్లింపుల పాటు వివిధ రకాల యూపీఐ సేవలను సులువుగా పొందే వీలుండడంతో ఉచిత డిజిటల్ యాప్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. దీంతో మన దేశంలో ప్రతినెలా వేల కోట్లలో యూపీఐ నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. జూలైలో 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. -
కొత్తగా 20,000 ఉద్యోగాలు..
కన్సల్టెన్సీ దిగ్గజం పీడబ్ల్యూసీ ఇండియా వచ్చే ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 20,000 ఉద్యోగాలు కల్పించనుంది. దీనితో సంస్థలో మొత్తం సిబ్బంది సంఖ్య 50,000కు చేరనుంది. విజన్ 2030ని ప్రకటించిన సందర్భంగా పీడబ్ల్యూసీ ఇండియా చైర్పర్సన్ సంజీవ్ కృషన్ ఈ విషయం తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వార్షికాదాయాల్లో 5% టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాలపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు.దాంతోపాటు డిజిటల్ పరివర్తన, క్లౌడ్, సైబర్సెక్యూరిటీలాంటి వ్యాపార విభాగాల పై దృష్టి పెట్టనున్నట్లు సంజీవ్ చెప్పారు. సిబ్బంది, భాగస్వాములకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఆదాయాల్లో 1 శాతం భాగాన్ని వెచ్చిస్తున్నట్లు వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరిస్తూ, హైరింగ్ చేపడుతున్నామని సంజీవ్ చెప్పారు. ప్రధానంగా ఆర్థిక సేవలు, హెల్త్కేర్, ఆటో, టెక్నాలజీ, మీడియా వంటి ఆరు విభాగాలపై ఫోకస్ పెడుతున్నట్లు వివరించారు. -
ఫ్లిప్కార్ట్ ఒక్కరోజు ప్రత్యేక సేల్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘క్రాఫ్టెడ్ బై భారత్’ (Crafted by Bharat) పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్కార్ట్ సమర్థ్ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సేల్ 10వ ఎడిషన్ది. భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశీయ కళాకారులు, చేనేతలు, మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తోంది.ఈ ఒక్కరోజు ప్రత్యేక సేల్లో 1.4 లక్షలకు పైగా హస్తకళా ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తారు. 2,200 మందికి పైగా కళాకారులు, స్వయం సహాయక సంఘాలు, మహిళా వ్యాపారవేత్తలు పాల్గొంటున్నారు. వార్లీ, పటచిత్ర, మధుబని, పిచ్వాయి, టెర్రకోటా, ప్రాంతీయ చెక్క కళాకృతులు, హోమ్ డెకోర్, ఫర్నిచర్, వంటగది వస్తువులు, దుస్తులు మొదలైనవి ఈ ప్రత్యేక సేల్లో అందుబాటులో ఉంటాయి. భదోహి, హత్రాస్, మధురై, కన్నౌజ్, రామనగర, ఉజ్జయిని వంటి చిన్న పట్టణాల మహిళలు తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు ఈ సేల్ అవకాశం కల్పిస్తోంది.ఏటా నిర్వహించే ఈ సేల్లో ఈసారి 100 మందికిపైగా కొత్త విక్రేతలు చేరారు. ఎంఎస్ఎంఈలు, స్థానిక కళాకారులకు సాధికారత కల్పిస్తూ తమ ఉత్పత్తులను ఆన్లైన్లో ఈ-కామర్స్ వేదికగా విక్రయించుకునేందుకు ఫ్లిప్కార్ట్ సమర్థ్ మిషన్ సహకారం అందిస్తోంది. -
తామరాకు స్ఫూర్తితో ఏషియన్ పెయింట్స్ కొత్త టెక్నాలజీ
ఇంట్లో గోడలకు సాధారణంగా మరకలు పడుతుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వాటిని శుభ్రం చేసేందుకు ఎక్కవ కష్టపడాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా ఏషియన్ పెయింట్స్ కొత్త టెక్నాలజీ ఉపయోగించి నూతన రంగులను తయారు చేస్తున్నట్లు తెలిపింది. తన రంగుల్లో లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో పని చేసే ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ అనే సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేస్తున్నట్లు ఏషియన్ పెయింట్స్ చెప్పింది.ఈ అత్యాధునిక ప్రీమియం ఇంటీరియర్ పెయింట్స్ మెరుగైన స్టెయిన్ రిపెల్లెన్సీ, ఫ్లేమ్ రెసిస్టెన్స్, మెరుగైన సౌందర్యాన్ని అందిస్తాయని ఏషియన్ పెయింట్స్ తెలిపింది. దీన్ని వినియోగదారుల ఆధునిక జీవనం కోసం రూపొందించిన్నట్లు పేర్కొంది. గతంలో ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రోటెక్ట్ ద్వారా గోడల లామినేషన్ ప్రొటెక్షన్ కోసం గ్రాఫీన్ను ఉపయోగించింది. రాయల్ వేరియంట్లో టెఫ్లాన్ ఆధారిత స్టెయిన్ రెసిస్టెన్స్ను ప్రవేశపెట్టింది. తాజాగా ఏషియన్ పెయింట్స్ ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్లో అధునాతన లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఆవిష్కరించినట్లు తెలిపింది.సహజంగా శుభ్రపరుచుకునే సామర్థ్యాలు కలిగిన తామర ఆకు నుంచి ప్రేరణ పొంది లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీని రూపొందించినట్లు ఏషియన్ పెయింట్స్ తెలిపింది. సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది ఇంటి గోడలకు రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. రోజువారీ మరకలు కనిపించకుండా లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీ పని చేస్తుంది. కాఫీ, సాస్, క్రేయాన్లు.. వంటి మరకలు గోడపై ఉన్నప్పుడు చాలా తక్కువ శ్రమతోనే వాటిని శుభ్రం చేసేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఇది సమకాలీన భారతీయ గృహాలకు అనువైన పరిష్కారంగా ఉంది. ఈ పెయింట్ ఫ్లేమ్ రెసిస్టెన్స్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇది ఇంట్లో సువాసనలను సైతం వ్యాపింపజేస్తుంది. మాట్, షైన్ ఫినిషింగ్ రెండింటిలోనూ ఈ రంగులు లభిస్తాయి. ఆరు సంవత్సరాల వారంటీతోపాటు మన్నిక, సంరక్షణ అత్యున్నత ప్రమాణాలను అందిస్తుంది.ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ..‘ఏషియన్ పెయింట్స్లో గృహాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి మేము చాలా సమయం వెచ్చిస్తాం. నేటి వినియోగదారులకు నిజంగా అవసరమైన వాటి చుట్టే మా ఆవిష్కరణలు ఉంటాయి. వేడుకలు, పిల్లలు, పెంపుడు జంతువులు, దైనందిన కార్యక్రమాలతో నేడు ఇళ్లు కళకళలాడుతున్నాయి. ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ దాని లోటస్ ఎఫెక్ట్ టెక్నాలజీతో మేము ఈ వాస్తవికతకు సరిపోయే పరిష్కారాన్ని సృష్టించాం. ఇది గోడలను శుభ్రంగా ఉంచి ఒత్తిడిని తొలగిస్తుంది. దాని ఉత్తమ స్టెయిన్ రిపెల్లెన్సీకి ధన్యవాదాలు. ఇది తెలివైన, మరింత అప్రయత్నమైన జీవనం వైపు సాగే అడుగు. ఇక్కడ గృహాలు సొగసైనవి. రోజువారీ దుస్తులను సులభంగా హ్యాండిల్ చేస్తాయి’ అని చెప్పారు.ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. బ్రాండ్ అంబాసిడర్ విరాట్ కోహ్లీ నటించిన కొత్త యాడ్ ఫిల్మ్ దీనికి మద్దతు ఇస్తుంది. ఈ యాడ్లో అతను ఉత్పత్తుల ఆకర్షణ, శక్తితో జీవం పోస్తాడు. ఈ యాడ్ ఉల్లాసకరమైన, సాపేక్షమైన సెట్టింగ్ను చూపిస్తుంది. ఇక్కడ కోహ్లీ అందంగా డిజైన్ చేసిన ఇంటిని జ్యూస్, మిల్క్ షేక్స్ మరెన్నో పదార్థాలతో ఒక పిల్లవాడిలా పరీక్షిస్తాడు. ప్రతి పరీక్షలో ఆప్కోలైట్ ఆల్ ప్రోటెక్ థీమ్స్ను సులభంగా నిర్వహిస్తుంది. ఆ పదార్థాల మరకలు స్థిరపడకముందే నిలుపుదల చేస్తుంది. ఈ లాంచ్తో ఏషియన్ పెయింట్స్ సూపర్ ప్రీమియం ఇంటీరియర్ పెయింట్ విభాగంలో మరోసారి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. పెయింట్స్, అలంకరణ విషయానికి వస్తే బ్రాండ్ పరిశ్రమలో పాల్గొనడమే కాకుండా దాని భవిష్యత్తును రూపొందిస్తోందని చూపిస్తుంది. -
ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?
ఇండియాలో బిజినెస్ ఐకానిక్గా ఎదిగి దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేశ్ అంబానీ పుట్టింది భారత్లో కాదు. అంబానీ ఏడెన్(ప్రస్తుతం యెమెన్)లో జన్మించారు. పుట్టిన ఏడాదికే ఇండియా వచ్చి చదువు పూర్తయ్యాక తండ్రితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించి రూ.కోట్ల రూపాయలు సంపాదించారు.తాజాగా హురున్ ఇండియా 2025లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. చాలా విభాగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న అంబానీ కుటుంబ వ్యాపార విలువ రూ.28.2 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో పన్నెండో వంతుగా ఉండడం విశేషం. అయితే ఇంతకీ ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ వివరాలు కింద తెలియజేశాం.పుట్టిన ప్రదేశం: 1957 ఏప్రిల్ 19న ఏడెన్ (ప్రస్తుత యెమెన్)లో జన్మించారు. తర్వాత ఆయన 1958లో కుటుంబంతో భారత్కు వచ్చారు. 1950ల్లో ఆయన తండ్రి ధీరూబాయ్ అంబానీ యెమెన్లో పని చేస్తుండేవారు. దాంతో ముఖేశ్ అక్కడే జన్మించాల్సి వచ్చింది.ప్రాథమిక విద్య: గ్వాలియర్లోని సింధియా పాఠశాలలో చదివారు.హైస్కూల్: ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీతో కలిసి ముంబైలోని పెద్దార్ రోడ్లోని హిల్ గ్రాంజ్ హైస్కూల్లో సెకండరీ విద్య పూర్తి చేశారు.సీనియర్ సెకండరీ: ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదివారు.అండర్ గ్రాడ్యుయేషన్: ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.పోస్ట్ గ్రాడ్యుయేషన్: స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ప్రోగ్రామ్లో చేరారు. ఒకప్పటి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బామర్ స్టాన్ఫోర్డ్లో ముఖేశ్ క్లాస్మేట్. 1980లో తన తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.ఇదీ చదవండి: తలపై గన్ పెట్టి బెదిరిస్తే ఎలా? -
హిందాల్కో లాభం రూ. 4,004 కోట్లు
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 30 శాతం జంప్చేసి రూ. 4,004 కోట్లకు చేరింది. అత్యుత్తమ ప్రొడక్ట్ మిక్స్, వ్యయ నియంత్రణ ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 3,074 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం 13 శాతం ఎగసి రూ. 64,232 కోట్లను తాకింది. అల్యూమినియంకు అధిక ధరలు లభించడం ఇందుకు దోహదపడింది. గత క్యూ1లో రూ. 57,013 కోట్ల టర్నోవర్ అందుకుంది. యూఎస్ అనుబంధ సంస్థ నోవెలిస్ 1 శాతం అధికంగా 963 కేటీ షిప్మెంట్స్ను సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు 0.7% నీరసించి రూ. 667 వద్ద ముగిసింది. -
50 సార్లు చేతితో రాయండి: ఉద్యోగులకు కంపెనీ పనిష్మెంట్
ఉదయం 9:30 గంటలకు ఆఫీసుకు రాకపోతే.. ఆ రోజు హాఫ్ డే సెలవుగా పరిగణిస్తామని చెప్పిన కంపెనీ ఉదంతం మరువకముందే.. మరో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రెడ్డిట్ వినియోగదారుడు షేర్ చేసిన పోస్టులో.. నేను కంపెనీ నిర్వహించిన పరీక్షలో 27/33 స్కోర్ చేశాను. అంటే దాదాపు 82 శాతం స్కోర్ అన్నమాట. కానీ యాజమాన్యం మాత్రం 90 శాతం కంటే తక్కువ స్కోర్ వచ్చినవారు.. మొత్తం పరీక్ష పేపరును 50 సార్లు చేతితో రాయమని పనిష్మెంట్ ఇచ్చిందని చెప్పాడు. దీనికి సంబంధించి తన వచ్చిన మెయిల్ స్క్రీన్షాట్ షేర్ చేసాడు.ఫోటో షేర్ చేస్తూ.. ఇలాంటి కంపెనీని నా జీవితంలో చూడలేదని అన్నాడు. 50 సార్లు రాయడం కూడా ఆఫీస్ వర్క్ ముగించుకున్న తరువాత రాయాలని సూచించారని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు.ఇదీ చదవండి: జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామాఇది చాలా కామెడీగా ఉందని ఒకరు, మీ కంపెనీ సీఈఓ ఇంతకు ముందు ఉపాధ్యాయుడా? అని మరొకరు, ఇది చాలా అమానుషం అని ఇంకొకరు కామెంట్స్ చేశారు. భారతీయ కార్యాలయాల్లో ఏమి జరుగుతోంది? అని ఇంకొకరు అన్నారు. -
పదేళ్ల వారంటీతో నిస్సాన్ కొత్త ప్లాన్: పూర్తి వివరాలు
నిస్సాన్ ఇండియా కొత్తగా ప్రారంభించిన 'నిస్సాన్ మాగ్నైట్' కోసం 10 సంవత్సరాల ఎక్స్టెండెడ్ వారంటీ ప్లాన్ను ప్రారంభించింది. ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన భారతదేశంలో అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్యూవీలలో ఒకటిగా నిలిచిన తరువాత కంపెనీ ఈ ప్లాన్ ప్రకటించింది.నిస్సాన్ ఇండియా ప్రారంభించిన కొత్త ప్లాన్లో 10 సంవత్సరాలు లేదా 2 లక్షల కి.మీ వారంటీని.. కేవలం రోజుకి రూ.12 లేదా కిలోమీటరుకు 0.22 పైసలకే ఎందుకోవచ్చు. వినియోగదారుడు 3+7, 3+4, 3+3, 3+2, లేదా 3+1 సంవత్సరాల వంటి ప్లాన్ల నుంచి తమకు నచ్చిన ప్లాన్ ఎంచుకోవచ్చు.ఈ కవరేజ్లో ఏడు సంవత్సరాల పాటు సమగ్ర రక్షణ ఉంటుంది. ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ సంవత్సరాలలో ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ కవరేజ్ ఉంటుంది. ఈ ప్లాన్ నిస్సాన్ అధీకృత వర్క్షాప్లలో నగదు రహిత మరమ్మతులను అందిస్తుంది.ఈ ఆఫర్ అక్టోబర్ 2024 నుంచి 3 సంవత్సరాల ప్రామాణిక వారంటీతో విక్రయించబడే కొత్త నిస్సాన్ మాగ్నైట్ మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. 2 సంవత్సరాల ప్రామాణిక వారంటీ కలిగిన పాత మాగ్నైట్ మోడళ్లకు ఈ ఆఫర్ లభించదు.ఇదీ చదవండి: యెజ్డి రోడ్స్టర్ 2025 మోడల్ వచ్చేసింది: ధర ఎంతంటే?కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్బ్యాగులు, 67 శాతం హై-టెన్సైల్ స్టీల్ బాడీ కలిగిన ఈ కారు.. ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టీసీఎస్, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కాగా కంపెనీ ఈ కారును సుమారు 65 కంటే ఎక్కువ దేశాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. -
టాప్ 10లో వీరే.. ఇండియాలో అత్యంత ధనిక కుటుంబాలు
హురున్ ఇండియా 2025లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేసింది. ఇందులో అంబానీ ఫ్యామిలీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కుటుంబ వ్యాపార విలువ రూ. 28.2 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో పన్నెండవ వంతు. ఆ తరువాత జాబితాలో కుమార్ మంగళం బిర్లా కుటుంబం ఉంది. వీరి ఫ్యామిలీ బిజినెస్ వాల్యూ రూ. 1.1 లక్షల కోట్లు పెరిగి రూ. 6.5 లక్షల కోట్ల విలువకు చేరుకుంది. మూడో స్థానంలో జిందాల్ కుటుంబం (రూ. 5.7 లక్షల కోట్లు) ఉంది.భారతదేశంలో అత్యంత విలువైన కుటుంబాల జాబితాలో నిలిచిన మొదటి మూడు ఫ్యామిలీల విలువ రూ. 40.4 లక్షల కోట్లు. ఇది ఫిలిప్పీన్స్ జీడీపీకి సమానం అని తెలుస్తోంది.భారతదేశంలోని టాప్ 10 ధనిక కుటుంబాలు➤అంబానీ కుటుంబం: రూ. 28,23,100 కోట్లు (రిలయన్స్ ఇండస్ట్రీస్)➤కుమార్ మంగళం బిర్లా కుటుంబం: రూ. 6,47,700 కోట్లు (ఆదిత్య బిర్లా గ్రూప్)➤జిందాల్ కుటుంబం: రూ. 5,70,900 కోట్లు (జె.ఎస్.డబ్ల్యు స్టీల్)➤బజాజ్ ఫ్యామిలీ: రూ. 5,64,200 కోట్లు (బజాజ్ గ్రూప్)➤మహీంద్రా కుటుంబం: రూ. 5,43,800 కోట్లు (మహీంద్రా & మహీంద్రా)➤నాడార్ కుటుంబం: రూ. 4,68,900 కోట్లు (హెచ్సిఎల్ టెక్నాలజీస్)➤మురుగప్ప కుటుంబం: రూ. 2,92,400 కోట్లు (చోళమండలం ఇన్వెస్ట్మెంట్ & ఫైనాన్స్ కంపెనీ)➤ప్రేమ్జీ కుటుంబం: రూ. 2,78,600 కోట్లు (విప్రో)➤అనిల్ అగర్వాల్ కుటుంబం: రూ. 2,55,000 కోట్లు (హిందూస్తాన్ జింక్)➤డాని, చోక్సీ & వకీల్ కుటుంబాలు: రూ. 2,20,900 కోట్లు (ఏషియన్ పెయింట్స్)The 2025 Barclays Private Clients Hurun India Most Valuable Family Businesses List ranks India’s top family-run enterprises. Ambani Family leads, followed by Kumar Mangalam Birla & Jindal families. Reliance Industries remains India’s most valuable family business. pic.twitter.com/I57WJFy5JC— HURUN INDIA (@HurunReportInd) August 12, 2025 -
ఆగస్టు 15 నుంచే.. ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్'ను ప్రారంభించనుంది. ఒక్కసారి రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పదేపదే టోల్ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేకుండా.. వాహనదారులు జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి ఈ పాస్ తీసుకొచ్చారు.ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ అనేది భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన చొరవ. ఇది తరచుగా ప్రయాణించేవారికి హైవే ప్రయాణాన్ని మరింత సరసమైనదిగా.. ఇబ్బంది లేకుండా చేస్తుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన ఈ పాస్.. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్ కోసం ఒకేసారి రూ. 3000 చెల్లిస్తే.. వాహనాలు ఒక సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్లు (ఏది ముందు అయితే అది) చేయడానికి అనుమతి పొందుతాయి.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ టోల్ బూత్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుంది. దీని ఫలితంగా లక్షలాది మందికి వాహనదారులు వేగవంతమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు. అయితే ఇప్పటికే ఫాస్ట్ట్యాగ్ ఉన్నవారు కొత్త ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదని రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) స్పష్టం చేసింది.ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ ఎలా పనిచేస్తుంది?ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ అనేది.. NHAI నిర్వహించే జాతీయ రహదారులు (NH), జాతీయ ఎక్స్ప్రెస్వేలు (NE), ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే, ముంబై-నాసిక్, ముంబై-సూరత్, ముంబై-రత్నగిరి మార్గాల వంటి టోల్ ప్లాజాలలో మాత్రమే చెల్లుతుంది.రాష్ట్ర రహదారులు లేదా మున్సిపల్ టోల్ రోడ్లపై, మీ FASTag సాధారణంగా పనిచేస్తుంది. టోల్ ఛార్జీలు యథావిధిగా వర్తిస్తాయి. ఉదాహరణకు, ముంబై - పూణే ఎక్స్ప్రెస్వే, ముంబై - నాగ్పూర్ ఎక్స్ప్రెస్వే (సమృద్ధి మహామార్గ్), అటల్ సేతు, ఆగ్రా - లక్నో ఎక్స్ప్రెస్వే, బెంగళూరు - మైసూర్ ఎక్స్ప్రెస్వే, అహ్మదాబాద్ - వడోదర ఎక్స్ప్రెస్వే వంటి వాటిని రాష్ట్ర అధికారులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ యాన్యువల్ పాస్ చెల్లుబాటు కాదని సమాచారం.ఇదీ చదవండి: కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే వంటి క్లోజ్డ్ టోలింగ్ హైవేలలో.. టోల్ వసూలు ప్రత్యేకంగా ఎగ్జిట్ పాయింట్ల వద్ద జరుగుతుంది. ఒకే ట్రిప్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు రెండూ ఉంటాయి. మరోవైపు.. ఢిల్లీ-చండీగఢ్ వంటి ఓపెన్ టోలింగ్ మార్గాలలో, ప్రతి టోల్ ప్లాజా క్రాసింగ్ ప్రత్యేక ట్రిప్గా ఉంటుంది. పాస్ చెల్లుబాటు ముగిసే వరకు వినియోగదారులు ఏదైనా జాతీయ రహదారి లేదా ఎక్స్ప్రెస్వేపై ప్రయాణించవచ్చు. చెల్లుబాటు గడువు ముగిసిన తర్వాత, సాధారణ ఫాస్ట్ట్యాగ్ మాదిరిగానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ ఎలా పొందాలి?ఫాస్ట్ట్యాగ్ యాన్యువల్ పాస్ అనేది.. ఒక సాధారణ డిజిటల్ ప్రక్రియ. దీని కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.రాజ్మార్గ్ యాత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోండి లేదా ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.మీ వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలను ఎంటర్ చేయండి.మీ ప్రస్తుత ఫాస్ట్ట్యాగ్ యాక్టివ్గా, చెల్లుబాటు అయ్యేదిగా ఉండాలి. బ్లాక్లిస్ట్లో లేదని ముందుగానే చెక్ చేసుకోవాలి.యాన్యువల్ పాస్ కోసం రూ. 3,000 ఆన్లైన్లో చెల్లించండి.చెల్లింపులు పూర్తయిన తరువాత.. మీ యాన్యువల్ పాస్ మీ ప్రస్తుత FASTagకి లింక్ అవుతుంది.#FASTagbasedAnnualPass for ₹3,000!✅ Valid for 1 year or up to 200 toll plaza crossings – whichever is earlier – starting from the day you activate it.✅ Enjoy seamless travel across highways without the hassle of frequent top-ups.Travel smarter, travel with #FASTag!… pic.twitter.com/eDABOdqO2M— NHAI (@NHAI_Official) August 11, 2025 -
ఆఫీస్కు వస్తున్నారా?.. ఎలా రావాలో చెప్పిన ఇన్ఫోసిస్
బెంగళూరులో కొత్తగా ప్రారంభించిన నమ్మ మెట్రో ఎల్లో లైన్ సర్వీసులకు భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ మద్దతుగా నిలుస్తుంది. సుస్థిర ప్రయాణానికి మద్దతు ఇవ్వడానికి కంపెనీ ఉద్యోగులను రోడ్డు రవాణాకు బదులుగా మెట్రోలో ప్రయాణించాలని కోరింది. జయనగర్లోని ఆర్వీ రోడ్డు నుంచి ఎలక్ట్రానిక్ సిటీ ద్వారా బొమ్మసంద్రను కనెక్ట్ చేసేలా 19.14 కిలోమీటర్ల ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఇటీవల ప్రారంభించారు. రోడ్డు ప్రయాణానికి సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ మెట్రో మార్గాన్ని ప్రమోట్ చేస్తూ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపించింది.ఇదీ చదవండి: టెలికాం టారిఫ్లు పెంపు?భారీ ట్రెఫిక్ జామ్లతో సతమవుతున్న బెంగళూరులో పలు ప్రాంతాలకు సులువుగా ప్రయాణించేలా మెట్రో సర్వీసులు అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. కోనప్పన అగ్రహార స్టేషన్ తన ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్కు కీలక నోడ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది. స్టేషన్ నుంచి ఇన్ఫోసిస్ మెట్రో ప్లాజా వరకు ప్రత్యేకమైన స్కైవాక్ను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఇది క్యాంపస్కు ప్రత్యక్ష, సురక్షితమైన ప్రవేశాన్ని అందిస్తుందని పేర్కొంది. ఉద్యోగుల కోసం మెట్రో ప్లాజా వద్ద ఐడీ ఆధారిత ఎంట్రీ ప్రోటోకాల్స్ పాటించనున్నట్లు స్పష్టం చేసింది. -
టెలికాం టారిఫ్లు పెంపు?
ఈ ఏడాది చివరికల్లా టెలికాం ఆపరేటర్లు కొత్త టారిఫ్ పెంపును ప్రకటిస్తారని పరిశ్రమ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో మళ్లీ అధిక రీఛార్జ్ బిల్లులు చెల్లించాల్సి వస్తుందని భారతీయ మొబైల్ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య ఈ పెరుగుదల ఉండొచ్చని ఇక్రా ప్రతినిధి అంకిత్ జైన్ తెలిపారు. అయితే ఈ పెంపు టెలికాం కంపెనీని అనుసరించి మొత్తం టారిఫ్లో 15-20% కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇది 2024లోని పెంపు కంటే తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.‘టెలికాం కంపెనీల టారిఫ్ పెంపు తప్పదు. మొత్తం టారిఫ్లో ఇది 15-20 శాతం కంటే తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో ఒక వినియోగదారుడి నుంచి కంపెనీలకు సమకూరే సగటు ఆదాయం(ఆర్పూ) రూ.200గా ఉంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.220కు పెరుగుతుంది’ అని అంకిత్ అన్నారు.గతంలో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు టారిఫ్లను 19-21 శాతం పెంచాయని, దీంతో కొంతమంది వినియోగదారులు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ప్లాన్ వ్యాలిడిటీ పీరియడ్స్ మార్చకుండా ధరల పెంపుపై ఆపరేటర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఐసీఐసీఐ పేదల బ్యాంకు కాదా? మినిమం బ్యాలెన్స్ రూల్స్లో మార్పుభారతీ ఎయిర్టెల్ ఇప్పటికే డేటా టారిఫ్లను పెంచే సూచనలు చేసింది. ‘భారత్లో మొబైల్ టారిఫ్ డిజైన్ తారుమారుగా ఉంది. సంపన్నులు తక్కువ చెల్లిస్తున్నారు. పేదలు కూడా వారితో సమానంగా పే చేస్తున్నారు. ఇది మారాల్సి ఉంది’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ కంపెనీ ఇటీవల తెలిపారు. రిలయన్స్ జియో ప్రతినిధులు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత 5జీ పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి టారిఫ్ దిద్దుబాట్లు అవసరమని చెప్పారు. -
ఐసీఐసీఐ పేదల బ్యాంకు కాదా? మినిమం బ్యాలెన్స్ రూల్స్లో మార్పు
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా ఎంఏబీ పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంక్ సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు?ఈ నిర్ణయం వ్యూహాత్మకమేనని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. తక్కువ బ్యాలెన్స్ ఉన్న చాలా మంది పొదుపు ఖాతాదారులు ఐసీఐసీఐ బ్యాంకును ద్వితీయ ఖాతాగా భావిస్తున్నారు. అదే సమయంలో ప్రీమియం కస్టమర్లతో సమానంగా బ్యాంకు సేవలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రాబడులు లేకుండానే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నట్లు బ్యాంకు భావిస్తోంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ‘మ్యూల్ ఖాతాలు(అనైతిక కార్యకలాపాలు, మనీలాండరింగ్ కోసం ఉపయోగించేలా)’గా వాడే అవకాశం ఉంది. ఖాతాల్లో అధిక బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లపై దృష్టి పెట్టడం ద్వారా బ్యాంక్ ఈ మ్యూల్ ఖాతాలను లక్ష్యం చేసుకోనుంది. ఈ కొత్త విధానం ద్వారా స్థిర ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తుంది. ప్రీమియం కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడం, టెక్నాలజీ అప్గ్రేడ్లు, కొత్త ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం మూలధనాన్ని ఉపయోగించాలని చూస్తుంది.వ్యాపారంపై ప్రభావం?ఈ పెంపు వల్ల ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ (ఎస్ఏ) నిష్పత్తి లేదా ప్రాఫిట్ మార్జిన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని బ్యాంకు పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కస్టమర్లు తమ అవసరాలను తీర్చడంలో బ్యాంకు విఫలమైతే పెనాల్టీ ఛార్జీల నుంచి ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీఏ-జీరో బ్యాలెన్స్ ఖాతాలు) ఖాతాలకు ఈ నిబంధన వర్తించదు. పెన్షనర్లు, శాలరీ అకౌంట్లు, రూ.2 లక్షల పొదుపు, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లకు మినహాయింపులు ఇచ్చారు.విమర్శలు ఎందుకు?ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్ జే కోటక్ తన ఎక్స్ ఖాతాలో చెప్పారు.ఇదీ చదవండి: సోదరుడికి పంపిన లీగల్ నోటీసు విత్డ్రాబ్యాంకు చర్యల ద్వారా ప్రీమియం క్లయింట్లకు ప్రాధాన్యత ఇస్తూ, మాస్ మార్కెట్ విభాగాన్ని దూరం చేసుకుంటుందని కొందరు చెబుతున్నారు. ఆర్థిక సమ్మిళితం(ఫైనాన్షియల్ ఇన్క్యూజన్) అనే విస్తృత జాతీయ లక్ష్యాన్ని ఇది బలహీనపరుస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంఏబీలను తక్కువగా లేదా జీరోగా ఉంచుతున్న తరుణంలో ఐసీఐసీఐ బ్యాంక్ బహుళ సేవా ఛార్జీలను (ఏటీఎం, విత్డ్రా, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ మొదలైన వాటిపై) వసూలు చేస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు విధానానికి విరుద్ధంగా మిడ్ సైజ్ బ్యాంకులు ఎన్నో సర్వీసులు అందిస్తున్నాయి. పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ ఇస్తున్న బ్యాంకులున్నాయి. ప్రాథమిక లావాదేవీలపై ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. రూ.25,000 ఎంఏబీతో కస్టమర్లకు ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ఇస్తున్నాయి.ఇతర బ్యాంకులు ఇదే బాటలో నడుస్తాయా?బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటాయి. హెచ్డీఎఫ్సీ లిమిటెడ్తో విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిపాజిట్లను పెంచడంపై దృష్టి పెట్టింది. పెరుగుతున్న డిపాజిట్ల పోటీ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్, పలు మిడ్ టైర్ ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ చర్యను అనుకరించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
సోదరుడికి పంపిన లీగల్ నోటీసు విత్డ్రా
సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ ఛైర్మన్ కళానిధి మారన్ ఆయన సోదరుడు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మధ్య తలెత్తిన న్యాయ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు కంపెనీ తెలిపింది. కళానిధి మారన్కు వ్యతిరేకంగా దయానిధి జారీ చేసిన అన్ని లీగల్ నోటీసులను ఉపసంహరించుకున్నట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.సన్టీవీ ఛైర్మన్ కళానిధి మారన్తోపాటు మరో ఏడుగురిపై గతంలో ఆయన సోదరుడు దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపించడంతో పరిస్థితులు తీవ్రంగా పరిణమించాయి. కళానిధి మారన్ తన వ్యాపార కార్యకలాపాల్లో మనీలాండరింగ్కు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళానిధిపై చర్యలు తీసుకోవాలని దయానిది కోరారు. కళానిధి మారన్ భార్య కావేరి మారన్కు కూడా నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో దయానిధి మారన్ లీగల్ నోటీసులు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది.కళానిధి మారన్ సారధ్యం వహిస్తున్న సన్ గ్రూప్ ఆధ్వర్యంలో టెలివిజన్, రేడియో, ప్రింట్, సినిమా, క్రీడా విభాగాల్లో వ్యాపారాలున్నాయి. కళానిధితో సంబంధం ఉన్న కీలక కంపెనీలు, వెంచర్ల జాబితా కింది విధంగా ఉంది.మీడియా, ఎంటర్టైన్మెంట్ సన్ టీవీ నెట్వర్క్ లిమిటెడ్ - 37 టీవీ ఛానళ్లు నిర్వహిస్తోంది. సన్ పిక్చర్స్ - చిత్ర నిర్మాణ సంస్థ. సన్ డైరెక్ట్ - డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) శాటిలైట్ టీవీ సర్వీస్. సన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ - కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. కేఏఎల్ పబ్లికేషన్స్ / కుంగుమమ్ పబ్లికేషన్స్ - కుంగుమమ్ తమిళ పత్రికను ప్రచురిస్తుంది. కేఏఎల్ కేబుల్స్ - కేబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. కేఏఎల్ రేడియో / సౌత్ఏషియా ఎఫ్ఎమ్ - సూర్యన్ ఎఫ్ఎమ్, రెడ్ ఎఫ్ఎమ్ వంటి బ్రాండ్ల ద్వారా 69 ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లను నిర్వహిస్తుంది.ప్రింట్ మీడియా దినకరన్ - ఈ గ్రూపునకు చెందిన ప్రముఖ తమిళ దినపత్రిక.క్రీడలు సన్ రైజర్స్ హైదరాబాద్ - ఐపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీ. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ - దక్షిణాఫ్రికా టీ20 లీగ్ జట్టు.ఇదీ చదవండి: కొత్త ఆదాయపన్ను బిల్లులోని ముఖ్యాంశాలుగతంలోని వెంచర్ స్పైస్ జెట్ - మారన్ 2010 నుంచి 2015 వరకు కేఏఎల్ ఎయిర్ వేస్ ద్వారా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. ఆర్థిక అనిశ్చితి కారణంగా అందులో నుంచి నిష్క్రమించారు. -
కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ సెంటర్
ఇంధన రంగ పీఎస్యూ దిగ్గజం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) తాజాగా రూ. 4,606 కోట్లకుపైగా పెట్టుబడులకు తెరతీయనుంది. తద్వారా 10 చమురు, గ్యాస్ బావుల అభివృద్ధి, రెండు మానవరహిత ప్లాట్ఫామ్స్, ఆఫ్షోర్ పైప్లైన్ ఏర్పాటుతోపాటు.. ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఆన్షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని నెలకొల్పనుంది. ప్రతిపాదిత ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం పర్యావరణం, అటవీ శాఖను సంప్రదించింది.ఇదీ చదవండి: హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నారా?ఈ శాఖకు చెందిన నిపుణుల అప్రైజల్ కమిటీ(ఈఏసీ) జులై 24న సంబంధిత సమావేశం జరిగినట్లు వెల్లడించింది. ప్రతిపాదిత ఇన్స్టాలేషన్కు ఓడలరేవు టెర్మినల్లో మొత్తం 26.3 హెక్టార్లు అవసరమని తెలియజేసింది. 8.7 హెక్టార్లలో గ్రీన్బెల్ట్ను అభివృద్ధి చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. మొత్తం ప్రాజెక్టుకు రూ.4,606 కోట్లకుపైగా వ్యయంకానున్నట్లు వివరించింది. -
2030 నాటికి 220 హోటళ్లు
న్యూఢిల్లీ: ఐటీసీ హోటల్స్ 2030 నాటికి నిర్వహణలోని హోటళ్ల సంఖ్యను 220కి పెంచుకోనుంది. అప్పటికి 20వేల కీలను (గదులు) కలిగి ఉంటామని సంస్థ చైర్మన్ సంజీవ్ పురి ప్రకటించారు. ఐటీసీ నుంచి వేరుపడి లిస్టింగ్ అనంతరం జరిగిన తొలి ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి అంతర్జాతీయ అల్లకల్లోల పరిస్థితుల్లో ఆవిష్కరణలు, టెక్నాలజీలపై పెట్టుబడులకు పిలుపునిచ్చారు. తద్వారా మరింత బలోపేతం కావాలని, స్వావలంబన సాధించాలని పేర్కొన్నారు. యువ జనాభా అధికంగా ఉండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వేగవంతమైన పట్టణీకరణ, టెక్నాలజీ సామర్థ్యాలు, పోటీతత్వం అన్నవి కంపెనీని నిలదొక్కుకునేలా చేస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు 2.2 హోటల్ గదులు అందుబాటులో ఉంటే, భారత్లో 0.3 గదులుగానే ఉన్నట్టు పురి చెప్పారు.అస్సెట్ రైట్ విధానంతో కంపెనీ వేగంగా వృద్ధిని సాధించగలదని చెప్పారు. టైర్ 2, 3 పట్టణాలకు ఐటీసీ హోటల్స్ విస్తరిస్తున్నట్టు చెప్పారు. కస్టమర్లకు మెరుగైన అనుభవంతోపాటు నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా డిజిటల్ టెక్నాలజీలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాలో ఐటీసీ హోటల్స్ రూ.3,300 కోట్ల ఆదాయాన్ని సాధించిందని, ఎబిట్డా మార్జిన్ 36 శాతానికి పెరిగినట్టు చెప్పారు. -
బ్యాంకులకు వరుస సెలవులు.. మూడు రోజులు క్లోజ్
2025 ఆగస్టులో బ్యాంక్ సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం మీద 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ఇప్పటికే తెలుసుకున్నాం. కాగా ఈ వారంలోనే వరుసగా మూడు రోజులు బ్యాంకులు మూత పడనున్నాయి.ఆగస్టు 13 (బుధవారం): దేశభక్తుల దినోత్సవం సందర్భంగా 'ఇంఫాల్' (మణిపూర్)లోని బ్యాంకులకు సెలవు.ఆగస్టు 15 (శుక్రవారం): స్వాతంత్య్ర దినోత్సవం, పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.ఆగస్టు 16 (శనివారం): జన్మాష్టమి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లోని బ్యాంకులు మూతపడి ఉంటాయి.ఆగస్టు 17 (ఆదివారం): ఆదివారం కాబట్టి.. దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.అందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. -
మందుబాబులకు ఇక ఇంటి వద్దకే మద్యం: స్విగ్గీ రెడీ
ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. చాంతాడంత క్యూలలో నిలుచోవాల్సిన పనిలేదు. రోజూ వైన్ షాప్లో కనపడుతుంటే జనం అదోలా చూస్తారనే సంకోచాలక్కర్లేదు. దర్జాగా కాలు మీద కాలేసుకుని ఇంట్లో కూర్చుని కావాల్సిన మందు తెప్పించుకోవచ్చు. అంతేనా, దానితో కలిపి లాగించే సైడ్ డిష్లు కూడా ఒకేసారి అందుకోవచ్చు. మరి మందుబాబుల ఇలాంటి కల సాకారం కావాలంటే.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు షురూ కావాలి. ఈ దిశగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ముందడుగేశాయి.ఒడిశా పశ్చిమ బెంగాల్లు మద్యం హోమ్ డెలివరీని అనుమతిస్తున్న తొలి రెండు భారతీయ రాష్ట్రాలుగా ఘనత దక్కించుకున్నాయి. ఇదే కోవలో స్విగ్గీ, జొమాటో బిగ్బాస్కెట్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఆన్ లైన్ మద్యం అమ్మకాలను అనుమతించే అవకాశాన్ని అనేక ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ లు ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో కేరళ మరింత చురుకుగా ఈ విషయంపై చర్చిస్తోందని రేపో మాపో దీనిపై నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది.కేరళ స్టేట్ బేవరేజెస్ (మార్కెటింగ్ – మాన్యుఫ్యాక్చరింగ్) కార్పొరేషన్ లిమిటెడ్ (బిఇవిసిఒ) రాష్ట్రంలో ఆన్లైన్ అమ్మకాల ద్వారా మద్యం ఇంటికి డెలివరీ చేసే ప్రతిపాదనను ఇటీవలే ముందుకు తెచ్చింది. కేరళలో ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలను సులభతరం చేయడానికి అబ్కారీ చట్టాన్ని సవరించే గతంలో రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ, బిఇవిసిఒ ఈ ప్రతిపాదనను మరోసారి తెరపైకి తెచ్చింది.గత జూలైలో బిఇవిసిఒ ఎండి హర్షిత అత్తలూరి ఈ ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖకు సమర్పించారు. ఆన్లైన్లో మద్యం డెలివరీ కోసం ఫుడ్, కిరాణా డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ నుంచి తాము ప్రాజెక్ట్ ప్రతిపాదనను అందుకున్నట్లు అత్తలూరి చెప్పారు. ‘ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే, మేం టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తాము. ఎవరు తక్కువ మొత్తాన్ని బిడ్ చేస్తారో వారికి బిడ్ ఇవ్వడం జరుగుతుంది.ఈ ప్రతిపాదన ప్రకారం, 23 సంవత్సరాలు నిండిన వ్యక్తి మాత్రమే మద్యం కోసం ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. వయస్సును నిర్ధారించడానికి ఐడీని తనిఖీ చేస్తారు. మా అవుట్లెట్లలో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉత్పత్తులు కూడా ఆన్ లైన్ లో విక్రయాలు జరుగుతాయి,‘ అని హర్షిత అత్తలూరి చెబుతున్నారు.రిటైల్ అవుట్లెట్లలో రద్దీని నివారించడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య కారణం. కేరళలో మద్యం దుకాణాల ముందు పొడవైన క్యూలు కనపడడం సర్వసాధారణం, పలు చోట్ల ఇది ట్రాఫిక్ రద్దీకి కూడా దారితీస్తుంది. తమిళనాడు వంటి 4700 మద్యం దుకాణాలు ఉన్న రాష్ట్రాల మాదిరిగా కాకుండా, కేరళలో కేవలం 283 దుకాణాలు మాత్రమే ఉన్నాయి. దీనివల్ల పొడవాటి క్యూలు, రద్దీ ఏర్పడుతుంది. ఆన్ లైన్ అమ్మకాలు చురుకుగా మారిన తర్వాత, విక్రయాల్లో గణనీయమైన భాగం ఆన్ లైన్ అమ్మకాల ప్లాట్ఫామ్కు మళ్లుతుంది. ఇది అవుట్లెట్ల ముందు రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది‘ అని అత్తలూరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా మద్యం హోమ్ డెలివరీ ఆదాయాన్ని కూడా పెంచుతుందని కూడా బిఇవిసిఒ ఆశిస్తోంది. ఇప్పటికే అనేక రకాల చర్యల ద్వారా మద్యం మీద ఆదాయాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంది కేరళ రాష్ట్రం. గత 2016–17లో మద్యం నుంచి వచ్చిన ఆదాయం రూ.8778.29 కోట్లు కాగా కేవలం ఏడేళ్ల కాలంలో..గత 2024–25లో, మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.19,700 కోట్లు కావడం దీనికి అద్దం పడుతోంది. అయితే ‘ఆన్ లైన్ అమ్మకాలతో ఈ ఆదాయం మరింత అసాధారణ రీతిలో పెరుగుతుందని తాము ఆశిస్తున్నాం అంటున్నారు హర్షిత అత్తలూరి అయితే ఈ ప్రతిపాదనను గతంలో పరిశీలించి తిరస్కరించామని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.‘మద్యం అమ్మకం అనేది 1953 నాటి చట్ట నిబంధనల ప్రకారం జరుగుతోంది. రాష్ట్రంలో ఆన్లైన్ అమ్మకాలను ప్రవేశపెట్టాలంటే, అందుకు అనుగుణంగా చట్ట సవరణలు చేయాలి అంతేకాకుండా తదనుగుణంగా నియమాలను రూపొందించాలి. అన్నింటికన్నా ముందు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి‘ అని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. కోవిడ్ సమయంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో మద్యం అమ్మకాన్ని ప్రవేశపెట్టింది. దీని కోసం ఒక అప్లికేషన్ కూడా అభివృద్ధి చేసింది. మద్యం వనరు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న తరుణంలో కోవిడ్ కాలపు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవచ్చుననే అభిప్రాయాలు వస్తున్నాయి. ఇదే జరిగితే పొరుగు రాష్ట్రమైన కేరళ లో ఆన్లైన్ విక్రయాలు ప్రారంభమై భారీ ఆదాయం కళ్ల జూస్తే.. ఆదాయం కోసం ఆవురావురు మంటున్న మన తెలుగు రాష్ట్రాలు సైతం అదే బాటలో నడిచే అవకాశం లేకపోలేదు. -
టెస్లా రెండో షోరూం ప్రారంభం
టెస్లా ముంబైలో తన మొదటి షోరూం ప్రారంభించి.. ఇండియన్ మార్కెట్లో 'మోడల్ వై' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇప్పుడు ఢిల్లీలో రెండో షోరూమ్ ప్రారంభించింది.భారతదేశంలో రెండవ టెస్లా అవుట్లెట్ ఢిల్లీలోని ఏరోసిటీలోని వరల్డ్మార్క్ 3 వద్ద ఉంది. 8,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త షోరూమ్ వద్ద, నాలుగు సూపర్చార్జర్లు కూడా ఉన్నాయి. నోయిడా, హారిజన్ సెంటర్, సాకేత్ వంటి ప్రదేశాలలో సూపర్చార్జర్లను ఏర్పాటు చేయడానికి కూడా టెస్లా సన్నద్ధమవుతోంది.ముంబై, ఢిల్లీలలో తన షోరూంలను ప్రారంభించిన టెస్లా తన నెట్వర్క్ను హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, జైపూర్ వంటి నగరాలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది.టెస్లా మోడల్ వైటెస్లా మోడల్ వై అనేది.. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న టెస్లా ఏకైక మోడల్. ఎంట్రీ లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నారా?
యూపీఐ చెల్లింపులు ఆన్లైన్ లావాదేవీలు చేసే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటే.. డబ్బు స్వీకరించేవారికి మాత్రం ఇబ్బందులు తెచ్చి పెడుతుందనే వాదనలున్నాయి. ఇటీవల బెంగళూరులోని వీధివ్యాపారులకు వారి యూపీఐ లావాదేవీల ఆధారంగా జీఎస్టీ నోటీసులు అందడంతో చాలామంది జాగ్రత్త పడుతున్నారు. బెంగళూరులోని ఓ పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహం రెంట్ నగదు రూపంలోనే చెల్లించాలని, ఆన్లైన్ లావాదేవీలపై 12% జీఎస్టీ ఉంటుందని పోస్టర్లు వెలిశాయి. ఇదికాస్తా వైరల్గా మారింది.రెడ్డిట్లో వెలసిన ఈ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘అద్దె నగదు రూపంలోనే చెల్లించాలి. ఆన్లైన్ పేమెంట్పై 12 శాతం జీఎస్టీ ఉంది’ అని పీజీ ముందు పోస్టర్ వేసినట్లు ఫోటో తీసి పోస్ట్లో అప్లోడ్ చేశారు. ఎస్కేడీజీక్ అనే హ్యాండిల్ నుంచి షేర్ చేసిన ఈ పోస్ట్కు 31,000 వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.ఇదీ చదవండి: పెట్రోల్ పంపుల ఏర్పాటు మరింత సులువు?చాలా మంది నెటిజన్లు ఈ పద్ధతి చట్టవిరుద్ధమని, దర్యాప్తు చేసి కఠినమైన శిక్షలను అమలు చేయాలని అధికారులను కోరారు. రెసిడెన్షియల్ రెంట్ పై జీఎస్టీ లేదని, ప్రాపర్టీని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే తప్ప జీఎస్టీ విధించరని కొందరు తెలిపారు. ‘మీరు జీఎస్టీ బిల్లు అడగండి’ అని ఒకరు కామెంట్ చేశారు. రెసిడెన్షియల్ పీజీలకు సాధారణంగా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందని కొందరు చెప్పారు. రిజిస్ట్రేషన్, సరైన ఇన్వాయిసింగ్ లేకుండా ఏకపక్షంగా జీఎస్టీని విధించలేరని కొన్ని కామెంట్లు వచ్చాయి. -
సీఈఓ కనుసన్నల్లోనే వేతన పెంపు
కార్పొరేట్ నిర్ణయాలు తీసుకునేందుకు చాలా సంస్థలు అల్గారిథమ్స్, సంబంధిత విభాగాలను వాడుకుంటాయి. అందుకు భిన్నంగా ప్రపంచ టాప్ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వైఖరి వేరుగా ఉంది. అతను ఎన్విడియాలోని దాదాపు 42,000 మంది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి వేతనాలను వ్యక్తిగతంగా సమీక్షిస్తారు. ‘మీ సిబ్బందిని జాగ్రత్తగా చూసుకుంటే.. మిగిలినవన్నీ వాటంతటవే వస్తాయి’ అనే ఫిలాసఫీని నమ్ముతానని హువాంగ్ తెలిపారు.వేతన పెంపు నిర్ణయంలో వ్యక్తిగత ప్రమేయం వ్యూహాత్మకమైనదని హువాంగ్ నమ్ముతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే పరిహారాన్ని కేవలం హెచ్ఆర్కు వదిలేయడం సరికాదని, ప్రతి నెలా తానూ వేతన డేటాను సమీక్షిస్తానని చెప్పారు. అయితే మొత్తం సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి, దాన్ని విశ్లేషించడానికి సహాయపడే మెషిన్ లెర్నింగ్ టూల్స్ను వాడుతానని తెలిపారు. కానీ తుది నిర్ణయం మాత్రం తనదేనని స్పష్టం చేశారు.ఎన్విడియా టాప్ టాలెంట్ను నిలుపుకోవడమే కాకుండా, నాయకత్వ బృందాన్ని విజయవంతంగా అభివృద్ధి చేస్తోందన్నారు. కంపెనీ తన సిబ్బందినిసైతం బిలియనీర్లుగా తీర్చిదిద్దిందని తెలిపారు. వేతన నిర్ణయాల్లో వ్యక్తిగత ప్రమేయం పారదర్శకత, కంపెనీ విధేయతతో కూడిన సంస్కృతిని పెంపొందిస్తోందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: కోడింగ్ ఉద్యోగాల కథ కంచికేనా?ఎన్విడియా నిర్వహణ ఖర్చులు రెట్టింపు అయినప్పటికీ హువాంగ్ దీన్ని అవసరమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. దీని ఫలితంగానే కంపెనీ విలువ 2023లో 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఇది ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ సంస్థగా మార్చిందని చెప్పారు. ఎన్విడియా ఉద్యోగుల్లో 76% మంది మిలియనీర్లని గర్వంగా తెలిపారు. -
జీతం వచ్చిన ఐదు నిమిషాలకే ఉద్యోగి రాజీనామా
ఉద్యోగం దొరక్క కొంతమంది బాధపడుతుంటే.. ఉన్న ఉద్యోగంలో ఇమడలేక కొందరు రాజీనామాలు చేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన కేవలం ఒక నెల తరువాత ఒక ఉద్యోగి రాజీనామా చేసిన సంఘటన సోషక్ నీడియాలో వైరల్ అవుతోంది.హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్ ప్రియవర్షిణి చేసిన లింక్డ్ఇన్ పోస్టులో.. ఉద్యోగంలో చేరిన ఒక నెల తర్వాత రాజీనామా చేసిన ఉద్యోగి గురించి వెల్లడించింది. ఉదయం 10:00 గంటలకు జీతం అందుకున్న ఉద్యోగి.. తన రాజీనామాను ఉదయం 10:05 గంటలకు ఈమెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడించింది. ఇటువంటి చర్య మంచిదేనా?, ఇది న్యాయంగా ఉందా? అంటూ హెచ్ఆర్ ప్రశ్నించారు.నువ్వు ఇక్కడే ఉండాలి అనుకోకపోతే.. ఉద్యోగంలో ఎందుకు చేరాలి?, ప్రాసెస్ ప్రక్రియలను ఎందుకు పూర్తి చేయాలి?, ట్రైనింగ్ సమయంలో ఎందుకు మౌనంగా ఉండాలి? అని కూడా హెచ్ఆర్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: ఏఐ నుంచి ఎవరూ తప్పించుకోలేరు: గౌడత్ హెచ్చరికజీతం వచ్చిన వెంటనే.. రాజీనామా చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం.. జవాబుదారీతనం లేకపోవడం అని కొందరు చెబుతున్నారు. ఆకస్మికంగా ఉద్యోగానికి రాజీనామా చేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఇంకొందరు చెబుతుంటే.. ఉద్యోగం నచ్చలేదేమో అని మరికొందరు సమర్థిస్తున్నారు. -
ఎస్బీఐ నుంచి స్టాక్ మార్కెట్కు 2 సంస్థలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండు అనుబంధ సంస్థల పబ్లిక్ ఇష్యూపై కసరత్తు చేస్తోందని ఎస్బీఐ గ్రూప్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు (సీఎస్) శెట్టి తెలిపారు. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వీటిలో ఉన్నాయని చెప్పారు. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్కు సంబంధించి నిర్దిష్ట గడువేదీ నిర్దేశించుకోలేదని పేర్కొన్నారు.గ్రూప్లో ప్రస్తుతం 18 అనుబంధ సంస్థలు ఉన్నాయని, వీటిపై సుమారు రూ.6,500 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, వాటి విలువ ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల పైచిలుకు ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనకాపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్కు సంబంధించిన 30 హెల్త్ ఇన్సూరెన్స్ శాఖలను శనివారం ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఇవి ప్రత్యేకంగా ఆరోగ్య బీమా సర్వీసులను అందించేందుకే ఉద్దేశించినవని శ్రీనివాసులు శెట్టి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 2,100 పైగా ఆస్పత్రుల నెట్వర్క్తో సేవలు అందిస్తున్నట్లు ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ నవీన్ చంద్ర ఝా చెప్పారు. టారిఫ్ల అనిశ్చితి తొలగిపోతే మంచిది.. భారత్పై అమెరికా టారిఫ్ల వల్ల ప్రత్యక్షంగా పడే ప్రభావం తక్కువే అయినప్పటికీ, వాటి వల్ల తలెత్తిన అనిశ్చితి సాధ్యమైనంత త్వరగా తొలగిపోతే మంచిదని శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎక్కువగా ఎగుమతయ్యే రసాయనాలు, టెక్స్టైల్స్, ఆభరణాలు, తెలుగు రాష్ట్రాల నుంచి ఆక్వా తదితర రంగాలకు టారిఫ్ల వల్ల సవాళ్లు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, టారిఫ్ల ప్రభావిత రంగాలకు రుణాలు స్వల్ప స్థాయిలోనే ఉన్నందున తమ బ్యాంకుపై ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు. -
ప్రభుత్వ స్కీమ్లు.. ఒకటి పొడిగింపు.. మరొకటి పునఃప్రారంభం
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ స్కీమును కొన్ని వాహన విభాగాలకు రెండేళ్ల పాటు 2028 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎలక్ట్రిక్ బస్సులు, ఈ–అంబులెన్స్లు, ఈ–ట్రక్కులు వీటిలో ఉన్నాయి. వాస్తవానికి ఈ స్కీము గడువు 2026 మార్చితో ముగియాల్సి ఉంది.ఈ స్కీము పరిమాణం రూ. 10,900 కోట్లకు మాత్రమే పరిమితమవుతుందని, ఒకవేళ గడువు లోగా నిధులు పూర్తిగా వినియోగించేసిన పక్షంలో.. సంబంధిత సెగ్మెంట్లు లేదా స్కీము కూడా ముగిసిపోతుందని కేంద్రం వివరించింది. మరోవైపు, రిజిస్టర్డ్ ఈ–టూవీలర్లు, ఈ–రిక్షాలు, ఈ–కార్టులు, ఈ–త్రీ వీలర్లకు ఆఖరు తేదీ యథాప్రకారంగా 2026 మార్చి 31గా ఉంటుందని పేర్కొంది. టెక్స్టైల్స్ పీఎల్ఐ స్కీము పోర్టల్ పునఃప్రారంభం పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు టెక్స్టైల్స్ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము పోర్టల్ను మళ్లీ తెరిచినట్లు కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలే కొత్త దరఖాస్తులకు కూడా వర్తిస్తాయి. ఆసక్తి గల కంపెనీలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టెక్స్టైల్స్ శాఖ సూచించింది. -
తెలంగాణలో ఫుడ్, టూరిజం స్టార్టప్లకు ఊతం
హైదరాబాద్: రాష్ట్రంలో ఫుడ్, టూరిజం స్టార్టప్ లకు ఊతమిచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఆగస్టు ఫెస్ట్ కార్యక్రమంలో తెలంగాణ కలినరీ అండ్ ఎక్స్ పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ ను పర్యాటక శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐసీ సీఈవో మెరాజ్ ఫహీమ్, ఎన్ ఐసీఈ కో ఫౌండర్ సంజయ్ ఆనందరామ్ ఆవిష్కరించారు.తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ), నైస్ఆర్గ్, కలినరీ లాంజ్ ఆధ్వర్యంలో ఆరు నెలల పాటు సాగే ఈ కార్యక్రమం తెలంగాణ సాంస్కృతిక వారసత్వంలో పాతుకుపోయిన వ్యాపారాలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందించేందుకు దోహదపడుతుంది.స్టార్టప్ లకు నిపుణుల మార్గదర్శకత్వం, మార్కెట్ యాక్సెస్, నైస్ఆర్గ్ ఇన్వెస్టర్ నెట్ వర్క్ ద్వారా ఫండ్ రైజింగ్ సపోర్ట్ లభిస్తుంది. తెలంగాణ ఆహార, పర్యాటక అనుభవాలను ప్రోత్సహించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, సాంస్కృతిక వ్యవస్థాపకతకు రాష్ట్రాన్ని ప్రపంచ గమ్యస్థానంగా నిలబెట్టడానికి ఈ చొరవను రూపొందించారు.ఈ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ స్థానిక వారసత్వాన్ని ఆర్థిక అవకాశంగా మారుస్తుందని, సంప్రదాయాన్ని సృజనాత్మకతతో మిళితం చేసి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
భారతీ ఎయిర్టెల్ బల్క్ డీల్.. రూ. 11,227 కోట్ల షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రమోటర్ సంస్థలలో ఒకటైన ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్(ఐసీఐఎల్) తాజాగా 0.98 శాతం వాటా విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్డీల్ గణాంకాల ప్రకారం రెండు దశలలో 6 కోట్ల షేర్లు అమ్మివేసింది. ఒక్కో షేరుకి రూ. 1,870–1,872 ధరల శ్రేణిలో రూ. 11,227 కోట్లకు వాటా విక్రయించింది.అయితే కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు. తాజా లావాదేవీ తదుపరి ఎయిర్టెల్లో ఐసీఐఎల్ వాటా 2.47 శాతం నుంచి 1.49 శాతానికి తగ్గింది. వెరసి మొత్తం ప్రమోటర్ల వాటా 51.25 శాతం నుంచి 50.27 శాతానికి దిగివచ్చింది. ప్రమోటర్లలో భారతీ టెలికం అత్యధికంగా 40.47 శాతం వాటా కలిగి ఉంది. వాటా విక్రయం నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 1,860 వద్ద ముగిసింది. -
మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు ఉండాల్సిందే!
దేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం 'ఐసీఐసీఐ' (ICICI) సంచలన నిర్ణయం తీసుకుంది. మినిమమ్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంచుతూ కీలక సవరణ చేసింది. 2025 ఆగస్టు 1 అమలులోకి వచ్చేలా.. సేవింగ్స్ ఖాతాలకు మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB)ను గణనీయంగా పెంచుతున్నట్లు పేర్కొంది.ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకారం.. మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు మినిమం బ్యాలెన్స్ రూ. 50,000 నిర్వహించాలి. గతంలో ఈ బ్యాలెన్స్ రూ. 10,000గా ఉండేది. సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారులు బ్యాలెన్స్ రూ. 5000 నుంచి రూ. 25వేలకు పెరిగింది. గ్రామీణ ఖాతాలను రూ. 2500 నుంచి రూ. 10,000కు పెంచింది. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోకపోతే.. భారీ జరిమానాలు చెల్లించాల్సిందే. ఇదే బాటలో ఇతర ప్రైవేట్ బ్యాంకులు కూడా అడుగులు వేస్తే.. ఖాతాదారులు తమ ఖాతాల్లో వేల రూపాయలు ఉంచుకోక తప్పదు. -
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్
పండుగ సీజన్ మొదలైపోయింది. పట్టణాల్లో ఉండేవారంతా.. సొంతూళ్లకు వెళ్ళడానికి సన్నద్ధమైపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' అనే ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.ఇండియన్ రైల్వేస్ తన 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' కింద రిటర్న్ ఛార్జీలపై 20 తగ్గింపును ప్రవేశపెట్టింది. పండుగల సమయంలో రద్దీని నివారించడమే లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించినట్లు రైల్వే మంత్రి 'అశ్విని వైష్ణవ్' పేర్కొన్నారు. వెళ్ళడానికి, తిరిగి రావడానికి ఒకేసారి టికెట్స్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ.. టికెట్ బుకింగ్స్ వివరాలుభారతీయ రైల్వే రౌండ్ ట్రిప్ ప్యాకేజీ పథకం కింద ఆగస్టు 14 నుంచి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే వెళ్లేందుకు టికెట్ 2025 అక్టోబర్ 13 నుంచి 26 మధ్య, తిరిగి రావడానికి టికెట్ 2025 నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉండాలి. వెళ్లేందుకు, తిరిగి రావడానికి బుక్ చేసుకునే టికెట్లలో పేరు, ఇతర వివరాలు ఒకేలా ఉండాలి. అప్పుడే 20 శాతం తగ్గింపు లభిస్తుంది.ఇదీ చదవండి: బాండ్లు సురక్షితం కాదు: పెట్టుబడికి మార్గం ఏదంటే..రౌండ్ ట్రిప్ ప్యాకేజీ కింద ఒకే మోడ్ను (ఆన్లైన్ లేదా కౌంటర్ బుకింగ్) ఉపయోగించి.. వెళ్ళడానికి, తిరిగి రావడానికి టికెట్స్ బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఛార్జీల వాపసు ఉండదు. అంతే కాకుండా డిస్కౌంట్ జర్నీ కూపన్స్, వోచర్ బుకింగ్స్ మొదలైన రాయితీలపైన టికెట్స్ బుక్ చేసుకోలేరు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
తెలంగాణలో రూ. 5,200 కోట్లకు పిరమల్ ఫైనాన్స్ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలంగాణలో గృహ రుణాలు, వ్యాపార రుణాలు మొదలైన వాటికి గణనీయంగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో తమ లోన్ పోర్ట్ఫోలియో సుమారు రూ. 5,200 కోట్లకు చేరిందని పిరమల్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జగ్దీప్ మల్లారెడ్డి తెలిపారు. తమ మొత్తం వ్యాపారంలో రాష్ట్రం వాటా దాదాపు 10 శాతంగా, టాప్ 5 మార్కెట్లలో ఒకటిగా ఉంటోందని ఆయన చెప్పారు. 23 నగరాల్లో 29 శాఖలు ఉండగా, కార్యకలాపాలను మరింత పెద్ద ఎత్తున విస్తరిస్తున్నామన్నారు. కలలను సాకారం చేసుకోవడంలో రుణగ్రహీతల వాస్తవ గాధలను వివరించేలా రూపొందించిన ’సమీక్ష’ డిజిటల్ సిరీస్ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. -
ఉజ్బెకిస్తాన్లో ఇండియన్ ఎంబీబీఎస్
హైదరాబాద్: భారతదేశంలో మెడికల్ సీట్లు పరిమితంగా ఉండటంతో అనేక మంది మధ్య తరగతి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే, విదేశీ మెడికల్ కోర్సుల్లో భారతీయ ఎన్ఎంసీ ప్రమాణాలకు సరిపోయే పాఠ్యక్రమం లేకపోవడం, క్లీనికల్ ప్రాక్టికల్ లోపించడం వల్ల, విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చాక మెడికల్ రిజిస్ట్రేషన్ కోసం సవాళ్లను ఎదుర్కొంటున్నారు.ఈ లోపాన్ని పూరించేందుకు భారత్కు చెందిన జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థలు, ఇంపల్స్ మెడికల్ ఇన్స్టిట్యూట్ (ఉజ్బెకిస్తాన్), నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కలిసి తొలిసారి భారతీయ మెడికల్ పాఠ్యక్రమంతో కూడిన ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ను ఉజ్బెకిస్తాన్, తాష్కెంట్ ప్రాంతంలో ప్రారంభించాయి.ఈ కోర్సు ఎన్ఎంసీ - ఎఫ్ఎంజీఎల్ నియమావళి 2021 ప్రకారం పూర్తి అనుగుణంగా ఉందని, ఇక్కడ భారతీయ అధ్యాపకుల బృందం బోధిస్తారని జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థలు తెలిపాయి. సీబీఎంఈ ఆధారిత పాఠ్యక్రమం, భారతదేశంలో అవసరమైన వ్యాధులపై స్పెషలైజ్డ్ ట్రైనింగ్, అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఈ కోర్సు ద్వారా లభిస్తుందని వివరించాయి. -
విదేశాల నుంచి భారత్కు డబ్బు: రెమిట్ ఫస్ట్ టు ఇండియా
ప్రవాస భారతీయులు విదేశాల నుంచి భారత్కు సులభంగా డబ్బులు పంపుకునేందుకు వీలుగా ‘రెమిట్ ఫస్ట్ టు ఇండియా’ ప్లాట్ఫామ్ను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఎలాంటి ఖర్చు లేకుండా, ట్రాన్స్ఫర్ ఫీజు లేకుండా డబ్బులు పంపుకోవచ్చని ప్రకటించింది.సింగపూర్కు చెందిన ప్రముఖ రిమిటెన్స్ సేవల సంస్థ సింగ్ ఎక్స్ భాగస్వామ్యంతో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించడం గమనార్హం. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ నుంచి డబ్బులు పంపుకునే (రెమిటెన్స్) సేవలు అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని దేశాలకు విస్తరించనున్నట్టు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది. -
హైస్పీడ్ డేటాతో కొత్త రీఛార్జ్ ప్లాన్
టెలికాం కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ పరిచయం చేస్తూ.. యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే వోడాఫోన్ ఐడియా (VI) రూ.365 రీఛార్జ్ ప్యాక్ తీసుకొచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వోడాఫోన్ ఐడియా.. తన కస్టమర్ల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్, కాలింగ్ను అందించే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 365 తీసుకొచ్చింది. ఈ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే.. అన్లిమిటెడ్ కాల్స్తో పాటు రోజుకి 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. హై-స్పీడ్ 4G ఇంటర్నెట్ ఆస్వాదించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. -
పెరిగిన ఎల్ఐసీ లాభం.. ఎంతంటే..
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 5 శాతం పుంజుకుని రూ.10,987 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ.10,461 కోట్లు ఆర్జించింది.మొత్తం ఆదాయం సైతం రూ.2,10,910 కోట్ల నుంచి రూ.2,22,864 కోట్లకు జంప్చేసింది. ఈ కాలంలో తొలి ఏడాది ప్రీమియం రూ.7,470 కోట్ల నుంచి రూ. 7,525 కో ట్లకు బలపడింది. రెన్యువల్ ప్రీమియం ఆదాయం రూ.56,429 కోట్ల నుంచి రూ.59,885 కోట్లకు ఎగసింది. పెట్టుబడుల నుంచి నికర ఆదాయం రూ.96,183 కోట్ల నుంచి రూ. 1,02,930 కోట్లకు బలపడింది.మొత్తం ప్రీమియం ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 1,19,200 కోట్లకు చేరింది. వ్యక్తిగత విభాగంలో 15 శాతం తక్కువగా 30,39,709 పాలసీలను విక్రయించింది. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 6 శాతం మెరుగుపడి రూ. 57,05,341 కోట్లుగా నమోదైంది. -
ట్రాఫిక్ సమస్యకు చెక్!.. జపాన్ కంపెనీ వ్యూహం ఇదే..
అభివృద్ధి చెందిన నగరాల్లో ట్రాఫిక్ అనేది వాహన వినియోగదారులకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. దీనిని పరిష్కరించే దిశలోనే జపాన్ విమానయాన సంస్థ 'ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్' (ANA) అడుగులు వేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ (ANA) కాలిఫోర్నియాకు చెందిన స్టార్టప్ జాబీ ఏవియేషన్తో భాగస్వామ్యం ద్వారా జపాన్లో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు కంపెనీలు ఒక జాయింట్ వెంచర్ను స్థాపించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. దీని ద్వారా 100కి పైగా ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (eVTOL) ట్యాక్సీలను మోహరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2027 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.జపాన్ కంపెనీ తయారు చేయనున్న.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఐదు సీట్లను కలిగి ఉంటాయి. ఇందులో ఒక పైలట్, నలుగురు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించగలరు. ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ తరహా ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చిన తరువాత నరిటా, హనేడా విమానాశ్రయాలు - సెంట్రల్ టోక్యో మధ్య ప్రయాణించడానికి కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్ వెల్లడించింది.ఇదీ చదవండి: 75 దేశాల్లో కోటి మంది కొన్నారు: ధర కూడా తక్కువే..ఎయిర్ టాక్సీల ధరలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా సంస్థ తన మొదటి ఎయిర్ టాక్సీని అక్టోబర్ 2025లో జరిగే ఒసాకా ఎక్స్పోలో ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఇవి తక్కువ శబ్దంతో.. వినియోగంలో లేనప్పుడు జీరో ఉద్గారాలను ఉత్పత్తి చేసేలా కంపెనీ నిర్మించనుంది. -
‘భారత్ను బెదిరిస్తారు’.. సూపర్ పవర్గా ఎదగాలంటే..
భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఇటీవల సంతకం చేసిన నేపథ్యంలో పలువులు పారిశ్రామికవేత్తలు స్పందిస్తున్నారు. జొమాటో వ్యవస్థాపకులు, సీఈఓ దీపిందర్ గోయల్ సుంకాల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం తన భవితవ్యంపై నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచ శక్తులు ఇండియాను బెదిరిస్తూనే ఉంటాయన్నారు. ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి శక్తిగా ఎదిగేందుకు భారత్ కృషి చేయాలని కోరారు. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడంపై భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడంతో జీడీపీ, ఎగుమతులపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అందరూ ఏకం కావాలని పిలుపుభారత్ సూపర్ పవర్గా ఎదగాలని దీపిందర్ గోయల్ తన లింక్డ్ఇన్ పోస్ట్లో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఇండియా బలాన్ని పెంపొందించుకోకపోతే, ప్రపంచ శక్తులు బెదిరింపులకు పాల్పడుతాయని హెచ్చరించారు. దేశంలోని పౌరులు, వ్యాపారులు, విధాన నిర్ణేతలు భారత్ను ప్రపంచ స్థాయిలో టాప్లో ఉంచేందుకు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: భారత్కు ఎంత బాధైనా అది ఏడాదే?ట్రంప్ ఇటీవలి కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో భారత దిగుమతులపై అదనంగా 25% సుంకాన్ని విధిస్తున్నట్లు చెప్పారు. దాంతో మొత్తం లెవీ 50 శాతానికి చేరింది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకోవడం కొనసాగిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ముకేశ్ అంబానీ జీతం: ఈ సారి ఎంతంటే?
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన 'ముఖేష్ అంబానీ' వరుసగా ఐదవ సంవత్సరం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది.2009 నుంచి 2020 వరకు అంబానీ తన వార్షిక వేతనాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ తరువాత కరోనా మహమ్మారి సమయంలో స్వచ్ఛందంగా తాను జీతం తీసుకోకూడని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి అదే నిర్ణయానికి కట్టుబడిన ముకేశ్ అంబానీ.. జీతం తీసుకోవడం మానేశారు.జీతం తీసుకోకపోయినా.. ముకేశ్ అంబానీ ప్రస్తుతం ప్రపంచ ధనవంతుల జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు. ఈయన నికర విలువ 103.3 బిలియన్ డాలర్లు. కంపెనీ నుంచి జీతం మాత్రమే కాకుండా.. ఇతర ఏ అలవెన్సులను కూడా ముకేశ్ అంబానీ తీసుకోవడం లేదు. అయితే ఆయన ప్రయాణం, ఇతర వ్యాపార ప్రకటనలు, ఇంటికి భద్రత మొదలైనవన్నీ కూడా కంపెనీ చూసుకుంటుంది.ఇదీ చదవండి: ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకి'రిలయన్స్ ఇండస్ట్రీస్'లో అంబానీ ఫ్యామిలీ వాటా 50.33 శాతం. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుకు రూ. 10 డివిడెండ్ చెల్లించింది. దీనితో 332.27 కోట్ల షేర్లు ఉన్న అంబానీ ఫ్యామిలీకి డివిడెండ్ రూపంలో రూ. 3322.7 కోట్లు వచ్చాయి. అంబానీ జీతం తీసుకోకపోయినా.. డివిడెండ్ రూపంలో భారీ మొత్తం వస్తూనే ఉంటుంది. -
మైక్రోసాఫ్ట్లో సంక్షోభం
మైక్రోసాఫ్ట్ తాజాగా వాషింగ్టన్ క్యాంపస్లో పని చేస్తున్న 40 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. దాంతో మే నెల నుంచి ఇప్పటివరకు ఆ క్యాంపస్లో కొలువులు కోల్పోయిన వారి సంఖ్య 3,160కు చేరింది. చాలా మంది ఉద్యోగులు ఈ వ్యవహారాన్ని ‘కల్చరల్ క్రైసిస్(సాంస్కృతిక సంక్షోభం)’గా అభివర్ణించారు. 2025 ప్రారంభం నుంచి వివిధ సందర్భాల్లో ఇప్పటికే 15,000 మంది ఉద్యోగులను తొలగించింది.లేఆఫ్స్కు కారణాలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్ను మైక్రోసాఫ్ట్ భారీగా పెంచుతోంది. గత ఏడాది ఏఐ మౌలిక సదుపాయాలపై 88 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సెప్టెంబర్ నాటికి మరో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.ఈ లేఆఫ్స్ను వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణగా కంపెనీ పెద్దలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2025లో 15,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. ఇది కంపెనీలో పరిధిలో ఎక్స్బాక్స్, సేల్స్, ఇంజినీరింగ్, లీగల్ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందిపై ఎంతో ప్రభావాన్ని చూపింది.పనితీరు ఆధారంగా కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు.సీఈఓ స్పందనేంటి?ఈ వ్యవహారంపై ఇటీవల కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తమ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో స్పందిస్తూ.. ‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవి నాపై ఎంతో భారాన్ని మోపుతున్నాయి. మనం కలిసి పనిచేసిన, కలిసి నేర్చుకున్న లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్న వ్యక్తులపై ప్రభావం ఉంటోంది. కంపెనీని విడిచి వెళ్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. అయితే ఈ కొలువుల కోత కంపెనీలో కల్చరల్ క్రైసిస్ను సూచిస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!బలమైన ఆర్థిక పనితీరు అయినా..బలమైన ఆర్థిక పనితీరు ఉన్న సమయంలోనూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతలను అనుసరిస్తోంది. కంపెనీ ఇటీవల త్రైమాసిక నికర ఆదాయం 18 శాతం పెరిగి 25.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయినా పునర్నిర్మాణం పేరిట కొలువులను తొలగిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో పనితీరు ఆధారిత సమీక్షలతో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. తరువాత మే, జూన్, జులైలో ఇవి పెరుగుతూ వచ్చాయి. ఈ లేఆఫ్స్తో గేమింగ్ యూనిట్ భారీగా ప్రభావితం చెందింది. 3,000కి పైగా కొలువుల కోత ఈ ఒక్క విభాగంలోనే ఉంది. ‘ది ఇనిషియేటివ్’ వంటి స్టూడియోలను కంపెనీ మూసివేసింది. ఎక్స్ బాక్స్, పర్ఫెక్ట్ డార్క్ గేమ్లను రద్దు చేసుకుంది. -
జాక్పాట్.. కుర్రాడు రూ.కోట్లు గెలిచాడు
అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో చెప్పలేం. 30 ఏళ్లుగా తల్లిదండ్రులకు దక్కని అదృష్టం వారి కొడుక్కి దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థి వేన్ నాష్ డిసౌజా 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8.7 కోట్లు గెలుచుకున్నాడు.ఇల్లినాయిస్ అర్బానా-చాంపైన్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను ప్రారంభించడానికి యూఎస్ వెళ్తున్న వేన్.. వెళ్తూ వెళ్తూ జూలై 26న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాటరీ టికెట్ కొన్నాడు. లక్కీ డ్రాలో ఆ టికెట్కే (సిరీస్ 510, నంబర్ 4463) జాక్పాట్ తగిలింది.వేన్ నాష్ డిసౌజా దుబాయ్లోనే పుట్టి పెరినప్పటికీ అతని తల్లిదండ్రులు ముంబైకి చెందినవారు. వేన్కు టీనేజర్ కావడంతో సొంతంగా అకౌంట్ లేదు. 18 ఏళ్లు నిండినా ఇప్పుడిప్పుడే కావడంతో అకౌంట్ సెట్ చేసుకోలేదు. దీంతో తన తండ్రి అకౌంట్ను ఉపయోగించి వేన్ డ్రాలోకి ప్రవేశించాడు. అతని కుటుంబం 30 సంవత్సరాలకు పైగా రాఫెల్ డ్రాలో పాల్గొంటోంది. అయినా వారికి దక్కని జాక్పాట్ వేన్కు దక్కింది.వేన్ ఒక రోజు యూనివర్సల్ స్టూడియోలో నిద్రిస్తుండగా కాల్ వచ్చింది. తాను లాటరీ గెలిచినట్లు వారు తెలియజేశారు. దీంతో అతనికి ఇంక నిద్ర పట్టలేదు. ఈ విషయాన్ని వేన్ మొదట నమ్మలేదు. అంతా కల అనుకున్నాడు. ఈ ప్రైజ్ మనీని తన విద్యకు, తన సోదరి చదువుల కోసం, దుబాయ్ లో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నట్లు వేన్ తెలిపాడు. 1999లో ఈ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ అందుకున్న 255వ భారతీయుడిగా వేన్ నిలిచాడు. -
హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్కు కొత్త కాన్సుల్ జనరల్
హైదరాబాద్: నగరంలోని యూఎస్ కాన్సులేట్కు కొత్త కాన్సుల్ జనరల్ నియమితులయ్యారు. దశాబ్దాల దౌత్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలుగులోకి తెచ్చిన లారా ఇ.విలియమ్స్ నూతన అమెరికా కాన్సుల్ జనరల్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ఫారిన్ సర్వీస్ లో సీనియర్ సభ్యురాలైన విలియమ్స్ గతంలో యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ లో డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా పనిచేశారు.హైదరాబాద్ లో సేవలందించడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడం గౌరవంగా భావిస్తున్నానని విలియమ్స్ పేర్కొన్నారు. భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సృజనాత్మకతను ప్రోత్సహించడం, ప్రజల మధ్య సంబంధాలను విస్తరించడంపై తన నిబద్ధతను ఆమె తెలిజేశారు. ప్రభావవంతమైన నాయకత్వానికి ప్రశంసలు పొందిన జెన్నిఫర్ లార్సన్ స్థానంలో విలియమ్స్ వచ్చారు.విలియమ్స్ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని రాయబార కార్యాలయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. డిజిటల్ విధానం, విశ్లేషణలు, దౌత్య శిక్షణలో చొరవలకు నాయకత్వం వహించారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో బీఏ, టెక్నాలజీ, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లో మల్టిపుల్ సర్టిఫికేషన్లు పొందారు. -
‘అదే రిలయన్స్కు మంచిది’.. వాటాదారులకు అంబానీ లేఖ
రిలయన్స్ ఇండస్ట్రీస్ భవిష్యత్తు గురించి ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు లేఖలో తెలియజేశారు. ‘భారతదేశానికి ఏది మంచిదో అదే రిలయన్స్ కు మంచిది’ అనే శీర్షికతో రాసిన ఈ లేఖ కంపెనీ వృద్ధి దేశ పురోగతితో విడదీయరానిదిగా ఉంటుందన్న ముఖేష్ అంబానీ నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది.దేశానికి అమృత కాలం.. రిలయన్స్కు పునరుజ్జీవండిజిటల్ పేమెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ లీడర్గా అవతరించిందని అంబానీ కొనియాడారు. ‘భారతదేశం కేవలం గ్లోబల్ ట్రెండ్లను అనుసరించడమే కాదు.. వాటిని సెట్ చేస్తోంది’ అని రాసుకొచ్చారు. 145 కోట్ల భారతీయుల సాధికారతకు కట్టుబడి ఉన్న "జాతీయ సంస్థ"గా రిలయన్స్ అభివృద్ధి చెందుతోందన్నారు.డీప్-టెక్ పరివర్తనరిలయన్స్ ఒక కొత్త తరం డీప్-టెక్ ఎంటర్ప్రైజ్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కృత్రిమ మేధస్సు, పునరుత్పాదక శక్తి, అడ్వాన్స్ డ్ మెటీరియల్స్, డిజిటల్ ప్లాట్ ఫామ్ వంటి అత్యాధునిక ఆవిష్కరణలపై 1,000 మందికి పైగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఎనర్జీ, రిటైల్ నుంచి టెలికాం, ఎంటర్టైన్మెంట్ వరకు రిలయన్స్ విభిన్న వ్యాపారాల్లో ఈ టెక్నాలజీలను అనుసంధానించనున్నట్లు అంబానీ ఉద్ఘాటించారు.వ్యాపార పనితీరు ముఖ్యాంశాలురిటైల్: రూ.3.3 లక్షల కోట్ల టర్నోవర్, దేశవ్యాప్తంగా 19,340 స్టోర్లు.జియో: 5జీలో 191 మిలియన్లతో సహా 488 మిలియన్ల యూజర్లు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా నెట్వర్క్.మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్: డిస్నీతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రికార్డు స్థాయిలో ఐపీఎల్ వ్యూయర్షిప్.ఆయిల్ అండ్ గ్యాస్: అత్యధిక ఇబిటా, బలమైన దేశీయ ప్లేస్మెంట్.O2C (ఆయిల్ టు కెమికల్స్): క్రమశిక్షణతో కూడిన వ్యయ నిర్వహణ ద్వారా స్థిరమైన పనితీరు.సుస్థిరతసుస్థిరత, సర్క్యులర్ ఎకానమీ సూత్రాలు, సమ్మిళిత వృద్ధికి రిలయన్స్ నిబద్ధతను అంబానీ పునరుద్ఘాటించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగాలన్న భారత్ ఆకాంక్షకు మద్దతుగా కంపెనీ తన ఉత్పాదక మౌలిక సదుపాయాలను భవిష్యత్తులో మెరుగుపరుచుకుంటోందని ఆయన పేర్కొన్నారు.👉 చదివారా? మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా? -
ఐశ్వర్యా రాయ్.. బిజినెస్లోనూ ‘తారా’స్థాయి..
ఐశ్వర్యారాయ్ బచ్చన్.. సినిమాలు చూసే సామాన్యులకు కూడా ఈ పేరు తెలుసు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో మంచి పేరున్న తారల్లో ఒకరు. ఏ సినిమాలోనైనా ఆమె కొన్ని క్షణాలు కనిపించినా చాలు అని అభిమానులు ఆశిస్తారు. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో విశేష కీర్తిని సంపాదించడమే కాదు.. చేతినిండా బ్రాండ్ ఎండార్స్మెంట్లతో బిజినెస్లోనూ రాణిస్తూ భారీ సంపదనూ నిర్మించుకున్నారు.భారీ నెట్వర్త్భారత సినీ ప్రపంచంలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్.. సంపదలోనూ అగ్ర స్థానంలో నిలిచారు. సియాసత్ నివేదిక ప్రకారం.. మే 2025 నాటికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ .900 కోట్ల నెట్వర్త్తో భారతదేశంలో రెండవ ధనవంతురాలైన నటి. మిస్ వరల్డ్ కిరీటాన్నిసాధించడమే కాకుండా పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే తారల్లో ఒకరు. న్యూస్ 18 ప్రకారం.. ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. నటనతో పాటు హైఎండ్ ఇండియన్, ఇంటర్నేషనల్ బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.6-7 కోట్లు సంపాదిస్తోంది.బిజినెస్ వెంచర్లు, విలాసవంతమైన ఆస్తులునటన, బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ తో పాటు వ్యాపార ప్రపంచంలోకి కూడా ఐష్ అడుగు పెట్టింది. స్మార్ట్ పెట్టుబడుల కారణంగా ఆమెను బాలీవుడ్ అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా పరిగణిస్తున్నారు. పాసిబుల్, యాంబీ వంటి స్టార్టప్లలో ఆమె పెట్టుబడులు పెట్టారు.రియల్ ఎస్టేట్ విషయానికొస్తే ఆమెకు పలు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ముంబైలోని బాంద్రాలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే భారీ బంగ్లాలో నివసిస్తున్నారు. దుబాయ్ లోని జుమేరా గోల్ఫ్ ఎస్టేట్స్ లోని ఎత్తైన శాంక్చురీ ఫాల్స్ లో అద్భుతమైన విల్లా ఉంది.ఇది చదివారా? ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా: వివేక్ ఒబెరాయ్ -
‘నెలకు రూ.2 లక్షల స్టైపెండ్’.. పుచ్ఏఐ సీఈఓ ప్రకటన
నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు ఇస్తారు.. ఇది వేతనం అనుకుంటే పొరపాటే. ఓ కంపెనీ ప్రకటించిన ఇంటర్న్షిప్ స్టైపెండ్! పుచ్ ఏఐ సహ వ్యవస్థాపకులు, సీఈఓ సిద్ధార్థ్ భాటియా తన ఎక్స్ ఖాతాలో ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. తన కంపెనీలో ఇంటర్న్షిప్ ఖాళీలున్నాయని చెబుతూ.. అందుకు సంబంధించిన వివరాలను సైతం పబ్లిక్ డొమైన్లో ప్రకటించడంతో అదికాస్తా వైరల్గా మారింది.సిద్ధార్థ్ భాటియా ఎక్స్లో తెలిపిన వివరాల ప్రకారం..‘మేం రిక్రూట్మెంట్ ప్రారంభించాం. లక్షల మందికి ఉపయోగపడేలా ఏఐని రూపొందించడానికి puch_ai కంపెనీలో చేరండి.స్టైపెండ్: నెలకు రూ.1 లక్షల నుంచి రూ.2 లక్షలుమీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటే అప్పుడు చేరవచ్చు.రిమోట్గా పని చేయవచ్చు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి.డిగ్రీ అవసరం లేదు.మేము గత నెలలో ఒక హైస్కూల్ విద్యార్థిని నియమించుకున్నాం.ఓపెన్ రోల్స్:1. ఏఐ ఇంజినీరింగ్ ఇంటర్న్ (ఫుల్ టైమ్)2. గ్రోత్ మెజీషియన్ (ఫుల్ టైమ్/పార్ట్టైమ్)ఈ ఖాళీలపై ఆసక్తిగా ఉందా?మేము మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలో.. మీరు పుచ్ ఏఐలో చేరితే దేనిపై పనిచేయడానికి ఇష్టపడుతారో కామెంట్ చేయండి. పర్ఫెక్ట్గా సరిపోయే వ్యక్తి ఎవరో తెలిస్తే వారిని నెటిజన్లు ట్యాగ్ చేయవచ్చు. ట్యాగ్ చేసిన వారిని నియమించుకుంటే ఐఫోన్ గెలుచుకుంటారు.మేం కూడా హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. అందులో గెలిస్తే ఇంటర్న్షిప్ ఆఫర్ లభిస్తుంది. టాప్ 10లో చోటు దక్కించుకుంటే వ్యవస్థాపకులు నేరుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రిజిస్టర్ చేసుకోవాంటే http://puch.ai/hackathon పై క్లిక్ చేయండి’ అని రాసుకొచ్చారు.🚨 We're Hiring! 🚨Join @puch_ai to build AI for a Billion+ people.💰 Stipend: ₹1L–2L/month🗓️ Start: Whenever you're ready📍 Remote🚀 PPOs for top performers🎓 No degree needed. We hired a high schooler last month.Open Roles:1. AI Engineering Intern (Full-time)2.…— Siddharth Bhatia (@siddharthb_) August 6, 2025ఈ పోస్ట్పై టెకీలు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే కంపెనీ సీఈఓ వ్యాఖ్యలపై ఉద్యోగార్థులు తమ లక్ష్యాలను, ఇప్పటి వరకు తాము చేసిన పనిని వివరిస్తూ పోస్టులు చేస్తున్నారు.ఇదీ చదవండి: ప్రత్యామ్నాయాలపై భారతీయ తయారీదారుల కన్నుఏఐ టాలెంట్ హంటింగ్..కృత్రిమమేధ టూల్స్కు డిమాండ్ పెరుగుతుండడంతో స్థాయితో సంబంధం లేకుండా దాదాపు చాలా టెక్ కంపెనీలు ఏఐ టాలెంట్ హంటింగ్ రేసులో పడ్డాయి. మెటా, ఎక్స్ఏఐ వంటి కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇచ్చి ఏఐ నిపుణులను నియమించుకుంటున్నాయి. చిన్న కంపెనీలు కూడా ఏఐ టాలెంట్ను వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. అందుకోసం విభిన్న మార్గాలు ఎంచుకుంటున్నాయి. -
సమయమే ముఖ్యమా.. చేసేపని కాదా?
సమయపాలన చాలా అవసరం అని చిన్నప్పుడే బడిలో చదువుకున్నాం. ఈ విధానాన్ని ఇప్పటికి కూడా కొన్ని కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఉద్యోగులందరూ ఖచ్చితమైన సమయానికి కార్యాలయానికి చేరుకోవాలని షరతులు కూడా పెడుతున్నాయి. అయితే ఇది సమంజసంగా లేదని ఓ రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ రోజు ఒక విషయాన్ని నేను పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పటికీ పాఠశాల సంస్కృతిని పాటిస్తున్నాయి. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఉద్యోగులందరూ ఉదయం 9:30 గంటలకు తప్పకుండా ఆఫీసుకు రావాలి. ఆలస్యమైతే సగం రోజు లీవుగా పరిగణించడం జరుగుతుందని మా టీమ్ చాట్లో అధికారిక మెసేజ్ చేశారు.ఆలస్యమైతే.. ముందుగా తెలియజేయాలి. ఎవరికీ తెలియజేయకుండా ఆలస్యంగా వస్తే మాత్రం హాఫ్-డేగా పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ.. మనం ఇంకా స్కూల్లోనే ఉన్నామా?, పెద్దవాళ్లమయ్యామా? అని రెడ్దిట్ యూజర్ పేర్కొన్నారు.భారతదేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికీ 'సమయానికి రిపోర్ట్ చేయండి లేదా శిక్ష అనుభవించండి' అనే పాతకాలపు మనస్తత్వాన్ని ఎందుకు పట్టుకుంటున్నాయి? చేసే పని ముఖ్యం కాదా? అని రెడ్దిట్ అన్నారు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ఎవరైనా కోటీశ్వరులు కావచ్చు: రాబర్ట్ కియోసాకికొందరు తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ఆఫీసులకు ఆలస్యంగా వెళ్తే.. యజమానులు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో పేర్కొన్నారు. ఆలస్యంగా వస్తే పనిష్మెంట్ ఉంటుంది.. కానీ అదనపు వర్క్ చేసినప్పుడు ఎలాంటి ప్రోత్సాహకం ఉండదని ఒకరు అన్నారు. మారుతున్న కాలంతోపాటు మనం కూడా మారాలి. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా అదే విధానాలు ఉన్నాయి కానీ చాలా అరుదుగా అమలు చేస్తాని మరొకరు పేర్కొన్నారు. -
యాపిల్కు ట్రంప్ వణుకు?
భారత్లో ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించిన యాపిల్ కంపెనీ తాజాగా యూఎస్లోనూ 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.8.3 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ ఉత్పత్తిని భారత్కు తరలించాలన్న కంపెనీ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వారాల కొందట బహిరంగంగానే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాంతో కంపెనీ ఈమేరకు చర్యలు తీసుకొని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశీయ తయారీ, సరఫరా గొలుసు కార్యకలాపాలను విస్తరించేందుకు వచ్చే నాలుగేళ్లలో ఈమేరకు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు కంపెనీ వివరణ ఇచ్చింది.యాపిల్ చేసిన ప్రకటనను ఉద్దేశించి శ్వేతసౌధం ప్రకటన విడుదల చేసింది. అందులో అమెరికా తయారీ రంగానికి ఈ చర్య పెద్ద విజయం అని తెలిపారు. ‘యాపిల్ ఈ రోజు చేసిన ప్రకటన మా తయారీ పరిశ్రమకు మరొక విజయం. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతను రక్షించడానికి కీలకమైన ఉత్పత్తిని ప్రారంభిస్తుంది’ అని వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కంపెనీ యూఎస్లో 500 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో 100 బిలియన్ డాలర్లు ఇందుకు తోడయ్యే అవకాశం ఉంది.యాపిల్ నిర్ణయంతో చిన్న సమస్యభారత్లో ఉత్పత్తిని విస్తరించాలన్న యాపిల్ నిర్ణయంతో చిన్న సమస్య ఉందని ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ చేసిన విమర్శల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఖతార్లో జరిగిన ఓ కార్యక్రమంలో యాపిల్ సీఈఓ టిమ్కుక్తో నేరుగా ‘మీరు భారత్లో యాపిల్ కార్యకలాపాలు ఏర్పాటు చేయడం నాకు ఇష్టం లేదు’ అని ట్రంప్ బహిరంగంగానే చెప్పారు.సుంకాలు పెంపు..రష్యా చమురు దిగుమతులను భారత్ కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత వస్తువులపై ట్రంప్ 25 శాతం అదనపు సుంకం విధించిన రోజే యాపిల్ తన పంథాను మార్చుకుంది. కొత్త పన్నులు 21 రోజుల్లో అమల్లోకి రానుండడంతో భారత ఎగుమతులపై మొత్తం అమెరికా సుంకాలు 50 శాతానికి చేరుకుంటాయి. దాంతో యాపిల్ ఉత్పత్తులను భారత్లో తయారు చేసి తిరిగి అమెరికాకు ఎగుమతి చేసే క్రమంలో 50 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కంపెనీకి భారంగా మారనుంది.ఇదీ చదవండి: 365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా.. -
365 రోజులు ఎంతసేపైనా మాట్లాడుకునేలా..
బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జ్ ప్లాన్లు అందించడంలో బీఎస్ఎన్ఎల్కు ప్రత్యేక స్థానం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను తక్కువ ధరలకు అందించడం ద్వారా తన యూజర్ బేస్ను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ తన తాజా ఆఫర్లలో కేవలం రూ.1,999 ధరతో ఇయర్లీ ప్లాన్ను ప్రవేశపెడుతున్నట్లు చెప్పింది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ ప్లాన్ను పోటీ టెలికాం సంస్థల కంటే తక్కువ ధరకే అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.వ్యాలిడిటీ: 365 రోజులుడేటా: ఒకేసారి 600 జీబీ(రోజువారీగా 1.64 జీబీ)వాయిస్ కాలింగ్: అపరిమిత కాల్స్ చేయవచ్చు.ఎస్ఎంఎస్: రోజుకు 100ప్లాన్ ధర: రూ.1,999ఇదీ చదవండి: త్వరలో యూఎస్ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) ఇలాంటి సరికొత్త ప్లాన్లును తీసుకొస్తుంది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అందిస్తున్నట్లు, ఇండిపెండెన్స్డే సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటిస్తున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. -
వ్యాపార అవకాశాలపై కంపెనీల ధీమా..
న్యూఢిల్లీ: వ్యయాలు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ఏప్రిల్ - జూన్ వ్యవధిలో వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) 149.4కి పెరగడం ఇందుకు నిదర్శనం.జనవరి - మార్చి త్రైమాసికంలో ఇది 139.3గా నమోదైనట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నవారిలో వచ్చే ఆరు నెలల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని 78.7 శాతం, దేశీయంగా అమ్మకాలు పెరుగుతాయని 79.1 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అలాగే ముడి వస్తువుల దిగుమతులు పెరుగుతాయని 54.3 శాతం, పన్నుల ముందు లాభాలు మెరుగుపడతాయని 61 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి.ఆరు నగరాలవ్యాప్తంగా జూన్లో నిర్వహించిన ఈ సర్వేలో 479 కంపెనీలు పాల్గొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు, కంపెనీల ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడుల వాతావరణం తదితర నాలుగు అంశాలు బీసీఐకి ప్రాతిపదికగా ఉంటాయని ఎన్సీఏఈఆర్ తెలిపింది. -
వ్యాపార అవకాశాలపై కంపెనీల ధీమా
న్యూఢిల్లీ: వ్యయాలు తగ్గుతున్న నేపథ్యంలో వచ్చే ఆరు నెలల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశావహంగా ఉన్నాయి. ఏప్రిల్–జూన్ వ్యవధిలో వ్యాపార విశ్వాస సూచీ (బీసీఐ) 149.4కి పెరగడం ఇందుకు నిదర్శనం. జనవరి–మార్చి త్రైమాసికంలో ఇది 139.3గా నమోదైనట్లు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నవారిలో వచ్చే ఆరు నెలల్లో ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని 78.7 శాతం, దేశీయంగా అమ్మకాలు పెరుగుతాయని 79.1 శాతం కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. అలాగే ముడి వస్తువుల దిగుమతులు పెరుగుతాయని 54.3 శాతం, పన్నుల ముందు లాభాలు మెరుగుపడతాయని 61 శాతం సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆరు నగరాలవ్యాప్తంగా జూన్లో నిర్వహించిన ఈ సర్వేలో 479 కంపెనీలు పాల్గొన్నాయి. వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు, కంపెనీల ఆర్థిక స్థితిగతులు, పెట్టుబడుల వాతావరణం తదితర నాలుగు అంశాలు బీసీఐకి ప్రాతిపదికగా ఉంటాయని ఎన్సీఏఈఆర్ తెలిపింది. -
టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు షురూ
న్యూఢిల్లీ: టీసీఎస్ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. జూనియర్ లెవల్ నుంచి మధ్య స్థాయి ఉద్యోగుల వరకు 80 శాతం సిబ్బందికి సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్, సీహెచ్ఆర్వోగా నియమితులైన కే సుదీప్ తెలిపారు. గ్రేడ్ సీ3ఏ, దీనికి సమానమైన అసోసియేట్లకు (మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం) వేతన సవరణను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించడం తెలిసే ఉంటుంది. -
పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఇండోసోల్
హైదరాబాద్: షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్రణాళికల్లో ఉంది. రాబోయే కొన్నేళ్లలో రూ. 69,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సీఎండీ ఎన్ విశ్వేశ్వరరెడ్డి ఈ విషయాలు వెల్లడించారు. ‘ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్లో 1 గిగావాట్ల సమగ్ర తయారీ లైన్ (ఇన్గోట్ నుంచి సెల్ మాడ్యూల్ వరకు) ప్రారంభించనున్నాం. ఆ తర్వాత ఐపీవోకి వచ్చే యోచన ఉంది. ప్రాథమికంగా, ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ ద్వారా 25–26 శాతం వాటా విక్రయించాలని భావిస్తున్నం‘ అని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇండోసోల్లో షిర్డీ సాయి 51 శాతం వాటాలను తన దగ్గరుంచుకుని, దాదాపు 49 శాతం వరకు వాటాలను విక్రయించే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఇండోసోల్ ఐపీవో గానీ కుదరకపోతే షిర్డీ సాయి ఎలక్ట్రికల్సే 2027 ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి రావచ్చని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. సోలార్ పీవీ తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కారేడు గ్రామంలో 8,348 ఎకరాల స్థలం, అదే జిల్లాలోని చెవురు గ్రామంలో మరో 114.5 ఎకరాల స్థలాన్ని ఇండోసోల్కి కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్ ప్రణాళికలు.. పాలీసిలికాన్కి ముడి వనరైన క్వారŠట్జ్ మైనింగ్కి సంబంధించి కర్నూలు, అనంతపురంలో మైనింగ్ హక్కులు దక్కించుకున్నామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రూ. 25,000–రూ. 28,000 కోట్లతో ఫేజ్1లో భాగంగా తలపెట్టిన 10 గిగావాట్ల లైన్ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. దీర్ఘకాలంలో 90,000 మిలియన్ టన్నుల (ఎంటీ) పాలీసిలికాన్ ఉత్పత్తి తదితర లక్ష్యాలతో ఇండోసోల్ ప్రాజెక్టుపై పెట్టుబడులు మొత్తం మీద రూ. 64,000 కోట్లుగా ఉంటాయని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. ఇందుకోసం అంతర్గతంగాను, అలాగే ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఇరెడా) నుంచి నిధులు సమీకరిస్తున్నట్లు తెలిపారు. బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. మరోవైపు, షిర్డీ సాయి ఆర్డర్ బుక్ రూ. 12,000 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3,000 కోట్లుగా ఉండగా, ఈసారి రూ. 6,500 కోట్లు అంచనా వేస్తోంది. -
ఎయిర్బస్ ప్రెసిడెంట్గా జూర్గెన్ వెస్టర్మీయర్
ప్రముఖ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ ఎయిర్బస్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతానికి ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్గా జూర్గెన్ వెస్టర్మీయర్ను నియమితులయ్యారు. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుండి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం ఎయిర్బస్లో ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా ఉన్న జూర్గెన్, రెమీ మైలార్డ్ స్థానంలో ఈ పదవిని చేపడతారు.రెమీ మైలార్డ్ ఎయిర్బస్లో కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, టెక్నాలజీ హెడ్గా నియమితులవుతారు. తన కొత్త పాత్రలో, జూర్గెన్ భారత్, దక్షిణ ఆసియా ప్రాంతంలో ఎయిర్బస్ వ్యాపారాన్ని నడిపిస్తారు. ఇందులో కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, డిఫెన్స్ అండ్ స్పేస్, హెలికాప్టర్లు ఉన్నాయి. కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్ అమ్మకాలకు బాధ్యత వహించనున్న జూర్గెన్ సర్వీసెస్, ఇంజనీరింగ్, డిజిటల్, ఇన్నోవేషన్, శిక్షణ రంగాలలో సంస్థ విస్తరణకు కృషి చేయనున్నారు.జర్మనీలోని యూనివర్శిటీ ఆఫ్ కార్ల్స్రూహే నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన జూర్గెన్.. తన కెరియర్ను 1998లో బీఎమ్డబ్ల్యూలో ప్రారంభించారు. అక్కడ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, మోటార్సైకిల్స్ ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ సప్లయర్ నెట్వర్క్, కాస్ట్ ఇంజనీరింగ్ రంగాలలో వ్యూహాత్మక స్థానాలలో పనిచేశారు. జూర్గెన్ 2020లో ఎయిర్బస్లో చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్గా చేరారు.అక్కడ ఆయన ఎయిర్బస్ విభాగాల్లో ప్రొక్యూర్మెంట్ బాధ్యతలు చూశారు -
బ్యాంకు కొలువుల జాతర.. ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 2025-26 కాలానికి 5,583 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సర్వీస్ & సపోర్ట్) ఖాళీలను భర్తీ చేయడానికి పెద్ద ఎత్తున నియామక డ్రైవ్ను ప్రారంభించింది. ఆన్లైన్ దరఖాస్తు విండో ఆగస్టు 6 నుండి ఆగస్టు 26 వరకు తెరిచి ఉంటుంది.ఎస్బీఐ ఇటీవలే 505 ప్రొబేషనరీ ఆఫీసర్లు, 13,455 జూనియర్ అసోసియేట్లను నియమించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ విస్తృత శాఖలు, కార్యాలయాల నెట్వర్క్లో సేవా సరఫరా, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి బ్యాంకు తాజాగా నియామకాలు చేపట్టింది. ఈ నియామక డ్రైవ్, ప్రస్తుతం 2.36 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఎస్బీఐ మానవ వనరుల సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చెందుతున్న కస్టమర్, సాంకేతిక అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్న కొత్త ప్రతిభను నియమించడం లక్ష్యంగా పెట్టుకుంది.“కొత్త ప్రతిభను నియమించడం మా మానవ వనరుల సామర్థ్యాలను బలోపేతం చేసే లక్ష్యంలో కీలక అంశం. నిర్మాణాత్మక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, బ్యాంకింగ్ రంగాన్ని పునర్నిర్మించే క్రియాత్మక, సాంకేతిక పురోగతులతో మా ఉద్యోగులను సమలేఖనం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం” అని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ నియామకం వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తూ పేర్కొన్నారు. -
ఆ ఏనుగుకు అక్కడే అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం: వంతారా
అనంత్ అంబానీ నిర్వహిస్తున్న వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం వంతారాలో సంరక్షిస్తున్న మాధురి అనే ఏనుగును తిరిగి కొల్హాపూర్కు తరలించే ప్రయత్నాలకు తాము పూర్తిగా సహకరిస్తామని గుజరాత్ని జంతు సంరక్షణ కేంద్రం వంతారా తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకే ఆ ఏనుగును వంతారాకు తీసుకొచ్చామని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని వంతారా మరోసారి స్పష్టం చేసింది.పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) పిటిషన్ ఆధారంగా బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు గత నెలలో మాధురి ఏనుగును కొల్హాపూర్ లోని నందిని మఠం నుంచి జామ్ నగర్ లోని వంతరా కేంద్రానికి తరలించారు. స్థానికులు మాధురి ఏనుగును పవిత్రంగా భావించే కొల్హాపూర్ లో ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి. అనంతరం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా చెప్పారు. దీనిపై స్పందించిన వంతరా ఒక ప్రకటన విడుదల చేసింది.మాధురిని కొల్హాపూర్ కు తిరిగి రప్పించాలని కోరుతూ జైన మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వంతరా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపింది. సుప్రీం కోర్టు అనుమతికి లోబడి మాధురి ఏనుగును సురక్షితంగా, గౌరవప్రదంగా తిరిగి కొల్హాపూర్కు తరలించడానికి పూర్తి సాంకేతిక, పశువైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొంది. అంతేకాకుండా దీర్ఘకాలిక పరిష్కారంగా కొల్హాపూర్ లో మాధురి కోసం శాటిలైట్ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటును వంతరా ప్రతిపాదించింది. మఠం, మహారాష్ట్ర ప్రభుత్వం, జంతు సంక్షేమ నిపుణుల సహకారంతో ఈ కొత్త సదుపాయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. మఠం అధిపతి, రాష్ట్ర అధికారులతో చర్చించి భూమిని ఎంపిక చేస్తామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు తమ బృందం సిద్ధంగా ఉందని వంతరా తెలిసింది.ప్రతిపాదిత కేంద్రంలో కల్పించే సౌకర్యాలుహైడ్రోథెరపీ పాండ్, స్విమ్మింగ్ ప్రాంతంలేజర్ థెరపీ గదులు, పునరావాస ప్రదేశాలునైట్ షెల్టర్, గొలుసులు లేని భారీ బయలు ప్రదేశంసహజ ప్రవర్తన, ఆట కోసం ఇసుక గుంట24/ 7 సంరక్షణ కోసం పూర్తిస్థాయి సౌకర్యాలతో పశువైద్యశాలకీళ్ల నొప్పులు,పాదాల కుళ్లడం వంటి వాటి నుంచి ఉపశమనం, విశ్రాంతి కోసం మృదువైన రబ్బరు ఫ్లోర్లు, ఇసుక దిబ్బలు -
రూ.26 కోట్లు సమీకరించిన క్లీన్ ఎనర్జీ కంపెనీ
కార్బన్ రహిత విద్యుత్ వ్యవస్థల కోసం ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్ (ఎల్ఈఎన్ఆర్)’ను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించిన క్లీన్ ఎనర్జీ స్టార్టప్ హెచ్వైఎల్ఈఎన్ఆర్ ‘ప్రీ-సిరీస్-ఏ ఫండింగ్ రౌండ్’ను పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ రౌండ్లో సుమారు 3 మిలియన్ డాలర్ల(రూ.26.39 కోట్లు)ను సమీకరించినట్లు తెలిపింది. డీప్ టెక్, ఎనర్జీ ట్రాన్సిషన్ టెక్నాలజీల్లో ఆసక్తి ఉన్న వేలార్ క్యాపిటల్, చత్తీస్గఢ్ ఇన్వెస్టమెంట్స్ లిమిటెడ్ ఈ రౌండ్లో పాల్గొన్నాయని కంపెనీ తెలపింది. వీటితోపాటు వ్యక్తిగత ఇన్వెస్టర్లు కార్తీక్ సుందర్ అయ్యర్, అనంత్ సర్దా ఇందులో పాల్గొన్నారని పేర్కొంది.ఈ నిధులతో గ్లోబల్ ఎనర్జీ ల్యాండ్ స్కేప్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అవకాశం లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఎల్ఈఎన్ఆర్ టెక్నాలజీతో తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసే ప్రయత్నాలను వేగవంతం చేయవచ్చని పేర్కొంది. సాంప్రదాయ శిలాజ ఇంధనాలకు బదులుగా లో-ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ (ఎల్ఈఎన్ఆర్) టెక్నాలజీ ద్వారా రేడియోధార్మిక పదార్థాలు లేకుండా స్వచ్ఛమైన గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నారు. ఈమేరకు ఇప్పటికే ప్రపంచంలోనే మొట్టమొదటి కోల్డ్ ఫ్యూజన్ రియాక్టర్(ఎల్ఈఎన్ఆర్ టెక్నాలజీతో నడిచే రియాక్టర్)ను హెచ్ఐఎల్ఈఎన్ఆర్ అభివృద్ధి చేసింది.ఈ ఫండింగ్ రౌండ్లో పాల్గొన్న వేలార్ క్యాపిటల్ పార్టనర్ కరణ్ గోషార్ మాట్లాడుతూ..‘హెచ్వైఎల్ఈఎన్ఆర్కు చెందిన ఎల్ఈఎన్ఆర్ టెక్నాలజీ పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడే ఎనర్జీని అందిస్తుంది. ఇది శక్తిని అందించడంతోపాటు అసాధారణమైన భద్రతా కూడా కలిగి ఉంది. ఇది ప్రపంచ శక్తి పరివర్తనకు సరిగ్గా సరిపోతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే బృందానికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.హెచ్వైఎల్ఈఎన్ఆర్ ఛైర్మన్, ఎండీ సిద్దార్ధ దురైరాజన్ మాట్లాడుతూ..‘ఇటీవలి ప్రయోగశాల పరిశోధనలు మెరుగైన ఎనర్జీ ఫలితాలు ఇచ్చాయి. ఎల్ఈఎన్ఆర్ వ్యవస్థ ఆచరణీయంతోపాటు చాలా సమర్థవంతంగా ఉంటుంది. మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పరీక్షలను ప్రారంభించాం. కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఎల్ఈఎన్ఆర్ వ్యవస్థపై ఆసక్తి చూపుతున్నాయి. భవిష్యత్తులో తయారీని విస్తరిస్తాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ బ్రేక్ఎల్ఈఎన్ఆర్ (లో-ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్) సాపేక్షంగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సంభవించే అణు ప్రతిచర్యను నిర్ధారిస్తుంది. ఇది తక్కువ రేడియేషన్తో అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. హెచ్వైఎల్ఈఎన్ఆర్ 7.2కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ల సామర్థ్యం వరకు పారిశ్రామిక, గృహ ఉపయోగం కోసం పేటెంట్ పొందిన హైబ్రిడ్ హీట్ సిస్టమ్లను కలిగి ఉంది. -
‘మోసపూరిత స్టార్టప్లో చేరాను.. తర్వాత..’
ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల కొలువులు ప్రమాదంలో పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మాత్రం కంపెనీలు మారుతూ భారీ వేతనాలతో దూసుకుపోతున్నారు. గతంలో ఫ్లిప్కార్ట్లో పనిచేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సౌరభ్ యాదవ్ కేవలం రెండుసార్లు కంపెనీలు మారడంతో తన జీతం భారీగా పెరిగిందని సోషల్ మీడియాలో వివరాలు పంచుకున్నారు. అదికాస్తా వైరల్గా మారింది.‘మొదటి ఉద్యోగం: రూ.26 ఎల్పీఏ, సెకండ్: రూ.28 ఎల్పీఏ, మూడో ఉద్యోగం: రూ.70 ఎల్పీఏ.. నో ఐఐటీ.. నో ఎంబీఏ.. కష్టపడి పనిచేశాను. మీ సంగతేంటి?’ అని సౌరబ్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ను ఇప్పటికే 30 లక్షల మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. first job: ₹26LPAsecond: ₹28LPAthird: ₹70LPAno IIT. no MBA. just worked hard. what about you?— Saurabh ✧ (@saurabhyadavz) August 3, 2025ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ బ్రేక్‘మీరు 7.7 శాతం వేతన పెంపుతో మొదటి ఉద్యోగం నుంచి రెండో ఉద్యోగానికి మారారు. అందులో ఎన్ని రోజులు వర్క్ చేశారు?’ అని ఒకరు పోస్ట్ చేశారు. దీనికి స్పందిస్తూ సౌరబ్..‘ఇది చాలా పెద్ద కథ. నాకు వచ్చిన ఆఫర్ను ఓకే చేయడం తప్పా.. నాకు వేరే మార్గం లేదు. నేను మొదటి ఉద్యోగానికి రాజీనామా చేశాను. తరువాత ఒక మోసపూరిత స్టార్టప్లో చేరాను. ఆపై అక్కడి నుంచి మరో కంపెనీలో చేరాను’ అని తెలిపారు.You switched from first to second for 7.7% hike?And for how much time did you work in the 2nd job?— Prapat Saxena (@PrapatnotPratap) August 3, 2025 -
ఐపీఓగా టాటా గ్రూప్ కంపెనీ
టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ దిగ్గజం టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూ బాటలో మరో ముందడుగు వేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. తద్వారా 200 కోట్ల డాలర్లు(రూ.17,200 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంపెనీ విలువ 11 బిలియన్ డాలర్లు(రూ.94,600 కోట్లు)గా మదింపు చేశాయి.ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ మొత్తం 47.58 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో 21 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుండగా.. 26.58 కోట్ల షేర్లను కంపెనీ ప్రధాన ప్రమోటర్ టాటా సన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఎఫ్సీ) ఆఫర్ చేయనున్నాయి. టాటా సన్స్ 23 కోట్ల షేర్లు, ఐఎఫ్సీ 3.58 కోట్ల షేర్లు విక్రయించనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో టాటా సన్స్ వాటా 88.6 శాతంకాగా.. ఐఎఫ్సీకి 1.8 శాతం వాటా ఉంది. ఇష్యూ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 క్యాపిటల్ పటిష్టతకు వినియోగించనుంది. ఇదీ చదవండి: ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడుకంపెనీ ఇప్పటికే ఏప్రిల్లో గోప్యతా విధానంలో సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జులైలో దీనికి అనుమతి లభించడంతో తుది ప్రాస్పెక్టస్ దాఖలు చేసేలోగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయవలసి ఉంది. దీంతో తాజాగా సెబీకి అప్డేటెడ్ పత్రాలను దాఖలు చేసింది. వెరసి 2023 నవంబర్లో టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టాటా టెక్నాలజీస్ లిస్ట్ అయ్యాక తిరిగి మరో దిగ్గజం పబ్లిక్ ఇష్యూకి రానుంది. -
అదానీ పోర్ట్స్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 3,311 కోట్లకు చేరింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,307 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 8,054 కోట్ల నుంచి రూ. 9,422 కోట్లకు జంప్ చేసింది.అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 4,239 కోట్ల నుంచి రూ. 5,732 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 11 శాతం అధికంగా 121 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) కార్గో పరిమాణాన్ని హ్యాండిల్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీయంగా పోర్టుల ఆదాయం 14% ఎగసి రూ. 6,137 కోట్లను తాకగా. అంతర్జాతీయ పోర్టుల బిజినెస్ 22% వృద్ధితో రూ. 973 కోట్లకు చేరినట్లు తెలియజేసింది.అదానీ పోర్ట్స్ షేరు 2.4 శాతం క్షీణించి రూ. 1,358 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ లాభాల రింగ్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 43 శాతం జంప్చేసి రూ. 5,948 కోట్లను తాకింది. భారత్సహా.. ఆఫ్రికా బిజి నెస్లో వృద్ధి ఇందుకు సహకరించింది.గతేడాది (2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,160 కోట్లు ఆర్జించింది. ఆఫ్రికా కార్యకలాపాల నికర లాభం ఐదు రెట్లు ఎగసి 15.6 కోట్ల డాలర్లకు చేరింది. గత క్యూ1లో ఇది 3.1 కోట్ల డాలర్లు మా త్రమే. కాగా.. మొత్తం ఆ దాయం 28 శాతం పైగా పుంజుకుని రూ. 49,463 కోట్లయ్యింది. గత క్యూ1 లో రూ. 38,506 కోట్ల టర్నోవర్ అందుకుంది. దేశీ విభాగం జోరు మొత్తం ఆదాయంలో దేశీ బిజినెస్ 29 శాతం జంప్చేసి రూ. 37,585 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 211 నుంచి రూ. 250కు బలపడింది. ఈ కాలంలో 40 లక్షలమంది స్మార్ట్ఫోన్ డేటా యూజర్లను జత చేసుకుంది. 2025 జూన్కల్లా మొత్తం కస్టమర్ల సంఖ్య 7% వృద్ధితో 60.5 కోట్లను తాకింది. దీనిలో దేశీ వినియోగదారుల వాటా 6.6 శాతం పుంజుకుని 43.6 కోట్లకు చేరింది.పోస్ట్పెయిడ్ విభాగంలో 0.7 మిలియన్ల మంది జత కలవడంతో వీరి సంఖ్య 2.66 కోట్లకు చేరింది. స్మార్ట్ఫోన్ డేటా యూజర్ల సంఖ్యలో 8.2 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో క్యూ1లో 2.13 కోట్లమంది వినియోగదారులు జత కలిశారు. మొబైల్ డేటా వినియోగం సగటున 13 శాతం ఎగసి నెలకు 26.9 జీబీకి చేరింది. ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్సహా హోమ్ సర్విసుల విభాగం కస్టమర్ల సంఖ్య 38 శాతం జంప్చేసి 1.09 కోట్లను తాకింది.ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు 14 శాతం తగ్గి రూ. 7,273 కోట్లకు పరిమితమయ్యాయి. కంపెనీ రుణ భారం 2 శాతం పెరిగి రూ. 1.91 లక్షల కోట్లకు చేరింది. భారతీ ఎయిర్టెల్లో భాగమైన ఎక్స్టెలిఫై కొత్తగా ఎయిర్టెల్ క్లౌడ్ పేరిట క్లౌడ్ ప్లాట్ఫాంను ఆవిష్కరించింది. ఇన్ఫ్రా, ప్లాట్ఫాం సర్వీసులను (ఐఏఏఎస్, పీఏఏఎస్) ఇది అందిస్తుంది. ఎయిర్టెల్ షేరు 0.8% బలపడి రూ. 1,930 వద్ద క్లోజైంది. -
ఉద్యోగం మానేసి నా స్టోర్లో పనిచెయ్ అన్నాడు: కానీ ఇప్పుడు..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనిషి ప్రయత్నిస్తే సాధించలేని ఏదీ లేదు. ఒకప్పడు ఏడాదికి రూ.2.19 లక్షల జీతం అందుకునే వ్యక్తి.. తొమ్మిదేళ్లలో సంవత్సరానికి ఏకంగా రూ. 92.5 లక్షల వేతనం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది?, దాని వెనుకున్న అతని కృషి ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.2016లో మాస్ హైరింగ్ ద్వారా మొదటి ఉద్యోగం పొందాను. నా జీతం రూ.2.16 లక్షలు. అప్పుడు జావాలో ట్రైనింగ్ తీసుకున్న సమయంలో.. నా కజిన్ ఒకరు నా స్టోర్లో సేల్స్పర్సన్గా పని పనిచేస్తే.. అంతకంటే ఎక్కువ జీతం ఇస్తాను అన్నాడు. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆ మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.ఆ సమయంలో నేను నిజంగా సిగ్గుపడ్డాను. అయితే 2017లో నా వేతనం రూ. 3.35 లక్షలకు చేరింది. ఆ తరువాత ఇంకో కంపెనీలో రూ.6.6 లక్షల ప్యాకేజీకి చేరాను. అంతటితో నా ప్రయాణం ఆపలేదు.2018లో ఇంకొన్ని కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యాను. అప్పుడు రూ.7.3 లక్షల వేతనానికి ఉద్యోగంలో చేరాను. అదే సంస్థ 2019లో నా ప్యాకేజీని రూ.9.75 లక్షలు చేసింది. వేతనం పెరగడం, ఉద్యోగంలో సుఖంగా ఉండటం చేత.. ఇంటర్వ్యూలకు హాజరవ్వడం మానేశాను. 2020లో నా జీతం రూ. 12.5 లక్షలకు చేరింది. కోవిడ్ రావడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైంది. కంపెనీ బాగానే ఉన్నప్పటికీ.. బోనస్లు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వకుండా కోవిడ్ను సాకు చెప్పారు. ఆ సమయంలోనే మళ్ళీ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని అనుకున్నాను.2020లోనే మరో ఇంటర్వ్యూకు హాజరైతే.. రూ.25 లక్షల ప్యాకేజ్ లభించింది. కొత్త కంపెనీ, ఎక్కువ పని. అయినా చాలా విషయాలను నేర్చుకున్నాను. ఆ తరువాత 2021, 2022, 2023, 2024లలో కూడా ఇంటర్వ్యూలకు హాజరయ్యాను, జీతం కూడా పెరిగింది. 2025లో ఓ ఇంటర్వ్యూకు వెళ్తే అక్కడ రూ. 92.5 లక్షల ప్యాకేజ్ లభించింది. దీంతో ఈ ఏడాది చాలా ఆనందంగా గడుస్తోంది. ఇప్పుడు వస్తున్న జీతం.. ప్రారంభంలో నా నెల జీతంకంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నన్ను ఎగతాళి చేసిన నా కజిన్.. తన పిల్లలకు నాలాగే ఉండాలని చెబుతున్నాడు.ఇదీ చదవండి: అందని జీతం.. ఫుట్పాత్పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగిరూ.2.19 లక్షల వేతనం తీసుకునే స్థాయి నుంచి రూ.92.5 లక్షల వేతనం తీసుకునే స్థాయికి ఒక్క రోజులో చేరుకోలేదు. ఎంతో కష్టపడ్డాను. అయితే సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటం నా అదృష్టమని నమ్ముతున్నానని పేర్కొన్నాడు. అతని ఎదుగుదలను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుంటే.. మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.My 9 years in corporatebyu/noob-expert inIndian_flex -
మెటాతో కలిసిన సేఫర్ ఇంటర్నెట్ ఇండియా: ఎందుకంటే?
మెటా, సేఫర్ ఇంటర్నెట్ ఇండియాతో కలిసి, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు.. స్కామ్ల నుంచి ప్రజలను రక్షించడంలో సహాయపడటానికి కంటెంట్ క్రియేటర్ల నేతృత్వంలో ఒక కొత్త అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా, కొత్త రకాల స్కామ్లను ఎలా గుర్తించాలో, మెటా యొక్క డిజిటల్ భద్రతా సాధనాలను ఎలా ఉపయోగించాలో, ఆన్లైన్లో సురక్షితంగా ఎలా ఉండాలో వారి అనుచరులకు నేర్పించే సులభంగా అర్థం చేసుకోగల కంటెంట్ను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి క్రియేటర్లు వర్క్షాప్లలో పాల్గొంటారు.సేఫర్ ఇంటర్నెట్ ఇండియా, మెటా మద్దతుతో, ఇటీవల “క్రియేటర్స్ ఫర్ ఆన్లైన్ ట్రస్ట్" అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆన్లైన్ భద్రత గురించి ఆలోచనలు, నిజ జీవిత ఉదాహరణలను పంచుకోవడానికి ఇది కంటెంట్ క్రియేటర్లు, టెక్ కంపెనీలు,ప్రభుత్వ ప్రతినిధులను ఒకచోట చేర్చింది. ఆన్లైన్ మోసాలపై పోరాడటానికి.. ఇంటర్నెట్ను మరింత సురక్షితంగా, తెలివిగా ఉపయోగించమని ప్రజలను ప్రోత్సహించడానికి విశ్వసనీయ క్రియేటర్లు ఎలా సహాయపడతారనే దాని గురించి చర్చించడం జరిగింది.ప్రారంభ కార్యక్రమంలో నథానియల్ గ్లీచెర్ (మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ కౌంటర్ ఫ్రాడ్, సెక్యూరిటీ పాలసీ డైరెక్టర్) మాట్లాడుతూ.. మోసాలు, స్కామ్లపై పోరాడటానికి వివిధ పరిశ్రమలలో సమిష్టి కృషి, నిరంతర విద్య అవసరం. ఆన్లైన్లో ఎలా సురక్షితంగా ఉండాలో అర్థం చేసుకోవడంలో ప్రజలకు సహాయపడటం చాలా ముఖ్యం. సేఫర్ ఇంటర్నెట్ ఇండియాతో మా భాగస్వామ్యం ద్వారా, డిజిటల్ భద్రత గురించి అవగాహన కల్పించడంలో కంటెంట్ క్రియేటర్లకు మార్గనిర్దేశం చేయడంలో మేము సహాయం చేయాలనుకుంటున్నామని అన్నారు.ఈ సందర్భంగా సేఫర్ ఇంటర్నెట్ ఇండియా కో-కన్వీనర్, బెర్గెస్ మాలు మాట్లాడుతూ.. కంటెంట్ క్రియేటర్లను ముందుండే భాగస్వాములుగా ఉంచుతూ ఈ ప్రయోజనకరమైన చొరవను ప్రారంభించడం మాకు సంతోషాన్ని కలిగిస్తోంది. సమగ్ర భద్రతా సమాచారంను సులభంగా అర్థమయ్యేలా, నమ్మదగిన ఆన్లైన్ స్వరాల ద్వారా వినియోగదారుల వద్దకు చేరవేయడమే దీని లక్ష్యం. ప్రతి ఒక్కరికి సమాచారంతో కూడిన డిజిటల్ భద్రత కలిగిన భారత్ను నిర్మించాలన్న మా దీర్ఘకాలిక దృష్టిలో ఈ ప్రచారం ఒక ముఖ్యమైన మైలురాయి.మెటా తాజాగా తన స్కామ్ల వ్యతిరేక ప్రచారం రెండవ ఎడిషన్ “స్కామ్ సే బచో 2.0”ను ప్రారంభించింది. ఈ ప్రచారంలో అనేక క్రియేటర్లు భాగస్వాములై డిజిటల్ భద్రతా చిట్కాలను వినోదాత్మకంగా, ట్విస్ట్తో ప్రజలకు అందిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రచారం ముంబైలోని ప్రసిద్ధ వీధుల్లో స్కామ్లపై అవగాహన పెంచేలా రూపొందించబడింది. నకిలీ లోన్లు, ఫేక్ లింకులు, OTP మోసాలు వంటి సాధారణ ఆన్లైన్ మోసాల గురించి ప్రజలకు తెలియజేయడానికి, ప్రజల జీవనశైలికి దగ్గరగా ఉండే సాంస్కృతికం సంబంధిత మరియు ఆకర్షణీయమైన విజువల్స్ను వినియోగిస్తోంది.అర బిలియన్ భారతీయ వినియోగదారులను చేరుకున్న దాదాపు రెండు డజన్ల వ్యాపార సంస్థల సమాఖ్య అయిన సేఫర్ ఇంటర్నెట్ ఇండియా, భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల సంక్షేమాన్ని మెరుగుపరచడం మరియు ఆవిష్కరణ ఆధారిత వృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కూటమిలో డిజిటల్ సేవల సంస్థలు, టెలికాం, ఇంటర్నెట్ ప్రొవైడర్లు, ఫిన్టెక్ కంపెనీలు, అలాగే ఆన్లైన్ ట్రస్ట్ మరియు భద్రత రంగాల్లో పనిచేస్తున్న ఇతర ప్రముఖ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. -
జేఎల్ఆర్ తొలి భారత సీఈవోగా పీబీ బాలాజీ
టాటా గ్రూప్లో భాగమైన బ్రిటిష్ ఆటోమొబైల్ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) తొలి భారత సీఈవోగా పీబీ బాలాజీ సేవలు అందించనున్నారు. ఆగస్ట్ 4నాటి సమావేశంలో పీబీ బాలాజీ నియామకానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.ప్రస్తుతం బాలాజీ టాటా గ్రూప్ సీఎఫ్వోగా పనిచేస్తున్నారు. జేఎల్ఆర్ సీఈవోగా ఇటీవలే మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆర్డియన్ మార్డెల్ తప్పుకోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. జేఎల్ఆర్తో ఆయన 35 ఏళ్లుగా కలసి నడుస్తున్నారు. జేఎల్ఆర్ సీఈవో బాధ్యతలను బాలాజీ నవంబర్లో చేపడతారని కంపెనీ వెల్లడించింది. -
ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడు
రూ.10,01,35,60,00,00,00,00,01,00,23,56,00,00,00,00,00,00,299 ఏంటి ఇది అని అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడి కోటక్ మహీంద్రా బ్యాంక్ పొదుపు ఖాతాలో ఉన్న బ్యాలెన్స్. అవును.. నిజమే. తన ఖాతాలో రూ.1 బిలియన్ 13 లక్షల 56 వేల కోట్ల రూపాయలకు పైగా డబ్బు జమ కావాడాన్ని చూసి ఆ యువకుడే ఆశ్చర్యపోయాడు. ఆ వివరాలేంటో చూద్దాం.సచిన్ గుప్తా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో చేసిన వివరాల ప్రకారం.. రూ.1 బిలియన్ 13 లక్షల 56 వేల కోట్లకుపైగా 20 ఏళ్ల దీపక్ ఖాతాలో జమైందని ఎక్స్లో పేర్కొన్నారు. ‘నేను మ్యాథ్స్లో వీక్. ఇది చదువుతున్నవారు ఈ డబ్బు విలువ ఎంతో చెప్పవచ్చు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తోంది. దీపక్ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు’ అని పోస్ట్ చేశారు.మీడియా కథనాల ప్రకారం.. దీపక్ తల్లి గాయత్రీదేవీ రెండు నెలల క్రితం మరణించారు. తన తల్లి బ్యాంకు ఖాతాను ప్రస్తుతం 20 ఏళ్ల దీపక్ నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 3 రాత్రి గాయత్రి ఖాతాలో రూ.1 బిలియన్ 13 లక్షల 56 వేల కోట్లకుపైగా నగదు క్రెడిట్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది. అయోమయానికి, ఆందోళనకు గురైన దీపక్ ఖాతాలో చూపిస్తున్న డబ్బు ఎంతో లెక్కించమని తన స్నేహితులతో ఆ సందేశాన్ని పంచుకున్నాడు.नोएडा में 20 साल के दीपक के कोटक महिंद्रा बैंक खाते में 36 डिजिट की धनराशि आई है। ये रकम 1 अरब 13 लाख 56 हजार करोड़ रुपए बैठती है। मेरा गणित थोड़ा कमजोर है। बाकी आप लोग गुणा-भाग कर सकते हैं। फिलहाल इनकम टैक्स विभाग जांच कर रहा है। बैंक खाता फ्रीज कर दिया गया है। pic.twitter.com/cLnZdMKozD— Sachin Gupta (@SachinGuptaUP) August 4, 2025మరుసటి రోజు ఉదయం దీపక్ సదరు లావాదేవీని సరిచూసుకునేందుకు బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు అధికారులు బ్యాలెన్స్ను ధ్రువీకరించినప్పటికీ అనుమానాస్పదంగా పెద్ద మొత్తంలో డిపాజిట్ కావడంతో ఖాతాను స్తంభింపజేశారు. ఈ విషయాన్ని వెంటనే ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయగా, వారు అధికారికంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ వార్త వేగంగా వ్యాపించడంతో దీపక్కు బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారి నుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. హఠాత్తుగా వచ్చిన అటెన్షన్ తట్టుకోలేక ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.ఇదీ చదవండి: బంగారం ధరలు రయ్ రయ్ఈ లావాదేవీ సాంకేతిక తప్పిదమా, బ్యాంకింగ్ లోపమా లేక మనీలాండరింగ్ కేసునా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే అసలు వివరాలు తెలుస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఇది బ్యాంకు లోపం అన్నారు. ‘ఇది సాధ్యం కాదు. బ్యాంకు సాఫ్ట్వర్లో లోపం లేదా మాన్యువల్ ఎంట్రీ తప్పిదం మాత్రమే’ అని ఒకరు రాశారు. ఈ 20 ఏళ్ల యువకుడు ఇప్పుడు అంబానీ కంటే ధనవంతుడు అని మరొకరు రిప్లై ఇచ్చారు.స్పందించిన బ్యాంక్దీపక్ ఖాతాలో లెక్కకు మించిన డబ్బు జమ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్పందిస్తూ.. కస్టమర్ ఖాతాలో పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ ఉందని వస్తున్న వార్తలు తప్పు. మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా ఖాతా వివరాలను తనిఖీ చేసుకోమని కస్టమర్లకు చెబుతాము. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని, అన్ని సేవలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. -
ఇండియా-ఇంగ్లాండ్ హ్యాట్సాఫ్
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన టెస్టు సిరీస్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసిన సిరీస్ సెంటిమెంట్ను సత్య హైలైట్ చేశారు. 25 రోజుల పాటు జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఈ టెస్టు సిరీస్లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.ఇదీ చదవండి: బంగారం ధరలు రయ్ రయ్మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్లో.. ‘25 రోజులు. 5 పోరాటాలు.. స్కోర్ 2-2తో సమమయ్యాయి. ఇది కేవలం ఆట మాత్రమే కాదు. యుగాలపాటు నిలిచిపోయే సిరీస్. ఇరు దేశాలు చూపిన ధైర్యసాహసాలు, గొప్పతనానికి ఇండియా, ఇంగ్లాండ్కు హ్యాట్సాఫ్’ అని అన్నారు. సత్య నాదెళ్ల కామెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఇప్పటికే ఈ పోస్ట్ను మూడు లక్షలకుపైగా మంది నెటిజన్లు వీక్షించారు. ఈ సిరీస్ చివరి మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఇండస్ఇండ్ బ్యాంక్కు కొత్త బాస్
ఇండస్ఇండ్ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా రాజీవ్ ఆనంద్ను అధికారికంగా నియమిస్తున్నట్లు బ్యాంక్ వర్గాలు ప్రకటన జారీ చేశాయి. 2028 ఆగస్టు 24తో ముగిసే మూడేళ్ల తన పదవీ కాలం 2025 ఆగస్టు 25 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల జరిగిన రూ.1,960 కోట్ల అకౌంటింగ్ అవకతవకలు నడుమ బ్యాంక్ మాజీ సీఈఓ సుమంత్ కత్పాలియా రాజీనామా చేశారు.ఎవరీ రాజీవ్ ఆనంద్?యాక్సిస్ బ్యాంక్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. హోల్సేల్ బ్యాంకింగ్, డిజిటల్ ట్రాన్స్పర్మేషన్కు కీలకంగా వ్యవహరించారు. యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపక ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు. కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రాజీవ్ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. క్యాపిటల్ మార్కెట్, యాక్సిస్ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఇదీ చదవండి: బంగారం ధరలు రయ్ రయ్ఇటీవల బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలు, మేనేజ్మెంట్ సంక్షోభం తర్వాత ఈమేరకు నియామకం చేపట్టడం కీలకంగా ఉంది. ఇన్వెస్టర్లు, ఖాతాదారుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడం, కార్యకలాపాల స్థిరీకరణ కొత్త బాస్ ముందున్న సవాళ్లు. దశాబ్ద కాలంలో ఇండస్ఇండ్ తన లీడర్షిప్ బెంచ్లో నుంచి కాకుండా బయటి వ్యక్తులను సీఈఓగా నియమించడం ఇదే తొలిసారి. -
విద్యార్థుల చూపు.. ఐర్లాండ్ వైపు
బలమైన అకడమిక్ పాలసీలు, అనుకూలమైన వీసా విధానాలు, విస్తరిస్తున్న కెరియర్ అవకాశాలతో ఐర్లాండ్ భారతీయ విద్యార్థులను ఎంతో ఆకర్షిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 40,400 మంది విదేశీ విద్యార్థులకు ఐర్లాండ్ స్వాగతం పలికింది. ఇది గత సంవత్సరం కంటే 15% పెరుగుదల నమోదు చేసింది. ఐడీపీ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం 2024లో భారతదేశం నుంచి ఐర్లాండ్ వెళ్లే విద్యార్థినుల సంఖ్య గతంలో కంటే 60 శాతంపైగా పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల విద్యార్థి-స్నేహపూర్వక, సురక్షితమైన, సమ్మిళిత వాతావరణాన్ని సూచిస్తుంది. ఆ దేశంపై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి ఐరిష్ విద్యా నాణ్యతను మాత్రమే కాకుండా దాని క్రియాశీల విధానాలు, భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుండడాన్ని హైలైట్ చేస్తుంది.ఎందుకంత ఆసక్తి?ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ టెక్నాలజీ, గేమింగ్ వంటి అధిక వృద్ధి, ఆవిష్కరణ ఆధారిత పరిశ్రమలకు ప్రపంచ కేంద్రంగా ఐర్లాండ్ నిలుస్తుంది. గూగుల్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫైజర్, స్ట్రిప్.. వంటి ప్రధాన బహుళజాతి కంపెనీల యూరోపియన్ ప్రధాన కార్యాలయాలకు ఐర్లాండ్లో స్థాపిస్తున్నారు. ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత డైనమిక్ రంగాల్లో కెరియర్ అవకాశాల కోసం యువత ఈ దేశంవైపు చూస్తోంది.మెరుగైన యూనివర్సిటీలుప్రపంచవ్యాప్తంగా టాప్లో నిలుస్తున్న విశ్వవిద్యాలయాలు అకడమిక్ విద్యను బలోపేతం చేస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ ర్యాంకింగ్స్లో ఐర్లాండ్ యూనివర్సిటీలు చోటు సంపాదిస్తున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఆరు ఐరిష్ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకోగా, ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ 75వ స్థానంలో నిలిచింది.ట్రినిటీ కాలేజ్ డబ్లిన్: #75యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్: #118యూనివర్శిటీ ఆఫ్ గాల్వే: #289యూనివర్శిటీ కాలేజ్ కార్క్: #292డబ్లిన్ సిటీ యూనివర్శిటీ, యూనివర్సిటీ ఆఫ్ లిమెరిక్: 436వ స్థానంలో నిలిచాయి.ఈ సంస్థలు ముఖ్యంగా డేటా సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్స్లో ప్రోగ్రామ్లకు ప్రసిద్ధి చెందాయి. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇది గమ్యస్థానంగా తోస్తుంది. యూకే, ఆస్ట్రేలియాతో పోలిస్తే ఐర్లాండ్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్లకు ఇది ఎంతో ఉపయోగడుతుంది.విద్య తర్వాత పని అవకాశాలుఐర్లాండ్ పోస్ట్ స్టడీ వర్క్ పాలసీ విదేశీ విద్యార్థులను మరింత ఆకర్షిస్తోంది. 2023లో 7,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు పొందారు. థర్డ్ లెవల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ కింద, అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఐర్లాండ్లో ఉండి పనిచేయవచ్చు. ఇది అంతర్జాతీయ పని అనుభవాన్ని పొందడానికి తోడ్పడుతుంది. విద్యార్థులు అకడమిక్ పరంగా వారానికి 20 గంటలు, సెలవు దినాల్లో 40 గంటలు పనిచేయడానికి అనుమతులున్నాయి. ఇది వారి అకడమిక్ సమయంలో ఆర్థికంగా సహాయపడుతుంది.భారతదేశంతో సంబంధాలు బలోపేతంఐర్లాండ్-భారతదేశంలో విద్యార్థులు పెరుగుతున్న నేపథ్యంలో పరస్పరం విద్యా సహకారాలను పంచుకుంటున్నాయి. మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), సంయుక్త పరిశోధన కార్యక్రమాలతో సహా 30కి పైగా సంస్థాగత భాగస్వామ్యాలు ఇప్పటికే కుదుర్చుకున్నాయి. ఐర్లాండ్-ఇండియా ఎఫినిటీ డయాస్పోరా నెట్వర్క్ విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇది ఐర్లాండ్లోని భారతీయ విద్యార్థులకు సహాయక వ్యవస్థను అందిస్తోంది. ‘గ్లోబల్ సిటిజన్స్ 2030 ఇంటర్నేషనల్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ’ వంటి జాతీయ వ్యూహాల ద్వారా అంతర్జాతీయ విద్య పట్ల ఐర్లాండ్ నిబద్ధతను హైలైట్ చేస్తుంది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు ఐర్లాండ్ మొదటి ఎంపికగా ఉంచాలనే ప్రభుత్వ దార్శనికతను ఈ ఫ్రేమ్వర్క్ ప్రతిబింబిస్తుంది.ఇదీ చదవండి: బక్కచిక్కుతోన్న రూపాయి -
తయారీ లక్ష్యానికి పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ తయారీని ప్రోత్సహించడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్రాన్ని ఇండియా సెల్యులార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కోరింది. 2030–31 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ తయారీ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. కేవలం ప్రోడక్టుల తయారీకే పరిమితం కాకుండా ఫ్యాక్టరీలు, నగరాలు, రవాణా నెట్వర్క్లు మొదలైన వాటిని ఆటోమేట్ చేసేందుకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేస్తే ఎల్రక్టానిక్స్ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఇండ్రస్టియల్ ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ తెలిపారు. ’ప్రతి అధునాతన తయారీ సెటప్కి ఇది మెదడు, నాడీమండలం లాంటిది. తయారీ రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలంటే, పారిశ్రామిక ఆటోమేషన్లో అగ్రగామిగా ఎదగాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు.భారీగా ఉద్యోగావకాశాలు.. పారిశ్రామిక ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్కి సంబంధించి ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆటోమేషన్ సాఫ్ట్వేర్, రోబోటిక్స్, ఏఐ ఆధారిత సిస్టమ్స్ మొదలైన విభాగాల్లో నిపుణులకు భారీగా ఉద్యోగావకాశాలు ఉంటాయని మహీంద్రూ చెప్పారు. ఈ విభాగం మరింతగా అభివృద్ధి చెందేలా నిపుణులను తీర్చిదిద్దడంపై, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలపై ఇన్వెస్ట్ చేయడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఆధునిక తయారీ మౌలిక సదుపాయాల కల్పనకు ఇండస్ట్రియల్ ఎల్రక్టానిక్స్ సాంకేతికంగా వెన్నెముకలాంటిదని డెల్టా ఎల్రక్టానిక్స్ వీపీ మనీష్ వాలియా తెలిపారు. స్మార్ట్ ఫ్యాక్టరీలు, రోబోటిక్స్, ఇంటెలిజెంట్ గ్రిడ్స్, ఆటోమేటెడ్ సిస్టమ్స్, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు ఉండే రవాణా, లాజిస్టిక్స్ నెట్వర్క్లకు ఇది దన్నుగా నిలుస్తుందని వివరించారు. -
భారత్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి..
ఓలా, ఊబర్ వంటి రైడ్-హెయిలింగ్ దిగ్గజాలతో పోటీపడేందుకు సర్కారు ట్యాక్సీలు రంగంలోకి దిగుతున్నాయి. ఎనిమిది ప్రముఖ భారతీయ సహకార సంస్థలు భారత్ టాక్సీ సర్వీస్ను 2025 చివరి నాటికి ప్రారంభించేందుకు చేతులు కలిపాయి. జూన్ 6న అధికారికంగా నమోదైన మల్టీ-స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ రూ. 300 కోట్ల అధీకృత మూలధనంతో బలపడింది.ఈ సంస్థలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NCDC), ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF), కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD), నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB), నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) వంటి సంస్థలు భాగస్వామ్యం వహిస్తున్నాయి.ఈ సర్కారు ట్యాక్సీ సర్వీసు ఇప్పటికే ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుండి 200 మంది డ్రైవర్లను చేర్చుకుంది. ప్రతి రాష్ట్రం నుండి 50 మంది డ్రైవర్లు ఉన్నారు. భారత్ టాక్సీ సర్వీస్ డ్రైవర్లకు మెరుగైన ఆదాయాన్ని అందించడంతో పాటు, ప్రయాణీకులకు తక్కువ ధరకు, సురక్షితమైన, నమ్మదగిన రవాణా సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సహకార మోడల్ ద్వారా డ్రైవర్లు సభ్యులుగా వ్యాపారంలో భాగస్వామ్యం కలిగి ఉంటారు. ఇది యాజమాన్య భావనను, సమాజ భావనను పెంపొందిస్తుంది.త్వరలో ఒక టెక్నాలజీ భాగస్వామిని ఎంపిక చేసి, డిసెంబర్ 2025 నాటికి వినియోగదారులకు అనుకూలమైన రైడ్-హెయిలింగ్ యాప్ను ప్రారంభించనున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) బెంగళూరు, ఒక సలహాదారుతో కలిసి, భారత్ టాక్సీ సర్వీస్ను భారతదేశ మొబిలిటీ రంగంలో పోటీదారుగా నిలపడానికి బలమైన మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. సహకార నెట్వర్క్ను విస్తరించేందుకు సభ్యత్వ డ్రైవ్లు కూడా జరుగుతున్నాయి. -
ఏటీఎంలో రూ.500 నోట్లు కనుమరుగు?
ఏటీఎంలలో రూ.500 నోట్లు కనుమరుగు కానున్నట్లు ఓ సందేశం వాట్సాప్లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 30లోగా ఏటీఎంల ద్వారా రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులను ఆదేశించిదనేది ఆ సందేశం సారాంశం. అయితే ఆ వాట్సాప్ సందేశం అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది.రానున్న సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో రూ.500 నోట్ల జారీని నిలిపివేయాలనేది ఆర్బీఐ లక్ష్యం అంటూ కూడా ఫేక్ మెసేజ్లో పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఏటీఎంల ద్వారా రూ.100, రూ.200 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, కాబట్టి ఎవరి దగ్గరైనా రూ.500 నోట్లు ఉంటే వెంటనే మార్చేసుకోవాలని కూడా అందులో సూచించారు.వాట్సాప్లో విస్తృతంగా షేర్ అయిన ఈ తప్పుడు సందేశంపై స్పందించిన ప్రభుత్వ మీడియా విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఆర్బీఐ అలాంటి ఆదేశాలేవీ జారీ చేయలేదని, రూ.500 నోట్లు ఇప్పటికీ చట్టబద్ధమైనవేనని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని, వాటిని షేర్ చేసే ముందు అధికారిక వర్గాల ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.Has RBI really asked banks to stop disbursing ₹500 notes from ATMs by September 2025? 🤔A message falsely claiming exactly this is spreading on #WhatsApp #PIBFactCheck ✅ No such instruction has been issued by the @RBI✅ ₹500 notes will continue to be legal tender.… pic.twitter.com/9ia2t8Nf0K— PIB Fact Check (@PIBFactCheck) August 3, 2025 -
హైదరాబాద్లో మెర్జెన్ కార్యకలాపాలు ప్రారంభం
కృత్రిమ మేధ, వర్క్ ఫ్లో ఆటోమేషన్ సామర్థ్యాల్లో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా మెర్జెన్ కార్పొరేట్స్ తన అతిపెద్ద ‘సర్వీస్ నౌ డిజిటల్ వర్క్ ఫ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)’ను హైదరాబాద్లో ప్రారంభించింది. ఈ సెంటర్ కోసం మొత్తంగా 1 మిలియన్ డాలర్లను(సుమారు రూ.8.3 కోట్లు) వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ‘ఏదో అలా బ్రతికేస్తున్నాం.. అంతే..’ప్రస్తుతానికి కంపెనీలో 50+ సర్వీస్ నౌ నిపుణులు పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2026 ప్రారంభం నాటికి ఈ సంఖ్య రెట్టింపు కానున్నట్లు కంపెనీ పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన సెంటర్ 150 సీట్ల కెపాసిటీని కలిగి ఉన్నట్లు చెప్పింది. భవిష్యత్తులో దీని విస్తరణకు అనువుగా 8,000 చదరపు అడుగులు స్థలం ఉన్నట్లు స్పష్టం చేసింది. ఏఐ, లో-కోడ్ ప్లాట్ ఫామ్లు, ఏఐఓపీలు, పరిశ్రమ-నిర్ధిష్ట డిజిటల్ వర్క్ఫ్లోలను ఇందులో అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. మెర్జెన్ ఫౌండర్ అండ్ సీఈఓ మహంత్ మల్లికార్జున మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందుతున్న క్లయింట్ అవసరాలను తీర్చడానికి పరిశ్రమ నిర్దిష్ట పరిష్కారాలను అందిస్తున్నాం’ అన్నారు. -
సులువుగా యూఎస్ వీసా రావాలంటే..
యూఎస్ వీసా రావాలంటే కష్టమని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇటీవల వీసా ఇంటర్వ్యూకు హాజరైన ఒక స్టార్టప్ ఫౌండర్కు ఇట్టే వీసా అప్రూవ్ అయింది. తన వీసా ఇంటర్వ్యూలో ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో తనకు, తన భార్యకు యూఎస్ వీసా వచ్చినట్లు ప్రణవ్ దత్ ఓ పోస్ట్లో ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకీ వీసా ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలేంటో కింద చూద్దాం.ప్రణవ్కు ఎలాంటి ఆదాయం లేదు. పాత కంపెనీలో ఉద్యోగం వదిలేయడంతో ఎలాంటి ఉపాధి పత్రాలు లేవు. గతంలోనూ అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోలేదు. నిజాయితీగా దరఖాస్తు చేస్తే తప్పకుండా వీసా అవకాశం వస్తుందని తెలుసుకుని అప్లై చేశాడు. అమెరికా వీసా లేకపోయినా ‘ఎస్ఏఎస్ 1 మిలియన్ మైల్ ఛాలెంజ్’లో పాల్గొంటూ ప్రణవ్ దత్, ఆయన భార్య శ్రుతి పాటిల్ పలు దేశాల్లో పర్యటించారు. యూఎస్ వీసాకు సంబంధించి అభ్యర్థులు ఎంత నిజాయితీగా సమాధానం చెబుతున్నారు, ఎంత స్పష్టంగా కమ్యునికేట్ చేస్తున్నారో ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారని చెప్పారు.ఇదీ చదవండి: ‘మెటాలా అనైతిక ఆఫర్ ఇవ్వట్లేదు’ముంబై కాన్సులేట్లో వీసా ఇంటర్వ్యూ కోసం అడిగిన ప్రశ్నలు1. యూఎస్ ఎందుకు వెళుతున్నారు?2. యూఎస్లో ఎవరినైనా కలవాలనుకుంటున్నారా?3. మీ యూఎస్ ఫ్రెండ్ ఎక్కడ పనిచేస్తున్నాడు?4. మీరు ఇంతకు ముందు ఎక్కడ ప్రయాణించారు?5. ఏం చేస్తారు? (ఇద్దరిని)6. మీ ట్రిప్కు ఎవరు నిధులు సమకూరుస్తున్నారు?7. మీకు పెళ్లయిందా?8. పిల్లలు ఉన్నారా?9. ఇష్టమైన లాయల్టీ ప్రోగ్రామ్ ఏది? -
‘మెటా మాదిరి అనైతిక ఆఫర్ ఇవ్వట్లేదు’
మెటా వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న టాలెంట్ వార్పై ఎలాన్ మస్క్ మౌనం వీడారు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఏఐ టాలెంట్వార్ను ప్రారంభించారు. దాదాపు చాలా టాప్ టెక్నాలజీ కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను మెటాలో నియమించుకుంటున్నారు. అందుకోసం భారీగా వేతన ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విండ్సర్ఫ్.. వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.ఎక్స్ఏఐలో చేరిన మెటా ఇంజినీర్లను ఉద్దేశించి ఎలాన్ మస్క్ మాట్లాడుతూ..‘కంపెనీ ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐలో చాలా మంది మెటా ఇంజినీర్లు చేరారు. అయితే మెటా మాదిరిగా కాకుండా, ఎక్స్ఏఐ వారిని అనైతికంగా కంపెనీలో చేరడానికి భారీ వేతనాలు ఇవ్వడం లేదు. మెరుగైన నైపుణ్యం కలిగిన చాలా మంది మెటా ఇంజినీర్లు ఎక్స్ఏఐలో చేరుతున్నారు. మెటా కంటే ఎక్స్ఏఐకి చాలా ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ వృద్ధి సామర్థ్యం ఉంది. హైపర్ మెరిట్ ఆధారంగా నియమకాలు చేపడుతున్నాం. భారీ ప్యాకేజీల ఆశ చూపడం లేదు’ అని ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘అల్ట్రా హార్డ్ కోర్ ఇంజినీర్లకు ఎక్స్ఏఐ బెటర్ ప్లేస్’ అని మరో పోస్ట్లో రాసుకొచ్చారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: ట్రంప్ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
అందని జీతం.. ఫుట్పాత్పై పడుకున్న టీసీఎస్ ఉద్యోగి
ఐటీ జాబ్స్ తెచ్చుకోవడం చాలామంది కల. అయితే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక బిక్కుబిక్కు మంటున్న పరిస్థితి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. జీతాలు చెల్లించడంలో కూడా ఆలస్యమవుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి నిదర్శనమే పూణేలో జరిగిన ఈ ఘటన. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..పూణేలోని టీసీఎస్ ఉద్యోగి జీతం అందడంలో జాప్యం కారణంగా.. కంపెనీ సహ్యాద్రి పార్క్ కార్యాలయం వెలుపల పడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జీతం రాకపోవడంతో.. ఫుడ్ కోసం కూడా తన వద్ద డబ్బు లేకుండా పోయిందని ఉద్యోగి పేర్కొన్నాడు. దీనికి నిరసనగానే ఆఫీస్ బయట ఫుట్పాత్పై పడుకున్నాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఒక లేఖ కూడా రాశాడు.తన ఆర్ధిక పరిస్థితి గురించి 'హెచ్ఆర్'కు తెలియజేసినట్లు, జీతం రాకుంటే బయట పాడుకోవాల్సి వస్తుందని హెచ్చరించినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదని ఆ ఉద్యోగి పేర్కొన్నాడు. ఆ ఉద్యోగి ఫుట్పాత్పై పడుకున్న దృశ్యాలు, తన పరిస్థితి గురించి వెల్లడించిన లేఖ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. కంపెనీ తీరుపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆ ఉద్యోగిపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరికచాలామంది నెటిజన్లు కంపెనీ ఉద్యోగి పట్ల మౌనం వహించడాన్ని విమర్శించారు. కార్మిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కోరారు. మరికొందరు టెక్ పరిశ్రమలో జీతాల ఆలస్యానికి సంబంధించిన సమస్యలను హైలైట్ చేశారు.A TCS employee is apparently protesting by sleeping outside the Pune office because his salary has not been credited.😢 pic.twitter.com/MV4rPRa4P7— Jaydeep (@_jaydeepkarale) August 3, 2025టీసీఎస్ ఏమన్నదంటే..సదరు ఉద్యోగి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడని, అందుకే కంపెనీ నియమావళి ప్రకారం ఆ గైర్హాజరైన కాలానికి వేతనం నిలుపుదల చేయడం జరిగిందని టీసీఎస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. ప్రస్తుతం ఆ ఉద్యోగి తిరిగి విధుల్లో చేరాడని, అతనికి వసతి కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నాయి. -
ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయని చైనా
ప్రభుత్వ ఉద్యోగులపై చైనా ప్రభుత్వం వింత వింత ఆంక్షలు పెడుతోంది. ఉపాధ్యాయులు, వైద్యులు సహా ప్రభుత్వ యాజమాన్యంలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులెవరినీ దేశం దాటి విదేశాలకు వెళ్లనీయడం లేదు. ప్రజల్లో సైద్ధాంతిక భావాలు సడలకుండా ఉండేందుకు, విదేశీ ప్రభావాన్ని అరికట్టడానికి, జాతీయ భద్రతను పెంచడానికి చైనా ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంది.కీలక ఆంక్షలు ఇవే..పాస్ పోర్ట్ సరెండర్: చాలా మంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఇప్పుడు తమ పాస్ పోర్ట్ లను స్థానిక అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది.వ్యక్తిగత ప్రయాణానికి అనుమతి తప్పనిసరి: విదేశాలలో వ్యక్తిగత సెలవులను కూడా యజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలు ఆమోదించాలి. అయితే విదేశీ పర్యటనలకు అనుమతులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు.విదేశాల్లో చదువుపై నిషేధం: చాలా ప్రావిన్సుల్లో విదేశాల్లో చదువుకున్న వ్యక్తులు ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పదవులకు అనర్హులు.వ్యాపార ప్రయాణ ఆంక్షలు: సాధారణ పరిశోధన, అధ్యయనం ప్రయాణాలను కూడా అనేక ప్రాంతాలలో నిషేధించారు.ఇదంతా ఎందుకంటే..తమ దేశ ప్రజలపై ముఖ్యంగా విద్యావేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులలో విదేశీ సైద్ధాంతిక ప్రభావం గురించి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఆందోళన చెందుతోంది. రాజకీయ క్రమశిక్షణ, పార్టీ పట్ల విధేయతను బలోపేతం చేసే విస్తృత ప్రచారంలో భాగంగా ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విదేశాలతో ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కూడా అధికారులు మ్యాపింగ్ చేస్తున్నారు.ఆంక్షల పరిధి, ప్రభావంచైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ఆంక్షలు చైనా శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ పట్టణ స్థానిక సంస్థలలో పనిచేసే సుమారు 16.7 కోట్ల మందిపై వీటి ప్రభావం పడుతోంది. కొన్ని నగరాల్లో రిటైరైన వారు కూడా తమ పాస్పోర్టులను తిరిగి పొందడానికి రెండేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. కొంతమంది ఉద్యోగులనైతే సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని, తమ నివాస నగరాన్ని విడిచి వెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని అడుగుతున్నారట. -
యూఏఈకి ఉచిత వీసాలు
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పరిధిలోని ఆబుదాబిలో ఉపాధి కల్పనకు ఉచిత వీసాల జారీకి ఏడీఎన్హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి నియామకాల మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఈనెల 16న జగిత్యాలలో, 17న నిజామాబాద్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.క్లీనింగ్ విభాగంలో పని కల్పించడానికి ఇంటర్వ్యూలను నిర్వహించనుండగా.. 21 ఏళ్లు నిండి, 38 ఏళ్లలోపు వయసున్న వారు ఈసీఎన్ఆర్ పాస్పోర్టు కలిగి ఉంటే నియామకాల మేళాకు హాజరు కావచ్చు. ఎంపికైన వారికి మన కరెన్సీలో రూ.22 వేల వేతనం ప్రతి నెలా చెల్లించనున్నారు. ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనున్నారు.వివరాలకు ఆర్మూర్ (8332062299), సిరిసిల్ల (9347661522), నిజామాబాద్ (8686860999), జగిత్యాల్ (8332042299)ల్లోని జీటీఎం సంస్థ శాఖలను సంప్రదించాలని సంస్థ చైర్మన్ చీటీ సతీశ్రావు వెల్లడించారు. ఉచిత వీసాలతో పాటు ఉచిత టికెట్ల కోసం నిర్వహిస్తున్న ఈ నియామకాల మేళాను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎవరికి నయాపైసా చెల్లించాల్సిన అవసరం లేదని సతీశ్రావు స్పష్టం చేశారు. -
విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?
చాలా మంది భారతీయులు విదేశాల్లో విజయవంతమైన కెరీర్ సొంతం చేసుకోవడమే కాకుండా.. అతిపెద్ద పారిశ్రామికవేత్తల లీగ్లో కూడా నిలిచారు. వ్యాపార, పరిశ్రమల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వారిలో ఒకరు 'ప్రకాష్ లోహియా'. ఇంతకీ ఈయన ఎవరు?, నెట్వర్త్ ఎంత? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.కోల్కతాకు చెందిన ప్రకాష్ లోహియా.. 1952 ఆగస్టు 11న మోహన్ లాల్ లోహియా & కాంచన్ దేవి లోహియా దంపతులకు జన్మించారు. 1973లో తన తండ్రితో కలిసి ఇండోనేషియాకు మకాం మార్చారు. అక్కడ వారు 1976లో స్పన్ నూలు ఉత్పత్తిదారు ఇండోరమా కార్పొరేషన్ను స్థాపించారు. ఈ కంపెనీ ఎరువులు, పాలియోలిఫిన్లు వంటి ఉత్పత్తులను తయారు చేసేది.ప్రకాష్కు ఒక అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. కాబట్టి వీరి తండ్రి మోహన్ లాల్ లోహియా తమ వ్యాపారం వృద్ధి చెందడానికి, కుటుంబ వివాదాలను నివారించడానికి వారి 1980లలో ఆస్తిని ముగ్గురు కుమారులకు విభజించారు. ఆ తరువాత ప్రకాష్ లోహియా అన్నయ్య ఓం ప్రకాష్ భారతదేశానికి తిరిగి వచ్చి ఇండోరామా సింథటిక్స్ను స్థాపించారు. తమ్ముడు అలోక్ థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఉన్ని నూలును తయారు చేసే ఇండోరామా హోల్డింగ్స్ను స్థాపించారు.అన్న, తమ్ముడు సొంత వ్యాపారాలను ప్రారభించుకున్న తరువాత.. ప్రకాష్ లోహియా 2006లో నైజీరియాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఓలేఫిన్ ప్లాంట్ను కొనుగోలు చేశాడు. ఇది అప్పట్లోనే పశ్చిమ ఆఫ్రికాలో అతిపెద్ద పెట్రోకెమికల్ సంస్థ, ఆఫ్రికాలో రెండవ అతిపెద్ద ఓలేఫిన్ల ఉత్పత్తిదారు.ప్రకాష్ లోహియా.. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ & సీఈఓ, భారతదేశ బిలియనీర్లలో ఒకరైన లక్ష్మీ మిట్టల్ సోదరి సీమా లోహియా భర్త. 2025 నాటికి ప్రపంచ బిలియనీర్లలో ఆయన 353వ స్థానంలో.. 2024 నాటికి ఇండోనేషియాలోని 50 మంది అత్యంత ధనవంతులలో ఆరవ స్థానంలో ఉన్నారు.ఇదీ చదవండి: టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..ప్రకాష్ లోహియా నెట్వర్త్లోహియా నికర విలువ 8.3 బిలియన్ డాలర్ల (రూ. 72,000 కోట్లు) కంటే ఎక్కువ అని ఫోర్బ్స్ వెల్లడిస్తూ.. ఈయనను ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా & ఇండోనేషియాలోని టాప్ పది బిలియనీర్లలో ఒకరిగా పేర్కొంది. ఈయన SP లోహియా ఫౌండేషన్ను కూడా స్థాపించి.. దీని ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు కళా కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. -
ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తి అప్పుడే సాధ్యం
వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాటలు సర్వత్రా చర్చకు దారితీశాయి. ఆ తరువాత వారానికి 90 గంటలు పనిచేయాలని లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ అన్నారు. అయితే ఇప్పుడు వారానికి 80 గంటలు పనిచేయాలని శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న భారతీయ వ్యవస్థాపకురాలు 'నేహా సురేష్' అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.''మీరు మీ కలను సాకారం చేసుకోవాలంటే రోజుకు 14 గంటలు పని చేయాలి. రోజూ 9 నుంచి 5 గంటల వరకు పనిచేస్తే ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తిని అభివృద్ధి చేయలేరు. వారానికి 80 గంటల పని అనేది అంత కష్టమైనదేమీ కాదు'' అంటూ నేహా సురేష్ ట్వీట్ చేస్తూ.. ఒక వీడియో కూడా షేర్ చేసారు.ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకినేహా సురేష్ షేర్ చేసిన వీడియోలో.. ఆమె సహా వ్యవస్థాపకుడు ఆకాష్ పనిచేస్తున్నారు. ఇందులో వారి రోజువారీ పని ఎలా జరుగుతుందో గమనించవచ్చు. మధ్య మధ్య చిన్న బ్రేక్స్ తీసుకుని వారి పనిని కొనసాగిస్తుండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.If you're not spending 14+ hours a day working on your dream you're ngmi. You can’t build a world-changing product on 9–5 energy.80-hour weeks aren’t extreme. It's baseline. pic.twitter.com/6lTxrqUxJZ— Neha (@Neha_Suresh_M) July 31, 2025 -
సెమీకండక్టర్ రంగంలో భారత్: ఏటా 24 బిలియన్ చిప్లు
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమోదం తెలిపిన సెమీకండక్టర్ పరిశ్రమల ద్వారా ఏటా 24 బిలియన్ చిప్లు దేశీయంగా తయారు కానున్నట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్ శాఖ అదనపు సెక్రటరీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ సీఈవో అమితేష్ సిన్హా ప్రకటించారు.ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టాటా ఎలక్ట్రానిక్స్కు చెందిన ఒక వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ సహా మొత్తం ఆరు ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ''ఈ ఫ్యాబ్ నెలకు 50,000 వేఫర్లను తయారు చేస్తుంది. మిగిలిన ఐదు ప్యాకేజింగ్ యూనిట్లు 24 బిలియన్ చిప్స్ను ఏటా ఉత్పత్తి చేస్తాయి. మరిన్ని ప్రతిపాదనలను మదింపు దశలో ఉన్నాయి. కనుక సమీప కాలంలో మరిన్ని ప్రతిపాదనలకు అనుమతులు ఇవ్వనున్నాం''అని సిన్హా తెలిపారు.విధానాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయని భరోసానిస్తూ.. సెమీకండక్టర్ రంగంలో భారత్ దీర్ఘకాల మార్కెట్గా కొనసాగుతుందన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమకు మద్దతుగా కేంద్రం రూ.76,000 కోట్లతో పథకాన్ని ప్రకటించడం తెలిసే ఉంటుంది. సరఫరా వ్యవస్థను సైతం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ విశ్వసనీయమైన భాగస్వామిగా పేర్కొన్నారు. -
జీసీసీల్లో కొలువుల సందడి
న్యూఢిల్లీ: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టనున్నాయి. భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, జేఎల్ఎల్ ఇండియాతో కలిసి ట్యాగ్డ్ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 48 శాతం జీసీసీల్లో హైరింగ్ను పెంచుకోవడంపై సానుకూల సెంటిమెంటు నెలకొంది. 19 శాతం సంస్థలు 2024 ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే నియామకాలను కొనసాగించే యోచనలో ఉన్నాయి. ఇటు ఖర్చులు, అటు సమర్ధత మధ్య సమతౌల్యాన్ని పాటించేలా 1–5 ఏళ్ల అనుభవం గల వారిని రిక్రూట్ చేసుకోవడంపై జీసీసీలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. కెరియర్లో పెద్దగా పురోగతి లేకుండా 18–24 నెలల పాటు ఒకే హోదాలో ఉండిపోవడానికి జెనరెషన్ జెడ్ ప్రొఫెషనల్స్ ఇష్టపడకపోతుండటంతో, ఉద్యోగంలో కొనసాగే సగటు వ్యవధి గణనీయంగా తగ్గిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. వివిధ రంగాలవ్యాప్తంగా 100కు పైగా జీసీసీలపై అధ్యయనం ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందింది. ప్రధాన హబ్లలోనే రిక్రూట్మెంట్.. ప్రధాన హబ్లుగా ఉంటున్న నగరాల నుంచే ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాలని 60 శాతం జీసీసీలు భావిస్తున్నాయి. 29 శాతం సంస్థలు మాత్రం ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నగరాల మేళవింపుతో నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి. ఇక 13 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి రిక్రూట్ చేసుకోనున్నాయి. కృత్రిమ మేథ (ఏఐ) కారణంగా జీసీసీల్లో నియామకాల ప్రక్రియలో గణనీయంగా మార్పులు వస్తున్నట్లు నివేదిక తెలిపింది. 48 శాతం జీసీసీలు ఏఐ ఆధారిత హైరింగ్ టూల్స్ను ఉపయోగించే యోచనలో ఉండగా, ఇప్పటికే 24 శాతం సంస్థలు వివిధ స్థాయుల్లో వాటిని ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. -
ఒక్క రూపాయికే వీసా.. రెండు రోజులే ఛాన్స్
విదేశాలకు వెళ్తున్న భారతీయులకు వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అట్లిస్ (Atlys) బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు 15 దేశాలకు కేవలం ఒక్క రూపాయికే వీసాలు ఇస్తామని తెలిపింది. 'వన్ వే అవుట్' పేరుతో ప్రకటించిన ఈ పరిమిత కాల ఆఫర్ ఆగస్టు 4, 5 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణాలను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఈ సేల్ నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.వీసా సంబంధిత ఖర్చులు, తిరస్కరణలు పెద్ద ఆర్థిక భారంగా మారిన తరుణంలో అట్లిస్ రూ.1కే వీసా అందించడం విదేశీ ట్రిప్లకు వెళ్లే భారతీయులకు ఇది సువర్ణ అవకాశం. పరిశ్రమ అంచనాల ప్రకారం, భారతీయ ప్రయాణికులు 2024లో మాత్రమే నాన్-రిఫండబుల్ వీసా ఫీజుల రూపంలో రూ .664 కోట్లకు పైగా నష్టపోయారు. అంతర్జాతీయ ప్రయాణాలను సామాన్యులకు అందుబాటులోకి తేవాలని, వీసా దరఖాస్తులతో ముడిపడి ఉన్న ఆర్థిక ఆందోళనను తొలగించాలనుకుంటున్నామని అట్లిస్ సీఈఓ మోహక్ నహ్తా పేర్కొన్నారు.ఆఫర్ వర్తించే దేశాలుయూఏఈ, యునైటెడ్ కింగ్డమ్, వియత్నాం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, ఈజిప్ట్, హాంగ్ కాంగ్, జార్జియా, ఒమన్, మొరాకో, ఖతార్, కెన్యా, తైవాన్. ఈ-వీసా దేశాలకు రూ.1 ఆఫర్ అట్లిస్ సర్వీస్ ఫీజు ప్రభుత్వ రుసుము రెండింటినీ కవర్ చేస్తుంది. అయితే వీసా కోసం వ్యక్తిగత హాజరు అవసరమైన యునైటెడ్ స్టేట్స్, కొన్ని సెంజెన్ దేశాలకు (ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ మొదలైనవి)అట్లిస్ దరఖాస్తు రుసుము మాత్రమే కవర్ అవుతుంది. ఇక దరఖాస్తుదారు ప్రాసెసింగ్ కేంద్రం వద్ద కాన్సులేట్, బయోమెట్రిక్ ఫీజులు వంటి ప్రభుత్వ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్టులను కలిగి ఉండి, కంపెనీ వెబ్సైట్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే భారతీయ నివాసితులు మాత్రమే ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. మీరు ఏజెంట్ లేదా థర్డ్ పార్టీని ఉపయోగిస్తే ఇది వర్తించదు. ఈ ఆఫర్ కింద మీరు ఒక వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఒక్కరికి మాత్రమే రూ.1 వీసా ఆఫర్ వర్తిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంటే వారికి రెగ్యులర్ వీసా ఛార్జీలు వర్తిస్తాయి.గ్రూప్, బల్క్ లేదా బిజినెస్ బుకింగ్స్కు ఈ ఆఫర్ వర్తించదు. దరఖాస్తు చేసుకోవడానికి, చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్పోర్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయాలి. గమ్యస్థాన దేశ నిబంధనలను బట్టి ఫైనాన్షియల్ ప్రూఫ్ లేదా ట్రావెల్ బుకింగ్స్ వంటి ఇతర అవసరమైన డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలి.రాయబార కార్యాలయం డాక్యుమెంట్ నిబంధనలను నిర్ణయిస్తుంది కాబట్టి, మీ పత్రాలు తప్పుగా లేదా అసంపూర్ణంగా ఉంటే మీ వీసా తిరస్కరించే అవకాశం ఉంటుంది. స్లాట్లను రాయబార కార్యాలయాలు నియంత్రిస్తున్నందున వీసా నియామకాలకు గ్యారంటీ ఉండదు.ఆఫర్ పొందండిలా.. రూ .1 వీసా ఆఫర్ పొందడానికి, అట్లిస్ వెబ్సైట్ (www.atlys.com)లో దరఖాస్తును ఆగస్టు 4 (ఉదయం 6 గంటలకు) నుండి ఆగస్టు 5 (రాత్రి 11:59 గంటలకు) మధ్య పూర్తి చేసి సమర్పించాలి. ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆఫర్ ఉంటుంది. ఎవరు ముందుగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ వెబ్ సైట్ లో సెల్ఫీ వెరిఫికేషన్ తప్పనిసరి. -
రెండు బ్యాంకుల విలీనానికి ఆర్బీఐ ఆమోదం
సహకార బ్యాంకింగ్ విభాగంలో ఇటీవల మోసాలకు గురైన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎన్ఐసీబీ)ను సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (ఎస్సీబీ)లో విలీనం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. ఈ విలీనం అధికారికంగా 2025 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ తేదీ నుంచి అన్ని ఎన్ఐసీబీ శాఖలు సారస్వత్ బ్యాంక్లో భాగంగా పనిచేస్తాయి.సారస్వత్ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..ఎన్ఐసీబీ డిపాజిటర్లతో సహా ఖాతాదారులను 2025 ఆగస్టు 4 నుంచి సారస్వత్ బ్యాంక్ కస్టమర్లుగా పరిగణిస్తామని తెలిపింది. వారి ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తామని పేర్కొంది. ఈ విలీన ప్రక్రియలో భాగంగా ఎన్ఐసీబీ ఆస్తులు, అప్పులన్నింటినీ సారస్వత్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంటుంది. డిపాజిట్లు, అడ్వాన్సులతో సహా ఎన్ఐసీబీ బ్యాంకింగ్ కార్యకలాపాలను సారస్వత్ వ్యవస్థలో విలీనం చేయనున్నారు.ఈ విలీనంతో సారస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్గా మారుతుంది. మార్చి 31, 2025 నాటికి మొత్తం వ్యాపారం (డిపాజిట్లు + అడ్వాన్సులు) రూ.91,800 కోట్లుగా ఉంది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ మార్చి 2025 నాటికి మొత్తం రూ.3,500 కోట్ల వ్యాపారం సాగించింది. ఇదీ చదవండి: బీర్ పరిశ్రమలో ఊహించని సమస్య2025 ఫిబ్రవరిలో న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్కు చెందిన ప్రభాదేవి ప్రధాన కార్యాలయం, గోరేగావ్ శాఖలో ఆర్బీఐ సాధారణ తనిఖీ సమయంలో రూ .122 కోట్ల అవకతవకలను కనుగొంది. ఫిజికల్ క్యాష్, లెడ్జర్ ఎంట్రీల మధ్య వ్యత్యాసాలతో వాల్ట్ల్లోని నగదులో మోసం జరిగినట్లు ధ్రువీకరించింది. -
గూగుల్ ప్లేలో రియల్ మనీ గేమ్స్
చట్టబద్ధమైన రియల్ మనీ గేమ్స్ (ఆర్ఎంజీ) అన్నింటిని భారత్లోని తమ ప్లేస్టోర్లో అనుమతించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్ ప్రతిపాదన చేసింది.ఎంపిక చేసిన నిర్దిష్ట డైలీ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (డీఎఫ్ఎస్), రమ్మీ యాప్లకు మాత్రమే ప్లేస్టోర్లో చోటు కల్పించే ప్రయోగాత్మక ప్రోగ్రాంను నిలిపివేసే విధంగా ఇది ఉండనుంది. మరోవైపు, నైపుణ్యాల ఆధారిత గేమ్స్ను ప్రమోట్ చేసేందుకు వీలుగా తమ యాడ్ పాలసీలో కూడా మార్పులు చేసే యోచన ఉన్నట్లు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి గూగుల్ తెలిపింది.మార్కెట్లో పోటీని దెబ్బతీసే విధానాలను అమలు చేస్తోందన్న విన్జో గేమ్స్ ఫిర్యాదుపై సీసీఐ విచారణ చేపట్టిన నేపథ్యంలో గూగుల్ ఈ మేరకు ప్రతిపాదన చేసింది. దీనిపై ఆగస్టు 20 లోపు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలపాల్సి ఉంటుంది. -
బీర్ పరిశ్రమలో ఊహించని సమస్య
భారతీయ బీర్ పరిశ్రమ ఊహించని సమస్యలతో సతమతం అవుతుంది. దాదాపు రూ.38,000 కోట్లకు పైగా విలువైన ఈ విభాగం బీర్ నింపేందుకు అల్యూమినియం డబ్బాల కొరత ఎదుర్కొంటుంది. బ్రేవరేజ్ సంస్థల అంచనాబట్టి సుమారు 12-13 కోట్ల 500 మిల్లీలీటర్ల డబ్బాల వార్షిక లోటు ఉంది. ఇది మొత్తం డిమాండ్లో సుమారు 20% ఉండడం గమనార్హం. ఈ కొరత బీర్ క్యాన్ల లోటును తెలియజేయడంతోపాటు పెరుగుతున్న డిమాండ్, తగినంత దేశీయ మౌలిక సదుపాయాలు లేకపోవడం, ప్రపంచ సరఫరా పరిమితులు, కొత్త నియంత్రణ ఒత్తిళ్లను హైలైట్ చేస్తుంది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించకపోతే పరిశ్రమ వృద్ధి మందగించే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.క్యాన్లకు పెరుగుతున్న డిమాండ్ఒకప్పుడు సీసాల తర్వాత అల్యూమినియం క్యాన్లు సెకండరీ ప్యాకేజింగ్ ఎంపికగా ఉండేవి. కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ ఇవే ప్యాకింగ్లో ప్రధానంగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద బీర్ కంపెనీ అయిన యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్(యూబీఎల్) క్యాన్ల మొత్తం పరిమాణంలో 22% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్య ఉత్తర ప్రదేశ్ వంటి అధిక వృద్ధి ఉన్న మార్కెట్లలో 75–80% వరకు పెరిగింది. ఆ రాష్ట్రంలోని ఎక్సైజ్ విధాన మార్పులు క్యాన్లను చౌకగా, వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చాయి.పరిమిత సరఫరా మౌలిక సదుపాయాలుదేశంలో కేవలం మూడు అల్యూమినియం క్యాన్ల తయారీ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. అందులో రెండింటిని విదేశీ యాజమాన్యంలోని కాన్ప్యాక్, బాల్ కార్పొరేషన్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. క్యాన్ ఉత్పత్తికి అవసరమైన అల్యూమినియంలో గణనీయమైన భాగం ఇతర దేశాల నుంచే దిగమతి చేసుకుంటున్నారు. ప్రపంచ సరఫరా గొలుసు అంతరాయాల ప్రభావం దీనిపై అధికంగా ఉంది.సాఫ్ట్డ్రింక్స్లో..నాన్ ఆల్కహాలిక్ విభాగంలో క్యాన్లకు డిమాండ్ పెరగడంతో బీర్ క్యాన్ల కొరత తీవ్రమవుతోంది. కోకాకోలా, పెప్సికో వంటి శీతల పానీయాల దిగ్గజాలు క్యాన్ ఆధారిత ఉత్పత్తులను వేగంగా పెంచుతున్నాయి.రెగ్యులేటరీ నిబంధనలుఏప్రిల్ 2025లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దిగుమతులతో సహా అన్ని అల్యూమినియం డబ్బాలకు సర్టిఫికేషన్ను తప్పనిసరి చేసింది. అందులో క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను (క్యూసీఓ) అమలు చేస్తుంది. నాణ్యత, భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నప్పటికీ తక్షణ డిమాండ్కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. బీఐఎస్ సర్టిఫికేషన్కు విదేశీ తయారీ ప్లాంట్లను ఫిజికల్గా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అందులో జాప్యం జరుగుతుంది.ఇండస్ట్రీ ఇబ్బందులుబీఐఎస్ సర్టిఫికేషన్ అమలును ఒక సంవత్సరంపాటు (2026 ఏప్రిల్ వరకు) వాయిదా వేయాలని బ్రేవరీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) ప్రభుత్వాన్ని కోరింది. బీఐఎస్ సర్టిఫికేషన్ అవసరాన్ని దేశీయ ఉత్పత్తిదారులకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పింది. దిగుమతులపై ఆంక్షలు విధించకూడదని తెలిపింది. ఇప్పటికే యూబీఎల్ విభిన్న మార్కెట్లలో క్యాన్ల కొరత ఉందని తెలిపింది. దాంతో గత ఆరు నెలల్లో 1–2 శాతం నష్టాన్ని అంచనా వేసింది.ఇదీ చదవండి: యాపిల్లో ఇంజినీర్ కనీస వేతనం ఎంతంటే..ఇప్పుడు ఏం చేయాలి?క్యాన్ల సంక్షోభం మరింత పెరగకుండా నిరోధించడానికి బ్రేవరేజెస్, ఇతర సంస్థలు తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశీయ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాలని సూచిస్తున్నారు. కొత్త క్యాన్ తయారీ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలంటున్నారు. టెక్నాలజీ, వీటి ఏర్పాటుకు మూలధనం కోసం గ్లోబల్ కంపెనీలతో జాయింట్ వెంచర్లు చేపట్టాలని చెబుతున్నారు. -
యాపిల్లో ఇంజినీర్ కనీస వేతనం ఎంతంటే..
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్ విదేశీ ఉద్యోగుల ప్యాకేజీ వివరాలను వెల్లడించింది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కు సమర్పించిన వివరాల ప్రకారం వివిధ హోదాల్లో పని చేస్తున్న కంపెనీ ఇంజినీర్ల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి. ఇందులో ఇంజినీర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్ట్లు.. ఉన్నారు.ఇంజినీరింగ్ ఉద్యోగాలు (వార్షిక మూల వేతనం యూఎస్ డాలర్లలో)సీపీయూ ఇంప్లిమెంటేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 2,64,200టెస్ట్ ఇంజినీర్ డిజైన్: 1,31,352 - 2,93,800డిజైన్ వెరిఫికేషన్: 1,03,164 - 3,12,200ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్: 1,08,160 - 2,64,200ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ / ప్రోగ్రామ్ మేనేజర్: 1,05,550 - 3,01,400ఎఫ్ఈ ఇంజినీరింగ్: 1,25,694 - 3,12,200హార్డ్ వేర్ డెవలప్మెంట్: 1,24,942 - 2,93,800హార్డ్వేర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,25,495 - 3,78,700మాడ్యూల్ డిజైన్ ఇంజినీర్: 1,08,796 - 3,29,600ఫిజికల్ డిజైన్ ఇంజినీర్: 1,01,982 - 3,41,200ప్రొడక్షన్ సర్వీసెస్ ఇంజినీర్: 1,22,800 - 2,93,800సిలికాన్ వాలిడేషన్ ఇంజినీరింగ్: 1,03,164 - 3,29,600సిస్టమ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజినీర్: 1,03,164 - 3,12,200టూల్స్ అండ్ ఆటోమేషన్ ఇంజినీర్: 1,05,602 - 2,93,800వైర్లెస్ సిస్టమ్స్ ఇంజినీరింగ్: 1,28,300 - 3,12,200వైర్లెస్ సిస్టమ్స్ వాలిడేషన్ ఇంజినీర్: 1,26,672 - 3,12,200డేటా ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)డేటా ఇంజినీర్: 1,05,602 - 2,34,700డేటా సైంటిస్ట్: 1,05,550 - 3,22,400మెషీన్ లెర్నింగ్ (జనరల్): 1,26,880 - 3,29,600మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్: 1,43,100 - 3,12,200మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్: 1,14,100 - 3,12,200ఇదీ చదవండి: చెంత ఏఐ ఉందిగా..!సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలు (వార్షిక బేస్ శాలరీ డాలర్లలో)ఏఆర్/వీఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్: 1,29,805 - 3,12,200హ్యూమన్ ఇంటర్ఫేస్ డిజైనర్: 1,35,400 - 4,68,500సాఫ్ట్వేర్ డెవలపర్: 1,32,267 - 2,64,200సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్: 1,32,267 - 3,78,700సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ - అప్లికేషన్స్: 1,32,267 - 3,78,700 -
చెంత ఏఐ ఉందిగా..!
కృత్రిమ మేధ సహాయంతో కంపెనీ ఉత్పాదకతను మరింత పెంచాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. అసాధారణ పెట్టుబడి వ్యూహాలు ఉన్నప్పుడు ఉత్పాదకత కూడా అందుకు తగినట్లుగా మారాలని చెప్పారు. అందుకు కృత్రిమ మేధను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. అందుకోసం కంపెనీ అంతర్గతంగా కొన్ని మోడల్స్ను ఆవిష్కరించినట్లు చెప్పారు.‘ఉత్పాదకతను పెంచడానికి మనం మరింత సాధించాలని అనుకుంటున్నాను. మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ప్రయత్నిద్దాం. గూగుల్ ప్రస్తుత పనితీరుపై ఆశావహంగా ఉన్నాను’ అని సుందర్ తెలిపారు. ఈ సమావేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల (ఎస్డబ్ల్యూఈ) కోసం కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొన్ని సాధనాలను వివరించారు. కంపెనీ అవసరాలను తీర్చడానికి కృత్రిమ మేధను మరింత వేగంగా, అత్యవసరంగా కోడింగ్ వర్క్ఫ్లోలో అమలు చేయాలని చెప్పారు. దీనిద్వారా పనిలో వేగం పెరుగుతుందన్నారు.ఇదీ చదవండి: మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనంగూగుల్ ఫ్లాగ్షిప్ ఉత్పత్తుల కోసం టెక్నికల్ ఫౌండేషన్ బృందాలకు నేతృత్వం వహిస్తున్న బ్రియాన్ సలుజో ‘ఏఐ-సావీ’ని రూపొందించినట్లు చెప్పారు. ఏఐ సావీ గూగుల్.. కోర్సులు, టూల్కిట్లు, ప్రొడక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ సెషన్లను అందించే ఒక అంతర్గత వేదికగా ఉంటుంది. ఈ సమావేశంలో గూగుల్ జెమినీ మోడల్స్తో ఇంజినీర్లకు సహాయపడటానికి డీప్ మైండ్తో అభివృద్ధి చేసిన శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. -
డేట్ ఫిక్స్.. ఇండియాలో టెస్లా ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ అక్కడే
అమెరికన్ కార్ల దిగ్గజం 'టెస్లా' భారత మార్కెట్లో తమ మొట్టమొదటి షోరూమ్ను ప్రారంభించింది. కాగా ఇప్పుడు మొదటి ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించడానికి సన్నద్ధమైంది. టెస్లా వై కారును ఆవిష్కరించిన తరువాత.. కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.టెస్లా భారతదేశంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ను ఆగస్టు 4న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రారభించనుంది. కొత్త టెస్లా ఛార్జింగ్ హబ్లో మొత్తం ఎనిమిది ఛార్జింగ్ యూనిట్లు ఉంటాయి. ఇందులో నాలుగు వీ4 సూపర్చార్జర్లు (DC ఫాస్ట్ ఛార్జర్లు), నాలుగు డెస్టినేషన్ ఛార్జర్లు (AC ఛార్జర్లు).వీ4 సూపర్చార్జర్లు kWhకి రూ.24, డెస్టినేషన్ ఛార్జర్లు kWhకి రూ.14 చొప్పున ఛార్జ్ ఉంటుంది. V4 సూపర్చార్జర్లు మోడల్ Y కి 15 నిమిషాల్లో 267 కిలోమీటర్ల పరిధిని అందించడానికి కావాల్సిన ఛార్జ్ చేయగలదని టెస్లా పేర్కొంది. అంటే టెస్లా వై కారుకు 15 నిముషాలు సూపర్చార్జర్ ద్వారా ఛార్జ్ చేస్తే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం& గేట్వే ఆఫ్ ఇండియా మధ్య ఐదు ట్రిప్పులు తిరగవచ్చని కంపెనీ వెల్లడించింది.టెస్లా మోడల్ వైభారతదేశంలో టెస్లా మోడల్ వై కారును ప్రారంభించిన తరువాత.. కంపెనీ బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కారును ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై నగరాల్లో మాత్రమే బుక్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో సంస్థ మరిన్ని నగరాలకు విస్తరించనుంది.టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ ధర రూ. 59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్), లాంగ్ రేంజ్ RWD వెర్షన్ రూ. 67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. రెండు మోడళ్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో.. ఒక ఛార్జ్పై 500 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీ ఒక ఛార్జ్పై 622 కిమీ రేంజ్ అందిస్తుంది. రెండు వెర్షన్లు దాదాపు 295 హార్స్పవర్ను ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతాయి. పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. టెస్లా మోడల్ వై బేస్ RWD మోడల్ 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది, అయితే లాంగ్ రేంజ్ వెర్షన్ కొన్ని 5.6 సెకన్లలో ఈ వేగాన్ని చేరుకుంటుంది. అయితే వీటి టాప్ స్పీడ్ 201 కిమీ/గం. -
మెటా తీరుతో ఇతర కంపెనీలు సర్వనాశనం
కృత్రిమ మేధస్సు(ఏఐ) విభాగంలో కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ హంటింగ్ అనూహ్య స్థాయికి చేరుకుంది. ఓపెన్ఏఐ అగ్ర నిపుణులను ఆకర్షించడానికి మెటా 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ.870 కోట్లు) బోనస్ను సైతం ఆఫర్ చేస్తున్న తరుణంలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ వైరల్గా మారింది. మెటా వంటి పోటీదారుల నుంచి వచ్చే వేతన ఆఫర్లు కంపెనీల సంస్కృతిని నాశనం చేస్తాయని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు.ఇతర కంపెనీలు ఆఫర్ చేసే ఆర్థిక ప్రోత్సాహకాల కంటే ఆంత్రోపిక్ తన మిషన్ పట్ల నిబద్ధతగా వ్యవహరించాలని ఆయన ఉద్యోగులను కోరారు. మెటా అసాధ్యాన్ని సాధ్యం చేయాలనే తప్పుడు ఆలోచనతో ఉందన్నారు. మెటా తీరు ఇతర కంపెనీల సంస్కృతిని నాశనం చేసేలా ఉందని అంతర్గత ఈమెయిల్లో అమోడీ తెలిపారు. ఆంత్రోపిక్ ఉద్యోగులకు వేతన ఆఫర్ల కంటే కంపెనీ మిషన్ ప్రధానమని చెప్పారు. మెటా ఆఫర్ చేస్తున్న ప్యాకేజీల కారణంగా సంస్థాగత సమగ్రతను కాపాడుకుంటూ కీలక ప్రతిభావంతులను నిలుపుకోవడంపై పరిశ్రమలో ఇతర కంపెనీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లుగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
భారత్లో యాపిల్కు రికార్డు స్థాయిలో ఆదాయం
జూన్ త్రైమాసికంలో భారత్ సహా ఇరవై నాలుగు మార్కెట్లలో రికార్డు స్థాయిలో ఆదాయాలు సాధించినట్లు అమెరికన్ టెక్ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. ఐఫోన్లు, మ్యాక్, సర్వీసులు మొదలైన విభాగాలు ఇందుకు దోహదపడినట్లు చెప్పారు. ప్రతి ప్రాంతంలోనూ ఐఫోన్ల విక్రయాలు పెరిగాయని, భారత్తో పాటు దక్షిణాసియా, బ్రెజిల్లాంటి వర్ధమాన మార్కెట్లలో రెండంకెల స్థాయి వృద్ధి నమోదైందని ఆయన వివరించారు.ఇదీ చదవండి: ‘ఏఐకి అంత సీన్ లేదు’మరోవైపు, అమెరికా టారిఫ్ల అంశం తీసుకుంటే 800 మిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడిందన్నారు. కొత్త టారిఫ్లేమీ లేకపోతే సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 1.1 బిలియన్ డాలర్లకు చేరొచ్చని కుక్ వివరించారు. జూన్ త్రైమాసికంలో యాపిల్ ఆదాయం 10 శాతం పెరిగి 94.04 బిలియన్ డాలర్లకు, లాభం 9.2 శాతం పెరిగి రూ.23.42 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఇంటికొచ్చి వంట చేస్తాడు.. రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు
ఈరోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కన్నా చిరు వృత్తులు చేసేవారే అధికంగా సంపాదిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై ముంబైకి చెందిన ఆయుషి దోషి అనే న్యాయవాది సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఆదాయ అసమానతలు , నైపుణ్యం కలిగిన కార్మికుల నిర్వచనం గురించి విస్తృతమైన చర్చకు దారితీసింది.స్థానికంగా 'మహారాజ్' అని పిలిచే ఆమె ఇంట్లో పనిచేసే వంటమనిషి కార్పొరేట్ ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఒక్కో ఇంట్లో ఆయన కేవలం 30 నిమిషాల్లో వంట పూర్తి చేస్తాడు. ఇందుకు ఒక్కో ఇంటికి రూ.18,000 సంపాదిస్తున్నారు. ఆయన ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని 10-12 ఇళ్లలో పనిచేస్తున్నాడు. అంటే అతని నెలవారీ సంపాదన రూ .1.8 లక్షల నుంచి రూ.2.16 లక్షల మధ్య ఉంటుంది. ఇది చాలా మంది వైట్-కాలర్ నిపుణుల జీతాల కంటే ఎక్కువ.విజయానికి ఒక రెసిపీ! దోషి తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) పోస్ట్లో వంటమనిషి సమర్థవంతమైన పని నమూనాను హైలైట్ చేశారు. ‘ఒక్కో ఇంటికి రూ.18,000 తీసుకుంటాడు. రోజూ 10-12 ఫ్లాట్లలో పనిచేస్తాడు. ఒక్కో ఇంటికీ 30 నిమిషాలే కేటాయిస్తాడు. భోజనం, టీలు ఉచితం. సమయానికి పేమెంట్’ అంటూ ఆమె పోస్ట్లో రాసుకొచ్చారు.అయితే అందరు వంటవాళ్లూ ఇలాగే సంపాదిస్తున్నారని కాదు.. అద్భుతమైన నైపుణ్యం, దశాబ్దానికి పైగా నిర్మించుకున్న పేరు ఆయనకు ఎక్కువ సంపాదనను తెచ్చిపెడుతోంది. మరోవైపు చాలా మంది వంటవాళ్ల సంపాదన రూ.10,000 నుంచి రూ.12,000 మించడం లేదని, వేగం, పరిశుభ్రత, స్థిరత్వానికి పేరుగాంచిన వారు గణనీయంగా ఎక్కువ సంపాదించవచ్చని దోషి చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ పోస్టుపై మిశ్రమ స్పందనలు వెల్లువెత్తాయి. -
బంపరాఫర్.. ఒక్క రూపాయి రీఛార్జ్తో అన్లిమిటెడ్ కాల్స్
రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న తరుణంలో.. ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం ఒక రూపాయితోనే 30 రోజుల అపరిమిత కాల్స్ అంటూ ట్వీట్ చేసింది.భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్ 30 రోజులపాటు అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటా మాత్రమే కాకుండా రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లను పొందవచ్చు. సిమ్ కార్డు కూడా పూర్తిగా ఉచితం కావడం గమనార్హం. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.Azadi ka plan at just Rs. 1/- & get true digital freedom with BSNL.With 30 days of unlimited calls, 2GB data/day, 100 SMS/day, and a free SIM. Applicable for new users only.#BSNL #DigitalIndia #IndependenceDay #BSNLFreedomOffer #DigitalAzadi pic.twitter.com/L9KoJNVaXG— BSNL India (@BSNLCorporate) July 31, 2025 -
‘ఏఐకి అంత సీన్ లేదు’
ఆధార్, యూపీఐ ఆవిష్కరణల్లో కీలకపాత్ర పోషించిన నందన్ నీలేకని భారత్లో కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం ఉద్యోగాలపై ఎలా ఉండబోతుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏఐ భారతదేశ జాబ్ మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపదని చెప్పారు. అందుకు బదులుగా భారీగా సంపదను, అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు. సాంకేతిక నిపుణులు ఏఐలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంతోపాటు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని కోరారు.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికారం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది. ఈ ధోరణి ఇప్పటికే ప్రపంచ సాంకేతిక పర్యావరణ వ్యవస్థల్లో కనిపిస్తుంది. కానీ భారతదేశం అందుకు భిన్నమైన దృక్పథాన్ని నిర్మించాలి. ప్రపంచ శక్తులతో మనం పోరాడలేం. కానీ మన ప్రభావిత ప్రాంతంలో కోట్ల మంది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నూతన ఆవిష్కరణలు చేయాలి. ఉద్యోగం పోతుందని భయపడే బదులు నైపుణ్యాల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలి’ అని నీలేకని అన్నారు. -
గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
రక్షాబంధన్కు ముందు ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఊరట కలిగించాయి. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశవ్యాప్తంగా రూ .33.50 తగ్గించాయి. కొత్త రేట్లు ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.కొత్త ధరల ప్రకారం.. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ఇప్పుడు ఢిల్లీలో రూ .1,631.50 కు లభిస్తుంది. ఇంతకుముందు దీని ధర రూ.1,665గా ఉండేది. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపుతో క్యాటరింగ్ యూనిట్లు, హోటళ్లు-రెస్టారెంట్లు, ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యాపారులకు ఉపశమనం కలుగుతుంది.దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కొత్త రేట్లుఢిల్లీ: రూ.1,631.50కోల్కతా: రూ.1734.50ముంబై: రూ.1582.50చెన్నై: రూ.1789హైదరాబాద్: రూ.1,886.50డొమెస్టిక్ సిలిండర్ ధరలుడొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 14.3 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025 నుండి స్థిరంగా ఉంది. ఇందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు, తగ్గించలేదు. ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.853గా ఉంది. -
‘టీసీఎస్ నిర్ణయం ప్రమాదకరం’
దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కర్ణాటక కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ స్పందించారు. రాష్ట్రంలోని సన్రైజ్ కంపెనీల(ఎమర్జింగ్ పరిశ్రమలు)కు ఇచ్చిన కార్మిక చట్టాన్ని పరిశీలిస్తామని తెలిపారు.‘టీసీఎస్ నిర్ణయంతో చాలామంది ఉద్యోగులు ప్రభావితం అవుతారు. అకస్మాత్తుగా 12,000 మంది తొలగింపు అంటే చాలా ప్రమాదం. ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అంతకుమించి స్పష్టమైన కారణం కూడా తెలుసుకుంటాను. కార్మిక చట్టాన్ని పరిశీలిస్తాం. సన్ రైజ్ కంపెనీలకు నిత్యం చాలా వెసులుబాట్లు ఇస్తూనే ఉంటాం’ అని మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు.ప్రభుత్వ జోక్యం కోరిన ఎన్ఐటీఈఎస్లేఆఫ్స్కు సంబంధించి వివరణ కోరుతూ టీసీఎస్కు నోటీసులు జారీ చేయాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్) కోరింది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో తన ఉద్యోగుల సంఖ్యను 5,000 పెంచింది.ఇదీ చదవండి: క్యాప్ జెమినీలో భారీ నియామకాలుసన్రైజ్ పరిశ్రమలునూతన ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కర్ణాటక ప్రభుత్వం సన్రైజ్ పరిశ్రమలకు(అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీలు) కార్మిక చట్టం మినహాయింపులు ఇస్తోంది. ఇందులో సౌకర్యవంతమైన నియామకాలు, తొలగింపు నిబంధనలున్నాయి. స్టార్టప్లు, టెక్ ఆధారిత సంస్థలకు ఈ చట్టం ద్వారా మద్దతు లభిస్తుంది. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఫిన్ టెక్, స్పేస్ టెక్, ఏరోస్పేస్ వంటి విభాగాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. -
క్యాప్ జెమినీలో భారీ నియామకాలు
ఐటీ నియామకాలపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో క్యాప్ జెమినీ ఇండియా ఉద్యోగార్థులకు తీపి కబురు అందించింది. భారత్లో ఈ ఏడాది 40,000-45,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 35-40 శాతం లేటరల్ నియామకాలు ఉంటాయని క్యాప్ జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అశ్విన్ యార్డీ తెలిపారు.భారత్లో 1.75 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీ దేశీయ కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరించినట్లు ఆయన చెప్పారు. కంపెనీ కస్టమర్లు ఎక్కువగా ఖర్చు ఆదా, మరిన్ని అవకాశాలను కోరుతున్నట్లు తెలిపారు. ఈ ధోరణి భారత్లో మరింత వ్యాపారాన్ని అందిస్తుంది. సంస్థకు 50కి పైగా కళాశాలలు, క్యాంపస్లతో ఒప్పందాలు ఉన్నాయని, ప్రస్తుత సీజన్కు సంబంధించి నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త నియామకాలు అభ్యర్థుల కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాలపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఈడీ సమన్లుడబ్ల్యుఎన్ఎస్తో విలీనంఇటీవల డబ్ల్యూఎన్ఎస్ కొనుగోలు క్యాప్జెమినీకి వ్యూహాత్మకంగా నిలుస్తుందని యార్డీ చెప్పారు. సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్వేస్ డబ్ల్యూఎన్ఎస్ను నెలకొల్పింది. ఈ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) సంస్థను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్జెమిని సొంతం చేసుకోనుంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఈ రెండు కంపెనీలూ భారత్లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. -
అనిల్ అంబానీకి ఈడీ సమన్లు
బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రిలయన్స్ కమ్యునికేషన్స్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఈడీ ముందుకు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీల్లో సోదాలు నిర్వహించి పలుచోట్ల కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన ఈడీ అనిల్ను ప్రశ్నించేందుకు తాజాగా సమన్లు జారీ చేయడం గమనార్హం.రూ.3,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు కొన్ని కంపెనీలు కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జులై 24న ఈడీ అనిల్ గ్రూప్ కంపెనీలపై దాడులు నిర్వహించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఢిల్లీ, ముంబైల్లో మూడు రోజుల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్లు సహా 50 ఇతర కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మరో 25 మంది కీలక హోదాల్లో ఉన్నవారిని ప్రశ్నించారు. అంతకుముందు అనిల్ అంబానీ కంపెనీలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన తరువాత ఈ దాడులు జరిగాయి.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరిపినట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: రిటైర్ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!‘ఫ్రాడ్’గా వర్గీకరణరిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే రెండు కంపెనీలు జులై 26న స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈమేరకు దాడులకు సంబంధించిన విషయాలను ధ్రువీకరించాయి. ఈ దాడులు తమ వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు, వాటాదారులు, ఉద్యోగులు లేదా మరే ఇతర వాటాదారులపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని తెలిపాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) సహా కొన్ని నియంత్రణ, ఆర్థిక సంస్థలు అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను ఈడీతో పంచుకున్నాయి. అనిల్ అంబానీ, అంబానీల గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్)ను ‘ఫ్రాడ్’గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వర్గీకరించింది. -
ఈవీ రంగంలో మరిన్ని అవకాశాలపై మీడియాటెక్ కన్ను
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ దిగ్గజం మీడియాటెక్ భారత్లో మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని భావిస్తోంది. ఏఐ నిపుణుల లభ్యత మెరుగ్గా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కృత్రిమ మేథను ఉపయోగించుకోవడంపై ఆసక్తి చూపుతుండటమనేది విక్రయాల వృద్ధికి దోహదపడగలదని ఆశిస్తోంది. ఏఐ, కొత్త తరం కనెక్టివిటీ సొల్యూషన్స్పై దృష్టి పెడుతూ ఆటోమోటివ్ రంగంలో మరింతగా కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉన్నట్లు మీడియాటెక్ డైరెక్టర్ రీటా వూ తెలిపారు. ఏఐ వినియోగం, హై–పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సామర్థ్యాలకు డిమాండ్, తక్కువ విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడం వంటి అంశాలు పరిశ్రమలో కీలక మార్పులు తెస్తున్నాయని ఆమె తెలిపారు. -
ఓఎన్డీసీ, జెమ్ పోర్టల్లో పోస్టల్ సర్వీసులు
ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ), గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్ పోర్టల్తో అనుసంధానంపై ఇండియా పోస్ట్ కసరత్తు చేస్తంది. దీనితో పోస్టల్ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి రాగలవని, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలతో పోస్టల్ విభాగం పోటీపడేందుకు వీలవుతుంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో సమావేశమైన సందర్భంగా పోస్టల్ శాఖ అధికారులు ఈ విషయాలను వివరించారు.ఇండియా పోస్ట్ ఐటీ 2.0 ఫ్రేమ్ వర్క్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. రియల్ టైమ్లో ట్రాక్ చేసేందుకు, డిజిటల్ చెల్లింపులు మొదలైన వాటికి ఉపయోగపడేలా ప్లాట్ఫాంను కొత్తగా అప్గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. 86వేలకు పైగా పోస్టాఫీసులు కొత్త అప్లికేషన్ ను ఉపయోగిస్తున్నాయని, ఆగస్టు 4 నాటికి, సుమారు 1.65 లక్షల పోస్టాఫీసుల నెట్ వర్క్ మొత్తం కొత్త ప్లాట్ ఫామ్ కు మారుతుందని అధికారులు మంత్రికి తెలియజేశారు. -
పేటీఎంలో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు
రాఖీ, జన్మాష్టమి తదితర పండుగల సందర్భంగా ట్రావెల్ మెగా ఫెస్టివల్ సేల్ కింద ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నట్లు పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా విమాన సర్వీసుల్లో 12%, అంతర్జాతీయ రూట్లలో 10%, బస్ బుకింగ్స్పై 20 % డిస్కౌంటు పొందవచ్చు.అలాగే యూపీఐ ద్వారా రైలు బుకింగ్స్కి పేమెంట్ గేట్వే చార్జీలు ఉండవు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ కార్డుదారులు ప్రత్యేక రాయితీలు పొందవచ్చు. పేటీఎం ద్వారా బుక్ చేసుకున్న రైలు టికెట్లను రద్దు చేసుకుంటే 100% తక్షణ రీఫండ్తో, ఉచిత క్యాన్సిలేషన్ అవకాశాన్ని పొందవచ్చని సంస్థ తెలిపింది. జూలై 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. -
అమెరికా కంపెనీ సీఈవోగా సత్య నాదెళ్ల క్లాస్మేట్
సనత్నగర్: బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన శైలేష్ జేజురికర్ ప్రముఖ వినియోగ వస్తువుల దిగ్గజ కంపెనీ ప్రొక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) గ్లోబల్ సీఈఓగా నియమితులయ్యారు. పీ అండ్ జీ కంపెనీ అమెరికన్ మల్టినేషనల్ కన్జ్యూమర్ గూడ్స్ కార్పొరేషన్. అమెరికాలోని సిన్సినాటి ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 58 ఏళ్ల శైలేష్ జేజురికర్ ప్రస్తుతం పీ అండ్ జీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. 2026, జనవరి 1 నుంచి ఆ సంస్థ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఆయన పాఠశాల విద్యాభ్యాసం హెచ్పీఎస్లో సాగగా.. 1987లో ముంబై విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఎకనామిక్స్లో పట్టా పొందారు. 1989లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–లక్నోలో ఎంబీఏ పూర్తి చేసి, అదే సంవత్సరం పీ అండ్ జీలో చేరారు. తాజాగా భారతీయ గ్లోబల్ సీఈఓల జాబితాలో శైలేష్ జేజురికర్ (Shailesh Jejurikar) కూడా చేరారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివి మైక్రోసాఫ్ట్ సీఈఓగా పనిచేస్తున్న సత్య నాదెళ్ల, డెలాయిట్ కన్సల్టింగ్కు చెందిన సౌమ్య చక్రవర్తి, టెస్లాకు చెందిన నాగేందర్ వంటి వారు శేలేష్ క్లాస్మేట్స్. హెచ్పీఎస్ 1984 బ్యాచ్లో శైలేష్ పాఠశాల హెడ్బాయ్గా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella), శైలేష్ జేజురికర్లు మంచి స్నేహితులు. గ్లోబల్ సీఈఓల ఫ్యాక్టరీగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నిలవడం గర్వకారణమని ఈ సందర్భంగా పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.చదవండి: సుందర్ పిచాయ్, ఎలాన్ మస్క్.. ఎడ్యుకేషన్ ఏంటి? -
ఆసుస్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా రాజ్ షమానీ
ఆసుస్ ఇండియా ప్రముఖ పాడ్కాస్టర్ రాజ్ షమానీని ఎక్స్ఫర్ట్బుక్ సిరీస్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించింది. 18 మిలియన్లకు పైగా వివిధ ప్లాట్ఫామ్ల్లో రాజ్కు సబ్స్క్రైబర్లున్నారు. ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ అనే పాడ్కాస్ట్ ద్వారా విస్తృతంగా ఫాలోయింగ్ను సంపాదించారు. ఆసుస్ ఇండియాలో కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి రాజ్ షమానీ కీలకంగా వ్యవహరిస్తారని కంపెనీ నమ్ముతుంది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ఈ సందర్భంగా ఆసుస్ ఇండియా, శ్రీలంక, నేపాల్ కమర్షియల్ పీసీ, స్మార్ట్ఫోన్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ శర్మ మాట్లాడుతూ.. ‘ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ సిరీస్ బ్రాండ్ అంబాసిడర్గా రాజ్ షమానీని స్వాగతిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎక్స్పర్ట్బుక్ సిరీస్ ద్వారా కంపెనీ భారతీయ నిపుణులకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారించింది’ అన్నారు. రాజ్ షమానీ మాట్లాడుతూ..‘ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ యువ సృష్టికర్తల కోసం, కంపెనీల వ్యవస్థాపకులు లేదా భవిష్యత్ వ్యాపార నాయకుల కోసం తయారు చేశారు. ఆసుస్కు బ్రాండ్ అంబాసిడర్గా ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉంది’ అన్నారు. -
‘ఫార్చూన్’లో మళ్లీ రిలయన్స్ టాప్
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) ఫార్చూన్ గ్లోబల్–500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి తొమ్మిది కంపెనీలకు చోటు లభించింది. వీటిలో అయిదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా, నాలుగు ప్రైవేట్ రంగానికి చెందినవి. అన్నింటికన్నా మెరుగ్గా ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 88వ స్థానంలో నిల్చింది. అయితే, 2024లోని 86వ ర్యాంకు నుంచి రెండు స్థానాలు తగ్గింది. అటు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) 95వ ర్యాంకులో కొనసాగింది. 22 ఏళ్లుగా ఫార్చూన్ గ్లోబల్ లిస్టులో స్థానం దక్కించుకుంటున్న ఏకైక ప్రైవేట్ రంగ కంపెనీ రిలయన్స్ కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రిలయన్స్ స్థూల ఆదాయం 7.1% పెరిగి రూ. 10,71,174 కోట్లకు చేరింది. 2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలను బట్టి కంపెనీలకు ర్యాంకింగ్ ఉంటుంది. ఐవోసీ డౌన్.. ఎస్బీఐ అప్.. అటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 11 ర్యాంకులు తగ్గి 127వ స్థానానికి పడిపోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 స్థానాలు మెరుగుపడి 163 ర్యాంకును, హెచ్డీఎఫ్సీ 48 స్థానాలు ఎగబాకి 258వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) ఒక ర్యాంకు తగ్గి 181వ స్థానానికి పరిమితమైంది. ఇక మిగతా వాటిలో టాటా మోటార్స్ (283 ర్యాంకు, 12 స్థానాలు డౌన్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (285 స్థానం, 27 స్థానాల క్షీణత), ఐసీఐసీఐ బ్యాంక్ (464 ర్యాంకు, ఎలాంటి మార్పు లేదు) ఉన్నాయి. -
జియో ఫైనాన్షియల్కు రూ.15,825 కోట్లు
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్ నుంచి రూ. 15,825 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డు ఆమోదముద్ర వేసింది. ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన కన్వర్టబుల్ వారంట్ల జారీ ద్వారా ఈ నిధులు సమీకరించనున్నట్లు కంపెనీ వివరించింది. ప్రస్తుతం అంబానీ కుటుంబంతో పాటు వివిధ గ్రూప్ హోల్డింగ్ సంస్థలకు కంపెనీలో 47.12 శాతం వాటాలు ఉన్నాయి. ప్రిఫరెషన్షియల్ ఇష్యూ ద్వారా 54.19 శాతానికి పెరుగుతుంది. ఒక్కొక్కటి రూ. 316.50 రేటు చొప్పున 50 కోట్ల వరకు వారంట్లను కంపెనీ జారీ చేయనుంది. వీటి ముఖ విలువ రూ. 10గా ఉంటుంది. ఇష్యూ అనంతరం ప్రమోటర్ గ్రూప్లో భాగమైన సిక్కా పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ వాటా 1.08 శాతం నుంచి 4.65 శాతానికి, జామ్నగర్ యుటిలిటీస్ అండ్ పవర్ వాటా 2.02 శాతం నుంచి 5.52 శాతానికి పెరుగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడదీసిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధానంగా ఇన్వెస్టింగ్, ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 8% అప్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) తొలి త్రైమాసికంలో నెమ్మదించిన దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్ రెండో త్రైమాసికంలో పుంజుకుంది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాలు పరిమాణంపరంగా ఎనిమిది శాతం, టోకు అమ్మకాలు విలువపరంగా 18 శాతం పెరిగాయి. అత్యధికంగా ఐఫోన్ 16 టోకు అమ్మకాలు నమోదైనట్లు టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్పాయింట్ తమ నెలవారీ స్మార్ట్ఫోన్స్ ట్రాకర్ నివేదికలో తెలిపింది. కొత్త ఫోన్లను ప్రవేశపెట్టడం, మార్కెటింగ్, వేసవిలో అమ్మకాలు పటిష్టంగా ఉండటం, బ్రాండ్లు భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం సులభతరమైన ఈఐఎంలు, మిడ్–ప్రీమియం సెగ్మెంట్లలో ప్రత్యేక ఆఫర్లు మొదలైన అంశాలు స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరగడానికి దోహదపడినట్లు వివరించింది. కొనుగోలుదారుల సెంటిమెంట్ మెరుగుపడటంతో అల్ట్రా ప్రీమియం (రూ. 45,000 పైగా రేటు ఉండే ఫోన్లు) సెగ్మెంట్ వార్షికంగా 37 శాతం వృద్ధి నమోదు చేసినట్లు కౌంటర్పాయింట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రాచిర్ సింగ్ తెలిపారు. దేశీ స్మార్ట్ఫోన్ల మార్కెట్..రెండో త్రైమాసికంలో విలువపరంగాను, సగటు విక్రయ ధరపరంగాను (ఏఎస్పీ) రికార్డు స్థాయి పనితీరు కనపర్చేందుకు అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్ దోహదపడినట్లు వివరించారు.వివో టాప్.. స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు సంబంధించి పరిమాణంపరంగా వివో అగ్రస్థానంలో నిలవగా, విలువపరంగా శాంసంగ్, యాపిల్ అగ్రస్థానంలో ఉన్నట్లు కౌంటర్పాయింట్ తెలిపింది. పరిమాణం ప్రకారం వివోకి 20 శాతం, శాంసంగ్కి 16 శాతం, ఒప్పోకి 13 శాతం, రియల్మీకి 10 శాతం, షావోమీకి 8 శాతం వాటా ఉంది. హోల్సేల్ అమ్మకాల విలువపరంగా శాంసంగ్, యాపిల్ చెరి 23 శాతం వాటాతో పోటాపోటీగా టాప్లో ఉన్నాయి. వివోకి 15 శాతం, ఒప్పోకి 10 శాతం, రియల్మీకి 6 శాతం, వన్ప్లస్కి 4 శాతం వాటా ఉంది. -
దేశంలో ఏఐ, ఎడ్టెక్ల విస్తరణ.. కానీ..
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) నైపుణ్యాలకు డిమాండ్ ఆమాంతం పెరగడంతో అందుకు తగ్గట్టుగానే మన దేశంలో, రాష్ట్రంలో ఎడ్ టెక్ రంగం క్రమంగా గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఏఐ కేంద్రీకృత కోర్సుల విస్తరణకు విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు ఊపందుకుంటున్నాయి. విద్యా రంగంలో, నైపుణ్యాలను పెంచుకునే విషయంలో ఏఐను ఏకీకృతం చేయడానికి ఉద్దేశించి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ దిశలో ముందుకు సాగుతున్నాయి. ఏఐ, ఎడ్టెక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో ఈ మార్కెట్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.వివిధ పరిశ్రమల్లో ఏఐ నైపుణ్యాలకు ఆదరణ పెరగడంతో ఏఐ, ఎంఎల్ సంబంధిత రంగాల్లో నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఏఐ, ఎడ్టెక్లకు కేంద్రంగా అనేక సంస్థలు ప్రత్యేక కోర్సులు, శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు తమ ఏఐ కోర్సు కేటలాగ్లను విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వపరంగానూ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, చలనశీలత వంటి రంగాల్లో ఏఐను ఉపయోగించడంపై దృష్టి సారిస్తోంది. ఏఐ విద్యకు ప్రొత్సాహంతోపాటు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏఐ, రొబోటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. పరిశ్రమ సంబంధిత ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అవకాశాలు అందించడానికి సంస్థలు పరిశ్రమలు, టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.ఉద్యోగాలున్నా నైపుణ్యాల కొరతకృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లర్నింగ్ (ఎంఎల్)లలో ప్రావీణ్య సాధన ఎకో సిస్టమ్ పూర్తిస్థాయిలో ఇంకా మన దేశంలో ఏర్పడలేదని స్మార్ట్ స్టెప్స్ ట్రైనింగ్ అకాడమీ ఫౌండర్ నానబాల లావణ్యకుమార్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ సమయంలో కంపెనీలు, ఉద్యోగులంతా క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ, అప్లికేషన్లపైనే దృష్టి పెట్టారని.. కానీ అదే సమయంలో అమెరికా, చైనా మాత్రం జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్ (జీపీటీ)లను తయారు చేసి రేసులో ఎంతో ముందుకెళ్లిపోయాయని చెప్పారు. కానీ భారత్ మాత్రం సంప్రదాయ కోర్సులకే పరిమితమై వెనుకబడిపోయిందన్నారు. ఎట్టకేలకు విశ్వవిద్యాలయాలు అనేక ఏఐ, ఎంఎల్ కోర్సులను ప్రారంభించినప్పటికీ సంక్లిష్టమైన ఈ నైపుణ్యాలను నేర్చుకొనేందుకు అవసరమైన మేర ఫ్యాకల్టీ లేరని లావణ్యకుమార్ అన్నారు. అందుకే గుణాత్మకమైన విద్యను అందించడంలో అధిక శాతం కళాశాలలు, ట్రైనింగ్ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అందుకే మార్కెట్లో డిమాండ్ ఉన్నా కావాల్సిన స్కిల్స్ లేక యువత వెనుకబడుతున్నారని.. ఏఐ ఆధారిత కంపెనీలు సైతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు.ఇదీ చదవండి: మర మనుషులు.. కేవలం రూ.5 లక్షలే!కాలేజీల్లో మౌలిక సదుపాయాలేవి?చైనాతో పోలిస్తే భారత్లోని ఎడ్టెక్ కంపెనీల సామర్థ్యాలు పూర్తిస్థాయిలో లేవని క్వాలిటీ థాట్ ఫౌండర్, కెరీర్ గైడెన్స్ కోచ్ రమణ భూపతి అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లడం కూడా దీనికి కారణమన్నారు. ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలకు తగ్గట్టుగా ఎడ్టెక్ కంపెనీలు వేగాన్ని పెంచుకోలేకపోవడం, ఏఐ నైపుణ్యాలకు అవసరమైన గణితంలో లోతైన పరిజ్ఞానం విద్యార్థులకు కొరవడటం తదితర కారణాల వల్ల భారత్ కొంత వెనుకబడిందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐను బోధించాలంటే ఒక సరైన కాన్ఫిగరేషన్ (రూ.1.20 లక్షల ధర, గ్రాఫిక్ కార్డ్ తదితరాలతో) ఉన్న కంప్యూటర్ కావాలని.. కానీ మన దేశంలో అలాంటి కంప్యూటర్లు లేని కాలేజీలే 99 శాతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎడ్టెక్ కంపెనీలు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణనిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
వీరికి రూ.కోట్ల వేతనాలు.. వారికి కొలువుల కోతలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సిబ్బందిలో 2% మంది(సుమారు 12,000) ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా కంపెనీ సీఈఓ కృతివాసన్ వేతన భత్యాలను కోట్ చేస్తూ పోస్ట్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ లాభదాయకంగా ఉంటూ ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తుండడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సామాజిక మాధ్యమాలు వేదికగా టీసీఎస్ సీఈఓ కృతివాసన్ రూ.26.52 కోట్ల ప్యాకేజీపై తీవ్ర చర్చ సాగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ప్యాకేజీ బేస్ జీతం రూ.1.39 కోట్లు, బెనిఫిట్స్ అండ్ అలవెన్స్లు రూ .2.12 కోట్లు, కమిషన్లలో రూ.23 కోట్లుగా ఉన్నాయని కొందరు పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన వేతన భత్యాలపై స్పందించారు.ఇదీ చదవండి: మళ్లీ భాగ్యనగరంలో భూముల వేలం‘బలమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థను నిర్మించడానికి 12,000 మంది ఉద్యోగులను తొలగించాలి. వాస్తవానికి, కంపెనీ చాలా ముఖ్యమైంది. ఉద్యోగులు జీవితాలు ఏమైనా ఫర్వాలేదు’ అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ వేతనాల్లో కోత విధించాలని కొందరు డిమాండ్ చేయగా, మరికొందరు టీసీఎస్ ఛైర్మన్లు ఏడాదికి రూ.150 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు వ్యూహాత్మకమే తప్పా, ఆర్థిక సమస్య కాదని కంపెనీ మద్దతుదారులు అంటున్నారు. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది ప్రతిభను పునర్నిర్మించే చర్యగా చూడాలని తెలిపారు. ఖర్చు ఆదా చేసే చర్య కాదన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు రూ.కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. కానీ ఉద్యోగులకు మాత్రం తమ కొలువుల్లో కోత విధిస్తున్నారు’ అని చెప్పారు. -
‘లేఆఫ్స్ నిర్ణయం ఎంతో భారం’.. అయినా తప్పట్లేదు!
మైక్రోసాఫ్ట్ 2025 ప్రారంభం నుంచి వివిధ సందర్భాల్లో తొలగించిన 15,000 మంది ఉద్యోగులను ఉద్దేశించి కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ నాలుగో విడత ఉద్యోగాల కోత సందర్భంగా విడుదల చేసిన అంతర్గత మెమోలో ఆయన కొన్ని విషయాలు పంచుకున్నారు.‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవి నాపై ఎంతో భారాన్ని మోపుతున్నాయి. మనం కలిసి పనిచేసిన, కలిసి నేర్చుకున్న లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్న వ్యక్తులపై ప్రభావం ఉంటోంది. కంపెనీని విడిచి వెళ్తున్నవారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, గేమింగ్, మిడిల్ మేనేజ్మెంట్తో సహా వివిధ విభాగాలలో ఈ సంవత్సరం మొత్తంగా 15,000 మందిని తొలగించింది. ఇటీవల సత్య చేసిన ప్రకటనతో మరో 9,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’బలమైన ఆర్థిక పనితీరు అయినా..బలమైన ఆర్థిక పనితీరు ఉన్న సమయంలోనూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతలను అనుసరిస్తోంది. కంపెనీ ఇటీవల త్రైమాసిక నికర ఆదాయం 18 శాతం పెరిగి 25.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయినా పునర్నిర్మాణం పేరిట కొలువులను తొలగిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో పనితీరు ఆధారిత సమీక్షలతో లేఆఫ్స్ ప్రారంభమయ్యాయి. తరువాత మే, జూన్, జులైలో ఇవి పెరుగుతూ వచ్చాయి. ఈ లేఆఫ్స్తో గేమింగ్ యూనిట్ భారీగా ప్రభావితం చెందింది. 3,000కి పైగా కొలువుల కోత ఈ ఒక్క విభాగంలోనే ఉంది. ‘ది ఇనిషియేటివ్’ వంటి స్టూడియోలను కంపెనీ మూసివేసింది. ఎక్స్ బాక్స్, పర్ఫెక్ట్ డార్క్ గేమ్లను రద్దు చేసుకుంది. -
భారత్ నుంచి 3 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు
న్యూఢిల్లీ: వచ్చే అయిదేళ్లలో (2030 నాటికి) తమ గ్లోబల్ కార్యకలాపాల కోసం భారత్ నుంచి కొనుగోళ్లను 3 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు (సుమారు రూ. 25,500 కోట్లు) ఫ్రాన్స్కి చెందిన స్పోర్ట్స్ రిటైలింగ్ సంస్థ డెకాథ్లాన్ తెలిపింది. తాము గత 25 ఏళ్లుగా భారత్ నుంచి కొనుగోలు చేస్తున్నామని, మేకిన్ ఇండియా విజన్కి కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రొడక్షన్ హెడ్ ఫ్రెడరిక్ మెర్లివీడ్ తెలిపారు. ప్రస్తుతం తాము అంతర్జాతీయంగా జరిపే కొనుగోళ్ల పరిమాణంలో భారత్ వాటా 8 శాతంగా ఉందని, 2030 నాటికి దీన్ని 15 శాతానికి పెంచుకోనున్నామని చెప్పారు. భారత్లో విక్రయాల పరిమాణంలో 70 శాతం వాటా దేశీ సోర్సింగ్దే ఉంటోందని, దీన్ని 90 శాతానికి పెంచుకోనున్నామని వివరించారు. నాణ్యత, వేగం, కొత్త ఆవిష్కరణలపరంగా భారత్, తమ గ్లోబల్ తయారీ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోందని ఫ్రెడరిక్ చెప్పారు. డెకాథ్లాన్కి భారత్లో ఒక డిజైన్ సెంటర్, 83 సరఫరాదార్లు, 113 తయారీ యూనిట్లు, 55 నగరాల్లో 132 స్టోర్స్ ఉన్నాయి. రిటైల్, తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు సుమారు రూ.933 కోట్లు (100 మిలియన్ యూరోలు) ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో డెకాథ్లాన్ భారత మార్కెట్లో రూ. 4,000 కోట్ల ఆదాయం, రూ. 197 కోట్ల లాభం ఆర్జించింది. -
టెక్ దిగ్గజాలు.. ఎవరేం చదివారంటే..
టెక్ బిలియనీర్ల ప్రపంచంలో సుందర్ పిచాయ్, ఎలాన్మస్క్లకు ప్రత్యేక స్థానం ఉంది. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ ఇంక్కు నాయకత్వం వహిస్తూ, బిలియనీర్ జాబితాలో ఇటీవల చోటు సంపాదించారు. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ వ్యవస్థాపకుడిగా ఎలాన్మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. వీరు సారథ్యం వహిస్తున్న కంపెనీల ఉత్పత్తుల ద్వారా నిత్యం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు వీరి నుంచి అకడమిక్ ప్రమాణాలతోపాటు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది.సుందర్ పిచాయ్చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ టెక్ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న జవహర్ విద్యాలయంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. వానవాణి స్కూల్లో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఐఐటీ ఖరగ్పూర్లో మెటలార్జీ ఇంజినీరింగ్ చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో ఎంఎస్ చేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి వార్టన్ స్కూల్ ద్వారా ఎంబీఏ చేశారు. గూగుల్లో ప్రొడక్ట్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ల్లో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలాన్ మస్క్దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన ఎలాన్ మస్క్ చిన్న వయసులోనే కంప్యూటింగ్పై ఆసక్తి పెంచుకుని 10 ఏళ్లకే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాలోని తప్పనిసరి సైనిక సేవను నివారించడానికి క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరడానికి కెనడా వెళ్లారు. రెండేళ్ల తరువాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరారు. వార్టన్ స్కూల్ నుంచి ఫిజిక్స్, ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. మస్క్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్స్ సైన్స్లో పీహెచ్డీ కోసం కొంతకాలం చేరారు. కాని కొద్ది రోజులే అందుకు కొనసాగారు. -
టీసీఎస్ లేఆఫ్స్తో ఆర్థిక ప్రకంపనలు
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిలో 2 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. టీసీఎస్ ప్రకటన ఆర్థిక ప్రకంపనలకు(ఎకనామిక్ ఎర్త్క్వేక్) కారణమవుతుందన్నారు. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందులో ప్రభావితం చెందే వారిలో ఎక్కువ మంది మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులు ఉండబోతున్నట్లు సంస్థ తెలిపింది.2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ‘నైపుణ్యాల అసమతుల్యత వల్ల కంపెనీ ఈమేరకు ప్రకటన చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ వార్త ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇది ఆర్థిక ప్రకంకపనలు సృష్టిస్తుంది’ అని జైరాం రమేష్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. టెక్నాలజీ, కృత్రిమ మేధ, మార్కెట్ విస్తరణ, శ్రామిక శక్తి పునర్వ్యవస్థీకరణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ విస్తృత వ్యూహంలో భాగంగా లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ టారిప్లపై కీలక ప్రకటనబాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడాన్ని పరిశీలిస్తుంది. -
మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేత
రష్యన్ కంపెనీలపై యూరోపియన్ యూనియన్ ఆంక్షల నేపథ్యంలో నయారా ఎనర్జీకి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలు నిలిపివేసింది. దీనితో గతంలోనే పుర్తిగా చెల్లించి, లైసెన్సులను కొనుగోలు చేసినప్పటికీ సొంత డేటా, ఇతరత్రా టూల్స్ మొదలైనవి తమకు అందుబాటులోకి లేకుండా పోయాయని నయారా వెల్లడించింది. ఇలాంటివి చాలా ప్రమాదకర ధోరణులని ఆందోళన వ్యక్తం చేసింది.మైక్రోసాఫ్ట్ ఏకపక్షంగా, హఠాత్తుగా సర్వీసులను నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించింది. సర్వీసులను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాను కట్టడి చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నయారా ఎనర్జీపై కూడా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించింది. ఇదీ చదవండి: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!అయితే, ఇవి ఈయూ చట్టాల పరిధిలోకే వస్తాయి తప్ప మైక్రోసాఫ్ట్లాంటి అమెరికన్ కంపెనీలకు, భారతీయ సంస్థలకు వర్తించవని నయారా ఎనర్జీ తెలిపింది. రిఫైనింగ్ సామర్థ్యంలో 8 శాతం, రిటైల్ పెట్రోల్ బంకుల నెట్వర్క్లో ఏడు శాతం వాటాతో భారత ఇంధన భద్రతలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది. -
ఈ ఐటీకి ఏమైంది..?
2000 సంవత్సరంలో వై2కే, 2017లో క్లౌడ్.. ఇప్పుడు ఏఐ.. ఇలా టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగులకు సరికొత్త సాంకేతికతలు పెను సవాలుగా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఉద్యోగ కల్పవృక్షంగా నిలుస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఒక్కసారిగా ‘కోత’ల గుబులు మొదలైంది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు చేసిన ప్రకటనతో పరిశ్రమకు షాక్ తగిలింది. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ దెబ్బ, మరోపక్క ప్రపంచ ఆర్థిక మందగమనంతో ఐటీ కంపెనీల ఆదాయాలకు చిల్లు పడుతోంది. దీంతో వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. పులిమీదపుట్రలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కూడా ఉద్యోగులకు కునుకు లేకుండా చేస్తున్నాయి. టీసీఎస్ చర్యలు ఆరంభమేనని.. రానున్న కాలంలో మరిన్ని కంపెనీలూ ఇదే బాట పట్టొచ్చనేది విశ్లేషకుల మాట.దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్లో ఉద్యోగాల తొలగింపు వార్త అటు ఐటీ రంగాన్నే కాదు.. స్టాక్ మార్కెట్లను సైతం కుదిపేసింది. పరిశ్రమ లీడర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగతా కంపెనీలు ఎలాంటి చర్యలకు దిగుతాయోనన్న భయమే దీనికి కారణం. వాస్తవానికి ఐటీలో కొత్త ఉద్యోగాలు గత రెండు మూడేళ్లుగా పెద్దగా పెరగడం లేదు. టీసీఎస్నే తీసుకుంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.14 లక్షల గరిష్ట స్థాయిని చేరుకుంది. అయితే, 2019–20లో 4.48 లక్షలుగా ఉన్న కంపెనీ సిబ్బంది సంఖ్య తదుపరి మూడేళ్లలో ఏకంగా 1.7 లక్షలు పెరగడం విశేషం. ఆపై క్రమంగా దిగజారుతూనే ఉంది. 2023–24లో 6.01 లక్షలకు పడిపోయింది. 13,249 మంది సిబ్బంది తగ్గిపోయారు. గతేడాది కాస్త పుంజుకుని 6.07 లక్షలకు చేరుకుంది. తాజాగా 2025–26 తొలి త్రైమాసికం (క్యూ1)లో నికరంగా 5,090 మంది సిబ్బంది జతయ్యారు. అయినప్పటికీ మొత్తం సిబ్బంది సంఖ్య మూడేళ్ల క్రితం నాటి గరిష్ట స్థాయి కిందే కొనసాగుతోంది. ఇక మిగతా కంపెనీల విషయానికొస్తే, టాప్–5 కంపెనీలు కలిపి ఈ ఏడాది క్యూ1లో కేవలం 4,703 ఉద్యోగులను మాత్రమే నికరంగా జత చేసుకున్నాయి. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్ మినహా మిగతా మూడు కంపెనీల్లో సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. ఐటీ నియామకాల్లో మందగమనాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకీ పరిస్థితి... టీసీఎస్ ప్రకటించిన 12,000 మంది సిబ్బంది కోతల్లో అత్యధికంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపైనే ప్రభావం చూపనుంది. భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధంగా తీర్చిదిద్దడం, టెక్నాలజీలో పెట్టుబడులపై మరింత ఫోకస్ చేయడం, ఏఐ వినియోగం, మార్కెట్ విస్తరణ, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ వంటి విస్తృత వ్యూహాలను కంపెనీ దీనికి కారణంగా చెబుతోంది. అంటే, రానున్న రోజుల్లో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి వ్యూహాల వైపే నడుస్తాయనే సంకేతాలు కనబడుతున్నాయి. ‘ఆర్థిక ఒత్తిళ్లతో పాటు క్లయింట్ల అంచనాలు, అలాగే చురుకైన, ఫలితాల ఆధారిత డెలివరీ విధానాల దిశగా పరిశ్రమలో వస్తున్న మార్పులు వంటి అనేక అంశాలు టీసీఎస్ సిబ్బంది కోత నిర్ణయాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థలో రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వ్యాఖ్యానించారుబెంచ్ సిబ్బంది విషయంలో కఠిన పాలసీని కంపెనీలన్నీ అమలు చేస్తుండటాన్ని చూస్తుంటే, సిబ్బంది సేవలను పూర్తిగా సది్వనియోగం చేసుకోవడంపై ఐటీ సంస్థలు దృష్టి పెడుతున్నాయనేందుకు నిదర్శనం. అయితే, టీసీఎస్ మాత్రం ఏఐకి తాజా కోతలకు సంబంధం లేదని చెబుతోంది. కానీ టెక్ పరిశ్రమలో సిబ్బంది నియామకాలను ఏఐ, ఆటోమేషన్ అనేవి మరింత ప్రభావితం చేస్తున్న తరుణంలో టీసీఎస్ నిర్ణయం వెలువడం గమనార్హం. మరోపక్క, ఇటీవలి ఐటీ కంపెనీల ఫలితాలను పరిశీలిస్తే.. ఆదాయాల్లో ఏమంత పెద్ద పెరుగుదల లేదు. క్లయింట్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో వ్యయాల తగ్గింపునకు కంపెనీలు మొగ్గు చూపడం కూడా నియామకాలపై ప్రభావం చూపుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే తీరు... మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్తో సహా ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు.. ఇప్పటికే ఉద్యోగుల తగ్గింపు బాట పట్టాయి. ముఖ్యంగా సరికొత్త డిజిటల్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉద్యోగ విధులు, నైపుణ్యాలను మదింపు చేస్తూ అవసరమైన వారికి శిక్షణ ఇవ్వడం.. లేదంటే వేటు వేయడానికీ వెనుకాడటం లేదు. ‘మన ఐటీ కంపెనీల విషయానికొస్తే.. సమర్థవంతమైన, పనితీరు ఆధారిత సిబ్బంది విధానాల వైపు మార్పునకు ఈ చర్యలు అద్దం పడుతున్నాయి’ అని పాఠక్ అభిప్రాయపడ్డారు. ‘ప్రపంచవ్యాప్తంగా కంపెనీలన్నీ ఇప్పుడు ఏఐ ఆసరాతో తక్కువ వ్యయానికి మరిన్ని సేవలు కోరుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ సంస్థల సిబ్బంది కోతలకు ఆజ్యం పోస్తోంది. భవిష్యత్తు అంతా ఏఐ ఆధారిత ఐటీ వైపు మారుతోంది. ప్రస్తుత మానవ నైపుణ్యాలతో పోటీ పడే ఏఐ ఏజెంట్లు.. ఇప్పుడున్న కొంత మంది సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియ జోరందుకుంటుంది’ అని టెక్ఆర్క్ వ్యవస్థాపకుడు ఫైజల్ కవూసా అభిప్రాయపడ్డారు. ఐటీ డిమాండ్ తగ్గడం, క్లయింట్ల ప్రాధాన్యతలు మారడం వల్ల ఎదురవుతున్న మార్జిన్ ఒత్తిళ్లు.. సిబ్బంది కోతకు దారితీస్తున్నాయని సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ పేర్కొన్నారు. నైపుణ్యాలు లేకుంటే ఇంటికే... కంపెనీ పనితీరును మెరుగుపరిచేందుకు టీసీఎస్తో పాటు దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఏఐ, ఆటోమేషన్ బాట పడుతున్నాయి. మార్జిన్లు పెంచుకోవడానికి తక్కువ సిబ్బందితో ఎక్కువ ఫలితాలు పొందాలనేది వాటి తాజా వ్యూహం. ప్రతి కంపెనీలో సిబ్బంది, విధానాలు, టెక్నాలజీ అన్నీ ఏఐ చుట్టూనే తిరుగుతున్నాయని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ పేర్కొన్నారు. ‘కంపెనీలన్నీ తమ ప్రస్తుత సిబ్బందితో పాటు కొత్తగా తీసుకునే ఉద్యోగుల సాంకేతిక నైపుణ్యాలను పెంచేందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. స్కిల్స్ పెంచుకోకుండా, భవిష్యత్తు విధానానికి అనుగుణంగా లేనివారిపై వేటు తప్పదు. దీర్ఘకాలంలో కంపెనీల్లో అనేక సానుకూల మార్పులతో మాటు కొన్ని ప్రతికూలతలు కూడా తప్పవు’ అని శర్మ అభిప్రాయపడ్డారు.పరిశీలిస్తున్నాం: ఐటీ శాఖ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించాలన్న టీసీఎస్ నిర్ణయంతో తలెత్తే పరిణామాలను కేంద్ర ఐటీ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, కారి్మక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (ఎన్ఐటీఈఎస్), ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ టీసీఎస్కు నోటీసులు ఇవ్వాలని కోరింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మహాలయ పక్ష ప్రత్యేక రైలు
హైదరాబాద్: మహాలయ పక్షం సందర్భంగా భారతీయ రైల్వే ప్రత్యేక రైలు యాత్రను ప్రారంభిస్తోంది. భారత్ గౌరవ్ ట్రైన్లలో భాగంగా ‘మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర’ పేరుతో ప్రత్యేక రైలును నడపబోతోంది. ఈ రైలు వివరాలను రైల్వే అధికారులు హైదరాబాద్లో జూలై 29న ప్రకటించనున్నారు.మహాలయ పక్ష సప్త మోక్ష క్షేత్ర యాత్ర రైలు ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించవచ్చు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిధ్పూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారనాసి, గయా క్షేత్రాలు ఉన్నాయి. మహాలయ పక్ష కాలంలో ఈ క్షేత్రాలను దర్శించి పూర్వీకులకు పిండ ప్రదానాలు చేస్తే స్వర్గగతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. -
టాటా కంపెనీకి డిమాండ్ నోటీసు.. రూ.7,800 కోట్లు బాకీ
సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలు సుమారు రూ.7,800 కోట్లు చెల్లించాలని కోరుతూ టాటా కమ్యూనికేషన్స్కు టెలికాం విభాగం (DoT) షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసు జారీ చేసింది. ఇవి 2005-06 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించిన ఏజీఆర్ బకాయిలుగా డిమాండ్ నోటీసులో పేర్కొంది.‘2005-06 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.7,827.55 కోట్ల షోకాజ్ కమ్ డిమాండ్ నోటీసులు భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం నుంచి జూన్ 30, 2005 నాడు అందాయి’ అని టాటా కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఏఎస్ లక్ష్మీనారాయణ్ తెలిపారు. ఇందులో ఐఎస్పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) లైసెన్స్ కింద 2010-11 ఆర్థిక సంవత్సరానికి, ఎన్ఎల్డీ (నేషనల్ లాంగ్ డిస్టెన్స్) లైసెన్స్ కింద 2007, 2010 ఆర్థిక సంవత్సాలకు కంపెనీ క్లెయిమ్ చేసిన మినహాయింపులు రూ .276.68 కోట్లను కూడా పేర్కొన్నట్లు ఆయన చెప్పారు.అయితే ఐఎల్డీ (ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్), ఎన్ఎల్డీ, ఐఎస్పీ లైసెన్సులకు సంబంధించి టాటా కమ్యూనికేషన్స్ గతంలో దాఖలు చేసిన అప్పీళ్లు సుప్రీంకోర్టు, టెలికాం ట్రిబ్యునల్ టీడీఎస్ఏటీ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. పాత టెలికాం లైసెన్స్ విధానం యూఏఎస్ఎల్ కింద ఏజీఆర్పై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కంపెనీ అప్పీళ్లను ప్రస్తావించలేదని లక్ష్మీనారాయణ్ తెలిపారు. కాబట్టి తమ లైసెన్సులు యూఏఎస్ఎల్కి భిన్నమని కంపెనీ భావిస్తోందని, స్వతంత్ర న్యాయ అభిప్రాయాల ఆధారంగా తన స్థానాన్ని సమర్థించుకోగలదని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. -
టెస్లాతో శాంసంగ్ భారీ డీల్
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రముఖ కంపెనీతో 16.5 బిలియన్ డాలర్ల(రూ.1.4 లక్షల కోట్లు) విలువైన భారీ చిప్ తయారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. 2033 చివరి వరకు కొనసాగే ఈ ఒప్పందం శాంసంగ్ చిప్ ఫౌండ్రీ వ్యాపారానికి ఊతమిస్తుందని నమ్ముతుంది. శాంసంగ్ గ్లోబల్ క్లయింట్లో ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఏ కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారో మాత్రం ధ్రువీకరించలేదు. అయితే ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి బ్లూమ్బర్గ్తో మాట్లాడుతూ శాంసంగ్ టెస్లాతోనే డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పారు. శాంసంగ్ చిప్ ఫౌండ్రీ విభాగం ఇప్పటికే టెస్లాతో కలిసి పనిచేస్తోందని, ఈ కొత్త డీల్ ఆ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.మార్కెట్లో పెరుగుతున్న పోటీ వల్ల శాంసంగ్ తన తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునేంత ఆర్డర్లను ఆకర్షించలేకపోయింది. మెమొరీ చిప్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న ఈ కంపెనీ చిప్ ఫౌండ్రీ వ్యాపారం డిమాండ్, పోటీని తట్టుకోవడానికి నానా తంటాలు పడుతోంది. ఈ కీలక సమయంలో దీర్ఘకాలిక ఒప్పందం రావడం కంపెనీకి కలిసొస్తుందని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఓలా కృత్రిమ్లో రెండో విడత లేఆఫ్స్తైవాన్కు చెందిన టీఎస్ఎంసీ(తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ) ప్రపంచ మార్కెట్పై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫౌండ్రీ మార్కెట్లో టీఎస్ఎంసీకి 67.6 శాతం వాటా ఉందని పరిశోధన సంస్థ ట్రెండ్ ఫోర్స్ తెలిపింది. శాంసంగ్ షేరు 8.1 శాతం నుంచి 7.7 శాతానికి పడిపోయింది. టెస్లాతో కొత్త ఒప్పందం శాంసంగ్ భవిష్యత్ చిప్ టెక్నాలజీని బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్తో సహా తదుపరి తరం పరికరాలు, అనువర్తనాలకు 2-నానోమీటర్ చిప్లు ఎంతో అవసరం అవుతాయి. -
దేశానికి సిగ్గుచేటు.. బంగారు బాతులను చంపేస్తున్నారు!
గురుగ్రామ్, బెంగళూరుకు మధ్య కొన్ని విషయాల్లో దగ్గరి పోలికలున్నాయని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. దేశంలోని రెండు అత్యంత సంపన్న నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించాయని విమర్శించారు. కాలమిస్ట్, వ్యాపారవేత్త సుహేల్ సేథ్ గురుగ్రామ్పై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆమె ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.అంతకుముందు సేథ్ ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ..‘గురుగ్రామ్లోని మౌలిక సదుపాయాలు దేశానికి సిగ్గుచేటు. ఈ నగరం దేశ రాజధానికి సమీపంలో ఉన్నప్పటికీ అక్కడి నగర పాలక సంస్థ అధికారులతీరు దారుణంగా ఉంది. గురుగ్రామ్లో ట్రాఫిక్ సిగ్నల్స్ కంటే ఎక్కువ మద్యం దుకాణాలు, పాఠశాలల కంటే బార్లు అధికంగా ఉన్నాయి. స్మార్ట్గా వ్యవహరించని నాయకులతో స్మార్ట్ సిటీల ఏర్పాటు సాధ్యం కాదు’ అని ఘాటుగా విమర్శించారు.దీనిపై మజుందార్ షా ఎక్స్ ద్వారా స్పందించారు. ‘ధనిక నగరాల దుస్థితి ఇలాగే ఉంది. బెంగళూరు కూడా మరో గురుగ్రామ్లా మారుతోంది. మౌలిక సదుపాయాలు, పౌర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేకుండా ప్రభుత్వం బంగారు బాతు(అభివృద్ధి చెందుతోన్న నగరాలు)ను దోచుకుని చంపేస్తోంది. డబ్బు సంపాదన కోసం భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు’ అని సేథ్ వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడారు.This is the fate of every rich city. Bengaluru is another Gurugram The state plunders n kills the golden goose with no responsibility to provide basic infrastructure n civic amenities -building rules are flouted to make money etc. @Suhelseth https://t.co/OLlM3YXaL1— Kiran Mazumdar-Shaw (@kiranshaw) July 26, 2025ఇదీ చదవండి: ఒకటికి మించిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా?దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘సరస్సులు, పచ్చదనం, సరైన ప్రణాళికతో కొత్త బెంగళూరును నిర్మించే అవకాశం ప్రభుత్వానికి లభించింది. కానీ ట్రాఫిక్, చెత్తాచెదారంతో కాంక్రీట్ జంగిల్గా మారుస్తున్నారు’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘పట్టణ ప్రణాళిక అనేది ఒక డెడ్ డిపార్ట్మెంట్. బహిరంగ ప్రదేశాలపై సరైన నిబంధనలు లేవు. బెంగళూరు రోడ్లు పార్కింగ్ స్థలాలుగా మారాయి’ అని ఒకరు చెప్పారు. స్మార్ట్ సిటీల గురించి 15-20 ఏళ్లుగా వింటున్నామని మరో యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రాధాన్యరంగ రుణాల విక్రయం
న్యూఢిల్లీ: అధికంగా ఉన్న ప్రాధాన్యరంగ రుణాల్లో కొంత వరకు ప్రస్తుత త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) విక్రయించనున్నట్టు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో కె.సత్యనారాయణ రాజు తెలిపారు. వడ్డీ రేట్లు తగ్గడం కారణంగా మార్జిన్లపై పడే ఒత్తిళ్లను ఈ రూపంలో అధిగమిస్తామన్నారు. జూన్ త్రైమాసికంలో ప్రా ధాన్యరంగ రుణాల విక్రయం రూపంలో రూ.1,248 కోట్ల కమీషన్ను కెనరా బ్యాంక్ ఆర్జించడం గమనార్హం. అయినప్పటికీ ప్రాధా న్యరంగ రుణాలు నియంత్రణ పరిమితి 40% కంటే అధికంగా 45.63% స్థాయిలో ఉన్న ట్టు సత్యానారాయణ రాజు చెప్పారు. మార్కెట్లో ప్రాధాన్య రంగ రుణాలకు డిమాండ్ ఉందంటూ.. దీన్ని అనుకూలంగా మలుచుకుంటామన్నారు. ఆర్బీఐ 1% మేర రెపో రేటును తగ్గించడంతో నికర వడ్డీ మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ముందు పేర్కొన్న విధంగా 2.75 శాతాన్ని సాధించడం కష్టమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం 3% లోపు కొనసాగితే మరో విడత రేట్ల కోత ఉండొచ్చన్నారు. కనుక ప్రస్తుత త్రైమాసికంపై ఒత్తిళ్లు ఉంటాయంటూ.. క్యూ3, క్యూ4లలో కొంత పురోగతి ఉండొచ్చని అంచనా వేశారు. రెండు సబ్సిడరీల్లో వాటాల విక్రయంతో వెసులుబాటు లభిస్తుందన్నారు. రెండింటిలో ఒక దానిని ప్రస్తుత త్రైమాసికంలో, మరొకటి వచ్చే త్రైమాసికంలో లిస్ట్ కానున్నట్టు చెప్పారు. కెనరా రొబెకో ఏఎంసీ, కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్లను ఐపీవోకు తీసుకొచ్చే ప్రణాళికల్లో బ్యాంక్ ఉండడం గమనార్హం. -
హైదరాబాద్కు ఐసీఐసీఐ లాంబార్డ్ ‘డిజాస్టర్ రికవరీ’ మార్పు
న్యూఢిల్లీ: బీమా రంగ సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ తమ డిజాస్టర్ రికవరీ మౌలిక సదుపాయాలను అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో ఆసియా–పసిఫిక్ (ముంబై) నుంచి ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్కు అప్గ్రేడ్ చేసినట్లు వెల్లడించింది.నిర్వహణపరమైన రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ, కస్టమర్లకు నిరాటంకంగా సేవలు అందించేందుకు ఇది సహాయపడగలదని పేర్కొంది. టెక్నాలజీపరమైన అంతరాయాలు, అంతర్జాతీయంగా ఐటీ పరిశ్రమలో రిసు్కలు పెరుగుతున్న నేపథ్యంలో డౌన్టైమ్ను గణనీయంగా తగ్గించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ తెలిపింది. -
మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా?
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక భారత సంతతికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వైభవ్ తనేజా. ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఉన్న ఆయనకు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు మస్క్. కొత్తగా ప్రకటించిన రాజకీయ వెంచర్ అయిన అమెరికా పార్టీకి వైభవ్ తానేజాను ట్రెజరర్, రికార్డుల కస్టోడియన్గానూ చేశారు. సంప్రదాయ ఐఐటీ-ఐఐఎం నుంచి వచ్చినవాడు కాకపోయినా తనేజా రూ.1,100 కోట్ల వేతన పరిహారాన్ని అందుకుంటున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.తనేజా అధికారికంగా అమెరికా పార్టీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు చేపట్టినట్లు ఇటీవల ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ధృవీకరించింది. ఈ పాత్రలో ఆయన రాజకీయ నిధులు, బడ్జెట్ పంపిణీని పర్యవేక్షించడం, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది కార్పొరేట్ ఫైనాన్స్ లో ఆయన ప్రస్తుత పాత్ర నుండి రాజకీయ రంగానికి గణనీయమైన మార్పును సూచిస్తుంది. తనేజాపై ఉన్న నమ్మకంతో మస్క్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ ఆర్థిక బాధ్యతలనూ అప్పగించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మొదలై..వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999 లో కామర్స్ లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 2006లో అమెరికా వెళ్లి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీసీఏ) అయ్యారు. ఇదే ఆయన ప్రపంచ ఆర్థిక జీవితాన్ని విస్తరించింది.ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)లో ఆయన దాదాపు 17 సంవత్సరాలు పనిచేశారు. అక్కడాయన 500 మందికి పైగా క్లయింట్లకు రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, ఐపీఓలను నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన రంగంలోకి ఆయన ప్రవేశం 2016లో సోలార్సిటీతో జరిగింది. ఈ సంస్థ తరువాత టెస్లాలో విలీనమైంది.రూ.1,100 కోట్ల వేతనం2017లో టెస్లాలో చేరిన తనేజా క్రమంగా ఎదుగుతూ 2023లో ఆ సంస్థకు సీఎఫ్ఓ అయ్యారు. 2024లో ఆయన 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,157 కోట్లు) వేతన పరిహారం అందుకున్నారు. ఇందులో మూల వేతనంగా అందుకున్నది 4 లక్షల డాలర్లే అయినప్పటికీ మిగిలినది స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా కూడా తానేజా పనిచేశారు. -
ఈసీఎం స్కీమ్.. రూ.16 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు
ఎల్రక్టానిక్స్ విడిభాగాల తయారీ స్కీమ్ (ఈసీఎంఎస్) కింద రూ. 16,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు కేంద్రానికి అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతుల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, షార్ట్లిస్ట్ చేసిన ప్రాజెక్టుల పేర్లను సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దేశ, విదేశ కంపెనీల నుంచి ఈ స్కీముకు మంచి స్పందన లభించినట్లు వివరించాయి.రూ. 22,805 కోట్ల ఈసీఎంఎస్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మే 1న దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల డిమాండ్కు తగ్గట్లుగా దేశీయంగా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. టాటా ఎల్రక్టానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్, ఫాక్స్కాన్లాంటి సంస్థలు దీనిపై ఆసక్తి కనపర్చినట్లు సమాచారం.విడిభాగాల సెగ్మెంట్లో 2030 నాటికి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 500 బిలియన్ డాలర్లకు చేరనుండగా, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం 248 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 21 లక్షల కోట్లు) చేరుతుందని ఎల్రక్టానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు తగు చర్యలు తీసుకోకపోతే ఈ కొరతను అధిగమించేందుకు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఈ బ్యాంకుల లాభాలు తగ్గాయ్..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం రూ. 3,282 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 3,520 కోట్లతో పోలిస్తే 7 శాతం క్షీణించింది. రిజర్వ్ బ్యాంక్ కీలక పాలసీ రేట్లను తగ్గించడం, ఫీజు ఆదాయాల వృద్ధి నెమ్మదించడం, ప్రొవిజనింగ్ పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణం.వార్షికంగా చూస్తే మొండిబాకీలకు ప్రొవిజనింగ్ 109 శాతం ఎగిసి రూ. 1,208 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం 6 శాతం పెరిగి రూ. 7,259 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 4.65 శాతంగా నమోదైంది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ లాభం స్వల్పంగా 1 శాతం వృద్ధితో రూ. 4,472 కోట్లకు చేరింది. జనరల్ ఇన్సూరెన్స్ విభాగం విక్రయానికి సంబంధించి రూ. 3,000 కోట్లు కూడా జత కావడంతో గత క్యూ1లో లాభం రూ. 7,448 కోట్లుగా నమోదైంది. తాజాగా నిర్వహణలోని మొత్తం ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 18 శాతం పెరిగి రూ. 6,36,311 కోట్ల నుంచి రూ. 7,50,143 కోట్లకు పెరిగింది. స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రిటైల్ కమర్షియల్ వాహన రుణాల పోర్ట్ఫోలియోలో ఒత్తిడి నెలకొన్నట్లు బ్యాంకు తెలిపింది. స్వల్పంగా పెరిగిన మొండిబాకీలు .. సమీక్షాకాలంలో అసెట్ క్వాలిటీ స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం (జీఎన్పీఏ) 1.39 శాతం నుంచి 1.48 శాతానికి పెరిగింది. నికర ఎన్పీఏలు స్థిరంగా 0.34 శాతంగా నమోదయ్యాయి. అటు కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (కాసా) నిష్పత్తి 43.4 శాతం నుంచి 40.9 శాతానికి తగ్గింది. సగటున మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ. 4,35,603 కోట్ల నుంచి రూ. 4,91,998 కోట్లకు, రుణాలు 14 శాతం పెరిగి రూ. 4,44,823 కోట్లకు చేరాయి. కరెంట్ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ. 62,200 కోట్ల నుంచి రూ. 67,809 కోట్లకు, సేవింగ్స్ డిపాజిట్లు 2 శాతం వృద్ధితో రూ. 1,22,105 కోట్ల నుంచి రూ. 1,24,186 కోట్లకు, టర్మ్ డిపాజిట్లు రూ. 2,1,298 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ. 3,00,003 కోట్లకు చేరాయి. స్లిప్పేజీలు రూ. 1,318 కోట్ల నుంచి రూ. 1,812 కోట్లకు పెరిగాయి.ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ లాభం 32% డౌన్ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 463 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 681 కోట్లతో పోలిస్తే ఏకంగా 32.07 శాతం క్షీణించింది. సమీక్షాకాలంలో అసెట్ క్వాలిటీ సైతం నెమ్మదించింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్పీఏ) పరిమాణం 1.87 శాతం నుంచి 1.97 శాతానికి పెరిగింది. రూ. 4,433.5 కోట్ల నుంచి రూ. 4,867.5 కోట్లకు చేరింది. అలాగే నికర ఎన్పీఏలు శాతాలవారీగా 0.53 శాతం నుంచి 0.53 శాతానికి, రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,346 కోట్లకు పెరిగాయి. వడ్డీ ఆదాయం 5 శాతం అప్.. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం రూ. 4,695 కోట్ల నుంచి రూ. 4,933 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ త్రైమాసికాలవారీగా 24 బేసిస్ పాయింట్లు క్షీణించి 5.71 శాతం నుంచి 5.95 శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల కోత ప్రభావం ఇందుకు కారణమని బ్యాంకు తెలిపింది. క్యూ1లో కస్టమర్ల డిపాజిట్లు 25.5 శాతం పెరిగినట్లు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ వి. వైద్యనాథన్ తెలిపారు. అసెట్ క్వాలిటీ విషయానికొస్తే సూక్ష్మరుణాల విభాగం మినహా అన్ని వ్యాపారాలు మెరుగ్గా రాణించినట్లు వివరించారు. అర్హులైన రుణగ్రహీతలకు, రెపో రేట్ల తగ్గింపు ప్రయోజనాలను బదలాయించడం వల్ల మార్జిన్లు తగ్గినట్లు వైద్యనాథన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి మార్జిన్లు మెరుగుపడొచ్చని వివరించారు. -
టెక్నాలజీ అందుబాటులోకి తీసురావడమే లక్ష్యం
రిలయన్స్ రిటైల్ ఇటీవల ఎలక్ట్రోలక్స్ గ్రూప్ కన్జూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ కెల్వినేటర్ కొనుగోలు డీల్పై కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ స్పందించారు. కంపెనీ ఉత్పత్తుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతి వినియోగదారుడి విభిన్న అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.‘కెల్వినేటర్ కొనుగోలు కంపెనీ అభివృద్ధికి ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. ఇది భారతీయ వినియోగదారులకు నమ్మకమైన ప్రపంచ ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకురావడానికిక వీలు కల్పిస్తుంది. దానికి కంపెనీ మార్కెట్ లీడింగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఎంతో తోడ్పడుతుంది’ అని ఇషా చెప్పారు. ఇదీ చదవండి: ‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’ఈ డీల్ విలువ సుమారు రూ.160 కోట్లు. దేశీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రీమియం గృహోపకరణాల విభాగంలో కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు రిలయన్స్ రిటైల్కి ఇది ఉపయోగపడనుంది. రిలయన్స్ రిటైల్ గతంలో కెల్వినేటర్ బ్రాండ్కి లైసెన్సు తీసుకుని, ఉపయోగించుకుంది. దీని కింద ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు మొదలైనవి అమ్ముడవుతున్నాయి. -
ఐటీకి ముందుంది మంచి కాలం
కొన్ని నెలలుగా ఐటీ పరిశ్రమలో చెప్పుకోదగిన లాభాలు ఉండడంలేదు. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీలు పోస్ట్ చేస్తోన్న ఫలితాల్లో చాలాభాగం లేఆఫ్స్, డిస్క్రీషనరీ వ్యయాన్ని తగ్గించుకోవడం వల్ల ఒనగూరిందే. అయితే సమీప భవిష్యత్తులో వీటిలో మార్పు రాబోతుందని అంచనాలు వెలువడుతున్నాయి. కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా ఆధునీకరణ, మెరుగైన డిజిటల్ అనుభవాల కోసం ఐటీ కంపెనీల కస్టమర్లు వ్యయాన్ని పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, రిటైల్ రంగాల్లో విచక్షణాత్మక ఐటీ వ్యయం తిరిగి గాడినపడుతుందనే సంకేతాలు వస్తున్నాయి.వ్యయాలు పెంపుస్థూల ఆర్థిక ఒడిదుడుకులు, అంతర్జాతీయ టారిఫ్ అనిశ్చితుల మధ్య మొత్తం టెక్ బడ్జెట్లు స్తంభించాయి. సాంప్రదాయ ఐటీ కార్యకలాపాలను కంపెనీలు జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈమేరకు ఐటీ కస్టమర్ కంపెనీలు తమ వ్యయాన్ని పెంచుతున్నాయి. ఇది ఐటీ రంగానికి కలిసొచ్చే అంశం. వినియోగదారులు ఏఐ వాడకంవైపు మొగ్గు చూపడం కూడా ఐటీకి ఊతం ఇస్తుంది. జేపీ మోర్గాన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రధాన యూఎస్ బ్యాంకులు ఏఐకి సంబంధించి ప్రయోగాత్మక దశలను దాటి పూర్తి స్థాయి, ఉత్పత్తి గ్రేడ్ ఏఐను వాడుతున్నాయి. ఈ పరివర్తన వ్యాపార ఫలితాలకు నేరుగా దోహదం చేస్తుంది.ఏఐతో మేలు..మల్టీ బిలియన్ డాలర్ల టెక్ బడ్జెట్ ఉన్న సంస్థలు ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గణనీయమైన వార్షిక ఆదాయాన్ని సంపాదిస్తున్నట్లు ఫారెస్టర్ ప్రిన్సిపల్ అనలిస్ట్ బిశ్వజీత్ మహాపాత్ర అన్నారు. స్పష్టమైన ఉత్పాదకత లాభాల కోసం ఏఐ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు. హైపర్-పర్సనలైజేషన్తో మెరుగైన కస్టమర్ అనుభవం చేకూరుతుందని చెప్పారు. ఏజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇది ఐటీ కంపెనీలకు లాభాలు తెస్తుందని చెప్పారు. ప్రముఖ సంస్థల ఐటీ వ్యయంలో 50% కంటే ఎక్కువ కృత్రిమ మేధ, డేటా ఆధునీకరణ, కస్టమర్-ఫేసింగ్ ఇన్నోవేషన్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..పూర్తి స్థాయిలో కేటాయింపులు పెండింగ్..ఐటీ కంపెనీల కస్టమర్ సంస్థల విచక్షణ వ్యయంలో రికవరీ ఇంకా విస్తృతంగా లేదని నిపుణులు చెబుతున్నారు. అనేక సంస్థలు ఐటీ స్పెండింగ్ కోసం ఇంకా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపడంలేదు. దాంతో మొత్తం టెక్ బడ్జెట్లు 2026 ఆర్థిక సంవత్సరంలో ఫ్లాట్గా లేదా స్వల్ప లాభాల్లో మాత్రమే పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఏఐ పుణ్యామా అని ఐటీ వ్యయంలో కొంత పురోగతి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తుంది. -
ప్రతి బీమా సంస్థకు ఒక అంబుడ్స్మన్
బీమా రంగంలో మరింత జవాబుదారీతనం దిశగా బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కీలక ప్రతిపాదన చేసింది. రూ.50 లక్షల వరకు క్లెయిమ్లకు సంబంధించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత బీమా అంబుడ్స్మన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు ‘ఇంటర్నల్ అంబుడ్స్మన్ గైడ్లైన్స్, 2025’ ముసాయిదాను విడుదల చేసింది.ఇదీ చదవండి: ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్ఫిర్యాదులను న్యాయంగా, పారదర్శకంగా, సకాలంలో పరిష్కరించేందుకు స్వతంత్ర, నిష్పాక్షిక యంత్రాంగం ఉండాలని పేర్కొంది. కార్యకలాపాలు ప్రారంభించి మూడేళ్లు దాటిన అన్ని బీమా సంస్థలకు ఈ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. బీమా సంస్థలు ఒకరికి మించి కూడా అంతర్గత అంబుడ్స్మన్ను నియమించొచ్చని తెలిపింది. ముసాయిదా మార్గదర్శకాలపై ఆగస్ట్ 17 వరకు సలహా, సూచనలను ఆహ్వానించింది. -
ఐటీసీ రూ.20,000 కోట్ల పెట్టుబడులు
కోల్కతా: ఐటీసీ మధ్య కాలానికి తన వ్యాపారాలపై రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోనున్నట్టు చైర్మన్, ఎండీ సంజీవ్ పురి ప్రకటించారు. ఏ వ్యాపారాలపై వెచ్చించేదీ స్పష్టం చేయలేదు. ఇటీవలి కాలంలో ఎనిమిది ప్రపంచస్థాయి తయారీ కేంద్రాలపై రూ.4,500 కోట్లను ఐటీసీ ఖర్చు చేసినట్టు కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులకు వెల్లడించారు. ఎఫ్ఎంసీజీ, ప్యాకేజింగ్, ఎగుమతులకు సంబంధించి విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులపై ఈ పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 40 అత్యాధునిక తయారీ వసతులను నిర్మించినట్టు గుర్తు చేశారు. 250 తయారీ కేంద్రాలు, 7,500 ఎంఎస్ఎంఈలతో కూడిన ఐటీసీ ఎకోసిస్టమ్ను ఇవి బలోపేతం చేస్తాయన్నారు. ‘‘కంపెనీ వ్యాపారాలన్నింటా 90 శాతం మేర అదనపు విలువ జోడింపు చర్యలను చేపట్టాం. వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ ఫుడ్ సేవల విభాగంలోకి ప్రవేశించాం. ఇప్పటికే ఐదు పట్టణాల్లో 60 క్లౌడ్ కిచెన్లను ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ ఆపరేషన్స్, ఆశీర్వాద్ సౌల్ క్రియేషన్స్, సన్ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్, శాన్షో బ్రాండ్ల కింద ఏర్పాటు చేశాం’’అని సంజీవ్ పురి వివరించారు. మూడేళ్లలో ఈ వ్యాపారం ఏటా 108 శాతం వృద్ధిని చూసినట్టు చెప్పారు. గత మూడేళ్లలో 300 కొత్త ఉత్పత్తులను కంపెనీ విడుదల చేసినట్టు వాటాదారుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత బ్రాండ్లు ప్రపంచ వేదికపై సత్తా చాటాలన్నది తమ అభిమతమంటూ.. ఈ విషయంలో భారత్కే తొలి ప్రాధాన్యమని చెప్పారు. డీమెర్జర్పై సరైన సమయంలో నిర్ణయాలు ఐటీసీ ఇన్ఫోటెక్ సహా తన వ్యాపారాల డీమెర్జర్ (వేరు చేసి లిస్ట్ చేయడం) విషయమై ఎప్పటికప్పుడు అవకాశాలను ఐటీసీ మదింపు వేస్తుందని సంజీవ్ పురి తెలిపారు. పోటీ వాతావరణం, వ్యాపారం పరిపూర్ణతకు రావడం, అవకాశాలు, విలువ జోడింపు తదితర అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. -
హైదరాబాద్లో 2వ జీసీసీ లీడర్షిప్ సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ తాజాగా 2వ జీసీసీ లీడర్షిప్ సదస్సుకు ఆతిథ్యమివ్వనుంది. జూలై 30న లీడర్షిప్ ఫెడరేషన్ నిర్వహించే ఈ కాంక్లేవ్లో దేశ విదేశ దిగ్గజాలు, ప్రభుత్వ సంస్థలు, ఇన్నోవేషన్ హబ్లకు చెందిన 300 మంది సీనియర్ లీడర్లు పాల్గోనున్నారు. చౌకగా సర్వీసులను అందించే వ్యాపార విభాగాల స్థాయి నుంచి అంతర్జాతీయంగా కొత్త ఆవిష్కరణలకు చోదకాలుగా జీసీసీలు ఎదుగుతున్న తీరుపై ఇందులో చర్చిస్తారని లీడర్షిప్ ఫెడరేషన్ అడ్వైజరీ బోర్డు సభ్యుడు రాబిన్ జె తెలిపారు. ఈసారి సదస్సులో జెన్ఏఐ–ఆటోమేషన్, వర్క్ఫోర్స్ పరివర్తన తదితర అంశాలు ప్రధాన అజెండాగా ఉంటాయని పేర్కొన్నారు. -
కొలువులకు లైవ్ ఈవెంట్ల దన్ను
ముంబై: లైవ్ ఈవెంట్లు, కాన్సర్ట్ల వ్యవస్థ దేశీయంగా గణనీయంగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడనుంది. దేశవ్యాప్తంగా ఏటా 100 పైగా భారీ కాన్సర్టులు (కచేరీలు) జరగనున్న నేపథ్యంలో 2030–32 నాటికి 1.2 కోట్ల పైచిలుకు తాత్కాలిక కొలువులు రానున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ ఈ విషయాలు వెల్లడించింది. లైవ్ ఈవెంట్లు, కాన్సర్టులు ఉపాధితోపాటు ఆర్థిక వ్యవస్థకు కూడా చోదకాలుగా ఉంటున్నాయని సంస్థ సీఈవో సచిన్ అలగ్ తెలిపారు. కొత్త పరిణామాలతో ప్రొడక్షన్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియావ్యాప్తంగా నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులాంటి మెట్రోల్లోనే జరుగుతున్నప్పటికీ, క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా తెరపైకి వస్తున్నాయని అలగ్ చెప్పారు. ‘షిల్లాంగ్, గౌహతి, పుణే, జైపూర్, కొచ్చి, లక్నో, ఇండోర్, చండీగఢ్ లాంటి నగరాలు లైవ్ ఈవెంట్లకు హాట్ స్పాట్లుగా మారుతున్నాయి’ అని పేర్కొన్నారు.వివిధ విభాగాల్లో వేల కొద్దీ అవకాశాలు.. ఒక్కో కాన్సర్టుతో వివిధ విభాగాల్లో 15,000 నుంచి 20,000 స్వల్పకాలిక ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఎన్ఎల్బీ సరీ్వసెస్ తెలిపింది. వేదిక నిర్వహణ, జన సమూహాల నియంత్రణ, ఫుడ్..బెవరేజ్ సరీ్వసులు, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఆర్టిస్టులకు సర్వీసుల్లాంటి విభాగాలు వీటిలో ఉన్నాయి. కాన్సర్ట్ ఎకానమీ అనేది అటు ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. ఉదాహరణకు 2024లో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన కోల్డ్ప్లే కచేరీతో స్థానిక ఎకానమీకి రూ. 72 కోట్ల జీఎస్టీ సహా రూ. 641 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఫ్లయిట్లకు డిమాండ్ 300–350 శాతం ఎగిసింది. రైళ్ల బుకింగ్స్ 8 శాతం పెరిగాయి. హోటల్ టారిఫ్లు రికార్డు స్థాయికి (కొన్ని గదుల టారిఫ్లు రోజుకు రూ. 90,000) ఎగిశాయి.ఫుల్టైమ్ కొలువుల్లోకి రూపాంతరం.. ఈ కాన్సర్టుల బూమ్ అనేదిక ఏదో స్వల్పకాలిక వ్యవహారం కాదని, 10–15 శాతం తాత్కాలిక కొలువులు పూర్తి స్థాయి ఉద్యోగాలుగా కూడా మారుతున్నాయని అలగ్ చెప్పారు. ముఖ్యంగా ఆడియో ఇంజనీరింగ్, డిజిటల్ వ్యూహం, ఈవెంట్ టెక్నాలజీ, ప్రొడక్షన్ నిర్వహణ వంటి విభాగాల్లో ఈ ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాజెక్టులు పునరావృతం అవుతుండటం, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ లాంటి అంశాలు దీర్ఘకాలికంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గిగ్ లేదా ఫ్రీలాన్స్ వర్కర్లకు ఉపయోగకరంగా ఉంటోందని అలగ్ చెప్పారు. ఏటా 100 పైగా కాన్సర్టులు ఉంటాయనే అంచనాల కారణంగా రాబోయే కొన్నేళ్లలో వీటిపంగా రూ. 15,000 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనాలు ఉన్నట్లు వివరించారు. టికెటింగ్, హాస్పిటాలిటీ, రవాణా ద్వారా ప్రత్యక్ష ఆదాయాలు, పర్యాటకం, స్థానికంగా ఉపాధి కల్పన, వంటి అంశాలు ఇందుకు తోడ్పడతాయని అలగ్ చెప్పారు. -
విస్కీ ధరలు తగ్గింపు..?
భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరు ప్రాంతాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ డీల్ కుదరడంతో స్పిరిట్లపై దిగుమతి సుంకాలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియం అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా అందించే వీలుందని భావిస్తున్నారు. ఒక్కో బాటిల్పై సరాసరిగా రూ.300 వరకు ధరల తగ్గింపు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దీర్ఘకాలంలో ఇరుదేశాల వాణిజ్యాన్ని 35 బిలియన్ డాలర్లకు పెంచుతుంది. ఈ డీల్ కోసం మూడేళ్లకు పైగా సాగుతున్న చర్చల ఫలితంగా మే నెలలో ఎఫ్టీఏను ఖరారు చేయగా, ప్రధాని నరేంద్ర మోదీ బ్రిటన్ పర్యటన సందర్భంగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, యూకే ప్రధాని జోనాథన్ రేనాల్డ్స్ ఒప్పందంపై తాజాగా సంతకాలు చేశారు. రెండు ప్రభుత్వాల మధ్య లండన్లో కుదిరిన ఎఫ్టీఏ ప్రకారం యూకే విస్కీ, జిన్లపై సుంకాన్ని భారత్ 150 శాతం నుంచి 75 శాతానికి తగ్గించనుంది. ఈ ఒప్పందం కుదిరిన పదేళ్లలో మరో 40 శాతం సుంకాలు తగ్గించేలా నియమాలున్నాయి.విస్కీ ధరలపై నిపుణుల అంచనాలుభారతదేశంలో ప్రీమియం ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్డబ్ల్యూఏఐ) ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఆల్కహాలిక్ బేవరేజ్ రంగానికి చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించింది. ఈ ఒప్పందం వల్ల ప్రీమియం అంతర్జాతీయ స్పిరిట్స్ మరింత అందుబాటులోకి వస్తాయని, ఈ డీల్ భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఐఎస్డబ్ల్యూఏఐ సీఈఓ సంజిత్ పాధి తెలిపారు. ఇది హాస్పిటాలిటీ, టూరిజం, రిటైల్ వంటి అనుబంధ రంగాల్లో వృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టంపెద్దగా మార్పు ఉండదు..దిగుమతి చేసుకున్న స్కాచ్ (విస్కీ) వినియోగదారుల ధరల్లో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని మద్యం పరిశ్రమ నిపుణుడు వినోద్ గిరి తెలిపారు. మద్యంపై పన్నులు చాలా వరకు రాష్ట్రాల్లోనే ఉన్నాయని, కస్టమ్స్ సుంకం తగ్గింపు జరిగినా దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీల వినియోగదారుల ధరలపై ప్రభావం ఒక్కో బాటిల్పై సరాసరి రూ.100-300 మధ్య ఉంటుందని తెలిపారు. -
వెజ్ ప్రోటీన్ స్లైస్ను విడుదల చేసిన మెక్డొనాల్డ్స్
ఆహార ప్రియులకు ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన ఫాస్ట్ ఫుడ్ను అందించాలనే లక్ష్యంతో మెక్డొనాల్డ్ ఇండియా (వెస్ట్ & సౌత్) ‘ప్రోటీన్ ప్లస్ స్లైస్’ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ వెజిటేరియన్ ఆధారిత ఆవిష్కరణ కోసం మెక్డొనాల్డ్ సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ - సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో జత కట్టినట్లు పేర్కొంది.ప్రోటీన్ ప్లస్ స్లైస్ప్రోటీన్ ప్లస్ స్లైస్ అనేది మొక్కల ఆధారిత ప్రోటీన్ స్లైస్. ఇది అధిక పోషకాలు కలిగి మాంసాహార ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా భారతీయ అభిరుచులు, ఆహార ప్రాధాన్యతలకు అనుగుణంగా దీన్ని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్లైస్ 100% శాఖాహారంతో తయారు చేసినట్లు చెప్పింది. ఇందులో మొక్కల ఆధారిత ప్రోటీన్ అధికంగా ఉంటుంది. భారతీయ ఆహార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి స్థానికంగా అభివృద్ధి చేశారు.సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ సహకారంఈ స్లైస్ ఆవిష్కరణకు మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకోవడం మరింత విశ్వసనీయతను చేకూరుస్తుందని కంపెనీ నమ్ముతుంది. పప్పులు, తృణధాన్యాల నుంచి సేకరించిన మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఉపయోగించి పోషకాల సమతుల్యానికి సీఎఫ్టీఆర్ఐ పరిశోధనలు ఎంతో తోడ్పడ్డాయని మెక్డొనాల్డ్ తెలిపింది. స్థిరమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి భారత్లో డిమాండ్ పెరుగుతుందని చెప్పింది. ఈ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఇలాంటి ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టంవెస్ట్లైఫ్ ఫుడ్వరల్డ్ నిర్వహిస్తున్న మెక్డొనాల్డ్స్ ఇండియా (వెస్ట్ & సౌత్) మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని అవుట్లెట్ల మెనూలో ఈ ప్రోటీన్ ప్లస్ స్లైస్ను ఉంచబోతున్నట్లు తెలుస్తుంది. కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాంక్ తీసుకొని, దాన్ని విశ్లేషించిన తర్వాత ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. -
ఇండియన్స్ను వద్దంటే యూఎస్కే నష్టం
భారత్ వంటి దేశాలతో సహా విదేశాల్లో నియామకాలను నిలిపివేయాలని గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలకు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందేశం పంపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణాలు లేకపోలేదు. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ అక్కడి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోపాటు ఇంకా కొన్ని కారణాలున్నాయి. అయితే దీని అమలు చేస్తే యూఎస్ సాంకేతిక అభివృద్ధి మందగిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.జాతీయవాదం, అమెరికా ఫస్ట్ ఎజెండా2025 జులై 23-24 తేదీల్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ రాడికల్ గ్లోబలిజం నుంచి టెక్ కంపెనీలు బయటకు రావాలని నొక్కి చెప్పారు. టెక్ కంపెనీలు యూఎస్ నుంచి ప్రయోజనం పొందుతున్నాయని చెబుతూ, చైనా, భారత్ వంటి దేశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ఎత్తిచూపారు. అమెరికాలో ఉపాధిని పెంచేందుకు స్థానిక టెక్నాలజీ కంపెనీలు ముందుకు రావాలన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీఇదే సదస్సులో కృత్రిమ మేధకు సంబంధించి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో కృత్రిమ మేధ అభివృద్ధిని పెంచడానికి, దేశ పురోగతి అడ్డంకులను తగ్గించడానికి ‘విన్నింగ్ ది రేస్’ పేరుతో జాతీయ వ్యూహాన్ని తెలియజేశారు. ఈ ప్రణాళికలో డేటాసెంటర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం ద్వారా, కృత్రిమ మేధకు అవసరమైన మౌలిక సదుపాయాలను కంపెనీలు సులభంగా నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాను కృత్రిమ మేధలో అగ్రగామిగా నిలపాలని చెప్పారు. ఏఐని అభివృద్ధి చేయడానికి ఫెడరల్ ఫండింగ్ పొందే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఉత్తర్వుపై సంతకం చేశారు. అందులో భాగంగా కంపెనీలు రాజకీయంగా తటస్థంగా ఉండే ఏఐ టూల్స్ను తయారు చేయాల్సి ఉంటుంది.హెచ్-1బీ వర్క్ వీసాలపై ఆందోళనట్రంప్ గత హయాంలో జారీ చేసిన బై అమెరికన్, హైర్ అమెరికన్ కార్యనిర్వాహక ఉత్తర్వులను పునసమీక్షించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా టెక్ సంస్థల్లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించే హెచ్-1బీ వీసా విధానాలపై ఇది ఒత్తిడి తెస్తుంది. ఈ వీసా అమెరికా కంపెనీలు స్థానిక సిబ్బంది కంటే విదేశీ ప్రతిభావంతులపై ఎక్కువగా ఆధారపడటానికి ప్రోత్సహిస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.ఇప్పటికే హెచ్చరికలు..గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. భారత్లో నియామకాలు ఆపేయాలనే ట్రంప్ హెచ్చరిక కంపెనీల దీర్ఘకాలిక కార్యకలాపాలకు సవాలుగా మారుతుంది. ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో ఇండియాలో కార్యకలాపాలు నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ ఉద్యోగులను తిరిగి యూఎస్కు రప్పించాలని కూడా ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..నష్టమేంటి..?ట్రంప్ వ్యాఖ్యలపై భారత అధికారులు, ప్రపంచ ఆర్థికవేత్తలు, టెక్ ఇండస్ట్రీ లీడర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ ప్రతిభావంతులకు భారతదేశం నెలవుగా కొనసాగుతోంది. చాలా కంపెనీలు ఇక్కడి నైపుణ్యాన్ని తమ అభివృద్ధికి ఉపయోగిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం అమెరికా ఆవిష్కరణలకు సహాయపడటం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ టెక్ ఎకోసిస్టమ్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రా కోసం భారతీయ ఇంజినీర్లు, డెవలపర్లు, పరిశోధకులు గణనీయంగా దోహదపడుతున్నారు. భారత్ నుంచి నియామకాలను నిలిపివేస్తే అమెరికా-భారత్ సంబంధాలు దెబ్బతింటాయని, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి మందగించవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
త్వరలో 25000 మంది ఉద్యోగాలు కట్..
చిప్ తయారీ సంస్థ ఇంటెల్ త్వరలో 25,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించాలని యోచిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గత ఏడాది చివరి నాటికి 1,08,900 మంది ఉద్యోగులను తగ్గించిన కంపెనీ 2025 చివరి నాటికి మరో 75,000 మంది ఉద్యోగులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 2025 నుంచి ఇంటెల్ ఇప్పటికే సుమారు 15,000 కొలువులను తగ్గించుకుంది.ఇంటెల్ 2025 రెండో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ ఉద్యోగుల తొలగింపు స్థాయిని ధ్రువీకరించింది. పునర్నిర్మాణ ఖర్చులతో సహా కంపెనీ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఆదాయం 12.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం 12.6 బిలియన్ డాలర్ల నుంచి 13.6 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని ఇంటెల్ అంచనా వేసింది.ఇంటెల్ కొత్త సీఈఓ లిప్-బు టాన్ ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ ఎదుర్కొంటున్న క్లిష్ట కాలాన్ని అంగీకరించారు. ‘గత కొన్ని నెలలుగా పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నాయి. సంస్థను క్రమబద్ధీకరించడానికి, మరింత సామర్థ్యాన్ని పెంచడానికి, ప్రతి స్థాయిలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. కంపెనీ ‘రీసెట్’లో భాగంగానే ఇలా ఉద్యోగులను తొలగిస్తున్నాం’ అని తెలిపారు. జర్మనీ, పోలాండ్ల్లో కొత్త కర్మాగారాలను నిర్మించే ప్రణాళికలను కూడా కంపెనీ విరమించుకుంది. కంపెనీ ఒహియో సైట్లో ఉత్పత్తి వేగం తగ్గిపోయింది. కోస్టారికాలో కొన్ని కార్యకలాపాలను వియత్నాం, మలేషియాకు తరలించారు. నిర్వహణ వ్యయాలను తగ్గించడానికి, దాని ప్రపంచ కార్యకలాపాల అంతటా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఇంటెల్ తెలిపింది.ఇదీ చదవండి: ప్రమాణాలను పెంచండి, విశ్వాసాన్ని గెలవండిఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఇంటెల్ ఇటీవలి కాలంలో కష్టాల్లో పడింది. 1990వ దశకంలో పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రోప్రాసెసర్ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు ఎన్వీడియా వంటి సంస్థల నేతృత్వంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ చిప్ విభాగంలో వెనుకబడింది. వెంచర్ క్యాపిటలిస్ట్, ఇంటెల్ బోర్డు సభ్యుడు లిప్-బు టాన్ మార్చిలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీ బ్యూరోక్రసీని తగ్గించి, తమ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టిస్తానని హామీ ఇచ్చారు. -
బాలాజీ ఫౌండేషన్ దాతృత్వం
హైదారాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలాజీ ఫౌండేషన్ మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.10 లక్షలు వెచ్చించి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ... నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్టాండులో తాగునీటి సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. బాలాజీ ఫౌండేషన్ వ్యాపారంతో పాటు సేవారంగంలోనూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. తన తండ్రి బాలాజీ చౌదరి నెల్లూరు నుంచే తన వ్యాపార ప్రస్థానాన్ని ప్రారంభించారని, అలాంటి ప్రాంతంలో బాలాజీ ఫౌండేషన్ సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని బీ న్యూ మొబైల్స్ అండ్ ఎల్రక్టానిక్స్’, బాలాజీ సంస్థ సీవోఈ సాయి నిఖిలేష్ తెలిపారు. -
అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలేయ వ్యాధుల చికిత్సకు సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేసే దిశగా అపోలో హాస్పిటల్స్, సీమెన్స్ హెల్తినీర్స్ చేతులు కలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా వ్యాధులను ముందుగా గుర్తించడం, పర్యవేక్షణ, చికిత్స మొదలైన వాటికి కృత్రిమ మేథ (ఏఐ), అల్ట్రాసౌండ్ ఇమేజింగ్లాంటి సాంకేతికతలను ఉపయోగిస్తాయి. తద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించడంపై దృష్టి పెడతాయి. ఏఐని ఉపయోగించి, గాటు పెట్టకుండా కాలేయ వ్యాధికి చికిత్సను అందించే దిశగా సీమెన్స్ హెల్తినీర్స్తో భాగస్వామ్యం కీలక ముందడుగు కాగలదని అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీత రెడ్డి తెలిపారు. వ్యాధులను సకాలంలో కచి్చతంగా గుర్తించేందుకు, మెరుగైన చికిత్సను అందించేందుకు, పేషంట్లకు మెరుగైన జీవితాన్ని అందించేందుకు అధునాతన టెక్నాలజీలు తోడ్పడతాయని సీమెన్స్ హెల్త్కేర్ ఎండీ హరిహరన్ సుబ్రమణియన్ చెప్పారు. -
పెరిగిన గగనతల ప్రయాణికుల సంఖ్య
న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సంస్థలు ఈ ఏడాది జూన్లో 1.36 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చాయి. మే నెలలో నమోదైన 1.32 కోట్ల మందితో పోలిస్తే ఇది 3 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో దేశీ ఎయిర్లైన్స్లో 8.51 కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 7.93 కోట్ల మంది ప్యాసింజర్లతో పోలిస్తే ఇది 7.34 శాతం అధికం. ఫ్లయిట్ల జాప్యాల వల్ల 1,20,023 మంది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఫ్లయిట్ల రద్దు వల్ల 33,333 ప్రయాణికులపై ప్రభావం పడగా, పరిహారం, ఇతరత్రా సదుపాయాల కల్పన కింద విమానయాన సంస్థలు రూ. 72.40 లక్షలు వెచ్చించాయి. ఇక, మే నెలలో 64.6 శాతంగా ఉన్న విమానయాన సంస్థ ఇండిగో మార్కెట్ వాటా జూన్లో 64.5 శాతానికి పరిమితమైంది. ఎయిరిండియా గ్రూప్ వాటా 26.5 శాతం నుంచి 27.1 శాతానికి చేరింది. ఆకాశ ఎయిర్ వాటా పెద్దగా మార్పు లేకుండా 5.3 శాతం స్థాయిలోనే ఉంది. స్పైస్జెట్ వాటా మాత్రం 2.4 శాతం నుంచి 1.9 శాతానికి తగ్గింది. -
బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళలకు మరింత వాటా
ముంబై: కార్మిక, నైపుణ్య ఉద్యోగాల్లో (బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలు) మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. అదే సమయంలో చెప్పుకోతగ్గ సంఖ్యలో ఉద్యోగం వీడుతుండడం (వలసల రేటు/అట్రిషన్) ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యం 19 శాతానికి పెరిగింది. 2020–21 నాటికి వీరి భాగస్వామ్యం 16 శాతంగా ఉండడం గమనార్హం. కానీ, వలసలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా ఏడాది లోపు అనుభవం ఉన్న మహిళల ఎక్కువగా ఉద్యోగం మానేస్తున్నారు. ఈ వివరాలను ఉదైతి ఫౌండేషన్, క్వెస్కార్ప్ నివేదిక వెల్లడించింది. రిటైల్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, సేవల రంగాల్లో ఉద్యోగం చేస్తున్న 10,000 మంది మహిళలతోపాటు, ఉద్యోగం మానేసిన 1,500 మందిని సర్వే చేసి ఈ వివరాలు విడుదల చేసింది. వలసలు ఎక్కువగా ఉండడం ఉత్పాదకతకు, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్వప్న సాకారానికి విఘాతం కలిగిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళల అభిప్రాయాలు.. వచ్చే 12 నెలల్లో ఉద్యోగం వీడనున్నట్టు ఏడాది లోపు అనుభవం ఉన్న 52 శాతం మహిళా ఉద్యోగులు సర్వేలో తెలిపారు. అదే రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిలో ఇలా చెప్పిన వారు 3 శాతంగానే ఉండడం గమనార్హం. వలసల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల్లోనూ 54 శాతం తమ వేతనం విషయమై సంతృప్తిగా లేరు. 80 శాతం మంది నెలకి రూ. 2,000 కన్నా తక్కువే పొదుపు చేస్తున్నారు. మంచి వేతనం ఇస్తే ఉద్యోగాల్లో తిరిగి చేరతామని 42 శాతం మంది చెప్పారు. 57 శాతం మంది రవాణా పరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటే, 11 శాతం మంది రాత్రి షిఫ్టుల్లో పని ప్రదేశానికి వెళ్లి రావడాన్ని భద్రంగా భావించడం లేదు. రూ.20వేల కంటే అధిక వేతనం పొందుతున్న వారు సమీప కాలంలో ఉద్యోగం విడిచి పెట్టిపోవడం 21 శాతం తక్కువగా ఉండొచ్చన్నది ఈ నివేదిక సారాంశం. వ్యవస్థలోనే లోపం.. ‘‘భారత్ ఆర్థిక సామర్థ్యాల విస్తరణకు అద్భుతమైన అవకాశాలున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలకు ద్వారాలు తెరిచాం. కానీ, వారికి అనుకూలమైన వ్యవస్థల ఏర్పాటుతోనే వృద్ధి చెందగలరు. సామర్థ్యాలు లేకపోవడం వల్ల మహిళల ఉద్యోగాలు వీడడం లేదు. మహిళలు పనిచేసేందుకు, విజయాలు సాధించేందుకు అనుకూలమైన వసతులను మనం కలి్పంచలేకపోతున్నాం’’అని ఉదైతి ఫౌండేషన్ సీఈవో పూజ గోయల్ వివరించారు. -
ఐఆర్డీఏఐ కొత్త చైర్మన్ అజయ్ సేత్
న్యూఢిల్లీ: బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కొత్త చైర్మన్గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేత్ను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల కాలానికి లేదా 65 ఏళ్లు వచ్చేంత వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు సేత్ను ఈ పదవిలో నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. అజయ్ సేత్ 1987 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. నాలుగేళ్ల పాటు కేంద్ర ఆర్థిక శాఖలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సేవలు అందించిన అనంతరం ఈ ఏడాది జూన్లో పదవీ విరమణ చేశారు. దేవాశిష్ పాండా పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగియగా, అప్పటి నుంచి ఐఆర్డీఏఐ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. -
ఉద్యోగం ఇచ్చారు.. అంతలోనే తొలగించారు!
ఓ మహిళా ఉద్యోగిని నియమించిన కొంత కాలానికి తన నియామకం చెల్లదని కంపెనీ తనను కొలువు నుంచి తొలగించింది. అందుకు నియామక సమయానికి ఆమెను గర్భిణిగా గుర్తించడమే కారణమని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వెలిసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్పామ్ టీమ్బ్లైండ్లో చేసిన ఓ పోస్ట్లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.‘ఓ ప్రైవేట్ కంపెనీ ఒక మహిళా అభ్యర్థిని ఉద్యోగంలో నియమించుకుంది. బ్యాంక్గ్రౌండ్ వెరిపికేషన్లో ఆమె 6 నెలల గర్భిణి అని గుర్తించారు. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఉద్యోగానికి దరఖాస్తు చేయడం చట్టవిరుద్ధంగా కంపెనీ భావిస్తోంది. దాంతో తనను ఉద్యోగం నుంచి తొలగించి తిరిగి ఆ లెవల్-6 కొలువుకు మళ్లీ రిక్రూట్మెంట్ జరుపుతుంది’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్పై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఈ పోస్ట్ ఏ దేశంలోని ఉద్యోగి అప్లోడ్ చేశారో తెలియరాలేదు.ఇదీ చదవండి: అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలుగతంలో ఇలాంటి వివక్షను ఎదుర్కొన్న ఒక ఉద్యోగి రిప్లై ఇస్తూ..‘నేను ఉద్యోగంలో చేరినప్పుడు 5 నెలల గర్భిణిగా ఉన్నాను. ఇప్పుడు కంపెనీలు చూపిస్తున్న చిన్నచూపు సరికాదు. నేను ఉద్యోగంలో చేరి ముందుకు సాగుతున్నాను. కంపెనీలో టాప్ ఎంప్లాయిల్లో ఒకరిగా ఉన్నాను. ప్రతి ప్రాజెక్ట్లోనూ నా నైపుణ్యాలు వాడుతారు. నేను చాలా మంది ఉద్యోగుల కంటే మెరుగ్గా సమస్యలకు పరిష్కారాలు అందిస్తాను. మహిళలు అభద్రతా భావానికి గురికావద్దు. పైన తెలిపిన పోస్ట్లో ఆమెను ఒక కారణం కోసం కంపెనీ నియమించుకుంది. దాన్ని మర్చిపోవద్దు’ అని రాసుకొచ్చారు. -
అనిల్ అంబానీ సంస్థలపై ఈడీ సోదాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ అంబానీని ‘ఫ్రాడ్’గా వర్గీకరించిన కొద్ది రోజుల్లోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ముంబైలోని కంపెనీకి సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో అంబానీ వ్యక్తిగత నివాసం లేనప్పటికీ ఢిల్లీ, ముంబైలోని ఈడీ బృందాలు ఆయన గ్రూప్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీ నిర్వహించాయి. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.కంపెనీ ఆర్థిక వ్యవహారాలపై ఇప్పటికే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు నియంత్రణ, ఆర్థిక సంస్థల నుంచి అందిన సమాచారం, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈ చర్యలు తీసుకుంది. విస్తృత దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్తో సంబంధం ఉన్న సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్లను కూడా విచారిస్తున్నారు. ప్రజాధనాన్ని దారి మళ్లించారనేలా ఆధారాలు లభించాయని ఈడీ పేర్కొంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ సంస్థలతో సహా అనేక సంస్థలను తప్పుదారి పట్టించి ఉండవచ్చని ఈడీ అభిప్రాయపడింది.యస్ బ్యాంక్ రుణాలు2017 నుంచి 2019 వరకు యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు. గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంకు ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు తెలిపారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.8,670.80 కోట్లకు పెరిగింది. యస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు సంబంధించిన లంచం కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు ఈడీ తెలిపింది.ఇదీ చదవండి: ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సుఫ్రాడ్గా వర్గీకరణరిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ సంస్థ ప్రమోటర్ అనిల్ అంబానీని ‘మోసపూరితం(ఫ్రాడ్)’గా ఎస్బీఐ జూన్ 13న గుర్తించినట్టు ఇటీవల లోక్సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పకంజ్ చౌదరి తెలిపారు. జూన్ 24న ఆర్బీఐకి ఫ్రాడ్ వర్గీకరణ గురించి ఎస్బీఐ నివేదించిందని.. దీనిపై సీబీఐ వద్ద కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫ్రాడ్గా గుర్తించిన విషయాన్ని ఆర్కామ్ బీఎస్ఈకి జూలై 1న వెల్లడించడం గమనార్హం. ఆర్కామ్ ప్రస్తుతం దివాలా పరిష్కార చట్టం కింద చర్యలను ఎదుర్కొంటోంది. ఆర్కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31వేల కోట్లకు పైగా రుణం తీసుకోగా.. ఈ నిధులను వివిధ గ్రూప్ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని ఎస్బీఐ ఆర్కామ్కు తెలియజేయడం గమనార్హం. రిలయన్స్ కమ్యూనికేషన్స్కు ఎస్బీఐ భారీగానే అప్పులు ఇచ్చింది. ఇందులో ఆగస్టు 26, 2016 నుంచి చెల్లించాల్సిన వడ్డీ, ఖర్చులతో కలిపి రూ.2,227.64 కోట్ల అసలు ఉంది. రూ.786.52 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీల ద్వారా నాన్ ఫండ్ బేస్డ్ రుణాలు కూడా ఉన్నాయి. -
ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు
‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2025’ సదస్సు సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్టు మంత్రి చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు పరిచయడం చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సదస్సును ‘భారత్ మండపం’లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక పోర్టల్, మొబైల్ అప్లికేషన్ను మంత్రి ఆవిష్కరించారు.ఇదీ చదవండి: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లుగతంలో నిర్వహించిన మూడు ఎడిషన్లు (సదస్సులు) విజయవంతమైనట్టు, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ కార్యదర్శి అవినాష్ జోషి తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఈ రంగం ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతుల్లో ఈ విభాగం నుంచే 20 శాతం ఉంటున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎక్విప్మెంట్ తయారీదారులు, ప్యాకేజింగ్ సొల్యూషన్ కంపెనీలు, లాజిస్టిక్స్ సంస్థలు, స్టార్టప్లు పాల్గొనున్నట్టు తెలిపారు. -
ఆడ్కాక్ వాటాలపై నాట్కో కన్ను
దక్షిణాఫ్రికాకు చెందిన ఔషధ సంస్థ ఆడ్కాక్ ఇన్గ్రాం హోల్డింగ్స్లో మైనారిటీ షేర్హోల్డర్ల వాటాలను కొనుగోలు చేయనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. ఇందుకోసం నగదు డీల్ రూపంలో రూ. 2,100 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలిపింది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆడ్కాక్లో నాట్కోకు గతంలో ఉన్న 0.80 శాతంతో కలిపి మొత్తం 35.75 శాతం వాటా (సుమారు 5,16,43,319 షేర్లు) దక్కుతుంది. దీని విలువ 226 మిలియన్ డాలర్లు. ప్రస్తుతం ఆడ్కాక్ వేల్యుయేషన్ సుమారు 632 మి. డాలర్లుగా ఉంది.ఇదీ చదవండి: డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లుడీల్ తర్వాత కంపెనీలో బిడ్వెస్ట్ (64.25%), నాట్కో (35.75%) ప్రధాన వాటాదార్లుగా ఉంటాయి. 1890లో ఏర్పాటైన ఆడ్కాక్ ఇన్గ్రాం ప్రధానంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ తదితర 4 సెగ్మెంట్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 536 మిలియన్ డాలర్ల ఆదాయం, 33.4% స్థూల మార్జిన్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించేందుకు, కొత్త ఆదాయ మార్గాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని తెలిపారు. కంపెనీకి గల సుదీర్ఘ చరిత్ర, బ్రాండ్స్పై గల నమ్మకానికి ఈ ఒప్పందం నిదర్శనంగా నిలుస్తుందని ఆడ్కాక్ సీఈవో ఆండ్రూ హాల్ తెలిపారు. ఈ డీల్ నాలుగు నెలల్లో ముగియవచ్చని అంచనా. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ.1,410 కోట్లు
ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,410 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 1,392 కోట్లతో లాభం స్వల్పంగా పెరిగింది. మరోవైపు సమీక్షాకాలంలో ఆదాయం 11 శాతం పెరిగి రూ. 7,673 కోట్ల నుంచి రూ. 8,545 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే రెండంకెల స్థాయిలో ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. బ్రాండెడ్ ఉత్పత్తుల మార్కెట్లో పనితీరు నిలకడగా ఉండటం, నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ (ఎన్ఆర్టీ) పోర్ట్ఫోలియో పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడినట్లు వివరించారు.లెనాలిడోమైడ్ ఔషధం ధరలకు సంబంధించి అమెరికా జనరిక్స్ మార్కెట్లో ఒత్తిడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్పాదకతను మెరుగుపర్చుకుంటూ, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ, ప్రధాన వ్యాపార విభాగాలను బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తామని ప్రసాద్ చెప్పారు. స్థూలకాయాన్ని తగ్గించే ఇంజెక్షన్ సెమాగ్లూటైడ్ జనరిక్ వెర్షన్ను వచ్చే ఏడాది భారత్ సహా పలు దేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. ఇదీ చదవండి: ‘ఆర్బీఐ రేట్ల కోత మ్యాజిక్ బుల్లెట్ కాదు’మరిన్ని విశేషాలు..విభాగాలవారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ వ్యాపారం సుమారు 10 శాతం పెరిగి రూ. 6,886 కోట్ల నుంచి రూ. 7,562 కోట్లకు చేరగా, ఫార్మా సర్వీసెస్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్ఏఐ) సెగ్మెంట్ 7 శాతం వృద్ధితో రూ. 766 కోట్ల నుంచి రూ. 818 కోట్లకు పెరిగింది.గ్లోబల్ జనరిక్స్ విషయంలో, కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 11 శాతం క్షీణించి రూ. 3,846 కోట్ల నుంచి రూ. 3,412 కోట్లకు తగ్గింది. లెనాలిడొమైడ్ సహా కొన్ని కీలక ఉత్పత్తుల ధరల తగ్గుదల ఇందుకు కారణమైంది.ఎన్ఆర్టీ పోర్ట్ఫోలియో కలిపి యూరప్ మార్కెట్ రూ. 526 కోట్ల నుంచి రూ. 1,274 కోట్లకు చేరింది.అయిదు కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టడం, ధరల పెరుగుదల వంటి అంశాల దన్నుతో భారత మార్కెట్ 11 శాతం పెరిగి రూ. 1,325 కోట్ల నుంచి రూ. 1,471 కోట్లకు చేరింది. -
మింత్రాపై ఈడీ ఫెమా కేసు
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–కామర్స్ సంస్థ మింత్రాపై విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదైంది. రూ. 1,654 కోట్ల పెట్టుబడుల విషయంలో మింత్రాతో పాటు, దానితో సంబంధమున్న కంపెనీలు, డైరెక్టర్లపై తమ బెంగళూరు జోనల్ ఆఫీసు ఫిర్యాదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ పేరిట విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరించిన మింత్రా, దాని అనుబంధ కంపెనీలు మలీ్ట–బ్రాండ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయనేది ప్రధాన ఆరోపణ. కంపెనీ సింహ భాగం ఉత్పత్తులను వెక్టార్ ఈ–కామర్స్ సంస్థకు విక్రయిస్తోండగా, సదరు కంపెనీ అంతిమంగా కస్టమర్లకు రిటైల్గా విక్రయిస్తోందని ఈడీ వివరించింది. ఈ రెండు సంస్థలూ ఒకే గ్రూప్లో భాగమని తెలిపింది. మరోవైపు, చట్టాలను తాము గౌరవిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని మింత్రా ప్రతినిధి తెలిపారు. డిజిటల్ కామర్స్ ద్వారా దుస్తుల పరిశ్రమకు సాధికారత కలి్పంచడం ద్వారా దేశ నిర్మాణానికి కంపెనీ తన వంతు తోడ్పాటు అందిస్తోందన్నారు. ప్రస్తు నిబంధనల ప్రకారం మార్కెట్ప్లేస్ విధానంలో కార్యకలాపాలు సాగించే కంపెనీల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతులున్నాయి. 2007లో ఏర్పాటైన మింత్రా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ గ్రూప్లో భాగంగా ఉంది. -
తిలక్నగర్ చేతికి ఇంపీరియల్ బ్లూ
ముంబై: దేశీ లిక్కర్ కంపెనీ తిలక్నగర్ ఇండస్ట్రీస్ తాజాగా సుప్రసిద్ధ విస్కీ బ్రాండ్ ఇంపీరియల్ బ్లూను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఫ్రెంచ్ లిక్కర్ దిగ్గజం దేశీ యూనిట్ పెర్నాడ్ రికార్డ్ ఇండియాతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ ప్రకారం రూ. 4,150 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో కొనుగోలు చేయనుంది. దీనిలో రూ. 282 కోట్లు లావాదేవీ ముగిసిన నాలుగేళ్ల తదుపరి చెల్లించేందుకు వీలుంది. డీల్ వివరాలను రెండు సంస్థలూ వెల్లడించాయి. కాగా.. ఈ డీల్ ద్వారా పాప్యులర్ బ్రాందీ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ను ఉత్పత్తి చేసే తిలక్నగర్ విస్కీ విభాగంలోనూ సుప్రసిద్ధ బ్రాండ్ను సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) విభాగంలో రెండు భారీ బ్రాండ్లను విక్రయించేందుకు వీలు చిక్కనుంది. అమ్మకాల పరిమాణంరీత్యా ఇంపీరియల్ బ్లూ దేశీయంగా మూడో పెద్ద విస్కీ బ్రాండ్గా నిలుస్తోంది. గతేడాది(2024–25) రూ. 3,067 కోట్ల అమ్మకాలు సాధించింది. రెండు సొంత యూనిట్లు, బాట్లింగ్ సహతయారీ సర్వీసులు డీల్లో భాగంకానున్నాయి. షేరు పరుగు..కొనుగోలు వార్తల నేపథ్యంలో తిలక్నగర్ ఇండస్ట్రీస్ షేరు గత కొద్ది రోజులుగా బలపడుతూ వస్తోంది. తాజాగా బీఎస్ఈలో 0.7 శాతం లాభపడి రూ. 473 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 30 శాతంపైగా లాభపడటం గమనార్హం! ఈ ఏప్రిల్ 7న రూ. 205 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకిన షేరు మంగళవారానికల్లా(22న) రూ. 488 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది!! -
ఇన్ఫోసిస్.. గుడ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 9 శాతం ఎగసి రూ. 6,921 కోట్లను తాకింది. గతేడాది (2024–25) ఇదే కాలంలో రూ. 6,368 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 8 శాతం పుంజుకుని రూ. 42,279 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 39,315 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 5,189 కోట్ల నుంచి రూ. 5,173 కోట్లకు స్వల్పంగా తగ్గాయి. 1–3 శాతం వృద్ధి పూర్తి ఏడాదికి ఆదాయంలో స్థిర కరెన్సీ ప్రాతిపదికన 1–3 శాతం పురోగతి సాధించగలమని ఇన్ఫోసిస్ తాజాగా అంచనా (గైడెన్స్) వేసింది. తద్వారా గతంలో ప్రకటించిన 0–3 శాతం గైడెన్స్ను స్వల్పంగా మెరుగుపరచింది. 20–22 శాతం స్థాయిలో నిర్వహణ మార్జిన్లు సాధించగలమన్న గత అంచనాలను కొనసాగించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం వృద్ధితో రూ. 8,803 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 21.1 శాతం నుంచి 20.8 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ఫ్రీ క్యాష్ఫ్లో 18 శాతం తక్కువగా రూ. 7,533 కోట్లకు చేరింది. విభాగాలవారీగా.. ఇన్ఫోసిస్ క్యూ1 ఆదాయంలో ఫైనాన్షియల్ సరీ్వసుల వాటా 28 శాతం కాగా.. తయారీ 16 శాతం, రిటైల్ 13.4 శాతం చొప్పున ఆక్రమించాయి. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా నుంచి ఆదాయంలో దాదాపు 57 శాతం సమకూరింది. గత క్యూ1లో ఇది 59 శాతంకాగా.. యూరప్ వాటా 32 శాతంగా నమోదైంది. గత క్యూ1లో ఇది 28 శాతమే. గత కొన్ని త్రైమాసికాలుగా యూరప్లో బలమైన వృద్ధిని సాధిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్వో జయేష్ ఎస్. పేర్కొన్నారు. కొన్నేళ్ల క్రితం యూరప్లో చేపట్టిన పెట్టుబడుల ఫలితమిదని తెలియజేశారు. అయితే ఇప్పటికీ యూఎస్ అతిపెద్ద మార్కెట్గా నిలుస్తున్నట్లు వెల్లడించారు. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేరు బీఎస్ఈలో 0.3 శాతం బలపడి రూ. 1,574 వద్ద ముగిసింది.క్యూ1లో ఇతర విశేషాలు.. → 3.8 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. వీటిలో 55 శాతం కొత్తగా పొందినవే. → 210 మంది ఉద్యోగులను జత కలుపుకుంది. మొత్తం సిబ్బంది సంఖ్య 3,23,788కు చేరింది. → గతంలో ప్రకటించినట్లుగా పూర్తి ఏడాదిలో 20,000 మంది ఫ్రెషర్స్ నియామకం. → ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు దాదాపు యథాతథంగా 14.4 శాతంగా నమోదైంది. -
2 రోజుల్లో రూ.2 వేల కోట్లు.. ‘క్విక్’ కుబేరుడు!
ఎటర్నల్ (జొమాటో) వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ (Deepinder Goyal) నికర సంపద అమాంతం పెరిగిపోయింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.2,000 కోట్లు పెరిగింది. ఎటర్నల్ క్విక్ కామర్స్ విభాగమైన బ్లింకిట్ లో కనిపించిన గణనీయమైన వృద్ధిని ఇన్వెస్టర్లు స్వాగతించడంతో, ఎటర్నల్ షేర్లు రెండు రోజుల్లో 21 శాతానికి పైగా పెరిగాయి. ఎన్ఎస్ఈలో తాజా ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ .311.60 ను కూడా తాకాయి.సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అయిన 42 ఏళ్ల దీపిందర్ గోయల్ ఎటర్నల్ కంపెనీలో తనకున్న 3.83 శాతం వాటా కారణంగా కొత్తతరం కంపెనీలో తన వాటా విలువ రూ.11,515 కోట్లకు పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఈ ఐఐటీయన్ నికర సంపద 1.9 బిలియన్ డాలర్లుగా ఉంది.విప్రో, టాటా మోటార్స్, నెస్లే, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల కంటే ఎటర్నల్ షేర్లు రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటాయి. ఎటర్నల్ షేర్ల జోరు ప్రత్యర్థి స్విగ్గీపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపింది. దీంతో ఆరోజు ఆ కంపెనీ షేరు 7 శాతానికి పైగా పెరిగింది.నెట్ ఆర్డర్ వ్యాల్యూ (ఎన్ఓవీ) పరంగా బ్లింకిట్ ఇప్పుడు జొమాటో కంటే పెద్దది కావడంతో టాప్ బ్రోకరేజీ సంస్థలు ఇప్పుడు రూ.400పై దృష్టి సారించాయి. రూ.400 టార్గెట్ ధరతో ఎటర్నల్ను బైకి అప్ గ్రేడ్ చేస్తూ జెఫరీస్ అత్యంత దూకుడుగా వ్యవహరించింది. పోటీ ముప్పును అతిగా అంచనా వేసినట్లు కూడా అంగీకరించింది.దీపిందర్ గురించి..పంజాబ్లోని ముక్త్సర్లో 1983 జనవరి 26న జన్మించిన దీపిందర్ గోయల్.. ఐఐటీ ఢిల్లీ నుంచి మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్లో బీటెక్ పూర్తి చేశారు. 2008లో ఫుడీబే (Foodiebay) అనే వెబ్సైట్తో ప్రారంభమైన ఆయన వ్యాపార ప్రయాణం, తర్వాత జొమాటోగా (Zomato)గా మారింది. దీపిందర్ వ్యూహాత్మక నిర్ణయాలతో జొమాటో దేశ విదేశాల్లో విస్తరించింది. 2022లో బ్లింకిట్ (Blinkit) అనే క్విక్ కామర్స్ సంస్థను కొనుగోలు చేసి, ఆ రంగంలోనూ తన ఆధిపత్యాన్ని చూపించారు. 2025లో జొమాటో పేరును ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Limited)గా మార్చారు. -
2032 నాటికి 226 విమానాలు..
విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ భారీ విస్తరణ ప్రణాళికల్లో ఉంది. 2032 నాటికి 226 విమానాలను సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్షికంగా సర్వీసుల సామర్థ్యాన్ని 25–30 శాతం మేర పెంచుకోవాలని నిర్దేశించుకుంది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంకుర్ గోయల్ ఈ విషయాలు తెలిపారు.2022 ఆగస్టులో ప్రారంభమైన ఆకాశ ఎయిర్ దేశీయంగా 23, అంతర్జాతీయంగా 5 గమ్యస్థానాలకు ఫ్లైట్లు నడుపుతోంది. కంపెనీ దగ్గర ప్రస్తుతం 30 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో అయిదు కొత్త విమానాలు జత కానున్నాయి. త్వరలోనే వ్యయాలను మరింతగా తగ్గించుకుని, లాభాల్లోకి మళ్లగలమని అంకుర్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎయిర్లైన్ మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో 49% పెరుగుదలను నమోదు చేసింది . పరిశ్రమ వ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆకాశ ఎయిర్ ఏఎస్కే (అవెలబుల్ సీట్ కిలోమీటర్స్)కి యూనిట్ ఖర్చును (ఇంధనం మినహా) 7% తగ్గించగలిగింది. అయితే ఎబిటార్ (Ebitdar) మార్జిన్లు 50% పెరిగాయి. వడ్డీ, పన్నులు , తరుగుదల, రుణ విమోచన, అద్దె ఖర్చులు మినహాయించక ముందు ఆదాయాలను ఎబిటార్ సూచిస్తుంది. విమానయాన పరిశ్రమలో కార్యాచరణ పనితీరుకు కీలకమైన కొలమానంగా దీన్ని చూస్తారు.