breaking news
NTR
-
బెల్టు షాపు తొలగించాలంటూ రోడ్డెక్కిన మహిళలు
షేర్మహ్మద్పేట(జగ్గయ్యపేట): మద్యం బెల్ట్ షాప్ తొలగించాలంటూ మహిళలు ఆందోళన చేసిన సంఘటన షేర్మహ్మద్పేట మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామంలోని గ్రామ సచివాలయానికి ఎదురుగా గత కొంతకాలంగా బెల్టు షాప్ నడుస్తోంది. మధ్యాహ్న సమయంలో షాపు వద్ద మందుబాబులు రోడ్డుపై వెళ్తున్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో గ్రామంలోని మహిళలు ఐద్వా ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. పలువురు మహిళలు మాట్లాడుతూ మందుబాబులు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడంతోపాటు మద్యం సీసాలను సమీపంలోని ప్రభుత్వ భవనాలు వద్ద పగలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. ఇటీవల అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ వారు పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన విరమించాలంటూ చెప్పినప్పటికీ వారు షాపు తొలగించే వరకు ఆందోళన చేస్తామని చెప్పడంతో కొద్దిసేపు ఉద్ధృత వాతావరణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయానికి షాపును పూర్తిగా తొలగిస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు. కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు ఎస్. నాగమణి సీపీఎం నాయకులు కోట కష్ణ, గౌస్ మియా, కాకనబోయిన వెంకటేశ్వర్లు, జుజ్జవరపు వెంకటరావు, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
మహానేతా.. మనసాస్మరామి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత వైఎస్ రాజ శేఖరరెడ్డి సంక్షేమ పాలనకు సరికొత్త అర్థం చెప్పారు. జనరంజక పాలన అంటే ఏమిటో చేసి చూపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. తన ఐదేళ్ల పాలనతోనే జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అలాంటి మహానేత ఈ లోకాన్ని విడిచి పుష్కర కాలం గడిచినా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా జిల్లాలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఆయనను మంగళవారం మనసారా స్మరించుకున్నారు. వాడవాడలా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ మహనీయుడి సేవ లను కీర్తించారు. ఆయనకు నివాళిగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదలకు చీరలు, నిత్యావసర సరుకులు, రోగులకు పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.●డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న వైఎస్సార్ కాంస్య విగ్రహానికి వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు ఆయన చేసిన సేవలను కొనియా డారు. మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస రావు, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పూనూరు గౌతంరెడ్డి, అంజిరెడ్డి, పోతిన మహేష్, ఆసిఫ్, రవిచంద్ర, వేములకొండ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.● విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, వైఎస్సార్ సీపీ నాయకులు నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో నియోజకవర్గ ఇన్చార్జ్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, డివిజన్ కార్పొరేటర్లు, ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు.● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జ్ల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి.్ల మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జన హిత సదనం, మల్లాది విష్ణు కార్యాలయంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల మందికి అన్నదానం చేశారు.● మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీం పట్నం, కొండపల్లి పరిధిలో ఏడు చోట్ల, కేతనకొండ, దొనబండ, దాములూరు, జూపూడి, మూలపాడు, విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జి.కొండూరు, మైలవరం మండలాల్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నియోజ కవర్గ ఇన్చార్జ్ జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శులు అప్పిడి కిరణ్కుమార్ రెడ్డి, వేములకొండ తిరుపతిరావు, సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు.● నందిగామ నియోజకవర్గంలో వాడవాడలా మహానేత డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. నందిగామ, కంచికచర్ల, గొట్టిముక్కల, అల్లూరు, పెద్దాపురం, చందర్లపాడు గ్రామాల్లో నిర్వహించిన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణకుమార్, పార్టీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.● తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరులో వైఎస్సార్ సీపీ కార్యాలయం, సీఐ కార్యాలయం సెంటరు, రాజుపేట బైపాస్రోడ్డు, బోయ కాలనీల్లో నిర్వహించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ట స్వామిదాసుతో పాటు సూర్యనారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, నవీన్తో పాటు పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.● జగ్గయ్యపేటలోని విలియంపేట, కన్యాకుమార్ పాన్షాపు సెంటర్, క్రిస్టియన్పేట, కోదాడ రోడ్డు యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్, బస్టాండ్, విజయవాడ బైపాస్ రోడ్డు సెంటర్, దనంబోడు, తొర్రకుంటపాలెం, బొడ్రాయి సెంటర్లలో నిర్వహించిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజ గోపాల్(చిన్నా) పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు మండల పరిధిలోని శనగపాడు గ్రామం, వెంగనాయకునిపాలెం, వెంకటాపురం, పొన్నవరం గ్రామాల్లో బైకు ర్యాలీలు నిర్వహించారు. కొల్లికొళ్లలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్తో కలిసి తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. -
గజానికో గండం.. ఈ రోడ్డుకో దండం
కంకిపాడు: ‘సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లను చూస్తారు’ ఇదీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతో ఆర్భాటంగా చేసిన ప్రకటన. సంక్రాంతి దాటి కూడా నెలలు గడిచిపోతున్నాయి. మళ్లీ కొద్ది నెలల్లోనే సంక్రాంతి రాబోతోంది. కానీ రోడ్ల పరిస్థితి ఏమీ మారలేదు. ప్రాధాన్యం గల రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్న కూటమి ప్రభుత్వ మాటలు నీటి మూటలయ్యాయి. ప్రభుత్వ తీరుతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల రహదారి కష్టాలకు మద్దూరు–గోసాల రోడ్డు మార్గమే నిలువెత్తు నిదర్శనం. ప్రయాణం.. నరకప్రాయం.. విజయవాడ–దివిసీమ కరకట్ట రహదారి నుంచి విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిని కలుపుతూ ఉన్న ప్రధాన రహదారి మార్గం మద్దూరు– గోసాల రోడ్డు. ఆర్అండ్బీ శాఖ పరిధిలోని ఈ రోడ్డు మార్గంలో ప్రయాణం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోడ్డు పూర్తిగా అడుగడుగునా గోతులతో అధ్వానంగా మారింది. రోడ్డు మార్జిన్లు కోతకు గురై ప్రమాదకరంగా తయారయ్యాయి. మద్దూరు, వణుకూరు, గోసాల గ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో పాటుగా కరకట్ట మీదుగా విజయవాడ, దివిసీమ ప్రాంతాలకు వెళ్లాలన్నా, ఏలూరు రోడ్డు సమీపంలో గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లాలన్నా మద్దూరు–ఈడుపుగల్లు మీదుగా ఉప్పలూరు రోడ్డు మార్గాన్ని వినియోగిస్తుంటారు. నిత్యం అధిక సంఖ్య లో వాహనాలు రాకపోకలకు సాగుతుంటాయి. అభివృద్ధి ఊసే లేదు.. దశాబ్దకాలం పైగా రోడ్డు అభివృద్ధికి నోచుకోలేదు. మద్దూరు, రొయ్యూరు ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్ల నుంచి భారీ లోడుతో ఇసుక లారీలు ఈ మార్గం గుండానే ఇసుకను రవాణా సాగించాయి. దీంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతుల మయంగా తయారైంది. చిన్న పాటి వర్షానికే గోతుల్లో నీరు చేరి ప్రయాణం అస్తవ్యస్తంగా మారుతోంది. అంతేకాకుండా వాహనాలు అదుపుతుప్పి ప్రమాదాల బారిన పడటం, తరచూ వాహనాలు మరమ్మతులకు గురవుతుండటం ఇక్కడ సర్వసాధారణమైంది. ఇంకెన్నాళ్లీ ‘దారి’ద్య్రం.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గోసాల నుంచి మద్దూరు వైపు రోడ్డు దుస్థితి ఇది శంకుస్థాపన చేస్తే.. పనులు రద్దు చేశారు..గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగా ఎన్నికల ముందు మద్దూరు–గోసాల–ఉప్పలూరు రోడ్డు అభివృద్ధికి రూ. 19.50 కోట్లు నిధులు కేటాయించింది. సింగిల్ లైన్గా ఉన్న రోడ్డును ప్రజల అవసరాల రీత్యా డబుల్ లైన్గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అప్పటి మంత్రి జోగి రమేష్ చేతుల మీదుగా ఈడుపుగల్లు సెంటరులో శంకుస్థాపన కూడా చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పనులు ప్రారంభానికి నోచలేదు. తదుపరి రాజకీయ పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల ఇబ్బందులను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోని కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధి పనులను రద్దు చేసింది. కొత్తగా మద్దూరు–గోసాల రోడ్డు అభివృద్ధికి రూ 6.50 కోట్లతో అంచనాలను నివేదించి సరిపెట్టేసింది. గోతులమయంగా మద్దూరు–గోసాల రహదారి -
పరుగులు పెట్టి.. పడిగాపులు
యూరియా కోసం అన్నదాతల ఆక్రందననాగాయలంక: మండలంలో రైతాంగానికి మంగళవారం యూరియా అందిస్తామని వ్యవసాయశాఖ సమాచారం అందించడంతో రైతులు పెద్ద సంఖ్య లో రైతు సేవా కేంద్రాలకు పరుగులు పెట్టి.. పడిగాపులు కాశారు. నాగాయలంకలోని బస్స్టేషన్ సమీపంలోని సేవా కేంద్రంలో ఉదయం 8గంటలకు రైతులకు యూరియా అందిస్తామని మెసేజ్లు పెట్టడంతో తెల్లవారుజాము నుంచే నాగాయలంక, మర్రిపాలెం, రేమాలవారిపాలెం రైతులు ఈ కేంద్రానికి తరలివచ్చారు. అయితే 10గంటలు దాటే వరకూ సంబంధిత అధికారులు రాకపోవడంతో రైతులు సంఖ్య భారీగా పెరిగింది. పరిస్థితితో ఆందోళన చెందిన నాగాయలంక ఎస్ఐ కె.రాజేష్ సేవా కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. అందరూ క్యూలో నిలబడి అధికారులకు సహకరించాలని నచ్చజెప్పారు. 40 టన్నులే స్టాక్.. ఇదే పరిస్థితి మండలంలోని భావదేవరపల్లి, సంగమేశ్వరం, పర్రచివర సేవాకేంద్రాల్లో నెలకొంది. వాస్తవానికి ఈ నాలుగు కేంద్రాలకు కలిపి 40టన్నులు స్టాక్ మాత్రమే అందించినట్లు ఏఓ ఎ.సంజీవకుమార్ చెప్పారు. మరో ఎనిమిది కేంద్రాలకు 80టన్నుల మేరకు ఇండెంట్ పెట్టామని రెండు రోజుల్లో వస్తుందని వివరించారు. 3ఎకరాల లోపు రైతు ఒక బస్తా, ఆపై ఉన్న రైతులకు రెండు బస్తాలు ఇస్తామని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రైతులు రావాలని, ఏ గ్రామాల పరిధిలో స్టాక్ వచ్చిందో ఆ పరిధిలో పొలం ఉన్న రైతులు మాత్రమే యూరియా తీసుకోవాలని ఏఓ సూచించారు. కాగా సంగమేశ్వరం రైతు సేవా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకుడిగా పనిచేస్తున్న వెంకన్నస్వామి నిత్యం మద్యం మత్తులో జోగుతూ రైతులతో గొడవ పడతున్నాడు. ఆ వీడియోలు గ్రామస్తులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం జేడీ దృష్టిలో పెట్టామని ఏఓ సంజీవ్ కుమార్ చెప్పారు. -
ఆకాంక్షిత మండలాలకు నీతి ఆయోగ్ పట్టం
అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ భవానీపురం(విజయవాడపశ్చిమ): కేంద్రం ప్రకటించిన ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలాలు.. ఆదర్శ మండలాలుగా నిలవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ సమ్మాన్ సమరోహ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ రెండు మండలాలకు నీతి అయోగ్ బంగారు పతకాలను ప్రకటించగా ఈ ప్రగతిలో భాగస్వాములైన అధికారులు, సిబ్బందికి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను ప్రత్యేకంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. బంగారు పతకాలు రావడం అభినందనీయం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ జిల్లాలోని రెండు మండలాలకు నీతి ఆయోగ్ బంగారు పతకాలు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, డీఆర్డీఎ అధికారుల కృషి కారణంగా ఈ విజయం సాధించామని తెలిపారు. సత్కారం పొందిన అధికారులు ఇవే.. సీపీఓ వై. శ్రీలత, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా, జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు ఉన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు ఎంపీడీఓలు, ఏబీపీ కో ఆర్డినేటర్లు జి. మోహన్ సందీప్, పి. శ్రీనివాస్, వివిధ మండల స్థాయి అధికారులు, వైద్య ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి ఫ్రంట్లైన్ వర్కర్లు సత్కారం అందుకున్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రోడ్డుదాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై భవానీపురం బ్యాంక్ సెంటర్ సమీపంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. ఆ సమయంలో స్వాతి సెంటర్ వైపు నుంచి వస్తున్న లారీ ఆ వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతని చేయి నుజ్జునుజ్జు అయింది. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు 40ఏళ్లు ఉంటుంది. అతని పూర్తి వివరాలు తెలియలేదు. దీనిపై సచివాలయ మహిళా పోలీసు వెంపటి శ్రీవల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర రాజధాని అమరావతి పేరు, ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై మంగళవారం సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్, కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక సంప్రదాయాల వారసత్వ సంపదను భావితరా లకు అందించేందుకు వీలుంటుందన్నారు. నగ రంలో తొలిసారిగా భారీఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విధాలా అంచనాలను సిద్ధం చేసుకొని, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలతో పాటు భక్తులకు ఈ ఆధ్యాత్మిక పర్యటన మధురానుభూతులు మిగిల్చేలా పర్యాటకానికి కూడా ఊపు తెచ్చేలా ఉత్సవ్ ఉంటుందన్నారు. ఉత్సవాల విజయవంతానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, గొల్ల పూడి ఎగ్జిబిషన్ వేదిక తదితరాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. హోల్డింగ్ ప్రాంతాల ఏర్పాటు, పటిష్ట భద్రత, నగర సుందరీకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా, ఫుడ్ కోర్టుల ఏర్పాటు, హెలీ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, సంప్రదాయ కళా ప్రదర్శనలు తదితరాలపై సమావేశంలో చర్చించి చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈఓ శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ -
జనసేన కార్యకర్తల అతి
ఇబ్రహీంపట్నం: ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వైఎస్సార్ సీపీ, జనసేన కార్యకర్తల నడుమ మంగళవారం వివాదం చోటుచేసుకుంది. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ మంత్రి జోగి రమేష్ కార్యకర్తలతో వైఎస్సార్ చిత్రపటం(ఫ్లెక్సీ)కు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ఆయన వేరే కార్యక్రమానికి బయలుదేరిన మరుక్షణం వైఎస్సార్ బ్యానర్పై పవన్కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన జనసేక కార్యకర్తలను కొందరు వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఫణీంద్ర సిబ్బందితో చేరుకున్నారు. దగ్గరుండి వైఎస్సార్ బ్యానర్పై పవన్కల్యాణ్ బ్యానర్ ఏర్పాటు చేయించి జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందించారు. కూటమి నేతలు, పోలీసుల తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. పవన్ కార్యక్రమం ముందు జరిగి ఉంటే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని పోలీసులు చెప్పేవారని చర్చించుకున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి పోలీసులు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. -
యూరియా కోసం బారులు
ఉంగుటూరు(గన్నవరం): మండల కేంద్రమైన ఉంగుటూరులోని మన గ్రోమోర్ సెంటర్ వద్ద మంగళవారం యూరియా కోసం వందలాది మంది రైతులు బారులు తీరారు. యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాలకు చెందిన రైతులు భారీగా ఆ సెంటర్కు తరలివచ్చారు. అన్నదాతల రద్దీని దృష్టిని పెట్టు కుని తోపులాట జరగకుండా పోలీసులు బందో బస్తు నిర్వహించారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో రావడం గమనార్హం. అయితే గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ యూరియా దొరక్కపోవడంతో కొంత మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఒక్కొక్క రైతుకు రెండు యూరియా బస్తాలు అందించినట్లు మండల వ్యవసా యాధికారి జి. రమేష్ తెలిపారు. తహసీల్దార్ విమలకుమారి, ఎస్ఐ యూ. గోవిందు పర్యవేక్షించారు. మొత్తం రెండు మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వివరించారు. విజిలెన్స్ డీఎస్పీ పరిశీలన.. ఉంగుటూరులో యూరియా కోసం రైతులు భారీగా తరలిరావడంతో విజిలెన్స్ డీఎస్పీ బంగా ర్రాజు నేతృత్వంలో బృందం అక్కడికి చేరుకుని పంపిణీ వ్యవస్ధను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీని కలిసిన కౌలు రైతు సంఘం నాయకులు టీవీ లక్ష్మణస్వామి, అజ్మీరా వెంకటేశ్వరరావు తదితరులు రైతుల యూరియా ఇబ్బందులను వివరించారురు. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. -
ఏపీకి అలర్ట్.. ఆ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆ తదుపరి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40-60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు.దీని ప్రభావంతో రేపు(బుధవారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాళిలో 88.7మిమీ, వజ్రపుకొత్తూరులో 80.7మిమీ, పలాసలో 70.5మిమీ, రావివలసలో 56.5 మిమీ, మదనపురంలో 53.5 మిమీ, హరిపురంలో 53 మిమీ చొప్పున వర్షపాతం రికార్డైందని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 41.3 అడుగులు ఉందన్నారు.ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.72 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించినట్లు తెలిపారు. కృష్ణానది ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 5 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,52,772 క్యూసెక్కులు ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. -
వైఎస్సార్ వర్థంతి: నందిగామలో పోలీసుల ఓవరాక్షన్
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్ వర్థంతి కార్యక్రమంలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేస్తే దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్మిషన్ లేదంటూ పోలీసులు అతి చేశారు. అన్నదాన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టేబుల్స్, వాటర్ క్యాన్లను పోలీసులు లాక్కెళ్లిపోయారు. అదే సమయంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మండిపడ్డారు. ‘వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా అన్నదానం ఏర్పాటు చేశాం. అన్నదానం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దారుణం. నందిగామ సీఐ టిడిపి కార్యకర్తలాగ వ్యవహరిస్తున్నాడు. వైఎస్సార్ వర్ధంతికి పేదలకు అన్నదానం చేస్తే తప్పా. గతంలో టీడీపీ నేతల వర్ధంతి, జయంతులకు మేం ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అన్నా క్యాంటీన్ను కూడా గాంధీసెంటర్ లోనే ఏర్పాటు చేశారు..మేం అడ్డు చెప్పలేదుటిడిపి నేతలు పిచ్చెక్కి కల్లుతాగిన కోతిలా వ్యవహరిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. -
‘చెరగని చిరునవ్వుతో పాలన అందించిన గొప్ప పాలకులు వైఎస్సార్’
విజయవాడ: చెరగని చిరునవ్వుతో పాలన అందించిన గొప్ప పాలకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ కొనియాడారు. ఈరోజు(మంగళవారం, సెప్టెంబర్ 2వ తేదీ) వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఆయన పాలనను గుర్తుచేసుకున్నారు పోతిన మహేష్. ‘ ప్రతీ కుటంబం వైఎస్సార్ వల్ల లబ్ధి పొందారు. పేద , సామాన్య వర్గాల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ , ఆరోగ్యశ్రీ తెచ్చారు. రైతులకు కోసం ఉచిత కరెంట్ ఇచ్చారు. పోలవరంతో పాటు ఎన్నో బహుళార్ధక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కొందరు వైఎస్సార్కు మేమే పోటీ అంటున్నారు. వైఎస్సార్ గురించి మాట్లాడే వారు ఎందులో ఆయనకు పోటీనో సమాధానం చెప్పాలి. వైఎస్సార్ ఆశయాలను వైఎస్ .జగన్ పుణికిపుచ్చుకున్నారు. అమ్మ ఒడి తెచ్చింది వైఎస్ జగన్. పోర్టులు తెచ్చినా ...మెడికల్ కాలేజీలు కట్టినా అది వైఎస్ జగన్కే సాధ్యమైంది. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మహిళల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి’ అని డిమాండ్ చేశారు. -
పింఛన్లతో సామాజిక భద్రతకు భరోసా
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చిల్లకల్లు(జగ్గయ్యపేట): ఎన్టీఆర్ పింఛన్లతో పేదల సామాజిక భద్రతకు భరోసా లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గ్రామంలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛన్దారులకు ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో 2,30,277 పింఛన్లకు గాను దాదాపు రూ. 99.55 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సిబ్బందితో ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా ప్రతినెలా పింఛన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పంపిణీలో పాల్గొంటున్నట్లు తెలిపారు. గ్రామంలోని మూడు కుటుంబాల లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, డీఆర్డీఏ పీడీ నాంచారరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఎంపీడీవో నితిన్, ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు
ఎస్పీ గంగాధరరావు కోనేరుసెంటర్: ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు అందుకున్నారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరి కొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు అప్పగించి బాఽధితులకు వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు పోలీసుశాఖ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోలీసు వ్యవస్థ ప్రత్యక్షమవుతుందన్నారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా మీకోసంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కారం చూపిస్తానని చెప్పారు. అలాగే మీకోసం ద్వారా న్యాయం జరగని బాధితులు ఎవరైనా ఉంటే తనను మరలా కలిసి జరిగిన విషయాన్ని వివరించి న్యాయం కోరవచ్చునన్నారు. మీ కోసంలో 39 అర్జీలు అందినట్లు పేర్కొన్నారు. -
మది మదిలో రాజర్షి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ ఆయన చేసిన సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని జిల్లాకు ఆయన చేసిన అభివృద్ధిని జిల్లా వాసులు మరోసారి మననం చేసుకుంటున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆ పేరే ప్రత్యేకం.. వైఎస్సార్.. ఈ పేరు వింటేనే ఏదో ఆత్మీయత, కొండంత భరోసా, అభివృద్ధికి చిరునామాగా ప్రజలు తలుస్తారు. జలయజ్ఞంతో రైతుల పాలిట అపర భగీరథుడిగా.. ఆరోగ్యశ్రీతో పేదల గుండెల్లో ఊపిరిగా.. అభివృద్ధిని చేతల్లో చేసి చూపించిన సిసలైన నాయకుడిగా నిలిచిపోయారు. అందుకే ఆ మహానీయుడు భౌతికంగా దూరమై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ అందరి మదిలో కొలువై ఉన్నారు. ‘నమస్తే అక్కయ్య.. నమస్తే చెల్లెమ్మ.. నమస్తే తమ్ముడూ’ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ పిలుపు అందరి చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. -
బుడమేరు ముంపు నివారణలో కూటమి వైఫల్యం
బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ధర్నా గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద ముంపు నివారణ చర్యల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ అర్బన్ సిటిజన్స్ ఫెడరేషన్ కన్వీనర్ సీహెచ్ బాబూరావు ధ్వజమెత్తారు. బుడమేరు వరదల సందర్భంలో హడావిడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత శాశ్వత నివారణ చర్యలను విస్మరించిందన్నారు. బుడమేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతూ బుడమేరు ముంపు బాధితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. బుడమేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, బాధితులందరికీ సహాయం అందించాలని నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 2047 నాటికి ప్రణాళికలు రచిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, తక్షణ సమస్యగా ఉన్న బుడమేరు వరదను శాశ్వతంగా నివారించడానికి మాత్రం ప్రణాళికలు రచించడం లేదన్నారు. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో బనకచర్ల ప్రాజెక్టును నిర్మించటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. బుడమేరు వరద శాశ్వత నివారణకు ఎందుకు చర్యలు చేపట్టటంలేదని ప్రశ్నించారు, ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోని పక్షంలో ప్రజలు ఆందోళన చేయటానికి సిధ్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం ముంపు ప్రాంతాలకు చెందిన వివిధ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ లక్ష్మీశను కలిసి వినతి మెమోరాండం అందజేశారు. మిత్రా కమిటీ సిఫార్సుల ప్రకారం వెలగలేరు రెగ్యులేటర్ కు ఎగువన రిజర్వాయర్లు నిర్మించాలని, బుడమేరు డ్రైవర్షన్ ఛానల్ వెడల్పు పెంచి కనీసం 35,000 క్యుసెక్కులకు పెంచాలని, విజయవాడ నగరానికి ముంపు లేకుండా మరొక అదనపు కాలువ నిర్మించి వరద నీరు ఎప్పటికప్పుడు పోయేవిధంగా ఏర్పాటు చేయాలని, బుడమేరు లోతు, వెడల్పు పెంచి రెండు వైపుల రిటైనింగ్ వాల్ నిర్మించాలని, బుడమేరు పూడికల తీయించి రివెటింగ్ చేయించాలని కలెక్టర్కు ఇచ్చిన మెమోరాండంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జె. మంగపతి, యు. వి. కృష్ణయ్య, కార్పొరేటర్ సత్తిబాబు, ఎస్.కే. సలీమ్, పిల్లి మహేష్, వాసు, మాచర్ల లింగరాజు, కే.సరోజ, షకీల, పౌర సంక్షేమసంఘం నాయకులు బి.రమణారావు, పులి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నందిగామ టౌన్: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పీ4 కార్యక్రమం యజ్ఞంలా అమలవుతోందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన బంగారు కుటుంబం లబ్ధిదారు కోట వెంకటరత్నం కుటుంబానికి కేసీపీ లిమిటెడ్ ప్రతినిధులతో కలిసి సోమవారం ఆయన స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆటోను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపు లక్ష బంగారు కుటుంబాలుండగా 6,400 మంది మార్గదర్శులు ముందుకు వచ్చారన్నారు. బంగారు కుటుంబాల అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో చేయూతనందిస్తున్నారని అవసరమైన వారికి వైద్య, విద్య, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి మార్గాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆటో ఖర్చులో 60 శాతం మొత్తాన్ని కేసీపీ అందించగా మిగిలిన 40 శాతంను బ్యాంకు రుణంగా అందించామని చెప్పారు. ఆర్డీవో బాలకృష్ణ, కేసీపీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మధుసూదనరావు పాల్గొన్నారు. పాడి పరిశ్రమలో భాగస్వాములు కావాలి చిల్లకల్లు(జగ్గయ్యపేట): రైతులు పాడి పరిశ్రమలో భాగస్వాములై విస్తరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చిల్లకల్లు పాల శీతలీకరణ కేంద్రంలో కృష్ణామిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో పెయ్య దూడలు పెట్టే వీర్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ4 కార్యక్రమాన్ని స్ఫూర్తిగా కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులను ఆదుకునేందుకు అంకిత భావంతో పని చేయటం హర్షణీయమన్నారు. పాడి పరిశ్రమకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర నాయుడు మాట్లాడుతూ రైతుకు పాడి గేదె ఉంటే ఆదాయ వనరుగా మారుతుందన్నారు. గ్రామాలలో పచ్చిగడ్డి అందుబాటులో ఉండేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ వీర్యం డోసు కేవలం రూ. 50లకే అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ హనుమంతరావు, శ్రీనివాసరావు, విజయ డెయిరీ చైర్మన్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
సరోగసీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికతతో సరోగసి(అద్దె గర్భం) ద్వారా బిడ్డలను పొందడానికి చట్టపరంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. దంపతులకు సంతానం లేనప్పుడు, వారి బిడ్డను మరొక మహిళ తన గర్భంలో పెంచి , తర్వాత వారికి అప్పగించే విధానాన్ని సరోగసి, దత్తత గర్భధారణ అని కూడా అంటారని తెలిపారు. సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021 ప్రకారం వాణిజ్య పరమైన సరోగసీ నిషేధించినట్లు తెలిపారు. కేవలం పరోపకార సరోగసి మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. సరోగసీ ద్వారా బిడ్డలు పొందాలనుకునే దంపతులు తప్పనిసరిగా భారతీయులైన ఉండాలని, విదేశీయులు, సింగిల్ పురుషులు ఈ సరోగసీకి అర్హులు కాదన్నారు. సరోగేట్ మదర్ 21–35 ఏళ్లు మధ్య వయస్సుతో పాటు, కనీసం ఒక బిడ్డను కలిగి ఉండాలని తెలిపారు. తన జీవితంలో రెండు సార్లు మాత్రమే సరోగేట్ తల్లిగా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వాణిజ్య లాభం కోసం చేస్తే జైలుశిక్ష, జరిమానా విధించడం జరుగుతుందని, అద్దె గర్భం పొందేందుకు ముందు సరోగేట్ మదర్ నుంచి రాత పూర్వక అంగీకారం తీసుకోవాలని సూచించారు. ఈ పక్రియలో లైంగిక ఎంపిక నిషేధమని, అద్దె గర్భం ఇచ్చు తల్లి పిల్లలు ఆరోగ్య పరిరక్షణకు నియమ నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. -
నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యల పరిష్కారంలో ఉదాసీనతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై సస్పెన్షన్ వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. ఎండార్స్మెంట్ ఇచ్చేసి చేతులు దులుపుకొంటే సహించేది లేదని.. తప్పనిసరిగా సమస్యకు సరైన విధంగా పరిష్కారం చూపాల్సిందేనని స్పష్టం చేశారు. కొత్త విధానంలో.. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో కలెక్టర్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటివరకు కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్కు అర్జీదారుడు వారి సమస్యపై నేరుగా వేదిక వద్ద ఉన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలను కలిసి అర్జీలను సమర్పించి విన్నవించుకునేవారు. అర్జీదారుని సమస్యను విని పరిష్కారం కోసం సంబంధిత జిల్లా అధికారులను పిలిచి అర్జీలను అప్పగించేవారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ ఇందుకు భిన్నంగా కొనసాగింది. అర్జీదారుడు వారి అర్జీలను నమోదు చేసుకొని ముందుగా సమస్యకు సంబంధించిన జిల్లా అధికారిని కలిసే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. సమస్యకు గల కారణాలు అధికారి తెలుసుకొని, గతంలో కింది స్థాయి అధికారులు అలసత్వం లేదా ఇబ్బందులకు గురి చేయడం వంటివి ఏవైనా జరిగితే వాటిని నమోదు చేస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యల నిమిత్తం అర్జీదారును కలెక్టర్ వద్దకు పంపుతారు. సమస్య పరిష్కారంలో కింది స్థాయిలో జరుగుతున్న జాప్యాన్ని, అలసత్వం, అర్జీదారుడు పడుతున్న ఇబ్బందులు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సాధ్యమైనంత వరకు జిల్లా అధికారుల స్థాయిలోనే పరిష్కారం చూపాలన్నారు. ఈ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అర్జీలో నమోదు చేసి, తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 92 అర్జీలు అందాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె.పోసిబాబు, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 83 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 83 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 83 ఫిర్యాదులు రాగా, వాటిలో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 35, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 4, కొట్లాటలపై 2, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలపై 20, దొంగతనాలకు సంబంధించి 3, ఇతర చిన్న వివాదాలపై 15 ఫిర్యాదులు అందాయి. కాగా ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత ఎస్హెచ్ఓలకు పంపి, సత్వరమే చర్యలు తీసుకోవాలని డీసీపీ ఉదయరాణి ఆదేశించారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల వద్దకే వెళ్లి అర్జీ స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు చర్యలు కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): తీరప్రాంతాల్లో మత్స్యరంగంలో జీవనోపాధుల మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గ్రీన్ క్లైమెట్ ఫండ్స్ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పీతల సాగు, సముద్రనాచు సాగు, అలంకార చేపల పెంపకం, మైరెన్ ఫిష్ కేజ్ కల్చర్, మడ అడవుల పెంపకం, సంరక్షణకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఆయన అధికారులతో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో తీరప్రాంతం కలిగిన జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధి, జీవనోపాధులకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను వంటి తీరప్రాంత మండలాలు పీతల సాగుకు అవసరమైన ప్రాంతమని అందుకు అవసరమైన పీతలసీడ్ను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆదేశించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆసుపత్రిలోకి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన గొల్లపూడిలో చోటుచేసుకుంది. రాయనపాడుకు చెందిన మందా రాకేష్ రాడ్ బెండింగ్ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. ఆయనకు గొల్లపూడికి చెందిన లతతో వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగస్టు 29వ తేదీ సాయంత్రం వెస్ట్ బైపాస్ ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. అక్కడ నుంచి గొల్లపూడిలోని అత్తారింటికి వచ్చి తాను పురుగు మందు తాగిన విషయం తెలిపాడు. వెంటనే భవానీపురంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
కోరలు విప్పిన కాల్మనీ!
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలో కాల్మనీ వ్యాపారులు మళ్లీ కోరలు విప్పుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో విచ్చలవిడిగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వనివారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు. అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇదే విధంగా తండ్రీ కుమారులపై కాల్మనీ వ్యాపారి దాడులకు తెగబడ్డ ఘటన వెలుగులోకి వచ్చింది. 57వ డివిజన్ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన బలసాని స్వామిదాస్ రియల్ ఎస్టేట్లో మధ్యవర్తిత్వం చేస్తుంటాడు, కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు. కరోనా వైరస్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో చింతా చందు అనే కాల్మనీ వ్యాపారి తల్లి వద్ద రూ.85 వేలు అప్పుగా తీసుకొని ఆమెకు నెల నెలా వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నాడు. ఆమె రెండేళ్ల క్రితం కాలం చేయడంతో ఆ సమయంలో కూడా అసలులో రూ.20 వేలు ఇచ్చారు. ఆ తరువాత ఆమె కొడుకు చందు తన తల్లికి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగాడు. మరో రూ.40 వేలు మాత్రమే ఇవ్వాలని స్వామిదాస్ చెప్పగా అవన్నీ తన వద్ద కుదరదని, తమది కాల్ మనీ అని, లక్ష రూపాయలు కట్టాల్సిందేనని గొడవపడి భయపెట్టాడు. దీంతో చేసేది లేక లక్ష కడతామని ఒప్పుకున్నారు. గతేడాది బుడమేరు వరదల్లో అంతా నష్టపోయామని చెప్పినా కూడా వినకుండా మొత్తం రూ.3 లక్షలకు పైగా అసలు, వడ్డీల చొప్పున డబ్బులు కట్టించుకున్నారు. చికిత్స చేయించు కుంటున్న స్వామిదాస్ తలకు కుట్లు పడిన లాజర్ రూ.15 వేల కోసం తలపగలకొట్టిన వైనం... దఫదఫాలుగా అప్పు తీర్చుకుంటూ వస్తున్న స్వామి దాసు ఇంకా రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన ఆ డబ్బులు ఇచ్చేస్తానని చెప్పారు. దానికి సరే అని చెప్పిన చందు ఆగస్టు 31వ తేదీన స్వామిదాస్కు ఫోను చేసి అసభ్యకరంగా తిడుతూ ఈ రోజే నాడబ్బులు ఇచ్చేయాలి లేకపోతే నిన్ను చంపేస్తా అంటూ కులం పేరుతో బూతులు తిట్టాడు. స్వామిదాసు వారి ఇంటి ముందు వేసిన వినాయకచవితి పందిరి వద్ద ఆదివారం రాత్రి కూర్చొని ఉండగా చందు ఒక్కసారిగా స్వామిదాసుపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న స్వామిదాసు కుమారుడు తన తండ్రిని కొట్టవద్దంటూ అడ్డురాగా రాయితో అతని తల పగలకొట్టాడు. ఈ ఘటనలో స్వామిదాసు ముఖంపై, చేతికి, ఒంటిపై గాయాలుకాగా అతని కుమారుడు లాజర్ తలపగిలి కుట్లుపడ్డాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించగా చింతా చందు అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. కాల్మనీ వ్యాపారులకు అండగా టీడీపీ నాయకులు రంగంలోకి దిగి కేసు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. వినాయక చవితి బందోబస్తు నేపథ్యంలో దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పుకొచ్చారు. -
రాజీనామా బాటలో రేషన్ డీలర్లు!
పెడన: కొందరు రేషన్ డీలర్లు రాజీనామాల బాటలో పయనిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వెట్టిచాకిరీ తాము చేయలేమని తేల్చి చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రశాంతంగా ఉన్న తాము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే కమీషన్ అతి తక్కువగా ఉంటుందని... తమతో చేయించే పని ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. కమీషన్ పెంచాలని ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం ఉండటం లేదని అంటున్నారు. ఎప్పటికి పెంచుతారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న పని చేయడం కష్టమని, తప్పుకోవడమే మేలని వెల్లడిస్తున్నారు. పెడన పట్టణంలో జూన్ నెలలో ఎంతో ఆర్భాటంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించిన షాపు నెంబరు ఏడు డీలరు ఐవీ పద్మావతి రాజీనామా చేశారు. ఈ షాపును విజేత డ్వాక్రా గ్రూపునకు అప్పగించారు. గ్రూపు లీడరు పి.కృష్ణప్రియ బాధ్యతలు చేపట్టారు. మండల పరిధిలోని దావోజిపాలెం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ కె.నాగమల్లేశ్వరరావు కూడా రాజీనామా అందజేశారు. అయితే ఈయన రాజీనామాను అధికారులు ఇంకా ఆమోదించలేదు. పట్టణంలోని మరో మహిళా డీలరు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో హాయిగా... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే హాయిగా ఉన్నామని, ఇప్పుడు ఈ చాకిరీ చేయలేకపోతున్నామనే విషయాన్ని డీలర్లు పేర్కొంటున్నారు. గతంలో క్వింటాకు రూ.100 చొప్పున ఒక డీలరుకు సుమారు రూ.7వేలు నుంచి రూ.12 వేలు వరకు కమీషన్ వచ్చేది. ప్రస్తుతం వికలాంగులకు, 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధుల ఇళ్లకు తీసుకువెళ్లి రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రేషన్ డీలర్లు ఒక హెల్పెర్ను పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ హెల్పెర్కు రూ.5వేలు నుంచి రూ.6వేలు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇంటింటికి రేషన్ తీసుకువెళ్లి ఇవ్వడానికి ఒక్కొ డీలరుకు 25 నుంచి 150 ఇళ్లకు వెళ్లి ఇంటింటికి రేషన్ అందించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనంపై ఆయా ఇళ్లకు తిరగడానికి పెట్రోల్ ఖర్చులు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు వెచ్చిస్తున్నారు. అదనంగా చాకిరీ చేయాల్సి రావడంతో ఇంత కష్టం ఎందుకు..రాజీనామాయే బెటర్ అంటున్నారు. -
పీ–4 కార్యక్రమాన్ని వేగవంతం చేయండి
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పీ–4 కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తో కలిసి పీ–4 కార్యక్రమం పురోగతిపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 78,670 కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామని చెప్పారు. ఇందులో అత్యధికంగా పెడన నియోజకవర్గంలో 12,661, అత్యల్పంగా పెనమలూరు నియోజకవర్గంలో 8,813 కుటుంబాలు గుర్తించామని పేర్కొన్నారు. వీటిలో 47,876 బంగారు కుటుంబాలను 4,286 మార్గదర్శిలకు అనుసంధానం చేసి దత్తత ఇచ్చామని వెల్లడించారు. జిల్లాకు చెందిన ధనికులు, ప్రముఖులు దాతృత్వం, మానవత్వం కలిగిన వ్యక్తులు స్థానికంగా గానీ ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న వారి వివరాలను సేకరించి పీ–4 కార్యక్రమం గురించి వారికి అవగాహన కల్పించి స్వచ్ఛందంగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చేలా చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, మెప్మా పీడీ పి. సాయిబాబు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మురళీకిషోర్, మార్కెటింగ్ ఏడీ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు. -
నేరస్తుల వైపే చంద్రబాబు, పవన్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గత టీడీపీ ప్రభుత్వంలోనే గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై లైంగికదాడి, హత్య జరిగాయని.. ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేరస్తుల వైపు ఉన్నారని, 2017 నుంచి 2019 వరకు కేసును తాత్సారం చేశారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు జిల్లాలోని కట్టమంచి స్కూల్లో 2017 ఆగస్టు 18వ తేదీన సుగాలి ప్రీతి ఘటన జరిగిందని గుర్తుచేశారు. ‘2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉంది. బీజేపీ అందులో భాగస్వామిగా ఉంది. పవన్కల్యాణ్ వాళ్లతో కలిసి పనిచేస్తున్నారు. ప్రీతి కేసును విచారించి నేరస్తులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాల్సిన నాటి టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. నేరస్తులకు కొమ్ము కాసింది..’ అంటూ మండిపడ్డారు. ఆనాడు ప్రీతి తల్లిదండ్రులు అడగని నాయకుడు, తొక్కని గుమ్మం లేదన్నారు. 2018లో హైదారాబాద్లో జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్కల్యాణ్కు ఫైల్ ఇచ్చారని చెప్పారు. 14 ఏళ్ల పసిబిడ్డ జీవితం నాశనమైపోతే ఎలా ఊరుకుంటారంటూ ఊగిపోయి మాట్లాడిన పవన్కల్యాణ్.. అప్పటి సీఎం చంద్రబాబును ప్రశ్నించలేదని, విచారణ చేయమని కోరలేదని చెప్పారు. నేరస్తులకు శిక్షపడే విధంగా చేయలేదని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఆ కుటుంబానికి రావాల్సిన ప్రయోజనాలు కూడా అందించలేదని విమర్శించారు. 2017 నుంచి 2019 వరకు రెండేళ్లు కేసును తాత్సారం చేశారని విమర్శించారు. రాజకీయంగా కేసును వాడుకొని.. తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పడి పోవడంతో పవన్కల్యాణ్ ఈ కేసును రాజకీయంగా వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందారని విజయ్కుమార్ తెలిపారు. ఎన్నికలైన తర్వాత కూడా చంద్రబాబు నేరస్తులకు కొమ్ము కాశారని, అందుకే మొదటి సంతకం అన్న పవన్ కల్యాణ్ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. డీఎన్ఏలు మ్యాచ్ కాలేదని పవన్కల్యాణ్కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. నాడు, నేడు నేరస్తులకు కొమ్ము కాస్తున్నందునే పవన్కల్యాణ్ ఈ కేసులో మాట మార్చారని చెప్పారు. ఈ కేసును పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నతవిద్యను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. -
బస్స్టాండ్లో ప్రసాదాల కౌంటర్కు కరెంట్ సరఫరా కట్..!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పండిట్ నెహ్రూ బస్స్టాండ్లో సిటీ బస్ టెర్మినల్ వద్ద దుర్గగుడి ఏర్పాటు చేసిన ప్రసాదాల కౌంటర్కు విద్యుత్ను ఆర్టీసీ అధికారులు కట్ చేశారు. బస్టాండ్ ఆవరణలో ప్రసాదాల కౌంటర్కు ఆర్టీసీ నుంచి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. దీనికి దేవస్థానం ప్రతి నెలా విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. అయితే కొన్ని నెలలుగా దేవస్థానం ప్రసాదాల కౌంటర్ విద్యుత్ బిల్లును చెల్లించకపోవడంతో అది కాస్త రూ. 18 వేలకు చేరింది. బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ ఆర్టీసీ అధికారులు కౌంటర్లోని సిబ్బందికి తెలియజేస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని కౌంటర్లోని సిబ్బంది దేవస్థాన అధికారులకు చెప్పినా ఎటువంటి స్పందన లేకపోవడంతో నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ అధికారులు విద్యుత్ కనెక్షన్ను కట్ చేశారు. దీంతో ప్రసాదాల కౌంటర్లో కంప్యూటర్, ఇంటర్నెట్, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు పని చేయడం లేదు. ప్రసాదాలు కొనుగోలు చేసే భక్తులకు తొలుత కంప్యూటర్ టోకెన్ ఇవ్వాల్సి ఉంది. అయితే విద్యుత్ లేకపోవడంతో టోకెన్లు లేకుండానే ప్రసాదాల విక్రయాలు జరుగుతున్నాయి. మరో వైపు చీకట్లోనే బ్యాంక్ సిబ్బంది పని చేస్తూ భక్తులకు, ప్రయాణికులకు ప్రసాదాలను విక్రయిస్తున్నారు. దుర్గగుడి అధికారుల తీరు సరికాదని పలువురు భక్తులు, యాత్రికులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ బిల్లు బకాయి కోసం ఆర్టీసీ చర్య -
ఇష్టారాజ్యం!
జగ్గయ్యపేట: మట్టి, ఇసుక, గ్రావెల్ ఇలా కాదేదీ దోపిడీకి అనర్హం అన్న చందంగా తయారైంది కూటమి ప్రభుత్వంలో పరిస్థితి. అక్రమార్కులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో వీరి దోపిడీ అధికంగా ఉంది. జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఇనుము తయారీలో ముడి పదార్థంగా వినియోగించే కాకిరాయి(స్పాంజ్ ఐరన్) విరివిగా లభిస్తోంది. దీనిపై కన్నేసిన అక్రమార్కులు దానిని యథేచ్ఛగా పక్క రాష్ట్రానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది. అటవీ ప్రాంత గ్రామాలలో.. జగ్గయ్యపేట మండలంలోని షేర్మహ్మద్పేట, రామచంద్రునిపేట, గండ్రాయి, తక్కెళ్లపాడు గ్రామాల్లోని అటవీ ప్రాంతాలలో పంట భూములు అధికంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కాకిరాయి అధికంగా లభ్యమవుతోంది. దీంతో కొందరు అక్రమార్కులు ఐరన్ స్పాంజ్ కర్మాగారాలకు తరలిస్తున్నారు. 2006–09 వరకు ఈ ప్రాంతాలలో కాకిరాయి కలాపాలు అప్పటి ప్రభుత్వ అనుమతితో విరివిగా సాగాయి. అంతే కాకుండా వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లోని ఐరన్ వోర్ కర్మాగారాలకు కూడా కాకిరాయి రవాణా సాగింది. అయితే 2009లో కొన్ని రాజకీయ కారణాలతో ప్రభుత్వం అనుమతులు నిలిపివేయటంతో పాటు కొన్ని కర్మాగారాలు నష్టాలలో ఉండటంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. 16 ఏళ్ల తరువాత తవ్వకాలు.. కాకిరాయి రవాణా పూర్తిగా నిలిపివేసి 16 ఏళ్లు గడిచిన తరువాత కూటమి ప్రభుత్వంలో అక్రమ రవాణా మళ్లీ ఊపందుకుంది. ఆయా గ్రామాల్లోని పొలాలు పూర్తిగా ఎర్ర నేలలు కావటంతో వర్షాధారమైనవి. వర్షాలు సకాలంలో కురిస్తేనే రైతులకు పంట దిగుబడి వస్తుంది. లేకుంటే నష్టాలు చూడాల్సిందే. దీనిని ఆసరా చేసుకుంటున్న అక్రమార్కులు ఆ రైతులకు డబ్బిచ్చి పొలాలను తీసుకుంటున్నారు. కూలీలతో రాయి ఏరివేత.. కాకిరాయిని పొలాల్లో అక్రమార్కులు ప్రత్యేకంగా కూలీలతో ఏరిస్తారు. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో పొలాలలో రాయి పైకి తేలుతుంది. ఉదయం సమయంలో రాయిని కూలీలతో ఏరించి పొలాల్లో కుప్పలుగా పోస్తారు. రాత్రి వేళల్లో రాళ్ల కుప్పను ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని తెలంగాణ రాష్ట్రం నేలకొండపల్లి మండలంలోని గట్టు కాచవరం, అప్పలనర్సాపురం మీదుగా సూర్యాపేట, హైదరాబాద్కు తరలిస్తున్నారు. అంతే కాకుండా సమీపంలోని ఐరన్ ఇండస్ట్రీకి కూడా తరలిస్తున్నట్లు సమాచారం. పట్టించుకోని అధికారులు.. గుట్టుచప్పుడు కాకుండా ఖనిజ సంపదను ఎటు వంటి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవటం లేదు. మైనింగ్, అటవీ శాఖాధికారులు కూడా కనీసం కన్నెత్తి చూడకపోవటంతో అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారు. విలువైన ఖనిజ సంపదను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.చర్యలు తీసుకుంటాం.. అనుమతులు లేకుండా ఖనిజ సంపదను అక్రమ రవాణా సాగిస్తే చర్యలు తీసుకుంటాం. కాకిరాయి తరలింపుపై విచారణ జరుపుతాం. నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – వీరాస్వామి, మైనింగ్ ఏడీ, విజయవాడ తక్కెళ్లపాడు, రామచంద్రునిపేట, గండ్రాయి గ్రామాల్లోని గాడుదల గుట్ట పంట పొలాలను లీజుకు తీసుకునేందుకు అక్రమార్కులు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కాకిరాయి చిన్నా, పెద్ద సైజులో ఉంటుంది. పొలంలో రెండు నుంచి మూడు, నాలుగు అడుగుల వరకు తవ్వకాలు చేస్తే కాకిరాయి బయటపడుతుంది. దీంతో అక్రమార్కులు సైజును బట్టి ధర నిర్ణయించి ఎకరం పొలం లీజుకు రూ. లక్షకు తీసుకునేలా రైతులతో ఒప్పందం చేసుకుంటున్నారు. -
బుడమేరు పాపం.. బాబు ప్రభుత్వానిదే
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద వస్తోందని తెలిసినా.. ప్రజలను అప్రమత్తం చేసి కాపాడటంలో కూటమి ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య ధోరణి వల్లే విజయవాడ మునిగిందని.. లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ఈ పాపం ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆరోపించారు. బుడమేరు వరద బీభత్సం జరిగి ఏడాది గడిచిన నేపథ్యంలో పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బుడమేరు ముంపు బాధితులకు మద్దతుగా– ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా సింగ్ నగర్ ఆంధ్రప్రభకాలనీలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది బుడమేరు వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. వేల ఇళ్లు నీట మునిగి.. లక్షల మంది సర్వం కోల్పోయి రోడ్డునపడే దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. వరద గురించి ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నా.. కింద ఉన్న గ్రామాలు, విజయవాడ నగర ప్రజలకు సమాచారం అందించి వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం చివరికి దాతలు అందించిన రూ.600 కోట్లకు పైగా విరాళాలను కూడా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, వాటర్ ప్యాకెట్లు పేరుతో పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. దొంగ సర్వేలతో బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకొందని విమర్శించారు.కృష్ణా రిటైనింగ్ వాల్ మాదిరిగా..కృష్ణానదికి నేడు ఇంత పెద్ద స్థాయిలో వరదనీరు వస్తున్నా కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్ కట్ట పరిసర ప్రాంత ప్రజలంతా నిశ్చింతగా ఉంటున్నారంటే దానికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో నిర్మించిన రిటైనింగ్ వాలేనని అవినాష్ స్పష్టం చేశారు. అలాంటి వాల్ బుడమేరుకు కూడా నిర్మించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.నేటికీ ప్రజల గుండెల్లో భయం..కూటమి ప్రభుత్వం అసమర్థత, ముందు చూపులేని కారణంగా ఏ కొద్దిపాటి వర్షం పడినా నేటికీ బుడమేరు వరద బాధితులు భయపడుతూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి బుడమేరు ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని.. మిషన్ బుడమేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.సమీక్షల పేరుతో కాలయాపన..బుడమేరు వరదలు జరిగి ఏడాది కాలం గడిచినా కూటమి ప్రభుత్వం నేటికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కేవలం సమీక్షల పేరుతో సీఎం చంద్రబాబు కాలయాపన చేశారే తప్ప వాస్తవంగా బుడమేరు పరిరక్షణకు ఈ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు బీహెచ్ఎస్వీ జానారెడ్డి, ఎండీ షాహీనా సుల్తానా, శర్వాణీమూర్తి, కుక్కల అనిత, వైఎస్సార్సీపీ స్టూడెంట్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, అన్ని డివిజన్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
ఉద్యోగులకు అండగా ఉంటాం
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఏపీ ఎన్జీఓ సంఘం అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అన్నారు. కమర్షియల్ ట్యాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలోని సంఘ కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భవనారి వెంకటేష్బాబు ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి 15 డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న విద్యాసాగర్ను సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. సమస్యల పరిష్కారానికి కృషి.. తొలుత విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆర్థికాంశాలతో ముడిపడి ఉన్న అంశాల పరిష్కారానికి తమ రాష్ట్ర కార్యవర్గం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భవనారి వెంకటేష్బాబు, కొప్పొలు సుధాకరరావు, కోశాధికారి జి.ఎన్.వి.రత్నకుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ కాల పరిమితి(2022–2025) అక్టోబర్ నెలతో ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైన మేరకు సంఘ బైలాస్ నందు మార్పులు చేర్పులు చేయాలని ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించామన్నారు. ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.పి.జగదీష్, ఆల్ ఇండియా ఉమెన్ వింగ్ సభ్యురాలు రాజ్యలక్ష్మి ప్రసంగించారు. విజయవాడ 1,2,3 డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ -
ఎన్టీటీపీఎస్ ప్లాంట్లో బూడిద లారీ బోల్తా
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ ప్లాంట్లో బూడిద రవాణా చేసే ట్యాంకర్ లారీ శనివారం రాత్రి బోల్తా పడింది. జగ్గయ్యపేట సమీపంలోని సిమెంట్ ఫ్యాకర్టీలకు బూడిద తరలించే నేపథ్యంలో మద్యం మత్తులో లారీతో ప్లాంటులోకి డ్రైవర్ ప్రవేశించడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్లాంటులో 20కేఎం వేగానికి మించి వాహనం నడిపే అవకాశం లేకపోయినా ప్రమాదం జరగడానికి మద్యం మత్తే కారణంగా తేల్చారు. లారీలు పార్కింగ్ చేసే సమీపంలో మద్యం బెల్ట్ షాపులు అందుబాటులో ఉన్నాయి. దీంతో డ్రైవర్లు మద్యానికి బానిసలై వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. ఉద్యోగులను క్షుణంగా పరిశీలించే సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్లను ఎందుకు తనిఖీ చేయడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కొత్తూరుకు చెందిన మండవ శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,001 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. కనకదుర్గ కుటుంబం.. కావ్య, సుధీర్కుమార్ పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా ఇచ్చారు. విజయవాడ విద్యాధరపురానికి చెందిన పి.సుబ్బలక్ష్మి పేరిట కుమారుడు, కోడలు శివశంకర్, విజయదుర్గ నిత్యాన్నదానానికి రూ. 1,00,111 విరాళాన్ని అందజేశారు. ఉచిత ప్రసాద వితరణకు .. హైదరాబాద్కు చెందిన కేవీ లక్ష్మీ నరసింహశాస్త్రి, పద్మావతి దంపతులు కుమారుడు సునీల్చంద్ర, ఫణిశ్రీల పేరిట ఉచిత ప్రసాద వితరణకు రూ. 1,00,001 విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన తేగెల రవీంద్రబాబు, డాక్టర్ నాగేశ్వరమ్మలు తమ కుమార్తె మమత శ్రీరంగ పేరిట రూ. 1,00,001 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ లోక కల్యాణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ జరి గింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువురు ఉభయదాతలు, భక్తులు సేవలో పాల్గొన్నారు.ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ సాధారణంగా కనిపించింది. ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టిన పనులపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో కీలకమైన క్యూలు, ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటుతో పాటు ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న ప్రసాదాల పోటు, అన్నదాన భవనం పనుల పురోగతిపై చర్చించారు. శుక్రవారం జిల్లా స్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశానికి అవసరమైన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. -
అంతర్జాతీయ స్థాయిలో విజయవాడ స్కేటర్ల సత్తా
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): విజయవాడకు చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి కుమారి పి.చైత్ర దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. ఆస్ట్రేలియాలో ఈ ఆగస్టు 28వ తేదీ నుంచి ఆదివారం వరకు జరిగిన వరల్డ్ స్కేట్ పసిఫిక్ కప్–2025 (వరల్డ్ స్కేట్ ఓషేనియా) పోటీల్లో పెయిర్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం, ఇన్లైన్ విభాగంలో బంగారు పతకం, కపుల్ డ్యాన్స్ విభాగంలో బంగారు పతకం సాధించింది. విజయవాడ నగరానికి చెందిన వి.హృతిక్ ఇన్లైన్ విభాగంలో బంగారు పతకం, పెయిర్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకం, కపుల్ డాన్స్ విభాగంలో బంగారు పతకం, సోలో డాన్స్ విభాగంలో సిల్వర్ పతకం సాధించారు. ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ దీపక్ ఎల్లాప్రగడ, టీమ్ ఇండియా రోలర్ స్కేటింగ్ కోచ్ పి.సత్యనారాయణ వారిని అభినందించారు. -
ఏకదంతుడి లడ్డూ రూ.లక్ష
గుడివాడ టౌన్: పెద ఎరికపాడులోని శ్రీ కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాల పందిరిలో స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం ఆదివారం జరిగింది. పలువురు భక్తులు వేలంలో పాల్గొనగా అదే ప్రాంతానికి చెందిన పోతుల శ్రీకాంత్ స్వామివారి లడ్డూను లక్ష వెయ్యి రూపాయలకు పాడుకొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బైక్పై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన కనకదుర్గ ఫ్లై ఓవర్పై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా విశ్వనాథపురం బ్యాంక్ కాలనీకి చెందిన బసు పృథ్వీరాజ్(22) విజయవాడ యనమలకుదురు కరకట్ట ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. పోరంకి లోని ఓ కళ్లజోళ్ల షాపులో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భార్యతో ఫోన్లో మాట్లాడాడు. ఆతర్వాత తన బుల్లెట్పై భవానీపురం ఆశ్రమం రోడ్డుకు వచ్చి అక్కడ జరిగిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రూంకు వెళ్తుండగా కనకదుర్గ ఫ్లై ఓవర్పై లోటస్ అపార్ట్మెంట్ సమీపంలోకి వచ్చే సరికే బుల్లెట్ స్కిడ్ అయి అదుపు తప్పి డివైడర్కు ఢీ కొట్టింది. బండిపై నుంచి పృధ్వీరాజ్ ఎగిరిఫ్లైఓవర్ అవతలి వైపు పడిపోయాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనసై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం: వీటీపీఎస్ ఆఫీసర్స్ కన్స్యూమర్స్ కో–ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ సంస్థ పర్యవేక్షణలో నిర్వహించే పెట్రోల్ బంక్లో నగదు గోల్మాల్ జరిగిన విషయంలో ముగ్గురు వ్యక్తులకు ప్రధాన పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. బంక్లో పనిచేసి అదృశ్యమైన కాంట్రాక్ట్ కార్మికుడు గోపాలకృష్ణను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో ముగ్గురు పేర్లు తెలిసినట్లు సమాచారం. వీరిలో ఇద్దరు సొసైటీలో ప్రధాన వ్యక్తులు కాగా, మరొకరు స్థానికంగా పనిచేసే ఓ ప్రముఖ టీవీ చానల్ రిపోర్టర్ (సాక్షి కాదు) అని తెలిసింది. అయితే ముగ్గురితో పాటు సంబంధం లేని వ్యక్తులను కూడా ఇందులోకి లాగాలని కొందరు కూటమి నేతలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. -
ఆరోగ్య గమ్యానికి సైకిల్ సవారీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆరోగ్యం, ఆహ్లాదం.. ఆపై పర్యావరణ పరిరక్షణకూ సైక్లింగ్ చేయూతనిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. చిన్నారులు, యువత సైకిల్ సవారీని అలవాటుగా చేసుకోవాలన్నారు. సైకిల్ సవారీ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడంతో పాటు కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాతీయ క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో పెడల్ ఫర్ ఫిట్నెస్ అండ్ యూనిటీ ఇతివృత్తంతో నిర్వహించిన సైకిల్ రైడ్లో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం నుంచి ప్రారంభమైన ఈ రైడ్ బెంజిసర్కిల్, రామవరప్పాడు, బీఆర్టీఎస్ రోడ్డు, గాంధీనగర్, మునిసిపల్ ఆఫీస్, ప్రకాశం బ్యారేజ్, కంట్రోల్ రూమ్, స్టేడియం వరకు మొత్తం 21 కి.మీ. మేర సాగింది. దాదాపు 80 మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని ఐక్యతా మార్గంలో క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పారు. అనంతరం లండన్ – ఎడిన్బర్గ్ – లండన్ (ఎల్ఈఎల్) సైక్లింగ్ ఈవెంట్ – 2025లో పాల్గొన్న నిషికాంత్ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అమరావతి రన్నర్స్ ప్రెసిడెంట్ ఆర్.రమేష్ రవి, సభ్యులు బసవేశ్వరరావు, జీవీ సత్యనారాయణ, నిషికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఆర్భాటమే.. ఆచరణ సున్నా
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సింహాచలం దేవస్థానంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఈ ఏడాది దసరాకు క్యూల ఏర్పాటులో ఐరన్ ఫ్రేమ్లను వినియోగిస్తున్నామని దుర్గగుడి అధికారులు ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో కానరావడం లేదు. గత నెల 17న దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి చారిటీస్ కాటేజీ వద్ద ఐరన్ ఫ్రేమ్లతో ఏర్పాటు చేసిన క్యూలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీనికి అవసరమైన ఐరన్ ఫ్రేమ్లను సింహాచలం దేవస్థానం నుంచి దిగుమతి చేసుకున్నామని ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఎంతో ఘనంగా చెప్పుకున్నారు. కార్యాచరణలో దిగే సరికి.. దసరా ఉత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి అధికారులు గురువారం కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి, ఘాట్ రోడ్డులో మొదటి మలుపు వద్ద కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేస్తానని చెప్పిన ఐరన్ ఫ్రేమ్లు కనీసం దుర్గగుడి పరిసరాలకు కూడా చేరలేదు. దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు ముందుగానే టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్ ఐరన్ ఫ్రేమ్లను బిగించడానికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూ పనులు రెండు రోజులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఉత్సవాలు సమీపిస్తుండటంతో చేసేది లేక పాత క్యూలనే ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్రోడ్డులో ఇప్పటికే బారికేడ్లతో క్యూ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక ఐరన్ ఫ్రేమ్ల క్యూలు ప్రకటనలకే పరిమితమైందని ఇంజినీరింగ్ సిబ్బంది బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఐరన్ ఫ్రేమ్లతో క్యూలు ఏర్పాటు చేస్తున్నామని ఇంజినీరింగ్ విభాగం ముఖ్య అధికారులు పనుల వ్యయాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పాత విధానంతోనే క్యూలు ఏర్పాటు చేయడంతో అంచనాలను తగ్గిస్తారా లేక యధావిథిగానే బిల్లులు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఎవరి జేబులో వేస్తారో వేచి చూడాల్సి ఉంది. దేవదాయ శాఖ ఆదేశాలు బేఖాతర్...! ఈ ఏడాది సింహాచలం దేవస్థానంలో చోటు చేసుకున్న రెండు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చందనోత్సవం రాత్రి కురిసిన భారీ వర్షంతో గోడ కూలిపోవడం, సింహాచలం గిరి ప్రదక్షిణలో ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోయిన ఘటనలతో భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు, ఆకస్మిక అల్పపీడనాలు వస్తుండటంతో ఉత్సవాల ఏరా్పాట్లకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా క్యూల ఏర్పాటుపై అలసత్వం చూపొద్దని హెచ్చరించడమే కాకుండా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. కీలకమైన క్యూల ఏర్పాటులో దేవస్థానం దేవదాయ శాఖ ఆదేశాలను తుంగలోకి తొక్కి పెట్టింది. బారికేడ్లతో ఏర్పాటు చేసే వాటర్ ఫ్రూప్ టెంట్ల విషయంలోనూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. -
సిప్ అబాకస్ విజేతలకు అభినందన
భవానీపురం(విజయవాడపశ్చిమ): సిప్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సిప్ అబాకస్ పోటీలో గెలిచిన విద్యార్థులను ఆదివారం భవానీపురంలోని ఇన్స్టిట్యూట్లో అభినందించారు. ఈ సందర్భంగా సెంటర్ హెడ్ మధుసూదనరావు మాట్లాడుతూ ఇటీవల మంగళగిరి సీకే కన్వెన్షన్లో నిర్వహించిన సిప్ అబాకస్ పోటీలో 5–11 నిముషాల వ్యవధిలో 80 నుంచి 160 వరకు క్యాలిక్యులేషన్స్ను సాల్వ్ చేశారని తెలిపారు. ఈ పోటీలో భవానీపురం, వన్టౌన్ బ్రాంచిల నుంచి 180 మంది విద్యార్థులు పాల్గొనగా 157 మంది వివిధ కేటగిరీల్లో విజయం సాధించారని చెప్పారు. ఈ విద్యార్థులు నవంబర్ 16న చైన్నెలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఏపీలో మూడోసారి అత్యధిక విజేతలతో తమ బ్రాంచి మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 18 ఏళ్లల్లో దాదాపు 5వేల మంది విద్యార్థులను మెరుగైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దామని తెలిపారు. -
‘ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలి’
విజయవాడ: బుడమేరు వరదకు ఏడాది పూర్తైన నేపథ్యంలో బాధితులకు మద్దతుగా, ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నిరసన చేపట్టింది. సింగ్నగర్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్ఆర్సిపి నేతలు, శ్రేణులు పాల్గొన్నాయి. దీనిలో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘గత ఏడాది ఇదే ప్రాంతం వరదతో మునిగిపోయింది. ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలి. వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కానీ పరిహారం సక్రమంగా అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కృష్ణానదికి వరద వచ్చి కృష్ణలంక ముంపునకు గురైంది. రిటైనింగ్ వాల్ కటి కృష్ణలంక ప్రజల కష్టాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. దేవుడి పాదాల సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమాకు అభివృద్ధి పట్టదు. ప్రజల కష్టాలు తెలియని అసమర్ధ ఎమ్మెల్యే బోండా ఉమా. బోండా ఉమాకు తెలిసింది ప్రజల పై రౌడీయిజం చేయడమే. ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ‘వరద వస్తుందని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బుడమేరు ప్రజలను ముంచేసింది. వరదలు వచ్చి ఏడాదైనా ప్రజల్లో భయం పోలేదు. వానపడితేనే ఈ ప్రాంత ప్రజలు భయపడిపోతున్నారు. ఏడాదైనా నేటికీ బుడమేరు వరద బాధితులకు పరిహారం అందలేదు. నష్టపరిహారం పేరుతో దొంగ సర్వేలు చేశారు. అబద్ధపు సాకులతో ఎంతోమందికి అన్యాయం చేశారు. సాయం కోరుతూ వెళ్లిన బాధితులను కలెక్టరేట్లోకి రానివ్వలేదు. సిగ్గులేకుండా కలెక్టరేట్ గేట్లకు తాళాలేశారు. దేశ చరిత్రలో వరద విరాళాల్లో అవినీతి చేసిన ఏకైక పార్టీ టీడీపీనే. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతాం’ అని హెచ్చరించారు.విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ‘విజయవాడ నగరం కనీవినీ ఎరుగని రీతిలో బుడమేరు ప్రజలను ముంచేసింది. ప్రజలు నిలువెల్లా వణికిపోయారు. ప్రపంచ రాజధాని అమరావతి కడుతున్నామని కబుర్లు చెబుతున్నారు. టెక్నాలజీ అంతా మాకే తెలుసంటారు. కానీ వరద వస్తున్న విషయాన్ని గుర్తించి ప్రజలను కాపాడలేకపోయారు. జగన్ రిటైనింగ్ వాల్ కట్టి కృష్ణలంక ప్రజలను ముంపు నుంచి తప్పించారు. చంద్రబాబు బుడమేరు ప్రక్షాళన చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ నేటికీ ఆదిశగా అడుగులు వేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మరోమారు బుడమేరు ముంపుకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. బుడమేరు ఆక్రమణలు తొలగించే వరకూ మా పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. -
ఆటో డ్రైవర్ల నిరసన ప్రదర్శన
పెడన: తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఆటో యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు పెడన మండల శాఖ ఆటో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పెడన బస్టాండు సెంటరు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీ్త్ర శక్తి పథకం అమలు వల్ల కిరా యిలు కరువయ్యాయని, జీవితం దుర్భరంగా మారిందని వాపోయారు. ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం రూ.25 వేలు ఇవ్వాలని, జీఓ 21ని రద్దు చేయాలని, ఇన్సూరెన్సులు, పెట్రోలు, డీజిల్ సబ్సిడీపై ఇవ్వాలని, బ్యాంకుల్లో వడ్డీ లేని సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు పి.నరసింహారావు, ఆటో యూనియన్ నాయకులు షేక్ బాజీ, పులి రమేష్, వి.దేవ పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నియంత్రణకు సహకరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): బాల్యవివాహాలను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగ ణంలోని న్యాయసేవాసదన్లో శనివారం బాల్యవివా హాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జి.గోపీ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు జరగకుండా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఎక్కడైన బాల్యవివాహాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే నష్టాలు ఎన్నో ఉంటాయన్నారు. రక్తహీనత, పిల్లలు సరిగ్గా పుట్టకపోవటం తదితర పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇందుకోసం బాల్యవివాహాలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. బాలలకు సంబంధించిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి.రామ కృష్ణయ్య, పదో తరగతి జిల్లా న్యాయమూర్తి బి.బాబు నాయక్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.పోతురాజు, డీఎస్పీ చప్పిడి రాజా, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపీ -
పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ నాయకుల బాహాబాహీ
చిల్లకల్లు(జగ్గయ్యపేట): స్థానిక పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు బాహాబాహీకి దిగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వత్సవాయి మండలం మక్కపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రామ సర్పంచ్ మల్లెల శివపై జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన అదే పార్టీ యూత్ నాయకుడు ఎనికె గోపీ సోషల్ మీడియాలో కొంత కాలంగా అనుచిత పోస్ట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల అధిష్టానం దృష్టికి ఈ ఘటన వెళ్లడంతో రాజీ చేశారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో శివ భార్య సబిత జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు మీదుగా మక్కపేటకు కారులో వెళ్తుండగా మెయిన్ రోడ్డు పక్కన పోలీస్ స్టేషన్ వద్ద గోపీ ఉండటాన్ని చూశారు. తన భర్తపై అనుచిత పోస్ట్లు ఎందుకు పెడుతున్నావని ఆమె గోపీని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడికి రావడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు గంటల పాటు ఆ ప్రాంతం అంతా బూతుపురాణాలతో దద్దరిల్లింది. అధికార పార్టీ నాయకులు కావడంతో పోలీసులు కూడా నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. చివరుకు పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించారు. -
లాటరీలో 62 బార్లు కేటాయింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వ నూతన బార్ పాలసీ 2025–28లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 62 బార్లకు శనివారం లాటరీ నిర్వహించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ అబ్కారీ అధికారి వి.శ్రీనివాసరావుతో కలిసి దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ తీశారు. జిల్లా ప్రొహిబిషన్ అబ్కారీ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నూతన పాలసీలో భాగంగా మూడేళ్ల కాలపరిమితికి జిల్లాలో సాధారణ కేటగిరీలో 130 బార్లు, గీత కులాలకు 10 బార్లు చొప్పున కేటాయించామన్నారు. నిర్దేశించిన గడువు తేదీలోగా ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 130 బార్లకు గాను 75 బార్లకు మాత్రమే 262 దరఖాస్తులు వచ్చాయన్నారు. 55 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చిన 62 బార్లను లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు కేటాయించామని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో ఒక బార్కు రెండు, మరో 12 బార్లకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. నాలుగు కంటె తక్కువ దరఖాస్తులు వచ్చిన బార్లకు మరలా లాటరీ ద్వారా కేటాయించడానికి ఇదే నోటిఫికేషన్ గడువు పెంచుతామన్నారు. ఒక్క దరఖాస్తు కూడా దాఖలవని 55 బార్లకు ఎకై ్సజ్ కమిషనర్ ఆదేశాల ప్రకారం మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. గీత కులాల కేటగిరీలో మొత్తం నోటిఫై చేసిన 10 బార్లకు 104 దరఖాస్తులు అందాయన్నారు. అత్యధికంగా గెజిట్ నంబర్లు 6,7లకు 13 చొప్పున, అత్యల్పంగా గెజిట్ నంబరు 10 బార్ (కొండపల్లి)కి ఆరు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గీత కులాల వారికి కూడా గెజిట్ సీరియల్ నంబరు ప్రకారం కలెక్టర్ లక్ష్మీశ పారదర్శ కంగా లాటరీ తీశారు. ఈ పది బార్లకు లాటరీ ద్వారానే మరో ఇద్దరు వ్యక్తులను రిజర్వుడ్ –1, రిజర్వుడ్ –2గా నిర్ణయించినట్లు తెలిపారు. లాటరీలో బార్లు దక్కించుకున్న వారందరూ నిర్ణయించిన వార్షిక లైసెన్సు ఫీజులో ఆరో వంతు సొమ్ము ప్రభుత్వానికి చలానాగా చెల్లించాల్సి ఉంటుందని, నూతన బార్ పాలసీ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
ఈజ్ ఆఫ్ డూయింగ్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనూ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. తొలుత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నిర్వహించే బీఆర్ఏపీ–2024 సర్వేపై పారిశ్రామిక వర్గాలకు అవగాహన కల్పించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ర్యాంకింగ్స్ ఇచ్చే విధానాన్ని, పారామీటర్లను క్షుణ్ణంగా వివరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ర్యాంకింగ్ను మెరుగుపరిచేందుకు వీలుగా ప్రతి శాఖ తమ శాఖ ద్వారా సేవలు పొందిన వారికి సింగిల్ విండో వ్యవస్థతో పాటు వివిధ ఆన్లైన్ సేవలు వంటి వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించాలన్నారు. వివిధ అనుమతులకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 29 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 2,958 దరఖాస్తులు రాగా 2,921 దరఖాస్తులు పరిష్కారమయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద పది క్లెయిమ్లకు రూ.1.52 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కమిటీ ఆమోదం తెలిపింది. 2025–26కు సంబంధించి పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకాల అమల్లో పురోగతిని కమిటీలో చర్చించి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు, యూనిట్ల ప్రారంభానికి కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్)కు సంబంధించి మండల ప్రధాన కేంద్రాల్లో షెడ్యూల్ ప్రకారం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్షాప్లను నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కె.బాబ్జి, ఎల్డీఎం కె.ప్రియాంక, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, పారిశ్రామిక అసోసియేషన్ల ప్రతినిధులు, సర్వీస్ యూజర్లు పాల్గొన్నారు. -
క్రీడల్లో ప్రతిభ చూపుతున్న జిల్లా పాఠశాలలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): క్రీడా రంగంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు చక్కని ప్రతిభను ప్రదర్శిస్తున్నాయని జిల్లా పాఠశాల విద్యాశాఖ జోన్–2 రీజనల్ జాయింట్ డైరెక్టర్ (కాకినాడ) జి.నాగమణి అన్నారు. క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఈవో కార్యాలయంలో ప్రతిభ చూపిన పాఠశాలల క్రీడా విభాగ ఉపాధ్యాయులను, విద్యార్థులను శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నున్న జిల్లా పరిషత్ పాఠశాల రాష్ట్రంలోనే అత్యధికంగా 1347 పాయింట్లను సాధించి క్రీడల్లో తొలి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాకు చెందిన విద్యార్థులు పలు క్రీడాంశాల్లో అద్భు తమైన ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారని అభినందించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి నున్న జెడ్పీ పాఠశాల ప్రథమస్థానం, పటమట కేబీసీ జిల్లా పరిషత్ పాఠశాల ద్వితీయ, దుర్గాపురం ఎస్టీవీఆర్ఎంసీ హైస్కూల్ తృతీయ, నిడమానూరు జెడ్పీ హైస్కూల్ నాలుగో స్థానం, కొత్తపేట హిందూ హైస్కూల్ ఐదో స్థానంలో ఉన్నట్లు వివరించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన హెచ్ఎంలను, పీఈటీలను సత్కరించారు. ఏపీలో తొలి స్థానంలో నిలిచిన నున్న జెడ్పీ పాఠశాల -
ఆధునిక వైద్య విధానాలను అందిపుచ్చుకోవాలి
●సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు ●పల్మనాలజీ విభాగం రాష్ట్ర స్థాయి సీఎంఈ నిర్వహణ లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్యాసకోశ వ్యాధులకు సంబంధించి అందుబాటులోకి వస్తున్న ఆధునిక చికిత్సా విధానాలను పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో పల్మనరీ మెడిసిన్ పీజీ విద్యార్థుల కోసం రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ సదస్సు శనివారం ప్రారంభమైంది. లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ ఆర్ట్ ఆఫ్ సైన్స్ అనే థీమ్తో నిర్వహిస్తున్న ఈ సదస్సును డాక్టర్ ఏడుకొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీలు పరీక్షల ప్రిపరేషన్, రోగులతో ప్రవర్తన, నైతిక విలువలు, నీతి, కష్టపడే తత్వం, నిజాయతీ వంటి అంశాలను వివరించారు. అనంతరం లాంగ్ కేస్, షార్ట్కేస్ ప్రజెంటేషన్, ఓఎస్సీఈ, వైవా ప్రిపరేషన్ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ బాబూరావుతో పాటు కొందరు ఫ్యాకల్టీ సభ్యులు ఈ సదస్సులో పలు విలువైన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో ఈ ఏడాది అక్టోబరులో యూనివర్సిటీ తుది పరీక్షలు రాయనున్న 100 మంది పల్మనరీ మెడిసిన్ పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సును పల్మనరీ మెడిసిన్ విబాగాధిపతి డాక్టర్ సుధీన, ఇతర అధ్యాపకులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. -
న్యూఢిల్లీలో అమరావతి ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతిష్టాత్మకంగా న్యూఢిల్లీలో ప్రారంభమైన 17వ నారెడ్కో జాతీయ సదస్సులో శనివారం అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 బ్రోచర్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు. అమరావతిని భవిష్యత్లో రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ముఖ్య కేంద్రంగా ప్రదర్శించడానికి ఈ ఫెస్టివల్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. నారెడ్కో ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025లో నివాస, వాణిజ్య ప్రాజెక్టులతో పాటు ప్రభుత్వ దూరదృష్టి, పెట్టుబడి సౌహార్ధ విధానాలు, సమగ్ర టౌన్షిప్ ప్రణాళికలు ప్రదర్శిస్తారని తెలిపారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు, అభివృద్ధిదారులు, ఎన్ఆర్ఐలు, విధాన నిర్ణేతలు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ జి.సూర్య ప్రవీణ్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, నారెడ్కో జాతీయ అధ్యక్షుడు జి.హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.చక్రధర్, సెంట్రల్ జోన్ అధ్యక్షుడు సందీప్ మండవ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి తదితరులు హాజరయ్యారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఉచిత ప్రసాద వితరణకు రూ.5 లక్షలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు శనివారం విరాళాలను సమర్పించారు. అమెరికాలోని టెక్సాస్కు చెందిన సాయి సౌమ్య కామరాజు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి సాయి సౌమ్య కామరాజు, యశ్వంత్రావు దంపతులు తమ కుమారుడు ఇషాన్ కృష్ణ పేరిట వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ.లక్ష, గోసంరక్షణకు రూ.50 వేల విరాళాన్ని అందజేశారు. ఉచిత ప్రసాద వితరణకు రూ.5 లక్షలు హైదరాబాద్కు చెందిన మేఘమాల ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, అనుపమ దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. దేవస్థానంలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి రూ.5 లక్షల విరాళాన్ని అందజేశారు. నిత్యాన్నదానానికి రూ.లక్ష విజయవాడ కొత్తూరు తాడేపల్లికి చెందిన డి.శివనాగరాజు, దుర్గారాణి దంపతులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,00,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
నందిగామరూరల్: పట్టణ శివారులోని అంబారుపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సేకరించిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామానికి చెందిన మండూరి చిట్టిబాబు తన భార్య నాగమల్లేశ్వరి(30)తో కలిసి శనివారం మండలంలోని మాగల్లు గ్రామంలోని బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో అంబారుపేట గ్రామ సమీపంలోని వై జంక్షన్ వద్దకు వచ్చే సరికి వెనుకగా వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై నుంచి మల్లేశ్వరి కింద పడగా, ఆమె పైనుంచి లారీ వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందగా భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిమన్యు తెలిపారు. మృతురాలికి కుమార్తె ఉన్నారు. నాగమల్లేశ్వరి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. ఆయన శనివారం ఉత్సవాల సందర్భంగా చేయనున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపైన ఏర్పాటు చేయనున్న క్యూలైన్లు, ఘాట్రోడ్డు తదితర ప్రాంతాలను నడుచుకుంటూ వెళ్లి పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వినాయక టెంపుల్ వద్ద నుంచి ఏర్పాటు చేసే క్యూలైన్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. క్యూలైన్లలో ఏఏ ప్రదేశాల్లో బారికేడింగ్ చేయాలి, హోల్డింగ్ చేయాలి, హోల్డింగ్ ప్రదేశాల్లో భక్తులు లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఏర్పాట్లు వంటి అంశాలపై సూచనలు చేశారు. దర్శనం అనంతరం భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించి, ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమజోన్ ఇన్చార్జి డీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, వన్టౌన్ సీఐ గురుప్రకాష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. దసరా ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ రాజశేఖరబాబు -
వినతి పత్రం విసిరిపడేశాడు.. వికలాంగులపై దౌర్జన్యం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దివ్యాంగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయంలో ఘటన జరిగింది. దివ్యాంగులపై జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ దౌర్జన్యానికి దిగారు. వినతి పత్రం తీసుకుని విసిరిపడేశారని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్పై చర్యలు తీసుకోవాలని వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు.కాగా, దివ్యాంగులపై కూటమి సర్కారు నిర్దయగా వ్యవహరిస్తోంది. వైకల్య శాతం తగ్గించేసి అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తోంది. వారికి ఆర్థిక ఆసరాను అందకుండా చేస్తోంది. పూర్తిగా మంచానికే పరిమితమైనా.. మానసిక వికలాంగులుగా ఉన్నా.. కనీస కనికరం లేకుండా నోటికాడ కూడును లాగేస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి పింఛన్లు మార్పుచేస్తూ తీరని వేదన మిగులుస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో దివ్యాంగులు ఆవేదన చెందుతున్నారు. నాడు ఉన్న అర్హత నేడు ఎక్కడికి వెళ్లిందంటూ కన్నీళ్లు పెడుతున్నారు. -
వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే!
సెప్టిక్ ట్యాంకులే అస్త్రాలుగా.. జి.కొండూరు: మండల పరిధిలో వ్యర్థాల పాపం ఇంటి దొంగలదే. పోలీసుల నిఘాతో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. కెమికల్, మడ్డి ఆయిల్, టైర్ ఆయిల్ కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలను కాల్వలు, చెరువులు, రహదారుల వెంట పారబోస్తూ కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు. వినూత్న పద్ధతిలో వ్యర్థాలను బయటకు తరలించి చేతులు దులుపుకొంటున్న కంపెనీలు, వ్యర్థాలు తమవి కావని చెప్పిన బుకాయింపు మాటలు అవాస్తవమని తేలిపోయింది. ‘సాక్షి’ వరస కథనాలతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో జి.కొండూరు పరిధిలోని గడ్డమణుగు గ్రామ శివారులో కొత్తూరు రోడ్డులో వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు రెడ్హ్యాండెడ్గా పోలీసులకు చిక్కడంతో చేసేది లేక కంపెనీల నిర్వాహకులు ముఖం చాటేశారు. నిత్యం వివాదమే కొండపల్లి ఐడీఏలోని కెమికల్ పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు నిత్యం వివాదంగానే మారుతున్నాయి. ఇక్కడ నాలుగు వందల వరకు పరిశ్రమలు ఉండగా వీటిలో ఫార్మా, కెమికల్ కంపెనీలు 12, ప్లాస్టిక్ కంపెనీలు మూడు, మడ్డి ఆయిల్ కంపెనీలు నాలుగు, టైర్ ఆయిల్ కంపెనీలు మూడు వరకు ఉన్నాయి. వీటి నుంచి రోజుకు వేల లీటర్ల కెమికల్ వ్యర్థాలు విడుదలవుతూ ఉంటాయి. వీటిని పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి విడుదల చేయడంతో ఈ నీరు వ్యవసాయ భూముల మీదగా ప్రవహిస్తుంది. ఈ కెమికల్ వ్యర్థాల ప్రభావంతో కవులూరు గ్రామానికి చెందిన 600 ఎకరాలు చవుడుబారి పండక రైతులు నష్టపోతున్నారు. వ్యర్థాల కారణంగా కట్టుబడిపాలెం గ్రామ ప్రజలు పక్షవాతం, ఎలర్జీలు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో కెమికల్ కంపెనీలకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. రీసైక్లింగ్ యూనిట్ కూడా వివాదమే ఈ వ్యర్థాలను శుద్ధి చేసేందుకు రసాయనిక పరిశ్రమల సొసైటీ ఆధ్వర్యాన కొండపల్లి సమీపంలోనే రీసైక్లింగ్ యూనిట్ను రూ.8కోట్లతో దశాబ్ద కాలం క్రితం నిర్మించారు. ఈ కంపెనీ నిర్మాణం కూడా వివాదంగానే మారింది. జనావాసాలకు సమీపంలో వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ నిర్మించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ యూనిట్ పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో పాటు అప్పట్లో ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ యూనిట్కు తరలించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో పక్కనే ఉన్న తొమ్మండ్రం వాగులోకి విడుదల చేస్తూ ఆ యూనిట్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులతో తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఏడాదికిపైగా జరుగుతున్న ఈ దురాగతాన్ని జి.కొండూరు పోలీసులు పసిగట్టడంతో కంపెనీల నిర్వాహకుల తీరు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. కొండపల్లి ఐడీఏలోని పలు కంపెనీలు ప్రాసెసింగ్ అనంతరం విడుదలయ్యే కెమికల్ వ్యర్థాలను తరలించడానికి సెప్టిక్ ట్యాంకులను అస్త్రాలుగా ఎంచుకున్నారు. ఏడాది కాలంగా కొండపల్లి ఐడీఏలోని పలు కంపెనీల నుంచి లక్షల లీటర్ల కెమికల్ వ్యర్థాలను సెప్టిక్ ట్యాంకుల్లో తరలించి జి.కొండూరు మండల పరిధిలోని పినపాక, ఆత్కూరు, హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు, వెలగలేరు, చెవుటూరు, జి.కొండూరు, గడ్డమణుగు గ్రామాల పరిధిలో చెరువులు, కాల్వల్లో పారబోస్తున్నారు. ఈ దారుణంపై ‘సాక్షి’ కథనాలను ప్రచురించే సమయంలో ఐడీఏలోని కంపెనీల నిర్వాహకులు కొంతమందిని వివరణ కోరగా పారబోస్తున్న వ్యర్థాలకు తమకు ఎటువంటి సంబంధంలేదని బుకాయించారు. ఇప్పుడు కెమికల్ వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు పోలీసులకు పట్టుబడటంతో తమ దందా బయటపడిందని ముఖం చాటేస్తున్నారు. సెప్టిక్ ట్యాంకులో వ్యర్థాలను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం కెమికల్ వ్యర్థాలను కాల్వలు, చెరువులు, రహదారుల వెంబడి పారబోస్తూ పర్యావరణ కాలుష్యానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలను పారబోస్తూ సెప్టిక్ ట్యాంకు పట్టుబడింది. పొల్యూషన్ కంట్రోల్బోర్డు అధికారులు నమూనాలను తీసుకెళ్లారు. ఐడీఏలోని కంపెనీల నిర్వాహకులతో మాట్లాడి హెచ్చరించాం. నమూనాల ఫలితాలు రాగానే బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం. –సతీష్కుమార్, ఎస్ఐ, జి.కొండూరు -
పనులకు ఫుల్ స్టాప్
సాక్షి, ప్రత్యేకప్రతినిధి: విజయవాడ నగరంలో మూడు రోడ్డు పనులకు ఏపీ సీఆర్డీఏ ఫుల్స్టా్ప్ పెట్టింది. రూ.75 కోట్లతో టెండర్లను ఆహ్వానించిన సర్కారు వాటిని అర్ధాంతరంగా రద్దుచేసింది. టెండర్లను రద్దు చేయడానికి కారణాలేంటో కూడా వెల్లడించలేదని టెండరుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోడ్డు పనులు పూర్తయితే తమ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గుతుందని ఆశించిన విజయవాడ ప్రజలకు, ఆ మార్గాల్లో వాహనచోదకులకు నిరాశే మిగిలింది.గత నెలలో టెండర్లువిజయవాడ, గుంటూరు నగరాలతో పాటు రాజధాని అమరావతిలో పది పనులను చేపట్టడానికి గత నెలలో ఏపీ సీఆర్డీఏ రూ.793.21 కోట్లతో టెండర్లు ఆహ్వానించిన సంగతి తెలి సిందే. ఇందులో ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు ఉండగా తక్కిన మూడు టెండర్ల్లు సేవలకు సంబంధించినవి. వీటిలో రూ.683.33 కోట్లతో రాజధానిలో వివిధ పనులు కాగా రూ.109.88 కోట్లతో విజయవాడ, గుంటూరులో నాలుగు రోడ్ల నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణ, నిర్వహణ పనుల టెండరు డాక్యుమెంట్లను జూలై 11 నుంచి ఆగస్టు 8వ తేదీ లోగా డౌన్లోడ్ చేసుకోవాలని, నిర్దేశిత బిడ్లకు ఆగస్టు ఒకటి నుంచి 13వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయవచ్చని నోటీసులో పేర్కొనడం విదితమే.● విజయవాడ నగరంలోని బల్లెంవారివీధి జంక్షన్ నుంచి నిడమానూరు మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు (హెచ్టీ లైన్ రోడ్) బీటీ హాట్ మిక్స్తో రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ తదితర పనులకు 26,51,89,656 రూపాయలతో, మహానాడు రోడ్డు.. బల్లెంవారి వీధి నుంచి పోరంకి, నిడమానూరు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఇతర పనులకు 25,52,45,567 రూపాయలతో, బందరు రోడ్డు నుంచి హెచ్టీ లైన్ జంక్షన్ వరకు బల్లెంవారివీధి రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనుల నిమిత్తం 22,96,21,066 రూపాయలతో టెండర్లను జూలైలో ఆహ్వానించిన సంగతి తెలిసిందే. టెండర్లో పేర్కొన్న విధంగా ఈ మూడు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్లను ఈనెల 11వ తేదీ తెరవాల్సి ఉంది. సీఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ఏ కారణం చెప్పకుండానే బిడ్ తెరవలేదు. 19వ తేదీ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తున్నట్లు ఆ సమయంలో పేర్కొన్న అధికారులు ఆ పని కూడా చేయకపోగా 29వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా టెండరు ఐడీ 832663ని క్యాన్సిల్డ్/రిజెక్టెడ్ అని శుక్రవారం ఏపీ సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ తెలియజేశారు.మూడు సార్లు వాయిదాలెందుకు? ఇప్పుడు రద్దేల?విజయవాడ నగరంలో మూడు రోడ్డు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్ను ఓపెన్ చేయకపోగా మూడు పర్యాయాలు వాయిదా వేసి చివరకు ఎందుకు రద్దు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా టెండరు ఆహ్వానదారు పరిపాలనా కారణాల పేరిట ఎప్పుడైనా రద్దు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, దాదాపు నెలకు పైగా టెండరు వ్యవహారాలు నడిపి, టెక్నికల్ బిడ్ తెరవడానికి మూడుసార్లు వాయిదాలు వేసి చివర్లో రద్దు చేయడం ఏంటనేదే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రశ్న.కనీసం సహేతుక కారణమైనా ఉండాలి కదా అంటున్నారు. అన్ని పనులను కలిపి పెద్దమొత్తంతో టెండర్ ఆహ్వానించి రాజధాని అమరావతిలో మాదిరి బడా కాంట్రాక్టు సంస్థలకు కట్టబెట్టడానికి తాజా టెండర్లను రద్దు చేసి ఉండవచ్చనే అనుమానాలను కాంట్రాక్టర్లు వ్యక్తం చేస్తుండటం పరిశీలనాంశం. అందువల్లే వాయిదాలు వేసి చివరకు టెండర్లనే రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బిడ్ తెరవలేదుగుంటూరు జేకేసీ కాలేజీ మార్గంలోని స్వర్ణభారతి నగర్ వద్ద నుంచి పెద్దపలకలూరు వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో ఫేజ్ కింద నిర్మాణానికి రూ.34,87,28,545 టెండరు పిలిచిన సంగతి తెలిసిందే. ఆగస్టు ఏడో తేదీ టెక్నికల్ బిడ్ తెరవగా ఆరు టెండర్లు దాఖలైనట్లు అధికారులు గుర్తించారు. టెండరు నిబంధనల ప్రకారం 8వ తేదీ ఫైనాన్షియల్ బిడ్ను తెరవాలి. కానీ ఇప్పటివరకు ఆ పనిచేయలేదు. రాజధాని అమరావతిలో వివిధ పనులకు రూ.683.33 కోట్లతో పిలిచిన టెండర్ల అంశం ఇంకా తేల్లేదు.నిత్యం తీవ్ర ఇబ్బందులేట్రాఫిక్తో విజయవాడ నగర ప్రజానీకం నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత మూడు రోడ్ల విస్తరణ పనులు జరిగినట్లయితే విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలతో పాటు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లోని పలు కాలనీలకు, గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గంగా, అదనపు సౌకర్యంగా ఉండేది. బెంజిసర్కిల్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత హాస్పటల్ జంక్షన్, రామవరప్పాడు రింగ్, నిడమానూరు వరకు ట్రాఫిక్ చెప్ప నలవికాదు. చైన్నె– కోల్కతా జాతీయ రహదారి కూడా అయినందున ఈ మార్గంలో భారీవాహనాలు ఎక్కువే. గన్నవరం విమానాశ్రయానికి సమయానికి వెళ్లడానికి ప్రయాణికులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. టెండర్లలో ప్రతిపాదించిన మూడు మార్గాలు విస్తరణకు నోచుకుంటే మహానాడు మార్గం నుంచి బల్లెంవారివీధి గుండా నిడమానూరు మీదుగా అటు గన్నవరం రోడ్డు, ఇటు కానూరు, పోరంకిల మీదుగా బందరు రోడ్డు, మచిలీపట్నం జాతీయరహదారికి చేరుకోవడానికి అనువైన ప్రత్యామ్నాయాలుగా ఉండేవి. అదేవిధంగా వంద అడుగుల రోడ్డు (కామినేని హాస్పటల్ రోడ్డు)కు చేరుకోవడానికి వీలయ్యేది. అన్నింటికీ మించి రెండు ఆటోనగర్ల నుంచి ఊరి వెలుపలికి వెళ్లడానికి, నగరంలోకి రావడానికి భారీ వాహనదారులకు ఉపయోగపడేది. తాజాగా రద్దయిన టెండర్ల అంశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని రోడ్ల విస్తరణ పనులు జరిగేలా దృష్టి సారిస్తే ప్రజోపయోగంగా ఉంటుంది. -
రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) శుక్రవారం కేసు నమోదు చేశారు. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం జనశతాబ్ది ఎక్స్ప్రెస్ విజయవాడ స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ పదిపై ఆగింది. ఈ క్రమంలో ఆ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ పార్థసారథి రైలు వద్దకు చేరుకుని ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై పసుపు, నీలం రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, నీలం, కుంకుమ రంగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని, కుడి మోచేతి కింది భాగంలో ‘ఎన్టీఆర్’ అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయని, ఇతర ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ స్టేషన్లో గాని లేదా 8897156153 నంబర్ ద్వారా సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. -
తెలుగు భాష ఔన్నత్యం చాటాలి
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు భాష ఔన్నత్యం చాటి చెప్పడంలో తొలి భాషా విజ్ఞాని గిడుగు రామ్మూర్తి పంతులు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కొనియాడారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ .. రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాష గొప్పదనాన్ని భావితరాలకు చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో కమ్మనైన తెలుగుకు మించిన భాష మరొకటి లేదన్నారు. గిడుగు రామ్మూర్తి జన్మదినమైన ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. తెలుగు వ్యవహారిక భాషకు పితామహుడిగా గిడుగు రామ్మూర్తిని పరిగణిస్తారన్నారు. రామ్మూర్తి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలుస్తారన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాతో కలిపి దాదాపు 15 కోట్ల మంది ప్రజలు తెలుగు మాట్లాడుతూ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు బాల్యం నుంచే తెలుగు భాషలో మాట్లాడటం, రాయడం, చదవడం నేర్పించి తెలుగు భాషను భావితరాలకు అందించడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని లక్ష్మీశ పిలుపునిచ్చారు. గిడుగు రామ్మూర్తికి నివాళులర్పించిన వారిలో డీఎం అండ్ హెచ్వో ఎం.సుహాసిని, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్డీఎ పీడీ ఏఎన్వీ నాంచారరావు, కలెక్టరేట్ సిబ్బంది ఉన్నారు. -
కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలు
డీఆర్వో లక్ష్మీనరసింహం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించడానికి జిల్లాలో కొత్తగా 129 పోలింగ్ కేంద్రాలను రూపొందించారని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం అన్నారు. కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ ఈసీఐ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 (ఎస్ఐఆర్– 2026) ముందస్తు సన్నాహకాల్లో భాగంగా నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ నిర్వహించామన్నారు. జిల్లాలో 1,200 ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాన్ని హేతుబద్ధీకరించి కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు, సమీప పోలింగ్ కేంద్రంలో విలీనం చేయాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,792 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వీటిలో 295 సెంటర్లలో 1,200 మంది ఓటర్లు మించి ఉన్నారన్నారు. అదనంగా ఉన్న ఓటర్లను సమీప కేంద్రంలో విలీనం చేసి కొత్తగా మరో 129 పోలింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించామన్నారు. వీటితో ప్రస్తుతం ఏర్పాటు చేసిన 129తో కలిపి జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,921కి చేరిందన్నారు. జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామన్నారు. పోలింగ్ కేంద్రం వారీగా బూతు స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కృష్ణా వర్సిటీలో క్రీడా వసతులకు చర్యలు
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో క్రీడా వసతుల కల్పనకు ఖేలో ఇండియా పథకం కింద నలభై రెండు కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని ఉప కులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మేజర్ ధ్యాన్చంద్, గిడుగు రామ్మూర్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యాన అఖిల భారత విశ్వవిద్యాలయాల స్థాయిలో మహిళల నెట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు భాషా వికాసానికి గిడుగు రామ్మూర్తి చేసిన కృషిని ఆయన వివరించారు. మాతృ భాషను నిర్లక్ష్యం చేయకుండా ఆంగ్లభాషపై పట్టు సాధించాలన్నారు. వికసిత భారత్ 2047–యువ కనెక్టింగ్ నోడల్ అధికారి ఎల్.సుశీల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 18 సార్లు హాకీ రాష్ట్ర జట్టు సభ్యురాలిగా జాతీయ స్థాయిలో పాల్గొన్న జ్యోతిని ఘనంగా సత్కరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి నవీన లావణ్య లత, ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం. శ్రావణి, ఆచార్య మారుతి, ఫిజికల్ డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెండు కిలోమీటర్లు వాక్థాన్ చేశారు. నూతన బార్లకు దరఖాస్తు గడువు ముగింపు నేడు 30 షాపులకు జేసీ సమక్షంలో డ్రా చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బార్ల నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో 39 జనరల్ బార్లు, నాలుగు గీత కార్మికులకు కేటాయించిన బార్లు ఉన్నాయి. జనరల్ బార్లకు సంబంధించి 112 దరఖాస్తులు రాగా, గీత కులాలకు కేటాయించిన నాలుగు షాపులకు 39 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.గంగాధరరావు తెలిపారు. వీటిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక షాపునకు ఒకే దరఖాస్తుదారుడు, నాలుగు దరఖాస్తులను.. 30 షాపులకు మాత్రమే చేశారు. మిగిలిన తొమ్మిది షాపులకు నాలుగు దరఖాస్తులు చొప్పున దాఖలు కాలేదు. ప్రస్తుతం జనరల్ బార్లకు సంబం ధించి 26 షాపులు, గీత కులాలకు చెందిన నాలుగు షాపులకు శనివారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ హాలులో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పర్యవేక్షణలో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని గంగాధరరావు తెలిపారు. దరఖాస్తుదారులు ఉదయం 8 గంటలకే వారికి ఇచ్చిన ఎంట్రీ పాస్ ద్వారా షాపుల వారీగా లాటరీలో పాల్గొనవచ్చని ఆయన సూచించారు. ‘పసుమర్తి’కి గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు కూచిపూడి(మొవ్వ): కూచిపూడి నాట్యాచార్యులు, నాట్య ప్రయోక్త డాక్టర్ పసుమర్తి శేషుబాబు (కూచిపూడి–హైదరాబాద్)ను తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు అవార్డు వరించింది. కూచిపూడి నాట్య కళాపీఠం పూర్వ ప్రిన్సిపాల్ పసుమర్తి వేణుగోపాలకృష్ణశర్మ పెద్ద కుమారుడు శేషుబాబుకు ఈ అవార్డు వచ్చినట్లు సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళా పీఠం ఉప ప్రధానాచార్యుడు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ శుక్రవారం స్థానిక విలేకరులకు తెలిపారు. అవార్డుతో పాటు రూ.25 వేల నగదు శాలువా మెమొంటో అందజేస్తారని వివరించారు. ఏపీ యువజన అభ్యుదయం, పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయనతో పాటు వివిధ కళల్లో నిష్ణాతులైన 14 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి సత్కరించినట్లు వివరించారు. బ్యారేజీకి వరద తగ్గుముఖం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణా నదిలో వరద తగ్గుముఖం పట్టింది. ప్రకాశం బ్యారేజీకి 3,08,838 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీనిలో 2,96, 900 క్యూసెక్కుల వరద దిగువకు వదిలివేస్తున్నారు. మిగిలిన 11,938 క్యూసెక్కులను పంట కాలువలకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీకి 3,98,397 క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. -
108 అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్సే ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పీఎన్బీఎస్ పరిసరాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, సంగుల పేరయ్య వీధిలో జల్ది వెంకటేశ్వరరావు(36), భార్య రత్నకుమారి, ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటున్నాడు. బస్టాండ్ వద్ద ఒక కార్ ట్రావెల్స్లో గుమాస్తాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ క్రమంలో అతను నైట్ డ్యూటీలో ఉండగా.. గురువారం రాత్రి టీ తాగేందుకు కార్ ట్రావెల్స్ కార్యాలయం నుంచి బాలాజీ హోటల్ వద్దకు వెళ్తున్నాడు. ఈ సమయంలో ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి వారధి వైపునకు అతివేగంగా వెళ్తున్న 108 అంబులెన్స్ అదుపుతప్పి రోడ్డు పక్కన వెళ్తున్న అతనిని బలంగా ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జి.కొండూరు: ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో గురువారం రాత్రి నుంచి వర్షం లేకపోవడంతో బుడమేరులో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద శుక్రవారం సాయంత్రానికి 3.2అడుగుల మేర నీటి నిల్వ ఉండగా 2,600క్యూసెక్కుల నీటి ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి వెళ్తోంది. హెచ్. ముత్యాలంపాడు వద్ద చప్టా మీదుగా బుడమేరు వరద ప్రవాహం కొనసాగుతున్నందున పక్కనే ఉన్న శిథిల వంతెన మీదుగా ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలను ఈ వంతెన మీదుగా పోలీసులు అనుమతించడం లేదు. వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతున్నందున ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ, ప్రసాదాల తయారీ విభాగంలో కాంట్రాక్ట్ విధానంలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న బ్రాహ్మణులను పర్మినెంట్ చేయాలని ధార్మిక పరివార్–బ్రాహ్మణ సంక్షేమ వేదిక డిమాండ్ చేసింది. శుక్రవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ధార్మిక పరివార్ జాతీయ అధ్యక్షుడు వి.వి. రామారావు మాట్లాడుతూ 25 ఏళ్లుగా దేవుని కై ంకర్యాలలో ఎంతో కీలకమైన పోటులో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీ కార్మికులు దుర్భర జీవితాలను గడుపుతున్నారన్నారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయకపోవడం వల్ల ప్రయోజనాలు కోల్సోవాల్సి వస్తోందన్నారు. టీటీడీలోని ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను యాజమాన్యం రెగ్యులరైజ్ చేసిందని, కానీ పోటులో పనిచేస్తున్న బ్రాహ్మణుల విషయంలో చొరవ చూపడం లేదన్నారు. తక్షణమే యాజమాన్యం స్పందించాలన్నారు. -
ఐక్యతా మార్గంలో ‘బౌద్ధ ధర్మ యాత్ర’
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బుద్ధుని బోధనలు.. శాంతి, కరుణ, సోదరభావానికి ప్రతీకలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ గొప్ప సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, దక్షిణాసియా అంతటా సాంస్కృతిక, వారసత్వ పర్యాటకాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధా సర్క్యూట్ మోటారు సైకిల్ యాత్ర ప్రారంభమైందన్నారు. ఈ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు కలెక్టర్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం వద్ద కలెక్టర్ లక్ష్మీశ.. లార్డ్ బుద్ధా సర్క్యూట్ మోటారు సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. నేపాల్, భారత్, శ్రీలంకలోని ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలను కవర్ చేసే లక్ష్యంతో ఈ యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. దేశ త్రివిధ దళాల అధికారులు, యువ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ యాత్ర శుక్రవారం విజయవాడకు చేరుకుంది. కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి స్వాగతం పలికి, అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ రాహుల్ లక్ష్మణ్ పాటిల్, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, సాంస్కృతిక శాఖ అధికారి సుమన్, ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్ రహిత సమాజానికి పాటుపడదాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హెచ్ఐవీ/ఎయిడ్స్ రహిత సమాజం నెలకొల్పేందుకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి వ్యాధిని నివారించాలన్నారు. వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేసేలా సంస్థలు కృషి చేయాలన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం వైద్య ఆర్యోగ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఎయిడ్స్ వ్యాధి నివారణపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ, మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో హెచ్ఐవీ/ఎయిడ్స్ పరీక్షల కేంద్రాలతో పాటు ఐసీటీఆర్ మొబైల్ వాహనం ద్వారా ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తాన్ని, 17 బ్లడ్ బ్యాంకుల ద్వారా అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, పాత ప్రభుత్వ ఆస్పత్రులలో ఏఆర్టీ సెంటర్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు సేవలందించేందుకు 9 స్వచ్ఛంద సంస్థలు సేవలు అందిస్తున్నాయన్నారు. 2024–25 సంవత్సరంలో 1,300 హెచ్ఐవీ పాజిటివ్ కేసులను గుర్తించామనిని, వీరిలో 1,291 మందికి వైద్య సహాయం అందించడంతో పాటు 1,924 మందికి పెన్షన్లు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు.ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా.. ‘మీకు తెలుసా’ క్యాంపెయిన్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి, నివారణ మార్గాలు, పరీక్షలు చేయించుకోవడం, వైద్య సేవలు పొందడం, కండోమ్ వాడకం, వ్యాధి నివారణపై చర్చాగోష్టులు నిర్వహించడం, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవడం, టోల్ ఫ్రీ నంబర్ 1097 ద్వారా సహకారం పొందడం, వైరల్లోడ్ తగ్గించడం వంటి అంశాలను మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక ప్రచార పద్ధతుల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్లు, కరపత్రాలు, బుక్లెట్లను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో డీఎం అండ్హెచ్ఓ ఎం. సుహాసిని, అడిషనల్ డీఎంఅండ్హెచ్వో, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ బి.బాను నాయక్, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
వైభవంగా జైనుల శోభాయాత్ర
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నగరంలోని జైనులు నిర్వహించిన శోభాయాత్ర శుక్రవారం నేత్రపర్వంగా జరిగింది. మహావీర్ భగవానుని స్మరించుకుంటూ జైనులు శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ సంభవనాథ్ జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించారు. పర్యూషన్ ముగింపుతో పాటుగా అష్టసిద్ధిదాయక్ సిద్ధితప్ (36 రోజుల ఉపవాసదీక్షలు) ముగింపును పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన శోభాయాత్రలో గుర్రపు బగ్గీని పూలతో అలంకరించి అందులో మహావీరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగించారు. అంతేకాకుండా పర్యూషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని అధిక రోజులు ఉపవాసదీక్షలు పాటించిన కుటుంబాలను గుర్రపుబగ్గీలలో ఊరేగించారు. జైనులు సంకీర్తనలతో నత్యాలు చేస్తూ సందడి చేశారు. వన్టౌన్లోని జైనులు తమ ఇళ్ల ఎదుటకు వచ్చిన మహావీరునికి వారి సంప్రదాయ పద్ధతిలో నేలపై పీఠను ఉంచి, బియ్యంతో మహావీరుని మంత్రాన్ని రాస్తూ ఎదురు చల్లుతూ స్వాగతం పలికారు. ఉపవాస దీక్షలు సంస్కరిస్తాయి.. ఉపవాస దీక్షలు మానవులను సంస్కరిస్తాయని ప్రముఖ జైనగురువులు పన్యాస్ ప్రవర్ సమర్పణ ప్రభ్ విజయాజి, సాధ్వి రాజనమ్రతా శ్రిజీ అన్నారు. శోభాయాత్ర మార్వాడీ గుడి వీధిలోని జైన ఆలయం నుంచి బయలుదేరి శివాలయంవీధి, మెయిన్బజార్, హిందూ హైస్కూల్, సుబ్బరామయ్యవీధి, వట్టూరి వారి వీధి తదితర ప్రాంతాల మీదుగా పల్లెవీధిలోని అజిత్నాథ్ ప్రవచన్ వాటికా ప్రాంగణానికి చేరుకుంది. పలువురు జైనగురువులు పాల్గొన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బోడోతరియా, ఉపాధ్యక్షుడు అశోక్ జైన్, జయంతిలాల్ జైన్, కార్యదర్శి పన్నాలాల్ జైన్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
విశ్రాంత బ్యాంకు ఉద్యోగి డిజిటల్ అరెస్ట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విశ్రాంత బ్యాంకు ఉద్యోగిపై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు. డిజిటల్ అరెస్టు పేరుతో 72 గంటల పాటు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేశారు. వారి ఒత్తిళ్లకు భయపడిన ఆ రిటైర్డ్ ఉద్యోగి, తన పేరుపై ఉన్న వివిధ డిపాజిట్లలోని రూ.12 లక్షలను సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేసేందుకు సిద్ధమయ్యారు. డిపాజిట్లు క్యాన్సిల్ చేయడంపై అనుమానం వచ్చిన కేడీసీసీ బ్యాంకు మేనేజర్ ఎ. రమ్యకృష్ణ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబర్ క్రైమ్ సీఐ బి. గుణరామ్ వెంటనే రంగంలోకి దిగి సైబర్ నేరగాళ్ల ప్రయత్నాన్ని విఫలం చేశారు. పూర్తి వివరాలు ఇవి.. రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ చలసాని పూర్ణచంద్రరావు(74) మొగల్రాజపురం ప్రాంతంలో నివసిస్తుంటారు. ఆయనకు మూడు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల పేరుతో ఫోన్ చేసి ‘నీ అకౌంట్లో రూ.3కోట్లు పడ్డాయి.. నీ బ్యాంకు లావాదేవీలన్నీ మా వద్ద ఉన్నాయి, నీవు విదేశాలకు ఎవరెవరిని పంపుతున్నావో మాకంతా తెలుసు’ అంటూ బైదిరింపులకు పాల్పడ్డారు. అంతేకాకుండా అకౌంట్ సీజ్ చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్కు దిగారు. వారి వేధింపులు తీవ్రరూపం దాల్చడంతో భరించలేని వృద్ధుడు తన ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.12 లక్షలు వారికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బ్యాంక్ సిబ్బందికి అనుమానం.. విశ్రాంతి ఉద్యోగి కేడీసీసీ బ్యాంకు బ్రాంచికి వెళ్లి తన డిపాజిట్లు రూ.12 లక్షలు రద్దు చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇచ్చిన అకౌంట్కు బదిలీ చేయాలని బ్యాంకు సిబ్బందిని కోరారు. బ్యాంకు ఉద్యోగులకు అనుమానం రావడంతో ఎందుకు బదిలీ చేస్తున్నారని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పాటు, భయాందోళనతో ఉండటాన్ని గుర్తించారు. దీంతో నగదు బదిలీ చేయకుండా విశ్రాంత ఉద్యోగికి నచ్చజెప్పేందుకు యత్నించగా వినలేదు. సైబర్ పోలీసులకు సమాచారం.. విశ్రాంత ఉద్యోగి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్ ఎ. రమ్యకృష్ణ సైబర్ పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన సీఐబి. గుణరామ్, కానిస్టేబుల్ జి. ఉదయభాను బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారుని వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలోనే సైబర్ నేరగాళ్లు మళ్లీ ఫోన్ చేయడంతో సీఐ గుణరామ్ ఫోన్ తీసుకుని వారిని హెచ్చరించడంతో ఫోన్ కట్ చేశారు. అనంతరం పోలీసులకు విశ్రాంత ఉద్యోగి 72 గంటలుగా తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వివరించారు. పోలీసులు బ్యాంకు సిబ్బంది ధైర్యం చెప్పడంతో ఆందోళన నుంచి బయటపడ్డారు. కాగా నగదు బదిలీపై అనుమానించి వెంటనే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్ రమ్య కృష్ణ, ఇతర సిబ్బందిని సైబర్ పోలీసులు అభినందించారు. -
మందేసి.. చిందేసి..
కొండపల్లి ఖిల్లాపై కుర్రాళ్ల వీరంగంకొండపల్లి(ఇబ్రహీంపట్నం): శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన కొండపల్లి ఖిల్లా ప్రాశస్త్యం మసకబారుతోంది. ఎందరో రాజులకు పరిపాలన కేంద్రంగా నిలిచిన ఖిల్లా.. నేడు మందు బాబులకు అడ్డాగా మారింది. కార్ రేస్లతో పాటు మందు, విందు, చిందులతో యువకులు ఖిల్లాపై చెలరేగిపోతున్నారు. వినాయక చవితి పర్వదినం రోజు కొందరు యువకులు ఖిల్లాపై వీరంగం సృష్టించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యాటక శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఇటువంటి ఘటనల చోటుచేసుకోవడం దురదృష్టకరమని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడి మద్యం విక్రయాలే ఇటువంటి ఘటనలకు కారణమని చెబుతున్నారు. ఒక గ్రూప్గా వచ్చి.. వినాయక చవితి పండగ సెలవు రోజున సుమారు 50 మంది యువకులు కొండపల్లి ఖిల్లాపై టూర్ ప్రోగ్రాం నిర్ణయించుకుని ఘాట్ రోడ్డుకు చేరుకున్నారు. ఖిల్లాపైకి చేరుకునే క్రమంలో కొందరు కార్లపైకి ఎక్కి విన్యాసాలు చేశారు. మరికొందరు డోర్ల నుంచి బయటకు చూస్తూ హవాభావాలు ప్రదర్శించి ఘాట్ రోడ్డులో ప్రయాణించే ఇతరులను భయభ్రాంతులకు గురిచేశారు. కార్లతో పాటు బైక్లపై కూడా రేస్లను తలపించే విధంగా సైరన్ వేసి డ్రైవింగ్ విన్యాసాలు చేస్తూ కుటుంబ సభ్యులతో వచ్చిన వారిని భయకంపితులను చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇటువంటి ఘటనలతో ఖిల్లాకు పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ శూన్యం.. కొండపల్లి ఖిల్లా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఖిల్లాపై ఒక సూపర్ వైజర్తో పాటు గైడ్, టికెట్లు వసూలు, పారిశుద్ధ్య సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. వీరు టికెట్లు వసూలు తప్ప పర్యాటకుల కదలికలపై దృష్టి పెట్టకపోవడం ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఖిల్లాపైకి వివిధ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాల నుంచి సందర్శకులు వస్తారు. వీరితో పాటు ట్రెక్కింగ్ చేసేందుకు పాఠశాలలు, కళాశాల నుంచి విద్యార్థులు వెళ్తుంటారు. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, ఆర్డీఓ చైతన్య ఇతర అధికారులతో ట్రెక్కింగ్ చేశారు. మందుబాబుల హంగామాతో పర్యాటకులు, ట్రెక్కర్లు సైతం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. మందుబాబులపై అధికారులు దృష్టిసారించి అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలని సందర్శకులు కోరుతున్నారు. రేవ్ పార్టీ రేంజ్లో.. కొండపైకి చేరిన యువకులు ఖిల్లాపై బార్ అండ్ రెస్టారెంట్ మాదిరి టేబుల్స్ ఏర్పాటు చేసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఖిల్లాపై నానా హంగామా సృష్టించారు. రేవ్ పార్టీ కల్చర్ను గుర్తు చేస్తూ చిందులు వేశారు. మద్యం మత్తులో వారిలో వారు వాదులాడుకున్నారు. ఓ దశలో వారిలో వారు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో ఖిల్లాపై సరదాగా గడుపుదామని వచ్చిన సందర్శకులు వీరి హంగామా చూసి, హడావుడిగా కొండదిగి వెళ్లిపోయారు. -
వైఎస్సార్ కాలనీలో గుర్తు తెలియని మృతదేహం
భవానీపురం(విజయవాడపశ్చిమ): నగర శివారులో ఉన్న జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలనీలోని కొత్త బ్లాకుల వద్ద గల చెరువులో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 35–40 సంవత్సరాల వయసు కలిగి వంటిపై లైట్ బ్లూ కలర్ చొక్కా, బ్లాక్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మణికట్టుకు కాశీదారం ఉన్న గుర్తు తెలియని ఆ వ్యక్తి చెప్పులు, కండువా చెరువు గట్టుపై వదిలేసి చెరువులో దూకి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వివరాలు ఎవరికై నా తెలిస్తే టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. -
బషీర్బాగ్ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బషీర్బాగ్ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ భారాలపై మరో ఉద్యమానికి సిద్ధం కావాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విద్యుత్ పోరాటంలో ప్రభుత్వ దమనకాండకు బలైన అమరవీరుల సంస్మరణ సభ గురువారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్లో జరిగింది. విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్థన్రెడ్డి చిత్రపటాలకు నివాళులర్పించారు. సభలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ భారాలను, స్మార్ట్ మీటర్లను ఆపాలన్నారు. లేని పక్షంలో ప్రజల మద్దతుతో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. సీపీఐ జాతీయ కమిటీ సభ్యురాలు ఎ.వనజ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ రంగం మొత్తాన్ని కార్పొరేట్ల పరం చేస్తున్నారని, ప్రజలు తిరగబడాలని పిలుపిచ్చారు. సమావేశానికి సీపీఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్.బాబూరావు, సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఐ(ఎం.ఎల్) పార్టీ రాష్ట్ర నాయకుడు డి.హరినాథ్, సీపీఐ(ఎం.ఎల్) న్యూ డెమొక్రసీ నాయకులు పోలారి, ఎస్యూసీఐ నాయకుడు సుధీర్, ఎంసీపీఐ నాయకుడు ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడిన పోలీసులు
వరదలో కొట్టుకుపోయిన బైక్ పెనుగంచిప్రోలు: మునేరు వరదలో చిక్కుకున్న యువకులను స్థానికుల సహకారంతో పోలీసులు కాపాడిన ఘటన మండల కేంద్రం పెనుగంచిప్రోలులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన రేలా సుధాకర్, నందిగామ మండలం చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన మార్కాపురపు సురేష్ తిరుపతమ్మవారి దర్శనానికి పెనుగంచిప్రోలు వచ్చారు. అనంతరం మునేరు అవతల నుంచి కాజ్వేపై పెనుగంచిప్రోలు వైపు వస్తుండగా ప్రమాదవశాత్తూ బైక్తో సహా మునేరు వరద నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కాజ్వేకు పక్కన ఉన్న పైపును పట్టుకున్న వారిని రోప్ సాయంతో బయటకు తీశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నా యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారి బైక్ మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో యువకులు మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వరద ఎక్కువగా ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ అర్జున్ సూచించారు. -
ఉప్పొంగిన వాగులు..
మైలవరం నియోజకవర్గంలోని మైలవరం కొండవాగు, జి.కొండూరు మండల పరిధిలో పులివాగు, దొర్లింతాల వాగు, కప్పలవాగు, బుడమేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏనుగుగడ్డవాగు, ఉబ్బడివాగు పొంగి పొర్లుతుండడంతో కొటికలపూడి, చిలుకూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో జూపూడి చిన్నలంక, పెద్దలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల పరిధిలో వరిపైరు ముంపునకు గురైంది. రెడ్డిగూడెం మండల పరిధిలో కోతులవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఓబులాపురం, రంగాపురం గ్రామాల మధ్యన రహదారిపై భారీగా వరద ప్రవాహం చేరడంతో ఈ రెండు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఉద్ధృతంగా బుడమేరు.. ఏ.కొండూరు మండల పరిధిలోని కొండల్లో ప్రారంభమయ్యే బుడమేరు వాగులో కొండవాగు, కోతులవాగు, పులివాగుల వరద ప్రవాహం కలిసి గురువారం 3500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. బుడమేరుపై ఉన్న వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద 3.8మేర నీటి నిల్వ ఉంది. ఈ వరద ప్రవాహం బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలో కలుస్తోంది. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మధ్యన చప్టాపై బుడమేరు వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలను నిలిపివేశారు. -
వైద్య కళాశాలల్లో కొత్త విద్యార్థుల రాక
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి సీట్లు కేటాయించడంతో విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పొందిన వారు గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావును కలసి అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా 149 మంది విద్యార్థులు సిద్ధార్థ వైద్య కళాశాలలో సీట్లు పొందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ కళాశాలను ఎంచుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న మెరుగైన భవనాలు, అత్యాధునిక పరికరాలు, ఆస్పత్రిలో వసతులు, రోగులపై పనిచేసే అవకాశాలు, క్రీడా వసతులు, అత్యుత్తమ బోధన ఇందుకు కారణాలుగా తెలిపారు. వీటికితోడు ఇటీవల విడుదలైన ఐఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో తమ కళాశాల రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉండగా, దక్షిణ భారత దేశంలో 15వ స్థానం, ఆల్ ఇండియా స్థాయిలో 65వ ర్యాంకు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మెరిట్ విద్యార్థులు సిద్ధార్థను ఎంచుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో తమ కళాశాలలో వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు. మెరిట్ విద్యార్థులు సిద్ధార్థనే కోరుకున్నారు -
దివ్యాంగుల పింఛన్లలో కోతకు కూటమి కుట్ర
వైఎస్సార్ సీపీ దివ్యాంగుల రాష్ట్ర నాయకుడు కిరణ్రాజ్ భవానీపురం(విజయవాడపశ్చిమ): మూడు దశాబ్దాలకుపైగా 100–90 శాతం వైకల్యం ఉన్నవారికి రీ వెరిఫికేషన్లో 60–50 శాతం వైకల్యం ఎలా తగ్గుతుంది? ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన వైకల్యం వయసు పెరిగేకొద్దీ తగ్గుతుందా? ఇదంతా దివ్యాంగుల పింఛన్లలో కోత వేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బందెల కిరణ్రాజ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విభిన్న ప్రతిభావంతుల శాశ్వత సదరం సర్టిఫికెట్లలో వైకల్య శాతాన్ని కుదించి పింఛన్లు తొలగిస్తూ జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, ఉన్న పింఛన్లను యథావిథిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దొంగ సాఫ్ట్వేర్తో 40 శాతం కంటే తక్కువ వైకల్య శాతం ఉన్నట్లుగా చూపించి కూటమి ప్రభుత్వం మోసగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుణదల(విజయవాడ తూర్పు): సులువైన మార్గంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో డ్రగ్స్ను తరలిస్తున్న ఇద్దరు విద్యార్థులను విజయవాడ ఈగల్ టీమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం విశాఖపట్నం కు చెందిన శ్రీవాత్సవ్ ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అదే నగరానికి చెందిన బి.హవీలా అనే యువతి ఎంబీఏ పూర్తి చేసింది. గత కొన్నేళ్లుగా మంచి స్నేహితులుగా ఉంటున్న వీరిద్దరూ అనుకోని పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. డ్రగ్స్కు పూర్తిగా బానిసలైన వీరిద్దరూ సులువైన మార్గంలో డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. ఆ వచ్చిన డబ్బుతో డ్రగ్స్ను తీసుకుంటూ ఆ మత్తులో తిరుగుతున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ను విక్రయించడం ద్వారా అధికమొత్తంలో డబ్బులు వస్తాయని తెలిసిన వీరిద్దరూ బెంగళూరు వెళ్లి అక్కడ సుమారు లక్ష రూపాయల విలువ గల (ఎండీఎంఏ) డ్రగ్స్ను కొనుగోలు చేశారు. కొంత డ్రగ్ను వారు తీసుకుని ఆ మత్తులో తూగుతూ ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో బెంగళూరు నుంచి విశాఖపట్నానికి పయనమయ్యారు. గురువారం మధ్యాహ్నం తమకు అందిన పక్కా సమాచారంతో విజయవాడ ఈగల్ టీమ్ పోలీసులు విజయవాడ మహానాడు రోడ్డు జంక్షన్ వద్ద ఆ బస్సును నిలిపి తనిఖీ చేయగా వీరిద్దరి వద్ద 19 గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న కారణంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వారి వద్ద గల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గన్నవరం: స్థానిక చైన్నె–కోల్కత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ న్యాయవాది మృతి చెందిన ఘటనపై గన్నవరం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక గ్యాస్ కంపెనీ ఏరియాలో నివాసం ఉంటున్న న్యాయవాది ఎంవీవీ వెంకటేశ్వరరావు(52) విజయవాడ కోర్టులో పనిచేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి స్థానిక చార్మినార్ హోటల్ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ప్రమాదవశాత్తు వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
రైల్లో బంగారు ఆభరణాల దొంగ అరెస్టు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలులో బంగారు ఆభరణాలు కలిగిన బ్యాగును చోరీ చేసిన నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) డీఎస్పీ రత్నరాజు విజయవాడ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన తొరియవాలా కుజమా ఈ నెల 16న భగత్ కి కోటి నుంచి చైన్నెకి ఏ1 కోచ్లో ప్రయాణం చేస్తోంది. రైలు విజయవాడ స్టేషన్కు చేరుకున్నప్పుడు చూసుకోగా తన సీటు వద్ద ఉన్న బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగు కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో రైలు విజయవాడ సమీపిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాగును చోరీ చేసినట్లు ఆమె రైలు మదాద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన విజయవాడ జీఆర్పీ సిబ్బంది ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో రైల్వే స్టేషన్లోని సీసీ కెమెరాల ద్వారా చోరీకి పాల్పడింది గుంటూరుకు చెందిన పాతనేరస్తుడు అబ్దుల్ రహ్మాన్గా గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఏసీ కోచ్లనే టార్గెట్గా చేసుకుని ప్రయాణికుడిలా రైలులో ప్రయాణం చేస్తూ అదను చూసి లగేజీ బ్యాగులను చోరీ చేస్తుంటాడని డీఎస్పీ తెలిపారు. ఇప్పటికే విజయవాడ జీఆర్పీ పోలీసులు నాలుగు కేసుల్లో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అయినా తన నేర ప్రవృత్తిని మార్చుకోకుండా అదే తరహా నేరాలకు పాల్పడుతున్నాడన్నారు. నిందితుని నుంచి రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఇతర చోరీ కేసుల్లో రూ.2లక్షల విలువైన రెండు ల్యాప్టాప్లు, ఐ ఫోన్లు రికవరీ చేశారు. సమావేశంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు జె.వి రమణ, ఫతే ఆలీబేగ్, సిబ్బంది పాల్గొన్నారు. రూ.10 లక్షల చోరీ సొత్తు స్వాధీనం -
దంచింది.. ముంచింది!
ఎడతెరిపి లేని వానతో జిల్లా అతలాకుతలం సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తోంది. దీనికితోడు పాలేరు నుంచి 5,660 క్యూసెక్కులు, కీసర నుంచి 27,902 క్యూసెక్కులు, బుడమేరు నుంచి 3,500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో మధ్యాహ్నం 2గంటల సమయంలో ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 69 గేట్లు ఎత్తి 4,16,622 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు మధ్యాహ్నం 3గంటల నుంచి కొంత మేర వరద తగ్గడంతో, శుక్రవారం ఉదయానికి వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేడు కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా ఎగువ, దిగువ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 551 టీఎంసీల నీటిని విడుదల చేశారు. జూలై 20వ తేదీ నుంచి ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీటిని నిరంతరాయంగా సముద్రంలోకి విడుదల చేస్తూనే ఉన్నారు. విజయవాడను వదలని వాన.. బుధవారం వినాయక చవితి పండుగ రోజు ఉదయం బెజవాడలో భారీ వర్షం కురిసింది. నగరంలో వీధులన్నీ జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు పైన నీటితో వాగులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినాయక మండపాల వద్దకు నీరు చేరింది. గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఎగువన కురిసిన వర్షాలకు బుడమేరుకు 3,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే డైవర్షన్ చానల్ ద్వారా ఆ నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. కొంత మేర వరద పెరిగినా ఇబ్బంది ఏమి ఉందడని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. డైవర్షన్ కాలువ ద్వారా 10,500 క్యూసెక్కుల నీటిని మళ్లించే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో గడచిన 48 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువా రం ఉదయం 8.30 గంటల మధ్య 80.43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు.. జగ్గయ్యపేటలో 32.4, చందర్లపాడులో 24.4, పెనుగంచిప్రోలులో 23.4, తిరువూరులో 22.6, మైలవరంలో 18.4, గంపలగూడెంలో 18.2, కంచికచర్లలో 17.6, విజయవాడ ఈస్ట్లో 17.2, నార్త్లో 17.0, సెంట్రల్, వెస్ట్లో 16.4 చొప్పున, నందిగామ, జి కొండూరు మండలాల్లో 15.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం 8.30 వరకు.. జి. కొండూరులో 152.8, చందర్లపాడులో 123.0, కంచికచర్లలో 98.8, తిరువూరులో 98.4, వీరులపాడులో 96.2, ఏ కొండూరులో 88.4, ఇబ్రహీంపట్నంలో 88.4, గంపలగూడెంలో 87.6, విస్సన్నపేటలో 84.4, రెడ్డిగూడెంలో 78.4, మైలవరంలో 69.2, వత్సవాయిలో 67.8, పెనుగంచిప్రోలులో 67.4, నందిగామలో 64.4, జగ్గయ్యపేటలో 62.4, విజయవాడ రూరల్లో 56.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
గణనాథుడి విగ్రహాన్ని దర్శించుకున్న సీఎం
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురంలోని లేబర్కాలనీ గ్రౌండ్ లో డూండీ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి మహా గణపతి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, సమితి నిర్వాహకులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఘనంగా చవితి వేడుకలుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా.. అన్ని విఘ్నాలు తొలగి జిల్లా, రాష్ట్రం, దేశం సమగ్ర అభివృద్ధి చెందేలా ఆ ఆది దేవుని ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఏవో ఎ.శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.నిత్యాన్నదానానికి విరాళంభవానీపురం(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ప్రతి రోజూ జరిగే నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామానికి చెందిన చదలవాడ కోటేశ్వరరావు దంపతులు రూ.1,01,116 విరాళం అందజేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపైకి విచ్చేసిన వారు ఆలయ అధికారులను కలిసి విరాళాన్ని అందించారు. అనంతరం దాత కుటుంబానికి అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులతో వేదాశీర్వచనం తర్వాత అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.క్వాంటం వ్యాలీతో ఉపాధి అవకాశాలుకోనేరుసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ పేర్కొన్నారు. గురువారం వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ హ్యాకథాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్వాంటం వ్యాలీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి మాట్లాడుతూ ఇంటర్ క్వాంటం వ్యాలీ హ్యాకథాన్లో పదహారు టీమ్లు పాల్గొనడం శుభపరిణామం అన్నారు. కార్యక్రమానికి డాక్టర్ సల్మా సమన్వయకర్తగా వ్యవరించగా.. కంప్యూటర్ సైన్స్ డీన్ ఆచార్య వైకే సుందర కృష్ణ పాల్గొన్నారు.సాగర్ను సందర్శించిన 23 దేశాల ప్రతినిధులువిజయపురిసౌత్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ను బుధవారం 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు. నేపాల్, శ్రీలంక, రష్యా, వియత్నాం, జింబాబ్వే, నైజీరియా, తదితర 23 దేశాల ప్రతినిధులు ఈ నెల 15వ తేదీనుంచి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘నూతన ఆవిష్కరణలు–అభివృద్ధి’ అనే అంశంపై శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీతో శిక్షణ ముగియనుంది. దీనిలో భాగంగా టీం కో–ఆర్డినేటర్ డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ను సందర్శించారు. -
● అవ్వ స్థైర్యం ముందు వాన దిగదుడుపే
ఈ చిత్రం చూస్తుంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో భిక్షువర్షీయసి కవిత గుర్తొస్తుంది కదూ.. దారిపక్క చెట్టుకింద, ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతె.. మూలుగుతూ.. ముసురుతున్న ఈగలతో వేగలేక.. ముడతలు తేరిన దేహం.. రానున్నది చలికాలం.. దిక్కులేని దీనురాలు.. అంటూ ఆ కవితలో రోడ్డు పక్క బిచ్చగత్తె గురించి శ్రీశ్రీ హృదయవిదారకంగా రాశారు. ఈ చిత్రంలో ముసలమ్మ బిచ్చగత్తె కాదు.. ఆత్మాభిమానం ఉన్న ముసలమ్మ.. ఈ వయసులో కూడా ఎవరిపై ఆధారపడకుండా కష్టపడి సంపాదించి తన కష్టంతోనే బతికే మహిళ. వినాయకచవితి నాడు వర్షంలో తడుస్తూ కూడా రోడ్డుపై మునగదీసుకుని కూర్చుని పత్రి కొనే వారి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. విజయవాడ పటమట హైస్కూల్ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. – ఆటోనగర్(విజయవాడ తూర్పు) -
అప్రమత్తంగా ఉండాలి
జి.కొండూరు: ఎగువన వర్షాలు పడుతున్న నేపథ్యంలో బుడమేరుకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు వద్ద చప్టాపై ప్రవహిస్తున్న బుడమేరు వరద ఉద్ధృతిని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అనంతరం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించి ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు.నిరంతర పర్యవేక్షణ..వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. బుడమేరులో వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవలసి అవసరం లేదని చెప్పారు. ఒకవేళ వరద ఉద్ధృతి పెరిగి రెగ్యులేటర్ గేట్లు ఎత్తాల్సి వస్తే ముందుగానే సమాచారం అందించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వివరించారు. తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, బుడమేరు ఏఈ వెంకటేశ్ పాల్గొన్నారు.కంట్రోల్ రూం ఏర్పాటుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదితో పాటు బుడమేరు, మునేరులో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) నుంచి జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా వరద నీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీవాహక గ్రామాల ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 95 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉన్నందున పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు.ఏ సహాయం కావాలన్నా..91549 70454 నంబరుతో కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇందులో సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమాచారం కోసమైనా, సహాయానికైనా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేయొచ్చని సూచించారు. -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
మచిలీపట్నం అర్బన్: స్థానిక నోబుల్ కళాశాలలో డీఎస్సీ–2025 అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దీని కోసం కళాశాలలో మొత్తం 21 రూంలను ఏర్పాటు చేశారు. అబ్జర్వర్ ప్రసన్న కుమార్, కృష్ణా జిల్లా డీఈఓ పీవీజే రామారావు, ఎన్టీఆర్ జిల్లా డీఈఓ యూవీ సుబ్బారావు పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగింది. మూడు రూంలకు ఒక డీవైఈఓ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ప్రతి రూంలో ఒక ఎంఈఓ, హెచ్ఎం, డెప్యూటీ తహసీల్దార్, టెక్నికల్ అసిస్టెంట్, ఒక పీడీలను నియమించారు. మొత్తం 1,048 మందికి.. మొత్తం 1,048 మంది అర్హత పొందిన అభ్యర్థులను మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలో పరిశీలనకు విద్యాశాఖ కాల్ లెటర్లు జారీ చేసింది. కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులను ఒక్కో రూంలో 50 మంది చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యేలా విభజించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, డిసేబుల్డ్ వెల్ఫేర్ శాఖల అధికారులు, గురుకుల విద్యాలయాల ప్రతినిధులు బృందాలుగా పాల్గొని పరిశీలన చేస్తున్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు అవసరమైన జత పత్రాలను సమర్పించి ధ్రువీకరణ కోసం హాజరయ్యారు. వర్షాల నేపథ్యంలో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణాడీఈఓ రామారావు తెలిపారు. డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టులు.. నోటిఫికేషన్కు ఉమ్మడికృష్ణా నుంచి మొత్తం 19,953 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 6,543 మంది పురుషులు, 13,410 మంది మహిళలు ఉన్నా రు. 1,208 పోస్టులు భర్తీకి విద్యాశాఖ నోటిఫై చేసింది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 540, ఎస్జీటీ 545, పీఈటీలు 123, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో ఐదు (ఎస్జీటీ 2, స్కూల్ అసిస్టెంట్లు 3) పోస్టులు ఉన్నాయి. నిరాశలో అభ్యర్థులు.. డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అయితే మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ కాల్ లెటర్లు రాకపోవడంతో వారు సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మెరిట్, రోస్టర్, ఖాళీల ఆధారంగా మాత్రమే కాల్ లెటర్లు పంపించామని స్పష్టం చేశారు. రెండు, మూడు పోస్టులు సాధించిన అభ్యర్థులకు, ఒక్క పోస్టు మాత్ర మే, అదీ అభ్యర్థి దరఖాస్తులో చూపిన ప్రాధాన్యతాక్రమం ప్రకారమే అవకాశం ఉండటంతో చాలామందికి కాల్ లెటర్లు అందక నిరాశ చెంది వెనుదిరిగారు. -
కదిలించిన ఎడ్లంక కథనాలు
ఎడ్లంక(అవనిగడ్డ): వరదల వల్ల తీవ్రస్థాయిలో కోతకు గురైన ఎడ్లంక గ్రామ దుస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన పలు కథనాలు అధికార యంత్రాంగాన్ని కదిలించాయి. ‘‘ఎడ్లంకకు గుండెకోత’’, ఎడ్లంకకు వంతెన నిర్మించండి’’, ‘‘కన్నీటిలంక’’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ కఽథనాలకు స్పందించిన కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి కోతకు గురైన ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి తీసుకెళ్లారు. పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించనున్నట్టు అధికారులు చెప్పారు. గ్రామాన్ని సందర్శించిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ అధికారులు వరద వల్ల కోతకు గురైన ఎడ్లంక గ్రామాన్ని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ ఎ.విజయభాస్కర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం గురువారం సందర్శించింది. పడవలో గ్రామం చుట్టూ తిరిగి కోతకు గురైన ప్రాంతాన్ని వారు సందర్శించారు. వరద వల్ల నదిలోకి పడిపోయిన గృహాలు, చెట్లు, తిరుపతమ్మ ఆలయం శిథిలాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి గత పదేళ్ల నుంచి ఎడ్లంక కోతకు గురవుతున్న విధానాన్ని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మపుత్ర ప్రాంతంలో చేపట్టిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక – సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ విజయభాస్కర్ నదీ ప్రవాహం తరచూ తన దిశను మార్చుకుంటుందని, వరదల సమయంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుందని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సీఈ ఎ.విజయభాస్కర్ చెప్పారు. దీనివల్ల కొన్ని ప్రాంతాలు తీవ్ర కోతకు గురవుతూ ఉంటాయన్నారు. ఈ ప్రభావం వలనే ఎడ్లంక గ్రామం తీవ్రంగా కోతకు గురవుతోందని చెప్పారు. బ్రహ్మపుత్ర నది వద్ద ఇలాంటి పరిస్థితి ఉండగా, జియో ట్యూబ్, జియో బ్యాగ్, జియో గ్రాయిన్స్ ఏర్పాటు ద్వారా సమస్యను అరికట్టినట్టు తెలిపారు. ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకుంటే సత్ఫలితాలు ఇస్తాయన్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజయ్భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఎస్ఈ జి.శివకుమార్రెడ్డి, కృష్ణాడెల్టా సిస్టం సీఈ బి.రాంబాబు, ఇరిగేషన్ ఎస్ఈ ఆర్.మోహనరావు, ఈఈ రావెళ్ళ రవికిరణ్, గ్రామీణ యువజన వికాస సమితి చైర్మన్ మండలి వెంకట్రామ్(రాజా), సర్పంచ్ పాలెపు సామ్రాజ్యం, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఆర్సీ డీఈ సీహెచ్ గోపీనాఽథ్, ఏఈ కట్టా హరీష్తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గత రెండేళ్ల నుంచి తమ గ్రామం తీవ్ర కోతకు గురవుతోందని, ఎప్పుడు ఎవరి ఇల్లు పడిపోతుందో తెలియడం లేదని కొంతమంది బాధితులు విజయభాస్కర్కు వివరించారు. రక్షణ చర్యలు చేపట్టకపోతే గ్రామంలో ఉండలేమని, అవనిగడ్డలో స్థలాలు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు. ఇప్పటికే కొంతమంది నివేశన స్థలాల కోసం అర్జీలు సమర్పించారని, ఇంకా ఎవరన్నా ముందుకొస్తే వారి అర్జీలు తీసుకుని జిల్లా కలెక్టర్కు పంపిస్తామని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. అనంతరం స్థానిక ఎంపీపీ స్కూల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు డ్రోన్తో తీయించిన వీడియోలను వారు పరిశీలించారు. -
ఢిల్లీ సదస్సులో పాల్గొన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
గన్నవరంరూరల్: బోధన, అభ్యాస ప్రక్రియలో సృజనాత్మక ఆచరణలపై జాతీయ స్థాయి వర్క్షాప్కు గన్నవరం మండలం వీరపనేనిగూడెం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వై.యశోదలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఢిల్లీలో వారం రోజుల పాటు ఏపీ సమగ్ర శిక్షణ ఆధ్వర్యాన జరుగుతున్న జాతీయ విద్య ప్రణాళిక, పరిపాలన సంస్థ నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనే అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. విద్యార్థుల సామర్థ్య వికాసం కోసం సూచనలు, సలహాలు సదస్సులో అందించాల్సి ఉంది. స్వదేశీ జ్ఞానాన్ని అమలు చేయటం, సృజన పెంచటం వంటి అంశాలపై యశోదలక్ష్మి ప్రసంగాలకు ప్రశంసలు లభించాయి. -
నిమ్మకూరులో ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతల దాడి
సాక్షి, కృష్ణాజిల్లా: జిల్లాలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇంటింటికి బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సుపై టీడీపీ నేతలు దాడి చేశారు. మూడు రోజుల క్రితం నిమ్మకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ-నిమ్మకూరు మెట్రో సర్వీస్(333N) బస్సుపై దాడి చేశారు.తాము చెప్పిన చోట ఆపలేదని బస్సు అడ్డగించిన నిమ్మకూరు గ్రామ టీడీపీ మాజీ సర్పంచ్ జంపన వెంకటేశ్వరరావు, అనగన మురళి.. బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. రిక్వెస్ట్ స్టాప్లోనే బస్సు ఆపుతామని డ్రైవర్ చెప్పగా.. డ్రైవర్ను కిందకు లాగి దాడిచేసేందుకు యత్నించారు. టీడీపీ నేతల దౌర్జన్యాన్ని కండక్టర్ వీడియో తీశారు. దీంతో కండక్టర్పై కూడా టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. -
గణేష్ ఉత్సవాల్లో రాజకీయాలు మాట్లాడటం పాపం కాదా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: పండుగలను కూడా రాజకీయాలకు వాడుకోవటం చంద్రబాబుకు అలవాటంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. కొన్నిసార్లు హిందూత్వవాదిగా, కొన్నిసార్లు లౌకికవాదిగా రంగులు మార్చుతారని.. పీఠాలకు ఇచ్చిన భూములను కూడా లాక్కున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపాన్ని కూల్చేసి, తాను హిందూవాదిగా ప్రచారం చేసుకుంటున్నారని.. చంద్రబాబు హయాంలోనే తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగి భక్తులు చనిపోయారు.. అలాంటి చంద్రబాబు హిందూ ధర్మం గురించి మాట్లాడటం సిగ్గుచేటు’’ అంటూ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వర్ధిల్లాలని గట్టిగా నమ్మిన మనిషి వైఎస్ జగన్.. ఆయన వినాయకుని పూజ చేస్తే చంద్రబాబు భయపడి పోయారు. ఆగమేఘాల మీద విజయవాడలో వినాయకుని దర్శనానికి వెళ్లారు’’ అని విష్ణు పేర్కొన్నారు...అప్పటికప్పుడు షెడ్యూల్ పెట్టుకుని డూండీ వినాయకుని దర్శనానికి ఎందుకు వెళ్లారో చెప్పాలి. దేవుడి చెంత కూడా రాజకీయ ప్రసంగాలు చేసి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. అందునా విష ప్రచారం చేయటానికి నోరు ఎలా వచ్చింది?. జగన్ హయాంలో వినాయకుని మంటపాల అనుమతులకు సింగిల్ విండో సిస్టమ్ ని తెచ్చాం. మా విధానాలనే చంద్రబాబు అమలు చేస్తూ మాపైనే విమర్శలు చేస్తున్నారు. రూ.19 వేల కోట్ల కరెంటు ఛార్జీల మోత ప్రజల మీద వేసి, వినాయక పందిళ్లకు ఫ్రీగా కరెంటు ఇచ్చామంటున్నారు...అసలు ఎన్ని పందిళ్లకు కరెంటు ఇచ్చారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. చంద్రబాబు వెళ్లిన వినాయక మంటపం నిర్వాహకులు ప్రజల నుండి ఎంత విరాళాలు వసూలు చేశారో చెప్పాలి. 2019-24 మధ్య జగన్ హయాంలో కాణిపాకం ఆలయాన్ని పునర్నిర్మించారు. బంగారు రథాన్ని కూడా జగన్ హయాంలోనే చేశారు. చంద్రబాబు హయాంలో తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు జరిగాయి. భక్తులు మరణించారు...తిరుపతిలో జగన్ వకుళమాత ఆలయాన్ని నిర్మాణం చేశారు. హిందూమతం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. ఎన్నో పీఠాలకు జగన్ భూములు ఇస్తే చంద్రబాబు ఆ పీఠాల భూములను లాక్కున్నారు. విశాఖపట్నంలో ఊరు, పేరులేని కంపెనీలకు వేల ఎకారలను ఇస్తూ, శారదా పీఠానికి జగన్ ఇచ్చిన భూములను లాక్కున్నారు. ఇదేనా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం అంటే?’’ అంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. -
నూతన బార్ పాలసీకి స్పందన కరువు
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన బార్ పాలసీకి దరఖాస్తుదారుల నుంచి స్పందన కనపడటం లేదు. కొత్త పాలసీలో ఇచ్చిన నిబంధనలతో తాము వ్యాపారం చేయలేమని దరఖాస్తుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఒక్కొక్క బార్కు ఒక్క దరఖాస్తుదారుడు నాలుగు అప్లికేషన్లు వేయాలని నిబంధన పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రిటైల్ మద్యం షాపులు ఆయా ప్రాంతా ల్లో కేటాయించటంతో అక్కడ తక్కువ ధరకు మద్యం అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో నూతన బార్ పాలసీలో విధించిన నిబంధన ప్రకారం తమకేమీ ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో దరఖాస్తుదారులు వెనకడుగు వేస్తున్నారు. ఒక దరఖాస్తుదారుడు నాలుగు దరఖాస్తులు వేయాలనే నిబంధన, ప్రభుత్వం అమలు చేస్తున్న ట్యాక్స్ను రద్దు చేయాలని వారు కోరుతున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ఏమైనా చర్యలు తీసుకుంటేనే జిల్లాలోని బార్లకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని వ్యాపారస్తులు వాపోతున్నారు. మరో మూడు రోజులు పొడిగింపు.. దరఖాస్తులు ఎక్కువగా రాకపోవటంతో మంగళ వారంతో దరఖాస్తు చేసుకునే అవకాశం ముగిసి నందున, రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని మంగళవారం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. ఈ షాపులకు ఆగస్టు 30వ తేదీన కలెక్టరేట్లోని సమావేశపు హాలులో వచ్చిన దరఖాస్తులను బట్టి డ్రా తీయనున్నారు. అయితే ప్రభుత్వం తాము కోరుకుంటున్నట్లు పాలసీలో మార్పులు చేస్తేనే బార్లు ద్వారా వ్యాపారాలు చేయగలమని వ్యాపారస్తులు బాహాటంగా చెబుతున్నారు. నాలుగు దరఖాస్తులు ఉంటేనే.. కృష్ణా జిల్లాలో జనరల్ బార్లు 39, గీత కార్మికులకు కేటాయించినవి నాలుగు షాపులు ఉన్నాయి. వీటికి మంగళవారం వరకు 61 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రతి బార్కు నాలుగు దరఖాస్తులు చేస్తేనే డ్రా చేసేందుకు అర్హత ఉంటుంది. దీంతో దరఖాస్తుదారులు అంతగా ఆసక్తి చూపలేదు. ఎకై ్సజ్ అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో మరికొద్ది రోజులు పొడిగించారు. దరఖాస్తుల వివరాలు.. ప్రస్తుతం మచిలీపట్నం నగరంలోని గెజిట్ నంబరు –4, 6, గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని గెజిట్ నంబరు–15, వైఎస్సార్ తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో గెజిట్ పరిధి నంబరు–23, 27, 30, 34, 35 షాపులకు ఒక్క దరఖాస్తుదారుడే నాలుగు అప్లికేషన్లు వేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి. గంగాధరరావు ‘సాక్షి’కి తెలిపారు. గీత కార్మికులకు కేటాయించిన నాలుగు షాపులకు కేవలం మూడు దరఖాస్తులే వచ్చాయి. అయితే ఈ షాపులకు ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే గడువు ఉన్నందున వాటికి ఏ విధంగా స్పందన ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. -
కలకలంరేపిన యూరియా నిల్వలు
●ఆత్కూరులో ఓ షెడ్డులో నిల్వ ఉంచిన యూరియా కట్టలు ●చెవుటూరు పీఏసీఎస్ నుంచి టీడీపీ నాయకుడు తరలించినట్లు ఆరోపణలు ●ఇటీవల పీఏసీఎస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సదరు టీడీపీ నాయకుడు జి.కొండూరు: యూరియా కొరతతో ఒక్క కట్ట దొరికినా చాలు అన్నట్లు రైతులు సహకార సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలోని ఓ రేకుల షెడ్డులో నిల్వ ఉంచిన యూరియా కట్టలు మంగళవారం కలకలం రేపాయి. ఈ యూరియా కట్టలు ఇటీవల చెవుటూరు సహకార సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ నాయకుడికి చెందినవిగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సదరు టీడీపీ నాయకుడు సహకార సొసైటీ నుంచి యూరియా కట్టలను రైతుల పేరుతో పక్కదారి పట్టించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన సదరు టీడీపీ నాయ కుడు వెంటనే యూరియా కట్టలను రేకుల షెడ్డు నుంచి రైతుల ఇళ్లకు తరలించినట్లు తెలిసింది. ఆ వెంటనే కొందరు రైతులను చెవుటూరు సహకార సొసైటీకి పంపి ఆ యూరియా కట్టలు తమవేనని, అక్రమంగా నిల్వ ఉంచలేదని వారితో చెప్పించారు. ఈ ఘటనపై చెవుటూరు సహకార సొసైటీ అధికారులను ఆరా తీయగా సొసైటీకి జూలై నెలలో రెండు విడతలుగా 1,670 యూరియా కట్టలు, ఆగస్టు నెలలో 270 కట్టలు దిగుమతవగా 706 మంది రైతులకు ఈ బస్తాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. అయితే ఈ నెల 22వ తేదీన ఆత్కూరు గ్రామానికి చెందిన ఏడుగురు రైతుల పేరుతో 35 కట్టల యూరియా, 13 కట్టల డీఏపీని పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. అయితే ఈ ఏడుగురు రైతుల పేరుతో సదరు టీడీపీ నాయకుడే యూరియా కట్టలను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తగానే నిల్వ చేసిన రేకుల షెడ్డు నుంచి యూరియా కట్టలను తరలించడంతో పాటు రేకుల షెడ్డు సైతం సదరు టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుల అధీనంలో ఉండడంతో అక్రమ నిల్వ ఆరోపణలకు బలం చేకూర్చింది. అంతే కాకుండా ఆత్కూరు గ్రామంలో వేరువేరు ప్రాంతాల్లో యూరియా కట్టలను నిల్వ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై జి.కొండూరు మండల వ్యవసాయాధికారి కేసీహెచ్ సూరిబాబు, ఎస్ఐ సతీష్కుమార్ చెవుటూరు సహకార సొసైటీకి చేరుకొని విచారణ చేపట్టారు. -
చెరువులో నీరంతా నల్లబడిపోయింది..
వేల లీటర్ల కెమికల్ వ్యర్థాలను మా చెరువులో వదులుతున్నారు. ఈ నెల 20వ తేదీన రాత్రి వ్యర్థాలను వదిలారు. చెరువు నీళ్లు నల్లబడిపోయి చెడు వాసన వస్తోంది. ఈ నీటిని పొలాలకు వాడాలంటే పైరు పాడైపోతుందేమోనని భయమేస్తోంది. ఈ నీటిలో పని చేయడం వల్ల మాకూ వ్యాధులు వచ్చేలా ఉన్నాయి. – వి.లక్ష్మారెడ్డి, కురిటి చెరువు ఆయకట్టు రైతు, ఆత్కూరు గ్రామం కెమికల్ వ్యర్థాలను చెరువులో పోయడం దారుణం. ఈ నీటినే వరి నాట్లు వేయడానికి వాడు తున్నాం. చెరువు నుంచి చెడు వాసన వస్తోంది. చెరువులో నీరు తాగడం వల్ల పశువులు చూడి నిలవడంలేదు. అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టాలి. – గంగుల రమేష్, కురిటి చెరువు ఆయకట్టు రైతు, ఆత్కూరు గ్రామం ● -
రూ.లక్షలు గుంజి బిడ్డల శవాలు అప్పగించారు
●నోరీ ఆస్పత్రి వద్ద మృతుల బంధువుల ఆందోళన ●చికిత్స పొందుతూ ఆస్పత్రిలోఒకేరోజు ఇద్దరు చిన్నారులు మృతి సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): విజయవాడ సత్యనారాయణపురంలోని నోరీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఒకే రోజు ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. తమ వద్ద రూ.లక్షలు వసూలు చేసి చివరికి బిడ్డల మృతదేహా లను అప్పగించారంటూ బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 29 రోజుల శిశువు, 18 నెలల చిన్నారి వైద్యం వికటించి మంగళవారం మృతి చెందారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబాల సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. జలుబుతో ఆస్పత్రిలో చేర్పిస్తే.. నగరంలోని కేఎల్ రావునగర్కు చెందిన కట్టా శ్రీను, ప్రసన్న దంపతుల పెద్ద కుమార్తె 18 నెలల శాన్వితదేవికి జలుబు చేయడంతో ఈ నెల 19న నోరీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని, వైద్యానికి రోజుకు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు. శ్రీను, ప్రసన్న దంపుతులు భయపడి శాన్వితదేవిని ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు సోమవారం శ్రీను, ప్రసన్నను పిలిపించి చిన్నారి పరిస్థితి విషమిస్తోందని, చైన్నెలో స్పెషలిస్ట్ డాక్టర్లు, అత్యాధు నిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వారు రావాలంటే రూ.5 లక్షల ఖర్చవుతుందని, సిబ్బందికి స్టార్ హోట్ళ్లలో విడిది ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడితే చాలని తల్లిదండ్రులు ఒప్పకొని వారు అడిగిన మొత్తం చెల్లించారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చికిత్స ప్రారంభించామని చెప్పిన వైద్యులు, మంగళవారం తెల్లవారుజాము 5.30 గంటల సమయంలో చికిత్స చేస్తుండగా చిన్నారికి హార్ట్ ఎటాక్తో మృతి చెందిందని, బేడ్ షీట్లో చుట్టుకుని మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. దీంతో శాన్వితదేవి తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చికిత్స పేరుతో తమ వద్ద రూ.12 లక్షలు వసూలు చేసి చివరికి బిడ్డ మృతదేహాన్ని అప్పగించడంపై ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నోరీ సూర్యనారాయణ, డాక్టర్ శ్రీధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 29 రోజుల శిశువు మృతి భవానీపురానికి చెందిన భార్గవి నోరీ ఆస్పత్రిలో 29 రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు బరువు తక్కువగా ఉన్నాడని, ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్స అందించాలని అందుకు రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో తాము అంత భరించలేమని, ప్రభుత్వా ఆస్పత్రికి తీసుకెళ్తామని భార్గవి కుటుంబ సభ్యులు చెప్పారు. శిశువును కదిపితే మరింత ఇబ్బందులు తలెత్తుతాయని, డబ్బులు ఎంత ఉంటే అంత చెల్లించి, ఎమ్మెల్యే నుంచి ఎల్ఓసీ సిఫార్సు లెటర్ తెచ్చుకుంటే చికిత్స చేస్తామని ఆస్పత్రి నిర్వాహకులు సూచించారు. దీంతో చిన్నారి తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు రూ.2 లక్షలు చెల్లించి తమకు తెలిసిన టీడీపీ నాయకుడి సహకారంతో ఎమ్మెల్యే ద్వారా రూ.9.20 లక్షలకు ఎల్ఓసీ లెటర్ను అందజేశాడు. అనంతరం తమ బిడ్డను చూపించాలని అడిగితే, చికిత్స జరుగుతోందని ఇప్పుడు కుదర దని సిబ్బంది స్పష్టంచేశారు. దీంతో భార్గవి బంధువులు బలవంతంగా తలుపులు నెట్టుకుని లోపలికి వెళ్లగా అప్పుడే శిశువు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో వారు ఆందోళన చేశారు. బాధితులతో రాజీ యత్నాలు ఒకే రోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి యాజమాన్యం రాజీ ప్రయత్నాలు చేపట్టింది. ముందుగా శిశువు బంధువులకు రూ.5 లక్షలు చెల్లించి, ఎవరి కంటా పడకుండా పక్క ద్వారం నుంచి పంపించేసింది. అనంతరం చిన్నారి శాన్వితదేవి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారు చెల్లించిన డబ్బులకు అదనంగా ఇచ్చి రాజీ చేసుకున్నారని సమాచారం. ఫిర్యాదులు అందలేదు నోరీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకు న్నామని ఎస్ఎన్పురం ఇన్స్పెక్టర్ ఎస్.వి.వి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనల్లో బాధితుల నుంచి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. -
శతాధిక వృద్ధుల సత్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన శతాధిక వృద్ధులను సత్కరించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్ తెలిపారు. దుర్గాపురంలోని విజయ్ నర్సింగ్ కళాశాలలో మంగళవారం శతాధిక వృద్ధులకు సత్కారం కర పత్రాల ఆవిష్కరణ జరిగింది. హరికుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నూరు సంవత్సరాలు పూర్తిచేసుకున్న వృద్ధులను గుర్తించి, ఒకే వేదికపై ప్రముఖుల చేతుల మీదుగా సత్కరిస్తామని తెలిపారు. శతాధిక వృద్ధులు వచ్చే నెల 10వ తేదీలోపు వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో స్వయంగా లేదా 98481 11138, 93475 72766 ఫోన్ నంబర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ట్రస్టీలు తట్టి అర్జునరావు, అమరా ఉమా మహేశ్వరరావు, కె.మధుసూదనరావు, పి.లక్ష్మీ నరసింహారావు, వెంకటేష్ గోదావరి తదితరులు పాల్గొన్నారు. గూడూరు: మండల పరిధిలోని కంకటావ గ్రామంలో వీరంకి విఘ్నేశ్వరరావు(38) హత్య కేసులో నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విఘ్నేశ్వరరావును హత్యచేసి, మృతదేహాన్ని సంచిలో మూటగట్టి పడేసిన విషయం విదితమే. ఈ నెల 22న ఈ ఘటన వెలుగుచూసింది. గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విఘ్నేశ్వరరావు తండ్రి నిరంజన్రావును నిందితుడిగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితు డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కృష్ణామిల్క్ యూనియన్ పాలకవర్గానికి సంబంధించి వివిధ సమితులకు నిర్వహించిన ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెడన మండలం పెనుమల్లికి చెందిన అర్జా వెంకటనగేష్, వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన ఇంజం రామారావు, విస్సన్నపేట మండలం విస్సన్నపేటకు చెందిన నెక్కళపు వాణిశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి లంక గురునాథం ప్రకటించారు. మట్టి విగ్రహాల పంపిణీ వినాయక చవితి పండుగన పురస్కరించుకొని కృష్ణా మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంగణంలో సిబ్బందికి ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండగను శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా ప్రజలందరూ జరుపుకోవాలని సూచించారు. -
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
మైలవరం: బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మైలవరం మండలం వెల్వడం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రత్తిపాటి రమణ (55), స్వామి భార్యా భర్తలు. వెల్వడం గ్రామంలోని దళితవాడలో నివసిస్తున్నారు. వారికి సంతానం లేదు. కొంతకాలంగా రమణ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బావిలో దూకి ఆత్మహత్య చేసు కుంది. ఈ ఘటనపై ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక నాయకుల ఆగ్రహం. అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగర ప్రజల్లో బుడమేరు ముంపు భయాన్ని తొలగించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక నాయ కులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుడమేరు ముంపు బాధిత ప్రాంతాల్లోని వివిధ కాలనీలు, అపార్ట్మెంట్లు, వ్యాపార, వాణిజ్య అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలతో సింగ్ నగర్ షాదీఖానాలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ సీహెచ్.బాబూరావు, సీనియర్ రైతు నాయకుడు వై.కేశవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే బుడమేరు ముంపు నివారణ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు నివారణ చర్యలపై ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీలకు అతీతంగా బుడమేరు ముంపు నివారణ బాధితుల ఐక్యవేదిక ఏర్పడిందని ప్రకటించారు. ఆగస్టు 30వ తేదీన సీపీఎం తలపెట్టిన వరద నిరసన, సెప్టెంబర్ ఒకటో తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వినతిపత్రాలతో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వరద బాధితులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది అశోక్కుమార్, ఈఎస్ఐ రిటైర్డ్ డెప్యూటీ డైరెక్టర్ ఏసు, ప్రింటర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనారాయణ, షామియానా సంస్థల అసోసియేషన్ ప్రతినిధి ప్రసాద్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. ప్రసాద్, వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. -
జీవో ఇలా.. ఉద్దరిస్తామంటే నమ్మేదెలా?
అవనిగడ్డ: తెలుగు భాషను పరిరక్షించాల్సిన అధికార భాషా సంఘం పేరు కాస్తా ఇంగ్లిష్లో అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్గా మారడంపై భాషాభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార భాషా సంఘం పేరును మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీఓ ఎంఎస్ 25 జారీ చేసింది. తెలుగు మాట్లాడాలి, తెలుగులో చదవాలి, తెలుగులో జీఓలు జారీ చేయాలనే సంకల్పంతో అధికార భాషా సంఘం పనిచేస్తుంది. అధికార భాషా సంఘం ఆదేశాల మేరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగతా విడుదల చేసే జీఓలు తెలుగులోనే జారీ చేశారు. ఈ స్ఫూర్తితో కొంత మంది న్యాయమూర్తులు తమ తీర్పులను తెలుగులో ఇచ్చారు. అలాంటి తెలుగు భాషా సంఘం పేరు మార్పు జీఓ ఇంగ్లిష్లో జారీ చేయడం భాషాభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తెలుగు భాష పరిరక్షణ కోసం మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీఓ ఆర్డర్లో మండలి వెంకట కృష్ణారావు జీవిత విశేషాలు ఇంగ్లిషులోనే ఉన్నాయి. అధికార భాషా సంఘంను అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్గా మారుస్తూ వైఏటీఅండ్సీ (యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజమ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జీఓ వివాదాస్పదంగా మారింది. అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్గా అధికార భాషా సంఘం పేరు అధికార భాషా సంఘం పేరు మార్పు జీఓ ఇంగ్లిష్లోనే.. విస్మయం వ్యక్తం చేస్తున్న తెలుగు భాషాభిమానులు -
పరిటాల దాసాంజనేయ స్వామి ఆలయంలో చోరీ
10 కిలోల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు అపహరణ కంచికచర్ల: జాతీయ రహదారి పక్కన కొలువై ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి సమయంలో జొరబడి స్వామి వారి వెండి ఆభరణాలు, నగదును దొంగిలించారు. ఈ ఘటనపై మంగళవారం కేసు నమోదైంది. నందిగామ రూరల్ సర్కిల్ సీఐ చవాన్దేవ్ కథనం మేరకు.. కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో నేషనల్ హైవే పక్కన వేంచేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి విగ్రహం ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు ఆలయ ఉత్తర వైపు ఉన్న ద్వారం తలుపు గొళ్లెం పగులకొట్టి గర్భగుడిలోకి జొరపడ్డారు. గర్భగుడిలో ఉన్న రూ.10 లక్షల విలువుగల పది కిలోల వెండి ఆభరణాలు (స్వామి వారి మకరతోరణం, వెండి కవచం, ఓంకారపు వెండి తొడుగు, పాదాలు, శటారి, వెండి బిందె, చిన్న వెండి విగ్రహం), రూ.40 వేల నగదును దోచు కెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున ఆలయానికి వచ్చిన అర్చకులు తలుపుల గొళ్లెం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజయవాడ క్రైం ఏడీసీపీ రాజారావు, క్రైం ఏసీపీ వెంకటేశ్వర్లు, నందిగామ ఏసీపీ ఎ.బాలగంగాధర్ తిలక్, రూరల్ సీఐ చవాన్దేవ్, క్రైం ఎస్ఐ బి.రాజు, ఎస్ఐ పి.విశ్వనాథ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. త్వరలో నిందితులను పట్టుకుంటామని క్రైం ఏడీసీపీ రాజారావు తెలిపారు. -
వారితో ఆస్పత్రికి సంబంధం లేదు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో శిశువును అపహరించి, మరొకరికి అప్పగించేందుకు రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకున్నారని జరిగిన ప్రచారం మంగళవారం కలకలం రేపింది. శిశువును అప్పగిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన విషయంపై పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తల్లో ఉన్న పేర్లతో ఆస్పత్రిలో సిబ్బంది ఎవరైనా ఉన్నారా అనే కోణంలె సూప రింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు మంగళవారం విచారణ జరిపారు. వైద్యులు, నర్సింగ్ వైద్య సిబ్బంది, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందిలో కూడా ఫాతిమా పేరుతో ఎవరూ లేరని నిర్ధారణకు వచ్చారు. బయటి వ్యక్తులు మోసం చేసేందుకు అలా చెప్పి ఉంటారని భావిస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగంలో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పోలీసులు, ఆస్పత్రి అధికారులు మంగళవారం పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఈ నెల 18న అర్ధరాత్రి 12 నుంచి వేకువ జాము మూడు గంటల వరకూ ఆ విభాగంలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా అనే కోణంలో పరిశీలన జరిపారు. ఆ విభాగం బ్లాక్తో పాటు, బయట ఉన్న సీసీ కెమెరాల పుటేజీల్లో అనుమానాస్పదంగా ఉన్నట్లు కనిపించలేదు. దీంతో ఆ సమయంలో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు రికార్డు చేసి తీసుకున్నారు. ప్రసూతి విభాగం నుంచి బయటి వ్యక్తులు కానీ, ఆస్పత్రిలో తెలిసిన వ్యక్తులు కానీ శిశువును అక్రమంగా తరలించేందుకు అవకాశమే లేదని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువుకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ట్యాగ్లు వేస్తామని, ఎవరైనా ఆ శిశువును బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అలారం మోగుతుందని పేర్కొన్నారు. వార్డు డోర్ వద్ద, రిసెప్షన్, పోలీసు అవుట్ పోస్టు, ఆ బ్లాక్ నుంచి బయటకు వెళ్లే గేటు వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. డబ్బుల కోసం వైద్యురాలు అని చెప్పి నమ్మించి, మోసం చేసి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాస్పత్రిలోని మాతా శిశు విభాగం ఆ రోజు ఆస్పత్రి ప్రాంగణంలో ఎవరూ అనుమానాస్పదంగా తిరగలేదు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు, ఆస్పత్రి అధికారులు -
రేపు వైఎస్ జగన్ విజయవాడ పర్యటన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) విజయవాడలో పర్యటించనున్నారు. వినాయకచవితి సందర్భంగా నగరంలోని రాణీగారి తోటలో జరిగే గణనాథుని పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణీగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్, శాంపిల్ బిల్డింగ్) వద్ద జరగనున్న గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతారు.వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలని, సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని.. ఇంకా గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని వైఎస్ జగన్ అభిలషించారు. -
టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్ర.. భారీ మార్జిన్కు 'పచ్చ' స్కెచ్
సాక్షి, విజయవాడ: టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది. మద్యం బార్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. 840 బార్లలో 52 బార్లకే ఆఫ్లికేషన్లు దాఖలయ్యాయి. బార్ లైసెన్స్ల కోసం దరఖాస్తులు రాకుండా టీడీపీ లిక్కర్ సిండికేట్ అడ్డుకుంది. భారీగా మార్జిన్ పెంచుకునేందుకు టీడీపీ లిక్కర్ సిండికేట్ కుట్రకు తెరతీసింది.లిక్కర్ సిండికేట్కి సరెండర్ అయిన చంద్రబాబు సర్కార్.. 29వ తేదీ వరకు అప్లికేషన్లకు గడువు పెంచింది. మంత్రి వర్గం ఉపసంఘం ద్వారా మార్జిన్ పెంచుకోవడానికి లాబీయింగ్ చేశారు. ఇతరులెవ్వరిని బార్ల కోసం దరఖాస్తు చేసుకొనివ్వకుండా టీడీపీ సిండికేట్ బెదిరింపులకు దిగారు.ఇంత తక్కువగా దరఖాస్తులు దాఖలు కావడం వెనుక టీడీపీ మద్యం సిండికేట్ వ్యూహాత్మక ఎత్తుగడ దాగుంది. బార్ల దరఖాస్తుల కోసం అయితే ఏకంగా 2,300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ.. వీరిలో తమ సిండికేట్ కాని వారిని గుర్తించిన టీడీపీ నేతలు.. దరఖాస్తు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పార్టీ గూండాలు, పోలీసు అధికారులతో వారిని బెదిరిస్తున్నారు.ఇక సిండికేట్కు అనుకూలంగా బార్ విధానంలో ముందే మార్పులు చేస్తే తమ దోపిడీ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకే.. తగినంత మంది దరఖాస్తు చేయలేదు కాబట్టి బార్ల యజమానులకు లాభాల మార్జిన్ పెంచుతున్నాం అన్నట్లుగా ప్రజల్ని నమ్మించాలన్నది అసలు తంత్రం. అలాగే, 840 బార్లలో కనీసం 10 శాతం బార్లకు కూడా దరఖాస్తులు రాలేదు కాబట్టి సిండికేట్ దోపిడీకి వీలుగా ఇలా బార్ విధానంలో మార్పులు చేయాలన్నది పచ్చముఠా పన్నాగం. -
రూ. 11 కోట్లు నావే అయితే నా వేలి ముద్రలు ఉంటాయి కదా?: రాజ్ కేసిరెడ్డి
విజయవాడ: సిట్ సీజ్ చేశామని చెబుతున్న రూ. 11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. లిక్కర్ కేసులో తన పాత్ర ఏమీ లేదని ఈ సందర్భంగా పేర్నొన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 26వ తేదీ) రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది విజయవాడలోని ఏసీబీ కోర్టు. దీనిలో భాగంగా ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని కేసిరెడ్డి కోర్టుకు తెలిపారు. ‘నన్ను కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో నా పాత్ర ఏమీ లేదు. అన్యాయంగా నన్ను ఇరికించారు. నాపై ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేదు. ఆ రూ. 11 కోట్లు నావే అయితే నా వేలి ముద్రలు ఉంటాయి కదా?, అసలు రూ. 11 కోట్ల క్యాష్ అనేది ఒక్క వ్యక్తి దగ్గర ఉంటుందా?, నేను స్పై సినిమా తీశాను. సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెబుతున్నారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ నాకు తెలియదు. చాలా మంది పేర్లు తొలిసారిగా వింటున్నా’ అని కేసిరెడ్డి పేర్కొన్నారు. -
పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలపండి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో కొత్తగా ప్రతిపాదిస్తున్న పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ డి.కె.బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 72 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. 30 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను మార్పు కోసం ప్రతిపాదించా మన్నారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారీగా రాజకీయ పార్టీల తరఫున బూత్స్థాయి ఏజెంట్లను తప్పనిసరిగా నియమించాలన్నారు. సమావేశంలో డీఆర్వో చంద్రశేఖరరావు, ఆర్డీఓలు కె.స్వాతి, బాలసుబ్రహ్మణ్యం, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, పార్టీల ప్రతినిధులు మేకల సుబ్బన్న, బాలాజీ, కొడాలి శర్మ, అధికారులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే విజయం
●ఐసీఏఐ సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడుశ్రీధర్ ●ఉత్సాహంగా సీఏల స్నాతకోత్సవం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చార్ట్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సు పూర్తి చేసిన వారు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్ట్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల శ్రీధర్ చెప్పారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల కాన్వొకేషన్–2025 (స్నాతకోత్సవం) ఐసీఏఐ ఆధ్వర్యంలో సోమవారం ఉత్సాహపూరిత వాతావరణంలో మొగల్రాజపురంలోని ఫంక్షన్ హాలులో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వారధిగా సీఏలు.. ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు చరణ్జోత్సింగ్, ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారులకు మధ్య సీఏలు వారధిగా ఉంటూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ కంచమరెడ్డి నారాయణ మాట్లాడుతూ సీఏ చదువుతున్న విద్యార్థులకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలతో పాటుగా సీఏ రంగంలో వస్తున్న కొత్త చట్టాలు, పన్నుల విధానంపై అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐసీఏఐ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్ఐఆర్సీ) వైస్చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జయంత్, కార్యదర్శి మనీష్కుమార్ జైన్ పాల్గొన్నారు. -
సెల్ఫోన్లు, సిఫార్సు దర్శనాల కట్టడే లక్ష్యం
●దుర్గగుడి ఈవో శీనానాయక్ ●దసరా ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి ఆలయంలోనికి సెల్ఫోన్లతో ప్రవేశించకుండా నియంత్రించడమే కాకుండా సిఫార్సులతో దర్శనాలకు వచ్చే వారిని సైతం కట్టడి చేసి ఆలయ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. అందులో భాగంగా ఈ నెల 27 నుంచి ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్లను అనుమతించమని ప్రకటించారు. మహామండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో సోమవారం ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇంజినీరింగ్ విభాగం, వైదిక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అమ్మవారి ఆలయంలోకి సెల్ఫోన్లను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విధానం ఆలయ అధికారులు, సిబ్బంది నుంచే మొదలు పెట్టాలని సూచించారు. ఇతర దేవాలయాల్లో అమలవుతున్న సెల్ఫోన్ల నిషేధం దుర్గగుడిలో ఎందుకు అమలు కావడం లేదో అర్థం కాలేదని పేర్కొన్నారు. అదే విధంగా అమ్మవారి దర్శనానికి వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రముఖులతో పాటు పోలీసు, రెవెన్యూ, మీడియా నుంచి ఎక్కువగా సిఫార్సులు వస్తున్నాయని ఈవో పేర్కొన్నారు. ఇటువంటి దర్శనాలను కట్టడి చేసేందుకు స్కానింగ్ పాయింట్, టికెట్ పంచింగ్ పాయింట్లలో సిబ్బందిని తరచూ అంతర్గత బదిలీ చేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 15 నాటికి నూతన భవనాలు సిద్ధం దసరా ఉత్సవాలకు ముందుగానే సెప్టెంబర్ 15వ తేదీ నాటికి అన్నదానం, ప్రసాదాల పోటు భవనాలను వినియోగంలోకి తీసుకువస్తామని ఈవో పేర్కొన్నారు. ఆయా భవనాల్లో నూతన మిషనరీ, వంట సామగ్రిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారన్నారు. దసరాకు ఆల్లైన్లోనే ఆర్జిత సేవ టికెట్లు ఉత్సవాలలో అమ్మవారికి ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించిందన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఆయా సేవలను నిర్వహిస్తారని, సేవా టికెట్లు కేవలం ఆన్లైన్ ద్వారా దేవస్థాన వైబ్సైట్లో అందుబాటులో ఉంటాయనే విషయాన్ని భక్తులు గమనించాలన్నారు. ఉత్సవాలలో ఉదయం ఆరు గంటల నుంచి భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ జరుగుతుందని, ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్న ప్రసాదం, తిరిగి రాత్రి 9.30 గంటల వరకు పులిహోర, కదంబం అందజేస్తామన్నారు. సమీక్ష సమావేశంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 75 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 75 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉదయరాణి వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇచ్చిన ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఆదేశాలిచ్చారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా ఆస్తి, భూ వివాదాలకు సంబంధించి 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 5, కొట్లాటలపై 2, వివిధ మోసాలపై 1, మహిళల సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 1, ఇతర చిన్న నేరాలకు సంబంధించి 14 ఫిర్యాదులు అందాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. విజయవాడ కరెన్సీనగర్కు చెందిన ఎస్.కృష్ణ, అనంతలక్ష్మి దంపతులు అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూ.లక్ష, భవానీపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డుకు చెందిన యు. లక్ష్మీపార్వతి తన భర్త వెంకటేశ్వరరావు పేరిట నిత్యాన్నదానానికి రూ. 1,00,101 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
టెండర్ల వాయిదాల పర్వం
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025u8లో అయినవారి కోసమేనా చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా కలెక్టరేట్ వద్ద పింఛన్ల తొలగింపును నిరసిస్తూ దివ్యాంగులు సోమవారం ధర్నా చేశారు. పింఛన్ల తొలగింపుపై పునరాలోచించాలని కోరారు.అవనిగడ్డ: నాలుగు రోజులుగా చేస్తున్న దీక్షను ఎడ్లంక గ్రామస్తులు సోమవారం విరమించారు. శాశ్వత నివాసం కోసం గ్రామాన్ని వదిలి వేరే చోట ఇళ్ల స్థలాలు తీసుకునేందుకు ముందుకు వచ్చిన వారి నుంచి అర్జీలు తీసు కోవాలని కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. దీంతో గ్రామస్తులు దీక్ష విర మించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎడ్లంకకు చెందిన 81 మంది ఇళ్ల స్థలాల కోసం తహసీల్దార్ నాగమల్లేశ్వరరావుకు అర్జీలు అందజేశారు. దీనికి సంబంధించి మంగళవారం నుంచి అధికారులు ఎడ్లంక గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించనున్నారు. తమ సమస్యకు అధికారులు చొరవ చూపినందున తాత్కాలికంగా దీక్షను నిలిపివేశామని గ్రామస్తులు తెలిపారు. ఎడ్లంక గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ బాలాజీ, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ చూపాలనమాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ కోరారు. దీక్షలో వార్డు సభ్యుడు వనమాలి విజయ్కుమార్, కొల్లు గోపాలకృష్ణ, మైలా వీర్రాజు, పెమ్మాడి నాంచారయ్య, మైలా శ్రీను, నాంచారమ్మ, ఘంటసాల పార్వతి, శ్రీను తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. పెనమలూరు: చౌక దుకాణాల ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకుల పంపిణీకి స్మార్ట్ రేషన్కార్డులు ఉపయోగపడతాయని పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పోరంకిలో సోమవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్గౌర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మలతో కలిసి స్మార్ట్ రేషన్కార్డులు పంపిణీ చేశారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా కోటీ 46 లక్షల గృహాలకు 4.42 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్డులో ఉన్న క్యూ ఆర్కోడ్ను స్కాన్ చేస్తే కార్డు దారుడు తీసు కున్నసరుకుల వివరాలు ఫోన్కి వస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడెప్రసాద్, డీఎస్ఓ మోహన్బాబు, ఆర్డీవో బీఎస్ హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. అక్రమాలు అరికట్టేందుకు.. గుణదల(విజయవాడ తూర్పు): రింగ్ రోడ్డు సమీపంలోని వరలక్ష్మీనగర్లో సోమవారం స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక సాంకేతి కత అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు లావా దేవీలు ఎంత సులువుగా మారాయో.. నేరాలు అలాగే పెరిగాయి. సైబర్ నేరస్తులు దుబాయిలో కూర్చుని ఇక్కడి వారి బ్యాంక్ ఖాతాల్లో సొమ్మంతా దోచేస్తారు. ఈ నేరగాళ్లు ఏ రూపంలో వస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చిన్న పొరపాటుతో నిమిషాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలోని సొమ్మంతా ఆన్లైన్ దొంగలు ఊడ్చేస్తారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా వారు కోల్పోయిన మొత్తాన్ని సీజ్ చేయడం కూడా కుదరని పరిస్థితి ఉంటుంది. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మోసాలు నిత్య కృత్యంగా మారాయి. లోన్ యాప్ల వేధింపులు, సైబర్ మోసాలకు గురైన వారు విజయవాలోని సైబర్ పోలీస్ స్టేషన్కు క్యూ కడుతున్నారు. రూ.250 కోట్లు దోచేసిన బెజవాడ వాసి విజయవాడకు చెందిన వడ్డేవల్లి లలిత శరణ్కుమార్ను సైబర్ నేరం కేసులో హైదరాబాద్ పోలీసులు రెండు రోజుల కిందట అరెస్టు చేశారు. అతను కొందరు ఏజెంట్ల ద్వారా పలు బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్లు సృష్టించి వందలాది ఫేక్ క్రైమ్ లింక్స్తో సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. దుబాయ్లో ఉంటూ ఇక్కడ ఏజెంట్ల ద్వారా క్రైమ్ లింక్స్ను ఆపరేట్ చేస్తూ రెండు నెలల వ్యవధిలో దాదాపు రూ.250 కోట్లు దోచేశాడు. ఈ కేసులో శరణ్కుమార్ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా వందలాది క్రైమ్లింక్స్ ద్వారా ఆ మొత్తాన్ని పలు కరెంటు అకౌంట్స్లోకి బదిలీ చేసినట్లు గుర్తించారు. ఒక రోజు వాడిన అకౌంట్ మరో రోజు వాడకుండా ఏజెంట్లకు కమీషన్ల ఆశచూపి వేర్వేరు బ్యాంకుల్లో కరెంటు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ మోసాలకు పాల్పడ్డాడు. అతను విజయవాడలో కూడా నేరాలకు పాల్పడ్డాడా అని పోలీసులు పరిశీలిస్తున్నారు. 7 రూ.793.21 కోట్లతో పది పనులకు టెండరు నోటీసు ఇందులో మూడు సేవలు, ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు రూ.683.33 కోట్లతో రాజధానిలో సమ్మిళిత పనులు రూ.109.88 కోట్లతో విజయవాడ, గుంటూరులో 4 రోడ్ల నిర్మాణాలు గుంటూరు ఐఆర్ఆర్ పనికి ఆరు టెండర్లు దాఖలు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్కు మీనమేషాలు విజయవాడలో మూడు పనులకు మూడు వాయిదాలు ఏపీసీఆర్డీఏ టెండర్లలో తిరకాసులెన్నెన్నో... చిలకలపూడి(మచిలీపట్నం): ఈవీఎం గోదా మును కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమ వారం తనిఖీ చేశారు. ఎన్నికల విభాగం సూపరింటెండెండ్ శ్యామ్నాథ్ పాల్గొన్నారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఏపీ సీఆర్డీఏ ఆహ్వానించిన టెండర్లను నిర్ణీత సమయంలో తెరవకుండా మీనమేషాలు లెక్కిస్తూ తమకు అనుకూలురైన కాంట్రాక్టర్ల కోసం ఎదురుచూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్కు బిడ్లు దాఖలైనప్పటికీ సహేతుక కారణాలేవీ లేకుండానే ఫైనాన్షియల్ బిడ్ తెరవకుండా వాయిదా వేస్తుండగా, కొన్ని టెండర్లకు సంబంధించి సాంకేతిక బిడ్లను కూడా ఓపెన్ చేయడంలేదని టెండరుదారులు తీవ్రారోపణలు చేస్తున్నారు. తమకు అనుకూలురైన బడా కాంట్రాక్టర్లకు టెండర్లను కట్టబెట్టడానికే వాయిదాల వ్యవహారాలను ఏపీసీఆర్డీఏ ఉన్నతాధికారుల ద్వారా కూటమిలోని పెద్దలు కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను పక్కన పెట్టి అన్ని పనులను ఒకటిగా చేసి పెద్దమొత్తంతో టెండరు పిలిచి బడా కంపెనీలకు అప్పజెప్పి భారీస్థాయిలో పర్సంటేజీలు రాబట్టుకోవచ్చనే వ్యూహంలో భాగంగానే వాయిదాలపర్వమని స్పష్టమవుతోంది. అమరావతి రాజధానిలో, విజయవాడ, గుంటూరు నగరాల్లో పది పనులకు ఏపీసీఆర్డీఏ రూ.793.22 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. ఏడు నిర్మాణ, నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉండగా తక్కిన మూడు టెండర్లు సేవలకు సంబంధించినవి. నిర్మాణ, నిర్వహణ పనులకు గాను టెండరు డాక్యుమెంట్లను జూలై 11 నుంచి ఆగస్టు 8వ తేదీ లోగా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. నిర్దేశిత బిడ్లకు ఆగస్టు ఒకటి నుంచి 13వ తేదీలోగా టెండర్లు దాఖలు చేయడానికి గడువు విధించింది. గుంటూరు జేకేసీ కాలేజీ మార్గంలోని స్వర్ణభారతి నగర్ వద్ద నుంచి పెద్దపలకలూరు వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో ఫేజ్ కింద నిర్మాణానికి రూ.34,87,28,545 టెండరు పిలిచింది. ఆగస్టు ఏడో తేదీ టెండరు దాఖలుకు గడువిచ్చింది. టెక్ని కల్ బిడ్డు తెరవగా ఆరు టెండర్లు దాఖలైనట్లు గుర్తించారు. టెండరు నిబంధనల ప్రకారం 8వ తేదీ ఫైనాన్షియల్ బిడ్ను తెరవాలి. ఇప్పటివరకు ఆ పనిచేయలేదు. కారణాలేంటని పలుసార్లు సంబంధిత అధికారులను సంప్రదించినా సమాచారం ఇవ్వడంలేదని టెండరుదారులు ‘సాక్షి’కి తెలిపారు. విజయవాడ నగరంలోని బల్లెంవారివీధి జంక్షన్ నుంచి నిడమానూరు మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు (హెచ్టీ లైన్ రోడ్) బీటీ హాట్ మిక్స్తో రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్ తదితర పనులకు రూ.26,51,89,656 టెండరు ఆహ్వానించింది. అదేవిధంగా మహానాడు రోడ్డు నుంచి బల్లెంవారివీధి నుంచి పోరంకి, నిడమానూరు రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్, ఇతర పనులకు రూ.25,52,45,567 మరో టెండర్ను పిలిచింది. బందరు రోడ్డు నుంచి హెచ్టీ లైన్ జంక్షన్ వరకు బల్లెంవారివీధి రోడ్డు విస్తరణ, సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనుల నిమిత్తం 22,96,21,066 టెండరు ఆహ్వానించింది. పై మూడు పనులకు సంబంధించి ఆగస్టు 11వ తేదీ టెక్నికల్ బిడ్ తెరవనున్నట్లు టెండరులో పేర్కొన్నప్పటికీ ఆ మేరకు చేయలేదు. ఏ కారణం చెప్పకుండానే 19వ తేదీ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేస్తున్నట్లు చెప్పిన అధికారులు అలా చేయకపోగా మరోసారి ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడం పరిశీలనాంశం. మూడు పనులకు సంబంధించిన టెక్నికల్ బిడ్ను ఓపెన్ చేయకుండా మూడు పర్యాయాలు ఎందుకు వాయిదా వేశార నేది అంతుబట్టని అంశంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయకపోవడం, విజయవాడలోని మూడు పనుల టెండర్లను ఇలా వాయిదాలు వేయడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు. బడా గుత్తేదారులకు పనులు అప్పగించాలనే వ్యూహంతో ఉన్నప్పుడు ఏపీ సీఆర్డీఏ టెండర్లు పిలవడం ఎందుకని నిలదీస్తుండటం చర్చనీయాంశంగా మారింది. -
ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒక్క ఫొటో వెయ్యి పదాలకు సమానమని, ఫొటో లేని వార్తా పత్రిక వెలుగు లేని దివిటీ లాంటిదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్స వాన్ని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం సోమ వారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణి, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ పి.ప్రసాద్ సేకరించిన పురాతన, అరుదైన కెమెరాలను తిలకించారు. అనంతరం లక్ష్మీశ, చక్రపాణి ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసి సత్కరించారు. మూడు కేటగిరిల్లో జరిగిన పోటీల్లో ఒక్కో కేటగిరి కింద విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.4 వేల చొప్పున అందజేశారు. బెస్ట్ న్యూస్ పిక్చర్లో ఎన్.కిశోర్ (సాక్షి), కె.చక్రపాణి (సాక్షి) ప్రోత్సాహక బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ జి.అనిత, సీనియర్ ఫొటో జర్నలిస్టు టి.శ్రీనివాసరెడ్డి, విజయవాడ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రవికుమార్, ఆడియో వీడియో విజువల్ సూపర్వైజర్ వి.వి.ప్రసాద్, ఐ అండ్ పీఆర్ అధికారి కె.రవి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
అర్జీలు పునరావృతమైతే అధికారులదే బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాసమస్యల పరిష్కారంలో స్పష్టత తప్పనిసరి అని, ఆర్జీలు పునరావృతమైతే జిల్లా అధికారులదే బాధ్యతని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అఽన్నారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీ ఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపడంలో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అర్జీలపై స్పష్టత ఉన్నప్పుడే పరిష్కారం అవుతాయని స్పష్టంచేవారు. సొసైటీలో అక్రమాలపై విచారణ చేపట్టాలి ‘ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి మెట్రో పాలిటన్ ఫీల్డ్ లేబర్ కో ఆపరేటివ్ సొసైటీని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్సీల జీవనం కోసం కేటాయించిన భూమి అన్యాక్రాంతమైంది. సొసైటీలోని సభ్యుల మధ్య వివాదాలు నెలకొని ఘర్షణలు జరుగుతున్నాయి. అధికారులు ఒక వర్గానికి మద్దతుగా నిలుస్తూ నిబంధనలు పాటించడం లేదు. ఎన్నికలు కూడా జరపడం లేదు. సభ్యుల సంఖ్య 53 కాగా అక్రమంగా మరికొంత మందిని చేర్చారు. వీటిపై విచారణ జరిపి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలి’ అని కొటికలపూడి రైతులు అర్జీ ఇచ్చారు. మొత్తం 187 అర్జీలు పీజీఆర్ఎస్లో రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 53 అర్జీలు అందాయి. శాఖల వారీగా పోలీస్ 30, ఎంఏయూడీ 22, విద్య 18, పీఆర్ 10, హెల్త్ 9, డీఆర్డీఏ 7, ఏపీ సీపీడీసీఎల్ 5, పౌరసరఫరాలు 5, విభిన్న ప్రతిభావంతులు 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 4, సర్వే 4, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 4, ఇరిగేషన్ 2, గిరిజన సంక్షేమం 2, వ్యవసాయం 2, సాంకేతిక విద్య, ఆర్డబ్ల్యూఎస్, బ్యాంకు, ఐడీసీఎస్, దేవదాయ, సోషల్ వెల్ఫేర్ విభాగాలకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున అందాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.చైతన్య, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె. పోసిబాబు, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
విజయవాడలో ఇళ్ల కూల్చివేతకు యత్నం.. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1995లో ఒక వ్యక్తి నుంచి 42 మంది ఫ్లాట్స్ కొనుగోలు చేశారు. 2000 సంవత్సరంలో ఇళ్లు నిర్మించుకుని ఆ కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఆ స్థలం తనదేనంటూ కొందరు వ్యక్తులు కోర్టుకెళ్లారు. మరోవైపు, తమ అసోసియేన్కే స్థలం చెందుతుందంటూ వాదనలు వినిపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని 42 కుటుంబాల వారు కోరుతున్నారు.ఇవాళ ఉదయం కోర్టు ఆర్డర్తో పోలీసుల సాయంతో ఇళ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఫ్లాట్ ఓనర్స్, రాజకీయ పార్టీల నేతలు ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్నారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఎలా కూల్చుతారంటూ బాధితులు అండగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధర్నాలో పాల్గొన్నారు.పేదల ఇళ్లు కూల్చడమేనా పీ-4 అంటే..వెల్లంపల్లి మాట్లాడుతూ.. 42 మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చామని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?. మునిసిపల్ ప్లాన్ ఉంది.. బ్యాంక్ లోన్ ఉంది.. అన్ని అనుమతులతో నిర్మాణం జరిగింది. పోలీసులు, ప్రభుత్వాలు పేదలను కాపాడాలి.. కానీ వారి పొట్ట కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం.. అధికారంంలోకి వచ్చి 14 నెలలు అయినా ఒక ఇల్లు కట్టలేదు.. పేద వారి ఇల్లు కూల్చడమేనా పీ-4 అంటే.. మహిళలను జుట్టులు పట్టుకొని లాగి పడేస్తున్నారు.భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి సర్కార్ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అవినాష్ మాట్లాడుతూ.. పేదలను భయపెట్టి ఇళ్ల నుండి బయటకు లాగి ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. ప్రైవేట్ భూమి విషయంలో వందలాది మంది పోలీసులు వచ్చారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే పోలీసులు పట్టించుకోరు. భూ కబ్జాలు చేసే వారి పక్షాన కూటమి ప్రభుత్వం ఉంది. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ ఉంది.కోర్టుని నమ్మించి..వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ మాట్లాడుతూ.. కోర్టుని నమ్మించి తమ భూమి అంటూ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పేదల భూములు లాక్కుని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది. టైం ఇవ్వాలని అడిగిన పట్టించుకోకుండా కూల్చడం ప్రజాస్వామ్య విరుద్ధం. జనవాణిలో మా భూములు కాపాడాలని అర్జీ ఇచ్చారు. ఇళ్లు కుల్చడానికి వచ్చింది జనసేన లీగల్ సెల్నే.. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు స్వందించడం లేదో చెప్పాలి. -
‘కృష్ణా’కు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాజీ ఎమ్మెల్యే, కాపునేత వంగవీటి మోహనరంగారావు పేరును కృష్ణాజిల్లాకు పెట్టాలని వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడపా ప్రతాప్ చంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా కార్మిక కర్షకవర్గ నాయకులుగా వంగవీటి మోహన్రంగాను నేటికీ ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారన్నారు. అటువంటి మహనీయుడి పేరు చిరస్థాయిగా నిలవాలంటే కృష్ణా జిల్లాకు, లేదా విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన నూతన జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరును పెట్టాలన్నారు. ఇప్పటికే ఈ విషయంపై కృష్ణా జిల్లా కలెక్టర్తో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్కు వినతి పత్రాలు ఇచ్చామన్నారు. వంగవీటి మోహనరంగా పేరు పెట్టే విషయమై మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలుస్తామన్నారు. ఈ డిమాండ్పై అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయన్నారు. రంగా పేరు పెట్టే విషయంలో ప్రభుత్వం సాను కూలంగా లేని పక్షంలో ఉద్యమ రూపంలో ముందుకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో కాపు నాయకులు ముత్యాల శ్రీనివాస చక్రవర్తి, జిగడం శ్రీనివాసరావు, చెన్నకేశవుల సత్యం, కె.నరేంద్ర, ద్వారపురెడ్డి వెంకటేశ్వరరావు, గేదెల గణేష్, బూరా రాజు, జ్ఞాన ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహన్రంగా సోషల్ ఆర్గనైజేషన్ -
5న ఏకపాత్రాభినయ పోటీలు
విజయవాడ కల్చరల్: శ్రీరామకృష్ణా నాట్యమండలి(సాంస్కృతిక సేవా సంఘం) వార్షికోత్సవం సందర్భంగా బాల బాలికల్లోని ప్రతిభను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి ఏకపాత్రాభినయ పోటీలను వచ్చేనెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ శ్రావణ్కుమార్ తెలిపారు. గాంధీనగర్లోని సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కౌతా పూర్ణానందం కళావేదిక వేదికగా జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. పౌరాణికం, సాంఘికం, చారిత్రక అంశాలను పోటీదార్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. సంబంధిత పోస్టర్ను అతిథులు ఆవిష్కరించారు. సమావేశంలో రంగస్థల ప్రముఖులు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహనరావు, చింతా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రవేశ రుసుం ఏమీ లేదని, పేర్ల నమోదుకు చివరి తేదీ వచ్చేనెల 2వ తేదీ అని చెప్పారు. జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి రూ.2,000, ద్వితీయ రూ. 1,500, తృతీయం రూ. 1000, సీనియర్ విభాగంలో మొదటి బహుమతి రూ. 5,116, ద్వితీయ రూ. 3,116, తృతీయ రూ. 2,116 నగదు అందజేస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు 85006 42543, 83747 60657లో సంప్రదించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఫీజు బోర్డులు ఏర్పాటు చేయండిలబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, లేబొరేటరీలు, స్కానింగ్ సెంటర్లలో వారు వసూలు చేసే ఫీజుల వివరాలతో కూడిన పట్టికలు రిసెప్షన్ వద్ద కనిపించేలా బోర్డులు పెట్టాలని ఎన్టీఆర్ డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ధరల పట్టికను ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని, అదే విధంగా జిల్లాలో ఉన్న ప్రతి స్కానింగ్ సెంటర్ పీసీ–పీఎన్డీటీ యాక్ట్ 1994 ప్రకారం స్కాన్ చేసే రూం బయట, లోపల ఐఈసీ మెటీరియల్ తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని తెలిపే బోర్డును తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఆస్పత్రి తప్పనిసరిగా ఫైర్ ఎన్ఓసీ కలిగి ఉండాలని, ఆ సర్టిఫికెట్ గడువు తేదీ ముగిస్తే వెంటనే తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు. అవసరం లేని ఎక్స్రే, స్కానింగ్లను నివారించాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): అవసరం లేని ఎక్స్రేలను నివారించాలని, ఇమేజింగ్ను న్యాయంగా ఉపయోగించాలని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్–ఏడీఎంఈ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఆదివారం ఆర్థోపెడిక్ జోనల్ సీఎంఈ(కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) జరిగింది. ‘ఇమేజింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సును వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుతో కలిసి జీజీహెచ్ సూపరింటెండెంట్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎన్ఆర్ఐ, పిన్నమనేని సిద్ధార్థ, ఆశ్రమ్, నిమ్రా, సిద్ధార్థ వైద్య కళాశాలల నుంచి 150 మంది ఆర్థోపెడిక్ పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో 12 శాసీ్త్రయ అంశాలపై నిపుణులు విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా బోన్ ట్యూమర్లు, స్పైన్ సమస్యలను గుర్తించడంపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ఎ శ్రీనివాసరావు, పరిశీలకుడిగా ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ ఎస్. వినయ్కుమార్ వ్యవహరించారు. ముగిసిన క్యారమ్ ర్యాంకింగ్ పోటీలు మధురానగర్(విజయవాడసెంట్రల్): చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్ టెలికాం రిక్రియేషన్ క్లబ్లో ఎస్. అంజారావు మెమోరియల్ ఎన్టీఆర్ జిల్లా ప్రథమ క్యారమ్ ర్యాంకింగ్(పురుషులు, సీ్త్రల) పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీలలో పురుషుల విభాగంలో వరుసగా వి. శ్రీనివాసరావు, ఎస్. శ్రీను బాబు, వై. మురళి, కె. సుజన్ కుమార్, ఎస్కే హుస్సేన్, సీహెచ్ శ్యాంప్రకాష్ ర్యాంకులు సాధించారు. అలాగే మహిళల విభాగంలో వరుసగా అమృత కుమారి, వి. కూర్మిళ, టి. తనూజ, రామ్కుమారి, ఎన్. నిర్మల, స్వాతి ర్యాంకింగ్ సాధించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. -
అంతర్జాతీయ కరాటే పోటీల్లో సత్తా
పెనమలూరు: అంతర్జాతీయ స్థాయి కుంగ్ఫూ కరాటే పోటీలో విద్యార్థులు ప్రతిభ చాటి పతకాలు సాధించారు. యనమలకుదురుకు చెందిన కరాటే డో ఫెడరేషన్ ఏపీ చీఫ్ ఎన్.దుర్గారావు ఆదివారం వివరాలు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో వివిధ దేశాల నుంచి దాదాపు రెండు వేల మంది పాల్గొన్నారన్నారు. తమ కరాటే స్కూల్కు చెందిన ఆరుగురు విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారని తెలిపారు. ఏడేళ్ల పసుపు బెల్ట్ కటా విభాగంలో జి.నినా బంగారు పతకం, వెపన్ ఈవెంట్లో కాంస్యం, ఎస్.అనన్య కటా పసుపు బెల్ట్లో బంగారు, వెపన్ కటా విభాగంలో వెండి పతకాలు సాధించారని తెలిపారు. 8ఏళ్ల ఆరెంజ్ బెల్ట్లో డి.చరణి బంగారు పతకం సాధించగా, గ్రీన్ బెల్ట్ కటా విభాగంలో డి.దక్ష గ్రీన్ బెల్ట్లో బంగారు పతకం, వెపన్ కటా విభాగంలో వెండి పతకం, 12ఏళ్ల విభాగంలో ఎ.శ్రీహర్ష ఆరెంజ్ బెల్ట్ కటా విభాగంలో బంగారు పతకం, 14ఏళ్ల విభాగంలో ఎ.వెంకట్ సురేష్ ఆరెంజ్ బెల్ట్ కటా విభాగంలో బంగారు పతకం గెలిచాడని వివరించారు. -
మధుమేహుల జీవితాల్లో కొత్త వెలుగులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహ చికిత్సల్లో అందుబాటులోకి వచ్చిన అధునాతన విధానాలు, వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని న్యూ ఢిల్లీకి చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ అమర్పాల్ సింగ్ అన్నారు. యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండోకాన్ 2025 సదస్సు విజయవాడలోని ఓ హోటల్లో ఆదివారం జరిగింది.సదస్సును డాక్టర్ అమర్పాల్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధుమేహ చికిత్సలో ఆధునిక విధానాలను వివరించారు. మధుమేహ నియంత్రణలో గట్ మేనేజ్మెంట్, ఆధునిక చికిత్సలతో డీ–యాక్సలరేషన్ మందుల వినియోగం తగ్గించడం, ఏఐ టెక్నాలజీ వినియోగం, టైప్–1 డయాబెటిస్ భవిష్యత్ చికిత్సలు, మధుమేహం ముప్పును వాయిదా వేయడం, కిడ్నీ వ్యాధులను తిప్పికొట్టడంపై వివరించారు. జీఐపీఆర్ ట్రీట్మెంట్తో రక్తకణాల వ్యవస్థను సంరక్షించడం, ఆస్టియో పోరోసిస్ నిర్వహణ, ఫాటీ లివర్ నిర్ధారణ–చికిత్సలు, లాంగివిటీ ఇన్ డయాబెటిస్, అడల్ట్ వ్యాక్సినేషన్, క్యాన్సర్ మందుల క్యాన్సర్ మందుల కారణంగా సంతాన లేమి వంటి అనేక కీలక అంశాలను డాక్టర్ అమర్పాల్తో పాటు పలువురు నిపుణులు విశ్లేషణాత్మకంగా వివరించారు. నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ.. శరీర బరువును అదుపులో ఉంచుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవడంతో పాటు గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ అమర్పాల్సింగ్కు గోల్డ్మెడల్ను ప్రదానం చేశారు. డాక్టర్ హిమన ఐశ్వర్య, అమూల్య తదితరులు పాల్గొన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ అమర్పాల్ సింగ్ -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. గుంటూరు పాతపేటకు చెందిన కనూరు రత్నాకరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రత్నాకరరావు తమ కుటుంబ సభ్యుల పేరిట అన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. ఉచిత ప్రసాద వితరణకు రూ. లక్ష విరాళం ఇంద్రకీలాద్రిపై ఉచిత ప్రసాద వితరణకు హైదరాబాద్కు చెందిన కత్తుంగ వీర వెంకట సత్యనారాయణ, అంజనాదేవిలు తమ కుమారుడు ఆర్యన్ పేరిట రూ. 1,01,116ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ఏఈవో ఎన్.రమేష్బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను ఇచ్చారు. -
అభివృద్ధి పనుల్లో కొండంత నిర్లక్ష్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కొండంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. అభివృద్ధి పనులను తరచూ పరిశీలిస్తున్న దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్.. వీటిని త్వరగా చేయాలని ఆదేశాలిస్తున్నా ఆచరణలో పురోగతి కనిపించడం లేదు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన మాస్టర్ ప్లాన్లో భాగంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా మహా మండపం దిగువన అన్నదాన భవనం, ప్రసాదాల పోటుతో పాటు వెలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల వేళకు అన్నదాన భవనం, ప్రసాదాల పోటును వినియోగంలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఆ భవనాలు అందుబాటులోకొస్తే.. ఆయా భవనాలు అందుబాటులోకి వస్తే ఆలయ ప్రాంగణంలోనే ప్రసాదాల తయారీ, అన్న ప్రసాద తయారీ, భక్తులకు అన్న ప్రసాద వితరణ, ఆలయ ఉద్యోగులకు అన్న ప్రసాద వితరణ వాటిలో నిర్వహించే వీలు కలుగుతుంది. దీంతో దేవస్థానానికి కోట్ల రూపాయలు ఆదాతో పాటు సమయం కలిసి వస్తుంది. ఆయా భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. నెలలో మూడు సార్లు కమిషనర్ పరిశీలించినా అధికారులు మాత్రం పనుల్లో వేగం పెంచడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. దసరా ఉత్సవాలు మరో నెల రోజులు మాత్రమే ఉండగా, ఇంకా అన్నదానం, ప్రసాదాల పోటు భవన నిర్మాణ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రూ. కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ప్రసాదం పోటు, అన్నదానం భవనాలు ఈ దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వస్తాయా అనే అనుమానం కమిషనర్ సైతం వ్యక్తం చేయడం గమనార్హం. కమిషనర్ మాట పెడచెవిన...! గత నెల 30న దేవదాయ శాఖ కమిషనర్ , దుర్గగుడి అధికారులు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. యాగశాలను ప్రారంభించి ఏడాది అవుతున్నా ఇంత వరకు తుది పనులు పూర్తి కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. యాగశాల చుట్టూ కారిడార్ను అభివృద్ధి చేసి శ్రావణ మాసంలోనైనా యాగాలు నిర్వహించాలని సూచించారు. అయితే కమిషనర్ ఆదేశాలను పట్టించుకోలేదు. శ్రావణ మాసం పూర్తి కావడంతో ఆదివారం కమిషనర్ వచ్చినా కొండపైకి రాకుండా జాగ్రత్తలు పడ్డారు. యాగశాలలో మరి కొన్నిపనులు మిగిలి ఉండటంతో దసరా నాటికి కూడా అనుమానమే అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇక యాగశాల పక్కనే ఉన్న పూజా మండపాలను పరిశీలించిన కమిషనర్ లోపల గోడలకు ఎరుపు రంగు ఉన్న గ్రానైట్ను వేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా డీఈపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వీటిని మార్చాలని ఆదేశించినా ఆయన మాటలు పెడచెవినపెట్టారు, పనుల తీరుపై ఆరా ఆదివారం కమిషనర్ మరోసారి అభివృద్ధి పనులను పరిశీలించారు. కనకదుర్గనగర్ నుంచి నేరుగా అన్నదానం, ప్రసాదాల పోటు, మల్లేశ్వరాలయం నుంచి అన్నదాన భవనానికి చేరుకునే మెట్ల మార్గంలో పనులను కమిషనర్ పరిశీలించారు. దసరా ఉత్సవాల నాటికి ఆయా భవనాలు ఏ మేరకు అందుబాటులోకి వస్తాయని ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. అనంతరం మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్లో అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లు, పనుల అంచనాలపై సమీక్షించారు. కమిషనర్ వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
కోడూరు: పోలీస్స్టేషన్ ఎదుట ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దివిసీమలో జరిగింది. పొలం గట్ల విషయమై ఇద్దరు రైతుల మధ్య తలెత్తిన వివాదంలో తనకు పోలీసులు అన్యాయం చేశారని ఓ రైతు మనస్తాపంతో స్టేషన్ వద్దే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆదివారం సాయంత్రం కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. కోడూరు గ్రామానికి చెందిన చిట్టిప్రోలు నరసింహరాజుకు జరుగువానిపాలెం గ్రామానికి చెందిన జరుగు వెంకటేశ్వరరావుకు జరుగువానిపాలెంలో సమీపంలో ఉన్న పొలం మధ్య గట్ల విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. వారిద్దరి మధ్య అనేకసార్లు ఘర్షణలు కూడా జరిగాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు జరుగుతుండగా ఇద్దరు రైతుల పొలాల మధ్య ఉన్న గట్టును వెంకటేశ్వరరావు తొలగించాడు. దీంతో ఈ విషయంపై నరసింహరాజు స్థానిక పోలీస్స్టేషన్లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వెంకటేశ్వరరావుకు కొమ్ముకాశారు. ఇదే అదునుగా చేసుకొని వివాదం పరిష్కారం కాకుండానే వెంకటేశ్వరరావు తన పొలంలో శనివారం వరినాటు వేశాడు. పోలీసులు పరిష్కరించలేదనే.. పోలీసులు తన సమస్యను పరిష్కరించలేదంటూ మనస్తాపానికి గురైన నరసింహరాజు ఆదివారం సాయంత్రం తన వెంట తీసుకువెళ్లిన పురుగు మందును స్టేషన్ ఎదుట తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నరసింహరాజు పురుగు మందు తాగుతున్న సమయంలో అవనిగడ్డ సీఐ యువకుమార్ కూడా స్టేషన్లోనే ఉన్నారు. బాధితుడిని పోలీసులే హుటాహుటిన అవనిగడ్డలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పొలం గట్ల విషయంలో పోలీసులు న్యాయం చేయకపోగా తనపైనే తిరిగి కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారని, దీంతో మనస్తాపం చెందిన పురుగు మందు తాగినట్లు బాధితుడు నరసింహరాజు తెలిపాడు. కేసు నమోదు చేయని పోలీసులు ఘటనపై కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు. కోడూరు పోలీసులు ఆస్పత్రికి వచ్చి స్టేట్మెంట్ను రికార్డు చేశారని, కేసు నమోదు చేయకపోవడంపై బాధిత రైతు నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత
ప్రొఫెసర్ జి.వి.ఎస్.మూర్తి కృష్ణలంక(విజయవాడతూర్పు): వైద్యరంగం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే సాధారణ ప్రజలకు మెరుగైన వైద్యం అంది మేలు జరుగుతుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ టాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జి.వి.ఎస్.మూర్తి అన్నారు. ప్రజా ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.వి.ఎస్.సాయిప్రసాద్ అధ్యక్షతన ఆదివారం జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ జి.వి.ఎస్.మూర్తి పాల్గొని వైద్యరంగ ప్రైవేటీకరణ–పరిణామాలు అనే అంశంపై మాట్లాడారు. వైద్య రంగ ప్రైవేటీకరణ ద్వారా సాధారణ ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందినట్లుగా ప్రపంచంలో ఎక్కడా రుజువు కాలేదన్నారు. ప్రాథమిక వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినప్పడే సాధారణ ప్రజలు జబ్బునపడే అవకాశం తక్కువగా ఉంటుందని, జబ్బుల కోసం పేదవారు పెట్టుకునే జేబు ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. పెరుగుతున్న క్యాన్సర్ కేసులు.. క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ డి.రఘునాథరావు మాట్లాడుతూ.. దేశంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్లు రావడానికి ప్రధానమైన కారణం పొగాకు వాడకమని, పొగాకును ఏ రూపంలో వాడినా దానివల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ డి.లీల మాట్లాడుతూ మహిళలకు వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు చాలా ప్రధానమైనవని, వీటిని చాలా వరకు నివారించుకోవచ్చని సూచించారు. అనంతరం క్యాన్సర్ను ముందుగా గుర్తించే పద్ధతులు, నివారణ మార్గాలకు సంబంధించిన పుస్కకాన్ని ఆవిష్కరించారు. సదస్సులో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.రమణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ్ ప్రకాష్, అధ్యక్షుడు డాక్టర్ మాకినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వ పాలిటెక్నిక్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆదివారం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎండీ పాషా, జనరల్ సెక్రటరీగా కేసీహెచ్ ప్రధాన్, కోశాధికారిగా కె.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివారావు, పి.శ్రీహరి, జాయింట్ సెక్రటరీగా డీబీఎస్ ప్రసాద్, మహిళా జాయింట్ సెక్రటరీగా సి.సుకీర్త, జోనల్ సెక్రటరీలుగా వి.జక్కన్నబాబు, ఎ.రాంబాబు, ఎస్పీసీ ప్రసాద్, పి.నరేష్ను ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ 2028 వరకు పదవిలో ఉంటుంది. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయసారథి, సివిల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి కట్లయ్య కమిటీ సభ్యులను అభినందించారు. -
ఆకట్టుకున్న శ్రమైక జీవనం చిత్రకళ ప్రదర్శన
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాఘవయ్య పార్కు సమీపంలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్, ఎం.బి.విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శ్రమైక జీవనం చిత్రకళ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్రంలోని 40 మంది చిత్రకారులు గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను చిత్రకళ అవధాన్ మార్లపూడి ఉదయ్కుమార్ ప్రారంభించి మాట్లాడారు. శ్రమైక జీవన సౌందర్యంపై చిత్రకారులు గీసిన చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎన్ఆర్ఐ వల్లభనేని గిరిబాబు మాట్లాడుతూ ఈ ప్రపంచం శ్రమ మీద నడుస్తోందని, దాన్ని గౌరవించడం కర్తవ్యమన్నారు. ఏపీఎంఎస్ఎంఈ గౌరవాధ్యక్షుడు బాయన వెంకట్రావు మాట్లాడుతూ 40 మంది చిత్రకారులు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అనంతరం ఫోరం ఫర్ ఆర్ట్స్ బాధ్యుడు సునీల్ కుమార్ అధ్యక్షతన వర్తమాన పరిస్థితుల్లో చిత్రకారుడి పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్టూనిస్ట్ శ్రీధర్ మాట్లాడుతూ చిత్రకళ కూడా మనిషి జీవనానికి అనుగుణంగానే అభివృద్ధి చెందిందన్నారు. ఎం.బి.విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, సంప్రదాయ చిత్రకళ విశ్లేషకుడు డాక్టర్ సాగర్ గిన్నె, యోగి వేమన విశ్వవిద్యాలయం ఫైన్ఆర్ట్ డిపార్ట్మెంట్ డాక్టర్ మృత్యుంజయరావు, చిత్రకారుడు వై.శేషబ్రహ్మం ప్రసంగించారు. అమరావతి బుద్ధ విహార్ బాధ్యులు శుభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ‘సండేస్ ఆన్ సైకిల్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైకిల్ తొక్కుదాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. అంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్పై గడిపే అరగంట సమయం మన జీవిత కాలాన్ని పెంచుతుందనే సందేశంతో, వ్యాయామం అనేది మందు కాదని, కానీ ప్రతిరోజూ చేస్తే మందుల అవసరం ఉండదనే నినాదంతో ర్యాలీ చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘సండేస్ ఆన్ సైకిల్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీని డీసీపీ ఎస్వీడీ ప్రసాద్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. వ్యాస్ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్కంట్రోల్ రూమ్ వరకూ వెళ్లి, తిరిగి బెంజిసర్కిల్ మీదుగా వ్యాస్ కాంప్లెక్స్కు చేరుకున్నారు. చురుకుగా లేకుంటే అనారోగ్యాలు.. ఈ సందర్భంగా డీసీపీ ప్రసాద్ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవన శైలిలో నిత్యం ద్విచక్రవాహనాలు, కార్లలో ప్రయాణించడం ఒక అలవాటుగా మారిందన్నారు. ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ, శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. అందుకోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందని పేర్కొన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు, ఊబకాయం, మధుమేహం వంటి అనేక రకాల సమస్యలను నివారిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఏడీసీపీ కె. కోటేశ్వరరావు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పోలీసుల సైకిల్ ర్యాలీని ప్రారంభించిన డీసీపీ ప్రసాద్ -
ఏకగ్రీవంగా రాష్ట్ర కార్యవర్గం
మధురానగర్(విజయవాడసెంట్రల్): అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ కార్యవర్గం ఏకగ్రీవమైంది. విజయవాడలో ఆదివారం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ ప్రచార సభ ఏపీ గౌరవ అధ్యక్షుడిగా కొల్లి సీతారాం గురుస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగార్జున రాజ్ గురుస్వామి, సహాయ కార్యదర్శిగా గాడు గురునాథ్ గురుస్వామి, జోనల్ కార్యదర్శిగా ఇంకొల్లు శ్రీను గురుస్వామి, కార్యవర్గ సభ్యులుగా నరసింహారావు స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యులు లంక బాబు, జాతీయ కార్యదర్శి తాతి నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు శంకరాచారి, కోశాధికారి రాజశేఖర్ పాల్గొన్నారు. -
‘నేటికీ విజయవాడ ప్రజలు కోలుకోలేదు’
విజయవాడ: గతేడాది వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు. బుడమేరుకు వరద వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, ఇప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ సమయంలో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, నేటికీ విజయవాడ ప్రజలు ఇంకా తిరిగి కోలుకోలేదని విమర్శించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఎం పాదయాత్రలో భాగంగా ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘వర్షానికే నీరు రోడ్ల మీద నిలిస్తేనే ప్రజలు భయపడుతున్నారు..బుడమేరు వల్ల ప్రమాదం లేదనే భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆపరేషన్ బుడమేరు అమలు కాలేదు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొని రాలేకపోయింది. రూ. 700కోట్లు దాతలు విరాళాలు ఇస్తే కొవ్వొత్తులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్కి ఖర్చు చేశారు. శాశ్వత నివారణ చర్యలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు రిపోర్ట్ లేదు, ఒక్క ఇటుక పడలేదు. కేవలం గండి పడిన చోట రూ. 30కోట్లతో పని చేశారు.. మిగిలిన చోట అసలు పని జరగలేదు. ఆపరేషన్ బుడమేరు కోసం పోరాటానికి సిద్ధం అవుతున్నాం. రూ. 10వేల కోట్లు శాశ్వత పనులు చేయాలి. సమాంతరంగా మరో కాలువ తవ్వాలి. బుడమేరుకు కూడా రిటనింగ్ వాల్ నిర్మించాలి. దిగువకు నీరు పోయే ప్రదేశాన్ని పెంచాలి. కలెక్టరేట్లో ఉండి హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. అమరావతి ముంపుపై మాట్లాడుతున్న చంద్రబాబు బుడమేరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దు నిద్రలో ఉన్నారు. గతంలో నష్టపోయిన వారికి నేటికి నష్ట పరిహారం అందలేదు. దాతలు ఇచ్చిన డబ్బును కూడా బాధితులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. బుడమేరు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర. 30వ తేదీన బారి సభ నిర్వహిస్తున్నాం. ఎంత నిధులు ఖర్చు చేశారు.. ఎమ్ చర్యలు తీసుకున్నారో శ్వేతా పత్రం విడుదల చేయాలి.బుడమేరు డైవర్షన్ చానల్ లోతు, వెడల్పు పెంచారా?, బుడమేరు కనీసం పూడిక కూడా తీయించలేదు. తూటుకాడే తీయించలేని ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసిందంటే ఎలా నమ్మాలి. ఎమ్మెల్యే అవివేకంతో మాట్లాడుతున్నారు.ప్రచార ఆర్బాటం తో కాకుండా శాశ్వత పనులు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇక సీపీఎం రాష్ట్ర కమిటీ సభయులు కాశీనాథ్ మాట్లాడుతూ.. ‘ బుడమేరు వద్ద తూటు కదా పేరుకుపోయింది. నిమ్మల రామానాయుడు నిర్మించమని చెప్పిన పని కూడా బీట్ల బారుతుంది. సింగినగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు బుడమేరు నివారణ చర్యలు తీసుకోవాలని పాదయాత్ర చేస్తున్నాం. 10వేలు కేంద్రాన్ని బుడమేరు కోసం అడగాలి...అప్పుడు కేంద్రం అప్పు ఇస్తుందో.. ముష్టి వేస్తారో తెలుస్తుంది. బుడమేరు కోసం మాట్లాడమంటే కొండవీటి వాగు కోసం మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. -
పచ్చని పంట పొలాలపై చంద్రబాబు కన్ను: రైతు నేతలు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు సర్కార్పై రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 65 వేల ఎకరాలు తీసుకోవాలని చూస్తే రైతులు పోరాటం ద్వారా అడ్డుకున్నారు. కర్ణాటకలో 1750 ఎకరాలు తీసుకోవడంపై పోరాటం చేసి విజయం సాధించారు. కరేడులో మూడు పంటలు పండే భూములను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తుందంటూ ఆయన మండిపడ్డారు.‘‘ప్రభుత్వ నిర్ణయాన్ని కరేడు రైతులు వ్యతిరేకించారు. రైతుల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి వెళ్లిన వాళ్లను అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా ఆందోళనను కూడా ప్రభుత్వం అడ్డుకుంటుంది. న్యాయ వాదుల బృందం కరేడులో మద్దతు తెలిపింది. బీపీసీఎల్ పేరుతో రావురులో 6 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. పోర్ట్ వస్తుంది కాబట్టి.. చవకగా భూములు కొట్టేయాలని ప్రయత్నం చేస్తుంది...రైతులు పోరాటంలో భాగస్వాములు అవుతాం. నవరాత్నాల్లో ఒకటైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేవు. దేశంలో సొంత గనులు లేని ఏకైక ప్లాంట్ విశాఖ స్టీల్. సొంత గనులు లేకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది. ప్రజలను మభ్యపెట్టి ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. 100 శాతం అమ్ముతామని కేంద్ర కమిటి నిర్ణయం కొనసాగుతుందని పార్లమెంట్లో చెప్పారు. అమ్మాలని కేంద్రం ప్రకటిస్తే ప్రజల చెవిలో కూటమి నేతలు ప్రజల్లో చెవిలో పువ్వులు పెడుతున్నారు...32 విభాగాలు ప్రైవేట్ పరం చేస్తే ఎందుకు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుపైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. ఎందుకు మాట్లాడడం లేదు?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. స్టీట్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు. దిగమతి సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం పత్తి రైతుపై దెబ్బ కొట్టింది. లక్ష 25 వేల ఆత్మహత్యలో ఎక్కువ మంది పత్తి రైతులు ఉన్నారు’’ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.రైతు సంఘం నేత మాట్లాడుతూ.. కేశవరావు మాట్లాడుతూ.. బహుళ పంటలు పండే భూములను కూటమి ప్రభుత్వం లాక్కోంటుంది. కరేడు రైతులు చేసే పోరాటానికి రైతు సంఘాలుగా మద్దతు ఇస్తున్నాం. రైతుల్లో, కులాల్లో, మనష్యుల మధ్య విభేదాలు పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.కరేడు రైతు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదోకటిగా వ్యవహరిస్తుంది. ఎండోమెంట్ భూములను కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఫారెస్ట్ భూములు, ఇండోమెంట్ భూములు ఇచ్చిన పరిస్ధితి ఇక్కడే ఉంది. పచ్చని పొలాలు ఉండే మా గ్రామంపై చంద్రబాబు కన్ను ఎందుకు పడింది?. మూడు పంటలు పండించుకుని జీవించే భూములను ఎందుకు ప్రైవేట్కి ఇస్తున్నారు. సస్యశామలామైన మా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దు. పంటలు పండని భూముల్లో పరిశ్రమలు పెట్టుకొండి. విభజించు పాలించు అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ లేని చట్టాలు మా గ్రామంలో అమలు చేస్తున్నారు...సెక్షన్ 30, 144 పెట్టడంపై కోర్ట్ కి వెళ్తై అవి లేవిని కోర్టులో అబద్దాలు చెబుతారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పర్మిషన్లు ఇవ్వరు. 69 వేల కోట్లతో పెట్టుబడులు పెడితే 49వేలు సబ్సిడి ఇస్తుంది ప్రభుత్వం. మా భూములు అమ్ముకోవడం మాకు వచ్చు. మా భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం మా భూములు దోచుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి రాగానే ప్రజా సమస్యలు పవన్ మరచిపోయాడు. చంద్రబాబు చెప్పిన విధంగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నాడు...చంద్రబాబు దారిలో పవన్ ప్రయాణిస్తే రాజకీయ జీవితం పవన్కి ఉండదు. రాజధాని రైతులు వాళ్ల భూముల కోసం పోరాటం చేస్తే న్యాయం.. మేమే చేస్తే అన్యాయమా?. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు నల్లాజెండాలు ఎగురవేస్తాం. తెల్లచట్టాలు, నల్లచట్టాలు, పచ్చ చట్టాలు అమలు చేస్తారా? జీవోలు వెనక్కి తీసుకోకపోతే రాజకీయ సమాధి చేస్తాం. తడా నుండి శ్రీకాకుళం నుండి భూములు కోట్టడంపై పోరాటం చేస్తాంరైతు కుమార్ మాట్లాడుతూ.. ఉలవపాడు, కరేడు ప్రాంతాల రైతుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. కేసులతో పాటు, ఫోన్ల ట్యాపింగ్ చేస్తున్నారు. ఉద్యమ నేతలను ఫోన్స్ ట్యాప్ చేస్తాం.. కేసులు పెడతామంటూ ప్రభుత్వం బెదిరిస్తుంది. కరేడులో రైతుల సంఘాలు పర్యటిస్తాయి. నల్లజెండాలు ఎగరవేయడమే కాదు.. పోరాటం చేస్తాంఉద్యమ నేత అజయ్ కుమార్ మాట్లాడుతూ.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో కరేడు అంత పెద్ద గ్రామం లేదు. 13 వేల ఎకరాలు సారవంతమైన భూమి ఉంది. కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. 1490లో పుట్టిన ఊరుని కబలించాలని ప్రభుత్వం చూస్తుంది. 18 రకాల పంటలు పండే భూమిని కబలిస్తున్నారు. నోటిఫికేషన్ని వెనక్కి తీసుకోవాలి -
యువత భవిష్యత్ అందరి బాధ్యత
మచిలీపట్నంఅర్బన్: ఎయిడ్స్పై అవగాహన పెంచి యువత భవిష్యత్ను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని జిల్లా రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ సాల్మన్ రాజు పేర్కొన్నారు. ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం 5కె మారథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురక్షిత జీవన శైలిని అనుసరించడం ద్వారా ఎయిడ్స్ను పూర్తిగా నివారించవచ్చన్నారు. స్థానిక చిలకలపూడి సెంటర్ నుంచి నోబుల్ కళాశాల వరకు జరిగిన ఈ మారథాన్లో 75మంది విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో బి.పవన్ కళ్యాణ్ (నోబుల్ కళాశాల), కారే కార్తికేయ (రుద్రపాక జూనియర్ కళాశాల), బి.లోకేష్ (మొవ్వ జూనియర్ కళాశాల) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో షేక్ అయేషా (నోబుల్ కళాశాల), టి. చైతన్యలక్ష్మి (మొవ్వ జూనియర్ కళాశాల), చింతగుంట కళ్యాణి (రుద్రపాక జూనియర్ కళాశాల)వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు నగదు బహుమతులుగా వరుసగా రూ.10వేలు, రూ.7వేలు, 5వేలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. జిల్లాస్థాయి విజేతలను రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసి ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ డాక్టర్ వెంకటరావు, జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూదనరావు, సీఎస్వో సాక్షి గోపాల్, నోబుల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.జె. ఎర్నెస్ట్, లెక్చరర్లు పి.వి.నరసింహారావు, రంగనాయకులు, ఎన్జీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. -
యువ మేధకు చుక్కాని.. ఆర్టీఐహెచ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యువ మేధస్సుకు పదునుపెట్టి, ప్రోత్సహించి పరిశ్రమల స్థాపన దిశగా చేయిపట్టి నడిపించడంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్) కీలకపాత్ర పోషిస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. యువ మేధకు ఆర్టీఐహెచ్ చుక్కాని వంటి దని పేర్కొన్నారు. విజయవాడ స్పోక్ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో టీమ్ – ఆర్టీఐహెచ్ కొత్త ఉత్సాహంతో కృషి చేయాలని జేసీ సూచించారు. ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్ స్పోక్ కార్యాలయానికి సంబంధించి సీఈఓగా జి.కృష్ణన్, ఇంక్యుబేషన్ హెడ్గా డి.రవి తేజకు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శనివారం నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా విజయవాడతో పాటు రాష్ట్రంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో స్పోక్స్ను ముఖ్యమంత్రి ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. -
జి.కొండూరులో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం పర్యటన
జి.కొండూరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యుల బృందం శనివారం జి.కొండూరు గ్రామంలో పర్యటించింది. పది రాష్ట్రాలకు చెందిన 90 మంది సభ్యుల బృందం ఈ పర్యటనలో పాల్గొంది. ఈ బృందానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతినిధులు బాలు, వీరేంద్రసింగ్ నేతృత్వం వహించారు. పర్యటనలో భాగంగా ఈ బృంద సభ్యులు జి.కొండూరు గ్రామంలో గతేడాది పులివాగు వరద ఉధృతికి ముంపునకు గురైన ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించారు. పులివాగును సందర్శించి వాగులో నీటి ప్రవాహ సామర్ధ్యం గురించి తెలుసుకున్నారు. వరదల సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు, పంట నష్టం, ప్రాణ నష్టం, బాధితులకు అందిన పరిహారం వంటి అంశాలను స్థానిక తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు బృందానికి వివరించారు. అనంతరం స్థానిక కమ్యూనిటీ హాలులో మండల అధికారులు, స్థానిక ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను బృందం సభ్యులు వివరించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ మండల అరుణ, ఇన్చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి బసవలింగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. ఇక శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చనలు శనివారంతో ముగిశాయి. శనివారం కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కుంకుమార్చనలు జరిపించుకున్నారు. సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. నూతన అన్నదాన భవన పరిశీలన రాజగోపురం ఎదుట నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనాన్ని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. దసరా ఉత్సవాల నాటికి అన్నదాన భవనం అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. క్లోక్రూమ్, సెల్ఫోన్ కౌంటర్ను తనిఖీ చేసిన ఈవో సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కనకదుర్గనగర్లో నిర్మిస్తున్న సమాచార కేంద్రాన్ని పరిశీలించారు. ఈవో వెంట ఈఈ రాంబాబు, ఏఈ మస్తాన్, సునీల్ ఇతర అధికారులు ఉన్నారు. -
బుడమేరు వద్ద ‘ఆడశిశువు’ను వదిలేసింది కన్నతండ్రే..
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు కాలువ వెంబడి శుక్రవారం రాత్రి లభ్యమైన మూడు నెలల పసికందు కుటుంబ సభ్యుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. భార్యతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో కన్నతండ్రే ఆ చిన్నారిని బుడమేరు పొదల్లో వదిలివెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు ఆ పాపను తల్లికి అప్పగించి తండ్రిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన పోలమ్మకు వించిపేటకు చెందిన కానూరు వెంకటస్వామి (38)తో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. చిత్తుకాగితాలు ఏరుకునే వారికి ఎనిమిది మంది సంతానం. ఎనిమిదో సంతానంగా అంజమ్మ మూడు నెలల క్రితం జన్మించింది. ఆ తరువాత పెద్ద ఆపరేషన్ చేయించుకున్న పోలమ్మ న్యూ ఆర్ఆర్పేటలోని తన పుట్టింటి వద్దకు వచ్చి ఉంటోంది. వెంకటస్వామి వించిపేటలోని ఇంటికి వచ్చేయాలంటూ భార్యతో గొడవ పడ్డాడు. పోలమ్మ ఆరోగ్యం బాలేదని, పిల్లని ఎలా చూసుకుంటానని ఆమె పుట్టింటివారు ప్రశ్నించడంతో మూడు నెలల పాప అంజమ్మను బలవంతంగా తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. న్యూఆర్ఆర్పేట నుంచి సింగ్నగర్ వైపు వెళ్లే షణ్ముఖసాయి నగర్లో వద్ద బుడమేరు కాలువ వెంబడి ఆ పాపను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ పాప ఏడుపును విన్న స్థానికులు ఆ చిన్నారని రక్షించి పోలీసులకు అప్పగించారు. ఈ కేసు విషయమై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ రోడ్డుపై హడావు డిగా వెదకడాన్ని గుర్తించి, ఆమెను విచారించగా తన కుమార్తె కనిపించడం లేదని, తన భర్తే పాపను తీసుకొని వెళ్లిపోయాడని తెలిపింది. చిన్నారిని బుడమేరు వద్ద వదలివెళ్లిన వెంకటస్వామిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. చిన్నారి తల్లిదండ్రుల మధ్య ఎందుకు వివాదాలు వస్తున్నాయి? చంటిబిడ్డను బుడమేరు వెంబడి వదిలేయడానికి కారణా లేంటి? ఎనిమిది మంది పిల్లలను ఎలా పెంచు తున్నారు? వంటి వివరాలు, పాప తల్లి పూర్తి ఆధారాలు తీసుకున్నాక చిన్నారిని తల్లికి అప్పగి స్తామని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. భార్యతో గొడవల నేపథ్యంలో అఘాయిత్యం -
అనారోగ్యానికి పచ్చజెండా
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ఒక అర్ధగంట బైక్పై ప్రధాన రోడ్లపై తిరిగితే చాలు అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. టన్నుల కొద్దీ కాలుష్యాన్ని వెదజల్లే కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. అనేక ప్రాణాంతక వ్యాధులకు సైతం కారణంగా నిలుస్తుంది. నిత్యం నగర రోడ్లపై ప్రయాణించే వారిలో శారీరక, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడు పోటుతో పాటు, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు. నిద్రలేమి సమస్యతో పాటు, అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇవే నిదర్శనం ఇలా వీరిద్దరే కాదు. నగరంలోని ట్రాఫిక్తో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వైద్యులు గుర్తించిన సమస్యలివే... ఏం చేయాలి... ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం ద్వారా కొందరు యాంగ్జయిటీకి గురవుతారు. యాంగ్జయిటీ ఉన్న వారు చికాకుతో రాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. నిద్రలేమి, హైపర్టెన్షన్ భారినపడుతున్న వారు ఉంటున్నారు. ముఖ్యంగా కాలుష్యం ప్రభావంతో రక్తం చిక్కపడి బ్రెయిన్స్ట్రోక్, హార్ట్స్ట్రోక్కు దారితీయొచ్చు. వెన్నెముక సమస్యలతో బాధ పడుతున్న వారు మా వద్దకు వస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టును వినియోగించడం మేలు. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. – డాక్టర్ డి.అనిల్కుమార్, న్యూరాలజిస్ట్, విజయవాడ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025టీడీపీ బీజేపీ బీజేపీ జెండా తీసేయండి..!7తిరువూరు: మెగా డీఎస్సీలో ఎ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన భూక్యా జాన్సన్ 100కు 95 మార్కులు సాధించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎస్జీటీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. జాన్సన్ను గ్రామస్తులు అభినందించారు.అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పరిశ్రమలశాఖ డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ చల్లరపు శైలేంద్రకుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ ఆలయం సమీపంలో ఆటో స్టాండ్ వ్యవహారం కూటమి పార్టీల నేతల మధ్య రగడకు దారి తీసింది. ఆ పార్టీ నేతలు రోడ్డుపైన బాహాబాహీకి దిగి బహిరంగంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది. సాక్షాత్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అతని అనుచరులపై టీడీపీ నేత మైలవరపు వీరబాబు దాడికి తెగబడటంపై నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం దిగువన రథం సెంటర్ సమీపంలో రహదారులను ఆక్రమించి వ్యాపారాలను నిర్వహిస్తున్న హాకర్లను ఇటీవల అధికారులు తొలగించారు. హాకర్ల వలన భక్తుల రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. హాకర్లతో పాటుగా అక్కడ ఉన్న ఆటోస్టాండ్ను సైతం తొలగించారు. అయితే ఆటో డ్రైవర్లు తమకు న్యాయం చేయాలని అడ్డూరి శ్రీరామ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే సుజనాచౌదరిని కలిసి అభ్యర్థించారు. సుజనాచౌదరి ఆదేశాలతో అడ్డూరి శ్రీరామ్ ఇతర బీజేపీ నేతలు అధికారులతో సంప్రదించి రథం సెంటర్కు అవతల వైపు కెనాల్ను ఆనుకొని ఉన్న బొడ్డు బొమ్మ వద్ద ఆటోస్టాండ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీడీపీ నేతలు అక్రమ వసూళ్లు చేస్తున్నారు టీడీపీ నేత మైలవరపు వీరబాబు టెండర్ ఫాంలో ఆ ప్రాంతం లేకపోయినా అక్రమంగా దుర్గగుడికి వచ్చే భక్తుల నుంచి పార్కింగ్ పేరుతో వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తాము నగరపాలకసంస్థ అధికారులను సంప్రదించామని, వీరబాబు పాడుకున్న టెండర్లో ఈ ప్రాంతం లేదని చెప్పినట్లు వారు చెబుతున్నారు. దాడి ఘటనపై బీజేపీ అధిష్టానం సీరియస్ సాక్షాత్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్పైనే టీడీపీ నేత దాడికి తెగబడటం నగరంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానం సైతం దీనిని సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన సుజనాచౌదరి ఎమ్మెల్యేగా ఉన్న వెస్ట్ నియోజకవర్గంలో స్థానికంగా టీడీపీ నేతలు అధికారాన్ని చెలాయిస్తూ వివిధ రూపాల్లో డబ్బులు దండుకోవటం తదితర అంశాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య అంతర్గతంగా గొడవలు సాగుతున్నాయి. అక్రమ పార్కింగ్ వసూళ్ల వెనుక మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత ఉన్నారని, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటాల పంపకంలో తేడాతోనే వివాదం వాటాల పంపకంలో కూటమి పార్టీల నేతల మధ్య చోటు చేసుకున్న వివాదం వలనే వారి మధ్య ఈ రగడ చోటు చేసుకుందనే ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది. ప్రధానంగా సుజనాచౌదరి స్థానికంగా లేకపోవటంతో నగరపాలకసంస్థ వ్యవహారాలను బీజేపీకి చెందిన సీనియర్ నేతలు చూస్తున్నారు. ఆ క్రమంలో పార్కింగ్ టెండర్ల విషయంలో టీడీపీ నేతలు వాటాలు పంచుకోవటం, అక్రమ వసూళ్ల వ్యవహారంలో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయనే ప్రచారం రావటంతో బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. తాజాగా వాటాల పంపకంలో తేడాలు రావటంతో రోడ్డుపైనే బాహాబాహీకి దిగారనే మాటలు వినిపిస్తున్నాయి. జయంతి గ్రామంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్రలో కలెక్టర్ లక్ష్మీశ బొడ్డుబొమ్మ సమీపంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ సంఘం బీఎంఎస్ జెండా, ఆటో స్టాండ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు అడ్డూరి శ్రీరామ్ సూచనలతో ఆటోడ్రైవర్లు సమాయత్తమయ్యారు. వాటిని ఆవిష్కరించే సమయంలో మైలవరపు వీరబాబు అడ్డూరి శ్రీరామ్కు ఫోన్ చేశాడు. ‘‘అక్కడ నేను నగరపాలకసంస్థ నుంచి పార్కింగ్ పాడుకున్నాను, నాకు నష్టం వస్తుంది. ఆ డబ్బులు మీరిస్తారా...?’’ అంటూ ప్రశ్నించాడు. దానికి ‘శ్రీరామ్ ఫోన్లో వద్దు ఇక్కడకు రా...’ అని సమాధానం ఇచ్చాడు. మైలవరపు వీరబాబు అక్కడకు వచ్చి ఇక్కడ బీజేపీ జెండా ఎలా పెడతారు? తీసేయండి అంటూ తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో అడ్డూరి శ్రీరామ్ ఇతర బీజేపీ నేతలు వీరబాబును అడ్డుకునే క్రమంలో వారి మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. కాసేపటికి టెండర్ ఫారంలో హద్దులు చూపించి అప్పుడు మాట్లాడతామని సర్దిచెప్పటంతో వీరబాబు వెనుకకు వెళ్లాడు. -
రేపు నున్నలో సాఫ్ట్ బాల్ జట్ల ఎంపిక
పెనమలూరు: కొద్ది నెలల క్రితం పెనమలూరులో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పెనమలూరు మహిళా మండలి కాలువ కట్టపై ఉంటున్న డేరంగుల పిచ్చయ్యకు ఓ మహిళతో వివాదం తలెత్తింది. ఆ మహిళకు మద్దతుగా వేల్పుల రమణ (అఖిల్), ముగ్గురు బిహార్ యువకులు పిచ్చయ్యతో గొడవపడి దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో నలుగురు నింది తుల్లో అఖిల్ను పోలీసులు ఘటన జరిగిన వెంటనే అరెస్టు చేశారు. మిగితా నిందితులు బిహార్కు చెందిన వారు కావటంతో వారు దొరకలేదు. నిందితుల్లో ఒకరైన బిహార్ రాష్ట్రానికి చెందిన విపిన్ సహానీని పోలీసులు పెనమలూరులో శనివారం అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా నెల్లూరు జైలుకు రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునే విష యంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతుడి బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక ఎస్ఐపై బదిలీ వేటు కూడా పడింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. జగ్గయ్యపేట అర్బన్: భార్య ఫిర్యాదుతో తనపై పోలీసులు కేసు నమోదు చేశారనే మనస్తాపంతో భర్త ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ శివారులోని తొర్రగుంటపాలెంలో శనివారం జరిగింది. పట్టణ ఎస్ఐ జి.రాజు కథనం మేరకు.. తొర్రగుంటపాలెంలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్న రామ కృష్ణ(34)కు నాలుగేళ్ల క్రితం సత్తెనపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. భార్యాభర్తల మద్య గొడవలు రావడంతో కొంత కాలంగా రామకృష్ణ భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల భార్య ఫిర్యాదు మేరకు మాచర్ల పోలీసులు రామకృష్ణపై కేసు నమోదుచేశారు. విచారణకు వస్తున్నామని పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన రామకృష్ణ ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతిచెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. -
అక్రమ ఆస్తుల కేసులో శైలేంద్రకుమార్ అరెస్టు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పరిశ్రమలశాఖ డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ చల్లరపు శైలేంద్రకుమార్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. శైలేంద్ర కుమార్ విజయవాడ పరిశ్రమలశాఖ డైరెక్టర్ కార్యాలయంలో డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్గా పని చేస్తున్నారు. ఆయన అక్రమ ఆస్తులు కూడబెట్టా రనే సమాచారంతో ఒంగోలు ఏసీబీ అధికారులు అతని ఇళ్లలో సోదాలు జరిపారు. శైలేంద్ర కుమార్ బంధువుల ఇళ్లలో ఏడు చోట్ల రెండు రోజులపాటు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు, బంగారపు బిస్కెట్లు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, పెద్దమొత్తంలో నగదు, వాహనాలను గుర్తించారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోదాల అనంతరం శైలేంద్రకుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం శైలేంద్రకుమార్ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నారు. -
కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి సీతా నగరం పరిధిలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ మహిళ కృష్ణానదిలోకి దూకి ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం ఘాట్ వద్దకు శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విజయభార్గవి (28) అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలసి వచ్చింది. భార్గవి కృష్ణానదిలోకి దూకడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పాప తన తండ్రి పేరు నరేష్ అని మాత్రమే చెబుతోందని, ఊరు పేరు చెప్పలేకపోయిందని తెలిపారు. ఎవరిౖకైనా వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్స్టేషన్ ఫోను నంబర్లు 86888 31361, 81438 73409, 97034 52206లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. అనేక్యను విజయవాడలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. -
ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క: ఏపీ జేఏసీ అమరావతి
సాక్షి, విజయవాడ: మూడు నెలల్లో పెండింగ్ బకాయిలు క్లీయర్ చేయకపోతే పోరుబాట పడతామని చంద్రబాబు సర్కార్ను ఏపీ జేఏసీ అమరావతి హెచ్చరించింది. ఇవాళ(శనివారం) కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై మా వైఖరీలో ‘‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క’’ అంటూ తేల్చి చెప్పింది. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. ఏడాది దాటినా కానీ.. సీఎం, కేబినెట్ ఉపసంఘం మాతో చర్చించలేదన్నారు. ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. జూన్లో జరగాల్సిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆగస్టులో జరిగాయి. ఏ అంశం పరిష్కారం కాలేదు’’ అని ఆయన మండిపడ్డారు.‘‘ఒక్కో ఉద్యోగికి మూడు నుండి 5లక్షలు, రిటైర్డ్ ఉద్యోగులకు 15 నుండి 20 లక్షలు బకాయిలు ఉన్నాయి. సీఎస్ఎంఎఫ్లో సంబంధం లేకుండా ప్లే స్లిప్లో మా బకాయిలు చూపించాలి. నాలుగు డీఎలు పెండింగ్లో ఉన్నాయి. డీఏ, ఐఆర్ కోల్పోవడం, బకాయిలు ఇవ్వకపోవడంతో వేల కోట్లు నష్టపోయాం. మా హక్కును మేం అడుగుతున్నాం. మూడు నెలల్లో బకాయిలు చెల్లించకపోతే పోరుబాట పడతాం’’ అని బొప్పరాజు చెప్పారు.ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి దామోదర్ మాట్లాడుతూ.. ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చానని చెప్పిన పవన్ ఇప్పుడు మాట్లాడటం లేదు. 2023 నుంచి ఐఆర్ రావాలి. వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మా సమస్యలు పరిష్కరించకుంటే ఎటువంటి ఉద్యమాకైన సిద్ధం. ప్రభుత్వ స్థలాలు, ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు అప్పగిస్తే సంపద సృష్టి జరగదు. -
ఎవరిదో ఈ పాపం
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్): కన్నతల్లి కమ్మని కౌగిలో ఉండాల్సిన ఆ పసికందు... చెత్త చెదారాల నడుమ.. కారు చీకటిలో దోమలు, పురుగుల కాట్లకు గురై గుక్క పట్టి ఏడుస్తోంది. మానవత్వం విలువలు మంట గలిపేలా ఉన్న ఈ ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందమూరి నగర్, షణ్ముఖ సాయినగర్ ప్రాంతంలో బుడమేరు వెంబడి ఉన్న గేదెల షెడ్డు పక్కన ఓ పసికందు ఏడుపు వినబడటంతో అక్కడ ఉన్న నాగరాజు అనే పాడి రైతు వెళ్లి చూడగా మూడు నెలల వయసున్న పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. అతను ఆ పాపను బయటకు తీసి సింగ్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సింగ్నగర్ సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని పసికందుకు స్థానిక మహిళలతో పాలు పట్టించారు. ఆ చిన్నారి ఒంటిపై దోమల పురుగులు కుట్టిన గాయాలు ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలించి ఎవరు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారో తెలుసుకుంటామని, అప్పటివరకు చైల్డ్ వెల్ఫేర్ వారికి పాపను అప్పగిస్తామని సీఐ తెలిపారు. -
ఇంట్లో చెప్పకుండా బందరు బీచ్కి వెళ్లిన మైనర్లు
పటమట(విజయవాడతూర్పు): సముద్రంపై మోజుతో ఇంట్లో చెప్పకుండా సైకిళ్లు వేసుకుని బందరుబీచ్కి వెళ్లిన నలుగురు మైనర్ బాలుర ఆచూకీని పటమట పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. పటమటకు చెందిన నలుగురు మైనర్ బాలురు పవన్ కుమార్ (9వ తరగతి), పెద్దపల్లి శశిధర్ (9వ తరగతి), మురపాక కార్తీక్ (8వ తరగతి), తాడేపల్లి నిక్కీ (9వ తరగతి) స్థానికంగా గోవిందరాజులు మున్సిపల్ పాఠశాలలో చదువుతున్నారు. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ కలిసి బందర్ బీచ్కి వెళదామని అనుకున్నారు. గురువారం రాత్రి 9 గంటలకు నలుగురు బాలురు వారి వారి ఇళ్లలో నుంచి బయటకు వచ్చి పటమటలోని ఓ పార్క్ లో రాత్రి 11 గంటల వరకు ఉన్నారు. అనంతరం రెండు సైకిళ్లపై నలుగురు కలిసి బందర్ బీచ్కి వెళ్లారు. అర్ధరాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లితండ్రులు ఎంత గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వారు పటమట పోలీసులను ఆశ్రయించారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ సూచనల మేరకు పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో బాలుర ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా సైకిళ్ల మీద ఆటోనగర్ నుంచి బందరు రోడ్డులోకి వెళ్లినట్టు గుర్తించారు. వరుసగా సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించి బందరు వెళ్లినట్టు గుర్తించారు. వెంటనే పటమట పోలీసులు బందరు బీచ్కి వెళ్లారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు బాలుర ఆచూకీని కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలురను పటమట స్టేషన్కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలో బాలుర ఆచూకీని కనిపెట్టిన సిబ్బందిని సీఐ పవన్ కిషోర్ అభినందించారు. పటమటకు చెందిన నలుగురు బాలుర దుస్సాహసం గంటల వ్యవధిలో ఛేదించిన పటమట పోలీసులు -
సర్వర్ మొరాయింపు.. సాగని రిజిస్ట్రేషన్లు
కంకిపాడు: సర్వర్ మొరాయింపుతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. స్లాట్ బుకింగ్స్ జరగకపోవటంతో రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా ప్రభుత్వం, అధికారులు ఏ ఒక్కరూ సమస్యను పట్టించుకోకపోవటంతో రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు ఉన్నాయి. అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, గుడివాడ, కానుమోలు, కౌతవరం, మొవ్వ, పామర్రు, పెడన, మచిలీపట్నం, గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో మూడు రోజులుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటే వరకూ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ తెరుచుకోవటం లేదు. ఈ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేస్తేనే కానీ స్థలాల రిజిస్ట్రేషన్లు, మార్టిగేజ్, ఇతర రిజిస్ట్రేషన్ కార్యాలయ సేవలు అందుబాటులోకి రావు. అయితే సర్వర్ మొరాయిస్తుండటంతో ఆయా సేవలు పొందేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్స్ చేయించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న కార్యాలయాలు శ్రావణమాసం కావటంతో మంచి రోజులు అని ఎక్కువ మంది ప్రజలు తాము కొనుగోలు చేసిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్ది రోజులుగా రియల్ వ్యాపారం మందకొడిగా సాగుతోంది. స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగటం లేదు. అయితే జరిగే అరకొర రిజిస్ట్రేషన్లు సైతం సకాలంలో జరగటం లేదని ప్రజలు వాపోతున్నారు. వెబ్సైట్ మొరాయింపుతో దస్తా వేజులు సిద్ధం చేసుకుని, చలానాలు చెల్లించి స్లాట్బుకింగ్స్ కోసం రోజంతా ఎదురుచూడాల్సి వస్తోందని చెబుతున్నారు. దీంతో మధ్యాహ్నం వరకూ మూడు రోజులుగా కార్యాలయాలు జనం లేక వెల వెల బోతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిజి స్ట్రేషన్ శాఖ వెబ్సైట్ తరచూ మొరాయిస్తుంది. సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో రిజి స్ట్రేషన్ సేవలు సజావుగా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ సర్వర్ సమస్యలు నెలకొంటున్నా అటు అధికారులు, ఇటు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అవగాహనతో దోమల నివారణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూడటం ద్వారా దోమలను నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాచర్ల సుహాసిని అన్నారు. ఆమె శుక్రవారం రామలింగేశ్వర నగర్, కళానగర్ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇంటింటినీ సందర్శించి దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దోమలను నియంత్రించాలంటే నీరు నిల్వ ఉండకుండా పాత టైర్లు, పాత సామాన్లు, తప్పనిసరిగా బోర్లించుకోవాలన్నారు. అక్కడే ఉన్న పాత టైర్లను చూపించి వాటిలో ఉన్న నిల్వ నీటి లోని లార్వాను చూపించి, దోమల అభివృద్ధికి ఇవే ప్రధాన కారణమన్నారు. ఇళ్లలోని రిఫ్రిజిరేటర్లు, పూలకుండీల్లో కూడా నీరు లేకుండా చూడాలన్నారు. మరో వీధిలో ఖాళీ స్థలంలో ఉన్న పెద్ద ట్రాక్టర్ టైరులో ఉన్న నిలువ నీటిలో ఉన్న లార్వాను చూపించి, ఆ టైర్ లో ఉన్న నీటిని పూర్తిగా తొలగించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సందీప్, ఏఎంఓ సూర్య నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ జగదీష్, ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు, పీడీపీ వర్కర్లు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని -
విద్యుత్ విజిలెన్స్ విస్తృత తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా పర్యవేక్షణాధికారి టి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో విజయవాడ టౌన్ డివిజన్ పరిధిలోగల గొల్లపూడి సెక్షన్లో శుక్రవారం విస్తృత తనిఖీలు చేపట్టినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (విజిలెన్స్) పి.విజయకుమారి, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.రవీంద్రబాబు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో 48 మంది అధికారులు, 96 మంది సిబ్బంది 48 బృందాలుగా ఏర్పడి 3,958 సర్వీసులు తనిఖీ చేశారు. అనుమతి ఇచ్చిన లోడ్ కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 98 మందికి రూ.3,46,000 అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు వారి విద్యుత్ మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఒక వేళ సీలు లేకపోయినా, తుప్పు పట్టి ఊడిపోయినా వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరం సీలు లేకపోవడం, ఉద్దేశపూర్వకంగా తొలగించడం, గాట్లు పెట్టడం వంటివి విద్యుత్ చౌర్యంగా పరిగణించి కేసులు నమోదు చేస్తారని ఈఈ విజయకుమారి హెచ్చరించారు. భారత విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం పనిచేయని మీటరు నుంచి విద్యుత్ వాడుకున్నా, ఉండవలసిన మీటర్ బదులుగా వేరే మీటరు పెట్టినా విద్యుత్ చౌర్యం కింద వస్తుందని వివరించారు. మొదటి తప్పిదానికి కాంపౌండింగ్ పద్ధతిలో అపరాధ రుసుము చెల్లిస్తే కేసు నుంచి విడిపిస్తారని, రెండవ సారి కూడా అదే తప్పు చేస్తే అరెస్ట్ చేసి రిమాండ్కు పంపి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అపరాధ రుసుము చెల్లించలేని పరిస్థితుల్లో రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా ఆస్తులు జప్తు చేస్తారని అన్నారు. మొదటిసారికి మూడు రెట్లు, రెండవసారికి ఆరు రెట్లు జరిమానా విధించే అవకాశం విద్యుత్ చట్టంలో ఉందని తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్ చౌర్యంపై ఫిర్యాదుల పూర్తి వివరాలతో 83310 20537, 8331014951 నంబర్లుకు నేరుగా లేదా వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చని అన్నారు. తమకు అందిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ దాడుల్లో డీఈఈలు ఎంవీవీ రామకృష్ణ, నాగేశ్వరరావు, ఆపరేషన్ డీఈఈ ఓ.బసవరాజు, ఏఈఈ వైవీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అనేక లోపాలు గుర్తించాం
విజయవాడలో నిర్వహించిన తనిఖీల్లో అనేక లోపాలు గుర్తించాం. హోటళ్లు, రెస్టారెంట్లలో వండిన రైస్, చికెన్, మటన్ వంటి వాటిని సైతం డీప్ ఫ్రిజ్లలో పెట్టి, మళ్లీ వాటిని వాడుతున్నారు. మితిమీరిన రసాయనాలు కలిసిన రంగులను ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా కాలపరిమితి ముగిసిన సరుకులను కూడా ఆహారం తయారీకి వాడుతున్నారు. బ్యాకరీ ప్రొడక్ట్స్పై సరైన లేబుల్స్ లేని విషయాన్ని తనిఖీల్లో గుర్తించాం. అంతేకాకుండా వంటనూనెనే రీ యూజ్ చేస్తున్నారు. అలా చేస్తే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. –పూర్ణచంద్రరావు, జాయింట్ ఫుడ్ కంట్రోలర్, ఏపీ -
ఆహారం కల్తీ.. ఆరోగ్యం అంతే
లబ్బీపేట(విజయవాడతూర్పు): కల్తీ ఆహారం... ప్రజలను అనారోగ్యం పాల్జేస్తోంది. నగరంలోని హోటల్స్ నుంచి రెస్టారెంట్ల దాకా, కార్పొరేట్ స్వీట్స్ షాపుల నుంచి రోడ్డు పక్కన అమ్మే పానీ పూరి బళ్ల వరకూ అన్నీ కల్తీ జరుగుతున్నాయి. వాడిన నూనెనే ఐదారుసార్లు వాడటం, రంగు, రుచికోసం రసాయనాల వినియోగం వంటి వాటితో ప్రజలను అనారోగ్యం పాల్జేస్తున్నాయి. సమయపాలన లేని ఆహార అలవాట్లు కొంపముంచుతున్నాయి. అప్రమత్తం కాకుంటే పెనుముప్పే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రెస్టారెంట్లు, ఫుడ్కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుండటంతో తొలుత జీర్ణాశయ వ్యాధులు, అనంతరం ప్రాణాపాయ స్థితికి దారితీస్తున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న, లివర్ సిర్రోసిస్, పాంక్రియాటైటీస్, క్యాన్సర్ కేసులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్ క్యాన్సర్ సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిల్లో ఈ రకం వ్యాధులే ఎక్కువగా వస్తున్నాయి. అన్నవాహిక క్యాన్సర్లు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికై నా అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెనుముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు. ఇవే నిదర్శనం వీరద్దరే కాదు.. ఇటీవల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో పెద్దపేగు, జీర్ణాశయ, లివర్ వ్యాధులు ఎక్కువగా వస్తున్నట్లు చెపుతున్నారు. అందుకు కల్తీ ఆహారమే కారణంగా పేర్కొంటున్నారు. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్న వైనం ఆహార నియమాలు పాటించక పోవడంతో ఒబెసిటీకి దారితీసి క్రమేణా జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలో మధుమేహం, రక్తపోటుతో పాటు, హైపో థైరాయిడ్ వంటి వ్యాధులు సోకుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటించడంతో పాటు, రెగ్యులర్గా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. నాన్వెజ్ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారంపొడులు ఎక్కువగా వాడుతుంటారు. మృతజంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలు వినియోగించి వంటలు చేస్తుండటంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అందుకు ఫుడ్ కంట్రోల్ శాఖ వారు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. మాంసాన్ని నిల్వ ఉంచి వంటలు చేయడం, వాడిన నూనెనే మళ్లీ, మళ్లీ వడపోసి వాడటం వంటివి చేస్తున్నట్లు చెపుతున్నారు. బయట ఆహారం తినడం తగ్గించడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్లకు కల్తీ ఆహారమే ప్రధాన కారణం అంటున్నారు. -
కలెక్టర్ లక్ష్మీశ
టూరిజం హబ్గా తీర్చిదిద్దుదాం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, టూరిజం హబ్గా తీర్చిదిద్దుదామని కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు సూచించారు. జిల్లాలో అత్యంత ప్రాచుర్యం పొందిన కొండపల్లి ఖిల్లా, భవానీ ద్వీపం, గాంధీ హిల్, బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం, మొగల్రాజపురం గుహలు, మూలపాడు బటర్ఫ్లై పార్కు వంటి పర్యాటక ప్రాంతాలతో పాటు కనకదుర్గమ్మ దేవాలయం, గుణదల మేరీమాత, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం, వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, జగ్గయ్యపేట సమీపంలోని తిరుమలగిరి వెంకటేశ్వరస్వామి ఆలయం వంటి పర్యాటక, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయన్నారు. వీటితో పర్యాటకులను ఆకర్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లో పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తేవడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. భవానీ ద్వీపంలో వారాంతాల్లో వినోద, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ వర్గాల్లో ప్రతిభను వెలికితీసే పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. పర్యాటక శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణను రూపొందించి ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప పాల్గొన్నారు. -
అత్యవసరమైతేనే బయట తినాలి
ఇటీవల కాలంలో జీర్ణాశయ, పెద్దపేగు క్యాన్సర్లు పెరిగాయి. అందుకు కల్తీ ఆహారం. నాన్వెజ్ ఎక్కువగా తీసుకోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్కు దారితీస్తున్నాయి. మహిళల్లో శారీరక శ్రమ తగ్గడంతో రొమ్ము క్యాన్సర్తో పాటు, గర్భాశయ క్యాన్సర్ కేసులు అధికమయ్యాయి. పట్టణ వాసుల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. క్యాన్సర్ను ముందు జాగ్రత్తలతో నివారించగలుగుతాం. –డాక్టర్ సుబ్బారావు, క్యాన్సర్ వైద్య నిపుణులు -
ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీ వత్రాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో అరుదుగా వచ్చే 5వ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఐదో శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించారు. మహా మండపం ఆరో అంతస్తులో వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాలు జరుపుకొన్నారు. రూ. 1500 టికెటుపై ఆర్జిత సేవగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో 87 మంది మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఉచిత సేవగా నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో 570కి పైగా మహిళలు అమ్మవారికి పూజలు జరిపించుకున్నారు. వీరిని రూ.100 క్యూలైన్లో అమ్మవారిని దర్శించుకునేందుకు అనుమతించారు. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం పట్టగా భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన టికెట్లను రద్దు చేశారు. -
చినుకు పడితే నరకమే!
చిన్నపాటి వర్షానికే విజయవాడ వణుకుతోంది. చినుకుపడితే నగరంలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీట మునుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థ పడుతున్నారు. మురుగునీటి వ్యవస్థ అంతంతమాత్రంగా ఉంటే.. మరోవైపు అసంపూర్తి పనులు మరింత ఇక్కట్లు కలిగిస్తున్నాయి. వాననీరు, మురుగు కలవడంతో రహదారులు నిండిపోతున్నాయి. కొద్ది పాటి వర్షానికే ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఇలా చినుకు పడితే నగర ప్రజలు వణికిపోతున్నారు. వానలు పడినప్పుడు హడావుడి చేసే పాలకులు, అధికార యంత్రాంగం శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయడం లేదు. బందరు రోడ్డులో నిలిచిన వాన నీరు సాక్షి ప్రతినిధి, విజయవాడ: కొద్దిపాటి వర్షానికే బెజవాడ నీటమునుగుతోంది. భారీ వర్షం వస్తే జనాల కష్టాలు మాటల్లో వర్ణించలేం. ప్రధాన రహదారులన్నీ మోకాలులోతు పైన నీటితో చెరువులను తలపిస్తున్నాయి. వాన ఆగిన తర్వాత నగరవాసులు గమ్యస్థానాలకు వెళ్లొచ్చని.. రోడ్డెక్కితే వారి అవస్థలు వర్ణనాతీతం. ప్రజలు రహదార్ల పైకి రాలేని దుస్థితి. ప్రధాన రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. పొరపాటున సందుగొందుల్లోకి వెళితే టూ వీలర్ అయితే బయటికి రాలేని పరిస్థితి. వర్షాలు పడినప్పుడు, నగరపాలక సంస్థ అధికారులు హడావుడి చేసి తాత్కాలిక ఉపశమనం చేయడమేగానీ, శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. ప్రధానంగా నగరానికే తలమానికమైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, పాలిక్లిని రహదారులు వాగులను తలపిస్తున్నాయి. వాన నీరు ముందుగా రోడ్ల వెంట ఉన్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి మేజర్ అవుట్ఫాల్ డ్రెయిన్లోకి చేరుతోంది. ఈ డ్రెయిన్లు కంటిన్యుటీగా లేవు. నగరంలో ఇప్పుడున్న స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లు, అవుట్ఫాల్ డ్రెయిన్లు సరిపోవడం లేదు. డ్రెయిన్లు ఎప్పుడో నిర్మించినవి కావడం.. అవి తగిన పరిణామంలో లేకపోవడం, చిన్నవిగా ఉండటంతో వర్షం నీరు వేగంగా ప్రవహించడం లేదు. ఎక్కడిక్కడ డ్రెయిన్లపై సిమెంటు నిర్మాణాలు చేపట్టడంతో ఇబ్బంది కరంగా మారింది. ప్రధానంగా విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గంలో అవుట్ఫాల్ డ్రెయిన్లు బుడమేరులో కలుస్తాయి, ఇవి ఎప్పుడో నిర్మించినవి కావడంతో ప్రస్తుతం ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు. తూర్పులో పుల్లేటి కాల్వ, గుంటతిప్ప కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటంతో నీరు బయటికి వెళ్లడం లేదు. నగరంలో రఅవుట్ఫాల్ డ్రెయిన్లు సరిగా పని చేయడం లేదు. దీంతో చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైన మోకాలి లోతుకుపైగా నీరు చేరి గంటల తరబడి నిలు స్తోంది. నగరం ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే అవుట్ఫాల్ డ్రెయిన్లలో నీరు ప్రవహించేలా ఆధునీకరించాల్సి ఉంది. వర్షం పడినప్పుడు, నగరపాలక సంస్థ అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టి మమ అనిపిస్తున్నా, పూర్తిస్థాయి పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. -
పర్యావరణహితంగా పండుగలు చేసుకుందాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి చెక్ పెట్టి, పర్యావరణ హితంగా పండగలు జరుపుకొనేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకు మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్లో వివరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మోకోల్ వంటి వినియోగంతో పర్యావరణానికి పెను ముప్పు కలుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 26న నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమలను తయారు చేసి రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలలతో పాటు ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్దఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఇళ్ల వద్ద మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి ఫొటోలను 91549 70454 నంబరుకు వాట్సాప్ చేయాలని సూచించారు. కొందరు సృజనాత్మకంగా గణపతి ప్రతిమలు చేస్తున్నారని.. రకరకాల గింజలు, ఆకులు, కూరగాయలు వంటివాటిని ఉపయోగించి చేస్తున్నారని.. ఇలాంటివి కూడా తయారుచేసి వాటి ఫొటోలను పంపాలని సూచించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియాలి వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జేసీ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అడిషనల్ సీపీ కేజీవీ సరితతో కలిసి గురువారం ఆయన వినాయక చవితి ఉత్సవాలపై రెవెన్యూ, పోలీస్, కాలుష్య నియంత్రణ మండలి, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు, పర్యావరణానికి అనుకూలంగా ఉత్సవాలు నిర్వహించుకునేలా కమిటీలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉత్సవాల వాల్పోస్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నందిగామ, తిరువూరు ఆర్డీవోలో కె.బాలకృష్ణ, కె.మాధురి తదితరులు పాల్గొన్నారు. -
కదిలించిన ఎడ్లంక కథనం
అవనిగడ్డ: వరదల వల్ల తీవ్ర కోతకు గురవుతున్న ఎడ్లంక దుస్థితిపై ‘సాక్షి’లో వచ్చిన ‘ఎడ్లంకకు గుండెకోత’ ప్రత్యేక కథనం అందరినీ కదిలించింది. పల్లెపాలెంకు చెందిన గ్రామస్తులు గురువారం ప్రత్యేక సమావేశమయ్యారు. రెండేళ్ల నుంచి పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పాలకులు స్పందించకుంటే ఎడ్లంక కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామ పరిస్థితిని కథనంలో కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు. శుక్రవారం నుంచి నది వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు గ్రామస్తులు తెలిపారు. హోం మంత్రికి వినతి.. ఎన్ఆర్ఐ, గ్రామవాసి, టీడీపీ నాయకుడు బొబ్బా గోవర్థన్ గురువారం అమరావతిలో రాష్ట్ర హోం మంత్రి అనితను కలిసి ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని చూపించి గ్రామ పరిస్థితిని వివరించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే కొద్ది రోజుల్లో ఎడ్లంక గ్రామం కనుమరుగయ్యే ప్రమాదముందని, విపత్తుల నిధుల నుంచి గ్రామంలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. -
విస్తరణకు వీడని గ్రహణం
నిలిచిన రహదారి నిర్మాణం కందులపాడు–గంగినేని స్టేట్ హైవే–242 విస్తరణ పనుల వివరాలు విస్తరణ పనుల పొడవు 14.44 కిలోమీటర్లు అంచనా విలువ రూ.34.11కోట్లు స్కీము న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు సీసీ రోడ్ల నిర్మాణం 2.87కిలోమీటర్లు కొత్త కల్వర్టులు 4 బాక్సు, 16పైపు కల్వర్టులు కొత్త బ్రిడ్జిలు 4బ్రిడ్జిలు పూర్తైన పనులు 50శాతం జి.కొండూరు: కూటమి పాలకుల నిర్లక్ష్యంతో కందులపాడు, గంగినేని స్టేట్ హైవే పనులు ముందుకు సాగడం లేదు. సుపరిపాలనకు తొలి అడుగు అంటూ గొప్పులు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. అసంపూర్తి రహదారులు అస్తవ్యస్తంగా మారడంతో గ్రామీణ ప్రజలు నరకయాతన పడుతున్నారు. న్యూడెవలప్మెంట్ బ్యాంకు నిధులు 70శాతం, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.30శాతం నిధులతో ఈ రహదారి విస్తరణ పనులు జరగాల్సి ఉంది. రెండున్నరేళ్ల క్రితం విస్తరణ పనులు ప్రారంభం కాగా గత ప్రభుత్వ హయాంలో రూ.4కోట్ల మేర బిల్లులను కూడా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిగా రూ.6కోట్ల మేర బిల్లులను పెండింగ్లో పెట్టడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు. పనులకు అవసరమైన యంత్రాలు, కార్మికులను సైతం పూర్తిగా తరలించడంతో రహదారి విస్తరణ ప్రశ్నార్థకంగా మారింది. పనులు నిలిచిపోయింది ఇలా జి.కొండూరు గెయిల్ ఇండియా కంపెనీ వద్ద 9.430వ కిలోమీటరు నుంచి 9.740వ కిలోమీటరు వరకు 310 మీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. గడ్డమణుగు గ్రామ చివర 9.740వ కిలోమీటరు నుంచి 9.790వ కిలోమీటరు వరకు 50మీటర్ల మేర సీసీరోడ్డును నిర్మించాల్సి ఉంది. గడ్డమణుగు గ్రామ శివారు 9.790వ కిలోమీటరు నుంచి చెర్వుమాధవరం వద్ద 12వ కిలోమీటరు వరకు 2.210కిలోమీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. ఇక్కడే రెండు కిలోమీటర్లు మేర భూ సేకరణ సైతం చేయాల్సి ఉంది. చెర్వుమాధవరం ప్రారంభం 12వ కిలోమీటరు నుంచి గ్రామ చివరి వరకు 13.350వ కిలోమీటరు వరకు 1.350కిలోమీటర్లు మేర సీసీరోడ్డును నిర్మించాల్సి ఉండగా సగం మాత్రమే పూర్తైంది. చెర్వుమాధవరం గ్రామ చివర 13.350వ కి.మీ.నుంచి మునగపాడు గ్రామం 13.700వ కి.మీ వరకు 350మీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉంది. మునగపాడు గ్రామ చివర 14.300వ కి.మీ నుంచి తెల్లదేవరపాడు వద్ద 18.360వ కి.మీ వరకు 4.60కిలోమీటర్లు మేర రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా ఇక్కడ యాభైశాతం మాత్రమే పూర్తయింది. తెల్లదేవరపాడు గ్రామ చివర 18.680వ కి.మీ నుంచి గంగినేని గ్రామ ప్రారంభం 20.370వ కి.మీ వరకు 1.690కి.మీ మేర రహదారిని 50 శాతం విస్తరణ చేయాల్సి ఉంది. గంగినేని చివర 20.900వ కి.మీ నుంచి 23.530వ కి.మీ వరకు 2.630కి.మీ. వరకు రహదారి విస్తరించాల్సి ఉంది. ఇప్పటి వరకు పూర్తయి సీసీరోడ్లకు డ్రైనేజీలు నిర్మించలేదు. పలు చోట్ల కల్వర్టులు, వంతెనలను నిర్మించాల్సి ఉంది. ఈ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును ఆనుకొని ఉన్న కృష్ణావాటర్ పైపులైను మార్చి కొత్తలైను వేసేందుకు అధికారులు రూ.3.30కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. వాటిని కూడా విడుదల చేయకపోవడంతో పైపులైను ఏర్పాటు ఆగింది. ఇది కూడా విస్తరణకు అడ్డంకిగా మారింది. కందులపాడు నుంచి జి.కొండూరు మీదుగా గంగినేని వరకు ఉన్న స్టేట్ హైవే–242 23.53కిలోమీటర్లు ఉంది. ఇది జి.కొండూరు నుంచి గడ్డమణుగు, చెర్వుమాధవరం, మునగపాడు, సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని గ్రామాల మీదుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం గ్రామాన్ని కలుపుతూ మధిర మీదుగా ఖమ్మం వరకు ఈ రహదారి షార్ట్కట్ రోడ్డుగా ఉంది. అయితే ఈ రహదారి భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమైంది. ఈ రహదారి జి.కొండూరు వద్ద 8.700కిలోమీటరు నుంచి 23.530కి.మీ వరకు 14.44 కి.మీలు మేర విస్తరణ పనులకు రూ.34.11కోట్లతో అంచనాలను తయారు చేశారు. ఈ పనులకు ఆగస్టు 27, 2022లో శంకుస్థాపన చేసినా ఆరు నెలలు తర్వాత పనులు ప్రారంభించారు. మొదటి దశ పనులకు నిధులు విడుదలైనా రెండో దశలో నిధులు విడుదలలో జాప్యం జరగడం, సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభం కావడంతో పనులు నిలిచాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు తర్వాత మళ్లీ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ యాభై శాతం రహదారి విస్తరణ పనులు పూర్తి చేశారు. అయినా రూ.6కోట్ల మేర బిల్లులను విడుదల చేయకపోవడంతో చేసేదిలేక కాంట్రాక్టర్ పనులను ఆపేశారు. -
ఉద్ధృతంగానే కృష్ణవేణి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదిపై ఎగువున ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్కు స్వల్పంగా వరద పెరిగింది. బుధవారం తగ్గినట్లే తగ్గి, మళ్లీ వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజ్కు గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 5,04,969 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో.. సాయంత్రం 7 గంటలకు 5,08,849 క్యూసెక్కులకు చేరింది. ఇందులో 4,93,822 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. మిగిలిన 15,027 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 13.7 అడుగులకు చేరింది. బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నది పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక -
సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో లైజనింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లు, వెన్యూ సూపర్వైజర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను లబ్బీపేట రెడ్ సర్కిల్ వద్ద నున్న బిషప్ అజరయ్య బాలికల కళాశాల పరీక్ష కేంద్రంలో ఈనెల 22, 23, 24, 30, 31 తేదీల్లో ఐదురోజుల పాటు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 106 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 11మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. ఆరుగురు విభిన్న ప్రతిభావంతులు పరీక్షలు రాసేందుకు అదే కళాశాలలో పరీక్ష కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు వెన్యూ సూపర్వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ సూపర్వైజర్లను నియమించామని తెలిపారు. అన్ని మౌలిక వసతులు.. పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా ఏపీఎస్ ఆర్టీసీ ఆ రూట్లో బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, యూపీఎస్సీ డెప్యూటీ సెక్రటరీ, ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ సునీల్కుమార్ అగర్వాల్, డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం, ఆర్డీఓ కె. చైతన్య, బిషప్ అజరయ్య బాలికల కళాశాల ప్రిన్సిపల్ కె.సంధ్య, వైస్ ప్రిన్సిపాల్ వి.సునీత తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
మృతదేహానికి 12 రోజుల తర్వాత పోస్టుమార్టం
గన్నవరం: ఓ వ్యక్తి మృతిపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు 12 రోజుల తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటన మండలంలోని చిక్కవరం శివారు చింతగుంట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. చింతగుంట గ్రామానికి చెందిన డోలా లక్ష్మణ్కుమార్(35) కారు డ్రైవర్. సుమారు 14 ఏళ్ల క్రితం జక్కంపూడికి చెందిన బిందుపావనితో అతనికి ప్రేమ వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. నాలుగు నెలల క్రితం కేసరపల్లి శివారు వీఎన్ పురం కాలనీలో లక్ష్మణ్కుమార్ ఇళ్లు అద్దెకు తీసుకుని కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున లక్ష్మణ్కుమార్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లుగా బిందుపావని అతని తల్లిదండ్రులు, బంధువులకు తెలియజేసింది. దీంతో మృతదేహాన్ని చింతగుంటకు తీసుకువెళ్లి మత సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మణ్కుమార్ మృతిపై అతని కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు గన్నవరం పోలీసులను ఆశ్రయించి అతని తండ్రి డోలా ఏసుపాదం ఫిర్యాదు చేశారు. లక్ష్మణ్కుమార్ మృతి చెందినప్పుడు అతని స్నేహితుడు చింతగుంటకు చెందిన దేవరపల్లి ప్రదీప్ కూడా అక్కడే ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడు మృతి విషయంలో కోడలు బిందుపావని, అతని స్నేహితుడు ప్రదీప్పై అనుమానాలు ఉన్నట్లుగా ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తహసీల్దార్ కె. వెంకటశివయ్య సమక్షంలో లక్ష్మణ్కుమార్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని సీఐ బి.వి.శివప్రసాద్ తెలిపారు. -
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ఆఫర్
మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలో త్రిపుల్ ప్లే సర్వీస్ ప్లాన్ను తీసుకొచ్చిందని బీఎస్ఎన్ఎల్ ఏపీసర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం తెలిపారు. విజయవాడ చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ అందుబాటులో ఉండేలా కేవలం రూ. 400కే హైస్పీడ్ ఇంటర్నెట్, 9ఓటీటీ, 400కు పైగా లైవ్ చానల్స్తోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోందన్నారు. ఈ సదుపాయం వినియోగించుకోవటానికి బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్సెంటర్లో స్వయంగాకానీ, ఆన్లైన్లో కానీ సంప్రదించవచ్చన్నారు. అలాగే 18004444 నంబర్కు హెచ్ఐ (హాయ్) అని మెసేజ్ పంపటం ద్వారా కూడా సేవలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బీఎస్ఎన్ఎల్ ఎప్ఐటీహెచ్ కస్టమర్లు కేవలం రూ.140 నుంచి టీవీ సేవలు పొందవచ్చన్నారు. ఫ్రీడమ్ ప్లాన్ ఇదే.. అలాగే ప్రత్యేకమైన ‘ఫ్రీడమ్ ప్లాన్’ను ఆగస్టు 2025లో ప్రవేశపెట్టిందన్నారు. ఇందులో కేవలం రూపాయికే ఉచిత బీఎస్ఎన్ఎల్ సిమ్, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్కాల్స్తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు 30 రోజులపాటు అందిస్తున్నామన్నారు. ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న దృష్ట్యా బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల కోసం స్పామ్ ఫ్రీ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా ప్రారంభించిందన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్లు రవి కుమార్ బుంగ, ఎల్ శ్రీను, జనరల్ మేనేజర్లు మురళీకృష్ణ, టి. వెంకట ప్రసాద్ డీజిఎంలు పాల్గొన్నారు. -
శాప్ చైర్మన్ రవినాయుడు
కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు.. రేపు హాజరుకండి లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు ఈ నెల 23న గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం పది గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో అప్లికేషన్తో జతపరిచిన అన్ని ధ్రువపత్రాల ఒరిజినల్స్, గజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలను తీసుకుని రావాలని సూచించారు. సివిల్ కానిస్టేబుల్స్, ఏపీ ఎస్సీ, పురుష, మహిళ అభ్యర్థులు అందరూ అదే రోజు హాజరు కావాలని స్పష్టంచేశారు. ఉచితంగా చెస్ శిక్షణ శిబిరాలు మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): చెస్ ఆట విశేషాలను పాఠ్యాంశంగా చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు చెప్పారు. స్థానిక పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఎస్ఆర్ఆర్ ఫీడే ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్–2025ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాప్ ఆధ్వర్యంలోని స్టేడియంల్లో చదరంగం కోసం ప్రత్యేకంగా ఒక గది కేటాయించి పేద విద్యార్థుల కోసం శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ టోర్నమెంట్లో 8 చెస్ బోర్డులను లైవ్ గేమ్ కోసం అందుబాటులో ఉంచామన్నారు. 25వ తేదీ వరకు టోర్నమెంట్ జరుగుతుందన్నారు. సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షుడు కృష్ణరావు, జాయింట్ డైరెక్టర్ లలిత్ ప్రసాద్, ఎస్ఎల్వీ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీనివాసరాజు, శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, టోర్నమెంట్ డైరెక్టర్ పి.రేణుక తదితరులు పాల్గొన్నారు. -
నేడు సామూహిక వరలక్ష్మీవ్రతాలు
ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పూర్తిఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం ఐదో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఆచరించనున్నారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రెండు కేటగిరీలలో నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటలకు వరకు రూ.1500 టికెట్పై ఆర్జిత సేవగా జరుగుతుంది. ఈ సేవలో పాల్గొన్న ఉభయదాతలకు, భక్తులకు రూ.300 టికెట్ క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక ఉదయం 10 గంటలకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగుతాయి. ఇప్పటికే భక్తులకు దరఖాస్తులను పంపిణీ చేయగా, దరఖాస్తులు స్వీకరించిన భక్తులు వాటిని పూర్తి చేసి దేవస్థానానికి సమర్పించారు. వ్రతంలో పాల్గొనే భక్తులకు ప్రసాదం కిట్ను ఉచితంగా అందజేస్తారు. వ్రతం అనంతరం రూ.100 క్యూలైన్లో భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాల నేపథ్యంలో మహా మండపం ఆరో అంతస్తులో దేవస్థానం ఏర్పాట్లు చేసింది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సదుపాయాలు కల్పించాలని దేవస్థాన అధికారులు ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, వాటర్ విభాగాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
ఖైదీ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్లో సంచలన ఆధారాలు
విజయవాడ: ఖైదీ శ్రీకాంత్ పెరోల్ అంశానికి సంబంధించి సంచలన ఆధారాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. శ్రీకాంత్ పెరోల్లో హోం మంత్రి అనిత అడ్డంగా దొరికిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాశం సునీల్ లేఖలపై హోంమంత్రి అనిత సంతకాలు చేశారు. హోంమంత్రి అనిత ఎండార్స్మెంట్ పైనే ఫైల్ కదిలింది. మే 16 న హోంమంత్రి అనిత ఫైల్పై సంతకం చేసి పంపగా, హోంమంత్రి ఆదేశాలతో హోంశాఖ ఫైల్ సిద్ధం చేసింది. అయితే ఖైదీ శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వొద్దని రిమార్క్స్ రాసిన నెల్లూరు జైల్ సూపరింటెండెంట్. ఫలితంగా శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడం సాధ్యం కాదని హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. జులై 16వ తేదీన శ్రీకాంత్ పెరోల్ ఫైల్ను హోంశాఖ జాయింట్ సెక్రటరీ తిరస్కరించారు. అయినా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేలు చక్రం తిప్పడంతో నిబంధనలు పక్కన పెట్టి శ్రీకాంత్కి పెరోల్ ఇస్తూ జీవో జారీ చేశారు. -
‘ఇది చాలా తప్పు నారా లోకేష్’.. ఏబీవీపీ ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా రంగం నిర్జీవమైపోయిందంటూ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకట గోపి మండిపడ్డారు. యువగళంలో నారా లోకేష్ యువతకు చాలా హామీలిచ్చారు. మార్చిలో ఇంటర్ పరీక్షలు పూర్తైతే.. ఈరోజుకీ డిగ్రీ అడ్మిషన్ల పట్ల స్పష్టత లేదు.. ఐదు నెలలు పూర్తైంది.. విద్యార్థులకు ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందంటూ మంత్రి నారా లోకేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ప్రైవేట్ యూనివర్శిటీలకు వలస పోతున్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల వద్ద తీసుకున్న లంచాల కారణంగానే అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయని అనుమానాలొస్తున్నాయి. మెగా డీఎస్సీ మెరిట్ లిస్ట్ బహిరంగంగా విడుదల చేయలేదు. మీ పార్టీ కార్యకర్తలకు డీఎస్సీ పోస్టులు ఇవ్వాలనే ఆలోచన కనిపిస్తోంది. మెరిట్ లిస్ట్ను మెసేజ్లు పెట్టి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పడం ముమ్మాటికీ తప్పు..రోస్టర్, మెరిట్ లిస్ట్ ప్రకారమే నియామక పత్రాలు అందించి రిక్రూట్ మెంట్ జరపాలి. ప్రైవేట్ యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. ఐసెట్, పీజీ సెట్లు అయిపోయినా ఇంతవరకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల ఆవరణలోకి విద్యార్ధి సంఘాలు రాకూడదని జీవో ఇవ్వడం దారుణం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పనిచేస్తున్నారు..యూనివర్శిటీల్లో ప్రైవేట్ కార్యక్రమాలు చేయొద్దంటారు. మీరు మాత్రం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారు. రాజకీయాలకు అతీతంగా పాఠశాలలు ఉండాలని మీరే అంటారు. కానీ మీరే రాజకీయ కార్యకలాపాలు పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా మంత్రి నారా లోకేష్ పునరాలోచన చేసి జీవోను ఉపసంహరించుకోవాలి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి’’ అని యాగంటి వెంకట గోపి డిమాండ్ చేశారు.స్కూళ్లు, కాలేజీల ఆవరణలో డ్రగ్స్ దందా విపరీతమైపోయింది. మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్వహించాలి. ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తాం’’ అని వెంకట గోపి హెచ్చరించారు. -
ఉద్యోగులంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? వెంకట్రామిరెడ్డి
విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21 వ తేదీ) జరిగిన ఏపీ క్యాబినెట భేటీలో ఉద్యోగుల డీఏ, ఐఆర్, పీఆర్సీలపై కనీసం చర్చించకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న(బుధవారం) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వినయానంద్ నిర్వహఙంచినా, నేటి చంద్రబాబు క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల బెనిఫిట్స్పై చర్చిస్తారని ఉద్యోగ సంఘాలు చెప్పుకొచ్చాయి. అయితే అది జరగలేదు. కనీసం ఉద్యోగుల డీఏపై కూడా చర్చింంచకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? అని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ‘ ఈరోజు చర్చిస్తామని నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చెప్పారు. కానీ కనీసం ఒక డిఏకి కూడా ఈరోజు ఆమోదించలేదు. 15 నెలలుగా కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వలేదు. ఇక ఐఆర్ లేదు.. పీఆర్సీ కమిషన్ వేయలేదు. ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తోంది. ఉద్యోగులపై పనిభారం పెంచి ఇబ్బంది పెడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే.. కెజిబివి ప్రిన్సిపాల్ని వేధిస్తే చర్యలు లేవు. ఇక ఉద్యోగులు ఎలా పని చేయాలి’ అని మండిపడ్డారు. -
దసరాలో పరిమితంగానే ఆర్జిత సేవలు
●ఉత్సవ ఏర్పాట్లపై దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష ●దుర్గా ఘాట్లో మరింత వైభవంగా కృష్ణమ్మ హారతులకు ఏర్పాట్లు ●టీటీడీ సహకారంతో అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులు ●కుమ్మరిపాలెంలో టీటీడీ స్థలాన్ని దుర్గగుడికి తీసుకునేందుకు చర్చలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి సన్నిధిలో జరిగే ఉత్సవాలు అంటేనే పూజలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అసలు పూజలు లేకుండా ఉత్సవాలు ఏంటి...అయితే అన్ని పూజలు కలిపి 3 వేలకు అటు ఇటుగా పెట్టండి అంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దుర్గగుడి అధికారులను ఆదేశించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దసరా మహోత్సవాల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో బోర్డు మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించగా, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో శీనా నాయక్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు హాజరయ్యారు. సమీక్ష సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలు, గతంలో చోటు చేసుకున్న పలు అంశాల గురించి వీడియో ప్రజెంటేషన్ జరగ్గా, ఆ తర్వాత ఈ ఏడాది చేస్తున్న ఏర్పాట్లు, ఇతర మౌలిక సదుపాయాలపై చర్చ సాగింది. అయితే ప్రధానంగా ఈ ఏడాది ఆర్జిత సేవలను పరోక్షంగా నిర్వహించాలని దేవదాయ శాఖ చేసిన ప్రతిపాదనకు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే దసరా ఉత్సవాలు అంటేనే ఇంద్రకీలాద్రి గుర్తుకు వస్తుందని, అటువంటిది ఆర్జిత సేవలు లేకుండా ఉత్సవాలు ఏంటని ప్రశ్నించారు. అయితే ప్రత్యేక ఖడ్గమాలార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చనలన్నీ కలిపి మూడు నుంచి మూడున్నర వేల టికెట్లు భక్తులకు అందు బాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత ఏడాది దసరా ఉత్సవాల వీడియో ఫుటేజీలను పరిశీలించిన మంత్రి, దేవాదాయ శాఖ అధికారులు కొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. దుర్గాఘాట్లో నిర్వహిస్తున్న కృష్ణమ్మ హారతులను మరింత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, కుమ్మరి పాలెంలోని టీటీడీకి చెందిన రెండున్నర ఎకరాల స్థలాన్ని దుర్గగుడికి ఇచ్చేందుకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటి గురించి టీటీడీతో మాట్లాడినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులను టీటీడీ సహకారంతో త్వరలోనే చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సమావేశంలో దేవస్థాన స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్డీ ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు కోట ప్రసాద్, శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మీడియా సమావేశం లేకుండానే ముగింపు దుర్గగుడిలో జరిగే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదని సిబ్బంది బహిరంగంగా పేర్కొనడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధానానికి దుర్గగుడి అధికారులు తెర లేపారు. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత దేవస్థానమే ఫొటోలు, వీడియోలు పంపుతుందని ముందుగానే మీడియా ప్రతినిధులకు సమాచారం అందించారు. కనీసం సమీక్ష సమావేశం హాల్ వద్దకు కూడా మీడియా ప్రతినిధులు రాకుండా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సమీక్ష సమావేశ వివరాలను రెండు ముక్కల్లో తేల్చివేశారు. -
వేర్వేరు కేసుల్లో బంగారం దొంగలు అరెస్ట్
పటమట(విజయవాడతూర్పు): అత్యాశకు పోయి యజమాని ఇంటిలో బంగారు దొంగిలించిన వేర్వేరు కేసుల్లో నిందితులను పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై విజయవాడ కమిషనరేట్ సెంట్రల్ డివిజన్ ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. గురునానక్నగర్లోని కనకదుర్గ గెజిటేట్ ఆఫీసర్స్ కాలనీలో నివాసం ఉండే దేవరకొండ తేజశ్రీ(24) శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలోని 5వ క్రాస్రోడ్డులో ఉండే అసుసుమిల్లి శివలీల ఇంటిలో పనిమనిషిగా చేరింది. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న రూ.13లక్షల విలువ చేసే 40 గ్రాముల డైమండ్ గాజులు, 114 ఆభరణాలను దొంగింలించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితురాలిపై పటమట పోలీసులు నిఘా పెట్టగా ఆమె వద్ద ఉన్న నగలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. – అశోక్ నగర్, వెంకటప్పయ్య వీధిలో నివాసం ఉండే బైసాని జనార్ధన్ కుటుంబసభ్యులు కుమారుడి వివాహం అనంతరం జూలై 31వ తేదీన శ్రీశైలం వెళ్లగా, ఆగస్టు 1వ తేదీన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉన్నాయని పనిమనిషి సమాచారంతో పటమట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయగా బెంజ్ సర్కిల్, నర్మదా లాడ్జ్ దగ్గరలో, ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్:3, ఎన్హెచ్ –16 సర్వీస్ రోడ్డు మార్జిన్ లో నిందితుడిని అదుపులో తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గుంటూరు అడవి తక్కెళ్లపాడుకు చెందిన ఉప్పల సురేష్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.5 కేజీల వెండి వస్తువులు చోరీ చేయగా అతని వద్ద గుంటూరు జిల్లా పట్టాభిపురంలో దొంగతనం చేసిన 60 గ్రాముల బంగారు ఆభరణాలు, పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన 300 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు పాత నేరస్తుడని, అతనిపై ఉమ్మడి కృష్ణాజిల్లా, గుంటూరు జిల్లాలో పలు కేసులు ఉన్నాయని, నిందితుడు జల్సాలకు అలవాటు పడి సుమారు 20 నేరాలకు పాల్పడ్డాడని చెప్పారు. సమావేశంలో మహిళా ఎస్ఐలు దుర్గా దేవి, రేవతి, ఏఎస్ఐ వి.గోపి, హెచ్.సి అబ్దుల్ రషీద్ కానిస్టేబుల్ నరేశ్, మహిళా కానిస్టేబుల్ సునీత పాల్గొన్నారు. -
బాస్కెట్ బాల్ విజేత హిందుస్థాన్ జట్టు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ పురుషుల బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్స్ బుధవారం రాత్రి సిద్ధార్థ కళాశాల మైదానంలో జరిగాయి. లయోలా కళాశాల(చైన్నె), హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(చైన్నె) జట్ల మధ్య ఫైనల్స్ పోటీ రసవత్తరంగా సాగింది. లయోలా జట్టుపై హిందుస్థాన్ జట్టు విజయం సాధించింది. హిందుస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ జట్టు 81 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 46 పాయింట్లతో లయోలా కళాశాల రన్నరప్గా నిలిచింది. విజేత జట్టుకు రూ.75 వేల నగదు, రన్నరప్ జట్టుకు రూ.50 వేల నగదును సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, అకాడమీ సభ్యులు కలిసి అందజేశారు. ఏపీ సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్, శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, అకాడమీ అడ్వయిజర్ ప్రొఫెసర్ ఎల్కే మోహనరావు, శాప్ మాజీ చైర్మన్ అంకమ్మ చౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి డాక్టర్ బాలకృష్ణారెడ్డి క్రీడాకారులను అభినందించారు. -
సిద్ధార్థలో రోబో ఎక్స్ 2కె25 హాకథాన్ పోటీలు
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో రోబో ఎక్స్ 2కె25 హాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నామని వైస్చాన్సలర్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు తెలిపారు. వర్సిటీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో జాతీయ స్థాయిలో రోబోటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం పెంపొందించటమే కాకుండా యువ ఇంజినీర్ల ఆవిష్కరణలకు వేదికగా ఉంటుందన్నారు. ఈ పోటీలు ప్రధానంగా ఇండస్ట్రీస్ 4.0, స్మార్ట్స్ ఆటోమేషన్, మెకాట్రోనిక్స్, ఏఐ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్పై ఉంటాయన్నారు. ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టామన్నారు.నూతన విద్యా విధానంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ ఎన్.రవికుమార్ మాట్లాడుతూ ఆరు సాంకేతిక పోటీలతో కార్యక్రమం ఉంటుందన్నారు. గెలుపొందిన వారికి రూ.2 లక్షల విలువ చేసే బహుమతులు ఇస్తామన్నారు. అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్ర, ఐటీ హెడ్ ఎం.సునీత, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు డాక్టర్ దిల్లీబాబు, డాక్టర్ ఎం.సుమలత, డాక్టర్ బి.సుప్రజరెడ్డి, విద్యార్థుల కోఆర్డినేటర్ జె.తేజఅమరేశ్వర్, ఫయాజ్, ఎం.ప్రవల్లిక, ఎస్.హర్షిత పాల్గొన్నారు. -
పత్తి చేలల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపాలి
గరికపాడు కేవీకే శాస్త్రవేత్తలు రాజశేఖర్, శివప్రసాద్ పెనుగంచిప్రోలు: పత్తి చేలల్లో వర్షపునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గరికపాడు కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శివప్రసాద్ రైతులకు సూచించారు. మండలంలోని వెంకటాపురం, శనగపాడు, పెనుగంచిప్రోలు గ్రామాల్లో బుధవారం పత్తి పంటలను పరిశీలించారు. పత్తి చేలల్లో వర్షపునీరు బయటకు పంపించిన వెంటనే 20 కేజీల యూరియా, 15 కేజీల పొటాష్ను కలిపి ఎకరాకు బూస్టర్ డోస్గా వేసుకోవాలని చెప్పారు. దీంతో పంట పెరుగుదల వస్తుందని తెలిపారు. నీరు తగ్గిన తర్వాత 19:19:19: ఎరువుల మిశ్రమాన్ని ఎకరానికి 1 కేజీ స్ప్రే చేసుకోవాలని, ఎండు తెగుల నివారణ కోసం కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములను నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. రసం పీల్చు పురుగులైన పేనుబంక, మైట్స్, త్రిప్స్ ఉన్నట్లయితే వేపనూనె 1000 పీపీఎం మందును 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరి పంటలో 25 కేజీల యూరియా 15 కేజీల పొటాష్ను కలిపి వేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి.రామసుబ్బారెడ్డి, ఏఈఓ, వీఏఏలు రైతులు పాల్గొన్నారు. -
గూడూరు–విజయవాడ సెక్షన్లో డీఆర్ఎం తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా బుధవారం గూడూరు–విజయవాడ సెక్షన్లో విస్తతంగా తనిఖీలు చేపట్టారు. నెల్లూరు స్టేషన్లో అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ముందుగా అధికారులతో కలసి డీఆర్ఎం గూడూరు స్టేషన్లోని ప్లాట్ఫాంలు, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ సకాలంలో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి నెల్లూరు స్టేషన్కు చేరుకుని స్టేషన్ ఆధునికీకరణ పనులను పర్యవేక్షించారు. నూతన భవన నిర్మాణాలు, ప్లాట్ఫాం పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేయాలన్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ప్రవేశ ద్వారాలు నెల్లూరు స్టేషన్కు ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. అనంతరం బిట్రగుంట, సింగరాయకొండ, ఒంగోలు స్టేషన్లను సందర్శించి సిబ్బందికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో గూడూరు–విజయవాడ సెక్షన్ అత్యంత కీలకమైనదన్నారు. ఈ సెక్షన్లో ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాల దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో పనులు వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. నందిగామ టౌన్: ఇంటిలోని ఫ్యాన్కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన కాసర్ల లక్ష్మయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు మనోజ్ (24) జేసీబీ ఆపరేటర్గా పని చేస్తూ మద్యానికి బానిసై నిత్యం మద్యం తాగుతుండటంతో పలుమార్లు తండ్రి మందలించాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి తండ్రితో వాగ్వాదానికి దిగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన మనోజ్ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి మనోజ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. మృతుని తండ్రి లక్ష్మయ్య కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. కృష్ణలంక(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బెంజిసర్కిల్ సమీపంలోని ఐరా హోటల్ ముందు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఒక వ్యక్తి మద్యం తాగి తూలుతూ నడుస్తూ రోడ్డు పక్కన పడిపోయాడు. కాళ్లు, చేతులు కొట్టుకుంటుండగా చుట్టుపక్కల వారు అతనిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుని వద్ద ఊరు, పేరుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండవచ్చని తెలిపారు. హోటల్ వాచ్మన్ నర సింహారావు బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో పండ్ల వ్యాపారి మృతి చెందిన ఘటన గుణదల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుడమేరు మధ్య కట్ట లెనిన్నగర్కు చెందిన పొగిరి శ్రీనివాస్(41) మాచవరంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన మంగళవారం రాత్రి తన ద్విచక్రవాహనంపై నున్న బైపాస్ వైపు నుంచి గుణదల వైపు వస్తుండగా గుణదల రైల్వేగేటు సమీపంలో ఎదురుగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను చుట్టుపక్కలవారు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు శ్రీనివాస్ అప్పటికే మృతి చెందాడని ధ్రువీకరించారు. శ్రీనివాస్ భార్య పొగిరి రమాదేవి ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేగంగా వచ్చి ఢీకొట్టిన ద్విచక్రవాహన చోదకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.