breaking news
NTR
-
ఆటోపై కూలిన తాటి చెట్టు.. డ్రైవర్కు తీవ్ర గాయాలు
నందమూరు(గన్నవరం): రోడ్డుపై వెళ్తున్న ఆటోపై తాటి చెట్టు కూలి డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఉంగుటూరు మండలం నందమూరు వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... ఉంగుటూరు మండలం ముక్కపాడుకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీను తెల్లవారుజామున పెనమలూరులో ఉన్న బందువులను ఎక్కించుకుని వచ్చేందుకు బయలుదేరాడు. నందమూరు వద్దకు రాగనే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి రోడ్డు పక్కనే ఉన్న తాడిచెట్టు కూలి ఒక్కసారిగా ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో శ్రీనుకు బలమైన గాయాలు కావడంతో ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. వర్షానికి కూలిన చెట్టును ఢీకొని బైకిస్టు దుర్మరణం గుణదల(విజయవాడ తూర్పు): వర్షానికి రోడ్డుపై కూలిన చెట్టును ఢీకొని మోటారు సైకిల్పై వెళుతున్న వ్యక్తి మృతి చెండాడు. ఈ ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., గుణదల హరిజన వాడకు చెందిన తుళ్లూరి మహేష్ బాబు (37) యనమల కుదురు ప్రాంతంలో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తుంటాడు. రెండేళ్ల క్రితం స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రోజు ఉదయం షాపు నిర్వహించేందుకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యనమలకుదురు వెళ్లిన మహేష్బాబు రాత్రి 11.30 గంటలకు గుణదలలోని ఇంటికి ప్రయాణమయ్యాడు. అప్పటికే వర్షానికి లయోల కళాశాల రోడ్డులో ఓ చెట్టు పడిపోయింది. రాత్రి సమయంలో వేగంగా వెళుతున్న మహేష్బాబు రోడ్డు పై పడి ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. బలమైన గాయాలు కావడంతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు వచ్చిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మహేష్బాబు బైక్ పై వచ్చి చెట్టుకు ఢీ కొట్టిన సీసీ కెమేరా ఫూటేజిలు లభ్యమయ్యాయని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు పెనమలూరు: తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు అరెస్టయ్యాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప శ్రీనివాసానగర్కు చెందిన నన్నం శౌరి(68), నన్నం కేశవరావులు తండ్రీకొడుకులు. ఇద్దరూ పెయింటింగ్ పనులు చేస్తుంటారు. రెండు రోజల కిందట కేశవరావు తనతో పాటు పనికి రావడం లేదనే కోపంతో తండ్రిపై దాడి చేశాడు. గాయపడి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా శౌరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనను రోడ్డు ప్రమాదంలో శౌరి గాయపడ్డాడని తప్పుదారి పట్టించటానికి కేశవరావు యత్నించాడు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావటంతో పోలీసులు కేశవరావుపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది. -
సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
టీడీపీ నేత వేధింపులే కారణం పెనమలూరు: టీడీపీ నేత బరి తెగించాడు. సచివాలయ మహిళా ఉద్యోగినిని బూతులు తిడుతూ బెదిరించాడు. దీంతో ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవటానికి బందరు కాలువలో దూకే యత్నం చేయగా మున్సిపాలిటీ ఉద్యోగులు, స్థానికులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురులో గ్రామ నాయకుడు, మరో వార్డు నాయకుడు కొద్ది రోజులుగా వీధి దీపాల వ్యవహారంలో పెత్తనం చెలాయిస్తున్నారు. వీధి దీపాలు వేయాలంటే తమ అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో సచివాలయ సిబ్బందికి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. మరో టీడీపీ నేత తాను ఉండే ప్రాంతంలో రెండు రోజుల క్రితం వీధి దీపాలు వేయించాడు. ఇది తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకుడు ఆగ్రహంతో బుధవారం సచివాలయానికి వచ్చి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని నిలదీస్తూ ఎవరిని అడిగి వీధి దీపాలు వేయిస్తున్నావని తీవ్రంగా దూషించాడు. బూతులు తిట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె వెంటనే యనమలకుదురు లాకుల వద్దకు వచ్చి బందరు కాలువలో దూకబోయింది. సహచర సిబ్బంది ఆమెను వారించి రక్షించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఈ విషయమై కమిషనర్ నజీర్ను వివరణ కోరగా ఘటనపై విచారిస్తానని, వీధి దీపాలు వేయటానికి ఎవ్వరి సిఫార్సు అవసరం లేదని చెప్పారు. బీరువా పగులగొట్టి నగలు చోరీ చిట్టినగర్(విజయవాడపశ్చిమ): బీరువా తాళాలు పగులగొట్టి వెండి, బంగారు నగలను చోరీకి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాపురం పరిధిలోని పైపుల రోడ్డు సమీపంలోని కృష్ణ బాబాయి హోటల్ వద్ద పన్నేరి దుర్గాప్రసాద్ తన భార్య సుమతో కలిసి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. దుర్గాప్రసాద్ ఎసీ టెక్నిషియన్గా పని చేస్తుంటాడు. ఈ నెల 10వ తేదీన దుర్గాప్రసాద్ భార్యకు ఇంట్లో సీమంతం జరిగింది. అదే రోజు సాయంత్రం సుమా పుట్టింటికి వెళ్లింది. 12వ తేదీ మధ్యాహ్నం దుర్గాప్రసాద్ తన ఇంటికి వచ్చి భార్యకు కావాల్సిన కొన్ని బట్టలు తీసుకుని అత్త గారి ఇంటికి వెళ్లాడు. అయితే బట్టలు సరిపోలేదని మరో డ్రెస్ తెచ్చేందుకు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి కనిపించాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసి కనిపించాయి. బీరువాలో ఉండాల్సిన నాలుగు గ్రాముల బంగారు నల్లపూసలు, 3 గ్రాముల బంగారపు చెవిదిద్దులు, 300 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురయినట్లు గుర్తించాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అమరేశ్వరుని పవిత్రోత్సవాలు ప్రారంభం అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
ప్రగతి సూచికలే ‘స్వర్ణాంధ్ర’ పునాదులు
●పీ4 అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపాలి ●జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ●విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో డీఆర్సీ సమావేశం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే (కేపీఐ) పునాదులని.. నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లోనూ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. బుధవారం విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్లోని రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా మూడో సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో పాటు ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకటరావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కొలికపూడి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ లక్ష్మీశ.. సుపరిపాలనలో తొలి అడుగు పనుల్లో ప్రగతిని వివరించారు. మొత్తం రూ. 167.37 కోట్లతో శంకుస్థాపన చేసిన 1,661 పనుల్లో ఇప్పటికే 1,339 పనులు ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను, రంగాల వారీగా జీవీఏ, జీడీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సానుకూల దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. డీఆర్సీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. 2024–25లో జిల్లా జీడీపీ రూ. 94,561 కోట్లు కాగా దీన్ని 2025–26లో రూ.1,12,057 కోట్లకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా 2024–25లో తలసరి ఆదాయం రూ. 3,53,150 కాగా దీన్ని 2028–29 నాటికి రూ. 6,38,946కు చేర్చాల్సి ఉందన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు వరుస లో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించా రు. విజయవాడ నగర ఘన వారసత్వ సంపద ను భావితరాలకు అందించేందుకే విజయవాడ ఉత్సవ్ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కీలక అంశాలను ముందుంచిన ఎమ్మెల్యేలు.. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు, గహ నిర్మాణాల వేగవంతానికి రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ఏర్పాటు, అడ్డంకులు లేని సురక్షిత తాగునీటి పథకాల పటిష్ట అమలు, ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులు, గన్నవరం–విజయవాడ రహదారి, లింకు రోడ్ల అభివృద్ధి, విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాలకు రెయిలింగ్, ఆటోనగర్ల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ల రూపకల్పన, వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకాల సమస్యల పరిష్కారం తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరుకు కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయినందున, పైపులైన్ల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎ.కొండూరు డయాలసిస్ కేంద్రంలో వారానికి ఒకసారి కా కుండా రెండు రోజులు నెఫ్రాలజిస్టు సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, ఆర్టీఓలు కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డ్వాక్రా బజార్ల ఏర్పాటు కీలకం : ఎంపీ శివనాథ్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. విజయవాడ అర్బన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు డ్వాక్రా బజార్ల ఏర్పాటు, ఎర్రకట్ట పై వంతెన ఆధునికీకరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ వర్క్ డీపీఆర్, అర్బన్ నియోజకవర్గాల పరిధిలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, మూడు కాలువల గట్ల సుందరీకరణతో పాటు గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు, గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. -
విద్యతోనే జ్ఞాన సముపార్జన
గుడ్లవల్లేరు: ఆకాశమే హద్దుగా విద్యార్థులు జ్ఞాన సముపార్జనకే విద్య అభ్యసించాలని స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ జి.వి.వి.సత్యనారాయణ మూర్తి అన్నారు. వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు 17వ స్మారక అవార్డుల ప్రదానోత్సవం బుధవారం నిర్వహించారు. గుడ్లవల్లేరు ఎ.ఎ.ఎన్.ఎమ్ అండ్ వి.వి.ఆర్.ఎస్.ఆర్. పాలిటెక్నిక్ కాలేజీలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ అవార్డులను సాంకేతిక విద్యామండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించారన్నారు. విద్యా విధానంలో మార్కులకు ప్రాతిపదికగా కాకుండా నైపుణ్యాలను పెంపొందించే దిశగా పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని మార్పులు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొనే దిశగా అడుగులువేస్తున్నామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను అందించటంలో లాభాపేక్ష లేని ఒక విద్యా వ్యవస్థను స్థాపించడంలో దివంగత వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. గుడ్లవల్లేరు ఏఏఎన్ఎమ్ అండ్ వీవీఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ విద్యార్థిని ఆలూరి లలిత కోమలికు రూ.10వేల విలువైన బంగారు పతకాన్ని, రూ.10వేల నగదును, డి.టి.ఇ ధ్రువీకరించిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ద్వితీయ ర్యాంకు సాధించినందుకు గాను శ్రీ వాసవి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ – టెక్నాలజీ నందమూరు పాలిటెక్నిక్కు చెందిన విద్యార్థిని అంకెం అఖిలా దేవికి రూ.5ల విలువగల బంగారు పతకాన్ని, రూ.5 వేల నగదును, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కాలేజీ ప్రెసిడెంట్ వల్లభనేని సుబ్బారావు, గారు, కో– కరెస్పాండెంట్ వల్లూరుపల్లి రామకృష్ణ తదితనేఏ పాల్గొన్నారు. స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సత్యనారాయణమూర్తి -
బందరులో ‘క్విట్ కార్పొరేట్’ నిరసన
మచిలీపట్నంటౌన్: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ల ప్రవేశాన్ని అడ్డుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు బుధవారం మచిలీపట్నం కోనేరు సెంటర్లో ధర్నా నిర్వహించారు. వ్యవసారంగంలో ఇప్పటికే చిన్న కమతాల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 20 సెంట్లు భూమి కలిగిన చిన్న రైతులకు అన్నదాత భరోసా పథకం వర్తించడం లేదని కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం నారాయణరావు మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి అత్యధికంగా పండే ఆక్వా ఉత్పత్తులపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల భారం నుంచి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కాపాడాలన్నారు. ఇతర దేశాలకు సరుకు ఎగుమతుల్లో ప్రోత్సహించి రొయ్యల రైతులకు గిట్టుబాటు ధర అదే విధంగా చూడాలని కోరారు. కృష్ణాజిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కోసూరు శివ నాగేంద్ర మాట్లాడుతూ అధిక వర్షాల బారిన పడి ముంపునకు గురైన వరి రైతులను ఆదుకోవాలన్నారు. వేలాది రూపాయల ఖర్చుపెట్టి వరి నాట్లు పూర్తి చేసిన రైతులకు నీటి ముంపు సమస్య తీరని నష్టం కలిగించిందన్నారు. డ్రెయిన్ల నిర్వహణ వేసవి కాలంలో చేపట్టి పనులు పూర్తి చేసి ఉంటే ముంపు నీరు త్వరగా తరలిపోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాల మేరకు ఉంటుందని ఆచరణలో అమలు జరగడం లేదన్నారు. రైతులు తమ పండించిన పంటలు అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఐటీయూ కృష్ణా జిల్లా కోశాధికారి బూర సుబ్రహ్మణ్యం, నగర కన్వీనర్ సీహెచ్ జయరావు, బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకుడు ఎండీ యూనస్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో 16న కృష్ణాష్టమి వేడుకలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 16వ తేదీ శనివారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కృష్ణ భగవానుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. లక్ష్మీ గణపతి విగ్రహం ఎదురుగా ఉన్న గోశాల వద్ద గోమాతకు విశేష పూజలు, సాయంత్రం 5 గంటలకు మహా మండపం కళావేదికపై దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసం ఉంటుందని తెలిపారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం రాజగోపురం ఎదుట ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. 19, 20 తేదీల్లో దరఖాస్తుల పంపిణీ.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో నిర్వహించే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు 19, 20వ తేదీలలో దరఖాస్తులను అందిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 22వ తేదీ 5వ శుక్రవారం మహా మండపం ఆరో అంతస్తులో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్న సంగతి తెలిసింది. ఈ వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు మహా మండపం గ్రౌండ్ ప్లోర్లో ఉన్న దేవస్థాన టోల్ ఫ్రీ కార్యాలయంలో ఉదయం నుంచి దరఖాస్తుల పంపిణీ జరుగుతుందన్నారు. దరఖాస్తులను పూర్తి చేసి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి తిరిగి కార్యాలయంలో అందచేయాలని తెలిపారు. -
విద్యుత్ షాక్తో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి
వీరులపాడు: విద్యుదాఘాతంతో ప్రొక్లెయిన్ డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని జయంతి గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు... గ్రామానికి చెందిన వల్లబోయిన గోపి (32) ప్రొక్లెయిన్ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం గ్రామ శివారులోని వ్యవసాయ పనులు ముగించుకుని ప్రొక్లెయిన్ను లారీపై ఎక్కించి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్సీ కాలనీ వద్దకు వచ్చే సరికి 11 కెవీ విద్యుత్ తీగలు ప్రొక్లెయిన్కు అడ్డురావటంతో తప్పించబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అనిల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
విద్యార్థులూ.. డ్రగ్స్ జోలికెళ్లొద్దు!
●ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులేయండి ●ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో బుధవారం యునైటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని సంయుక్త పేరుతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీ విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు వంటి దుర్వసనాల బారినపడితే జీవితం అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ చట్టం కింద విద్యార్థులపై కేసు నమోదైతే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగానికి, సరఫరాకు దూరంగా ఉండాలని హితవు పలికారు. డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి.. విజయవాడ డీసీపీ కె.జి.వి.సరిత మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని, దేశ ప్రగతికి కృషి చేయాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్పీ కె.నగేష్బాబు మాట్లాడుతూ ఆతిధ్య రంగంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో విద్యార్థులే కీలకమన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని కళా నైపుణ్యాలను వెలికితీసి వారిని బహుముఖ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే సంయుక్త లక్ష్యమన్నారు. అనంతరం ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు అనే బ్యానర్లును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అబ్దుల్ రెహమాన్, యునైటెడ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపాల్ జగదీష్ జంపన, ఈవెంట్ మేనేజర్ ఉష, ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం.రవీంద్ర, ఎస్ఐ ఎం.వీరాంజనేయులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో ఇద్దరు బాల నేరస్తులు
గన్నవరం: బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు బాల నేరస్తులను గన్నవరం పోలీసులు బుధవారం అదుపులో తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి ఈ ఏడాది జూలై 22న ఐదుగురు బాల నేరస్తులు పారిపోయారు. వీరిలో ఇద్దరు హయత్నగర్, చౌటుప్పల్లో రెండు బైక్లను చోరీ చేసుకుని విజయవాడ వచ్చి రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక దావాజీగూడెం రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేసి ఉన్న రెండ్ బైక్లు ఈ నెల 6వ తేదీ రాత్రి అపహరించారు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలోని సిబ్బంది సాంకేతిక ఆధారాలు మేరకు స్థానిక కోనాయి చెరువు సమీపంలో బైక్పై వెళ్తున్న ఇరువురు బాల నేరస్తులను అదుపులో తీసుకున్నారు. వీరి నుంచి సుమారు రూ. 4.30 లక్షల విలువైన మూడు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల గురించి హైదరాబాద్లోని జువైనెల్ హోమ్కు సమాచారం ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. -
మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు
కోనేరుసెంటర్: జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసులతో పాటు ప్రజలూ పాటుపడాలని ఎస్పీ గంగాధరరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగిన నషా ముక్త్ భారత్ అభియాన్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని, యువతను మత్తు పదార్థాల జోలికి పోకుండా పాటు పడతామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సమూలంగా నాశనం చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. యువత జీవితాలను చిత్తు చేస్తున్న గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలను నాశనం చేయడానికి పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఎస్పీ గంగాధరరావు -
ముంచేసినది
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం అర్ధరాత్రి, బుధవారం జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో, విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. బుడమేరు వాగు ఉధృతి పెరుగుతోంది. విజయవాడ పశ్చిమలో డ్రెయిన్లు పొంగి, రోడ్ల మీద నాలుగు అడుగుల మేర నీరు చేరాయి. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం.. టీడీపీ 53వ డివిజన్ అధ్యక్షుడు తిరువాయి పాటి మధుసూదరావు, టీడీపీ కార్యకర్త షేక్ ముర్తజ్ను పొట్టన పెట్టుకొంది. గులాం మొహద్గీర వీధిలో యూజీడీ కోసం అనేక చోట్ల 10నుంచి 14 అడుగుల గోతుల్ని తీసి రక్షణ చర్యలు చేపట్టలేదు. దీంతో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు మూడునుంచి నాలుగు అడుగుల మేర నిలిచింది. అక్కడ గోతులు ఉన్నాయనే విషయం తెలియక గీతా మందిరం వీధి చివర గొయ్యిలో మధుసూదనరావు, జెండా చెట్టు వద్ద వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకొని ముర్తాజ్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. విధ్యాధరపురం డిపో, జోనల్ వర్క్షాపు, వించిపేట, గణపతిరావునగర్, తారక రామనగర్, భవానీపురం, లేబర్ కాలనీ.. ఇలా పలు కాలనీలు నీట మునిగాయి. లయోల కాలేజీ సమీపంలో పటమట నివాసి అజయ్కుమార్పైన చెట్టు పడటం ప్రాణాలు విడిచారు. గుణదల సమీపంలోని పుల్లేటి డ్రెయిన్, టిక్కిల్ రోడ్డు, పన్నిమనేని పాలీక్లినిక్ రోడ్డు , ఈఎస్ఐ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్డు, డెంటల్ కాలేజీ రోడ్డు , ఏలూరు రోడ్డు, బుడమేరు ఏలూరు కాలువ మధ్యకట్ట, ఆర్టీసీ లేబర్ కాలనీలో డ్రెయిన్లు పొంగాయి. కృష్ణా నదికి పెరుగుతున్న వరద కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బుధవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో 3,44,638 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చింది. రెండు, మూడు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు, పులిచింతల, మున్నేరు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వరద నీరు పోటెత్తే అవకాశం ఉంది. దీంతో రానున్న రోజుల్లో ప్రకాశం బ్యారేజీకి 5లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నం. 91549 70454 ఏర్పాటు చేశారు. 87.03 మిల్లీమీటర్ల వర్షపాతం ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం రాత్రి 6.30 గంటల మధ్య 87.03 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 170.5 మిల్లీమీటర్లు, కంచికచర్లలో 110.7, జగ్గయ్యపేటలో 146.5, వీరులపాడులో 123.2, విజయవాడ నార్త్లో 123.8, విజయవాడ సెంట్రల్లో 127. 4, విజయవాడ వెస్ట్లో 127.4 , విజయవాడ ఈస్ట్లో 121.4, చందర్లపాడులో 102.4, విసన్నపేటలో 55.2, ఏ కొండూరులో 68.8, రెడ్డిగూడెంలో 109.3, మైలవరంలో 43.0, విజయవాడ రూరల్లో 60.0, నందిగామలో 78.0, జి కొండూరు లో 38.1, వత్సవాయిలో 62.3, పెనుగంచిప్రోలులో 63.6, తిరువూరులో 17.6 , గంపలగూడెంలో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లాలో, విజయవాడలో పలుప్రాంతాలు జలమయం బుడమేరుకు వాగుకు పెరుగుతున్న వరద ఉధృతి గుణదల వంతెనపై నుంచి ప్రవహించిన నీరు కృష్ణా నది ఎగువ నుంచి భారీగా వరద విజయవాడ వన్టౌన్లో డ్రెయిన్లో పడి ఇద్దరు, లయోల కాలేజీ సమీపంలో మరొకరు మృతి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 91549 70454 రెండు రోజులుగా దంచికొడుతున్న వాన -
ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీల వివరాలు
గ్రామ పంచాయతీలు 288 గ్రామ సచివాలయాలు 255 మార్చిలో రావాల్సిన ఆర్థి సంఘం నిధులు రూ.11.76కోట్లు జగనన్న కాలనీలు 291 గ్రేడ్–1 కార్యదర్శులు 40 గ్రేడ్–2కార్యదర్శులు 43 గ్రేడ్–3 కార్యదర్శులు 41 గ్రేడ్–4కార్యదర్శులు 10 గ్రేడ్–5కార్యదర్శులు 175 గ్రేడ్–6 కార్యదర్శులు 233 పంచాయతీ కార్మికులు 2200 -
పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాల విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో పాఠశాల విద్య, నిర్మాణ అంశాలపై ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడతూ కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ దార్శనికత –2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంగా లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ క్రమంలో పాఠశాల విద్య మెరుగుదలకు విద్యాధికులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో పాఠశాల స్థాయిలో వారికి సబ్జెక్టుపై పట్టు సాధించానికి నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం చాలా ముఖ్యమని పేర్కొంటూ ఆ దశలో వారికి వేయాల్సిన అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు అందించాలని చెప్పారు. రక్తహీనత నివారణకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని నైతిక విలువలు నేర్పిస్తూ మాదకద్రవ్యాల జోలికి పోకుండా చైతన్యవంతులను చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో పీవీజే రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ కుమిదినీసింగ్, డీఎంఅండ్హెచ్వో డాక్టర్ శర్మిష్ట, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్వాతంత్య్ర వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను డీజీపీ హరీష్కుమార్ గుప్తా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం పోలీస్ పరేడ్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, వీవీఐపీలు, వీఐపీలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారని కట్టుదిట్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీజీపీ మధుసూదనరెడ్డి, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, ఐజీ బి.రాజకుమారి, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి బెంగుళూరుకు చెందిన భక్తులు బుధవారం రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన పిళ్లా రవి దంపతులు కుటుంబం సమేతంగా అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ. 2 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఏఈవో ఎన్.రమేష్బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సాగరంలో ‘అల’జడి కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. బుధవారం ఉదయం నుంచి పాలకాయతిప్ప బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం నీరు ముందుకు చొచ్చుకురావడంతో పాటు తీరంలో ఈదురుగాలుల తీవ్రత అధికమైంది. సముద్ర స్థితిగతుల్లో మార్పు కనిపిస్తోందని పాలకాయతిప్ప మైరెన్ పోలీసులు తెలిపారు. బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర ఇసుక తిన్నెలు భారీగా కోతకు గురై భయానకంగా మారింది. భారీ వర్షాలు కూడా ఉండటంతో తీరంలో అలజడి నెలకొంది. గ్రంథాలయాలకు కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రంథాలయాల ద్వారా పౌరులకు డిజిటల్ సేవలు అందించేందుకు శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్, శిక్షణ ఫౌండేషన్, బెంగుళూరు గ్రంథాలయాలకు కంప్యూటర్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లు అందజేశారు. కృష్ణా జిల్లాలోని 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేశారు. బుధవారం ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రాజెక్టు మేనేజర్ వి. స్వాతిదేవ్ ఆయా గ్రంథాలయాలకు అందజేశారు. డైరెక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 70 శాఖా గ్రంథాలయాలను ఎంపిక చేసి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు అందజేశారన్నారు. యువతకు, నిరుద్యోగులు, విద్యార్థులకు డిజిటల్ లైబ్రరీ వ్యవస్థ ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్ స్వాతిదేవ్ మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రంథాలయాలకు 2 కంప్యూటర్లు, ఒక స్మార్ట్ టీవీ, ఒక స్మార్ట్ ఫోన్, ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ టీం ప్రతినిధులు డి. సత్యనారాయణ, రాజారావు, ఎ.బుచ్చిబాబు, ఎ. కార్తీక్, కార్యదర్శి వి. రవికుమార్ ఠాగూర్ గ్రంథాలయాధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కానూరులో వాలీబాల్ పోటీలు పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో ఆలిండియా ఇన్విటేషన్ వాలీబాల్ పోటీల వేదికగా మార్చారు. మూడు రోజులుగా విజయవాడ పీబీ సిద్ధార్థలో జరుగుతున్న పోటీలను వర్షం కారణంగా కానూరు సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సీటీలో పోటీలను బుధవారం ఉపకులపతి పి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. లీగ్ విభాగంలో మహిళల పోటీలో తమిళనాడు స్పోర్ట్స్ అకాడమీ జట్టు కేరళ అజంష్షన్ కాలేజీపై గెలిచింది.ఏపీ ఎంసీఎఫ్ జట్టు చైన్నె ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై విజయం సాధించింది. పురుషుల విభాగంలో చైన్నె ఎస్ఆర్ఎం జట్టు గుజరాత్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై, తివేండ్రం స్పోర్ట్స్ అథారటీ ఆఫ్ ఇండియా జట్టు కేరళ హోలీ గ్రేస్ జట్టుపై గెలిచింది. నాకౌట్ పోటీలు పూర్తయ్యాయని, లీగ్ పోటీలతో టోర్నమెంట్ ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. -
ఎడతెరిపి లేకుండా..
నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలతో పాటు పేట మున్సిపాల్టీలో మంగళవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెనుగంచిప్రోలు మునేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుతపమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లింగాల బ్రిడ్జి వద్ద పది అడుగుల మేర మునేరు ప్రవహించడంతో వత్సవాయి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జగ్గయ్యపేట మున్సిపాల్టీలోని ఎర్రకాలువ ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. -
పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు: చెవిరెడ్డి
సాక్షి, విజయవాడ: అక్రమ మద్యం కేసులో సిట్ అధికారులు తనను అక్రమంగా ఇరికించారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ‘‘మా కుటుంబం మద్యం జోలికి పోలేదు. వేద పాఠశాల నడుపుతున్నా.. నేనెప్పుడూ అబద్ధం చెప్పను.. పైన దేవుడు చూస్తున్నాడు.. అనుభవిస్తారు’’ అంటూ కోర్టు నుంచి జైలుకి తరలించే సమయంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.గాడ్ ఈజ్ సుప్రీం.. నేచర్ ఈజ్ సుప్రీం. అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మద్యం ముట్టలేదు.. అమ్మలేదు. అమ్మనురాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు మోపండి. చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యాన్ని రుద్దడం భావ్యం కాదు. ప్రభుత్వ పెద్దలు తప్పు చేస్తున్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తున్నారు’’ అంటూ చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, లిక్కర్ అక్రమ కేసులో అరెస్టైన వారికి ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన వారికి ఆగస్ట్ 26 వరకూ రిమాండ్ను పొడిగించింది. -
ఏపీవాసులకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
Heavy Rains In AP Updates:బుడమేరు వాగు ఉధృతిభారీవర్షాలతో బుడమేరులో పెరిగిన నీటి ప్రవాహంసరైన సమాచారం లేక ఆందోళన చెందుతున్న ప్రజలుబుడమేరు మధ్య కట్ట, గుణదల తదితర ప్రాంతాలలో పర్యటించిన సీపీఎం నేత సీహెచ్ బాబురావులోతట్టు ప్రాంతాల్లో మునిగిన కొన్ని ఇళ్లను సందర్శించిన బాబురావు, సీపీఎం నేతలుకృష్ణానది వరద ముంపు, కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలను పరామర్శించిన సీపీఎం బృందంవిజయవాడలో దంచికొడుతోన్న వర్షంరోడ్లు జలమయంపొంగిపొర్లుతున్న డ్రైన్లులోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరుతున్న వర్షపు నీరువిద్యాధరపురంలో పలు ఇళ్లలోకి చేరిన వర్షపునీరుగన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షంవిజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు, ప్రసాదంపాడులో జాతీయ రహదారిపైకి చేరిన వర్షపు నీరు.తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.సాక్షి, విజయవాడ: ఏపీలో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి ఈదురుగాలులు కొనసాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కృష్ణనది పరీవాహక ప్రాంత ప్రజలకు అధికారులు అలెర్ట్ జారీ చేశారు. విజయవాడలో బుడమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గుణదల వంతెనపై నుంచి బుడమేరు ప్రవాహం కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నంలోని చినలంక, పెద్దలంక ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండి పడింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద నీరు చేరుకుంది. కోల్కత్తా-చెన్నై జాతీయ రహదారిపై వాహనాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న(మంగళవారం) రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి.కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగిపొర్లుతోంది. కారంపూడి-దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాచవరం మండలం రుక్మిణి పురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం-పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. -
విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు బలి
సాక్షి, విజయవాడ: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఒకరు, చెట్టు మీదపడి మరొకరు మృతిచెందారు. మృతులను టీవీ మధుసూదన్, మూర్తాజా గుర్తించారు.గులాం మొహిద్దీన్ స్ట్రీట్లో మ్యాన్ హోల్ కోసం నగరపాలక సంస్థ అధికారులు భారీ గుంత తవ్వించారు. భారీ గోతుల వద్ద అధికారులు ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. గత రాత్రి కురిసిన వర్షానికి రోడ్లు చెరువుల్లా మారాయి. వీఎంసీ అధికారులు తవ్విన గోతిలో టీవీ మధుసూదన్ అనే వ్యక్తి మృతి చెందాడు. వీఎంసీ అధికారుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్షీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు.పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి వాగులు పొంగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామ శివారులో వాగు పొంగి జూలకల్లు పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో రహదారిపై నుండి పారుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.దాచేపల్లి పట్టణంలోని రజక కాలనీ, బొడ్రాయి సెంటర్ తో పాటు పలు కాలనీలు జలమయమయ్యాయి. కేసానుపల్లి గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. కారంపూడి దాచేపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం గ్రామం వద్ద పిల్లేరు వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. మాచవరం మండలం గాంధీనగర్ వద్ద వరద నీటితో వాగు పొంగి పొర్లడంతో మాచవరం పిడుగురాళ్ల గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
ఉత్సాహంగా తిరంగా ర్యాలీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా విజయవాడ రైల్వే డివిజన్లో తిరంగా బైక్, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఆర్ఎం మోహిత్ సొనాకియా ర్యాలీని ప్రారంభించారు. ముందుగా దేశ సమగ్రత, అభివృద్ధికి కృషి చేస్తామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు దేశ ఐక్యత, దేశభక్తి, స్వేచ్ఛ, సమానత్వానికి శక్తివంతమైన స్ఫూర్తినిస్తుందన్నారు. అనంతరం క్లాక్ టవర్ నుంచి త్రివర్ణ పతాకాలతో స్టేషన్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సత్యనారాయణపురంలోని ఈటీటీసీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కృష్ణా యూనివర్సిటీలో.. కోనేరుసెంటర్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం అనే నినాదంతో మంగళవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో 100 అడుగుల జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య కె. రాంజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు వీసీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వర రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీకి గురైన 600 సెల్ఫోన్లు రికవరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంతో పాటు, పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 600 సెల్ఫోన్లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో మంగళవారం రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు సీపీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ దొంగిలించిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్తో రికవరీ చేసినట్లు తెలిపారు. వేర్వేరు ప్రాంతాలకు చెందినవి.. రికవరీ చేసిన మొబైల్స్లో ఏపీకి చెందిన 504, ఒడిశావి 20్ల, కర్ణాటక 18, మహారాష్ట్రకు చెందిన 16, రాజస్తాన్ 13, ఉత్తరప్రదేశ్కు చెందిన 12 ఫోన్లు, బిహార్ 10, వెస్ట్ బెంగాల్ 7 మొబైల్స్ రికవరీ చేశామని తెలిపారు. అలాగే ‘సురక్ష’ ద్వారా ఆరువేల సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. -
స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు, ఇతర మంత్రులు, వీవీఐపీలు పాల్గొననున్న దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. బందోబస్తు పకడ్బందీగా ఉండాలన్నారు. కంటిజెన్సీ బృందాల కవాతు, ట్రాఫిక్ వంటి అంశాలపై చర్చించారు. అంతేకాకుండా స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ మళ్లింపుతో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఇతర మార్గాలను నిర్ధేశించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో డీఐజీ ఐఎస్డబ్ల్యూ కె. ఆరిఫ్ హఫీజ్, డీసీపీ కేజీవీ సరిత, ఎస్వీడీ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 17న బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక మచిలీపట్నంటౌన్/గన్నవరం: ఉమ్మడి కృష్ణాజిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక ఈనెల 17వ తేదీ విజయవాడ మధురానగర్లోని కేంద్రియ విద్యాలయం–1 గ్రౌండ్లో జరుగుతుందని ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని బాల్ బ్యాడ్మింటన్ సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ జట్ల సెలక్షన్లు అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సెలక్షన్లకు వచ్చే సబ్ జూనియర్ క్రీడాకారులు 2010 జనవరి 2, జూనియర్ క్రీడాకారులు 2006 జనవరి 2 తర్వాత జన్మించిన వారు ఉండాలని వివరించారు. సెలక్షన్స్కు వచ్చే క్రీడాకారులు స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బ్లడ్ గ్రూపు తప్పనిసరిగా తీసుకురావాలని, డ్రెస్ కోడ్ పాటించాలని ఆయన సూచించారు. జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలిమధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలని.. కచ్చితంగా సమయ వేళలు పాటించేలా చూడాలని ఆర్జేడీ ఎం.ఆదినారాయణ సూచించారు. మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోని ఇంటర్మీడియెట్ విద్యాధికారి కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో తప్పనిసరిగా ఉండాలన్నారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సైమన్ విక్టర్, డీఐఈఓ ప్రభాకరరావు మాట్లాడుతూ ఇక్కడ తెలుసుకున్న విషయాలను కళాశాలలో తప్పక అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణకాంత్, జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. ● ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న తరగతులను మంగళవారం ఆర్జేడీ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు. -
గిరిజనుల ఆలోచన విధానం మారాలి
నాగాయలంక: ఆదివాసీల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా నాబార్డు అందిస్తున్న భూమి ఆధారిత ఉపాధి అవకాశాల కంటే భిన్నంగా నాగాయలంక ‘యానాది గిరిజన సంఘం జీవావరణ వ్యవస్థ ఆధారిత జీవనోపాధి మెరుగుదల’ ప్రాజెక్ట్ చేపట్టడం ఆనందదాయకంగా ఉందని నాబార్డు డీఎండీ అజయ్కుమార్ సూద్ పేర్కొన్నారు. శ్రీరామపాద క్షేత్రం పుష్కరఘాట్లోని ఫుడ్కోర్టు భవనంలో మంగళవారం సంఘం అధ్యక్షుడు పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. చేపలు పట్టడం, కేజ్ కల్చర్ లాంటి సముద్రం, నదీ జలాల ఆధారిత కార్యక్రమంగా ఈ ప్రాజెక్టు మొదటిదని ఆయన పేర్కొంటూ మారుతున్న సామాజిక పరిణామాలకు దీటుగా ఆదివాసీ యానాదులు ఆలోచనా విధానాలను మార్చుకొని జీవన ప్రమాణాల్లో అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్షించారు. 25మందికి రూ. 12.75లక్షల విలువైన.. ఈ సందర్భంగా లబ్ధిదారులైన పలువురు గిరిజనులు తమ అనుభవాలను డీఎండీతో పంచుకున్నారు. తదుపరి ఎన్జీఓ ఆధ్వర్యంలో నాబార్డు–ట్రైబల్ డెవలెప్మెంట్ ఫండ్ ఆర్థిక సహకారంతో నాగాయలంక మండలంలోని మర్రిపాలెం, కమ్మనమోలు, సంగమేశ్వరం గ్రామాలకు చెందిన 25 మంది ఎస్టీ లబ్ధిదారులకు రూ.12.75లక్షల విలువైన అయిదు బోట్లు, ఐస్ బాక్స్లను డీఎండీ అందజేశారు. కార్యక్రమంలో నాబార్డు ఏపీఆర్ఓ సీజీఎం ఎం.రామ్గోపాల్, జీఎంలు కేవీఎస్ ప్రసాద్, ఎంపీ పహడ్సింగ్, కేడీసీసీబీ సీఈఓ ఎ.శ్యామ్ మనోహర్, పీపీఎస్ఎస్ కోఆర్డినేటర్ నక్కా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. నాబార్డు డీఎండీ అజయ్కుమార్ సూద్ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 202511ఘనంగా వినాయకునికి సంకటహర చతుర్థి పూజలు అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకటహర చతుర్థి పూజలను నిర్వహించారు. స్వామి వారికి పుష్పాలు, గరికతో విశేషాలంకారం చేశారు.18 నుంచి టీటీడీ పవిత్రోత్సవాలు వెంకటపాలెం(తాడికొండ): ఈ నెల 18 నుంచి 21 వరకు వెంకటపాలెంలోని టీటీడీలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ పర్యవేక్షణాధికారి మల్లికార్జున తెలిపారు.తిరుపతమ్మకు బోనాలు పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారికి మంగళవారం జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించారు. తిరువూరు: అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికా రులు దాటేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి విస్మరించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 12 ప్రదేశాల్లో 24,792 టిడ్కో ఇళ్లను నిర్మించి పట్టణ పేదలకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2017లో పనులు చేపట్టారు. సొంతిల్లు లేని పేద కుటుంబాలకు మూడు కేటగిరీల ఇళ్లను కేటాయించడానికి నిర్ణయించారు. కేటగిరీ–1లో 300 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లను, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను, కేటగిరీ–3లో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిపారు. కేటగిరీ–1 ఇళ్లకు రూ.5.72 లక్ష లు యూనిట్ ధర కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం భరించాలి. మిగిలిన రూ.2.71లక్షలను బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. ఈ కేట గిరీ ఇళ్లకు లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. సొమ్ము తిరిగి ఇవ్వలేదు కేటగిరీ–2లో యూనిట్ నిర్మాణ వ్యయం రూ.6.74 లక్షలు, రూ.50వేలను లబ్ధిదారు వాటాగా నాలుగు విడతల్లో చెల్లించాలి. కేటగిరీ–3 ఇళ్లకు రూ.లక్ష లబ్ధి దారు వాటా నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు. కేటగిరీ 2, 3 ఇళ్లకు లబ్ధిదారులు వాటా సొమ్ము చెల్లించినా డిమాండ్కు సరిపడా ఫ్ల్లాట్ల నిర్మాణం చేపట్టలేదు. ఆ యూనిట్లను రద్దు చేసినట్లు అధికారులు నోటీసులు జారీ చేసినా, లబ్ధిదారులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వలేదు. హామీలు గాలికి... తాము ఎన్నికల్లో గెలిస్తే వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి లబ్ధిదారులందరికీ అప్పగిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల హామీలో పేర్కొన్నా ఇప్పటివరకు పనులు పునఃప్రారంభించలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడలో 77 ఎకరాల్లో నిర్మించిన 8900 టిడ్కో ఇళ్లను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో లబ్ధిదారులకు పంపిణీ చేసింది. బందరులో 2,304 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టగా 544 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. తిరువూరు శివారు పీటీకొత్తూరులో 1536, నందిగామ హనుమంతుపాలెంలో 240, జగ్గయ్యపేటలో 3,168, విజయవాడ జక్కంపూడిలో 6,576, ఉయ్యూరులో 2,496, మచిలీపట్నంలో 1,760 టిడ్కో ఇళ్లను పూర్తిచేయాల్సి ఉంది. దాటవేత ధోరణి కూటమి నేతలను టిడ్కో ఇళ్ల కోసం పలు సందర్భాల్లో ప్రజా సంఘాలు నిలదీస్తున్నా సరైన సమాధానం రావట్లేదు. లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు కల్పించిన టిడ్కో ఇళ్లను త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్ప డం మినహా ఎప్పటికిస్తారో చెప్పలేకపోతున్నారు. న్యూస్రీల్ టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూపులు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మరచిన కూటమి మాట దాటేస్తున్న నేతలు సొంతింటి కోసం సొమ్ము చెల్లించిన పేదలువరదొస్తోంది.. అప్రమత్తంగా ఉండండి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వర్షాలతో పాటు ఎగువ నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని, ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో 24/7 అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఆర్డీవోలతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వీఎంసీ తదితర విభాగాల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాక ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోందని, క్రమేణా 4–5 లక్షల క్యూసెక్కులకు కూడా చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 91549 70454 నంబరుతో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ను యాక్టివేట్ చేయాలని, పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానంమచిలీపట్నంఅర్బన్: జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కృషా జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనున్నారన్నారు. దరఖాస్తులను రెండు ప్రతులుగా సంబంధిత తనిఖీ అధికారుల సిఫారసులతో పాటు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. జాతీయ ఉపకారవేతనాల కోసం.. దివ్యాంగ విద్యార్థులు జాతీయ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగ సంక్షేమశాఖ సహాయ సంచాలకుడు పి.కామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు అక్టోబరు 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు
మచిలీపట్నంఅర్బన్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడనుందని కృష్ణా జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మర్రాపు పోలినాయుడు తెలిపారు. జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నాచౌక్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. జిల్లాలో ఆటో వృత్తిపై 50వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. మహిళలకు ఉచిత బస్సుతో ఆటోల బాడుగలు తగ్గి, ఆదాయం ఉండదనే ఆందోళనలో ఆటో కార్మికులు ఉన్నారే కానీ, మహిళల ఉచిత బస్సు పథకానికి వ్యతిరేకం కాదన్నారు. ఇంధనంపై వ్యాట్ తగ్గింపు, జీవో నంబర్ 21 రద్దు, రుణ సబ్సిడీ మంజూరు చేయాలన్నారు. వాహన మిత్ర పథకం కింద డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి రూ.25 వేల సాయం డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు, వాహన కొనుగోలుకు రూ.4 లక్షల సబ్సిడీతో వడ్డీ రహి త రుణాలను మంజూరు చేయాలన్నారు. అనంతరం ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నేతలు కె. దావీదు, ఎ. వెంక టేశ్వరరావు, కె. పోతురాజు, కరీముల్లా పాల్గొన్నారు. -
సింగిల్ బ్లండర్!
కంకిపాడు: సింగిల్ నంబర్ లాటరీ మోజులో జీవితాలు చిత్తవుతున్నాయి. అత్యాశతో కుటుంబాలు గుల్లవుతున్నాయి. కూటమి ప్రభుత్వ పాలనలో సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. పచ్చ నేతల అండదండలతో అమ్మకందారులు ప్రజల ఆశను సొమ్ము చేసుకుంటున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా సింగిల్ నంబర్ లాటరీకి అడ్డాగా మారినా.. పోలీసు యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. చిన్నా పెద్దా తేడా లేదు.. ఎవరో ఒకరికి చిన్న లాటరీ తగిలిందన్న ప్రచారంతో ఎక్కువ మంది సొమ్ములకు ఆశ పడి సింగిల్ నంబర్ లాటరీ టికెట్లకు బానిసలవుతున్నారు. 15 ఏళ్ల బాలుడి నుంచి 80 ఏళ్ల ముసలి వాళ్ల వరకూ ఈ టికెట్లను కొనుగోలు చేస్తున్న వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇళ్లల్లో ఉన్న సొమ్మును తీసుకొచ్చి లాటరీ టికెట్లను కొనేవాళ్లు కొందరైతే, పగలంతా కష్టం చేసి ఆ కష్టాన్ని మరుసటి రోజు ఉదయాన్నే లాటరీ విక్రేతల వద్దకు వెళ్లి లాటరీ టికెట్లు కొనేవాళ్లు మరికొందరు. ప్రతి ఏరియాలోనూ వందల సంఖ్యలో వీటికి బానిసలయ్యారు. వీరి ఆశను సొమ్ము చేసుకుంటూ లాటరీ విక్రేతలు ప్రతి రోజూ కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. అంతా బాహాటంగానే.. లాటరీ విక్రయాలు అంతా బాహాటంగానే సాగుతున్నాయి. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండు ప్రాంగణాలే వీరికి సింగిల్ నంబర్ విక్రయ కేంద్రాలుగా మారాయి. చైన్నె, విజయవాడ కేంద్రాల నుంచి వ్యాపారులు ఇక్కడి విక్రేతలకు లాటరీ టికెట్ల వివరాలను చెబుతారు. ఇందులో నల్లనేరం రూ. 150, స్వర్ణలక్ష్మి రూ. 800, విష్ణు రూ. 400, కుమరన్ రూ. 300, తంగం రూ. 80, సిక్కిం సూపర్ రూ. 80, లయన్ రూ. 1200 ఇలా అనేక రకాల కంపెనీలకు చెందిన లాటరీ టికెట్లు అమ్ముడవుతున్నాయి. వాటికి సంబంధించిన టికెట్లకు బదులుగా ఐదంకెల టికెట్ నంబరును పేపరుపైన, లేదా సిగిరెట్ డొక్కులపైనా రాసి కొనుగోలుదారులకు అప్పగిస్తారు. అదే రోజు మధ్యాహ్నం ఓ వెబ్సైట్ ద్వారా లాటరీ ఫలితాలు చూసుకోవాలని సూచిస్తారు. లాటరీ వచ్చేది అరుదు. అయినా ఆశతో ప్రతి రోజూ లాటరీ టికెట్ల కొనుగోళ్లు మాత్రం చేస్తున్నారు. విక్రేతలకు భారీగా కమీషన్లు.. టికెట్ల విక్రయాల్లోనూ విక్రేతలకు భారీ మొత్తంలో కమీషన్లు అందుతాయని సమాచారం. ప్రధాన కేంద్రాల నుంచి లాటరీ టికెట్ల నంబర్లను స్థానిక విక్రేతలకు పంపుతారు. ఆ మొత్తాన్ని విక్రేతల ద్వారా అదే రోజు ఆన్లైన్లో పంపకాలు జరుగుతాయి. సుమారు 40 శాతం మార్జిన్ ఉంటుంది. అంతేకాకుండా లాటరీ తగిలితే కమీషన్ పేరుతో ప్రధాన విక్రేతలకు, స్థానిక విక్రేతలకు 60–65 శాతం పోనూ 35–40 శాతం మాత్రమే కొనుగోలుదారుడికి చేతికొస్తుంది. ఫేక్ టికెట్లతో కాసుల పంట.. చోద్యం చూస్తున్న పోలీసులు.. సుమారు 15 ఏళ్ల క్రితం జిల్లాను ఈ సింగిల్ నంబర్ లాటరీ టికెట్ల విక్రయాలు కుదిపేశాయి. అప్పట్లో పలువురు దీనికి బానిసలై అప్పులు చేయటంతో వాటిని తీర్చే పరిస్థితి లేక ఇళ్లు, స్థలాలు తాకట్టు పెట్టడం, ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డ ఘటనలు జరిగాయి. ప్రస్తుతం మరోమారు ఈ వ్యాపారం జోరందుకుంది. అడ్డూ అదుపు లేకుండా వ్యాపారం సాగిపోతోంది. బహిరంగంగా టికెట్ల నంబర్లు చేతులు మారుతున్నా పోలీసులు మాత్రం కిమ్మనటం లేదు. వ్యాపారులను నియంత్రించే చర్యలు తీసుకోవటం లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వ్యాపారుల నుంచి పోలీసు శాఖకు భారీ మొత్తం నెలవారీ మామూళ్లు ముడుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అందువల్లే ఆ వ్యాపారం జోలికి వెళ్లటం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అత్యాశతో చిత్తవుతున్న జీవితాలు జిల్లాలో జోరుగా సాగుతున్న సింగిల్ నంబర్ లాటరీ విక్రయాలు ఆశల వలలో చిక్కుకుని బానిసవుతున్న వైనం లూఠీ అవుతున్న పేదల కష్టార్జితం చోద్యం చూస్తున్న పోలీసు యంత్రాంగం మత్తు పదార్థాలకు బానిసలైనట్లు లాటరీ టికెట్లకు సైతం ఎంతో మంది బానిసలు అవుతున్నారు. ఇంట్లో బంగారం, డబ్బులు సైతం తెచ్చి టికెట్లను కొనుగోలు చేస్తున్నారంటే ఎంతగా ఈ వ్యాపారం పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిందో అర్థమవుతోంది. ప్రజల ఆశను వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధాన కేంద్రాల నుంచి ఒక్కో వ్యాపారి రోజుకు రూ.లక్ష విలువైన టికెట్లను కొనుగోలు చేస్తే అమ్మకం మాత్రం రూ. 2 లక్షలకు పైగా అమ్ముతున్నారని వినికిడి. తద్వారా ఫేక్ నంబర్లను కాగితాలపై వేసి ఆ టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును తమ జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
‘నులి’ నిర్మూలనతో బహుళ ప్రయోజనాలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ లబ్బీపేట(విజయవాడతూర్పు): నులి పురుగులు పిల్లలు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమవుతాయని, అందుకే పిల్లలందరూ ఆల్బెండజోల్ మాత్రను తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. పటమటలంకలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మంగళవారం జరిగిన జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అధికారులతో కలిసి చిన్నారులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులి పురుగుల కారణంగా పలు శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయన్నారు. దీంతో చదువులో రాణించలేక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చన్నారు. 20న మరోసారి పంపిణీ.. 1–19 ఏళ్ల వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకోకుండా ఉంటే వారికి ఈ నెల 20న ఇస్తామని కలెక్టర్ చెప్పారు. నులిపురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్య పరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నులిపురుగుల సంక్రమణా న్ని తగ్గించేందుకు డీవార్మింగ్కు అదనంగా పాటించాల్సిన విషయాలను కూడా వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని, ఆర్బీఎస్కే స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ రవితేజ, ఆర్బీఎస్కే జిల్లా అధికారి డాక్టర్ మాధవీనాయుడు, డీఈఓ డాక్టర్ సుబ్బారావు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు: అంబటి
సాక్షి, విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అరాచకం రాజ్యమేలుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు, ఓటర్లు బూత్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. టీడీపీ, పోలీసులు కలిసి వ్యూహాత్మకంగా పద్ధతి ప్రకారం కుట్ర చేశారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై ఎస్ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.‘‘పోలీసుల సహాయంతో మా పోలింగ్ ఏజెంట్లను బయటికి నెట్టేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది టీడీపీ గూండాలు వచ్చారు. వైఎస్సార్సీపీ నేత బలరాంరెడ్డి పోలింగ్ ఏజెంట్గా ఉన్నప్పటికీ ఆయన్ని వెళ్లనివ్వలేదు. వైఎస్సార్సీపీకి ఓటు వేసే వారిని గుర్తించి బయటికి పంపించేస్తున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. సాయంత్రం వరకూ అవినాష్ రెడ్డిని తిప్పాలనుకున్నారు. ప్రజలు తిరగబడటంతో ఎర్రగుంట్లలో వదిలిపెట్టారు..ఎస్వీ సతీష్ రెడ్డిని ఇంటి నుంచి బయటికి రాకుండా అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్ధిని కూడా బయటికి రానివ్వలేదు. టీడీపీ అభ్యర్ది మాత్రం అన్ని చోట్లా తిరగనిస్తున్నారు. నల్లకుంట్ల పాడులో పోలీసుల కాళ్లు పట్టుకుని మరీ ఓటర్లు వేడుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే కుట్ర మొదలైంది. పులివెందుల, ఒంటిమిట్టలో కుట్రలతో గెలవాలని ముందే ప్లాన్ చేశారు. కుట్రలతో గెలిచి వైఎస్ జగన్ పనైపోయిందని ప్రచారం చేయాలని చూస్తున్నారుటీడీపీ ఓటర్లు మాత్రమే ఓటేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది చాలా ప్రమాదకరం. నంద్యాలలో కూడా చంద్రబాబు ఇలానే చేశారు. చంద్రబాబు చర్యలతో వందేళ్లు వెనక్కిపోయాం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇంత దుర్మార్గంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదు. కనంపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్ను తుపాకీతో బెదిరించారు. జమ్మలమడుగు మార్కెట్ యార్డ్ ఛైర్మన్ టీడీపీ నేత నాగేశ్వరరెడ్డి పులివెందులలో ఓట్లు వేశారు. ఎన్నికల కమిషన్ తీరు చెవిటోడి ముందు శంఖం ఊదినట్లు ఉంది. ఎన్నికల కమిషన్, టీడీపీ, పోలీసులు ఒక్కటైపోతే ఎన్నికలు ఏం జరుగుతాయి?బ్యాలట్ ఓటింగ్లోనే ఇంత అరాచకం చేస్తే.. ఇక ఈవీఎంలు అయితే మరింత దారుణంగా వ్యవహరించేవారు. పులివెందులలో గెలిచానని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇలా చేస్తున్నాడు. పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటిసి అభ్యర్థి గన్మెన్ను రాత్రికి రాత్రి మార్చేశారు. రాబోయే కాలంలో ప్రతిఫలం చంద్రబాబు అనుభవించక తప్పదు. చంద్రబాబు నీచమైన వ్యక్తి అని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయింది.ఇంతకంటే దుర్మార్గం ఏముంది?: వెలంపల్లి శ్రీనివాస్పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో దారుణంగా వ్యవహరించారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకునేలా చేశారు. ఇంతకంటే దుర్మార్గం ఏముంది?. చంద్రబాబుకి శునకానంద తప్ప ఏమీ ఒరగదు. ఎప్పుడు ఎన్నిక వచ్చినా కూటమి పార్టీలకు డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయం. ఏం సాధించావని ఎన్నికల్లో ఇలా వ్యవహరిస్తున్నారు.దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు: మల్లాది విష్ణుఎన్నికల కమిషన్ నియమనిబంధనల ప్రకారం నడుచుకోవడం లేదు. పులివెందుల, ఒంటిమిట్టలో రెవిన్యూ, పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్నారు. ఓటర్లను గ్రామ పొలిమేర్లలోనే అడ్డుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులకు పులివెందుల, ఒంటిమిట్టలో ఏం పని?. దొంగ ఓట్లు వేయడానికి టీడీపీ నేతలు క్యూ కట్టారు. ఇది అసలు ఎన్నికే కాదు. ఈ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఓటమి భయంతో కుట్రపూరితంగా చంద్రబాబు వ్యవహరించారు. ఎలాగైనా పులివెందులలో గెలవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదు -
ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ప్లీనరీ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘ కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. సమావేశాలు 9, 10 తేదీల్లో కొండపల్లిలో జరిగాయన్నారు. ఈ ప్లీనరీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలపై తీర్మానాలు చేయడంతో పాటు నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా టి.కుమారస్వామి, సీహెచ్ వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లాలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, విద్యార్థులు స్కిల్స్ పెంచడానికి విజయవాడ కేంద్రంగా సైన్స్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్–కాస్మొటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్లో విద్యార్థులను ఐక్యం చేసి పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్లీనరీ అనంతరం నూతన జిల్లా కమిటీని 21 మందితో ఎన్నుకున్నామన్నారు. నూతన కార్యవర్గం.. నూతన కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడిగా టి.కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా ఎస్.ప్రణయ్, టి.కుమార్ నాయక్, టి.ప్రణీత, ఎస్కే ఖాజు, సహాయ కార్యదర్శులుగా బి.మాధవ్, వి.షణ్ముఖ, కె.యశస్వినీ దేవి, పెద్దబాబు, జిల్లా కమిటీ సభ్యులుగా ప్రసాద్, ఒజెస్విన్, జ్వాలిత, మోహన్కృష్ణ, కావ్య, కుషాల్ కుమార్, నరసింహ, సిద్దు, హస్మి, యశ్వంతీ ఉన్నారు. -
వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి
ఆత్కూరు(గన్నవరం): కృష్ణా జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పెద్దఆవుటపల్లి గ్రామ శివారు లూర్థునగర్కు చెందిన దొప్పల సురేష్(39) రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంటిలో సురేష్ ఉరి వేసుకుని ఉండటాన్ని అతని భార్య గమనించింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో అతడిని కిందకు దింపి చిన్నఆవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సురేష్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతని భార్య అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. గుడివాడలో వ్యక్తి మృతి గుడివాడరూరల్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని నీలామహాల్ రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీలామహాల్రోడ్డులో నివాసముంటున్న పోలుకొండ భద్రయ్య(48) ఆదివారం జరిగిన గంగానమ్మ సంబరంలో పాల్గొని మద్యం సేవించాడన్నారు. రోజు మాదిరిగానే రాత్రి ఇంట్లో పడుకున్న భద్రయ్య తెల్లారి సోమవారం చూసే సరికి చనిపోయి ఉండటంతో పరిసర ప్రాంత ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వన్టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి పిన్ని కుమారుడు వల్లూరు రాము ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా ఓ స్థలం విషయమై మృతునికి, అతని బంధువులకు గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రెండు సార్లు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మృతుడిది హత్యా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. తల్లి చెంతకు చేరిన బాలుడు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇంటి నుంచి తల్లితో పాటు బయలుదేరి, బస్టాండ్లో తప్పిపోయి తిరుగుతున్న బాలుడిని మహిళా పోలీసులు తిరిగి తల్లి చెంతకు చేర్చారు. ఈ ఘటన సోమవారం విజయవాడలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం మహిళా కానిస్టేబుళ్లు ఎస్కేబీబీ శైలజ, అనూష సోమవారం పీఎన్బీఎస్లో శక్తి యాప్పై అవగాహన కలిగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో బస్టాండ్లో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని వారు గుర్తించి అతని వద్దకు వెళ్లి వివరాలు అడగా, తల్లి పేరు మాత్రమే చెబుతూ, అడ్రస్ చెప్పలేక పోతున్నారు. దీంతో చుట్టుపక్కల విచారించినా ఎవరూ తెలియదని చెప్పడంతో, బాలుడిని మహిళా పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. అక్కడ ఇన్స్పెక్టర్ వాసవి బాలుడిని వివరాలు అడుగుతూ ఎక్కడకి వచ్చారని అడగ్గా హాస్పిటల్కు వచ్చినట్లు తెలపడంతో పాత ప్రభుత్వాస్పత్రికి వెళ్లి విచారించారు. దీంతో అక్కడ తల్లి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలుడిని క్షేమంగా అప్పగించారు. ఈ సందర్భంగా బాలుడి తల్లి పోలీసులకు వివరాలు చెబుతూ, తనది చిట్టినగర్ అని, భర్త మృతి చెందగా, తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. పిల్లల్లో ఇద్దరికి అనారోగ్యం కారణంగా పాత ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయిస్తున్న క్రమంలో రెండో బాబు కనిపించక పోవడంతో చుట్టుపక్కల విచారించి ఏమి చేయాలో తెలియని సమయంలో మహిళా పోలీసులు, శక్తి బృందం బాలుడిని తీసుకువచ్చి అప్పగించారన్నారు. మహిళా కానిస్టేబుళ్లకు బాలుడి తల్లి అభినందనలు తెలిపింది. -
భారీ వర్షానికి పొంగిన వాగులు
పెనుగంచిప్రోలు: మండలంతో పాటు ఎగువన ఆదివారం రాత్రి భారీ వర్షం పడటంతో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం వరకు లింగగూడెం వద్ద గండివాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పక్కన ఉన్న పొలాలు మొత్తం నీట మునిగాయి. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి పొలాలపై వరద ప్రవహించటంతో పాటు పంటలు పూర్తిగా నాశనమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముండ్లపాడు గ్రామంలోని వాగు చప్టాపై వరద నీరు ప్రవహించటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగులు గుండా నీరు ఉధృతంగా ప్రవహించటంతో సమీప వరి పొలాలు నీట మునిగాయి. రాకపోకలకు అంతరాయం -
పోతే.. పొమ్మనండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉంటే ఉండమనండీ.. పోతే పోమ్మనండీ ఎవరి కోసం వచ్చారు. ఏఆర్టీలో సిబ్బంది లేకుంటే నేనేమి చేస్తాను. వచ్చే వరకూ ఉండమనండీ అంటూ హెచ్ఐవీ బాధితుల పట్ల డీఎల్ఓ అమానుషంగా మాట్లాడారు. అసలు నీవు నాకెందుకు ఫోన్ చేశావు, నీ కేడర్ ఏమిటీ అంటూ విషయాన్ని ఆయనకు చెప్పేందుకు ఫోన్ చేసిన ప్రభుత్వాస్పత్రి నోడల్ ఆఫీసర్ను నోటికొచ్చినట్లు అనడంతో ఆయన చిన్నబుచ్చుకున్నారు. ఈ విషయం సోమవారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. హెచ్ఐవీ రోగులకు అందించే సేవలను పర్యవేక్షించాల్సిన అధికారే అలా బాధ్యతా రహితంగా వ్యవహరించడం ఏమిటనీ పలువురు అధికారులు అంటున్నారు. ఆయన తీరు నిత్యం వివాదస్పదంగా మారుతోందని వైద్యశాఖలోని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. అసలేమి జరిగిందంటే.. తిరువూరు నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతం నుంచి హెచ్ఐవీ బాధితులు మందుల కోసం కొత్తాస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రానికి వచ్చారు. అక్కడ గంట సేపు కూర్చున్నా వారికి కార్డులు ఇచ్చే కో ఆర్డినేటర్ రాలేదు. దీంతో తిరిగి వెళ్లేందుకు ఆలస్యం అవుతుందని, అక్కడి సిబ్బందిని ఎంత బతిమిలాడినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సూపరింటెండెంట్ చాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న అభయ్ నోడల్ అధికారిని కలిసి వివరించారు. దీంతో ఆయన ఏఆర్టీ కేంద్రాలను పర్యవేక్షించే డీఎల్ఓకు ఫోన్ చేసి విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా అసలు నాకు ఫోన్ చేయడానికి నీవు ఎవరూ, నీ కేడర్ ఏమిటీ, నాకెందుకు ఫోన్ చేశావంటూ చివాట్లు పెట్టారు. అయినా సిబ్బంది లేకపోతే వచ్చేదాకా కూర్చోమనండీ, లేకపోతే పొమ్మనండీ అంటూ అమానుషంగా మాట్లాడారు. దీంతో ఆ నోడల్ అధికారి చిన్నబుచ్చుకోవడమే కాకుండా, రోగి సైతం చేసేది ఏమి లేక, మళ్లీ ఏఆర్టీ దారి పట్టారు. ఓ గంట తర్వాత కానీ సిబ్బంది రాలేదు. గతంలో పనిచేసిన చోట్ల అంతే.. జిల్లాలో పనిచేస్తున్న డీఎల్ఓ గతంలో ఏలూరులో పనిచేస్తున్న సమయంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కోవిడ్లో పనిచేయని వారికి సైతం చేసినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, అనుభవం పత్రాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా అనంతరం భీమవరంలో పనిచేసిన సమయంలో రెండు నెలలో ఇన్చార్జి డీఎంహెచ్ఓగా చేసి అవినీతికి పాల్పడటంతో, ఆ పోస్టు నుంచి తప్పించినట్లు వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేయడం, ఇతరులపై పెత్తనం చేలాయించాలని చూడటం అతని నైజమని సిబ్బంది వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో జిల్లా వైద్య శాఖ పరువు బజారున పడటం ఖాయమంటున్నారు. మా కోసం వచ్చారా.. ఉండక ఏమి చేస్తారు హెచ్ఐవీ రోగుల పట్ల డీఎల్ఓ అమానుష ప్రవర్తన ప్రభుత్వాస్పత్రి నోడల్ అధికారిపై చిందులు నిత్యం వివాదస్పందంగా మారుతున్న డీఎల్ఓ తీరు గతంలో పనిచేసిన చోట్ల అనేక అవినీతి ఆరోపణలు ఆయన ప్రవర్తన నిత్యం వివాదస్పదమే.. నెలన్నర కిందట జరిగిన బదిలీల్లో జిల్లాకు వచ్చిన డీఎల్ఓ ప్రవర్తన వివాదస్పదంగా మారుతుంది. అంతేకాకుండా, ఆయన విధులు ఆయన చేయకుండా, డీఎంహెచ్ఓ కార్యాలయంలో చేసే ఇతర వైద్యులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడంటూ పలువురు ఆరోపించారు. రెండు రోజుల కిందట సీనియర్ వైద్యుడైన డీఎంఓను కూడా ఇలాగే మాట్లాడారని, డీఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేసే వైద్యుల పట్ల అమానుషంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఎలాంటి గొడవలు లేకుండా సజావుగా పనులు సాగుతున్నాయని, ఇప్పుడు డీఎల్ఓ తీరు నిత్యం వివాదంగా మారుతున్నట్లు వాపోతున్నారు. నా దృష్టికి వచ్చింది.. డీఎల్ఓ చులకనగా మాట్లాడుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇంకా డీఎల్ఓ అలాగే ప్రవర్తిస్తే కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తా. ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనపై కూడా వివరాలు తెలుసుకుంటా. – డాక్టర్ ఎం.సుహాసిని, డీఎంహెచ్ఓ, ఎన్టీఆర్ జిల్లా -
వైద్య రంగం ప్రైవేటీకరణపై 24న జాతీయ సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొస్తున్న ఆరోగ్య రంగ సంస్కరణల వలన రాష్ట్ర ఆరోగ్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో వైద్యరంగం ప్రైవేటీకరణ–ప్రభావాలు–పరిష్కారాలు అనే అంశంపై జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు సరైన వైద్యం అందక ప్రైవేట్ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు జరగబోయే వైద్య రంగంలోని మార్పుల వలన పేదల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి రాబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పబ్లిక్–ప్రైవేట్–భాగస్వామ్యం(పీపీపీ) నమూనా కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్రమైన ఆందోళనను రేకెత్తిస్తోందన్నారు. ప్రజారోగ్యం ప్రైవేటీకరణ అంశంపై పలువురు ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 73 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 73 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 36 ఫిర్యాదులు, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 3, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలు 5, దొంగతనాలపై 3, ఇతర చిన్న వివాదాలకు సంబంధించి 16 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీస్స్టేషన్లకు తెలిపి సత్వర పరిష్కారం చేయాలని డీసీపీ ఉదయరాణి ఆదేశాలు జారీ చేశారు. -
క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): యువత చదువుతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య అన్నారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ వాలీబాల్(సీ్త్ర, పురుషులు) టోర్నమెంట్ను సోమవారం సాయంత్రం పీబీ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. క్రీడల వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ తమ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ నిమ్మగడ్డ లలిత ప్రసాద్, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు పాల్గొన్నారు. హోరాహోరీగా పోటీలు.. ప్రారంభ సభ అనంతరం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ(చైన్నె) జట్టుతో బిషప్ మోర్ కళాశాల(కేరళ) జట్టు, సిద్ధార్థ కళాశాల జట్టుతో హోలీ గ్రేస్ అకాడమీ(త్రిసూర్, కేరళ) టీమ్లు తలపడ్డాయి. కపార్గామ్(కోయంబత్తూర్) టీమ్తో శాయ్(గుజరాత్) జట్టు, లయోలా కళాశాల(చైన్నె)జట్టుతో శాయ్(త్రివేండ్రం) జట్ల మధ్య పోటీలు జరిగాయి. వాలీబాల్ పోటీలను క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు, విద్యార్థులు వీక్షించారు. ఆల్ ఇండియా ఇన్విటేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో అతిథులు -
కార్మికుల ఆర్తనాదాలు పట్టని కూటమి సర్కారు
మా పొట్ట కొట్టినట్లే.. 18 ఏళ్లుగా ఆటో నడుపుతున్నా. ఇదే మా జీవనాధారం. దీని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఆటోలో ప్రయాణించే వారిలో 80శాతం మహిళలే. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ఆటో ఎక్కేవారే ఉండరు. మా పొట్ట కొట్టినట్లే. మేం ఉపాధి కోల్పోతాం. ఆటో అప్పు తీర్చడం కష్టమే. – వెన్నబోయిన కృష్ణ, మల్కాపురం, జగ్గయ్యపేట గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15 నుంచే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఆటో డ్రైవర్లలో ఆందో ళన మొదలైంది. సీ్త్ర శక్తి పథకం తమ భుక్తిని లాగేసుకుంటుందని భయపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము.. రేపటి నుంచి ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం ఖాయమని, కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుంటే ప్రభుత్వం తమతో కనీసం చర్చలు జరపలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఎన్నికల హామీలో ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన నాటి నుంచి ఆందోళన చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ వాపోతున్నారు. ఇదీ జిల్లాలో పరిస్థితి.. ఎన్టీఆర్ జిల్లాలో 25వేల ఆటోలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని యువత సైతం ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికీ ఫైనాన్స్లో ఆటో తీసుకొని వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంతో కార్మికుల నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తే తమకు కిరాయిలు ఉండవని, ఇప్పటికే ఈ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఆటో నిర్వహణ పెనుభారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆటో కార్మికులు కన్నీరు పెట్టుకుంటున్నారు. హామీలు అమలు చేయలేదు.. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సహాయం ఇస్తామన్న హామీ అమలు కాలేదు. ఏడాది కాలంగా అనేక ఆందోళనలు చేశాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. రుణాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోతాం. కనీసం కార్మికులను పిలిచి ప్రభుత్వం చర్చించలేదు. ఆర్థిక సహాయం ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మమ్మల్ని బిచ్చగాళ్లుగా మార్చొద్దు. – దాది శ్రీనివాసరావు, ఆటో కార్మికుడు తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ. 15వేలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆర్థిక సహాయంతో పాటు సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మబలికింది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇకనైనా అమలు చేస్తామని భరోసాను కల్పించలేదు. సంక్షేమ బోర్డు ఊసేత్తడం లేదు. తక్కువ వడ్డీతో ఆటోలు రుణాలు ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. తీరా సీ్త్ర శక్తి పథకం అమలు చేయబోతుండడంతో ఆటో కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని, ఫైనాన్షియర్లు ఒత్తిడి చేసే ప్రమాదం ఉందని వాపోతున్నారు. హామీలు అమలు చేయాలని పలు రూపాల్లో కార్మికులు ఆందోళన చేసిన ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు. రూ. 15వేల ఊసెత్తని సర్కారు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోని వైనం ఏకపక్షంగా ఉచిత బస్సు పథకం ప్రకటనతో ఆగ్రహం దిక్కుతోచని స్థితిలో 23వేల కుటుంబాలు ఫైనాన్స్ బకాయిలు చెల్లించేదెలా అంటూ ఆందోళన గత ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. వారి సంక్షేమానికి వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏటా రూ.10వేలు వాహన మిత్ర కింద ఆర్థిక సహాయం చేసింది. కరోనా లాంటి కష్టకాలంలోనూ ఆదుకుంది. వరుసగా క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందించింది. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. రూ. 3వేలు పెన్షన్ ఇవ్వాలి.. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులకు 50 నుంచి 60శాతం ఉపాధి పోతుంది. ఇప్పటికే పలు రకాల సమస్యలతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఉపాధి కోల్పోతున్న కార్మికులకు నెల నెలా రూ. 3వేలు పెన్షన్ ఇవ్వాలి. – కె. పోలారి, ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు -
నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా వ్యాప్తంగా మంగళవారం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సోమవారం తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు 5.26 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. నులి పురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల్లో నులిపురుగులు నిర్మూలించి రక్తహీనత నివారణ, శారీరక. మానసిక ఎదుగుదలకు పోషకాహారలోం, పిల్లల్లో అలసట, బలహీనత వంటి సమస్యలను నిర్మూలించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా డాక్టర్ సుహాసిని తెలిపారు. అందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్క చిన్నారికి ఈ మాత్రలు వేయాలని సూచించారు. మాత్రల పంపిణీ ఇలా.. ఎన్టీఆర్ జిల్లాలో 192 కళాశాలలు, 1,446 పాఠశాలలు, 1,475 అంగన్వాడీ కేంద్రాల్లో 19 ఏళ్లలోపు గల 5,26,323 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించనున్నట్లు తెలిపారు. అందుకోసం 5.64 లక్షల మాత్రలను సిద్ధం చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 5.64 లక్షల మాత్రలు సిద్ధం -
ప్రతి గుండె ఉప్పొంగేలా ‘హర్ ఘర్ తిరంగా’
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ పంద్రాగస్టు వేడుకులకు సిద్ధమవుతున్నామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రి వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, యువజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం తదితర శాఖల అధికారులు, సిబ్బందితో పాటు వాకర్స్ క్లబ్ వంటి వివిధ అసోసియేషన్ల నుంచి పెద్దఎత్తున ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సైనికుల త్యాగాలు చిరస్మరణీయం.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సరిహద్దుల్లో మన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని.. ఆపరేషన్ సిందూర్ మన దేశ సత్తాను చాటి చెప్పిందని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మనం నేడు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని.. మనకు స్వాతంత్య్రం వచ్చాక ఎన్నో రంగాల్లో ముందుకెళ్లామని అన్నారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని పాల్గొన్నారు. -
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఏ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు పెండింగ్ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పడు లాగిన్లో పరిశీలించి పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్ కేసులను కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని, గడువులోగా వినతులకు సమాధానాలు పంపాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె. పోసిబాబు, ఏసీపీ కె. వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. వచ్చిన అర్జీల వివరాలు.. పీజీఆర్ఎస్లో మొత్తం 126 అర్జీలు అందాయని జేసీ చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 36, పోలీస్ 20, డీఈఓ 16, వీఎంసీ 9, సర్వే 7 ఏీపీసీపీడీసీఎల్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు 4, విభిన్నప్రతిభావంతులు 3, డీఎంహెచ్వో 3, డీఆర్డీఏ 3, పౌరసరఫరాలు 2, ఎంపీడీఓ 2, ఆర్ఐవో (ఇంటర్మీడియట్) 2, పశుసంవర్ధక, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, డీసీహెచ్ఎస్, డీసీఓ (సహకార శాఖ), జిల్లా జలవనరులు, ఎకై ్సజ్ పోలీసు, మత్స్యశాఖ, అటవీ, జీజీహెచ్, హౌసింగ్, పరిశ్రమలు, మైనారిటీ, ఆర్అండ్బీ, సోషల్ వెల్ఫేర్కు సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున అందాయన్నారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
ఏదయా.. యూరియా!
ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలు చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమానికి తాము పాటుపడతామని రైతులకు ఎటువంటి కష్టం రానివ్వకుండా తాము అధికారంలోకి వస్తే రైతులకు అన్ని అందిస్తామని మాయమాటలు చెప్పి నేడు రైతులను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుద్దాలపాలెం సొసైటీ పరిధిలో ఉన్న బుద్దాలపాలెం, బొర్రపోతుపాలెం, పిల్లవానిగొల్లపాలెంతో పాటు కొంతమేర కొత్తపూడి, కాకర్లమూడి గ్రామాలకు చెందిన భూములకు చెందిన రైతులు పంట రుణాలు తీసుకున్నారు. సుమారు 2 వేల ఎకరాలు ఆయకట్టులో వరిసాగు చేస్తున్నారు. వీరికి ఎకరానికి నాలుగు బస్తాల ఎరువులు కావాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం ఇంత వరకు వారికి ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవటంతో పంట ఎదుగుదల లేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్కన వర్షం లేక ఎండలు కాస్తుండటం, కాలువల్లో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో పొలాల్లో ఎరువు వేసుకోవటం ఎంతో అవసరమైనప్పటికీ కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవటంతో సక్రమంగా ఎరువులు సరఫరా కాలేదు. దీనికోసం రోజుల తరబడి సొసైటీ చుట్టూ తిరుగుతూ రైతులు ఎప్పుడు ఎరువులు ఇస్తారో అర్థం కాక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఎరువుల కోసం రైతుల ఆందోళన.. బుద్దాలపాలెం సొసైటీకి సోమవారం అరకొరగా ఎరువులు రావటంతో రైతులు తమకు అందుతాయో, లేదోనని ఆందోళన చేపట్టారు. వచ్చిన ఎరువులు అందరికీ అందజేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో సొసైటీ ప్రతినిధులు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. రైతులు అంతటితో ఆగకుండా ఎరువులు అందరికీ సమానంగా పంచాలని పూర్తిస్థాయి ఎరువులు అందించకపోతే తమ పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సొసైటీ సిబ్బంది, పోలీసుల జోక్యంతో రైతులకు రెండు కట్టలు చొప్పున అందజేస్తామని చెప్పి టోకెన్లు అందజేసి వాటి ఆధారంగా ఎరువులు పంపిణీ చేస్తామని చెప్పారు. కూటమి నాయకులు చెప్పిన వారికే.. బుద్దాలపాలెం సొసైటీలో ఎరువుల పంపిణీలో కూడా కూటమి నాయకుల హవా కొనసాగింది. కూటమి నాయకులు చెప్పిన పేర్లకే టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరికీ రెండు కట్టలు చొప్పున ఎరువులు అందజేశారు. అయితే కొంత మంది రైతులకు అందకపోవటంతో సొసైటీ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో త్వరలో మరో ఎరువుల లోడ్ వస్తుందని అప్పుడు అందరికీ అందజేస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అయితే అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఎరువులు పంపిణీ చేశారని మా పరిస్థితి ఏమిటని మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకులు చెప్పిన వారికే టోకెన్ల వారీగా పంపిణీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు బుద్దాలపాలెం సొసైటీ వద్ద ఆందోళన నష్టపోతున్నాం.. ఆదుకోవాలని వేడుకోలు రుణం ఉన్న వారికి మాత్రమే.. పెడన: మండలంలోని పలు పీఏసీఎస్లకు యూరియా లోడు రావడంతో సోమవారం వేకువ జాము నుంచే రైతులు ఆయా పీఏసీఎస్లు వద్ద బారులు తీరారు. రైతుల రద్దీని చూసి ఆయా పీఏసీఎస్లు వద్ద ఒక్కో కానిస్టేబుల్ను ఏర్పాటు చేసి పంపిణీ చేయాలని అనుకున్నారు. పెనుమల్లి పీఏసీఎస్ వద్ద పరిస్థితి అదుపుతప్పడంతో కానిస్టేబుల్ను సైతం తోపులాటలో పక్కకు లాగేశారు. దీంతో అక్కడ ఎస్ఐ సత్యనారాయణ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్ది క్యూలైన్లో రైతులు నిలబడేలా చర్యలు తీసుకున్నారు. పీఏసీఎస్ సిబ్బంది బ్యాంకులో రుణం ఉన్న వారికి మాత్రమే యూరియా కట్టలు ఇస్తామని పేర్కొనడమే కాకుండా దండాలు పెట్టి మరీ చెబుతుండటంతో మిగిలిన రైతులు తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. దీంతో ముందుగా వారికి ఇచ్చిన తరువాత మిగిలినవి ఇస్తామని చెప్పడంతో చేసేది లేక రైతులు అలాగే క్యూ లైన్లో వేచి తమ వంత వచ్చేదాక ఉండి తీసుకువెళ్లారు. అరకట్ట చొప్పున మాత్రమే ఇవ్వడంతో ఇద్దరి రైతులకు ఒక కట్ట చొప్పున అందజేశారు. -
టీడీపీ అరాచకాలు.. ఎస్ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ ఆఫీస్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. పులివెందుల, ఒంటిమిట్టలో టీడీపీ అరాచకాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించారు. టీడీపీ అరాచకాల ఆధారాలను వైఎస్సార్సీపీ నేతలు ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల కమిషన్ కళ్లు తెరిచి.. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు.పులివెందుల ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లతో టీడీపీ అడ్డదారి తొక్కుతోంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన టీడీపీ గూండాలు పెట్టింది. క్యూల్లో నిలబడి వారే ఓట్లేస్తున్నారు. క్యూ లైన్లలో అసలు ఓటర్ల బదులు దొంగ ఓటర్లు ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటరు స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు వాళ్లను టీడీపీ నేతలు పంపిస్తున్నారు. దొంగ ఓటు వేయాలన్నా స్లిప్పులో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందన్నా ఏం కాదంటూ టీడీపీ నేతలు పంపిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లితో పాటు ప్రతి గ్రామంలో వందల కొద్దీ టీడీపీ గూండాలు మోహరించారు. గ్రామాల శివార్లలోనే వాహనాలను అడ్డుపెట్టిన టీడీపీ నేతలు ఎవర్నీ గ్రామంలో రానివ్వడం లేదు.కర్రలు, రాడ్లతో పహారా కాస్తున్నారు. పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు రాకుండా అడ్డగిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలను భయబ్రాంతులను చేసిన టీడీపీ మూకలు.. మీడియాను కూడా గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరుగుతోంది. దొంగ ఓటర్లతో పోలింగ్ బూత్ల నిండిపోయాయి. -
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. విజయవాడ ఎంజీ రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. సమితికి గౌరవ అధ్యక్షుడిగా గోకరాజు గంగరాజు, అధ్యక్షుడిగా చలసాని ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా త్రినాథ్ను నియమించారు. వీరితో పాటు అన్ని జిల్లాల నుంచి సమితి సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా గౌరవా ధ్యక్షుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే గణపతి నవరాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ విభాగాల నుంచి సహకారం అందించాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో మండపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసుకునేవారికి స్థానిక పరిపాలన వ్యవస్థ పోలీసు, విద్యుత్, వైద్య, ట్రాఫిక్, నీటిపారుదల శాఖ నుంచి సహాయ, సహకారాలు అందించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ.. ‘గణేష్ విగ్రహాల ఎత్తుపై ఆంక్షలు, అనుమతుల కోసం రకరకాల రుసుముల పేరుతో ఇబ్బంది పెట్టకుండా చూడాలన్నారు. ఉత్సవ సమితికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. అనంతరం ఉత్సవాల వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. -
ఓటరు స్లిప్లు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు: పేర్ని నాని
విజయవాడ: పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి ప్రవర్తిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఒటర్ల ఇంటికి వెళుతన్న టీడీపీ నేతలు ఓటరు స్లిప్లు తీసుకుంటున్నారని, ఓటర్లు ఇవ్వకపోతే వారిని బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) రాష్ట్ర ఎన్నికల కమిషన్ను వైఎస్సార్సీపీ నేతలు పేర్నినాని, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్, వెల్లంపల్లి, జోగి రమేష్, మల్లాది విష్ణు, కల్పలతార్డెఇ, హఫీజ్ ఖాన్లు కలిశారు. దీనిలో భాగంగా టీడీపీ ప్రలోభాలపై ఎన్నికల కమిషన్కు వినతిపత్రం అందజేశార. అనంతరం పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటిసి ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయి వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె,ఎర్రిపల్లి, నల్లగొండువారిపల్లిలో టీడీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి ఓటరు స్లిప్పులు తీసుకుంటున్నారు. ఓటుకి పది వేలు రూపాయలు ఆశచూపిస్తున్నారు. ఓటరు స్లిప్పులు ఇవ్వకపోతే బెదిరిస్తున్నారు. గన్ మెన్ ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కే రక్షణ లేదు. అవినాష్ రెడ్డితో పాటు 150 మంది పై కేసులు పెట్టారు. దాడులు చేస్తాం...కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పోలీసులు...షాడో పార్టీలున్నా కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారు. రికార్డుల ప్రకారమే పోలీసులున్నారు.. కానీ ఎవరినీ పట్టుకోరు. చంద్రబాబు 10 వేలు ఇచ్చి పంపిస్తే అందులో టిడిపి వాళ్లు 5 వేలు నొక్కేస్తున్నారు. రేపు ఉదయం లోపు మళ్లీ ఓటరు స్లిప్పులు పంచాలి. కాల్ సెంటర్ పెట్టాలి...స్లిప్పులు ఇవ్వమని బెదిరించినా చర్యలు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ రేపు ఒక్కరోజైనా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు?ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కైమా కైమా చేసేస్తున్నాడని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ‘దీన్ని ఎన్నిక అంటారా చంద్రబాబు. చంద్రబాబు నీకసలు సిగ్గుశరం ఉందా?, ఓటరు స్లిప్పులు తీసుకుని డబ్బులు పంచుతున్నారు. గతంలో నంద్యాలలో కూడా ఇలాగే చంద్రబాబు వ్యవహరించారు. పులివెందులలో అసలు ప్రజాస్వామ్యమే లేదు. ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. పులివెందులలో గెలిచానని సంకలు గుద్దుకోవాలని చూస్తున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం ... లోపలా... బయట...సిసి కెమెరాలు పెట్టాలని కోరాం. పులివెందుల,ఒంటిమిట్టలో మొత్తం తన ప్రభుత్వాన్ని చంద్రబాబు మోహరించారు. ఎన్ని కుట్రలు చేసినా పులివెందులలో గెలిచేది వైఎస్సార్సీపీనే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ఎన్నిక జరిగినా ఎగిరేది మా పార్టీ జెండానే’ అని తెలిపారు. -
అభ్యసన మదింపునకు సెల్ఫ్ అసెస్మెంట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నెల 11 నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించడానికి నిర్వహిస్తున్న పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. గతేడాది 1నుంచి 8 తరగతుల వరకూ సీబీఏ అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. టెన్త్ విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 జరపనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇలా.. సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో 1నుంచి 5 తరగతుల వరకు 33,983 మంది, 6 నుంచి 10 తరగతుల వరకు 56,094 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో సుమారు 90,077 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలో సుమారుగా 540 విద్యాసంస్థలు ఉన్నా వాటిల్లో కొద్ది విద్యాసంస్థలే అనుసరిస్తున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం... ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల నాలుగు నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్తో పాటు, ఆరో తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్పై పరీక్ష ఉంటుంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు కొన్ని మార్పులతో పరీక్షలను నిర్వహిస్తున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్ఎలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్ ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. కొండపల్లి జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినులు (ఫైల్) -
దుర్గమ్మ దర్శనంతో పులకించిన భక్తజన మది
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనంతో భక్తజన మది పులకించింది. దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివాహ సుముహూర్తాలు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యాల అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఘాట్రోడ్డు, మహా మండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వదర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 క్యూలో ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల వరకు రద్దీ ఓ మోస్తరుగా ఉండగా, తర్వాత అనూహ్యంగా పెరిగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభమవగా మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దీ కొనసాగింది. రాత్రి 7 గంటల తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.పూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలుఇంద్రకీలాద్రిపై మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలోని యాగశాలలో అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పూర్ణాహుతి చేశారు. తొలుత పవిత్రోత్సవాలను పురస్కరించుకుని పలు ప్రత్యేక వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. అనంతరం జరిగిన పూర్ణాహుతిలో ఈవో శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పవిత్రోత్సవాలు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఆర్జిత సేవలు యధావిథిగా ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమాలు వంటి ఆర్జిత సేవల టికెట్లు కౌంటర్లలో అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
No Headline
జగ్గయ్యపేట అర్బన్: శ్రావణ మాస ఉత్సవాల్లో పట్టణంలోని శ్రీముత్యాలమ్మ ఆలయంలో మూడో ఆదివారం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. రూ.5 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కుమ్మరి శాలివాహన వంశస్తులతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అప్పన మణికుమార్, కొత్తా రమేష్కుమార్, కార్యవర్గ సభ్యులు నోముల శివకుమార్, కొంకిమళ్ల సురేష్, అప్పన పిచ్చయ్య, సభ్యులు చేడె శ్రీరంగం, నాగప్రసాద్, తునికిపాటి మల్లేశ్వరాచారి, ఆరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో నిండిపోయింది. తెల్లవారుజామునుంచే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దేవస్థానంలో నిర్వహించే స్వామివారి శాంతి కల్యాణంలో 73 మంది దంపతులు పాల్గొన్నారు. 203 మంది సర్పదోషనివారణ పూజలు చేశారు. సేవా టికెట్ల ద్వారా ఒక్కరోజులో స్వామివారి ఆదాయం రూ. 10,00,605 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అమ్మ సన్నిధిలో
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అన్నదానం (అన్నప్రసాదం) అంటే భక్తులకు విశ్వాసం మెండు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తజనం జగజ్జనని దర్శనానంతరం అన్నప్రసాదం తీసుకునే వెనుదిరుగుతారు. అయితే దేవస్థానంలోని కొందరు సిబ్బంది, కాంట్రాక్టర్లు లాలూచీ పడటంతో తిన్నవారికంటే.. లెక్క అధికంగా చూపుతున్నట్లు తెలుస్తోంది. అన్నదానంలో అంకెల మాయ చేస్తూ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ కనక దుర్గమ్మను భక్తులు మనసారా పూజిస్తారు. అందుకే అమ్మవారిని నియమ నిష్టలతో కొలుస్తారు. అయితే ఆలయంలో సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి భీతి లేకుండా అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానంలోనూ వీరు నిత్యం అక్రమాలకు పాల్పడుతున్నారు. అన్నదానంలో తినేవారి కంటే ఎక్కువ సంఖ్య చూపిస్తూ ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సాధారణ రోజుల్లో.. జనం సాధారణంగా ఉండే సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకే అన్న ప్రసాదం భక్తులకు ఇస్తారు. అంటే మొత్తం 4.30 గంటల సమయంలో 14 బ్యాచ్లు. బ్యాచ్కు 300 మంది చొప్పున 4,200 మందికి మాత్రమే ఉచిత అన్నప్రసాదం వడ్డిస్తారు. ఆ రోజుల్లో బఫే ఉండదు. అయితే ఈ రోజుల్లో దాదాపు 5000 నుంచి 6000 మంది భక్తులకు భోజనం పెడుతున్నట్లు లెక్క చూపుతున్నారు. సరుకులు దేవస్థానం ఇస్తుండగా, పాలు, కూరగాయలు, గ్యాస్, క్లీన్అండ్ సర్వీసింగ్ను కాంట్రాక్టర్లు నిర్వహిస్తున్నారు. స్వీపింగ్లో 40 మంది సిబ్బంది పనిచేయాల్సిండగా అక్కడ కేవలం 30 మంది మాత్రమే చేస్తున్నారు. అధికంగా.. ఈ లెక్కన సాధారణ రోజుల్లో 2 వేల మంది, రద్దీ రోజుల్లో వెయ్యి మందిని ఎక్కువగా చూపి చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్కో భక్తుడికి అన్న ప్రసాదం పెట్టేందుకు దాదాపు రూ.40 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన సరాసరి రోజుకు 1000 నుంచి 1500 మందిని అదనంగా చూపి బిల్లులు పెట్టి దోపిడీ చేస్తున్నారు. రోజుకు రూ.50 వేలకు పైగా దండు కొంటున్నారు. ఇలా నెలకు రూ.15 లక్షల మేర దోపిడీ పర్వం జరుగుతోంది. గత ఏడాది జూన్, జూలై, ఈ ఏడాది జూన్, జూలై నెలలకు సంబంధించిన అన్నదానం లెక్కలు తీస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. సీసీ పుటేజ్ను పరిశీలిస్తే.. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆలయ కార్య నిర్వహణ అధికారి.. అన్నదానం పెట్టే ప్రాంతంలో జూన్, జూలై నెలల్లో సీసీ పుటేజీని పరిశీలిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. ఏ సయమంలో భక్తులకు అన్నదానం ప్రారంభిం చింది, క్లోజ్ అయిన విషయాలు స్పష్టంగా ఉంటాయి. ఒక్క రోజు పరిశీలిస్తే ఎన్ని బ్యాచ్లకు భోజనాలు పెట్టింది తెలుస్తుంది. అక్కడ భోజనాలు చేసే ముందు వేసే వేలి ముద్రల్లో సిబ్బంది మాయ చేస్తున్నారని సమాచారం. సీసీ పుటేజీలు పరిశీలిస్తే అన్నదానంలో జరిగే దందా మొత్తం బయటికి వస్తుంది. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉచిత అన్నదాన ప్రసాదాన్ని భక్తులకు పెడతారు. మూడో ఫ్లోర్ నుంచి క్యూలైన్ మొదలవుతుంది. రెండో ఫ్లోర్లో భక్తులకు ఒక హాలులో 180మంది, ఇంకో హాలులో 120 మందికి రెండు హాళ్లల్లో 300 మందికి ఒకేసారి భోజనం పెడతారు. ఒక్కో బ్యాచ్ భోజనం చేసేందుకు 20 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన 6 గంటల సమయంలో 18 బ్యాచ్లు అంటే అత్యధికంగా 5,400 మందికి భోజనం పెట్టే వెసులుబాటు ఉంది. ఈ రోజుల్లో ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 1500 మందికి బఫే పద్ధతిలో పెడతారు. అంటే అత్యఽధికంగా 7000 మందికి భోజనం పెట్టే వీలుంది. బఫే బ్యాచ్ భోజనం 10 నుంచి 13 నిమిషాల్లోనే పూర్తైనట్లు చూపి, రోజుకు 8000 నుంచి 9000 మందికి భోజనం పెడు తున్నట్లు లెక్క చూపుతున్నారని సమాచారం. ఎక్కువగా చూపిన భక్తుల సంఖ్యకు సంబంధించిన లెక్కను ఆలయ అన్నదాన సిబ్బంది, క్లీన్ అండ్ సర్వీంగ్ కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చేతివాటంలో అన్నదానానికి సంబంధించి ఇద్దరు గుమాస్తాలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
పెనమలూరు: మండల పరిధిలో ఆదివారం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సీఎం చంద్రబాబునాయుడు పోరంకి రావడం, మండల పరిధిలోని కల్యాణ మండపాల్లో శుభకార్యక్రమాలు జరగడంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో బందరురోడ్డుపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సీఎం చంద్రబాబు పోరంకిలో జరిగిన శుభకార్యక్రమానికి రోడ్డు మార్గంలో రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. ముఖ్యంగా చంద్రబాబు వచ్చిన సమయంలో పది నిమిషాల ముందుగానే బందరురోడ్డుపై వాహనాలు నిలిపివేయడంతో వాహనచదోకులు చాలా ఇబ్బందులు పడ్డారు. సీఎం తిరిగి వెళ్లిన తర్వాత బందరురోడ్డుపై ట్రాఫిక్ వదలటం, బందోబస్తులో ఉన్న పోలీసులు ట్రాఫిక్ సమస్యలు పట్టించుకోకుండా విధుల నుంచి వెళ్లిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనచోదకులు అవస్థ పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ ఏది..? జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు తరచూ విఫలమవుతున్నారు. ప్రజల కష్టాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కాలంలో బందరు రోడ్డుపై ట్రాఫిక్ పెరిగినా దాని నియంత్రణపై పోలీసు ఉన్నతాధికారులు శ్రద్ధ చూపడం లేదని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు మండల పరిధిలో తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
కలగా మిగిలిన రైలు మార్గం
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు రైలు సదుపాయం కల్పించేందుకు ప్రతిపాదించిన కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గత 40 సంవత్సరాలుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. అప్పటి ఎమ్మెల్సీ కొల్లి పావన వీరరాఘవరావు విజయవాడ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న దివంగత చెన్నుపాటి విద్యకు ఈ రైలుమార్గం ప్రాధాన్యతను తెలియజేసి పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదింపజేశారు. వరుసగా నాలుగు బడ్జెట్లలోనూ ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి గల అవకాశాలపై సర్వే చేయడానికి కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగా నిధులు కూడా కేటాయించింది. 2010లో తొలిసారి ఈ రైలుమార్గానికి రూ.10 కోట్లు కేటాయించి సర్వే చేయడానికి రైల్వేశాఖ కార్యాచరణ రూపొందించింది. గత పార్లమెంటు సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ మినహా ఈ రైలుమార్గం గురించి విజయవాడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇతర పార్లమెంటు సభ్యులెవరూ పార్లమెంటులో ప్రస్తావించలేదు. బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తదుపరి ఈ రైలుమార్గాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడంతో పాటు కొండపల్లి నుంచి నున్న, వెలగలేరు, వెల్వడం, మైలవరం, తిరువూరు మీదుగా రైలుమార్గం ఏర్పాటుకు సుముఖత చూపినా ఇంత వరకు తదుపరి చర్యలు తీసుకోలేదు. రెండు రాష్ట్రాలకు అనుసంధానం.. కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం నిర్మిస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో ఈ రైలుమార్గాన్ని ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని కిరండల్ వరకు నిర్మించాలనే ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉంది. దీనికి అనుసంధానంగా కొవ్వూరు – భద్రాచలం రైలుమార్గాన్ని గత పదేళ్లలో చేపట్టి పూర్తి చేశారు. ప్రస్తుతం కొండపల్లి నుంచి ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి వరకు రైలుమార్గం నిర్మిస్తే కొత్తగూడెం వరకు రైలు సదుపాయం కల్పించే అవకాశం ఉంటుంది. కొండపల్లి నుంచి పెనుబల్లికి 65 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండటంతో తక్కువ ఖర్చుతో రైలుమార్గం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇటీవల కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీలో కొత్త రైలుమార్గాల జాబితాలో కొండపల్లి – కొత్తగూడెం మార్గం లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కీలకమైన రైలుమార్గం కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనులు, భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి పుణ్యక్షేత్రం తదితర ప్రాంతాలను కలిపే ఈ రైలుమార్గం ఆవశ్యకతను ఇకనైనా విజయవాడ పార్లమెంటు సభ్యులు గుర్తించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి త్వరితగతిన కార్యరూపం దాల్చే విధంగా చూడాలని పలువురు కోరుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల అసెంబ్లీలో ఈ రైలుమార్గం నిర్మాణం గురించి ప్రస్తావించినా అధికార పార్టీ స్పందించలేదు. 40 ఏళ్లుగా సర్వేలతో సరి ప్రతి బడ్జెట్లో నామమాత్రంగా నిధుల కేటాయింపు ఆచరణకు నోచుకోని కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గంనాయకులు శ్రద్ధ చూపాలి.. అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ కృష్ణాకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే కొండపల్లి – కొత్తగూడెం రైలుమార్గం గురించి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయం. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్త రైలుమార్గాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్నా తదనుగుణంగా ప్రతిపాదనలను పంపకపోవడం తగదు. ఇకనైనా ఈ రైలుమార్గాన్ని నిర్మించడానికి ప్రజాప్రతినిధులు శ్రద్ధ చూపాలి. – నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ తిరువూరు ఇన్చార్జి రైలు మార్గం కల్పించాలి.. ఎన్టీఆర్ జిల్లాలోనే కాక రాష్ట్రంలో మారుమూల ఉన్న తిరువూరు, మైలవరం నియోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే రైలుమార్గం ఏర్పాటు ఎంతో అవసరం. ఈ రెండు నియోజక వర్గాల్లో ప్రభుత్వభూములు, అటవీ భూములు వేలాది ఎకరాలున్నందున వీటిని పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైలుమార్గం నిర్మాణంతో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. – ఐవీకే కిషోర్, స్థానికుడు, తిరువూరు -
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): విద్యారంగం, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విమర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు కొండపల్లి క్రాంతి హైస్కూల్లో ఆదివారం జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు కోరుతుంటే, విద్యార్థి సంఘాలను పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అనుమతించవద్దని సర్క్యూలర్ తీసుకురావడం అత్యంత దారుణమన్నారు. సర్క్యూలర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా ఏడాది ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ సంక్షేమ హాస్టళ్లలో, విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. ఆఫ్లైన్లో డిగ్రీ ప్రవేశాలు జరపాలని, పీజీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చడంలేదని విమర్శించారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ నగదు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు గోపి నాయక్, ఉపాధ్యక్షులు కుమారస్వామి, కుమార్ నాయక్, మాధవ్, ప్రణీత, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. -
‘వర్ణం’ కవితా సంపుటి ఆవిష్కరణ
విజయవాడకల్చరల్: వర్ణం కవితా సంపుటి ఆవిష్కరణ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయంలో ఆదివారం వైభవంగా జరిగింది. ‘సాక్షి’ స్టేట్ బ్యూరో రిపోర్టర్ బోణం గణేష్ రచించిన ఈ పుస్తకాన్ని ఆర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ల నారాయణరావు, అమరావతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి, కార్యవర్గ సభ్యులు లహరి మహేంద్రగౌడ్, నందివాడ చిన్నాదేవి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నాయకులువెంకటాపురం(పెనుగంచిప్రోలు): మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కందిమాల సత్యనారాయణ, నల్లబోతుల రామకృష్ణ(బుల్లబ్బాయి) వారి కుటుంబ సభ్యులు శఽనివారం రాత్రి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, సర్పంచ్ కూచి నర్సయ్య, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.లేజర్ ఎన్యుక్లియేషన్, అడ్వాన్స్డ్ ప్రొస్టేట్ సర్జరీలపై శిక్షణపటమట(విజయవాడతూర్పు): ప్రశాంత్ హాస్పిటల్ 37వ వార్షికోత్సవం సందర్భంగా లేజర్ ఎన్యుక్లియేషన్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొస్టేట్ సర్జరీ ప్రోగ్రామ్(లీప్)ను అత్యాధునిక ప్రొస్టేట్ సర్జరీలు, వైద్య చికిత్సల నిర్వహణపై వైద్యులకు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. లబ్బీపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానంగా.. అడ్వాన్స్డ్ లేజర్ ఎన్యుక్లియేషన్ ప్రొస్టేట్ చికిత్స గురించి, లైవ్ సర్జరీలు, చికిత్సలో మెలకువలు, యూరాలజిస్టులకు ప్రయోగాత్మక శిక్షణ అందించారు. వాటితో పాటు రెజుమ్ వాటర్ వేపర్ థెరపీ వంటి సూక్ష్మ విధాన శస్త్రచికిత్సలు, యూరోలిఫ్ట్, రోబోటిక్ సింపుల్ ప్రొస్టటెక్టమీ, ఐటిండ్ తదితర చికిత్స విధానాలపై శిక్షణనందించారు. కార్యక్రమంలో ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ధీరజ్ కాసరనేని, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతమ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విజ్ఞానంపై విస్తృత ప్రచారం జరగాలి
గన్నవరంరూరల్: వైద్య విజ్ఞానంపై ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం జరగాలని చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు ఆకాంక్షించారు. సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కళాశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లను 3,400 మంది సందర్శించారు. మొత్తం 26 వేల మందికి పైగా ఈ ఎగ్జిబిషన్లను సందర్శించినట్లు చెప్పారు. వైద్యం పట్ల అవగాహన ఎంతో అవసరమన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్నా ఆ మేరకు విజ్ఞాన ప్రగతి సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందని, వైద్య రంగంలో ఎంతో ప్రగతి సాధించామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ను సందర్శించిన వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ మానవ శరీర నిర్మాణంలో తమను తాము దర్శించుకున్నారని చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్లలో అన్ని డిపార్టుమెంట్లు, నర్సింగ్ స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని సేవలందించారని కొనియాడారు. డైరెక్టర్ సీవీ రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.అనిల్కుమార్, డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.కళ్యాణి, ఏవోలు, డాక్టర్ రాజగోపాల్ పాల్గొన్నారు. డెంటల్ కళాశాలలో.. చిన అవుటపల్లి డాక్టర్స్ సుధా అండ్ నాగేశ్వరరావు సిద్ధార్థ దంత వైద్య కళాశాలలో ఆదివారం 9 విభాగాల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను విద్యార్థులు తిలకించారు. గ్రహణం మొర్రి, అంగిలి చీలిక విభాగంలో ఇప్పటి వరకు ఆస్పత్రిలో నిర్వహించిన ఆపరేషన్ల వివరాలను ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలియజేశారు. కమ్యూనిటీ విభాగం ద్వారా పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సేవలు ప్రదర్శించారు. హెచ్వోడీలు కాళేశ్వరరావు, అజయ్బెనర్జీ, ఏవో వై.మధుసూదనరావు పాల్గొన్నారు. -
ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఐపీఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీఐపీఎంఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్క్లబ్లో ఏపీఐపీఎంఈఏ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తమ సంఘం రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. డిపార్ట్మెంట్ అధోగతి పాలుకావడానికి ఆయనే కారణమన్నారు. అతడిని తక్షణమే తొలగించి అదేస్థాయి అధికారిని పరిపాలన అధికారిగా నియమించాలని కోరారు. 150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.. ఐపీఎంకు డైరెక్టర్ను నియమించాలని రాజారావు కోరారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల పదోన్నతులు కల్పించాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన సింగిల్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని, మంత్రి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 150 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 50 శాతం పోస్టులు ల్యాబ్లోనే భర్తీ చేయాలన్నారు. జూనియర్ అనలిస్ట్లకు సర్వీసు రెగ్యులర్ చేయాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించాలని కోరారు. సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఐపీఎం నిర్వీర్యం కావడానికి అధికారులే కారణమన్నారు. ఐపీఎంను నిలబెట్టుకోవాలన్నా, పదోన్నతులు పొందాలన్నా, ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలన్నా పోరాటాలే శరణ్యమని పేర్కొన్నారు. సమావేశంలో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తాళ్లూరి వెంకటేశ్వర్లు, నేషనల్ హెల్త్ మిషన్ జేఏసీ నాయకులు దయామణి, చలం, బి. శ్రీనివాసరావు, సతీష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి.. అనంత లోకాలకు
పమిడిముక్కల: అభిమాన హీరో బ్యానర్ కట్టేందుకు వచ్చి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెనుమత్స గ్రామానికి చెందిన జుజ్జువరపు హర్ష(26) విజయవాడ గూడవల్లిలో నివాసం ఉంటూ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఓ సినీ హీరో పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రామంలో బ్యానర్ కట్టేందుకు వెళ్లాడు. బ్యానర్ కట్టి బైక్పై తిరిగి విజయవాడ వెళ్తుండగా మార్గమధ్యలో మంటాడ రెడ్డిపాలెం వద్ద ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొంది. దీంతో హర్ష తలకు తీవ్ర గాయమైంది. రెడ్డిపాలెం వాసులు పోలీసులకు, పెనుమత్స గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతునికి ఏడాది క్రితం వివాహమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు
పెడన: మచిలీపట్నం – గుడివాడ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందిగామ గ్రామానికి చెందిన పోలగాని పెదబోదయ్య(45), పోలగాని సాయి(23)లు గుడివాడ నుంచి పెడన వైపు వస్తున్నారు. వడ్లమన్నాడుకు చెందిన మరో ఇద్దరు గుడివాడ వైపు వెళ్తున్నారు. వీరి వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీ కొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పెడన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటోలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బోదయ్య మినహా మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేసినట్లుగా సమాచారం. జరిగిన సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
త్వరలో వేద పాఠశాలలో తరగతులు ప్రారంభం
తాడేపల్లి(ఘంటసాల): శ్రీపరిపూర్ణానందగిరి స్వామి ఆశీస్సులతో తాడేపల్లి ఆశ్రమంలోని బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారి శృతిభారతి వేద పాఠశాలలో సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించనున్నట్లు విశ్వ విద్యాలయం ఉపకులపతి ఆచార్య గుళ్లపల్లి శ్రీరామ కృష్ణమూర్తి తెలిపారు. ఘంటసాల మండలం తాడేపల్లిలో కృష్ణామండలం వ్యాసాశ్రమంలో ఎన్నారై మూల్పూరి వెంకట్రావు, సావిత్రి దంపతుల సౌజన్యంతో వేద పాఠశాల తరగతులు నిర్వహించనున్నారు. బ్రహ్మ విద్యా కేంద్రం ప్రాంగణంలో తిరుపతి రాష్ట్రీయ(జాతీయ) సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా గుర్తించబడిన సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో అర్చకత్వ పౌరోహిత్య(కర్మకాండ) అధ్యయన కేంద్రం, విశ్వవిద్యాలయ ప్రాక్ శాస్త్రి కార్యక్రమాలకు ప్రవేశం కల్పించి తరగతులు నిర్వహిస్తారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య శ్రీరామ కృష్ణమూర్తి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో మొదటసారిగా ఏర్పాటు చేస్తున్న వేద పాఠశాలలో కులరహితంగా ప్రవేశాలు పొంది వేదాలు అభ్యసించాలన్నారు. ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో ఒక సంవత్సరం, ప్రాక్ శాస్త్రి కోర్సు రెండేళ్లు ఉంటుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని చెప్పారు. కార్యక్రమంలో ఉపకులపతి సతీమణి రామలక్ష్మి, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం డైరెక్టర్, శృతిభారతి వేదపాఠశాల కోఆర్డినేటర్ డాక్టర్ జ్ఞాన్ రంజన్ పాండా, ఆశ్రమ నిర్వాహకులు కావూరి కోదండరామయ్య, గొర్రెపాటి రామకృష్ణ, మొవ్వ శ్రీరామమూర్తి, గొర్రెపాటి సురేష్, పి.శివకోటేశ్వరరావు, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శృతిభారతి వేదపాఠశాల విద్యార్థుల వసతి గదుల నిర్మాణానికి ఎన్నారై మూల్పూరి వెంకట్రావు – సావిత్రి దంపతులు శంకుస్థాపన చేశారు. మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నం చేయనున్నట్లు వారు చెప్పారు. -
మెడికల్ టెక్నీషియన్ల హక్కుల సాధనకు కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ హక్కుల సాధనకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్చార్జి మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లోని కందుకూరి కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్స్ అసోసియేషన్ 3వ రాష్ట్ర మహాసభ ఆదివారం జరిగింది. సభకు మల్లాది విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను మల్లాది విష్ణుకు తెలియజేశారు. బీమా సదుపాయం కూడా లేని పరిస్థితి ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ రోగులకు సేవలు అందించడంలో మెడికల్ లేబొరేటరీస్, రేడియాలజీ టెక్నిషియన్లదే కీలక పాత్ర అన్నారు. వారి సేవలను ప్రశంసించారు. రేడియాలజీ టెక్నీషియన్స్,ల్యాబ్ అసిస్టెంట్స్ ప్రభుత్వ సహాయ, సహకారాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం బీమా సదుపాయం కూడా లేదన్నారు. తాము అధికారంలో లేకపోయినా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అక్షరం ప్రభాకర్ ‘రణం’ ఉత్తమ కవితగా ఎన్నిక
విజయవాడ కల్చరల్: ఎక్స్రే సాహిత్య మాసపత్రిక జాతీయ స్థాయిలో నిర్వహించిన తెలుగు కవితల పోటీ విజేతలను ప్రధాన కార్యదర్శి బోడి ఆంజనేయ రాజు, అధ్యక్షుడు కొల్లూరి ఆదివారం ప్రకటించారు. తెలంగాణ మానుకోటకు చెందిన అక్షరం ప్రభాకర్ రచించిన రణం కవితను ఉత్తమ కవితగా న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారన్నారు. విజేతలకు రూ.10 వేల నగదు బహుమతి ఎక్స్రే అవార్డును అందజేస్తున్నట్లు తెలిపారు. కె.మునిసురేష్ పిళ్లే హైదరాబాద్, మామిడిశెట్టి శ్రీనివాస్ దొడిపట్ల, డాక్టర్ రాధాశ్రీ నాగరం, అవ్వారు శ్రీధర్బాబు నెల్లూరు, చిత్రాడ కిషోర్కుమార్ విజయవాడ, జాగారపు శంకరరావు గజపతి నగరం, శ్రీ కంఠస్ఫూర్తి విజయవాడ, దుప్పటి రమేష్బాబు నెల్లూరు, ధవశ్వేరపు రవికుమార్ విశాఖపట్నం, కోరుప్రోలు హరినాథ్ హైదరాబాద్ ఎక్స్రే అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరంలో విజయవాడలో జరిగే సభలో వారికి నగదు బహుమతి, జ్ఞాపికలతో సత్కరిస్తామని పేర్కొన్నారు. -
వాట్సాప్ గ్రూపుల్లో మెరిసిన 52 క్యారెట్ల వజ్రం!
కంచికచర్ల (నందిగామ): ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పరిటాలలో 52 క్యారెట్ల వజ్రం దొరికిందన్న వార్త ఆదివారం వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. దీని ప్రకారం– పరిటాల చెరువు వద్ద వజ్రాల వేటకు వచ్చిన ఓ వ్యక్తికి ఈ భారీ వజ్రం దొరికిందట. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ.4 కోట్లు ఉంటుందని, కానీ సదరు వ్యక్తి రూ.2.20 కోట్లకే అమ్మేశాడని ప్రచారం జరిగింది.స్వాతంత్య్రం రాకముందు ఈ ప్రాంతం నిజాం నవాబుల పాలనలో ఉండేదని, అప్పట్లో వజ్రాలు, వైఢూర్యాలు ఇక్కడ విరివిగా లభించేవని ఇక్కడ వినిపిస్తుంటుంది. అయితే, తాజాగా వజ్రం దొరికిందన్న వార్త పూర్తిగా కల్పితమని, తమకు ఎటువంటి సమాచారం లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. చెరువు కూడా ప్రస్తుతం నీటితో నిండిపోయి ఉండడంతో, వజ్రాల వేట అసాధ్యమని వారు చెబుతున్నారు. -
విశాఖలో ఆటీన్ రాణులు
విశాఖ సిటీ: విశాఖ ఆటీన్ రాణులు పెరిగిపోతున్నారు. చతుర్ముఖ పారాయణంలో మునిగితేలుతున్నారు. పలువురు మహిళలు ఏకంగా పేకాట డెన్లు సైతం నిర్వహిస్తున్నారు. కుటుంబాలను సైతం పట్టించుకోకుండా మూడు ముక్కలాటలో నిమగ్నమైపోతున్నారు. తన భార్య పేకాట మత్తు లో పడి తమను పట్టించుకోవడం లేదని ఒక భర్త నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగి్చకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. మహిళామణుల జూద క్రీడ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్లే్ల పేకాట డెన్లు ఇప్పటి వరకు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన వారంతా మగవారే. కానీ ఇపుడు కాలం మారిపోయింది. అన్నింట్లోను సమానమే అన్నట్లు ముక్కలాటలోను జోరుమీద ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ను సిద్ధం చేసుకుంటున్నారు. జూద క్రీడకు ఎక్కడకు వెళ్లకుండానే ఇళ్లనే పేకాట డెన్లుగా మార్చేసుకుంటున్నారు. భర్తలను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ముక్కలు విసిరే పనిలో బిజీగా ఉంటున్నారు. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఇళ్లలో పేకాట నిర్వహణకు కమీషన్ సైతం తీసుకుంటున్నారు. కొన్ని అపార్టుమెంట్లలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నారు. ఆరుగురి అరెస్ట్ సీపీ ఆదేశాలతో పోలీసులు ఆ ఇంటిపై దాడులు చేశారు. లోపల పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22 వేలను స్వా«దీనం చేసుకున్నారు. వీరిలో కొందరు కొన్నేళ్లుగా వివిధ ప్రాంతాల్లో నిత్యం పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పనిలో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టారు. వీరు ఎక్కడెక్కడ పేకాట నిర్వహిస్తున్నరన్న విషయంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. భార్య పేకాటపై భర్త ఫిర్యాదు ఇప్పటి వరకు సీరియల్స్, సినిమాలు, ఫోన్లలో పడి భర్తలు, పిల్లలను పట్టించుకోని ఆడవారు ఉన్నట్లు వింటూ వస్తున్నాం. కానీ పేకాటలో పడి పిల్లలను, తనను పట్టించుకోవడం లేదన్న విషయం ఒక భర్త ఫిర్యాదుతో తాజాగా వెలుగులోకి వచ్చింది. అక్కయ్యపాలెం లలితానగర్ ప్రాంతంలో ఒక ఇల్లు పేకాట డెన్గా మారింది. ఆ ఇంటి గృహిణే ఈ జూద క్రీడకు లీడర్గా వ్యవహిరస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రప్పించి ఆ ఇంట్లో నిత్యం మూడు ముక్కలాట ఆడిస్తోంది. భర్తను, పిల్లలను సైతం పట్టించుకోకుండా ఆటోలోనే మునిగితేలుతోంది.భర్త ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిపోయిన భర్త ఇటీవల ఫోర్త్ టౌన్ సీఐ సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. అతను పట్టించుకోకపోవడంతో నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. తన భార్య పేకాట కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు తన గోడును విన్నవించుకున్నాడు. పేకాట డెన్గా మారిపోయిన తమ ఇంటిని మార్చాలని కోరారు. దీనికి స్పందించిన సీపీ విచారణ అనంతరం సీఐని బదిలీ చేశారు. -
మరోసారి నోరు పారేసుకున్న ఎమ్మెల్యే కొలికపూడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి నోరు పారేసుకున్నారు. జిల్లాలోని ఎ. కొండూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడకల్లో జిల్లా కలెక్టర్లతో కలిసి కొలికపూడి పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఎ. కొండూరు మండలంలో నీటి సరఫరాపై జరుగుతున్న ప్రచారంపై కొలికపూడి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానంటూ అవాకులు చవాకులు పేలారు. అదే క్రమంలో స్థానిక టిడిపి ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ముఖ్య అనుచరుడిని టార్గెట్ చేశారు కొలికపూడి. గిరిజనులకు మరుగుదొడ్లు కట్టించేందుకు గతంలో కాంట్రాక్ట్ తీసుకున్న టీడీపీ నేత రమేష్రెడ్డిపై పరోక్షంగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. 320 మరుగుదొడ్లు కట్టించేందుకు బిల్లులు తీసుకున్నారన్నారు. అటువంటి వారి వెనుక తిరుగుతారా? అంటూ గిరిజనును నిలదీశారు. అసలు మీకు సిగ్గుందా? గిరిజనులపై సైతం నోరు పారేసుకున్నారు కొలికపూడి. -
భిక్షాటన చేయించేందుకు చిన్నారిని కొనుగోలు చేసిన జంట!
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): వ్యసనాలకు బానిసైన భర్త.. భార్యకు తెలియకుండా మూడేళ్ల కూతురును అపహరించి సహజీవనం చేస్తున్న ఒక జంటకు విక్రయించాడు.. తర్వాత ఏం తెలియనట్లుగా విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో అసలు నిందితుడు తండ్రే అని పోలీసులు నిగ్గు తేల్చారు. ఈ మేరకు విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) ఇన్స్పెక్టర్ జె.వి.రమణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతేఆలీబేగ్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.బాపట్ల జిల్లా వేటపాలెం గ్రామానికి చెందిన సైకం మస్తాన్, వెంకటేశ్వరమ్మ భార్యాభర్తలు. వీరికి ఏడుగురు సంతానం. చెడు వ్యసనాలకు బానిసైన భర్త తరచూ భార్యతో గొడవలు పడుతుండేవాడు. నాలుగు నెలల క్రితం కుటుంబంలో గొడవలు జరగటంతో భార్య పిల్లలతో కలసి భర్తకు వేటపాలంలోనే దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 6న సైకం మస్తాన్ భార్య ఇంటికి వెళ్లి ఆమెకు తెలియకుండా తన ఏడో సంతానం మూడేళ్ల శ్రావణిని తీసుకుని విజయవాడలో విక్రయించడానికి ప్రయతి్నస్తున్నాడు. భిక్షాటన చేయించేందుకు చిన్నారిని కొనుగోలు చేసిన జంట విజయవాడ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫాంపై మజ్జిగ ప్యాకెట్లు విక్రయిస్తున్న ప్రకాశం జిల్లా వేమవవరానికి చెందిన బొల్లా శ్రీనివాసులు, స్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేసుకుంటున్న సడేల చిన్నారి సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 7న విజయవాడ స్టేషన్లో వారిని సైకం మస్తాన్ పరిచయం చేసుకుని తన బిడ్డను విక్రయిస్తానని తెలపడంతో ఆ చిన్నారితో భిక్షాటన చేయిస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచించారు. వారు రూ.5 వేలు ఇచ్చి చిన్నారిని కొనుగోలు చేసుకున్నారు. విజయవాడలోనే ఉంటే బాలిక ఆచూకీ తెలిసిపోతుందని భావించిన వారు రాజమండ్రిలో బాలికతో భిక్షాటన చేయించడానికి తీసుకువెళ్లారు. అనంతరం ఎక్కడ తనపై అనుమానం వస్తుందోనని తండ్రి మస్తాన్ ఏంతెలియనట్లుగా అదే రోజు రాత్రి 10.30 గంటలకు తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారని ఒకసారి, రిజర్వేషన్ కౌంటర్ వద్ద తప్పిపోయిందని పొంతన లేకుండా జీఆర్పీ పోలీసులకు తెలిపాడు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ తండ్రి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు తల్లి లేకుండా మూడేళ్ల బిడ్డతో ఎందుకు వచ్చావని విచారణ చేయగా ఒకసారి భార్య చనిపోయిందని, మరోసారి ఆమె వదిలేసి వెళ్లిపోయిందని చెప్పాడు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తల్లి ఆచూకీ తెలుసుకుని ఆమెను పిలిపించారు. ఆర్పీఎఫ్ సహకారంతో స్టేషన్లోని సీసీ కెమేరాలను పరిశీలించిన పోలీసులు.. నిందితులు బాలికను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. బస్స్టేషన్లోని సీసీ కెమేరాలను పరిశీలించగా విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే బస్సు ఎక్కినట్లు గుర్తించి డ్రైవర్ నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి అనుమానితుల వివరాలు చెప్పడంతో బాలికను తీసుకుని ఒక మహిళ, పురుషుడు బస్సులో ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు. రాజమండ్రి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని బాలికతో పాటు ఇద్దరు నిందితులను విజయవాడ తీసుకువచ్చి బాలికను తల్లికి అప్పగించారు. తండ్రితో పాటు బాలికను కొనుగోలు చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఉన్మాద పాలన
నందిగామటౌన్: రాష్ట్రంలో గత 13 నెలలుగా ఉన్మాద పాలన సాగుతోందని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. ఇందులో భాగంగానే నందిగామలో అధికారులు గురువారం అర్ధరాత్రి అరాచకానికి పాల్పడ్డారన్నారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లం ఘించి గాంధీ సెంటర్లో ఉన్న మహానేత విగ్రహాన్ని క్రేన్లతో తొలగించి తీసుకువెళ్లి మున్సిపల్ కార్యా లయంలో పడేశారన్నారు. మహానేత విగ్రహాన్ని తొలగించటాన్ని నిరసిస్తూ డాక్టర్ మొండితోక జగన్ మోహనరావు నాయకత్వంలో శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి గాంధీ సెంటరులోని మహానేత విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లి ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని కూటమి నేతలు తొలగించి ప్రజల హృదయాలలో ఆయన స్థానాన్ని మరింత సుస్థిరం చేశారని అన్నారు. అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు అధికారులు కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తొలగించారని అన్నారు. అధికార పార్టీ నేతల ధన దాహానికి రాఘవాపురం కొండ విరిగి పడి ఓ వ్యక్తి మృతి చెందితే రెండవ కంటికి తెలియకుండా సెటిల్మెంట్ చేసి బాధిత కుటుంబానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వినతిపత్రం అందజేత.. గాంధీ సెంటరులోని రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని తొలగించిన కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కన్వీనర్ దేవినేని అవినాష్, నాయకులు నల్లగట్ల స్వామిదాసు, పూనూరు గౌతమ్రెడ్డి, ఇంటూరి రాజగోపాల్తో కలిసి సీఐ వైవీఎల్ నాయుడుకు వినతిపత్రం అందజేశారు. విగ్రహాన్ని తొలగిస్తున్న సమయంలో అటుగా వస్తున్న మహిళా సర్పంచ్ను, ఆమె భర్తను సైతం ఇష్టారీతిన అసభ్య పదజాలంతో దూషించి కారు అద్దాలపై గుద్దుతూ భయభ్రాంతులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు లాక్కుని దిక్కున్న చోట చెప్పుకోండంటూ వ్యవహరించిన తీరు అమానవీయమని అన్నారు. ఇప్పటికై నా పోలీసులు స్పందించి విగ్రహాన్ని తొలగించేందుకు సహకరించిన వారితో పాటు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు ముక్కపాటి నరసింహారావు, వేల్పుల ప్రశాంతి, ఎంపీపీలు పెసరమల్లి రమాదేవి, మలక్ బషీర్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు మంగునూరి కొండారెడ్డి, కాలవ వాసుదేవరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, పట్టణ, మండల కన్వీనర్లు మహ్మద్ మస్తాన్, వేమా సురేష్బాబు, మంచాల చంద్రశేఖర్, బండి మల్లికార్జునరావు, ఆవుల రమేష్ బాబు, కందుల నాగేశ్వరరావు, నెలకుదిటి శివనాగేశ్వరరావు, షేక్ షహనాజ్ బేగం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నందిగామలో అర్ధరాత్రి మహానేత విగ్రహం తొలగింపు హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేసిన అధికారులు కూటమి నేతల మెప్పు పొందేందుకే ఈ దుశ్చర్య నిరసనగా పాదయాత్ర చేసిన మాజీ ఎమ్మెల్యే జగన్మోహనరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అవినాష్, పార్టీ నేతలు -
కోరిన వరాలిచ్చే వరలక్ష్మిగా..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కోరిన వరములిచ్చే వరలక్ష్మిగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మరో వైపు పవిత్రోత్సవాల నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులకు పవిత్రాలను అలంకరించారు. ఉదయం 9.20 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభం కాగా భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. ఆన్ లైన్లో రూ.500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మాత్రం అంతరాలయ దర్శనం కల్పించారు. బంగారు వాకిలితో పాటు మొత్తం 5 క్యూలైన్ల ద్వారా భక్తులకు ఉచితంగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ... పవిత్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులతో పాటు పలువురు ఆలయ అధికారులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతాలను పురస్క రించుకుని అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రవేశ మార్గాలలో వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో మామిడి తోరణాలు, అరటి చెట్లతో అలంకరించడంతో పండుగ వాతావరణం కనిపించింది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు దేవస్థానం మజ్జిగ పంపిణీ చేసింది. రాత్రి 7 గంటల నుంచి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు... శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పవిత్రోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు పవిత్రాలను సమ ర్పించి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రోచ్చారణ మధ్య పవిత్రమాలలను అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి, ఉపాలయాల్లో దేవతా మూర్తులకు ఆలయ అర్చకులు అలంకరించారు. మూడు రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు ఆదివారం ఉదయం పూర్ణాహుతితో ముగుస్తాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తజనం భక్తులతో కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి రద్దీ సమయంలో టికెట్ల విక్రయాలు రద్దు అన్ని క్యూలైన్లలోనూ ఉచితమే -
యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటో బోల్తా
హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె–కోల్కతా జాతీయ రహదారిపై హనుమాన్జంక్షన్ బైపాస్రోడ్డులో యాసిస్ లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షు శుక్రవారం యాసిడ్ లోడుతో ఏలూరుకు కిరాయి కోసం బయలుదేరాడు. అతనితో పాటుగా తోడు ఉంటుందని తన భార్య షేక్ షంషాద్ (47)కు కూడా వెంట తీసుకెళ్లాడు. భార్యభర్తలిద్దరూ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మార్గమధ్యంలో దుర్ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి బోల్తా హనుమాన్జంక్షన్ బైపాస్రోడ్డు వద్దకు రాగానే ట్రక్కు ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ క్యాబిన్లో ఉన్న భార్య షంషాద్ రోడ్డుపైకి పడిపోయింది. ఆటో బోల్తా కొట్టడంతో ట్రక్కులో ఉన్న యాసిడ్ డ్రమ్ములు కూడా కిందకు ఒరిగిపోయాయి. దీంతో షంషాద్పై అధిక మొత్తంతో యాసిడ్ పడటంతో ఆమె శరీరంగా తీవ్రంగా కాలిపోయి, అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆటో నడుపుతున్న ఆమె భర్త షేక్ అలాభక్షు కంటిలో యాసిడ్ పడటంతో పాటుగా శరీరంపై పలుచోట్ల గాయాలైయ్యాయి. రహదారిపై యాసిడ్ పడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్జంక్షన్ ఫైర్ ఆఫీసర్ వి.అమరేశ్వరరావు సిబ్బందితో రహదారిపై పడిన యాసిడ్ను శుభ్రం చేయించారు. క్రేన్ సాయంతో ట్రక్కు ఆటోను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొలుత ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మృతురాలు షేక్ షంషాద్కు ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. వాచ్మెన్ అనుమానాస్పద మృతి మధురానగర్(విజయవాడసెంట్రల్): వాచ్మెన్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గుణదల పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదల అయ్యప్పనగర్కు చెందిన బద్దూరి ప్రసాద్(45) అపార్ట్మెంట్లో వాచ్మెన్. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం 5 గంటలకు ప్రసాద్ ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఏలూరు రోడ్డులో కొబ్బరికాయలు అమ్ముకునే వ్యక్తి ప్రసాద్ కుమార్తె నీలవేణికి ఫోన్ చేసి మధురానగర్ శివాలయం రైవస్కాలువ పక్కన మీ నాన్న ఫిట్స్వచ్చి చనిపోయారని తెలిపారు. దీంతో నీలవేణి తల్లి గౌరికి ఫోన్చేసి సమాచారం తెలియజేశారు. సమాచారం అందుకున్న గౌరి ఘటనాస్థలికి చేరుకుని చూడగా అప్పటికే ప్రసాద్ మృతి చెంది ఉన్నారు. దీంతో గౌరి ఫిర్యాదు మేరకు గుణదల పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టమ్కు పంపించారు. ప్రసాద్కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని వాటితో చనిపోయి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రైవర్ భార్య దుర్మరణం -
నగరంపై చెత్తపోటు!
పటమట(విజయవాడతూర్పు): నగరవాసులపై చెత్త పోటు పడనుంది. విజయవాడలో మళ్లీ కూటమి పెద్దలు పాతపద్ధతిలో పారిశుద్ధ్య విధానాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్(ఆర్డబ్ల్యూఎ)లతో 50 శాతం కాంట్రిబ్యూషన్తో ఎంవోయూ(మెమెరాండం ఆఫ్ అండర్స్టాండింగ్) చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు వీఎంసీ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యాన ఈ నెల 6వ తేదీన వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న నూతన భవనం సమావేశ మందిరంలో స్కూళ్లు, కాలేజీలు, రెస్టారెంట్లు, ఆర్డబ్ల్యూఏలు, బార్లు, మాంసం దుకాణాల యజమానులు, హోటళ్లు తదితర వ్యాపార సంస్థలతో సమావేశం నిర్వహించారు. దీని ప్రధాన ఉద్దేశం నగరవాసుల నుంచి 2014–19లో కూటమి ప్రభుత్వం పాలనలో మాదిరి మళ్లీ ఇంటింటి చెత్తసేకరణకు 50శాతం కాంట్రిబ్యూషన్ పేరుతో పన్నును వసూళ్లు చేయడమే. 1204 మైక్రోపాకెట్లు విజయవాడలో ఇంటింటి చెత్తసేకరణకు వీఎంసీ డివిజన్లు, ఏరియాల వాకీగా 1204 మైక్రోపాకెట్లు ఏర్పాటు చేసింది. 300 కుటుంబాలను ఒక మైక్రోపాకెట్గా నిర్ధారించారు. సుమారు 300 కుటుంబాల చొప్పున కార్మికులు/కార్మికురాలు ఇంటికి వెళ్లి ప్రతినిత్యం చెత్తను సేకరించడం, వాటిని గార్జేజ్ లోడర్పాయింట్కు అక్కడి నుంచి గార్బేజ్ ట్రాన్స్ఫర్స్టేషన్కు వాహనాల్లో తరలించేవారు. దీనికి పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే వేతనాన్ని 50 శాతం వీఎంసీ, 50 శాతం రెసిడెన్షియల్ వేల్ఫెర్ అసోసియేషన్లు, బల్క్ వేస్ట్ జనరేటర్స్, వివిధ వ్యాపారాలు చేసేవారు చెల్లించాలి. ప్రతినెలా కార్మికుల వేతనాలను కాలనీ పెద్దలు, వ్యాపారస్తులు వీఎంసీకి జతచేసిన తర్వాతే కార్మికులకు వేతనాలను అందించేవారు. ఒక్కో కాలనీకి సుమారు 4 నుంచి 15 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తారు. అయితే కాంట్రిబ్యూషన్ సరిగా జరగకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఇలాంటి కాంట్రీబ్యూషన్ విధానాన్ని వీఎంసీ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నాడు వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం.. నేడు ప్రజలపై భారానికి కూటమి సిద్ధం చెత్త తరలింపు ప్రక్రియను నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సచివాలయ వ్యవస్థతో నగరంలోని కుటుంబాలను మ్యాపింగ్చేసి క్లాప్(క్లీన్ ఆంధ్రప్రదేశ్) ద్వారా ఇంటింటి చెత్తసేకరణ చేసి డంపింగ్యార్డుకు వెళ్లడానికి పకడ్బందీగా అమలుచేసింది. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులను ఆప్కాస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్) కిందకు తీసుకువచ్చి వారి వేతనాలను ఠంచనుగా అందించింది. ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీలు స్లమ్ ఏరియాలో నెలకు రూ. 30, కామన్ ఏరియాల్లో అయితే నెలకు రూ.50 వసూలు చేసేవారు. దీనిపై కూటమి నాయకులు నగరవాసుల నుంచి ప్రభుత్వం చెత్త పన్నంటూ దుష్ప్రచారం చేసింది. తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దుచేస్తామని ప్రకటించిన వారు ఇప్పుడే అదే విధానాన్ని నగరవాసులపై రుద్దుతున్నారు. నగరంలో మొత్తం 3.70 లక్షల అసెస్మెంట్లు నగరంలో 3.70లక్షల అసెస్మెంట్ల నుంచి ప్రతినిత్యం 550–650 మెట్రిక్టన్నుల చెత్త ఉత్పత్తవుతుంది. దీనికోసం 3500 మంది పైచిలుకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో 111 నోటిఫైడ్ స్లమ్ఏరియాలు ఉన్నాయి. అత్యధికంగా కొండప్రాంతాలు, అజిత్సింగ్నగర, కృష్ణలంక, పటమట, భవానీపురం, పాయకాపురం, కండ్రిక, ఒన్న్టౌన్లో స్లమ్ ఏరియాలు నమోదయ్యాయి. కొండప్రాంతాల్లో సుమారు లక్షన్నరమంది జనాభా, మిగిలిన స్లమ్ ఏరియాల్లో నాలుగు ఐదు లక్షలకుపైగా నివాసాలుంటున్నారు. నగరంలోని నోటిఫైడ్ కాలనీలు సుమారు 250 కాలనీలు ఉన్నాయి. వాటిలో స్లమ్ఏరియాల్లోనే అత్యధికంగా 150 వరకు కాలనీలు ఉన్నాయి. ఆ కాలనీల్లో ఉండేవారికి, కొండప్రాంతాల్లో ఉండేవారికి ఇప్పుడు కాంట్రిబ్యూషన్ విధానం ఆర్థిక భారమవుతుంది. కాలనీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పూర్వ విధానంలో చెల్లించడానికి చర్యలు వీఎంసీలో చెత్తసేకరణకు ఆర్డబ్ల్యూఏల నుంచి 50 శాతం కాంట్రిబ్యూషన్ పద్ధతి విజయవాడలో 2014–19లో ఇదే విధానాన్ని అమలు చేసిన కూటమి నాడు వైఎస్సార్ సీపీపై కూటమి దుష్ప్రచారం చెత్తసేకరణ సక్రమంగా జరగడం లేదు కాలనీల్లో చెత్తసేకరణ కూడా సక్రమంగా జరగడం లేదు. గతంలో ఇంటింటికీ చెత్తసేకరణకు ఆటోలు వచ్చేవి. ఇప్పుడు సమయ పాలనలేదు. వచ్చినా కాలనీల్లో కొన్ని ఇళ్ల నుంచి మాత్రమే సేకరించి వెళ్లిపోతున్నారు. అదేమంటే మొన్నటివరకు కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారని, ఇప్పుడేమో తక్కువగా వస్తున్నారని కారణాలు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు కాలనీ వాసులే కాంట్రిబ్యూషన్ చేయాలనడం శోచనీయం. – శ్రీలక్ష్మీ, పటమట -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాల అమలుకు నోచుకోలేదని ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ అన్నారు. సంక్షేమ బోర్డును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19న మహాధర్నా జరుగుతుందన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏపీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, ఇఫ్టూఆధ్వర్యంలో మహాధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని, సంక్షేమ పథకాలు అందడానికి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారని ప్రభుత్వమే ప్రకటించిందన్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో ‘నా వంతు కర్తవ్యంగా కోటి రూపాయలు సంక్షేమ బోర్డుకి’ విరాళం ఇస్తున్నానని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విస్మరించడం కార్మికులను మోసం చేయడమేనని మండి పడ్డారు. కార్యక్రమంలో బీసీడబ్ల్యూ రాష్ట్ర నేతలు జి. హరికృష్ణరెడ్డి, షేక్ మీరావలి, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, ఆసియా బేగం, కనకారావు, మధు, కలాం, అల్లూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు 19న విజయవాడలో మహా ధర్నా ఇఫ్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ -
11 నుంచి ఆహ్వాన క్రీడా పోటీలు
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు):సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవం సంవత్సర సందర్భంగా ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆలిండియా ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ (ఆహ్వాన క్రీడా పోటీలు)ను తమ కళాశాల ఆవరణ మైదానంలో నిర్వహిస్తున్నామని సిద్ధార్థ అకాడమీ అకడమిక్ అడ్వైజర్ ఎల్కే మోహనరావు చెప్పారు. సిద్ధార్థ కళాశాల ఆవరణలోని సెమినార్ హాలులో టోర్నమెంట్స్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. మోహనరావు మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 14 వరకు వాలీబాల్ (సీ్త్ర, పురుష జట్లు) ఇన్విటేషనల్ టోర్నమెంట్స్ జరుగుతాయని చెప్పారు. ఈ టోర్నమెంట్లో కేరళ, మద్రాస్, కోయంబత్తూరు, గుజరాత్, ఆంధ్రపదేశ్ టీమ్లు తలపడతాయని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు బాస్కెట్బాల్ (పురుషులు) టోర్నమెంట్ ఉంటుందన్నారు. ఈ టోర్నమెంట్లో చైన్నె, బెంగళూరు, కేరళ, తమిళనాడు, ఏపీ టీమ్లు పోటీ పడనున్నాయని వెల్లడించారు. 11వ తేదీ మధ్యాహ్నాం టోర్నమెంట్స్ ప్రారంభ సభ నిర్వహిస్తామన్నారు. కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, కళాశాల ప్రిన్సిపాల్స్ మేకా రమేష్ మాట్లాడుతూ నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులతో పాటుగా విద్యార్థులు కూడా ఈ టోర్నమెంట్స్ను వీక్షించవచ్చునన్నారు. సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చుండి వెంకటేశ్వర్లు, శాప్ పూర్వ అధ్యక్షుడు అంకమ్మచౌదరి, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి టీ.బాలకృష్ణారెడ్డి, ఉపాధి కల్పనాధికారి కావూరి శ్రీధర్, వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు. -
పొంగిన వాగులు..
రాకపోకలకు అంతరాయంపెనుగంచిప్రోలు: పెనుగంచిప్రోలు మండలంలో గురువారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లింగగూడెం వద్ద గండివాగు పొంగడంతో రాకపోకలు నిలిచి పోయాయి. ముచ్చింతాల–తాళ్లూరు మధ్య, పెనుగంచిప్రోలు–అనిగండ్లపాడు మధ్య కూచివాగు, గుమ్మడిదుర్రు వద్ద వాగు పొంగడంతో చప్టాలపై పెద్ద ఎత్తున నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పక్కన ఉన్న పొలాలు నీట మునిగాయి. పెనుగంచిప్రోలు చెరువు నిండి అలుగుల నుంచి పెద్ద ఎత్తున జలపాతంలా నీరు ప్రవహిస్తూ రోడ్డుపైకి చేరింది. దీంతో పెనుగంచిప్రోలు–సుబ్బాయిగూడెం రోడ్డు వరద నీటికి కొట్టుకు పోయింది. చెరువు అలుగు కాలువ పూడి పోవడంతో నీరు మొత్తం నాట్లు వేసిన పొలాలపై ప్రవహించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు వాగుల వద్ద రాకపోకలు నిలిచి పోయాయి. పత్తి సాగు చేసిన పొలాల్లో వర్షం నీరు చేరి తటాకాలుగా మారాయి. -
AP: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, విజయవాడ: చిన్నారి శ్రావణి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని మూడేళ్ల శ్రావణిని రూ.5 వేలకు అమ్మేసిన కసాయి తండ్రి మస్తాన్.. బిక్షాటన చేయించే ముఠాకు చిన్నారిని విక్రయించాడు. కేసు వివరాలను జీఆర్పీ సీఐ డీవీ రమణ మీడియాకు వెల్లడించారు. బెజవాడ రైల్వే స్టేషన్లో ఈ అనూహ్యమైన ఘటన జరిగింది. పోలీసుల విచారణ కిడ్నాప్ డ్రామా బయటపడింది.గంటల వ్యవధిలోనే శ్రావణి కేసును పోలీసులు ఛేదించారు. శ్రావణినీ కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నిందితులను అత్యంత చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. శ్రావణిని నిందితులు రాజమహేంద్రవరం తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. శ్రావణి విక్రయం వ్యవహారంలో ఇద్దరు నిందితులు పాల్గొనట్టుగా పోలీసులు నిర్థారించారు. పాప శ్రావణిని తల్లి సైకం వెంకటేశ్వరమ్మకు రైల్వే పోలీసులు అప్పజెప్పారు. నిందితుడు సైకం మస్తాన్రావుకి గతంలో నేర చరిత్ర ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. -
చౌకబారు మాఫియా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని అధికార పార్టీ నేతలే పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పార్లమెంట్ ముఖ్యనేత డైరెక్షన్లో అధికారుల కనుసన్నల్లో బియ్యం పక్కదారి పడుతోందని తెలుస్తోంది. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పార్లమెంటు ముఖ్యనేత, ప్రజాప్రతినిధులు మెక్కేస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు, విజిలెన్స్ అధికారులను పావులుగా మార్చుకొని రేషన్ డీలర్లపై ప్రయోగిస్తున్నారు. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్ మేరకు వారు చెప్పిన వ్యక్తికే, బియ్యం ఇవ్వాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారు. దాంతో ప్రతి నెలా ఒకటో తేదీనే చాలా రేషన్ దుకాణాల్లో బియ్యం సంచులు ఖాళీ అయి పోతున్నాయి. నియోజకవర్గానికి సగటున 500 టన్నులకు పైగా బియ్యం మాఫియా చేతుల్లోకి జిల్లాలో ప్రతి నియోజక వర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. ప్రతి నెలా బియ్యం మాఫియా నుంచి పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజక వర్గాల ప్రజాప్రతి నిధులు రూ.25 లక్షల చొప్పున దండుకున్నారు. వ్యవస్థీకృతంగా సాగుతున్న బియ్యం లీలలు ఇవి. విష ప్రచారం చేసి.. గత ప్రభుత్వం మొబైల్ వాహనాల్లో ఇంటింటికీ రేషన్ ఇచ్చిది. వీటితో అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ నాడు కూటమి విష ప్రచారం చేసింది. ఈ వాహనాలను తొలగించి పాత పద్ధతిలోనే డీలర్లకు బాధ్యతలు అప్పగించారు. రేషన్ దుకాణాలకు ప్రతి నెలా 26వ తేదీ బియ్యం సరఫరా చేస్తారు. 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేయాల్సింటుంది. అయితే రేషన్ దుకాణాలు తెరిచిన రెండు, మూడు రోజులలోపే బియ్యం ఉండటం ల్సి ఉంటుంది. అయితే పార్లమెంటు ముఖ్యనేత, నియోజక వర్గ ప్రజాప్రతినిధులు పౌర సరఫరాలు, విజిలెన్స్ అధికారులతో రేషన్ డీలర్లపై ఒత్తిడి తెచ్చి, వారు సూచించిన రేషన్ మాఫియా సభ్యులకే బియ్యం ఇచ్చేలా హుకుం జారీ చేస్తున్నారు. రేషన్ మాఫియా.. రేషన్ డీలర్లకు ముందే అడ్వాన్స్లు ఇస్తున్నారు. దందాకు సహకరించని డీలర్లపై రేషన్ షాపులు తనిఖీ చేసి, సీజ్ చేస్తున్నారు. పోలీసులు సైతం మామూళ్లు తీసుకుని దందాకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. పార్లమెంటు ముఖ్యనేత డైరెక్షన్...అధికారుల యాక్షన్...! వ్యవస్థీకృతమైన రేషన్ బియ్యం మాఫియా ప్రతి నెల 26న డీలర్లకు బియ్యం సరఫరా పావులుగా మారిన అధికారులు! ప్రతి నియోజకవర్గం నుంచి 500 టన్నులు.. బియ్యం మాఫియా చేతిలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు..సూరంపల్లిలో డంప్! పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లో తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాలో రేషన్ దందా జరుగుతోంది. ఈ దందా అంతా రామచంద్రరావు అనే వ్యక్తి నడిపిస్తున్నారు. ఇతను పార్ల మెంటు ముఖ్యనేతకు నెలవారీగా దాదాపు కోటి రూపాయలకుపైగా ముడుపులు ఇస్తూ దర్జాగా దందా చేస్తున్నారు. జగ్గయ్యపేటలో నియోజక వర్గ ప్రజాప్రతినిధి, నందిగామలో కంచికచర్లకు చెందిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ ప్రజాప్రతినిధి అనుచరులు, పెనమలూరులో క్రాంతి కిరణ్, గుడివాడలో నియోజక వర్గ ప్రజాప్రతినిధి పేరుతో గిరి అనే వ్యక్తి రేషన్ బియ్యం అక్రమ దందాలో పలు పంచుకొంటున్నారు. ఈ బియ్యాన్ని పామర్రుకు చెందిన మాఫియా డాన్ గొట్టపు రమేష్ సేకరిస్తున్నారు. ఆయన గన్న వరం సమీపంలోని సూరంపల్లి వద్ద డంపు చేసి, అక్కడ నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. ఇటీవల ఈ డంపుపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా జిల్లా పౌర సరఫరాల ఉన్నతాధికారికి, ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో ఆయన చేతులెత్తేసినట్లు చర్చ సాగుతోంది. కొంత బియ్యం ఇబ్రహీపట్నం పంట పొలాల్లో లోడ్ చేసి, పోర్టుకు పంపుతున్నారు. రేషన్ మాఫియా దందాకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్పై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. -
ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం
గుణదల(విజయవాడ తూర్పు): దేశానికి తలమానికంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ అన్నారు. విజయవాడ భారతీనగర్ నోవోటెల్ హోటల్లో గురువారం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ – 2025 నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ నగర ప్రతిష్టతను ఇనుమడింప చేసే విధంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. అధునాతన నిర్మాణ శైలిని అనుసరిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగంలో రాజధాని గుర్తింపు సాధిస్తుందని వెల్లడించారు. అనంతరం గ్రీన్ ఆంధ్రప్రదేశ్ బ్రోచర్ను విడుదల చేశారు. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ పెనమలూరు:పూర్వార్జిత ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు కాజేయటానికి ఏకంగా తహసీల్దార్ గోపాలకృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేయటంతో పోలీసులు 11 మందిపై గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం..... కానూరు గ్రామంలో ఆర్ఎస్ నెంబర్లు 249/3,4,5ఎలో 300 చదరపు గజాల ఇంటి స్థలం ఉంది. తహసీల్దార్ గోపాలకృష్ణ ఎండార్స్ చేసినట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని కొందరు వ్యక్తులు సృష్టించారు. దీంతో పోలుకొండ వెంకటాచలం అనే మహిళ తన మనవడు కౌశిక్కు అనుకూలంగా కంకిపాడు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గిఫ్టు డీడ్ (16032/2024) ఇచ్చింది. దీనికి పలువురు వ్యక్తలు సహకరించి ఇంటి స్థలాన్ని అమ్మే యత్నం చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావటంతో తహసీల్దార్ గోపాలకృష్ణ తన సంతకం ఫోర్జరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామోదుల సూరిబాబు, (ఎర్రసూరిబాబు), షేక్.వలి, బోరుగడ్డకుమార్, పోలుకొండ వెంకటాచలం, పోలుకొండ కౌశిక్, బి. వెంకటేశ్వరరావు, వి.లక్ష్మణరావు, వేములపల్లి శ్రీనివాసరావు, రాఘవమ్మ, అవనిగడ్డ స్వాతీ, సూరిబాబులని నిందితులుగా గుర్తించారు. -
ప్రజారోగ్యానికి విఘాతం!
లబ్బీపేట(విజయవాడతూర్పు): విభాగాల మధ్య విభేదాలతో ప్రజారోగ్యానికి విఘాతం కలుగు తోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రజారోగ్య శాఖలో సమన్వయ లోపంతో ఆరోగ్య కార్యక్రమాలు పడకేశాయి. ఆ శాఖలో అధికారుల హడావుడి మినహా క్షేత్రస్థాయిలో ఏమీ అమలు కావడం లేదు. ఇంటింటి సర్వే ఎప్పుడో మర్చిపోయారు. గర్భిణుల ట్రాకింగ్ సరిగా జరగడం లేదు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే మానేశారు. దీంతో అవి లబ్ధి దారుల దరి చేరడం లేదు. వీటన్నింటికీ కారణం సిబ్బంది మధ్య సమన్వయం లేక పోవడమేననే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సీహెచ్ఓ, ఏఎన్ఎంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగు తోంది. ఆ ప్రభావం వైద్య సేవలపై పడుతోందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పట్టించుకోవడమే మానేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ఆరోగ్య కార్యక్రమాలు వ్యాధిగ్రస్తుల దరి చేరడం లేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో గర్భిణుల ట్రాకింగ్ సరిగా జరగడం లేదు. రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న వారిని వైద్య సిబ్బంది ఫాలోఅప్ చేయడం మానేశారు. దీంతో వాళ్లు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన తర్వాత సమాచారం తెలుసుకుని అక్కడకు పరుగులు పెడుతున్నారు. అంతేకాదు గర్భిణులకు ప్రసవం తర్వాత అందాల్సిన పీఎం జేఎస్వై సగం మందికి అందడం లేదు. దీనికి ఆ పథకంపై వైద్య సిబ్బంది అవగాహన కలిగించక పోవడమే కారణంగా చెబుతున్నారు. గర్భిణులకు సీ్త్ర శిశు సంక్షేమశాఖ నుంచి అందాల్సిన పోషకాహారం అంతం మాత్రంగానే ఉంది. అందుకు సిబ్బంది సమన్వయమే లోపం అంటున్నారు. ఇంటింటి సర్వే ఏదీ మలేరియా విభాగంలో పనిచేసే హెల్త్ అసిస్టెంట్లు నెలలో రెండుసార్లు, కనీసం ఒకసారైనా తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాల్సి ఉంది. వాళ్లు సందర్శించిన తేదీలను ఆ ఇంటి గోడపై నమోదు చేయాలి. ఇంటింటినీ సందర్శించి జ్వరాలపై సర్వే చేసే కార్యక్రమాన్ని ఎప్పుడో వదిలేశారు. వారిపైన ఉన్న హెల్త్ సూపర్వైజర్స్ పర్యవేక్షణను కూడా పూర్తిగా వదిలేశారు. వారానికి ఒకసారి నిర్వహించే డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో రెండిళ్లు సందర్శించి ఫొటోలు తీసి, యాప్లో, గ్రూప్లో అప్లోడ్ చేసి మమ అనిపిస్తున్నారు. అంతేకానీ ఏ ఒక్క ఇంట్లో వ్యాధి కారక లార్వాను గుర్తించిన సందర్భాలు లేవు. అంతేకాదు నగరంలో యాంటీ లార్వా ఆపరేషన్ కూడా సరిగా జరగడం లేదు. అధికారుల బంగళా చుట్టూ ఫాగింగ్ చేయడం మినహా నగరంలో ఎక్కడా చేయడం లేదు. లక్ష్యానికి తూట్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్ఓ), ఏఎన్ఎంల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సందర్శన విషయంలో వీరి మధ్య ఎప్పటి నుంచో వివాదాలు సాగుతున్నారు. ఒకదశలో ఏఎన్ఎంలకు ఏ..బీ..సీ..డీలు కూడా రావంటూ సీహెచ్ఓలు వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇలా వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్(వెల్నెస్ సెంటర్స్)లో సేవల లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. దీంతో ఏడాదిగా సేవలు మరుగున పడ్డాయి. ఆ వివాదాలను పరిష్కరించడాన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. విభాగాల మధ్య విభేదాలు ప్రజారోగ్యశాఖలో సమన్వయ లోపం పడకేసిన ఆరోగ్య కార్యక్రమాలు ఇంటింటి సర్వే అంతంత మాత్రమే లార్వా నిర్మూలన ఆపరేషన్ లేదు గ్రామాల్లో ఏఎన్ఎం, సీహెచ్ఓల ఆధిపత్య పోరు పీహెచ్సీలు ఎన్టీఆర్ 23 కృష్ణా 50 యూపీహెచ్సీలు ఎన్టీఆర్ 50 కృష్ణా 12 వెల్నెస్ సెంటర్లు ఎన్టీఆర్ 257 కృష్ణా 357వైద్య రంగాన్ని విస్మరిస్తున్నారు రాష్ట్రంలో వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యంగా మారింది. ప్రభుత్వాస్పత్రిల్లో సేవలు దిగజారాయి. ప్రజారోగ్యం పడకేసింది. ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయం లోపించినా పాలకులకు పట్టడం లేదు. కార్పొరేట్లకు ఆస్పత్రిలు అప్పగించి పర్సంటేజీలు దోచుకోవడం మినహా, ఆస్పత్రిలను బలోపేతం చేసి, రోగులకు నాణ్యమైన సేవలు అందించాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి లేదు. దీంతో ఉద్యోగులు సైతం ఎవరి దారిలో వారు నడుస్తున్నారు. –డాక్టర్ మెహబూబ్ షేక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం -
దసరా ఏర్పాట్ల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కనకదుర్గనగర్, మహా మండపం, దుర్గాఘాట్ పరిసరాల్లో పర్యటించి దసరా ఉత్సవాల పనులపై ఆలయ అధికారులతో మాట్లాడారు. దసరాపై గత నెల తొలి సమీక్ష సమావేశం నిర్వహించగా, అధికారులు పలు సూచనలు చేశారు. దీంతో గురువారం కలెక్టర్ ఆలయానికి విచ్చేసి కనకదుర్గనగర్ నుంచి మహా మండపం వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులపై అడిగారు. గోశాల వద్ద లడ్డూ పోటు, మహా మండపం వద్ద నిర్మిస్తున్న అన్నదాన భవనం పనులపై ఆరా తీశారు. దసరా నాటికి పనులు ఏ మేరకు జరుగుతాయి, ఉత్సవాల నేపథ్యంలో ఆయా భవనాల వినియోగంపై ఈవో శీనానాయక్, ఈఈ రాంబాబులను అడిగారు. మహా మండపం దిగువన ప్రసాదాల కౌంటర్లను పరిశీలించే క్రమంలో అక్కడ విక్రయిస్తున్న కవర్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కనకదుర్గనగర్, చైనావాల్, రథం సెంటర్ల మధ్య ఆక్రమణలు తొలగించిన తర్వాత చేసిన పనులను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో వైదిక క్రతువులు దసరా ఉత్సవాల్లో అమ్మవారికి జరిగే వైదిక క్రతువులు సకాలంలో జరిగేలా చూడాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దుర్గగుడి అధికారులను ఆదేశించారు. దుర్గగుడి మహా మండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్లో గురువారం దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రామచంద్రమోహన్, ఫెస్టివల్ ఆఫీసర్ భ్రమరాంబ, దుర్గగుడి ఈవో శీనానాయక్తో పాటు ఇంజినీరింగ్ అధికారులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అర్జిత సేవలపై భక్తులలో అనేక గందరగోళాలు ఉన్నాయని, సేవలకు తగిన ప్రణాళిక ఉండాలని సూచించారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు గురువారం బంగారు ముక్కుపుడక, బొట్టు, నత్తును కానుకగా సమర్పించారు. బెంజ్సర్కిల్లోని ఆచార్యరంగ నగర్కు చెందిన పోసాని బసవయ్య, మనోహరమ్మ దంపతులు, వారి కుమారుడు ప్రసాదరావు సుమారు 24.7 గ్రాముల బంగారం, నవ రత్నాలతో తయారు చేయించిన ముక్కుపుడక, బొట్టు, నత్తును ఆలయ అధికారులకు అందచేశారు. సుమారు రూ. 3.05 లక్షలతో బంగారు ఆభరణాలను తయారు చేయించినట్లు దాతలు పేర్కొన్నారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. నానో ఎరువులతో బహుళ ప్రయోజనాలు విజయవాడ రూరల్: నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వినియోగంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నున్న పీఏసీఎస్ను గురువారం ఆయన సందర్శించారు. రైతులకు ఎరువుల సరఫరా స్థితిగతులను పరిశీలించారు. ఈ పోస్ మెషిన్ పనితీరు పరిశీలించి, అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను తెలుసుకున్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణం, గోదాము తనిఖీ చేశారు. ఫిజికల్, ఆన్లైన్ రికార్డుల లావాదేవీలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగుకు సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. 5,403 మెట్రిక్ టన్నుల యూరియా, 2,251 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,052 మెట్రిక్ టన్నుల ఎంవోపీ, 2,310 మెట్రిక్ టన్నుల ఎస్ఎస్పీ, 12,292 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువులు, పురుగు మందులపై ఫిర్యాదులకు కలెక్టరేట్లో 91549 70454 నంబర్ అందుబాటులో ఉందని చెప్పారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ నాగమల్లిక ఉన్నారు. ముగిసిన షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికలుగన్నవరం: కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో గురువారం కృష్ణాజిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్–19 బాల, బాలికల షటిల్ బ్యాడ్మింటన్ ఎంపికలు జరిగాయి. సెలక్షన్స్కు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బాలిబాలికలు హాజరయ్యారు. తొలుత పోటీలను జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ అధికారి కె.ఝాన్సీలక్ష్మి ప్రారంభించారు. అనంతరం బాల, బాలికల విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించి క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఝాన్సీలక్ష్మి తెలిపారు. పోటీలను కేవీఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కేవీఆర్ కిషోర్ పర్యవేక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు రామారావు, బాలకృష్ణ, చంద్రశేఖర్, నాగరాజు, శాంతికిరణ్, రాంబాబు ఎంపికలు చేశారు. ఓటమి భయంతోనే కూటమి దాడులుభవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజలకు మేలు చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగజారుడు రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి రాదని, కేవలం ఓటమి భయంతోనే దాడులకు తెగబడుతోందని వైఎస్సార్ సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తొండమల్ల పుల్లయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ రౌడీ మూకల దాడిని ఖండించారు. ఇది అమానుష చర్య అని, రాజకీయం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాబలంతో గెలవాలి తప్ప దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, తద్వారా ఎన్నికల్లో గెలవాలనుకోవడం దుర్మార్గ చర్యే అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి వ్యతిరేకతను మూటకట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్పై జరిగిన దాడి బీసీ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. -
యూరియా దొరక్క ఇక్కట్లు!
పెడన: పీఏసీఎస్ల పరిధిలోని కూటమి నాయకులు వచ్చిన యూరియా కట్టలను గద్దల్లా తన్నుకుపోతున్నారు. పీఏసీఎస్ల సిబ్బంది చేసేదేమీ లేక చూస్తూ మిన్నకుండిపోతున్నారు. కనీసం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకురాకపోవడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెడన మండలంలో యూరియా దొరక్క రైతులు రోజు రోజుకు ఆందోళన చెందుతున్నారు. పీఏసీఎస్లు ద్వారా ఇప్పటికే ముందుగా బుక్ చేసుకున్న వారికి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. చేవేండ్ర పీఏసీస్ పరిధిలో యూరియా కట్టలు రావడతో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడొకరు సుమారు 70 యూరియా కట్టలను ట్రాక్టరులో వేసుకుపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇది గ్రామంలో తీవ్రస్థాయిలో చర్చనీయాంశ మైంది. ఇలా చేయడం చాలా దారుణమని వాపోతున్నారు. అధికారులు సైతం చూిసీచూడనట్లుగా వ్యవహరించడం చాలా అన్యాయమని, రైతులందరికి సమన్యాయంగా యూరియా అందించాల్సిన బాధ్యత లేకుండా నడుచుకోవడం పట్ల పరిస్థితి మరింత చేయిదాటే ప్రమాదం ఉందన్నారు. బయట మార్కెట్లో గుళికలతో.... బయట మార్కెట్లో గుళికలు కూడా కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తామనే వాదనను ఎరువుల దుకాణాల వారు స్పష్టం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో రూ.200 పెట్టి యూరియా కొంటే రూ.600 పెట్టి గుళికలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రస్తుతం గుళికలతో పని లేదని, అయినా అంటగడుతుండటంతో బయట యూరియా కొనుగోలు చేయడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎరువుల దుకాణంలో ఆ పరిస్థితి ఉంటే పీఏసీఎస్లలో మరింత దారుణంగా ఉందని పేర్కొంటున్నారు. పీఏసీఎస్లలో రుణం తీసుకున్న వారికి మాత్రమే యూరియా ఇస్తామని పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు పొందిన వారికి యూరియా కట్టలు దొరకడం లేదని, రెండు దఫాలుగా చేవేండ్ర పీఏసీఎస్కు 800 కట్టలు వచ్చినా ఇవ్వలేదంటూ పలువురు రైతులు వాపోతున్నారు. గద్దల్లా తన్నుకుపోతున్న టీడీపీ నాయకులు రుణాలు తీసుకున్న వారికే కట్టాలంటూ మెలిక బయట మార్కెట్లో గుళికలతో లింకు నో స్టాక్ అంటున్న ఎరువుల దుకాణాలు పక్కాగా పంపిణీ చేస్తున్నాం చేవేండ్ర పీఏసీఎస్ పరిధిలో 70 కట్టలు ఒకరే తీసుకుపోయారనే విషయం వాస్తవం కాదు. విచారణ చేశాం. చేవేండ్ర పీఏసీఎస్కు యూరియా కట్టలు రావడంతో రైతులు అధిక సంఖ్యలో వచ్చారు. రాత్రి కావడంతో తాళాలు వేసేందుకు సిద్ధం అవ్వగా ఆ వ్యక్తి వచ్చి రైతుల పేర్లు నమోదు చేసుకుని అందజేశారు. దానిని కావాలని కొందరు వక్రీకరించారు. అంతా పక్కాగా పంపిణీ చేస్తున్నారు. అయితే తీసుకువెళ్లిన వారే మళ్లీ మళ్లీ వచ్చి తీసుకుపోతున్నారు. – ఎస్.జెన్నీ, ఏవో, పెడన మండలం -
ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు
చేవేండ్ర పీఏసీఎస్లో రూ.16 లక్షలు రుణం తీసుకున్నా. రుణం తీసుకున్న వారికే యూరియా కట్టలు ఇస్తామన్నారు. ఉదయమే వచ్చా. అయినా ఒక కట్ట కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడా చూడలేదు. నాకు, నా కుటుంబసభ్యులందరికీ కలిపి 15 ఎకరాలున్నాయి. యూరియా కొట్టకపోతే పంటకు బలం రాదు. బయట కొందామంటే గుళికలకు లింకు పెడుతున్నారు. ప్రస్తుతం గుళికలతో పని లేదు. యూరియా మాత్రమే కొట్టాలి కాబట్టి పీఏసీఎస్లో తీసుకువెళ్లడానికి వచ్చా. -గంగుమోలు వెంకటేశ్వరరావు, రైతు, మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ ● -
రమేష్ యాదవ్పై దాడిని ఖండిస్తూ నిరసన
భవానీపురం(విజయవాడపశ్చిమ):ౖవెఎస్సార్ కడప జిల్లా పులివెందులలో జరుగనున్న జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్పై టీడీపీ గూండాలు చేసిన దాడిని ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మార్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడ్డ రమేష్ యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి చిత్రాలను పట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓటమి భయంతోనే టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ నేతలపై దాడి చేసి మట్టుపెట్టటానికి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని దౌర్జన్యం, దాడులకు పూనుకుంటే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ స్పందించి పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సంపతి విజిత మాట్లాడుతూ హోం మంత్రి ఒక రబ్బర్ స్టాంప్గా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బొడ్డు అప్పలనాయుడు, బొందిలి నరేంద్ర సింగ్, బత్తుల రామారావు, కె నాగేశ్వరరావు, కొరివి చైతన్య, షేక్ మస్తాన్, దుక్కా హరి భాస్కర్, జవ్వాది నరసింహారావు, కలపాల అజయ్, వేదాంతం చైతన్య, బూదాల సౌమ్య, పార్టీ నాయకులు విశ్వనాథ రవి, టి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి వినతి పత్రం -
నేడు వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, వరలక్ష్మీదేవి అలంకారం, విశేష పూజలు, బాలభోగ నివేదన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. పవిత్రోత్సవాల నేపథ్యంలో ఆది దంపతులతో పాటు ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాలధారణ జరుగుతుంది. అనంతరం ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని ఏకాంత సేవగా చేస్తారు. నేటి నుంచి పవిత్రోత్సవాలు ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వరలక్ష్మీదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయాన్ని వివిధ పుష్పాలతో అలంకరించనున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై మూడు రోజులు పవిత్రోత్సవాలు ఉదయం 9.30 గంటల తర్వాతే అమ్మవారి దర్శనం -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తేలప్రోలు(గన్నవరం): ఇంజినీర్లు తమ శ్రమ, పట్టుదల, మేధస్సుతో దేశాభివృద్ధికి దోహదపడే మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం తేలప్రోలు పరిధిలోని ఉషారామ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నేడు భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్లో ఉన్న యువత ప్రపంచంలోని మరే దేశంలోను లేదన్నారు. అటువంటి యువత దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కార్యదర్శి, కరస్పాండెంట్ సుంకర అనిల్, ప్రిన్సిపాల్ జీవీకేఎస్వీ. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లంక అరుణ్, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగ ప్రచార ర్యాలీ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ’ ప్రచార ర్యాలీ గురవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే నిర్మాణంలో సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. విజయవాడ రైల్వేస్టేషన్, డీఆర్ఎం కార్యాలయాలలో సెల్ఫీ బూత్లను సృజనాత్మకంగా ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం డివిజన్ ఆడిటోరియంలో జరిగిన పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో 300 మంది జాక్ అండ్ జిల్, కేంద్రీయ విద్యాలయం, ఐకాన్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్):నారాయణ కళాశాల యాజమాన్యం తీరుతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేదారేశ్వరపేట 8వ లైన్లో నివసిస్తున్న మల్లవరపు పద్మప్రసన్న, దుర్గాప్రసాద్ దంపతుల కుమారుడు మనుచక్రవర్తి (15) బందరు రోడ్డులో పీవీపీ మాల్ వెనుక ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇటీవల ఆ కళాశాలలో జరిగిన పరీక్షల్లో మనుచక్రవర్తికి మార్కులు తగ్గాయి. దీంతో కళాశాల యాజమాన్యం ఈ నెల 6న అతన్ని వేరే సెక్షన్కు మార్చారు. బాగా చదివే తనను తక్కువ మార్కులు సాధించే సెక్షన్లో వేయడంతో చక్రవర్తి జీర్ణించుకోలేకపోయాడు. కళాశాల యాజమాన్యం తీరుతో అవమానకరంగా అనిపించి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కళాశాల నుంచి ఇంటికి వచ్చి ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య పెనమలూరు: తాడిగడప గ్రామంలోని ఓ కుటుంబంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య చేసకున్న ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్.భానుప్రకాష్ గత 9 సంవత్సరాల క్రితం శివరంజని (30)ని వివాహం చేసుకున్నాడు. కారు డ్రైవర్గా పని చేస్తాడు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. శివరంజనికి గత 8 నెలల క్రితం గర్భస్రావం జరిగింది. అలాగే గత 7 నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యం కారణాలతో మృతి చెందాడు. ఈ ఘటనలతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. కాగా శివరంజని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుంది. నిద్రపోయిన భర్త లేచి చూసేసరికి భార్య ఉరేసుకొని వేలాడుతూ కనబడటంతో కానూరులో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. -
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మాతా శిశు మరణాల నివారణకు పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం మొదలు నమోదైన రెండు మాతృ, ఐదు శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ, వైద్యాధికారులు, స్పెషలిస్ట్ వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించారు. మరణాలకు కారణాలను విశ్లేషించడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి ప్రాణమూ అత్యంత విలువైనదని చెప్పారు. తీసుకున్న చిన్నచిన్న జాగ్రత్తలే మాతాశిశు ప్రాణాలకు రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శిశువులకు టీకాలు కూడా సరైన విధంగా వేసేలా మార్గదర్శనం చేయాలన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జె.ఇందుమతీదేవి, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. సాగు నీటి యాజమాన్యం ప్రధానం.... వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైనదని జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకం (ఎంఐపీ) కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్సెల్ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. సాగునీటి వనరుల సద్వినియోగంలో భాగంగా బిందు, తుంపర సేద్యంపై రైతులకు అవగాహన పెంచాలని సూచించారు. జిల్లాలో 2024–25 వరకు 23,937 హెక్టార్లు సూక్ష్మ సేద్యం కింద ఉందని, 2025–26లో కొత్తగా 2,200 హెక్టార్లను ఈ విధానంలోకి తీసుకొచ్చేలా అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యంపై అవగాహన పెంచేందుకు రూపొందించిన కరపత్రాలను, డ్రిప్, స్ప్రింకర్, రైన్ గన్లకు సంబంధించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సాగునీరు, కరెంటు వినియోగంలో 50 శాతం పొదుపు సూక్ష్మ సేద్యంతో సాధ్యమవుతుందని వెల్లడించారు. పీడీ పి.ఎం.సుభాని, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. వయోవృద్ధుల సంరక్షణ విస్మరిస్తే చర్యలు వయోవృద్ధుల సంరక్షణ బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం– 2007, వారి పోషణ, సంరక్షణ నియమావళి– 2011 పై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు సంరక్షణ, పోషణ చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. వయోవృద్దులు ఎవరైనా కార్యాలయాలకు వస్తే వారికి సరైన మార్గదర్శనం చేయాలన్నారు. కార్యక్రమంలో ముందుగా హెరిటేజ్ ఫౌండేషన్ ప్రాజెక్టు హెడ్ టి.రవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టం పై అధికారులకు అవగాహన కల్పించారు. ఏడీ వి. కామరాజు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు
నాకు, నా కుటుంబసభ్యులకు కలిపి సుమారు 30 ఎకరాలు వరకు ఉంది. ఇప్పటికే ఒకసారి పంట ఎండి పోయింది. ప్రస్తుతం నీరు వస్తుంది. ఈ సమయంలో యూరియా వేయాలి. కనీసం ఒక్క కట్ట కూడా ఇవ్వలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా యూరియా వచ్చిందన్నారు. ముందుగా బుక్ చేసుకున్నా కూడా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. అధికారులు స్పందించి యూరియా అందించేలా చూడాలి. -పుట్టి వెంకమ్మ, మాజీ సర్పంచు, రైతు, మర్రిగుంట, చేవేండ్ర పంచాయతీ -
టీడీపీ గూండాల అరాచకంపై గవర్నర్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ గూండాల అరాచకం, నిర్వీర్యమైన శాంతిభద్రతలు, అధికారపార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై విజయవాడలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్ధుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్ను కలిశారు.ఈ సందర్బంగా పులివెందుల్లో టీడీపీ గూండాలు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తున్నారో అన్ని ఆధారాలతో సహా గవర్నర్కు వివరించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి చేసి, ఎలా గాయపరిచారో తెలియచేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రాజ్భవన్ వెలుపల బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే...కడప జిల్లా పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్తో పాటు పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా టీడీపీకి చెందిన గూండాలు పది వాహనాల్లో వచ్చి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రవి, ఇతరులను హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ దాడులు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. బీసీ నాయకుడు రమేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే, పట్టించుకోకుండా ఉన్నారు.కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోంది. ఆయన మాటలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. తక్షణం గవర్నర్ దీనిపై దృష్టి సారించాలని కోరాం. ఎన్నికల కమిషన్కు కూడా దీనిపై ఫిర్యాదు చేశాం. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా, చట్టబద్దంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరాం.ఆ విషయాన్ని కూడా గవర్నర్కు వివరించాం. కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనంను ఆధారాలతో సహా గవర్నర్కు తెలియచేశాం. డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడిన మాటలు పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటు. అన్ని సందర్భాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి. వ్యవస్థలు చట్టప్రకారం పనిచేయాలే తప్ప రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారకూడదు.గవర్నర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ నేతలు దేవినేని అవినాష్, నౌడు వెంకటరమణ తదితరులు ఉన్నారు. -
AP: రూ.50 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం
సాక్షి, విజయవాడ: ఏసీబీ అధికారుల వలకు ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్ చిక్కారు. రూ. 50 లక్షల రూపాయల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డారు. ఏకలవ్య స్కూల్స్ అభివృద్ధి పనుల బిల్లుల మంజూరు కోసం శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. రూ.25 లక్షల లంచం తీసుకొని బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25 లక్షలు డిమాండ్ చేసిన శ్రీనివాస్.. లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఏపీ ఏసీబీ చరిత్రలో రూ. 25 లక్షల లంచం తీసుకొని నేరుగా పట్టుబడటం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. -
డీఐజీ కోయ ప్రవీణ్ తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
సాక్షి, మచిలీపట్నం: వైఎస్సార్ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో జరుగుతున్న హింసపై కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించిన తీరును మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రంగా ఖండించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పోలీస్ అధికారి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ 'వైఎస్సార్సీపీ వారు పత్తి యాపారం చేస్తే ఇట్లాగే ఉంటుంది' అంటూ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.కడప జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతను గాలికి వదిలి, పత్తియాపారం చేయడం వల్లే వరుసగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా నామినేషన్ ఘట్టం నుంచి ప్రచారం వరకు హింస, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని, నామినేషన్ నాడు ఎవరైతే దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడ్డారో వారే ప్రతి రోజూ తమ అరాచకాన్ని కొనసాగిస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.ముందు వారిని నియంత్రించాల్సిన అధికారులు పత్తి యాపారం చేస్తున్నారా అని నిలదీశారు. 'మేం ఉన్నాం కాబట్టే తలలు తెగలేదు' అని డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పిన దానిని బట్టి చూస్తే, టీడీపీ వారు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేల్పుల రాముల తలలు తెగేవేనని, ఆయన ఉండబట్టే అది జరగలేదని అర్థమవుతోంది.ఇటువంటి సమర్థులైన, నిజాయితీపరులైన అధికారికి ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియల్ అవార్డు, లేదా గ్యాలెంటీ అవార్డులు ఇవ్వాలని తాము రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఇదే అధికారి గాయపడిన వైఎస్సార్సీపీ నాయకుల గురించి మాట్లాడుతూ వారి శరీరంలో గాయాలు కనిపించడం లేదు కానీ, వారు ధరించిన దుస్తులపై మాత్రం రక్తపు మరకలు కనిపిస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేయడం మరో విడ్డూరమని అన్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ముకాసే కొందరు అధికారులకు తాత్కాలికంగా రాజకీయ శుక్లాలు వస్తాయని, ఆ పార్టీ అధికారానికి దూరం కాగానే వారికి ఆ శుక్లాలు తొలగిపోయి వాస్తవాలు కనిపిస్తాయని అన్నారు. -
‘నాకేమైనా జరిగితే ఎమ్మెల్సీ ఆలపాటే కారణం’
సాక్షి, విజయవాడ: నగరంలోకి శాతవాహన కళాశాల వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనను వేధిస్తున్నారంటూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్ మళ్లీ ఆరోపణలకు దిగడం చర్చనీయాంశమైంది. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తనను బెదిరిస్తున్నారని తాజాగా నగర పోలీస్ కమిషనర్కు శాతావాహన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆలపాటి కాల్ రికార్డ్ ఆడియోను మీడియాకు విడుదల చేశారాయన. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నా ఫోన్ సీఐడీతో ట్యాపింగ్ చేయిస్తున్నారని చెబుతున్నారు. గతంలో ఒకసారి ఫ్యామిలీ అందరినీ చంపేస్తానని ఆలపాటి బెదిరించారు. వారం క్రితం ఆలపాటి నాకు ఫోన్ చేసి నిన్ను వదలను అని బెదిరించారు. సీపీని కలిసి నన్ను రక్షించాలని కోరా.. .. గతంలో ఒకసారి కూడా నన్ను కిడ్నాప్ చేసి గుంటూరు ఇంటికి తీసుకు వెళ్ళారు. ఆ సమయంలో కూడా పోలీసులకి నా కుమారుడు ఫిర్యాదు చేస్తే అర్ధరాత్రి నన్ను విడిచి పెట్టారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లానని ఆలపాటి నన్ను బెదిరిస్తున్నారు. నేను ఆలపాటి పై డిజిపికి కూడా ఫిర్యాదు చేశాను. శాతవాహన కళాశాల విషయంలో ఆలపాటికి సంబంధం లేకపోయినా ఆయన చెప్పినట్టు వినాలని నన్ను బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేత కాబట్టి నేనేం చేయలేక రక్షణ కోసం పోలీసులని ఆశ్రయించాను అని శ్రీనివాస్ మీడియాతో అన్నారు. -
గవర్నర్ను కలవనున్న వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, తాడేపల్లి: పులివెందులలో టీడీపీ అరాచకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై టీడీపీ గుండాలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ విషయమై.. గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని బృందం ఆయన్ని కలిసి జరిగిన పరిణామాలను వివరించనుంది. అదే సమయంలో దాడికి పాల్పడిన వారి మీద చర్యలు తీసుకోకుండా ఏకపక్షంగా బాధితులమీద కేసులు నమోదు అవుతున్న విషయం పైనా ఫిర్యాదు చేయనుంది. పులివెందులలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని బొత్స బృందం గవర్నర్ను కోరనున్నట్లు సమాచారం. -
సామాజిక మాధ్యమాలతో జాగ్రత్తగా ఉండాలి
మచిలీపట్నంటౌన్: సామాజిక మాధ్యమాలను వినియోగించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో వారి బ్యాంకు ఖాతాలోని నగదు అపహరణకు గురవుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్రావు హెచ్చరించారు. స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో బుధవారం డిజిటల్, సైబర్ క్రైం, రహదారి భద్రతలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి సమాజంలో డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు వృద్ధులు, పెద్దలను భయభ్రాంతులకు గురి చేసి వారి బ్యాంక్ ఖాతాలో నగదును దోచుకుంటున్నారని తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్ల ద్వారా నకిలీ ఖాతాలను క్రియేట్ చేసి వాటి నుంచి స్నేహితులు మాదిరిగా నగదు కోసం రిక్వెస్ట్ పెట్టి నగదు దోచుకుంటున్నారన్నారు. ప్రతి విద్యార్థీ సైబర్ క్రైం పై అవగాహన పెంచుకొని సైబర్ వారియర్గా పని చేస్తూ వారి కుటుంబాలను, సమాజంలోని నిరక్షరాశ్యులను చైతన్య పరచాలని సూచించారు. అతివేగం అత్యంత ప్రమాదకర మని, సరదా కోసం బైక్ కార్ రైడింగ్లో జాగ్రత్తలు పాటించకుండా వేగంగా వాహనాలు నడప రాదన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, విద్యాలయ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్, పీజీటీలు జె.సత్య నారాయణ, రెమ్యా, బి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు -
జాతీయ రహదారిపై లారీ దగ్ధం
మంగళగిరి టౌన్: విజయవాడ గుంటూరు జాతీయ రహదారిపై ఓ లారీ దగ్ధమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నగర పరిధిలోని ఆత్మకూరు బైపాస్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో మంటలు చెలరేగాయి. రోడ్డుపై మార్జిన్ పెయింట్ వేసేందుకు ఉపయోగించే లారీగా దీనిని గుర్తించారు. రహదారి పక్కనే ఆపిన లారీలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనంలో ఉన్న నాలుగు సిలిండర్లు పేలడంతో మంటలు ఎక్కువయ్యాయి. పేలుడు శబ్దం ధాటికి సమీ పంలో ఉన్న ప్రజలు, వాహన దారులు భయ భ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరు కుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగే సమయంలో భారీగా ట్రాఫిక్ ఆగిపోవడంతో మంగళగిరి రూరల్ పోలీసులు వచ్చి క్రమబద్ధీకరించారు. అక్కాచెల్లెళ్లు అదృశ్యం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన ఘటన భవానీపురంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం ఔట్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు స్వాతి సెంటర్ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు వాళ్ల అమ్మ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఈ క్రమంలో వారికి నెల్లూరుకు చెందిన యువకులు చందు, కృష్ణ ఇన్స్టా గ్రామ్లో పరిచయ మయ్యారు. వారితో అక్కచెల్లెళ్లు మాట్లాడు తుంటే తల్లి గమనించిన బాలికలను మంద లించింది. దీంతో బుధవారం ఉదయం అక్కా చెల్లెళ్లు ఇద్దరు కలిసి బయట టిఫిన్ చేసి వస్తామని చెప్పి తల్లి సెల్ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. సాయంత్రం వరకు చూసినా తిరిగి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వారిని, తెలిసిన స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ తెలియలేదు. దీంతో తన ఇద్దరు కూతుళ్లు కనిపించడం లేదంటూ తల్లి భవానీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నానో ఎరువులపై అవగాహన అవసరం
ఏపీ మార్క్ఫెడ్ ఇగ్నైట్ సెల్ను సందర్శించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడకుండా.. పంట నాణ్యత, ఉత్పత్తిని పెంచడంతో పాటు డబ్బును, సమయాన్ని ఆదా చేసే నానో ఎరువులపై అన్నదాతలకు సమన్వయ శాఖల అధికారులు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏపీ మార్క్ఫెడ్ ఇగ్నైట్సెల్ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. పోస్టర్ల ఆవిష్కరణ.. ఖరీఫ్ సీజన్ (2025–26)కు సంబంధించిన వివిధ పంటల కనీస మద్దతు ధరలు, ఏపీ మార్క్ఫెడ్ రైతులకు అందిస్తున్న సేవలు, సీఎం ఎయిడ్, సీఎం యాప్, మార్క్ రే ఈ–ఆక్షన్ ప్లాట్ఫామ్ తదితర వివరాలతో రూపొందించిన పోస్టర్లను, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అదేవిధంగా నానో యూరియా, నానో డీఏపీ, నానో జింక్, నానో కాపర్ తదితర ఎరువుల బాటిళ్లను పరిశీలించారు. నానో ఎరువులను తేలిగ్గా స్ప్రే చేయగలిగే కిసాన్ డ్రోన్ పనితీరును పరిశీలించారు. నానో ఎరువుల వల్ల దాదాపు 50 శాతం మేర ఎరువులు ఆదా అవుతాయన్నారు. పంట రకాలు, వివిధ దశల్లో వినియోగించాల్సిన మోతాదు, స్ప్రేయర్ల వినియోగం తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో వీటిపై అవగాహన కల్పించాలన్నారు. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ కె.నాగమల్లిక, మార్క్ఫెడ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమాచార హక్కు పోటీల పోస్టర్ ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్య ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కుపై నిర్వహించే పోటీల పోస్టర్ను బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్ శ్యామూల్ జోనాథన్ ఆవిష్కరించారు. సమాచార హక్కుచట్టంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు జరిగాయి. రాష్ట్ర స్థాయి పోటీల పోస్టర్ను బుధవారం ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జోనాథన్ మాట్లాడుతూ.. సమాచార హక్కుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాశాల విద్య ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పోటీలను ఈ నెల 11న ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు రాష్ట్ర సమాచార కమిషనర్ శ్యాముల్ జోనాథన్ చేతులమీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం, కోకన్వీనర్ కొల్లేటి రమేష్, సభ్యులు యుగంధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి ప్రొటోకాల్ సిబ్బందికి మెమోలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్కు మంగళవారం దుర్గగుడిపై ఎదురైన చేదు ఘటనపై దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయ్కుమార్ కారును ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తనకు ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే నేరుగా ఆలయ ఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఆలయ అధికారులు ప్రొటోకాల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు సిబ్బందికి మెమోలు జారీ చేశారు. సూపరింటెండెంట్ కుర్రెళ్ల శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ డి.వి.ఎన్.రాజు, రికార్డు అసిస్టెంట్ పి.శ్రీనివాసులు, అటెండర్ జి.కృష్ణమ్మ, వి.ఓంకార్ను తాత్కాలికంగా ప్రొటోకాల్ విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మెమో అందుకున్న ఏడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ప్రొటోకాల్ విధుల నుంచి తొలగించిన వారి స్థానంలో సూపరింటెండెంట్ వి.సూర్యనారాయణమూర్తి, జూనియర్ అసిస్టెంట్ కె.సతీష్, రికార్డు అసిస్టెంట్ ఎం. జయప్రకాష్(పేషీ), ఎన్ఎంఆర్ పునిత్కుమార్, ఎంసీఎస్ వరప్రసాద్కు అదనపు విధులు కేటాయించారు. దేవదాయశాఖ మంత్రిని కలిసిన ఎన్ఎంఆర్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వివిధ దేవాలయాల్లో 30 ఏళ్లగా ఎన్ఎంఆర్లుగా విధులు నిర్వహిస్తున్న పలువురు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని బుధవారం కలిశారు. తమను రెగ్యులర్ చేయాలని కోరారు. విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాలకు చెందిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. గతంలోనూ దేవదాయ శాఖ మంత్రి ఆనంను తాము కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ఎంఆర్లకు తగిన న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ అధ్యక్షులు ఎన్.వి.రమణ, ఎ.కె.డి.శివ కుమార్, ఉడేపు రాజేశ్వరరావు, పునిత్, వెంకట్ తదితరులు ఉన్నారు. ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో జైరుద్రకు చోటు పెనమలూరు: మండలంలోని పోరంకి గ్రామంలో ఆరేళ్ల బాలుడు అసాధారణ ప్రతిభ చాటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు సాఽధించాడు. ఈ చిన్నారి అద్భుత ఆధ్యాత్మిక ప్రతిభ ప్రదర్శించి ఈ ఘనత సాధించాడు. 49 నిమిషాల 39 సెకన్లలో పూర్తి రామాయణ గాథను శ్రద్ధతో స్పష్టంగా పఠించాడు. జైరుద్ర వయసు ఆరు సంవత్సరాల మూడు నెలలు. ఒకటో తరగతి చదువుతున్నాడు. బాలుడికి చిన్ననాటి నుంచే అపూర్వ శ్రవణశక్తి ఉంది. దేనినైనా శ్రద్ధగా విని మదిలో నిలుపుకొని స్పష్టంగా తిరిగి పఠించగలడు. ఈ అసాధారణ శక్తితో ఆధ్యాత్మిక పాఠాలు వినటం, గుర్తుంచుకోవటం, పఠించటం సహజంగానే చేస్తున్నాడు. జైరుద్ర కాలభైరవ అష్టకాన్ని అత్యంత వేగంగా పఠించి రికార్డుల్లో స్థానం సంపాదించాడు. బాలుడి తల్లి గంగాశ్రీ మాట్లాడుతూ జైరుద్ర విజయాలు వ్యక్తిగత ఘనతే కాకుండా మన ప్రాచీన ధార్మిక సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసి స్ఫూర్తిదాయకంగా మారాయన్నారు. -
కొండలమ్మకు రూ.17.75లక్షల ఆదాయం
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మవారి దేవస్థానం హుండీల్లోని కానుకలను బుధవారం లెక్కించగా రూ.17,75,841 నగదు వచ్చింది. భోగిరెడ్డిపల్లి ఈఓ అరుణ పర్యవేక్షణలో దేవదాయ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కించగా మొత్తం 41రోజులకు గానూ నోట్ల ద్వారా రూ.16,16,601, చిల్లర ద్వారా రూ.1,59,240 వెరసి మొత్తం రూ.17,75,841 వచ్చింది. బంగా రం 27గ్రాములు, వెండి 1.2 కేజీలు వచ్చింది. నైపుణ్యాభివృద్ధితో ఉన్నతి ఆత్కూరు(గన్నవరం): నైపుణ్యాభివృద్ధితో జీవితంలో ఉన్నతిని సాధించవచ్చని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో బుధవారం శిక్షణార్థులతో కలిసి ఆయన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం ద్వారా యువత భవిష్యత్ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని, నైపుణ్యాభివృద్ధికి ఈ రెండు దారి దీపాలుగా నిలుస్తాయని చెప్పారు. ముఖ్యంగా యువత స్వయం సమృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నించడం కంటే, నలుగురికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని ఆకాంక్షించారు. దుర్గమ్మకు పలువురి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు బుధవారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. విజయవాడ గవర్నర్పేటకు చెందిన మానేపల్లి వెంకట పద్మావతి, వెంకటలక్ష్మి రాజాలు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని ఆలయ ఏఈవో ఎన్. రమేష్బాబుకు అందచేశారు. అలాగే భీమవరానికి చెందిన ఎం.రేణుక స్వాతి, ఎం.రాఘవమ్మ అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1,01,116, బంగారు తాపడం పనులకు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందించారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత పెనమలూరు: బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి అన్నారు. కానూరు రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో బుధవారం ఎన్టీఆర్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్స్ కమిటీలు, ఈగల్ క్లబ్లు, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, శక్తి కమిటీలు చురుకుగా పని చేయాలని సూచించారు. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్స్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బాల బాలికల హక్కుల సంరక్షణకు సమష్టి కృషి అవసరమన్నారు. అనాథ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో ఉండి చదువుకునే బాలలకు పూర్తి వసతులు కల్పించాలని సూచించారు. అనాథ పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాలలో ఉంచా లని వారికి నెలకు రూ.4 వేలు స్కాలర్షిప్ అందుతుందన్నారు. డీఈవో యూవీ సుబ్బారావు, సీ్త్ర,శిశు సంక్షేమ సాధికారిత అధికారి షేక్ రుక్సానా సుల్తానాబేగం, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, ఆర్ఐవో బి.ప్రభాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎన్టీటీపీఎస్ వైద్యశాల ఉద్యోగులను కొనసాగిస్తాం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీ పీఎస్ వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను తొలగించబోమని, వారిని కొనసాగిస్తామని, ఎప్పటిలాగే నాణ్యమైన మందులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య పరీక్షలు అందిస్తామని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ శివ రామాంజనేయులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘అమ్మేసినట్లేనా?’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురిత మైంది. ఈ కథనానికి చీఫ్ ఇంజినీరు శివ రామాంజనేయులు పైవిధంగా స్పందించారు. నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించేందుకే ఈ విధానం పాటించామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ప్రముఖ కంపెనీల మందులు అందజేయాలని, అందరు ఉద్యోగులను కొనసాగించాలని ప్రైవేట్ సంస్థకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ ప్రకటనలో సీఈశివ రామాంజనేయులు తెలిపారు. -
పొక్లెయిన్ తగిలి వ్యక్తి దుర్మరణం
కోడూరు: పొక్లెయిన్ ముందు భాగంలోని బకెట్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కోడూరు పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. ఎస్ఐ చాణిక్య కథనం మేరకు.. మండలంలోని మందపాకల– చింతకోళ్ల గ్రామాల మధ్య రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో భాగంగా బుధవారం ఉదయం పొక్లెయిన్తో రోడ్డుకు రెండు వైపులా మార్జిన్ పనులు చేస్తున్నారు. మందపాకల గ్రామానికి చెందిన గాదె చలపతిరావు (40) ద్విచక్రవాహనంపై చింతకోళ్ల వైపు ప్రయాణిస్తుండగా పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని కదిలించాడు. పొక్లెయిన్ ముందు భాగంలో ఉండే ఐరన్ బకెట్ చలపతిరావు ముఖంపై బలంగా తగలడంతో అతను తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చలపతిరావు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పొక్లెయిన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం చలపతిరావు మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. మృతుడి భార్య గాదె ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. అవనిగడ్డ ప్రభుత్వా స్పత్రి వద్ద చలపతిరావు మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పరిశీలించారు. ప్రమాదం తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. -
హాస్టళ్లలో ఫుడ్ కమిషన్ చైర్మన్ తనిఖీలు
గన్నవరం/గుడివాడరూరల్: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్.విజయ ప్రతాపరెడ్డి బుధవారం గన్నవరం మండలం, గుడివాడలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత గన్నవరం ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న అల్పాహారం నాణ్యతను పరిశీలించారు. ఇక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసి, వార్డెన్ ప్రకాష్ను సత్కారించారు. అనంతరం దావాజిగూడెంలోని బాలికల ఎస్సీ, బీసీ హాస్టళ్లు, కళాశాల వసతి గృహం, ఎస్సీ మోడల్ హాస్టళ్లలో భోజన వసతులను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారంలో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. గుడివాడలోని బేతవోలు మునిసిపల్ హైస్కూల్, టౌన్ హైస్కూల్, మోటూరు గురుకుల పాఠశాలను విజయప్రతాపరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం తిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. తనిఖీల సందర్భంగా గన్నవ రంలో కమిషన్ చైర్మన్ విజయ ప్రతాపరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వసతి గృహాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా ఎక్కువగా తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. రోజుకు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం కేటాయిస్తున్న రూ.47తో మెనూ సర్దుబాటు కాక వార్డెన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మోహన్రావు, జిల్లా మేనేజర్ టి.శివరాంప్రసాద్, సాంఘిక సంక్షేమ ఉపసంచాలకుడు షేక్ షాహిద్బాబు, వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ అధికారి జి.రమేష్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి దూర్జటి, డీఈఓ పి.వి.జె.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేట్ వైద్యశాలలో శిశువు మృతి
ఇబ్రహీంపట్నం: మండలంలోని కొండపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనతో యువదంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మండలంలోని మూలపాడు గ్రామానికి చెందిన మస్కట్ల రాజేష్, శ్రావణి దంపతులు. శ్రావణి ఫిజియోథెరపిస్టు. వారు హైదరాబాద్లో నివసిస్తున్నారు. శ్రావణికి తొలికాన్పు కావడంతో కొండపల్లిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వచ్చి అప్పడప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేవారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రావణిని కాన్పు కోసం వైద్యశాలలో చేర్చారు. స్కానింగ్ తీసి అంతా బాగానే ఉందని వైద్యులు చెప్పడంతో సంతోష పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటలకు డెలివరీ చేసిన వైద్యులు మగబిడ్డ పుట్టాడని తల్లిదండ్రులకు చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు ఆ బిడ్డ మరణించాడని మృత శిశువును వారి చేతిలో పెట్టారు. మృతికి కారణం అడిగితే ఇక్కడి నుంచి వెళ్లిపొండని వైద్య సిబ్బంది వారిపై దాడికి దిగారు. ఈ సమాచారం అందుకున్న సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ విజయలక్ష్మి వైద్యశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రతి కుటుంబం నుంచి వ్యాపారులు రావాలి
పటమట(విజయవాడతూర్పు): ఒక కుటుంబం.. ఒక వ్యాపారి అనే నినాదంతో స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావ్వాలని మెప్మా డైరెక్టర్ తేజ భరత్ సూచించారు. ప్రతి కుటుంబం నుంచి వ్యాపారులు రావాలని ఆకాంక్షించారు. వీఎంసీ–మెప్మా – ఇండియా ఎస్ఎంఈ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఐవీ ప్యాలెస్లో స్వయం సహాయక సంఘాలకు స్టార్ పెర్ఫార్మర్ మహిళల వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తేజభరత్ మాట్లాడుతూ.. పట్టణాల్లోని స్వయం సహాయక సమూహాలను వ్యాపారులుగా రూపొందంచే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారాలు నిర్వహిస్తున్న పొదుపు సంఘాల మహిళలను స్టార్ పెర్ఫార్మర్లుగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ స్టార్ పెర్ఫార్మర్ మహిళలకు వారి వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు, నైపుణ్యాలు, మెంటర్షిప్, సహాయ సహకారాలు అందించేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం, మెప్మా లీప్(లైవ్లీహుడ్స్ ఎన్హ్యాన్మెంట్ అండ్ యాస్పిరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్) నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రోగ్రాంలో ప్రధానంగా రిటైల్, టెక్స్టైల్స్, ఫుడ్, బ్యూటీ – వెల్నెస్, ఫర్నిచర్ – ఉడ్ ప్రొడక్ట్స్ ఉంటాయని వివరించారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్, జెమ్ రిజిస్ట్రేషన్, ఇన్కంటాక్స్ – కంప్లయన్సెస్, క్వాలిటీ – ప్యాకేజింగ్, డిజిటల్ టూల్స్, మార్కెట్ యాక్సెస్ (ఆన్లైన్ – ఆఫ్లైన్), ఐపీఆర్ రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ సపోర్ట్ – ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయన్నారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వీఎంసీ యూసీడీ ప్రాజక్ట్ అధి కారి పి.వెంకటనారాయణ, టెక్నికల్ ఎక్స్ఫర్ట్ (జీవనోపాధులు) జి.ఎస్.సుజాత పాల్గొన్నారు. -
ఎన్నికలకు దూరం
సహకార సంఘాలుపెనుగంచిప్రోలు: వ్యవసాయ రంగం బలోపేతం కోసం సహకార వ్యవస్థ రూపుదిద్దుకుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి జరుగుతుంది. రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలతో పాటు ఎన్నో సేవలను సహకార పరపతి సంఘాలు అందిస్తున్నాయి. వీటి పాలకవర్గాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నుకోవాల్సి ఉంది. 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత సహకార సంఘాలకు ఇంత వరకు తిరిగి జరగలేదు. ఈ సంఘాల్లో ప్రశ్నించే పాలకవర్గాలు అందుబాటులో లేకపో వటంతో కొన్ని చోట్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంజూరవని నిధులు ప్రతి ఐదేళ్లకోసారి సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యేవి. పాలకవర్గాలు లేక పోవటంతో నిధులు మంజూరు కావటం లేదని రైతులు వాపోతున్నారు. నిధులు రాకపోవటంతో పాటు రైతులకు అందించే రుణాల్లో కూడా రాయితీలు అందటం లేదంటున్నారు. ఎరువులు, పురుగు మందులు, యంత్ర పరికరాలు, వ్యవసాయ పరికరాలను కూడా సరిగా పొందలేక పోతున్నామని రైతులు అంటున్నారు. పదవులపై ఆశలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతోమంది నాయకులు సహకార సంఘ అధ్యక్ష పదవుల కోసం ఆశగా ఉన్నారు. అధికారుల పాలన పూర్తవటంతో ఎన్నికలు తక్షణం పెట్టక పోయినా నామినేటెడ్ పద్ధతిలో అయినా పదవి దక్కుతుందని భావిస్తున్నారు. జిల్లాలో మొత్తం 131 సహకార సంఘాలకు కేవలం తొమ్మిది కమిటీలకు మాత్రమే కమిటీలను వేశారు. మిగిలిన చోట్ల నాయకుల మధ్య పోటీ, పలు రాజకీయ కారణలతో కమిటీలు వేయలేదనే ప్రచారం జరుగుతోంది. కమిటీలను వేసేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలతో ప్రక్రియ జరుగుతోందనే ప్రచారం కూడా ఉంది. కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ సారి కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు కూడా కమిటీల్లో స్థానం కావా లని కోరటం టీడీపీ నాయకులకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. 2013లో చివరి సారిగా సహకార సంఘాలకు ఎన్నికలు నామినేటెడ్ పదవులతో సరిపెడుతున్న వైనం ఏడాదిగా పర్సన్ ఇన్చార్జీలతోనే పాలన పాలకవర్గాలు లేకపోవటంతో మంజూరవని నిధులు ఎన్టీఆర్ జిల్లాలో 131 సహకార పరపతి సంఘాలు ఎన్టీఆర్ జిల్లాలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. వీటికి ఇప్పటి వరకు 12 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవటంతో సహకార వ్యవస్థ లక్ష్యానికి దూరంగా ఉంటోందనే విమర్శలు కూడా ఉన్నాయి. సంఘాలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి త్రీ మెన్ కమిటీలు ఉండేవి. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన ఏడాది కాలంగా కమిటీలు వేయకుండా ఉద్యోగులనే అఫీషియల్ పర్సన్ ఇన్చార్జిలుగా నియమించింది. వారి సమయం కూడా జూలై 30వ తేదీతో ముగిసింది. అయితే 131 సంఘాల్లో తొమ్మిది సంఘాలకు ఇప్పటికే త్రీ మెన్ కమిటీ సభ్యులను నామినేట్ చేసినట్లు చెబుతున్నారు. గుణదల, ఇబ్రహీంపట్నం, గంగినేని పాలెం, కుంటముక్కల, మర్సుమల్లి, మైలవరం, కూనపురాజుపల్లి, రెడ్డిగూడెం, జి.కొండూరు మినహా మిగిలిన చోట్ల అఫీషియల్ పర్సన్ ఇన్చార్జులే కొనసాగనున్నారు. -
రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాజకీయ నాయ కులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉందనన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ 56 ఏళ్లుగా పార్టీలో సేవలందిస్తున్న సందర్భంగా ఆయనకు బుధవారం విజయవాడలోని ఓ ఫంక్షన్ హాటులో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. శ్రీమన్నారాయణను తన వ్యక్తిగత స్నేహితుడిగా పేర్కొన్నారు. జట్కా బండ్లపై తిరిగి వాజ్పేయి, అద్వానీతో ప్రచారం చేసిన రోజుల నుంచే శ్రీమన్నారాయణ బీజేపీ కోసం పదవులపై ఆశ లేకుండా, సిద్ధాంత నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు. గతంలో నాయకులు ఒక పార్టీ విడిచి మరొకదాన్ని చేరేటప్పుడు సిద్ధాంతాలు, కారణాలు ఉండేవని, నేడు డైపర్లు మార్చినంత సులువుగా పార్టీలు మారుతున్నారని విమర్శించారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండేలా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు కామి నేని శ్రీనివాస్, బోడే ప్రసాద్ పాల్గొన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాu8లో గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025హాస్టళ్లలో తనిఖీలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాపరెడ్డి బుధవారం గన్నవరం మండలం, గుడివాడలోని పలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. పూల మార్కెట్ కిటకిట విజయవాడలోని రాజీవ్గాంధీ పూల మార్కెట్ కొనుగోలుదారులతో బుధవారం కళకళ లాడింది. శ్రావణ మాస ప్రత్యేక పూజల నేపథ్యంలో పూల కోసం బారులు తీరారు.ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు తిరువూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య సేవలు సక్రమంగా అందట్లేదని ప్రజాప్రతి నిధులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీసీహెచ్ఎస్ మాధవీదేవి ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ప్రభుత్వ భూములు, ఆస్తులు, ఖజానాకు ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలే విలువైన ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఘటన. మచిలీపట్నంలోని మాచవరంలో రూ.54 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి.. ప్రభుత్వ కార్యాలయం నిర్మాణంలో ఉన్నా.. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో మాచవరం రెవెన్యూ పరిధిలో ఆర్ఎస్ నంబర్ 258/4లో 1.60సెంట్ల భూమి ఉంది. అక్కడ బహిరంగ మార్కెట్లో గజం ధర రూ.70వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన 77.44 గజాల భూమి విలువ రూ.54 కోట్లు. మార్కెట్ యార్డు రోడ్డులో ఉన్న అత్యంత ప్రాధాన్యం గలిగిన ఈ భూమిని ఇప్పటికే రవాణా శాఖకు కేటాయించారు. ఆ స్థలంలో ఆ శాఖకు చెందిన అధికారులు రెండు, మూడు దఫాలుగా రూ.1.5కోట్ల విలువైన పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టు ఇచ్చి నిర్మాణాలు చేయించారు. ఈ స్థలంలో కొంతమేర నిర్మాణ పనుల పర్యవేక్షణను ఏపీ హౌసింగ్ కార్పొరేషన్, ఆర్అండ్బీ శాఖలు చేపట్టాయి. ఆ పనులకు సుమారు రూ.50లక్షలకు పైగా వ్యయం చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాంటి స్థల రికార్డులను రెవెన్యూ అధికారులు ఏమార్చి.. అది ప్రభుత్వ ఖాళీ స్థలం అని, ఎవరి అనుభవంలోనూ లేనట్లు తప్పుగా చూపించి.. ధారాదత్తం చేసేందుకు అంతా సిద్ధం చేశారు. అసలేం జరిగిందంటే.. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో టీడీపీ కార్యాలయానికి తొలుత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న భూమిని కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. దానికి రెవెన్యూ శాఖ అభ్యంతరం చెప్పడంతో, మాచవరంలో రెవెన్యూ పరిధిలోని మార్కెట్ యార్డు రోడ్డులో ఉన్న అత్యంత విలువైన భూమిపై టీడీపీ నేతల కన్ను పడింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూమిని, అందులోనూ కార్యాలయాల నిర్మాణ పనులు జరుగుతున్న భూమిని ప్రైవేటు వారికి కేటాయించడం, నిబంధనలకు విరుద్ధం. అయినా సరే ఆ భూమిని తమ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు కేటాయించాలంటూ, టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు. అధికార పార్టీ కావడంతో ఉన్నత స్థాయి నేతలు చక్రం తిప్పడంతో ఆఫైలు ఆగమేఘాలపై కదిలింది. టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలని ప్రతిపాదించిన స్థలం ఇదే..7న్యూస్రీల్ఎకరం రూ.1000 చొప్పున.. నిబంధనలకు నీళ్లు.. బందరులో ఆర్అండ్బీకి కేటాయించిన భూమిపై ‘పచ్చ’నేతల కన్ను ఏడాదికి రూ.1000చొప్పున, 33ఏళ్ల పాటు లీజుకు ప్రతిపాదన ఆ భూమిలో ఇప్పటికే ఓ ప్రభుత్వ కార్యాలయ నిర్మాణ పనులు జరుగుతున్న వైనం అయినప్పటికీ టీడీపీ దరఖాస్తుపై ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధం అధికార దుర్వినియోగంపై విస్తుపోతున్న ప్రజా సంఘాలు టీడీపీ నేతలు అత్యంత విలువైన స్థలాన్ని కారుచౌకగా కేవలం ఏడాదికి ఎకరానికి నామమాత్ర ధర రూ.1000 చొప్పున ఇవ్వాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 33 ఏళ్ల లీజుకు కేటాయించాలని కోరారు. ఈ ప్రతిపాదనలను మచిలీపట్నం వాసులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కార్పొరేషన్ పాలక వర్గంలోని సభ్యులు సైతం, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించిన స్థలం, ఓ రాజకీయ పార్టీ కార్యాలయానికి ఇవ్వటం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఏదైనా భూమిని ప్రైవేటు వారికి కేటాయించాలంటే, 15 రోజుల ముందుగా బహిరంగ ప్రకటన చేయాలి. గ్రామ సభ నిర్వహించి ప్రజల అభ్యంతరాలను తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉంది. కానీ టీడీపీ కార్యాలయం కోసం భూమిని కేటాయించాలని చేసిన దరఖాస్తును ప్రతిపాదిస్తూ, అట్టి ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను, స్వీకరణకు ఏ1 నోటీసులోని తేదీలను, నెలను స్పష్టత లేకుండా, ప్రజలకు అర్థంకాని రీతిలో తయారు చేసి, దానిని స్థానిక మూడో వార్డులో ఉన్న నోటీసు బోర్డులో అతికించారు. దీనిని సైతం ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ముందు రోజు జూలై 31వ తేదీన మూడో వార్డు సచివాలయంలో నోటీసు బోర్డులో కనీసం తేదీ కూడా కనిపించకుండా అతికించారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే తహసీల్దార్కు పలు ప్రజా సంఘాలు వినతి పత్రాలు ఇచ్చాయి. దీంతోపాటు ప్రభుత్వ శాఖల భవనాల నిర్మాణాలు జరుగుతున్న భూమిని టీడీపీ కార్యాలయాలకు ఎలా కేటాయిస్తారని ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్కు వినతి పత్రాలు పంపాయి. ఇదే అంశంపై కలెక్టర్ను కలిసి తమ అభ్యంతరాలు చెప్పేందుకు ప్రజా సంఘాలు సిద్ధం అయ్యాయి. కానీ అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ రూ.54 కోట్ల విలువైన భూమిని టీడీపీ కార్యాలయానికి కేటాయించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుండటంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
వేతన పాట్లు.. దాహం కేకలు!
ఇబ్రహీంపట్నం: కొండపల్లి మునిసిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని 62 గ్రామ పంచాయతీల పరిధిలో మూడు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచి పోయింది. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలల వేతనాలతో పాటు మూడేళ్ల క్రితం నుంచి ఏరియర్స్ చెల్లించాలని పలువురు కార్మికులు సమ్మె బాట పట్టారు. పంపింగ్ హౌస్ మోటార్లు ఆన్ చేసేవారు లేకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది. వైఎస్సార్ సీపీ నాయకులు, వామపక్ష నాయకుల పోరాట పటిమతో కాంట్రాక్టర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దిగొచ్చారు. కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని, విధులకు హాజరు కావాలని కోరారు. మూడు రోజులుగా తాగునీటి వెతలు.. కాంట్రాక్ట్ కార్మికులు మూడు రోజుల సమ్మె నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడ రూరల్(ఐదు గ్రామాలు), రెడ్డిగూడెం, మైలవరం గ్రామ పంచాయితీలతో పాటు కొండపల్లి మునిసిపాలిటీలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. వేసవిని తలపిస్తున్న ఎండలకు ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ కలిగిన బోరు పంపు నీటిని తాగాల్సి వచ్చింది. మండల కేంద్రాలు, కొండపల్లి మునిసిపాలిటీలో మినరల్ వాటర్ పేరుతో అమ్ముతున్న వాటర్ క్యాన్లు కొనుగోలు చేసుకున్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కొందరు నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేశారు. అధికారులు కొన్ని ట్యాంకర్ల ఏర్పాటు చేసినప్పటికీ కూటమి నాయకుల కనుసన్నల్లో వారికిష్టమైన ప్రాంతాల్లోనే సరఫరా చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్సార్ సీపీ నాయకుల పోరుబాట.. తాగునీటి సరఫరా పునరుద్ధరణకు వైఎస్సార్ సీపీ నాయకులు, సీపీఐ, సీఐటీయూ నాయకులు పోరాట పటిమ చూపారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ గుంజా శ్రీనివాస్ నేతృత్వంలో పలువురు కౌన్సిలర్లు, పార్టీకి చెందిన వివిధ విభాగాల నాయకులు నీటి సరఫరా పునరుద్ధరణ చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తనకు వినతిపత్రం అందజేశారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులతో చర్చలు జరిపారు. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ చీఫ్ గాయత్రిదేవి, కాంట్రాక్టర్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ప్రజలకు తాగునీరు సరఫరా పునరుద్ధరించాలని వైఎస్సార్ సీపీ నాయకులు పట్టుబట్టారు. గాయత్రీదేవి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ సూచనలతో కార్మికులు అప్పటికప్పుడు సమ్మె విరమించారు. పంపు మోటార్లు ఆన్చేసి తాగు నీటిని విడుదల చేశారు. కాంట్రాక్టర్ కనుసన్నల్లోనేనా? ఆర్డబ్ల్యూఎస్ శాఖలో పనులు దక్కించుకున్న విజయవాడకు చెందిన కాంట్రాక్టర్ కనుసన్నల్లోనే కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు దిగినట్లు ప్రచారం సాగుతోంది. కాంట్రాక్టర్ నిర్వహించే తాగునీటి సరఫరా పనులకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.3.50కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో అతనే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు దించినట్లు తెలుస్తోంది. యజమాని వంటి కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో కార్మికులు మూడు రోజులుగా సమ్మె బాట పట్టారు. వాస్తవంగా కార్మికులు సమ్మె బాట పడితే కాంట్రాక్టర్ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని ప్రజలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఆ దిశగా అడుగులు వేయకుండా బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి చేయడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. సమ్మెకు దిగిన ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు మూడు రోజులుగా 62 గ్రామాల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వైఎస్సార్ సీపీ పోరాటంతో నీటి సరఫరా పునరుద్ధరణ కాంట్రాక్టర్ ప్రోద్బలంతోనే కార్మికులు సమ్మెబాట పట్టినట్లు ఆరోపణలు -
నషా ముక్త్ జిల్లా లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారం దిశగా పయనిస్తూ జిల్లాను, రాష్ట్రాన్ని, దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే క్రమంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సెలింగ్ సేవలు తదితరాలపై బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో ఈగల్ క్లబ్స్తో పాటు క్యాంపస్ అంబాసిడర్లను కీలకపాత్ర పోషించేలా చూడాలన్నారు. స్వల్ప నిడివితో ఆడియో, వీడియో ప్రదర్శనలు, పీపీటీ ప్రజెంటేషన్, సందేహాల నివృత్తి, ఇంటరాక్షన్ వంటివాటితో అరగంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఐదేళ్ల ప్రస్థానం.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాదకద్రవ్యాల వినియోగం అనేది తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతోందని.. సమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తోందని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2020, ఆగస్టు 15న నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబీఏ)ను ప్రారంభించారన్నారు. ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ర్యాలీలు, వాకథాన్లు, వెబినార్లు, సెమినార్లు, పోటీలు వంటివి నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 13న దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చడానికి శక్తి మేరకు కృషిచేస్తాననే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమాల వివరాలను ఎన్ఎంబీఏ మొబైల్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు.. స్కిల్స్ ముద్దు, ఈగల్ టోల్ఫ్రీ నంబరు 1972, ఈగల్ క్లబ్స్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు, టీజీ, వయోవృద్ధుల సంక్షేమ అధికారి వాడ్రేవు కామరాజు, ఏసీపీలు కె.వెంకటేశ్వరరావు, కె.లతా కుమారి, ఈగల్ ఎస్ఐ ఎం. వీరాంజనేయులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పేర్ని కిట్టు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పలువురిని నియమించారు. అందులో భాగంగా పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)ని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేర్ని కిట్టు నియామకం పట్ల మచిలీపట్నం నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
రసాయన ఎరువులను తగ్గించండి
‘పొలం పిలుస్తోంది’లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువులను రైతులు వాడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో పొలం పిలుస్తొంది కార్యక్రమంలో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించి ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులతో కలిసి వరి నాట్లు వేసి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లో రైతులు ఇబ్బందులు పడకుండా వారికి కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని గ్రామాలలో ఉన్న పీఏసీఎస్ కేంద్రాలలో ఎరువులు అందు బాటులో ఉంటాయన్నారు. ప్రతి రైతు తనకు కావాల్సిన ఎరువులను అక్కడ నుంచి పొందవచ్చని సూచించారు. ఉద్యానంపై దృష్టి పెట్టండి.. కేవలం వరి పంటకు పరిమితం కాకుండా ఉద్యాన పంటలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి ఎరువులు, పురుగు మందులు వాడాలని సలహాలు ఇచ్చారు. ఎన్టీటీపీఎస్ కాలుష్యం, గ్రీన్ ఫీల్డ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో గుంటుపల్లి సర్పంచ్ భుక్యా కవిత, జిల్లా వ్యవ సాయ అధికారి విజయ కుమారి, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, ఏడీ శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు -
కానిస్టేబుల్స్గా ఎంపికై న హోంగార్డుల పిల్లలకు అభినందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్స్ ఫలితాల్లో నగరంలో పనిచేస్తున్న హోంగార్డుల పిల్లలు ఎంపికయ్యారు. వారిని మంగళవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీ కేజీవీ సరితలు అభినందనలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే సివిల్ కానిస్టేబుల్స్గా ఎంపికై న హోంగార్డు వంగూరి చిట్టిబాబు ఇద్దరు కుమార్తెలు రత్నశ్రీ, జయశ్రీలను ప్రత్యేకంగా అభినందించారు. జి. కొండూరు మండలం, బీమావరప్పాడుకు చెందిన వంగూరు చిట్టిబాబు 1991 నుంచి హోంగార్డుగా పనిచేస్తూ ముగ్గురు కుమార్తెలను చదివించాడు. వారిలో ఇద్దరు ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్స్గా ఎంపికవడం పట్ల సీపీ, డీసీపీలు అభినందనలు తెలిపారు. కాగా మరో ఇద్దరు హోంగార్డులు అస్లామ్ బేగ్ కుమారుడు మొగల్ అబ్దుల్ అలీం బేగ్, రాఘవులు కుమారుడు పూర్ణనాగార్జున కూడా కానిస్టేబుల్గా సెలెక్ట్ కావడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. -
నవజాత శిశువులకు ‘తల్లి పాల బ్యాంక్’
విజయవాడ రెయిన్బో ఆస్పత్రిలో ప్రారంభం లబ్బీపేట(విజయవాడతూర్పు): శిశువుకు తల్లి పాలు చాలా అవసరం. తల్లి అందుబాటులో లేని శిశువుల కోసం విజయవాడలోని రెయిన్బో ఆస్పత్రిలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం ఎన్టీఆర్ జిల్లా డెప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవీ సరిత లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ తల్లి పాల బ్యాంక్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు, ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు తల్లి పాలు చాలా అవసరమని పేర్కొన్నారు. తల్లి పాలు అందుబాటులో లేని శిశువులకు ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా అందించి వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. దీనివల్ల శిశు మరణాల రేటు తగ్గించవచ్చన్నారు. 500 లీటర్ల సామర్థ్యం.. రెయిన్బో ఆస్పత్రికి చెందిన డాక్టర్ రాంప్రసాద్ తల్లిపాల బ్యాంక్ ఆవశ్యకతను వివరించారు. ఎవరైనా తల్లులు తమ అదనపు పాలను ఇక్కడ దానం చేయవచ్చని సూచించారు. వాటిని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిన వారికి అందిస్తామన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడే శిశువులను తల్లిపాలు ఓ వరం లాంటివన్నారు. దాతల నుంచి సేకరించిన సురక్షితమైన, పాశ్చరైజ్డ్ చేసిన పాలను ఈ బ్యాంక్ ద్వారా శిశువులకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ మదర్ మిల్క్ బ్యాంక్లో నిల్వ సామర్థ్యం 500 లీటర్లన్నారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 97037 71222లో సంప్రదించవచ్చని సూచించారు. డాక్టర్ వంశీ శివరామరాజు, డాక్టర్ బీఎస్సిపి రాజు, డాక్టర్ శ్రీథర్, డాక్టర్ భ్రజిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అంతరాయాల్లేని విద్యుత్ సరఫరా ఇవ్వాలి
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 33/11 కేవీ సబ్ స్టేషన్స్, సరఫరా లైన్లలో అంతరాయాలను తగ్గించాలన్నారు. ఇందుకోసం ముందుగానే నిర్వహణ పనులు, అవసరమైన సామగ్రి అందించేందుకు, అత్యవసర సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయని, కరెంట్ పోయిందని ఫిర్యాదులొస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవన్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని, వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాగుదారులకు 9 గంటల నిరంతరంగా విద్యుత్ సరఫరా అందించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణయాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ కేవీఎస్ఎన్ మూర్తి, డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్. వెంకటేశ్వర్లు ఆయా జిల్లాల విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం బస్టాండ్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో రోజువారీ వేతనంతో డ్రైవర్లుగా పనిచేయటానికి ఆసక్తి కలిగిన డ్రైవర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై దానం ఓ ప్రకటనలో తెలిపారు. వయస్సు 59 ఏళ్లలోపు ఉండి, చెల్లుబాటులో ఉన్న హెవీ డ్రైవింగ్ లైసెన్స్, 18 నెలల పాటు హెవీ వెహికల్ అనుభవం ఉండాలని తెలిపారు. జిల్లాలోని తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ, గవర్నరుపేట–1, గవర్నరుపేట–2, ఇబ్రహీంపట్నం, ఆటోనగర్, విద్యాధరపురం డిపోల పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు దగ్గరలోని డిపోలు గాని, జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అలాగే పీఓ కార్యాలయం 9959225453, ఆటోనగర్– 9959225463, జగ్గయ్యపేట–9959225460, గవర్నరుపేట2– 9959225456, విద్యాధరపురం–9959225458, విజయవాడ–9959225459, తిరువూరు–9959225465, గవర్నరుపేట1– 9959225455, ఇబ్రహీంపట్నం–9959225457 ద్వారా ఆయా డిపో మేనేజర్లను సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. గుర్తు తెలియని వృద్ధుడు మృతి చిట్టినగర్(విజయవాడపశ్చిమ): అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధు డిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కొత్తపేట సీఐ చిన్న కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట ఆంజనేయ వాగు సెంటర్లో సోమ వారం ఓ వృద్ధుడు స్పృహ కోల్పోయి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. మృతుడికి సుమారు 60 ఏళ్లు ఉంటాయని, ఒంటిపై బ్లూ షర్ట్ ధరించి ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
అమ్మేసినట్లేనా?
ఉద్యోగులకు భద్రత కల్పించాలి.. ఎన్టీటీపీఎస్ సంస్థ 39 ఏళ్లుగా నిర్వహించిన బోర్డు వైద్యశాల ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం వెనక కుట్ర దాగి ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి ఏమవ్వాలి. కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ పాత వారిని కొనసాగించాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించి జీతభత్యాలు సకాలంలో చెల్లించాలని కోరుతున్నాం. – ఎం.మహేష్, సీఐటీయూ మండల కార్యదర్శి సంస్థే అభివృద్ధి చేయాలి.. ఎన్టీటీపీఎస్ వైద్యశాలలో ఇప్పటికే అనేకమంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వైద్య సదుపాయం పొందారు. ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం విడ్డూరంగా ఉంది. ప్రైవేట్ సంస్థకు ఏడాదికి రూ.1.49కోట్లు చెల్లించే కంటే ఆ నిధులతో వైద్యశాలలో మెరుగైన సదుపాయాలు, వైద్య పరికరాలు నెలకొల్పడం మంచిదని కోరుతున్నాం. – గొల్లపూడి ప్రసాద్, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి ●ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ వైద్యశాల ప్రైవేట్పరమైంది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో పని చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు ఏపీ జెన్కో ఆధ్వర్యంలో 1986లో ఈ వైద్యశాలను ఏర్పాటు చేసింది. ఇది ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా మూడంతస్తుల భవనంలో 30 పడకల ఆస్పత్రి, ఔట్ పేషెంట్ విభాగాలకు అప్పట్లో భవనాలు నిర్మించారు. ఐదుగురు వైద్యులు, ఇతర సిబ్బందితో కలిపి సుమారు 32మంది ఇక్కడ విధులు నిర్వర్తిస్తారు. అయితే ఆగమేఘాలపై విజయవాడకు చెందిన ఓ ప్రైవేట్ వైద్యశాలకు దీని నిర్వహణను అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకు ఏడాదికి రూ.1,49,12,616 నగదు ఎన్టీటీపీఎస్ సంస్థ ప్రైవేట్ వైద్యశాలకు చెల్లించాల్సి రావడం గమనార్హం. ఆ నగదుతో ఇక్కడ వసతులు, వైద్య పరికరాలు మెరుగుపర్చాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ప్రైవేట్ పరం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల్లో ఆందోళన.. ఎన్టీటీపీఎస్ వైద్యశాల ప్రైవేట్ పరం కావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ వైద్యశాల చేతుల్లోకి ఆస్పత్రి వెళ్లిపోయింది. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న 32మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్రైవేట్ యాజమాన్యం ఇంకా విధులు ప్రారంభించలేదు. అయితే పాత వారిలో ఏపీజెన్కో నుంచి 11మంది, ఆపరేషన్, మెయింటెనెన్స్ నుంచి 9మంది, ప్రాంతీయ సిబ్బంది ఇద్దరు, మరికొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారు. సంస్థకు చెందిన వారి స్థానంలో కొత్త సభ్యులను నియమించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్న వారిని కొనసాగిస్తారా లేదా తొలగిస్తారా అనే సందిగ్ధం నెలకొంది. కొనసాగిస్తే ప్రైవేట్ యాజమాన్యం వేతనాలు గతంలో మాదిరిగా వీరికి చెల్లిస్తారా, తగ్గిస్తారా అనే సమస్య ఉత్పన్నమవుతోంది. గతంలో మాదిరిగా కాంట్రాక్ట్ సిబ్బందిని కొనసాగించాలని వారు కోరుతున్నారు. ఏడాదికి రూ.1.49కోట్లు.. ఎన్టీటీపీఎస్ వైద్యశాలను మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఓ ప్రైవేట్ వైద్యశాలకు ఎన్టీటీపీఎస్ యాజమాన్యం నెలకు రూ.12,42,718 చొప్పున ఏడాదికి రూ.1,49,12,616 నగదు చెల్లించాల్సి ఉంది. సంతృప్తికరమైన వైద్య సేవలు కాంట్రాక్టర్ అందిస్తే మొదటి ఏడాదిలో సేవల రుసుం కంటే మరో 5శాతం రెండో ఏడాది అదనంగా పెంచేందుకు నిర్ణయించారు. ఈ విషయంపై ఉద్యోగులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మెరుగైన వైద్యం పేరుతో ప్రైవేట్ సంస్థలకు ఎన్టీటీపీఎస్ సొమ్ము దోచిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రతి ఉద్యోగికి వృత్తి పరమైన ఆరోగ్య తనిఖీ పేరుతో వారానికి రూ.3,800 ప్రైవేట్ సంస్థకు చెల్లించాలని ఒప్పందం చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రైవేట్ సంస్థకు చెల్లించే నగదుతో స్థానిక వైద్యశాలలో మెరుగైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమకూర్చవచ్చని ప్రజా సంఘాలు సూచిస్తున్నాయి. ఎన్టీటీపీఎస్ సంస్థ సొమ్ము ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్టీటీపీఎస్ వైద్యశాల నిర్వహణ ప్రైవేట్ పరంఏడాదికి రూ.1.49 కోట్లు చెల్లించేలా ఒప్పందం పని చేస్తున్న ఉద్యోగుల్లో గందరగోళం వైద్యశాలను ఎన్టీటీపీఎస్ సంస్థే అభివృద్ధి చేయాలంటున్న ప్రజాసంఘాలు ప్రైవేటీకరణ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం! -
పగిడిపల్లి–గుంటూరు–విజయవాడ సెక్షన్లో తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ మంగళవారం గుంటూరు, విజయవాడ డివిజన్ల పరిధిలోని పగిడిపల్లి–గుంటూరు–కృష్ణా కెనాల్–విజయవాడ సెక్షన్లో తనిఖీలు నిర్వహించారు. ముందుగా విజయవాడ, గుంటూరు డివిజన్ల డీఆర్ఎంలు మోహిత్ సోనాకి యా, సుధేష్ణసేన్లతో కలసి ఆయా సెక్షన్లలో రియర్ విండో తనిఖీల ద్వారా ఆ సెక్షన్లలోని సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రత అంశాలు, ట్రాక్ల నిర్వహణను పరిశీలించారు. అక్కడ నుంచి నల్గొండ స్టేషన్లో వెయిటింగ్ హాల్, దివ్యాంగుల టాయిలెట్లు, లిఫ్ట్లు, తాగునీటి సౌకర్యం, ప్రయాణికుల మౌలిక సదుపాయాల ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం గుంటూరు డివిజనల్ కార్యాలయంలో.. ఆ తర్వాత విజయవాడ డివిజనల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పనితీరుపై చర్చించారు. ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య కంకిపాడు: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన కథనం మేరకు.. కంకిపాడు పట్టణంలోని రెల్లికాలనీకి చెందిన వడ్డాది లక్ష్మీనారాయణ(22) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్మేన్గా పనిచేస్తున్నాడు. ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ ఈనెల 4వ తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
వంకలు
వందనానికి రూ.10,900 మాత్రమే జమ చేశారు తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే చాలా మందికి రూ.13 వేల చొప్పున అందించింది. మాకు రూ.10,900 మాత్రమే అందాయి. మా మండలంలో చాలా మందికి రూ.10,900 చొప్పునే అందాయి. దీనిపై సచివాలయంలో విచారిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మిగిలిన నగదు అందుతుందని సమాధానమిచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకం కదా? కేంద్రం ఎందుకు ఇస్తుందో అర్థమవడం లేదు. – సీహెచ్ బుచ్చిబాబు, మైలవరం మండలం ఉచిత సీటు పేరుతో ఎసరు విద్యాహక్కు చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న క్రమంలో మా బాబుకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత సీటు కేటాయించారు. ఆ పేరుతో తల్లికి వందనం పథకం వర్తించదంటూ నిలిపివేశారు. అయితే రెండు వైపులా మాకు ప్రభుత్వం అన్యాయమే చేస్తోంది. మా బాబుకు కేటాయించిన సీటు పొందిన విధంగానే చాలా మందికి ఈ పథకాన్ని నిలిపివేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆర్థిక పరిస్థితులు కలిగిన అందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలి. – పి.జ్యోత్స్నాదేవి, విజయవాడ వన్టౌన్(విజయవాడపశ్చిమ): తల్లికి వందనం పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సాకులు వెదుకుతోంది. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి పెద్దలు హామీలు గుప్పించారు. అయితే తొలివిడత కొందరికే ఈ పథకం వర్తింపజేశారు. రూ.15 వేలకు బదులు రూ.13 వేలు మాత్రమే అందజేశారు. అర్హత ఉన్నా పథకం అందని పిల్లల తల్లిదండ్రుల నుంచి విమర్శలు రావడంతో రెండో విడత వారికి నగదు అందజేస్తామని, గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం సూచించింది. అనేక వంకలు.. అరకొరగా అమలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలు అందరూ చదువుకోవాలని, వారి చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని అమ్మ ఒడి పథకాన్ని అమలుచేశారు. ఆ పథకం పేరును తల్లికి వందనంగా మార్చిన కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ అమలుచేస్తామని గొప్పలు చెప్పింది. అమలులోకి వచ్చేసరికి అనేక వంకలు చూపుతూ వేల మందికి ఎగనామం పెట్టిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 2023లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలనలో 3,00,120 మంది తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకం నగదు జమయింది. కూటమి ప్రభుత్వం 2024లో తల్లికి వందనానికి ఎగనామం పెట్టింది. 2025 జూన్లో 2,53,457 మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేసింది. సుమారుగా 46,663 మంది తల్లులకు ఈ పథకాన్ని నిలిపివేసింది. ఆ తల్లులకు సంబంధించి సుమారుగా 70 వేల నుంచి 75 వేల మంది పిల్లలకు ఈ పథకాన్ని ఎగ్గొట్టిందని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అమలులోనూ అరకొరగానే నిధులు తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి పిల్లవాడికి రూ.15 వేలు అందిస్తామని, అందులో ఎటువంటి కోతలు పెట్టబోమంటూ ప్రకటించింది. అయితే రూ.13 వేల చొప్పునే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరికి రూ.10,900 చొప్పున, కొంత మందికి రూ.9 వేల చొప్పున జమ చేసింది. అదేమని ప్రశ్నిస్తే వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పడతాయంటూ సచివాలయ సిబ్బందితో చెప్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాపితంగా విద్యాహక్కు చట్టంలో భాగంగా అర్హత కలిగిన చిన్నారులకు ప్రభుత్వం ఉచితంగా ఆయా సమీప ప్రైవేటు విద్యాసంస్థల్లో సీట్లు కేటాయించింది. ఆ చిన్నారులకు తల్లికి వందనం పథకాన్ని నిలిపివేసింది. తల్లికి వందనం నగదు కోసం అర్హులకు తప్పని ఎదురుచూపులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 70 వేల మందికి అందని నగదు సచివాలయాల్లో బారులు తీరి అర్జీలుసమర్పించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్లో జరిగే స్పందనలోనూ అధికారులకు అందిన దరఖాస్తులు పాఠశాలల ఎదుట ధర్నాలకుదిగుతున్న తల్లిదండ్రులు పాఠశాలల ఎదుట ధర్నాలకు దిగుతున్న తల్లిదండ్రులు సచివాలయాల్లో వందలాదిగా దరఖాస్తులు తల్లికి వందనం పథకానికి అర్హత ఉండి నగదు జమ కాని విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమీప వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులంతా సమీప సచివాలయాల్లో, ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరుగుతున్న స్పందన కార్య క్రమంలో దరఖాస్తులు చేసుకున్నారు. కలెక్టర్లకు వస్తున్న దరఖాస్తులను డీఈఓ కార్యాలయాలకు పంపిస్తున్నారు. సచివాలయాల్లో వచ్చిన దరఖాస్తులను సెక్రటరీలు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే వాటికి స్పందించి పథకం అమలవుతున్న తీరు మాత్రం ఎక్కడా కనపడటం లేదు. అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని ఆందోళనలు చేపడుతున్నారు. మైలవరంలోని నారాయణ విద్యాసంస్థ హెచ్ఎం కార్యాలయం వద్ద సోమవారం తల్లిదండ్రులు బైఠాయించారు. తమకు ఎందుకు పథకం అమలు కాలేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో చాలా విద్యాసంస్థల్లో ఈ విధమైన ఆందోళనలు జరిగాయి. ఆయా పాఠశాలల యజమాన్యాలు తల్లిదండ్రులను డీఈఓ కార్యాలయాలకు, సచివాలయాలకు వెళ్లి నిలదీయాలంటూ పంపించి వేస్తున్నారు. -
ఘాటు తగ్గిన సాగు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎర్ర బంగారంగా పేరు పొందిన మిరప సాగుకు రైతులు దూరమవుతున్నారు. అసలు ఆ పంట పేరు చెబితేనే వణికిపోతున్నారు. ధర భారీగా పతనం కావడమే ఇందుకు కారణం. ఒకప్పుడు క్వింటా ధర గరిష్టంగా రూ.25 వేలకు చేరింది. ఆ తర్వాత అమాంతం రూ.8 వేలకు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పెట్టుబడి ఖర్చులు రాకపోగా అప్పుల్లో కూరుకుపోయారు. కోల్డ్ స్టోరేజ్ల్లో పంట నిల్వ చేసిన రైతులు అద్దె, వడ్డీల భారంతో అల్లాడుతున్నారు. మిర్చి ధర పూర్తిగా పతనం కావడంతో ఈ ఏడాది ఆ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు ఈ సారి సుబాబుల్, పత్తి సాగు వైపు మళ్లారు. దీంతో మిరప నారు కొనేవారు లేక నర్సరీల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. రూ.15 వేల ధర వస్తేనే గిట్టుబాటు ఎన్టీఆర్ జిల్లాలో ఏటా మెట్ట ప్రాంతమైన గంపలగూడెం, వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో, చందర్లపాడు, నందిగామ, వీరులపాడు మండలాల్లో కొంత మేర మిర్చి సాగవుతుంది. గతేడాది జిల్లాలో 14 వేల హెక్టార్లలో రైతులు ఈ పంట సాగు చేశారు. 190 నర్సరీల్లో మిర్చి నారు పెంచేవారు. రైతులు పండించిన పంట నిల్వ చేసుకునేందుకు జిల్లాలో 16 కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో ఉన్నాయి. ఒక ఎకరం మిర్చి సాగుకు దుక్కులు, విత్తనం, నారు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు ఇలా అన్ని కలుపుకొని రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడికి వెచ్చించాల్సి వచ్చేది. కౌలు రైతులకు అదనంగా రూ.50 వేల కౌలు భారం తప్పదు. ఎకరాకు అవసరమైన నారు కొనుగోలుకు రూ.24 వేల నుంచి రూ.28 వేల ఖర్చవుతుంది. ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చి క్వింటా ధర రూ.15 వేలకు పైగా పలికితేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. నాటి ధర నేడేది...? వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24 సంవత్సరంలో క్వింటా మిర్చి ధర గరిష్టంగా రూ.25 వేలు పలికింది. ఈ ధర మిర్చి రైతులకు ఊపు, ఉత్సాహం ఇచ్చింది. కూటమి ప్రభుత్వం హయాంలో ధర పూర్తిగా పతనమైంది. సాధారణ రకం క్వింటా ధర రూ.7 వేల నుంచి రూ.8 వేలు, నాణ్యమైన మిర్చి ధర రూ.11 వేల నుంచి రూ.13 వేలు మాత్రమే పలుకుతోంది. దీంతో స్తోమత కలిగిన రైతులు పండిన పంటను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. కొందరు బాకీల బెడదతో తక్కువ ధరకు విక్రయించారు. దిగుబడి తగ్గడం, ధర పతనం కావడంతో గత ఏడాది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం జిల్లాలోని 16 కోల్డ్ స్టోరేజీల్లో 6.40 లక్షల టిక్కీల మిర్చి నిల్వ ఉంది. మరి కొందరు తెలంగాణలోని కోల్డ్ స్టోరే జీల్లో నిల్వచేశారు. స్టోరేజీల్లో నిల్వ చేసిన రైతులకు అద్దె భారంగా మారింది. 35 కిలోల టిక్కీకి ఆరు నెలలకు రూ.170 వరకు అద్దె వసూలు చేస్తున్నారు. ఏటా కోల్డ్ స్టోరేజ్లు రుణాలు ఇచ్చేవి. ఈ ఏడాది రుణాలు ఇచ్చేందుకు నిరాకరించాయి. వీటన్నిటి నేపథ్యంలో ఈ ఏడాది మిర్చి సాగు చేసేది లేదని పలువురు రైతులు తేల్చి చెబుతున్నారు. కౌలు రైతులు మిర్చి సాగు విరమించుకోగా సొంత భూమి ఉన్న రైతులు సుబాబుల్, పత్తి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఉద్యాన వన శాఖ ఈ ఏడాది 11 వేల హెక్టార్లలో మిర్చి సాగవుతోందని అంచనా వేస్తోంది. వాస్తవంలో సగానికి సగం కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మిరప సాగుకు దూరమవుతున్న రైతులు సగానికి సగం తగ్గనున్న సాగు విస్తీర్ణం ధర పతనంతో భయపడుతున్న రైతులు ఆందోళనలో నర్సరీల యజమానులు నర్సరీల్లో తగ్గిన నారుపెంపకం మిర్చి సాగు మానేశా గత ఏడాది సొంత భూమి ఏడు ఎకరాల్లో మిర్చి సాగు చేశా. దిగుబడి, ధర రెండూ లేవు. పెట్టిన పెట్టుబడి రాలేదు. గిట్టుబాటు కాదని, నష్టం భరించలేక ఈ ఏడాది మిర్చి సాగు చేయడం మానేశా. పత్తి, సుబాబుల్ సాగుచేస్తున్నా. – కొండబోలు నారాయణ, రైతు, మక్కపేట మిర్చి సాగుచేయనుగతేడాది మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేశా. దిగుబడి బాగానే వచ్చింది. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత ధర దిగజారింది. క్వింటా రూ.10 వేల చొప్పునే విక్రయించాల్సి వచ్చింది. ఈ ఏడాది మిర్చి సాగు చేయదలచుకోలేదు. – సాంబిరెడ్డి, రైతు, జయంతి ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా వత్సవాయి మండలం మక్కపేటలో మిర్చి నర్సరీలు ఉన్నాయి. ఒక్కో నర్సరీ ఐదు నుంచి పది ఎకరాల్లో మిరప నారు పెంచుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక్కో నర్సరీలో రెండెకరాల్లోనే మిరప నారు పోశారు. మిర్చి మేలు రకం విత్తనాల ధర కిలో రూ.90 వేలు పలుకుతోంది. నారు పెంచేందుకు ఒక్కో నర్సరీకి రూ.లక్షల్లో ఖర్చవుతోంది. ఈ ఏడాది మిర్చి ధర పతనం కావడంతో నర్సరీ యాజమాన్యంలోనూ నిరుత్సాహం నెలకొంది. ఏటా జూన్, జూలై నెలల్లో రైతులు మిరప నారు కోసం నర్సరీల చుట్టూ తిరిగే వారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదని నర్సరీ యజమానులు చెబుతున్నారు. ఏటా మొక్క రూ.2 చొప్పున విక్రయించే వారు. ఈ ఏడాది మొక్క ధర రూపాయి నుంచి రూ.1.40 వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికే పెంచిన నారు అమ్ముడుపోతుందో లేదోనన్న ఆందోళనలో నర్సరీల యజమానులు ఉన్నారు. -
రైతు బజారుల్లో కూరగాయల ధరల బోర్డులు పెట్టాలి
జగ్గయ్యపేట అర్బన్: వినియోగదారుల సౌకర్యార్థ్యం రైతు బజార్లలో కూరగాయల ధరల బోర్డులు ఏర్పా టుచేయాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా సూచించారు. మంగళవారం పట్టణంలోని రైతుబజారును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను సందర్శించారు. తూనికల్లో తేడాలు లేకుండా చూడాలని ఎస్టేట్ ఆఫీసర్ వెంకటరమణను ఆదేశించారు. బలుసుపాడు రోడ్డులో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను జాయింట్ కలెక్టర్ ఇలక్కియా సందర్శించారు. విద్యార్థులకు కల్పించిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. స్టోర్లో బియ్యం, కంది పప్పు తదితర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. ఆర్డీఓ బాలకృష్ణ, తహసీల్దార్ మనోహర్, ఆర్ఐ సూర్యకుమారి, ప్రిన్సిపాల్ కె.లక్ష్మీసుజాత, అధ్యాపకులు పి.కరుణ పాల్గొన్నారు. -
8 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): స్థానిక శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై ఈ నెల ఎనిమిది నుంచి పదో తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఏడో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతి, ఎనిమిదో తేదీ ఉదయం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామి వారికి ఇతర ఉపాయాలలో దేవతా మూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుంది. ఉదయం 9.30 గంటలకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. పదో తేదీ ఉదయం 10.30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మహాదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.8న వరలక్ష్మీదేవిగా దుర్గమ్మ దర్శనంశ్రావణ మాసం మూడో శుక్రవారాన్ని పుర స్కరించుకుని ఎనిమిదో తేదీన దుర్గమ్మ సన్నిధిలో వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయంలో మూలవిరాట్ వద్ద ఆలయ అర్చకులు ఏకాంత సేవగా మాత్రమే వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.మూడు రోజులు సేవలు నిలిపివేతదుర్గగుడిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎనిమిది, తొమ్మిది, పది తేదీల్లో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించే అన్ని ప్రత్యక్ష, పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో నిర్వహించే ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవార్చన, లక్ష కుంకుమార్చన, శాంతి కల్యాణం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తారు. 11వ తేదీ నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు జరిగే అన్ని ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. -
ప్రమాదంలో శ్రీశైలం జలాశయం
గుడ్లవల్లేరు/పెడన: ప్రకాశం బ్యారేజీకి సాగునీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టుకు ఇబ్బంది వస్తే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో తిండి కూడా కరువవుతుందన్నారు. గుడ్లవల్లేరులో మంగళవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. పెడన టీడీపీ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో పాటు సాగునీటి సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. బంటుమిల్లి కాలువ ద్వారా శివారు భూములకు నీరందని పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. సరైనా సమాధానం రాకపోవడంతో ఇరిగేషన్ శాఖ సీఈకి ఫోన్ చేశారు. ఢిల్లీలో ఉన్నానని సీఈ చెప్పడంతో మంత్రి మండిపడ్డారు. ఎగువ పొలాలు ముంపునకు గురవుతున్నాయి, దిగువ పొలాలకు నీరందడం లేదు, ఈ సమస్యలను చక్కదిద్దకపోతే సస్పెండ్ చేస్తానంటూ హెచ్చరించారు. ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ పొట్లూరి రవి, బంటుమిల్లి డీసీ చైర్మన్ బొర్రా కాశీ తదితరులు పాల్గొన్నారు.భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి కోరారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగ ళవారం వివిధ శాఖల అధికారులతో బాలల హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పద్మావతి మాట్లాడుతూ.. తమ కమిషన్తో పాటు అన్ని శాఖలు కలిసి బాలల కోసం రూపొందించిన చట్టాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో బాలల హక్కుల కమిషన్ చేసిన సూచనలు పాటించాలని స్పష్టంచేశారు. బాల్య వివాహాలను అడ్డుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, టీనేజీ ప్రెగ్నెన్సీపై దృష్టిసారించి జిల్లాలో వీటి నియంత్రణకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్, లైంగిక వేధింపుల నివారణ తదితర అంశాల కోసం కమిటీలను నిర్వహించాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమిటీల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తే కమిషన్ తరఫున చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు సంబంధించిన సమస్యల కోసం 1098 లేక 100 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రతి పాఠశాలల్లో క్రీడామైదానాలు, గేమ్స్ అవర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, రక్తహీనత నివారణకు ఐరన్ఫోలిక్ యాసిడ్ మాత్రలను అందించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.చంద్ర శేఖరరావు, ఏఎస్పీ వి.వి.నాయుడు, డీఎస్పీ జి.శ్రీనివాసరావు, డీఈఓ పి.వి.జె.రామారావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహిద్బాబు, గిరిజన సంక్షేమ అధికారి ఎం.ఫణిదూర్జటి, ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.శర్మిష్ట తదితరులు పాల్గొన్నారు. -
ఐపీఎస్కు ఎంపికై న దోనేపూడి విజయ్బాబు
తెనాలి: పట్టణానికి చెందిన దోనేపూడి విజయ్బాబు ఐపీఎస్కు ఎంపికయ్యారు. 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్వీస్లను కేటాయిస్తూ యూపీఎస్ఈ మంగళవారం తుది ఫలితాలను విడుదల చేసింది. 2021 సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్కు ఎంపికైన విజయ్బాబు, ప్రస్తుతం విజయవాడలో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్) బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్కు ఎంపిక కావాలన్న లక్ష్యం కోసం వరుసగా సివిల్స్ పరీక్షలురాస్తూ వచ్చారు. నాలుగో పర్యాయం 681 ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యారు. అయినప్పటికీ తనకు సంతృప్తి లేదన్నారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి అయిన తన తండ్రి దోనేపూడి మధుబాబు కోరిక ప్రకారం ఐఏఎస్ అధికారి కావాలన్నదే తన కలగా విజయ్బాబు చెప్పారు. అందు కోసం మరోసారి సివిల్స్ రాస్తానని తెలిపారు. ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా విధుల నిర్వహణ నాలుగో పర్యాయం సివిల్స్ రాసిఐపీఎస్కు ఎంపిక -
మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డి బెయిల్పై తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమ కేసులో మిథున్రెడ్డి బెయిల్పై ఏసీబీ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ నెల 12న బెయిల్ పిటీషన్పై విజయవాడ ఏబీసీ కోర్టు తీర్పు ఇవ్వనుంది.ముగ్గురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఎక్కడా మిథున్రెడ్డి పాత్ర ఉందని చెప్పలేదని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అసలు లిక్కర్ స్కామే జరగలేదని న్యాయవాది తెలిపారు. ‘‘ఇప్పటివరకు మిథున్రెడ్డిని సిట్ కస్టడీకి కోరలేదు. పీఎల్ఆర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన నగదును తిరిగి మళ్లీ చెల్లించడం జరిగింది. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలి’ అని న్యాయవాది కోరారు. -
డ్రెయినేజీ కార్యాలయంపై ఏసీబీ దాడి
● గుడివాడలో రూ.30 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన జూనియర్ అసిస్టెంట్ గరికిపాటి శ్రీనివాసరావు ● కాంట్రాక్టర్కు డిపాజిట్ సొమ్ము రిలీజ్ చేసే విషయంలో లంచం డిమాండ్ గుడివాడరూరల్: కృష్ణా జిల్లా గుడివాడలో డ్రెయినేజీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. జూనియర్ అసిస్టెంట్, ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్న గరికపాటి శ్రీనివాసరావు ఓ కాంట్రాక్టర్ను రూ.30 వేలు లంచం డిమాండ్ చేశారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు కార్యాలయంపై దాడులు నిర్వహించి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు మీడియాకు వెల్లడించారు. గుడివాడ డ్రెయినేజీ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు కాంట్రాక్టర్ తురక రాజాను రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఆ కాంట్రాక్టర్ డ్రెయినేజీలో కొన్ని వర్కులు చేయగా వాటి బిల్లులు రూ.33 లక్షలు మంజూరయ్యాయి. దానికి సంబంధించి ఒక్క శాతం సొమ్మును కాంట్రాక్టర్ ఇవ్వలేదు. అయితే కాంట్రాక్టర్కు మరొక వర్క్కు సంబంధించి రెండు డిపాజిట్ల సొమ్ము రూ.1.7 లక్షలను రిలీజ్ చేయాల్సి ఉంది. దానికి రూ.30 వేల లంచం ఇవ్వాలని జూనియర్ అసిస్టెంట్ గరికపాటి శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ తురక రాజా ఏసీబీ అధికారులను ఆశ్రయించారన్నారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజా డ్రెయినేజీ కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు జి.వి.వి.సత్యనారాయణ, ఎం.వి.ఎస్.నాగరాజు, ఎస్ఐ పూర్ణిమ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీపీఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శిగా దోనేపూడి శంకర్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఎన్టీఆర్ జిల్లా జిల్లా కార్యదర్శిగా వరుసగా రెండోసారి దోనేపూడి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 1, 2వ తేదీల్లో జగ్గయ్యపేటలో సీపీఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభ జరిగింది. సోమవారం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మహాసభ తీర్మానాలు దోనేపూడి శంకర్ మీడి యాకు వెల్లడించారు. ఈ మహాసభలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా బుడ్డి రమేష్, జి.కోటేశ్వరరావు, తూము క్రిష్ణయ్య, చుండూరు వెంకట సుబ్బారావు, లంక దుర్గారావు, జూనేబోయిన శ్రీనివాసరావు, పరుచూరి రాజేంద్రబాబు, వై.యలమందరావు, బుట్టి రాయప్ప, చిలు కూరి వెంకటేశ్వరరావు, పంచదార్ల దుర్గాంబ, షేక్ నాగుల్ మీరా, ఎ.శివాజీ, నక్క వీరభద్రరావు, లంకా గోవిందరాజులు, మేకల డేవిడ్ ఎన్నికయ్యారు. శంకర్ మాట్లాడుతూ మహాసభ 10 తీర్మానాలను ఆమోదించిందన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ బుడమేరు తక్షణమే చేపట్టాలని, కట్టలేరుపై వంతెన నిర్మించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. -
సుబ్బారాయుడి సేవలో డెప్యూటీ స్పీకర్
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని శాసనసభ డెప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు సోమవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు పట్టువస్త్రాలతో పాటు స్వామివారి చిత్రపటం, లడ్డూప్రసాదం అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ ఈశ్వరావు, స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. -
‘అమ్మా.. నాన్నా.. బతకాలని లేదు’
ఉయ్యూరు(పెనమలూరు): వరకట్న వేధింపులకు నవవధువు బలైంది. భర్త, అత్తమామల హింస, వేధింపులు తాళలేక తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ఉయ్యూరు పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఉయ్యూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్లో నివాసం ఉంటున్న జూనియర్ కళాశాల లెక్చరర్ వర్రె శ్రీ విద్య(24) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివాహం అయినప్పటి నుంచీ.. మొవ్వ మండలం కొండవరానికి చెందిన శ్రీ విద్యకు కంకిపాడు మండలం కుందేరు గ్రామానికి చెందిన అరుణ్కుమార్తో ఐదునెలల క్రితం వివాహం జరిగింది. అరుణ్కుమార్ కలవపాముల సచివాలయంలో సర్వేయరుగా పనిచేస్తున్నారు. వీరు ఉయ్యూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. శ్రీ విద్య ఉయ్యూరు పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో జూనియర్ లెక్చరర్గా పనిచేస్తోంది. వివాహం అయిన నాటి నుంచి కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. కట్నం తీసుకురమ్మంటూ, అందంగా లేవంటూ తన మాజీ ప్రియురాలి మాదిరిగా లేవంటూ అరుణ్కుమార్ హింసించటం మొదలుపెట్టాడు. భర్తతో పాటు అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయి. మరో మారు గొడవ.. ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. అరుణ్కుమార్ హింసించటం, కొట్టడం చేయటంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీవిద్య ఇంట్లో గొడవ జరుగుతున్న విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసి, ఉయ్యూరులోని సమీప బంధువును ఆ ఇంటికి పంపించారు. శ్రీవిద్య విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ రామారావు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శ్రీవిద్య భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అల్లుడే చంపాడు.. శ్రీ విద్య ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు తమ అల్లుడు కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ రోధించారు. ఈ మేరకు పోలీసులకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపులకు శ్రీవిద్య బలైనట్లు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామారావు తెలిపారు. తమ్ముడూ.. రాఖీ కట్టలేనేమోరా!శ్రీవిద్య సూసైడ్ నోట్ కలకలం సృష్టిస్తోంది. భర్త, అత్తమామలు సాధించిన తీరును ఆ లేఖ తేటతెల్లం చేసింది. ‘అమ్మా.. నాన్నా.. నాకింక బతకాలని లేదు. తాగి వచ్చి.. నా భర్త చిత్రహింసలు పెడుతున్నాడు. తన ప్రియురాలిలా అందంగా లేనంటూ హింసిస్తూ, కొడుతున్నాడు. భరించలేకపోతున్నాను. మీరంటే ఇష్టం. తమ్ముడూ.. నీకు రాఖీ కట్టలేకపోవచ్చేమో? అమ్మా, నాన్నను జాగ్రత్తగా చూసుకో..’ అంటూ శ్రీవిద్య రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో పనిచేసే సహచరులు, కుటుంబ సభ్యులు ఆ లేఖను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వరకట్న వేధింపులకు నవ వధువు బలి -
రాష్ట్రాభివృద్ధిలో ఆప్కాబ్ కీలకపాత్ర
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆప్కాబ్ రాష్ట్రంలోని సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సేవలందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ గవర్నర్ పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఏపీ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) 62వ స్థాపన దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, సహకార ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా స్థాపించిన ఈ బ్యాంకు ఇప్పుడు ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ దేశంలో పెద్ద స్థాయిలో కంప్యూటరైజేషన్ ప్రాజెక్టును పూర్తి చేసిన కొద్ది సహకార బ్యాంకుల్లో ఆప్కాబ్ ఒకటన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడుతి రాజశేఖర్, కమిషనర్ ఆఫ్ కో ఆపరేషన్ అండ్ సహకార సంఘాల రిజిస్ట్రార్ ఎ.బాబు, ఆప్కాబ్ పర్సన్ ఇన్చార్జి వీరాంజనేయులు మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద సహకార డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ అయిన పీఏసీఎస్ కంప్యూటరైజేషన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడంలో ఆప్కాబ్ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సామాన్యులకు దూరం
ఆర్జితం..సిఫారసులు ఉంటేనే ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవాభాగ్యం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఆర్జితసేవాభాగ్యం సామాన్య భక్తులకు దూరమవుతోంది. రికమండేషన్లు ఉంటే చాలు ఆర్జిత సేవలు దరిచేరుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనంతో పాటు సేవల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామని చెబుతున్న ఆలయ అధికారులు, కార్యాచరణలో కానరావడం లేదు. కొన్ని నెలలుగా ఆర్జిత సేవ టికెట్ల విక్రయాలపై ఈవో పేషీ అజమాయిషీ పెరిగిపోవడంతో టికెట్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. ఈవో చాంబర్ లేదా ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు వస్తేనే తప్ప ఆర్జిత సేవా టికెట్లు పొందలేని పరిస్థితి ఎదురవుతోంది. నాడు ఎంతమందికై నా.. నేడు పరిమితం గతంలో ఎంతమంది వచ్చినా ఇచ్చిన ఆర్జిత సేవల టికెట్లను ఇప్పుడు పరిమితం చేశారు. రానున్న దసరా ఉత్సవాల్లో సైతం అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా నిర్వహించి, భక్తుల ఇళ్ల నుంచే సెల్ఫోన్, కంప్యూటర్ల ద్వారా వీక్షించేందుకు యత్నించారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయనే భావనతో దేవస్థానంతో పాటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఖడ్గమాల టికెట్లు కావాలంటే ఈవో పేషీనే! దుర్గమ్మ ఆర్జిత సేవల్లో తెల్లవారుజామున జరిగే ఖడ్గమాలార్చనకు అధిక డిమాండ్ ఉంది. గతంలో ఈ సేవకు పరిమిత సంఖ్యలో టికెట్లను మాత్రమే అనుమతించేవారు. టికెట్ ఖరీదు రూ. 5 వేలు ఉన్నా, డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఒక్కో రోజు 30కి పైగా టికెట్లు జారీ చేసి రెండు షిప్టుల్లో ఈ పూజ నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్లో పది టికెట్లు, ఆర్జిత సేవా కౌంటర్లో మరో పది టిక్కెట్లు విక్రయిస్తారు. ఇక మిగిలిన పది టికెట్లు ఈవో పేషీకే. ఈ పదితో పాటు మరి కొన్ని అదనంగా కావాలన్నా అక్కడి నుంచే సిఫారసు చేయించుకోవాలి. అయితే 30 టికెట్లు విక్రయిస్తున్నా సామాన్య భక్తుడు ఆన్లైన్లో కానీ, దేవస్థాన ఆర్జిత సేవా కేంద్రంలోగానీ టికెట్ పొందాలంటే సాధ్యం కాదు. దాదాపు నెల రోజుల ముందుగా టికెటు కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండవు. ప్రముఖుల నుంచి ఫోన్ చేయిస్తేనే టికెట్ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారుల నుంచి ఫోన్ చేయించేవారు నిమిషాల్లోనే టికెట్ పొందడం విశేషం. దీనికి కేంద్రబిందువుగా ఈవో పేషీ ఉందని దుర్గగుడిలో ప్రచారం జరుగుతోంది. నెల రోజుల ముందు దొరకని టికెట్ ఈవో పేషీలో అడిగితే సేవ కోరిన ముందు రోజు రాత్రికి అందిస్తున్నారు. దుర్గగుడి అధికారుల తీరును ప్రశ్నించే భక్తులకు సీఎం పేషీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల మీద నెపాన్ని నెట్టేస్తున్నారు. సామాన్యులు అడిగితే.. నో భక్తుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు టికెట్లు విక్రయించి అందరికీ క్యూలైన్లో నిల్చునే అవకాశం ఉండేది. కొన్ని రోజులుగా ఆర్జిత సేవ టికెట్లకు కోత విధించారు. నిత్యం మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత దేవస్థాన ఆర్జిత సేవా కౌంటర్తో పాటు సమాచార కేంద్రంలో టికెట్లను విక్రయిస్తారు. టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో ప్రముఖులు, పోలీసు, ప్రజా ప్రతినిధులు సిఫారసులు ఉన్నవారు ముందుగానే ఈ టికెట్లను తీసుకుంటున్నారు. సామాన్య భక్తులు వచ్చి అడిగితే ‘నో టికెట్స్’ అంటున్నారు. అదే ఆలయ ముఖ్య అధికారుల నుంచి ఫోన్ వస్తే పంచహారతుల టికెట్లు లేకున్నా రూ. 500 ఆశీర్వచన టికెట్ ఇచ్చి సేవలోకి అనుమతించడం విశేషం. విశేష పర్వదినాల్లో చండీహోమానికి పరిమితులు అమావాస్య, పౌర్ణమితో పాటు ఇతర విశేష పర్వదినాల్లో చండీహోమం టికెట్లకు ఆలయ అధికారులు పరిమితులు విధించారు. నిత్యం వంద చండీహోమానికి టికెట్లను విక్రయిస్తుండగా, పండుగలు, పర్వదినాల్లోనే దాదాపు ఇదే సంఖ్యలో టికెట్లను విక్రయిస్తున్నారు. ఆలయ కౌంటర్లో 60 టికెట్లు, ఆన్లైన్లో మరో 40 టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయి. అమావాస్య, పౌర్ణమి, ఇతర పర్వదినాలలో టికెట్లు దొరికితే చాలు అనుకునే భక్తులు పదుల సంఖ్యలో ఉంటారు. యాగశాల బయట అరుగులపై కూర్చుని కూడా ఈ సేవలో గోత్రనామాలు చెబితే చాలనుకుంటారు. ఇప్పుడు అధికారుల తీరుతో కనీసం సేవ చేయించుకునే భాగ్యం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్, కౌంటర్లలో అరకొరగా టికెట్లు ఖడ్గమాలార్చన టికెట్లు పేషీ నుంచే...! పంచహారతుల టికెట్లకుతప్పని రికమండేషన్లు విశేష పర్వదినాల్లో చండీహోమానికి ఇదే తీరు పంచహారతుల టికెట్లలో కోత ఇక దుర్గమ్మకు నిర్వహించే నిత్య ఆర్జిత సేవల్లో పంచహారతుల సేవ మరొకటి. నిత్యం సాయం సమయంలో ఆరు గంటలకు అమ్మవారికి పంచహారతులు, వేద స్వస్తి జరుగుతుంది. రూ. 500 టికెటు కొనుగోలు చేసిన భక్తులు సుమారు అరగంట క్యూలైన్లో నిల్చుని అమ్మవారి ముగ్ధమనోహరమైన రూపాన్ని తనివి తీరా వీక్షించే భాగ్యం కలుగుతుంది. దీంతో పంచహారతుల్లో పాల్గొనేందుకు భక్తులతో పాటు ప్రముఖులు నిత్యం ఇంద్రకీలాద్రికి తరలివస్తారు. ఇటీవల ఆలయ ఈవో ఈ పంచహారతుల టికెట్లను 20కే పరిమితం చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఆర్జిత సేవా కౌంటర్లో పది, సమాచార కేంద్రంలో మరో పది టికెట్లు విక్రయిస్తారు. గతంలో ఈ పద్ధతి ఉండేది కాదు. అదిగో.. ఇదిగో.. దాతలు రూ. 5 కోట్లు వెచ్చించి రాతితో నూతన యాగశాల నిర్మాణం చేపట్టినా అందులో మిగిలి ఉన్న పనులను చేయించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు. చైత్రమాసం నుంచి యాగశాలలో చండీహోమం నిర్వహణ అదిగో... ఇదిగో అంటూ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సైతం ఆలయ ఇంజినీ రింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు మార్లు నూతన యాగశాలలో హోమాలు జరిపిస్తామని చెబుతున్న దేవస్థాన అధికారులు భక్తుల మనోభావాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. -
● హర్ఘర్ తిరంగా.. ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
దేశభక్తి ఉప్పొంగేలా.. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. హర్ ఘర్ తిరంగా 2025 సందర్భంగా ప్రచార పోస్టర్ను సోమవారం కలెక్టర్ లక్ష్మీశ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ నెల 8వ తేదీ వరకు పాఠశాల, అన్ని విద్యా సంస్థల్లో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ భవనాలను అలంకరించడం విద్యార్థులకు తిరంగా రంగోలి, తిరంగా రాఖీ మేకింగ్ వర్క్ షాప్స్ , తిరంగా వేవ్స్ అండ్ థ్రెడ్స్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 9 నుంచి 12వ తేదీ వరకు తిరంగా మహోత్సవ్ పేరుతో ప్రజాప్రతినిధులు, వీఐపీలు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఇందులో డ్వాక్రా మహిళలతో తిరంగా కలర్ థీంతో ప్రత్యేక తిరంగా మేళా నిర్వహిస్తామని తెలిపారు. హర్ ఘర్ తిరంగా సెల్ఫీ బూత్లను ఏర్పాటు చేసి, ఫొటోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. తిరంగా బైక్ ర్యాలీలు, సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని భవనాలు, డ్యామ్లను అలంకరించి జెండా ఎగరవేయడానికి సిద్ధం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, యువజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, డీఎంఅండ్హెచ్ఓ సుహాసిని తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
తిరువూరు: మండలంలోని వావిలాలలో కుటుంబ సమస్యల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు మండలం వావిలాల శివా రు రాజుగూడెంకు చెందిన చాట్ల వెంకటేష్(50)కి ఇద్దరు కుమార్తెలు కాగా చిన్న కుమార్తె విజయవాడలో నర్సింగ్ కోర్సు చదువుతోంది. కుమార్తెకు తోడుగా వెంకటేష్ భార్య లక్ష్మి కూడా విజయవాడలో నివసిస్తోంది. ఆమెను రాజుగూడెం రావలసిందిగా పలుమార్లు ఒత్తిడి చేసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురై వెంకటేష్ పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన వెంకటేష్ను సోమవారం ఉదయం గమనించిన స్థానికులు తిరువూరు ప్రైవేటు నర్సింగ్హోంకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గవర్నర్పేట ఓల్డ్ కంట్రోల్ రూం వద్ద జరిగింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఓల్డ్ కంట్రోల్ రూం వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె కర్నాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లా తులగిరికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతురాలు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెంది ఉండొచ్చని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు గవర్నర్పేట స్టేషన్(0866 2576023)లో సంప్రదించాలని కోరారు. -
నిర్ణీత గడువులో అర్జీలకు పరిష్కారం
● కలెక్టర్ లక్ష్మీశ ● పీజీఆర్ఎస్కు 147 అర్జీలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలనుంచి అందే అర్జీలకు నిర్ణీత గడువులో పరిష్కారం చూపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదయ్యే అర్జీలు పెండింగ్ లేకుండా సకాలంలో పరిష్కరించాలని తెలిపారు. అధికారులు ప్రతి రోజూ పీజీఆర్ఎస్ పోర్టల్ లాగిన్ అయి వారి శాఖ అర్జీలను పరిశీలించాలని, రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. అర్జీలను అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు అర్జీదారులతో మర్యాదగా మాట్లాడాలని, సవివరమైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని, గడువు లోపలే అర్జీలకు పారదర్శకమైన సమాధానాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. -
రాష్ట్ర జట్టుకు ‘సిద్ధార్థ’ విద్యార్థినులు
పెనమలూరు: కానూరు సిద్ధార్థ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ విద్యార్థినులు రాష్ట్ర ట్రాంపోలిన్ మహిళా వ్యక్తిగత విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఫిజికల్ డైరెక్టర్ రఘు తెలిపారు. ఆయన సోమవారం వివరాలు తెలుపుతూ తమ కాలేజీకి చెందిన క్రీడాకారిణిలు ఎస్.ప్రగ్న, వి.నీలవేణి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారన్నారు. జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఉత్తరా ఖండ్లో జరిగేజాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వైస్చాన్సలర్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ క్రీడాకారులను అభినందించారు. -
నిర్లక్ష్యానికిదే ‘సాక్ష్యం’!
జగ్గయ్యపేట: కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. అంగన్ వాడీలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన పథకం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు దృశ్య రూపంలో ఆటపాటలు, ఇంగ్లిష్, తెలుగు పదాల వంటి విద్యాపరమైన విషయాలు.. పౌష్టికాహార విలువలు, ఆరోగ్య సూత్రాలు, తదితర అంశాలపై అవగాహన కల్పించటమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తల శిక్షణతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహించటానికి కేంద్ర ప్రభుత్వం ‘సాక్ష్యం’ అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసింది. ఈ కేంద్రాలకు స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. అయితే వాటిని కేంద్రాలలో అమర్చకపోవటంతో నిరుపయోగంగా పడి ఉంటున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు కనీసం స్పందించటం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు స్మార్ట్ టీవీలను కేటాయించిన విషయం కనీసం కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు కూడా తెలియకపోవటం గమనార్హం. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ రూరల్, అర్బన్ ప్రాంతాలలో 1,475 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో సొంత భవనం కలిగి ఉండి ప్రహరీ, మరుగుదొడ్లు, కిచెన్ నర్సరీలతో పాటు పూర్తి స్థాయిలో చిన్నారులకు ఆట వస్తువులున్న కేంద్రాలకు ‘సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ 2.0’ పథకం కింద జిల్లా వ్యాప్తంగా 440 కేంద్రాలను ఎంపిక చేసింది. ఇందులో జగ్గయ్యపేట 61, నందిగామ 121, తిరువూరు 85, మైలవరం 115, విజయవాడ రూరల్, అర్బన్ ప్రాంతాలలో 37 చొప్పున అంగన్వాడీ కేంద్రాలను ఎంపిక చేసి స్మార్ట్ టీవీలను పంపిణీ చేసింది. అయితే కేంద్రాలకు టీవీలు వచ్చి పక్షం రోజులు గడుస్తున్నప్పటికీ నేటికీ కేంద్రాలలో వాటిని అమర్చకపోవటంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో టీవీ రూ.30వేలకు కొనుగోలు చేసి మరీ సరఫరా చేసింది. కొన్ని కేంద్రాలలో టీవీలను అమర్చినా నెట్ సౌకర్యం లేక వినియోగించడం లేదు. నెట్ సౌకర్యం లేదు.. కేంద్రాలకు టీవీలను మంజూరు చేసినప్పటికీ నెట్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలి. అయితే ప్రస్తుతం కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో పాటు కొన్ని కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉండటంతో పాటు విద్యుత్ సరఫరాకు అనుమతిస్తారో లేదోనని అంగన్వాడీలు సంశయిస్తున్నారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం పలు సర్వేలను కేటాయించటంతో అదే పనిలో ఉంటున్నారని పిల్లలను సరిగా పట్టించుకోకపోవటంతో పిల్లలను పంపేందుకు కూడా ఆందోళన చెందాల్సి వస్తోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించినా అందిపుచ్చుకోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపయోగంగా అంగన్వాడీ కేంద్రాలలో స్మార్ట్ టీవీలు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 440 కేంద్రాలకు మంజూరు ఒక్క టీవీనీ కేంద్రాల్లో ఉపయోగించని వైనం పట్టించుకోని అధికారులు టీవీలను అమర్చుతాం.. అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన స్మార్ట్ టీవీలను వీలైనంత త్వరగానే అమర్చుతాం. కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో వసతులు లేకపోవటంతో టీవీల ఏర్పాటులో జాప్యం జరిగింది. కేంద్రాల మరమ్మతులకు కూడా నిధులు మంజూరయ్యాయి. వాటిని కూడా చేపడతాం. – రుక్సానా, పీడీ, మహిళా శిశు సంక్షేమ శాఖ -
రైతులను నట్టేట ముంచుతున్నారు
● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ● అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో కలిసి రైతు సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డుపై పోసే పరిస్థితులు కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో కలిసి దేవినేని అవినాష్ రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎన్టీఆర్ కలెక్టర్ జి.లక్ష్మీశను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ జిల్లాలో ఏడాదిగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలు తట్టుకోలేక పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను కలెక్టర్కు వివరిస్తే, అవి ఆయనకే తెలియక పోవడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టించిందని, దళారుల నుంచి బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతుల కోసం ఎక్కడికై నా వెళ్లి పోరాడతామని కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ చెప్పిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యూరియా ఎంత ఉపయోగమో వివరించాం పంటకు యూరియా ఎంత ఉపయోగమో కలెక్టర్కు వివరించామని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ అమలు కావడంలేదని తెలియజేశామన్నారు. ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో చెప్పామన్నారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తామని మాట తప్పారని, ఏ రైతూ ఆనందంగా లేరన్నారు. ఎంత సప్లై చేస్తున్నారు, ఎండ డిమాండ్ ఉందో తెలియజేయాలన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి రైతుకూ న్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు. పాలకులు తీరు మార్చకోపోతే రైతుల తరఫున పోరాడతామని హెచ్చరించారు. రైతుల నుంచి ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని కలెక్టర్ చెప్పటం దారుణమన్నారు. ఆయనతో కూడా ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోందని తెలిపారు. యూరియా దళారుల ద్వారా వెళ్తోందని, దమ్ముంటే చర్యలు తీసుకోండన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అటవీ భూములు, అసైన్ట్ భూములు సాగు చేసిన వారికి కూడా రైతు భరోసా ఇచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. రైతుల తరఫున పోరాడతాం మొవ్వ: రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే వారి తరఫున పోరాడేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. మొవ్వలో తహసీల్దార్ కార్యాలయానికి కై లే అనిల్ కుమార్, నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి వెళ్లి సోమవారం తహసీల్దార్ మస్తాన్కు వినతి పత్రాన్ని అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఎరువుల కొరతను, ప్రైవేటు ఎరువుల దుకాణదారులు చేస్తున్న దోపిడీని తహసీల్దార్కు వివరించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత పెద్ద ఎత్తున ఉన్నా సీఎం, డీసీఎం, మంత్రి లోకేష్, వ్యవసాయ శాఖ మంత్రిగాని నోరు మెదపక పోవడాన్ని కై లే అనిల్ కుమార్ ఖండించారు. ఎంపీపీ కొండేటి ఇందిర, జెడ్పీటీసీ రాజులపాటి పార్వతి, పార్టీ మండలాధ్యక్షులు రాజులపాటి రాఘవరావు, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మంద శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు 84 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన గ్రీవెన్స్కు 84 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 45మంది ఫిర్యాదు చేయగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 2, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరా లపై 5, దొంగతనాలకు సంబంధించి 5, ఇతర చిన్న వివాదాలకు సంబంధించి 17 కలిపి మొత్తం 84 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. -
విజయవాడ నుంచి కాదు.. ఇక కాకినాడ నుంచి!
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): అధిక లాభాలు తెచ్చే బస్సు సర్వీసును వేరే డిపోకు బదలాయింపు చేసిన ఆర్టీసీ ఉన్నతాధికారులపై ప్రయాణికులతోపాటు సంస్థ కార్మికులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. 15 ఏళ్లుగా విజయవాడ ఆటోనగర్ డిపో నుంచి చైన్నెకు రోజూ రెండు సర్వీసులు నడుపుతున్నారు. ఈ బస్సులకు మంచి ఆదాయమే వస్తోంది. వారం క్రితం కాకినాడలో జరిగిన ఓ సమావేశంలో అక్కడి ప్రజలు చైన్నెకు బస్సు సర్వీసు నడపాలని రవాణాశాఖ మంత్రిని కోరారు. దీనికి ఆ మంత్రి స్పందించి కాకినాడ నుంచి చైన్నెకి బస్సులు నడపాలని ఆర్టీసీ ఆర్ఎంతో పాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆటోనగర్ డిపో నుంచి నడుస్తున్న చైన్నె బస్సు సర్వీసును ఇక్కడి నుంచి కాకినాడకు బదిలీ చేశారు. ఇది సరికాదు: ఎన్ఎంయూ ఈ నిర్ణయాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు విమర్శిస్తున్నారు. అవసరమైతే కాకినాడ – చైన్నెకు అదే డిపో నుంచి ఇంకొక సర్వీస్ను నడపాలని సూచించారు. ఎన్ఎంయూ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ ఆర్ఎం దానంకు ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించారు. రోజు ఉదయం 6.30 గంటలకు 3727 సర్వీసు నంబరు బస్సు, సాయంత్రం 7.30 గంటలకు 4060 సర్వీసు నంబరు బస్సు చైన్నెకి రాకపోకలు సాగిస్తున్నాయి. సాయంత్రం వెళ్లే బస్ను కాకినాడ డిపోకు బదిలీ చేసేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు చైన్నె సమీపంలోని గుమ్మడిపూడి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వారు ఈ బస్సు సర్వీసుల్లోనే తరచూ ప్రయాణిస్తుంటారు. తమకు సౌకర్యవంతంగా ఉన్న బస్సును కాకినాడకు బదిలీ చేయడంపై ఆ విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.15 ఏళ్ల చైన్నె బస్సు సర్వీసు కాకినాడ తరలింపుపై కలకలం -
రూ. 11 కోట్ల నగదు స్వాధీనం కేసు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు
విజయవాడ: సిట్ జప్తు చేసిన రూ. 11 కోట్లు అంశానికి సంబంధించి నేడు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాచవరం ఎస్బీఐలో ఆ నగదును ఎప్పుడు డిపాజిట్ చేశారో తేదీ, సమయం తెలిపాలని కోర్టు ఆదేశించింది. నగదు జమ రశీదులకు సంబంధించి వీడియో, ఫోటో క్లిప్పింగ్స్ అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం బ్యాంకుకు ఈ నగదు పంపించేముందు తీసిన ఫోటోలు లేదా పంచనామాలు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: బేతాళ కుట్రలో మరో అంకం -
లిక్కర్ కేసు.. వెంకటేష్ నాయుడు పచ్చదొంగే!
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో సీహెచ్ వెంకటేష్ నాయుడి గురించి ఎల్లో మీడియా, ఆ పార్టీల అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు జరుపుతున్న ప్రచారం గురించి తెలిసిందే. అయితే అది విషప్రచారమని, అతను టీడీపీ మనిషేనన్న విషయం ఇప్పుడు ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా లిక్కర్ డ్రామా బెడిసి కొడుతూనే ఉంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో ఆ కేసు నిందితుడు(A-34) వెంకటేష్ నాయుడికి సాన్నిహిత్యం ఉందన్న విషయం బట్టబయలైంది. చంద్రబాబు, లోకేష్, చంద్రబాబు బావమరిది బాలకృష్ణతోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆదివారం నుంచి.. ఈ కేసులో కీలక నిందితుడు సీహెచ్ వెంకటేశ్ నాయుడు గడిపిన విలాసవంత జీవితానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు మరికొన్ని విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు, సినిమా తారలతో కలిసి ప్రత్యేక విమానంలో వెళ్తున్న ఫొటోలు, అత్యంత ఖరీదైన కార్లలో షికార్లు చేస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి. అదే సమయంలో వెంకటేశ్కు వైఎస్సార్సీపీ నేతలతోనూ సంబంధాలు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.టీడీపీ, ఎల్లో మీడియా ఏపీలో లిక్కర్ కుంభకోణం డ్రామాను ఎంత రసవత్తరంగా సాగదీస్తున్నాయో తెలిసిందే. సిట్ ఏర్పాటు మొదలు.. నోట్ల కట్టలు వీడియో సృష్టించి వైఎస్సార్సీపీ నేతలపై బురద చల్లుతోంది చూస్తున్నదే. అయితే వెంకటేష్ నాయుడు పచ్చదొంగే అని నిరూపించే సాక్ష్యాలు బయటకు రావడంతో.. ఎల్లో మీడియా అడ్డంగా బుక్కైనట్లు స్పష్టం అవుతోంది.టీడీపీ నాయకులతోనే సంబంధాలువెంకటేశ్ నాయుడికి తొలి నుంచీ టీడీపీ అధినేత చంద్రబాబుతో మంచి సంబంధం ఉంది. గతంలో పలుమార్లు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లతో కలిసి వెంకటేష్ ఫొటోలు దిగాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతోనూ దగ్గరి సంబంధాలు నడిపించినట్లు తెలుస్తోంది. -
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడివాడ రామస్వామి అన్నారు. స్థానిక ఎన్జీవో హోమ్లో పెన్షనర్లతో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెన్షనర్ల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయటం లేదన్నారు. పెండింగ్ డీఏలతో పాటు పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వీవీ సుబ్బారావు, పెన్షనర్ల సంఘం నాయకులు ఏవీఎస్ ప్రసాద్, బి శంకర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.బులియన్ మర్చంట్స్ అధ్యక్షుడిగా కోనా శ్రీహరివన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోనా శ్రీహరి సత్యనారాయణ ఎన్నికయ్యారు. అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 15 మందితో కూడిన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత సమావేశంలో వివిధ కారణాలతో మరణించిన సభ్యులకు సమావేశం నివాళులర్పించింది. అధ్యక్షుడిగా కోనా శ్రీహరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా పిన్నెంటి రామారావు, ప్రధాన కార్యదర్శిగా కేఎస్ఆర్ నాయుడు, కోశాధికారిగా రామానాథం కృష్ణబాబు, సహాయ కార్యదర్శిగా మిరియాల డూండేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా మండే పూడి ఆనందకుమార్, కిషోర్గెల్డా, ఎస్కే ఠాగూర్, వై. చలంబాబు, మహంతి సూర్యనారాయణ, ఎస్. అనీల్కుమార్, కె. ఉమాశంకర్, సీహెచ్ శ్రీనివాసరావు, వి. కేశవరావు, పి. సాంబశివరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌరవాధ్యక్షుడు జవ్వాది సూర్యనారాయణ (రుద్రయ్య) నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు.హెచ్ఎంల సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్ఉయ్యూరు: కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం నూతన అధ్యక్షుడిగా తాడంకి జెడ్పీ పాఠశాల హెచ్ఎం వైఎస్ఎన్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఉయ్యూరు జెడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల సంఘం కౌన్సిల్, జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆమోదించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.జగదీశ్వర్రావు, అధ్యక్షుడిగా వైఎస్ఎన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొమ్మా విజయ్, కోశాధికారిగా కేబీఎన్ శర్మ, మహిళా కార్యదర్శులుగా కె.అనిత, ఎం. సుమలత, మునిసిపల్ ప్రతినిధిగా శోభారాణి, ఎయిడెడ్ స్కూల్స్ ప్రతినిధిగా సూర్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లుగా డేవిడ్ రత్నరాజు, మోమిన్, సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. మచిలీపట్నం డివిజన్ అధ్యక్షుడిగా ఏవీ రమణ, ఉయ్యూరు డివిజన్ అధ్యక్షుడిగా టీవీ నాగేశ్వరరావు, గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా వి. సురేష్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి.వెంకటేశ్వరరావు, హెడ్క్లస్టర్ కార్యదర్శిగా ఎన్వీ శ్రీథర్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఎన్వీ రమణ, ఈఎల్సీ కేశవరావు వ్యవహరించారు. -
అందని నీళ్లు.. ఆగని కన్నీళ్లు
● కోడూరు మండలం పిట్టల్లంకలో వాటర్ ట్యాంకు నుంచి భావిశెట్టివారిపాలెం వరకూ వెళ్లే పంటబోదుని రూ.25వేలు చందాలు వేసుకుని రైతులు ఇటీవలే పూడిక తీయించుకున్నారు. అయినా ఈ బోదుకు నీరక్కెడం లేదు. ఈ పంటబోదు కింద పోసిన నారుమళ్లను బతికించుకునేందుకు ఇక్కడి రైతులు గుల్లపంపు, ఇంజిన్లతో ప్రతిరోజూ నీరు తోడుకుంటున్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతుంటే పంటకాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణానదికి నీరు వదలడం పట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. అవనిగడ్డ: కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్లో 1.62 లక్షల హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 92వేల హెక్టార్లలో వరినాట్లు పూర్తి అయినట్టు అధికారులు చెబుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో చాలాచోట్ల సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడూరు మండలం పిట్టల్లంక, సాలెంపాలెం, నారేపాలెం, వేణుగోపాలపురం, నాగాయలంక మండలంలో బర్రంకుల, నాలి, గణపేశ్వరం, పర్రచివర, సొర్లగొంది. దీనదయాల్పురం, దిండి, గుల్లలమోద, ఏటిమొగలో నారుమళ్లకు నీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటకాలువకు సరఫరా అవుతున్న అరకొర నీటిని గుల్లపంపు, ఆయిల్ ఇంజిన్ల ద్వారా నారుమళ్లను తడుపుకుంటున్నారు. మండే ఎండల వల్ల ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఆకుమడికి నీరు తోడాల్సి వస్తోందని రైతులు చెప్పారు. నారుమడి దగ్గర నుంచి దమ్ము చేసే వరకూ ఆయిల్ ఇంజిన్కు ఎకరాకు రూ.5వేల వరకూ ఖర్చులు అవుతున్నాయని కొంతమంది రైతులు తెలిపారు. ఎండిపోతున్న వరిదుబ్బులు.. కృత్తివెన్ను మండలం చినపాండ్రాక, నీలిమూడి, మునిపెడ, యండపల్లి, చెరుకుమిల్లి గ్రామాల్లో రైతులు తీవ్ర స్థాయిలో సాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. నీలిపూడి, మునిపెడ, చినపాండ్రాకలో సాగునీరందక పలుచోట్ల నాట్లు వేయలేదు. నారుమళ్లు ముదిరిపోతున్నాయని, ఇంకో వారం పదిరోజులు సాగునీరందకపోతే నాట్లు వేసేందుకు నారు పనికిరాదని కొంత మంది రైతులు చెప్పారు. మచిలీపట్నం మండలంలోని తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం, గోకవరం, మంగినపూడి, మొవ్వ మండలంలోని వేములమడ, కొండ వరంలో సాగునీరు అందక నాట్లు వేసిన వరిదుబ్బులు ఎండిపోతున్నాయి. కోడూరు మండలం పిట్టల్లంకలో నారుమడికి గుల్లపంపుతో నీరు తోడుతున్న రైతు బంటుమిల్లిలో రైతుల ధర్నా.. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో సీపీఎం రైతు సంఘం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు చెందిన రైతులు సాగునీటి కోసం శనివారం ధర్నా చేశారు. బంటుమిల్లి ప్రధాన పంటకాలువతో పాటు అనుబంధ కాలువలకు పదిరోజుల నుంచి సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు చెప్పారు. కృష్ణానదికి వందలాది క్యూసెక్కులు సాగునీరు వృథాగా వదులుతున్నారని, పంటకాలువలకు పూర్తిస్థాయిలో ఎందుకు వదలడం లేదని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణాజిల్లాలో చాలా ప్రాంతాలకు అందని సాగునీరు బంటుమిల్లిలో నీటి కోసం రైతుల ఆందోళన దివిసీమలో గుల్లపంపు, ఇంజిన్లతో నారుమళ్లకు నీటి తడులు కృత్తివెన్ను మండలంలో పలుచోట్ల ఎండుతున్న వరి మూడు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ నుంచి 3.18లక్షల క్యూసెక్కులు సముద్రం పాలు కాలువలకు నీరివ్వకుండా సముద్రంలోకి వదలడంపై రైతుల ఆందోళన వృథాగా సాగరంలోకి.. పంటకాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేని అధికారులు, కృష్ణా నది నీటిని వృథాగా సముద్రంలోకి వదలడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల పంటకాలువలకు పూర్తిస్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. దీంతో 20 నుంచి 30 శాతం తక్కువ సాగునీరు సరఫరా అవుతోందని రైతులు చెప్పారు. ప్రకాశం బ్యారేజీ నుంచి మూడు రోజులుగా 3.10లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పంటకాలువలకు సాగునీరు వదిలేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో దందాల పర్వం
అంతా తానే అవుతూ.. ఫేక్ లెటర్ల వెనుకా ఇతనే! సాక్షి ప్రతినిధి, విజయవాడ: లాబీయింగ్లో లాలూచీ పర్వాల్లో మచిలీపట్నం పార్లమెంట్ ముఖ్యనేతది అందెవేసిన చెయ్యి! అయితే ఆయనకు రైట్ హ్యాండ్గా చెప్పుకొనే ఓ అనుచరుడు దందాల్లో ఆ ముఖ్యనేతనే మించిపోయారు. చిల్లర దొంగతనాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాల నుంచి, రేషన్ బియ్యం అక్రమ రవాణా వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దందాల్లో ఘనాపాటి వ్యవహార శైలిని చూసి టీడీపీ, జనసేన శ్రేణులే ‘శివ.. శివా..’ అంటూ నివ్వెరపోతున్నాయి. గ్యాంగ్తో సెటిల్మెంట్లు.. రౌడీలు, గంజాయి బ్యాచ్, మర్డర్ కేసుల్లో ముద్దాయిలు, నేరప్రవృత్తి గల వారితో నియోజకవర్గాల్లో ప్రత్యేక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని, సెటిల్మెంట్లు చేయడంలో సిద్ధహస్తుడిగా ఆ అనుచరుడికి పేరుంది. దొంగతనం కేసుల్లో పట్టుబడిన వారిని పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. ఆ కేసుల నుంచి తప్పించడం, ఫేక్ లెటర్లతో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కరెంటు బిల్లు చెల్లించేందుకు అష్ట కష్టాలు పడిన ఇతను.. ఇప్పుడు అపర కుబేరుడిగా మారటం వెనుక అన్ని రకాల దందాలు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న తాజా సంఘటనల్లోనూ ఇతని పేరు తెరపైకి వచ్చింది. తనకు కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలు అందరితో సాన్నిహిత్యం ఉందని, తన మాటకు తిరుగే లేదని.. తాను ఎంత చెబితే, పార్లమెంటు మఖ్యనేత అంతే అంటాడని ప్రచారం చేసుకొంటూ, బరితెగించి దోపిడీకి పాల్పడుతున్నట్లు పార్టీ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. మైనర్ల దొంగతనాల కేసులోనూ.. ఇటీవల మైనర్ల దొంగతనాల కేసులో సైతం ఓ జనసేన నాయకుడిని పట్టు పట్టి కేసు నుంచి తప్పించినట్లు బందరులో జోరుగా చర్చ సాగుతోంది. చల్లపలిల్లో ఆక్రమించుకొన్న భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి, రికార్డులు సృష్టించినట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు పరిధిలో భూ వివాదాల్లో తలదూర్చడం, ప్రైవేటు సైన్యంతో భయోత్పాతం సృష్టించి సెటిల్మెంట్లు చేస్తూ, రూ. కోట్లు కాజేస్తున్నట్లు తెలుస్తోంది. బియ్యం మాఫియాలో ప్రధాన భూమిక.. ధాన్యం సేకరణలో రైతుల పేర్లతో ధాన్యాన్ని సేకరించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి, వాటి స్థానంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి, కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద ప్రభుత్వానికి ఇచ్చి కోట్ల రూపాయలు దండుకొన్నారు. ఈ మాఫియాలో మిల్లర్లను సిండికేట్ చేయడం, అధికారులను ఇబ్బందులు లేకుండా చూడటంలో ముఖ్యనేత అనుచరుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులకు ముడుపులు ఇవ్వడం కోసం మిల్లర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలోనూ సగం కాజేస్తున్నారని సమాచారం. మిల్లర్లను రెండు వర్గాలుగా చీల్చి, ఆ రెండు వర్గాలను తన చెప్పు చేతల్లో పెట్టుకొని, ధాన్యం సేకరణలో భారీ ఎత్తున కొల్లగొడుతున్నట్లు వినికిడి. తనకు ఉన్న ట్రాక్టర్ల కంపెనీ నుంచి రైతుల పేరుతో రైస్మిల్లుల వారికి అక్రమంగా బిల్లులు క్రియేట్ చేసి ఇచ్చి దండుకొంటున్నట్లు సమాచారం. ఓ ధాన్యం వ్యాపారిపై ఇతను కత్తులతో దాడి చేయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గుడివాడ రైల్వే ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ వద్ద కోటికిపైగా లంచం తీసుకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలో కేడీసీసీ బ్యాంకులో తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. పార్లమెంటు ముఖ్యనేత స్థాయిలో తన జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయాలని గంజాయి బ్యాచ్, రౌడీలతో కూడిన ప్రైవేటు సైన్యానికి హుకుం జారీ చేయడంతో గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, ఉయ్యూరు, పెనమలూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీలతో హంగామా చేశారు. దీనిని చూసిన ఆ పార్లమెంట్ ముఖ్యనేత సైతం నివ్వెరపోయి, ‘ఏంటిరా నాకు పోటీ వచ్చేటట్టున్నావే’ అంటూ చురకలు వేసినట్లు జనసేన వర్గాలు చర్చించుకొంటున్నాయి. గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డల్లో ప్రత్యేక అనుచరగణం రౌడీలు, గంజాయి, నేర ప్రవృత్తి గల వారితో ముఠా ఏర్పాటు ఇటీవల ఫేక్ లెటర్లతో ఉద్యోగాల వెనుక అతడే ఉన్నట్లు అనుమానం రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు అంతా తాను చెప్పినట్లే వింటారని బిల్డప్ ధాన్యం సేకరణలో మిల్లర్లతో కలిసి అడ్డదారులుఇటీవల కృష్ణా జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరుద్యోగ యువత నుంచి, కోటి రూపాయలు వసూలు చేశారు. సంతకాలను ఫోర్జరీ చేసి, సిఫారసు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ముఖ్యనేత అనుచరుడే చక్రం తిప్పినట్లు మోసపోయిన నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక లెటర్లో సంతకం ఫోర్జరీ చేయడానికి అవకాశం ఉంటుందని, 60మందికి పైగా లెటర్లలో ఫోర్జరీ చేయడం సాధ్యం కాదని, దీనిని బట్టి చూస్తే, ఆ ముఖ్య నేతకు కూడా దీనిలో సంబంధం ఉన్నట్లు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు. దీనికితోడు ముఖ్యనేత కార్యాలయంలో పని నుంచి తొలగించామని చెబుతున్న వ్యక్తిని పార్లమెంటు ముఖ్యనేత అనుచరుడు విజయవాడలోని తన వ్యాపార సముదాయాల్లో పనిలో ఉంచుకోవడంపైన ఈ దందాలో అనుచరుడి పాత్ర ఉందనే అనే దానికి బలం చేకూర్చుతోంది. ఆ ముఠాలో మొవ్వ మండలం మువ్వపాలెంకు చెందిన పార్లమెంటు ముఖ్యనేతకు తలలో నాలుకగా మెలిగిన ‘కాకా’లాంటి జనసేన నాయకుడు ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వా లని 8 మంది నిరుద్యోగులు ఇటీవల విజయవాడలోని ఆయన ఇంటి చుట్టుముట్టడం సంచలనం రేపింది. ఆ డబ్బుల్లో కూడా ముఖ్యనేత అనుచరుడికి వాటా ఉన్నట్లు చెబుతున్నారు. -
ఎముకల పటుత్వం తగ్గుతోంది..
లబ్బీపేట(విజయవాడతూర్పు): మానవుల్లో ఎముకల పటుత్వం తగ్గుతోంది. ఎముకల గూడే మనిషి నిర్మాణంగా రూపుదిద్దుకుంటుంది. వడివడిగా అడుగులు పడాలన్నా, చకచకా పనులు సాగాలన్నా ఎముకలే కీలకం. మారుతున్న జీవన విధానం, ఆహార అలవాట్లు ఎముకల పటుత్వంపై ప్రభావం చూపుతున్నాయి. ఎముకలు గుల్లబారడం, కీళ్లు అరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఆగస్టు 4 జాతీయ బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా ఎముకలు పటిష్టగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.. చిన్న దెబ్బకే ఎముకల ఫ్యాక్చర్ ఎముకల పటుత్వం తగ్గిన వారికి చిన్న దెబ్బకే బోన్స్ ఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అంతేకాదు మోకీళ్లు, తుంటెకీళ్లు అరుగుతున్న వారు సైతం ఎక్కువగా ఉంటున్నారు. అందుకు ఎముకలు గుల్లబారడం, విటమిన్ డి లోపంతో పాటు, ఆర్థరైటిస్ కూడా కారణంగా చెబుతున్నారు. ఇవే నిదర్శనం ● పటమటకు చెందిన రమణయ్యకు 55 ఏళ్లు. ఒకరోజు ఇంటి గుమ్మం దాటుతూ ముందుకు పడ్డాడు. తుంటెకీలు విరగడంతో ఆస్పత్రిలో సర్జరీ చేయాల్సి వచ్చింది. ఎముకలు పటుత్వం కోల్పోవడమే కారణంగా తేల్చారు. ● 42 ఏళ్ల భారతికి ఏడాదిగా మోకీలు వద్ద నొప్పి వస్తోంది. ఆస్పత్రికి వెళ్లగా, ఎముకల్లో అరుగుదల ప్రారంభమైందని వైద్యులు తేల్చారు. ఇప్పుడు ఇలాంటి సమస్యలే తలెత్తుతున్నాయి. శారీరక శ్రమ లేకే.. ఒకప్పుడు మహిళలు పిండి రుబ్బడం, దుస్తులు ఉతకడం, బావినీళ్లు చేదడం వంటి ఇంటి పనులతో మహిళలకు వ్యాయామం లభించేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మగ వారిలో సైతం వ్యా యామం ఉండటం లేదు. శరీరానికి సూర్యకిరణాలు తగలకపోవడం వంటి కారణాలతో ఎముకల్లో సాంధ్రత తగ్గిపోతుంది. చిన్నవయస్సు వారిలో పటుత్వం ఉండటం లేదు. పటుత్వం తగ్గడానికి కారణాలివే ● ఆహారంలో తగు పాళ్లలో కాల్షియం, విటమిన్ డి. ప్రొటీన్లు లోపించడం ● నిశ్చల జీవనశైలి (శారీరక శ్రమ లేక పోవడం), మద్యపానం, ధూమపానం ● అధికంగా కాఫీ, శీతలపానీయాలు తాగడం ● అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడటం ● మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ లోపమే కారణం ఏమి చేయాలి ● ఎముకల నిర్మాణంలో కాల్షియం చాలా కీలకం. సాధారణ వ్యక్తులకు 650 మి.గ్రాల కాల్షియం అవసరం. దీనికి పాలు, మజ్జిగ, చీజ్ తగినంత తీసుకోవడం మంచిది. ● మనం తీసుకున్న ఆహారం వంటబట్టడానికి విటమిన్ డి అవసరం. అందుకు ప్రతి రోజూ కాస్త ఎండలో ఉండటం మంచిది. ● అన్నిటి కంటే ముఖ్యమైనది వ్యాయామం. నిశ్చల జీవనశైలిలో ఎముక కండరం మోతాదు చాలా వేగంగా తగ్గిపోతుంది. వ్యాయామం, శారీరక శ్రమతో కాపాడుకోవచ్చు. ● తగినంత ప్రొటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం. గరిష్టంగా మన శరీర బరువులో కేజీకి ఒక గ్రాము ప్రొటీన్ తీసుకోవాలి. మన దేశంలో 0.5 గ్రాము ప్రొటీన్ మాత్రమే తీసుకుంటున్నారు. కాల్షియం, విటమిన్ డి లోపం వల్లే చాప కింద నీరులా ఆస్టియో ఫ్లోరోసిస్ మధ్య వయస్సులోనే కీళ్లు అరుగుతున్న వైనం రోగుల్లో మహిళలే ఎక్కువ నేడు జాతీయ బోన్ అండ్ జాయింట్ డే ఆరోగ్య వంతమైన జీవనశైలి అవసరం ఆరోగ్యవంతమైన జీవనశైలితోనే ఎముకలను పటిష్టంగా ఉంచుకోవచ్చు. కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు, పెరుగు, చేపలు, రాగులు, పండ్లు ఆహారంగా తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయాలి. ధూమ, మద్యపానం, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. మా వద్దకు చిన్న వయస్సులోనే కీళ్ల అరుగుదల ఉన్న వారు వస్తున్నారు. అలాంటి వారికి అత్యాధునిక విధానాలతో కీళ్ల మార్పిడి చేస్తున్నారు. రోబోటిక్ కీళ్ల మార్పిడిని అందుబాటులోకి తెచ్చాం. –డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు -
మాటల్లో కోటలు.. చేతల్లో కోతలు
కంకిపాడు: అన్నదాతల విషయంలో పాలకుల మాటలు కోటలు దాటితే.. చేతల్లో మాత్రం కోతలే అన్న విమర్శలు వస్తున్నాయి. అన్నదాత సుఖీభవ అని ఎన్నికల ముందు ఊదరగొట్టిన పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు క్షేమాన్ని విస్మరించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల వేళ రైతులందరికీ రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని నాడు కూటమి నేతలు గొప్పలు చెప్పారు. కానీ రూ.20 వేలు సొమ్ములో కేంద్రం వాటా రూ.6 వేలతో పాటుగా మొత్తం మూడు విడతలుగా ఇస్తామంటూ కూటమి మాట మార్చేసింది. పథకంలో అర్హుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గించడంతో దుఃఖమే మిగిలిందంటూ అన్న దాతలు వాపోతున్నారు. తగ్గిన అర్హుల సంఖ్య కూటమి ప్రభుత్వం రైతులను ఆది నుంచీ విస్మరిస్తూనే ఉంది. రైతులకు పెట్టుబడి సాయం విషయంలో మాట మార్చిన కూటమి పాలకులు ఇప్పుడు పథకానికి అర్హులైన రైతుల సంఖ్యలోనూ కోత విధించింది. కృష్ణా జిల్లాలో1.74 లక్షల హెక్టార్లలో సాగుకు అనువైన భూమి ఉంది. సుమారు 1.86 లక్షలు మందికి పైగా రైతులు ఉన్నారు. వివిధ కారణాలతో 1,484 మందికి సంబంధించిన ఈకేవైసీ తిరస్కరించారు. 2,300 మందికి పైగా రైతులు పెండింగ్లో ఉన్నట్లు వ్యవసాయశాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్నుదారులు, ఇతరత్రా వారిని మినహాయించి జిల్లాలో 1,34,488 మంది రైతులు ఉన్నారని, 1,30,626 మందిని అర్హులుగా తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.66.93 కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.22.73 కోట్లు వెరసి రూ.89.66 కోట్లు తొలివిడత రైతుల ఖాతాకు చేరాయి. అయితే ఆదాయ పన్ను చెల్లింపులు, ఇతరత్రా కారణాలను సాకుగా చూపి వడపోత ప్రక్రియ ద్వారా అర్హుల సంఖ్య భారీగా తగ్గించడం గమనార్హం. తొలి ఏడాది ఎగనామం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి వరదలు, అకాల వర్షాలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. పరిహారం విషయంలోనూ కోతలు విధించడంలో బాధిత రైతులకు పూర్తి న్యాయం జరగలేదు. ఆఖరికి ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా అన్నదాత సుఖీభవను అమలుచేయలేదు. తొలి ఏడాదిలోనే జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం చూసినా సుఖీభవ సొమ్ము రూ.300 కోట్లు మేర రైతులు నష్టపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ఒకే విడతలో సాయం అందుతుందని రైతులు భావించారు. మూడు విడతలు అంటూ మాట మార్చడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీనికి తోడు చాలా మంది రైతులకు పీఎం కిసాన్ రూ.2 వేలు మాత్రమే జమైందిగానీ, రాష్ట్రం వాటా సొమ్ము రూ.5 వేలు జమకాకపోవటంతో ఇదెక్కడి సుఖీభవ అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యం రైతు సంక్షేమానికి ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే రైతు సంక్షేమంప్రచారంపై ఉన్న శ్రద్ధరైతులపై లేదు కూటమి ప్రభుత్వానికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఒకటి, ఇప్పుడు చేస్తోంది మరొకటి. ఒకే పర్యాయం డబ్బులు విడుదల చేసినట్లయితే పెట్టుబడులకు ఉపయోగపడేది. విడతల వారీగా విడుదల చేయడంతో ప్రయోజనం ఏముంటుంది?. –జంపాన శ్రీనివాసగౌడ్, రైతు, గురజాడ కౌలురైతులకు మొండిచెయ్యి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలు మంది సంఖ్య తగ్గింది. ఆదాయ పన్ను చెల్లింపు, ఇంకేదో కారణాలతో అర్హుల సంఖ్య కుదించారు. కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. ఎన్నికల హామీ మేరకు సాగుదారులందరికీ వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించాలి. కష్టపడి వ్యవసాయం చేస్తున్నందుకు ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉంది. అక్టోబరులో కౌలురైతులకు ఇవ్వడంతో ఉపయోగం ఏంటి?, కౌలురైతులు అప్పులు చేసి, వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుంది. కౌలురైతులకు ఒకేసారి రూ.20 వేలు ఇవ్వాలి. –మాగంటి హరిబాబు, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నదాతకు దుఃఖం రైతు సంక్షేమంలో కూటమి విఫలం పేరుకేమో రూ.20వేలు పెట్టుబడి సాయం మూడు విడతలుగా సొమ్ము అందజేతకు ప్రణాళిక అర్హులైన రైతుల సంఖ్య కుదింపు వైఎస్సార్ సీపీ హయాంలో అన్నదాతకు భరోసా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి బాటలు పడ్డాయి. ఇచ్చినమాటకు అనుగుణంగా రైతులకు రైతు భరోసా సొమ్ము జమ చేసి అన్నదాతలకు అండగా నిలిచింది. జిల్లాలో 2019–20లో 1,31,595 మందికి రూ.108.09 కోట్లు, 2020–21లో 1,44,280 మందికి రూ.110.82 కోట్లు, 2021–22లో 1,50,099 మందికి రూ.115.00 కోట్లు, 2022–23లో 1,52,112 మందికి రూ.118.74 కోట్లు, 2023–24 సంవత్సరానికి అత్యధికంగా 1,56,827 మందికి రూ.122.55 కోట్లు రైతుభరోసా అందించి రైతుపక్షపాత ప్రభుత్వం అని నిరూపించింది. కౌలు రైతులకు కూడా ‘భరోసా’ ఇచ్చింది. -
ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. స్వచ్ఛ విజయవాడ సాధనలో భాగంగా ఆదివారం సాయంత్రం భవానీపురంలోని హరిత బెరంపార్క్లో సంప్రదాయ నృత్య పోటీలను ఆయన మునిసిపల్ కమిషనర్ ధ్యాన చంద్రతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నగరంలోని ఔత్సాహిక నృత్య కళాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయన్నారు. పర్యావరణ పరిరక్షణపై తరచూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహన ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్లాస్టిక్ ఉత్పత్తుల నిషేధంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వివిధ కళారూపాల ద్వారా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా వరుసగా ఐదు ఆదివారాల నృత్య పోటీలు ఇక్కడ జరుగుతాయని తెలిపారు. చివరి ఆదివారం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, మారిటైం బోర్డ్ సీఈఓ ప్రవీణ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ బెరంపార్క్లో నృత్య ప్రదర్శన పోటీలు ప్రారంభం -
కమ్యూనిటీ హాల్స్ పోలీసులకా..!
●క్యాన్సిల్ చేశాం.. ప్రత్యామ్నాయం చూసుకోండి అంటున్న అధికారులు ●విజయవాడ 17వ డివిజన్లో హాల్స్ బుక్ చేసుకున్న వారి ఆవేదన కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజల సౌకర్యార్థం నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ను ప్రజావసరాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు వినియోగించడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల ముందు శుభకార్యాల కోసం బుక్ చేసుకుంటే ఇంకా మూడు రోజులే ఉండగా క్యాన్సిల్ చేస్తున్నాం ప్రత్యామ్నాయం చూసుకోండని చెప్పడంతో ఏమి చేయాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు. రాణిగారితోట 17వ డివిజన్లోని సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఈ నెల 7,9,13 తేదీల్లో శుభకార్యాలు చేసుకునేందుకు స్థానికులు నెల క్రితమే నగదు చెల్లించి బుక్ చేసుకున్నారు. అయితే శనివారం అధికారులు వచ్చి ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇతర జిల్లాల నుంచి వస్తున్న పోలీస్ సిబ్బందికి షెల్టర్ కోసం కమ్యూనిటీ హాల్లను కేటాయించాలని కమిషనర్ ఆదేశించారని బుక్ చేసుకున్నవారు చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని ఆదివారం ఉదయం ఆయా కమ్యూనిటీ హాళ్లకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని తరలించి తమను ఇబ్బంది పెట్టొదని వారు కోరుతున్నారు. -
కాకినాడ రీజియన్లో డీఆర్ఎం ప్రత్యేక తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా ఆదివారం కాకినాడ రీజియన్లో భద్రత, సరుకు రవాణా సామర్థ్యం, సిబ్బంది సంక్షేమంపై సమగ్ర తనిఖీలు చేశారు. కాకినాడ స్టేషన్, కాకినాడ పోర్టు, కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్లను సందర్శించి సరుకు రవాణా నిర్వహణ, భద్రత, సిబ్బంది మౌలిక సదుపాయాలపై తనిఖీలు నిర్వహించారు. ముందుగా కాకినాడ టౌన్లో జరుగుతున్న ఐఓహెచ్ (ఇంటర్మీడియెట్ ఓవర్హాల్) షేడ్ పనులపై అధికారులతో సమీక్షించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం కోచ్ సర్వీసింగ్ కార్యకలాపాను పరిశీలించారు. అనంతరం రన్నింగ్ రూమ్ను పరిశీలించారు. సిబ్బంది సంక్షేమానికి డివిజన్ అత్యంత ప్రాధాన్యమిస్తోందని, రన్నింగ్ రూమ్లో పరిశుభ్రత, పోషకాహారం, డిజిటల్ లాగ్బుక్ వ్యవస్థలను మరింత మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. అక్కడ నుంచి కాకినాడ పోర్టు చేరుకుని గూడ్స్ సైడింగ్, ప్రైవేటు టెర్మినల్స్లలో సరుకు రవాణా నిర్వహణ కార్యకలాపాలపై అక్కడి అధికారులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు డివిజన్ నెట్వర్కులో కీలకమైన సరుకు రవాణా కేంద్రం అని, కేఎస్పీఎస్ సమన్వయంతో యార్డ్ లేఅవుట్, షంటింగ్ నమూనాలు, వేగవంతమైన వ్యాగన్ల నిర్వహణపై సమీక్షించి అధికారులు పలు మార్గదర్శకాలు చేశారు. విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సాంకేతిక ఆధారిత పద్ధతులను అవలంభిస్తూ సురక్షిత రైళ్ల నిర్వహణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల్లో ఆపరేటింగ్, మెకానికల్, కమర్షియల్, భధ్రత విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి
మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సమాజ బాధ్యతగా మిగిలిందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు ఎం.డి. షౌకత్ హుస్సేన్ అధ్యక్షత నిర్వహించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృష్ణా జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తొలుత పి.రాందేవ్ జాతీయ పతాకాన్ని, ఎస్.పార్వతీశం ఎస్టీఎఫ్ఐ పతాకాన్ని, ఎం. ఆరోగ్య స్వామి యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు సమగ్ర శిక్ష పథకాన్ని సమర్థంగా అమలు చేసి బలమైన విద్యావ్యవస్థ నిర్మించాయని, కానీ ఆంధ్రలో మాత్రం చిన్న సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలలు పెరిగాయన్నారు. సమగ్ర శిక్ష పేరుతో విద్యాశాఖకు సమాంతరంగా వ్యవస్థను ఏర్పాటుచేసిన కూటమి ప్రభుత్వ విధానాలు పాఠశాల విద్యను నిర్వీర్యం చేశాయన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రభుత్వం బకాయి ఉన్న రూ.22 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, 12వ వేతన సంఘాన్ని నియమించాలని, డీఏలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ యాప్లను రద్దు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కొత్తగా 14 అంశాలతో కూడిన యాప్లు తీసుకువచ్చారన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు కె.ఎ. ఉమామహేశ్వరరావు, ఎస్.పి. మనోహర్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి. కనకారావు, కోశాధికారి ఎమ్. వరప్రసాద్, కార్యదర్శి టి. సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు మహిళా కూలీ మృతి
●ఇద్దరికి తీవ్ర గాయాలు ●కోడూరు నరసింహపురంలో వరినాట్లు వేస్తుండగా ఘటన కోడూరు: పిడుగుపాటుకు ఓ మహిళా కూలీ పొలంలో మృతి చెందారు. మరో ఇద్దరు మహిళా కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన కోడూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మండలంలోని ఇరాలి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు రోజు మాదిరిగానే ఆటోలో వివిధ ప్రాంతాలకు వ్యవసాయ పనుల కోసం వెళ్లారు. వీరితో కొంతమంది మండల పరిధిలో నరసింహపురం గ్రామ సమీపంలోని పొలాల్లో వరినాట్లు వేసేందుకు వెళ్లారు. కూలీలు వరినాట్లు వేస్తుండగా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. అప్పుడు నరసింహపురం సమీపంలో కూలీలు వరినాట్లు వేస్తున్న ప్రాంతంలో భారీ శబ్దంతో పిడుగు పడింది. పిడుగుపాటుకు వరినాట్లు వేస్తున్న మహిళా కూలీ గంజాల కొండలమ్మ (30) పొ లంలోనే కుప్పకూలింది. కొండలమ్మ పక్కన ఉన్న మరో ఇద్దరు కూలీలు గంజాల జ్యోతి, గంజాల పార్వతి కూడా పడిపోయారు. మృతి చెందిన కొండలమ్మ.. పిడుగుపాటుకు గురైన ముగ్గురు మహిళా కూలీలను స్థానికులు హుటాహుటినా అవనిగడ్డలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే కొండలమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జ్యోతి, పార్వతిలకు తీవ్ర గాయాలు కావడంతో వీరికి చికిత్స చేస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామాలో విషాదఛాయలు అలము కున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కృత్తివెన్ను: కృత్తివెన్ను ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. సంగమూడి గ్రామానికి చెందిన కూనసాని వీరనారాయణస్వామి (55) ఆదివారం చర్చ్లో ప్రార్థనకు వెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి ఇంటికి సైకిల్పై వస్తుండగా కృత్తివెన్ను ప్రధాన సెంటర్లో వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీ కొట్టింది. ఘటనలో నారాయణస్వామి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కమృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం బందరు తరలించారు. మరో ఘటనలో తిరువూరు: చీమలపాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. కృష్ణారావుపాలెం శివారు కేశ్యా తండాకు చెందిన బాణావత్ సంధ్యా నాయక్ కుమారుడు యశ్వంత్(6)తో ద్విచక్రవాహనంపై చీమలపాడు వచ్చారు. అక్కడ తినుబండారాలు తీసుకువచ్చే నిమిత్తం రోడ్డు దాటుతున్న యశ్వంత్ను తిరువూరు నుంచి విజయవాడ వెళ్లే కారు ఢీకొంది. తలకు బలమైన గాయం కాగా బాలుణ్ణి మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సంధ్యానాయక్కు ముగ్గురు కుమార్తెల తర్వాత జన్మించిన యశ్వంత్ మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎ.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి పాలనలో రైతుకు భరోసా ఉండదు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతుల జీవితాలకు భరోసా ఉండదని సీఎం చంద్రబాబు రుజువు చేశారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులపై పగబట్టిందని విమర్శించారు. శనివారం జరిగిన దర్శి పర్యటనలో భాగంగా కూటమి అధికారంలో ఉంటే రైతులకు భరోసా ఉండదని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించడమే నిదర్శనమన్నారు. రైతుభరోసా కింద రైతులకు ఇవ్వాల్సిన లబ్ధిని కూటమి నేతలే దిగమింగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క రైతుకు రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన 7 లక్షల మంది రైతులకు కోట్లాది రూపాయలు నిలిపివేశారని పేర్కొన్నారు. రైతులకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులను సబ్సిడీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టే దిశగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రైతుల కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి సంస్కరణలు అమలు చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. రైతులకు చేయూతనందించేందుకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. శ్రావణ మాస శుభ ముహూర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమంలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించే విశేష కుంకుమార్చనలోనూ ఉభయదాతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అరగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేయడంతో రద్దీ మరింత పెరిగింది. మహానివేదన అనంతరం తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. సర్వ దర్శనంతో పాటు రూ. 100, రూ. 300, రూ. 500 క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఎండ వేడిమి, ఉక్కపోతతో క్యూలైన్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. క్యూలైన్లలో కూలర్లు ఉన్నా వాటికి కేవలం ఫ్యాన్లుగానే వినియోగించడంతో ఆలయ సిబ్బందిని ప్రశ్నించారు. చంటి పిల్లలతో ఉన్న వారు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారు. -
వృద్ధురాలిని బెదిరించి బంగారు గొలుసు అపహరణ
గన్నవరం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి సుమారు మూడు కాసుల విలువైన బంగారు గొలుసును దొంగ అపహరించుకుపోయిన ఘటన ఉంగుటూరు మండలం వెన్నుతలలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. గ్రామంలోని ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఇంటిలో బొమ్మి సింహాచలంతో పాటు ఆమె కుమారుడు, కోడలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు, కోడలు బంధువుల ఊరెళ్లగా శనివారం రాత్రి ఇంటి వెనుక గదిలో ఆమె నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంటి తలుపులు గట్టిగా కొట్టిన అలికిడి విని ఆమె భయపడుతూ తలుపులు తీసింది. అయితే ఎవరూ కనిపించకపోవడంతో తలుపులు తీసి ఉంచి మంచంపై కూర్చుంది. కొద్దిసేపటికి ముఖానికి మాస్కు ధరించి వచ్చిన దొంగ చేతిలోని రెండు కత్తులతో బెదిరించి ఆమె మెడలోని మూడు కాసుల విలువైన బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. జరిగిన విషయాన్ని కుమారుడు, కోడలికి ఫోన్లో తెలియజేయడంతో ఉదయం ఊరు నుంచి తిరిగివచ్చి ఉంగుటూరు పోలీసులను ఆశ్రయించారు. సీఐ బీవీ శివప్రసాద్, ఎస్ఐ యు. గోవిందు ఘటన స్థలాన్ని పరిశీలించి వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్ను రంగంలోకి దింపి నిందితుడి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశారు. బీరువా పగలకొట్టిన దొంగ అందులోని నగదు, ఇతర వస్తువులను మాత్రం అపహరించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోవిందు తెలిపారు. వీఎఫ్సీ ఫుడ్స్ షాపులో అగ్ని ప్రమాదం జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని జేఆర్సీ కాలేజీ రోడ్లోని వీఎఫ్సీ ఫుడ్స్ దుకాణంలో శనివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణంలో నాన్వెజ్, వెజ్ ఆహార పదార్థాలు తయారుచేస్తుంటారు. విద్యుత్ పరికరాలతో వేడి చేసి వినియోగదారులకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, గ్రైండర్లు, తదితర ఎలక్ట్రికల్ పరికరాలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. విద్యుత్ సిబ్బంది కరెంట్ సరఫరాను నిలిపివేసి ప్రమాద నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఫైర్ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను సకాలంలో బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఫైర్ ఆఫీసర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. -
‘ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా?’
విజయవాడ: చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఒక రకంగా ఉంటాడు.. అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోతాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అసలు చంద్రబాబుకి ఆర్టీసీ స్థలం లూలుకి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని ప్రశ్నించారాయన. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 3వ తేదీ) విజయవాడ నుంచి మాట్లాడిన రామకృష్ణ.. ‘వందల కోట్ల ఆర్టీసీ భూమి 99 ఏళ్లు లీజుకివ్వడమేంటి?, విశాఖలోనూ వందల కోట్ల భూమి లూలుకి కట్టబెట్టారు. విదేశాల్లో మూతబడిన లూలుకి ఇక్కడ ప్రభుత్వ భూములివ్వడం దేనికి?, కనీసం చర్చ కూడా లేకుండా చంద్రబాబు, నారాయణ లూలుకు ఆర్టీసి భూములిచ్చేశారు. గన్నవరంలో విమానాశ్రయం ఉంటే మళ్లీ అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పెట్టాల్సిన అవసరం ఏముంది?, విమానాశ్రయాలు కడితే సరిపోదు...విమానాలు నడవాలి కదా. అమరావతిలో 1500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ పెడతాననడం హాస్యాస్పదం. ప్రపంచంలో ఎక్కడైనా రైల్వేస్టేషన్ 1500 ఎకరాల్లో ఉందా? అని ప్రశ్నించారు రామకృష్ణ. -
11 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): అత్యంత క్లిష్టతరమైన గుండె సమస్యలున్న 11 మంది చిన్నారులకు విజయవాడలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్లో ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఆంధ్రా హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. విజయవాడ సూర్యారావుపేటలోని ఆస్పత్రిలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 28 నుంచి ఈ నెల 2 వరకూ నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో బెంగళూరుకు చెందిన పిడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బీఆర్ జగన్నాధ్, ఆంధ్రా హాస్పిటల్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుతో కలిసి ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు తెలిపారు. పదేళ్లుగా తమ ఆస్పత్రిలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఉచిత గుండె శస్త్ర చికిత్సలు చేస్తున్నామని, అందులో భాగంగా ప్రస్తుతం 35వ ఉచిత పిల్లల గుండె సర్జరీల క్యాంపు నిర్వహించి 11 మందికి సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ తమ ఆస్పత్రిలో 4800 వరకు సర్జరీలు ఇంటర్వెన్షన్స్ చేశామన్నారు. ఆంధ్రా హాస్పిటల్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పిడియాట్రిక్ కార్డియాలజీ టీమ్ ఈ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో సీటీ సర్జన్లు డాక్టర్ బీఆర్ జగన్నాధ్, డాక్టర్ నాగేశ్వరరావు, పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్, కార్డియాక్ ఎనస్థిస్ట్ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్లను తనిఖీ చేసిన డీఆర్ఎం రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): 2027వ సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా శనివారం రాజమండ్రి–గోదావరి–కొవ్వూరు సెక్షన్లను అధికారులతో కలసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పుష్కరాలకు సుమారు 40 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తారనే అంచనాలతో రాజమండ్రి స్టేషన్లోని తూర్పు, పశ్చిమ ప్రవేశ ద్వారాలు, స్టేషన్ యార్డులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను పరిశీలించారు. జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులను పరిశీలించి పుష్కరాలకు వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రవేశ ద్వారాలు, సర్క్యులేటింగ్ ప్రాంతాలు, ప్రజలకు అందించే సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రద్దీని నియంత్రించేందుకు రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు స్టేషన్లలో ప్రత్యక కార్యాచరణతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. స్టేషన్లో అదనపు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, టికెట్ బుకింగ్ పాయింట్లు, పార్కింగ్ స్థలాల ఆధునికీకరణ, సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్లు, సిట్టింగ్ ప్రదేశాలు, షెల్టర్లు, ప్రయాణికులకు మౌలిక సదుపాయాలతో అప్గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను అధికారులు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.