breaking news
NTR
-
నారా లోకేష్ పేరుతో సైబర్ నేరం.. 54 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
విజయవాడ: ప్రభుత్వం నుంచి మెడికల్ హెల్ప్ కోసం ఎదురుచూస్తున్న బాధితులను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. మంత్రి నారా లోకేష్ పేరును ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లోకేష్ ఫోటో ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఈ నేరాలకు పాల్పడ్డారు. అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు దోచేసిన ముగ్గురు నిందితులు. సోషల్ మీడియా వేదికగా సురేంద్ర టిడిపి ఎన్.అర్.ఐ కన్వీనర్ అంటూ మోసాలు చేశారు.వాట్సాప్ డీపి నారా లోకేష్ ది ఉండటంతో నిజమని నమ్మిన బాధితులు. నిందితులు రాజేష్, సాయి శ్రీనాథ్, సుమంత్లను సీ.ఐ.డీ పోలీసులు అరెస్ట్ చేశారు. పది లక్షల రూపాయలు వీత్ డ్రాకి అనుమతి వచ్చింది అంటూ.. ట్యాక్స్ లు పేరిట బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనలో 9 మంది బాధితుల నుంచి 54 లక్షల రూపాయల కాజేసిన కేటుగాళ్లు. -
కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను నేపథ్యంలో విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాల ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం మంత్రి సత్యకుమార్ యాదవ్ కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మునిసిపల్, వ్యవసాయం, ఇరిగేషన్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ జిల్లాలో విపత్తును ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా విజయవాడ అర్బన్లోని కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడేందుకు అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి.. ముప్పు ఉన్న ఆవాసాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. అవసరమైన మందులతో పాటు 108, 104 ద్వారా సమర్థవంతంగా సేవలందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని చిట్టినగర్ రాకేష్ ఈఎం హైస్కూల్లోని పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. కొండ ప్రాంతాల్లో అప్రమత్తం.. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మోంథా తుపాను నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు సూచించారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబాడీపేట, టేనర్పేట, ప్రైజర్పేట, టీఎంహెచ్ స్కూల్ అడ్డరోడ్డు కొండ ప్రాంతాల్లో మంగళవారం సీపీ పర్యటించారు. కొండ ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న నివాసాలను గుర్తించి తక్షణమే అందులో నివాసం ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలోని కొండ ప్రాంతాల వారికి సమాచారం చేరవేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. పోలీసులు, కార్పొరేషన్, రెవెన్యూ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. నగరంలో ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులకు ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని, హోర్డింగ్ల వల్ల ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సీపీ వెంట వెస్ట్ ఏసీపీ దుర్గారావు, వన్టౌన్, కొత్తపేట సీఐలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బోసిపోయిన బెజవాడ మార్కెట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): మోంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం నగరంలోని మార్కెట్లు బోసిపోయాయి. తుఫాన్ హెచ్చరికలతో జిల్లాలో ప్రజల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా దర్శనమిచ్చే నగరంలోని ప్రధాన వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య ప్రాంగణాలన్నీ బోసిపోయి కనిపించాయి. నగరంలోని వివిధ మార్కెట్లకు నిత్యం లక్షలాది మంది వినియోగదారులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. వారి రాకపోకలతో దుకాణాలన్నీ నిత్యం కళకళలాడుతూ దర్శనమిస్తుంటాయి. అయితే తుఫాన్ హెచ్చరికలతో నగరానికి వచ్చే రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో దుకాణాలు తెరిచి ఉన్నప్పటికీ ఏమాత్రం వ్యాపారాలు జరగలేదంటూ యజమానులు వాపోయారు. బీసెంట్రోడ్డు, బందరురోడ్డులోని ప్రధాన వ్యాపార కూడళ్లన్నీ బోసిపోయి దర్శనమిచ్చాయి. ఖాళీగా దర్శనమిచ్చిన పాతబస్తీ మార్కెట్లు తుఫాన్ నేపథ్యంలో పాతబస్తీలో వందలాది దుకాణాలు ఉన్న వివిధ ప్రధాన మార్కెట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. పశ్చిమ నియోజకవర్గంతో పాటుగా దాని పరిసర ప్రాంతాల్లో సుమారు వందకు పైగా హోల్సేల్ వ్యాపార సంఘాలు కొనసాగుతుంటాయి. వాటి పరిధుల్లో వేలాది దుకాణాలు పని చేస్తుంటాయి. తుఫాన్ హెచ్చరికలతో పాటుగా అధికారులు ప్రకటనలతో ప్రజానీకం ఎవరూ బయటకు రాకపోవటంతో ఆయా వ్యాపార కూడళ్లు అన్నీ బోసిపోయాయి. ముఖ్యంగా శ్రీ లాల్బహుదూర్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ (వస్త్రలత), కృష్ణవేణి హోల్సేల్ మార్కెట్, మెయిన్బజార్, శివాలయంవీధి, పులిపాటి వారి వీధి తదితర ప్రాంతాల్లోని దుకాణాలన్నీ ఖాళీగా కనిపించాయి. రైళ్లు, బస్సుల రద్దుతో... తుఫాన్ కారణంగా నగరానికి వచ్చే రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. విజయవాడతో పాటుగా విశాఖపట్నం నుంచి బయలుదేరే పలు రైలు సర్వీసులను రైల్వేశాఖ ముందస్తు జాగ్రత్తగా రద్దు చేసింది. నిత్యం లక్షలాదిగా ప్రయాణికులతో దర్శనమిచ్చే రైల్వేస్టేషన్ సైతం బోసిపోయింది. దాంతో నగరానికి వచ్చే ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో పాటుగా నగరానికి వచ్చే బస్సు సర్వీసులను సైతం ఆర్టీసీ కుదించింది. కొన్ని రూట్లలో అనధికారికంగా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతంతమాత్రంగానే బ్యాంకింగ్ లావాదేవీలు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లోనూ అంతంత మాత్రంగానే సేవలు కొనసాగాయి. ప్రధానంగా నగరంలోని వందలాది బ్యాంకుల్లో లావాదేవీలు నామమాత్రంగానే కొనసాగినట్లు ఆయా బ్యాంకు ఉద్యోగులు వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా నగరంలోని వన్టౌన్లో ఉన్న ప్రధాన పోస్టాఫీస్ సైతం వినియోగదారులు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. -
సివిల్స్కు ఎంపికై న హార్థిక్ కొఠారి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నగరానికి చెందిన హార్థిక్ కొఠారి సివిల్స్ ఫైనల్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. పాతబస్తీకి చెందిన ప్రముఖ వ్యాపారి మనోజ్ కొఠారి తనయుడు హార్థిక్ కొఠారి. మనోజ్కొఠారి ఏపీ జైన్ కార్పొరేషన్కు గతంలో చైర్మన్గా పని చేశారు. సివిల్స్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్షలు –2024 ఫైనల్స్ ఫలితాలను యూపీఎస్సీ ఏప్రిల్లో ప్రకటించింది. అందులో 1009 మంది ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించింది. మంగళవారం మరో 114 మందిని వివిధ కేటగిరీల్లో ఎంపిక చేస్తూ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కు సిఫారస్ చేసింది. హార్థిక్ కొఠారి నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాలతో పాటుగా బెంగళూర్లోని క్రిస్ట్ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా హార్థిక్ కొఠారి ఇంట్లో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. పాతబస్తీలోని పలు జైన్ కుటుంబాలు మనోజ్కొఠారి ఇంటికి వెళ్లి వారిని అభినందించాయి. -
ఎస్ఎంసీలో క్లినికల్ ట్రయల్స్పై వర్క్షాప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ ట్రయల్స్పై మూడు రోజుల పాటు నిర్వహించే వర్క్షాపు మంగళవారం ప్రారంభమైంది. ఈ వర్క్షాపులో వంద మందికి పైగా ప్రతినిధులు పాల్గొనగా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఐదుగురు నిపుణులు తమ అనుభవాలను, విలువైన సూచనలను పంచుకున్నారు. వర్క్షాపునకు కో ఆర్డినేటర్గా డాక్టర్ నవనీతలక్ష్మి వ్యవహరించారు. -
కృత్తివెన్నులో వణుకు
కృత్తివెన్ను: బంగాళాఖాతంలో ఏర్పడ్డ మోంథా తుపాను ప్రభావం మండలంపై తీవ్రంగా ఉంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా తీవ్రమైన గాలులతో పాటు వర్షం కురుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం తీర గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు గ్రామాల ప్రజలను కేంద్రాలకు తరలించారు. తుపాను తీవ్రతతో కృత్తివెన్ను మండలం పెద్ద గొల్లపాలెం బీచ్లో సముద్రం నీరు 100 మీటర్ల ముందుకు చొచ్చుకు వచ్చింది. సముద్రం బాగా పొంగడంతో ఉప్పుటేరులు, ఏటిపాయలు నీటి మట్టం పెరిగి ప్రధాన రహదారులు నీట మునిగిపోయాయి. లక్ష్మీపురం నుంచి పోడు వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా నీట మునిగిపోవడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఇంతేరు గ్రామపంచాయతీ పార్వతీపురం రహదారికి వరద పోటు కారణంగా గండి పడే ప్రమాదం పొంచి ఉండడంతో అధికారుల పర్యవేక్షణలో సిమెంట్ బస్తాలతో రక్షణ ఏర్పాటు చేశారు. పునరావాస శిబిరాలతో పాటు లోతట్టు ప్రాంతాలను మచిలీపట్నం డీఎస్పీ రాజా, రూరల్ సీఐ నాగేంద్రకుమార్, కృత్తివెన్ను ఎస్ఐ పైడిబాబులు సిబ్బందితో పరిశీలించారు. -
పత్తిలో మొలకలు...రైతులు దిగాలు
జి.కొండూరు: పత్తి రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. వరుస వానలతో భూమిలో తేమ శాతం తగ్గకపోవడంతో పత్తి ఎర్రబారి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు మళ్లీ మోంథా తుఫాన్ పత్తి రైతు నెత్తిన పిడుగులా మారింది. తీతకు వచ్చిన పత్తి చెట్టు పైనే మొలకెత్తుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాల ప్రభావంతో పత్తి గుబ్బలుగా మారి నల్లబడి నాణ్యత తగ్గడం, మొలకలు రావడం దీనికితోడు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారులకు అందిన కాడికి తెగనమ్ముకుని నష్టపోతున్నారు. తుఫాన్ ప్రభావం కూడా పడడంతో పత్తిని నాణ్యతతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎకరానికి యాభైవేలకు పైగా నష్టం ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది 32,744.5 హెక్టార్లలో రైతులు పత్తి పంటను సాగు చేశారు. పత్తి సాగు చేసేందుకు సొంత భూమి ఉన్న రైతులు పెట్టుబడి రూపంలో ఎకరానికి రూ.30వేలు వరకు ఖర్చు చేశారు. ఇక కౌలు రైతులు అయితే కౌలు రూ.20వేలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు చేశారు. వరుసగా వానలు పడుతుండడంతో పాటు మోంథా తుఫాన్ ప్రభావం కూడా పడడంతో పత్తి ఎర్రబారి తీతకు వచ్చిన పత్తి చెట్ల పైనే మొలకలు వస్తున్నాయి. మొదటి విడతగా తీయాల్సిన పత్తి చెట్ల పైనే మొలకలు వచ్చి నష్టపోతున్న రైతులు కొందరైతే మొదటి విడత పత్తి తీసి నాణ్యత లేక తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్న రైతులు మరికొందరు. పత్తి పైరు కూడా ఇప్పటికే ఎర్రబారి ఎండిపోతున్న క్రమంలో తదుపరి విడతల్లో దిగుబడి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. క్వింటా పత్తి ధర రూ.4వేలు లోపే... ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా పత్తి రూ.8,110 ధర పలకాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు అందినకాడికి ప్రయివేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పత్తి నాణ్యత లేకపోవడంతో దళారులు ఇష్టమొచ్చినట్లు ధర తగ్గించి క్వింటా పత్తి రూ.3వేల నుంచి రూ.4వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. క్వింటా పత్తి తీయడానికి కూలీలకు కేజీకి రూ.15 నుంచి రూ.20 చెల్లించాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి క్వాలిటీతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు ప్రకృతి వైపరీత్యాల వలన రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గత ప్రభుత్వంలో ఈ క్రాప్ చేయించిన ప్రతి రైతుకు ఉచితంగా క్రాప్ ఇన్సూరెన్స్ వర్తించేలా నిబంధనలను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచితంగా అందిస్తున్న క్రాప్ ఇన్సూరెన్స్ను నిలిపివేసింది. రైతులే నేరుగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పడంతో రైతులు ఆసక్తి చూపలేదు. పత్తి పైరులో ఈ ఏడాది వచ్చే నష్టాన్ని క్రాప్ ఇన్సూరెన్స్ ఉండి ఉంటే కొంత మేర నష్టం తగ్గేదని, అది లేకపోవడం వలన తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు. -
ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చర్యలు
ఎన్టీఆర్ జిల్లా తుపాను ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపానును ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా తుపాను ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ శశిభూషణ్ కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను ఆయన పరిశీలించి, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్తును ఎదుర్కోవడానికి అవసరమైన పొక్లయినర్లు, ట్రాక్టర్లు, యంత్రాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తుపాను వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కీలక శాఖల సిబ్బంది తుపాను ప్రతిస్పందన చర్యలలో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు ఏర్పా టు చేశారని, క్షేత్రస్థాయి యంత్రాంగమంతా సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు. అవసరమైన యంత్రాలు, సామగ్రి అందుబాటులో ఉన్నాయని, ఆస్తి ప్రాణ నష్టాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఇది తీవ్ర తుపాను అని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఏర్పాట్లు, చర్యలపై తమ ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని చెప్పారు. నిరంతర పర్యవేక్షణ.. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ అవేర్ వెబ్సైట్ ద్వారా తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తుపాను ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా కాలువల్లోని నీటిని నియంత్రిస్తున్నామని, బుడమేరుపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. రైతులు పంట కోతలు కోయరాదని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. -
మంగినపూడి బీచ్ పరిశీలన
కోనేరుసెంటర్: మోంథా తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి మండలంలోని మంగినపూడి బీచ్ వద్ద పరిస్థితులను గమనించారు. మోంథా తుపాను నేపథ్యంలో తీరప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అనంతరం గిరిపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. జిల్లాలో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. చెట్లు, గోడలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు వివరించారు. మంత్రి వెంట ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మచిలీపట్నం డివిజన్ తుపాను ప్రత్యేకాధికారి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. -
మల్లేశ్వరునికి సహస్ర లింగార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారికి మంగళవారం విశేష అభిషేకాలు, అర్చనలు, దీపార్చనలు నిర్వహించారు. స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని శాంతి కల్యాణ వేదిక వద్ద సహస్ర లింగార్చన జరిగింది. ఆలయ అర్చకులు పుట్టమన్నుతో శివాకృతులను సిద్ధం చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గులాబీలు, చామంతులు, కలువ పూలు, శంఖు పుష్పాలు, సన్నజాజులు, గన్నేరు పుష్పాలతో అర్చన నిర్వహించారు. సహస్ర లింగార్చనలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామి వారికి మహా నివేదన, పంచహారతుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవ నిర్వహించారు. శ్రీ గంగా పార్వతీ(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు దీపాలంకరణ సేవ అనంతరం ఊంజల్ సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయా సేవలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తుపాను నేపథ్యంలో ఘాట్రోడ్డు మూసివేత మంగళవారం సాయంత్రం నుంచి వర్షం తీవ్రత అధికం కావడంతో దుర్గగుడి ఘాట్రోడ్డును మూసివేశారు. తుపాను ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఘాట్రోడ్డులో రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు కనకదుర్గనగర్, మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకోవాలని సూచించారు. -
గ్రామ సచివాలయాల విలువ తెలుస్తోంది
లబ్బీపేట(విజయవాడతూర్పు): పరిపాలనా వికేంద్రీకరణ ద్వారానే ఏదైనా సాధిస్తామని గ్రహించి నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలే నేడు మొంథా తుఫాన్ సమయంలో కీలకంగా మారాయని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. తుఫాన్ సహాయక చర్యల్లో సచివాలయ సిబ్బంది నేరుగా ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారన్నారు. నాడు సచివాలయ, వలంటరీ వ్యవస్థను విమర్శించిన కూటమి ప్రభుత్వ పాలకులకు ఇప్పుడు వాటి విలువ తెలిసిందన్నారు. అదే రీతిన వలంటీర్లు కూడా ఉండి ఉంటే, ప్రతి ఇంటికి వెళ్లి అప్రమత్తం చేసే వారన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు. ఇప్పుడు ఆ పాఠశాలలే వరద బాధితులకు పునరావాస కేంద్రాలుగా మారాయన్నారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పని, నేడు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయనే విషయాన్ని కూటమి నాయకులు తెలుసుకోవాలని దేవినేని అవినాష్ హితవు పలికారు. -
పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితులలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. నవంబర్ 21, 22, 23 తేదీలలో పోలవరం నిర్వాసితుల ఆవేదన పేరిట బైక్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 23వ తేదీన వేలేరుపాడులో ఆవేదన సభ జరుగుతుందన్నారు. విజయవాడలోని దాసరి భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర బాబు మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల్లో 2016లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారని, పునరావాసం, పరిహారం ప్యాకేజి 2016వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్ గా పరిగణనలోకి తీసుకున్నారన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పూర్తి స్థాయిలో పరిహారం నిర్వాసితులకు అందలేదన్నారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలను కాలనీలకు తరలించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతను ప్యాకేజీకి అర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు యుగంధర్, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యానాదులకు దొరకని పునరావాసం
మచిలీపట్నంటౌన్: నగరంలోని 36వ డివిజన్ రాజుపేట మగ్గాల కాలనీకి చెందిన 20 యానాది కుటుంబాల వారు తుఫాన్ నేపథ్యంలో పునరావాసం లేక ఇబ్బందులు పడ్డారు. తుఫాన్ పెనుగాలులకు మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వారు నివసిస్తున్న గుడిసెలు దెబ్బతిని నివాసానికి ఇబ్బందిగా మారాయి. అదే ప్రాంతంలో ఓ భారీ వృక్షం నేలకూలింది. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ యానాదుల కాలనీవాసులు 36వ డివిజన్ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ మాచవరపు రాంప్రసాద్ ను సంప్రదించారు. దీంతో ఆయన వారిని డివిజన్ లోని ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉంచేందుకు తీసుకెళ్లారు. అయితే వారికి గది ఇచ్చేందుకు కళాశాల నిర్వాహకులు విముఖత చూపారు. తమ కళాశాలలో పునరావాస కేంద్రం లేదని మరుగుదొడ్ల సమస్య ఉందని చెప్పారు. దీంతో కార్పొరేటర్ రాంప్రసాద్ తహసీల్దార్ కు ఫోన్ చేసి పరిస్థితిని చెప్పడంతో 50వ డివిజన్ తుఫాన్ సెంటర్లో పునరావాసం ఏర్పాటు చేశామని, వారిని అక్కడకు తీసుకువెళ్లాలని చెప్పారు. వారంతా కళాశాల వరండాలోనే తలదాచుకోగా కార్పొరేటర్ రాంప్రసాద్ వారికి తాగునీరు, అల్పాహారం అందజేశారు. -
కూటమి పాలనలో ఆటోడ్రైవర్లకు అన్యాయం
మధురానగర్(విజయవాడసెంట్రల్): సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు ఆటో డ్రైవర్ సేవ పథకం ద్వారా ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఆటో కార్మికులంతా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో పాల్గొనాలని సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.సి.హెచ్ శ్రీనివాస్, సీఐటీయూ సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కె.దుర్గారావు పిలుపునిచ్చారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సీఐటీయూ సెంట్రల్ సిటీ 12 వ మహాసభ మంగళవారం బీఆర్టీఎస్ రోడ్డులోని నండూరి ప్రసాదరావు సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో మోటార్ రంగం పూర్తిగా దెబ్బతిని జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. కార్మిక చట్టాలను కాపాడుకోవటానికి కార్మికులంతా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులందరికీ న్యాయం చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 21 రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆటో మోటార్ కార్మికులు ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. అనంతరం 26 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. సీఐటీయూ సెంట్రల్ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా కె.దుర్గారావు, ప్రధాన కార్యదర్శిగా ఎం.హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్.కె.దుర్గావలి, కార్యనిర్వాహక కార్యదర్శిగా డి.కోటయ్య, కోశాధికారిగా బి.విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా పి.తిరుపతయ్య, ఉపాధ్యక్షులుగా పి.గణేష్ (చిన్న), బి.కుమార్ ఎన్నికయ్యారు. -
మిర్చి యార్డుకు సెలవులు
కొరిటెపాడు(గుంటూరు): మోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యం, ఉన్నతాధికారుల సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళ, బుధవారాలు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో యార్డులో క్రయ, విక్రయాలు జరగబోవని వెల్లడించారు. రైతులు సెలవు రోజుల్లో తమ మిర్చిని యార్డుకు తీసుకురావద్దని కోరారు. జి.కొండూరు: ఇంట్లో ఎవరూలేని సమయంలో బంగారు ఆభరణాలను చోరీ చేసిన ఘటన జి.కొండూరులో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక పీఏసీఎస్ బ్యాంకు సమీపంలో నివాసం ఉంటున్న కుక్కల శ్రీనివాసరావు కుటుంబం ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటికి తాళం వేసి తాళం చెవిని పక్కనే ఉన్న కిటికీలో పెట్టి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇనుప బీరువాలో ఉన్న నాలుగు గ్రాముల బంగారు బ్రాస్లేట్, 1.5 గ్రాముల చెవి దిద్దులను ఎత్తుకెళ్లారు. పొలం నుంచి ఇంటికి తిరిగివచ్చిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీ ష్కుమార్ తెలిపారు. -
తుఫాన్తో బుడమేరుకు వరద ముంపు !
జి.కొండూరు: బుడమేరు పేరు చెప్తేనే ఉలిక్కిపడేలా జల ప్రళయాన్ని సృష్టించిన ఘటన మరవక ముందే మోంథా తుఫాన్ రూపంలో వస్తున్న మరో ఉప్పెన లోతట్టు ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. బుడమేరు ఎగువ ప్రాంతాల్లో చెరువులు ఇప్పటికే నిండిపోయి నిండుకుండల్లా దర్శనమిస్తున్న క్రమంలో ఏ మాత్రం భారీ వర్షం కురిసినా బుడమేరుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. వరద పెరిగితే వెంటనే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద వచ్చే అవకాశం ఉండడంతో ఉరుకులు పరుగులు పెడుతున్న ప్రభుత్వ యంత్రాంగం వరదలొచ్చిపోయి ఏడాది గడిచినా బుడమేరు ప్రక్షాళన చేయడంలో మాత్రం విఫలమైంది. ఒక వేళ మోంథా తుఫాన్తో బుడమేరుకు వరద పోటెత్తితే ఎన్టీఆర్ జిల్లాలో రైతులు, పేద ప్రజలకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. గతేడాది అసలేం జరిగింది గతేడాది ఆగస్టు 30వ తేదీన శుక్రవారం మెల్లగా మొదలైన వర్షం ఆ రాత్రి భారీ వర్షంగా మారింది. దీంతో ఆగస్టు 31వ తేదీన ఉదయానికల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండవాగు, కోతులవాగు, కళింగవాగు, కోవ వాగు, పులివాగు, వెంకటాపురం వాగు, దొర్లింతాల వాగు, కప్పలవాగు, తొమ్మండ్రం వాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లాయి. ఒక్కసారిగా ఊహించని వరద ఉప్పొంగడంతో నియోజకవర్గంలో 34 చెరువులకు గండ్లు పడ్డాయి. ఏ.కొండూరు మండలంలో బుడమేరు పుట్టిన ప్రదేశం నుంచి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వరకు 42 కిలోమీటర్ల పరిధిలో చిన్న, పెద్దవి కలిపి 80కి పైగా గండ్లు పడ్డాయి. అదేవిధంగా ఈ వరద ప్రవాహానికి వెలగలేరు హెడ్రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్లు మేర ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు కుడి వైపు ఏడు గండ్లు, ఎడమ వైపున మూడు గండ్లు పడ్డాయి. ఈ వరద ప్రవాహానికి మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, ఇబ్రహీంపట్నం మండలాలు ముంపునకు గురయ్యాయి. అయితే అదేరోజు సాయంత్రానికి వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్దకు 30 వేల క్యూసెక్కులకుపైగా వరద నీరు చేరి అధికారులు 11 గేట్లను ఎత్తడంతో తర్వాతి రోజు సెప్టెంబర్ ఒకటో తేదీన ఉదయానికి విజయవాడ రూరల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ ముంపునకు గురయ్యాయి. కృష్ణానదికి కూడా వరద ప్రవాహం పెరగడంతో ఇబ్రహీంపట్నం పూర్తిగా ముంపునకు గురైంది. ఈ వరద ప్రభావంతో అటు విజయవాడ, ఇటు మైలవరం నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. యాభై మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు మళ్లీ మోంథా తుఫాన్ ప్రభావంతో బుడమేరుకు వరద పోటెత్తడంతో పాటు ఎగువన చెరువులు కూడా నిండి ఉండడంతో బుడమేరు పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆ మూడు గ్రామాలకు ప్రమాదం బుడమేరుకు వరద ప్రవాహం ఎక్కువైతే జి.కొండూరు మండల పరిధి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్దకు భారీగా వరద చేరుతుంది. హెడ్రెగ్యులేటర్ లాకులు ఎత్తితే విజయవాడ మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు సాధ్యమైనంత వరకు డైవర్షన్ కెనాల్గుండా కృష్ణా నదికే వరద మళ్లిస్తారు. ఈ క్రమంలో హెడ్రెగ్యులేటర్ వద్ద భారీగా వరద నిల్వ ఉంటుంది. ఈ సమయంలో బుడమేరు కాల్వకు ఎడమ వైపు గండ్లు పడితే దిగువన ఉన్న వెలగలేరు, కవులూరు గ్రామాలు, కుడి వైపు గండ్లు పడితే ముత్యాలంపాడు గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. 11,823 మంది జనాభా ఉండే ఈ మూడు గ్రామాల్లో ఇటీవల వచ్చిన వరద ప్రవాహానికి తీరని నష్టం వాటిల్లింది. మోంథా తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద బుడమేరును పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు 24/7 ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరిగితే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులను అప్రమత్తం చేయాలని బుడమేరు పరిశీలనా అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో 189 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. -
యాజమాన్యం నిర్లక్ష్యానికి క్వారీ కార్మికుడి మృతి
దొనబండ(ఇబ్రహీంపట్నం): బ్లాస్టింగ్ కోసం కొండపై డ్రిల్లింగ్ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడిపోయిన వ్యక్తి మృతి చెందిన ఘటన దొనబండలోని ఓ క్వారీలో సోమవారం జరిగింది. ప్రమాదంలో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. మృతుడు ఉప్పుతల కృష్ణ(27)గా గుర్తించారు. గ్రామానికి చెందిన ఉప్పతల శ్రీరాములు, నాగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. మృతిచెందిన కృష్ణ రెండో కుమారుడు. ఈ ఏడాది జనవరిలో కృష్ణ తండ్రి శ్రీరాములు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇప్పుడు కుమారుడు కూడా క్వారీ ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాజమాన్య నిర్లక్ష్యం, క్వారీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, భద్రతా పరికరాలు వాడనందునే ప్రమాదాలు జరుగుతున్నాయని బిల్డింగ్ కన్సక్షన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. మృతిని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం ప్రమాదాలు జరిగినప్పుడు నామమాత్రపు తనిఖీలు నిర్వహించి తరువాత పట్టించుకోక పోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ బి.రాజు తెలిపారు. జి.కొండూరు: మోంథా తుఫాన్ నేపథ్యంలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో హెడ్రెగ్యులేటర్ల మధ్యలో రైతుల అవసరాల కోసం నిల్వ ఉంచిన నీటిని అధికారులు సోమవారం కృష్ణానదిలోకి విడుదల చేశారు. బుడమేరుతో పాటు పోలవరం రైట్మెయిన్ కెనాల్ కూడా వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్ద డైవర్షన్ కెనాల్లో కలిసి ప్రవహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భారీ వర్షాలు కురిస్తే ఒక వైపు బుడమేరుకు వరద పోటెత్తే అవకాశం ఉంది. మరో వైపు పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో కూడా వర్షం నీరు పోటెత్తి ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా స్టాగ్నేటెడ్ వాటర్ని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో బుడమేరులో ఎగువ నుంచి వచ్చే కొద్దిపాటి ప్రవాహంతో పోలవరం రైట్మెయిన్ కెనాల్లో స్టాగ్నేటెడ్ వాటర్ కలిసి వెలగలేరు హెడ్రెగ్యులేటర్ వద్ద 3.3 అడుగుల మేర నీటి నిల్వ ఉండగా కృష్ణానదిలోకి 3,500 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. మంగళగిరిటౌన్: ఏపీ సచివాలయ ఉద్యోగి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు సుమారు రూ.లక్షకు పైగా నగదును దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాలు... దుగ్గిరాలకు చెందిన గోళ్ల గణేష్, వెలగపూడి ఏపీ సచివాలయం ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఐదు నెలల క్రితం భార్య, ఇద్దరు కుమారులతో కలసి యరబ్రాలెంలోని ఓ నివాసంలో అద్దెకు దిగారు. ఇటీవల గణేష్ తల్లి అనారోగ్యానికి గురైంది. దీంతో ఈనెల 23వ తేదీన దుగ్గిరాల వెళ్లారు. తిరిగి సోమవారం సాయంత్రం యరబ్రాలెంలోని ఇంటికి వెళ్లగా ఇంటి తలుపులకు వేసి ఉన్న తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్లి చూడగా బీరువాలో బట్టలు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులతో పాటు సుమారు రూ.లక్షకు పైగా నగదు మాయమైందని గుర్తించారు. దీంతో బాధితుడు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో బాధితుడు విస్మయం వ్యక్తం చేశాడు. -
బంగారు ఆభరణాలపై కన్నేసింది.. కొట్టేసింది
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ మారుతీనగర్కు చెందిన చీపురుపల్లి సుమలత అలియాస్ లత సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలోని ఓ ఇంట్లో వంట, ఇంటి పనిచేసేందుకు చేరింది. ఇంట్లో పనులు చేస్తూ చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయని గ్రహించి, వాటినీ చోరీ చేయాలని భావించింది. ఒకేసారి అయితే అనుమానం వస్తుందని, పని ముగించుకుని వెళ్లేటప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఒక్కో ఆభరణం ఎత్తుకెళ్లింది. అలా 837 గ్రాముల ఆభరణాలను తస్కరించింది. ఆరు నెలల కిందట తండ్రి మరణంతో ఆరోగ్యం బాగుండటం లేదని చెప్పి పనిమానేసింది. ఆలస్యంగా గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లత నుంచి చోరీకి గురైన రూ.కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిబ్బందికి అభినందనలు.. సూర్యారావుపేట చిలుకు దుర్గయ్య వీధిలో నివశించే ఫిర్యాది తమ ఇంట్లోని 837 గ్రాముల బంగారు వస్తువులు ఎవరో దొంగిలించారని సోమవారం సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటికి వెళ్లి అనుమానితుల వివరాలు సేకరించారు. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కేజీవీ సరిత సూచనలతో సౌత్జోన్ ఏసీపీ డి.పావన్కుమార్ పర్యవేక్షణలో సూర్యారావుపేట సీపీ షేక్ అహ్మద్ అలీ తమ సిబ్బందిలో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనుమానితులు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఆ ఇంట్లో పనిచేసి మానేసిన మహిళ సుమలతను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించింది. దీంతో ఆమె నుంచి రూ.కోటి విలువైన 837 గ్రాముల ఆభరణాలను రికవరీ చేశారు. గంటల వ్యవధిలోనే కేసును చేధించడంతో పాటు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన సౌత్ ఏసీపీ డి.పావన్కుమార్, ఎస్ఆర్పేట సీఐ షేక్ అహ్మద్ అలీ, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు అభినందించారు. సమావేశంలో డీసీపీలు సరిత, తిరుమలేశ్వరరెడ్డి, క్రైమ్ ఏడీసీపీ ఎం.రాజారావు, సౌత్ ఏసీపీ పావన్కుమార్, ఎస్ఆర్పేట సీఐ అహ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
తుఫాన్ ప్రభావంతో పలు రైళ్ల రద్దు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): తుఫాన్ ప్రభావంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయవాడ డివిజన్ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నేడు రద్దయిన రైళ్లు.. ఈ నెల 28న విజయవాడ–భీమవరం టౌన్(67281), భీమవరం టౌన్–నిడదవోలు(67283), నిడదవోలు–భీమవరం టౌన్(67284), భీమవరం టౌన్–విజయవాడ(67282), గుంటూరు–విజయవాడ(67230), విజయవాడ–కాకినాడ పోర్టు(17257), విజయవాడ–తెనాలి(67221), తెనాలి–రేపల్లె(67231), రేపల్లె–తెనాలి (67232), తెనాలి–రేపల్లె(67233), రేపల్లె–గుంటూరు(67234), గుంటూరు–తెనాలి(67237), విజయవాడ–మచిలీపట్నం(67265), మచిలీపట్నం–గుడివాడ(67271), గుడివాడ–మచిలీపట్నం(67272), విజయవాడ–నర్సాపూర్(67258), నర్సాపూర్–రాజమండ్రి(67246), విజయవాడ–రాజమండ్రి(67202), విజయవాడ–ఒంగోలు(67273), ఒంగోలు–విజయవాడ(67267), నర్సాపూర్–విజయవాడ(67276), భీమవరం టౌన్–నిడదవోలు(67277), నిడదవోలు–భీమవరం టౌన్(67278), నర్సాపూర్–గుంటూరు(67247), మచిలీపట్నం–విజయవాడ(67256), విజయవాడ–నర్సాపూర్(67257), విజయవాడ–మాచర్ల(67227), రాజమండ్రి–విజయవాడ(67201), రాజమండ్రి–విశాఖపట్నం(67285), విశాఖపట్నం–రాజమండ్రి(67286), కాకినాడ పోర్టు–విశాఖపట్నం(17267), విశాఖపట్నం–కాకినాడ పోర్టు(17268) రైళ్లు రద్దు చేశారు. 29న రద్దు చేసిన రైళ్లు.. గుంటూరు–విజయవాడ(67230), మచిలీపట్నం–విజయవాడ(67266), విజయవాడ–మచిలీపట్నం(67269), భీమవరం టౌన్–నర్సాపూర్(17263), గుంటూరు–రేపల్లె(67249), రేపల్లె–గుంటూరు(67250), నర్సాపూర్–నిడదవోలు(67244), నిడదవోలు–నర్సాపూర్(67245), మాచర్ల–విజయవాడ(67228), రాజమండ్రి–విజయవాడ(67261), రాజమండ్రి–భీమవరం టౌన్(67242), నిడదవోలు–నర్సాపూర్(67243), కాకినాడ పోర్టు–విజయవాడ(17258) రైళ్లు ఈ నెల 29న పూర్తిగా రద్దు చేశారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): నేషనల్ సైన్స్ ఎగ్జిబిషన్ – 2025కు ఎన్టీఆర్ జిల్లా నుంచి రెండు ప్రాజెక్ట్లు ఎంపికై నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. భోపాల్లో నవంబర్ 18 నుంచి 23వ తేదీ వరకూ ఈ ఎగ్జిబిషన్ జరుగుతుందన్నారు. ప్రదర్శనకు జిల్లాలోని ఏపీ మోడల్ స్కూల్ (గంపలగూడెం మండలం), జీవీజే జెడ్పీ హైస్కూల్(బాలురు) జగ్గయ్యపేటకు విద్యాసంస్థలకు చెందిన ప్రదర్శించిన ప్రాజెక్ట్లు ఎగ్జిబిషన్కు ఎంపికై నట్లు చెప్పారు. -
స్ట్రోక్ వస్తే.. జీవితాంతం మందులు వాడాలి
బ్రెయిన్స్ట్రోక్కు గురైన వారు కొన్ని రోజుల తర్వాత మధ్యలో మందులు ఆపేస్తున్నారు. అది సరికాదు. జీవితాంతం మందులు వాడాలి. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్కు గురైన వారు మళ్లీ స్ట్రోక్కు గురయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, కాలుష్యం బారిన పడకుండా చూడటం, ఆహార నియమాలు పాటించడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్కు గురికాకుండా చూసుకోవచ్చు. –డాక్టర్ ఎస్.బాలకృష్ణ, న్యూరాలజిస్ట్, సెంటినీ విజయవాడ -
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
నారాయణ స్కూల్లో యథావిధిగా తరగతుల నిర్వహణ పెనమలూరు: ఊరందరిదీ ఓ దారి... ఉలిపి కట్టెది మరో దారి అన్నట్టుంది నారాయణ విద్యా సంస్థల తీరు. తీవ్ర తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కానూరు నారాయణ పాఠశాల బేఖాతర్ చేసింది. విద్యాసంస్థలకు 27 నుంచి 29వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా పెనమలూరు మండల పరిధిలోని 35 ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఇదే పాటించాయి. అయితే మంత్రి నారాయణకు చెందిన కానూరులోని నారాయణ కెనడీ పాఠశాల నిర్వాహకులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. సోమవారం విద్యార్థులకు యథావిధిగా తరగతులు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీవోలు శేషగిరిరావు, కనకమహాలక్ష్మి పాఠశాలను తనిఖీ చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదని ప్రిన్సిపాల్ను నిలదీశారు. పాఠశాలకు వెంటనే సెలవు ఇప్పించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భద్రతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తరగతులు నిర్వహించటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ పాఠశాలపై ఫిర్యాదు చేశామని ఎంఈవో శేషగిరిరావు చెప్పారు. ప్రైవేటు పాఠశాలలు సెలవులు అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
తుఫాన్పై వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మోంథా తుఫాన్ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటు, విజయవాడలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లోనూ వైద్య సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ఆమె సోమవారం నగరంలోని పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య అధికారులు, సూపర్వైజర్లు 24/7 మూడు షిఫ్ట్ల్లో విధులు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో కాన్పుకు సిద్ధంగా ఉన్న గర్భిణులకు, మంచాన పడిన వ్యాధిగ్రస్తులకు, ప్రత్యేక వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఆరోగ్య కేంద్రాలు, మండలాల వారీగా పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలతో 605 రాపిడ్ రెస్పాన్స్ టీం బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయి నుంచి క్షేత్ర స్థాయిలో ఉన్న ఆరోగ్య సిబ్బంది వరకు నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రధాన కార్యాలయంతో అనుసంధానమై ఉంటారని తెలిపారు. -
ఆ సమయం...అమూల్యం
●వత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి ●రెగ్యులర్గా వ్యాయామం చేయాలి ●రక్తపోటు, మధుమేహంను అదుపులో ఉంచుకోవాలి ●అధిక కొలస్ట్రాల్ను తగ్గించుకోవాలి ●ధూమపానం, ఆల్కాహాల్ను మానుకోవాలి ●ఒకసారి స్ట్రోక్ వచ్చిన వారు రెండోసారి రాకుండా మందులు సక్రమంగా వాడాలి ●అవసరమైతే వైద్యుల సూచన మేరకు రక్తం పలుచబడే మందులు వాడాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒకప్పుడు యాబై ఏళ్లు దాటిన వారు బ్రెయిన్స్ట్రోక్కు గురయ్యేవారు. ఇప్పుడు 20 ఏళ్లకే స్ట్రోక్(పక్షవాతం)కు గురవడం ఆందోళన కలిగించే అంశంగా వైద్యులు చెపుతున్నారు. అందుకు తీవ్రమైన వత్తిళ్లే(స్ట్రెస్) కారణం అంటున్నారు. విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇలా అన్ని రంగాల్లో యువత తీవ్రమైన స్ట్రెస్కు గురవుతున్నారు. ఒకవైపు మారిన జీవనశైలి, మరోవైపు విధుల్లో వత్తిళ్లు స్ట్రోక్కు కారణమవుతున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఏటా 6 వేల మందికి పైగా స్ట్రోక్ బారిన పడుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్ట్రోక్ లక్షణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా లక్షణాలు కనిపించిన తర్వాత ‘ప్రతి నిమిషం లెక్కించదగినదే’ అనే నినాదంతో ఈ ఏడాది అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోల్డెన్ అవర్ కీలకం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన తర్వాత ప్రతి నిమిషం కీలకమైనదే. గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేరితే సీటీ స్కాన్ ద్వారా వైద్యులు ఏ రకమైన బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిర్ధారిస్తారు. ఇస్కిమిక్ స్ట్రోక్(రక్తనాళాల్లో గడ్డలు)గా నిర్ధారించిన వారికి థ్రోంబలైజ్ ఇంజక్షన్ ఇస్తారు. అవసరమైతే 12 గంటల్లోపు క్యాథ్ల్యాబ్కు తీసుకెళ్లి రక్తనాళాల్లోని గడ్డలను తొలగిస్తారు. ఈ రకమైన చికిత్సతో స్ట్రోక్ వచ్చినా రోగికి వైకల్యం లేకుండా చూడగలుగుతున్నారు. ఆస్పత్రికి రావడంలో ఆలస్యం అయిన వారికి ఈ రకమైన చికిత్సలు చేసినా ప్రయోజనం ఉండదు. బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యే వారిలో 85 శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ కాగా, 15 శాతం హెమరైజ్డ్ స్ట్రోక్కు గురవుతున్నారు. రిహాబిలేషన్... ●పక్షవాతం రోగుల్లో రిహాబిలేషన్ అనేది చాలా ముఖ్యం. కనీసం మూడు నుంచి ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉంటూ ఫిజియోథెరపీ లాంటివి చేయాలి. ●మాట రాని వారి కోసం స్పీచ్ థెరపీ చేయించాలి. ●ఒక్కసారి ఫిజియోథెరపీ సమయంలో నడవగలిగితే రోగిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యువతలో పెరిగిన స్ట్రోక్ ముప్పు ప్రస్తుతం యువత బ్రెయిన్ స్ట్రోక్కు గురవడమే కాకుండా, మరణాలకు దారి తీయడం ఆందోళన కలిగించే అంశంగా చెపుతున్నారు. ●గాంధీనగర్కు చెందిన సంతోష్(25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. విధుల్లో తీవ్రమైన వత్తిళ్లకు గురై, వారం రోజుల కిందట సడన్గా స్ట్రోక్ వచ్చి, కొన్ని గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డాడు. ●లబ్బీపేటకు చెందిన 26 ఏళ్ల ఇర్ఫాన్ ప్రయివేటు ఉద్యోగి. ఒకరోజు ఉదయం సడన్గా చేయి పైకి ఎత్తలేక పోవడం, మూతి వంకరగా మారడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే సమీపంలోని స్ట్రోక్ యూనిట్కు తరలించగా, అక్కడ సత్వరమే చికిత్స అందించడంతో ఎలాంటి వైకల్యం రాకుండా కోలుకున్నాడు. తీసుకోవలసిన జాగ్రత్తలు... -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.4.33 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 20 రోజులకు గాను 44 హుండీల ద్వారా 167 సంచులను తెరిచి కానుకల లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మొత్తం రూ.4,33,85,655 నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 6.614 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ తెలిపారు. ఇక విదేశాలకు చెందిన కరెన్సీ సైతం భారీగానే లభ్యమైంది. యుఎస్ఏకి చెందిన 582 డాలర్లు, సింగపూర్ డాలర్లు 22, కెనడా డాలర్లు 215, యుఏఈకి చెందిన 485 దిర్షమ్స్, అస్ట్రేలియా డాలర్లు 250, మలేషియా రింగిట్స్ 23, ఖతార్ రియాల్స్ 18, కువైట్ దినార్ 2.25, ఇంగ్లాండ్ పౌండ్లు 15 లభ్యమయ్యాయి. కానుకల లెక్కింపును ఛైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో జోగి రమేష్ సత్యప్రమాణం
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అన్నంత పని చేశారు. విజయవాడ కననదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్న ఆయన.. ఘాట్ రోడ్డు ఎంట్రెన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకుని ఈ వ్యవహారంలో తనకే సంబంధం లేదని అన్నారు.నా వ్యక్తిత్వంపై నింద వేశారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూశారు. నా మనసును బాధ పెట్టారు. అందుకే కుటుంబంతో సహా వచ్చా. నేను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశా. నా కుటుంబాన్ని అవమానపరిచి నా హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మని కోరుకున్నా. నేను ఏ తప్పు చేయను చేయలేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి బెజవాడ దుర్గమ్మ పై ప్రమాణానికి నేను సిద్ధమని నేను చెప్పాను. ఆ సవాలకు కట్టుబడి నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేశారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ , లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధం అని అన్నారాయన. ‘‘నకిలీ మద్యం కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు. మరి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ఏం చెబుతారు?. నాపై తప్పుడు ఆరోపణలు చేసినవాళ్లు సత్యప్రమాణానికి సిద్ధమా?. పోనీ.. లైడిటెక్టర్ టెస్టుకైనా వచ్చే దమ్ముందా?. కనక దుర్గమ్మ సాక్షిగా వాళ్లు నేను తప్పు చేసినట్లు నిరూపించాలి’’ అని జోగి రమేష్ మరోమారు సవాల్ విసిరారు. -
దుర్గమ్మ సన్నిధిలో క్యూలైన్లు కిటకిట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు భక్తుల రద్దీ ఓ మోస్తరుగా కనిపించింది. వర్షాలు కురుస్తాయని ముందుగా హెచ్చరించడంతో ఆ ప్రభావం కొంత భక్తులపై పడింది. అయితే ఉదయం నుంచి వాతావరణం పొడిగా, ఎండగా ఉండటంతో క్రమేపీ రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అరగంట పాటు అన్ని క్యూలైన్లు నిలిపివేశారు. అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం మధ్యాహ్నం తిరిగి దర్శనాలు ప్రారంభమయ్యాయి. అయితే అప్పటికే అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఘాట్రోడ్డులో ఓం టర్నింగ్లోని స్టీల్గేట్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండగా, ఇటు మహా మండపం మెట్ల మార్గంలోని క్యూలైన్ నాల్గో అంతస్తు వరకు చేరింది. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమై భక్తులకు త్వరతిగతిన అయ్యేలా చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా త్వరగా ముందుకు జరిగేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టిగా, రూ. 300, రూ. 100 టికెటు క్యూలైన్లో గంట సమయం పట్టింది. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ పలువురు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు -
మార్చిలో ఏపీ టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):వచ్చే ఏడాది మార్చిలో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్డీ ప్రసాద్ చెప్పారు. నగరంలోని హోటల్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఆదివారం జరిగింది. అనంతరం ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ... టెన్సిస్ బాల్తో క్రికెట్ ఆడే క్రీడాకారుల్లోని ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ఈ లీగ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. మార్చిలో 12 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ లీగ్ పోటీల్లో విజేతలకు సుమారు రూ.30 లక్షల విలువైన నగదు బహుమతులతో పాటుగా బెస్ట్ ప్లేయర్, బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్మెన్స్లకు బహుమతులు అందిస్తామని తెలిపారు. రానున్న కాలంలో టెన్నిస్ బాల్ క్రికెట్కు ఆదరణ వచ్చేలా తమ అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఐకాన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రెడ్డి మాట్లాడుతూ మార్చిలో జరిగే లీగ్ పోటీల్లో టెన్నిల్ బాల్ క్రికెట్ పోటీల్లో క్రీడాకారులు పాల్గొని వారిలోని ఉన్న ప్రతిభను మెరుగుపర్చుకోవచ్చని వెల్లడించారు. ఈ లీగ్ పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను నవంబర్ 14వ తేదీన విడుదల చేస్తామన్నారు. రాధా రంగా మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ అతిథిగా హాజరై టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు సంబంధించిన పాటను ఆవిష్కరించారు. కొండలరావు, కరుణాకర్తో పాటుగా సంఘం సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
● యువత లక్ష్యంగా సాగుతున్న గంజాయి దందా ● ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి రవాణా చేస్తున్న యువకులు ● రూరల్ ప్రాంతాల్లో వరసగా పట్టుబడుతున్న గంజాయి నిందితులు ● గంజాయి మత్తులో హత్యలు, దాడులకు పాల్పడుతున్న వైనం
జి.కొండూరు: యువతే లక్ష్యంగా గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. తేలికగా డబ్బు సంపాదించేందుకు అలవాటుపడిన యువకులతో గంజాయి రవాణా సాగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి దందా సాగిస్తోంది. పల్లె ప్రాంతాల్లో తరుచూ గంజాయి పట్టుబడటం ఇందుకు నిదర్శనంగా మారింది. యువతే లక్ష్యంగా గంజాయి మాఫియా ప్రత్యేక నెటవర్క్ను నడుపుతూ ఆన్లైన్ పేమెంట్లతో ముందుగానే ఆర్డర్లు తీసుకొని సరఫరా చేయడం నిఘా వ్యవస్థ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణా పల్లెల్లో విస్తరిస్తోంది. రేషన్, ఇసుక, మట్టి మాఫియా నిర్వాహకులు తమ దందాకు సెక్యూరిటీగా గంజాయి బ్యాచ్ను నియమించుకుంటున్నారని సమాచారం. ఇటీవల తిరువూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఓ మీడియా చానల్ డిబేట్లో మాట్లాడుతూ విజయవాడ పార్లమెంటు ప్రజాప్రతినిధి అనుచరులే భద్రాచలం నుంచి గంజాయి తెప్పించి తిరువూరులో విక్రయిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. తనిఖీల్లో చిక్కుతున్న గంజాయి ఈ నెల 15వ తేదీన జి.కొండూరు మండలం చెవుటూరు శివారులోని పత్తి చేలల్లో పోలీసులు తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద 1.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందతుల్లో ఏలూరుకు చెందిన ఉత్తరవల్లి జగదీష్, విజయవాడకు చెందిన నలుగురు యువకులు, మైలవరంకు చెందిన ఒకరు, జి.కొండూరు మండలం వెంకటాపురానికి చెందిన ముగ్గురు యువకులు ఉన్నారు. తిరువూరు మండలం చిట్టేల క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 21న బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేయగా 1.5 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులు విశాఖపట్నం జిల్లాలోని సీలేరు నుంచి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితుల్లో ఒకరు తిరువూరుకు చెందిన యువకుడు, మిగిలిన ఇద్దరు విజయవాడకు చెందిన వారని, తరచూ గంజాయి రవాణా చేస్తున్నారని వెల్లడైంది. జగ్గయ్యపేట మండల పరిధి చిల్లకల్లు పోలీసుస్టేషన్ పరిధిలో గౌరవరం వద్ద ఒడిశా నుంచి హైదరబాద్కు రెండు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 10 కిలోల గంజాయి జూలై 24న పట్టుబడింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు, కంచకచర్ల మండలం కీసరకు చెందిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచకచర్ల మండలం పరిటాల శివారులో ఈ ఏడాది జనవరి 23వ తేదీన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లో ఉన్న కారులో ఆరు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదే నెల 24వ తేదీన జుజ్జూరురోడ్డులో రెండు బైకులపై తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదే నెలలో నందిగామ, చిల్లకల్లు పోలీసుస్టేషన్ల పరిధిలో సుమారు 500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ అప్పట్లో ప్రకటించారు. దాడి ఘటనలో గంజాయి కలకలం గంజాయి మత్తుకు బానిసలవుతున్న యువకులు విచక్షణ కోల్పోయి రక్తసంబంధాలను మరిచి హత్యలకు తెగబడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2024, డిసెంబరు 22వ తేదీన రాత్రి సమయంలో జి.కొండూరు మండలం కుంటముక్కల శివారులో ఇటుక బట్టీల వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ట్రాక్టర్లు పక్కకు తప్పుకునే విషయమై వివాదం తలెత్తింది. ఈ వివాదంలో ఒక ట్రాక్టరుపై ఉన్న యువకుడు సన్నీ తన స్నేహితులకు ఫోన్ చేశాడు. బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు మరో ట్రాక్టరుపై ఉన్న యడవల్లి వెంకటేశ్వరరావు, సానం సాయిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే బాధితులకు మద్దతుగా ఇటుకబట్టీలలో కార్మికులు రావడంతో దాడి చేసిన యువకులు బైకులను వదిలేసి పారిపోయారు. ఈ బైకుల్లో గంజాయి దొరికింది. గంజాయి మత్తులోనే యువకులు దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఐదుగురు కుమార్తెలు, రెండో భార్యకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాజీ గంజాయి వ్యాపారం చేసేవాడు. గంజాయి విక్రయ కేసులో బాజీతో పాటు అతని రెండో భార్య నాగేంద్రమ్మ ఈ ఏడాది మే 30వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. మొదటి భార్య సాయంతో జైలు నుంచి విడుదలైన బాజీ జైలులో ఉన్న రెండో భార్య కుమార్తె చిందే గాయత్రిని ఆగస్టు 31వ తేదీన హత్య చేశాడు. గంజాయి కేసులో తన వివరాలను పోలీసులకు చెప్పిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తగా, వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో ఈ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు. నిందితుడిపై మొత్తం పది గంజాయి, చోరీ కేసులు ఉన్నాయి. అతని వద్ద 27.170 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని పీడీయాక్టును ప్రయోగించారు. ఈ కేసులో బాజీ, అతని రెండో భార్య జైలుపాలవగా కుమార్తె చనిపోయి ఆ కుటుంబం ఛిన్నాభిన్నమైంది. -
ఓంకారేశ్వరునికి నాగాభరణం సమర్పణ
నందిగామరూరల్: గ్రామీణ ప్రాంత ఆలయాల అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆలయ ధర్మకర్త గరికపాటి భగవంత్ తెలిపారు. మండలంలోని అంబారుపేట గ్రామంలో వేంచేసియున్న పార్వతీ సహిత ఓంకారేశ్వర స్వామికి చవట నాగరవితేజ రూ.1.50 లక్షల విలువ చేసే వెండి నాగాభరణాన్ని ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తిక మాసోత్సవాల్లో స్వామి వారికి నాగభరణం అందించటం అబినందనీయమని చెప్పారు. ముఖ్యంగా దాతలు ముందుకు వచ్చి ఆలయాల అభివృద్ధికి తమ వంతుగా సహకరించాలని కోరారు. అనంతరం నాగభరణాన్ని అర్చకులు సంప్రోక్షణ చేసి స్వామి వారికి అలంకరించారు. దాత కుటుంబ సభ్యులను స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు చవట వెంకటకృష్ణ, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. పభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆత్కూరు(గన్నవరం):ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఏలూరు కాలువలో జారిపడి మృతి చెందిన సంఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం...ఆత్కూరు గ్రామానికి చెందిన వేమూల నరేష్(20) విజయవాడలో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గ్రామ శివారులోని ఏలూరు కాలువలో ద్విచక్ర వాహనం కడిగేందుకు వెళ్లాడు. కాలువలోకి దిగిన నరేష్ ప్రమాదవశాత్తూ కాలుజారి లోతులోకి వెళ్లడంతో నీటి మునిగి మృతి చెందాడు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు సంతానంలో చిన్నవాడైన నరేష్ అకాల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తొలుత ప్రభుత్వ ఆస్పత్రిలో సమయాభావం కావడంతో పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఆస్పత్రి వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. చివరికి పోలీసులు జోక్యంతో వైద్యులు పోస్టుమార్టం పూర్తిచేయడంతో మృతదేహాన్ని అప్పగించారు. ముగిసిన ఎస్జీఎఫ్ టేబుల్ టెన్నిస్ టోర్నీ గోపాలపట్నం: స్థానిక ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికల జట్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విభాగాల వారీగా విజేతలు వీరే.. అండర్–14 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో అనంతపురం జిల్లా ప్రథమ స్థానాన్ని, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అండర్–17 విభాగం: బాలుర విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానాన్ని, అనంతపురం, కృష్ణా జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. అండర్–19 విభాగం: బాలుర విభాగంలో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలికల విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానాన్ని, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నాయి. విజేతలకు అధికారులు, కోచ్లు, ఉపాధ్యాయులు అభినందించారు. -
గ్రామీణ వైద్యంపై సమ్మెట
మందుల కొరత లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామీణ వైద్యం దారితప్పింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు 24 రోజుల పాటు సమ్మెలో ఉండటంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ఆందోళన విరమించి వైద్యులు విధుల్లో చేరినా, పెండింగ్ పనులు ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. సంచార వైద్యం గాడిన పడేందుకు వారం, పది రోజుల సమయం పడుతుందని వైద్యులు భావిస్తున్నారు. 25 రోజుల పాటు పర్యవేక్షించేవారు లేక హైరిస్క్ గర్భిణులు ఇబ్బందులకు గురయ్యారు. వైద్యాధికారుల లాగిన్లో ఉండే పలు ఆరోగ్య కార్యక్ర మాలు దాదాపు నెల రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. ఇలా అన్ని రకాలుగా గాడితప్పిన గ్రామీణ వైద్యం మళ్లీ సజావుగా సాగేదెన్నడో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సమ్మె కాలంలో ఇండెంట్ పెట్టే వారు కూడా లేక మందులు కొరత నెలకొంది. మొత్తం 72 పీహెచ్సీలు ఎన్టీఆర్ జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 50 చొప్పున ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 130 మంది వరకూ వైద్యులు పనిచేస్తున్నారు. వారంతా 24 రోజుల సమ్మె చేయగా, అంతకు ముందు సైతం నిరసనలో ఉన్నారు. ఆ సమయంలో కార్యక్రమాలు ఏమీ పట్టించుకోలేదు. సమ్మె కాలంలో ఇన్చార్జి వైద్యులను నియమించినా వారు మొక్కుబడిగా విధులు నిర్వహించి వెళ్లిపోయారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పీహెచ్ సీల్లో చేయాల్సిన పనులన్నీ పెండింగ్లో ఉండిపోయాయి. ఆరోగ్య కార్యక్రమాలతో పాటు, మందుల ఇండెంట్లు, ఇలా అన్ని రకాల సేవలు నిలిచిపోగా, అవన్నీ మళ్లీ గాడిన పడేందుకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేమని సీనియర్ వైద్యులే అంటున్నారు. సంచార వైద్యం లేక.. గత ప్రభుత్వంలో అమలు చేసిన ఫ్యామిలీ ఫిజీషియన్ విధానాన్ని ప్రస్తుతం సంచార వైద్యం పేరుతో నిర్వహించారు. అదికూడా మొక్కుబడిగా నిర్వహించగా, సమ్మెకాలంలో నిలిచిపోయింది. మళ్లీ రూట్ మ్యాపింగ్ ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పెండింగ్ పనులు ఎక్కువగా ఉన్నందున దానిని తిరిగి అమలు చేసేందుకు వారం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే మందుల కోసం సుదూర ప్రాంతంలోని ఆస్పత్రులకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యుల సమ్మెతో కొన్ని కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ప్రస్తుతం వైద్యులందరూ విధుల్లో చేరడంతో సోమవారం నుంచి కార్యక్రమాలపై పర్యవేక్షణ చేస్తాం. మందుల కొరత, ఇతరాత్ర అన్ని విషయాలపై దృష్టి పెడతాం. వైద్య సేవల్లో ఇబ్బందులు లేకుండా చూస్తాం, ఆరోగ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ యుగంధర్, డీఎంహెచ్ఓ, కృష్ణా జిల్లా నెల రోజుల పాటు పీహెచ్సీ వైద్యులు నిరస నలు, సమ్మె చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో మందుల కొరత నెలకొంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లోని విలేజ్ హెల్త్ క్లినిక్స్లో బీపీ మందులు లేవంటున్నారు. రామవరప్పాడులో ఉన్న హెల్త్ క్లినిక్లో ఓ రోగి వెళ్లి బీపీ మందులు అడగ్గా లేవని అక్కడి సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఇలా అన్ని ప్రాంతాల్లో నెల రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులకు వాడే పలు రకాల మందులు అందుబాటులో లేవంటున్నారు. ఇప్పుడు జిల్లా అంతా ఒకేసారి మందులకు ఇండెంట్ పెట్టినా అవి ఎప్పటికీ అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులకు మరిన్ని రోజులు కష్టాలు తప్పేలా లేవు. -
పోట్రైట్ చిత్ర కళాకారుడు సన్నాలకు ఘన నివాళి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రముఖ పో ట్రైట్ చిత్రకారుడు సన్నాల సత్యనారాయణ వరప్రసాద్కు ఆదివారం చిత్రకారులు పోట్రైట్ చిత్రాలతో ఘనంగా నివాళులర్పించారు. ముత్యాలంపాడు ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య, జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో సన్నాల సత్యనారాయణ వరప్రసాద్కు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 25 మంది ప్రోట్రైట్ చిత్రకారులు సన్నాల పోట్రైట్ చిత్రాలను గీసి నివాళులర్పించారు. జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోళ్ల నారాయణరావు అధ్యక్షతన సన్నాల సంస్మరణ సభ జరిగింది. అనంతరం పోట్రైట్ చిత్రాలు గీసిన చిత్రకారులకు సర్టిపికెట్లు అందజేశారు. ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కార్యదర్శి ఎంవీ సాయిబాబు చిత్రకారులు టీవీ, జీవన్ గోషిక, విజయకుమార్, బాలయోగి, మురళీకృష్ణ, రాము అలహరి, కళాసాగర్ రాజు, చిత్రాలయ రాంబాబు, కాంతారావు, సునీల్కుమార్, సర్వేశ్వరరావు పాల్గొన్నారు. -
కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా అమ్రాపాలి
చిలకలపూడి(మచిలీ పట్నం): మోంథా తుపాను పరిశీలన కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా కె.అమ్రాపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, గాలులు వీయనున్న నేపథ్యంలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగ కుండా, అధికారులను అప్రమత్తం చేసేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఆమెను నియమించారు. అమ్రాపాలి సోమవారం కలెక్టరేట్కు వస్తారని అధికారులు తెలిపారు. కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీసిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠంలో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఠం ప్రధానాచార్యుడు డాక్టర్ ఎం.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. కూచిపూడి నాట్యంలో ఎంపీఏ (మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్), సర్టిఫికెట్ కోర్సు, డిప్లమో, యక్ష గానం, సాత్విక అభినయం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను నవంబర్ 15వ తేదీలోగా సెంట్రల్ అడ్మి షన్స్ కమిటీ కన్వీనర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు, రాజమహేంద్రవరం–533124 చిరునామాకు పంపించా లని సూచించారు. రూ.200 ఆలస్య రుసుంతో 20వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు 94413 70591 నంబర్లో సంప్రదించాలని కోరారు. విజయవాడ కల్చరల్: తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన రచయితలు సదా స్మరణీయులని మధువని సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు వి.మధుబాబు అన్నారు. మధువని సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరానిచెందిన సాంస్కృతిక కళా సంస్థల సహకారంతో గాంధీనగర్లోకి కౌతా పూర్ణానందం కళావేదికపై ఆదివారం తెలుగు సినిమా 94 సంవత్సరాల విజయోత్సవ సభ, సినీ సంగీత విభావరి జరిగాయి. మధుబాబు మాట్లాడుతూ.. ఘంటసాల వెంకటేశ్వరరావు, బాలు వంటి గాయకులు, మహాకవి శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి, సినారే, సిరివెన్నెల, చంద్రబోస్ వంటి రచయితలు తెలుగు సిని మాలో సాహిత్య సృష్టితోపాటు అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేసినట్లు పేర్కొన్నారు. మధువని వ్యవస్థాపకుడు మధుబాబును ఆత్మీయంగా సత్కరించారు. గాయనీ గాయకులు పి.కృష్ణారావు, శివప్రసాద్, ఎస్.సత్యనారాయణ, కె.వై.కృపావరం, ఎ.రాఘవ, అన్నపూర్ణ, సుభాషిణి, మల్లీశ్వరి పలు చిత్రగీతాలను మధురంగా ఆలపించారు. ఘంటసాల: వ్యవసాయ రంగంలో విశేష సేవలందించడంతో పాటు పరిశోధన స్థానాల్లో సత్ఫలితాలు సాధించిన ఘంటసాల వ్యవసాయ పరిశోధనా స్థానం, ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ వి.సత్యప్రియ లలిత ఆదివారం పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం పురస్కారం అందు కున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య ప్రియలలిత మాట్లాడుతూ.. రైతు నేస్తం పత్రిక, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అందిస్తున్న వివిధ పురస్కారాల్లో భాగంగా శాస్త్రవేత్తల విభాగంలో తాను ఎంపికయ్యానని పేర్కొన్నారు. హైదరాబాద్ ముచ్చింతల్లోని స్వర్ణ భారత్ ట్రస్టు తరఫున జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదగా పురస్కారం అందుకున్నానని తెలిపారు. సత్య ప్రియలలితను పలువురు అభినందించారు. -
సంఖ్యలు.. ప్రమాద సంకేతాలు!
సాక్షి నెట్వర్క్: తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులకు తుఫాన్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రతి ఏటా తీర ప్రాంత జనం తుఫాన్ ప్రభావాలకు లోనవుతున్నారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో హెచ్చరిక సంఖ్యలు, వాటి తీవ్రతలు గురించి తెలుసుకుందాం. తుఫాన్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో వాతావరణ శాఖ మత్స్యకారులకు సూచించే విధంగా తీరం ఒడ్డున ఉండే ఎత్తయిన భవనాలపై హెచ్చరికలు జారీ చేస్తుంటారు. తుఫాన్ ప్రభావాన్ని మత్య్సకారులకు తెలిపేందుకు చీరాల వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఇప్పటివరకు మూడుసార్లు జారీ చేశారు. 10వ నంబర్ హెచ్చరిక అంటే ‘తీవ్రమైన వాతావరణం తుఫాన్గా రేవు మీదుగా గానీ, దగ్గరగా కానీ తీరాన్ని తాకును’ అనే అర్థం. అంటే ప్రమాదం భారీఎత్తున ఉన్నప్పుడే 10 నంబర్ హెచ్చరిక జారీ చేస్తారు. 11వ నంబర్ హెచ్చరికను జారీ చేస్తే ఎలాంటి వర్తమానాలు లేకుండా అంతా అతలాకుతలంగా మారుతుంది. ఇప్పటివరకు చీరాల రేవులో 11వ నంబర్ హెచ్చరికను జారీ చేయలేదు. చీరాల వాడరేవులో ఇప్పటివరకు 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను కేవలం మూడు సార్లు మాత్రమే జారీ చేశారు. 2021లో వార్దా తుఫాన్కు ఒకసారి, 2012లో జల్ తుఫాను సమయంలో, 2010 లైలా తుఫాన్ సమయాల్లోనే హెచ్చరిక జారీ చేశారు. గతంలో వచ్చిన లైలా, జల్ తుఫాన్లు బీభత్సాన్ని సృష్టించాయి. ఈ తుఫాన్ల కారణంగా భయంకరమైన గాలులు, భారీ వర్షాలు ముంచెత్తడంతో పాటుగా రాకాసి అలలు తీరానికి సంభవించాయి. మత్స్యకారులు బోట్లు ధ్వంసం కాగా, వలలు రాకాసి అలల తాకిడికి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. మత్స్యకారులకు రూ.లక్షల్లో, అన్నదాతలకు రూ.కోట్లలో నష్టాన్ని మిగిల్చాయి. తీరం కోతకు గురవ్వడంతో పాటుగా అనేక ప్రాంతాల్లో రహదారులు సైతం కొట్టుకుపోయాయి. ఎన్నో బ్రిడ్జిలు ముంపునకు గురయ్యాయి. హెచ్చరిక సంఖ్య తీవ్రత 1 నంబర్ అక్కడ ఈదురు గాలి ఉన్న ప్రాంతం ఉన్నది. దానికి తోటు తుఫాను ఏర్పడవచ్చు. 2 నంబర్ తుఫాన్ ఏర్పడి ఉన్నది. 3 నంబర్ ఈదురుగాలులు రేవును తాకవచ్చు. 4 నంబర్ తుఫాన్ తాకినప్పటికి ప్రమాదం లేదు. 5 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును ఎడమ పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 6 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును కుడి పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 7 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవు మీదుగా గాని తీరాన్ని గాని తాకుతుంది. 8 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును ఎడమ పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 9 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవును దాని మార్గమును కుడి పక్కన ఉండునట్లు తీరాన్ని తాకుతుంది. 10 నంబర్ తీవ్రమైన వాతావరణ తుఫాన్గా మారి రేవు మీదుగా గానీ దగ్గరగా గానీ తీరాన్ని తాకుతుంది. 11 నంబర్ తుఫాను ప్రమాదమైనది. వర్తమానాలు లేవు -
మత సామరస్యానికి ప్రతీక గ్యార్మీ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ముస్లిం మైనార్టీలు దైవంగా భావించే మహమ్మద్ ప్రవక్త బోధించిన సన్మార్గంలో నడుచుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని అల్లుడిపేటలో స్టార్ నవ జవాన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన గ్యార్మీ పండుగ వేడుకల్లో వెలంపల్లి పాల్గొని ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కమిటీ ఏర్పాటు చేసిన విందు వడ్డించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్యార్మీ పండుగ మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీక అన్నారు. ఇతరులకు తోచినంతలో సహాయం చేయడం మానవ ధర్మం అన్నారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దానిలో ఎంతో కొంత పేదలకు సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో 40, 41వ డివిజన్ల కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, వక్ఫ్బోర్డ్ డైరెక్టర్ షేక్ ఖాజా తదితరులు పాల్గొన్నారు. నందిగామ టౌన్:ప్రముఖ ఆడిటర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దుకూరి సాయిబాబు తండ్రి ప్రభాకరరావు (56) ఆదివారం మృతి చెందారు. తన నివాసంలో మెట్లపై నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యుడు డాక్టర్ మొండితోక అరుణకుమార్ మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణకుమార్ మాట్లాడుతూ అనారోగ్యం నుంచి కోలుకుంటున్న ప్రభాకరరావు ఆకస్మిక మృతి చెందడం బాధాకరమన్నారు. అనంతరం సాయిబాబు, నరసింహారావుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడ్డి సత్యనారాయణ, పారుపల్లి హరిబాబు, షేక్ మున్నా,షేక్ యాకుబ్ అలీ, మంగళపూడి కోటి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రైవేటు బస్సు.. భద్రత తుస్సు
బస్టాండ్(విజయవాడపశ్చిమ): కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అవి మృత్యు శకటాలుగా మారి నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ట్రావెల్స్ యజమానులు పలువురు నిబంధనలు పాటించకుండా కాలం చెల్లిన బస్సులు నడుపుతున్నారు. ఫిట్నెస్ లేకపోయినా బస్సులు రోడ్లు ఎక్కుతున్నాయి. వాటిపై నిరంతరం నిఘా ఉంచాల్సిన రవాణా శాఖ అధికారులు నామ మాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు హడావిడి చేసి వదిలేస్తున్నారు. ఏడేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు వద్ద జేసీ కుటుంబానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో 20 మందిపైగా మృత్యువాత పడ్డారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో డొల్లతనం బయటపడింది. ఉమ్మడి జిల్లాలో 500లకు పైగా బస్సులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు విజయవాడ రాజధానిగా మారింది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 500లకు పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి మరో 200 వరకు బస్సులు నగరం మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖ, చైన్నె, బెంగళూరు వంటి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు వాటిలో రాకపోకలు సాగిస్తుంటారు. ప్రత్యేకించి సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలతో పాటు వీకెండ్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మూడొంతులు పర్మిట్లు, ఫిట్నెస్ లేకపోవడం, సేఫ్టీ నింబంధనలు పాటించకుండానే రోడ్లపైన తిరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా తిరిగే బస్సులో అత్యధికం ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్నవే. అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్మిట్లు పొంది మన రాష్ట్రంలో విచ్చలవిడిగి తిరుగుతున్నాయి. ఈ బస్సులకు ఫిట్నెస్, పర్మిట్లు ఉన్నాయా? లేవా? ప్రయాణికులతో పాటు సరుకు రవాణా చేస్తున్నాయా అన్న అంశాలను నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికారులు వాటివైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. అంతా అడ్డగోలు కొందరు ట్రావెల్స్ యజమానులు ఫిట్నెస్ ఉన్న బస్సుల నంబర్లతో మరో రెండు మూడు పాత బస్సులను నడుపుతున్నారు. ఒక బస్సు విశాఖ రూట్లో వెళ్తే అదే నంబరుతో మరో బస్సు హైదరాబాద్, ఇంకొకటి బెంగళూరు రూట్లో ప్రయాణిస్తాయి. ఈ విషయాలన్నీ రవాణా శాఖ అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. డ్రైవర్లు ఏ స్థితిలో ఉన్నారో కూడా పట్టించుకోవడం లేదు. 2017లో హైదరాబాద్ జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండలంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది మృత్యువాత పడ్డారు. తాజాగా కర్నూలులో జరిగిన ఘటనలో 20 మంది చనిపోయారు. రెండేళ్ల క్రితం విజయవాడలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన బస్సు అగ్నికి ఆహుతైంది. కారణాలు తెలియలేదు. ఈ ప్రమాదాల నుంచి అటు ట్రావెల్స్ నిర్వాహకులు, ఇటు అధికారులు గుణపాఠం నేర్చుకోవడం లేదు. ప్రయాణికులతోపాటు సరుకు రవాణా విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులనే కాకుండా సరుకు రవాణా చేస్తున్నారు. విజయవాడ ఆటో నగర్, హనుమాన్పేట తదితర ప్రాంతాల్లో నిత్యం ప్రైవేటు బస్సులు సరుకు లోడింగ్ చేసుకుని వెళ్తుంటాయి. పోలీసులు, రవాణా శాఖ అధికారులు వారిపై చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. బస్సుల్లో ఏయే సరుకులు రవాణా చేస్తున్నారో కూడా నిఘా ఉండడం లేదు. కొన్ని బస్సుల్లో కింది భాగంలో బైక్లు ఎక్కిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే బైక్ల్లోని పెట్రోల్ ట్యాంక్లు పగిలి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. బస్టేషన్కు రెండు మూడు కిలో మీటర్ల పరిధిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. అయితే విజయవాడ బస్టాండ్ ఎదురుగానే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. కేబిన్లోనూ ప్రయాణికులను ఎక్కించి దందా సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా తీసు కుని అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఆయా శాఖల అధికారులు స్పందించి ప్రైవేటు బస్సుల్లో ఫిట్ నెస్, పర్మిట్లు, భధ్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖపట్నం, చైన్నె, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తగినన్ని బస్సులను ఆర్టీసీ నడపాలి. ఆర్టీసీ బస్సులు లేక పోవడం వల్లే ప్రైవేటు టావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. సురక్షితం కాదని తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించక తప్పడంలేదు. – తిమోతి, ప్రయాణికుడు, విజయవాడ ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణ లోపించింది. ట్రావెల్స్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. టన్నుల కొద్దీ సరుకును ప్రయాణికుల బస్సుల్లో లోడు చేస్తున్నారు. ఆ బస్సులు పరిమితికి మంచి లోడుతో ప్రయాణిస్తున్నాయి. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. – శరత్, ప్రయాణికుడు, విజయవాడ -
సైకిల్పై విధులకు హాజరైన కృష్ణా కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్పై వచ్చి విధులకు హాజరయ్యారు. శబ్ద, వాయు కాలుష్యం నివారణలో భాగంగా సైకిల్పై లేదా నడక మార్గంలో ప్రతి ఒక్కరూ ఒక రోజైనా విధులకు హాజరు కావాలని ఆయన ఇటీవల ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సైకిల్పై విధులకు హాజరయ్యారు. విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం తెలిపారు. తుపానులో ప్రాణ నష్టం నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి మూడు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులందరూ ఆదివారం సాయంత్రంలోగా తమ ఇళ్లకు చేరుకునే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో సజావుగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విలేజ్ క్లినిక్లలో ఆయుర్వేద గ్రాడ్యుయేట్లను నియమించండి లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని విలేజ్ హెల్త్ క్లినిక్లలో ఆయుర్వేద గ్రాడ్యుయేట్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ను శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ , కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు ఉద్దేశించి 58 సర్జరీలను అనుమతిస్తూ ప్రత్యేక జీఓ ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్కి పాలక మండలి ఏర్పాటు చేయాలని, ఆయుష్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు. డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలకు స్థలం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులకు డీడీఓ పవర్స్ మంజూరు చేయాలనే అంశాలను మంత్రికి వివరించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆయా అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఏపీ ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.బుల్లయ్య తెలిపారు. మంత్రిని కలిసి వారిలో నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల భాను ప్రకాశ్, డాక్టర్ వి.శ్రీధర్, డాక్టర్ రాజ్కమలాకర్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ జి.చినరాజు తదితరులు పాల్గొన్నారు. డెంగీతో సీఆర్పీ మృతి పాయకాపురం(విజయవాడరూరల్): డెంగీతో వారం రోజులుగా బాధ పడుతున్న కమ్యూనిటీ రిసోర్సు పర్సన్ (సీఆర్పీ) వి.శివదుర్గ(36) శనివారం ఉదయం మరణించారు. నగరంలోని 61వ డివిజన్ ప్రశాంతి నగర్లో నివసిస్తున్న శివదుర్గ సీఆర్పీగా విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు సెక్టార్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారం రోజుల క్రితం జ్వరం రాగా వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగీ అని నిర్ధారించారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి భర్త రాజారావు నార్త్ మండలంలో సీఆర్పీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. సీఆర్పీ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న విజయవాడ రూరల్ మండలం విద్యాశాఖాధికారులు ఎ.వెంకటరత్నం, ఎ.సూరిబాబు మండల సీఆర్పీలతో కలసి వెళ్లి ఆమె భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. -
● రహదారి ఇలా.. రాకపోకలు ఎలా?
విస్సన్నపేట నుంచి ఎ.కొండూరు వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. చిన్నపాటి వర్షానికి సైతం ఈ గుంతల్లోకి నీరు చేరుతోంది. పలు విద్యా సంస్థలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ట్రైబల్ బాలుర గురుకుల పాఠశాలతో పాటు ఆస్పత్రులు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. గుంతల కారణంగా వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. పలువురు వాహనచోదకులు ప్రమాదాల బారిన పడ్డారు. అధికారులు స్పందించి రహదారికి మర్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. –విస్సన్నపేట -
సీఎం చేతికి చిన్ని చిట్టా
ఘనంగా నాగులచవితి వేడుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం నాగులచవితి వేడుక ఘనంగా జరిగింది. వేకువ జాము నుంచే పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలుపోసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి మొక్కుబడులు చెల్లించారు. మోపిదేవిలోని ప్రసిద్ధ శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, పెనమలూరు మండలం చోడవరంలో వేంచేసిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత శ్రీనాగేంద్ర స్వామివారి దేవస్థానం భక్తులతో పోటెత్తాయి. సాయంత్రం ప్రజలు బాణసంచా కాల్చి సందడిచేశారు. – సాక్షి నెట్వర్క్ సాక్షి, ప్రత్యేక ప్రతినిఽధి: ‘విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుల మధ్య ఆ రచ్చ ఏంటి? పార్టీ పరువు బజారున పడటం లేదా? వారు ఎందుకింత రోడ్డుపైకి ఈడుస్తున్నారు? ఇంత దారుణమైన పరిస్థితులు మరెక్కడైనా ఉన్నాయా? అలా నేరుగా మీడియాకు ఎక్కడం ఏంటి? పార్టీ అధిష్ఠానం, కేంద్ర కార్యాలయం ఉన్న అమరావతిలోనే ఈ దుస్థితి నెలకొని ఉంటే రాష్ట్రమంతా ఎలాంటి సంకేతాలు వెళతాయి? ప్రజాప్రతినిధులపైన, నాయకులపైన పార్టీకి ఏమాత్రం పట్టులేదని రూఢీ కావడం లేదా? ద్వితీయశ్రేణి నాయకత్వం, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో అంచనాకు అందడం లేదా? మీరంతా కేంద్ర కార్యాలయంలో ఉండి ఏం చేస్తున్నారు? ఇంతలా అవుతున్నా ఎందుకు నా దృష్టికి తీసుకురాలేదు?’ అని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు తెలిసింది. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పొలిట్బ్యూరో సభ్యులతో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుతోనూ దుబాయ్ నుంచి మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీల గురించి తాజా సమాచారం రావడంతో వాటన్నింటిపై విచారించి వాస్తవాలు తెలియజేయాలని సంబంధితులను ఆదేశించినట్లు తెలిసింది. తిరువూరులో ఎమ్మెల్యే వ్యవహారాలపై ఫిర్యాదులు అందగా ఎంపీ కేశినేని చిన్నిపై ఆరోపణల చిట్టా చాంతాడంత చంద్రబాబు చేతికి వెళ్లిందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇసుక, గ్రావెల్, నాటుసారా, గంజాయి అమ్మకాలు తదితరాల గురించి నేతలిరువురు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం, వారి ముఖ్య అనుచరులు వాటిని సవివరంగా ఏకరువు పెట్టడం బహిరంగ రహస్యమే. విజయవాడలో శనివారం జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనగా అందులోనూ చిన్ని, కొలికిపూడి వ్యవహారంపై చర్చ వచ్చింది. ఈ సమావేశంలోనూ వీరిద్దరూ ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది. వీరి వ్యవహారంపై ఒక కమిటీని వేస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర మీడియాకు తెలిపారు. ‘నువ్వేదో సర్వీస్ ఓరియంటెడ్ అనుకున్నా. ఇంత కమర్షియల్ అని అనుకోలేదు. సర్వీస్ అంటే ఏంటో గండిపేటకు వెళ్లి ఎన్టీఆర్ ట్రస్టు చేస్తున్న సేవల గురించి తెలుసుకో. సేవ ఎలా చేయాలో, ఏం చేయాలో తెలిసొస్తుంది..’ అని ఎంపీ కేశినేని చిన్నికి చంద్ర బాబు విజయవాడలో ఓ సందర్భంలో హితవు చెప్పారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’కి వివరించారు. -
కలెక్టరేట్లో మోంథా తుపాను కంట్రోల్ రూమ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో 91549 70454 నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను క్రియాశీలం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఆర్డీఓలు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో మోంథా తుపానుపై కలెక్టర్ లక్ష్మీశ శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్తో పాటు డివిజన్ల వారీగా కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయా లని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, వైద్య – ఆరోగ్యం, అగ్నిమాపక, పౌర సరఫరాలు, మునిసిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి, అవసరం మేరకు పునరావాస శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. విజయవాడ అర్బన్ పరిధిలోని కొండ ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని, గర్భిణులు, వృద్ధులకు పరిస్థితిని బట్టి ముందే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించాలని సూచించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ, వీఎంసీ అధికారులు సమష్టిగా కృషిచేయాలన్నారు. చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉంటే పటిష్ట రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి, ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినా, స్తంభాలు పడిపోయినా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేప ట్టాలన్నారు. వర్షాల కారణంగా కృష్ణానదితోపాటు వాగులు, వంకలకు వరద పోటెత్తే అవకాశం ఉన్నందన్నారు. నదికి వెళ్లే మార్గాలు, వాగులు, వంకల వద్ద వరద హెచ్చరిక బోర్డులను తప్పని సరిగా ఏర్పాటు చేయాలని, వాటిని ఎవరూ తొలగించకుండా చూడాలని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. -
మద్యం షాపు తొలగించాలంటూ ఆందోళన
కృత్తివెన్ను: తమ గ్రామంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని మండలంలోని సీతనపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం వారంతా షాపు వద్దకు చేరుకుని షాపు ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. ఇటీవల సీతనపల్లి గ్రామంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ఎకై ్సజ్ శాఖాధికారులకు, స్థానిక అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినా కూడా వారు స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. తమ గ్రామంలో వెంటనే షాపు తొలగించాలని ఆందోళన చేయడంతో ఎకై ్సజ్ సీఐ రమణ విషయం తెలిసి అక్కడకు వచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి షాపును తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ షాపు నిర్వహణ కుదరదని వారు పట్టుపట్టడంతో షాపును తొలగిస్తున్నట్లు, వేరే ప్రాంతానికి తరలించనున్నట్లు సీఐ తెలిపారు. దీంతో గ్రామస్తులు నిరసన విరమించారు. -
రైతులకు అందుబాటులో ఉండాలి
కంకిపాడు: మండల స్థాయిలో అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సస్యరక్షణ చర్యలు వివరించాలని కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీన ‘వదలని వాన..రైతన్న హైరానా’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి శనివారం ఆమె స్పందించారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.54 లక్షల హెక్టార్లలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి సాగు జరిగిందన్నారు. పైర్లు చిరుపొట్ట, గింజ గట్టిపడే దశలో ఉన్నాయన్నారు. గత ఐదురోజులుగా 107.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 33 గ్రామాల్లో 379 మంది రైతులకు చెందిన 228.4 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనాలు రూపొందించిందన్నారు. శాస్త్రవేత్తల బృందంతో కలిసి, వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటించి పంటల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నామన్నారు. ముఖ్యంగా పొలాల్లో ముంపు నీటిని త్వరగా బయటకు తరలించాలన్నారు. ఎకరాకు 30 కిలోలు యూరియా, 15 కిలోలు పొటాష్ ఎరువులు పైపాటుగా వాడుకోవాలన్నారు. వరిలో పాముపొడ తెగులు ఉధృతి ఎక్కువగా రావటానికి ఆస్కారం ఉంటుందని, ఉధృతి ఎక్కువైతే మొక్కలు ఎండిపోయి చనిపోతాయన్నారు. నివారణకు ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి దుబ్బుకి తగిలేలా 15 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలన్నారు. అగ్గితెగులు ఉధృతికి వాతావరణం అనుకూలంగా ఉందని, తెగులు ఆశించినప్పుడు నూలుకండె ఆకారంలో గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెద్దవి అయి మొక్కలు చనిపోతాయన్నారు. నివారణకు ట్రైసైక్లోజల్ 0.6 గ్రాములు లైదా కాసుగామైసిన్ 2 మిల్లీలీటర్లు, లేదా ప్యూజివన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. సుడిదోమ ఆశిస్తే ఇతోపెన్హాక్స 2 మిల్లీలీటర్లు లేదా 1.5 గ్రాములు ఎసిపేట్, లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోపిడ్ లేదా 0.20 గ్రాములు డయోమిథోకార్బ్ ఇతర వ్యవసాయ శాఖ సూచనల మేరకు మందులు వినియోగించి పైరుపై పిచికారీ చేసుకోవాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకూ వరి కోతలు వాయిదా వేసుకోవాలని, అధిక వర్షాల దృష్ట్యా రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇవ్వాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా వ్యవసాయాధికారి పద్మావతి -
నేరాల నియంత్రణలో ఆర్పీఎఫ్ భేష్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ౖరెల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, రైళ్లు, రైల్వేస్టేషన్లలో నేరాల నియంత్రణలో విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఈ నెల 16 నుంచి 24 వరకు విజయవాడ డివిజన్ ఆర్పీఎఫ్ బృందాలు, జీఆర్పీ, సీఐబీ బృందాల సహకారంతో ప్రత్యేక డ్రైవ్ల ద్వారా పలు కేసులను ఛేదించి నేరస్తులను అరెస్టు చేశారు. తక్కువ సమయంలోనే ఛేదించిన కేసుల వివరాలు... ఆపరేషన్ సటార్క్లో భాగంగా ఆర్పీఎఫ్ పోలీసులు సీపీఎస్ఆర్, కస్టమ్స్ అధికారులతో కలసి ఈ నెల 21న విజయవాడ రైల్వేపార్శిల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. దిమాపూర్ నుంచి విజయవాడకు ‘ఫుడ్ ప్రొడక్ట్–మైక్రో కాఫీ’ పేరుతో బుక్ చేసిన పార్శిల్స్ అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ. 4.8 లక్షల విలువైన నిషేధిత విదేశీ సిగరెట్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ● ఆపరేషన్ యాత్రి సురక్షలో భాగంగా ఈ నెల 12న కాకినాడ స్టేషన్లో జరిగిన గొలుసు చోరీ కేసులో ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు సీసీ ఆధారాలు లేనప్పటికీ పాత నేరస్తులను విచారించారు. వారి ద్వారా చోరీకి పాల్పడిన దొరబాబును అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 16వేల విలువ చేసే బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలు చోరీలకు పాల్పడుతున్న చిత్తురుజిల్లా, కుప్పంకు చెందిన నలుగురు పాత నేరస్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.6.6 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఈనెల 16న రైలు నంబర్ 17209లో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు చైన్ స్నాచింగ్పై నమోదైన కేసులో మైలవరానికి చెందిన రావూరి నాగరాజును అరెస్టు చేసి అతని నుంచి రూ.1.10 లక్షల విలువ చేసే 11 గ్రాముల బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో ఈ నెల 23న గుడివాడలో రైలు నంబర్ 07096లో జరిగిన చోరీ కేసులో నిందితుడు గొరి పర్తి కోటేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైళ్లలో మొబైల్స్ చోరీలో.... ఈ నెల 18న 07229, 16094 నంబర్ రైళ్లలో మొబైల్ ఫోన్ల చోరీలపై నమోదైన కేసులో ఆర్పీఎఫ్ సిబ్బంది పల్నాడు జిల్లాకు చెందిన దుర్గారావును కావలి స్టేషన్లో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ. 35వేలు విలువ చేసే రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ నాన్హే షరిష్టేలో భాగంగా... ఈ నెల 22న తుని రైల్వేస్టేషన్లో ఒంటరిగా తిరుగుతున్న తొమ్మిదేళ్ల బాలుడిని, ఈ నెల 21న బాపట్ల రైల్వే స్టేషన్లో ఒంటరిగా తిరుగుతున్న 16 ఏళ్ల బాలుడిని గుర్తించిన ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని సంరక్షించి విచారించారు. వారిద్దరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురక్షితంగా బంగారు ఆభరణాల బ్యాగు అందజేత... ఈ నెల 24న రైలు నంబర్ 12664లో హెచ్1 కోచ్లో రూ.20 లక్షల విలువ చేసే 200 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును మర్చిపోయి రైలు దిగిన ప్రయాణికురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ ఆర్పీఎఫ్ అధికారులు రైలు నెల్లూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి అక్కడ సిబ్బందికి సమాచారం అందించారు. వారు సురక్షితంగా బ్యాగును స్వాధీనం చేసుకుని టీటీఈ సమక్షంలో బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించి ఆమె బంధువులకు అప్పగించారు. -
ఆర్టీసీ బస్సులో పొగలు
నందిగామ టౌన్: విజయవాడ గవర్నరుపేట–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో పొగలు వ్యాపించిన ఘటన పట్టణం సమీపంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు విజయవాడ నుంచి కోదాడకు ఆర్టీసీ బస్సు 15 మంది ప్రయాణికులతో వెళ్తోంది. నందిగామ పట్టణం సమీపంలోకి వచ్చే సరికి ఒక్కసారిగా బస్సులో పొగలు వ్యాపించాయి. గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దింపి ఆర్టీసీకి చెందిన మరొక బస్సులో పంపించారు. బస్సు ఇంజిన్లో ఆయిల్ లీకవటంతో పొగలు వ్యాపించినట్లు డ్రైవర్ తెలిపారు. కర్నూలు ఘటన మరువక ముందే ఈ విధంగా జరగడంతో ప్రయాణికులు ఆందోళనచెందారు. పొగలు వ్యాపించడంతో రోడ్డుపై నిలిచిపోయిన బస్సు -
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
గన్నవరం: ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కేసరపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...కేసరపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కూరగంటి సంజయ్(26) పదవ తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఇంట్లో బీరువాలో ఉన్న రూ.లక్ష నగదును సంజయ్ గప్చిప్గా తీసుకువెళ్లి స్నేహితులతో కలిసి ఆ నగదును ఖర్చు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి వరప్రసాద్ అతనిని తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన సంజయ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏబీపీలో కీలక సూచికల్లో పురోగతి
●పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి పెట్టాలి ● కేంద్ర ప్రభారి అధికారి నేలపట్ల అశోక్బాబు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం (ఏబీపీ) అమలవుతున్న పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల్లో కీలక సూచికల్లో పురోగతి సాధించినట్లు కేంద్ర ప్రభారి అధికారి నేలపట్ల అశోక్బాబు అన్నారు. ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం మంచి చర్యలు చేపట్టిందని ప్రశంసించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన ఆకాంక్షిత బ్లాకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యల వల్ల పెనుగంచిప్రోలు మండలంలో 25 సూచికల్లో, ఇబ్రహీంపట్నం మండలంలో 18 సూచికల్లో నూరుశాతం లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. మిగిలిన సూచికల్లో కూడా సంతృప్త స్థాయిని సాధించాలని సూచించారు. ఈ మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రైతు సేవా కేంద్రాలు, చెత్త నుంచి సంపద కేంద్రాలు మెరుగ్గా ఉన్నాయని కితాబిచ్చారు. కొండపల్లి బొమ్మలను వివిధ రకాల ఆకృతుల్లో రూపొందించాలని సూచించారు. పాఠశాలల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత శాతం పెంపుపై దృష్టి సారించాలని, కొండపల్లి కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాకులలో మెరుగైన ఫలితాల సాధనకు స్మార్ట్ వ్యవసాయాన్ని చేపడుతున్నామని చెప్పారు. ఏబీపీలో భాగంగా ఆరు కీలక సూచికల్లో నూరు శాతం సంతృప్త స్థాయి చేరుకోవడానికి 2024 జూలైలో ప్రత్యేక డ్రైవ్ ద్వారా ప్రధానమంత్రి ‘సంపూర్ణత అభియాన్‘ కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. జిల్లాలోని రెండు ఏబీపీ మండలాల్లోనూ ఆరు సూచికల్లో నూరు శాతం లక్ష్యాలు సాధించి నీతి అయోగ్ నుంచి జిల్లా, మండల అధికారులు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు పొంది నట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సూచికల్లోనూ సంతృప్త స్థాయి సాధిస్తామని తెలిపారు. ఏబీపీలో ఎ.కొండూరు మండలాన్ని కూడా చేర్చాలని కోరారు. అంతకుముందు కలెక్టరేట్ లోని ఇగ్నైట్ సెల్ లో డీఆర్డీఏ విభాగం ఏర్పాటుచేసిన స్టాల్ను కేంద్ర ప్రభారీ అధికారి అశోక్ బాబు కలెక్టర్ లక్ష్మీశతో కలసి ప్రారంభించారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కె. చైతన్య, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ నరసింహం, ముఖ్య ప్రణాళిక అధికారి వై.శ్రీలత, జెడ్పీ సీఈవో కేకే నాయుడు, కె.ఆర్.ఆర్.సి.స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పోసిబాబు, డీఎంహెచ్ఓ సుహాసిని, డీఆర్డీఏ పి.డి నాంచారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు విమానాలు అత్యవసర ల్యాండింగ్
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఇండిగో సంస్థకు చెందిన రెండు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం మధ్యాహ్నం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సిలిగురి, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రెండు ఇండిగో విమానాలను విజయవాడ విమానాశ్రయానికి మళ్లించారు.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సూచన మేరకు అధికారులు అత్యవసర ల్యాండింగ్కు ఏర్పాట్లు చేయడంతో రెండు విమానాలు మధ్యాహ్నం 2.15 నుంచి 2.20 గంటల మధ్య సురక్షితంగా దిగాయి. గంటన్నర తర్వాత తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్లాయి. హైదరాబాద్లో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా విమానాలను ఇక్కడికి దారి మళ్లించినట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు. -
నందిగామ వద్ద ఆర్టీసీ బస్సులో పొగలు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.నందిగామ చేరుకునే సరికి బస్సులో పొగలు వచ్చాయి. దాంతో అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే తేరుకున్నాడు. బస్సును రోడ్డు పక్కనే ఆపేసి ప్రయాణికుల్ని బస్సు నుండి ఉన్నపళంగా దించేశాడు. పొగలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ప్రయాణికులు సురక్షితంగా బస్సు నుంచి బయటకు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఆ ప్రయాణికుల్ని మరో బస్సులో పంపించారు ఆర్టీసీ సిబ్బంది. -
ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు ముట్టజెప్పా..
తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పరస్పర ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. నాయకుల అవినీతిపై మాటల మంటలు మండుతున్నాయి. ఎమ్మెల్యే కొలికపూడిపై ఎంపీ చిన్ని చేసిన ఆరోపణల నేపథ్యంలో దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. తిరువూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక మాఫియా ఎంపీ కనుసన్నల్లోనే నడుస్తోం దని, నామినేటెడ్ పోస్టులను సైతం ఎంపీ కార్యాలయ సిబ్బంది అమ్ముకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గ రాజకీయాల్లో తలదూరు స్తున్న ఎంపీ వ్యవహారంపై అధిష్టానం ఎదుట తేల్చుకుంటానని, ఈ నెల 24న టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతానని ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం తిరువూరు నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ చిన్ని వావిలాల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొలికపూడిపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను నిఖార్సైన టీడీపీ కార్యకర్తనని, ప్రతిపక్ష పార్టీలతో అంటకాగే రకాన్ని కాదని ఎంపీ అన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్ను విమర్శించే నాయకుల అంతు చూస్తానంటూ ఎంపీ హెచ్చరించారు. నాలుగేళ్లుగా తాను నియోజకవర్గంలో సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేస్తుండగా.. తాను డబ్బులు తీసుకుని పనులు చేస్తున్నట్టు ఆరోపిస్తున్న వ్యక్తుల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ ఎమ్మెల్యేపై పరోక్షంగా విమర్శలు చేశారు. టీడీపీలో కోవర్టులున్నారు టీడీపీలో కోవర్టులు ఉన్నారని.. ఆ కోవర్టులు ఎవరో, ఎక్కడున్నారో అందరికీ తెలుసని ఎంపీ చిన్ని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థుల జన్మదినాల స్టేటస్లు పెట్టుకుంటూ.. పార్టీకి విధేయుడినంటే కార్యకర్తలు ఒప్పుకుంటారా అంటూ ఎంపీ రెచ్చిపోయారు. నాయకుల కోసం పార్టీ శ్రేణులు దెబ్బలు తినాలి గానీ, నేతలు మాత్రం ఇతర పార్టీలతో అంటకాగితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ ఎమ్మెల్యే వైఖరిని తప్పుపట్టారు. ‘తిరువూరు నియోజకవర్గంలో విలేకరులకే వార్నింగ్లు ఇచ్చారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన కనీస విషయాలు తెలియకుండా అన్ని వివాదాలకూ కారణమవుతున్నారు’ అంటూ కొలికపూడిపై ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లిందని ఎంపీ వ్యాఖ్యానించారు. కాగా.. ఎంపీ చిన్ని తిరువూరు పర్యటనలో తనపై చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే కొలికపూడి దీటైన సమాధానం ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారని సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్టు పెట్టారు. 2024 ఎన్నికల్లో చిన్ని తనను రూ.5 కోట్లు అడిగారని, తన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా ఈ సొమ్మును ఆయనకు ఇచ్చానని ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు, మరుసటి రోజు మరో రూ.20 లక్షలు, ఫిబ్రవరి 14న రూ.20 లక్షలు తదుపరి చిన్ని పీఏ మోహన్కు రూ.50 లక్షలు, గొల్లపూడిలో తన మిత్రుల ద్వారా రూ.3.50 కోట్లు ఇచ్చానని వివరించారు. ‘ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం.. నిజం గెలవాలి. నిజమే గెలవాలి’ అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు నియోజకవర్గంలో సంచలనం రేపింది. ఎంపీ, ఎమ్మెల్యేల నడుమ విభేదాల నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్యేను విభేదించే నాయకులు ఎంపీ పర్యటనలో పాల్గొన్నారు. -
● జలదిగ్బంధంలో కృష్ణా కలెక్టరేట్
మచిలీపట్నం నగరంలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కలెక్టరేట్ పరిసరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి మోకాలి లోతు నీళ్లతో రహ దారులన్నీ జలమయమయ్యాయి. కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఏ కార్యాలయానికి వెళ్లాలన్నా మోకాలి లోతు నీళ్లలో నడిచి వెళ్లాల్సి వచ్చింది. కలెక్టరేట్కు వెళ్లే రహదారులన్నీ జలమయం కావటంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రహదారుల్లో వర్షపునీరు నిలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. – చిలకలపూడి(మచిలీపట్నం) -
‘కార్తిక మాసం జ్యోతిర్లింగ దర్శనం’ పేరుతో ప్రత్యేక రైలు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో విజయవాడ డివిజన్లోని రేణిగుంట స్టేషన్ నుంచి ‘కార్తీకమాసం జ్యోతిర్లింగ దర్శనం’ పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 4వరకు జరిగే ఈ యాత్రలో ద్వారకలోని ద్వారకాదీష్ ఆలయం, నాగేశ్వర్ దేవాలయం, ద్వారకా, సోమనాథ్లోని సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్లోని సబర్మతి అశ్రమం, మోథేరా సూర్యదేవాలయం, రాణిక వాప్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ (ఏక్తా నగర్) సందర్శన ఉంటుందన్నారు. రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ స్టేషన్లలో బోర్డింగ్/డీబోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఈ యాత్రలో ఆన్బోర్డు/ఆఫ్బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణ సదుపాయం, రాత్రుళ్లు హోటల్స్లో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్ట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్యాకేజీ ధరలు... ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్) పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 18,400, పిల్లలకు రూ. 17,300, స్టాండర్డ్ (3 ఏసీ)లో పెద్దలకు రూ. 30,200, పిల్లలకు రూ. 28,900, కంఫర్ట్ (2 ఏసీ) పెద్దలకు రూ 39,000, పిల్లలకు రూ. 38,300 టికెట్ ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 9281495848, 9281030714 ఫోన్ నంబర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 4 వరకు యాత్ర -
ముగ్దమనోహరంగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం గాజులతో విశేషంగా అలంకరించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ప్రధాన మూలవిరాట్తో పాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి, ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారికి సప్త వర్ణాలతో మెరిసిపోతున్న గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారి ప్రధాన ఆలయానికి గాజులతో చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. యమ ద్వితీయ, భగిని హస్త భోజనాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కార్తిక మాసంలో అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరిస్తారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, వస్త్రాలంకరణ సేవ, ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అమ్మవారిని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతులు, ఆలయ అధికారులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఉత్సవానికి సుమారు 4.31 లక్షల గాజులను సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పూజా సామగ్రితో పాటు గాజులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో ముత్తయిదువులు గాజులు, పసుపు, కుంకుమను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉత్సవం నేపథ్యంలో 300 మంది సేవా సిబ్బంది 24 గంటల పాటు నిర్విరామంగా సేవలందించి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. అమ్మవారికి అలంకరించిన గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. సర్వాంగ సుందరంగా అలంకరణ గాజుల ఉత్సవం నేపథ్యంలో అమ్మవారి మూలవిరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పెద్ద, మీడియం, చిన్న సైజు గాజులతో అమ్మవారికి అవసరమైన ఆభరణాలను తీర్చిదిద్ది అలంకరించారు. గాజుల అలంకారంలో అమ్మవారి రూపం ముగ్దమనోహరంగా ఉందని భక్తులు అంటున్నారు. సాయంత్రం పెరిగిన రద్దీ ఉదయం 9 గంటల వరకు వాతావరణం సాధారణంగా ఉండటంతో భక్తుల రద్దీ కనిపించింది. 9 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఆ ప్రభావం రద్దీపై కనిపించింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో రద్దీ క్రమంగా పెరిగింది. పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. -
యువత నైపుణ్యాలకు పదును పెట్టాలి
సందడిగా జిల్లా యువజనోత్సవాలువన్టౌన్(విజయవాడపశ్చిమ): యువత తమలోని నైపుణ్యాలకు పదును పెట్టాలని విజయవాడ ఆర్డీవో కె.చైతన్య అన్నారు. యువజన సర్వీసుల శాఖ, స్టెప్, క్రిషి ఆధ్వర్యంలో విజయవాడ కేబీఎన్ కళాశాలలో గురువారం జరిగిన ఎన్టీఆర్ జిల్లా యువజనోత్సవాలు సందడిగా కొనసాగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన చైతన్య మాట్లాడుతూ యువత తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి యువజనోత్సవాలు మంచి వేదికన్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో బహుమతులు సాధించి జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమాధికారి యు.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని చెప్పారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులు బృందగానం, నృత్యం, చిత్రలేఖనం వంటి అంశాలలో పోటీపడ్డారు. జానపద గీతాల విభాగంలో ఎం.సింధు రాజేశ్వరి బృందం మొదటి స్థానంలో నిలవగా, టి.కిరణ్ బృందం ద్వితీయ స్థానంలో నిలిచింది. జానపద నృత్యం విభాగంలో విఘ్నేష్ కార్తికేయ బృందం మొదటి బహుమతిని, కౌశిక్ బృందం రెండో బహుమతిని దక్కించుకున్నాయి. సైన్స్ మేళాలో కె.అఖిల బృందం తొలి స్థానంలో, సీహెచ్ హాసిని బృందం ద్వితీయ స్థానంలో నిలిచాయి. స్టోరీ రైటింగ్లో కె.బాలమణి ప్రసాద్ ప్రథమ బహుమతిని, కె.ప్రదీప్ కుమార్ ద్వితీయ బహుమతిని పొందారు. పొయెట్రీలో ఎం.శ్రీలేఖ, వి.వర్షిణి మొదటి, రెండు స్థానాలు పొందగా, చిత్రలేఖనంలో డి.సుధీక్ష, ఎం.శ్రీ వైష్ణవి, డిక్లమేషన్లో కె.శ్రావణి, ఎస్కే నదియా ప్రథమ ద్వితీయ బహుమతులు పొందారు. విజేతలకు ఆర్డీఓ చైతన్య జ్ఞాపికలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
40 సూచికల్లో వృద్ధి సాధించాలి
పెనుగంచిప్రోలు:నీతి అయోగ్ ఆకాంక్షిత బ్లాక్(ఏబీపీ)లుగా ఉమ్మడి జిల్లాలో పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను గుర్తించామని కేంద్ర ప్రభారీ అధికారి, కేంద్ర జలసంఘం డైరక్టర్ నేలపట్ల అశోక్కుమార్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పెనుగంచిప్రోలు, ముండ్లపాడు గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. పెనుగంచిప్రోలులో తిరుపతమ్మవారి ఆలయం వద్ద వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న డ్వాక్రా సంఘ మహిళలను కలుసుకుని వారితో మాట్లాడారు. వ్యాపారా న్ని మరింత వృద్ధి చేసుకునేందుకు సూచనలు చేశారు. హైస్కూల్లో వంట షెడ్ నిర్మాణం కోసం పాఠశాల పూర్వ విద్యార్థులను సంప్రదించాలని హెచ్ఎంకు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు లేరని ఇన్చార్జీ వైద్యులు వస్తున్నారని, ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీపీ మార్కపూడి గాంధీ, జెడ్పీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి అధికారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై డీఎంహెచ్ఓ మాచర్ల సుహాసిని మాట్లాడుతూ వైద్యుల పోస్టులు కొద్ది రోజుల్లో భర్తీ అవుతాయన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతి అయోగ్ నిర్దేశించిన 40 సూచికల్లో జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలాల్లో వెనుకబడిన సూచికల్లో మరింత వృద్ధి సాధించటానికి అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభారీ అధికారి అశోక్కుమార్ -
గురుకులాల్లో ప్రకృతి సాగుకు ప్రోత్సాహం
జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తిరువూరు:జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నామని, విద్యార్థులకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు పండించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. తిరువూరు మండలం కాకర్ల, రామన్నపాలెం, ఏకొండూరు మండలం కృష్ణారావుపాలెం, ఏకొండూరు గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. కృష్ణారావుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రకృతి సేద్యం ద్వారా సాగుచేస్తున్న దుంపజాతులు, తీగజాతులు, ఆకుకూరలు, కాయగూరలను పరిశీలించారు. తెగుళ్ళ నివారణకు ద్రవ జీవామృతం, ఘన జీవామృతాలను వాడాలని, రసాయన మందులను వినియోగించవద్దని సూచించారు. గురుకుల విద్యార్థులకు పోషక విలువలున్న కూరగాయలు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రకృతి సేద్యంలో విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేయాలన్నారు. రామన్నపాలెంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండిస్తున్న పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, దుంపలను కలెక్టర్ పరిశీలించి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. ఏకొండూరులో ధాన్యం సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ రైతులతో మాట్లాడారు. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజరు శంకర్ నాయక్, ఏకొండూరు తహసీల్దారు లక్ష్మి, డీఎంఎం నాగేశ్వరమ్మ, తిరువూరు ఏడీఏ రంగారావు, వ్యవసాయాధికారి పి.పద్మ పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మచిలీపట్నం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న మచిలీపట్నం–చర్లపల్లి (07642) రైలు, 26న చర్లపల్లి–మచిలీపట్నం (07641) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు. రెండు మార్గాల్లో ఈ రైలు గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుందన్నారు. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ కమిషనరేట్ పరిధిలోని పటమటలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించామని పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఆటోనగర్లో ఉన్న నవ్య బార్ వద్ద వ్యక్తి చనిపోయి ఉన్నాడని పేర్కొన్నారు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన సిబ్బంది ఊరు, పేరు తెలియని సుమారు 30– 35 మధ్య వయసు గల ఒక మగ వ్యక్తి చనిపోయాడని గుర్తించామన్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపారు. మృతుడి వివరాలు తెలియలేదని ఎవరైనా గుర్తిస్తే స్టేషన్ నంబరు, 0866–2542333, ఎస్ఐ నంబరు 9866216282 సంప్రదించాలన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ నగర పాలక సంస్థ చరిత్రలో ఒక పార్కింగ్ ప్రదేశానికి నిర్వహించిన ఈ ఆక్షన్లో రూ.ఐదు కోట్లకు పైగా పలికిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. దీంతో దీనిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. విజయవాడ కెనాల్రోడ్డు వినాయకుని గుడి నుంచి బొడ్డు బొమ్మ సెంటర్ వరకూ వాహనాల పార్కింగ్కు సంబంధించి నగర పాలక సంస్థ ఈ ఆక్షన్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీన పత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో రూ.41,56,130 అప్సెట్ ధరగా నిర్ణయించారు. రూ.10,39,100 ఈఎండీగా నిర్ణయించారు. దానికి సంబంధించి 23వ తేదీ మధ్యాహ్నం బిడ్ తెరిచింది. దానిలో విజయవాడకు చెందిన జీఎం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఐదుకోట్ల 71 లక్షల 26 వేలకు, అలాగే కడపకు చెందిన మరో సంస్థ దానికి సుమారుగా ఆరు వేల తక్కువగా మరో టెండర్ దాఖలు చేసినట్లు తెలిసింది. అయితే ఇది పొరపాటున సున్నా ఎక్కువ వేయటం ద్వారా ఇంత మొత్తం వేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ దీనిని రద్దు చేసుకుంటే వారు చెల్లించిన ఈఎండీ పదిలక్షలు వదులు కోవాల్సి వస్తుంది. మొత్తం మీద ఇది నగర పాలక సంస్థలో చర్చనీయాంశమైంది. -
సీజేఐ గవాయ్పై దాడిని ఖండిస్తున్నాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గాంధీనగర్:దేశ అత్యున్నత న్యాయస్థానం సీజేఐ బీఆర్ గవాయ్పై దాడి దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజేఐపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నో కేసులను సుమోటోగా స్వీకరిస్తున్న పోలీసు వ్యవస్థకు సీజేఐపై దాడి కనిపించడం లేదా అని నిలదీశారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దాడికి బాధ్యులపై కేసు నమోదు చేయలేదని, ఆయన స్థానంలో ఉన్నత కులాలకు చెందిన జడ్జి ఉంటే కేసు నమోదు చేయడంలో ఇలా నిర్లక్ష్యం చేస్తారా అన్నారు. దళితులు ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా కుల రక్కసి వెంటాడుతూనే ఉందన్నారు. దాడి ఘటనను నిరసిస్తూ జాతీయ స్థాయిలో దళితుల ఆత్మగౌరవ పోరాటం చేపడుతున్నామన్నారు. గవాయ్ పై జరిగిన దాడి వల్ల దేశంలో ఉన్న దళితుల హృదయాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయన్నారు. దాడి విషయంలో న్యాయాన్ని కోరుతూ నవంబర్ 1 న లక్షలాది మందితో చలో హైదరాబాద్ పేరుతో దళితుల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఈ ర్యాలీకి ఆత్మగౌరవంతో జీవించాలని కోరుకునే దళిత ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం.నాగరాజు, పేరెల్లి ఎలీషా, నరేంద్ర, డానియల్, లింగాల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మైలవరం:మైలవరంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న నిర్వహించాల్సిన జాబ్మేళా కార్యక్రమం ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణంగా రద్దు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇళ్ళ రవి తెలిపారు. తిరిగి ఈ నెల 31 శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. -
వేయి మునులకుదురులో కార్తికమాస పూజలు
నెలరోజుల పాటు కొండ పై దీపారాధన పెనమలూరు:యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో కార్తికమాస పూజలు నెల రోజుల పాటు చేయనున్నారు. కార్తికమాస ఉత్సవాల సందర్భంగా స్వామివారికి భక్తులు అభిషేకాలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలో యనమలకుదురు గ్రామంలో మునిగిరి అనే పేరు గల కొండ పై శ్రీరామలింగేశ్వరస్వాయివార్ల దేవాలయం కొలువై ఉంది. శివుడు ఇక్కడ శ్రీరామలింగేశ్వరుడిగా ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో శివుడు స్వయంభువుగా వెలిశాడు. దేవాలయంలో శివుడిని వాయులింగంగా కొలుస్తారు. విష్ణుమూర్తి ఆరవ అవతామమైన పరుశురాముడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. ఆ సమయంలో వేయి మంది మునులు కొలువు తీరి యజ్ఞం నిర్వహించనట్లుగా తెలుస్తోంది. పరుశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణప్రతిష్ట చేశాడని స్థల పురాణం చెబుతుంది. వేయి మంది మునులు తపస్సు చే శారని అప్పటి నుంచి వేయి మునులకుదురు కాలక్రమేనా యనమలకుదురుగా పిలుస్తున్నారు. గ్రామంలో 612 అడుగుల ఎత్తు కొండ పై రామలింగేశ్వర ఆలయం కొలువై ఉంది. కొండ పై వేంచేసి ఉన్న రామలింగేశ్వరస్వామి సన్నిధిలో కార్తిక దీపారాధన భక్తులు చేస్తారు. నాలుగు కార్తిక సోమవారాలతో పాటు, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కొండపై దీపాలు వెలిగిస్తారు. భక్తుల సౌకర్యార్థం కొండ పై దీపారాధనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తికమాస పూజలకు ప్రత్యేకం.... రామలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేంద్రస్వామివారి ఆలయంలో శనివారం నాగులచవితి పండుగ చేస్తారు. ఈ నెల 27వ తేదీ మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి శాంతికల్యాణం, నవంబర్ 1వ తేదీవ తేదీన భస్మాభిషేకం, 3వ తేదీ రెండవ కార్తిక సోమవారం శాంతి కల్యాణం, నందీశ్వర అభిషేకం పూజలు నిర్వహిస్తారు. 5వ తేదీ పెద్ద ఎత్తున కార్తిక పౌర్ణమి పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. నవంబర్ 9వ తేదీ పార్వతీదేవి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ప్రత్యేకంగా అలంకరిస్తారు. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఉదయం 8 గంటలకు అన్నాభిషేకం, 11 గంటలకు భక్తులకు అన్నసంతర్పన చేస్తారు. 10వ తేదీ మూడవ కార్తిక సోమవారం సందర్భంగా శాంతి కల్యాణం చేస్తారు. 15వ తేదీన స్వామివారికి మారేడు దళాలతో బిల్వార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవంబర్ 17వ తేదీన 4వ కార్తీక సోమవారం సందర్భంగా శాంతి కల్యాణం, సాయంత్రం నందీశ్వర అభిషేకం చేస్తారు. 18వ తేదీ మాసశివరాత్రి ప్రత్యేక పూజలు చేస్తారు. నవంబర్ 21వ తేదీన ఉద్వాసన సందర్భంగా స్వామివారికి అభిషేకం, విశేష అలంకరణ చేస్తారు. రామలింగేశ్వర సన్నిధిలో దీపారాధన చాలా పవిత్రమైనది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశాం. కార్తిక మాసంలో భక్తులు ప్రతి రోజూ దీపారాధన చేయటానికి వసతులు కల్పించాం. నవంబర్ 9వ తేదీ అన్నసంతర్పణ ఉంటుంది. భక్తులు గోత్రనామాలతో అభిషేకం చేసుకోవచ్చు. – సంగా నరసింహారావు, ఆలయ నిర్మాణ దాత, యనమలకుదురు -
క్రీడలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి
విజయవాడరూరల్:క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయని రాష్ట్ర ఎంఈఓల సంఘం అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, సమగ్ర శిక్ష, ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన రెజ్లింగ్ అండర్–19 పోటీలు గురువారం ముగిశాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటరత్నం రెజ్లింగ్ పోటీల్లో గెలుపొందిన నెల్లూరు జిల్లా జట్టుకు ఓవరాల్ చాంపియన్షిప్ ట్రోఫీలను, వ్యక్తిగత విజేతలకు పతకాలు అందచేశారు. నెల్లూరు జిల్లా క్రీడాకారులు ఈ టోర్నమెంట్ అంతటా అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఫ్రీస్టైల్ విభాగంలో ఆ జట్టు నాలుగు బంగారు పతకాలను రెండు రజత పతకాలను గెలుచుకోవడం ద్వారా 26 పాయింట్లు సాధించింది. గ్రీకో రోమన్ విభాగంలో మూడు బంగారు పతకాలు, మూడు కాంస్య పతకాలతో 18 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు
కృష్ణలంక(విజయవాడతూర్పు):ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్య వ్యవస్థలను కొనసాగాలని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గవర్నర్పేట, రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేవీవీ రాష్ట్ర కమిటీ ప్రచురించిన పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ద్వారా వైద్య విద్యను పొందడమే కాకుండా ప్రతి కాలేజీకి అనుబంధంగా 300 పడకల ఆసుపత్రి కూడా ఉంటుందని చెప్పారు. తద్వారా ఆయా ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలు ఉచిత వైద్య సదుపాయాలు పొందవచ్చని తెలిపారు. మెడికల్ రిప్స్ యూనియన్ నాయకుడు యు.కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య హక్కులకు, పేద ప్రజల వైద్యానికి హామీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోనే సాధ్యమన్నారు. ప్రజారోగ్య వేదిక నాయకుడు రామావతారం మాట్లాడుతూ వైద్య విద్యను ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే పీపీపీ విధానాలను మానుకోవాలని కోరారు. 10 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రభుత్వమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పది మెడికల్ కాలేజీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు, విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు. వాటిని రక్షించుకోవడం కోసం జేవీవీ చేస్తున్న కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు -
జీజీహెచ్లో దివీస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): దివీస్ లేబొరేటరీస్ తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో రోగులు, అటెండెంట్ల కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. న్యూ జీజీహెచ్లో రూ.66.67 లక్షలు వెచ్చించి గంటకు 1000 లీటర్ల సామర్ధ్యం ఉన్న 3 ఆర్ఓ ప్లాంట్లు, గంటకు 100 లీటర్ల సామర్ధ్యం కల 11 ఆర్ఓ ప్లాంట్లను వితరణగా అందజేసింది. వాటిని గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావుతో కలిసి తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, సిబ్బందికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు ముందుకు వచ్చిన దివీస్ లేబొరేటరీస్కు ఎమ్మెల్యే, సూపరింటెండెంట్లు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్(డెప్యూటీ కలెక్టర్) జీవీవీ సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్(పరిపాలనా విభాగం) లక్ష్మీకుమారి, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పెనమలూరుః విద్యార్థులు కళారూపాలలో ప్రావీణ్యం సాధించాలని పాఠశాల విద్యా కమిషనర్ వి.విజయరామరాజు అన్నారు. పోరంకిలో గురువారం రాష్ట్ర స్థాయి కళోత్సవం, సమృద్ధి ఫెస్టివల్ వైభవాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వివరించారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 2020 విద్యా విధానంలో భాగంగా సాధారణ విద్యతో పాటు కళా విద్యను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వినూత్న బోధనా పద్ధతుల ద్వారా తరగతి గదుల్లో సమృద్ధి కళారూపం ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు. 12 రకాల కళారూపాల్లో 348 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పెనుగంచిప్రోలు: గ్రామంలో ఉన్న శ్రీతిరుపతమ్మ వారి మండల దీక్ష మాలధారణ కార్యక్రమం డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతుందని ఆలయ ఈఓ కిషోర్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 21తో ముగుస్తుందన్నారు. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి 10 వరకు అర్ధమండల దీక్ష, జనవరి 16 నుంచి 20 వరకు 11 రోజుల దీక్ష మాలధారణ కార్యక్రమం ఆలయంలో నిర్వహిస్తారని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ ఉద్యోగి జి. రాంబాబు జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2025 టైటిల్ కై వసం చేసుకున్నాడు. కర్నాటక రాష్ట్రం పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9 నుంచి 12 వరకు బెంగళూరులో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాజమండ్రిలో ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న జి.రాంబాబు అద్భుతమైన ప్రదర్శనతో మొదటిస్థానం కైవసం చేసుకున్నాడు. అతను స్క్వాట్–165 కిలోలు, బెంచ్ ప్రెస్–100 కిలోలు, డెడ్లిఫ్ట్–202.5 కిలోల్లో తన ప్రతిభ చాటుకుని టైటిల్ విన్నర్తో పాటుగా మాస్టర్ స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా–2025 బిరుదును అందుకున్నాడు. ఈ సందర్భంగా రాంబాబు గురువారం విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా, ఏడీఆర్ఎం, ఇతర సిబ్బందిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
మంత్రి అనుచరుడి ఇంట్లో పేకాట శిబిరం
కంకిపాడు: పేకాట శిబిరంపై కంకిపాడు పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి రూ 1.72 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ డి.సందీప్ తెలిపిన వివరాల మేరకు...కంకిపాడు గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి అనే వ్యక్తి కొంతమంది పేకాట రాయుళ్లను కూడగట్టి కోలవెన్ను గ్రామానికి చెందిన టీడీపీ నేత, మంత్రి కొలుసు పార్థసారథి అనుచరుడు కొలుసు లక్ష్మణ్ ఉప్పులూరు గ్రామంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో పేకాట కోతముక్క నిర్వహిస్తున్నాడు. పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందటంతో ఆ శిబిరంపై కంకిపాడు ఎస్ఐ డి.సందీప్, ఉయ్యూరు రూరల్ ఎస్ఐ సురేష్ల నేతృత్వంలో పోలీసు సిబ్బంది దాడులు నిర్వహించారు. దాడుల్లో 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ 1.72 లక్షలు నగదు, ఒక కారు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. -
కనుల పండువగా ఆదిదంపతులకు దీపోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీగంగా పార్వతీ(దుర్గ)సమేత మల్లేశ్వర స్వామి వార్లకు పలు విశేష పూజలను నిర్వహించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం ఆదిదంపతులకు దీపోత్సవ సేవను నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదిక వద్ద సహస్ర లింగార్చనను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. లింగార్చనలో భాగంగా స్వామి వారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, హారతి, ప్రసాదాల పంపిణీ జరిగింది. సాయంత్రం ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారికి పంచహారతుల సేవ అనంతరం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. దీపోత్సవంలో భాగంగా ఆదిదంపతులకు ఊంజల్ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య 9.19 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. విజయవాడ ఈస్ట్లో 24.0, వెస్ట్లో 22.8, నార్త్లో 21.3, సెంట్రల్లో 21.0, ఎ.కొండూరు మండలంలో 20.8, విజయవాడ రూరల్ మండలంలో 17.5, తిరువూరులో 11.5, మైలవరంలో 6.5, కంచికచర్లలో 6.3, చందర్లపాడులో 6.3, వీరులపాడులో 6.0, నందిగామలో 5.3, ఇబ్రహీంపట్నంలో 5.3, జి.కొండూరులో 3.3, జగ్గయ్యపేటలో 2.5, పెనుగంచిప్రోలులో 1.8, వత్సవాయిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కాజ్వేపై నుంచి మునేరులో పడిన ఇసుక ట్రాక్టర్
పెనుగంచిప్రోలు: కాజ్వేపై నుంచి ఇసుక ట్రాక్టర్ మునేరులో పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక మునేరు కాజ్వే అవతల నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ అదుపు తప్పి ట్రక్కుతో సహా మునేరులో పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ గోగుల నాగు పక్కకు దూకటంతో తలకు గాయమైంది. ట్రాక్టర్ జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామానికి చెందినది కాగా, డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం రాయగూడెంకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా ఉద్యమంతో పీపీపీని అడ్డుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఈ నెల 28న ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. అందులో భాగంగా ర్యాలీలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేయన్నుట్లు చెప్పారు. ప్రజా ఉద్యమంకు సంబంధించిన పోస్టర్ను గురువారం విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జిలతో కలిసి అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ అంశంపై ఇప్పటికే నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేస్తున్నారన్నారు. ఈ నెల 28న నిర్వహించే ప్రజా ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన రాష్ట్రంలో వైద్యాన్ని అమ్ముకునేలా చంద్రబాబు పాలన ఉందని మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. అడ్రస్ లేని కంపెనీలకు విలువైన భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. వైద్యం ఊపిరి తీస్తున్నారు కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రంలో వైద్య రంగం ఊపిరి తీస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మల్లాది విష్ణు అన్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మెతో గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు బంద్ అయ్యాయని, ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ మాజీ ఎమ్మెల్యే, నందిగామ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు. అనేక ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు కనీసం రక్షిత మంచినీరు కూడా అందివ్వడం లేదన్నారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి ఇతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ ఆసిఫ్, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడి అరెస్టు
ఉయ్యూరు: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పోలీసుస్టేషన్ నుంచి నిందితుడిని ముసుగు తొలగించి నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లి హాజరు పరిచారు. న్యాయమూర్తి శ్రీహరి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. న్యాయస్థానం ఆదేశాలతో నిందితుడు చాన్బాషాను నెల్లూరు జైలుకు తరలించారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు స్థానిక పోలీసుస్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటన వివరాలు వెల్లడించారు. ఉయ్యూరులోని కాపుల రామాలయం ప్రాంతంలో షేక్ చాన్బాషా నివాసం ఉంటున్నాడు. గ్యాస్స్టవ్లు రిపేర్లు చేస్తూ తాపీ కార్మికుడుగా పని చేస్తున్నాడు. తన ఇంటి వద్దకు రోజూ ఆడుకునేందుకు వచ్చే ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఆశ చూపి పైశాచికానందం పొందుతున్నాడు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 21న ఆయన ఇంటికి వచ్చిన బాలిక పెద్దగా కేకలు వేయటంతో ఇరుగుపొరుగు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో దారుణం వెలుగు చూసింది. నిందితుడు బాలికకు వరుసకు మామయ్యే. ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తీవ్రంగా స్పందించటంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రామారావు వేగంగా దర్యాప్తు చేపట్టి ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాప్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ (ఏపీహెచ్డీసీ) డైరెక్టర్స్గా గంగళ్ల జీవిత, పొగాకుల సోమ శేఖర్, పుట్టం శ్రీనివాసరెడ్డి, ఆర్డీఎస్ ప్రసాద్ నియమితులయ్యారు. వీరు గురువారం గాంధీనగర్లోని ఏపీ హ్యాండీక్రాప్ట్స్ కార్యాలయంలో పదవీ ప్రమాణం చేశారు. సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.విశ్వం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం నూతన డైరెక్టర్లను అభినందించారు. భవానీపురం(విజయవాడపశ్చిమ):అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా భవానీపురానికి చెందిన బొడ్డు మురళీకృష్ణ నియమితులయ్యారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంట్ల రామమోహన్రావు గురువారం మురళీకృష్ణకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పర్యటించి ఆర్య వైశ్య ఫెడరేషన్ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇబ్బందుల్లో ఉన్న ఆర్య వైశ్యులను ఆదుకుని తగిన భరోసా కల్పిస్తానని తెలిపారు. ఇప్పటికే వాసవి క్లబ్ అంతర్జాతీయ కో ఆర్డినేటర్గా పని చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని వాసవి సభ్యులు, పేదలకు వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తున్నానని పేర్కొన్నారు. -
ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియామకం
సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ సుబేందు సమంత నియామకం జరిగింది. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్.. గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై రాగా, జస్టిస్ సుబేందు సమంత.. కోల్కతా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చారు. -
‘ఎమ్మెల్యే టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని రూ.5 కోట్లు తీసుకున్నారంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన విషయాలు బయటపెట్టారు. కేశినేని చిన్నికి సంబంధించిన ఆధారాలను కొలికపూడి బయటపెట్టారు. రూ.5 కోట్లు తీసుకుని తనకు తిరువూరు టికెట్ ఇచ్చారన్న కొలికపూడి.. సంచలన ఆధారాలను బయటపెట్టారు.2024 ఎన్నికల్లో కేశినేని చిన్ని నన్ను ఐదు కోట్లు అడిగాన్న కొలికపూడి.. తన అకౌంట్ నుంచి ఎవరెవరికి ఎంత ట్రాన్స్ఫర్ చేశారో ఆయన బయటపెట్టారు. ‘‘2024 ఫిబ్రవరి 7న రూ.20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫ్రిబవరి 8న మరో రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. 2024 ఫిబ్రవరి 14న రూ. 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశా. కేశినేని చిన్ని పీఏ మోహన్కు రూ. 50 లక్షలు.. గొల్లపూడిలో నా మిత్రుల ద్వారా రూ.3.5 కోట్లు ఇచ్చా.. ఈ వివరాలన్నీ రేపు మాట్లాడుకుందాం’’ అంటూ కొలికపూడి సంచలన పోస్టు పెట్టారు. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి అంటూ కొలికపూడి పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.మరోవైపు.. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘‘తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నాడు. నాపై విమర్శలు చేసిన వాళ్లు సాక్ష్యాలు ఇవ్వాలి. నేను డబ్బులు సంపాదించుకోవాలంటే తిరువూరు వరకూ రావాల్సిన అవసరం లేదు. తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి ఇప్పటికే పార్టీ దృష్టికి వెళ్లాయి’’ అని చిన్ని వ్యాఖ్యానించారు. -
పీజీఆర్ఎస్ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమ స్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. పీజీఆర్ఎస్, అందరికీ ఇళ్లు అంశాలపై భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జేసీ కలెక్టర్ ఇలక్కియతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ అర్జీల్లో అపరిష్కృతంగా ఉన్నవాటి వివరాలు శాఖల వారీగా, మండలాల వారీగా తెలపాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దని ఆదేశించారు. భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కీలక ప్రగతి సూచికల్లో (కేపీఐ) ఐసీడీఎస్, పోలీస్ శాఖల అంశాలలో పురోగతి ఉండాలన్నారు. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ లక్ష్మీనరసింహం, కేఆర్ఆర్సీ ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ ఎ.పోసిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఎస్ఎల్ఓ వై.మోహన్రావు పాల్గొన్నారు. పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పండుగల సీజన్లో ప్రయాణికుల రద్దీని నివారించేందుకు భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 12,011 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టిందని విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 973 రైళ్లు కాగా, విజయవాడ డివిజన్ 263 ప్రత్యేక రైళ్లుతో రద్దీని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ డివిజన్ మీదుగా 1,277 రైళ్లు నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇది గత ఏడాదితో పొల్చుకుంటే 5.8 శాతం పెరుగుదల సాధించిదని వివరించారు. గత ఏడాది ఈ కాలంలో విజయవాడ డివిజన్ 1.21 కోట్ల మంది ప్రయాణికులు నమోదవగా, ఈ ఏడాది 1.35 కోట్ల మంది ప్రయాణికుల వృద్ధిని సాధించినట్లు తెలిపారు. అదనపు ప్రయాణికుల డిమాండ్ను తగ్గించేందుకు ఇప్పటికే నడుస్తున్న 68 రైళ్లకు అదనపు కోచ్లను జతచేసినట్లు వివరించారు. గుంటూరు మెడికల్: గుంటూరులో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటైన ఆదిత్య హాస్పిటల్ 15 దేశాల్లో గుర్తింపు పొందిన యూరోపియన్ ఆరోగ్య సంరక్షణ సంస్థ మెడికవర్ హాస్పిటల్స్తో కీలక భాగస్వామ్యంకుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం బుడంపాడులో నిర్మించిన హాస్పిటల్లో రెండు ఆస్పత్రుల యాజమాన్యాలు ఒప్పంద పత్రాలను మార్చుకున్నాయి. రెండు ఆస్పత్రుల కలయికతో గుంటూరు, పరిసర జిల్లాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు, సాంకేతికత పెంపుదలకు దోహదపడతా యని యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఆదిత్య హాస్పిటల్స్ న్యూరాలజిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమూల్య మాట్లాడుతూ.. మెడికవర్తో ఒప్పందం నేపథ్యంలో గుంటూరులో అంతర్జాతీయ స్థాయి ఆధునిక చికిత్సలు చేస్తామన్నారు. ఆదిత్య హాస్పిటల్స్ డైరెక్టర్, చైర్మన్ డాక్టర్ పాకనాటి కృష్ణశ్రవంత్ మాట్లాడుతూ.. రోబోటిక్, ట్రాన్స్ప్లాంట్ సర్జరీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ అత్యాధునిక వైద్యం లభిస్తుందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీల్ కృష్ణ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని నగరాలకు ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను తీసుకురావాలనేది తమ లక్ష్యమని వెల్లడించారు. 2018లో ఆదిత్య మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటైంది. 350 పడకలతో నేషనల్ హైవేపై ఏటుకూరు – బుడంపాడు మధ్య నిర్మించిన ఆస్పత్రి భవనాన్ని నవంబర్ 27న ప్రారంభించనున్నారు. ఇటీవల డాక్టర్ హనుమ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఎంట రాలజీ సేవలు ఈ ఆస్పత్రిలో అందుబాటులోకి వచ్చాయి. జి.కొండూరు: మండలంలోని కవులూరు పోస్టాఫీసులో మహిళా పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించి ఖాతాదారుల సొమ్మును స్వాహాచేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ బుధవారం కొనసాగింది. ఖాతాదారులను పోస్టాఫీసుకు పిలిపించిన అధికారులు వారి నగదు లావాదేవీలను నమోదు చేశారు. నిధుల గోల్మాల్ అంశంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పోస్టాఫీసు వద్దకు చేరుకున్నారు. ఖాతాదారుల్లో ఎక్కువ శాతం కూలిపనులు చేసుకునే పేదలే. ఆడబిడ్డల భవిష్యత్తు అవసరాల కోసం సుకన్య సమృద్ధి పథకంలో డిపాజిట్లు చేస్తున్న వారు ఉన్నారు. ఎనిమిది నెలలుగా పక్కా వ్యూహంతో పోస్టుమాస్టర్ ఖాతాదారుల నిధులు గోల్మాల్ చేసినట్లు సమాచారం. రెండో రోజు విచారణ పూర్తయ్యే సమయానికి రూ.6 లక్షల వరకు గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. ఉన్నతాధికారుల విచారణ మరో వారం రోజులు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. నిధుల స్వాహా నేపథ్యంలో తమ పథకాలు కొనసాగుతాయా లేదా అని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నిధుల గోల్మాల్ అంశం బయటకు పొక్కడంతో పోస్టు మాస్టర్ రూ.2 లక్షల మేర ఇప్పటికే కొంత మంది ఖాతాదారులకు చెల్లించి, మరో రూ.2 లక్షలను కొండపల్లి సబ్ పోస్టాఫీసులో డిపాజిట్ చేసినట్లు సమాచారం. పోస్టుమాస్టర్పై కేసు నమోదు చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారని తెలిసింది. -
ప్రభుత్వం మొండివైఖరి వీడాలి
18వ రోజు కొనసాగిన పీహెచ్సీ వైద్యుల రిలే దీక్షలు లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు బుధవారం 18వ రోజు కొనసాగాయి. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తుండటంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వైద్యులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న ఈ దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెపుతున్నారు. ఇన్సర్వీసు పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ ఇవ్వాలని, ఆ మేరకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా టైమ్బాండ్ పదోన్నతులు, టైం బాండ్ స్కేల్స్ వర్తింపజేయాలంటున్నారు. నిరసనలో అసోసియేషన్ నేతలతో పాటు, వందలాది మంది వైద్యులు పాల్గొన్నారు. కాగా నగరంలో బుధవారం కురిసిన జోరు వర్షంలోనూ దీక్ష కొనసాగించారు. -
రైతులకు వాయు‘గండం’
కంకిపాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావంతో కురుస్తున్న మోస్తరు వర్షాలతో పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. పొట్ట దశ నుంచి కంకులు గట్టిపడే దశలో ఉన్న చేలు నేలవాలితే నష్టం తీవ్రంగా ఉంటుందని భయపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు.. అల్పపీడన ప్రభావంతో కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం నుంచి చిరుజల్లులతో ఆరంభమై భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు, రోడ్డు మార్జిన్లలో నీరు చేరి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరి రైతుల్లో గుబులు.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1.54లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. పెనమలూరు, పామర్రు, గన్నవరం, గుడివాడ, పెడన నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో తొలకరి వర్షాలతో రైతులు వరి నాట్లు వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో వరి పైర్లు చిరుపొట్ట, కంకులు గట్టిపడే దశలో ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు చాలా చోట్ల వరి పైర్లు నేలవాలాయి. కంకులు సుంకు రాలిపోతుందని, చిరుపొట్ట ధ్వంసమై తాలు ఏర్పడుతుందని వాపోతున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలకు కంటి మీద కునుకు కరువైంది. దిగుబడులుపై ప్రభావం.. ఒక్కో రైతు ఎకరాకు ఇప్పటికే రూ.20వేల నుంచి రూ.25వేలు వరకూ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం చిరుపొట్ట, కంకులు దశకు వరి పైర్లు చేరుకున్నాయి. ఈ తరుణంలో కురుస్తున్న మోస్తరు వర్షాలు, వీస్తున్న గాలులకు పైర్లు నేలవాలుతున్నాయి. దీంతో కంకులు నీటిలో నానటం, తాలు తప్ప ఏర్పడటంతో దిగుబడులు గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడులు ఎక్కడ చేతికి అందకుండా పోతాయోనన్న భయంతో రోజులు వెళ్లదీస్తున్నారు. -
ప్రైవేటు వసూళ్లు!
పదో తరగతి పరీక్ష ఫీజులంటూ దోపిడీవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు పరీక్ష ఫీజు పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. వాటిని కట్టలేక తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 2026 మార్చి మాసంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనుంది. ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష రుసుంను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ రుసుం వసూళ్లలో ప్రైవేట్ విద్యాసంస్థలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. అందినకాడికి దండుకునేలా విద్యార్థుల నుంచి తమకిష్టమైన రీతిలో వేలాది రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ విద్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ విడుదల కాని నోటిఫికేషన్.. పదో తరగతి పరీక్ష రుసుంకు సంబంధించి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ను జారీ చేయలేదు. ఇప్పటి వరకూ పరీక్షల షెడ్యూల్ను కూడా ప్రకటించలేదు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ను ప్రకటించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కానీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే తమ దందాను ప్రారంభించాయి. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని దాదాపుగా సగానికి పైగా ప్రైవేట్ యాజమాన్యాలు ఈ దందా కొనసాగిస్తున్నాయని సాక్షాత్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మూడు వేల వరకూ వసూళ్లు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 55వేల నుంచి 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. పరీక్ష ఫీజు చెల్లించి, గడువు ముగిసిన తరువాత ఆ సంఖ్యపై స్పష్టత వస్తుంది. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు నుంచి మూడు వేల వరకూ పరీక్ష ఫీజు అంటూ వసూళ్లకు పాల్పడుతున్నాయి. దసరా సెలవులకు ముందు వరకూ పాఠశాలలు పుస్తకాల విక్రయాలు, వాటి వసూళ్లలో బిజిబిజీగా ఉన్నాయి. దసరా సెలవులు ముగిసిన తరువాత పరీక్ష ఫీజు వసూళ్ల దందాను ప్రారంభించాయని పలువురు మండిపడుతున్నారు. స్కూల్ ఫీజు చెల్లిస్తేనే.. పరీక్షల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కాకముందే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజు కట్టాలని కట్టాలని వెంటపడటానికి కారణం స్కూల్ ఫీజులు వసూళ్ల కోసమని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. తాజాగా పరీక్ష ఫీజు చెల్లించాలంటే తప్పనిసరిగా మొత్తం స్కూల్ ఫీజు చెల్లించాల్సిందేనని, లేకుంటా పరీక్ష ఫీజు తీసుకోమంటూ పాఠశాలల యాజమాన్యాలు వెంటపడుతున్నాయి. ఒక్కసారిగా మొత్తం ఫీజు చెల్లించాలంటే ఎలా? అంటూ పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 మాత్రమేపదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయలేదు. త్వరలోనే పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అప్పుడే పరీక్ష ఫీజు నిర్ణయం తదితర వివరాలు తెలుస్తాయి. దానికి తోడు స్కూల్ ఫీజుతో పరీక్ష రుసుం ముడిపెట్టి విద్యార్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదు. అదేవిధంగా పరీక్ష ఫీజు అధికంగా వసూళ్లకు పాల్పడినట్లుగా తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –యూవీ సుబ్బారావు, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా సాధారణంగా ఏటా పదో తరగతి పరీక్ష ఫీజు కేవలం రూ.125 మాత్రమే ఉంటుంది. అలాగే వొకేషనల్ విద్యార్థులు రూ.185 చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యార్థులు హాజరు మినహాయింపు కోసం రూ.650 సంబంధిత విద్యార్థులు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును నేరుగా చెల్లించకుండా పాఠశాల యాజమాన్యం ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రకటించిన తేదీ దాటిన తరువాత చెల్లించే విద్యార్థులు ప్రభుత్వం ప్రకటించిన అపరాధ రుసుంతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. -
అండర్–19 కుస్తీ పోటీలు ప్రారంభం
విజయవాడరూరల్: మండలంలోని నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల క్రీడా సమాఖ్య (ఏపీజీఎఫ్)అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు స్థానిక అశోక్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏపీ రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.భూషణం, నున్న జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ఎస్.రవిప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ జి.కుమార్ టోర్నమెంట్ పరిశీలకుడు సీహెచ్ రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు, కోచ్లు మేనేజర్లు హాజరయ్యారు. అండర్–19బాలుర, బాలికల ఫ్రీస్టైల్, బాలుర గ్రీకోరోమన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో టెక్నికల్ కమిటీ ఇన్చార్జి పి.ఆనంద్, శాప్ కోచ్లు కె.మనోహర్, ఎస్.కనకదుర్గ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి.శ్రీలత పాల్గొన్నారు. -
ముగిసిన ఖోఖో శిక్షణ శిబిరం
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో గత వారం రోజులుగా జరుగుతున్న రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచ్లు టి. శ్రీనివాసరావు, షేక్ మీరాసాహెబ్ నేతృత్వంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు టీఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు కర్ణాటకలోని దార్వాడ్లో జరిగే సౌత్జోన్ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో మహిళల జట్టు అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచి విజయంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళల జట్టు కర్ణాటకకు బయలుదేరివెళ్లింది. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గోవులకు లంపి స్కిన్ టీకా
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారి గోశాలలో గోవులకు లంపి స్కిన్ టీకాలు వేశామని పశు వైద్యాధికారి పి. అనిల్ తెలిపారు. ‘ఆవులకు లంపి స్కిన్ వ్యాధి’ అనే శీర్షికతో ఈనెల 20న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గోశాలలో వ్యాధి వచ్చిన ఆవు దూడలను గుర్తించి వెంట నే వాటిని మిగతా ఆవుల నుంచి వేరు చేసి వైద్యం అందిస్తున్నామన్నారు. వ్యాధి సోకని వాటిని గుర్తించి, ముందస్తుగా టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా గోశాలకు గోవులు ఇచ్చే రైతుల నుంచి లంపిస్కిన్ టీకా తరువాత మాత్రమే స్వీకరించాలని దేవస్థానం వారికి సూచించిందని వివరించారు. గన్నవరం: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులతో సీఎం చంద్రబాబునాయుడు జరిపిన చర్చలు తీవ్ర నిరాశను కలిగించాయని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి. విద్యాసాగర్ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ 12వ పీఆర్సీ, నాలుగు పెండింగ్ డీఏల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు కొండంత ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎంతో జరిగిన చర్చల తర్వాత కేవలం ఒక డీఏ మాత్రమే ఇవ్వడం కంటి తుడుపు చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ చెందుతున్నట్లు పేర్కొన్నారు. 12వ పీఆర్సీకి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను ఎప్పటి నుంచి ఇచ్చేది కూడా ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. 2010 కంటే నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు పొందేలా సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. ఉయ్యూరు: మైనరు బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించిన ఘటన ఉయ్యూరు పట్టణంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాపు రామాలయం ప్రాంతంలో తాపీ కార్మికుడు చాన్బాషా నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక రోజూ చాన్బాషా ఇంటికి ఆడుకునేందుకు వెళ్తుంది. మంగళవారం చాన్బాషా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటున్న మైనరు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అత్యాచారయత్నానికి పాల్పడేందుకు యత్నించగా, బాలిక భయపడి పెద్దగా కేకలు వేసింది. దీంతో ఇరుగుపొరుగు బాలిక కేకలు విని చాన్బాషా ఇంటికి పరుగెత్తుకుని వెళ్లి చాన్బాషాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేస్తున్నారు. పెనమలూరు: కానూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు కావటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుణదలకు చెందిన మల్లంపల్లి వెంకటస్వామి కానూరు బల్లెంవారి వీధిలో బైక్పై వెళ్తుండగా అతడిని ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతని కుడి కాలికి బలమైన గాయమైంది. బాధితుడిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చిక్సితకు కుటుంబ సభ్యులు చేర్చారు. బాధితుడి సోదరుడు శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన పలువురు భక్తులు మంగళవారం విరాళాలు అందజేశారు. గొల్లపూడికి చెందిన వేమూరి సురేష్ కుటుంబం ఆలయ ఈవో శీనానాయక్ను కలిసి రూ. 1,00,116, సత్యనారాయణపురానికి చెందిన అనిల్, గోవిందరాజు, శైలెజల కుటుంబ సభ్యులు రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా, దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పెనుగంచిప్రోలు: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో రైతులు ధాన్యం అమ్ముకోవటానికి వారి సెల్ఫోన్లోని వాట్సాప్(7337359375)లో షెడ్యూల్ చేసుకోవచ్చన్నారు. ధాన్యం నింపుకోవటానికి సంచులు కూడా జిల్లా యంత్రాంగం నేరుగా అందిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పంట నమోదు 98 శాతం పూర్తయిందన్నారు. రేపు కేంద్ర బృందం పర్యటన.. మండలం ఆస్పిరేషన్ బ్లాక్లో ఉన్నందున ఈనెల 23న కేంద్ర బృందం పెనుగంచిప్రోలు, ముండ్లపా డు గ్రామాల్లో పర్యటించనుందని కలెక్టర్ చెప్పారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మరింత మెరుగు పడాలన్నారు. గోకులం షెడ్లు నిర్మాణం వేగంగా జరగాలని అధికారులకు సూచించారు. మండలంలోని లింగగూడెం గ్రామంలో తాగునీటి సమస్యను తక్ష ణం పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ను ఆదేశించారు. డీఎంహెచ్ఓ ఎం. సుహాసిని, నందిగామ ఆర్డీఓ కె. బాలకృష్ణ, తహసీల్దార్ ఎ. శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి. శ్రీను పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం
17వ రోజు కొనసాగిన పీహెచ్సీ వైద్యుల రిలే దీక్షలు లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘మాకు న్యాయపరంగా రావాల్సిన వాటిని ఇవ్వమని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నాం.. అంతేకానీ కొత్తగా ఏమీ డిమాండ్ చేయడం లేదు’ అని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు అంటున్నారు. తమ సమస్యలపై విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 17వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన వైద్యులు దాదాపు 600 మంది వరకూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ ప్రధాన డిమాండ్లు అయిన ఇన్సర్వీసు కోటా పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ కల్పించడంతో పాటు, అన్ని స్పెషాలిటీ విభాగాల్లోనూ అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు అదనపు భత్యం, 104 సర్వీసుల్లో పనిచేసినందుకు ప్రతి నెలా అదనపు అలవెన్సులు, ముఖ్యంగా టైమ్ బాండ్ పదోన్నతులు, టైమ్ బాండ్ స్కేల్స్ వర్తింపజేయాలని కోరుతున్నామన్నారు. వైద్యులుగా సర్వీసులో చేరిన వాళ్లు ఒక్క ప్రమోషన్ కూడా తీసుకోకుండానే పదవీ విరమణ చేస్తున్న వారు ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్ఞాణేష్, అధ్యక్షుడు రవీంధ్రనాయక్ ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు రేపు గాజుల అలంకరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను గురువారం పది లక్షల గాజులతో అలంకరించనున్నారు. భగిని హస్త భోజనం (యమ ద్వితీయ)ను పురస్కరించుకుని ఏటా కార్తిక మాసంలో అమ్మవారికి గాజులతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారి గాజుల ఉత్సవాన్ని పురస్కరించుకుని గాజుల దండలను సేవా సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. మహామండపం ఆరో అంతస్తులో సుమారు రెండువందల మంది సేవ సిబ్బంది ఉత్సవానికి అవసరమైన గాజుల దండలను తయారు చేస్తున్నారు. అమ్మవారి అలంకరణ నిమిత్తం భక్తులు, ఉభయదాతలు సమర్పించిన గాజులకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈఓ శీనానాయక్ మంగళవారం పూజా కార్యక్రమాలు చేశారు. మంగళవారం సాయంత్రానికి సుమారు ఐదు లక్షల గాజులను భక్తులు సమర్పించారని, మిగిలిన గాజులను దేవస్థానం కొనుగోలు చేస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని గాజుల దండలతో అలంకరిస్తారు. అమ్మవారికి ఆలకరించిన గాజులను ఉత్సవం అనంతరం భక్తులకు పంపిణీచేస్తారు. -
చిన్నారులకు సోకింది సాధారణ వైరల్ ఇన్ఫెక్షనే!
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పెనుగంచిప్రోలు: గ్రామంలోని చిన్నారులకు సోకిన వైరల్ ఇన్ఫెక్షన్ సామాన్యమైనదేనని, ఆందోళన అవసరం లేదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకిందన్న సమాచారం తెలిసిన వెంటనే వైద్య బృందాలను పంపి, ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యం చేయించామని, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి నమూనాలు సేకరించారని వివరించారు. గ్రామంలో వైరల్ ఇఫెక్షన్తో కాళ్లు, చేతులపై బొబ్బలు వచ్చిన చిట్టిమళ్ల గోపి కుమార్త్తెలు విషిత, గీతాసమస్రతో పాటు వారి పొరుగున ఉండే మరో చిన్నారి గానవిని వారి ఇంటి వద్దకు కలెక్టర్ లక్ష్మీశ డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసినితో కలసి వెళ్లి పలకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన చిన్నారుల్లో ఇద్దరికి వెంటనే తగ్గిపోయిందన్నారు. గీతాసహస్రకు విజయవాడ జీజీహెచ్లో పరీక్షలు చేసి వైద్య సేవలు అందించామని, ఆమె కూడా ప్రస్తుతం ఇంటి వద్ద ఆరోగ్యంగా ఉందని తెలిపారు. అనంతరం గ్రామంలోని ఓవర్హెడ్ ట్యాంక్ను పరిశీలించి, తాగునీటిలో క్లోరినేషన్ శాతాన్ని తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, తహసీల్దార్ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను, పలువురు వైద్యాధికారులు పాల్గొన్నారు. -
పీలిస్తే.. ప్రాణాంతకమే!
● టైప్–2 డయాబెటిస్ వచ్చే అవకాశం ●ఇప్పటికే వ్యాధితో ఉన్న వారికి మరింత ప్రమాదం ●మెదడుపై తీవ్ర ప్రభావం ●డిప్రెషన్, మతిమరుపు, పార్కిన్సన్స్ సమస్యలు ●తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు పోరంకికి చెందిన 35 ఏళ్ల రాజేష్ గాంధీనగర్లోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంటారు. నిత్యం ద్విచక్రవాహనంపై విధులకు వస్తుంటారు. ఇటీవల నీరసంగా ఉండటంతో పరీక్ష చేయించుకుంటే సుగర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అతనికి ఫ్యామిలీ హిస్టరీ కూడా లేకపోవడంతో కాలుష్యమే కారణమై ఉంటుందంటుని వైద్యులు చెబుతున్నారు. లబ్బీపేటకు చెందిన 42 ఏళ్ల ఒస్మాన్ మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తుంటారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం సిటీలో బైక్పై తిరుగుతుంటారు. ఇటీవల వాసన గ్రహించలేక పోవడంతో పాటు డిప్రెషన్కు లోనవుతున్నాడు. దీనికీ కాలుష్య ప్రభావమే కారణమని నిపుణులు వివరిస్తున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ట్రాఫిక్ రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. కాలం చెల్లిన వాహనాలు సైతం రోడ్లపై పరుగులు పెడు తూ టన్నుల కొద్దీ కాలుష్యాన్ని ప్రజలపైకి వదులుతున్నాయి. ఏ రోడ్డు చూసినా వందలాది వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అలాంటి రోడ్లపై నిత్యం ద్విచక్రవాహనాలపై తిరిగే వారు వాయు కాలుష్యం కారణంగా పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వాయు కాలుష్యంతో డయాబెటిస్కు దారి తీస్తున్నట్లు ఢిల్లీ, చైన్నెలలో నిర్వహించిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రధాన సమస్యలివే.. ● కాలుష్య ప్రభావంతో మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. ● వాయు కాలుష్యంతో పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంది. ● వాసన గ్రహించలేక ఇబ్బంది పడతారు. ● పార్కిన్సన్స్(వణుకుడు రోగం), డిప్రెషన్కు గురికావచ్చు. ● ఫిట్స్, మైగ్రేన్ తలనొప్పి వంటివి రావచ్చు. ● ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఇలా నివారించవచ్చు.. ● ద్విచక్రవాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్తో పాటు సర్జికల్ మాస్క్ లాంటివి పెట్టుకుంటే మంచిది. ● వీలైనంత వరకూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ (బస్సులు)ను వినియోగిస్తే కాలుష్యం బారిన పడకుండా కొంత వరకూ తగ్గించుకోవచ్చు. ● కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల వినియోగాన్ని నివారించాలి. ● ఎలక్ట్రిక్ వాహనాల వాడకంపై దృష్టి సారించాలి. ● రోడ్ల వెంట విరివిగా మొక్కలు నాటితే కాలుష్య ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి. విజయవాడలో ట్రాఫిక్ కారణంగా రోడ్లపై పొగ కమ్మేసిన దృశ్యంఇలా అనేక మంది వాయు కాలుష్యం కారణంగా మధుమేహంతో పాటు, మెదడు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు. కొత్తగా మధుమేహం బారిన పడటమే కాకుండా, ఇప్పటికే వ్యాధితో ఉన్న వారు కాలుష్య ప్రభావానికి గురైతే, మధుమేహం అదుపులో ఉండని పరిస్థితి తలెత్తుతోందని నిపుణులు చెబుతున్నారు. -
ఇంతటి నిర్లక్ష్యం ఎప్పుడూ చూడలేదు
●పేదల సంజీవని ఆరోగ్యశ్రీపై కక్ష తగదు ● వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదలకు సంజీవనిగా ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నాశనం చేస్తోందని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ విమర్శించారు. నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ప్రారంభించి 19 ఏళ్లు అయ్యిందని, ఏనాడు నెట్వర్క్ ఆస్పత్రులు ఇంత కఠిన పరిస్థితులు ఎదుర్కోలేదని ఆయన పేర్కొన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలు, పేదలకు వైద్యసేవల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేదన్నారు. ఆరోగ్య శ్రీ మొదలైన తర్వాత తొలిసారి బిల్లుల కోసం నెట్వర్క్ ఆస్పత్రులు ఏకంగా ధర్నాకు సిద్ధమవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. వారికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే.. కేవలం 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం, రాష్ట్రంలోని 95 శాతం మంది పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న ఆరోగ్యశ్రీకి రూ. 3వేల కోట్లు కట్టలేదా అని ప్రశ్నించారు. రూ. 5వేల కోట్లు ఖర్చు చేసి పది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరా అని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు మంచిపేరు వస్తుందని ఆరోశ్రీని ఆపేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కో నెట్వర్క్ ఆస్పత్రికి రూ. 2కోట్ల నుంచి రూ. 5కోట్ల వరకూ బకాయిలు పెట్టారని వివరించారు. -
కీలక ప్రగతి సూచికల్లో ఏ గ్రేడ్ సాధించాలి
సమీక్ష సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కీలక ప్రగతి సూచిక (కేపీఐ)ల్లో జిల్లా ర్యాంకు ముందంజలో ఉండాలంటే ప్రతి శాఖా ఉత్తమ పనితీరు కనబరచాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కేపీఐలపై కలెక్టర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని శాఖలు బీ, సీ గ్రేడుల్లో ఉన్నాయని, దీని వల్ల జిల్లా ర్యాంకు ప్రభావితం అవుతోందని చెప్పారు. కేపీఐల లక్ష్యాలను పూర్తి చేసి ప్రతి శాఖ తప్పనిసరిగా ఏ గ్రేడ్ సాధించాలన్నారు. అన్ని కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు (ఈహెచ్ఆర్) నిర్వహించాలన్నారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ కేంద్రానికి వచ్చేలా చూడాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ 100 శాతం జరగాలని స్పష్టంచేశారు. ఐటీఐ విద్యార్థులకు యాడ్ ఆన్ కోర్సుగా కృత్రిమ మేథ(ఏఐ) నేర్పించాలని ఆదేశించారు. జిల్లా విపత్తు తగ్గింపు వ్యూహాన్ని అన్నిచోట్ల అమలు చేయాలన్నారు. ఉన్నత విద్య, ఇంధన శాఖలు ఏ+ గ్రేడు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ విజన్ కార్యాచరణ ప్రణాళిక దేశంలోనే వినూత్నమైనదన్నారు. ప్రతి నెలలో ఒకసారి తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశమై లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి వై.శ్రీలత, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, నియోజకవర్గ విజన్ కార్యాచరణ బృందాల సభ్యులు పాల్గొన్నారు. -
పోస్టాఫీసులో నగదు గోల్మాల్
జి.కొండూరు: ఖాతాదారుల నగదును మహిళా పోస్టుమాస్టర్ స్వాహాచేసిన ఘటన మండలంలోని కవులూరు బ్రాంచ్ పోస్టాఫీసులో వెలుగు చూసింది. ఎనిమిది నెలలపాటు గుట్టుగా సాగిన స్వాహా పర్వం ఉన్నతాధికారుల సాధారణ తనిఖీల్లో బయటపడింది. నిధుల గల్లంతు విషయం ఆ నోటా ఈ నోటా పడి గ్రామంలోని ఖాతాదారులందరికీ తెలిసి ఆందోళన చెందుతున్నారు. తమ పాస్ పుస్తకాలతో మంగళవారం స్థానిక పోస్టాఫీసు వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు పాస్ పుస్తకాలతో కొండపల్లి సబ్పోస్టాఫీసుకు చేరుకుని తమ డిపాజిట్లు ఏమయ్యా యని ఆరా తీస్తున్నారు. గ్రామంలో ఖాతాదారులు భారీగా ఉండడంతో అధికారులు విచారణ పూర్తయిన తరువాతే పోస్టుమాస్టర్ ఎంతమేర గోల్మాల్ చేసిందీ తేలదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 1500లకు పైగా ఖాతాలు కవులూరు గ్రామంలో 1200 వరకు ఇళ్లు ఉండగా 1,712 కుటుంబాలకు చెందిన ఏడు వేల మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. గ్రామలోని బ్రాంచ్ పోస్టాఫీసులో సుమారు 1500లకు పైగా ఖాతాలు ఉన్నాయని సమాచారం. ఎనిమిది నెలలుగా ఖాతా దారులు డిపాజిట్ చేస్తున్న సొమ్మును పోస్టుమాస్టర్ వారి ఖాతాల్లో జమ చేయకుండా ఎగవేస్తున్నట్లు తెలిసింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలు, టీడీ ఖాతాలు, సుకన్య సమృద్ధి వంటి పథకాల కింద గ్రామస్తులు ఎక్కువగా నగదును జమ చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా ఇక్కడ పోస్టుమాస్టర్గా పని చేస్తున్న మహిళ ఖాతా దారుల సొమ్మును ఎగవేసేందుకు పక్కా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఖాతాదారుల నగదును జమ చేసినప్పుడు పుస్తకాలలో రాసి, అకౌంట్లో జమ చేయకపోవడం, ఖాతాదారులు సొమ్ము విత్డ్రా కోసం సంతకాలు సేకరించి వారికి తిరిగి సొమ్ము చెల్లించకుండా కాలయాపన చేయడం, కొందిరి వద్ద ఖాతా పుస్తకాలు సైతం తీసుకొని ఐదు నెలలుగా తిరిగి ఇవ్వకపోవడం వంటి చర్యలతో నగదు గోల్మాల్ చేసినట్లు వ్యక్తమవుతోంది. నా భార్య శ్రీదేవి ఖాతాలో జమ చేసిన రూ.78,222కి గానూ అకౌంట్లో రూ.10 వేలే ఉన్నాయని అధికారులు చెప్పారు. పోస్టాఫీసులో అయితే సొమ్ము భద్రంగా ఉంటుందని దాచుకుంటే అక్కడ కూడా మాయం చేయడం దారుణం. ఉన్నతాధికారులు విచారణ జరిపి మా సొమ్ము మాకు ఇప్పించాలి. పోస్టాఫీసులో నిధుల గల్లంతు విషయం తెలిసి గ్రామస్తులు అందరూ ఆందోళన చెందుతున్నారు. – చెరుకూరి వెంకట నర్సింహారావు, గ్రామస్తుడు, కవులూరు నేను మూడు సంవత్సరాలుగా పోస్టాఫీసులో నెలకు రూ.1500 చొప్పున దాచుకుంటున్నాను. నెల రోజుల క్రితం డబ్బులు అవసరమై విత్డ్రా చేసేందుకు వెళ్తే పోస్టుమాస్టర్ సంతకం పెట్టించుకున్నారు. నెల గడిచినా నాకు రావాల్సిన అసలు రూ.54 వేలు, వడ్డీ గదును ఇంత వరకు ఇవ్వలేదు. ప్రతి రోజూ అడుగుతున్నప్పటికీ మాట దాట వేస్తున్నారు కానీ డబ్బులు ఇవ్వడంలేదు. – చెరుకూరి గంగయ్య, ఖాతాదారుడు, కవులూరు మహిళ అకౌంట్లో నగదు మాయంతో వెలుగులోకి.. కవులూరు పోస్టాఫీసులో సాధారణ తనిఖీలు చేసిన తపాలా శాఖ ఉన్నతాధికారులు ఈ నెల 18వ తేదీన గ్రామానికి చెందిన ఖాతాదారు చెరుకూరి శ్రీదేవిని పోస్టాఫీసుకు పిలిపించి, ఆమె అకౌంట్ పుస్తకాన్ని పరిశీలించారు. అకౌంట్లో రూ.78 వేలు నగదు ఉన్నట్లు నమోదవగా, ఖాతాలో మాత్రం రూ.10 వేలే ఉండడంతో నగదు మాయమైనట్లు గుర్తించారు. ఖాతాదారు శ్రీదేవిని ఎప్పుడైనా నగదు విత్డ్రా చేశారా అని అధికారులు ప్రశ్నించగా తామెప్పుడూ డబ్బులు తీసుకోలేదని ఆమె స్పష్టం చేయడంతో నిధుల గల్లంతు విషయం బయటకొచ్చింది. గ్రామానికి చెందిన జువ్వా రాంబాబు, నిమ్మగడ్డ నాగలక్ష్మి, పసుమర్తి కుమారి కొండపల్లి సబ్ పోస్టాఫీసుకు వెళ్లి ఖాతాలో నగదును చెక్చేయించగా ఏడు నెలలుగా ఖాతాలో నగదు జమకావడంలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో కంగుతిన్నారు. గోల్మాల్ విషయం తెలుసుకున్న కవులూరు గ్రామస్తులు తమ ఖాతా పుస్తకాలతో కొండపల్లి పోస్టాఫీసుకు క్యూ కట్టి ఖాతాలను చెక్చేయించడం ప్రారంభించారు. కొందరి ఖాతాలలో నగదు జమైనట్లు, మరి కొందరి ఖాతాలలో జమ కానట్లు అక్కడ అధికారులు చెప్పడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ విధంగా పోస్టుమాస్టర్ భారీగా నగదును ఎగవేసినట్లు సమాచారం. -
గన్నవరం టీడీపీలో అసమ్మతి కుంపటి
సాక్షి టాస్క్ఫోర్స్: తిరువూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు సమసిపోకముందే గన్నవరంలో నియోజకవర్గంలోనూ అసమ్మతి కుంపటి రగులుకుంది. గత ఎన్నికల ముందు అందరితో సఖ్యతగా మెలిగిన యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచాక అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడలపై టీడీపీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. తాను చెప్పిందే జరగాలన్న ధోరణితో యార్లగడ్డ వ్యవహరించడం, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలతో వివాదాలు పెట్టుకో వడం, అధికారులపై చిందులు తొక్కడం వంటి అంశాలు పార్టీ క్యాడర్కు ఆయనకు మరింత అంతరం పెంచాయి. ఎమ్మెల్యే వైఖరితో విసిగిపోయిన ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ విజయానికి అహర్నిశలూ శ్రమించామని, తీరా గెలిచిన తరువాత తమను దూరం పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. పుట్టిన రోజు వేడుక వేదికగా తిరుగుబాటు వైఎస్సార్ సీపీ నుంచి తన వెంట వచ్చిన నాయకులకే ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ క్యాడర్ను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు రగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం అవకాశం కల్పిస్తే తమ తరఫున ఏఎంసీ మాజీ చైర్మన్ పొట్లూరి బసవరావు పోటీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఇందుకు కేసరపల్లిలో దీపా వళి రోజు జరిగిన బసవరావు జన్మదిన వేడుకను వేదికగా చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి వెంకటబాలవర్ధనరావు, మూల్పూరు బాలకృష్ణా రావు, విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, షుగర్ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్ గూడపనేని ఉమాప్రసాద్, పార్టీ గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ భర్త తుమ్మల ఉదయ్, పార్టీ ముఖ్యనేతలు, గన్నవరం, ఉంగుటూరు, బావులపాడు మండ లాల నుంచి పెద్ద సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎనిమిది వేల మందిపైగా ఈ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం సంచలనంగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరుకాని పలువురు నేతలు సైతం ఫోన్లో సంఘీభావం తెలిపినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ సాగుతోంది. యార్లగడ్డ ఫొటో లేకుండా బసవరావు జన్మదిన బ్యానర్లు, ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేయడం గమనార్హం. గత ఎన్నికల్లో తన విజయానికి కృషిచేసిన పార్టీ సీనియర్లను ఎమ్మెల్యే యార్లగడ్డ దూరంపెట్టారని ఏఎంసీ మాజీ చైర్మన్ పొట్లూరి బసవరావు ఆరోపిస్తున్నారు. సీనియర్లు అంటే ఆయనకు కనీస గౌరవం లేదని, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నామని పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే కేసరపల్లి పర్యటనకు వచ్చినప్పుడు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తమను పోలీసులతో నిర్బంధించారని, ఆయన తీరుతో పార్టీలో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. పార్టీ శ్రేయస్సు కోసం వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని బసవరావు స్పష్టంచేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావు అతికొద్ది కాలంలోనే ఇటు టీడీపీలో, అటు ప్రజల్లో అసంతృప్తిని మూటగట్టుకున్నారు. విజయ డెయిరీ వ్యవహారం, మద్యం షాపుల లైసెన్సులు, అధికారుల బదిలీలు, పార్టీ వ్యవహారాల విషయంలో యార్లగడ్డకు పార్టీ లోని సీనియర్లకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి. యార్లగడ్డ తీరు నచ్చని సీనియర్లు ఆయనకు దూరంగా ఉంటున్నారు. వీరంతా ఒక వర్గంగా ఏర్పడి యార్లగడ్డకు పోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే తీరుపై పార్టీ గన్న వరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వర రావు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి కష్టంలో అండగా నిలబడిన వారిని ఇబ్బంది పెడుతున్నారని, దాడులు చేయడం, తన వద్దకు వెళ్లిన వారిని కించపరచడం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొనట్లు సమాచారం. మద్యం షాపుల టెండర్ల వ్యవహారంలో దరఖాస్తు చేయకుండా బెదిరించి, ముస్తాబాదకు చెందిన టీడీపీ నాయకుడిపై దాడి చేసిన ఘటనపైన నేతలు గుర్రుగా ఉన్నారు. మట్టి తవ్వకాల విషయంలో మంత్రి కొలుసు పార్థసారథిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన నియోజకవర్గంలో కొంత మంది తనకు చెప్పకుండానే పర్యటిస్తున్నారని బహిరంగంగానే ఆరోపించడం వివాదాస్పదమైంది. ఇటీవల నియమించిన గన్నవరం, ఉంగుటూరు మండల కమిటీల వ్యవహారంలో పార్టీ సీనియర్లు తమను పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారు. మొత్తం మీద గన్న వరం నియోజకవర్గంలో ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి కుంపటి రగులుకోవడం చర్చనీయాంశమైంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 30,355 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,715 క్యూసెక్కులు వదులుతున్నారు.పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. అనంతరం అమ్మను దర్శించుకున్నారు.వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు మంగళవారం ఆత్మీయంగా కలిశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పార్టీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ కుమార్, రుహుల్లా, మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కై లే అనిల్కుమార్, పార్టీ నాయకుడు ఆసిఫ్ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని కలిశారు. 7దీపావళి పండుగను ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. ముంగిళ్లను దీపాలతో ముస్తాబు చేశారు. చిన్నాపెద్ద అన్న తేడా లేకుండా టపాసులు కాల్చి సందడి చేశారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా బాణసంచా పేలుడు శబ్దాలతో కేరింతలు కొట్టాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ ఆలయం వద్ద బాణసంచా వెలుగులను ఈ చిత్రాల్లో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఉద్యోగుల డిఏ పై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పై మరో జీవో జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం. డిఏ అరియర్స్ రిటైర్ అయ్యాక చెల్లిస్తామన్న నిబంధన వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం. అరియర్స్ 10 శాతం 2026 ఏప్రిల్ లో చెల్లిస్తామని వెల్లడించింది. 90 శాతం అరియర్స్ 2026 ఆగస్ట్, నవంబర్, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగుల జి పి ఎఫ్ లో జమ చేస్తామని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
‘చంద్రబాబు.. అన్నీ ప్రైవేటుకు అప్పగించి ఇంకేం పాలన చేస్తావ్’
విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలన్నీ ప్రైవేటీకరణ వైపు నడుస్తున్నాయని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అన్నింటినీ ప్రైవేటుకు కట్టబెట్టాలనే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారని ధ్వజమెత్తారు. అన్నింటినీ ప్రైవేటుకు అప్పగించేటప్పుడు ఇక చేసే పాలన ఏముంటుందని ప్రశ్నించారు రామకృష్ణ.మోదీని ప్రసన్నం చేసుకోవడానికి అవసరం లేకపోయినా ఏపీకి ఆహ్వానిస్తున్నారన్నారు.‘వందల కోట్లు ఖర్చు చేసి పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. కర్నూలులో జీఎస్టీ విజయోత్సవం నిర్వహించడం హాస్యాస్పదం. జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్యులకు ఎలాంటి లాభం లేదు. రాష్ట్రానికి కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నెలలో ఏపీకి జీఎస్టీ వల్ల వచ్చింది 3500 కోట్లు మాత్రమే. ఏపీ కంటే జీఎస్టీ వల్ల ఎక్కువ ఆదాయం వచ్చిన రాష్ట్రాలేవీ ఇలా సంబరాలు నిర్వహించలేదు. మోదీని ప్రసన్నం చేసుకోవడానికే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఢిల్లీలో ఈనెల 24,25 తేదీల్లో జాతీయ సిపిఐ సమావేశాలు. దేశవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల పై చర్చిస్తాం. 25వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. నవంబర్ 2,3 తేదీల్లో సిపిఐ స్టేట్ కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి. ఏపీలో భవిష్యత్ కార్యక్రమాలు , పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నాం. మాతో కలిసి వచ్చే అందరినీ కలుపుకుని పోరాడుతాం’ అని రామకృష్ణ స్పష్టం చేశారు.ఇది ఉద్యోగులను దగా చేస్తున్న ప్రభుత్వం -
చంద్రబాబు సర్కార్పై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
సాక్షి, విజయవాడ: డీఏ విడుదలపై ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చర్చల సమయంలో ప్రస్తావనకు రాని అంశాలను జీవోలో చేర్చడం దారుణమన్న ఉపాధ్యాయ సంఘాలు.. సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి.. జీవోలో ప్రస్తావించకపోవడం సరికాదన్నాయి.‘‘ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027-28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాల్లో బకాయిల చెల్లిస్తామనడాన్ని ఖండిస్తున్నాం. 4 డీఏలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క డీఏ మాత్రమే విడుదల చేసి దానిలో గందరగోళానికి గురిచేయమంటే మోసం చేయడమే. ప్రభుత్వం తక్షణమే జీవో 60,61లను సవరించి, సొమ్ము రూపంలో చెల్లించాలి’’ అని యూటీఫ్ డిమాండ్ చేసింది.చంద్రబాబు సర్కార్.. డీఏ జీవోలోనూ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసింది. డీఏ అరియర్స్ రిటైర్ అయ్యాక ఇస్తామంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం డీఏ జీవో ఇచ్చింది. అయితే, డీఏ జీవో చూసి ప్రభుత్వ ఉద్యోగులు షాక్ తిన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): స్థానిక వీరమాచనేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరుగుతున్న ఎన్టీఆర్ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్–2025 పోటీలు ఆదివారంతో ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరై వారిలోని ప్రతిభను ప్రదర్శించారు. మాజీ కార్పొరేటర్ త్రిమూర్తిరాజు, జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి ఎల్.మురళీకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఎల్.శాంతి, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాజీ కోచ్ వై.రామమోహన్ హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. విజేతల వివరాలు.. ● అండర్–12 గరల్స్ విభాగంలో ఏరోబిక్స్, భీమ్ బ్యాలన్స్, ఫ్లోర్ ఎక్స్ర్సైజ్, టేబుల్ వాల్ట్, ట్రంప్లైన్ విభాగాల్లో పి.అనన్య మొదటి బహుమతిని గెలుపొందింది. ● అండర్–12 బాయ్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్స్ర్సైజ్లో ఎల్.శ్రీరామ్, ఏరోబిక్స్లో ఎం.హీమేష్ మొదటి స్థానంలో నిలిచారు. ● జూనియర్ గరల్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్స్ర్సైజ్, భీమ్ ఎక్స్ర్సైజ్, టేబుల్ వాల్ట్, ట్రంప్లైన్ అంశాల్లో పి.ధనీషా, ఏరోబిక్స్ విభాగంలో కె.జాహ్నవి మొదటి బహుమతిని పొందారు. ● జూనియర్స్ బాయ్స్ విభాగంలో ఫ్లోర్ ఎక్సర్సైజ్లో ఎల్.శ్రీరామ్, టేబుల్ వాల్ట్, హైబార్, రోమన్రింగ్స్లో ఎన్.మెహత మొదటి స్థానంలో నిలిచారు. ● సీనియర్స్ ఏరోబిక్స్ విభాగంలో ఎస్.ఐశ్వర్య, ట్రంప్లైన్ విభాగంలో ఎస్.ప్రజ్ఞ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. విజేతలకు అతిథులు ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. -
సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలని, మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర 16వ మహాసభ తీర్మానించిందని సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి తెలిపారు. ఇటీవల జరిగిన 16వ రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మానాలను ఆమె ఆదివారం గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సరళీకరణ ఆర్థిక విధానాల వలన మహిళా రంగంలో జరుగుతున్న మార్పులపై చర్చించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వలస మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోతున్నాయని చెప్పారు. డ్వాక్రా గ్రూపులలో అవినీతిని అరికట్టాలని, డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేకుండా రు.10 లక్షలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, మైక్రో ఫైనాన్స్ దోపిడీ నుంచి కుటుంబాలను రక్షించాలని కోరారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని విన్నవించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. అలాగే ఉచిత గ్యాస్ కొంతమందికే ఇస్తున్నారని, ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అందరికీ 3 సిలిండర్లు ఇవ్వాలని, ప్రతి మహిళకు నెలకు రు.1500 ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం పోరాడాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. ఈ సమావేశంలో ఐద్వా కార్యదర్శి వి.సావిత్రి, కోశాధికారి డి.శ్రీనివాసకుమారి, ఉపాధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి
భవానీపురం(విజయవాడపశ్చిమ): గొల్లపూడి పరిధిలోని రామరాజ్యనగర్లో ఆదివారం వేకువజామున మూడు గంటల సమయంలో ఒక కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రామరాజ్యనగర్లో ఒక ఇంట్లో ఆకాష్ అనే వ్యక్తి ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. పెయింట్స్లో కలిపే టిన్నర్ను లీటర్, రెండు లీటర్ల చొప్పున ప్యాకింగ్ చేస్తుంటారు. ఈ పనులను ఐదుగురు యువకులు చేస్తుంటారు. ఈ క్రమంలో జోరున వర్షం కురుస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షణ్ముఖ శ్రీనివాస్ (16) మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. రమణబాబు (19) గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయాడు. భవానీపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీపావళి పండుగ సందర్భంగా కంపెనీ యజమాని చైన్నె వెళ్లాడు. పీసా పవనసాయి మణికుమార్, మోహన్కృష్ణ ఈ ప్రమాదంలో నుంచి బయటపడ్డారని పోలీసులు తెలిపారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ):కేటీరోడ్డు పరిధిలోని భీమనవారిపేటలో ఓ మెడికల్ షాపు ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కొత్తపేట పోలీసులు ఆదివారం గుర్తించారు. లంబాడీపేటలోని రాకేష్ మెడికల్ స్టోర్స్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడంటూ పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు మెడికల్ షాపు మెట్లపై ఓ యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. అయితే స్థానికులను ఆరా తీయగా ఆ వ్యక్తి ఏలూరుకు చెందిన కె. శేఖర్గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో మహాలక్ష్మి యాగం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ధనత్రయోదశిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలోని నూతన యాగశాలలో ఆదివారం శ్రీమహాలక్ష్మి యాగాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్, వైదిక కమిటీ పర్యవేక్షణలో తొలుత గణపతి పూజ, కలశస్థాపన, పూజా కార్యక్రమాల అనంతరం యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగంలో చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. రాజగోపురం వద్ద ఆలయ అర్చ కులు సూర్య భగవానుడి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరగ గా, పలువురు భక్తులు, ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. నేడు ధనలక్ష్మి పూజ.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం అమ్మవారి ప్రధాన ఆలయంలో ఆలయ అర్చకులు ధనలక్ష్మి పూజ నిర్వహించనున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం పూజను జరిపిస్తారు. అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ దీపాలను వెలగించిన అనంతరం రాజగోపురం ఎదుట దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. -
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మధురానగర్(విజయవాడసెంట్రల్):వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతోనే 60 పీజీ సీట్లు రాష్ట్రానికి లభించాయని వైఎస్సార్ సీపీ వైద్య విభాగం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగరాధాకృష్ణ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అసలు కట్టనే లేదు అని చెప్పిందనీ.. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం 106 మెడికల్ పీజీ సీట్ల గురించి ఘనంగా ప్రచారం చేసుకుంటుందన్నారు. వాటిలో 60 సీట్లు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించిన కాలేజీల్లోనే ఉన్నాయన్నారు. ఈ కాలేజీలు మూడు సంవత్సరాల్లోనే 60 పీజీ సీట్లు పొందడం నిజంగా అద్భుతమని చెప్పారు. ప్రజలకు మంచి మెడికల్ విద్య అందించాలని కోరారు. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు కొనసాగించటం ద్వారా మరింత మెరుగైన వైద్యం అందుతుందన్నారు. పెనమలూరు: ఉరేసుకొని యనమలకుదురులో బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... బోసుబొమ్మ సెంటర్కు చెందిన నాగం ప్రభావతి, రాంబాబు, ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. తల్లి నారాయణ స్కూల్లో ప్రిన్సిపాల్గా పని చేస్తుంది. కాగా వారి పెద్ద కుమారుడు రవిప్రకాష్ (19) గంగూరులో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తల్లి, సోదరుడు తిరువూరు ప్రార్థనలకు వెళ్లారు. ఇంటి వద్దే ఉన్న రవిప్రకాష్ ఫ్యాన్కు ఉరేసుకొని బలవన్మరణరానికి పాల్పడ్డాడు. రవిప్రకాష్ కోసం స్నేహితుడు సాయిరాం వెళ్లగా ఇంట్లో ఉరేసుకొని కన్పించాడు. వెంటనే ఈ సమాచారాన్ని రవిప్రకాష్ తల్లికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియలేదు. ఈ ఘటన పై తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉరేసుకుని యువకుడి.... కృష్ణలంక(విజయవాడతూర్పు):ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న చెందిన ఘటన చోటుచేసుకుంది. రాణిగారితోట, తమ్మిన పోతురాజు వీధిలో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి ఏసుబాబు (20) కూలీ పనులకు వెళ్తుంటాడు. మద్యానికి బానిసవడంతో ఆరోగ్యం క్షీణించింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన సోదరి అంజలి కూడా అనారోగ్యంతో ఉంది. తనతో పాటు తన సోదరి కూడా అనారోగ్యానికి గురైందని తరచూ మనస్తాపం చెందుతుండేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో రూమ్లోకి వెళ్లి పడుకున్నాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు తల్లి రూమ్లోకి వెళ్లి చూడగా రేకుల షెడ్డు ఐరన్ రాడ్కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
దీపోత్సవానికి వేళాయె
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే వేడుక దీపావళికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. హిందువుల పవిత్ర పండుగల్లో ఒకటైన ఈ పర్వదినాన్ని సోమవారం ప్రజలు సంబరంగా నిర్వహించుకోనున్నారు. ఇంటింటా దీపాలు.. లోగిళ్లలో ప్రమిదల వెలుగులు.. వీధుల్లో పటాకుల మోతలతో హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే క్రాకర్స్ విక్రయాలు ఊపందుకున్నాయి. మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. అయితే పటాకులు కాల్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలతో ఆనందంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
దళిత వ్యతిరేకి చంద్రబాబును గద్దె దింపుదాం
మచిలీపట్నంటౌన్: రాష్ట్రంలోని దళితులను అన్ని విధాలుగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పేందుకు ఐక్యంగా సన్నద్ధం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవే టీకరించడాన్ని, నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ‘మాట్లాడుకుందాం.. రండి..’ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ ఎస్సీ సెల్ కృష్ణాజిల్లా అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు, పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం, పెడన, పెనమలూరు నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జి లు పేర్ని కిట్టు, ఉప్పాల రాము, దేవభక్తుని చక్రవర్తి, మచిలీపట్నం పార్లమెంట్ ఇన్చార్జి జెట్టి గురునాథం పాల్గొని మాట్లాడారు. ఎవరిది సంపద సృష్టి.. రాష్ట్రంలోని పేద వర్గాలకు విద్యను, నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టారన్నారు. వాటిలో ఐదు కళాశాలలు ప్రారంభం కాగా, మరో రెండు ప్రారంభానికి సిద్ధమయ్యాయన్నారు. పులివెందుల కళాశాలకు ఎన్ఎంసీ ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినా చంద్రబాబు ప్రభుత్వం వద్దని లేఖ రాసి.. పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేసిందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ ఆస్తులను పెంచితే వాటిని చంద్రబాబు కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. 10 అంశాలపై తీర్మానం.. నకిలీ మద్యం వ్యవహారంపై నిజానిజాలు బయటకు వచ్చేందుకు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, నకిలీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 10 డిమాండ్లను ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్.అంబేడ్కర్, మాజీ ఉప ప్రధాని బాబుజగ్జీవన్రామ్ చిత్రపటాలకు, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ‘మాట్లాడుకుందాం.. రండి’ కార్యక్రమంలో వక్తలు మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వర్గాలకు మేలు జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేర్కొన్నారు. అంబేడ్కర్ కలలుగన్న విధంగా విద్యతోనే సమాజ మార్పు జరుగుతుందన్న విషయాన్ని అమ్మఒడి, నాడు– నేడు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో జగన్ చేసి చూపించారన్నారు. మరోసారి జగన్ను సీఎంను చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని సుధాకర్ బాబు పిలుపునిచ్చారు. -
అభివృద్ధి పేరుతో విధ్వంసం
●కానూరులో పేదల ఇళ్లు తొలగిస్తే సహించం ●ప్రత్యామ్నాయం చూపాలని చక్రవర్తి డిమాండ్ పెనమలూరు:కానూరులో అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే బోడెప్రసాద్ విధ్వంసం సృష్టిస్తున్నాడని, పేదలకు ప్రత్యామ్నయం చూపకుండా ఇళ్లు తొలగిస్తే సహించేదిలేదని వైఎస్సార్ సీపీ పెనమలూరు ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి తెలిపారు. ఆయన ఆదివారం కానూరులో పేదల సమక్షంలో విలేకర్లతో మాట్లాడారు. కానూరులో దాదాపు 40 మంది పేదలు కాలువ కట్టలపై చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని చెప్పారు. గతంలో వీరికి ప్రభుత్వం ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ప్రత్యామ్నయం చూపితే ఇళ్లు ఖాళీ చేస్తామని నివాసితులు స్పష్టం చేశారన్నారు. దరఖాస్తులు కూడా పెట్టారని పేర్కొన్నారు. అయితే దీని పై బోడెప్రసాద్ స్పందించలేదన్నారు. అధికారులు శనివారం అర్ధరాత్రి పొక్లెయిన్లతో వచ్చి ఇళ్లు కూల్చడానికి సిద్ధపడ్డారని తెలిపారు. పేదలతో కలిసి ఆందోళణకు దిగటంతో వెనక్కు తగ్గారన్నారు. నిబంధనల ప్రకారం కానూరు ప్రధాన రహదారి 60 అడుగులు ఉండాల్సి ఉండగా కేవలం 30 అడుగుల్లోనే డ్రెయినేజీలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం చేయటం తగదన్నారు. పేదలకు ప్రత్యామ్నయం చూపితే ఇళ్లు ఖాళీ చేస్తారన్నారు. దందా చేసేందుకే బైక్పై పర్యటనలు.... ఎమ్మెల్యే బోడెప్రసాద్ దందా చేయటానికి బైక్ పై గ్రామాల్లో పర్యటనలు నిర్వహిస్తున్నాడని చక్రవర్తి ఆరోపించారు. గ్రామాలలో బిల్డర్లు, భవన యజమయానులు ఎవరెవరు అదనపు ఫ్లోర్లు నిర్మిస్తుంది వివరాలు సేకరిస్తున్నాడని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పి.రాఘవరావు, వేమూరి బాలకృష్ణ, మండూరు కోటేశ్వరరావు, షుక్.అహ్మద్ అష్రప్, మల్లంపల్లి వెంకటేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చులకనగా మాట్లాడారు... ఎమ్మెల్యే బోడెప్రాద్మ పట్ల చులకనగా మాట్లాడారని బాధితులు ఆరోపించారు. బాధితులు విలేకరుతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శనివారం ఒక్కసాకిగా ఇళ్లలోకి రావటంతో భయాందోళన చెందామన్నారు. మురికివాడలో ఎలా ఉంటారని చులకనగా మాట్లాడరని తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించినట్లు వాపోయారు. -
‘ఆ ఒక్క కిలోమీటర్’ పూర్తి చేస్తే 400 ఎకరాలకు మేలు
వ్యాపారస్తులతో ముఖాముఖీ.. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దీపావళి పండుగ సందర్భంగా విజయవాడలోని కలెక్టరేట్లో 20వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కంకిపాడు: భారీ వర్షంతో వరి పైర్లు నేలవాలాయి. అల్పపీడన ప్రభావంతో ముసురు కొనసాగుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అల్పపీడన ప్రభావంతో శనివారం రాత్రి నుంచి వర్షం విడవకుండా కురుస్తోంది. ఆదివారం కూడా మోస్తరు వర్షం పడింది. వర్షానికితోడు తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీంతో చిరుపొట్ట దశకు చేరిన వరిపైర్లు నేలవాలాయి. మండలంలోని కంకిపాడు, పునాదిపాడు, ఉప్పలూరు గ్రామాల్లో చాలా చోట్ల వరి పొలాలు నేలవాలి నీటిలో నానుతున్నాయి. వర్షం విడవకుండా కురుస్తుండటంతో చిరుపొట్ట దశలో, సుంకు దశలో ఉన్న పైర్లకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీడని ముసురు.. వర్షంతో పాటు ముసురు కొనసాగుతోంది. రెండు రోజులుగా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఉంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొలాల్లో నిలిచిన నీటిని పక్కనే ఉన్న పంట బోదెల్లోకి మళ్లించుకుని వరి కంకులు నీటిలో నానకుండా రైతులు జాగ్రత్త వహిస్తున్నారు. కంకి, చిరుపొట్ట దశలో వర్షంతో నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. జి.కొండూరు: సాగు నీరందించేందుకు తవ్విన కాలువ రైతుల పాలిట శాపంగా మారింది. పాలకుల నిర్లక్ష్యంతో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులకు అడ్డంగా కాలువ తవ్వి, వాగులలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేయడంతో రైతుల సాగు భూములు ముంపునకు గురవుతున్నాయి. రెండు దశాబ్దాలుగా ముంపు బారిన పడి రైతులు నష్టపోతుంటే ప్రభుత్వాలు, స్థానిక పాలకులు చూసీ చూడనట్లు వదిలేయడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, విజయవాడ రూరల్ మండలాల పరిధిలోని కవులూరు, కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో తారకరామా ఎడమ కాలువకు ఆనుకొని ఉన్న రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. సమస్యే ఇది.. ఇబ్రహీంపట్నంలోని థర్మల్ పవర్ స్టేషన్లో వినియోగించిన నీటిని తిరిగి కృష్ణా నది లోకి వెళ్లకుండా బుడమేరు డైవర్షన్ కెనాల్ ద్వారా ఈలప్రోలు గ్రామం వద్ద కుడి, ఎడమ కాలువకు మళ్లించి తారకరామా ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరందించడం లక్ష్యంగా 1982లో ప్రణాళిక రచించారు. కృష్ణాజిల్లాలోని మెట్ట ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, విజయవాడరూరల్, మైలవరం, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, ఆగిరిపల్లి, మండలాల పరిధిలోని 64 గ్రామాలకు చెందిన 56వేల ఎకరాలకు సాగునీరందించే విధంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో కుడికాలువ పొడవు 25.74కిలోమీటర్లు, ఎడమకాలువ పొడవు 51.27కిలోమీటర్లుగా నిర్ధారించారు. మొదటి దశ నిర్మాణంలో భాగంగా రూ.24.97కోట్ల అంచనాలతో.. కుడి కాలువు 6.250కిలోమీటర్ల తవ్వి రెండు పంపుహౌస్లు, ఎడమ కాలువ 8.079కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా కొత్తూరు తాడేపల్లి శివారులో 6.6కిలో మీటర్ల వరకు తవ్వి ఆపేశారు. ఈ మొదటి దశ పనులు 2004నాటికి పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకంలో కుడి కాలువ తవ్వకం, పంపుహౌస్ల నిర్మాణం కోసం రెండు దశల్లో పనులు జరిగినప్పటికీ ఎడమ కాలువ తవ్వకాన్ని మాత్రం చేపట్టలేదు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. వాగులకు అడ్డంగా ఎడమ కాల్వ జి.కొండూరు మండల పరిధిలోని కవులూరు, విజయవాడ రూరల్ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లి గ్రామాలకు ఎగువ నుంచి వచ్చే నల్లవాగు(బుడమేరువాగు), చిల్లవాగు, తాడేపల్లివాగు, తొమ్మండ్రంవాగుల ప్రవాహానికి అడ్డంగా తారకరామా ఎడమ కాలువను తవ్వారు. అయితే ఈ కాలువను ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తే వాగులలో వరద ప్రవాహం తారకరామా ఎడమ కాలువలో కలిసి ముందుకు సాగే వీలుండేది. అలా కాకుండా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేయడంతో పాటు, ఎగువ నుంచి వచ్చే వాగులలో వరద దిగువకు పోయేందుకు అడ్డంగా ఉన్న కాలువకు సైపన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఎడమ కాలువకు ఎగువన ఉన్న వరిపొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన 400ఎకరాల భూమిని సాగు చేసే రైతులు తారకరామా ఎడమ కాలువ తవ్విన నాటి నుంచి అంటే దాదాపు 20ఏళ్లుగా నష్టపోతున్నారు. వరద నీరు పోయే మార్గం లేక నోటికాడకు వచ్చిన పైరు కుళ్లిపోవడం వంటి ఘటనలతో ఇక్కడ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తారకరామా ఎడమ కాలువను 6.6కిలో మీటర్లు మాత్రమే తవ్వి వదిలేసిన వైనం అది కూడా వాగుల ప్రవాహానికి అడ్డంగా తవ్వకం సైపన్లు సైతం ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు వరద సమయంలో ముంపు బారిన పడుతున్న వరి పొలాలు కవులూరు, కొత్తూరు తాడేపల్లికి చెందిన రైతులకు తీవ్ర నష్టం ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి కొద్దిపాటి శ్రద్ధ చూపితే తమకు ముంపు కష్టాలు తీరతాయని ఇక్కడి రైతులు కోరుతున్నారు. కొత్తూరు తాడేపల్లి గ్రామ శివారులో 6.6కిలోమీటరు వద్ద ఆపేసిన తారకరామా ఎడమ కాలువను ఒక కిలోమీటరు పొడగించి.. ఆ గ్రామ తుమ్మల చెరువులో కలిపితే, కాలువలో నీటి ప్రవాహం ముందుకు సాగి, ఎగువ నుంచి వచ్చే వరద తారకరామా ఎడమ కాలువ ద్వారా దిగువకు పోయే అవకాశం ఉంది. లేదంటే ఎగువ నుంచి వచ్చే వాగుల వరద పోయేందుకు తారకరామా ఎడమ కాలువకు కిందగా సైపన్లు ఏర్పాటు చేసినా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. తారకరామా ఎడమ కాలువలో తూడు కాడ లేకుండా ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల సమస్య కొంతమేర పరిష్కారమవుతుంది. తారకరామా ఎడమ కాలువను కొంత తవ్వి అసంపూర్తిగా వదిలేయడం వల్ల ఎగువ వాగుల ద్వారా వచ్చే వరద దిగువకు పోయేందుకు కాలువ అడ్డుగా ఉండడంతో పొలాలు మునిగిపోతున్నాయి. ఇరవై ఏళ్లుగా ఇదే సమస్యతో తీవ్ర నష్టాలు వస్తుండడంతో నాకు ఉన్న తొమ్మిది ఎకరాలను ఇటుక బట్టీల ఏర్పాటుకు లీజుకిచ్చాను. – చెరుకూరి శ్రీనివాసరావు, రైతు, కవులూరు గ్రామం మా గ్రామ శివారులో నేను ఏడు ఎకరాలు కౌలుకి తీసుకొని వరి సాగు చేశాను. తారకరామా ఎడమ కాల్వ వల్ల వరద దిగువకు పోయే అవకాశం లేక పొలం అంతా మునిగిపోయింది. ఐదు ఎకరాలు ఎందుకూ పనికిరాకుండా పోయింది. పై నుంచి వాగులలో వచ్చే వరద పోయేలా చేస్తేనే పొలాలు సాగు చేయగలుగుతాం. – తమ్మెట శ్రీహరి, రైతు, కవులూరు గ్రామం -
బెట్టింగ్, మొబైల్ వ్యసనాల నుంచి బయటపడాలి
● 5కే రన్లో స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ ● రన్ ప్రారంభించిన నగర డీసీపీ కేవీజీ సరితగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆధునిక సమాజానికి బెట్టింగ్, జంక్ఫుడ్, మొబైల్ అడిక్షన్ వంటివి పంచ మహాపాథకాలుగా తయారయ్యాయని 5కే రన్లో వక్తలు పేర్కొన్నారు. సమాజ స్థితిగతులను మార్చి పౌరుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం బీఆర్టీఎస్ రోడ్డులోని శారద కళాశాల జంక్షన్ వద్ద స్లేట్, ది స్కూల్ ఆధ్వర్యంలో స్లేట్ స్మార్ట్ పేరిట 5కే రన్ నిర్వహించారు. ఈ రన్ను నగర డీసీపీ కేవీజే సరిత జెండా ఊపి ప్రారంభించారు. 1572 మంది రన్లో పాల్గొన్నారు. బెట్టింగ్, జంక్ ఫుడ్, రోట్ లెర్నింగ్, లోన్ యాప్స్, మొబైల్ అడిక్షన్ వంటి వాటికి వ్యతిరేకంగా స్లేట్ స్కూల్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించినట్లు వ్యవస్థాపకులు వాసిరెడ్డి అమర్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కుటుంబ శ్రేయస్సునే కోరుకుంటే అది స్వార్థమవుతుందని, సమాజ సేవకు నడుబిగించాలని పిలుపునిచ్చారు. డీసీపీ కేవీజే సరిత మాట్లాడుతూ బెట్టింగ్, లోన్ యాప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఆ అలవాట్లు ఉన్న వారు వాటి నుంచి బయటపడాలని కోరారు. స్వీయ తెలివితేటలు, హార్డ్ , స్మార్ట్ వర్క్తో ముందుకు సాగాలన్నారు. పొదుపు, సహజ రుచులు, సాంకేతిక పరిజ్ఞానం సక్రమ వాడకం, బట్టీ చదువుల్ని వదిలి, విజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించే చదువులపై దృష్టి పెట్టాలన్నారు. సామాజిక అంశాలపై సరైన అవగాహన కలిగి ఉండాలని కోరారు. 5కే రన్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
నడకతో రోగాలు వెనకడుగు!
నడకతో అనేక ప్రయోజనాలు.... ● ప్రతిరోజూ 45 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ● కీళ్లకు మేలు చేస్తుంది. మోకీళ్లు చుట్టూ ఉన్న కండరాలు యాక్టివ్గా కదలికలు ఉంటే , కీళ్లు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన గుజ్జును ఉత్పత్తి చేస్తాయి. ● ఎక్కువుగా వాకింగ్ చేస్తే కీళ్లు అరుగుతాయనేది అపోహ మాత్రమే. ● నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణకోశ సమస్యలున్న వారికి నడక మేలు చేస్తుంది. బీపీ, షుగర్ అదుపులో ఉండేలా చేస్తుంది. ఎక్కడ నడవాలంటే.... ● నగరంలో చాలా మంది సిమెంటు, తారు రోడ్లుపై నడుస్తూ కనిపిస్తున్నారు. వాటిపై నడవడం కీళ్లకు ఆరోగ్యకరం కాదని వైద్యులు అంటున్నారు. ● మట్టి రోడ్డు, ఇసుకలో నడవడం కీళ్లకు మంచిదని పేర్కొన్నారు. ● తారు, సిమెంటు రోడ్డుపై నడిస్తే మోకీళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ● వాకింగ్ చేసేటప్పుడు మంచి షూస్ వేసుకోవడం కూడా ముఖ్యమేనంటున్నారు. ● ట్రెడ్మిల్పై వేగంగా పరుగెడుతుంటారని, గంటకు ఆరు కిలోమీటర్లు మాత్రమే నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. ● డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు ● మోకీళ్లు అరుగుదల మూడో స్టేజ్లో ఉన్న వారు ● స్మోకింగ్తో కాళ్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అలాంటి వారు వాకింగ్ చేయరాదు. ● గుండె సమస్యలున్న వారు, ఆయాసం ఉన్న వా రు వైద్యుల సూచనల మేరకు మాత్రమే చేయాలి. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కీళ్లకు ప్రయోజనం మోకీళ్లలో గుజ్జు తయారయ్యేందుకు నడక అవసరం ఎక్కువ నడిస్తే కీళ్లు అరగడం అపోహే డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
కానిస్టేబుళ్ల ఆత్మీయ సమ్మేళనం
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ కమిషనరేట్కు చెందిన 2004 కానిస్టేబుళ్ల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆటోనగర్లోని ఓ హోటల్లో జరిగింది. 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ సమయంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన బ్యాచ్ సభ్యులకు నివాళులర్పించారు. ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రావిశెట్టి సాంబశివరావు మాట్లాడుతూ ట్రైనింగ్లో తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. దైనందన జీవితంలో నిరంతరం ఒత్తిడితో ఉండే తాము తమ స్నేహాన్ని 20 ఏళ్ల తర్వాత గుర్తు చేసుకునేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అనంతరం ఆటపాటలతో గడిపారు. 2004 బ్యాచ్ కు చెందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
AP: హోంమంత్రి స్టేట్మెంట్పై కాపు సంఘాల ఆగ్రహం
విజయవాడ: దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారనే వాదనకు మరింత బలం చేకూర్చింది హోంమంత్రి అనిత ప్రకటన. ఆర్థిక లావాదేవీల కారణంగానే తిరుమలశెట్టి లక్ష్మీనాయుడిని హత్య చేశారని అనిత వ్యాఖ్యానించడంపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నాయి. హత్య జరిగిన 17 రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన అనిత.. ఆపై ఆర్థిక లావాదేవీలే కారణమని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై కాపు సంఘాలు భగ్గుమంటున్నాయి. హత్య జరిగిన 17 రోజులకి పరామర్శకి రావడమే కాకుండా ఈ తరహాలో వ్యాఖ్యానించడాన్ని కాపు సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కమ్మకొక న్యాయం.. కాపు బిడ్డకి మరొక న్యాయమా? అంటూ కాపు సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించే విధంగా హోంమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ హత్య కేసుపై స్పందించకపోవడాన్ని కూడా వారు నిలదీస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టిని పంపి నగదు ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. ఇదొక మారణకాండ..నెల్లూరులో జరిగింది మారణకాండ అని కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ముగ్గురిపై ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారన్నారు. ప్రమాదం అని చిన్న కేసు నమోదు చేశారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు అంబటిలక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర! -
ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా -
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించాలి
మచిలీపట్నంటౌన్: ప్రతి ఒక్కరూ అవసరం మేరకే వాహనాలు ఉపయోగించి వాయు, శబ్ద కాలుష్య రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కృష్ణా జిల్లా ప్రజలకు కలెక్టర్ డి.కె.బాలాజీ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వాయు, శబ్దకాలుష్య రహిత సమాజం నిర్మాణంపై శనివారం ఆయన మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా మూడు సంభాల సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన సైకిల్ తొక్కుతూ ప్రజలకు శబ్ద, వాయు కాలుష్యంపై అవగాహన కల్పించారు. మూడు స్తంభాల సెంటర్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమ ప్రతిజ్ఞ చేయించారు. అన్నా క్యాంటీన్ను సందర్శించి అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కుంచె నాని, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ కన్నమ నాయుడు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, డ్వామా పీడీ ఎన్.వి.శివ ప్రసాద్ యాదవ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఝాన్సీలక్ష్మి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, విద్యార్థులు పాల్గొన్నారు తొలుత సోలార్ విద్యుత్ (సూర్యఘర్) వాడకంపై అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ టౌన్ ఏడీఈ శ్రీనివాసరావు, రూరల్ ఏడీఈ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
జియోడిటెక్ అసెట్తో కచ్చితమైన మ్యాపులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పటాల(మ్యాపుల) తయారీకి, సర్వేకు అత్యంత కీలకమైన స్టాండర్డ్ బెంచ్ మార్కు(ఎస్బీఎం)లను సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని 1910 నాటి ఎస్బీఎం పునరుద్ధరణ శిలాఫలకాన్ని సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడాతో కలిసి కలెక్టర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ... రాష్ట్రంలో స్టాండర్డ్ బెంచ్ మార్కులు(ఎస్బీఎం) 89, బెంచ్ మార్కులు(బీఎం) వేయికి పైగా ఉన్నాయన్నారు. కలెక్టరేట్లోని 1910 నాటి స్టాండర్డ్ బెంచ్ మార్కును సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటిగా పునరుద్ధరించిందని చెప్పారు. ఈ బెంచ్ మార్కుల సహాయంతో అత్యంత కచ్చితత్వంతో(పొజిషన్) స్థానాన్ని చెప్పవచ్చన్నారు. సర్వేకు, మ్యాపుల రూపకల్పనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్ర పరిశోధనకు ఈ బెంచ్ మార్కులు దోహదం చేస్తాయని, విపత్తు నిర్వహణలో వీటి పాత్ర కీలకమని చెప్పారు. మైదాన ప్రాంతాల్లోని బెంచ్ మార్కులే కాక ఎత్తయిన కొండలపై ఉన్న బెంచ్ మార్కులను కూడా సర్వే ఆఫ్ ఇండియా పరిరక్షిస్తుండడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్వే ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాల డైరెక్టర్ బీసీ పరిడా మాట్లాడుతూ.. జియోడెటిక్ రిజిస్టర్ను రూపొందిస్తున్నామని, ఎన్టీఆర్ జిల్లాలోని బెంచ్ మార్కుల సమాచారంతో కూడిన ఈ రిజిస్టర్ను త్వరలో జిల్లా యంత్రాంగానికి అందజేస్తామని చెప్పారు. సర్వేకు, మ్యాపులకు అత్యంత కీలకమైన ఈబెంచ్ మార్కు లు బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేశారని, వీటిని పునరుద్ధరిస్తున్నామన్నారు. దీనికై మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్ఎల్ఓ వై.మోహన్ రావు, సర్వే ఇన్స్పెక్టర్ ఏ.జగన్మోహన్, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్లు సమీరుద్దీన్ ఖాన్, పి.నిత్యానందం పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
పరిశ్రమలపై నిఘా
పరిశ్రమల నుంచి వ్యర్థాలను కాలువల్లోకి వదల కుండా నిఘా ఏర్పాటు చేశాం. రసాయన వ్యర్థాలతో కూడిన నీటిని శుద్ధి చేసేందుకు ప్రతి కంపెనీలో శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవల విశాఖ నుంచి ట్యాంకర్తో రసాయన వ్యర్థాలను తీసుకొచ్చి జక్కంపూడి వద్ద పోస్తుంటే పట్టు కున్నాం. కొండపల్లి ఐడీఏలోని కంపెనీల్లో రసా యన వ్యర్థాల సీవేజ్ ట్యాంకర్లతో బయట పో స్తుండగా గుర్తించాం. నిరంతరం నిఘాతో రసాయనాలు కాలువల్లో కలవకుండా చూస్తున్నాం. – పి.శ్రీనివాసరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, పీసీబీ -
రైళ్లలో వేర్వేరు చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్ట్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులను దృష్టి మరల్చి బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ తెలిపారు. విజయవాడ రైల్వేస్టేషన్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిందితుల నుంచి రూ.6.10 లక్షల బంగారు ఆభరణాలను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. దృష్టిమరల్చి ఆభరణాల చోరీ.. విజయనగరం, హనుమాన్నగర్కు చెందిన గుల్లిపల్లి సరస్వతి తన భర్తతో కలసి ఈ నెల 16న విజయవాడ రైల్వేస్టేషన్లో దిగారు. ఉదయం 7 గంటల సమయంలో ఆమె ప్లాట్ఫాం నంబర్ – 1లోని సులభ కాంప్లెక్స్లో స్నానానికి వెళ్తూ బంగారు ఆభరణాలను భర్త తన ఫ్యాంట్ జేబులో ఉంచి భార్యకు అప్పగించి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి రెండు పది రూపాయల నోట్లు కిందపడ్డాయి అని చెప్పడంతో ఆమె వాటిని తీసుకునే క్రమంలో మహిళ చేతిలోని ఫ్యాంట్ను తీసుకుని పరారయ్యాడు. దీనిపై బాధితురాలు అదే రోజు జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రావులపాలెంకు చెందిన గండ్రోతు సాయినాగలక్ష్మీ మౌనిక ఈ నెల 15న కృష్జార్జునపురం నుంచి రాజమండ్రి వెళ్లేందుకు శేషాద్రి ఎక్స్ప్రెస్, ఎస్–4 కోచ్, బెర్త్ నంబర్ – 7లో ప్రయాణిస్తుంది. రైలు రాత్రి 12.15 గంటలకు విజయవాడ చేరుకున్నప్పడు ఆమె నిద్రలోంచి మేల్కోంది. రైలు తిరిగి బయలుదేరి విజయవాడ అవుటర్ సిగ్నల్ పాయింట్ వరకు చేరుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని 11 గ్రాముల సాయిబాబా లాకెట్ కలిగిన చైన్ను తెంచుకుని నెమ్మదిగా కదులుతున్న రైలు నుంచి దూకి పరారయ్యడు. దీనిపై విజయవాడ జీఆర్పీ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు కేసుల్లో ఐదుగురు నిందితుల అరెస్ట్.. ఈ రెండు కేసులపై జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు జేవీ రమణ, ఫతే ఆలీబేగ్లు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటుగా పాత నేరస్తులను విచారణ చేయడం ద్వారా నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో శనివారం రైల్వేస్టేషన్ మినీస్టేడియం బస్స్టేషన్ వద్ద వారు ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు దాడిచేసి చిత్తురుజిల్లాకు చెందిన గోగుల జన నరసింహులు, పసుపులేటి సులోచన, పసుపులేటి బాబు, కె.జగన్నాథంలను అదుపులోకి తీసుకుని సులభ కాంప్లెక్స్ వద్ద చోరీ చేసిన రూ.5 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా రైలులో మహిళ మెడలో బంగారు చైన్ స్నాచింగ్ పాల్పడింది ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన రావూరి సుబ్బారావుగా గుర్తించి గాలింపు చేపట్టారు. నిందితుడు శుక్రవారం ప్లాట్ఫాం నంబర్ – 9లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి స్నాచింగ్కు పాల్పడిన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. -
ఉత్సాహంగా జిమ్నాస్టిక్స్ జిల్లా స్థాయి టోర్నీ
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): స్థానిక మొగల్రాజపురంలోని వీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఎన్టీఆర్ జిల్లా జిమ్మాస్టిక్స్ టోర్నీ శనివారం సాయంత్రం ప్రారంభమైంది. మినీ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు జరిగాయి. జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కనకదుర్గ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ సంది రెడ్డి లక్ష్మీనారాయణ అతిథిగా హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. విజేతల వివరాలు.. మినీ జూనియర్స్(బాలికలు) ప్లోర్ విభాగంలో పి. లహరి, ట్రంప్ లైన్ విభాగంలో పి.మౌల్య, బీమ్ విభాగంలో పి.లాస్య మొదటి స్థానాల్లో నిలిచారు. మినీ జూనియర్స్(బాలురు)– ప్లోర్ విభాగంలో జి.శశాంత్, ట్రంప్లైన్ విభాగంలో జి.కార్తికేయ మొదటి స్థానంలో ఉన్నారు. అండర్–9 బాలికల ఏరోబిక్స్ విభాగంలో దివ్య, ప్లోర్, బీమ్ విభాగాల్లో బస్వతా మొదటి బహుమతిని పొందారు. అండర్–10 బాయ్స్ ప్లోర్ విభాగంలో వి.సూర్య, ట్రంప్లైన్, ఏరోబిక్స్ విభాగాల్లో యు.సూర్య మొదటి స్థానంలో నిలిచారు. అండర్–12 బాలికల ప్లోర్, భీమ్, ఏరోబిక్స్ విభాగాల్లో వి.మౌనిక మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ట్రంప్లైన్లో ఎ.తాత్విక మొదటి, వి.మౌనిక ద్వితీయ బహుమతి పొందారు. విజేతలను అతిథులు అభినందించారు. -
కూచిపూడిలో పులకించిన మువ్వలు
కూచిపూడి(మొవ్వ): లెజెండరీ నృత్య కళాకారుడు డాక్టర్ వెంపటి చినసత్యం జయంతిని పురస్కరించుకుని కూచిపూడిలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళావేదికపై శనివారం వరల్డ్ కూచిపూడి డే సెలబ్రేషన్లు జరిగాయి. కళాకారుల నృత్య ప్రదర్శనలతో నాట్యక్షేత్రం పులకించింది. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ గంగాబాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం సహకారంతో సాగిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల కరతాళధ్వనులు అందుకున్నాయి. డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో ఆయన శిష్య, ప్రశిష్యులు నృత్య ప్రదర్శనలతో వీక్షకులు మైమరిచారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన 21 మంది గురువుల పర్యవేక్షణలో 150 మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన అంశాలు అలరించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యాం నట్టువాగం, సూత్రధారిగా కొనసాగిన భామాకలాపం నృత్య రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సత్యభామగా అక్షర దేవెళ్ల, శ్రీ కష్ణుడిగా యశశ్రీ, మాధవిగా డేగల సాంబశివరావు తమ నృత్యాభినయంతో పాత్రలకు జీవం పోసి నృత్యరూపకాన్ని రక్తి కట్టించారు. తొలుత సర్పంచ్ కొండవీటి వెంకట రమణ విజయ లక్ష్మి, ఎంపీడీఓ డి.సుహాసిని, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఫౌండర్ పెద్దప్రోలు భావన, పలువురు నాట్యాచార్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. నాట్యాచార్యులకు పురస్కారాల ప్రదానం సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ ఏటా అందించే అవార్డులు, మూడు జీవిత సాఫల్య పురస్కారాలు, ఒక సేవా పురస్కారాన్ని ఈ వేదికపై పెద్దప్రోలు భావన ప్రదానం చేశారు. పద్మభూషణ్ వెంపటి చిన్న సత్యం జీవిత సాఫల్య పురస్కారాన్ని సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్కు, పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని కూచిపూడి నాట్య పరిశోధన ఆచార్య డాక్టర్ పసుమర్తి శ్రీనివాస శర్మకు, లంక అన్నపూర్ణదేవి జీవిత సాఫల్య పురస్కారాన్ని సీనియర్ నాట్యచార్యుడు గుంటూరు సంధ్యా మూర్తికి, వెంపటి వెంకట్ సేవా పురస్కారాన్ని వి.రమణ కుమారికి అందజేశారు. -
కొల్లు స్వార్థం కోసం రోడ్ల విస్తరణ
చిలకలపూడి(మచిలీపట్నం): బందరు ప్రజలతో మంత్రి కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారని, తన స్వార్థం కోసం రోడ్ల విస్తరణకు నోటిఫికేషన్ ఇప్పించారని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తంచేశారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. బెల్లంకొట్ల సందు, సామాస్ పక్క సందు విస్తరణ చేస్తామంటూ మునిసిపల్ కమిషనర్తో ఓ దినపత్రికలో నోటిఫికేషన్ ఇప్పించారని పేర్కొన్నారు. కొల్లు రవీంద్ర అక్రమంగా రూ.30 కోట్లతో చేపట్టిన కాంప్లెక్స్ నిర్మాణం కోసమే అర్ధంతరంగా ఈ నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు. కొల్లు రవీంద్ర నిర్మించే భవనం వద్ద తక్కువ, మిగిలిన ఇళ్ల వద్ద ఎక్కువ విస్తరణ జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చిన వైనాన్ని మ్యాప్ ద్వారా వివరించారు. కొల్లు రవీంద్ర నిర్మించే భవనాలు అన్నింటికీ ప్లాన్లు లేవని స్పష్టంచేశారు. ప్లాన్ తీసుకునేందుకు రోడ్డు విస్తరణ చేయాల్సి రావటంతో ఈ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. తాను 2004లోనే బెల్లంకొట్ల సందును లారీలు రాకపోకలు సాగించేలా విస్తరించామని గుర్తుచేశారు. ప్లాన్ లేకుండా రవీంద్ర చేపట్టిన నిర్మాణాలను మునిసిపల్, ఎంయూడీఏ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బడ్డీకొట్లను తొలగించేసి చిరువ్యాపారులను రోడ్డున పడేశారని, ఇప్పుడు ఈ నోటిఫికేషన్తో ఎంతో మంది అమాయకులు నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మునిసిపల్ కమిషనర్ విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారని, గుమ్మటాల చెరువుపై కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా తెలుగు తమ్ముళ్లు 50, 60 గజాల చొప్పున విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. కొల్లు రవీంద్ర కబ్జాలపై హైకోర్టుకు.. మంత్రి కొల్లు రవీంద్ర చేస్తున్న కబ్జాల పర్వం, అక్రమ దందాలపై తాను హైకోర్టుకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిటీషన్లు పంపుతానని పేర్ని నాని తెలిపారు. న్యాయపోరాటం చేస్తానన్నారు. పోలీసు లను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తు లను లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్యవైశ్యుల ఆస్తు లను కొట్టేసేందుకు ప్రయత్నించి, 200 మంది రౌడీలను పంపి సరుగుడు చెట్లను తొలగించి రూ.కోటికి విక్రయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. బాధితుల కుటుంబంపై తప్పుడు కేసులు బనాయించి, అనుచరులతో బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. కొల్లు రవీంద్ర చేస్తున్న కబ్జాలను ఎదుర్కో లేక తనను కొంత మంది ఆశ్రయించారని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. త్వరలో కొల్లు రవీంద్ర కబ్జాలను ఆధారాలతో వెల్లడిస్తామని పేర్ని నాని ప్రకటించారు. ఈ సమావేశంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డెప్యూటీ మేయర్ శీలం భారతి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు మేకల సుధాకర్బాబు (సుబ్బన్న), మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, కార్పొరేటర్ తిరుమలశెట్టి ప్రసాద్, నాయకులు చిటికిన నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ శరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.మచిలీపట్నంలో ఎవరైనా ఇంటి నిర్మాణానికి పునాది తీసిన వెంటనే టీడీపీ స్థానిక డివిజన్ ఇన్చార్జిని కలవాలని సచివాలయ సిబ్బందితో చెప్పిస్తున్నారని, అంతస్తుకు రూ.50 వేలు ఇస్తేకానీ పనులు జరిగే పరిస్థితి లేదని పేర్ని నాని పేర్కొన్నారు. మంత్రి చేపట్టిన భవన నిర్మాణానికి సంబంధిత ఇన్చార్జ్లకు ఎంత చెల్లించారని సూటిగా ప్రశ్నించారు. బడ్డీకొట్లు తొలగించిన మంత్రి టీడీపీ ఇన్చార్జ్ల సిఫార్సులతో తిరిగి వారి వద్ద రూ.లక్షలు కాజేసి అదే స్థానంలో వారు కొట్లు ఏర్పాటు చేసుకుంటున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతో మంది కన్నీళ్లతో వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారిని బెదిరించి కబ్జా చేసి ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం నిజం కాదా అని ప్రశ్నించారు. సాక్షాత్తూ టీడీపీకి చెందిన వారి వద్దే ఎంయూడీఏ చైర్మన్ పదవి ఇప్పిస్తానని నమ్మించి రూ.6.70 కోట్లు తీసుకున్నది వాస్తవమా, కాదా చెప్పాలని కొల్లు రవీంద్రను ప్రశ్నించారు. -
భూగర్భ గరళం
లబ్బీపేట(విజయవాడతూర్పు): భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి. వాటిని నేరుగా తాగడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు నామమాత్రంగా శుద్ధిచేసి సరఫరా చేస్తున్న ఆర్ఓ ప్లాంట్ల నీరు కూడా ఆరోగ్యకరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్లో విజయవాడ సింగ్నగర్లో వందలాది మంది డయేరియా బారిన పడ్డారు. అందుకు కారణం తెలుసుకునేందుకు అనేక మంది వివిధ రకాల సర్వేలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భూగర్భ జలశాఖ కూడా సర్వేలు చేసింది. ఈ అధ్య యనాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో 60 నుంచి 80 అడుగుల లోతుల వేసిన బోర్లు నుంచి నైట్రేట్స్, నికిల్, కాడ్మియం, సీసం, జింక్ వంటి వ్యాధికారిక లోహాలు, ఈకోలి, టైఫో బ్యాక్టీరియాలు ఉన్నట్లు గుర్తించారు. ఇవి రాయనపాడు, కవులూరు నుంచి కొల్లేరు వరకూ బుడమేరుకు రెండు వైపులా రెండు కిలోమీటర్ల మేర ప్రభావం చూపుతున్నాయి. కలుషితానికి కారణాలివే.. భూగర్భ జలాల్లో గుర్తించిన నైట్రేట్, నికిల్, కాడ్మియం, సీసం, జింక్ వంటివి ఉండాల్సిన మోతాదులో ఉంటే ప్రమాదం ఏమి లేదని, కాకుంటే ఎక్కువ మోతాదులో ఉండటం వల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లు చెపుతున్నారు. బుడమేరు పరీవాహక ప్రాంతాల్లో రాయనపాడు నుంచి కొల్లేరు వరకూ భూగర్భ జలాలు కలుషితమైనట్లు ఇటీవల పలు అధ్యయనాల్లో తేలింది. ఆ ప్రాంతంలో 60 నుచి 80 అడుగుల్లో ఉన్న బోర్లు ద్వారా వచ్చే నీటిలో నైట్రేట్స్, నికిల్, కాడ్మియం, సీసం, జింక్ వంటివి ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. వాటితో పాటు ఈకోలి, టైఫో బ్యాక్టీరి యాలు కూడా ఉన్నాయి. ప్రజలు శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగాలి. లేకుంటే అనేక ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ తుమ్మల శ్రీకుమార్,ఫిజిక్స్ హెచ్ఓడీ, ఆంధ్రా లయోల కళాశాల -
చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో చిన్నారులకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం కలకలం రేపింది. పలువురి కాళ్లు, చేతులపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోవాలని చెబుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇదీ చదవండి:గూగుల్తో లక్ష ఉద్యోగాలు అనేది అబద్ధం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ధన్వంతరీ జయంతీ
తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో MLC పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇన్చార్జ్ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో వైద్య నారాయణుడు ధన్వంతరీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ ధన్వంతరీ చిత్రపటానికి పూలమాలలు వేసి, సంప్రదాయ సిద్దంగా భక్తిశ్రద్దలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు నేతలు భగవాన్ ధన్వంతరీ సమాజానికి అందించిన ఔషద సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వక్తల ప్రసంగించారు.నాయీబ్రాహ్మణులకు వైఎస్సార్సీపీ హయాంలోనే సముచిత గౌరవం-లేళ్ల అప్పిరెడ్డివైద్యనారాయణుడు ధన్వంతరీ భగవన్ జయంతిని వైఎస్సార్సీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. మానవుల ఆనారోగ్యాన్ని తొలగించి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే ఆయుర్వేదానికి ఆధ్యుడు భగవాన్ ధన్వంతరీ. ఆయన అందించిన జ్క్షానాన్ని నాయీబ్రాహ్మణులు అందుకుని, ఈ సమాజానికి ఎనలేని సేవలు అందించారు. గతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్యులు లేని సమయంలో నాయీబ్రాహ్మణులే తమ వైద్య విజ్క్షానంతో చికిత్సలు చేసేవారు. మానవ నాగరికతలో నాయీబ్రాహ్మణులది కీలకపాత్ర. తరువాత కాలంలో వారిలో అనేకులు ఆర్ఎంపీలు, పీఎంపీలుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో అమూల్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. గతంలో సీఎంగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి తన పాలనలో వీరి సేవలను గుర్తించి వారికి వృత్తిశిక్షణను అందించి, సర్టిఫికేట్లు ఇచ్చి మరీ ప్రోత్సహించారు. ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎంగా నాయీబ్రాహ్మణుల అభ్యున్నతికి పాటుపడ్డారు. విద్యకు ప్రాధానత్య ఇచ్చి అణగారిన కులాలకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేశారు. కులవృత్తుల్లో ఉన్న నాయీబ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు, సెలూన్లకు నెలకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ను అంఆదించారు. పాలక మండళ్ళలో నాయీబ్రాహ్మణులకు స్థానం కల్పించారు. ఆలయాల ప్రతిష్టను మరింత పెంచే క్రమంలో నాయీబ్రాహ్మణుల పాత్రకు ఉన్న ప్రాధాన్యతను ఆయన చాటిచెప్పారు. ధన్వంతరీ జయంతిని కూడా అధికారికంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో జీఓను జారీ చేసే సమయంలోనే ఎన్నికలు రావడం వల్ల అది సాధ్యపడలేదు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత భగవాన్ ధన్వంతరీ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు తప్పకుండా జారీ చేస్తారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయీబ్రాహ్మణులకు మేలు చేయకపోగా, తమ సమస్యలను చెప్పడానికి వెడితే 'తోకలు కట్ చేస్తాను' అంటూ బెదిరించిన సంఘటనలను చూశాం. ఇటువంటి పరిస్థితులు మారాలంటే మళ్లీ బీసీలకు సముచిత గౌరవం ఇచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావాలి. సమాజానికి భగవాన్ ధన్వంతరీ ఆరోగ్యాన్ని ప్రసాదించారు-టీటీడీ మాజీ సభ్యుడు యానాదయ్యధనత్రయోదశి నాడు ప్రతి ఏటా ప్రజలు భగవాన్ ధన్వంతరీ జయంతిని జరుపుకుంటారు. నాయీబ్రాహ్మణులు తమ కులదైవంగా భగవాన్ ధన్వంతరీ ప్రసాదించిన ఔషదసేవలను తమ వృత్తిలో భాగంగా ప్రజలకు అందించారు. మన పురాణాల ప్రకారం పాలసముద్రంను చిలికిన సందర్భంగా ఆయుర్వేద ఔషద కలశంతో భగవాన్ ధన్వంతరీ ఆవిర్భవించారు. అప్పటి నుంచి ఆయన ప్రజల ఆరోగ్యాలను కాపాడే అపర వైద్య నారాయణుడుగా మానవాళికి మహోపకారం చేశారు. అలాగే మానసిక ఉల్లాసం, మానసిక రుగ్మతలను శబ్ధవాయిధ్యాలతో పారద్రోలో కళను కూడా నాయీబ్రాహ్మణులకు ప్రసాదించారు. చివరికి భగవంతుడిని మేల్కొలిపే అరుదైన అవకాశాన్ని కూడా వాయిద్యకారులైన నాయీబ్రాహ్మణులకు అనుగ్రహించాడానికి భగవాన్ ధన్వంతరీ ఆశీస్సులే కారణం.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యుల సేవాసంఘం ఆనంద్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, RMP వైద్యులు శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రాజ్కుమార్, వెంకటసుబ్బయ్య, మాధవరావు, మురళీ తదితరులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో నాయీబ్రాహ్మణసంఘం కార్పోరేషన్ మాజీ డైరెక్టర్లు మల్కాపురం కనకారావు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, ప్రకాశ్, ఆలయ పాలకమండలి మాజీ సభ్యురాళ్ళు రామలక్ష్మమ్మ, నందిని, AGL.నారాయణ, పొదిలి సత్యం, ద్రోణాదుల రామకృష్ణ ,గ్రీవెన్స్ సెల్ నారాయణ మూర్తి, పిల్లుట్ల మోహన్రావు ఇతర నాయకులు పాల్గొన్నారు. -
మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడు: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలీపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర స్వార్థం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. చిరు వ్యాపారులను రోడ్డున పడేశారంటూ ధ్వజమెత్తారు.‘‘కొల్లు రవీంద్ర కాంప్లెక్స్ కోసం అన్యాయంగా స్థానికులకు నోటీసులు ఇస్తున్నారు. కొల్లు రవీంద్ర బలవంతంగా భూసేకరణ చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. కొల్లు రవీంద్ర కట్టే నిర్మాణాలకు మున్సిపల్ ప్లాన్ లేదు. మున్సిపల్ ప్లాన్ లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమయ్యారు?. సామాన్యులు ఇల్లు కట్టుకుంటే మాత్రం అధికారులు ఆపేస్తున్నారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే టీడీపీ నేతలు 50 వేలు వసూలు చేస్తున్నారు’’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.‘‘13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ను రెడీ చేసేసుకున్నారు. బెల్లపుకొట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్హౌస్ కడుతున్నాడు..కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు. చిన్నచిన్న వారి పై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా?. ప్లాన్లు లేకుండా నిర్మాణాలు జరుగుతుంటే మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ(ముడా) కళ్లు మూసుకుందా?. కొల్లు రవీంద్ర అండ చూసుకుని మున్సిపల్ కమిషనర్ రెచ్చిపోతున్నాడు. సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే మున్సిపల్ సిబ్బంది వాలిపోతున్నారు. స్థానిక టీడీపీ ఇంఛార్జ్లకు కమిషన్ ఇస్తేనే అనుమతులిస్తున్నారు. నువ్వు మీ ఇంఛార్జిలకు ఎంత కమిషన్ ఇచ్చావ్ కొల్లు రవీంద్ర?..బడ్డీ కొట్లు కూలగొట్టించి నీఇంఛార్జ్లకు కమిషన్లు ఇప్పించి మళ్లీ అక్కడే షాపులు పెట్టించావ్. కొల్లు రవీంద్ర కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్కు కనీసం ప్లాన్ లేదు. తన కాంప్లెక్స్ ప్లాన్ కోసం రోడ్డును విస్తరణ చేయిస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడు. ఎంతమంది కన్నీళ్లతో నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటావ్. నీ స్వార్థం కోసం వ్యాపారుల ఉసురు పోసుకోకు. నేను ఊరు బాగు కోసం గతంలో రోడ్డు విస్తరణ చేయించా. ఈ రోజు ఎవరి బాగు కోసం మీరు ఈ రోడ్డు విస్తరణ చేయిస్తున్నావు. మచిలీపట్నం పట్టణ అభివృద్ధి సంస్థ (ముడా) ఛైర్మన్ పదవి ఇప్పిస్తానని రూ.5 కోట్లు తీసుకున్నావు. లోకేష్ దగ్గర పెండింగ్ ఉందని మరో కోటి 70 లక్షలు తీసుకున్నది నిజం కాదా?..ఉచ్ఛనీచాలు ఆలోచించకుండా పాపాలు చేయడం దేనికి కొల్లు రవీంద్ర. నువ్వు, చంద్రబాబు కలిసి 650 ఎకరాల ముడా భూమి తవ్వింది నిజం కాదా?. నేను చెప్పింది నిజమో కాదో ముడా పదవికి రాజీనామా చేసిన బీజేపి నేతను అడగండి చెబుతాడు. బెజవాడలోనో.. హైదరాబాద్లోనో కట్టుకోవచ్చు కదా. మచిలీపట్నంలోనే నీ మల్టీ కాంప్లెక్స్ ఎందుకు కట్టడం?. తన కమర్షియల్ కాంప్లెక్స్ కోసం స్వార్థంతో రోడ్డు విస్తరణ చేస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ కడతానంటే చూస్తూ ఊరుకునేది లేదు. బలవంతంగా కొల్లు రవీంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కట్టలేడు. కొల్లు రవీంద్ర చేస్తున్న పాపం.. దగాపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. చంద్రబాబుకి పిటిషన్లు పెడతాం. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తాం..పోలీసులను ఉపయోగించి బలవంతంగా ఆర్యవైశ్యుల ఆస్తులు లాక్కోవాలని చూస్తే ఊరుకోం. కృత్తివెన్నులో 35 ఎకరాల ఆర్య వైశ్యుల ఆస్తులను కొట్టేశావ్. బెంగుళూరులో ఉన్న వారిపై అక్రమంగా కేసులు పెట్టావ్. జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే కచ్చితంగా నీ అక్రమ కేసుల సంగతి తేలుస్తాం. బీచ్లో ఫెస్టివల్ తప్ప బందరుకు నువ్వు చేసిందేంటి?. మచిలీపట్నంలో రోడ్డు విస్తరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. కొల్లు రవీంద్రను ఎదుర్కోలేకే... సామాన్యులు నన్ను ఆశ్రయించారు. నన్ను సాయం కోరిన వారికి కచ్చితంగా నేను అండగా ఉంటా’’ పేర్ని నాని పేర్కొన్నారు. -
నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడిచిన నకిలీ మద్యం దందాలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ డెన్ నుంచి రాష్ట్రం మొత్తం సరఫరా అయ్యింది నకిలీ మద్యమేనని తేలింది. సేకరించిన గుంటూరు ప్రయోగశాలకు పంపగా.. ఫలితాలను చూసి ఎక్సైజ్ అధికారులే కంగుతిన్నట్లు తెలుస్తోంది.మొత్తం 45 శాంపిల్స్ను పంపగా.. అన్నీ నకిలీ మద్యమేనని తేలింది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో కల్తీ మద్యం తయారు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నాణ్యతా ప్రమాణాలు లేకుండా తయారైన ఈ లిక్కర్ను రాష్ట్రవ్యాప్తంగా బార్లు, వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా చేశారనే షాకింగ్ విషయం వెలుగు చూసింది. అలాగే నిందితుల కస్టడీ రిపోర్టులోనూ కీలక వివరాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ అనుమతి ఉందంటూ టీడీపీ నేతలు దగ్గరుండి మరీ నకిలీ మద్యం తయారు చేసినట్లు వెల్లడైంది. గవర్నమెంట్ పర్మిషన్ ఉందని కూలీలకు నమ్మబలికి.. ఈ దందాను యధేచ్చగా నడిపించినట్లు తెలుస్తోంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 18 శ్రీ అక్టోబర్ శ్రీ 2025‘సాక్షి’పై వేధింపులు అప్రజాస్వామికంఅచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 30,411 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 37,760 క్యూసెక్కులు వదులుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే.. పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు విధులు బహిష్కరించి విజయవాడలోని ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు. సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెప్పారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ వివాహ సుముహుర్తాలు, చిన్నారులకు అన్న ప్రాసనలు, దీక్షలు స్వీకరించిన భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. సామాన్యులు, నిరుపేదలు నకిలీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దనే ఉద్దేశంతోనే సాక్షి వార్తలు రాస్తోంది. రాష్ట్రంలో కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారు చేస్తూ అమ్మకాలు జరుపుతున్న వైనాన్ని మాత్రమే సాక్షి బహిర్గతం చేస్తోంది. సారాతో ప్రాణాలకు ప్రమాదం అని దానిని నిషేధించారు. ఇప్పుడు నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయి అని రాస్తే కేసులు కడతారా? అంటే నకిలీ మద్యం తాగినా ఫర్వాలేదా? సమాజానికి మేలు చేసేందుకే జర్నలిస్టులు పనిచేస్తున్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాసినందుకు సాక్షి ఎడిటర్, విలేకరులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. – బి. రాఘవరెడ్డి, నెట్వర్క్ ఇన్చార్జి, సాక్షి లబ్బీపేట(విజయవాడతూర్పు): కలంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంపై జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు గళం విప్పారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ పిడికిలి బిగించి నినదించారు. సాక్షి దినపత్రిక కార్యాలయాలు, ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ‘సాక్షి’పై పోలీసుల చర్యలను నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు, ప్రజాస్వామిక వాదులు పాల్గొని పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. నిజాలు రాస్తుంన్నందుకే.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేపట్టి, అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం. లక్ష్మీనరసింహంకు వినతిపత్రం సమ ర్పించారు. సాక్షి పత్రికపై జరుగుతున్న వేధింపుల తీరును ఆయనకు వివరించారు. సత్యమేవ జయతే అంటూ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న సాక్షి పత్రికపై కుట్ర పూరితంగా.. పోలీసులను అడ్డుపెట్టుకుని చర్యలకు పాల్పడుతున్నారంటూ డీఆర్ఓకు ఇచ్చిన వినతిపత్రంలో జర్నలిస్టులు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నకిలీ మద్యంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిందని, అప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు అధికమయ్యాయని వివరించారు. ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియాపై అక్కసుతో అణచివేతే అక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నారు. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ పోలీసులను ప్రయోగిస్తోందని విమర్శించారు. నకిలీ మద్యం బహిర్గతమైన నాటి నుంచి.. నకిలీ మద్యంపై కథనాలు ప్రచురించిన నాటి నుంచి వరుసగా ఐదో రోజులుగా ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు హల్ చల్ చేస్తున్నారని, ఎడిటర్ ధనంజయ రెడ్డికి నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇలా విజయవాడ, నెల్లూరులోని కార్యాలయాలతో పాటు హైదరాబాద్లోని ఎడిటర్ను వేధింపులకు గురి చేస్తున్న పోలీసుల చర్యలు పూర్తిగా సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని జర్నలిస్టులు పేర్కొన్నారు. పోలీసుల చర్యలను జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలుగా తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్ట ఉల్లంఘనకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఇప్టూ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామకృష్ణ, అరుణోదయ సంఘం ప్రతినిధి శ్రీనివాస్, సాక్షి ఏపీ నెట్వర్క్ ఇన్చార్జి బి.రాఘవరెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి నాగవెంకటరెడ్డి, సాక్షి టీవీ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నిద్దన సతీష్, బ్యూరో ఇన్చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి చందు శివాంజనేయులు, డీజీఎం కేఎస్ అప్పన్న, విజయవాడ బ్రాంచి మేనేజర్ ఆర్.యశోద్రాజ్, స్టేట్బ్యూరో సీనియర్ రిపోర్టర్స్ ఎ.రామ్ గోపాల్రెడ్డి, మాణిక్యాలరావు, సెంట్రల్ డెస్క్, మఫిసిల్ డెస్క్ సభ్యులు, సర్కులేషన్ ఏజీఎం వి.నరేంద్ర, టీయూసీనేత కోన సుధాకర్రెడ్డి, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రజలకూ ఇబ్బందే.. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను హరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అన్ని పత్రికలకు ఒకే విధమైన నియమనిబంధనలు ఉండాలి. కేవలం సాక్షి మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం విచారకరం. ఇది ముమ్మాటికి రాజ్యాంగం ప్రసాదించిన పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికల్లో వచ్చే వార్తల్లో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణ ఇవ్వడం మంచి పద్ధతి. అలా కాకుండా పోలీసులతో వేధింపులకు గురిచేస్తుండడం దారుణం. – ఎగ్గొని గాంధీ, దళిత బహుజన పరిరక్షణ సంఘ నేత ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందిస్తున్న జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు మైలవరం తహసీల్దార్ అబ్దుల్ దరియాకు వినతిపత్రాన్ని అందజేస్తున్న జర్నలిస్టులు, వైఎస్సార్ సీపీ నాయకులు విజయవాడలో రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న జర్నలిస్టులు, ఆయా సంఘాల నాయకులు9జిల్లాలోని ఇతర ప్రాంతాలలో..ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని కోరుతూ సాక్షి దినపత్రిక మైలవరం ఆర్సీ ఇన్చార్జ్ వేమిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు మైలవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ అబ్దుల్ దరియాకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గంలో సాక్షి దినపత్రిక నందిగామ ఆర్సీ ఇన్చార్జ్ బొక్కా ప్రభాకర్రావు ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాలు స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ కె.బాలకృష్ణకు వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి సాక్షి ఆర్సీ ఇన్చార్జి ఈడే శివప్రసాద్ ఆధ్వర్యంలో ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయం వద్ద పలువురు పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, పాత్రికేయులు నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. పలువురు నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వం సాక్షి పత్రికపై 15 నెలల కాలంలో 14 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఇక్కడి జర్నలిస్టులు ప్రభుత్వ అక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తున్నారనే అక్కసుతోనే కేసులు పెడుతున్నారు. రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బెదిరించి, భయపెట్టే ధోరణిలో హైదరాబాద్లోని కార్యాలయంలో మూడు రోజుల పాటు ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిని వేధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. ఇది దుర్మార్గమైన చర్య. – నిద్దన సతీష్, సాక్షి టీవీ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ -
సాంకేతికత సాయంతో రోడ్డు ప్రమాదాల నివారణ
రహదారి భద్రత కమిటీ సమావేశంలో కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో శుక్రవారం రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా జిల్లాలోని మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి సమస్యలను పరిష్కరించాలన్నారు. అవసరమైన చోట్ల ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఐ పవర్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా అమర్చకపోవటం పట్ల ఆయన జాతీయ రహదారుల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం నగరంలోని ప్రధాన రహదారులపై యూ–టర్న్ తీసుకుని వచ్చే వాహనాలు ఆ వాహనాలకు ఎదురుగా వచ్చే ఇతర వాహనాలు పరస్పరం ఢీకొని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన బారీకేడ్లకు బదులుగా ఎత్తు తక్కువగా ఉండే సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక పరికరం.. వాహనం నడిపే సమయంలో వాహనచోదకుడు ఫోన్ మాట్లాడటం, స్టీరింగ్ సరిగ్గా పట్టుకోకుండా నడిపినా అప్రమత్తం చేసే విధంగా ప్రత్యేక పరికరం పనితీరుపై గంగూరు ధనేకుల కళాశాల విద్యార్థులు డెమో ద్వారా వారికి వివరించారు. వాహనాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 2025 సెప్టెంబర్ నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 63 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిలో 32 మరణాలు, 47మందికి గాయాలయ్యాయన్నారు. సమావేశంలో ఏఎస్పీ వీవీ నాయుడు, జిల్లా రవాణాధికారి ఎన్యూఎన్ఎస్ శ్రీనివాస్, జెడ్పీ సీఈవో కె. కన్నమనాయుడు, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, ఆర్అండ్బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రసాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకోవాలి
డీఈవో సుబ్బారావు వన్టౌన్(విజయవాడపశ్చిమ): శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు మక్కువ పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీ స్థానిక బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రతిభ చూపిన విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. క్వాంటమ్ ప్రారంభం – అవకాశాలు– సవాళ్లు అంశంపై సెమినార్ పోటీలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నామని, ప్రతభ చూపిన విద్యార్థులను 18వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామన్నారు. జి. కొండూరు మండలం కుంటముక్కల గ్రామానికి చెందిన ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యాసంస్థకు చెందిన బి. ఉషాకిరణమై ప్రథమ, పటమట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి బి. రబిస్మిత ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. విద్యార్థులకు డీఈవో చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి పిచ్చేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
AP: విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కార్ మొండి వైఖరి
విజయవాడ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు డిమాండ్లతో విద్యుత్ యాజమాన్యంతో చర్చలకు వెళ్లిన జేఏసీకి ఇంకా స్పష్టత రాలేదు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూటమి సర్కార్ మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. వారి హామీలపై స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. ప్రధానంగా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అంశంపై విద్యుత్ యాజమాన్యం ఎటు తేల్చకపోవడంతో ఈరోజు ఒక దఫాలో జరిగిన చర్చలు పలప్రదం కాలేదు. దాంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడానికి సమాయత్తమయ్యారు. అయితే విద్యుత్ యాజమాన్యం.. మళ్లీ జేఏసీని చర్చలకు పిలిచింది. అయితే చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశానికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని జేఏసీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. విద్యుత్ సౌధాలో జేఏసీ నేతలు తమ నిరసన తెలుపుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశం తప్పించి మిగతావి అడగాలని మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. దాంతో జేఏసీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల అంశంపై క్లారిటీ ఇవ్వాలని అంటుంది. మళ్లీ కొనసాగుతున్న చర్చలుఈరోజు(శుక్రవారం, అక్టోబర్ 17వ తేదీ) విద్యుత్ యాజమాన్యంతో జరిగిన చర్చల విఫలమై.. ఉద్యోగులు సమ్మె బాటకు సిద్ధమైన తరుణంలో వెంటనే మళ్లీ చర్చలకు పిలిచారు. మరోసారి జేఏసీతో విద్యుత్ యాజమాన్యం చర్చలు జరుపుతుంది. ప్రధానంగా జేఏసీ చైర్మన్, కన్వీనర్ను మాత్రమే పిలిచి విద్యుత్ యాజమాన్యం చర్చలు జరుపుతున్నారు. మిగతా నేతలంతా విద్యుత్ యాజమాన్యం వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
టీటీడీ అధికారులపై హైకోర్టు అసహనం!
సాక్షి, విజయవాడ: తిరుమల పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సీజ్ చేసిన ఫైళ్లు, ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నత న్యాయస్థానానికి సీఐడీ సమర్పించింది. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై టీటీడీ ఈవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27న ఈవో న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. -
నా ఫోటో చూపిస్తే పోలీసులకే దడ పుడుతుంది..
ఎన్టీఆర్ జిల్లా: ఆర్డీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తమపై దురుసుగా ప్రవర్తించిందని డ్రైవర్, కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఎనీ్టఆర్ జిల్లా కంచికచర్లలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ జగ్గయ్యపేట డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సును విజయవాడలో ఎక్కింది. ఆమె పరిటాలలో దిగాల్సి ఉంది. ఆమె బస్సు ఎక్కి ఫుట్పాత్పై నిల్చుంది. గమనించిన డ్రైవర్ ఆమెను లోపలికి వెళ్లమని సూచించాడు. దీనిపై ఆమె డ్రైవర్పై గొడవకు దిగింది. ఎందుకమ్మా డ్రైవర్పై గొడవ పడతున్నావన్న కండక్టర్పైనా ఆమె మండిపడింది. ఇద్దరు కలసి తనను మందలిస్తారా.. ఇది ఫ్రీ బస్సు.. నా ఫొటో తీసుకో.. ఈ ఫొటోను విజయవాడ సిటీలో లేదా చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చూపించుకో.. నా ఫొటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ కండక్టర్పై దురుసుగా ప్రవర్తించింది. ‘అమ్మా కండక్టర్ అయ్యప్ప మాల ధరించాడు అతనిపై దుర్భాషలాడకూడదు’ అని హితవు పలికిన తోటి మహిళలను కూడా దుర్భాషలాడింది. బస్సు డ్రైవర్ పరిటాల గ్రామంలో బస్సును ఆపకుండా నేరుగా కంచికచర్ల పోలీస్స్టేషన్ వద్ద బస్సు ఆపి మహిళపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విశ్వనాథ్ మహిళను మందలించి కండక్టర్, డ్రైవర్లకు సర్ది చెప్పి పంపించి వేశారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ ఉద్యోగి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ అటెండర్ ఒక దుకాణ యజమాని వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన గురువారం రాత్రి విజయవాడ పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వాణిజ్య పన్నుల శాఖ గవర్నరుపేట సర్కిల్లో కొండపల్లి శ్రీనివాసరావు అటెండర్గా పని చేస్తున్నాడు. అతను గురువారం రాత్రి పాతబస్తీ సుబ్బరామయ్యవీధిలోని జెండాచెట్టు వద్ద ఒక వాహనాన్ని ఆపి అందులో ఉన్న సరుకుకు బిల్లు చూపించాలని అడిగాడు. బిల్లు చూపించగా దానిని చింపేసి తనకు రూ.40 వేలు లంచం కావాలని డిమాండ్ చేశాడు. దానికి వాహనదారుడు తన దుకాణ యజమాని జోగారావు చౌదరిని అక్కడకు పిలిపించాడు. జోగారావు చౌదరి అతనికి ఎంత నచ్చజెప్పినా వినకపోవటంతో రూ.16 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్సీ ప్రసాదరావు ఆదేశాల మేరకు సీఐ రంగారావు అక్కడ దాడి చేశాడు. లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతని నుంచి నగదును స్వాధీనం చేసుకున్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెనుగంచిప్రోలు: గ్రామానికి చెందిన చిట్స్, గోల్డ్ స్కీం వ్యాపారి చిన్నం చిన్న దుర్గారావు కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ అర్జున్ గురువారం తెలిపారు. గోల్డ్ స్కీం, చిట్స్, వడ్డీకి డబ్బులు తీసుకుని అతను పారిపోయాడన్నారు. అతనిపై చీటింగ్ కేసుతో పాటు చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ప్రజలు లైసెన్స్ లేని చిట్స్, గోల్డ్ స్కీంలలో చేరవద్దని ఎస్ఐ సూచించారు. దుర్గారావు బాధితులు పోలీస్స్టేషన్కు క్యూ కడుతూనే ఉన్నారు. గురువారం సాయంత్రానికి 68 మంది ప్రామిసరీ నోట్లు, గోల్డ్ స్కీం రశీదులతో వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ముసిముక్కు కనకచింతయ్య, అతని భార్య సీతామహాలక్ష్మి(42) వ్యవసాయ సనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కపక్కనే నివాసిస్తున్న కనకచింతయ్యకు, అతని సోదరుడైన వడ్డీకాసులకు గత కొంత కాలంగా దారి విషయంలో వివాదం కొనసాగుతోంది. ఈ విషయమై రెండు నెలలు క్రితం వీరి మధ్య జరిగిన గొడవలో సీతామహాలక్ష్మిపై దాడిచేసి కొట్టారు. ఈ ఘటనపై అప్పట్లో ఉంగుటూరు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ వివాదం సమసిపోలేదు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఇంట్లో సీతామహాలక్ష్మి సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీకాసులు కుటుంబ సభ్యులే సీతామహాలక్ష్మిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి భర్త కనకచింతయ్య, కుమారుడు రాజేష్ ఆరోపిస్తున్నారు. గతంలో ఆమైపె దాడి జరిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. -
కమనీయ కార్తికానికి సంసిద్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై రానున్న రెండు నెలల్లో జరిగే విశేష పూజలు, పర్వదినాలను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆవరణలోని మహా మండపం ఆరో అంతస్తులో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజులలో దేవస్థానంలో నిర్వహించనున్న ఉత్సవాలు, విశేష పర్వదినాలు, భవానీ దీక్ష స్వీకరణలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత దేవస్థానం అమ్మవారి అలంకరణలు, ఆలయ బంగారు శిఖరం, రాజగోపురం ఫొటోలతో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. 20న దీపావళి వేడుకలు.. 19వ తేదీ ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8గంటలకు దేవస్థాన యాగశాలలో శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహిస్తామని చైర్మన్, ఈవో తెలిపారు. ఈ యాగం దేవస్థానం తరఫున ఆలయ అర్చకులు నిర్వహిస్తారని, భక్తుల పరోక్ష సేవగా జరుగుతుందన్నారు. ఇక 20వ తేదీ దీపావళి పర్వదినాన ప్రదోషకాలంలో అమ్మవారి ప్రధాన ఆలయంలో ధనలక్ష్మీపూజ, దీపాలంకరణ, దీపావళి వేడుకల అనంతరం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామన్నారు. కార్తికం.. ఆధ్యాత్మిక సంరంభం.. 21వ తేదీ సాయంత్రం అమ్మవారి ఆలయం, నటరాజ స్వామి వారి ఆలయం, మల్లేశ్వర స్వామి వారి ఆలయాల్లో ఆకాశదీపం వెలిగిస్తామని, 22వ తేదీ నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభమవుతాయని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నిర్వహించే మాసోత్సవాలలో ప్రతి నిత్యం స్వామి వారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయన్నారు. వీటితో పాటు ప్రతి రోజు సాయంత్రం 3 గంటలకు మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుందన్నారు. వీటితో పాటు కార్తిక మాసంలో వచ్చే విశేషమైన రోజుల్లో స్వామి వారికి బిల్వార్చన, కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపో త్సవం, జ్వాలా తోరణం, మాస శివరాత్రి వంటి పర్వదినాలను విశేష పూజలు నిర్వహిస్తామన్నారు. దుర్గమ్మ గాజుల సంబరం.. దుర్గమ్మకు 23వ తేదీన గాజులతో విశేష అలంకరణ చేస్తారని చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణం, మూలవిరాట్కు గాజులతో విశేషంగా అలంకరిస్తామన్నారు. అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేస్తామని వివరించారు. ప్రత్యేక బిల్వార్చన జరిగే తేదీలు.. కార్తిక మాసంలో మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక తిథులలో బిల్వార్చన నిర్వహిస్తారు. 27వ తేదీ సోమవారం శుద్ధ చవితి, నవంబర్ 1వ తేదీ శనివారం శుద్ధ ఏకాదశి, 3వ తేదీ సోమవారం శుద్ధ త్రయోదశి, 05వ తేదీ బుధవారం కార్తిక పౌర్ణమి, 10వ తేదీ సోమవారం బహుళ పంచమి, 15వ తేదీ శనివారం బహుళ ఏకాదశి, 17వ తేదీ సోమవారం బహుళ త్రయోదశి 18వ తేదీ మంగళవారం మాస శివరాత్రిన ప్రత్యేక బిల్వార్చన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి భవానీ దీక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భవానీ మండల దీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అర్ధమండల దీక్షలు నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, డిసెంబర్ 4వ తేదీ కలశ జ్యోతి ఉత్సవం సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవానీదీక్ష విరమణలు జరుగుతాయని, 15వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో దీక్ష విరమణలు పరిసమాప్తమవుతాయన్నారు. మీడియా సమావేశంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై 22 నుంచి కార్తిక మాసోత్సవాలు 23న దుర్గమ్మకు గాజుల అలంకరణ భక్తులకు ఇబ్బందుల్లేకుండా పక్కా ఏర్పాట్లు మీడియాతో దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ -
తాను తవ్విన గోతిలోనే పడిన కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): టీడీపీ తీసుకున్న సారా గోతిలోనే కూటమి ప్రభుత్వం పడిందని.. దాని నుంచి బయటపడేందుకు వైఎస్సార్ సీపీ నాయకులపై బురద చల్లుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి విమర్శించారు. సత్యనారాయణపురం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సూపర్ లేబుల్స్కు పరిమితం అయ్యారని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు జోగి రమేష్ను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని.. పోలీసులు సమగ్రంగా విచారణ చేయటం లేదన్నారు. జోగి రమేష్కు ఎలాంటి నిక్ నేమ్స్ లేవని.. కంప్లైంట్లో 1 రమేష్ అని పెట్టించారని ఫోన్లో చూపించారు. తద్వారా ఇదంతా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే అని తేలిపోయిందన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు. 16 నెలలు గడిచిన తరువాత కూటమి ప్రభుత్వం ఇప్పుడు క్యూ ఆర్ కోడ్ పెట్టాం అని చెబుతున్నారని.. గతంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ క్యూ ఆర్ కోడ్ పద్ధతిని తెచ్చిందని గుర్తు చేశారు. జైలులో ఉన్న జనార్దన్ వీడియో బయటకి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సాయి పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి -
జీఎస్టీ సంస్కరణలతో సుస్థిర ఆర్థిక ప్రగతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జీఎస్టీ 2.0 సంస్కరణలు సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సంస్కరణల ఫలితంగా దేశ వ్యాప్తంగా 99శాతం వస్తువులు, సేవలు పన్ను రహితం కావడం లేదా 5 శాతం, 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయన్నారు. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం రవాణా శాఖ ఆధ్వ ర్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ది కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంతో ఏర్పా టు చేసిన ఆటోలు, సరుకుల రవాణా వంటి వివిధ పనులకు ఉపయోగించే చిన్న వాహనాల ర్యాలీని కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎస్.ప్రశాంత్ కుమార్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్ తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆతిథ్య రంగానికి ఊతం.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలతో రవాణా, ఆతిథ్య రంగాల్లో మరింత అభివృద్ధికి వీలవుతుందన్నారు. ప్రయాణికుల రవాణా వాహనాలు, వస్తువుల రవాణా వాహనాలకు 28 శాతం ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గిందని వివరించారు. సూపర్ జీఎస్టీతో రాష్ట్ర ప్రజలకు దాదాపు రూ. 8 వేల కోట్లు, జిల్లా ప్రజలకు రూ. 300 కోట్లు, ప్రతికుటుంబానికి నెలకు రూ. 6 వేలు నుంచి రూ.12 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. అనంతరం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఆర్టీవోలు ఆర్. ప్రవీణ్, కె.వెంకటేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు వై. నాగేశ్వరరావు, వి.పద్మాకర్, అలీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి. ప్రియదర్శిని, కృష్ణాజిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్, విజయవాడ టాక్సీ ఓనర్ల అసోసియేషన్, ఎన్ఏఎంటీఏ అసోసియేషన్, టీఎన్ టీయూసీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ బాబూ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
రూ 2.96కోట్ల మెరిట్ స్కాలర్షిప్లు పంపిణీ
పెనమలూరు: కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులకు గురువారంరూ.2,96,37,000 మెరిట్ స్కాలర్ షిప్పులు యాజ మాన్యం పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీని సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీగా మార్చిన తర్వాత విద్యార్థులకు తాము పూర్తి అండగా ఉన్నామన్నారు. గతంలో విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ఉండేదని, యూనివర్సిటీ చేసిన తరువాత తామే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామన్నారు. చదువులో ప్రతిభ, హాజరు శాతం పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2025–2026లో 624 మంది విద్యార్థులకు రూ.2.96కోట్లను స్కాలర్షిప్లుగా ఇచ్చామన్నారు. ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో సొమ్ము జమ అవుతుందని తెలిపారు. ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, డైరెక్టర్ బావినేని పాండురంగారావు, డీన్ డాక్టర్ జీఎన్.స్వామి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సూత్రధారులు చంద్రబాబు, లోకేష్లే
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం మాఫియా వ్యవహారంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ను గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యం స్కాంలో జయచంద్రారెడ్డి, జనార్దన్లు కేవలం పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అని అనుమానం వ్యక్తం చేశారు. నకిలీ మద్యం ద్వారా వచ్చిన డబ్బులు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత పంచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. కావాలని కేసును పక్కదారి పట్టించేందుకు జోగి రమేష్ పాత్ర ఉందని, ప్రధాన నిందితుడు జనార్దనరావుతో చెప్పించారని అన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై జోగి రమేష్ పోరాటాలు చేస్తున్నారని, నకిలీ మద్యంపై తొలిసారిగా గళం విప్పింది ఆయనే అని అన్నారు. నకిలీ మద్యం రాకెట్పై సీబీఐ విచారణ కోరింది కూడా జోగి రమేష్ అని గుర్తు చేశారు. ఆయన్ను మానసికంగా దెబ్బతీయడం కోసమే తప్పుడు కేసు పెట్టారని అన్నారు. జోగి రమేష్కు జిల్లా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, తమ పార్టీ నాయకులు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా పని చేసినవారు ఫిర్యాదు చేయడానికి వస్తే కలవని సీపీ టీడీపీ చోటామోటా నాయకులు వస్తే కలవడం చూస్తే ఏ విధంగా పని చేస్తున్నారో అర్ధమవుతోందన్నారు. ఏ పదవీ లేని బుద్ధా వెంకన్న ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తే తనను గుర్తిస్తారన్న తపనతో తమ నాయకులపై కారుకూతలు కూస్తున్నాడని, ఆయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతకు ముందు మాజీ మంత్రి జోగి రమేష్తో ప్రస్తుత పరిణామాలపై కొద్దిసేపు చర్చించారు. పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, కుంచం జయరాజును కూడా పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు జెడ్పీటీసీ మందా జక్రధరరావు, కొండపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గుంజా శ్రీనివాస్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు పోరంకి శ్రీనివాసరాజు, రెంటపల్లి నాగరాజు, నాయకులు జడ రాంబాబు, మిక్కిలి శరభయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం...ఉధృతం
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ధర్నా చౌక్లో గత 12 రోజులుగా నిర్వహిస్తున్న పీహెచ్సీ వైద్యుల ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోని వైద్యులు మాత్రమే రిలే దీక్షలు, నిరసనల్లో పాల్గొనగా, ఇప్పుడు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సైతం పాల్గొనడంతో దీక్షా శిబిరం నినాదాలతో హోరెత్తుతోంది. మరోవైపు స్కిట్లు, పాటలతో యువ వైద్యులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీహెచ్సీల్లో పనిచేసే 2700 మంది వైద్యులు విధులను బహిష్కరించినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు. వైద్యులకు మద్దతుగా వైద్య సిబ్బంది వైద్యులకు మద్దతుగా పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది సైతం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ తమ నిరసనను తెలియచేస్తున్నారు. అవసరమైతే తాము కూడా విధులు బహిష్కరించేందుకు సిద్ధమేనని ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు సెకండరీ హెల్త్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, టీచింగ్ వైద్యుల సంఘాలు సైతం ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు సైతం పెద్ద సంఖ్యలో వైద్యులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం మాత్రం మొండిపట్టు వీడటం లేదు. ముఖ్యమైన డిమాండ్లు ఇవే... ఇన్సర్వీసు కోటా పీజీ సీట్లు 20 శాతం 2030 వరకూ కల్పించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి అదనపు భత్యం, టైమ్బాండ్ ఉద్యోగోన్నతులు, టైమ్ బాండ్ స్కేల్స్ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవీంద్రనాయక్, ఇతర నేతలు డాక్టర్ వినోద్కుమార్, డాక్టర్ జ్ఞానేష్లతో పాటు దాదాపు వెయ్యి మందికి పైగా వైద్యులు, వారి కుటుంబ సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 17 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఇంద్రకీలాద్రిపై రానున్న కార్తిక మాసంలో జరిపే విశేష పూజలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ తెలిపారు. –IIలో విమానాశ్రయం(గన్నవరం): తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్.రవి విజయవాడ పర్యటన నిమిత్తం గురువారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మచిలీపట్నంలోని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎండూరి శేష బాపనలాల్, పూర్ణచంద్రిక, రవీంద్రమూర్తి రక్త సంబంధీకులు. వారికి చిన్నగొల్లపాలెంలో తల్లి దండ్రుల నుంచి 167 ఎకరాలు సంక్రమించింది. 1941వ సంవత్సరం నుంచి ఎండూరి కుటుంబం స్వానుభవంలో ఉన్న 213, 217, 572/1 సర్వే నంబర్లలోని 52.76 ఎకరాల విషయంలో ప్రస్తుతం వివాదం నెలకొంది. తన బృందం ద్వారా కొల్లు రవీంద్ర 2014–19 మధ్య కాలంలోనూ, తాజాగా కూటమి ప్రభుత్వంలో ప్రయత్నాలు ఈ భూమిని కాజేసే యత్నాలు కొనసాగిస్తున్నారు. ఎండూరి శేషబాపనలాల్ 2011 జూలైలో మరణించగానే 2012లో మచిలీపట్నానికే చెందిన గంపల కస్తూరి అనే మహిళను రంగప్రవేశం చేయించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల ద్వారా ఆమెను లాల్ భార్య అంటూ ఇంటి పేరును సైతం మార్పించి రెవెన్యూ కార్యాలయం నుంచి 39.70 ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్ను ఇప్పించగలిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లాల్ తల్లి ఎండూరి సీతామహాలక్షుమమ్మ 2014 ఆగస్టులో రెవెన్యూ కోర్టులో కేసు దాఖలు చేశారు. కుమారుడి ద్వారా పొందిన వీలునామా తదితరాలను సాక్ష్యాలుగా పొందుపరిచారు. కాలక్రమంలో చిన్న కుమారుడైన ఎండూరి రవీంద్రమూర్తికి తల్లి సీతామహా లక్షుమమ్మ వీలునామా రాశారు. ఆమె తదనంతరం రెవెన్యూ కోర్టులో మూర్తి ఇంప్లీడ్ అయ్యారు. ఈ కేసు కొనసాగుతున్న దశలోనే 2016 ఆగస్టులో గంపల కస్తూరి వివాదరహిత భూమిగా పేర్కొంటూ ఆరుగురికి సేల్ డీడ్ ద్వారా, మరొకరికి గిఫ్ట్ డీడ్ ద్వారా 38 ఎకరాలను విక్రయించారు. 1.70 ఎకరాలను పంచాయతీ దారి కోసం రాసిచ్చారు. అప్పుడు కొల్లు రవీంద్ర మంత్రిగా కొనసాగుతున్నందునే ఈ విక్రయ ప్రక్రియ సాధ్యమైందని బాధితవర్గం ఆరోపిస్తోంది. సరుగుడు తోటలు నరికేశారు... చిన్నగొల్లపాలెంకు చెందిన పెద్ది సత్యనారాయణ, చందు సత్యనారాయణ 2011 నుంచి వివాదాస్పద భూమితో పాటు రవీంద్రమూర్తికి చెందిన మరి కొంత భూమిని కౌలుకు తీసుకుని మొత్తం 53.76 ఎకరాలలో సరుగుడు తోటలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అండదండలతో భూ కొనుగోలుదారులమంటూ ఈ ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీన, తాజాగా సెప్టెంబరు 22 నుంచి ఈనెల ఆరో తేదీ వరకు 19 ఎకరాల్లోని తోటలు నరికేశారు. నరికేసిన 900 టన్నులకు పైగా కలప విలువ దాదాపు రూ.80 లక్షల వరకు ఉంటుందని కౌలురైతులు వాపోతున్నారు. రైతులపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు తమ తోటలు నరకొద్దని అడ్డుపడిన రవీంద్రమూర్తి తో పాటు 12 మంది రైతులపై ఫిబ్రవరిలో కృత్తివెన్ను పోలీసులు కేసు నమోదుచేశారు. మచిలీ పట్నం నుంచి వెళ్లి దౌర్జన్యంగా కోర్టు పరిధిలో ఉన్న తోటలు నరికేసిన రౌడీల జోలికి పోలీసులు వెళ్లక పోవడం వెనుక ఎవరున్నారనేది విదితమే. ఆర్డీవో, డీఎస్పీలు గ్రామానికి వెళ్లి మీకు మేలు చేస్తామనడం వరకే పరిమితమయ్యారు. పది నెలలు అవుతున్నా పోలీసులు చార్జిషీటు దాఖలు చేయకపోవడం గమనార్హం. మంత్రి చెప్పినట్టు వినండి, ఆ భూముల వద్దకు వెళ్లకండి, లేదంటే మీ సంగతి తేలుస్తామనే పోలీసుల బెదిరింపులకు నెలల తరబడి గ్రామాన్ని వదిలి తలదాచుకోవాల్సిన దుస్థితి దాపురించిందని బాఽధిత రైతులు వాపోయారు. అక్రమంగా రెండు సారా కేసులు భూమి తనకు చెందుతుందని కోర్టుకు వెళ్లిన రవీంద్రమూర్తిపై గత టీడీపీ హయాంలో అక్రమంగా రెండు సారా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేసుల నుంచి బయటపడినట్లు బాధితుడు తెలిపారు. పెడన ఎమ్మెల్యే కాగిత హెచ్చరికలు... పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మంత్రి తరఫున మాట్లాడుకుందాం రండని చినగొల్లపాలెం బాధిత రైతులను ఫిబ్రవరి నుంచి పలుసార్లు పిలిపించి చెప్పినట్లు వింటే మీపై కేసులు లేకుండా చూస్తానని, ఎదురుచెపితే కటకటాలు తప్పవని హెచ్చరించినట్టు బాధితులు చెబుతున్నారు. సెటిల్మెంట్కు భీమవరం ఎమ్మెల్యే వద్దకు... భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు స్వగ్రామం చినగొల్లపాలెం. రైతులకు సర్ది చెప్పి సెటిల్ చేయాలని మంత్రి రవీంద్ర ఆయనకు సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా భూమిని తమకు వదిలేసి వెళ్లిపోవాలని కొల్లు బృందం కోరడాన్ని ఎమ్మెల్యే అంజిబాబు తప్పు పట్టి ఎటూ తేల్చకుండా పంపించేశారని సమాచారం. టీజీ వెంకటేష్, సోము వీర్రాజుల జోక్యం... తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయం గురించి రవీంద్రమూర్తి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. చినగొల్లపాలెం రైతులకు అన్యాయం జరుగుతోందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు సోము వీర్రాజుకు వివరించగా ఆయన పోలీసు అధికారులకు ఫోన్ చేసి చట్టప్రకారం వెళ్లాలని, లేదంటే పరిణామాలు వేరుగా ఉంటాయని అన్నారని సమాచారం.Iమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని కొల్లు రవీంద్ర హద్దు లేని అరాచకాలకు పాల్పడుతున్నారనే తీవ్ర విమర్శలు వినవస్తున్నాయి. కుటుంబ తగాదాలు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని వారి ఆస్తిపాస్తులను కాజేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంధువులు, బినామీల మాటున ఈ అడ్డగోలు వ్యవహారాలకు ఒడిగడుతున్నారని, ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల ద్వారా సామ దాన భేద దండోపాయాల వినియోగానికి ఏమాత్రం వెనుకాడటంలేదని స్థానికులు అంటున్నారు. కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో రూ.11.50 కోట్లకు పైగా విలువ చేసే 38 ఎకరాల భూమిని కాజేయడానికి దశాబ్దకాలంగా కొనసాగిస్తున్న అరాచకపర్వం ఇందుకు తార్కాణమని ఉదహరిస్తున్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు బెంగళూరు వెళ్లి నా కుమార్తె కుటుంబాన్ని బెదిరించారు. నా కుమారుడిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నా పైనా, రైతుల పైనా తప్పుడు కేసులు పెట్టారు. ఏంచేసినా సరే న్యాయం జరిగే వరకు పోరాడతా. – ఎండూరి రవీంద్రమూర్తి, మచిలీపట్నం మంత్రి కొల్లు అయినా.. మరెవరైనా సరే రైతుల భూములను లాగేసుకోవా లని చూస్తే ఊరుకోం. రవీంద్రమూర్తి విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడాం. – వల్లభనేని ఆశాకిరణ్, భారతీయ కిసాన్సంఘ్ రాష్ట్ర కోశాధికారి భూమిని కొనుగోలు చేశామంటున్న వారందరూ మచిలీపట్నం వాసులే. వారిలో మంత్రి కొల్లు రవీంద్ర చినమామ నడకుదిటి అర్జున సర్వే నంబరు 213లో 11.30 ఎకరాలు, మంత్రి బాబాయ్ కుమారుడు కొల్లు రంగనాఽథ్ 571/1లో అయిదు ఎకరాలు, మంత్రి కొల్లు బినామీలుగా స్థానికంగా బాగా గుర్తింపు ఉన్న ఊకంటి రాంబాబు 572/1లో 5 ఎకరాలు, పైడిపాటి త్రినాథ్ 217లో 5 ఎకరాలు, కొల్లూరి సూర్య చంద్ర భగవాన్ గుప్త 217లో 5 ఎకరాలు, శ్రవణం పవన్కుమార్ 3.70 ఎకరాలు కొను గోలుదారులు. కాగా గిఫ్ట్ డీడ్ కింద పొన్నుగంటి చంద్రమౌళి 3 ఎకరాలు పొందారు. -
దుర్గమ్మకు వజ్రాభరణాలు
శుక్రవారం తెల్లవారుజామున అలంకరణ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ప్రముఖ జ్యూయలర్స్ సంస్థ కీర్తిలాల్ జ్యూయలర్స్ వారు గురువారం బంగారు, వజ్రాభరణాలను కానుకగా సమర్పించారు. సుమారు రూ.2కోట్ల విలువైన 531 గ్రాముల బంగారం, వజ్రాలు, కెంపులు, ముత్యాలతో కూడిన సూర్యుడు, చంద్రుడు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, మంగళ సూత్రాలు, బంగారు గొలుసు వంటి ఆభరణాలను దాతలు గురువారం రాత్రి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. తొలుత దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులకు వాటిని అందజేశారు. శుక్రవారం ఈ వజ్రాభరణాలను అమ్మవారికి అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కీర్తిలాల్ జ్యూయలర్స్కు చెందిన సూరజ్ శాంతకుమార్, కీర్తిలాల్ కాళిదాస్, తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మీరవి, గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. -
టికెట్ తనిఖీల ద్వారా రూ.1.22 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో మూడు రోజుల పాటు నిర్వహించిన టికెట్ తనిఖీల ప్రత్యేక డ్రైవ్ ద్వారా రూ.1.22 కోట్లు ఆదాయం ఆర్జించింది. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగిన ఈ తనిఖీలలో 716 మంది టికెట్ తనిఖీ సిబ్బంది డివిజన్లోని రైళ్లు, స్టేషన్లలో చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో అనధికారిక ప్రయాణం చేస్తున్న వారిపై 17,017 కేసులు నమోదు చేయడం ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అందులో టికెట్ లేని ప్రయాణికులపై 7,928 కేసులు, సరైన టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారిపై 9,034 కేసులు, అనధికారిక లగేజీలపై 55 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో మొదటి రోజు రూ.37.03 లక్షలు, రెండవ రోజు రూ.40.26 లక్షలు, మూడవ రోజు రూ.45.03 లక్షల పెనాల్టీలు వసూలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ డీసీఎం బి.ప్రశాంత కుమార్ మాట్లాడుతూ రైళ్లలో సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సరైన టికెట్తోనే ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. సరైన ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సజావుగా వారి ప్రయాణాన్ని కొనసాగించేందుకు డివిజన్లో ఇటువంటి డ్రైవ్లు తరచుగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
జాబ్ మార్కెట్కు అనుగుణంగా నైపుణ్యాలు
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రస్తుతం జాబ్ మార్కెట్కు అనుగుణంగా యువత నైపుణ్యాలు సముపార్జించాలని, అప్పుడే కెరీర్ పరంగా ప్రపంచ వ్యాప్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ లక్ష్మీశ సందర్శించారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా అందిస్తున్న సేవలకు సంబంధించిన వివరాలను, సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీఎస్ఎస్డీసీ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలతో పాటు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రష్యా, జర్మనీ, ఖతార్ తదితర దేశాల్లో కూడా వివిధ ఉద్యోగావకాశాలు పొందేందుకు ఆయా భాషల్లో శిక్షణతో పాటు ఉద్యోగాలు పొందేందుకు చేయూతనందిస్తోందన్నారు. ఇలాంటి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అనంతరం సంస్థ రూపొందించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ వెంట జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సీపాన శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు ఉన్నారు. నవంబరు 22, 23 తేదీలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు విజయవాడ కల్చరల్: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సంకల్పంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మల్లెతీగ సాహిత్యవేదిక సహకారంతో నవంబరు 22, 23 తేదీలలో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రెండు రోజులపాటు సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు కలిమిశ్రీ తెలిపారు. గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి సంగీత, సాహిత్య, నాటక రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెలుగు సాహితీ వైభవాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలుంటాయని తెలిపారు. సాంస్కృతిక ఉత్సవాల విజయవంతానికి కామ్రేడ్ జీఆర్కే, పోలవరపు సాహితీ సమితి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. పోస్టర్ను అతిథులు ఆవిష్కరించారు. వివిధ రంగాలకు చెందిన మీసాల రాజేశ్వరరావు, గొరిపర్తి హనుమంతరావు, ఉత్సవ కమిటీ బాధ్యులు చొప్పా రాఘవేంద్ర చంద్రశేఖర్, పి.చిదంబరం, వైడీ ఆనంద్ పాల్గొన్నారు. పున్నమిఘాట్లో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక పున్నమి ఘాట్లో గురువారం రాత్రి విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్, యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఆదాయపు పన్ను కమిషనర్ ప్రకాష్, ఐసీడీఎస్ పీడీ ఎస్కే రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అంశంపై నిర్వహించిన డ్రాయింగ్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మనోజ్కుమార్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జిల్లాలో నేటి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలోని 159 రైతు సేవా కేంద్రాల ద్వారా 17వ తేదీ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ టీవీ సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో మొత్తం 3,59,733 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో సుమారు 3,03,154 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తిరువూరు మండలంలోని మునకుళ్ల రైతు సేవా కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభిస్తారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతు సేవా కేంద్రాలను వినియోగించుకుని, మద్దతు ధర పొందాలని డీఎం టీవీ సతీష్ ఆ ప్రకటనలో కోరారు. -
వైఎస్సార్సీపీ నేతలకు పోలీసుల వేధింపులు
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులు తీవ్రస్థాయిలో వేధిస్తున్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో గురువారం వైఎస్సార్సీపీ సీనియర్ నేతలైన మేడపాటి నాగిరెడ్డి, మైలవరం నియోజవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కుంచం జయరాజు ఇంటికి సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లారు.ఇద్దరి ఇళ్లల్లో సోదాలు చేయడానికి ప్రయత్నించారు. దీన్ని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం వీరి ఫోన్లను పోలీసులు స్వా«దీనం చేసుకుని సీజ్ చేశారు. వాట్సాప్లో చాటింగ్ ఆధారంగా ఇద్దరి నేతలను అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు స్థానిక నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. -
సిద్ధార్థ లూథ్రాపై ఏసీబీ కోర్టు జడ్జీ సీరియస్
సాక్షి, విజయవాడ: అక్రమ లిక్కర్ కేసు బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ప్రాసిక్యూషన్ తరపున సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. లూథ్రాపై సీరియస్ అయిన ఏసీబీ కోర్టు జడ్జి.. కేసు విచారణ పూర్తయిందా? లేదా? సూటిగా చెప్పాలన్నారు. విచారణ కొనసాగుతుందని.. కొత్త విషయాలు గుర్తించాల్సి ఉందని కోర్టుకు లూథ్రా తెలిపారు.ఇప్పటి వరకు మూడు సార్లు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చామని.. కొత్తగా ఆధారాలు కోర్టుకు తెలపలేదన్న ఏసీబీ జడ్జి.. ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారన్నారు. మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేదన్న న్యాయమూర్తి.. కోర్టుని మిస్ గైడ్ చేస్తున్నారంటూ లుథ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్చువల్ విధానంలో సిద్ధార్ధ లూథ్రా తన వాదనలు వినిపించారు. -
నకిలీ మద్యం కేసులో ఉన్నది లోకేష్, ఎంపీ: దేవినేని అవినాష్
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ నాయకులు దేవినేని అవినాష్. తప్పుడు కేసులతో బీసీ నాయకుడు జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అంటూ ఆరోపించారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ పార్టీ నేతలే అని చెప్పుకొచ్చారు. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్, మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.జోగి రమేష్ ను కలిసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) గురువారం ఉదయం జోగి రమేష్ను(Jogi Ramesh) కలిశారు. ఈ క్రమంలో ఆయనపై టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. అనంతరం, దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో 15 నెలలుగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులతో జోగి రమేష్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వ నీచ రాజకీయాలను జోగి రమేష్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. జోగి రమేష్కు వైఎస్సార్సీపీ పూర్తి అండగా ఉంటుంది. నకిలీ మద్యం వ్యవహారంలో సీబీఐ ఎంక్వైరీ వేయాలని జోగి రమేష్ ధైర్యంగా అడిగారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. నకిలీ మద్యంలో ఉన్నదంతా టీడీపీ నేతలే. నకిలీ మద్యం వ్యవహారంలో లోకేష్(Nara Lokesh), మైలవరం ఎమ్మెల్యే, విజయవాడ ఎంపీ ఉన్నారు. జయచంద్రారెడ్డి, జనార్ధన్ రావు నెలనెలా మామూళ్లు చినబాబు, వసంత కృష్ణప్రసాద్, ఎంపీ చిన్నికి పంపించారు. టీడీపీ నేతలు దొరికిపోవడంతో వైఎస్సార్సీపీపై నీచ రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ పెట్టిన తప్పుడు కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటాం.పోలీసులు కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ సెక్షన్లను వైఎస్సార్సీపీ(YSRCP) నేతలపై పెడుతున్నారు. టీడీపీ తప్పుడు ప్రచారాలపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీస్ కమిషనర్ కలవలేదు. అదే టీడీపీ నుంచి చోటా మోటా నేతలు వెళితే సీపీ వారిని కలిశాడు. పోలీస్ కమిషనర్ ప్రజల కోసం పనిచేస్తున్నారా? టీడీపీ నేతల కోసం పనిచేస్తున్నారా?. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదవుల కోసం బుద్ధా వెంకన్న ఆరాటపడుతున్నాడు. వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేస్తే పదవులు వస్తాయని బుద్ధా వెంకన్న అనుకుంటున్నాడు అని ెసెటైరికల్ కామెంట్స్ చేశారు. -
విజయవంతంగా ‘స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్’
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ రైలు – స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా విజయవాడ డివిజన్లో పక్షం రోజులుగా నిర్వహించిన స్వచ్ఛత పక్వాడ–2025 విజయవంతంగా ముగిసిందని విజయవాడ రైల్వే ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు తెలిపారు. డీఆర్ఎం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా డివిజన్లోని రైల్వే స్టేషన్లు, రైల్వే ప్రాంగణాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత డ్రైవ్లు విజయవంతంగా ముగిశాయన్నారు. అందులో స్వచ్ఛత అభియాన్, స్వచ్ఛత హి సేవా, స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాలతో విస్తృతమైన డ్రైవ్లు నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించినట్లు చెప్పారు. ఉద్యోగులు, వలంటీర్లకు అభినందనలు 1,595 మంది అధికారులు, 2,243 మంది వలంటీర్లతో పరిశుభ్రత డ్రైవ్లు నిర్వహించడం ద్వారా 9,166 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న స్టేషన్లలో పరిశుభ్రత కార్యక్రమాలు, 64.7 కి.మీ. ట్రాక్లు, 341 మీటర్ల డ్రెయిన్లు, 30 కార్యాలయాలను శుభ్రపర్చామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేసిన వారిపై 114 కేసులు నమోదు చేయడం ద్వారా రూ.24,800 పెనాల్టీలు వసూలు, ఒక టన్ను వ్యర్థాలను తొలగించడం, 26 రైళ్లను శుభ్రపర్చడం, మొక్కలు నాటడంతో పాటు ప్రయాణికులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. కార్యక్రమం విజయవంతం కావడంలో విశేష కృషి చేసిన, స్వచ్ఛందంగా పాల్గొన్న వలంటీర్లు, ఉద్యోగులను వారు ప్రత్యేకంగా అభినందించారు. డివిజన్ పరిధిలో పరిశుభ్రత, ప్రయాణికుల పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపర్చడంతో డివిజన్ అనుకున్న లక్షాలను సాధించినట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ డీఈ (పర్యావరణ, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్) వంశీకాంత్, పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
వించిపేట(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ షేక్ గౌస్మొహిద్దీన్ డిమాండ్ చేశారు. వించిపేటలోని తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పెద్దల అండదండలతో ఆ పార్టీ నాయకుడు అద్దేపల్లి జనార్దనరావు ఒక పరిశ్రమలా పెద్దఎత్తున తయారు చేసిన నకిలీ మద్యం వ్యవహారంలో కుట్రపూరితంగా వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరును ఇరికించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. ఏడాదిన్నర టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని అమ్మి టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ఈ విషయం బయటకు పడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటంతో దొంగే.. దొంగ అని అరిచిన చందంగా వైఎస్సార్ సీపీ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రిమాండ్ రిపోర్టులో లేని జోగి రమేష్ పేరు ఇప్పడు ఎలా వచ్చిందని, ఇది కుట్ర పూర్వక చర్యలు కాదా అని గౌస్ మొహిద్దీన్ ప్రశ్నించారు. నిందితుడి చేతికి ఫోన్ ఇచ్చి జోగి రమేష్ పేరు చెప్పిస్తూ చవకబారు వీడియో చేశారని ఎద్దేవా చేశారు. జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ గౌస్మొహిద్దీన్ -
లారీల మధ్య ఇరుక్కుని లారీ డ్రైవర్ దుర్మరణం
జి.కొండూరు: రెండు లారీల మధ్య ప్రమాదవశాత్తూ ఇరుక్కుని లారీ డ్రైవర్ మృతి చెందిన ఘటన జి.కొండూరు బైపాస్రోడ్డులో బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులో ఒకే యజమానికి చెందిన రెండు లారీలు చత్తీస్ఘడ్లో అల్యూమినీయం రోల్స్ను లోడు చేసుకొని తమిళనాడు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో జి.కొండూరు బైపాస్రోడ్డులోని ఆత్కూరు క్రాస్రోడ్డు జంక్షన్ వద్దకు రాగానే మలుపు తీసుకునే సమయంలో ముందు వస్తున్న లారీ ఇంజిన్ ఆగిపోయింది. ఆగిపోయిన లారీకి సెల్ఫ్ స్టార్ట్ లేకపోవడంతో వెనుక ఉన్న లారీతో ముందు లారీని నెట్టేందుకు ముందు లారీలో ఉన్న డ్రైవర్ సుభాష్(42) రెండు లారీల మధ్య ఇనుప రాడ్ను సెట్ చేస్తున్నాడు. ఈ సమయంలో ఇనుప రాడ్డు పక్కకి తప్పడంతో వెనుక లారీ ఒక్కసారిగా ముందుకు రావడంతో రెండు లారీల మధ్యలో సుభాష్ ఇరుక్కుపోయాడు. సుభాష్ తల రెండు లారీల మధ్యలో ఒత్తుకుపోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సతీష్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి మృతుడు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కంచికచర్ల: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు కంచికచర్లకు చెందిన కూరపాటి సరస్వతి(65) బుధవారం ఉదయం స్థానిక శ్రీశివసాయ క్షేత్రానికి వెళ్లి వచ్చే క్రమంలో నేషనల్ హైవే దాటుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనగా ఆమె తలకు తీవ్రగాయాలై, అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బందరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం ఆటోనగర్(విజయవాడతూర్పు): పడవలరేవు సమీపంలోని బందరు కాలువ బ్రిడ్జి వద్దకు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బుధవారం కొట్టుకు వచ్చింది. మృతుడు సుమారు 45 ఏళ్ల మగ వ్యక్తిగా భావిస్తున్నారు. ఒంటిపై నిక్కర్ మాత్రమే ఉంది. బ్రిడ్జి పక్కనే ఉన్న చెట్లకు ఆనుకొని మృతదేహం ఆగింది. కుటుంబ కలహాలతో అధ్యాపకుడు ఆత్మహత్య పెనమలూరు: కుటుంబ కలహాలతో పోరంకిలో అధ్యాపకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన బాణావత్ హరిచంద్(37) ఓ ప్రైవేట్ కాలేజీలో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. అతని భార్య అనిత పోరంకిలో ప్రైవేటు స్కూల్లో టీచర్గా పని చేస్తోంది. వీరు పోరంకిలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం అనిత సోదరుడు ఆర్థిక ఇబ్బందులతో ఉండటంతో రుణం కోసం బంగారు ఆభరణాలు ఇచ్చింది. అయితే అతను బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వలేదు. దీంతో దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. కాగా మంగళవారం అనిత సోదరుడు ఇంటికి రాగా హరిచంద్ బంగారు ఆభరణాల విషయం అడిగాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపం చెందిన హరిచంద్ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. భర్త గది నుంచి బయటకు రాక పోవటంతో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా హరిచంద్ ఫ్యాన్కు ఉరేసుకోని వేలాడుతూ కనిపించాడు. అతడిని వెంటనే విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యవసర చికిత్సకు తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న హరిచంద్ ఆస్పత్రిలో బుధవారం వేకువజామున మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
నిమ్మకూరు(పామర్రు): గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించామన్నారు. ఇంకా గ్రామానికి అవసరమైన పనులను గ్రామస్తుల నుంచి తెలుసుకుని వాటి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో రహదారుల నిర్మాణం, అంతర్గత డ్రెయినేజీ, చెరువుల కంచె ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్పు, పీహెచ్సీలో పరికరాల ఏర్పాటు, వసతుల కల్పనపై చర్చించారు. గ్రామంలో కమ్యూనిటీ గోకులం ఏర్పాటుకు రూ.10 లక్షల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. అనంతరం గ్రామంలోని గురుకుల వృత్తి విద్యా పాఠశాల, బాలుర, బాలికల డార్మిటరీలను పరిశీలించారు. గ్రామంలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి దేవదాయశాఖ ఆధ్వర్యంలో రూ.1.10 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, దేవదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నూతక్కి వెంకట సాంబశివరావు, డీఎంహెచ్వో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి 22 నుంచి బస్సు జాతా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 22 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు బస్సు జాతా నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుజ్జుల వలరాజు, బందెల నాసర్జీ తెలిపారు. విజయవాడ హనుమాన్పేటలోని దాసరి భవన్లో బస్సు జాతా వాల్ పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే చర్యలు మానుకోవాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. యువగళం పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే బకాయిలు పూర్తిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన లోకేష్ ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. తానే విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా విద్యారంగ సమస్యలు గాలికి వదిలేశారన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ పేద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కురుపాంలో 150 మంది విద్యార్థులు వ్యాధుల బారిన పడ్డారని, వీరిలో నలుగురు విద్యార్థులు చనిపోయినా ప్రభుత్వానికి, మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కార్తిక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యశ్వంత్, నాయకులు ప్రణీత్, అమర్నాథ్, అజయ్ పాల్గొన్నారు. -
టిడ్కో గృహాలకు నోటీసులు జారీ చేసిన బ్యాంక్ అధికారులు
మచిలీపట్నంటౌన్: స్థానిక రుద్రవరంలోని టిడ్కో గృహాల లబ్ధిదారులు బ్యాంక్కు రుణ వాయిదాలు(ఈఎంఐ)లు సక్రమంగా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు బుధవారం పలువురు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసి, ఇళ్లకు అతికించారు. కొంతమంది లబ్ధిదారులు రాజకీయ నాయకుల హామీలను నమ్మి, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే అపోహలో ఉండి ఈఎంఐ చెల్లింపులు నిలిపివేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇళ్లు కేటాయించి, నివాసం ఉండకపోవడం రుణ చెల్లింపులు నిలిపివేయడానికి సరైన కారణం కాదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం, టిడ్కో సంస్థ ఇప్పటికే స్పష్టంగా ప్రకటించినట్లుగా, ఒకసారి ఇల్లు కేటాయించబడిన తరువాత ఇకపై ఎటువంటి ఆర్థిక సహాయం, రుణమాఫీ ఉండదని అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. బ్యాంకు అధికారులు రుద్రవరంలోని లబ్ధిదారులకు, ఈఎంఐలు తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు. ఆలస్యం జరిగితే ఖాతాలు ఎన్పీఏ స్థితిలోకి వెళ్లి సర్ఫేసీ(ఎస్ఎఆర్ఎఫ్ఎఈఎస్ఐ) చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి, అవసరమైతే ఇళ్లు వేలం వేస్తామని హెచ్చరించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డెప్యూటీ రీజినల్ హెడ్ కొవ్వూరి రామలింగారెడ్డి, రికవరీ చీఫ్ మేనేజర్ రాకేష్, జిల్లా పరిషత్ బ్రాంచ్ మేనేజర్ నవక్రాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
సిబ్బంది కృషి వల్లే సాధ్యమైంది
బస్టాండ్(విజయవాడపశ్చిమ): స్వీపింగ్, టాయిలెట్ సిబ్బంది కృషి ఫలితంగానే పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సేవా అవార్డు వచ్చినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ హౌస్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవల సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్న అవార్డును ద్వారకాతిరుమలరావు సిబ్బందికి అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి అవార్డులు పండిట్ నెహ్రూ బస్స్టేషన్కు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. బస్స్టేషన్ స్వీపింగ్, టాయిలెట్ సిబ్బందికి బహుమతులను అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవివర్మ, అప్పల రాజు, చెంగల్రెడ్డి, విజయరత్నం, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సూర్యపవన్కుమార్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి.శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ -
జీజీహెచ్ సూపరింటెండెంట్కు బెదిరింపులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావును గుర్తు తెలియని అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లయోలా కళాశాల సమీపంలో నివసించే ఆయన ఇంటికి మంగళవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లారు. మంగళవారం జరిగిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మా క్యాంటీన్ లీజు ఒక ఏడాదే పొడిగించారు, రెండేళ్లు పొడిగించాలని డిమాండ్ చేశారు. నేను మూడు నెలల్లో రిటైర్ అవుతున్నానని చెప్పగా, అవన్నీ మాకు తెలియదు రేపు రెండేళ్లకు పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. అలాంటిది ఏమైనా ఉంటే ఆఫీసులో మాట్లాడదామని చెప్పినా వినకుండా బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఫోన్ తీసుకు వచ్చి ఫొటో తీద్దామని ఇంట్లోకి వెళ్లి రాగా, అప్పటికే వాళ్లు వెళ్లిపోయారు. ఈ విషయమై సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశకు సమాచారం ఇవ్వడంతో పాటు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంటీన్ నిర్వాహకుల ఫిర్యాదు.. కాగా సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరించిన వారితో తమకు సంబంధం లేదంటూ క్యాంటీన్ నిర్వాహకులు మాచవరం పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. అగంతకులను గుర్తించాలని ఆ ఫిర్యాదులో కోరారు. క్యాంటీన్ లీజు ఏడాది పొడిగించారని, బెదిరించాల్సిన అవసరం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని కోరారు. అందుకు సంబంధించి అనుమానితుల పేర్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులు దుర్మార్గం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని వైద్యుల సంఘం నేతలు డాక్టర్ సొంగా వినయ్కుమార్, డాక్టర్ కె.రవిలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి వద్దకు వెళ్లిన అగంతకులు ఎవరో గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. గంజాయి నిందితుల అరెస్ట్ జి.కొండూరు: గంజాయి నిందితులను జి.కొండూరు పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్తే... ఏలూరుకు చెందిన ఉత్తరవల్లి జగదీష్ అనే వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండల పరిధి చెవుటూరు గ్రామ శివారులో ఎనిమిది మంది వ్యక్తులకు విక్రయించేందుకు ఏలూరు నుంచి గంజాయిని తీసుకువచ్చాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్ మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్న జగదీష్తో పాటు కొనుగోలు చేసేందుకు ముందుగానే నిందితుడికి ఆన్లైన్ పేమెంట్ చేశారన్నారు. గంజాయిని తీసుకునేందుకు వచ్చిన మైలవరానికి చెందిన తమ్మిశెట్టి సాయి, విజయవాడకు చెందిన రామ్జలి కృష్ణ, బెజవాడ చందు, బొప్పూరి రవి, యలమర్తి కమలకేష్, జి.కొండూరు మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన బొడ్డపాటి కార్తీక్, నూతక్కి ప్రసన్నకుమార్, చాట్ల విజ్ఞాన్ సాగర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.1 కేజీల గంజాయిని, రెండు స్కూటీలను, ఒక ఆటోని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామన్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. ఎంయూడీఏ వైస్ చైర్మన్గా జేసీ నవీన్ చిలకలపూడి(మచిలీపట్నం): మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంయూడీఏ) వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంయూడీఏ వైస్ చైర్మన్గా ఫుల్ అడిషనల్ చార్జ్ను నవీన్కు అప్పగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నాట్యాచార్యుడు చినసత్యంకు నృత్య నీరాజనం
విజయవాడకల్చరల్: దుర్గాపురంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో బుధవారం నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం జయంతి సందర్భంగా గోకరాజు గంగరాజు కళావేదికపై నిర్వహించిన నృత్య కార్యక్రమాలు మనోహరంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు నృత్య కళాశాల, అమరావతి నాట్యాచార్యుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. నగరానికి చెందిన 30 మంది నాట్యాచార్యులు తమ 500 మంది బృంద సభ్యులు నృత్యాంజలి ఘటించారు. చినసత్యం నృత్య దర్శకత్వం వహించిన బ్రహ్మాంజలి, జతిస్వరం, థిల్లానా అంశాలను ఒకే వేదికపై నృత్యాలను చేసి గురుభక్తిని చాటుకున్నారు. తెలుగు తేజం చినసత్యం.. తెలుగు తేజం వెంపటి చినసత్యమని వైస్ ప్రిన్సిపాల్ కూచిపూడి కళాక్షేత్రం డాక్టర్ చింతారవి బాల కృష్ణ అన్నారు. నృత్య కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కూచిపూడి నాట్యరంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన అనేక తెలుగు సినిమాల్లో పాటలకు నృత్య దర్శకత్వం వహించారని తెలిపారు. కూచిపూడి నాట్యానికి దిశానిర్దేశం చేశారన్నారు. నేడు ప్రముఖ నాట్యాచార్యులు ఆయన వద్ద నృత్యంలో శిక్షణ తీసుకున్నారన్నారు నాట్యాచార్యులు వేదాంతం రాధేశ్యాం ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. పద్మశ్రీ హేమంత్, ఉమామహేశ్వర పాత్రుడు, సీహెచ్ అజయ్కుమార్, రాయన శ్రీనివాసరావు, సప్తా శివకుమార్, ఉషామాధవి, యల్లాజోస్యుల అనూరాధ, చదలవాడ ఆనంద్, హిమాన్సీ చౌదరి, లలిత, వేణుగోపాల్ తదితరులు తమ బృందాలతో నృత్య కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు నాట్యాచార్యుడు వెంపటి చినసత్యానికి పుష్పాంజలి సమర్పించారు. -
18న క్లీన్ ఎయిర్ థీమ్తో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఈ నెల 18న స్వచ్ఛమైన గాలి(క్లీన్ ఎయిర్) ఇతివృత్తంతో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల విజయవంతానికి ప్రణాళికాయుత కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. పర్యావరణహిత దీపావళిని జరుపుకుందాం.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సుసంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలోని 10 సూత్రాల్లో సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర అనేది ఒక సూత్రంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్తో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల క్లీన్ ఎయిర్ థీమ్తో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. గాలి కాలుష్య కారకాలకు అడ్డుకట్ట వేస్తూ హరిత విస్తీర్ణం పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని ఐశ్వర్యంగా పొందవచ్చన్నారు. గాలి కాలుష్యం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ, సౌర విద్యుత్ వినియోగం వంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. నిత్య జీవిత ప్రయాణాన్ని పర్యావరణహిత మార్గంలో సాగించేలా అవగాహన కల్పించాలన్నారు. హానికర టపాసులు కాకుండా దీపాల కాంతులతో పర్యావరణహిత దీపావళిని జరుపుకుందామని సూచించారు. అధికారులు, సిబ్బంది కూడా ఇదే బాటలో నడిచి భావితరాలకు స్వచ్ఛమైన గాలి రూపంలో వెలకట్టలేని సంపదను బహుమతిగా అందించడంలో భాగస్వాములమవుదామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సమావేశంలో డీపీవో పి.లావణ్యకుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విజయవాడలో భారీగా స్టెరాయిడ్స్ పట్టివేత
సాక్షి, విజయవాడ: నగరంలో భారీగా స్టెరాయిడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏనీటైమ్ ఫిట్నెస్ సెంటర్లో స్టెరాయిడ్స్తో రసూల్ అనే యువకుడు పట్టుబడ్డాడు. జిమ్కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈగల్, టాస్క్ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. నగరంలోని పలు జిమ్లకు కూడా రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. సునీల్, రసూల్ కలిసి స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. -
చంద్రబాబు, లోకేష్కు జోగి రమేష్ సవాల్
సాక్షి, విజయవాడ: తనపై వస్తున్న ఫేక్ వార్తలపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జనార్థన్తో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘లై డిటెక్టర్ టెస్టుకు రెడీ అని సవాల్ చేసి రెండ్రోజులవుతోంది. మళ్లీ చెబుతున్నా లై డిటెక్టర్ టెస్టుకు నేను రెడీ.. చంద్రబాబు, లోకేష్ రెడీనా?. చంద్రబాబు మరి ఇంత దారుణంగా దిగజారిపోయాడు. రిమాండ్లో ఉన్న జనార్థన్రావుతో వీడియో రికార్డ్ చేశారు. బలహీనవర్గానికి చెందిన నన్ను జైల్లో వేయాలని చూస్తున్నారు. నేను ఎక్కడికి పారిపోలేదు. ఇబ్రహీంపట్నం నడిబొడ్డున ఉండి మాట్లాడుతున్నా.. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు’’ అని జోగి రమేష్ నిప్పులు చెరిగారు. -
చంద్రబాబువి కుట్రపూరిత రాజకీయాలు
● డైవర్షన్ పాలిటిక్స్తో కాలం గడుపుతున్న కూటమి నేతలు ● మాజీ మంత్రి వెలంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి వెలం పల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ మద్యం కేసు బనాయించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మంగళవారం వారు జోగి రమేష్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దనరావు పాత ఏఎన్నార్ బార్, నూతన బార్ సమీపంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రం, మద్యం డంపింగ్పై చర్చించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిపై కూటమి నేతలు రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎకై ్సజ్ శాఖ దాడుల్లో టీడీపీ నేతలు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్రావు నేరుగా దొరికినప్పటికీ ఆ నేరాన్ని జోగి రమేష్కు ఆపాదించాలని చూడటం దారుణమన్నారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం పట్టుబడిన రోజునే జోగి రమేష్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. అక్రమ మద్యం తయారీ కేంద్రం పరిశీలించినందుకు జోగి రమేష్, మరికొంతమంది నాయకులపై ఆరోజు కేసులు నమోదు చేశారని, ఇప్పుడు తయారీ సూత్రధారి జోగి రమేష్గా జనార్దనరావుతో చెప్పించడమంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన గాలికొదిలేసిన కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్తో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.


