breaking news
NTR
-
సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు!
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు.. కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించినా మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు సిట్ ఎలాంటి సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ “సాయి కృష్ణ ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ తిరిగిన వ్యవహారం ఇప్పుడు “సాయి కృష్ణ బతికే లేడు” అనే విషయాన్ని ధృవీకరించే దిశగా వెళ్తోంది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, అనంతరం ఆధారాలు లేకుండా శవాన్ని తగులబెట్టారని ఆరోపిస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదులో ఏముంది?ఈ నెల 19వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను మే నెల మొదటి వారంలో పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కేసు పేరుతో కృష్ణలంక, మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.దండ రెడీ చేసుకో..విజయలక్ష్మి చేసిన ఫిర్యాదులో సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత సీఐ నాగరాజు తనతో “నీ కొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో” అని చెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు. అలాగే లాకప్లో సాయి కృష్ణను తీవ్రంగా కొడుతున్న సమయంలో అతడి అరుపులు, కేకలు తాను స్వయంగా విన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని తనతో పంపించాలని కోరగా.. సీఐ నాగరాజు తనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.అందుకే హైకోర్టుకు.. సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో తన కుమార్తె ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు విజయలక్ష్మి తన ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పటికే సాయి కృష్ణ మరణించాడని, ఆ విషయం బయటపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అతడి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగులబెట్టారని ఆరోపించారు. తన కొడుకును కిరాతకంగా చంపిన నాగరాజును కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, ఆధారాలను నాశనం చేయడం, హత్యాయత్నం తదితర అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.విచారణలో నాగరాజు ఏమైనా కీలక విషయాలు వెల్లడించాడా? సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత ఇచ్చాడా? ఎవరు చెబితే ఇదంతా చేశాడు?.. సీసీటీవీ పుటేజీ ఎందుకు మాయం చేశాడు?.. అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నాగరాజుకు రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇచ్చారని, అందుకే విచారణలో పూర్తిగా నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
ఈసీ డెప్యూటీ కమిషనర్కు స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర ఎన్నికల సంఘం డెప్యూటీ కమిషనర్ భానుప్రకాష్ ఏటూరుకు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ పర్యటన నిమిత్తం ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్తో కలిసి ఆయన ఎయిరిండియా విమానంలో న్యూఢిల్లీ నుంచి ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలంకారీ ఉత్పత్తులను అందజేసి సాదర స్వాగతం పలికారు. గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం, ఎయిర్పోర్ట్ సీఎస్ఓ కె. ధర్మేంద్ర తదితరులు ఉన్నారు. డైట్సెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి గుడ్లవల్లేరు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డి.ఎల్.ఎడ్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డి.ఎల్. ఎడ్ సెట్ – 2026) హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అంగలూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ మంగళవారం తెలిపారు. ఈ పరీక్ష జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తమ హాల్ టికెట్లోని పేరు, ఫొటో, సంతకం, పరీక్ష కేంద్రం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు గమనించినట్లయితే వెంటనే డైట్, అంగలూరు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. పరీక్ష రోజు అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకురావాలని చెప్పారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ సమావేశ హాలులో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మంగళవారం చైర్పర్సన్ ఉప్పాల హారిక పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులతో చైర్పర్సన్ మాట్లాడుతూ పనులు జరుగుతున్న తీరును, నాణ్యతను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా ఆధునికీకరణ పనులను సమావేశపు హాలుతో పాటు సీఈవో, చైర్పర్సన్ చాంబర్లను కూడా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్సీఏ ఆనంద్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు. పట్టుబడిన మాదకద్రవ్యాలు జిందాల్ ప్లాంట్లో దహనం యడ్లపాడు(పల్నాడు జిల్లా): కృష్ణా–ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి, ఇతర నార్కోటిక్ సంబంధిత పదార్థాలను పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో మంగళవారం దహనం చేశారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 364 కిలోల గంజాయి, 20 గ్రాముల ఎండీఎంఏ, 69 కిలోల ఎన్డీపీఎస్ పదార్థాలను, కృష్ణాజిల్లాకు సంబంధించి 911 కిలోల గంజాయిని శాసీ్త్రయ పద్ధతిలో దహనం చేశారు. విజయవాడ డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు సీహెచ్ లావణ్య, రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ అధికారి నజీనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు
దుర్గమ్మకు తొలి సారె సమర్పించనున్న దుర్గగుడి ఈవో ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని మహా మండపం ఆరో అంతస్తులో ప్రతిష్టించనున్నారు. ఆషాఢ మాసంలో తొలి రోజైన 15వ తేదీ బుధవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం తరఫున ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారికి మొదటి సారెను సమర్పించనున్నారు. నెల రోజుల పాటు సాగే మాసోత్సవాలలో భక్తులు, సేవా బృందాలు, భక్త బృందాలు, ఆలయ ట్రస్టీలు, దేవస్థానాల తరఫున అమ్మవారికి చీరలు, పూజా సామగ్రి, మిఠాయిలు, కాయలు, పండ్లు, పసుపు, కుంకుమను సారెగా సమర్పిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆషాఢ మాసం చివరి రోజైన ఆగస్టు 12వ తేదీ బుధవారం దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారెను సమర్పిస్తారు. పక్కా ఏర్పాట్లు.. ఆషాఢ మాసోత్సవాలకు తోడు జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాలను పురస్కరించుకొని నెల రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈవో శీనానాయక్ ఆలయానికి చెందిన కీలక విభాగాల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
గన్నవరం: మండలంలోని దావాజిగూడెం, అల్లాపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత దావాజీగూడెం మోడల్ స్కూల్ ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి వసతులను పరిశీలించారు. అంగన్వాడీకి వచ్చే చిన్నారుల సంఖ్యను పెంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు హాజరు, పౌష్టికాహారం పంపిణీ వివరాలను యాప్ ద్వారానే నిర్వహించాలని చెప్పారు. హాజరు పట్టికలు, రికార్డుల్లో రాయడం వంటి పాత పద్ధతులకు స్వస్తి పలకాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులు ఎత్తు, బరువులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అల్లాపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ టాయిలెట్స్, టీవీ, తాగునీటి సదుపాయలను పరిశీలించారు. కేంద్రం నిర్వహణపై ఐవీఆర్ఐ కాల్స్లో ప్రజలు ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తపరచడంపై విచారించారు. ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి, గన్నవరం ప్రాజెక్ట్ సీడీపీఓ జి. మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వీధివీధినా ఎం‘చుక్క’.. వ్యాపారం
కోనేరుసెంటర్: కూటమి పాలనలో మద్యం సిండికేట్ రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ ప్రజా ధనాన్ని దోపిడీ చేసేస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లకు చుక్క నీరు దొరకని పరిస్థితి ఉందేమోగానీ.. మందు చుక్క దొరకని సందు లేదు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బందరు మండలంలోని కొంత మంది మద్యం వ్యాపారుల అవినీతి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వైన్ షాపుల్లోని మద్యాన్ని పల్లెలతో పాటు పట్టణంలోనూ ఏరులై పారిస్తున్నారు. వైన్షాపుల్లో నడిచే వ్యాపారం చాలదన్నట్టు పచ్చటి పల్లెల్లో బెల్టుషాపులు పెట్టించి మరీ దొడ్డిదారిన లిక్కర్ బాటిళ్లను సరఫరా చేస్తూ లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగమంతా ఎకై ్సజ్శాఖకు తెలిసే నడుస్తున్నా పట్టించుకునే నాథుడు ఉండటంలేదని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు.. బందరు మండలంలో మద్యం వ్యాపారులు అంతా కుమ్మక్కయ్యారు. పార్టీలు ఏవైనా ఒకరికొకరు స్నేహంతో మెలుగుతున్నారు. సొమ్ము ఎవడికి చేదు అన్నట్టు బెల్టుషాపులకు మద్యాన్ని తరలించి అక్రమార్జనను తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు పంచుకుంటున్నారు. దీంతో అందరూ అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. -
ఆర్టీసీని కాపాడుకునేందుకే ఉద్యమం
ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 88 నేపథ్యంలో ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునేందుకే ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ విలువైన ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకుని, సంస్థను ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ రెండు రోజులు తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విద్యాధరపురం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ వద్ద ధర్నా – గేట్ మీటింగ్ నిర్వహించింది. జేఏసీ నాయకులు ఎస్. కల్యాణ్ కుమార్, స్వామి, శ్రీనివాస్ (ఎన్ఎంయూ), రాష్ట్ర నాయకులు కె. కోటేశ్వరరావు, వి. శ్రీధర్, ప్రసాద్ (ఈయూ), పాపారావు (కార్మిక పరిషత్) పాల్గొని మాట్లాడారు. విద్యుత్ బస్(ప్రైవేట్) ఆపరేటర్ల కోసం రన్నింగ్లో ఉన్న డిపోలను ఖాళీ చేయించే విధానాలను మానుకోవాలన్నారు. సీ్త్ర–శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే నాలుగు వేల కొత్త బస్లను ప్రవేశపెట్టాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలి.. అన్ని రకాల బస్లు నడపగలిగే సామర్థ్యం ఉన్న డ్రైవర్లు ఆర్టీసీ సంస్థలో ఉండగా ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించకుండా ఏపీఎస్ఆర్టీసీ సంస్థే సొంతంగా నిర్వహించాలని జేఏసీ నాయకులు కోరారు. ఆర్టీసీ సంస్థలో అపరిష్కృతంగా ఉన్న మరి కొన్ని సమస్యలపై బుధవారంకూడా ధర్నా కొనసాగుతుందని తెలిపారు. -
సీఐ నాగరాజును మరోసారి విచారిస్తున్న సిట్
విజయవాడ: సీఐ నాగరాజును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి విచారిస్తోంది. కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయికృష్ణను 6 గంటలపాటు విచారించింది సిట్.. అనంతరం, రెండు గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆరా తీసింది. ఇప్పటికే సేకరించిన వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేస్తోంది. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సీఐ నాగరాజును ఇవాళ తొలిసారి విచారించిన అనంతరం కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాశ్ వెళ్లిపోయారు. నివేదికను సిద్ధం చేసినట్లు సిట్ బృందం చెబుతోంది. నేటి రాత్రి లేదంటే రేపు ఉదయం సీఐ నాగరాజుని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
సాయికృష్ణ కేసు: సీఐ నాగరాజు అరెస్ట్!
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్.. మంగళవారం నాగరాజు నివాసానికి వెళ్లింది. పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు.అయితే తమ విధులకు ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొట్టగా.. సిట్ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం.. నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ కోసం నాగరాజును పోలీస్ గెస్ట్హౌజ్కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అక్కడ వైద్యపరీక్షల అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. నాగరాజు అరెస్ట్పై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేసి ఉంటారనే అనుమానాల నడుమ.. ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని నాగరాజు మాయం చేసినట్లు.. లాకప్డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ వ్యవహారంలో సస్పెండైన సీఐ నాగరాజు పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ రికార్డులను పరిశీలించిన సిట్ అధికారులు, మే 1 నుంచి జూన్ 1 వరకు ఉండాల్సిన ఫుటేజ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడాన్నిగుర్తించినట్లు సమాచారం. నెల రోజుల వ్యవధిలో.. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉంచబడినట్లు తేలింది. మిగతా రికార్డులు ఉద్దేశపూర్వకంగానే తొలగించబడ్డాయా? గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ప్లాన్ చేశారా? నాగరాజే వీటి వెనుక ఉన్నాడా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ దృశ్యాలను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలకు ముందే మే నెలకు సంబంధించిన ఫుటేజ్ తొలగించబడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఇది సాధారణ సాంకేతిక లోపమా లేదంటే కీలక ఆధారాలను చెరిపివేసే ప్రయత్నమా? అనే దానిపై విచారణ ముమ్మరమైంది.సాయికృష్ణ కేసు దర్యాప్తుకు ఈ సీసీటీవీ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలపై స్పష్టత ఇవ్వగల ఆధారాలు ఇవేనని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ఫుటేజ్ లేకపోవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఐ నాగరాజే ఉద్దేశపూర్వకంగా వాటిని మాయం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అలాగే.. సాయికృష్ణ కేసులో కీలక ఆధారాలు అందుబాటులో లేకుండా పోవడంతో అప్పటి పోలీసు అధికారుల పాత్ర, కేసు నిర్వహణ తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీ ఫుటేజ్ మాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిట్, బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపుగా మారింది. -
పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచి పెడుతూ.. ఇసుక నుంచి మట్టి దాకా అన్నింటినీ ఆదాయ వనరుగా మార్చుకుని బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యనేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చ జెండా ఊపారు! ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరి తెగించిన పచ్చ ముఠాలు పోలవరం కాలువను కుళ్లబొడుస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. కాలువకు రక్షణగా ఉన్న ప్రధాన గట్లను (బండ్స్) కూడా వదలకుండా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వేస్తూ నిత్యం వేలాది లారీల మట్టిని తరలించి జేబులు నింపుకొంటున్నారు. విజయవాడకు కూతవేటు దూరంలో సీఎం చంద్రబాబు నివాసానికి అత్యంత చేరువలో కేజీఎఫ్ గనులను తలదన్నేలా ఈ మట్టి దందా సాగుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలతో కాలువ గట్లు బలహీనపడి వరద ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో.. ఇక్కడ కాలువ గట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్న పోలవరం కాలువలో మట్టి దందా ఇలా ఉంది..!మట్టి గుట్టలు మాయం..పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టిని మింగేసేందుకు ముఖ్యనేత డైరెక్షన్లో టీడీపీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) అవసరాల కోసం పోలవరం కాలువ 167.040 కిలోమీటరు వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలు పరిమితంగా పగటి పూట మాత్రమే చేపట్టాలి. దీనికి విరుద్ధంగా రోజు భారీ యంత్రాలతో రేయింబవళ్లు కాలువ గట్లను ఛిద్రం చేసి వేలాది లారీల మట్టిని అక్రమంగా తరలించారు. అడ్డగోలు తవ్వకాలపై సామాజిక కార్యకర్త జమలయ్య ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. జీపీఎస్ మ్యాపింగ్ ఫొటోలతో నీటి పారుదలశాఖ అధికారుల దృష్టికి సైతం తెచ్చినా స్పందించలేదు. ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో మరింత బరి తెగించి పోలవరం కుడికాలువ 166 కి.మీ. నుంచి 168 కి.మీ. వరకు రెండు కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా గట్లను తవ్వడంతో భారీ మట్టి గుట్టలు మాయమయ్యాయి. కొన్ని చోట్ల బండ్ను మాయం చేశారు. దీంపాటు ఇదే ప్రదేశంలో కాలువ గట్టుకు సమీపంలో ఉన్న దండ తిప్పలు కొండలను సైతం బాంబులతో పెకిలించి గ్రావెల్ను తరలిస్తున్నారు.రూ.350 కోట్ల మట్టి దందా!– సీఎంకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ మట్టి దందాకు అండదండలు అందిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్నిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని (శ్రీనివాస్) సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడ రూరల్ పరిధిలోని పోలవరం కుడి ప్రధాన కాలువ రక్షణ గట్లను, బుడమేరు డైవర్షన్ కాలువ(బీడీసీ) పరిసరాల్లోని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి ఎంపీ కేశినేని చిన్ని రూ.350 కోట్లు పోగేశారని ఆరోపించారు. పదవిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఒక పెద్ద బినామీ నెట్వర్క్ ద్వారా ఈ దోపిడీకి తెర తీసినట్లు పేర్కొన్నారు. మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీల కీలక చర్చలన్నీ విజయవాడ గురునానక్ కాలనీ ‘రావూరి విస్టా’ అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 301 కేంద్రంగా సాగినట్లు వెల్లడించారు. అక్కడ తక్షణమే దాడులు నిర్వహించి సోదాలు చేస్తే ఈ కుంభకోణానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. కేవలం ఐదు వేల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతి పొంది ఏకంగా రెండు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని కాలువ గట్ల నుంచి తవ్వేందుకు వ్యూహం రచించారని తెలిపారు. జేసీబీలు, పొక్లెయిన్లతో రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపించారన్నారు. వందలాది టిప్పర్ల మట్టిని అమరావతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలించి విక్రయించారని చెప్పారు. ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండా మైనింగ్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐతో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మైలవరంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఫిర్యాదుమైలవరం నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు.సహజ వనరుల లూటీరాజధాని నిర్మాణం ముసుగులో టీడీపీ నేతలు అమరావతిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మట్టి, ఇసుక, గ్రావెల్, బూడిద, సహజ వనరులన్నింటిని దోచేస్తున్నారు. పోలవరం గట్లను సైతం మాయం చేస్తున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తవ్వేసి వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఈ మట్టి దోపిడీ కేజీఎఫ్–3 సినిమాను తలపిస్తోంది. యథేచ్ఛగా మట్టి దోచేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. మట్టి దోపిడీపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.– జోగి రమేష్, మాజీ మంత్రి -
ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికుల శంఖారావం
సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14 రకాల సేవలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై కార్మికులు కన్నెర్రజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులంతా సోమవారం విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ప్రభుత్వ తీరుకు నిరసనగా శంఖారావం పూరించారు. మున్సిపల్ సేవలు ప్రైవేటుపరమైతే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు.చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో చెత్త పన్నుపై నానా యాగీ చేసిన ఇదే చంద్రబాబు.. ఇప్పుడు అదే చెత్త పన్ను తీసుకొస్తున్నారని.. ఉమ్మేస్తే కూడా పన్ను వసూలు చేసేలా ఉన్నారని మండిపడ్డారు. కరోనా సమయం, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మున్సిపల్ కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకుని దేవుళ్లు అని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు వారందర్నీ బలిపశువులుగా మార్చేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు చీకటి జీవోలతో పొట్టగొడతారా! కార్మికులను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతూ చీకటి జీఓలతో మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో 14 సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సిద్ధం కావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రైవేటుపరమైతే అన్ని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న 60 వేల మంది మున్సిపల్ కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయన్నారు.ఇదే చంద్రబాబు 2014–19 కాలంలో జీవో నం.279 తెచ్చి మున్సిపల్ కార్మికుల బయటకు గెంటేసి, ప్రైవేటుపరం చేయాలని చూశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు జీవోలు 975, 673 తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నారన్నారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.నాగభూషణం మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సేవలను ప్రైవేటుపరం చేయొద్దని, సేవలందించే వారిని పర్మినెంట్ చేయాలని కోరుతూ వేలాదిమంది కార్మికులు సంతకాలు చేశారని, ఆ ప్రతులను మున్సిపల్ మంత్రి నారాయణ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కార్మిక నేతలు కాశీనాథ్, వెంకటరెడ్డి, వెంకటరావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలను విరమించుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్న్నేతలు పీవీ సురేష్ , రాయపురెడ్డి అనిల్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, కార్మిక నేతలు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రమిచ్చారు.అనంతరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పలువురు ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ..విద్య, వైద్యం, ప్రజా రవాణా వంటి కీలక రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అయితేనే పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జాన్వెస్లీ, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్ టీయూసీ జోనల్ ఇన్చార్జి నారపరెడ్డి రాజారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గోవిందరాజులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశకు వైఎస్సార్టీయూసీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ చక్రం ప్రజా ప్రగతికి చిహ్నమనే నినాదం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన చేస్తోందన్నారు. కూటమి పాలనలో ఆర్టీసీ ఉద్యోగులపై, ప్రజల పాలిట కర్కోటకంగా వ్యవహరిస్తోందన్నారు. 2015 –16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే.. ఆ సంఖ్య ప్రస్తుతం తగ్గిందన్నారు. గతంలో అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే, ఇప్పుడా సంఖ్య 10,700 వచ్చిందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కొత్త బస్సుల కొనుగోలు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బస్సులను వారి ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీని నష్టాలు సాకుగా చూపి ప్రైవేటుకు ధారాదత్తం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, బస్డిపోలను అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధోరణి ఇదేవిధంగా కొనసాగితే అన్ని సంఘాలు, ప్రజల సహకారంతో ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జీవీ నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు ఎస్కే అక్బర్, ఎం.రామారావు, బి.రాజేష్, ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ టీయూసీ -
కౌన్సెలింగ్ బహిష్కరించి ఆందోళన
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేల్) ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరోసారి గందరగోళానికి దారితీసింది. బదిలీలకు సంబంధించిన పూర్తి ఖాళీల వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరచకుండానే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంపై ఉపాధ్యా యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పారదర్శకత లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ–2008, డీఎస్సీ–1998 బ్యాచ్లకు చెందిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా డీఎస్సీ–2008, అనంతరం డీఎస్సీ–1998 ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఖాళీల వివరాలు ఏవి? అయితే జిల్లాలో ఉన్న అన్ని ఖాళీల వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల్లో అనుసరించే ప్రమాణాలు ఎంటీఎస్ ఉపాధ్యాయుల విషయంలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. పూర్తి ఖాళీల జాబితాను ప్రకటించకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది ఉపాధ్యాయుల ఎంపిక హక్కును పరిమితం చేసే చర్యగా మారుతుందని విమర్శించారు. దీంతో కౌన్సెలింగ్ను బహిష్కరించిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మొత్తం ఖాళీలు ప్రకటించాలని, పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చల అనంతరం ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ సోమవారం పొద్దుపోయాక ప్రారంభమైంది. పారదర్శకత లేని బదిలీలపై ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆగ్రహం -
‘ఫీజు’ బకాయిలను విడుదల చేయాలని ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రూ. 10వేల కోట్లు పైచిలుకు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూతబడ్డ 4,500 పాఠశాలలను పునఃప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, దీపక్, యశ్వంత్, సాయి, దివ్య తదితరులు పాల్గొన్నారు. హనుమాన్జంక్షన్ రూరల్: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఒకరి మరణానికి కారకుడైన వాహన చోదకుడు అంకం ప్రవీణ్ శ్రీనివాస్కు నూజివీడు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇవి.. 2023 డిసెంబర్ 22వ తేదీన బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి హైవే మధ్యలో ఉన్న డివైడర్ను సైతం దాటుకుని అవతల వైపు రోడ్డు మీదకు వెళ్లింది. ఆ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొనటంతో ఆ కారులో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన లాజర్ పి.థామస్ (60) అనే వ్యక్తి దుర్మరణం చెందటంతో పాటుగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు గ్రామంలోని కాఫీ ఫ్యాక్టరీలో మిషనరీ పరిశీలించేందుకు కేరళ నుంచి వచ్చిన థామస్ తిరిగి వెళ్లేందుకు కారులో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరగా, ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై అప్పటి వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవి కేసు నమోదు చేయటంతో పాటుగా విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జీషీట్ సమర్పించారు. ఈ కేసులో ఏపీపీ వి.ప్రసన్న వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుడు అంకం ప్రవీణ్ శ్రీనివాస్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందు మామయ్య మోహనరావు ఇబ్రహీంపట్నం: యూట్యూబర్, సినీ నటి రమానందన (నందు) భర్త తండ్రి జాగర్లమూడి మోహనరావును ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం స్టేషన్లో విచారించారు. ఇప్పటికే నందు కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. తన వ్యక్తిగత లాయర్తో కలిసి మోహనరావు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని మీడియా ప్రతినిధులతో అతడి లాయర్ గొడవకు దిగారు. విచారణలో.. నందు దంపతులు ఎక్కడున్నారు? వారు చేసే వ్యాపారంలో మీ పాత్ర ఏమిటి? ఇప్పటి వరకు ఎంత మంది వీసాలు రెన్యూవల్ చేశారు? వీసాల రెన్యూవల్లో మీ కుటుంబంతో పాటు ఇంకా బయట వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే ప్రశ్నలు పోలీసులు వేసినట్లుసమాచారం. అసలేం జరిగిందంటే.. పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ తన యూకే వీసా రెన్యూవల్ చేయాలని గతంలో డెస్టినీ సంస్థను ఆశ్రయించగా, ఇండియాలో ఉన్న తమ సంస్థకు రూ.15 లక్షలు చెల్లించాలని వారు నమ్మబలికారు. రూ.15 లక్షలు తీసుకున్న తర్వాత ముఖం చాటేయడంతో అతను ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు నిందితులుగా ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, మధుకర్ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేశారు. నందు దంపతులు అందుబాటులో లేకపోవడంతో మోహనరావును తీసుకువచ్చి విచారించిన అనంతరం పంపించేసినట్లు పోలీసులు తెలిపారు. -
నర్సాపూర్ నుంచి రెండు జతల రెగ్యులర్ సర్వీసులు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్ నుంచి తిరువణ్ణామలై, ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న రెండు జతల వారంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చడానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. నర్సాపూర్ – తిరువణ్ణామలై (17291) వారంతపు ఎక్స్ప్రెస్ జూలై ఒకటి నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సాపూర్లో బయలుదేరి, గురువారం తెల్లవారుజామున 4.55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17292) జూలై రెండు నుంచి ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరి, శుక్రవారం మధ్యరాత్రి రెండు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుంది. నర్సాపూర్ – ఎస్ఎంవీటీ బెంగళూరు (17293) జూలై మూడు నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్ లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17294) జూలై నాలుగు నుంచి ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, బంగారుపేట్, కృష్ణార్జునపురం స్టేషనల్లో ఆగుతుంది. -
యూరియా సరఫరాకు పటిష్ట కార్యాచరణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఖరీఫ్ సీజన్లో యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అన్ని రకాల ఎరువుల సరఫరాకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో ఖరీఫ్ యూరియా, ఇతర ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ యూరియా, ఇతర ఎరువుల శాసీ్త్రయ సమతుల్య వినియోగంతో పాటు ఏపీ ఎయిమ్స్ యాప్, పంట వైవిధ్యం, నానో ఎరువులు, డ్రోన్ స్ప్రేయింగ్ తదితరాలపై ఇంటింటి సందర్శనల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఏసీఎస్ వద్ద తాగునీరు, టెంట్, కుర్చీలు వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎరువుల సరఫరా, పంపిణీ లేదా ఇతర వ్యవసాయ సంబంధిత సమస్యలు ఎదురైన సందర్భంలో రైతులు కాల్ టు కలెక్టర్ 91549 70454లో సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. జేసీ ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, సహకార అధికారి అజిత కుమారి, మార్క్ఫెడ్ డీఎం కె.నాగమల్లిక, వ్యవసాయ శాఖ ఏడీలు, వర్చువల్గా ఆర్డీవోలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
బుడమేరు ప్రక్షాళన మరిచారు
బుడమేరు ప్రక్షాళన చేస్తామని, బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇంత వరకు కనీస చర్యలు చేపట్టలేదు. తూడు తొలగింపు పనులు సక్రమంగా చేపట్టలేదు. బుడమేరులో చెత్త్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంది. బుడమేరులోకి మురుగు, సెప్టిక్ వ్యర్థాలను సైతం వదలివేస్తున్నారు. బుడమేరులో చెత్త్తాచెదారం సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసకేంద్రంగా మారింది. గత వరదల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. వర్షకాలం వస్తోందంటే భయమేస్తోంది. అధికారులు స్పందించి బుడమేరును ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. –పూర్ణ, బుడమేరు మధ్య కట్ట -
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ఇబ్రహీంపట్నం: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీటీపీఎస్ పాత గేటు వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ అధ్యక్షుడు ఎస్కే సలీం, రీజనల్ కార్యదర్శి ఎం.రవీంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా కార్మికుల వేతనం రూ.43వేలు, పెండింగ్లో ఉన్న కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. రమేష్, కోశాధికారి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు టి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి
పెనమలూరు: ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని (సర్) పరిశీలించడానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్యాదవ్ పెనమలూరులో సోమవారం పర్యటించారు. ఆయన 132,134 పోలింగ్ బూత్లకు సంబంధించి సర్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేస్తున్నారా లేదా పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఇంటింటి సర్వే నిర్వహణ, మరణించిన ఓటర్ల గుర్తింపు, వలస వెళ్లిన ఓటర్ల నమోదు, తాళం వేసి ఉన్న ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి ఎస్.కరుణకుమారి వివరాలు తెలుపుతూ ఎన్యూమరేషన్ ఫారాలను 71.44 శాతం పంపిణీ చేశామని, ఇంటికి తాళాలు వేసిన కేసుల్లో బీఎల్వోలు మూడుసార్లు గృహాలు సందర్శించారని తెలిపారు. చనిపోయిన ఓటర్ల కేసుల్లో మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పంచనామా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్యాదవ్ మాట్లాడుతూ సర్ విషయంలో బీఎల్వోలు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఈఆర్వో శివకుమార్రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఏపీ పీటీడీ (ఆర్టీసీ) విజిలెన్స్, సెక్యూరిటీ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా బాధ్యతలు తీసుకున్న ఎస్.వినోద్కుమార్ను సోమవారం పీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి అభినందించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంకినీడు ఆధ్వర్యాన విజయవాడ ఆర్టీసీ హౌస్లో జోనల్, రీజనల్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కొండారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, నాయకులు రవి, అనంతకుమార్, ఆదామ్, జాన్బాబు, గురవయ్య తదితరలు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లో పల్స్ పోలియోపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జేసీ నవీన్ పల్స్ పోలియో ప్రచార వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా మైక్రో ప్లానింగ్ రూపొందించడం, బూత్ల ఏర్పాటు, వ్యాక్సిన్ సరఫరా, కోల్డ్చైన్ నిర్వహణ, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అనంతరం మిగిలిపోయిన పిల్లలను గుర్తించి ఇంటింటి సందర్శనలతో పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె.ప్రేమ్చంద్ మాట్లాడుతూ విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, రవాణా శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. -
అభివృద్ధి.. కనపడని చిత్తశుద్ధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో వరదలు సృష్టించిన బీభత్సం నుంచి విజయవాడ పూర్తిగా తేరుకోలేదు. అప్పుడే వర్షాకాలం వచ్చేసింది. అయితే బుడమేరు ఆధునికీకరణపై ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండ్లుపడిన చోట గతేడాది చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. వెలగలేరు వద్ద బుడమేరు హెడ్ రెగ్యులేటర్ పనులను మమ అనిపించి వదిలేశారు. అరకొరగా నిధులు బుడమేరు హెడ్రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్ కెనాల్ ఉంది. బుడమేరు ఆధునికీకరణలో భాగంగా దీన్ని పూర్తిగా లైనింగ్ చేయాల్సి ఉంది. వరదలొచ్చిపోయిన 20 నెలల తర్వాత ఇప్పుడు 0 కిలోమీటరు నుంచి 8.3 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.121కోట్లను మాత్రమే కేటాయించింది. మరో 3.600 కిలోమీటర్ల కెనాల్ పనుల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. నిధులను ఇటీవల విడుదల చేయడంతో కాంట్రాక్టర్ లైనింగ్ పనులను ఏప్రిల్ 18న మొదలు పెట్టారు. ఈ పనులకు కావాల్సిన వ్యవస్థను తరలించి పూర్తి స్థాయిలో చేపట్టేందుకు మరో నెల అంటే మే నెల సగంలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి వానలు పడుతుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పునాది దశలోనే బ్యాలన్స్ రిటైనింగ్ వాల్ బుడమేరుకు 2024 ఆగష్టు 31న వచ్చిన వరదలకు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున మూడు చోట్ల, కుడి వైపున ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున పడిన గండ్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం అంటూ 2025, మార్చి 21వ తేదీన రూ.39.77కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఇది ఇచ్చిన యాభై రోజుల తర్వాత మే 15న శంకుస్థాపన చేసి రూ.28కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.1.80కోట్లతో రెగ్యులేటర్ మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. వీటిలో భాగంగా శాంతినగర్ వద్ద డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు నిర్మించే రిటైనింగ్ వాల్ 8.65 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు 500 మీటర్ల పొడవునా, కుడి వైపు అంటే శాంతినగర్ వైపున ఇదే కొలతలతో యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ను నిర్మించాల్సి ఉంది. పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీటిని విడుదల చేయడంతో ఎడమవైపు 360మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ని నిర్మించి జూన్ 9న పనులు ఆపేశారు. ఇంకా ఎడమ వైపున బ్యాలన్స్ ఉన్న 140 మీటర్లు పొడవు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభమై పునాది దశలోనే ఉండగా కుడి వైపున యాభై మీటర్ల పొడవునా నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్ పనులు ఇంకా ప్రారంభించలేదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ లైనింగ్ పనులు చేయడానికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద డైవర్షన్ కెనాల్ వైపు వరదనీరు వెళ్లకుండా ఉండేలా భారీ కట్టను నిర్మించారు. డైవర్షన్ కెనాల్లో సైతం అక్కడక్కడా అడ్డుకట్టలను నిర్మించారు. ఇవే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక వైపు పనులు నత్తనడకన సాగుతుండటం.. వర్షాలు కూడా పడుతుండడంతో ఏ క్షణంలోనైనా భారీ వర్షం పడి గతంలో వచ్చినట్లు వరద మళ్లీ వస్తే పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. డైవర్షన్ కెనాల్కు అడ్డకట్టలు వేయడంతో ప్రస్తుతం వచ్చిన వరద హెడ్ రెగ్యులేటర్ గేట్ల నుంచి దిగువకు అంటే విజయవాడ వైపు బుడమేరులో ప్రవహించాల్సి ఉంది. ఈ రెగ్యులేటర్ 11అడుగుల ఎత్తుతో 11 గేట్లు మాత్రమే ఉండి 15వేల క్యూసెక్కుల వరద మాత్రమే అవుట్ ఫ్లో సామర్ధ్యం ఉంది. వరద పోయేందుకు మరో మార్గం కూడా లేకపోవడంతో ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జూలై నెలలో పట్టిసీమ నీళ్లను సైతం విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్న క్రమంలో లైనింగ్ పనులు పూర్తిగా ఆగిపోయి మరో ఆరు నెలల పాటు వేచి ఉండక తప్పదు. -
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళపై దాడి
మైలవరం: అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వమని మహిళ అడిగితే ఆమైపె దాడి చేసిన సంఘటన మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో సోమవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి(చల్లా కోటయ్య) ఇటుక బట్టీలు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 2020లో అతను వెంకటేశ్వరమ్మ వద్ద నుంచి రూ. 4లక్షలను వ్యాపారం నిమిత్తం తీసుకుని 4, 5 నెలల్లో తిరిగి వడ్డీతో చెల్లిస్తానని చెప్పాడు. వీరి ఒప్పందం ప్రకారం సమయం దాటిపోయిన డబ్బులు చెల్లించకపోవడంతో బాధితురాలు వెంకటేశ్వరమ్మ పదేపదే తన డబ్బులు తనకు ఇవ్వమని అడుగుతోంది. తన పిల్లలు, భర్తతో కలిసి ఆ వ్యక్తిని పలుమార్లు అడిగారు. దానికి బదులుగా ఆ వ్యక్తి నేను ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరమ్మ తనకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి అడగ్గా అసభ్య పదజాలంతో దూషించి ఆ వ్యక్తి ఆమైపె దాడి చేశాడు. ఈ అవమాన భారంతో వెంకటేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన భర్త, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మను ఆటోలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైలవరం పోలీసులకు కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మ పరిస్థితిని వివరించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
జి.కొండూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మైలవరంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామానికి చెందిన తమండ్రు వేణు(25) తన బైక్పై మైలవరం నుంచి కుంటముక్కల వెళ్తుండగా మైలవరం మార్కెట్ యార్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన వేణు తలకి తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రుడిని స్థానికులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడు వేణు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ప్రజా విశ్వాసమే పని తీరుకు ప్రమాణం
పీజీఆర్ఎస్ను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల విశ్వాసమే అధికారుల పనితీరుకు అసలైన ప్రమాణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి.సాయిప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం.. అన్నింటికీ కంటే ముఖ్యంగా నాణ్యత, సంతృప్తికర పరిష్కారం ముఖ్యమన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సీఎస్ సాయిప్రసాద్.. సీసీఎల్ఏ జి.జయలక్ష్మితో కలిసి సందర్శించారు. కొంత సమయం ప్రజల అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై లిఖిత పూర్వకంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి రెవెన్యూ సేవలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి స్వీకరిస్తున్న వినతులు, వాటి ఆన్లైన్ నమోదు విధానం, సంబంధిత శాఖలకు పంపిణీ, పరిష్కార చర్యలు, అధికారుల మధ్య సమన్వయం, పర్యవేక్షణ తదితర అంశాలను సీఎస్ పరిశీలించారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించడంతో ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. జిల్లాస్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ, వాటి నమోదు తీరుతెన్నులు, పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం తదితరాలను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ జి.లక్ష్మీశ వివరించగా సీఎస్ సాయిప్రసాద్ అభినందించారు. మొత్తం 177 అర్జీలు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 177 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ 51, పోలీస్ 33, ఎంఏయూడీ 28, పంచాయతీరాజ్ 22, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఈఎస్ 6, డీఆర్డీఏ 4, విద్య 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 4, ఏపీసీపీడీసీఎల్ 3, గనులు 3, ఏపీఎస్ ఆర్టీసీ 2, వైద్య 2 అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, బ్యాంకింగ్ సేవలు తదితర విభాగాల నుంచి ఒక్కో అర్జీ వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, అధికారులు పాల్గొన్నారు. -
గాలి హోరు.. వాన జోరు
కొడాలి ప్రధాన రహదారిపై కూలిన తాటిచెట్టు, విద్యుత్తు స్తంభం కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారి పై ఈదురు గాలులకు కూలిన వృక్షం ఘంటసాల: వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో ఘంటసాల మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయం కాగా చెట్లు, విద్యుత్ స్తంభాలు ప్రధాన రహదారులపై కూలిపోయాయి. ● ఘంటసాల ప్రధాన సెంటర్తో పాటు ఘంటసాల – అంబేడ్కర్, మల్లంపల్లి వెళ్లే రోడ్లు పూర్తి జలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● ఘంటసాల మండలం కొడాలి ప్రధాన రహదారిలో తాటిచెట్లు కూలి విద్యుత్ వైర్ల మీద పడటంలో స్తంభం కూడా కూలిపోయింది. ● కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారిలో కొడాలి రైస్ మిల్లు సమీపంలో, చినకళ్లేపల్లి వెళ్లే రోడ్డులో, గోగినేనిపాలెం వెళ్లే దారిలో భారీ వృక్షా లు కూలిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ నయీమ్ స్పందించి సిబ్బందితో కలసి చెట్లను తొలగించడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ● ఘంటసాల మండలంలో తాడేపల్లి, కొడాలి, శ్రీకాకుళం శివారు సూరపనేనిపాలెం గ్రామాల్లో నాలుగు విద్యుత్తు స్తంభాలు పడిపోయినట్లు విద్యుత్తు శాఖ ఏఈ రవి కుమార్ వివరించారు. నేలవాలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, పలు రోడ్లు జలమయం -
నిత్యాన్నదానానికి రూ,10 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన భక్తులు సోమవారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. మంగళగిరి సమీపంలోని కృష్ణాయపాలేనికి చెందిన వై.జయశంకర కిషోర్బాబు, మహాలక్ష్మి దంపతులు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధా కృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కల్వకుర్తికి చెందిన భక్తులు తాడూరి సురేష్కుమార్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి తాడూరి రాఘవేంద్ర పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని, బీఎల్వోలు ఇప్పటివరకు 7,96,696 మంది (46.87 శాతం) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు పేర్కొన్నారు. 46,871 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తైనట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేలో భాగంగా జులై 14వ తేదీ వరకు బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లనున్నారని తెలిపారు. -
‘కేజీఎఫ్’ను మించిన రీతిలో అక్రమ క్వారీయింగ్
● అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించాలి ● కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి జోగి రమేష్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మైలవరం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మైనింగ్ దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా దాములూరి ఇసుక క్వారీలో అక్రమాలను బహిర్గతం చేశామన్నారు. అలాగే జి. కొండూరు మండలం శేగురెడ్డిపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. ఆ గ్రామంలో పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందన్నారు. అనుమతులు ఒక చోట తీసుకొని మరో చోట మైనింగ్ సాగిస్తున్నారన్నారు. అక్కడ కేజీఎఫ్ సినిమాను తలపించే రీతిలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. మైనింగ్ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో వీడియో క్లిప్పింగ్, ఫొటోలతో ఆధారాలన్నీ కలెక్టర్కు అందజేశారు. నియోజక వర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దోపిడీపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేపట్టాలని కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఊసరవెల్లిలా ఎమ్మెల్యే.. ఇసుక, గ్రావెల్, బూడిద, మైనింగ్ దోపిడీ ఏ విధంగా జరుగుతుంది? ఎంత పరిమాణంలో దోచుకున్నారు? జాయింట్ ఇన్స్పెక్షన్లో తేల్చి.. నాలుగైదు రెట్లు జరిమానా విధించాలని కలెక్టర్ను కోరినట్లు జోగి రమేష్ చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇసుక, గ్రావెల్, లిక్కర్, బూడిద ఇలా ప్రతిదాంట్లో పావలా వాటా వెళ్తోందన్నారు. ఆయన ఊసరవెల్లిగా మారారన్నారు. పార్టీలు మారడం, సూట్ కేసులు పంపడం ఆయన ప్రవృత్తిగా మారిందన్నారు. పంపిన సూట్కేసులకు సరిపడా మైనింగ్ ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. నిర్భయంగా, యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారన్నారు. సర్కారుకు దమ్ముందా? గుంటుపల్లి, ఫెర్రీ పవిత్ర సంగమంలో ఫంటు పేరుతో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని జోగి ఆరోపించారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరులో గ్రావెల్ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్కు ఇక్కడ ఎమ్మెల్యే చేసే దాన్లో వాటా ఉందా అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే దమ్మూ ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే అవినీతి నిరూపించి న్యాయ స్థానంలో నిలబెడతామన్నారు. -
ఉపాధి పనుల పరిశీలన
ఘంటసాల: ఘంటసాలలో 2025–26లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఆడీట్ సీఓఎం వనీత చౌదరి, పింకు కుమార్ మండల కంప్యూటర్ సెంటర్లో బిల్లులను ఎఫ్టీఓలు ఎలా అప్లోడ్ చేస్తున్నారో గమనించారు. పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖలో నిర్మించిన సీసీ రోడ్లు ఫైల్స్ ఎం బుక్, రికార్డులు చూడటంతో పాటు ఆన్లైన్లో కూడా సక్రమంగా ఉన్నాయో లేవో చూశారు. పశువుల షెడ్లు, మేకలు, గొర్రెల షెడ్లు నిర్మాణాలు, వినియోగం, పంట బోదెలు, పంట కాలువల్లో చేసిన ఉపాధి ఫైల్స్, ఏడు రిజిస్టర్ల నమోదును క్షుణ్ణంగా తనఖీ చేశారు. పశువుల షెడ్లను పరిశీలించి యజమానులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో మండలంలోని ఇతర గ్రామాల్లో పర్యటించకుండానే కేంద్ర బృందం వెనుతిరగడంతో కొన్ని గ్రామాల ఎఫ్ఏలు, అధికారులు ఊపిరిపీల్చుకోవడం కొసమెరుపు. ముందుగా ఘంటసాల మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సభ్యులు వనిత చౌదరి, పింకు కుమార్ను ఎంపీడీవో సుబ్బారావు సత్కరించారు. డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, మచిలీపట్నం, ఉయ్యూరు ఏపీడీలు రామమోహన్, లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 90 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 90 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజలు నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకుని, సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్ఓలను డీసీపీ ఉదయరాణి ఆదేశించారు. కాగా భూ, ఆస్తి వివాదాలకు సంబంధించి 31, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 12, వివిధ మోసాలపై 9, మహిళా సంబంధిత నేరాలపై 5, కొట్లాటలపై 2, దొంగతనాలపై 5, ఇతర వివిధ సమస్యలపై 26 ఫిర్యాదులు అందాయి. పెనమలూరు: యనమలకుదురు కొండ వెనుక గత కొద్ది రోజుల క్రితం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పెనమలూరు పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన యనమలకుదురు కొండ వెనుక నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అతను మృతి చెందాడు. అయితే పోలీసులు వివిధ కోణాల్లో విచారించి మృతుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రం బిర్బూమ్ జిల్లా బారాలుండా పోస్టు పార్సిములై గ్రామానికి చెందిన లాలుబాస్కీగా గుర్తించారు. అతను పనులు చేయటానికి యనమలకుదురుకు వచ్చి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బంధువులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. పీఎం అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. జి.కొండూరు: చెత్త లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన హెచ్. ముత్యాలంపాడు వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన డ్రైవర్ బొర్రా వీర నాగ శ్రీనివాసరావు లారీలో చెత్తను నింపుకొని జి.కొండూరు వైపు వస్తున్నాడు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తుండటంతో జి.కొండూరు మండల పరిధి హెచ్. ముత్యాలంపాడు వద్ద బుడమేరు వంతెన దాటగానే లారీ అదుపు తప్పి సైడ్ కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన వీర నాగ శ్రీనివాసరావుని స్థానికులు దగ్గర్లో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘంటసాల: పదేళ్ల వయస్సులో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కోలవెన్ను ప్రణతి చేసిన నాట్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల గ్రామంలో చేసిన గాన కచేరి 60ఏళ్లయిన సందర్భంగా ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో శ్రీజలధీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఈ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శన అనంతరం ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో సమితి గౌరవాధ్యక్షుడు గొర్రెపాటి రామకృష్ణ చిన్నారి ప్రణతిని ఘనంగా సత్కరించారు. కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఘంటసాల కృష్ణ మోహన్, పోతన వెంకటేశ్వరరావు, పామర్రులోని ఘంటసాల కళాపీఠం వ్యవస్థాపకుడు కాటూ రు వెంకట మురళీ కృష్ణ, ప్రణతి తల్లిదండ్రులు విజయ్ కుమార్, బాల భార్గవి పాల్గొన్నారు. -
లాకప్డెత్ సాక్షిగా హైడ్రామా..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీసు బాస్ను కాపాడేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసమయ్యాక 40 రోజుల తరువాత తాపీగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకొంటోంది. ఈ ఘటనను సీఐ నాగరాజుకు ఆపాదించి తూతూమంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసి పోవడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘ఎవరో కులం వాడు క్రిమినల్ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పరా..?’ అంటూ సాయికృష్ణ మిస్సింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో సాయికృష్ణ కుటుంబం జనసేన తరపున పని చేయలేదా? అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఏమైంది? తొలుత తాము సాయికృష్ణను తీసుకురాలేదని బుకాయించినా తరువాత విధిలేని పరిస్థితుల్లో టాస్్కఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి వెళ్లి మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను విజయవాడకు తెచ్చామని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణాధికారి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్కు ముందుగానే దీనిపై సమాచారం ఉందని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ప్రత్యేకించి విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దిట్టలు అని, నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎన్నో కేసులు చేధించామని ప్రకటించే ఉన్నతాధికారులు సాయికృష్ణ ఆచూకీపై నోరు మెదపకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీన్నిబట్టి ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కరుడు గట్టిన నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టే పోలీసులు సాయికృష్ణ అదృశ్యంపై వివరాలను సేకరించడం పెద్ద కష్టమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానిస్టేబుళ్లను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ డీల్ వ్యవహారమేనా..! సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక భూ వివాదం దీనికి కారణమని.. ఎంపీ, పోలీసుబాస్ పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాంతి కుమార్ ఆత్మహత్య... సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో వెల్లడించినా ఇంతవరకు దీనిపై పోలీసులు విచారణ చేపట్టలేదు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఐ ఇంటి వద్ద హైడ్రామా.. తనపై కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సీఐ నాగరాజు ఇంటి వద్ద హైడ్రామా నడుపుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోవద్దంటూ కొందరు యువకులు, మహిళలను పోగు చేసి ఆదివారం ఆందోళన చేయించారు. కొందరు పోలీసులు నాగరాజు ఇంటికి చేరుకుని విచారణ పేరుతో మంతనాలు సాగించారు. ఇక సాయంత్రం ధర్నా చౌక్ ప్రాంతం వద్ద సీఐకు అనుకూలంగా ధర్నా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా పోలీస్ బాసులు వారించడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవన్నీ కేసును పక్క దారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
క్రాంతికుమార్ది ప్రభుత్వ హత్యే
లబ్బీపేట/కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలీసుల వేధింపుల వల్లే పేరుపోగు క్రాంతికుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్ల గతనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ అధికార ప్రతినిధి షేక్ ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్లే రక్షకభటులు భక్షక భటులుగా మారుతున్నారని, ప్రజలు, సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే పోలీసు వేధింపులకు రాష్ట్రంలో 12 మంది చనిపోయారని మండిపడ్డారు. ట్యాక్సీ నడుపుకుంటూ బతుకుబండి లాగుతున్న క్రాంతిని ఇన్ఫార్మర్గా మారాలని సీఐ నాగరాజు వేధించారని, లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించారని, ఈ వేధింపులకు భయపడే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు.క్రాంతి బలవన్మరణానికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలని, క్రాంతి ముగ్గురు పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తక్షణం ఆ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం క్రాంతి కుటుంబం పనిచేసిందని, దానికి కానుకగా అతని శవాన్ని ప్రభుత్వం ఇచ్చిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు వెలుగులోకి వచ్చేవి కావని, ఈ రెండు ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. సాయికృష్ణ, క్రాంతి మరణాలపై పవన్కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. -
పవన్ పరిధి చాలా చిన్నది
సాక్షి, విజయవాడ : డెప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది కాదని.. ఆ విషయం పవన్కళ్యాణ్ తెలుసుకోవాలని అడ్వొకేట్ రజని హితవు పలికారు. ఆయన పరిధి చాలా చిన్నదని, ఆయనకు కేటాయించిన శాఖలు ఆయన చూసుకుంటే చాలన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్క్లబ్లో ‘సాయికృష్ణ లాకప్డెత్–పౌరహక్కులు’ అంశంపై జరిగిన మహిళా ఐక్యవేదిక సమావేశంలో ఆమె ప్రసంగించారు. నేరస్తులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులకే వారిని శిక్షించే అధికారంలేదని.. అలాంటిది డెప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కాలుకు కాలు.. చేయికి చేయి తీసేస్తా.. తొక్కిపట్టి నారతీస్తా అనడం ఏంటని ఆమె ప్రశ్నించారు.రజని ఇంకా ఏమన్నారంటే.. పవన్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారా? లేక సామంత రాజునని అనుకుంటున్నారా? ఆయన వాడే పదజాలం పబ్లిక్లో ఉన్నప్పుడు వాడకూడదని ఎవరూ ఆయనకు చెప్పకపోవడం దౌర్భాగ్యం. డెప్యూటీ సీఎం హోదాలో ఉన్నవ్యక్తి ఇలా పిచ్చి మాటలు మాట్లాడడం ఏమిటి? హోంమంత్రి మీద అంత ప్రేమ ఉంటే పవన్ రాఖీ కట్టించుకోవాలి. ఆయన శాఖలో పనిచేస్తున్న ఒక దళిత మహిళను నడిరోడ్డుపై పోలీసు లాఠీతో జనసేన నేతలు కొందరు కొడితే పవన్ ఎందుకు స్పందించలేదు? తప్పు జరగకపోతే ప్రభుత్వం సిట్ ఎందుకు ఏర్పాటుచేసినట్లు? సామాజికవేత్త వసుంధర కుర్రా, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ గంగాభవానీ మాట్లాడుతూ.. ‘40 రోజులుగా కనిపించకుండాపోయినా సాయికృష్ణ ఉన్నాడా? లేడా?.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏమీ జరగకపోతే ప్రభుత్వం ఎందుకు సిట్ ఏర్పాటు చేసింది? సిట్ అధికారులు స్వర్గపురి శ్మశానంలో వివరాలు సేకరిస్తున్నారంటే తప్పు జరిగిందనే కదా.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో పబ్లిక్గా డ్రగ్స్ తీసుకునే ఎంపీలు, అమ్మాయిలను వేధించే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారిని ఏమీ అనరు. కర్నూలులో గంగమ్మ అనే మహిళ పోలీసుల కస్టడీలో ఉండగానే చనిపోయింది. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
టీడీపీ నేతల అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో టీడీపీ నేతల అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రావెల్ తరలిస్తున్న లారీలు, జేసీబీలను జోగి రమేష్ అడ్డుకున్నారు. జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు, జి.కొండూరు ఎస్ఐ సతీష్ స్పందించలేదు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన జోగి రమేష్.. జాయింట్ కలెక్టర్తో పాటు ఏసీపీ ప్రసాదరావుకు కూడా ఫోన్ చేశారు.జోగి రమేష్తో ఫోన్లో ఏసీపీ వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ మండిపడ్డారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని.. పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. వాటా లేకుండా, వసంత కృష్ణ ప్రసాద్కి తెలియకుండా ఇంత జరుగుతుందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.కొత్తూరు వద్ద పర్మిషన్ తీసుకుని శేగిరెడ్డిపాడు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోవాలి. మైలవరం నియోజకవర్గంలోని సహజ సంపదను ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి కూడా భాగం ఉందని ప్రజలు భావిస్తారు’’ అంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి: దేవినేని అవినాశ్
విజయవాడ: క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును దేవినేని అవినాశ్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేశ్,షేక్ ఆసిఫ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.నెలరోజుల క్రితం ఇదే రోజు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని దేవినేని అవినాశ్ చెప్పారు. ‘‘పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలే. 8 ఏళ్ల క్రితం క్రాంతి కుమార్ పై కేసులున్నాయి. ఇప్పుడు క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవు. తండ్రి కొనిచ్చిన కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమ దందాల కోసం, గంజాయి అమ్మకాల కోసం పోలీసులు వేధిస్తున్నారు. క్రాంతి కుమార్ మృతికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో క్రాంతి కుమార్ కుటుంబం కూటమి కోసం పనిచేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకూ సీపీ పరామర్శించలేదు. డీజీపీ, సీపీ బయటికి రావాలి. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. క్రాంతి కుమార్ ను కులం పేరుతో పోలీసులు దూషించారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అందరిపై కేసులు నమోదు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులే గంజాయి అమ్ముతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు బయటికి వచ్చేవా? జగన్ కలిశాకే సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సాయికృష్ణ,క్రాంతి కుమార్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది’’ అని తెలిపారు.ఇంకెప్పుడు ఆగుతాయి?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... క్రాంతి కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ హత్యలు ఇంకెప్పుడు ఆగుతాయని నిలదీశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ చనిపోయినా చంద్రబాబు, పవన్, హోంమంత్రి నోరుమెదపడం లేదని విమర్శించారు. చంపేసి సెటిల్మెంట్ చేసుకోవాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేదంటే వైసీపీ తరఫున ఉద్యమం చేస్తామని తెలిపారు.వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో పోలీసులంటేనే భయపడేలా చేస్తున్నారని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ చెప్పారు. క్రాంతి కుమార్,సాయికృష్ణవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైసీపీ నేత పోతిన మహేశ్ మాట్లాడుతూ.. పోలీసుల వేధింపుల వల్లే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, క్రాంతి కుమార్ కుటుంబం పనిచేసిందని అన్నారు. కూటమి నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. -
అన్నదానానికి రూ. 50 వేల విరాళం
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణాకు డీఎస్సీ–2008, 1998లలోని మినిమం టైమ్స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు ఈ నెల 22న బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా డీఎస్సీ–2008, అనంతరం డీఎస్సీ–1998 ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాకు సంబంధించిన మినిమం టైమ్స్కేల్ ఉపాధ్యాయుల జాబితాను వెబ్సైట్ doekrn.wee by.com లో పొందుపరిచినట్లు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్కు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. హాజరుకాని ఉపాధ్యాయులకు మిగులు ఖాళీలు కేటాయించనున్నట్టు డీఈఓ స్పష్టం చేశారు. -
యోగాతో జీవన శైలి వ్యాధుల నిర్మూలన
మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): యోగా సాధనతో జీవన శైలి వ్యాధులు దూరమవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మూడు రోజులుగా గుంటుపల్లి డాన్బాస్కో పాఠశాలలో జరిగిన యోగా పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 1600 మంది పాల్గొనగా, ప్రతిభకలిగిన 108 మంది విజేతలుగా నిలిచారు. వారికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎస్.చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియాతో కలసి జ్ఞాపికలు, సర్టిఫికెట్లను మంత్రి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రాచీన వారసత్వ సంపదను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి నుంచి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతా యని వివరించారు. ఈ సంవత్సరం ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నామని పేర్కొన్నారు. నిత్యం 45 నిమిషాలు యోగాకు కేటాయించాలని సూచించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. యోగా సాధన వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమన్వయ అఽధికారులు సుజాత, కృష్ణవేణి, సుకన్య, జిల్లా ఆయుష్ అధికారి రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర కీలకం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని గుడ్లవల్లేరు: గ్రామీణాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో 25వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెమ్మసాని పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంపాదించిన డిగ్రీని కేవలం విద్యార్హతగా కాక సమాజాభివృద్ధికి దోహదపడే సాధనగా మలచుకోవాలన్నారు. వ్యవసాయం, పారిశుద్ధ్యం, తాగునీరు, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో యువ ఇంజినీర్ల సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంజినీరింగ్ కళాశాలలు పరిశోధకులు, వ్యవస్థాపకులను తయారు చేసే సంస్థలుగా రూపుదిద్దుకోవాలని సూచించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల విద్య ప్రతిభావంతులకు, జ్ఞాన సముపార్జనకు, శ్రేష్ఠతకు నిలయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరు పల్లి రామకృష్ణ, కళాశాల సభ్యులు వల్లూరుపల్లి వెంకట కిరణ్, ముసునూరి శ్రీరామ్, డైరెక్టర్ డాక్టర్ పి.సిద్ధయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్, యాజమాన్య సలహాదారు డాక్టర్ పి.రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.కోదండ రామారావు, డాక్టర్ ఎం.ఆర్.సి.హెచ్.శాస్త్రి, పీజీసీఆర్డీ డైరెక్టర్ డాక్టర్ జి.వి.ఎస్.ఎన్.ఆర్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 20267గొల్లపూడి ఏఎంసీ ప్రాంగణంలో శనివారం అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మను యోగా గురు బాబా రామ్దేవ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ హంసా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సిటీ విభాగాల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సెమినార్ హాలులో జరిగిన అసోసియేషన్ సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసి యేషన్ విజయవాడసిటీ ప్రెసిడెంట్గా జాలం సరోజిని, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.ఎస్.ఆర్.కె.ప్రసాద్, కార్యదర్శిగా కె.బి.సి.శేఖర్, కోశాధికారిగా జె.పుష్పలీల ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా వి.రామకృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్గా వి.రోషిబాబు, సెక్రటరీగా రాజశేఖర్, కోశాధికారిగా కె.ఎ.ఎల్.ప్రసన్న ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాగోలు రమ పరిశీలకులుగా వ్యవహరించారు. అనంతరం ఎన్నికై న వారందరూ బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.81 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. 17 రోజులకు హుండీల ద్వారా రూ.3,81,94,846 నగదు 230 గ్రాముల బంగారం, 4.300 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. కానుకల లెక్కింపును ఈఓతో పాటు ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పలువురు సభ్యులు పర్యవేక్షించారు. ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 1,707 అమెరికా డాలర్లు, 195 యూఏఈ దిర్హమ్స్, 52 సౌదీ రియాల్స్, 50 ఆస్ట్రేలియా డాలర్లు లభించాయి. కానుకల లెక్కింపులో రద్దయిన రూ.2000 నోట్లు 15, రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. కోనేరుసెంటర్(మచిలీపట్నం): మండలంలోని మంగినపూడి బీచ్ సమీపంలోని సత్రవపాలెం గ్రామంలో శనివారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) బృందం పర్యటించింది. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ శ్రీరామ శంకర్నాయక్, సీఈఓ డాక్టర్ విజయ్కుమార్ బెహర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఎల్ వనామీ నెక్యూలియర్ బ్రీడింగ్ సెంటర్కు అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. పర్యటనలో జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రారంభించిన ఇగ్నైట్ సెల్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కలెక్టర్ తరఫున జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు కార్యక్రమంలో పాల్గొని అవార్డు స్వీకరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. దేశంలో పరిపాలన, అభివృద్ధి, సృజనాత్మక కార్యక్రమాల అమల్లో విశిష్ట సేవలను గుర్తిస్తూ అందజేసే ఈ అవార్డుకు ఇగ్నైట్ సెల్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన కఠినమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత మూల్యాంకన ప్రక్రియలో అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం ఇగ్నైట్ సెల్ ప్రాజెక్టు అవార్డుకు ఎంపిౖకైందన్నారు. జాతీయ స్థాయి పురస్కారం టీమ్ ఎన్టీఆర్ జిల్లా సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇగ్నైట్ సెల్ ఉపయోగపడుతోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకుల పరుగుల జీవన విధానంతో యువత నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ ఒత్తిళ్ల బారిన పడుతున్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించేందుకు జీవన పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పని వత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి వాటితో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత కొరవడింది. దీంతో శారీరక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ జీవన విధానంలో భాగమైన యోగాపై ప్రజలు దృష్టి సారి స్తున్నారు. ఇటీవల కాలంలో యోగాతో లభించే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెరి గింది. విజయవాడ నగరంలో అనేక యోగా కేంద్రాలు వెలిశాయి. ఉదయం సాయంత్రం వేళల్లో యోగా క్లాసులు నిర్వహించడంతో ఎవరికి అనువైన సమయంలో వారు వెళ్తున్నారు. ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని జరుపుతున్నారు. వయసుతో నిమిత్తం లేదు యోగాసనాలతో ప్రయోజనం యోగాతో పాటు పలు రకాల ఆసనాలు, యోగా థెరపీతో పలు రకాల వ్యాధులు, నొప్పులతో భాదపడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెన్ను నొప్పితో భాదపడే వారికి భుజంగ ఆసనంతో పాటు మరికొన్ని ఆసనాలు చేయిస్తారు. అంతేకాకుండా ఆస్తమా, సైనస్, ఎలర్జీలకు ప్రాణయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, గర్భిణులకు ప్రీ నాటల్ యోగా వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. గర్భిణులు ఆసనాలు చేయడం ద్వారా గర్భస్థ శిశువుకు సమతుల్యంగా రక్త ప్రసరణ, బ్రీతింగ్ జరుగుతుంది. ఇలా అనేక రకాల ఆసనాలు ప్రజలకు ఉన్న సమస్యలను బట్టి అందుబాటులో ఉన్నాయి. యోగా దినచర్యలో భాగం కావాలి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.3600 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులకు యోగా చాలా కీలకం. మెరుగైన ఆరోగ్యాన్ని కోరుకునే మధుమేహ బాధితులకు యోగాతో సాధారణ వ్యాయామమే కాకుండా క్యాలరీలు ఖర్చయ్యి బరువు తగ్గడం, బీపీ, షుగర్లు అదుపులో ఉంటాయి. ప్రాణాయామం శ్వాసమీద ద్యాసను పెంపొందించడమే కాక కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో ఊపరితిత్తుల పనితీరును మెరుగుపరిచి, మధుమేహాన్ని అదుపుచేస్తుంది. అంతేకాక ధ్యానంతో మైండ్ రిలాక్స్, హైపోథా లమస్కు ప్రయోజనం చేకూరుస్తుంది. దీంతో ప్రాంక్రీయాస్, ఇతర అవయవాల పని తీరు మెరుగుపడుతుంది. – డాక్టర్ ఎం.సునీత, మధుమేహ నిపుణురాలు కండరాలను సాగదీయడానికి, బలోపేతం చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. కండరాల ఓర్పు, సమతుల్యతను మెరుగుపర్చడానికి దోహదం చేస్తుంది. వత్తిడిని తగ్గించి చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. సున్నితమైన ఆసనాలు కీళ్లలో కదలికను మెరుగుపరిచి, ఆర్థరైటీస్ వంటి నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. భుజంగాసనం, మకరాసనం వంటివి వెన్నెముకను దృఢపరుస్తాయి. ప్రాణాయామం, లోతైనా శ్వాస తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. – డాక్టర్ జి.శ్రీరమ్య, ఫిజియోథెరపిస్ట్ -
స్వయం ఉపాధికి నిచ్చెన
‘సాక్షి’ మైత్రి మహిళ శిక్షణ.. మెలకువలు నేర్చుకుంటున్న మహిళలుశిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందుకుంటున్న మహిళలుకృష్ణలంక(విజయవాడతూర్పు): మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు ‘సాక్షి’ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్ కోర్సు శిక్షణ శనివారం విజయవంతంగా ముగిసింది. సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంకలోని మేఘన హెర్బల్ బ్యూటీ క్లినిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ నెల రోజులపాటు సాగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళలు థ్రెడింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ ప్యాక్, డాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బ్రైడల్ మేకప్స్, గ్రూమింగ్, ఫేషియల్స్ తదితర అంశాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు. బ్యూటీషియన్ వృత్తిలో నైపుణ్యాలు తెలుసుకున్నా మని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తామని శిక్షణ పొందిన మహిళలు ఆత్మ విశ్వాసంతో చెప్పారు. ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా బ్యూరో ఇన్చార్జి ఓ.వెంకట్రామిరెడ్డి అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఈవెంట్ మేనేజర్ శ్రీహరి పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళల అభిప్రాయాలు వారి మాటల్లోనే... సాక్షి మైత్రి మహిళతో కలిసి బ్యూటీషియన్ శిక్షణ తరగతులు నిర్వ హించాం. నెల రోజుల శిక్షణలో 20కి పైగా అంశాలతో పాటు ప్రాక్టికల్స్ కూడా చేయించాం. కస్టమర్ వస్తే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా మెలగాలో చక్కగా నేర్చుకున్నారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యూటీపార్లర్ పెట్టుకోగలమనే నమ్మకం వచ్చింది. మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్న ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు – అందె నాగలక్ష్మి, ట్రైనర్, మేఘన హెర్బల్ బ్యూటీ క్లినిక్ అండ్ ట్రైనింగ్సెంటర్ -
ఏపీకి అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను విపత్తుల సంస్థ ప్రకటించింది. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.విశాఖపట్నంలో వర్షం దంచికొడుతోంది. బీచ్ రోడ్డులో వరద నీరు భారీగా చేరింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. -
సాయికృష్ణ కేసు.. పోలీసుల అదుపులో బాషా!
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాధ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.విచారణలో భాగంగా ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అతడి మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకుని సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. శ్మశాన వాటికలో విధి నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
వచ్చే నెల 27 నుంచి శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. 27న ఆకుకూరలు, 28న కాయగూరలు, 29వ తేదీన కాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. శాకంబరీ ఉత్సవాలలో భాగంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను రైతులు, హోల్సేల్ వ్యాపారుల నుంచి సేకరించనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతల ద్వారా సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కదంబం.. ప్రత్యేకం.. శాకంబరీదేవిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఈ ఉత్సవాలలోనే ప్రత్యేకంగా తయారు చేసే కదంబ ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. శాకంబరీదేవి ఉత్సవాలలో రోజూ 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా వీలుగా ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు, అర్చకులు, వైదిక కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజుల పాటు ఉత్సవం -
రాష్ట్రంలో 5వేల ఆలయాల నిర్మాణం
పెనుగంచిప్రోలు: తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 5 వేల ఆలయాలను నిర్మించనున్నామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్ అన్నారు. గ్రామంలో వేంచేసి ఉన్న తిరుపతమ్మవారిని శుక్రవారం ఆయన కటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ఈఓ బి. మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఈఓ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 27,500 ఆలయాలు ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులు నివసించే ప్రాంతంలో 5వేల ఆలయాలు రాబోవు మూడేళ్ల కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 1,275 ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలో అంతా ఆన్లైన్.. రాబోవు రోజుల్లో ఆలయాల్లో అన్ని రకాల సేవలను భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకుంటారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 40 శాతం ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకుంటుంటే అన్నవరంలో మాత్రం 95 శాతం అమలవుతుందన్నారు. రాష్ట్రంలో 22 ముఖ్య ఆలయాలు ఉంటే వీటిలో 7 ఆర్జెసీ, 15 డీసీ కేడర్లో ఉన్నాయన్నారు. ఆదాయపరంగా, భక్తుల పరంగా ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 6(ఎ) ఆలయాలు 175 ఉన్నాయని, వీటిల్లో కూడా సిబ్బంది, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, దర్శనాలుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేశ ఖండనశాల, ఆలయ పరిసరాల్లో భక్తులకు అందుతున్న సేవలను వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ -
ప్రతి ఒక్కరి జీవితంలో యోగాతో ఆనందం
గుడ్లవల్లేరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంగలూరులోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో నిర్వహిస్తున్న పోస్టర్ మేకింగ్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల విద్యార్థులకు జిల్లా స్థాయి పోస్టర్ మేకింగ్ పోటీలను రెండు రోజుల పాటు ప్రభుత్వ డైట్ కళాశాల, అంగలూరులో విజయవంతంగా నిర్వహించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే పోస్టర్లను రూపొందించారు. కృష్ణా జిల్లా విజేతగా జి. అపూర్వ (10వ తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, అంగలూరు), ఎన్టీఆర్ జిల్లా విజేతగా ఎస్కే హఫ్సా తహ్సీన్ (10వ తరగతి, పి.ఎం. శ్రీ ఎం.కె. బైగ్ ఎం.సి.హెచ్.ఎస్, విజయవాడ) నిలిచారు. వీరితో పాటు రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందించామని డైట్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. రైల్వేస్టేషన్( విజయవాడ పశ్చిమ): దక్షిణ రైల్వే జోన్ అరక్కోణం జంక్షన్లో జరుగుతున్న నాన్–ఇంటర్లాకింగ్, స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రు ప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న విల్లుపురం–ఖరగ్పూర్ (22604), 24న తిరు నెల్వేలి–పురూలియా (22606), 25న టాటా నగర్–యర్నాకుళంం (18189) రైళ్లు మెల్పక్కం, తిరుత్తాని, రేణిగుంట, గూడూరు మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
ఐజీఎంసీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
పటమట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం(ఐజీఎంసీఎస్)లో చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక, యోగా సాధన ప్రదేశం, అతిథులు, యోగా సాధకులు, ప్రజల కోసం చేపట్టిన ఏర్పాట్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
మందుల్లేవ్.. సౌకర్యాలూ లేవు
● దయనీయ స్థితిలో ప్రభుత్వాస్పత్రులు ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సౌకర్యాలు లేక నిరుపేద రోగులు అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేద వాడి ప్రాణాల కంటే.. ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుతాస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు రంగులు వేసి, తామే చేసినట్లు బిల్డప్ ఇవ్వడం మినహా చేసిందేమీ లేదని ఆరోపించారు. వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు ఉండవు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిత్యం 3వేల మంది వరకూ రోగులు వస్తుంటారని, నడవలేని వారికి కనీసం వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొందని విష్ణు ఆరోపించారు. పేదవాడికి సంజీవని లాంటి ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందన్నారు. వైద్యం పొందాలంటే ఇళ్లు, వంటిపైన నగలు తాకట్టు పెట్టాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాని ంగ్ మెషిన్లు పనిచేయకున్నా పట్టంచుకునే వారు లేరన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మీటింగులు పెట్టడం కాదని విజయవాడ జీజీహెచ్కి వచ్చి ఎక్స్–రే రూమ్, ఎమ్మారై రూమ్ల ముందు క్యూ కట్టిన పేద రోగుల కష్టాలను కళ్లారా చూడాలని విష్ణు హితవు పలికారు. -
రామలింగేశ్వరుని సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజే
వీరులపాడు: మండలంలోని పొన్నవరం గ్రామంలో వేంచేసియున్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాల అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణాన్ని జరిపించారు. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ముందుగా వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎన్వీ రమణ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతోనే తాను ఇంతటి స్థాయికి చేరుకున్నానని తెలిపారు. -
కూటమి ప్రభుత్వంలో వాతలే కాదు.. కోతలూ బోనస్
● అరగంట ఆన్.. పావు గంట ఆఫ్.. ● సర్కారు వారి అప్రకటిత విద్యుత్ కోతలు ● చినుకు పడితే కట్.. చెట్టు ఊగితే కట్ ● ఉక్కపోతతో అవస్థలు పడుతున్న ప్రజలు డీటీఆర్లపైన ఉండే హెచ్జీ ఫ్యూజ్ వైర్ గుండా ఉడతలు, బల్లులు వెళ్లటం వల్ల ఫీడర్లు ట్రిప్ అయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో నందిగామ పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయ సమీపంలో డీటీఆర్ కేబుల్ వైర్కు ట్రాక్టర్ తగలడం వల్ల ఫీడర్ ట్రిప్ అయి కొంత సమయం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమస్య తలెత్తిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. – నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఏఈ, నందిగామ టౌన్ నందిగామ రూరల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పరిస్థితి అర గంట ఆన్.. పావు గంట ఆఫ్.. అన్న చందంగా మారింది. విద్యుత్ శాఖాధికారులు విధిస్తున్న అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి ఎండ వేడిమి తగ్గినప్పటికీ భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. దీనికి తోడు గంటల తరబడి విద్యుత్ కోతలను దశల వారీగా అమలు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో గంటకు 10 నుంచి 20 నిముషాల చొప్పున దశల వారీగా రోజు మొత్తం మీద ఐదారు గంటలకు పైగా అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని మండిపడుతున్నారు. నందిగామ, అనాసాగరం, చందాపురం గ్రామాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ల ద్వారా పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సబ్ స్టేషన్ల పరిధిలో చిన్నపాటి వర్షం పడినా.. చిరు గాలులకు చెట్లు కదిలినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ప్రజలు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే నందిగామలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని విద్యుత్ శాఖాధికారులు అనధికారిక కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఈఎల్ఆర్(ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వాపోతున్నారు. మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా అప్రకటిత కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. దీంతో లైన్ ట్రిప్ అయినా.. లేక ఏదైనా సమస్య వచ్చినా దానిని పునరుద్ధరించడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ఇక కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో సైతం కోతలు అధికంగానే ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిన సమయంలో సమాచారం తెలుసుకునేందుకు ఫోన్ చేసినా కనీసం స్పందించటం లేదని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు లైన్మెన్లు మరొకడుగు ముందుకేసి ఈఎల్ఆర్(ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్ సరఫరాకు సమయం పడుతుందని వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు తప్ప విద్యుత్ సరఫరా సమాచారం మాత్రం చెప్పటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. విద్యుత్ శాఖాధికారులు స్పందించి అనధికారిక విద్యుత్ కోతలు విధించకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 4130 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గన్నవరం: విమానాశ్రయంలో యోగా గురువు బాబా రాందేవ్కు శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయవాడలో 21న జరగనున్న యోగా దినోత్సవంలో ఆయన పాల్గోనున్నారు. -
రెండోసారి నీట్గాఏర్పాట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ఈ నెల 21న జరగనుంది. గత నెల మూడో తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను తాజాగా ఈ ఆదివారం దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 12 వేల మంది అభ్యర్థులకు 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా.. ప్రత్యేక కారణాల రీత్యా మరో 15 నిమిషాలు అధికంగా సమయాన్ని ఇవ్వనున్నారు. పరీక్ష సాయంత్రం 5.15 నిమిషాల వరకూ కొనసాగనుంది. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే అభ్యర్థులను ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. వస్త్రధారణపై ఆంక్షలు.. నీట్కు హాజరయ్యే అభ్యర్థులు వస్త్రధారణపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ గత అనుభవాల రీత్యా పలు ఆంక్షలు విధించింది. అభ్యర్థులు చెవులకు దిద్దులు, చేతులకు గాజులు, ముక్కుపుడకతో సహా ఆభరణాలు, వాచీలు, జీన్స్ ప్యాంట్లు, టోపీలు, సన్గ్లాసెస్ ధరించకూడదు. సెల్ఫోన్లు, స్మార్ట్బాండ్లు వంటి ఇతర ఎటువంటి వస్తువులను అనుమతించరు. ట్రాఫిక్ అలర్ట్.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న దృష్ట్యా నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు ట్రాఫిక్ ఇబ్బందులను గమనంలో ఉంచుకొని ముందుగానే బయలుదేరి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): నీట్ పరీక్ష నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు బందరులో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారన్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా పర్యవేక్షణ కోసం ఈ నెల 20, 21వ తేదీల్లో కలెక్టరేట్లో జిల్లా స్థాయి కంట్రోల్రూమ్(08672–252399)ను ఏర్పాటు చేశామన్నారు. 20వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 21వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. రేపటి పరీక్షకు ఎన్టీఆర్ జిల్లాలో 31 కేంద్రాలు -
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
మరోసారి చంద్రబాబు సర్కార్ దగా
సాక్షి, విజయవాడ: మరోసారి కూటమి సర్కార్ దగా చేసింది. ఆక్వా మేత ధర కిలోకి రూ.4 తగ్గిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన అమలు కాలేదు. కిలోకి రూ.2 మాత్రమే ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. చంద్రబాబు ఆదేశాలు అమలు కాకపోవడంతో తమను మళ్లీ మోసం చేశారంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొయ్యలు, చేపల సాగుకు వినియోగించే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయే తప్ప ఆక్వా ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు వాపోయారు. ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు ఫీడ్ ధర పెంచుతున్న కంపెనీలు.. వాటి ధరలు తగ్గినప్పుడు మాత్రం కూడా తగ్గించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది అదీ ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు.రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మూడో ఏడాది కూడా రైతులను వంచించేందుకు యత్నిస్తున్నారు. 2026–27 వ్యవసాయ సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారీ మొండి చేయే చూపించారు. -
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శ తర్వాతే ఈ కేసులో.. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాల్లో కదలికలు రావడం గమనార్హం. గురువారం రాత్రి 11గం. సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ను విచారణ అధికారిగా నియమించినట్లు విజయలక్ష్మితో సీపీ రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లడంతోనే ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వం.. ఆగమేఘాల మీద పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు.. సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్ తప్పదని.. ఆ తర్వాత ఈ కేసులో మరికొంత మంది ఖాకీలపైనా చర్యలు ఉంటాయంటూ లీకులు వస్తున్నాయి. ఈ కేసులో సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ ఇవాళ విజయవాడ రానున్నారు. డీజీపీ హరీష్కుమార్ గుప్తా, విజయవాడ సీపీ రాజశేఖర బాబులను కలిశాకే.. కృష్ణలంక స్టేషన్కు వెళ్తారని సమాచారం. ఇదీ చదవండి: సీఐ నాగరాజు.. మాములోడు కాదు! -
కింకర్తవ్యం?
సాక్షి టాస్క్ఫోర్స్: విజయవాడ కృష్ణలంక యువకుడి లాకప్డెత్ ఘటన నుంచి బయట పడేందుకు చంద్ర బాబు కూటమి సర్కారు వేయని ఎత్తుగడ లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బాధితులను భయాందోళనలకు గురి చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ, ఆ ఘటనను తెరమరుగు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. లాకప్డెత్ జరిగిందని, ఓ వైపు పోలీసు వర్గాలే బాహాటంగా చర్చించుకొంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల్లో సైతం ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో కలకలం రేపింది. మన ప్రభుత్వంలో మన కాపులకే అన్యాయం జరుగుతోందని వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రశ్నించాల్సిన జనసేన రాజీ చేస్తుండటం దిగ్భ్రాంతి పరుస్తోందని వాపోతున్నారు. ఇందుకు విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతను రాయబారానికి పంపడమే సాక్ష్యమని ఎత్తి చూపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై భాదితులను సంతృప్తి పరిచేందుకు పోలీసు పెద్దలు ఇంకో అడుగు ముందుకు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇంకా అవసరం అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా సాయం చేస్తారని భరోసా ఇస్తునట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి చనిసోయిన కుర్రాడికి రౌడీషీటర్ ముద్ర వేసి, అతనిని ఎన్కౌంటర్ చేసుంటే సరిపోయేదని, అదే జరిగి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ఓ పోలీసు పెద్ద వ్యాఖ్యనించినట్లు చర్చ జరుగుతోంది. తమదాకా రాకుండా... తమదాకా రాకుండా పోలీసు స్థాయిలోనే కేసు క్లోజ్ కావాలని ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ విషయానికి సంబంధించి ఏదైనా ఉంటే, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి నిర్ణయం తీసుకొండని మరోమారు సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. తూతూ మంత్రంగా కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేసి, సమస్య తీవ్ర పెరగకుండా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, రాష్ట్రంలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిక్కుతోచక కర్తవ్యం ఏంటని, డిఫెన్స్లో పడింది. సాయికృష్ణ బతికి ఉంటే, సీఐను సస్పెండ్ చేయరని, రాజీయత్నాలకు ప్రయత్నించారనే భావన వ్యక్తం అవు తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఘటన నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక విలవిల్లాడుతోంది. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంపడం, కనీసం శవాన్ని కూడా ఇవ్వకుండా కాల్చివే యటం ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న చర్చ. చంద్రబాబు, చినబాబు రెడ్బుక్ రాజ్యంగం నడుస్తోందని, దీంతో పోలీసులు రెచ్చి పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహారించి నెలరోజులుగా హైడ్రామా నడిపి, సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి చంపండం, కనీసం శవం ఇవ్వకుండా ప్రవర్తించడం వెనుక, రెడ్బుక్ అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పౌరుల ప్రాణాలకు రక్షణ లేదా, అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిలదీస్తున్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే వరకు పోలీసుల్లో చలనం లేదని, ఈ విషయం అంతా సీఎం, డిప్యూటీ సీఎం, చినబాబుకు తెలియకుండా జరుగుతుందా ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు అండగా ప్రభుత్వం నిలవడంపై కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. లాకప్ డెత్ ఉదంతం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకనుందని, విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలు
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మండలం పరిధి లోని గుంటుపల్లి డాన్బోస్కో స్కూల్లో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. యోగాంధ్రలో భాగంగా జరిగిన యోగా పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 800 మంది యోగా సాధకులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి డాక్టర్ సుజాత, పోటీల రాష్ట్ర నోడల్ అధికారి ఝాన్సీలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ పోటీలు యోగాంధ్ర– ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్తో జరుగుతున్నాయన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీల్లో జూనియర్, యంగ్, సీనియర్ గ్రూప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై.రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీ.. పొక్లయినర్ డ్రైవర్ మృతి
ఉయ్యూరు: మండలంలోని కాటూరు గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొక్లయినర్ డ్రైవర్ మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని ముదునూరు గ్రామానికి చెందిన పొక్లయినర్ డ్రైవరు దోమతోటి అర్జునరావు(33) సొంత పనుల నిమిత్తం ఉయ్యూరు వచ్చాడు. బైక్పై ఇంటికి వెళ్లే క్రమంలో కాటూరు పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఉయ్యూరుకు చెందిన డాక్టర్ కడియాల విశ్వేశ్వరరావు కాటూరు నుంచి కారులో ఉయ్యూరు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ వేగంగా ఢీకొనటంతో అర్జునరావు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అర్జునరావు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్బాబు తెలిపారు. కాగా డాక్టర్ విశ్వేశ్వరరావు కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. మృతుడు అర్జునరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు దాసే రవి ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. పేద కుటుంబం కావటంతో అర్జునరావు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు విజయవాడకు చెందిన భక్తులు రూ.2 లక్షల విరాళం సమర్పించారు. విజయ వాడ భారతీనగర్కు చెందిన హెచ్.భాగ్యలక్ష్మి గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, సూపరిండెంటెంట్ నాగేశ్వరరావు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జపాన్లో ఇటీవల జరిగిన మహిళల అండర్–18 హాకీ ఆసియా కప్ పోటీల్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి నమ్మి గీతశ్రీని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ.రవినాయుడు సత్కరించారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయంలో రవినాయుడును గీతశ్రీ గురువారం కలిసి తాను ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి తెలిపింది. భవిష్యత్తులో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి పతకాలు అందించాలని గీతశ్రీకి రవినాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాప్యం లేకుండా 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించాలని ఏపీ జేఏసీ, అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ బత్తిన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హక్కుల సాధన కోసం ఉద్యమా నికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి అవగాహన కల్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఐఆర్ విడుదల చేయాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరారు. తిమ్మసర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి.వెంకటేశ్వరరావు, ప్రసాద్, సోము శేఖర్, బంక్ శ్రీను, బాషా, సుబ్బారావు, గోపి, దీపక్ కుమార్, సులోమాన్ రాజు, శ్యాం తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారుల సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. స్థానిక గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ లేకుండా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. రెవెన్యూ వసూలుపై దృష్టి పెట్టాలని సూచించారు. పీఎం సూర్యఘర్, పీఎం–కుసుమ, ఎల్టీ నెట్వర్క్ అభివృద్ధి అంశాలపై వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆపరేషన్స్ విభాగం అధికారులు, ఏపీసీపీడీసీఎల్ (టెక్నికల్) డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి,ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణలంక యువకుడు సాయికృష్ణ ఘటనపై అత్యున్నత విచారణ సంస్థలతో నిష్పాక్షికంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయా లని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవన్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయి కృష్ణ ఘటనలో 40 రోజులు గడుస్తున్నా నేటికి అధికారులు, ప్రభుత్వం నోరు విప్పకపోవడం సమంజసం కాదన్నారు. నగరంలో ఈస్థాయి ఘటనలు జరుగుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు కనీసం స్పందించదని విమర్శించారు. బాధిత కుటుంబానికి ముఖ్యంగా యువకుడు తల్లి, ఒంటరి మహిళకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు భూపతి రమణారావు, పుప్పాల కృష్ణ, బోయ సత్యబాబు పాల్గొన్నారు. -
శుభ ఘడియలు షురూ
● చాలా రోజుల విరామం తరువాత ప్రారంభమైన ముహూర్తాలు ● రానున్న నాలుగు మాసాల్లో వేలాది వివాహాలు ● జోరుగా క్యాటరింగ్, కల్యాణ మండపాల బుకింగ్ ● తర్వాత పుష్కరాలు ఉండటంతో త్వరపడుతున్న వైనం వన్టౌన్(విజయవాడపశ్చిమ): చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వివాహ ముహూర్తాలు ప్రారంభం కావటంతో ఆయా కుటుంబాలు పెళ్లి పనులను ప్రారంభించాయి. అధిక జ్యేష్ట మాసం ముగిసి రెండు రోజుల క్రితమే నిజజ్యేష్ట మాసం ప్రారంభమైంది. దాంతో అన్ని ప్రాంతాల్లో శుభకార్యాలకు సంబంధించి హడావుడి ప్రారంభమైంది. ఆయా ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంది. శుభకార్యాలపై ఆధారపడిన వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. నెలవిడిచి నెల శుభముహూర్తాలు.. అధిక జ్యేష్టమాసంలో ముహూర్తాలు ఉండవు. నిజ జ్యేష్టమాసం ప్రారంభం కావటంతో ఈ నెల 16 నుంచి నెల రోజుల పాటు ముహూర్తాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల పాటు వివాహాలకు, గృహప్రవేశాలకు ఇతర శుభకార్యక్రమాలకు అనువుగా ఉన్నట్లు పండితులు వివరిస్తున్నారు. అలాగే నెల తరువాత మళ్లీ శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా శ్రావణమాసం అన్ని కార్యక్రమాలకు మంచి మాసంగా, ఏ శుభకార్యక్రమమైనా ఆ మాసంలో చేసుకోవటానికి అనువైన ముహూర్తాలు ఉంటాయని వారు వివరిస్తున్నారు. ఆ తరువాత మళ్లీ ఆశ్వీయజ మాసంలో మంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయని ఆ మాసంలోనూ వివాహ ముహూర్తాలకు అవకాశమున్నట్లు వారు చెబుతున్నారు. ఆషాఢం, భాద్రపదాలు శూన్యమాసాలు.. నిజ జ్యేష్టమాసం ముగిసిన తరువాత వచ్చే ఆషాఢంలో ముహూర్తాలు ఉండవు. జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ దాదాపుగా ఆ నెల రోజులు శుభకార్యక్రమాలకు బ్రేక్ పడుతుంది. ఆ తరువాత మళ్లీ భాద్రపద మాసంలోనూ శుభకార్యక్రమాలకు అవకాశముండదని పండితులు చెబుతున్నారు. అంటే సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ ఈ మాసం ఉంటుంది. ఆ మాసంలో ఎటువంటి ముహూర్తాలు ఉండవని వారు వివరిస్తున్నారు. వివాహాల జోరు.. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగు మాసాల్లో వేలాది వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదారు వేల కల్యాణమండపాలు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాల్స్కు డిమాండ్ పెరిగింది. ఇంటి వద్ద వివాహాలు జరుపుకోవటానికి అవకాశమున్నప్పటికీ అధిక శాతం కుటుంబాలు కల్యాణమండపాలు, ఇతర వేదికల వద్దనే వివాహాలు జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితులు కావచ్చు, సోషల్ స్టేటస్ తదితర కారణాల రీత్య బయటే వివాహాలు జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఫుల్ డిమాండ్.. వివాహాల సీజన్పై చాలా విభాగాలు దానిపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా కల్యాణ మండపాలు పక్కన పెడితే ముఖ్యమైనది భోజనాలు దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో వేలాది మంది క్యాటరింగ్ నిర్వాహకులు ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో వివాహాలు సీజన్ ముఖ్యమైనది కావటంతో వారికి గిరాకీ పెరిగింది. వారితో పాటుగా వివాహాలు జరిపించే పండితులు, మండపాలను ఆకర్షణీయంగా అలంకరించే డెకరేటింగ్, బాజాభజంత్రీలు, ఆర్కెస్ట్రా కళాకారులు ఇలా అనేక మంది ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈవెంట్ మేనేజర్లు సైతం ఈ సీజన్ను ఉపయోగించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో రెండు ముఖ్యనదుల పుష్కరాలు జరగనున్నాయి. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. అలాగే కృష్ణానదికి సైతం 2028 ఆగస్టు మాసంలో ప్రారంభమవుతాయి. పుష్కరాలు జరిగే సంవత్సరాల్లో వివాహాలు చేయకూడదనే ఆచారాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలను చాలా కుటుంబాలు పాటిస్తాయి. కనుక వచ్చే రెండేళ్లలో రానున్న పుష్కరాల దృష్ట్యా చాలా కుటుంబాలు తమ ఇళ్లలో వివాహాలు ఈ ఏడాదిలో వచ్చే ముహూర్తాల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నాయి. నిజజ్యేష్టం, శ్రావణం, ఆశ్వీయజ మాసాల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అధిక జ్యేష్టం, ఆషాఢం, భాద్రపదాలు శూన్యమాసాలు కావటంతో ముహూర్తాలు ఉండవు. కాబట్టి ముహూర్తాలు ఉన్న మాసాల్లో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరగటానికి అవకాశముంది. ఇప్పటికే చాలా మంది వివాహ ముహూర్తాలు నిర్ణయించుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా మాసాల్లో వారివారి జన్మనక్షత్రాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ముహూర్తాలు నిర్ణయం అవుతాయి. – పొన్నంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పురోహితుడు -
25 సూచికల్లో 100 శాతం ప్రగతి
ఇబ్రహీంపట్నం: ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నా మని కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్బాబు పేర్కొన్నారు. 38 సూచికలకు ఇప్పటికే 25 సూచికల్లో 100 శాతం పురోగతి సాధించామని తెలిపారు. మిగిలిన 13 సూచికల్లోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేస్తామన్నారు. నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్, కేంద్ర ప్రభారీ అధికారి అశోక్బాబు గురువారం ఇబ్రహీం పట్నం మండలంలో అధికారులతో కలిసి పర్యటించారు. కొటికలపూడిలోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల తీరును పరిశీలించారు. మూలపాడు లోని ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన మునగ, నిమ్మ ప్లాంటేషన్ ప్రాంతాలు, బటర్ ఫ్లై పార్కును సందర్శించారు. కొండపల్లిలో ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలతో పాటు గుంటుపల్లిలో వ్యవసాయ క్షేత్రాలు, రైజ్ కేంద్రాన్ని సందర్శించి, మహిళలు స్వయం ఉపాధి దిశగా అమలు చేస్తున్న వినూత్న శిక్షణ కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 500లకు పైగా ఆకాంక్షిత బ్లాకులను కేంద్ర ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 15 బ్లాకులు ఉండగా, ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలు ఉన్నా యన్నారు. మిగిలిన మండలాలతో సమానంగా ప్రగతి సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా, గృహ నిర్మాణం వంటి వాటికి సంబంధించిన సూచికల్లోనూ సంతృప్తికర స్థితికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సారథ్యంలో బ్లాకు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి అన్ని సూచికల్లో ప్రగతి దిశగా తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు డి.శకుంతల, రామకృష్ణ నాయక్, డెప్యూటీ ఎంపీడీఓలు వి.మనోజ్, బి.ప్రసాద్, బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈఓ పుష్పలత, సీడీపీఓ పుష్పలత, డీఆర్డీఏ పీడీ నాచారరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 20267లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ వైద్య కళాశాల స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం జీజీహెచ్, వైద్య కళాశాల ప్రాంగణాల్లో డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు పాల్గొన్నారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ శాక్స్ ఎండీ బాచు స్మరణ్రాజ్ గురువారం పాత ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాలను పరిశీలించారు. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక ఈవీఎం గోదామును కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం తనిఖీ చేశారు. ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.సాయికృష్ణ కేసులో మంత్రి లోకేష్ ఏ–1 ముద్దాయి -
పాపం.. పసివాళ్లు
ప్రక్షాళనతోనే గాడిలోకి.. మచిలీపట్నంటౌన్: వారంతా పదేళ్లలోపు చిన్నారులు.. నా అన్నవారు లేని అభాగ్యులు.. ప్రభుత్వ శిశుగృహంలో వసతి పొందుతున్న ఆ పసివారి ఆలనా పాలన చూడాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ మధ్య విభేదాల నేపథ్యంలో చిన్నారుల ఆకలిదప్పులను విస్మరిస్తున్నారు. మచిలీపట్నం నగరంలోని ప్రభుత్వ శిశుగృహ నిర్వహణపై ఆరోపణలు వినవస్తున్నాయి. సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయని, ఫలితంగా శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న నాలుగు నుంచి పదేళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది చిన్నారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలు, వంట సామగ్రి ఉన్నా చిన్నారులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నారులకు పాలకు బదులు గంజి ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. శిశుగృహలో ఆరుగురు ఆయాలు, సామాజిక కార్యకర్త పనిచేస్తున్నారు. వారి మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు విధి నిర్వహణలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా రని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సెలవులు పెడుతూ చిన్నారులను సాకడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పలువురు సిబ్బంది ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారు కావడంతో వారి వ్యవహార శైలి ఇలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. పరికరాల వినియోగంలోనూ అలసత్వం శిశుగృహలోని పలు గృహోపకరణలను వినియోగించడంలో ఇక్కడ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాషింగ్ మిషన్లలో నిర్లక్ష్యంగా డైపర్లను పడేస్తున్నారు. ఫలితంగా ఇటీవల కాలంలో మూడు వాషింగ్ మిషన్లు మూలకు చేరాయి. మిక్సీలు సైతం మరమ్మతులకు గురయ్యాయి. మరో వైపు శిశుగృహానికి దాతలు ఇస్తున్న వస్తువులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నారుల దాతలు ఇస్తున్న ఆహార పదార్థాలతో పాటు వెండి, బంగారు వస్తువులను సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారనే పలు వురు విమర్శిస్తున్నారు. నిబంధన ప్రకారం దాతలు నుంచి వితరణలు తీసుకోకూడదు. దీనికి భిన్నంగా ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్నారని, కొంత మంది సిబ్బంది ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. శిశుగృహం సిబ్బంది వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది మధ్య విభేదాలు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. కొంత మంది ముందస్తు సమా చారం లేకుండానే సెలవు పెట్టేస్తున్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. చిన్నారులకు దాతలు వెండి, బంగారు వస్తువులు ఇవ్వలేదు. వస్తువులు పక్కదారి పట్టలేదు. చిన్నారులకు గంజి ఇవ్వడం అవాస్తవం. మెనూ ప్రకారమే వారికి ఆహారం అందిస్తున్నాం. కొంత మంది కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారు. – ఎం.నూర్జహాన్ రాణి, ఐసీడీఎస్ కృష్ణాజిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ స్థానిక శిశుగృహలో సిబ్బంది వ్యవహారంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు ఇబ్బందులు తొలగాలంటే కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ దృష్టిసారించి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక్కడి సిబ్బందిని ఇంకా కొనసాగిస్తే ఇలానే ఎప్పుడు విభేదాలతో వ్యవహరిస్తూ చిన్నారుల ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తక్షణమే శిశుగృహ వ్యవహారంపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు.అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందని.. సీపీ, ఏసీసీ, సీఐ కూడా ఇందులో ఉన్నారని.. డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందన్నారు. ‘‘మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను అడిగింది. కొడుకును చూపించమని పోలీస్స్టేషన్కు వెళ్లని రోజు లేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పారు. ..బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేశారు. సాయికృష్ణ తల్లితో బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసింది. బాధితులకు మేం సపోర్ట్గా నిలబడ్డాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారు. చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్ చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. చంద్రబాబు మాత్రం అతన్ని కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. సాయికృష్ణ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపేశారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘కంటితుడుపుగా సీఐ నాగారాజును మాత్రమే సస్పెండ్ చేశారు. ఈ క్రైమ్లో సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కాదు. నేరంలో సీపీ, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉంది. వీళ్లందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
సాయికృష్ణ కేసులో వాటిని భద్రపరచాలని కోర్టు ఆదేశం
విజయవాడ రెండో ఏజేఎం కోర్టు గాదె సాయికృష్ణ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించింది. సీసీ ఫుటేజ్తో పాటు కాల్డేటాను కూడా భద్రపరచాలని కోర్టు చెప్పింది. కాగా, గాదె సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. గాదె సాయి కృష్ణ నెల రోజుల క్రితం కనపడకుండాపోయారు. ఆయన ఆచూకీ గల్లంతయిన కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. ఆ సమయంలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 29లోగా బాధితుడిని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని చెప్పింది. కాగా, విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని.. మార్కాపురం జిల్లాకు చెందిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. -
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై ప్రముఖ న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏదైనా కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన నిబంధన ఉందని అన్నారు. అయితే గాదె సాయికృష్ణ వ్యవహారంలో ఆ నిబంధనలు పాటించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. సాయికృష్ణ కేసులో కూటమి ప్రభుత్వ పనితీరు.. ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ. భారతదేశ చరిత్రలో ఇంత హీనమైన, హేయమైన ఘటన ఎప్పుడూ లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూటకట్టి అటకపై పడేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారమైనా తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే కొందరు పోలీసులు చేసేదే లాకప్ డెత్. చట్టాలు అప్ గ్రేడ్ అయినట్లు పోలీసులు కూడా అప్ గ్రేడ్ అయినట్లున్నారుఏపీ హోంమంత్రికి ఓ కత్తెర మంత్రి. ఇన్ విజిబుల్ పోలీసింగ్ అని ఏదో ఒక్క అర్ధం చెబుతున్నారామె. నా పాతికేళ్ల న్యాయవృత్తిలో ఇలాంటి పదాలు నేనెప్పుడూ వినలేదు. లాకప్ డెత్ లు జరిగినపుడు పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారుసాయికృష్ణను చంపేసి బూడిద చేశారని అతని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకుని చూపించమని పోలీసులను సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకూ నేను అండగా ఉంటా. న్యాయపరంగా అవసరమైతే సాయం అందిస్తా. సాయికృష్ణకు జరిగిన అన్యాయం పై కులమతాలకు అతీతంగా అండగా నిలవాలిహోంమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. మే 9 నుంచి ఈరోజు వరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని బయటపెట్టాలి. స్టేషన్ మొత్తం సిసి కెమెరాలు ఉంటే.. సీఐ రూమ్లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు. ఏపీలో ప్రతీ స్టేషన్లో ఇంటరాగేషన్ కోసం వ్యక్తిగత రూమ్ లు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణలంక సీఐ వ్యక్తిగత రూమ్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయిసాయికృష్ణ మృతి కేసులో ఏ1 ముద్దాయి మంత్రి లోకేష్. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే ఏపీలో లా అండ్ ఆర్డర్ పాతరేశారు. ఏ2 ముద్దాయి సీఎం చంద్రబాబు. చంద్రబాబు కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడు. లోకేష్ దుర్యోధనుడి మాదిరి రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు. ఈ కేసులో ఏ3 ముద్దాయి పవన్ కళ్యాణ్. పవన్ తనకు దేవుడిచ్చిన అన్న అని లోకేష్ అంటున్నాడు. పదేళ్లక్రితం ఇదే దేవుడిచ్చిన అన్నను పచ్చి బూతులు తిట్టించింది లోకేష్ కాదా?. కౌరవులకు ఉన్న ఏకైక సోదరి హోంమంత్రి అనిత*తెనాలిలో ఎన్డీపీఎస్ కేసులో ముగ్గురు యువకులను నడిరోడ్డు పై పోలీసులు చితకబాదారు. తెనాలి ఘటన చూశాక న్యాయవాదులు, న్యాయ మూర్తులు నీళ్లులేని బావిలో దూకి చావాలి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయవ్యవస్థ.. పోలీసులు కాదు. కాపీ కొట్టి పాసై టీచర్ అయిన హోంమంత్రి ఈ విషయం తెలుసుకోవాలి. సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పడానికి కాదు నీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. హెరిటేజ్ మీద ఎవరైనా మాట్లాడగానే సీఎఫ్ఓ మాదిరి హోంమంత్రి తెరపైకి వస్తారు. ఎందుకు సాయికృష్ణ అంశం పై హోంమంత్రి మాట్లాడలేదు. ఎందుకు హోంమంత్రి సీఐపై మాట్లాడలేదు. జడ్జీలను సైతం కొనేద్దామని భావన ఈ పోలీసులు, మంత్రులది.సాయికృష్ణ చనిపోయిన రోజునే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి తెలుసు. సీఎం, హోంమంత్రి మనల్ని కాపాడతాడని సీఐకి సీపీ భరోసా ఇచ్చారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని తక్షణమే సస్పెండ్ చేయాలి. సీపీతో పాటు ఆరోజే హోంమంతికి కూడా ఈ విషయం తెలుసు. వారం రోజుల తర్వాత సీఎం,డిప్యూటీ సీఎంకు కూడా తెలుసు.. హోంమంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. రాజశేఖర్ బాబు ఇక్కడ ఉండగా విచారణ సజావుగా సాగదు. కాబట్టి సీపీగా రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలి. క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు. పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇలా లాకప్ డెత్ లు చేయడమేనా పోలీస్ వ్యవస్థ అద్భుత పనితీరు?. రెండు కేసులున్న వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే.. 40 కేసులున్న చంద్రబాబును ఏ స్టేషన్కు పంపిస్తారు?. వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపణలున్న లోకేష్ ను ఏ స్టేషన్ కు పంపిస్తారు?. హోంమంత్రి మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా నీ శాఖ పై పెడితే బాగుంటుందిఈ రెండేళ్లలో ఆడపిల్లల పై ఏపీలో జరిగిన నేరాల సంఖ్య 44,586. శిక్షలు పడింది కేవలం 541 కేసుల్లో మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం నాలుగు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన డేటా 10 క్లాస్ ఫెయిల్ అయిన మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా?. హోం శాఖ నిర్వహిస్తున్న హోంమంత్రికి.. డీజీపీకి సిగ్గుండాలిసీఎం సొంత జిల్లాలో కేవలం 10 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. డిప్యూటీ సీఎం జిల్లాలో శిక్షపడింది 14 కేసుల్లో మాత్రమే. రాష్ట్రంలో 46 వేల మంది ఆడిపిల్లలకు అన్యాయం జరిగితే ఏనాడైనా వారి ఇంటికి వెళ్లారా డిప్యూటీ సీఎం?. ఉపముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏంపీకారు?. పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనాగతంతో పోల్చుకుంటే 24 శాతం ఆడపిల్లల పై నేరాలు పెరిగాయి. పోలీస్ డిపార్ట్ మెంట్కు క్రెడిట్ ఇవ్వాలని అడగడానికి సిగ్గుందా?. సాయికృష్ణ మృతదేహాన్ని కాని..అతని బూడిదను కానీ ఇచ్చి అప్పుడు క్రెడిట్ తీసుకోండి. సాయికృష్ణ తల్లి కన్నీళ్లకు సమాధానం చెప్పి క్రెడిట్ తీసుకోండి. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ బ్రతికేహక్కుంది. మోకీళ్లు తీసేస్తా ... అరచేతిలో రేఖలు చెరిపేస్తానని డిప్యూటీసీఎం చెబుతుంటే పోలీసులకు ఏం ఇండికేషన్ ఇచ్చినట్లు?. సిగ్గులేకుండా సోషల్ మీడియాలో సాయికృష్ణ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. సాయికృష్ణ తల్లి కడుపుకోతతో బాధపడుతోంది. ఆ తల్లికి దళితసోదరులంతా అండగా నిలవాలి. కాపుల ఓట్లు వేయించుకుని పవన్ కాపులను గాలికి వదిలేశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు అని జడ శ్రవణ్ మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? అనే అంశం ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పోలీసు శాఖ నుండి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది. -
రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ 'జనసేన' బెదిరింపు
నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..! సీఐ నాగరాజు నా కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడు. ఫొటో చేయించి దండేసుకో అన్నాడు. చివరకు కనిపించకుండా చేశాడు. నా కుమారుడిని కొట్టి పోలీస్స్టేషన్ బాత్రూమ్లో పడేశారు. స్టేషన్లో చంపేసి, ఇద్దరు పోలీసులు బైక్పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు’ అంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది.లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..!’ అంటూ విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశించారు. తమ బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే..రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ జనసేన తూర్పు ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు బెదిరిస్తున్నారని కంటతడి పెట్టారు. ‘మేం జనసేనకు చెందిన వాళ్లమే.. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ ఈ విషయంలో స్పందించాలి..’ అని సాయికృష్ణ చిన మేనమామ ముళ్లపూడి నవరంగ్ కోరారు. బుధవారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులైతే... చంపి తగలబెడతారా? సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడని, ఫొటో చేయించి దండేసుకో అన్నాడని, చివరకు కనిపించకుండా చేశాడంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా బిడ్డకోసం పోలీస్ స్టేషన్కు వెళ్లా.. అక్కడ కుర్రాళ్లను కొడుతుంటే తట్టుకోలేకపోయా. నా కుమారుడిని చూపించమంటే చూపించలేదు. నా కుమారుడిని కొట్టి బాత్రూమ్లో పడేశారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్లో చంపేసి.. ఇద్దరు పోలీసులు బైక్పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి ఎవడు ఇచ్చాడు అధికారం చంపేయమని? పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా? నాకు మద్దతుగా నిలిచిన వారిపై నిందలు వేస్తున్నారు. నా కుమారుడికి రాజకీయాలు అంటగట్టొద్దు. న్యాయం చేయమని కోరుతున్నాం’ అని విజయలక్ష్మి విలపించారు.మాఫియా, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? పోలీసులు అన్ని కేసులు ఉన్నాయి.. ఇన్ని కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరి అలాంటి వాడిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఫోటోల్లో గొడ్డలి పెట్టి ట్రోల్ చేస్తున్నారు. కోర్టు వాయిదాకి వచ్చి కనిపిస్తే కొడతారని భయపడి మార్కాపురం వెళ్లి జొమాటోలో పనిచేస్తూ రోజుకు రూ.350 ఆదాయంతో బతికాడు. అంత పెద్ద మాఫియా డాన్, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? గంజాయి ఫాల్స్ కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవీ నిరూపణ కాలేదు. మా పిల్లోడిని మాకు అప్పగించాలి. చనిపోతే బాడీ అయినా ఇవ్వండి. పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్దకి వచ్చి కేసులు ఉన్నాయని నిరూపించాలి. – ముళ్లపూడి నాగేశ్వరరావు, సాయికృష్ణ మేనమామరెండు కేసులే ఉన్నాయి: కనకదుర్గ, అడ్వొకేట్ సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో వాయిదాలకు హాజరు కాలేదని తీసుకొచ్చి కొట్టారు. బందర్ రోడ్డులో కూర్చుంటా. పోలీసులు వచ్చి ఎన్ని కేసులు ఉన్నాయో నిరూపించాలి. సాయికృష్ణకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ప్రశ్నిస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అనేక కేసుల్లో ఆందోళనలు చేశారు. మా అబ్బాయి విషయంలో ఏం చేస్తారు? మేమంతా జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్, లోకేశ్ కోసం పని చేశాం. పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలి. సాయికృష్ణను స్టేషన్కు తీసుకొచ్చి చంపేస్తే డీజీపీ అడగరా..? కేసు సెటిల్ చేసుకుందామని, రూ.50 లక్షలు ఇప్పిస్తామని జనసేన నేత అమ్మిశెట్టి వాసు బెదిరించినా మేం ఒప్పుకోలేదు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ఈ కేసుతో సంబంధం ఉన్న సీఐతో పాటు అశోక్, బాబూరావు, సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, మరికొంతమంది స్టేషన్లో ఉన్న వాళ్లను సస్పెండ్ చేయాలి. కేసులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి కొట్టి చంపేస్తారా? మావాడు రౌడీ అంటున్నారు. మీరు చేసిందేమిటి? మీరు హంతకులు కాదా? సామాన్యులకు న్యాయం జరగదా? అన్యాయం జరిగిందని మాకు అండగా నిలుస్తున్న వారికి పారీ్టలను అంటగడతారా? మాకు పారీ్టలు లేవు.. కులం లేదు. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకు న్యాయం చేయండి. విజయవాడలో వందల మంది రౌడీ షీటర్లు ఉన్నారు. కానీ మావాడినే తీసుకొచ్చి చంపేశారు. మేం రాజకీయాలు చేసే వాళ్లం కాదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, లోకేష్, హోం మంత్రి అనిత స్పందించాలి. మేం పనిచేసిన పార్టీ వాళ్లు మా కోసం ఏమీ చేయలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నారు. – ముళ్లపూడి నవరంగ్, సాయికృష్ణ మేనమామ -
యోగా సాధనతో శారీరక, మానసిక ఆరోగ్యం
కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా నిర్వహిస్తున్న యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్రలో భాగంగా బుధవారం విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్డులో నిత్యయోగా కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన అత్యంత అవసరమని అన్నారు. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానం అన్నారు. నిత్య యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుందన్నారు. విద్యార్థులకు యోగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుందని, ఉద్యోగులకు పనితీరు మెరుగుపడేందుకు దోహదపడుతుందన్నారు. ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పి.వాణి, సహాయ పౌరసరఫరాల అధికారి వి.శ్రీనివాసులు నాయుడు, ఆయుష్ అధికారి డాక్టర్ వై.రత్నప్రియదర్శిని, డీఎస్డీవో కోటేశ్వరరావు, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ తవ్వకాల అడ్డగింత
దాములూరు(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవులో కృష్ణానది గర్భం నుంచి తవ్వి అక్రమంగా ఇసుక తరలింపుపై ఆ మధ్య కాలంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు అడ్డుకట్ట వేశారు. నెలరోజులు తిరగకుండానే మళ్లీ అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. కొత్తగా దాములూరు ఇసుక క్వారీ నుంచి యంత్రాలతో తవ్వి లారీలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాను మాజీ మంత్రి జోగి రమేష్ బుధవారం సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి అడ్డుకున్నారు. వారిని చూసి లోడింగ్ అయిన లారీలు, లోడింగ్ చేస్తున్న పొక్లెయిన్ల డ్రైవర్లు పారిపోయారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ప్రతి పనికి వాటా తీసుకుంటున్న పావలా ప్రసాద్(ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్), ఆయన బావమరిది అక్రమాలను సంబంధిత అధికారులు అడ్డుకోకపోతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. దాములూరు శాండ్ సప్లయిర్స్ పేరుతో దొంగ బిల్లులు ప్రింట్ చేయించి ఇసుక దోపిడీకి తెగబడ్డారన్నారు. నదీ ప్రాంతంలో పొక్లెయిన్లు, జేసీబీలతో తవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. నదికి అవతల వైపు ఉండే సీఎం చంద్రబాబు ఇవతల వైపు జరుగుతున్న దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను ఈ నియోజకవర్గం నుంచి పంపకపోతే ప్రకృతి వనరులు భవిష్యత్ తరాలకు మిగలవని మండిపడ్డారు. అధికారులు తక్షణం ఇసుక దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ రాత్రి 7.40 గంటల వరకు రేవు వద్ద బైఠాయించారు. ఫోన్లో రెవెన్యూ, మైనింగ్ అధికారులను ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలానికి చెందిన నాయకులు మేడపాటి నాగిరెడ్డి, గుంజా శ్రీనివాస్, నల్లమోతు ప్రకాశ్, పచ్చిగోళ్ల పండు, రెంటపల్లి నాగరాజు, లంకే అంకమోహనరావు, పఠాన్నాగుల్మీరా, కుమ్మరి నాగరాజు, గోగులమూడి రాణి, శెట్టి ఈశ్వరి, సందిపాము రాజేష్, బాణావత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పూర్తి చేయాలి
అధికారులకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆదేశం విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను దసరా ఉత్సవాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి నూతన టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని ఎయిర్పోర్ట్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు వివరించారు. అనంతరం శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సవరించిన అంచనాల ప్రకారం రూ.824.28 కోట్ల వ్యయంతో ఏడాదికి 3.5 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యంతో అత్యాధునిక సదుపాయాలతో టెర్మినల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 51,315 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మిస్తున్న టెర్మినల్లో 24 చెక్ – ఇన్ కౌంటర్లు, 8 కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ఆరు ఏరో బ్రిడ్జ్లు, 9 డిపార్చర్ గేట్లు, పది ఎస్కలేటర్లు, 19 ఎలివేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నూతన టెర్మినల్ అందుబాటులోకి వస్తే షార్జా, సింగపూర్తో పాటు మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీస్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయన వెంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, విమానాశ్రయ అధికారులు ఉన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై నిష్పాక్షక దర్యాప్తు చేయాలి గూడూరు: గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఏపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాఽథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాయికృష్ణ తల్లి, మేనమామ చేస్తున్న ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న వాస్తవాలను త్వరితగతంగా వెలికితీయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసులో వస్తున్న ఆరోపణలపై వేగవంతంగా విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు. అవసరమైతే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు బుధవారం విడుదల చేశారు. ఏఎన్యూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,985 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,870 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యూషన్కు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాల 24వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఎ. వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చన్నారు. గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి గుడివాడరూరల్: ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కార్యదర్శులు ఎస్.సమరం, సీహెచ్ వెంకటేశ్వరరావు జిల్లా గురుకుల పాఠశాలల డీసీవో మురళీకృష్ణకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని గురుకుల పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని, విద్యార్థులకు ఆట స్థలాలు కేటాయించాలని కోరారు. తాగునీటి సౌకర్యం, బోర్లు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, విస్సన్నపేట, నందిగామ, తిరువూరు గురుకుల పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉందన్నారు. రుద్రవరంలోని డాక్టర్ గురుకుల పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, మోటూరు గురుకుల పాఠశాలలో తాగునీటి బోర్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు. -
అసత్య ప్రచారాలు ఇకనైనా ఆపండి
నందిగామ టౌన్: కేంద్రియ విద్యాలయంపై పాలక పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. పట్టణంలోని హనుమంతపాలెం గ్రామ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద గత ప్రభుత్వ హయాంలో కేంద్రియ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రియ విద్యాలయానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా కేటాయించలేదని పాలక పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రియ విద్యాలయం, వంద పడకల ఆస్పత్రి మంజూరుపై దగా మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా హనుమంతపాలెంలో ఐదెకరాల స్థలాన్ని కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు. మున్సిపల్ శాఖాధికారుల అనుమతితో స్థలాన్ని చదును చేయించి హనుమంతపాలెం, టిడ్కో ఇళ్ల నివాసితులు, విద్యాలయానికి వచ్చే విద్యార్థుల సౌకర్యార్ధం రూ.80 లక్షల వ్యయంతో రోడ్డు కూడా నిర్మించినట్లు గుర్తు చేశారు. భవన నిర్మాణానికి సాయిల్ టెస్ట్ సైతం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అయితే గత ప్రభుత్వంలో కేటాయించిన స్థలంలో నిర్మించకుండా రాఘవాపురం కొండల్లో కేంద్రియ విద్యాలయ భవన నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రియ విద్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆయుష్ ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని నిప్పులు చెరిగారు. కేంద్రియ విద్యాలయం, వంద పడకల ఆస్పత్రిపై చర్చకు సిద్ధమని జగన్మోహనరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నైనా.. గాంధీ సెంటర్లో నైనా మీరు చెప్పిన చోటుకు వస్తామని అన్నారు. ఇప్పటికై నా అసత్య ప్రచారాలు మానుకుని పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. -
మలి సంధ్య వేళలో...
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026పగలంతా పుడమికి వెలుగును ప్రసాదించిన భానుడు... ఇక ఈ రోజుకి టాటా...చెబుతూ గిరి శిఖరాల చాటున తలదాచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఉదయం ఉషోదయంతో పరవశించిన వృక్షాలు వింజామరల్లా తమ కొమ్మలను ఉయ్యాలలూపుతూ సూర్య భగవానుడికి బై..బై.. చెబుతున్నాయి. మలి సంధ్య వేళలో ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత చిత్రం ఎంతో రమణీయంగా ఉంది కదూ... విజయవాడ గుణదల ప్రాంతంలో బుధవారం సాయంత్రం సూర్యాస్తమయం వేళ కనువిందు చేసిన ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఎల్నినో...ఎలా సాగునో..!
పెనుగంచిప్రోలు: ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై ఏర్పడి వర్షపాతంలో భారీగా తేడాలుంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చిన సంగతి విదితమే. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కరువు పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. ఎల్నినో కారణంగా సాధారణం కంటే తక్కువగా లోటు వర్షపాతం నమోదు కానుంది. ఇదే జరిగితే ఖరీఫ్లో వర్షాధారంతో సాగయ్యే పంటల పరిస్థితి ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు భరోసా కల్పించనున్న ప్రీమాన్సూన్ డ్రైసోయింగ్... వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడే తక్కువ వర్షపాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అమలు చేస్తున్న ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)విధానం రైతులకు కొత్త భరోసాను కల్పిస్తోంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందే విత్తనాలు చల్లటం ద్వారా నేలలో తేమ లభించిన వెంటనే మొలకలు రావటం, పంటల పెరుగుదల వేగవంతం కావటం ఈ విధానంలో ప్రత్యేకత. ఒకే పొలంలో 27 నుంచి 30 రకాల పలు పంటల విత్తనాలు సాగు చేయటం వల్ల మట్టి సారం పెరగటంతో పాటు నీటి వినియోగం తగ్గుతుంది. రైతుకు ఒకే పంటపై ఆధారపడకుండా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మొదట దీర్ఘకాలిక పంటలను విత్తన గుళికలు తయారు చేసి లైన్ సోయింగ్ పద్ధతి ద్వారా నాటుకుని మిగతా 27 నుంచి 30 రకాల విత్తనాలను పొలంలో చల్లుకోవాలి. దీర్ఘకాలిక పంటల్లో కందులు, బొబ్బర్లు, ఆముదాలు, మొక్కజొన్న, గోరుచిక్కుడు, నువ్వులు మొదలైనవి. ఈ పంటలు వర్షాభావ పరిస్థితులకు తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. పొలంలో చల్లిన రైతుకు ఎంతోకొంత ఆదాయం వస్తుంది. వర్షాభావం వలన పశువులకు మేత సమస్య రాకుండా పంటల అవశేషాలను పశువులకు మేత లభించటంతో పాటు పాల దిగుబడి కూడా బాగుంటుంది. రైతులందరూ 27 నుంచి 30 రకాల విత్తనాలను ఎకరానికి 15 నుంచి 20 కిలోల వరకు భూమిలో చల్లుకుంటే భూమి సారం పెరగటమే కాకుండా రైతుకు ఆదాయం కూడా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు పీఎండీఎస్ విధానం ద్వారా 13,622 మంది రైతులకు చెందిన 13,083 ఎకరాల్లో విత్తనాలు నాటారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్వవసాయ పద్ధతులపై దృష్టి పెట్టాలి. ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్, విత్తన గుళికలు తయారీ విధానం ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు స్థిరమైన దిగుబడులు, ఆదాయం పొందవచ్చు. రైతులకు ఈ విధానాలపై గ్రామాల్లో అవగాహన కల్పించటంతో పాటు విస్తృతంగా విత్తనాలు విత్తే కార్యక్రమాలు చేపడుతున్నాం. –వి నాగప్రమీలారాణి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విత్తన గుళికల తయారీ కూడా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాయి. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘన జీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు, పొరలుగా కలపటం ద్వారా సాధారణ విత్తనం కంటే పెద్దగా విత్తన గుళికలు తయారవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి రక్షించబడతాయి. మట్టిలో 10 నుంచి 15 మి.మీ వర్షం కురిసినా విత్తనాలు మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా సుమారుగా ఆరు నెలల వరకు జీవంతో ఉండి మొలకెత్తిన తరువాత కూడా నీటి ఎద్దడిని తట్టుకుంటాయని ప్రకృతి వ్యవసాయం ప్రతినిధులు చెబుతున్నారు. -
మైక్రో ఫైనాన్స్ చెర నుంచి విముక్తి
చల్లపల్లి: గత వారం రోజులుగా సొంత ఇంటి అరుగుల పైనే పరాయివారిలా కాలం నెట్టుకొస్తున్న మైక్రో ఫైనాన్స్ బాధిత కుటుంబం ఎట్టకేటకు బుధవారం ఇంట్లోకి వెళ్లారు. మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు వచ్చి ఇంటికి వేసిన తాళాలు తీయటంతో అప్పటి వరకూ దీనంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ దళితవాడకు చెందిన కాకి సుకన్య ఇంటికి రేపల్లెకు చెందిన ఇన్ఫినిటీ మైక్రోఫైనాన్స్ నిర్వాహకులు లోను కిస్తీలు కట్టలేదని వారం రోజుల క్రితం ఇంటికి తాళం వేశారు. దీంతో కట్టుబట్టలతో వీధిన పడ్డ సుకన్య, ఆమె పిల్లలు మంగళవారం వరకూ ఆ ఇంటి బయట అరుగుల పైనే కాలం గడిపారు. చివరికి విషయాన్ని ‘సాక్షి’ దృష్టికి తీసుకురావటంతో ‘‘నలుగురు పిల్లలతో అరుగుపై నివాసం’’ అనే శీర్షికన బుధవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి మాలమహానాడు సంఘ నేతలతో పాటు, రెవెన్యూ అధికారులు స్పందించారు. విషయం తెలిసిన వెంటనే మాల మహానాడు జిల్లా అద్యక్షుడు దోవా గోవర్దన్ పురిటిగడ్డలోని బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. ఇప్పటి వరకూ దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఇన్ఫినిటీ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులకు ఫోన్ చేశారు. లోను కిస్తీ వ్యవహారాలు తరువాత చూసుకుందామని, వెంటనే వచ్చి వేసిన తాళాలు తీయకపోతే చట్టపరంగా ముందుకు వెళతామని హెచ్చరించారు. దీంతో ఇన్ఫినిటీ నిర్వాహకులు హుటాహుటిన వచ్చి ఇంటికి వేసిన తాళాలు తెరిచారు. అప్పటివరకూ ఇల్లు దక్కుతుందో... దక్కదోనన్న ఆందోళనతో ఉన్న సుకన్య, ఆమె నలుగురు పిల్లల మోములో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చి తమకు న్యాయం జరిగేలా కృషి చేసిన ‘సాక్షి’ పత్రికకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వివరాలు సేకరించిన రెవెన్యూ అధికారులు సాక్షిలో కథనం ప్రచురితం కావటంతో మచిలీపట్నం ఆర్డీవో సాంబశివరావు దీనిపై వివరాలు సేకరించి పంపాలని బుధవారం చల్లపల్లి ఇన్చార్జి తహసీల్దార్ టి.శ్రీలతను ఆదేశించారు. దీంతో తహసీల్దార్ శ్రీలత కాకి సుకన్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. -
పిడుగుపాటుతో కౌలురైతు మృతి
కంకిపాడు: చిన్న వివాదం ఘర్షణకు దారి తీసి ఓ వృద్ధుడి మృతికి కారణమైంది. మండలంలోని గోసాల సెంటరు (ఈడుపుగల్లు పరిధిలో) బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఉప్పాల సాంబశివరావు (60) గోసాల సెంటరులో బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. బడ్డీ కొట్టు వెనుక రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన మట్టిని నిల్వ చేశారు. సాంబశివరావు తమ్ముడి అల్లుడు బోలెం శ్రీను (35) బడ్డీ కొట్టు వెనుక ఉన్న మట్టిన తరలించేందుకు యత్నించాడు. విషయాన్ని గుర్తించిన సాంబశివరావు మట్టి తరలింపును అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సాంబశివరావుపై బోలెం శ్రీను దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ సాంబశివరావు ఆయాసంతో కూలబడిపోగా, అతని భార్య డాక్టర్ కోసం వెళ్లొచ్చేసరికి మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్య కేసుగా నమోదు చేసి ఇన్చార్జి సీఐ వెంకట నారాయణ దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటలు అత్యంత కీలకమని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బుధవారం సాయంత్రంలోపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వర్ష ప్రభావం కారణంగా విద్యుత్ అంతరాయాలు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశాలు ఉండటంతో స్థానిక యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా.🔴 రెడ్ అలర్ట్:విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.🟡 ఎల్లో అలర్ట్:తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించింది. అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించింది. మొత్తం పరిస్థితిని చూస్తే రాబోయే గంటలు రాష్ట్రానికి కీలకంగా మారనున్నాయి. -
బుడమేరులో ఈతకు దిగి బాలుడు మృతి
నందివాడ: బుడమేరులో ఈతకు దిగి బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన లక్ష్మీనరసింహాపురం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. ఏలూ రు జిల్లా దుగ్గిరాల గ్రామానికి చెందిన తలారి మానస గోపాల్ (కిట్టు) (14), బన్నీ, డేవిడ్ మంగళవారం పోలుకొండ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వచ్చే క్రమంలో లక్ష్మీనరసింహాపురం గ్రామంలో బుడమేరు వద్దకు వెళ్లారు. బన్నీ, డేవిడ్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కొద్ది దూరం వెళ్లారు. మానస గోపాల్ (కిట్టు) ఈత కొట్టేందుకు బుడమేరులో దిగగా ఆ ప్రవాహానికి కొట్టుకుపోతూ అన్నయ్యా.. అన్నయ్యా అంటూ పెద్దగా కేకలు వేశాడు. కిట్టు అరుపులు విన్న వాళ్లిద్దరూ అక్కడికి చేరుకుని వారి బంధువులకు ఆ ప్రమాదాన్ని తెలియజేశారు. సమాచారం అందుకున్న నందివాడ ఎస్ఐ పి.ఎస్.వి.సుబ్రహ్మణ్యం పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు ముమ్మరంగా సాగిన శోధన అనంతరం బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. కిట్టు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెండేళ్ల కూటమి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వివక్ష, వంచన ద్రోహం చేసిందని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ఆయా వర్గాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కుల కార్పొరేషన్లకు బదలాయించిందని ఆరోపించింది. విజయవాడ ప్రెస్క్లబ్లో రెండేళ్ల కూటమి పాలనపై మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. జేఏసీ కో–ఆర్డినేటర్ కొరివి వినయ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం అట్టడుగు వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించకుండా, బడ్జెట్ కేటాయించకుండా ఆర్థిక అణచివేతకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 27 సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని, ఎన్నికల్లో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలు గురించి ఈ రెండేళ్లలో కనీస ప్రయత్నం కూడా చేయలేదన్నారు. తక్షణమే పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని కాల పరిమితికి సంబంధం లేకుండా ఆ వర్గాల సమగ్రాభివృద్ధి నిధి చట్టంగా మార్పుచేసి సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.8 లక్షల ఆదాయ పరిమితితో ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్షిప్లు గతంలో లాగా కొనసాగించాలని, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యోన్నతి పేరుతో బడ్జెట్ కేటాయించి అర్హులందరికీ అవకాశాలు కల్పించాలన్నారు. బ్యాక్ లాగ్స్ భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్, సీపీఐ నాయకుడు కరవాది సుబ్బారావు, డీహెచ్పీఎస్ నాయకులు నీలం నాగేంద్రరావు, తోటి చంగల్రావ్, నతం హరిబాబు, సాంబశివరావు, మేళం భాగ్యారావు, అంగడాల పూర్ణచంద్ర, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
డీపీఎఫ్, ఆర్టీఐహెచ్ మధ్య ఎంఓయూ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి, సమగ్ర ఆవిష్కరణలు, జీవనోపాధి అభివృద్ధికి దళిత్ ఫిలాంత్రఫీ ఫౌండేషన్(డీపీఎఫ్), రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ సమక్షంలో డీపీఎఫ్, ఆర్టీఐహెచ్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, సమగ్ర ఆవిష్కరణలు, జీవనోపాధి అభివృద్ధి, సామాజిక సంస్థల బలోపేతం కోసం సంయుక్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. రెండు సంస్థలు కలిసి మహిళలు, యువత, వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారతకు, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు, నైపుణ్యాభివృద్ధికి, వ్యాపారాల ప్రోత్సాహానికి కలిసి పనిచేస్తాయి. కార్యక్రమంలో డీపీఎఫ్ ఈడీ సంతోష్కుమార్ సామల్, హబ్ సీఈఓ జి.కృష్ణన్ పాల్గొన్నారు. గంటలోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు అవనిగడ్డ: స్థానిక రెండవ వార్డుకు చెందిన మూడేళ్ల బాలుడు అంగన్వాడీ కేంద్రంకు వెళ్లి తప్పిపోగా గంటలోనే పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అవనిగడ్డ రెండో వార్డుకు చెందిన గాయం బాలరాజు కుమారుడు అభి అంగన్వాడీ కేంద్రంకు వెళ్లాడు. అక్కడ నుంచి ఆడుతూ తప్పిపోయి వంతెన సెంటర్ వరకూ వెళ్లాడు. అక్కడ వచ్చీపోయే వాహనాలకు అడ్డుపడుతున్న అభిని ఏఎస్ఐ శ్రీనివాసరావు దగ్గరకు తీసుకుని స్థానిక పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. వివరాలు అడిగినా చెప్పలేకపోవడంతో బాలుడిని తీసుకుని పలువురికి చూపిస్తూ వాకబు చేశారు. ఇంతలో ఒకతను అతనిని గుర్తించి మా వాళ్ళ కుర్రాడేనని వివరాలు చెప్పారు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులను పిలిపించిన ఏఎస్ఐ వారికి అప్పగించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
పేదల బియ్యం పక్కదారి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా వ్యవహారాన్ని సాక్షాత్తూ ఓ టీడీపీ ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో రేషన్ బియ్యాన్ని ఏకీ కృతంగా ఒక వ్యక్తే సేకరించి, కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి కోట్లు దండుకుంటున్నారు. ఈ దందాలో సింహభాగం పార్లమెంటు ముఖ్యనేత కనుసన్నల్లోనే సాగుతోంది. కిందిస్థాయి అధికారులతో లాలూచీ రేషన్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా జాయింట్ కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుండటంతో కింది స్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నిత్యం ఎక్కడో చోట రేషన్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి. అసలు రేషన్ మాఫియా సభ్యులను వదిలేసి నామమాత్రపు కేసులు పెట్టి చేతులు దులుపుకొంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్ దుకాణాల్లో బియ్యం ఖాళీ అయిపోతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో సగటున 500 టన్నులకు పైగా రేషన్ బియ్యం మాఫియా చేతుల్లోకి పోతున్నాయి. రైస్ మిల్లుల్లో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి, నేరుగా కాకినాడ పోర్టు మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. బియ్యం మాఫియా నుంచి ప్రతి నెలా పార్లమెంటు ముఖ్యనేతకు కోటి రూపాయలు, నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు రూ.25 లక్షల చొప్పున మామూళ్లు వెళుతుంటాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్లో... విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత వారంలో నున్న సమీపంలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకొన్నారు. అసలు దొంగలను వదిలేసి, అనామకులపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీంతో ఆ ముఠా అక్కడ నుంచి సూరం పల్లికి మకాం మార్చి అక్కడ గోడౌన్లు అద్దెకు తీసుకుని రేషన్ బియ్యం తరలించి, అక్కడ నుంచి హైవే మీదుగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఇటీవల నిడమానూరు సమీపంలో పటమట పోలీసులు బియ్యం లారీని పట్టుకొన్నారు. ఈ మాఫియాలో ప్రధానంగా ఒకరేమో డీలర్ల సంఘంలో అపోసియేషన్ నాయకుడు, ఇంకొకరు రెండవ డివిజన్కు చెందిన టీడీపీ నేత, ఇంకొకరు బియ్యం మాఫియాలో ‘వైకుంఠ ’పాళిలా అంచెలంచలుగా ఎదిగిన వ్యక్తి. వీరి పేర్లు పోలీసుల హిట్లిస్టులో కూడా ఉన్నాయి . రెండేళ్లుగా ఈ గ్యాంగ్ యథేచ్ఛగా రేషన్ దందా చేస్తూ లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. విజయవాడ వన్టౌన్లో... వన్టౌన్, కొత్తపేట, చిట్టినగర్ పరిధిలోని రేషన్ డీలర్లు అందరూ సిండికేట్గా మారి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిట్టినగర్కు చెందిన ఓ సీనియర్ రేషన్ డీలర్ ఈ అక్రమ దందాకు తెర లేపాడు. డిపో డీలర్ల వద్ద నుంచి అక్రమంగా బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ మధ్యవర్తి సాయంతో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఇందుకు పగటి వేళ అయితే అందరికీ తెలుస్తుందనే భావనతో రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల మధ్య బియ్యం అక్రమ రవాణాకు అనువుగా మార్చుకున్నారు. అయితే ఈ వ్యవహారమంతా పౌర సరఫరాల శాఖ అధికారులకు తెలిసే జరుగుతోందని రేషన్ డీలర్లు బహిరంగంగానే అంటున్నారు. వీరులపాడులో 295 బస్తాల బియ్యం పట్టుకుని కేసులు నమోదు చేశారు. వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణ(50)పై పీడీ యాక్టు అమలు చేశారు. ఇతనిపైన 41 కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రేషన్ మాఫియాలో కీలకంగా వ్యవహరిస్తున్న రామచంద్రరావుపైన ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇతనిపై పీడీ యాక్టు అమలు కాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇతను పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో పాటు, స్థానికంగా ఉండే పోలీసు, రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెపుతుండటంతోనే ఇతన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలున్నాయి. గత నెల 6 వ తేదీన కొండపల్లి శాంతినగర్లో 550 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వతేదీ తిరువూరు మండలం రాజుగూడెంలో 60 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. -
వైఎస్సార్ సీపీ అభిమాని ఇంటర్నెట్ ఆఫీసుపై దాడి
సాక్షి టాస్క్ఫోర్స్: వైఎస్సార్ సీపీ అభిమానులపై టీడీపీ గూండాల దాడులు పెచ్చుమీరుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వాంబే కాలనీలో నివసించే వైఎస్సార్ సీపీ అభిమాని సింగంశెట్టి ప్రవీణ్ ఇంటర్నెట్ కార్యాలయం నిర్వహిస్తూ, వి డిజిటల్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రవీణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కోసం పని చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రవీణ్పై స్థానిక ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసి గాయపరిచారు. అప్పట్లో నున్న పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరులు ఎనిమిది మంది మంగళవారం ప్రవీణ్ ఇంటికి వెళ్లి వాంబే కాలనీలో ఇంటర్నెట్ కార్యాలయం ఉండకూడదని, ఖాళీ చేసి వెళ్లి పోవాలని హెచ్చరించారు. అనంతరం వాంబే కాలనీ ఏ బ్లాక్ 494 ఫ్లాట్లో ఉన్న ఇంటర్నెట్ కార్యాలయానికి వెళ్లి కేబుల్ కనెక్షన్లకు సంబంధించిన నెట్ వర్క్ను ఇష్టం వచ్చినట్లు పీకేసి, వైర్లు కట్ చేసి రూ.లక్షల విలువైన సామగ్రిని నాశనం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి కలవాలని హెచ్చరించారు. వన్టౌన్ వెళ్లాలని బెదిరింపులు, వేధింపులు చేస్తుండటంతో ప్రవీణ్ నున్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్ఐ సాయి ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. తాను ఇంటర్నెట్ కార్యాలయం కోసం దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేసి ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసి కనెక్షన్లు ఇచ్చానని, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించి కేబుల్నెట్ వర్కు ఉండటంతో దానికి పోటీగా ఉండకూడదనే ఆయన అనుచరులు దాడులు చేయడం, బెదిరింపులు చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
గంజాయి రవాణాపై పటిష్ట నిఘా
● గంజాయి విక్రయించే 44 ముఠాల్లో 35 ముఠాలు అరెస్టు ● వెస్ట్జోన్ డీసీపీ రామకృష్ణ వెల్లడి పాయకాపురం(విజయవాడరూరల్): విజయవాడ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్పు తీసుకొచ్చేందుకు పోలీసు యంత్రాంగం గట్టి చర్యలు చేపట్టిందని విజయవాడ నగర డెప్యూటీ పోలీసు కమిషనర్(వెస్ట్ జోన్) గుణ్ణం రామ కృష్ణ తెలియజేశారు. నున్న పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ నగరానికి వచ్చే వాహనాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్ధాల రవాణాపై నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నామన్నారు. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన ఐదుగురు వ్యక్తులు హరి విఘ్నేష్ తానపాల్, షణ్ముఖ, సికిందర్, సూర్య, హరీష్ 26 కిలోల గంజాయిని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో కొనుగోలు చేసి కారులో వెస్ట్ బైపాస్లో వస్తుండగా సోమవారం నున్న గ్రామ సమీపంలోని హలో గురు హోటల్ వద్ద వీరి కారు ఆగివున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు 108కి సమాచారం అందించి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకు పంపారు. ఈ సమాచారం తెలుసుకుని మహిళా ఎస్ఐ విమల ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు ప్రాథమిక చికిత్స తీసుకొని వచ్చి కారు డిక్కీలో ప్రత్యేకంగా ప్యాక్ చేసి ఉన్న గంజాయిని పట్టుకుని పారిపోవడానికి యత్నించారు. ఎస్ఐ విమల వారిని సమయస్ఫూర్తితో పట్టుకుని స్టేషన్కు తీసుకొచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూర్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను రైల్వే కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు. మిగిలిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నార్త్ డివిజన్ పరిధిలో గంజాయి తాగే 1544 మందిని గుర్తించామని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయిని విక్ర యించే 44 ముఠాల్లో 35 ముఠాలను అరెస్ట్ చేశామని డీసీపీ రామకృష్ణ చెప్పారు. విలేకరుల సమావేశంలో నార్త్ ఏసీపీ పి.సత్యానందం, నున్న సీఐ అహ్మద్ అలీ, ఎస్ఐ విమల పాల్గొన్నారు. -
జిల్లాలో సజావుగా ‘సర్’
ఐతవరంలో ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ నందిగామ రూరల్: అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటంతో పాటు తప్పులు లేకుండా పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించటమే లక్ష్యంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగుతోందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని ఐతవరం గ్రామంలో ఇంటింటి సందర్శన ద్వారా నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో 1,792మంది బీఎల్వోలు.. జిల్లాలో 1,792మంది బీఎల్వోలు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లున్న వారిని తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటరు జాబితా సిద్ధం చేయాలని చెప్పారు. ఆర్డీవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.7,37,306 ఆదాయం వచ్చిందని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదావు మంగళవారం వెల్లడించారు. అలాగే మోపిదేవి టీటీడీ కల్యాణ మండపంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈనెల 21వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 7.30 నుంచి 8.30గంటల వరకు ఉంటుందని వివరించారు. -
వలస కూలీల కోసం న్యాయ క్లినిక్
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోపిమచిలీపట్నంటౌన్: జిల్లాలో పనిచేస్తున్న ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుట్టాల గోపి కోరారు. నగరంలోని ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యాయ సహాయ క్లినిక్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, దిశా న్యాయమూర్తి వరలక్ష్మితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి.. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి గోపి మాట్లాడుతూ మణిపూర్, త్రిపుర, మిజోరం చుట్టుపక్కల ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులు వివిధ రకాల పనులు జిల్లాలో చేస్తున్నారని, వారికి అన్యాయం జరిగితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సహాయం అందించే ఉద్దేశంతో న్యాయ సహాయ క్లినిక్ను ఏర్పాటు చేశామన్నారు. పుర ప్రజలకు, వలస కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఎవరికై నా ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయ సహాయ క్లినిక్ సంప్రదించేలా అవగాహన కల్పించాలన్నారు. న్యాయ సహాయం అందించడానికి ప్రత్యేకించి ఒక న్యాయ సహాయ కౌన్సిలర్ అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో డీపీటీవో వెంకటేశ్వర్లు, ఆర్టీసీ డిపో మేనేజర్ డిపో మేనేజర్ టి. పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. -
కాసుక్కూర్చున్నారు!
మానవ ప్రమేయం లేదంటూనే వసూళ్ల పర్వం ● పైసలిస్తేనే ఫిట్ అంటున్నారని ఆరోపణలు ● రోడ్డెక్కుతున్న అన్ఫిట్ వాహనాలుప్రత్యక్ష అధికారాలు లేవు.. మచిలీపట్నంఅర్బన్: రవాణా రంగంలో వాహనాల ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత పెరుగుతాయని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లను (ఏటీఎస్లు) ప్రవేశపెట్టింది. చివరకు మొత్తం వ్యవస్థను ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన వాహనాల భద్రత అంశాన్ని రవాణాశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నుంచి దూరం చేసి, ప్రైవేట్ యాజమాన్యాలపై ఆధారపడే పరిస్థితిని తీసుకొచ్చింది. ఫిట్నెస్ పరీక్షల పేరుతో అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెట్టేందుకు మార్గం సుగమం చేసింది. ఫలితంగా మానవ ప్రమేయంలేని ఏటీఎస్లలో అవినీతి రాజ్యమేలుతోంది. పైసలిస్తేనే ‘ఫిట్’ అనే పరిస్థితి వచ్చింది. దీంతో ఫిట్నెస్ లేని వాహనాలు సైతం రోడ్డెక్కి అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనల అమలు ప్రశ్నార్థకం.. జిల్లాలో వాణిజ్య, ప్రజా రవాణా వాహనాలకు ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే ప్రక్రియలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తిగా ఫిట్గా ఉన్నప్పుడే పత్రాలు జారీ చేయాల్సి ఉండగా, జిల్లా కేంద్రం మచిలీపట్నానికి సమీపంలోని మల్లవోలులో ఏర్పాటు చేసిన ఏటీఎస్లో నిబంధనల అమలు ప్రశ్నార్థకంగా మారిందని వాహన యజమానులు చెబుతున్నారు. ఎంవీఐల పాత్ర ఇలా.. గతంలో రవాణాశాఖ కార్యాలయాల్లో మోటారు వాహన ఇన్స్పెక్టర్లు (ఎంవీఐలు) ప్రత్యక్షంగా వాహనాలను తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ప్రస్తుతం ఆటోమేటిక్ టెస్టింగ్ వ్యవస్థ పేరుతో ఎంవీఐల పాత్రను దాదాపు పూర్తిగా తొలగించడంతో పరీక్షల ప్రక్రియ మొత్తం ప్రైవేట్ నిర్వాహకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో బాధ్యత, జవాబుదారీతనం రెండూ లేకుండా పోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలపై భారమే.. ప్రతి జిల్లాకు ఒక్కటే ఏటీసీ ఏర్పాటు చేయడంతో వాహన యజమానులపై అనవసరమైన ప్రయాణ భారం పడుతోందన్న వాదన ఉంది. జిల్లా కేంద్రం మచిలీపట్నానికి సుమారు 10కిలోమీటర్ల దూరంలో ఏటీసీ ఉండటంతో, జిల్లా నలుమూలల నుంచి వాహనాలు ఫిట్నెస్ కోసం రావాలంటే కనీసం 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరో వైపు పక్క రాష్ట్రం తెలంగాణలో ఏటీసీలను ప్రభుత్వమే నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం ప్రైవేటీకరణ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోందని ప్రజలు అంటున్నారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్)లో అధికారిక ఫీజులకు అదనంగా రూ.వెయ్యి నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటీఎస్ నిర్వహిస్తున్న సంస్థ యాజమాన్యమే ఈ అదనపు వసూళ్లకు పాల్పడుతోందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. ఫిట్నెస్ పరీక్ష కోసం ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని టెస్టింగ్ సెంటర్కు చేరుకున్న వాహనాల్లో లోపాలను గుర్తించి, వాటిని సరిచేయాలంటే అదనపు మొత్తం చెల్లించాలని సంస్థ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదనపు మొత్తాలు చెల్లించిన వాహనాలకు లోపాలు ఉన్నప్పటికీ ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని, ఆశించినంత మొత్తం చెల్లించని వాహన యజమానులను మళ్లీ పరీక్షలకు రావాలని సూచిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండోసారి పరీక్షలకు హాజరుకావాలంటే అదనపు ప్రయాణ భారం, ఖర్చులు భరించాల్సి రావడంతో చాలామంది వాహన యజమానులు అడిగిన మొత్తాన్ని చెల్లించి ఫిట్నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నట్లు పేర్కొంటున్నారు. వాహన ఫిట్నెస్ వ్యవస్థపై విమర్శలు రాజ్యమేలుతున్న అవినీతి జిల్లాలో రహదారి ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులు, ట్యాక్సీలు, వ్యాన్ల వల్లే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలోని జాతీయ రహదారులపై అత్యధికంగా 138ప్రమాదాలు నమోదై 64 మంది మృతి చెందగా, 167మంది గాయపడ్డారు. ఇతర రహదారులపై 90 ప్రమాదాలు, రాష్ట్ర రహదారులపై 49 ప్రమాదాలు నమోదయ్యాయి. -
ఆర్టీసీ ఎండీని కలిసిన ఉద్యోగులు
విజయవాడ కల్చరల్: నగరానికి చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు శ్రీనివాస్ అజయ్ చక్రవర్తికి 2024 సంవత్సరానికి గానూ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం లభించినట్లు శ్రీనివాస చక్రవర్తి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలం కూచిపూడి సంప్రదాయ నృత్యాన్ని దేశ విదేశాలలో ప్రదర్శించి వందలాది మందికి శిక్షణ ఇచ్చినందుకుగానూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన అవార్డ్కు ఎంపిక చేసింది. తల్లిదండ్రుల పెదప్రోలు జేజిబాబు, తల్లి శారద ప్రోత్సాహంతో ప్రముఖ నాట్యాచారిణి లంకా అన్నపూర్ణ నృత్యంలో ఓనమాలు నేర్చుకోగా.. కూచిపూడి నాట్యాన్ని నాట్యాచార్యులు వెంపటి చినసత్యం, వేదాంతం రాధేశ్యాం, వేదాంతం వెంకటా చలపతి వద్ద నేర్చుకున్నారు. అజయ్ చక్రవర్తి నృత్యరూపకాలలో ప్రతినాయక పాత్రలు, మహిషాసురుడు, రావణ బ్రహ్మ, ఘటోత్కచుడు, హిరణ్య కశ్యపుడు తదితర పాత్రాలలో నటించి రక్తికట్టించారు. మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్టీయూ నాయకులు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీని కోరారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా పరిషత్ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్లోకి తీసుకురావడంతో పాటు పెండింగ్లో ఉన్న పీఎఫ్ పియర్ స్లిప్లను విడుదల చేయాలని కోరారు. మచిలీపట్నం, గుడివాడ స్థానిక సంస్థల పరిధిలో పనిచేస్తున్న, ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సీఎస్ఎస్ పథకంలో జమ చేసిన డీఏ, వేతన సవరణ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరితగతిన పరిష్కరించాలని కోరా రు. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి డి. చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు పి. ఇమ్మానియేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి యూవీ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
రెడ్ బుక్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. భారత రాజ్యాంగాన్ని కాలరాస్తూ.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం అవలంభిస్తున్న అణచివేత ధోరణిని వ్యతిరేకిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగాగల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సైనికులపై ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన చింత కాయల విజయ్ను రాజ్యసభకు పంపించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 800 మంది సోషల్ మీడియా సైనికులపై అక్రమ కేసులు పెట్టారని, ఈ కేసులకు ఎవరూ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కేసులు బనాయించి వేధించారు.. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయించి వేధింపులకు గురి చేశారని మండిపడ్డారు. ఫేస్ బుక్, ఎక్స్ వంటి వేదికల ద్వారా కూటమి పాలనను ప్రశ్నిస్తుంటే ప్రభుత్వ పెద్దలు తట్టుకోలేక పోతున్నారన్నారు. భయపెట్టే రాజకీయాలు చేస్తూ బెదిరించాలని చూస్తున్నారని, దానికి భయపడేవారెవరూ లేరని గ్రహించాలని హితవు పలికారు. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి.. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించే అవకాశాన్ని డాక్టర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం కల్పించిందని, దానిని ప్రభుత్వం హరిస్తోందని తిరువూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడం చూస్తుంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, కృష్ణాజిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు పడిగపాటి చైతన్యరెడ్డి, సర్నాల తిరుపతిరావు, ఆళ్ల చెల్లారావు, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గ పరిశీలకులు తంగిరాల రామిరెడ్డి, కర్నాటి రాంబాబు, జిల్లా పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అలీమ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలపై ప్రభుత్వం దాష్టీకం ప్రదర్శిస్తూ గొంతు నొక్కాలని చూస్తోందని విమర్శించారు. ఇప్పటికే 800 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని, వారిలో 55 మందిని అన్యాయంగా రిమాండ్కు పంపారని గుర్తు చేశారు. -
కృష్ణానదిపై విద్యుత్ లైన్లకు మార్కర్ స్పియర్లు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని పున్నమీఘాట్ నుంచి భవానీ ఐల్యాండ్ మధ్య కృష్ణానదిపై 11కేవీ ఓవర్హెడ్ విద్యుత్ లైన్ల పై ఏవియేషన్ మార్కర్ స్పియర్లను ఏపీసీపీడీసీఎల్ సిబ్బంది మంగళవారం అమర్చారు. కృష్ణానదిపై నుంచి ఆకాశంలో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్ల పైలెట్లకు విద్యుత్ తీగలు స్పష్టంగా గుర్తించేందుకు ఈ ఏవియేషన్ మార్కర్ స్పియర్లు దోహదం చేస్తాయని ఏపీసీపీడీసీఎల్ విజయవాడ టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కావేటి కొండలరావు చెప్పారు. ప్రజల భద్రతతో పాటుగా విద్యుత్ మౌలిక వసతుల రక్షణకు కూడా ఈ మార్కర్ స్పియర్లు ఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు. -
నలుగురు పిల్లలతో అరుగుపై నివాసం
చల్లపల్లి: ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖం.. నలుగురు పిల్లల్ని ఎలా సాకాలో తెలియక దిక్కు తోచని స్థితి.. ఈ లోపే ఓ మైక్రో ఫైనాన్స్ సంస్థ అమానుషత్వ ధోరణి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. తీసుకున్న అప్పు కట్టలేదనే నెపంతో మానవత్వాన్ని మరచిపోయి ఆ నిరుపేద ఇంటికి తాళాలు వేశారు. అప్పు కడితేనే తాళాలు ఇస్తామని హుకుం జారీచేయటంతో ఆమె తన నలుగురు చిన్నపిల్లలతో సొంత ఇంటి ఆవరణలోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఏం జరిగిందంటే.. కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామానికి చెందిన కాకి మహేష్ అతని భార్య సుకన్య 2024 ఫిబ్రవరిలో రేపల్లెకు చెందిన ఇన్ఫినిటీ మైక్రో ఫైనాన్స్ సంస్థ నుంచి ఇంటి నిర్మాణం నిమిత్తం రూ.3లక్షలు అప్పు తీసుకున్నారు. అప్పట్లో తొలుత రెండు లక్షలు మాత్రమే ఇచ్చి మరో లక్ష తరువాత ఇస్తామన్నారు. అప్పు తీసుకున్న కొంత కాలానికి మహేష్ అనారోగ్యానికి గురై మృతిచెందారు. సంపాదించే భర్తను కోల్పోవటంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. లోను తాలూకా సంస్థ నుంచి రావాల్సిన మరో లక్ష ఇవ్వమని కోరింది. అయితే ఇంటి పనులు పూర్తయ్యాక ఆ లక్ష ఇస్తామని అప్పటి వరకూ వాయిదా సొమ్ము కట్టాల్సిందేనని అన్నారు. 2025 వరకూ నానా కష్టాలు పడి లోను కిస్తీలు కట్టుకుంటూ వచ్చింది. కూలీ పనులు చేయగా వచ్చే కొద్దిపాటి మొత్తంతోనే ఓ పక్క తన ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు మొత్తం నలుగురు పిల్లల చదువు, ఇంటి ఖర్చులు క్రమంగా భారంగా మారటంతో తీసుకున్న లోన్కు సంబంధించిన వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోయింది. రోజువారీ పనులు కూడా సరిగా దొరక్కపోవటంతో అసలు ఇల్లు కూడా గడవని పరిస్థితి. కొంతకాలం తర్వాత రూపాయి రూపాయి కూడబెట్టి లోను కడతానని బతిమాలినా మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు ఏమాత్రం కనికరించలేదు. వారం రోజుల క్రితం వచ్చి ఇంటికి తాళాలు వేశారు. తనకు ఇల్లు తప్ప మరో నీడలేదని ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్లాలని.. మైక్కో ఫైనాన్స్ నిర్వాహకులను బతిమలాడింది. అయినా వారు కనికరించకుండా వెళ్లిపోయారు. చేసేది లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక సొంత ఇంటి వసారాలోనే పరాయి వారిలా తన నలుగురు పిల్లలో కాలం గడుపుతోంది. నలుగురు పిల్లలు పురిటిగడ్డ హైస్కూల్లో చదవుతున్నారు. స్కూలుకు వెళ్లాలన్నా పుస్తకాలు లేవు. కట్టుకోవటానికి బట్టలు కూడా లేవు. అన్ని ఇంట్లోనే ఉండిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
యోగాతో ఒత్తిడిని తగ్గించుకుందాం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ భవానీపురం(విజయవాడపశ్చిమ): మీడియా రంగంలో పని చేస్తున్న పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిరంతరం ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో వృత్తిపరమైన సామరథ్యాన్ని పెంచుకునేందుకు యోగ సాధన ఎంతో అవసరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా మంగళవారం భవానీపురంలోని హరిత బెరంపార్క్లోగల పున్నమీఘాట్లో జరిగిన మీడియా థీమ్ యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులతో కలిసి యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ఆర్టిస్టిక్ యోగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై. రత్న ప్రియదర్శిని, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి బి. ప్రభాకరరావు, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, డీఎస్డీఓ కె. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
AP: ఆక్వా రైతుల ఆగ్రహ జ్వాలలు
విజయవాడ: పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని రైతులు ఆందోళన బాటపట్టారు. దొడ్డిదారిన పెంచిన ఆక్వా ఫీడ్ను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేస్తున్నారు.ఆక్వా రైతుల నిరసన కార్యక్రమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి మెయిన్ సెంటర్లో ధర్నా చేశారు. తమకు ఉరితాళ్లే శరణ్యం అంటూ ఉరితాళ్ళు మెడకు బిగించుకుని ఉండి మెయిన్ సెంటర్లో నిరసన తెలిపారు. సిండికేట్ వ్యవస్థను అరికట్టాలని, ఆక్వారైతులకు సరైన ధర కల్పించి అప్సడ చట్టాన్ని అమలు చేయాలని నినాదాలు చేశారు. ఉండి మండల తాసిల్దార్కు వినతి పత్రం అందజేశారు ఆక్వా రైతులు. దీనికి వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు. వనామీ రకం మేత పై కేజికి 10 రూపాయి పెంపు, టైగర్ ప్రాన్ మేత ధరలు 12 రూపాయల పెంపును వ్యతిరేకిస్తూ ఆక్వా రైతులు ధర్నా చేపట్టారు. టన్ను వనామీ ఫీడ్కు రూ. 10 వేలు, టైగర్ ప్రాన్ ఫీడ్కు రూ. 12 వేలు పెంచి ఆక్వా రైతుల నడ్డివిరిచే యత్నం చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ పెంపును ఏ మాత్రం అంగీకకరించబోమని రైతులు పదే పదే చెప్పినప్పటికీ ఏకపక్షంగా టీడీపీకి చెందిన కంపెనీలు ధరలు పెంచేశాయని ధ్వజమెత్తారు. అప్పడాతో సంబంధం లేకుండా మొండిగా నిర్ణయం తీసుకోవడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. ఇప్పటికే రొయ్య రేటు పతనం కావడం ఒకటైతే పెంచిన ధరలతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. కేజీ రొయ్య ఉత్పత్తికి 280/- వరకు ఖర్చు.. ప్రస్తుతం కేజీ వనామి రొయ్య మార్కెట్ ధర 240 ఉండటంతో తాము సాగు ఎలా చేసేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం దిగిరాకుంటే.. చలో అమరావతికి పిలుపునిస్తామని ఆక్వా రైతుల హెచ్చరిస్తున్నారు.ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలం గుండుగొలనులో ఆక్వా రైతుల సమావేశమయ్యారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఆక్వా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2026 ఏఎన్ఎంలకు యాప్ కష్టాలు 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 4130 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి నందిగామకు చెందిన కె.నరసింహారావు కుటుంబం సోమవారం రూ.1,00,100 విరాళం సమర్పించింది. అనంతరం స్వామి వారిని దర్శించుకుంది.గన్నవరం: విమానాశ్రయంలో సోమవారం యాత్రి సువిధా దివస్ ఘనంగా నిర్వహించారు. విమానాశ్రయానికి విచ్చేసిన ప్రయాణికులకు తిలకం దిద్ది ఆత్మీయ స్వాగతం పలికారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ప్రారంభమైందని, ప్రజలు కీలకభాగస్వాములై దీనిని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. దోషరహిత ఓటర్ల జాబితా ఈ కార్యక్రం లక్ష్యమని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సర్లో భాగంగా బీఎల్వోలు ఇంటింటి సందర్శన కీలక దశ ప్రారంభమైందని వెల్లడించారు. ఇంటింటి సర్వేలో భాగంగా జూలై 14వ తేదీ వరకు బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్లు) అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తా రని వివరించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరిగేందుకు అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహించా మని పేర్కొన్నారు. జిల్లాలో 1,792 మంది బీఎల్వోలు ఉన్నారని, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం నింపి తిరిగి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో ఓటర్లకు బీఎల్వోలు సహకరిస్తారన్నారు. ఇంటింటి సర్వే ముగిసిన అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురిస్తామని వివరించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య, ఆరోగ్య శాఖలో క్షేత్ర స్థాయిలో సేవలు అందించే ఏఎన్ఎంలను యంత్రాలుగా మార్చేశారు. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సూచనలు, సలహాలు ఇవ్వాల్సిన వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులకు పరిమితం అయ్యారు. వివిధ ప్రోగ్రామ్ల పేరుతో 36 యాప్ అప్లికేషన్లను వారిపై బలవంతంగా రుద్దారు. ఉన్న సమయం ఆ యాప్లలో సమాచారం నింపేందుకే సరిపోతోంది. ఫలితంగా ఆరోగ్య కార్యక్రమాలు పక్కదారి పడుతున్నాయి. మరో వైపు యాప్లలో సమాచారం అప్లోడ్ చేసేందుకు ఏఎన్ఎంలు తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిమిషం ఖాళీ లేకుండా ఆకలి దప్పులు మరిచి స్మార్ట్ ఫోన్లతో కుస్తీ పడుతూ సమాచారం అప్లోడ్ చేస్తూ సతమతం అవుతున్నారు. నెట్వర్క్ సరిగా లేకున్నా, సర్వర్లు పనిచేయకున్నా యాప్లో సమాచారం నింపేందుకు ఏఎన్ఎంలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఒక్కొక్క సారి సమాచారం మొత్తం నింపినా టెక్నికల్ ఎర్రర్ వచ్చి మొత్తం పోతోంది. దీంతో మొదటి నుంచి మళ్లీ సమాచారం నింపాల్సి వస్తోంది. ఉన్నతాధికారుల నుంచి పదే పదే వచ్చే ఫోన్లకు సమాధానం ఇస్తూ, సమాచారం అప్లోడ్ చేస్తూ నిరంతరం మానసిక వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్యాల బారిన పడుతున్నట్లు పలువురు ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 36 యాప్ల భారం ప్రధానంగా ఏఎన్ఎం ఏపీ హెల్త్ ఆప్లో ఉండే ఆర్సీహెచ్ ప్రోగ్రామ్లో ఎనిమిది యాప్లు ఉంటాయి. వాటిలో చైల్డ్ హెల్త్కు సంబంధించి అనేక అంశాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు ఎన్సీడీ–సీడీ, ఆభ జనరేషన్, ఇమ్యూనైజేషన్, నోటీసెస్, ఎన్ఎల్పీ– ఏపీ, శానిటేషన్, సర్వైలెన్స్, ఎన్డీడీ, సిటిజన్ డెత్ స్టేటస్, వీహెచ్సీ ప్రొఫైల్, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ, హెచ్బీఏ1సీ శాంపిల్ కలెక్షన్ తదితర మొత్తం 36 యాప్లలో వారు సమాచారం నింపాల్సి ఉంటోంది. వారి పరిధిలో గర్భిణులు ఎంత మంది, వారి ప్రసవ తేదీలు ఏమిటి, హైరిస్క్ ప్రెగ్నెంట్లు ఎవరు వంటి అన్ని అంశాలను యాప్లలో అప్లోడ్ చేయాల్సి రావడంతో ఏఎన్ఎంలు సతమతం అవుతున్నారు. ఉన్నతాధికారులతో చీవాట్లు అన్ని రకాల యాప్లలో సమాచారం అప్లోడ్ చేయడంలో సతమతం అవుతున్న ఏఎన్ఎంలకు ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు తప్పడం లేదు. ఏదైనా సమాచారం యాప్లో నమోదు కాకున్నా, టెక్నికల్ సమస్య తలెత్తి సరైన సమయంలో అప్లోడ్ చేయకున్నా ఉన్నతాధికారులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని, చీవాట్లతో విరుచుకుపడుతున్నాని ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయవాడ పరిధిలో సాంకేతిక సమస్య లతో ఫొటోలు అప్లోడ్ కాక ఏకంగా 35 మంది ఏఎన్ఎంలు మెమోలు అందుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వివరిస్తున్నారు. అధికారులిచ్చే టార్గెట్లు పూర్తి చేసేందుకు రాత్రి పది గంటల వరకూ స్మార్ట్ ఫోన్లతో కుస్తీ పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలిగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల సమస్యలపై సత్వరం స్పందించి, వీలైనంత త్వరగా నాణ్యతతో వాటిని పరిష్కరిస్తున్నా మని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రతి అధికారి పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజలకు సంతృప్తికరంగా సేవలు అందించాలని ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సంతృప్త స్థాయి బాగుండాలంటే అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ ద్వారా మొత్తం 201 అర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి అత్యధికంగా 56 అర్జీలు అందాయని పేర్కొన్నారు. పురపాలక శాఖకు సంబంధించి 31 అర్జీలు, పోలీస్ శాఖ 29, పంచాయతీరాజ్ శాఖ 17, డీఆర్డీఏ 10, విద్యుత్ 9, వైద్య–ఆరోగ్యం ఏడు, ప్రజారవాణా ఆరు, ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఈఎస్ ఐదు, కాలుష్య నియంత్రణ నాలుగు, ఎండోమెంట్స్, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో మూడు చొప్పున, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, విద్య, ఉపాధికల్పన, గృహ నిర్మాణం, కార్మిక, మైన్స్ అండ్ జియాలజీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ లో రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. బీసీ సంక్షేమం, సహకార, డ్వామా, మత్స్య, జాతీయ రహదారులు విభాగాలకు ఒకటి చొప్పున వచ్చాయని తెలిపారు.ప్రతి ఇంటికీ వెళ్లి ఏమ్మా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించాల్సిన ఏఎన్ఎంలు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారి యాప్లతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. యాప్లతో ప్రయోజనం ఎంత ఉందో తెలియదు కానీ ఏఎన్ఎంలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏఎన్ఎంలపై యాప్ అప్లికేషన్ల భారం తగ్గిం చాలి. ఈ ఏమేరకు గతంలోనే ఉన్నతాధికారులకు విన్నవించాం. – బి.ఆస్కారావు, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం పటమట(విజయవాడతూర్పు): గంజాయి తరలిస్తూ పట్టుబడిన స్మగ్లర్ పోలీసుల నిర్లక్ష్యంతో స్టేషన్ నుంచి పరార య్యాడు. రాత్రి వేళలో మూత్ర విసర్జనకు బయటకు తీసుకురాగా స్టేషన్ గోడదూకి పారిపోయాడని సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్లో విధులు నిర్వర్తించే సిబ్బందిపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమ వారం కోర్టులో హాజరు పరచాల్సి ఉండటంతో నిందితుడిని గాలింపునకు రెండు బృందాలను ఏర్పాటు చేశారని, ఒకటి కేరళ, మరొకటి ఢిల్లీ పంపారని సమాచారం. వివరాలు ఇవి.. ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున కేరళ మలప్పురం, చెరుకరకు చెందిన మహ్మద్ సోహైల్, ఒడిశాకు చెందిన అనూప్సింగ్, రాజేష్ కుమార్ గుట్టుగా ఒడిశా నుంచి తమిళనాడు కోయంబత్తూరుకు లారీలో గంజాయి తరలిస్తుండగా ఈగల్ టీంకు సమాచారం వచ్చింది. ఈగల్టీం నిడమానూరు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించి సోహైల్ బృందం తరలిస్తున్న 140 కేజీల గంజాయి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసు కుని పటమట పోలీసులకు అప్పగించారు. కేసు విచారణ జరుగుతుండగా నిందితుడు శుక్రవారం రాత్రి స్టేషన్లోని గోడదూకి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీ ఆర్ జిల్లా కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర్బాబు నిందితుడు సోహైల్ గాలింపు కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. -
ప్రైవేట్ ఫీజుల బడిత పూజ
అదే ఇంటర్మీడియెట్కు.. ఇంటర్లో చేరే విద్యార్థికి జేఈఈ అడ్వాన్స్ వంటి అంశాలతో కార్పొరేట్ స్థాయి కళాశాలలో చేర్పిస్తే ఒక్క ఫీజే రూ.1.60 లక్షలుగా ఉంది. మిగిలినవన్ని మామూలే. అంటే సుమారుగా రెండో కుమారుడికి రూ.2.70 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా ఈ ఏడాది కట్టాల్సినవి, ఇతర చిన్నచిన్న ఖర్చులతో సుమారుగా ఐదు లక్షల వరకూ విద్యకోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఒక సాధారణ స్థాయి విద్యాసంస్థకు మాత్రమే. అదే ఇంటర్నేషనల్ పేరుతో ఉన్న విద్యాసంస్థకు ఫీజు ఒక్కటే నాలుగు లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. సాధారణ పాఠశాలల్లో సైతం గత ఏడాది కంటే 20 నుంచి 30 శాతం పెంచి వసూలు చేస్తున్నాయి. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దెబ్బకు తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లల ఉన్న కుటుంబాల్లో చదువు ఖర్చు వారికి తడిసిమోపెడవ్వటంతో దయనీయమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జూన్ నెలలో అప్పులపాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వెయ్యి ప్రైవేట్ విద్యాసంస్థలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా వెయ్యి ప్రైవేట్ విద్యాసంస్థలు కొనసాగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారుగా 3.25 లక్షల వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 510 వరకూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా అందులో సుమారుగా 2.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కృష్ణా జిల్లాలో సుమారుగా 450 వరకూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండగా అందులో సుమారు లక్షల వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థుల సంఖ్య సైతం మరో లక్షన్నర వరకూ ఉంటుంది. ప్రభుత్వం అజమాయిషీ ఏదీ ఫీజుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కూటమి నేతలకు సంబంధించిన విద్యాసంస్థలే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, అవే అత్యఽధికంగా వసూళ్లకు పాల్పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు లక్షల్లో ఫీజు వివరాలను బహిరంగంగా వారి వెబ్సైట్లో పెట్టి మరీ వసూళ్లకు పాల్పడటం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోందని విద్యార్థి సంఘ నేతలు మండి పడుతున్నారు. స్టేషనరీ వ్యాపారంతో భారీ ఆదాయం మరోవైపు ప్రైవేట్ విద్యాసంస్థలు పుస్తకాలు, ఇతర స్టేషనరీ పేరుతో దందా ప్రారంభించాయి. ఫీజులు ఇతర చెల్లింపులు పక్కన పెడితే పుస్తకాలు, యూనిఫామ్, ఇతర స్టేషనరీ అమ్మకాల వ్యాపారం ఆయా విద్యాసంస్థలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ప్రతి విద్యార్థి అదే విద్యాసంస్థలో పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందే. లేదంటే యజమాన్యాలు పాఠశాలలోకి అనుమతించని పరిస్థితులున్నాయి. ఒక్కొక్క విద్యార్థి నుంచి నోటు పుస్తకాలు, టెక్ట్స్ బుక్స్, వర్క్ బుక్స్, ఇతర స్టేషనరీ పేర్లతో ఆయా యాజమాన్యాలు ఐదు వేల నుంచి రూ.25 వేల వరకూ వసూలుకు పాల్పడుతున్నాయి. స్కూల్ యూనిఫామ్, బూట్లు ఇతర వస్తువులతో కలిపి రూ.30 వేల వరకూ కొన్ని విద్యాసంస్థలు విక్రయిస్తుండగా ఈ పుస్తకాలపై సుమారుగా 30 నుంచి 50 శాతం లాభం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నగరంలో కొత్తపేటకు చెందిన చిరుద్యోగి రామారావుకు ఇద్దరు పిల్లలు. ఈ విద్యాసంవత్సరంలో ఒక పిల్లవాడు పదో తరగతికి రాగా మరో కుమారుడు ఇంటర్మీడియెట్కు వచ్చాడు. పదో తరగతి మంచి పాఠశాలలో చేర్పించాలని చూస్తే నగరంలో సాధారణ స్థాయిలో ఉన్న ఒక కార్పొరేట్ పాఠశాలకు రూ.85 వేలు ఫీజు చెప్పారు. దానికి తోడు యూనిఫాం, పుస్తకాలు మరో రూ.25 వేలు, బస్సుకు ఏడాదికి రూ.25 వేలు చెల్లించాలి. హాస్టల్ అయితే సుమారుగా మరో 60 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తుంది. సుమారుగా రెండు లక్షలు చెల్లించాల్సి వస్తోంది. జూనియర్ కళాశాలల్లోనూ అదే తంతు కొనసాగు తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 250 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో మొదటి ఏడాది చేరే విద్యార్థులకు ప్రారంభంలోనే రూ.20 వేలు నుంచి రూ.30 వేలు విలువైన పుస్తకాలు, యూనిఫామ్, ఇతర స్టేషనరీకి అవసరం. ఆ మేరకు రెండుమూడు దఫాలుగా వాటిని వసూలు చేస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే మీకు అడ్మిషన్ లేదు వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు చదవాలంటే చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నీళ్లపై విద్యావ్యాపారం భారీగా పెరిగిన ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులు పుస్తకాలు, స్టేషనరీ పేరుతో వ్యాపారం విలవిలలాడుతున్న తల్లిదండ్రులు పట్టించుకోని పాలకులు -
రక్తదానం ప్రాణదానంతో సమానం
పామర్రు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ నరేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూఎన్వో మిండా లిమిటెడ్, జోయాలూక్కాస్, కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్, ముత్తూట్ ఫైనాన్స్, అడెక్కో ఇండియా లిమిటెడ్, వరుణ్ మోటార్స్, అపోలో ఫార్మసీ, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్, మోహన్ స్పింటెక్స్, పేటీఎం సర్వీసెస్ వంటి 10కి పైగా ప్రముఖ కంపెనీల పాల్గొంటాయని వివరించారు. టెన్త్, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీ ఫార్మసీ, పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని పేర్కొన్నారు. అర్హులు ముందుగా హెచ్టీటీపీఎస్://ఎన్ఏఐపీయుఎన్వైఏఎం.ఏపీ.జీవోవీ.ఐఎన్ వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు): యూరో– ఆంకాలజీ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న విప్లవాత్మక వైద్య, సాంకేతిక పరిణామాలు క్యాన్సర్ చికిత్సల్లో నూతన మార్పులకు దారి తీస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. మూత్రపిండాలు, ప్రొస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, ఆధారబద్ధమైన వైద్య నిర్ణయాలు, క్లిష్ట శస్త్రచికిత్స నైపుణ్యాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో ‘యూరో–ఆంకాలజీ సింప్లిఫైడ్ – 2026’ పేరుతో రాష్ట్రస్థాయి శాసీ్త్రయ సదస్సు విజయవాడలో ఆదివారం జరిగింది. సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సోగస్–ఏపీ) ఆధ్వర్యంలో, విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ (వేగస్) సహకారంతో జరిగిన ఈ సదస్సుకు 200 మందికి పైగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, యువ వైద్యులు, పీజీ విద్యార్థులు హాజరై యూరో–ఆంకాలజీ రంగంలో తాజా వైద్య విధానాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సులో ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.వి.కృష్ణకిషోర్, వేగస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.శ్రీమన్నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.ప్రియతమ్, డాక్టర్ ధీరజ్, పేట్రాన్ డాక్టర్ కె.ప్రశాంత్కుమార్ విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. -
డీఎంఓ vs ఏఎన్ఎంలు!
● విజయవాడలో 35 మంది ఏఎన్ఎంలకు మెమోలు ● వైద్యాధికారి తీరుపై మండిపడుతున్న వైద్య ఉద్యోగులు లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా మలేరియా అధికారి ఇప్పుడు వైద్యశాఖలో వివాదస్పదంగా మారారు. ఆయనకు సంబంధం లేని ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం సమస్యగా మారింది. సాంకేతిక కారణంతో ఫొటోలు యాప్లో అప్లోడ్ కావడం లేదని చెప్పినా ఏకంగా నగరంలోని 35 మంది ఏఎన్ఎంలకు మెమోలు జారీ చేశారు. దీనిపై ఏఎన్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. వైద్యశాఖ ఉద్యోగులు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటిస్తుంటారు. అందులో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, అక్కడ ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఇటీవల డ్రైడే ఫ్రైడే రోజు యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆ ఫొటోలు కొన్ని.. ఉన్నతాధికారులకు కనిపించలేదు. దీంతో ఫ్రైడే డ్రైడే సక్రమంగా నిర్వహించలేదంటూ నోడల్ పర్సన్స్, సీహెచ్ఓలు, ఎంపీహెచ్ఓలు, పీహె చ్ఎన్, ఎంపీహెచ్ఎస్, ఎంపీహెచ్ఏ, ఆరోగ్య కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీఎంఓ రాజు నాయక్ డీఎంహెచ్ఓకు లేఖ పెట్టారు. ఏకంగా 35 మందికి మెమోలు జిల్లా మలేరియా అధికారి సూచన మేరకు ఇన్చార్జి డీఎంహెచ్ఓ ఇందుమతీదేవి ఏకంగా 35 మందికి మెమోలు ఇచ్చారు. రెండు రోజుల్లో డీఎంఓ కార్యాలయంలో వివరణ ఇవ్వాలంటూ పేర్కొనడంతో ఏఎన్ఎంలు మండిపడుతున్నారు. అలాగే ఫీల్డ్ విజిట్ సమయంలో డీఎంఓ తీరును ఏఎన్ఎంలు ఖండిస్తున్నారు. ఆయన వేధింపులకు ‘సెంట్రల్’లోని ఓ ఏఎన్ఎం కన్నీరు పెట్టుకున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీకి వెళ్లిన సమయంలో అక్కడ వైద్యుడు లేక పోవడంతో అతడిని డీఎంఓ కామెంట్ చేసినట్లు తెలిసింది. ఆ పీహెచ్సీ వైద్యుడు జిల్లాలో కీలకమైన ప్రోగ్రామ్ అధికారిగా పని చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో ఆ తర్వాత ఉన్నతాధికారులు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఇలా అనవసరమైన విషయాల్లో డీఎంఓ జోక్యం పెరగడంతో వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల కాలం వస్తోందని, దోమల నివారణపై వారి సిబ్బందితో పనిచేయించాలేగానీ, సంబంధం లేని వారిపై పెత్తనం అంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. -
సాగుకు ఇబ్బందులే
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం పెరుగుతోంది, ఖరీఫ్ సీజన్పై ఆశలు పెట్టుకున్న రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పొలాలు దున్నడం.. నారుమడి ఏర్పాట్లు.. విత్తనాల సేకరణ వంటి పనుల్లో రైతులు నిమగ్నమవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ బాగా సాగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగు నీటి విడుదల జాప్యమవుతోంది. సాక్షి ప్రతినిధి,విజయవాడ: తొలకరి పులకింతతో వ్యవసాయ సందడి మొదలైంది. రెండు రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతన్న మోములో కొత్త ఆశలను చిగురింప జేస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జిల్లాలో ఖరీఫ్ సాగు పనులు ఊపందుకొంటున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో మునేరుతోపాటు, వాగుల నుంచి నీరు ప్రకాశం బ్యారేజికి చేరుతోంది. అక్కడ 12 అడుగులకు పైగా నీరు చేరుకుంది. దీంతో బ్యారేజి నాలుగు గేట్లు, ఒక అడుగు మేర ఎత్తి 2,900 క్యూస్కెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తాగునీటి కోసం బందరుకాలువకు 300 క్యూసెక్కులు, రైవస్ కాలువకు 1500, కేఈబీ కాలువకు 303 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి వరద నీరు వచ్చి చేరడంతోపాటు, పులిచింతల ప్రాజెక్టులో సైతం 32 టీఎంసీల నీరు ఉంది. ఎలినినో ప్రభావం ఉందని ఆందోళన చెందుతున్న రైతులకు ఊరట నిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పొలాల్లో దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 2.65 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధానంగా వరి పంట 1.22 లక్షల ఎకరాలు, ప్రత్తి 85,142 ఎకరాలు, మొక్క జొన్న 9,312 ఎకరాలు, కంది,పెసర, మినుము పంటలు 17 717.5 ఎకరాలు, మిరప పంట 29, 157.5 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ప్రత్తి పంట సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. మొక్క జొన్న కంది, మినుము, పెసర పంటలను ప్రస్తుతం రైతులు సాగు చేయనున్నారు. రైతులకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, రైతులకు అవసరమైన స్థాయిలో వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగుకు రైతుల సన్నాహాలు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు .. ప్రకాశం బ్యారేజికి చేరుతున్న నీరు ఇప్పటికే తాగునీటిని విడుదల చేసిన అధికారులు సాగునీటి విడుదలలో జాప్యం సాగుకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. జూన్ నెల వచ్చినా ఇంకా కాలువలకు నీళ్లు వదల్లేదు. బోర్లు కింద నారుమడులు పోసుకుంటున్నాం. వరి నాట్లు వేసుకోవాలంటే కాలువ నీరు కూడా అవసరం. గత వైఎస్సార్ సీపీ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు. ఈ సారేమో ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు. –కొండవీటి వెంకట సుబ్బారావు, రైతు, మంతెన, కంకిపాడు మండలం కృష్ణా జిల్లాలో తొలకరి చినుకులు, ప్రకాశం బ్యారేజికి నీరు చేరుతుండటంతో రైతులు బోర్ల కింద నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. కొంత మంది రైతులు వెద పద్ధతిలో సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీరణం 4,15,185 ఎకరాలు. ఇందులో ప్రధానంగా వరి పంట సాగు విస్తీర్ణం 4,05, 307.5 ఎకరాలు. మినుము 3,350 ఎకరాలు, చెరుకు 2907.5 ఎకరాలు, వేరుశెనగ 1,625 ఎకరాలు, ప్రత్తి పంట 1,142.5 ఎకరాలు, ఇతర పంటల 837.5 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సాగునీరు విడుదల చేయగానే పెనమలూరు, గుడివాడ, పామర్రు, గన్నవరం ప్రాంతాల్లో వరిసాగు చేస్తారు. చివరి ఆయకట్టు ప్రాంతాలైన అవనిగడ్డ, పెడన , మచిలీపట్నంలో కొంత ఆలస్యంగా వరి పంటను సాగు చేయనున్నారు. ముందుగా పంట సాగు చేస్తే డిసెంబరులో వచ్చే తుఫానుల బారి నుంచి పంట కాపాడుకోవచ్చని రైతుల భావన. -
యోగాతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం
మధురానగర్(విజయవాడసెంట్రల్): యోగాభ్యాసంతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా ఆదివారం నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో విద్యాశాఖ, వీఎంసీ ఆధ్వర్యాన విద్యార్థుల థీమ్తో ప్రత్యేక యోగాభ్యాసన జరిగింది. కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రొటో కాల్ను అభ్యసించారు. కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఒక ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో యోగాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారన్నారు. యోగాంధ్రతో ఆరోగ్యకర సమాజ నిర్మాణమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. డీఈవో చంద్రకళ మాట్లాడుతూ యోగాతో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరోగ్యం మరింత మెరుగవుతుందని, ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని, రోగనిరోధక శక్తి పెరిగి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందనీ తెలియజేశారు, కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఆర్. రమేష్ బాబు, డీవైఈవో డి.సాంబశివరావు, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32.9640 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్ ఎస్ జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో భక్తజన కోలాహలం నెలకొంది. ఆదివారం, అమావాస్య కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గమ్మను సందర్శించుకున్నారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటం
● యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్కుమార్ ● జూలై 15న నిరాహార దీక్ష వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో జూలై 15వ తేదీ వరకూ వివిధ రూపాల్లో పోరాటం చేయనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్కుమార్ తెలిపారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ రాష్ట్ర కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. మనోహర్కుమార్ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ టెట్ అర్హత సాధించాల్సిందేనన్నారు. 2028 ఆగస్టు 31 తేదీ వరకు టెట్ అర్హత సాధించడానికి అవకాశం ఇస్తామని తెలిపిందన్నారు. ఉపాధ్యాయుల ఆందోళన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కేంద్రప్రభుత్వంతో మాట్లాడి విద్యాహక్కు చట్టం 23(1)లో సవరణకు ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక టెట్కు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక టెట్కు నోటిఫికేషన్ విడుదల చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ విద్యా హక్కు చట్ట సవరణకు, ప్రత్యేక టెట్ నిర్వహణ కోసం ఆందోళన కార్యాచరణను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జూన్ 13 నుంచి 16 వరకు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, జూన్ 30వ తేదీ ఒకరోజు మండల కేంద్రాల్లో నిరసన దీక్ష, జూలై రెండవ తేదీ జిల్లా స్థాయిలో ఒకరోజు నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. జూలై 15 రాష్ట్రస్థాయి నిరాహార దీక్ష చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుందరయ్య, సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య, సహాధ్యక్షురాలు పి.భవాని తదితరులు పాల్గొన్నారు. -
5న రూట్స్ అవార్డులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఏటా అందించే రూట్స్ హెల్త్ ఫౌండేషన్ 13వ వార్షిక అవార్డులను జూలై 5వ తేదీన అందజేయనున్నట్లు ఎంపిక కమిటీ చైర్మన్, ఎస్ఎల్వీ బిల్డర్స్ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. ఈ ఏడాది జీవిత సాఫల్య పురస్కారానికి జనరల్ సర్జన్ డాక్టర్ ఘట్టమనేని లక్ష్మీప్రసాద్ను ఎంపిక చేసినట్లు తెలిపారు. రూట్స్ అవార్డులకు సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పీఎస్ఎన్మూర్తి, మధుమేహ నిపుణులు డాక్టర్ కొండా వేణుగోపాలరెడ్డి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కోడే ప్రభాదేవి, సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ కేశవరావు బాబు, బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ గాజుల రమేష్, జిరియాట్రిక్ కేర్ నిపుణులు డాక్టర్ అక్కినేని మణి, యువ వైద్యుల విభాగంలో గుంటూరుకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పొట్ల శివయ్య, పల్మోనాలజిస్ట్ డాక్టర్ కంచర్ల అనీల్లను అవార్డులు అందజేస్తామన్నారు. అదే విధంగా ఆయుర్వేదిక్ ఫిజీషియన్ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, ఉత్తమ సేవా విభాగంలో తేజలాల్ సోలాంకిని ఎంపిక చేశామని చెప్పారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పీవీఎస్ భాస్కర్, సంజయ్ పాల్గొన్నారు. -
దంపతుల మృతి.. మాగల్లులో విషాదం
● క్యాన్సర్ బారిన పడిన భార్య ● ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనోవేదన ● భార్యాభర్తల ఆత్మహత్య నందిగామ రూరల్: క్యాన్సర్ వ్యాధి ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్యాన్సర్ బారిన పడిన భార్యకు వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మాగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావు (52) వ్యవసాయంతో పాటు గ్రామంలోనే ఎరువులు, పురుగు మందుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శైలజ (48) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమెను పలు హాస్పిటల్స్లో వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఏకై క కుమారుడు వినోద్ను ఉన్నత చదువుల నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్లో యూకే వెళ్లాడు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో దంపతుల మాటల మధ్యన మెరుగైన వైద్యం చేయించాలని భార్య కోరింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలిసిన శ్రీనివాసరావు మనస్తాపం చెంది గడ్డి మందు తాగడంతో గమనించిన భార్య భార్య శైలజ సైతం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దంపతుల పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు బంధువులకు సమాచారం అందించగా హుటాహుటినా వారిని విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శ్రీనివాసరావు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందగా శైలజ శనివారం మృతి చెందారు. ఎంతో కలివిడిగా ఉండే భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను తెలిపారు. జి.కొండూరు: విద్యుత్ స్తంభంపై సర్వీస్ వైర్ సరి చేస్తుండగా వ్యక్తి మృతి చెందిన ఘటన జి.కొండూరు మండల పరిధి గంగినేని గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన తాటిమట్ల వెంకటకృష్ణారావు(49) కేబుల్ ఆపరేటర్ వద్ద టెక్నీషియన్గా పని చేస్తూ విద్యుత్ పరికరాలు సైతం రిపేర్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో గంగినేని సహకార సొసైటీకి విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో సొసైటీకి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపై సర్వీసు వైర్ను సరి చేసేందుకు శనివారం మధ్యాహ్న సమయంలో స్తంభం పైకి ఎక్కాడు. విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా స్తంభం ఎక్కడంతో స్తంభం పైన ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. వెంకటకృష్ణారావు విద్యుత్ స్తంభం పైకి ఎక్కే సమయంలో సొసైటీ సంఘం పెద్దలు అక్కడే ఉన్నారని, విద్యుత్ షాక్ తగిలి మృతి చెందగానే అక్కడి నుంచి వెళ్లి పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు సహకార సొసైటీ పెద్దలను నిలదీయగా తమకేమీ సంబంధం లేదని, వారు బుకాయించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ పెద్దలు తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని కదిలించేదిలేదని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని మద్దతుగా నిలిచారు. ఎట్టకేలకు సొసైటీ సభ్యుల హామీతో వారు ఆందోళనను విరమించారు. శ్రీనివాసరావు (ఫైల్) శైలజ (ఫైల్) -
ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో శనివారం భవానీపురంలోని బెరంపార్క్, పున్నమి హోటల్ వద్ద ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ లక్ష్మీశ, ఆయుష్ డైరెక్టర్ గోపాలకృష్ణ రోణంకి, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒక వైపు యోగాంధ్రతో శరీరాన్ని.. మనసును ఆరోగ్యంగా ఉంచుకుంటూ మరో వైపు ఆపరేషన్ క్లీన్ స్వీప్తో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులు కేవలం పనివారు కాదని, దైవసమానులని కొనియాడారు. ఎండైనా.. వర్షమైనా లెక్క చేయకుండా అనుకూల, ప్రతికూల వాతావరణంలో నగరాన్ని శుభ్రపరుస్తూ ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచడంలో వారు నిర్వహిస్తున్న విధులు అనిర్వచనీయమని పేర్కొన్నారు. నాలుగు వారాలుగా వేర్వేరు అంశాలతో.. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ.. గత నాలుగు వారాలుగా ఒక్కో వారం ఒక్కో అంశంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మొదటి వారం రెడ్ స్పాట్, ఎల్లో స్పాట్ విజిబుల్తో, రెండో వారం స్ట్రాం వాటర్ డ్రెయిన్స్ కాలువల డీసిల్టింగ్, మూడో వారం బల్క్ వేస్ట్ జనరేటర్లకు ఒక ప్రత్యేకమైన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించడమే కాకుండా నాలుగు రంగుల చెత్త బుట్టల వినియోగంపై వివిధ ఎన్జీవోలు, స్వచ్చంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కల్పించామని చెప్పారు. ఈ వారం అంశంగా గార్బేజ్, పబ్లిక్ టాయిలెట్స్ను తీసుకుని నగరంలోని మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వాటిని పరిశుభ్రంగా నిర్వహించుకోవడమే కాకుండా ప్రజలుకూడా తమ ఇళ్లల్లోని మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడమే కాకుండా అక్కడున్న వ్యర్థాలను తీసివేసి శుభ్రం చేశారు. కార్యక్రమంలో వీఎంసీ అదనపు కమిషనర్లు డాక్టర్ డి.చంద్రశేఖర్, శకుంతల, జోనల్ కమిషనర్ కె.షమ్మి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, పర్యవేక్షణ ఇంజినీర్ చంద్రశేఖర్, ఈఈ జె.శ్రీనివాస్, ఏఎంఓహెచ్ డాక్టర్ అన్నపూర్ణ, బీఏఎస్ డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీశ -
రెండు కార్లు ఢీ.. మహిళలకు గాయాలు
పెనమలూరు: తాడిగడప గ్రామంలో రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు కావడంతో పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం తాడిగడపకు చెందిన విమల అనే మహిళ తన తల్లితో కలిసి కారులో పోరంకికి బయలుదేరింది. కారు క్వాలిటీ ఐస్క్రీమ్ వద్దకు రాగా ఎదురుగా వచ్చిన మరో కారు వీరి కారును ఢీ కొట్టింది. దీంతో వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న విమల చేయి విరగ్గా, ఆమె తల్లికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలం
గన్నవరం: వ్యవసాయ, పారిశ్రామిక కార్మికులు, కౌలుదారుల ఐక్య పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలమని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు చెప్పారు. మండల కేంద్రమైన ఉంగుటూరులోని మానికొండ సూర్యావతి శ్రామిక భవనంలో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం 3వ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుల పోరాటాలకు ఉంగుటూరు పుట్టినిల్లు వంటిదన్నారు. వ్యవసాయ కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలి..కామ్రేడ్ అట్లూరి శ్రీమన్నారాయణ నాయకత్వంలో కూలీ రెట్లు పెంపు కోసం పోరాటాలు చేసిన ఘన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభను ఉంగుటూరులో నిర్వహించడం అప్పటి పోరాటాలను గుర్తుచేస్తుందన్నారు. ప్రపంచంలో ఎర్రజెండా లేకుండా ఏ పోరాటం విజయవంతం కాలేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వీ వెంకటేశ్వర్లు తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటంతో 2005లో వచ్చిన ఉపాధి హామీ చట్టం పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ పథకం అమలులో రూ.300 కోట్లు బకాయిలను కార్మికులు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిల కోసం వ్యవసాయ కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తొలుత సంఘం సీని యర్ నాయకులు పిల్లి రాజారావు ఎర్రజెండాను ఎగురవేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్ళం వెంకటేశ్వరరావు, కార్యదర్శి బేతా శ్రీనివాసరావు, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీవీ లక్ష్మణస్వామి, రంగారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం సౌహర్ధ, సంఘ నేతలు పి.పవన్కుమార్, శీలం నారాయణ, మహమ్మద్ అబ్దుల్బారి, సునీత పాల్గొన్నారు. -
దుర్గమ్మకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కడప చిన్న చౌక్కు చెందిన కె. గోపిరెడ్డి కుటుంబం అయ్య వరమ్మ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడుకు చెందిన వై.కనకదుర్గ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,01,116ల విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన గోగినేని సావిత్రి కుటుంబం మౌత్విక, మోహినిష్సాయి పేరిట రూ.లక్ష విరాళం అందజేసింది. పీహెచ్సీల్లో మాతృ సంరక్షణ చర్యలు చేపట్టాలి పెనమలూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాతృ సంరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి.యుగంధర్ ఆదేశించారు. ఆయన శనివారం పెనమలూరు పీహెచ్సీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ.. పీహెచ్సీల్లో మాతృ సంరక్షణ చేపట్టాలని సూచించారు. ఈ సేవల్లో నిర్లక్ష్యం తగదన్నారు. సాధారణ కాన్పులు పెంచటానికి ఏఎన్ఎంలకు, ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. డయేరియా, డెంగీ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్స్ పోలియోపై యాక్షన్ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. పీహెచ్సీలో ఉన్న బ్లాక్ హెల్త్ యూనిట్ను ప్రారంభించటానికి చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ యుగంధర్ ఆదేశించారు. ‘బ్లాక్ హెల్త్ పబ్లిక్ యూనిట్కు గ్రహణం’ శీర్షికన ఈ నెల 10వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. యూనిట్లో అన్నిరకాలు పరికరాలు సమకూర్చి మెక్రో బయోలజీ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రరంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాయిలలిత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏపీఐఎంఎస్ఈఏ విజయవాడ రీజనల్ కమిటీ ఎన్నిక కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీఐఎంఎస్ఈఏ) విజయవాడ రీజనల్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నగరంలో శనివారం జరిగిన అసో సియేషన్ సమావేశంలో ఈ కమిటీని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్గా డాక్టర్ ఆర్.ప్రవీణ్కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సి.సిద్దావలి, సెక్రటరీ ఎస్.మురళీ, జాయింట్ సెక్రటరీగా వి.చలపతిరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి.మంగతాయారు, ఆర్.నల్లయ్య, బేతపూడి రాము, జి. రాజేష్, బి.నాగరాజు, వి.మోహనరావు, ఎన్.ఆంజనేయులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.శేషగిరిరావు, స్టేట్ సెక్రటరీ వి.సురేష్కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్.గిరిధర్ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. రేపు యాత్రి సౌకర్య దివస్ గన్నవరం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) 12 ఏళ్ల ప్రగతి, విజయాలను పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన ‘యాత్రి సౌకర్య దివస్’ నిర్వహించనున్నట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంత్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, ప్రయాణి కుల సౌకర్యాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే పలు కార్యక్రమాలు చేపట్టను న్నట్లు పేర్కొన్నారు. 12 ఏళ్లలో విమానాశ్రయం గణనీయమైన వృద్ధిని సాధించి దేశీయ విమాన రంగంలో కీలక కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. 2014–15లో రూ.5.98 కోట్లు ఉన్న ఎయిర్పోర్ట్ వార్షిక ఆదాయం ప్రస్తుతం రూ.87.97 కోట్లకు చేరిందని, ప్రయాణికుల సంఖ్య 2.33 లక్షల నుంచి 14.11 లక్షలకు పెరిగిందని వివరించారు. అంతర్జాతీయంగా షార్జా, సింగపూర్కు విమాన సర్వీస్లు నడుస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం రూ.791.59 కోట్లతో 51,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నూతన ఏటీసీ టవర్, టెక్నికల్ బ్లాక్ నిర్మాణం పూర్తికావడంతో పాటు డీజీ యాత్ర, వైఫై, ఫ్టాస్టాగ్ ఆధారిత పార్కింగ్, ఉడాన్ యాత్రి కేఫ్ వంటి సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మరింత అవగాహన పెరగాలి
ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాల్సి ఉంది. 18 నుంచి 60 ఏళ్ల ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేద రోగులకు అవసరమైన రక్తాన్ని వీలైనంత మేరకు అందించగలుగుతున్నాం. ప్రైవేటు బ్లడ్ బ్యాంకు నుంచి మాకు రావాల్సిన 30 శాతం యూనిట్లు పూర్తిస్థాయిలో రావడం లేదు. అవికూడా వస్తే రోగులకు మరింత బ్లడ్ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. మా బ్లడ్బ్యాంకు నుంచి ప్రసూతి విబాగానికి అత్యధికంగా యూనిట్లు కేటాయిస్తున్నాం. – డాక్టర్ ఎం.అనిత, బ్లడ్ బ్యాంకు ఇన్చార్జి, జీజీహెచ్ -
రక్తదాత.. స్ఫూర్తిప్రదాత
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్య విజ్ఞాన రంగం ఎంతగా అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఒక వ్యక్తి సహృదయంతో ముందుకొచ్చి దానం చేస్తే కానీ రక్తం దొరకని పరిస్థితి. దీనిని దృష్టిలో ఉంచుకుని రక్తదానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జూన్ 14న అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రజల్లో ఎంత అవగాహన పెరిగినా ఏదో ఒక అవరోధం వస్తూనే ఉంది. ప్రస్తుతం రక్తదానం చేయాలంటే అభ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)లో రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన ఉండటంతో చాలా మందికి సాధ్యం కావడం లేదు. జీజీహెచ్లో 15 వేల యూనిట్లు అవసరం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులు ఏటా పెరుగుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగా రక్తం అవసరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 15 వేల యూనిట్ల వరకూ రక్తం అవసరం. 90 శాతం వరకూ స్థానికంగా ఉన్న బ్లడ్ బ్యాంక్ నుంచి అందిస్తున్నారు. ఏదైనా అరుదైన గ్రూపు అవసరమైనప్పుడు రోగికి కావాల్సిన రక్తం అందుబాటులో లేనప్పుడు బయట బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. అత్యధికంగా రక్తం యూనిట్లు ప్రసూతి విభాగానికి కేటాయిస్తున్నారు. ప్రతి నెలా 300 నుంచి 350 యూనిట్లు వరకూ ఆ విభాగానికే ఇస్తున్నారు. ప్రసవం కోసం వచ్చే వారిలో హిమోగ్లోబిన్ స్థాయిలు అత్యంత తక్కువగా ఉంటుండటంతో ఎక్కువ యూనిట్లు అవసరం అవుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఆ తర్వాత జనరల్ సర్జరీ, మెడిసిన్, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్ విభాగాలకు ప్రతి నెలా 100 యూనిట్లు వరకూ కేటాయిస్తున్నారు థలసీమియా చిన్నారులకూ.. ప్రభుత్వాస్పత్రిలోని పిడియాట్రిక్ విభాగానికి వచ్చే థలసీమియా చిన్నారులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో 2020లో 19 మంది, 2021లో 11 మంది, 2022లో 9 మంది, 2023లో 20 మంది, 2024లో 30 మంది, 2025లో 26 మంది, 2026లో 15 మంది థలసీమియా చిన్నారులు జీజీహెచ్లో రిజిస్టర్ అయ్యారు. వారికి అవసరమైన రక్తాన్ని ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకు నుంచి అందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి బ్లడ్ బ్యాంకులో స్వచ్చంధ రక్తదాతలు, రీప్లేస్మెంట్, క్యాంపుల నిర్వహణ ద్వారా రక్తాన్ని సేకరిస్తుంటారు. అలా జీజీహెచ్లోని మదర్ బ్లడ్ బ్యాంకులో సేకరించిన రక్తాన్ని ఇక్కడ అవసరమైనన్ని యూనిట్లు వినియోగిస్తూ, అనుబంధంగా ఉన్న పాత ప్రభుత్వాస్పత్రి, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరంలలోని స్టోరేజ్ యూనిట్లు రక్తాన్ని అందిస్తున్నారు. ఐదేళ్లలో జీజీహెచ్ బ్లడ్ బ్యాంకు నుంచి సేకరించిన యూనిట్లు ఇలా... -
రక్తదాన ట్రస్ట్ ద్వారా సాయం
నేను 2009లో హైదరాబాద్లో తలసేమియా చిన్నారులు రక్తం అందక పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయా. వివేకానంద యూత్ ట్రస్టు ఏర్పాటు చేసి ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులను చేర్చుకుని అవసరమైన వారికి రక్త దానం చేస్తున్నాం. గుండె శస్త్ర చికిత్సలు, ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసరమైతే ఎవరు ఫోన్ చేసినా మా సభ్యులు వెళ్లి రక్తం దానం చేస్తారు. నాది బీ పాజిటివ్. ఇప్పటికి 36 సార్లు రక్తదానం చేశా. మా ట్రస్టులో 5 వేల మంది వలంటీర్లు ఉన్నారు. ఈ 16 ఏళ్లల్లో 8 వేల యూనిట్లు వరకు రక్తదానం చేశారు. –డాక్టర్ కృష్ణ ప్రసన్న వైట్ల, అధ్యక్షుడు, వివేకానంద యూత్ ట్రస్టు -
ఇంధనం.. కోసం బారులు
ఆటో బండి నడవాలంటే ఇంధనం కావాలి. బండి నడిస్తేనే జేబులోకి నాలుగు రూపాయలు వచ్చేది. డబ్బులు వస్తేనే కుటుంబానికి రోజు గడుస్తుంది. సీఎన్జీ ఆటోలో ఇంధనం నింపాలంటే గంట పాటు వేచిచూడక తప్పదు. గంటపాటు ఇంధనం కోసమే ఎదురుచూసి, ఆపై ప్రయాణికుల కోసం పడిగాపులు కాయక తప్పడంలేదని ఆటో వాలాలు వాపోతున్నారు. విజయవాడ గాంధీనగర్లో ఉన్న జిల్లా సబ్జైలు సమీపంలోని బంక్ వద్ద సీఎన్జీ కోసం ఎదురుచూస్తున్న ఆటోలను ఈ చిత్రంలో చూడొచ్చు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ట్రిపుల్ఐటీ ప్రవేశాల జాబితా విడుదల
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యాసంవత్సరం అడ్మిషన్లలో భాగంగా ఎంపికై న అభ్యర్థుల జాబితాను ఆర్జీయూకేటీ వర్గాలు శనివారం విడుదల చేశాయి. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా నుంచి 366 మంది ఎంపికయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అత్యల్పంగా నలుగురు మాత్రమే ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా నుంచి 119 మంది, ఎన్టీఆర్ జిల్లా నుంచి 66 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. డాక్టర్ కేవీఎల్ఎన్ శర్మకు మహా నంది పురస్కారం భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ అయోధ్యనగర్కు చెందిన ప్రముఖ రచయిత, పద్య నాటక కళాకారుడు డాక్టర్ కంచర్ల వేంకటలక్ష్మీనరసింహ శర్మ (కేవీఎల్ఎన్ శర్మ)కు నంది పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు వెలుగు సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో శనివారం వరంగల్ టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన తెలుగు వెలుగు పురస్కారాల మహోత్సవంలో డాక్టర్ శర్మను సత్క రించి మహా నంది పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘లవంగి’ పుస్తకానికిగాను 2017లో ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్, ‘జగన్నాథ పండిత రాయలు’ పుస్తకానికిగాను అదే సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీ మరో డాక్టరేట్ ప్రదానం చేయడం ఆయన సాహిత్య ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. డాక్టర్ శర్మకు మహా నంది పురస్కారం లభించడంపట్ల పలువురు సాహితీవేత్తలు అభినందించారు. -
భక్తుల సౌకర్యార్థం కూలింగ్ వాటర్ప్లాంట్
మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూలింగ్ వాటర్ ప్లాంట్ను ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ గతంలో ఉన్న కూలింగ్ వాటర్ ప్లాంట్ భక్తుల అవసరాలకు సరిపోకపోవడంతో అదనంగా మరో కూలింగ్ వాటర్ ప్లాంట ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం యోగాసనాలను ప్రారంభించారు. అ ఈనెల 21వ తేదీ వరకు యోగాసనాలు జరుగుతాయని వివరించారు. -
రంగులతో ఏమార్చారు
ప్రస్తుత ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ 20 ఏళ్లు అధికారంలో ఉన్నారు. మేమున్నది ఐదేళ్లు. అందులో రెండేళ్లు కరోనా కాలం. మా హయాంలో అక్విడెక్టు శిథిలావస్థకు చేరిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన అక్విడెక్టుకు చేసిందేమిటి? రూ.కోటికి పైగా నిధులు మంజూరైతే రంగులు వేయించి రక్షణ చర్యలు చేశామని చెప్పడానికి సిగ్గుండాలి. – సింహాద్రి రమేష్బాబు, మాజీ ఎమ్మెల్యే, అవనిగడ్డ అవనిగడ్డ: దివి సీమకు జీవనాడి అయిన అక్విడెక్టుకు ప్రమాదం పొంచివుంది. లీకులను అరికట్టే చర్యలు చేయకుండా రెయిలింగ్ కోసం రూ.లక్షలు ఖర్చుపెట్టారు. కాలువ తొట్టె భద్రతకు చర్యలు చేపట్టకుండా రెయిలింగ్కు రంగులు వేసి ౖపైపె మెరుగులు దిద్దడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ జేబులు నింపడానికి తప్ప రైతులకు ఒనగూరే ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దివిసీమ రైతులకు సాగు, ప్రజల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారం పులిగడ్డ అక్విడెక్టు. అక్విడెక్టు పంట కాలువల ద్వారా అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలా ల్లోని 70 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 1.25 లక్షల జనాభా దాహార్తి తీరుతుంది. 1936లో ఒకతొట్టెతో కలిపి అక్విడెక్టును నిర్మించగా, 1977లో రెండో తొట్టెతో పంటకాలువను విస్తరించారు. లీకేజీ నివారణ చర్యలేవీ? ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ పంట కాలువలకు లీకులు కాకుండా కొబ్బరినార, తారుతో మరమ్మతులు చేస్తారు. గత ఏడాది అక్విడెక్టు నిర్వహణలో భాగంగా నాలుగు పనుల కోసం రూ.110.05 లక్షలు ఎస్డీఎంఎఫ్ (స్టేట్ డిజాస్టర్ మీటిగేషన్ ఫండ్) నిధులు మంజూరయ్యాయి. ఇన్ని నిధులు వచ్చినా పంటకాలువ తొట్టె జాయింట్ల వద్ద లీకులు తలెత్తకుండా ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. రెండు రోజుల క్రితం అక్విడెక్టుకు నీరు వదలగా పంటకాలువ తొట్టెలో ప్రతి జాయింట్ వద్ద లీకేజీ ఏర్పడి నదిలోకి నీరు కారుతోంది. అక్విడెక్టు రహదారి వైపు ఫిల్లర్ల పైనుంచి లీకై నీరు కారుతోంది. లీకులు పెరిగితే పంటకాలువ తొట్టె దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే దివిసీమకు సాగునీటి సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. రాకపోకలు లేని రెయిలింగ్ కోసం రూ.లక్షలు అక్విడెక్టుపై రాకపోకలు సాగించే సమయంలో ప్రయాణి రక్షణ కోసం ఇరువైపులా ఇనుప రాడ్లతో రెయిలింగ్ ఏర్పాటు చేశారు. 2008లో అక్విడెక్టుకు కూతవేటు దూరంలో కొత్తగా హైలెవల్ వంతెన నిర్మించారు. అప్పటి నుంచి అక్విడెక్టుపై రాకపోకలను నిషేధించారు. పాత రెయిలింగ్ అక్కడక్కడ దెబ్బతినగా వాటికి మరమ్మతులతో సరిపెట్టాల్సింది పోయి వాటి స్థానంలో కొత్త రెయిలింగ్, పెయింట్ కోసం రూ.లక్షలు ఖర్చు పెట్టడం వల్ల ప్రయోజం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంటకాలువ తొట్టె జాయింట్ల వద్ద పెచ్చులూడి పడిపోతున్నా వాటికి కనీసం మరమ్మతులు చేయలేదు. చాంబర్ల మరమ్మతులపైనా అనుమానాలు అక్విడెక్టుకు మొత్తం 36 ఫిల్లర్లు ఉన్నాయి. ఫిల్లర్ విడచి ఫిల్లర్కు చాంబర్లు ఉన్నాయి. రహదారిపై వాహనాలు వచ్చేటప్పుడు, వరదల సమయంలో ఒత్తిడిని నివారించేందుకు వీటిలో ప్రత్యేక స్ప్రింగ్లు అమర్చారు. వీటికి ప్రతి రెండేళ్లకోసారి గ్రీజు పెడుతుంటారు. గత ఏడాది మంజూరైన నిధులతో వీటికి మరమ్మతులు చేసి పైన బాక్సులను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. పులిగడ్డ వైపున ఒక చాంబర్కు గ్రీజు పెట్టకుండా బాక్సు లేకుండా వదిలేయడం గమనార్హం. జాయింట్ వద్ద లీకవుతున్న నీరుపంటకాలువ తొట్టె జాయింట్ల వద్ద లీకులు రాకుండా పటి ష్టంగా పనులు చేశాం. దెబ్బతిన్న చాంబర్లకు మరమ్మతులు చేయించి గ్రీజు పెట్టించాం. ఎస్టిమేట్లో లేకపోయినా కాంట్రాక్టర్తో ఒప్పించి చాంబర్లకు పై షీట్లు బిగించాం. నాలుగు పనులకు మంజూరైన రూ.110.05 లక్షల పనులన్నీ పూర్తిచేశాం. – బి.బి.ఎస్.గణపతి, ఇరిగేషన్ డీఈఈ, పులిగడ్డ అక్విడెక్టుకు మరమ్మతుల కోసం మంజూరైన రూ.110.05 లక్షలు ఎస్డీఎంఎఫ్ నిధుల్లో నిర్వహణ కోసం ఖర్చు చేసింది తక్కువనే చెప్పాలి. పులిగడ్డలో ఆర్ఎఫ్ఆర్ (రైట్ ప్లాంక్ రెగ్యులేటర్) నిర్వహణకు రూ.36.55 లక్షలు, మోపిదేవి వైపు ఎల్ఎఫ్ఆర్ నిర్వహణ కోసం రూ.29.40 లక్షలు, పులిగడ్డ వద్ద ఎల్ఎఫ్ఆర్ వద్ద నిర్వహణ కాలువ పనులకు రూ.23.10 లక్షలు, పులిగడ్డ వద్ద ఆర్ఎఫ్ఆర్ వైపు కాలువకు మరమ్మతులు, నిర్వహణ కోసం రూ.21 లక్షలు ఖర్చు చేసినట్టు అధికా రులు వెల్లడించారు. వీటిలో అక్విడెక్డు రక్షణ కోసం ఖర్చు చేసింది చాలా తక్కువే. గత ఏడాది వచ్చిన వరదలకు కొట్టుకొచ్చిన కొన్ని భారీ వృక్షాలు అక్విడెక్టు వద్ద పట్టుకుపోగా వాటిని కూడా తొలగించే చర్యలు చేయలేదు. -
నేడు 50వ సారి
నాది బీ నెగటివ్. ఈ గ్రూపు ఎవరికి అవసరమైనా రక్తదానం చేస్తా. 2008లో దివ్య ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నా. ఇప్పటి వరకూ 49 సార్లు రక్తదానం చేశా. నేడు రక్తదాతల దినోత్సవం సందర్భంగా 50వ సారి రక్తదానం చేస్తున్నా. బైపాస్ సర్జరీలు, రోడ్డు ప్రమాదాలతో పాటు, ఇతర శస్త్ర చికిత్సల్లో బ్లడ్ అవసరమైన వాళ్ల ఎలాంటి మెసేజ్ చూసినా మా ఫౌండేషన్ సభ్యులు వెళ్లి రక్తదానం చేస్తుంటారు. ఇప్పటి వరకూ 5 వేల యూనిట్లు రక్తదానం చేశాం. – చెన్నంశెట్టి వికాస్, దివ్య ఫౌండేషన్ వ్యవస్థాపకుడు -
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి. -
దద్దరిల్లె ఊరు
వెన్నుపోటుపై పోరు..గన్నవరం.. జనహారం.. గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం జరిగింది. స్థానిక బుద్దవరం రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై గాంధీబొమ్మ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయ సెంటర్కు చేరుకుంది. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడు షేక్ సలార్దాదా, ఎంపీపీ అనగాని రవి, జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్రాణి, పార్టీ నాయకులు కాకర్లమూడి సువర్ణరాజు, కొమరవల్లి గంగాభవాని, మేచినేని సత్యనారాయణ, వై నగేష్ తదితరులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి కార్యకర్తలు, నాయకులతో కలిసి వీరమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి ఉయ్యూరు సెంటరులో సభ నిర్వహించి, ప్రభుత్వ రెండేళ్ల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఉయ్యూరు తహసీల్దార్ సురేష్కు వినతిపత్రం అందజేశారు. తొలుత వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) కార్యక్రమం వద్దకు చేరుకుని కార్యకర్తలతో కొద్దిసేపు మాటమంతి నిర్వహించారు. మోసపూరిత వాగ్ధానాలతో కూటమి ప్రభుత్వం మహిళలను దగా చేస్తోంది. ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ నెలకు రూ. 1,500 ఇస్తామనే ఎన్నికల హామీ ఇంతవరకు అమలు చేయలేదు. రెండేళ్లకుగాను ఒక్కొక్క మహిళకు ప్రభుత్వం రూ. 36వేలు బకాయి పడింది. సీ్త్రశక్తి పథకం, ఉచిత గ్యాస్, తల్లికి వందనం పథకాలు అమలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. – కూనపురెడ్డి రజని, గన్నవరం -
బాలకార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
భవానీపురం(విజయవాడపశ్చిమ): బాల కార్మిక వ్యవస్థ కారణంగా పుస్తకాలు పట్టాల్సిన చేతులతో పనిముట్లను పట్టుకుని పనిచేయడం ద్వారా వారి భవిష్యత్ చిన్నాభిన్నమవుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం భవానీపురంలోని హరిత బెరంపార్క్లోని పున్నమీఘాట్లో ఏర్పాటు చేసిన బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అవగాహన పోస్టర్లను ఆయన విడుదల చేశారు. అనంతరం జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ జి. ధనలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో ఆర్డినేటర్ అరవ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కుటుంబ సమేతంగా, సీపీ రాజశేఖరబాబు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన దర్బారు సేవ, పల్లకీ సేవలో చైర్మన్ రాధాకృష్ణతో కలిసి పాల్గొన్నారు. అలాగే సీపీ రాజశేఖరబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. సీపీకి ఈవో శీనానాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): మనసుకు ప్రశాంతత, జీవితానికి సమతుల్యత యోగాతోనే సాధ్యమవుతుందని, అది కేవలం వ్యాయమం కాదని, సంపూర్ణ జీవన విధానానికి మార్గమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భవానీపురంలోని బెరంపార్క్లో నిర్వహించిన యోగ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ శ్వాసను నియంత్రించే యోగా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా జీవితాన్ని క్రమశిక్షణతో నడిపించే శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా ఎంతో అవసరమని చెప్పారు. యోగ సాధనతో ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాకు సమయాన్ని కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో ఆయుష్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియదర్శిని, నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ షమ్మి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ శ్రీనివాసరావు, సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
పాతబడి న అడుగులు
చిరిగిన బ్యాగ్లు, తెగిన చెప్పులు, రంగు వెలిసిపోయిన యూనిఫామ్తో విద్యార్థులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి జిల్లాలో వేసవి సెలవుల తరువాత బడి గంటలు శుక్రవారం మోగాయి. పాఠశాలలకు చిరిగిన బ్యాగులు తగిలించుకుని, షూస్ లేకుండానే చిన్నారులు చిటిపొట్టి అడుగులతో వడివడిగా బడిబాట పట్టారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లోనూ తరగతులు పునఃప్రారంభమయ్యాయి. కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే విద్యార్థులకు అందించారు. తొలి రోజు సంప్రదాయానికి స్వస్తి.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్, షూస్, సాక్స్, డిక్షనరీ, వర్క్బుక్ ఇలా అన్ని వస్తువులతో కూడిన కిట్ను తొలిరోజే అందించేవారు. ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంప్రదాయానికి స్వస్తి పలికిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ఏడాది తొలి రోజు అరకొరగానే పుస్తకాలు అందిస్తే ఈ ఏడాది కేవలం పాఠ్యపుస్తకాలతోనే తొలిరోజు పంపిణీని మమ అనిపించారని ఉపాధ్యాయులు వ్మాఖ్యానిస్తున్నారు. అది సైతం కేవలం కొన్ని పాఠశాలల్లోనే జరిగింది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పాఠశాలకు చేరుకున్న పుస్తకాలను మాత్రమే విద్యార్థులకు అందించామని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. చిరిగిన బ్యాగ్లతో అవస్థలు చిన్నారులు తొలి రోజు చిరిగిన బ్యాగ్లతోనే పాఠశాలలకు హాజరయ్యారు. గత ఏడాది నాణ్యత లేని బ్యాగ్లు సరఫరా చేసిన విషయం తెలిసిందే. ఆ బ్యాగ్లు అప్పుడే చిరిగిపోవటంతో వాటిని కుట్టుకొని వినియోగించారు. తొలి రోజు పాఠశాలలో బ్యాగ్ అందిస్తారని ఆశగా వచ్చిన చిన్నారులకు వాటిని సరఫరా చేయకపోవటంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దానికి తోడు పేదలైన చిన్నారులు చాలా మంది తెగిన చెప్పులతో వచ్చారు. కొన్ని పాఠశాలలు పాఠ్యపుస్తకాలు అందించటంతో వాటిని తీసుకెళ్లటానికి విద్యార్థులు నానా ఇబ్బందులు పడ్డారు. సెలవుల అనంతరం పాఠశాలలకు చేరుకున్న విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. చాలా పాఠశాలల్లో తరగతుల కొరత వెంటాడుతోంది. గదులు సరిపోక రెండు తరగతులు ఒకే గదిలో నడిపే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. అంతేకాకుండా సరిపడ మరుగుదొడ్లు, మంచినీరు, బెంచ్లు ఇలా సగానికి పైగా సర్కార్ పాఠశాలల్లో సమస్యలు ఉన్నట్లు అధికారుల పర్యవేక్షణలోనే తేలింది. -
దుర్గమ్మ నిత్యాన్నదాన పథకానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మామిడిపాలెం రోడ్డుకు చెందిన బబ్బూరి సుబ్బారావు కుటుంబం శుక్రవారం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసి రూ. 9లక్షల విరాళాన్ని అందజేసింది. అలాగే విజయవాడ బందరురోడ్డుకు చెందిన సాదు వెంకట సుబ్బారావు గుప్తా దంపతులు రూ. 1,11,111, పాయకాపురానికి చెందిన ఎం. శ్రీనివాసరావు రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
కేశినేని బ్రదర్స్ వార్లో కీలక పరిణామం
బెజవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) సోషల్మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది తెలిసిందే. తాజాగా ఈడీకి సైతం ఆయన ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఆయనపైనే కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరుడి వ్యవహారంపై అధికార పార్టీ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య, అనుచిత ప్రచారం జరుగుతోందని, పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చిన్ని అధికార కూటమికి చెందిన ఎంపీ కాగా, నాని ఇటీవల కాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయ పరిణామాలపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి ఫిర్యాదు చేసిన కొద్దిరోజుల్లోనే నానిపై కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది.నాని అనుచరులు మాత్రం ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా జరిగిన చర్య అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు. మరోవైపు ఎంపీ చిన్ని వర్గం మాత్రం సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాన్ని సహించబోమని చెబుతోంది. -
17న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ సామూహిక అక్షరాభ్యాసాలు జరగనున్నాయి. దీనిపై ఆలయ వైదిక కమిటీ సామూహిక అక్షరాభ్యాసాల నిర్వహణకు నిర్ణయించింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహామండపం ఆరో అంతస్తులో బుధవారం ఉదయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సుమారు 250 మందితో అక్షరాభ్యాసం చేయించనున్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు దేవస్థానం తరఫున ఉచితంగా పలక, బలపం, అమ్మవారి కంకణం, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేయనున్నారు. ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లపై ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందితో పాటు ఆలయ సిబ్బందికి ప్రత్యేకంగా సూచనలు చేశారు. పెనమలూరు: జాతీయ స్థాయిలో జరగనున్న ఫెడరేషన్ కప్ బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులను ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఆయన గురువారం కానూరులో వివరాలు తెలుపుతూ సయ్యద్ జావీద్(57కేజీలు), దుంప వంశీ(75కేజీలు) విభాగంలో ఏపీ జట్టు నుంచి జాతీయ పోటీల్లో పాల్గొంటారని టీఏబీబీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్, ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు ప్రకటించారన్నారు. ఈ నెల 12,13,14 తేదీల్లో పంజాబ్ రాష్ట్రం లూథియానాలో 15వ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాడీబిల్డింగ్ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సంఘ ప్రతినిధులు బి.మనోహర్, సీహెచ్.రాజు, సభ్యులు అభినందించారు. 21 కేజీల గంజాయి స్వాధీనం అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): నగరంలో అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గద్దె వారి పొలాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సింగ్నగర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. దావు బుచ్చయ్య కాలనీ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సింగ్నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఐ దాడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా పెట్టి దాడులు చేయగా ముగ్గురు రౌడీషీటర్లు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసుల కంటపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీలు చేయగా 21 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులైన ముగ్గురు రౌడీషీటర్లు అద్దంకి సతీష్, కందుల విఘ్నేష్, వల్లభనేని సాయి శ్రీరామ్ అలియాస్ వైఫైలను అరెస్ట్ చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. -
చంద్రబాబుకు సెగ తగిలేలా నేడు ర్యాలీలు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రెండేళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు వెన్నుపోటు పేరుతో ఈ నెల 4 నుంచి 12 వరకూ వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చంద్రబాబుకు సెగ తగిలేలా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో చేపట్టే నిరసన ర్యాలీల్లో వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు అసమర్థ పాలన, అక్రమాలు, ఎన్నికల హామీలు విస్మరించడం వంటి అంశాలను ప్రశ్నించడానికి ర్యాలీలను విజయవంతం చేద్దామని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నంఅర్బన్: బందరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్)లో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గురువారం కీలక నియామకాలు చేపట్టినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి.లీలాప్రసాద్ తెలిపారు. నూతన రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ)గా కంటి వైద్య నిపుణులు జి. భానుమూర్తి, అసిస్టెంట్ ఆర్ఎంఓలుగా ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజన్, డాక్టర్ నాగలక్ష్మిని నియమించామన్నారు. -
సమస్యల తిష్ఠ
సర్కారీ స్కూళ్లలో వన్టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వ కృషి ఫలితంగా సాధించిన విజయాలను తమవిగా పాలకుల గొప్పులు చెప్పుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రూ.10.50 కోట్లు లేక రెండేళ్లుగా నిలిచిన 364 తరగతి గదులు ఎన్టీఆర్ జిల్లాలో నాడు–నేడు పనుల్లో భాగంగా పది శాతం పనులు పూర్తి చేస్తే సుమారు 364 తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. అయితే కూటమి ప్రభుత్వం నాడు–నేడు పేరును ‘మనబడి – మన భవిష్యత్’ అంటూ మార్చేసింది. కానీ ఒక్క రూపాయి సైతం విడుదల చేయలేదు. జిల్లాలో ఈ రెండో విడత పనులకు సుమారుగా రూ.10.50 కోట్లు అవసరం కానున్నాయి. వీటి కోసం జిల్లాలో విద్యాసంస్థలు రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాయి. అయినా పాలకుల్లో స్పందన లేదు. రూ.189 కోట్లతో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎయిడెడ్ మినహాయిస్తే సుమారుగా 863 పాఠశాలలు పని చేస్తున్నాయి. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాసంస్థలతో పాటుగా ఇతర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. వాటిల్లో రెండేళ్లగా ఎటువంటి పనులు చేపట్టకపోవటంతో వేలాది సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి సుమారుగా రూ.189 కోట్లు నిధులు అవసరమవుతాయని జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష విభాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలిసింది. ఎదురు చూపులు రాష్ట్ర ప్రభుత్వం వసతుల ఏర్పాటుకు దాతలను చూడాలంటూ అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం. విద్యాంజలి యాప్ ద్వారా దాతలను గుర్తించి ప్రోత్సహించాలంటూ సర్వశిక్ష అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కొంతమంది ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాడు– నేడు పనుల్లో భాగంగా విజయవాడ కుమ్మరిపాలెంలోని దళవాయి సుబ్బరామయ్య హైస్కూల్ పురాతనం కావటంతో పడగొట్టి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పునాదులు పడే సమయంలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. తాజాగా స్థానిక నేతల ఆందోళనలతో.. దానికి దాతలను చూసే పనిలో కూటమి ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వసతుల ఏర్పాటుకు నిధులు లేవువిద్యార్థుల భవిష్యత్తు అంధకారంపూర్తికాని అదనపు గదులుజిల్లాలో వివిధ విద్యాసంస్థల్లో అనేక సమస్యలు తిష్ట వేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష విభాగాలు ఆయా పాఠశాల్లో ఉన్న సమస్యలపై ప్రధానోపాధ్యాయులను ఇటీవల సమాచారాన్ని కోరాయి. అందులో చాలా పాఠశాల్లో విద్యార్థులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివరించారు. ఉన్నవి చాలడం లేదని, సరిపడా మంచినీటి వసతులు లేవని, అలాగే ఇతర మౌలిక సదుపాయలపై పలు వినతులను వివరించారు. -
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశవన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యాన కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ఎక్స్పోను కలెక్టర్ ప్రారంభించారు. 20 మండలాల్లోని విద్యాసంస్థలు సాధించిన విజయాలను వివరిస్తూ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేశారన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలు, సౌకర్యాలు, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే విధంగా విద్యా ఎక్స్పోను నిర్వహిస్తున్నామన్నారు. గత ఏడాది విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 31 మంది విద్యార్థులు 580 పైగా మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.చంద్రకళ, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్.రమేష్ బాబు, డెప్యూటీ డీఈవోలు డి.సాంబశివరావు, జి.గుర్నాథం, ఎ.శ్యాంసుందర్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, జిల్లాకు చెందిన మండల విద్యా శాఖ అధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
జీతం రాక.. జీవితం సాగక
ప్రాణాలు కాపాడుతున్న చేతులకు జీతాల కష్టాలు లబ్బీపేట(విజయవాడతూర్పు): కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ప్రభుత్వ మొండి వైఖరితో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు చెల్లించకపోవడంపై అధికారులను అడుగుతుంటే వారు ఏవేవో కారణాలు చెబుతున్నా రని, గట్టిగా అడిగితే తమ చేతుల్లో ఏమీ లేదంటున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకనెలలో నాలుగు రోజులు జీతం ఆలస్యమేతేనే ఇబ్బందని, అలాంటిది మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి జీతాలు రావడం లేదని మేమేం అవస్థలు పడుతున్నామో అధికారులకు ఏం తెలుసని పలువురు వాపోతున్నారు. 400మంది కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్), ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల (ఎస్ఎంసీ) పరిధిలో సుమారు 400 మంది కాంట్రాక్టు వైద్య ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 250 మంది వరకూ స్టాఫ్ నర్సులు ఉండగా, మిగిలిన వారు ఆఫీసు సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పారా మెడికల్ సిబ్బంది, టెక్నీషియన్లు, అడ్మినిస్ట్రేటర్లు ఇలా అనేక విభాగాల్లో పని చేస్తున్నారు. వీరిలో కొందరు పదేళ్లకు పైగా పనిచేస్తుండగా, మరికొందరు ఐదేళ్లుగా పని చేస్తున్నారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి మూడు నెలలుగా జీతాలు రాక పోవడంతో అప్పులు చేసి, కుటుంబాలను నెట్టుకు రావాల్సి వస్తోందని పలువురు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రతినెలా మొదటి వారంలో జీతాలు వస్తుండేవని, దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం, వస్తువులు కొనుగోలు చేయడం చేశామంటున్నారు. ఇప్పుడు వాటి ఈఎంఐలు చెల్లించేందుకు బంగారు వస్తువులు తాకట్టు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాటవేత ధోరణి కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల జీతాల విషయమై ప్రభుత్వాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జయలక్ష్మిని వివరణ కోరగా, ఉద్యోగుల జీతాలు వంటి విషయాలు అన్నీ వైద్య కళాశాల ఏడీ చూస్తున్నట్లు తెలిపారు. వైద్య కళాశాల ఏడీని సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఒక సీనియర్ అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేసి తాము కొత్తగా వచ్చామని, అవి తమకు తెలియదని చెప్పడం గమనార్హం ఇప్పటి వరకూ ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించేది. ప్రస్తుతం నిధి పోర్టల్ను ఏర్పాటు చేశారు. దీనిలో కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం ఎప్పుడు జరిగింది.. వారి వివరాలు అన్నీ ఎంటర్ చేయాలి. తక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్న చోట ఒకటీ, రెండు నెలల్లో చేసేశారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న వైద్యశాఖలో నిధి పోర్టల్లో డేటా ఎంటర్ చేయడం జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. -
వెలుగులోకి మరో జనసేన నేత మోసం
సాక్షి, విజయవాడ: మరో జనసేన నేత మోసం వెలుగులోకి వచ్చింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్ తనను మోసం చేశాడంటున్న ఓ మహిళ.. కాంట్రాక్టులు ఇప్పిస్తానని చేశాడని పేర్కొంది. ఆ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. కరోనా సమయంలో పరిచయమైన విజయ్ శేఖర్.. రాబోయేది మన ప్రభుత్వమేనని తన నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది.2024లో ప్రభుత్వం రాగానే ఇసుక క్వారీలు, గ్రానైట్, వైన్ షాపులు మనవేనంటూ విజయ్ శేఖర్ ఆ మహిళను నమ్మించాడు. ఆయన్ని నమ్మి రూ.కోటి 75 లక్షలు ఇచ్చింది. ఆ మహిళ బంగారాన్ని కూడా తాకట్టు పెట్టించిన విజయ్ శేఖర్.. అధికారంలోకి రాగానే మోహం చాటేశాడు. తన డబ్బు ఇవ్వమని అడిగితే ఆ మహిళపై విజయ్శేఖర్ దాడి చేశారు.బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మంగళగిరిలో బేతపూడి విజయ్ శేఖర్తో పరిచయమైంది. అధికారంలోకి వస్తే ఇసుక క్వారీలు, గ్రానైట్, బిజినెస్, వైన్ షాప్ మనవేనని నమ్మించాడు. ముందుగా కొంత పెట్టుబడి పెట్టాలని నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్గా విజయ్శేఖర్కు నామినేటెడ్ పదవి వచ్చింది. నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత నుంచి నన్ను దూరం పెడుతూ వచ్చాడు. నా డబ్బుల గురించి అడిగితే నీ దిక్కున్నచోట చెప్పుకోమంటున్నాడు..నాకు న్యాయం చేయమని అందరి దగ్గరికీ వెళ్లా. జనవాణిలో మూడుసార్లు దరఖాస్తు పెట్టుకున్నా. నాకు జరిగిన అన్యాయం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్కు తప్ప అందరికీ తెలుసు. మంత్రి కందుల దుర్గేష్కు కూడా తెలుసు. నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించి న్యాయం చేయండి. నాకు న్యాయం జరగకపోతే పవన్ కళ్యాణ్ సాక్షిగా ఆత్మహత్య చేసుకుంటా. నా చావుకి జనసేనలో ఉన్నవారంతా బాధ్యులే’’ అంటూ ఆమె హెచ్చరించింది. -
కూటమి ప్రభుత్వ పతనానికి కారకుడు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పతనమవ్వడానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కారణమవుతారంటూ జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులు, క్రైస్తవులపై ఆర్ధిక ఉగ్రవాది దాడిచేస్తున్న రఘురామకృష్ణంరాజును తక్షణమే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనను బర్తరఫ్ చేసే వరకూ తన పోరాటం ఆగదని ప్రకటించారు. బ్యాంకులను కొల్లగొట్టిన ఈ దొంగను కూటమి ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని విమర్శించారు. బాయ్కాట్ రఘురామకృష్ణంరాజు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు.''భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ఈ దేశంలో అందరూ సమానమేనని చెప్పింది. ఎవరి మతాలు వారిని పూజించుకోవడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్వేచ్ఛను ఇచ్చాయి. కానీ మతసాంప్రదాయాల మీద రఘురామకృష్ణంరాజు దాడి చేస్తున్నాడు. ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అమలవుతుందని అనక తప్పడం లేదు. దళితులు, క్రైస్తవులపై రఘురామకృష్ణంరాజు అర్ధిక ఉగ్రవాదిలా దాడిచేస్తున్నాడు. దళితులు, క్రైస్తవుల ఓట్లు తనకు వద్దని చెప్పిన రఘురామకృష్ణం రాజు చెబుతున్నారు. సిగ్గు, శరం, లజ్జా , అభిమానం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలి. దళితులు, క్రైస్తవులు కట్టే పన్నుల నుంచి జీతం తీసుకోనని ప్రకటించాలి. మేకుల దేవుడు అని దైవాన్ని కించపరుస్తున్న నీకు అదే మేకులతో సమాధానం చెప్పే రోజు వస్తుంది.తెలుగువీర లేవరా పేరుతో ఎస్సీ ఉద్యోగులపై నిఘా పెట్టారు. చర్చిలకు వెళుతున్న ఎస్సీ ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. ఎస్సీ ఉద్యోగుల తల్లిదండ్రుల సమాధులను ఫోటోలు తీసి అధికారులకు పంపిస్తున్నారు. ఆ ఫోటోలను అడ్డుపెట్టకుని క్యాస్ట్ సర్టిఫికెట్లు రద్దు చేయాలని చెప్పడం నీచమైన పని. రఘురామకృష్ణంరాజు దళం ఇస్తున్న ఫిర్యాదులను తీసుకుని అధికారులు షోకాజ్ నోటీసులిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి ఒక మతాన్ని టార్గెట్ చేయడం ఎంత వరకూ సమంజసం? అధికారులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కనిపించడం లేదు. రఘురామకృష్ణంరాజు పంపించిన సూట్ కేసులో డబ్బు మాత్రమే కనిపిస్తోంది.రఘురామకృష్ణంరాజు పంపించిన 6.5 కోట్ల రూపాయలు తీసుకుని ఆకువీడులో నిర్మాణాలకు అనుమతిలిచ్చారు. బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బు ఆయన వద్ద వద్ద దండిగా ఉన్నాయి. ఐదేళ్లూ ఢిల్లీలో కూర్చుని పిజ్జాలు, బర్గర్లు , కేఎఫ్సీ చికెన్లు తిన్నప్పుడు శ్రీరాముడు గుర్తుకురాలేదా? కాక్ టెయిల్ పార్టీలకు వెళ్లినప్పుడు జై శ్రీరామ్ నినాదం మీకు గుర్తుకు రాలేదా? తల్లిదండ్రుల మాటలకు కట్టుబడి వనవాసం చేసిన ఆ శ్రీరాముడు ఎక్కడ, బ్యాంకులను లూటీ చేసిన నువ్వెక్కడ? జై శ్రీరామ్ నినాదం పేరుతో నీ మెడలో వేసుకున్న కండువా కూడా నిన్ను చూసి సిగ్గుపడుతోంది.రఘురామకృష్ణం రాజు చెప్పాడని 50 ఏళ్ల నుంచి ఉన్న చర్చిలను కూల్చేస్తామంటున్నారు అధికారులు. 40, 50 ఏళ్ల నుంచి చర్చిలు ఉన్నప్పుడు అధికారులు నిద్రపోయారా? చర్చిలపై ఉన్న మైకులు తొలగించాలని డీజీపీకి రఘురామకృష్ణంరాజు లేఖరాయడం దుర్మార్గం. జూన్ 28న ఏలూరు బహిరంగ సభలో బాయ్కాట్ రఘురామ పిలుపునివ్వబోతున్నాను. ఆ రోజుతో రఘురామకృష్ణంరాజు రాజకీయ జీవితం ముగియనుంది. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి కోటి 10 లక్షల మంది దళిత, క్రైస్తవులపై దాడి చేయడం సమంజసమేనా? రఘురామకృష్ణంరాజు మాటలు కొన్ని కోట్ల మంది హృదయాలను గాయపరిచాయి. నీ జీవితంలో అశాంతి మొదలైంది.. నీ రాజకీయ, ఆర్ధిక పతనం ప్రారంభమైంది. నీకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కోర్టులో గుంజీలు తీయిస్తా. రఘురామకృష్ణంరాజు చెప్పగానే గొంతేనమ్మ ఆలయాన్ని కూల్చేయించారు. కలెక్టర్ను నేను ఇదే హెచ్చరిస్తున్నా.. మీ సర్వీసంతా వెంటాడుతూనే ఉంటా. లంచం తీసుకుని రఘురామకృష్ణంరాజుకు కలెక్టర్ సాయం చేశారు. కలెక్టర్.. మీరు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టను. చదువుకుంటున్న పిల్లలపై కూడా కేసులు పెట్టించి వేధించారు.మొన్నటి వరకూ తాను క్రిస్టియన్ అని హోంమంత్రి అనిత చెప్పారు. ఎప్పుడూ తన చేతిలో బైబిల్ ఉంటుందని చెప్పారు. కానీ హోంమంత్రి అనిత ఇప్పుడు హిందువు ముసుగు వేసుకున్నారు. తన హోంమంత్రి పదవి పోతుందనే భయంతో బైబిల్ తీసి అటకపై పెట్టారు. బైబిల్ చదవడం మీకు అంత తప్పుగా కనిపిస్తుందా? మనల్ని అసహ్యించుకుంటున్నప్పుడు అనితకు, రఘురామకృష్ణంరాజుకు మనం ఓటెందుకు వేయాలి? చదవండి: మా బిడ్డల కాపురాలు కూలిపోతున్నాయిజూన్ 28వ తేదీ నుంచి ఎవరైనా మతాలను కించపరిచేలా యూట్యూబ్లలో ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు. మీ ఛానల్స్ మూతవేయిస్తామని హెచ్చరిస్తున్నా. వెయ్యి మందితో ఒక ఫోర్స్ తయారు చేస్తున్నాం. మతాలను టార్గెట్ చేసుకుని ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రఘురామకృష్ణం రాజు తన గొయ్యి తనే తవ్వుకుంటున్నాడు. మరోసారి క్రిస్టియానిటీని టార్గెట్ చేస్తూ ఒక్క మాట నీ నోటి నుంచి వచ్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. రఘురామకృష్ణంరాజును బర్తరఫ్ చేసే వరకూ నా పోరాటం ఆగదని జడ శ్రవణ్ కుమార్ అన్నారు. -
క్రైస్తవ మైనారిటీలపై దాడులను అరికట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్రైస్తవులు ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఎ.మెల్కీ సెదేక్, మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో క్రిస్టియన్ డెమోక్రాటిక్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మతమార్పిడి నిరోధక చట్టాలు, క్రైస్తవ ఇతర మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా మంగళవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హర్షకుమార్. మెల్నీసెదేక్ మాట్లాడుతూ.. దేశంలో తీసుకొచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రిస్టియన్ బిల్లును ఆమోదించాలన్నారు. జస్టిస్ కె.బాలకృష్ణన్ కమిషన్పై తమకు ఏ మాత్రం నమ్మకం లేదని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆవుల శేఖర్, ఐసీఎం చర్చ్ బిషప్ జాన్, ఎం.రాజేశ్వరరావు (ఏఐసీసీ), ప్రసాద్ రవికాంత్, మహమ్మద్ కరీముద్దీన్, శ్యామ్ సుందర్, శామ్యూల్ రాజు, రూత్ భారతి, ఆర్.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్, మెల్కీ సెదేక్ -
గేట్వే!
గంజాయ్కిజీవనశైలిలో యోగా భాగం కావాలి సాక్షి ప్రతినిధి,విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో చైన్నె, కోల్కతా హైవే గంజాయి కారిడార్గా మారింది. ఒడిశా, విశాఖ నుంచి నిత్యం గంజాయి తరలిస్తూనే ఉన్నారు. తరచూ పోలీసుల తనిఖీలో గంజాయి పట్టుబడుతూనే ఉంది. మంగళవారం తెల్లవారుజామున పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో పటమట పోలీసుస్టేషన్ పరిధిలోని నిడమానూరులో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించారు. ఇందులో రూ.70లక్షల విలువైన 140 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడోచోట పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతూనే ఉంది. మాదకద్రవ్యాలను (గంజాయి, డ్రగ్స్)సమూలంగా నిర్మూలిస్తాం, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతాం.. అంటూ రెండేళ్లుగా పాలకులు ఎక్కడ చూసినా మాటల తూటాలు పేలుస్తున్నారు. అవన్నీ ప్రచారం కోసం మాట్లాడే ఉత్తుత్తి మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి, ఇతర డ్రగ్స్ వంటివి విచ్చలవిడిగా లభిస్తుండటంతో యువత వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు విజయవాడ నగరానికే పరిమితమైన ఈ విష సంస్కృతి.. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ప్రభుత్వ వైఫల్యంతో గంజాయి కేజీలకు కేజీలు సరఫరా అవుతూనే ఉంది. అందుకు పోలీసులకు పట్టుబడిన ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. గంజాయితో పాటు ఎండీఎంఏ డ్రగ్స్ సైతం విజయవాడలో పట్టుపడటం ప్రజలను నివ్వెర పడేలా చేస్తోంది. జాతీయ రహదారులు ఉండే పోలీసు స్టేషన్ల పరిధిలోనే ఎక్కువగా గంజాయి దొరకుతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం గమనార్హం. గత రెండేళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గంజాయి విక్రయాలు భారీగా పెరిగాయి. గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్న వారిలో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత ఉంటున్నారు. అందుకు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పదుల సంఖ్యలో యువతకు డ్రగ్స్ పాజిటివ్ రావడమే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో 1200మందికి పైగా పాజిటివ్ రావటం గమనార్హం. దీనిని బట్టే గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పెరిగిందని స్పష్టంగా అర్థం అవుతోంది. పోలీసులు డ్రగ్స్పై దండయాత్ర పేరుతో కఠిన చర్యలు తీసుకొంటున్నామని పేర్కొంటున్నా.. క్షేత్ర స్థాయిలో మూలాలను కూకటి వేళ్లతో పెకిలించడంలో ఘోరంగా విఫలం అవుతున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్న స్మగ్లర్లు భారీగా పట్టుబడుతున్నా ఆగని రవాణా గ్రామాలకు విస్తరించిన గంజాయి గుప్పు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మత్తులో చిత్తవుతున్న యువత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గంజాయి అమ్మకందారులు ప్రధానంగా విద్యాసంస్థలే లక్ష్యంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. మత్తుకు బానిసలైన విద్యార్థులు విచక్షణ కోల్పోయి, ఘర్షణలకు దిగుతున్నారు. గంజాయికి అలవాటు పడిన వారు చివరకు చోరీలు, చైన్స్నాచింగ్లు వంటి నేరాలకు తెగబడుతున్నారు. పేకాట, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్లకు బానిలసవుతున్నారు. ఇటీవల బైక్ దొంగతనం కేసులో అరెస్టు చేసిన నిందితుడిని పరీక్ష చేయగా, పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇలా గంజాయికి అలవాటు పడిన వారు నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ్లలో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైక్లు చోరీ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో కూడా డ్రగ్స్కు బానిసలైన వారు ఉంటున్నారు. -
పవర్ లిఫ్టింగ్లో రాణిస్తున్న నితిన్ కుమార్
మచిలీపట్నంటౌన్: నగరానికి చెందిన కె. నితిన్ కుమార్ పవర్ లిఫ్టింగ్లో ప్రత్యేక ప్రతిభను కనబరుస్తున్నాడు. స్థానిక దేశాయిపేటకు చెందిన ఈ యువకుడు 17 ఏళ్ల వయసులోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పతకాలను సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఇటీవల జరిగిన పలు పోటీల్లో పాల్గొని బంగారంతో పాటు పలు పతకా లను సాధించాడు. స్థానిక సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో నితిన్కుమార్ 12వ తరగతి చదువుతున్నాడు. గత ఏప్రిల్ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 93 కిలోల సబ్ జూనియర్ క్యాటగిరీ పోటీల్లో పాల్గొని టాప్ పోర్ విత్ 327.5 కిలోల బరువును ఎత్తాడు. ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కర్నూల్లోని డీఎస్ఏ అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 295 కిలోల బరువు ఎత్తి వెండి, రజిత పతకాలను సాధించాడు. ఫిబ్రవరి 8వ తేదీన గుడివాడలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో జరిగిన సెకండ్ కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల జిల్లా స్థాయి పవర్ లిప్టింగ్ చాంపియన్ షిప్ 2025– 26 పోటీల్లో పాల్గొని సబ్ జూనియర్ 93 కిలోల విభాగంలో 250 కిలోల బరువును ఎత్తి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. అండర్ –20 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని 94 కిలోల భాగంలో బంగారు పతకాన్ని సాధించాడు. ఏ ప్రాంతంలో జరిగిన పోటీల్లోనైనా పాల్గొని పతకాలు సాధిస్తున్న యువ క్రీడాకారుడు నితిన్ కుమార్ను నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పతకాలను సాధించి మచిలీపట్నానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు 17 ఏళ్ల వయసులోనే క్రీడా నైపుణ్యం -
విద్యార్థుల జీవితాలతో సీబీఎస్ఈ ఆటలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సీబీఎస్ఈ తన అసమర్ధతతో దేశంలోని లక్షలాది యువత జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ అన్నారు. సీబీఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకల తీరును ఖండిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విజయవాడ సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి.. ఈ సందర్భంగా బందెల నాసర్జీ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ జరిగి నెలరోజులు కాకుండానే సీబీఎస్ఈ పరీక్ష పత్రాల డిజిటల్ మూల్యాంకనంలో అవకతవకలు జరగటం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. పరీక్ష ఫలితాల అనంతరం అనేక వేలమంది విద్యార్థులకు వారి మార్కులు చూసి సందేహం కలిగి రీవ్యాల్యుయేషన్ దరఖాస్తు చేసుకున్నారన్నారు. అందులో భాగంగా వేదాంత్ అనే విద్యార్థి తాను రాసిన జవాబు పత్రం కావాలని స్కాన్ కాపీ కోరాడన్నారు. వచ్చిన పేపర్ తాను రాసిన జవాబు పత్రమే కాదని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారని చెప్పారు. సంజన, మోక్ష, హర్షిత విద్యార్థుల పేపర్లు అసలు రీవ్యాల్యుయేషన్ చేయలేదని వాపోయారు. ఈ వరుస తప్పిదాలకు నైతిక బాధ్యతగా తీసుకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ ఇటీవల ప్రారంభించిన కొత్త విధానంలో అనేక సాంకేతిక సమస్యలు బయటకు వచ్చాయన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి, శివా, రాష్ట్ర సమితి సభ్యులు అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లికి వందనానికి నిబంధనలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): చంద్రబాబు ప్రభుత్వం కొత్త నిబంధనలతో తల్లికి వందనం పథకానికి ఎసరు పెట్టేందుకు కసరత్తు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకూ లేని కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాలలు కార్మికులుగా మారకూడదనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకొచ్చింది. తమ పిల్లలను బడికి పంపించే తల్లుల బ్యాంక్ ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జమచేసి. బాలలు అందరినీ బడిబాట పట్టిం చింది. ఆ పథకానికి జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంకన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలుచేస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం పథకం పేరును తల్లికి వంద నంగా మార్చి అర్హుల సంఖ్యను భారీగా తగ్గిం చింది. తాజాగా ఎస్సీ విద్యార్థులకు కొత్త నిబంధనలను తీసుకొచ్చి తల్లికి వందనం పథకాన్ని వారికి దూరం చేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కొత్త ఖాతా తెరవాల్సిందే.. పదో తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియెట్లో చేరిన ఎస్సీ విద్యార్థులు అందరనూ కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాతా తెరిచిన వారికి మాత్రమే తల్లికి వందనం పథకం వర్తిస్తుందనే స్పష్టంచేశారు. విద్యార్థి కేవలం ఆధార్కార్డు, దానికి లింకై న ఫోన్ నంబర్తో బ్యాంక్ ఖాతాను తెరవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీ లోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ శాఖల్లో మాత్రమే ఖాతా తెరిచి ఆ సమాచారాన్ని అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. పాన్కార్డు కావాల్సిందే.. కొత్తగా ఖాతాను తెరిచేందుకు వెళ్తున్న విద్యార్థులను బ్యాంకర్లు పాన్ కార్డ్ కావాలని అడుగుతున్నారు. పాన్ కార్డు లేకుండా కొత్తగా ఖాతాను తెరవటానికి అవకాశం లేదని కొన్ని బ్యాంకు శాఖల్లో అధికారులు చెబుతున్నారు. ఎంపిక చేసిన కొన్ని జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఖాతా తెరవాలని సూచించటం, అందులోనూ మూడు నాలుగు రోజుల్లోనే ఈ తంతు పూర్తి చేసి ఆప్డేట్ చేయాలని ప్రకటించటంపై తల్లిదండ్రులు, విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. చాలా మందికి ఈ సమాచారం తెలియలేదని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఆధార్ లింకే సమస్య ఆధార్కార్డుకు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకులు ఖాతా తెరిచేందుకు అభ్యంతరం చెబుతున్నాయి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తల్లిదండ్రులు సెల్ఫోన్లు కొనిచ్చే పరిస్థితి లేదు. కొత్త నిబంధనల నేపథ్యంలో ఫోన్ కొని సిమ్ కార్డు తీసుకుని, దానిని విద్యార్థి ఆధార్ కార్డుకు లింక్ చేయటం ఇప్పటికిప్పుడు పూర్తయ్యే పరిస్థితి లేదు. కొత్తగా ఫోన్ నంబర్ లింక్ చేయాలంటే ఇబ్బందులు తప్పవని, అక్షరాస్యత లేని కుటుంబాలకు ఇంకా కష్టమని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. అమ్మ ఒడి పేరుతో గత ప్రభుత్వం సమర్థంగా అమలు చేసిన ఈ పథకాన్ని తల్లికి వందనం పేరు మార్చి నీరుగార్చారని విమర్శిస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అని చెప్పిన కూటమి ప్రభుత్వం సుమారు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 50 వేల మంది పిల్లలకు ఈ పథకం ఇవ్వలేదంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఎస్సీ వర్గానికి చెందిన విద్యార్థులు ఖాతా తెరవాలనే పేరుతో పథకంలో కోత పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇంటర్లో చేరిన ఎస్సీ విద్యార్థులు బ్యాంక్ ఖాతా తెరవాలని ఆదేశం పాన్కార్డు లేకుండా ఖాతాను తెరవబోమంటున్న బ్యాంక్ సిబ్బంది ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ కాకపోవటంతో బ్యాంకర్ల అభ్యంతరం పథకం ఎగవేతకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందంటున్న విద్యార్థి సంఘాలు తల్లికి వందనం పథకాన్ని నీరుగార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. తల్లికి వందనం పేరుతో తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. అటువంటిది ఇప్పుడు ఎస్సీ విద్యార్థులు కొత్తగా ఖాతాలు తెరవాలని చెప్పటం ఏమిటి? అందులోనూ వారికి పాన్కార్డులు ఉండవు. ఆధార్కార్డుకు ఫోన్ లింక్ అయ్యే అవకాశాలు తక్కువ. అసలు వారికి ఫోనే ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పథకాన్ని పూర్తిగా కోతలు పెట్టేందుకు చంద్రబాబు సర్కార్ ఆడుతున్న నాటకంగా కనిపిస్తోంది. ఎటువంటి ఆంక్షలు, కొత్త నిబంధనలు లేకుండా పథకాన్ని అమలు చేయాలి. – ఎ.రవిచంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం -
పాఠశాలలో అభివృద్ధి పనుల పరిశీలన
గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం సందర్శించారు. ఆ పాఠశాల పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న పలు భవనాల నిర్మాణ పురోగతి, ఒకేషనల్ భవన నిర్మాణం కోసం మెరక చేసిన స్థలాన్ని, కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించి అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, తహసీల్దార్ బి.లోకరాజు, ఎంపీడీఓ ఎండీ ఇమ్రాన్, సాగునీటి డీసీ చైర్మన్ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, ఎంఈఓ జి.గోపాలరావు, పాఠశాల హెచ్ఎం రజిని కుమారి, ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు. -
ఉపాధ్యాయులకు ముగిసిన శిక్షణ కార్యక్రమం
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధ్యాయులకు నిర్వహించిన పునాది అభ్యాసన, సంఖ్యాత్మకత శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. జిల్లాలో ఒకటో తరగతి బోధించే 854 మంది ఉపాధ్యాయులకు ఏడు ప్రదేశాల్లో ఈ శిక్షణ శిబిరాన్ని వారం రోజులుగా నిర్వహించారు. విజయవాడలోని పడమట, గొల్లపూడి, మైలవరం, విస్సన్నపేట, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున 20 మండలాలకుగాను 60 మంది రిసోర్స్ పర్సన్స్ను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. వారు వారివారి ప్రదేశాల్లో ఈ శిక్షణ నిర్వహిస్తారని వివరించారు. ప్రధానంగా విద్యార్థులకు బోధనలతో, నూతన పాఠ్యపుస్తకాలకు సంబంధించిన అంశాలను, సామర్థ్యాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు నేర్పి తద్వారా పాఠశాలలో అమలు చేస్తారన్నారు. జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. రమేష్బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ, స్టేట్ అబ్జర్వర్ సీహెచ్ వెంకటరమణ, స్టేట్ ఎఫ్ఎల్ఎన్ కోఆర్డినేటర్లు ప్రతిష్ట కుసుమాలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మక్కపేట(వత్సవాయి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన వత్సవాయి మండలంలోని మక్కపేట గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఖమ్మం జిల్లా, బోనకల్లు మండలం, పెద్దబీరవల్లి గ్రామానికి చెందిన గొర్రెముచ్చు ప్రమీళ (41) మక్కపేట సెంటర్లో ఆటో దిగింది. అనంతరం బైక్ ఎక్కి జగ్గయ్యపేట వైపు వెళ్తుండగా పంచాయతీ కార్యాలయం సమీపంలో అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయింది. అదే సమయంలో పెనుగంచిప్రోలు వైపు నుంచి వస్తున్న టిప్పర్ టైరు ఆమె తలపై ఎక్కటంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారయిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పామర్రు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పామర్రు మండలంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మచిటీ పట్నం మండలం బొర్రపోతుపాలెంనకు చెందిన కత్తిక శ్రీనివాసరావు(50) అదే గ్రామానికి చెందిన ముక్కు రామకృష్ణతో కలిసి బైక్పై విజయవాడకు ప్రయాణమయ్యారు. పామర్రు మండలం బల్లిపర్రు అడ్డరోడ్డు వద్ద వెనుక నుంచి టిప్పర్ అతి వేగంగా వచ్చి బైక్ను బలంగా ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామకృష్ణ కాలికు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతిని పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. పామర్రు సీఐ నాగప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. టిప్పర్ డ్రెయివర్ నిద్ర మత్తులో ఉండటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. టిప్పర్ డ్రెయివర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ కె.శ్రీనివాస్ తెలిపారు. నందివాడ: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని తమిరిశ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తమిరిశ గ్రామానికి చెందిన అలవాల నాగరాజు (36), వెంకటలక్ష్మి దంపతులు. నాగరాజు దినసరి కూలీగా జీవిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో విద్యుత్ సరఫరా జరగడంలేదని తీగలను సరిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. స్పృహలేకుండా పడవున్న నాగరాజును అతని భార్య వెంకటలక్ష్మి గమనించి బంధువుల సాంయంతో 108 అంబులెన్స్లో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే నాగరాజు మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. ఎగువ నుంచి 1250 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యాన్నదానానికి విజయవాడ గాంధీనగర్ కు చెందిన గుండా కృష్ణకార్తీక్ కుటుంబం రూ. 1,01,116 విరాళాన్ని అందజేసింది.చల్లపల్లి: స్థానిక లక్ష్మీపురం రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం కృష్ణా జిల్లా జేసీ ఎం. నవీన్ సందర్శించి, ఎరువుల పంపిణీపై అధికారులకు పలు సూచనలిచ్చారు. -
కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలి
పెనమలూరు: తల్లులు కిల్కారి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కిల్కారి స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు. పోరంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రధాన మంత్రి సురక్షిత్ అభియాన్(పీఎంఎస్ఎంఏ) కార్యక్రమంలో భాగంగా మాతృత్వ కిల్కారి సేవలపై తల్లులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ ప్రతి గర్భిణి నాలుగో నెల నుంచి బిడ్డ పుట్టిన సంవత్సరం వరకు కిల్కారి కాల్స్ ప్రతి నెలకు ఒకసారి వస్తాయన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ ప్రతి గర్భిణి ప్రతీ నెల 9వ తేదీన ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని మందులు తీసుకోవాలన్నారు. కిల్కారి పీవో రాజు, సీహెచ్వో కుమార్, హెచ్వీ పుష్పావతి, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. జి.కొండూరు: ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీఏఐఎంఎస్ యాప్తో అర్హులైన రైతులకు రాయితీపై ఎరువులు సకాలంలో అందుతాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మండల పరిధిలోని వెలగలేరు గ్రామంలో శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణంలో యాప్ ద్వారా ఎరువుల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎరువులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రైవేటు ఎరువుల దుకాణాలతో పాటు సహకార సొసైటీలు సైతం ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. జిల్లా వ్యవసాయాధికారి విజయకుమారి, తహసీల్దార్ రాణి, ఏఓ సూరిబాబు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఓపెన్ స్కూల్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకన కార్యక్రమం రెండో రోజు సజావుగా కొనసాగిందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపా రు. మంగళవారం ఆయన మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించి ప్రక్రియను పరిశీలించారు. మూల్యాంకనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి అయ్యే లా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఓ చెప్పారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో వేద, స్మార్త విద్యలను అభ్యసించేందుకు ఆసక్తి కలిగిన బ్రాహ్మణ బాలుర నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విధిగా ఉపనయనం జరిగి, సంధ్యావందనం చేస్తూ తెలుగు చదవగలిగిన బాలురు ప్రవేశానికి అర్హులని పేర్కొన్నారు. స్మార్త విద్యకు 10 నుంచి 13ఏళ్లు, వేద విద్యకు 10 నుంచి 12 ఏళ్లు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పాఠశాలలో రుగ్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం, అపస్తంబ పౌరోహిత్య స్మార్త విద్యను బోధిస్తారు. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, వస్త్రాలు, వైద్య సదుపాయాలతో పాటు కోర్సు పూర్తి చేసి తుది పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యోగ్యతా పత్రాలతో పాటు రూ. 3లక్షలు స్టయిఫండ్ను అందిస్తారన్నారు. ఇతర వివరాలకు పోరంకిలోని దేవస్థాన వేద పాఠశాల ప్రిన్సిపాల్ను 9440136924లో సంప్రదించవచ్చన్నారు. -
అహంకారాన్ని చూపిస్తారా?
బాధితుల్ని ఓదార్చాల్సిందిపోయి.. చిలకలపూడి(మచిలీపట్నం): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను ఓదార్చాల్సింది పోయి.. రాష్ట్ర మంత్రులు అహంకారంతో వ్యవహరించడం, సంస్కారం లేని మాటలు మాట్లాడటం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిన సమయంలో అహంకారాన్ని చూపిస్తారా? అని మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన సెక్షన్లలో 22 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా.. పది మందితో పని చేయించడం వల్ల ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఏడాదికి 3.2 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18 వేల మంది కార్మికులు పనిచేయగా.. నేడు 7.2 మిలియన్ టన్నుల ఉత్పాదక సామర్థ్యమున్నా కేవలం 8 వేల మంది కార్మికులు పనిచేయిస్తున్నారని వివరించారు. అనుభవం ఉన్న కార్మికులను గత రెండేళ్లలో వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించేశారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి భరోసా ఇవ్వాల్సిందిపోయి.. ‘మీ ఇంట్లో వాళ్లు చనిపోయారా?’ అంటూ మంత్రి నారా లోకేశ్ అహంకారంగా మాట్లాడటం ఏమిటని పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి పరిహారం ప్రకటించలేదని విమర్శించారు. 2011లో ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులకు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారాన్నే.. ఇప్పుడు యాజమాన్యం ద్వారా ఇస్తామనడం చంద్రబాబు ప్రభుత్వానికే చెల్లిందన్నారు. ప్రమాదం జరిగిన గంట ల్లోనే కేంద్ర మంత్రి ఘటనా స్థలానికి రాగా.. ఒక రోజు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్, అన్ని శాఖల మంత్రి నారా లోకేశ్ రావడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య తీరుకు నిదర్శనమన్నారు. ‘గతంలో కార్మిక సంఘాల సమావేశంలో తాను మాట్లాడినప్పుడు.. చెయ్యి ఎత్తకపోవడం వల్లే స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్ ఇప్పించలేదు. జగన్మోహన్రెడ్డి ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తే మేమే ఆపాం’ అని డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ మాట్లాడారంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడిన వీడియోను పేర్ని నాని ప్రదర్శించారు. ‘స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని వైఎస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు పంపించింది. అందువల్లే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని 2025 జనవరిలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పిన వీడియోను చూపించి పవన్కల్యాణ్ను పేర్ని నాని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజైనా ప్లాంట్ను సందర్శించావా? అని పవన్ను నిలదీశారు. నాడైనా, నేడైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని.. ప్రతిపక్షంగా ఉన్న సమయంలో పోరాటం చేస్తామని.. అధికారంలో ఉంటే ప్రైవేటీకరణకు అడ్డం పడతామని పేర్ని నాని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎంవైఎస్ జగన్ ప్రకటించిన విధంగా.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబసభ్యులకు శాశ్వత ఉద్యోగం కల్పించా లని పేర్ని నాని డిమాండ్ చేశారు. మంత్రులు లోకేశ్, పవన్కల్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకమని పునరుద్ఘాటన -
దోష రహిత ఓటర్ల జాబితా కీలకం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు దోష రహిత ఓటర్ల జాబితా కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. దోష రహిత ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో సర్పై జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్వైజర్లు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంతో కలిసి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సర్ ప్రక్రియలోని ఐదు దశలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) అందజేత, స్వీకరణ, ఫారాల డిజిటైజేషన్, పూర్తి షెడ్యూల్ తదితర అంశాలను వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఈ నెల 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని పేర్కొన్నారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందన్నారు. క్లయిమ్లు పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. అర్హులను ఓటరు జాబితాలో ఉండేలా చేయడంతోపాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి వారి ఓట్లను తొలగించి స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా లక్ష్యంగా సర్ ప్రక్రియ చేపట్టారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ, స్వీకరణ, డిజిటైజేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను పాల్గొన్నారు. -
గ్యాస్, పెట్రో ధరలను తక్షణమే రద్దు చేయాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు, పన్నులు పెంచి ప్రజలను పీక్కుతింటున్నాయని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రేట్లు పెంపుదలకు నిరసనగా రాస్తారోకో జరిగింది. పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు హైవేపై బైఠాయించారు. ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, ధరల భారాలకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హైవేపై అరగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ధరలు పెంచడంలో రికార్డులు బ్రేక్.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, ఇతర వామపక్షాల నేతలు మాట్లాడుతూ.. 12 సంవత్సరాలు పాలించి మోదీ రికార్డు బ్రేక్ చేయడం కాదు, పన్నులు, ధరలు పెంచడంలో రికార్డులు బద్దలు కొట్టారని విమర్శించారు. పెట్రోలియం ఉత్పత్తులపై 12 ఏళ్లలో రూ.40 లక్షల కోట్లు పన్నులు వసూలు చేసిన పాపం కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి చమురు రేట్లు పెంచడం దుర్మార్గమన్నారు. రష్యా, ఇరాన్ నుంచి చౌకగా చమురు లభిస్తున్నా అధిక రేట్లకు అమెరికా చెప్పిన విధంగా కొనుగోలు చేసి దేశ ప్రజలపై భారం మోపటం గర్హనీయమన్నారు. ఎన్నికలకు ముందు అదనపు పన్నులు తగ్గిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు కూటమి మోసం చేసిందని దుయ్యబట్టారు. ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా పెట్రోల్పై 35 శాతం, డీజిల్పై 27శాతం పన్నులు వసూలు చేయటం అమానుషమన్నారు. వామపక్ష పార్టీల నాయకులు హరినాథ్, వెంకటేశ్వర్లు, అమర్నాథ్, డి.కాశీనాథ్, జి.కోటేశ్వరరావు, ప్రసాద్ బాబు పాల్గొన్నారు. రాస్తారోకోలో వామపక్ష పార్టీల నాయకులు -
గ్రామ సచివాలయ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నంటౌన్: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ కృష్ణా జిల్లా కార్యవర్గం ఏకగ్రీ వంగా ఎన్నికై ంది. నోబుల్ కళాశాల ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్నికల కార్యక్రమంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ సంఘ జిల్లా చైర్మన్గా పువ్వుల కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చాట్ల మేరీ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ హాజరైన ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బగ్గా జగదీష్, అసోసియేట్ చైర్మన్ పిల్లి హరీశ్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జేఏసీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఉద్యోగులకు ఇప్పటికే రావాల్సిన స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, అసంబద్ధమైన హేతుబద్ధీకరణ ప్రక్రియ, తాత్కాలిక డెప్యుటేషన్ల రద్దుతో పాటు ఇతర ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై రానున్న కాలంలో వివిధ శాఖల సంఘాల నాయకులతో చర్చించి త్వరలోనే ఒక బలమైన ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర కమిటీ కో–చైర్మన్లు చేవూరి వెంకటేశ్వర్లు, బెక్కం రవితేజ, గంటా రామకృష్ణతో పాటు నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులు బి.సుకుమార్, కృష్ణ చైతన్య, రాజు, క్రాంతి, హనుమంతరావు, విశ్వ, రామకష్ణ, హేమలత, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి యోగా పోటీలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతి ఒక్కరికీ యోగాపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర–2026లో భాగంగా ఆదివారం నుంచి యోగా పోటీలు నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఓ ప్రకట నలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు గ్రామ/వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్ – గ్రాస్రూట్స్ వెల్నెస్ ఇతివృత్తంతో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఔత్సాహికులు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో విజేతలు మండల స్థాయికి, మండల స్థాయిలో విజేతలు జిల్లాస్థాయికి, అక్కడ విజేత లుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఈ నెల పది నుంచి 12వ తేదీ వరకు యూనిటీతో యోగా – బ్రిడ్జింగ్ కమ్యూనిటీస్ థీమ్తో మండలస్థాయిలో, ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు యోగా అండ్ యూత్ – బిల్డింగ్ ఏ హెల్దీ ఫ్యూచర్ థీమ్తో జిల్లాస్థాయిలో, ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు యోగాంధ్ర – ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్తో రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీలో పోటీలు ఉంటాయని.. వ్యక్తిగత కేటగిరీలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామం ప్రదర్శనలు, గ్రూపు కేటగిరీలో సింక్రనైజ్డ్ గ్రూపుయోగా ఉంటుందన్నారు. యోగా సాంగ్, యోగా క్విజ్, యోగా స్లోగన్, యోగా ఎస్సే పోటీలు కూడా ఉంటా యని వివరించారు. 10 నుంచి 18 ఏళ్ల వారికి జూనియర్, 19 నుంచి 35 ఏళ్ల వారికి యంగ్, 35 ఏళ్లు, ఆపైన వారికి సీనియర్ గ్రూప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పోటీల విజేతలను రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సత్కరించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలకు 84980 12833, 83413 64185 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. -
ఉపాధి కూలీలపై ఎఫ్ఏ నిర్లక్ష్యం
క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండా పని బాగోలేదన్న ఫీల్డ్ అసిస్టెంట్ పెడన: ఉపాధి కూలీలకు పనులు కల్పించి ఏ రోజు కూలి డబ్బులు ఆ రోజే ఇచ్చేస్తున్నామని గొప్పలు చెబుతున్న చంద్రబాబు పాలనలో వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మండలంలోని నందిగామలో జరుగుతున్న ఉపాధి పనులే ఇందుకు నిదర్శనం. వారం రోజులు పనులకు వెళ్లినా రూ.1000 కూడా కూలి రావడంలేదని కూలీలు వాపోతున్నారు. ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.270 నుంచి రూ.320 నగదు వచ్చేలా పనులు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు ముందుకు వేయడం లేదనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పనులు చేసిన చోట హాజరు నమోదవక ఎక్కడో దూరంగా వెళ్లి ఆన్లైన్ చేస్తుండటాన్ని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు అవకా శంగా తీసుకుని కూలీలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పనిచేసిన రోజు హాజరు తీసుకోని ఎఫ్ఏ మండలవలోని నందిగామ దళితవాడకు చెందిన ఉపాధి కూలీలు 50 మందికిపైగా శుక్రవారం పనికి వెళ్లారు. వారికి మేట్లు సుధాకర్, ప్రకాష్ పని కల్పించారు. ఆ పనిని పూర్తి చేసిన శ్రామికుల హాజరు తీసుకోవాల్సి ఫీల్డ్ అసిస్టెంట్ పోలగాని అమలేశ్వరరావు పని ప్రదేశానికి రాలేదు. సిగ్నల్ అందే చోటకు రావాలని చెప్పడంతో అంత ఎండలో రాలేమని, పనిచేసే చోట సిగ్నల్ అందుతోందని మేట్లు కూడా చెబుతున్నారని కూలీలు చెప్పినా వినిపించుకోకుండా చేసిన పని బాగోలేదని పేర్కొంటూ కూలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు శనివారం కూలీలకు పనులు కల్పించకుండా ఖాళీగా కూర్చో బెట్టారు. నందిగామ దళితవాడ వద్ద పనులు జరిగిన చోటుకు ఎఫ్ఏ వెళ్లకుండా పని బాగోలేదనే విషయంతో పాటు ఉపాధి కూలీల అటెండెన్సు చేసిన పని రోజున వేయకపోవడం, మరుసటి రోజున పనులు కల్పించకపోవడం వంటి విషయాలపై ఏపీఎంను పంపించి విచారణ చేయిస్తాం. గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఏం జరిగిందో తెలుసుకుంటా. ఉపాధి కూలీలకు న్యాయం చేస్తాం. – ఎ.అరుణకుమారి, ఎంపీడీఓ, పెడన హాజరు కోసం సిగ్నల్స్ అందడం లేదనే సాకుతో తమను ఫీల్డ్ అసిస్టెంట్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూలీలు దుయ్యబడుతున్నారు. శుక్రవారం పని చేయగా హాజరు వేయకుండా పనిచేయని రోజు హాజరు తీసుకునేందుకు ఎఫ్ఏ ప్రయత్నించడంపై కూలీలు మండిపడ్డారు. ఏ రోజు పనులకు ఆ రోజు కూలి ఇవ్వకుండా, మరుసటి రోజు పని కల్పించకుండా ఖాళీగా కూర్చోబెట్టడం ఏమిటంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీఓ వజీర్ దృష్టికి తీసుకువెళ్లగా.. పని బాగోలేదని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారని, తనకు రావడం కుదరదని, నందమూరులో ఉన్నానని బదులిచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డుకు వెళ్లకుండా పని బాగోలేదని ఫిర్యాదు చేస్తే ఏపీఎం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. -
పీహెచ్సీలో డీహెచ్ తనిఖీలు
పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ పద్మావతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆన్లైన్ విధానం ద్వారా ఈహెచ్ఆర్, ఈ ఔషధి, ఫీల్డ్ సిబ్బంది సేవలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందు తున్న రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అన్నిరకాల మందులు అందుబా టులో ఉన్నదీ లేనిదీ పరిశీలించారు. ఆస్పత్రిలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఐఓ డాక్టర్ప్రేమ్చంద్, వైద్యాధికారి సాయిలలిత, డాక్టర్ బిజిలీ శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్తికేయుడి ఆలయానికి రూ.లక్ష విరాళం మోపిదేవి: స్థానిక శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన సీహెచ్.వెంకటరామిరెడ్డి, వాసవి దంపతులు శనివారం రూ.1,05,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధు సూదనరావుకు విరాళాన్ని అందజేశారు. చిలక లూరిపేటకు చెందిన ఎం.సి.మనోజ్, ఉమా వైష్ణవి 970 గ్రాముల వెండి నాగపడగ సమర్పించారు. ఆలయ అధికారి కిషోర్ పాల్గొన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వర్షాకాలంలో అంతరాయాలు తలెత్తకుండా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీ సీపీ డీసీ ఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి సూచించారు. గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు, ఈదురుగాలులు వంటి అత్య వసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ తగ్గింపు, రెవెన్యూ కలెక్షన్లు, నూతనంగా నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పనుల పురోగతి వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని, వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యా దులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, పలువురు సీజీఎంలు, ఎస్ఈలు, జీఎంలు, ఈఈలు పాల్గొన్నారు. యోగా నిర్వహణకు వెస్ట్ బైపాస్ పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన సామూహికంగా యోగా నిర్వహించేందుకు వెస్ట్ బైపాస్ను వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో గుంటూరు జిల్లా అధికారులతో కలిసి వెస్ట్బైపాస్ ప్రాంతాలను పరిశీలించారు. యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు, యోగా సాధకులు, విద్యార్థులు , వివిధ శాఖల ప్రతినిధుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, తాగునీటి సదుపాయం, వైద్య సేవలు, అత్యవసర సహాయక ఏర్పాట్లు, వేదిక నిర్మాణం , ప్రజల రాకపోకలకు సంబంధించిన అంశాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరుజిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, నగర డీసీపీ కృష్ణకాంత్ పటేల్, కేజీవి సరిత తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 20269అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. క్రీడల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను ఆయన శనివారం ప్రారంభించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): సిటీ ఏఆర్ అదనపు ఎస్పీగా ఎన్.వి.రమణ శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం సీపీ రాజశేఖరబాబును మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. -
28న స్విమ్మింగ్ జట్ల ఎంపికలు
వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్ వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేవదాయ శాఖ ఆస్తులను కొట్టేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటుగా బీజేపీ అధ్యక్షుడు మాధవ్లకు భగవంతుడు అంటే భయం లేకుండాపోయిందన్నారు. అందువలనే హిందూ దేవాలయాలకు చెందిన 1,38,848 ఎకరాల భూముల్ని దేవాలయాల ఆస్తుల జాబితా నుంచి, రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితా 22 (1) నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తుల పేర్లపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములను అమ్మకం చేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని దాని కోసమే దేవదాయ శాఖ ఆస్తుల జాబితా నుంచి తొలగించే బాధ్యతను ఆ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్కు అప్పగించారని ఆయన ఆరోపించారు. దేవాలయాల భూముల్ని కొట్టేయాలని చూస్తున్న వారు భగవంతుడి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఒక్క సంతకంతో దేవుడు ఆస్తుల జాబితా నుంచి భూములను తొలగించే నిర్ణయం సాధారణ నిర్ణయం కాదన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్గా అభివర్ణించారు. హిందూ ధర్మానికి హిందూ దేవాలయాల భూములకు శాశ్వత నష్టం కలిగించే ఈ మెమోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హిందూ ధర్మానికి, ఆలయాలకు ఇంత ప్రమాదం జరుగుతుంటే స్వామీజీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారిపై గొల్లపూడి వద్ద డ్రైవర్ పక్కన ఉండే బానెట్లో నుంచి పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు వచ్చాయి. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది వరకు ప్రయాణికులున్నారు. డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను దింపేశారు. భయపడిపోయిన కొంత మంది యువకులు ఎమర్జెన్సీ ద్వారం, కిటికీల నుంచి బయటపడ్డారు. బానెట్ కింద ఉండే ఇంజిన్ వద్ద ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడంతో పొగలు ఆ తరువాత మంటలు వచ్చి ఉంటాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఎండల తీవ్రత వల్ల కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. -
అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కంచికచర్ల: నిత్యావసర సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన యువకుడు ట్రాక్టర్ ఢీకొని దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో మరొకరు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కంచికచర్లలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాధ్ శనివారం తెలిపిన కథనం మేరకు... మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ(28) ఓ ఐరన్ షీట్లు తయారు చేసే ప్యాబ్రిక్స్లో పని చేస్తుంటాడు. శుక్రవారం రాత్రి పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన అతడికి కుటుంబసభ్యులు నిత్యావసర సరుకులు తీసుకురావాలని చెప్పగా తన స్నేహితుడు షేక్ షరీప్బుడే కలసి స్కూటీపై దుకాణానికి కంచికచర్ల వెళ్లాడు. సరుకులు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా విజయవాడ వైపు నుంచి కంచికచర్ల వైపునకు కంకరలోడుతో వస్తున్న ట్రాక్టర్ వీరి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహ్మద్రఫీ తలకు తీవ్ర గాయాలు కాగా షరీప్కు కూడా తీవ్ర గాయమయింది. రఫీని వైద్య చికిత్సకోసం ప్రవేటు వాహనం ద్వారా విజయవాడలోని గొల్లపూడి ప్రవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. షరీప్ బుడేను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. రఫీ భార్య కౌసర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పేదలకు కూల్చివెతలు
జేసీబీలతో రంగంలోకి దిగిన పోలీసు, రెవెన్యూ అధికారులు రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా శతాబ్దానికి పైగా నివాసం ఉంటున్న నిరు పేదల ఇళ్లు తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ జేసీబీలతో రంగంలోకి దిగి బలవంతంగా నివాసాలు తొలగించేందుకు యత్నించగా పేదలు అడ్డుకున్నారు. తహసీల్దార్ సుగుణ, ఏసీపీ దామోదర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది హడావుడి చేస్తూ ఇళ్లు తొలగించ డానికి పూనుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధిత పేదలు, స్థానిక నాయకులు జేసీబీలను అడ్డుకోవడంతో అధికారులు చేసేదేమీ లేక ప్రస్తుతానికి వెను తిరిగారు. 100 ఏళ్లకు పైగానే స్థిర నివాసాలు గ్రామంలోని రైవస్ కాలువ, సీడబ్ల్యూసీ గోదాము సమీపంలో 100 సంవత్సరాలకు పైగానే నిరు పేదలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం 83 గృహల్లో పేదలు నివస్తుండగా, మరో 20 మంది చిన్నపాటి దుకాణాలు ఉన్నాయి. ఇటీవల రెవెన్యూ, రైల్వే అధికారులు ఓవర్ బ్రిడ్డి నిర్మాణమంటూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రాంతంలో కొలతలు తీసుకున్నారు. రహదారికి రెండు వైపులా ఉన్న ఇళ్లను తొలగించాలని హుకుం జారీ చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సిర్థ నివాసాలు ఏర్పాటు చేసుకుని బతుకుతున్నామని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తమను సంప్రదించకుండా ఇళ్లు ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రెండు రోజులుగా ఫ్లై ఓవర్ బాధితుల పోరాట కమిటీగా ఏర్పడి ఇళ్ల తొలగింపుపై అభ్యంతరాలు తెలుపుతున్నారు. శనివారం ఇళ్లు కూల్చివేతకు అధికారులు రావడంతో బాధితులు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి శీలం రంగారావు, మహిళా నాయకురాలు పరిమి సింధు, దండు సుబ్రహ్మణ్యరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయకులు వెంకటేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు మద్దతు తెలిపి బాధితుల నిరసనలో పాల్గొన్నారు. ఇళ్ల కూల్చివేతకు ముందుగానే బాధితులకు ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేశారు. -
యువకుడి హత్య కేసులో నిందితులు అరెస్ట్
గన్నవరం: మండలంలోని దావాజీగూడెంలో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు గన్నవరం పోలీస్స్టేషన్లో కేసు వివరాలను సీఐ బీవీ శివప్రసాద్ మీడియాకు వివరించారు. హత్యకు గురైన కంకిపాడు మండలం వేల్పూరుకు చెందిన పామర్తి హేమకుమార్కు గన్నవరం మండలం అల్లాపురానికి చెందిన వెలవెల జయంత్ కుటుంబాల మధ్య గత రెండేళ్లుగా వివాదాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 30వ తేదీన మద్యం తాగిన హేమకుమార్, జయంత్ పరస్పరం ఘర్షణకు దిగారు. వీరిద్దరికీ పరిచయస్తుడైన డొక్కా దిలీప్ ఈ ఘర్షణను అడ్డుకున్నాడు. ఈ తరుణంలో జయంత్ తన బైక్ తాళంతో హేమకుమార్ మెడపై పొడవగా చిన్న గాయమైంది. దీనికి ప్రతీకారంగా జయంత్ కోసం గాలిస్తున్న హేమకుమార్, అతని స్నేహితులు లోకేష్, ఖాదర్ స్థానిక బజాబ్ షోరూమ్ వెనుక ఉన్న మైదానంలో క్రికెట్ ఆడుతున్న డొక్కా దిలీప్పై దాడి చేసి కొట్టారు. అదే రోజు రాత్రి పాటిటెక్నిక్ కాలేజీ సమీపంలో సిగరెట్ తాగుతున్న హేమకుమార్పై జయంత్ దాడి చేసి కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన హేమకుమార్ను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందినట్లు సీఐ శివప్రసాద్ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడైన జయంత్తో పాటు హత్యకు సహకరించిన అతని స్నేహితులు గుణదీప్, భావధీర్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు, హత్య చేసిన తర్వాత పరారయ్యేందుకు వినియోగించిన మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఈ ముగ్గురు నిందితులను నూజివీడు కోర్టుకు హాజరుపర్చగా, ఈ నెల 18వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించటంతో నెల్లూరు సెంట్రల్ జైల్కు తరలిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా సీఐ చెప్పారు. -
బెజవాడలో చీకటి సామ్రాజ్యం!
అలవిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం.. వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఫలితంగా రెండేళ్లలోనే జనాగ్రహాన్ని చవిచూస్తోంది. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో ప్రజానీకం స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్ల ప్రతులను దహనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ నయవంచనపై బిగిసిన పిడికిళ్లు సాక్షి టాస్క్ఫోర్స్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) ఓ పార్లమెంట్ సభ్యుడిపై మరోసారి ఫైర్ అయ్యారు. విజయవాడను భయాందోళనకు గురిచేయడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వాటి వివరాలతో తన ఫేస్బుక్ ఖాతాలో పెద్ద పోస్టు పెట్టారు. ఆయన పోస్టులో ఇలా ఉంది.. ప్రస్తుత ఎంపీపై వరుసగా వెలుగులోకి వస్తున్న ఆరోపణలు.. రాజకీయ, వ్యాపార సామాజిక వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. భూ ఆక్రమణలు, వివిధ రకాల అక్రమ దందాలు, క్రీడా సంస్థల్లో అవినీతి, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం వంటి అంశాల వెనుక పార్లమెంట్ సభ్యుడి ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉందనే ఆరోపణలు పౌర సమాజంలో కలకలం రేపుతున్నాయి. క్రీడా రంగాన్ని కూడా వదలకుండా సదరు ఎంపీ తన అధికార ప్రభావాన్ని వినియోగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వాణిజ్య సముదాయంపై ఒత్తిళ్ల వివాదం.. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఒక ప్రముఖ వాణిజ్య సముదాయానికి సంబంధించి పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీ దిశానిర్దేశంతోనే ఒక ప్రవాస భారతీయ మహిళ ఏర్పాటు చేయదలచిన వ్యాపార సంస్థ (బ్రూవరీ) కోసం, సదరు భవనాన్ని రెండేళ్లపాటు అద్దె లేకుండా అందించాలని భవన యజమానిపై ఉన్నతాధికారుల స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. భవనాన్ని ఉచితంగా ఇవ్వకపోతే దానిని ‘అనధికార నిర్మాణం’గా పేర్కొంటూ కూల్చివేస్తామని మున్సిపల్ అధికారుల ద్వారా హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం ఉంది. ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదంలో టాస్క్ఫోర్స్ పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతూ, లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలో అక్రమాలను ప్రశ్నించిన సొంత పార్టీ వారిపైనే పోలీసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. అరెస్ట్ చేసిన అనంతరం వారిని నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడమే కాకుండా, కక్ష సాధింపులో భాగంగా ఏకంగా సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద అక్రమ కేసులు బనాయించారు. ఎంపీ నీడలో రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక, మట్టి మాఫియా, ఫ్లైయాష్ దందా, పేకాట క్లబ్స్, ప్రైవేటు సెటిల్మెంట్స్ యథేచ్ఛగా సాగుతున్నాయి. వారికి టాస్క్ఫోర్స్ అండగా నిలుస్తోంది. విజయవాడలో ఓ విద్యాసంస్థ భూమి ఆక్రమించే యత్నాలు సాగుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కారును టిప్పర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గొల్లపూడికి చెందిన యడవల్లి ఆంజనేయులు, ఆయన భార్య అంజలిదేవి గుంటూరు నుంచి కారులో గొల్లపూడి బయలుదేరారు. వెస్ట్ బైపాస్లో నల్లకుంట వద్దకు చేరుకున్న కారు గొల్లపూడి వైపు తిరగకుండా కొంతదూరం ముందుకు వెళ్లిపోయింది. ఫీడర్ రోడ్డులో కారు వెనక్కు నడుపుతూ గొల్లపూడి వస్తుండగా టిప్పర్ వచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో కూర్చున్న అంజలి దేవి( 59) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ఉన్న ఆమె భర్త ఆంజనేయులు, మనవడు సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్మార్ట్ పోలీసింగ్లో ప్రతిభకు ప్రశంస
లబ్బీపేట(విజయవాడతూర్పు): శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు వేగంగా సేవలు అందిస్తూ.. స్మార్ట్ పోలీసింగ్లో ప్రతిభ చూపిన వారికి శుక్రవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ప్రశంసాపత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతివారం ఇస్తున్న ర్యాంకింగ్లో 16 వారాలుగా స్మార్ట్ పోలీసింగ్లో జిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుండటంతో అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సైబర్ క్రైమ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ నేరాలు జరగకుండా చూడటం, ఒకవేళ జరిగినా సాంకేతికత, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉపయోగించి నిందితులను వెంటనే పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డీసీపీ(అడ్మిన్) కేజివి సరిత, సైబర్ క్రైమ్ డీసీపీ కె. కృష్ణప్రసన్న, ఏసీపీ భానుప్రకాష్రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: దుర్గగుడి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద నవహారతుల కార్యక్రమం శుక్రవారం పునఃప్రారంభమైంది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణానదికి జలహారతులు ఇచ్చారు. అనంతరం నది ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంతంలో నవహారతులు ఇచ్చారు. గతంలో కృష్ణానదిలో ఫంటు ఏర్పాటు చేసి నవహరతులు ఇచ్చేవారు. హారతులతో పాటు హారతులు తిలకించడం, ఉచ్ఛరించడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేవారు. ఇప్పుడు నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేసి పూజారులు హారతులు ఇచ్చారు. దుర్గ గుడి ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు వెంకటనాగ కిశోర్ కుమార్, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మృగశిరకార్తె ప్రవేశం సందర్భంగా ఈనెల 8, 9న ఊపిరితిత్తులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు వనమూలికలతో తయారు చేసిన చేపమందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు కొండపల్లికి చెందిన మహ్మద్ మహ్మద్ ఆలీ, మహ్మద్ మసూద్ ఆలీ (జిన్నా) సంయుక్తంగా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, పారిశ్రామిక కాలుష్యం ఈ వ్యాధులకు ప్రధాన కారణాలన్నారు. చేపమందు కోసం వచ్చేవారు ప్రాణంతో ఉన్న బురదమట్ట, కొరమేను చేపపిల్లను వెంట తెచ్చుకోవాలన్నారు. బతికున్న చేపకు వనమూలికల ఔషధం తినిపించి, రోగికి మింగిస్తామని, శాఖాహారులకు అనుపానంతో మందు ఇస్తామని వారు ఆ ప్రకటనలో తెలిపారు.


