NTR
-
ప్రభుత్వ కర్కశత్వంపై అక్షర గర్జన
విజయవాడ స్పోర్ట్స్/జి.కొండూరు: ‘సాక్షి’ కార్యాలయాలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దురుద్దేశంతో చేస్తున్న దాడులను ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు, కార్మిక సంఘాలు, న్యాయవాదులు, వామపక్ష నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. నాణేనికి మరోవైపు ఉన్న ప్రపంచాన్ని చూపిస్తూ ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షిపై దాడులు చేయడం సిగ్గుచేటు అన్నారు. పత్రిక కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని నినదించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను రెడ్బుక్ ప్రమాదంలో పడేసిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.సాక్షి కార్యాలయాలపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడులకు నిరసనగా విజయవాడ గాం«దీనగర్లోని ధర్నా చౌక్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఇచి్చన పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుంచి జర్నలిస్టు, జర్నలిస్టు సంఘాల నాయకులు తరలివచ్చి ధరాలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా కొనసాగింది.టీడీపీ గూండాల చర్యలకు నిరసనగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడండి, రెడ్బుక్ పాలనను అంతం చేయండి, పత్రికా కార్యాలయాలపై దాడులు సిగ్గు.. సిగ్గు.. అనే నినాదాలతో ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్, సాక్షి ప్రతినిధులు బీవీ రాఘవరెడ్డి, విశ్వనా«థ్రెడ్డి, ఎన్.సతీ‹Ù, ఓబుల్రెడ్డి వెంకట్రామిరెడ్డి, చందు శివాంజనేయులు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర పాల్గొన్నారు.సాక్షిపై కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం మీడియా సంస్థలు తప్పులు, పొరపాట్లు చేశాయని భావిస్తే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతమాత్రం సమంజసం కాదు. ఇది కేవలం కక్షసాధింపు చర్యే. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ను ఈ ప్రభుత్వం దురి్వనియోగం చేస్తోంది. సాక్షిపై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ఖండిస్తున్నాం. – కె.పోలారి, ఇఫ్టూ నేతనా సర్విసులో ఇలాంటివి చూడలేదు నా సర్విసులో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై ఇటువంటి దాడులు చూడలేదు. మీడియా సంస్థలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూడటం ప్రభుత్వానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – వెంకటేశ్వరరెడ్డి, రిటైర్డ్ పోలీసు అధికారి నిరంకుశ చర్య మంచిది కాదు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులను, దమన కాండలను జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకోవడం దుర్మార్గం. జర్నలిస్టులు, మీడియా సంస్థలపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి ప్రదర్శించడంమంచి చర్య కాదు. – సీహెచ్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి, చిన్న, మధ్య తరగతి పత్రికల సంఘం (సామ్నా) -
మాజీ సైనికుల కార్పొరేషన్ నెలకొల్పాలి
నగరంపాలెం: మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు అన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణను రూపొందించాలని అన్నారు. దేశ రక్షణలో విధులు నిర్వర్తించి, మిలటరీ నుంచి బయటకు వచ్చిన కొందరు సైనికులు అనారోగ్యాలతో మరణించారన్నారు. తద్వారా మాజీ సైనికుల కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐనంపూడి రత్నప్రసాద్ మాట్లాడుతూ కొందరి సైనికుల కుటుంబ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. మాజీ సైనికుడు వాకా ఆదినారాయణ, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు -
యోగాంధ్ర ప్రత్యేక గీతం టీజర్ విడుదల
విజయవాడస్పోర్ట్స్: వోల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ నేతృత్వంలో యోగాంధ్రపై రూపొందించిన ప్రత్యేక గీతానికి సంబంధించిన వీడియో టీజర్ను శాప్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఈనెల 21న 5 లక్షల మందితో విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. వోల్గా ఆర్చరీ అకాడమీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రత్యేక గీతాన్ని రూపొందించడం ప్రశంసనీయమన్నారు. వోల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఏపీ స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో ప్రపంచంలోనే యోగాపై తొలిసారిగా ప్రత్యేక గీతాన్ని రూపొందించా మన్నారు. ఈ గీతానికి తానే స్క్రిప్ట్ సిద్ధం చేశానని, రచయిత సుద్దాల అశోక్తేజ పాటను రచించారని, శ్రీకృష్ణ పాడారని వివరించారు. రెండురోజుల్లో పూర్తి పాట విడుదల చేస్తామని తెలిపారు. శాప్ డైరెక్టర్ సంతోష్ కుమార్, శాప్ ఏఓ వెంకటరమణ నాయక్, స్పోర్ట్స్ ఆఫీసర్లు, ఏడీలు పాల్గొన్నారు. -
డాక్టర్ సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం
కంకిపాడు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలోని కృష్ణాజిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి.సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం లభించింది. విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుంటూరు లాంఫామ్లో నిర్వహించిన సభలో గురువారం ఆమె వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. చెరకు పంటలో పీక పురుగు, పొలుసు పురుగు ఉధృతి, యాజమాన్యం, జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చెరకు పంటలను ఆశించే వివిధ పురుగుల యాజమాన్యం గురించి నిర్వహించిన పరిశోధనలు, బిందు సేద్యం పద్ధతిలో ఎరువులు అందించే విధానంపై పరిశోధనలకు సుధారాణికి ఉత్తమ శాస్త్రవేత్త పురస్కారం దక్కింది. ఆమె బంగారు పతకం, ప్రశంసాపత్రం అందుకున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మీ దేవి, వ్యవసాయశాఖ కమిషనర్ ఢిల్లీరావు, పరిశోధన సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ పాల్గొన్నారు. ఉత్తమ అవార్డు లభించినందుకు కేవీకే ఘంటసాల, వ్యవసాయశాఖ సిబ్బంది, కృష్ణాజిల్లాలోని పలువురు శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. డ్రగ్స్ కేసులో మరో నిందితుడు అరెస్ట్ పటమట(విజయవాడతూర్పు): రామవరప్పాడు రింగ్ వద్ద ఈ నెల 4న వాహనాల తనిఖీలో భాగంగా పట్టుబడిన ఎండీఎంఏ(మిథలిన్ డయాక్సి మిథపేటామిన్) కేసులో నిందితుడిగా ఉన్న పామర్రుకు చెందిన వల్లభనేని మనోహర్ను పటమట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా తాజాగా గురువారం మనోహర్ను చాకచక్యంగా రామవరప్పాడు వద్ద అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన మరో వ్యక్తిని, యూపీకి చెందిన మరో వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి ఉంది. గంజాయి సరఫరా చేస్తున్న ఇరువురు అరెస్ట్ 9 కిలోల గంజాయి స్వాధీనం పటమట(విజయవాడతూర్పు): పటమట ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సరఫరా చేస్తున్న ఇరువురు వ్యక్తులను పటమట పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పటమటలంక చేపల మార్కెట్ వద్ద గంజాయి విక్రయం జరుగుతోందని బుధవారం రాత్రి సమాచారం వచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న సీఐ పవన్ కిషోర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని గంజాయి సరఫరాదారులపై దాడి చేశారు. ఈ దాడిలో పున్నమితోటకు చెందిన గుడిగంట వంశీకుమార్ అలియాస్ సిద్ధా, పటమట పుట్టరోడ్డుకు చెందిన గుంజి సాయితరుణ్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారివద్ద ఉన్న 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిరువురిపై కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గొల్లపూడి వెస్ట్ బైపాస్ రోడ్డులో అమరావతి వెళ్లే మార్గంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అమరావతి వెళ్లే రోడ్డుకు ఎడమవైపున రోడ్డుకు, పొలాలకు మధ్య కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం స్థానికులకు కనిపించింది. మృతుని వయసు సుమారు 50 – 60 సంవత్సరాల మధ్య ఉంటుంది. బాగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉంది. మృతుని ఒంటిపై ఆకుపచ్చ లుంగీ, ఫుల్ హ్యాండ్స్ బనీను ఉన్నాయి. వివరాలకు భవానిపురం పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని పోలీసులు సూచించారు. -
విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న కూటమి ప్రభుత్వం
గుణదల(విజయవాడ తూర్పు): ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తూ విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించకపోగా లక్షలాది మంది ఉద్యోగులను తొలగించిందని, నిరుద్యోగ భృతి హామీ అటకెక్కించిందని మండిపడ్డారు. ఆచరణకు యోగ్యం కాని పథకాలను అమలు చేస్తామంటూ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్సిక్స్ పేరుతో పేదలను మభ్యపెట్టిన కూటమి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు జొన్నలగడ్డ కోమల్ సాయి, విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జ్ దేవినేని అవినాష్ -
ఉద్యోగుల్లో కుమ్ములాటలు!
● వాణిజ్య పన్నుల శాఖలో రచ్చకెక్కిన బాగోతం ● ఒక ఉద్యోగ సంఘ నేత తోటి ఉద్యోగులు, అధికారులపై ఫిర్యాదులు ● ఆ ఉద్యోగ సంఘ నేతపై మరికొందరు ఉద్యోగుల ఫిర్యాదు ● తనపై వచ్చిన ఆరోపణలపై డీసీ స్థాయి అధికారి లీగల్ నోటీసులు జారీ వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖ ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కుమ్ములాటలు ఇటీవల తారస్థాయికి చేరుకున్నాయి. కొంతమంది ఉద్యోగులు నిత్యం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తూ ఆ శాఖ ప్రతిష్టను బజారుపాలు చేస్తున్నారని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. గడిచిన కొద్ది మాసాలుగా ఈ ఫిర్యాదుల పర్వం నిత్యకృత్యంగా సాగుతోంది. అటెండర్ స్థాయి నుంచి అడిషనల్ కమిషనర్ కార్యాలయం వరకూ అందరిపైనా కొంతమంది ఉద్యోగులు పనిగట్టుకుని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక ఉద్యోగ సంఘ నేతపై ఫిర్యాదులు వాణిజ్య పన్నుల శాఖలో ఒక ఉద్యోగ సంఘ నేతపై పలువురి నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆ ఉద్యోగ సంఘ నేత విధులకు సక్రమంగా హాజరుకాకుండా తోటి ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, వ్యాపార వర్గాల నుంచి సైతం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని ఫిర్యాదులు చేశారు. వాటికి అవసరమైన సాక్ష్యాలతో సహా ఉన్నతాధికారులకు అందించారు. ఆ కాపీలను న్యాయస్థానానికి కూడా పంపటంతో వాటిపై ఉన్నతాధికారులు స్పందించారు. విజయవాడ డివిజన్–3 పరిధిలోని ఒక సీటీవో స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ గడిచిన ఏడు మాసాలుగా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగులపై మహిళతో ఫిర్యాదు వాణిజ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు కొంతమంది వ్యాపారులతో కలిసి తమకు గిట్టని వారిపై ఫిర్యాదులు చేయిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే క్రమంలో వాణిజ్య పన్నుల శాఖలోని ఒక ఉద్యోగి తన వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలను గురించి మాట్లాడటానికి వస్తే తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ కొద్దిమాసాల క్రితం ఒక మహిళా వ్యాపారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఆ ఫిర్యాదు వెనుక తోటి ఉద్యోగులు ఉన్నారనే ప్రచారం ఆ శాఖలో బలంగా వినిపించింది. దీనిపై కూడా విచారణ కొనసాగుతోంది. డెప్యూటీ కమిషనర్ లీగల్ నోటీసులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో డెప్యూటీ కమిషనర్ తనపై ఆరోపణ చేసిన ఉద్యోగిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పది మందిలో తన పేరు పెట్టడమే కాకుండా అవినీతికి పాల్పడుతున్నట్లు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా పరిగణించారు. వెంటనే లీగల్ నోటీసు ఇచ్చి తనపై చేసిన ఆరోపణలను తక్షణం ఉపసంహరించుకోవాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి సాక్షాలు ఉన్నాయని ప్రశ్నించారు. విచారణలే... నివేదికలు ఉండవు వచ్చిన ఫిర్యాదులపై విచారణలకు ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. కానీ విచారణ చేసిన తరువాత రిపోర్టులు మాత్రం బయటకు రావటం లేదు. కొంతమందిపై వేసిన విచారణలు పదేళ్లయినా ఇప్పటికీ నివేదికలు బయటకు రాలేదని, అంతా తూతూమంత్రంగా సాగిపోతుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అడిషనల్ కమిషనర్, ఇతర ఉద్యోగులపై ఫిర్యాదులు ఇటీవల ఒక ఉద్యోగ సంఘ నేత పది మందిపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అందులో జిల్లాకు చెందిన డెప్యూటీ కమిషనర్, రాష్ట్ర కార్యాలయంలోని అడిషనల్ కమిషనర్తో పాటుగా మరో ఎనిమిది మంది వివిధ స్థాయిల్లో పని చేస్తున్న ఉద్యోగులపై అవినీతి ఆరోపణలు చేశారు. పైగా ఆరోపణల ప్రతిని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయటంతో అది మరింత దుమారాన్ని లేపింది. పలు ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి తమపై లేనిపోని నిందలు వేస్తున్నారంటూ సదరు ఉద్యోగులు మండిపడుతున్నారు. -
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాల కార్మికులను రక్షించటం, సంరక్షించటం, బాలల హక్కుల పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం సందర్భంగా గురువారం కార్మిక శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, సంయుక్త ఫౌండేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రాఫిట్ షూ కంపెనీ సంయుక్త సహకారంతో సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇలక్కియ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండాలని, బాల కార్మికులు లేని సమాజాన్ని అందరూ కలిసి నిర్మించాలన్నారు. బాలల హక్కులు, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని, ఆపదలో ఉన్న బాలలను రక్షించడంలో ప్రతి ఒక్కరూ స్పందించాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘మా సంస్థలో బాల కార్మికులు లేరు’’ అనే ప్రత్యేకమైన స్టిక్కర్లను జేసీ ఆవిష్కరించారు. కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ఆశారాణి మాట్లాడుతూ బడి బయట ఉన్న బాలలను గుర్తించటం, వీధి బాలలుగా, బాల కార్మికులుగా ఉన్న బాలలను రక్షించడంలో సమాజం కీలకపాత్ర పోషించాలని అన్నారు. కార్యక్రమంలో ఫోరం ఫర్ చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎ.ధనలక్ష్మి, కార్మిక శాఖ అధికారులు టి.రాజేష్, డి.రత్నకుమారి, పి.రామ్ కుమార్, జి.విజయ సారథి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆఫీసర్ రాజేశ్వరరావు, సోషల్ వర్కర్లు శారద, లత, బర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ సెక్రటరీ కోటే ప్రకాష్ కుమార్, నవజీవన్ బాల భవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ తంబి జోసెఫ్, అడ్మినిస్ట్రేషన్ ఫాదర్ మర్రెడ్డి, ప్రోగ్రాం మేనేజర్ జి.శేఖర్ బాబు, కోఆర్డినేటర్ కె.ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ -
లారీ, కారు ఢీకొని ఒకరి దుర్మరణం
కృత్తివెన్ను: అప్పటి వరకు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా సాగుతున్న వారి ప్రయాణంలో లారీ రూపంలో మృత్యువు దూసుకువచ్చి కుటుంబ యజమానిని కబళించివేసింది. కృత్తివెన్ను మండలం సంగమూడి సమీపంలో 216 జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుంపట్ల రాంగోపాల్ (41) ఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన రాంగోపాల్ తన భార్య రీతూ, కుమారుడు, కుమార్తెతో కలసి హైదరాబాద్లో బంధువుల వివాహానికి వెళ్లారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వారు తమ కారులో తిరిగి పాలకొల్లుకు బయలుదేరారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సంగమూడి చినగట్టు సమీపంలో ఎదురెదురుగా వస్తున్న లారీ, కారు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రాంగోపాల్ అక్కడికక్కడే మరణించగా, భార్య రీతూ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కుమారుడికు సైతం తలకు బలమైన గాయాలవగా, కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రాంగోపాల్ పాలకొల్లులో రోటరీ క్లబ్ ఆఫ్ గోదావరి అధ్యక్షుడిగా పనిచేశారని, అందరితో కలివిడిగా ఉండే కుటుంబం ఒక్కసారిగా ప్రమాదంలో ఇలా ఛిద్రమైపోవడం ఎంతో విషాదాన్ని మిగిల్చిందని వారి బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపారు. ఈ ఘటనపై బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య పరిస్థితి విషమం, కుమారునికి తీవ్ర గాయాలు స్వల్ప గాయాలతో బయటపడిన కుమార్తె ఆ కుటుంబంలో పెను విషాదం నింపిన ప్రమాదం -
నిత్య యోగాచరణతో రోగాలు దూరం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం యోగాచరణ ద్వారా రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో గురువారం జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర 23వ రోజు కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్స్ థీమ్ యోగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, వైద్య ప్రముఖులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. అనంతరం మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడకుండా యోగాసనాలు రక్షణ కవచంగా ఉపయోగపడతాయని, ఒకవేళ ఏదైనా సమస్య వస్తే వైద్యుల చికిత్సకు కొన్ని రకాల యోగాసనాలు, ధ్యానం తోడైతే తొందరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించి, ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, డాక్టర్ ఉషారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనుమయ్య, ఫాగ్సీ ప్రతినిధి డాక్టర్ త్రిపుర, రమేష్ హాస్పిటల్ వైద్యులు పి.రమేష్, జిల్లా ఆయుష్ యోగాంధ్ర నోడల్ అధికారి వి.రాణి, ఆయుష్ అధికారి రామత్లేహి, వైద్యులు జె.సుమన్, రత్నప్రియదర్శిని, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, వైద్యులు సింగరి ప్రభాకర్, కోడె ప్రభాదేవి, రమేష్(ఆయుష్ హాస్పిటల్), అనిల్ (అనిల్ న్యూరో హాస్పిటల్), సుబ్బారావు(అమెరికన్ ఆంకాలజీ), శివప్రసాద్(హృదయాలయ హాస్పిటల్స్), సిద్ధార్థ వైద్య కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 13 శ్రీ జూన్ శ్రీ 2025సమస్యల మధ్యే ప్రారంభం 7దుర్గమ్మ సేవలో.. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సినీ నటుడు చిరంజీవి కుమార్తె సుష్మ గురువారం దర్శించుకున్నారు. ఈవో శీనానాయక్ ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.ఎస్ఎంసీకి కొత్త ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవైరావు బాధ్యతలు స్వీకరణలబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా అడిషనల్ డైరెక్టర్ హోదాలో డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు(ఏవై రావు) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ప్రిన్సిపాల్గా వ్యవహరించిన డాక్టర్ పి. అశోక్కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ఆయనను కలిసి పుష్ప గుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ.. సమయపాలన.. ఈ సందర్భంగా డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ కళాశాలలో క్రమశిక్షణ ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించేలా చూస్తామన్నారు. నిత్యం కళాశాల, విద్యార్థులు హాస్టల్స్లో రౌండ్స్ వేస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు అకడమిక్ కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తానన్నారు. వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్థులు ఎప్పుడైనా నేరుగా తనను కలవచ్చని, వెయిటింగ్ లేకుండా ఎప్పుడూ తలుపులు చెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వైద్యులు సిబ్బందితో సమన్వయం సమష్టి కృషితో ముందుకెళ్దామని పేర్కొన్నారు. కాగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావును అభినందించిన వారిలో పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. అశోక్కుమార్, ఏడీ శ్రీకాంత్, ఇతర ప్రొఫెసర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ఉన్నారు.గ్రీన్ ట్యాక్స్పై జీవోను విడుదల చేయాలని వినతి విజయవాడస్పోర్ట్స్: ఏడేళ్లు దాటిన సరుకు రవాణా వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు అన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్రెడ్డిని ఈశ్వరరావు అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రీన్ట్యాక్స్ తగ్గింపునకు జీవోను వెంటనే విడుదల చేయాలని మంత్రిని ఆయన కోరారు. దీనిపై మంత్రి రామ్ప్రసాద్రెడ్డి సానుకూలంగా స్పందించారని, ఈ వారంలోనే ట్యాక్స్ తగ్గింపుపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు వివరించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, కార్యదర్శి సీహెచ్ వినయ్ ఉన్నారు. తైక్వాండోలో జిల్లాకు 68 పతకాలు విజయవాడస్పోర్ట్స్: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మూడు రోజుల పాటు జరిగిన 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఈ పోటీలను నిర్వహించింది. ఈ పోటీల సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ విభాగాల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు 68 పతకాలను సొంతం చేసుకున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను కృష్ణాజిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఎం.అంకమ్మరావు, కోచ్లు పి.విక్టర్ ఆదిత్య, కె.కృష్ణవంశీ, బి.దినేష్, బి.కాశీనాథ్రెడ్డి, పి.గౌరిశంకర్, ఎం.బాలచందర్ అభినందించారు. చాలీ చాలని జీతాలతో బతికేదెలా? గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చాలీచాలని జీతాలతో బతుకీడ్చేదెలా అంటూ మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్లో వారు గత నెలరోజులుగా ధర్నా చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో యూనియన్ నగర అధ్యక్షుడు పిట్టా మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం మూడు దఫాలు చర్చల పేరుతో పిలిచి ఎటువంటి హామీ గానీ, ఉత్తర్వులు గాని ఇవ్వలేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ నాయకులు వేముల జైపాల్, పరసా బుచ్చిబాబు, బి.నాగరాజు, సీహెచ్ సాంబశివరావు, పి.కృష్ణ, ఎండీ గౌస్ తదితరులు పాల్గొన్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత క్రమక్రమంగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన షైనింగ్ స్టార్స్ పేరుతో పది, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు అందించిన పురస్కారాలు దానిని రుజువు చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో అడుగడుగునా ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి అండగా నిలిచింది. సర్కార్ బడుల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిరంతరం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. కానీ ప్రస్తుత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు పూర్తిగా కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేదిగా ఉన్నాయని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 174 మందికి సత్కారాలు.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియెట్లలో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో షైనింగ్ స్టార్స్ పేరుతో పురస్కారాలను అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మండలాల్లో కులాల ప్రతిపాదికన విద్యార్థులను ఎంపిక చేసింది. ఎంపికై న విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు పురస్కారాన్ని సైతం అందించాలని నిర్ణయించింది. పదో తరగతికి సంబంధించి 131 మందికి, ఇంట ర్మీడియెట్ కోర్సులకు చెందిన 43 మందికి ఈ అవార్డుల కోసం ఎంపిక చేసి ప్రదానం చేశారు. సర్వత్రా విమర్శలు.. ప్రభుత్వం తానిచ్చే పురస్కారాలు, అవార్డులు తొలుత ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఇవ్వటం పరిపాటి. పేద, మధ్య తరగతి అత్యధికంగా చదువుకునే ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రోత్సహించటం ద్వారా మరింత మంది ఆ విధమైన స్ఫూర్తిని అందిపుచ్చుకుంటారు. మరిన్ని విజయాలను సాధించేందుకు అది ఆదర్శంగా నిలుస్తుంది. కానీ జిల్లాలో సోమవారం అందించిన అవార్డులు దాదాపుగా 90 శాతం ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకే అందించింది. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు అత్యధికంగా మార్కులు సాధించినా ప్రైవేట్ విద్యార్థులకు అవార్డులు ఇవ్వటం ఏమిటని విద్యారంగ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రభుత్వ బడులకు మొండి చెయ్యి.. ఎన్టీఆర్ జిల్లాలో 20 మండలాలకు చెందిన విద్యార్థులను విద్యాశాఖ కులాల ప్రతిపాదికన ఎంపిక చేసింది. అందులో భాగంగా కేవలం ఎనిమిది మండలాల్లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు మాత్రమే అందులో ఎంపిక చేయటం వివాదాస్పదమవుతోంది. 12 మండలాలకు చెందిన ఒక్క ప్రభుత్వ విద్యాసంస్థ విద్యార్థికి ఈ పురస్కారాల్లో అవకాశం లభించలేదు. మిగిలిన ఎనిమిది మండలాలకు సంబంధించి నాలుగు మండలాలకు ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు ఉన్నారు. మిగిలిన మండలాలకు చెందిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కులు సాధించినా, ఆ మండలాల ప్రభుత్వ బడుల విద్యార్థులను దూరం పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. జిల్లాలో 131 మందిని పదో తరగతి విద్యార్థులను ఎంపిక చేయగా అందులో 19 మంది మాత్రమే ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 112మంది పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు చెందిన విద్యార్థులే. అలాగే ఇంటర్మీడియెట్కు సంబంధించి 43 మందిని ఎంపిక చేయగా అందులో కేవలం పది మంది మాత్రమే ఎయిడెడ్, ప్రభుత్వ రంగ విద్యాసంస్థలకు చెందిన వారు ఉన్నారు. మిగిలిన 33 మంది పూర్తిగా కార్పొరేట్ విద్యార్థులే.విద్యార్థినికి అవార్డు అందజేస్తున్న మంత్రి సత్యకుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ(ఫైల్)గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, ఎండీ రుహుల్లా, మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి తదితరులుగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. జిల్లాలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణకుమార్, ఎండీ రుహుల్లాలతో కలిసి ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వివరించారు. వినతి పత్రం సమర్పించారు. అనంతరం రాజ్భవన్ ఎదుట మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలపై.. జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ రవాణా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ చేస్తున్న దందాలు గవర్నర్కు వివరించామని అవినాష్ చెప్పారు. అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు, ఐఏఎస్, ఐపీఎస్లు, జర్నలిస్టుల అరెస్టులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. శాతవాహన కళాశాల భూ కబ్జా, సాక్షి కార్యాలయాలపై దాడులు, వైఎస్ జగన్ పొదిలి పర్యటనలో జరిగిన రాళ్ల దాడిని గవర్నర్కు వివరించామన్నారు. మరో బిహార్గా మార్చారు.. మల్లాది విష్ణు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వం ఏపీని మరో బిహార్గా మార్చేసిందన్నారు.. కూటమి ఏడాది పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, హామీల ఎగవేత వంటి 10 అంశాలతో గవర్నర్కు వినతి పత్రం ఇచ్చామన్నారు. మొండితోక అరుణకుమార్ మాట్లా డుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కూటమి పెద్దలు కావాలని ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన భధ్రత విషయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గవర్నర్ను కలిసిన వారిలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు అవుతు శ్రీశైలజ, బెల్లం దుర్గ, జగ్గయ్యపేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర తదితరులు ఉన్నారు. గవర్నర్కు వినతి పత్రం అందజేసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ నాయకులున్యూస్రీల్ జిల్లాలో 12 మండలాల ప్రభుత్వ బడులకు మొండి చెయ్యి మార్కులు సాధించినా.. అవార్డులకు ఎంపిక కాని వైనం ఎంపికై న ఒక్కో విద్యార్థికి రూ.20 వేల చొప్పున నగదు అందజేత విజయవాడ నుంచి ఒక్కరూ లేరు.. విజయవాడ పశ్చిమ, తూర్పు, ఉత్తరం, అర్బన్, విజయవాడ రూరల్ మండలాలు చాలా ప్రధానమైనవి. ఈ పరిసర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ, ఎయిడెడ్ విద్యాసంస్థలు వంద వరకూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఈ విద్యా సంస్థల నుంచి ఒక్క విద్యార్థిని కూడా విద్యాశాఖ ఎంపిక చేయలేదు. ఎయిడెడ్, నగరపాలకసంస్థ, ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన పదో తరగతి విద్యార్థులు అవార్డులు సాధించిన విద్యార్థుల కన్నా అత్యధిక మార్కులు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారందరికీ విద్యాశాఖ అమలు చేసిన నిర్ణయం తీవ్రమైన అన్యాయం చేసిందంటూ ఉపాధ్యాయులు సైతం విమర్శిస్తున్నారు. -
గవర్నర్ని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్సార్సీపీకి చెందిన పలువురు నేతలు కలిశారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ నేతలు.. గవర్నర్ నజీర్ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందించారు. గవర్నర్ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంచార్స్ తన్నేరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు అరుణ్, రాహుల్, మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజా రెడ్డి, బెల్లం దుర్గలు ఉన్నారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ. . ‘గవర్నర్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు వివరించాము. స్థానిక ప్రజాప్రతినిధుల చేస్తున్న ఇసుక అక్రమ రవాణా పై వివరించాము. మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం, శాతవాహన కాలేజ్ అంశం, సాక్షి కార్యాలయంపై దాడి , జగన్ పోన్నూరు టూర్ లో రాళ్ళ దాడిపై వినతిపత్రం అందించాం’ అని అన్నారు.మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘10 అంశాలతో కూడిన వినతి గవర్నర్ కి ఇచ్చాం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం , అక్రమ అరెస్టులు అన్ని వివరించాము. గవర్నర్తగు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. గత హయాంలో జరిగిన మంచి కార్యక్రమాలు తుడిచిపెట్టే పని మొదలు పెట్టారు..కూటమి నేతలు తల్లికి వెన్నుపోటు పొడిచారు.. 30లక్షల మంది పిల్లలకు అన్యాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని సహజ సంపదని తెలంగాణకి అమ్మేసుకొంటున్నారు’ అని మండిపడ్డారు. -
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను అధికారులు ఇవాళ (గురువారం) సాయంత్రం విడుదల చేశారు. మొత్తంగా 1,23,477మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 76.14శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు విద్యాశాఖ ప్రకటించింది.బాలురలో 73.55 శాతం, బాలికల్లో 80.10 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఒకే ఒక్క క్లిక్తో www.sakshieducation.comలో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 👉ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 కోసం క్లిక్ చేయండి -
చంద్రబాబుపై మరోమారు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఫైర్
సాక్షి, విజయవాడ: చంద్రబాబుపై మరోమారు టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. గురువారం.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ‘‘టీడీపీ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన-రైతాంగానికి ఇచ్చిన హామీలు- అమలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఎం నాయకులు పి.మధు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదైపోయిందని.. రైతులకు 20 వేలు సాయం చేస్తామన్నారు. ఎన్నికలయ్యాక ఒక ఖరీఫ్, ఒక రబీ సీజన్ అయిపోయాయి. కేంద్రం ఇచ్చేవి కాకపోయినా మీరు ఇస్తామన్న 14 వేలైనా ఇవ్వాలి కదా. గతంలోనూ రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రెండు కిస్తీలు ఎగ్గొట్టేశాడు...రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర దొరకడం లేదు. పక్క రాష్ట్రం తెలంగాణలో క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు బోనస్ రూపంలో రైతుకు కొంత సాయం చేస్తున్నాయి. చంద్రబాబు కనీసం రైతుల గురించి ఆలోచన చేయడం లేదు’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.‘‘ఏడాది నుంచి మెట్రో రైలు, రింగ్ రోడ్డు, ఐకానిక్ వంతెనలు అంటూ భజన చేస్తున్నారు. కృష్ణానదిపై 15 కిలోమీటర్లకు ఒక ఐకానిక్ వంతెన కట్టాలని ఓ ఛానల్లో చెబుతున్నారు. చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా పిచ్చి ఊహాలోకంలో విహరిస్తున్నాడు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదు. ఏదో స్వప్రయోజనం మనసులో పెట్టుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ఆలోచన చేస్తున్నాడు. భూములను 22ఏలో చేర్చి చిన్ని చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. భూములు రైతుల వద్ద కాకుండా.. ప్రభుత్వం వద్దే ఉండాలనేది చంద్రబాబు ఆలోచన.అమరావతిలో భూములిచ్చిన రైతులకు హామీలిచ్చి మోసం చేశారు. గతంలో గ్రాఫిక్స్తో మూడేళ్ల పాటు కథ నడిపించారు. ఇప్పుడు మళ్లీ 45 వేల ఎకరాలు రాజధానికి తీసుకుంటామంటున్నారు. ఐదు వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు కడతామంటున్నారు. గన్నవరంలో ఎయిర్పోర్టు ఉంటే అమరావతిలో మరో ఎయిర్ పోర్టు అవసరమా?. శ్రీకాకుళం ప్రజలకు కావాల్సింది తాగు, సాగునీరు కానీ.. ఎయిర్ పోర్టు కాదు. శ్రీకాకుళంలో ఎయిర్ పోర్టు కడితే సరిపోదు. ఎక్కేవాడు కావాలిగా.. ఇన్నేళ్ల అనుభవమున్న నిన్ను ఏమనుకోవాలి?. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజావ్యతిరేకమైన పిచ్చి ఆలోచనలను మానుకోవాలి’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
బుడమేరు పనుల్లో అవినీతి ప్రవాహం
నిబంధనలకు నీళ్లు.. వర్క్ ఆర్డర్ లేకుండానే పనులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో అవినీతికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టా రాజ్యంగా మరమ్మతులు చేస్తున్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేస్తున్నా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు అందాయి. అయినా పనులకు సంబంధించిన ఎంబుక్లకు స్వాధీనం చేసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. పనుల కేటాయింపులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నా కాంట్రాక్టర్లు పట్టించుకోవటం లేదు. దీనికి ప్రధాన కారణం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అవినీతి‘కోటీశ్వరుడు’, అక్రమాల ‘కిశోరం’ దళారులుగా 15 శాతం కమీషన్ వసూలు చేసిపెట్టడమేన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కాంట్రాక్టర్లకు అండగా ఆ ప్రజాప్రతినిధి రంగంలోకి పావులు కదుపుతున్నారు. ‘నేను చెప్పిందే వేదం. నోటి మాటతోనే పనులు చేయాలి’ అంటూ హుకుం జారీ చేస్తుండటంతో అధికారులు సైతం తలలు పట్టుకొంటున్నారు. ‘బుడమేరుకు అవినీతి గండ్లు’ శీర్షికన ఈ నెల తొమ్మిదో తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. జలవనరుల శాఖ ఈ కథనానికి స్పందించి వివరణ ఇవ్వాలంటూ ఆదేశించడంతో అధికా రులు హడలిపోతున్నారు. వర్క్ ఆర్డర్ లేకుండా పనులు అప్పగించామని వివరణస్తే తాము ఇరుక్కుపోతామని, పోనీ పనులు జరగలేదని చెబితే పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు వచ్చే పరిస్థితి ఉండదని, గండం నుంచి ఎలా గట్టెక్కాలని ఇంజినీరింగ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కమీషన్లకు కక్కుర్తి పడే... ప్రజాప్రతినిధికి చిత్తశుద్ధి ఉంటే వర్కింగ్ సీజన్కు ముందే బుడమేరు మరమ్మతులకు పరిపాలన అనుమతులు తీసుకొని, టెండర్లు పిలిచి రుతు పవనాలు ప్రవేశించక ముందే పనులు పూర్తి చేయాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్లో వరద పోటెత్తడంతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. బుడ మేరు వరదతో విజయవాడ నగరానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వర్షాకాలానికి ముందే బుడమేరు గండ్లు పూడ్చాలని, ఆధునికీకరణ పనులు చేపట్టాలని సూచిస్తూ ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. అయితే అప్పుడు పాలకులు, అధికారులు పట్టించుకోలేదు. వర్షాకాలం ప్రారంభంలో పనులు మంజూరు చేసి హడావిడి చేయడం వెనుక కమీషన్ల కుట్ర దాగి ఉందనే భావన పలువురిలో వ్యక్తమవుతోంది. పక్కా ప్రణాళిక ప్రకారమే వర్షాలు వస్తే ఇబ్బంది తలెత్తుతుందనే సాకు చూపి, పరిపాలన అనుమతులు రాకుండానే బుడమేరు పనులు చేపట్టారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. వర్క్ ఆర్డర్ లేకుండానే జరుగుతున్న పనులపై విమర్శలు వెల్లువెత్తడంతో అవినీతి జరగటం లేదని అధికారులు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. పనుల్లో లోపించిన నాణ్యత బుడమేరు గండ్లకు సంబంధించిన పనుల్లో నాణ్యత లోపించిందని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. గండ్లు పూడ్చేటప్పుడు లేయర్, లేయర్ను రోలర్తో తొక్కించి పటిష్టం చేయాలి. అయితే ఆ పనులు చేస్తున్న ప్రాంతాల్లో రోలర్ కనిపించటం లేదని పలువురు పేర్కొంటున్నారు. గండ్ల పూడ్చి వేత పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి బుడమేరులోని బుసక, చెరువులోని నల్లమట్టిని వినియోగిస్తున్నారు. ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు సైతం ఏమి చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. రూ.43.91 కోట్ల విలువైన 126 పనులను టెండర్లు లేకుండా పప్పుబెల్లాల పంచడం ఏమిటని ఇంజినీరింగ్ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే పనుల మంజూరులో జాప్యం కాంట్రాక్టర్లకు అండగా కమీషన్ తీసుకొన్న ప్రజాప్రతినిధి తప్పులను కప్పి పుచ్చుకొనేందుకు అధికారుల తంటాలు మరమ్మతు పనులపై ఇప్పటికే విజిలెన్స్కు ఫిర్యాదు -
మార్గదర్శకుల ఎంపికపై ప్రత్యేక దృష్టిపెట్టాలి
ఎంపీడీఓలకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ–4 కార్యక్రమం అమలుకు క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని, బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల ఎంపికపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ జి.లక్ష్మీశ ఎంపీడీఓలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, ఎంపీడీఓలతో పీ–4, ఉపాధి హామీ పథకం అమలు, పథకం అనుసంధానంతో చేపడుతున్న పనుల్లో పురోగతిపై కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బంగారు కుటుంబాలు–మార్గదర్శుల అనుసంధానం, బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికల అమలుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి జిల్లాలో 2025 –26 సంవత్సరానికి 80 లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటికి 27.99 లక్షల పనిదినాలు పూర్తయ్యాయని, లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేయాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటల దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. బహుళ ప్రయోజనాలున్న సేంద్రియ ఎరువుల గుంతల (కంపోస్టు పిట్) నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ నెలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము పాల్గొన్నారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న మట్టి దోపిడీ
గన్నవరం: మండలంలోని ముస్తాబాద పెద చెరువులో యథేచ్ఛగా సాగుతున్న మట్టి దోపిడీ ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. సూరంపల్లి గ్రామానికి చెందిన గజ్జల వెంకటేశ్వరరావు(55)ను మంగళవారం సాయంత్రం ముస్తాబాద గ్రామంలోని స్కూల్ సెంటర్లో మంగళవారం సాయంత్రం మట్టి ట్రాక్టర్ ఢీకొంది. అతని ఛాతీ భాగం, చేతులపై ట్రాక్టర్ టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతడిని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందాడు. వెంకటేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, సూరంపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బుధవారం గన్నవరం పోలీస్స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం తరఫున కొందరు రంగంలోకి దిగి మట్టి తవ్వకందారులైన టీడీపీ నేతలను కాపాడే ప్రయత్నాలను ప్రారంభించారు. పోలీస్స్టేషన్లోనే మృతుడి కుటుంబ సభ్యులు, ఆ గ్రామ పెద్దలతో చెరువు తవ్వకందారులు చర్చలు జరిపారు. మృతుడి కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ఇచ్చేందుకు చెరువు తవ్వకందారులు అంగీకరించారు. సూరంపల్లి గ్రామ వైఎస్సార్ సీపీ కమిటీ మృతుని కుటుంబానికి రూ.50 వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ఆ పార్టీ నేత కందిమళ్ల శ్రీనివాసరావు తెలిపారు. -
గాలిగోపురంపై పిడుగుపాటు
పెడన: పట్టణంలోని ప్రధాన ఆలయమైన శ్రీ గంగ, పార్వతి సమేత అగస్తేశ్వరస్వామి ఆలయ గాలిగోపురంపై బుధవారం వేకువ జామున సుమారు రెండున్నర గంటల సమయంలో పిడుగు పడింది. గోపురంపై సింహం బొమ్మపై పిడుగు పడటంతో అది పూర్తిగా ధ్వంసమైంది. గోపురంపై ఉన్న దేవతామూర్తుల బొమ్మలు కొన్ని దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భాగాలు గోపురం కింద చెల్లచెదురుగా పడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకుడు గూడూరు అగస్తయ్య పిడుగుపాటు సమాచారాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ, దేవదాయశాఖ అధికారులకు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ భళ్ల ప్రసాద్ తదితరులు ఆలయానికి చేరుకుని గాలిగోపురాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి సహకారంతో గాలిగోపురానికి మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిమాండ్స్ డే పాటిస్తూ ఫెడరేషన్ ప్రతినిధులు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియకు బుధవారం వినతి పత్రం అందజేశారు. రాష్ట్రం జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు సమస్య ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉందని, కూటమి నాయకులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంతో అర్హులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. జర్నలిజం వృత్తి ప్రమాదంలో పడిన నేపథ్యంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అక్రెడిటేషన్ కమిటీలో జేఎఫ్కు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ కమిటీ ఏర్పాటు చేయాలని, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.ఆంజనేయులు, అధ్యక్షుడు పి.వెంకట్రావు, జిల్లా అధ్యక్షుడు కె.సాంబశివరావు, కార్యదర్శి ఎం.బి.నాథన్ తదితరులు ఉన్నారు. బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆర్టీసీ బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గవర్నర్పేట పాత బస్టాండ్ వద్ద జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఏలూరు రోడ్డులో బస్టాండ్ వైపు వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టింది. అతనిపై బస్సు చక్రం ఎక్కింది, దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుంది. ఆ వ్యక్తి వివరాలు తెలిపే ఆధారాలు లభ్యంకాలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో లేదా 94406 27079, 0866–2576023 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు. -
జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
నందిగామటౌన్: జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకుడు ఆకుల వెంకట నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆర్డీవో బాలకృష్ణను కలసి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ది న్యూ ఇండియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసి యేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు పటాన్ మీరా హుసేన్ ఖాన్, జర్నలిస్టు సంఘ నాయకులు శ్రీనివాసరావు, సాంబశివరావు, ఖుద్దూస్, చందు, అనిల్, సురేష్, నరసింహ, సీతారామ్ పాల్గొన్నారు. -
ప్రచార రథంతో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జేష్ట పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా కొనసాగింది. ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభం కాగా, ప్రచార రథంపై ఆది దంపతులకు ఆలయ ఈవో శీనానాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు.మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రత్యేక వాహనంపై కాకుండా ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ప్రచార రథం ముందుకు సాగగా, భక్తులు అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, నాలుగు స్థంభాల సెంటర్, విద్యాధరపురం, సితార జంక్షన్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించుకున్నారు.ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా డాక్టర్ సమరంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): రెడ్క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో బుధవారం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా వార్షిక సర్వ సభ్య సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్గా డాక్టర్ జి.సమరం, వైస్ చైర్మన్గా డాక్టర్ వెలగా జోషి, కార్య దర్శిగా చిట్టిబాబు, కోశాధికారిగా జి.బాబ్జి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ టి.విజయలక్ష్మి, ఎం.అనురాధ, డాక్టర్ కొల్లేటి రమేష్, కర్లపాటి శ్రీనివాసరావు, ఎం.బలరాం, పి.సుధాకర్, ఎన్.జోసెఫ్ జోషి, కె. జయరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారుగా డాక్టర్ ఎంసీదాస్, డాక్టర్ కె.పట్టాభిరామయ్య, జీవీ రామారావు నియమితులయ్యారు. సమావేశానికి జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా పీసీఆర్ రాజు పరిశీలకులుగా వ్యవహరించారు.వైఎస్సార్ సీపీ యువజన విభాగ కమిటీ నియామకంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగ కమిటీ నియామకం జరిగింది. జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా తిరుమలశెట్టి రాజేష్కుమార్, తోట హరీష్, ప్రధాన కార్యదర్శులుగా మిండల జోషి కుమార్, దామినేని శివరామ్, షేక్ కరీముల్లా, పాల్వంచ రమేష్బాబు, జీతం వెంకట నాగేశ్వరరావు, గోగినేని సాయి సుభా ష్, పోట్రు శశాంక్, కార్యదర్శులుగా షేక్ ఇర్ఫాన్, బొడ్డు తరుణ్, ఎండీ ఆసిఫ్ అజీజ్, కర్ల అజిత్కుమార్, గూడపాటి రామకృష్ణ, పోతురాజు, గొట్టా హరీంద్ర బాబు, అమ్మనబోయిన గోపి, వల్లంకొండ సురేష్, యర్రగుంట సుకుందరావు, చింతల ప్రసాద్ రెడ్డి, శ్రీరాజ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా చట్టు దుర్గా సాయి, సైకం సాగర్, తోడేటి ప్రదీప్ కుమార్, ఈశ్వర్ దుర్గారెడ్డి, షేక్ అర్మన్ అహ్మద్, యర్రబోయిన నాగరాజు, ముద్రబోయిన మహేష్బాబు, జక్కులూరి వెంకటరావు, బేతంపూడి సాంబశివరావు, కొంగల రవీంద్ర, బత్తుల వెంకట నరసయ్య, నారోజు కృష్ణ శర్మ, వలసల అఖిల్, మాదు జయరాంబాబు నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
రైతులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి
జూపూడిలో ఏరువాక పౌర్ణమిలో పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీశ జూపూడి(ఇబ్రహీంపట్నం): వ్యవసాయ రంగంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మండలం పరిధిలోని జూపూడి గ్రామంలో జిల్లా స్థాయిలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్య క్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్ల భాగస్వామ్యం పెంచుకుని తక్కువ సమయంలో ఎరువులు, పురుగు మందుల పిచికారీ చేసుకోవాలని సూచించారు. పచ్చిరొట్ట, పశువుల ఎరువులతో భూమిని సారవంతం చేసుకుని ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా అవసరమైన మేరకే ఎరువులు వినియోగించుకోవా లని, వ్యవసాయంలో బిందు సేద్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటు పశుపోషణకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ట్రాక్టర్తో దుక్కిదున్ని ఏరువాక పౌర్ణమి ప్రారంభించారు. డ్రోన్లతో మందుల పిచికారీ ప్రదర్శించారు. జక్కంపూడి, రాయనపాడు గ్రూపు సభ్యులకు రెండు డ్రోన్లు పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమారి, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి సుభాని, ఏడీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, ఏవో శైలజ, రైతులు పాల్గొన్నారు. -
కృష్ణా నదీ తీరంలో రికార్డ్ యోగా
భవానీపురం(విజయవాడపశ్చిమ): యోగాంధ్ర– 2025 కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖకు చెందిన విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో బుధవారం వివిధ రకాల బోట్లపై 2 వేల మంది యోగాసనాలు ప్రదర్శించి వరల్డ్ రికార్డు సాధించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ నేతృత్వంలో కృష్ణానదీ తీరాన ఏర్పాటు చేసిన వాటర్ క్రాఫ్ట్ ్స – ఫ్లోటింగ్ మెగా యోగా ఈవెంట్లో పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాఽథ్తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్స్కీ వంటి అనేక వాటర్ క్రాఫ్ట్ ్సతో పాటు పున్నమిఘాట్లో ఏర్పాటు చేసిన తివాచీలపై దాదాపు 2 వేల మంది యోగాసనాలు ప్రదర్శించారు. వాటిన్నంటినీ నిశితంగా పరిశీలించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్యు) న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్ సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రపంచ రికార్డ్ సాధించినట్లు ప్రకటించారు. ఒక నదిలో అత్యధిక మందితో వివిధ రకాల బోట్లపై యోగాసనాలు వేసి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నట్లు ధ్రువీకరిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ– పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రలకు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఏబీసీ సీఈఓ తరుణ్ కాకాని, వీఎంసీ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఆయుష్ వైద్యులు వి.రాణి, రామత్లేహి, రత్న ప్రియదర్శిని, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా అధికారులు ఎ.శిల్ప, జి. జ్యోతి, జె.సుమన్, పి.లావణ్య కుమారి, తహసీల్దార్లు ఇంతియాజ్ పాషా, రోహిణీ దేవి, సుగుణ కుమారి, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. వేదికగా విజయవాడ బెరంపార్క్, పున్నమిఘాట్ -
తడబడిన అడుగులు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సర్కారు బడులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఒక వెలుగు వెలిగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సగర్వంగా తలెత్తుకుని నడిచాడు. కార్పొరేట్ పాఠశాలల్లో కూడా లేని విధంగా ఐవీఆర్ ప్యానల్స్తో విద్యా బోధన జరిగేది. పాఠశాలలు పునఃప్రారంభం రోజునే పుస్తకాలు, బూట్లు, సాక్స్, డిక్షనరీ, బ్యాగు సహా 9 వస్తువులతో కూడిన కిట్ను అందజేసేవారు. మన జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదవడమే కాక ఐక్యరాజ్య సమితిలో తమ వాణి వినిపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల కీర్తిని విశ్వ వ్యాప్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారు బడులపై నిర్లక్ష్యపు నీడలు కమ్మాయి. నాడు–నేడు రెండవ విడత పనులకు నిధులు సమకూర్చకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. స్టూడెంట్ కిట్లు ఇంకా పూర్తిస్థాయిలో బడులకు చేరుకోలేదు. గత ఏడాదిగా మూలన పడిన ఐవీఆర్ ప్యానెల్స్, ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోలేదు. దీనికి తోడు గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నా ఇంకా ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలు పూర్తికాలేదు. ఇలాంటి అయోమయ, అధ్వాన పరిస్థితి ముందెన్నడూ లేదని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కూటమి పాలనలో సర్కారు బడులు తిరోగమన దిశగా సాగుతున్నాయి. వన్టౌన్(విజయవాడ పశ్చిమ): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు బడిబాట పట్టేందుకు బ్యాగుల బూజు దులిపి సిద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సమాయత్తమవుతున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. దానివలన విద్యార్థుల విద్యా సంవత్సరం సజావుగా జరగడానికి ఇబ్బందులు తప్పవని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ను ఇప్పటి వరకూ పూర్తి చేయకపోవటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రోజుకొక నిర్ణయంతో ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందులపాలు చేసింది. వారు ఆందోళనలకు దిగి గడిచిన పది రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం బదిలీలకు కొన్ని సడలింపులను తీసుకొచ్చింది. అయితే ఆచరణలో అవి అమలుకాకపోవటంతో ఇప్పటివరకూ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి కాలేదు.పూర్తిస్థాయిలో అందని స్టూడెంట్ కిట్లుప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువుల కిట్లు ఇంకా పూర్తి స్థాయిలో పాఠశాలలకు చేరుకోలేదు. విద్యా సంవత్సరం మొదటి రోజే విద్యార్థులకు అవసరమైన కిట్లు ఇచ్చే పద్ధతిని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రారంభించింది. పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, సాక్స్, బ్యాగ్, డిక్షనరీ ఇలా తొమ్మిది రకాల వస్తువులతో కూడిన కిట్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించి మొదటి రోజే విద్యార్థులకు చేరవేసింది. అయితే ఈ ఏడాది ఇంకా చాలా వస్తువులు పాఠశాలలకు చేరుకోలేదు. 90 శాతం పుస్తకాలు మాత్రం పాఠశాలలకు చేరుకున్నాయి. మిగిలిన బ్యాగులు, బూట్లు, సాక్సులు ఇలా పలు వస్తువులు ఇంకా చాలా పాఠశాలలకు చేరుకోలేదు. అవి ఎప్పుడు వస్తాయో స్పష్టత లేదని అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.మరమ్మతులకు నోచుకోని ఆర్వో ప్లాంట్లు, ఐవీఆర్ ప్యానల్స్జిల్లా వ్యాప్తంగా చాలా విద్యాసంస్థల్లో ఆర్వో ప్లాంట్లు మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాదాపుగా అన్ని విద్యాసంస్థల్లో ఐవీఆర్ ప్యానల్స్ను వినియోగిస్తున్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశాలను సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా స్మార్ట్ టీవీలు, ఐవీఆర్ ప్యానల్స్ను సరఫరా చేసింది. వాటిల్లో చాలా వరకూ మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటిని గత ఏడాది నుంచి ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో చాలా విద్యాసంస్థల్లో వాటిని మూలన పెట్టినట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు.నేడు కూడా కొనసాగనున్న టీచర్ల బదిలీల కౌన్సెలింగ్మచిలీపట్నంఅర్బన్: వేసవి సెలవులలో ఆటపాటలతో మునిగి తేలిన చిన్నారులు బడి బాట పట్టారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 1,363 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 87,196 మంది విద్యార్థులు పాఠశాలలకు బయలుదేరుతున్నారు. 2023–24 వరకు గొప్ప ఫలితాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి నేడు దిగజారిపోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.17,981.08 లక్షలతో 1,261 పాఠశాలలకు మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించింది. చాలావరకు పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేసింది. మిగిలిన పాఠశాలల్లో పనులను కూటమి ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసింది.పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలుఉపాధ్యాయుల బదిలీలు పాఠశాలల పునః ప్రారంభం రోజుకి కూడా పూర్తికాలేదు. మొత్తం ఉమ్మడి కృష్ణాలో సుమారు 2,800 మంది ఎస్జీటీలకు సంబంధించి బదిలీల ప్రక్రియ సాగు తోంది. బుధవారం నాటికి సీనియారిటీ జాబితాలో 700 వరకు ఎస్జీటీలు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. పాఠశాలల పునః ప్రారంభం రోజున కౌన్సెలింగ్ ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే మినహాయింపు ఇవ్వటం జరుగుతుందని, ఆ పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.ప్రభుత్వ బడులపై అంతులేని నిర్లక్ష్యంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకూ విద్యాశాఖలోని విద్యాసంస్థల మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్క రూపాయి సైతం విడుదల చేయలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గత ప్రభుత్వం నాడు–నేడు మొదటి విడతలో భాగంగా రూ.95.32 కోట్లతో 341 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి పూర్తి చేసింది. నాడు–నేడు రెండో విడతలో భాగంగా 596 విద్యాసంస్థల్లో రూ.240.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. పలు టెండర్లను ఆమోదించి పనులకు సరిపడా నిధులను విడుదల చేసింది. అంతలో ఎన్నికలు రావటంతో పనుల పర్యవేక్షణ కుంటుపడింది. మిగిలిన అరకొర నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపకపోవటంతో జిల్లాలో సుమారుగా 185 పాఠశాలల్లో పనులు మధ్యలో నిలిచిపోయాయి. వీటికి సంబంధించి చిన్నచిన్న పనులను పూర్తి చేస్తే చాలావరకూ అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో గురువారం నుంచి ప్రారంభం కానున్న బడుల్లో విద్యార్థులు కూర్చోవటానికి సరిపడా తరగతి గదులు లేక ఇబ్బందులు పడనున్నారు.ఆందోళన చెందుతున్న విద్యార్థులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా అభివృద్ధి చెందాయి. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో పాటుగా అనేక ప్రోత్సాహకాలను అందించి దేశంలోనే ఏపీ విద్యాసంస్థలను ఆగ్రభాగాన నిలిపిన ఘనతను గత ప్రభుత్వం సాధించింది. అయితే ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలకు, విధానాలకు కూటమి ప్రభుత్వం తిలోదకాలివ్వటం వలన తమ పిల్లల భవిష్యత్ ఏమవుతుందో అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులు కొండెక్కుతుంటే మరోవైపు ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు దిగజారుతున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎట్టకేలకు వక్ఫ్ భూముల కౌలు వేలం
పెనమలూరు: ఎన్నో ఏళ్లుగా పెత్తందారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కొండపల్లి ఖాజీ వక్ఫ్ భూములకు అధికారులు ఎట్టకేలకు బుధవారం ఏక్సాల్ కౌలు వేలంపాట నిర్వహించారు.ఈ వేలం పాటలో జిల్లా నుంచి వచ్చిన 42 మంది రైతులు పోటాపోటీగా పాల్గొన్నారు. వక్ఫ్ భూములను రూ. 24,08,415కు నలుగురు కౌలుదారులు పాట దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న వక్ఫ్ భూములకు తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ కౌలు వేలంపాట నిర్వహించారు. మొత్తం 42 మంది రైతులు వేలంపాటలో ఒక్కొక్కరూ రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాల్గొన్నారు. ఈ భూములకు 40 ఏళ్ల తరువాత మొదటిసారిగా కౌలు వేలంపాట నిర్వహించడం గమనార్హం. వేలం పాట వివరాలు పెదపులిపాక గ్రామంలో ఉన్న ఆర్ఎస్ నంబర్ 87లోని 12.59 ఎకరాలకు ఎకరా రూ.40,500 చొప్పున మొత్తం రూ 5,09,895లకు సయ్యద్ రెహమాన్ వేలంపాట పాడారు. తాడిగడపలోని ఆర్ఎస్ నంబర్ 79 లోని 11.41 ఎకరాలను జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన అష్రఫ్ రికార్డు స్థాయిలో ఎకరా రూ.లక్ష చొప్పున 11.41 ఎకరాలను 11.41 లక్షలకు పాట పాడారు. ఆర్ఎస్ నంబర్ 176లో 12.92 ఎకరాలను ఎకరా రూ.46 వేల చొప్పున రూ.5,94,320కు హుస్సేన్ అనే రైతు వేలంపాట పాడారు. ఆర్ఎస్ నంబర్ 173లోని 4.08 ఎకరాలను ఎకరా రూ.40 వేల చొప్పున రూ.1,63,200కు రైతు ఫతాఉల్లా వేలంపాటలో దక్కించుకున్నారు. వేలంపాట పాడిన వారికి కౌలు లీజు 11 నెలలు ఉంటుంది. అందరూ ముందుగానే సొమ్ము వక్ఫ్ బోర్డుకు చెల్లించాల్సి ఉంటుంది. టీడీపీ నేతలు వక్ఫ్ భూములు కై వసం చేసుకోవాలని వేలం పాటలో పాల్గొని విఫలమయ్యారు. వేలంపాటలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ అబ్దుల్ రబ్బాని, వక్ఫ్ ఇన్స్పెక్టర్ నుహూ ఆలీషా, కొండ పల్లి ఖాజీ అబీబుల్లా హుస్సేని, వక్ఫ్ అధికారి కలీముల్లా పాల్గొన్నారు. తుది నిర్ణయం కోర్టుదే... వక్ఫ్ భూముల కౌలు వేలంపాట ముగియటంతో ఇక కోర్టు తుది ఉత్వర్వులతో కౌలుదారుల వద్ద సొమ్ము కట్టించుకుని 11 నెలలు భూమి కౌలు లీజుకు ఇస్తారు. గతంలో వక్ఫ్ భూముల్లో అనధికారికంగా సాగు చేసిన కొందరు ఏపీ హైకోర్టులో 2323/2025, 2324/2025 రిట్ పిటీషన్లు వేశారు. కోర్టు వక్ఫ్ భూములకు కౌలు వేలం నిర్వహించి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించింది. కౌలు వేలం పాట ముగియటంతో కోర్టు దృష్టికి వక్ఫ్ అధికారులు తీసుకు వెళతారు. అనంతరం కోర్టు అనుమతులతో భూములు కౌలుదారులకు అప్పగిస్తారు. రూ.24 లక్షల ఆదాయం వేలంలో పాల్గొన్న 42 మంది 40 సంవత్సరాల తరువాత మోక్షం టీడీపీ నేతలకు చుక్కెదురు 40 ఏళ్లుగా నయా పైసా చెల్లించలేదు... కొండపల్లి ఖాజీ,వక్ఫ్ భూములకు ఈ 40 ఏళ్లలో నయాపైసా కౌలు కొండపల్లి ఖాజీకి కాని, వక్ఫ్కు కాని చెల్లించలేదు. ఇప్పుడు కౌలు వేలం నిర్వహించటంతో కేవలం 11 నెలలకే రూ.24 లక్షల కౌలు ఆదాయం వచ్చింది. వక్ఫ్ భూముల కౌలు వేలంపై ‘సాక్షి’ లో వచ్చిన కథనాలు, వక్ఫ్ అఽధికారుల కృషితో న్యాయం జరిగిందని ముస్లిం సమాజం ఆనందం వ్యక్తం చేస్తోంది. -
ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు బిగ్ అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: రానున్న 24 గంటల్లో ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తరాంధ్ర తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణం.. రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారింది. నిన్న గుడివాడలో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కైకలూరు, మచిలీపట్టణం 7, ఏలూరు 6, నూజివీడు, భీమడోలు, రేపల్లె 5 సెంటీమీటర్ల, లేపాక్షి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
పక్కా కుట్రతోనే టీడీపీ నేతల దాడులు.. డీజీపీకి సాక్షి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీవ్యాప్తంగా తమ కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు తెగపడుతుండడంపై సాక్షి మీడియా సంస్థ పోలీసులను ఆశ్రయించింది. బుధవారం ఉదయం సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసి ఫిర్యాదు అందజేసింది. ఏపీలో సాక్షి యూనిట్తోపాటు ప్రాంతీయ కార్యాలయాలపై టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు జరిపిన దాడులు.. ఆస్తులు విధ్వంసం తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సాక్షి ప్రతినిధుల బృందం కోరింది. తద్వారా రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు పరిరక్షించాలని తెలిపింది. మహిళలు, బాలికలతో పాటు అన్ని వర్గాల పట్ల సాక్షి మీడియా పూర్తి గౌరవంతో వ్యవహరిస్తోందని, ఎటువంటి అనుచిత వ్యాఖ్యలను సాక్షి మీడియా సమర్థించదని, పక్కా కుట్రతోనే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని సాక్షి ప్రతినిధుల బృందం డీజీపీకి స్పష్టం చేసింది. కార్యాలయాలపై దాడికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకునేలా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించాలని ఆయన్ని సాక్షి బృందం కోరింది.ఏపీ పోలీస్ హెడ్క్వార్టర్స వద్ద సాక్షి ప్రతినిధుల బృందం -
నిత్య యోగాతో జీవితంలో నూతనోత్తేజం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా జీవితంలో నూతనోత్తేజం కలుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ యోగాను చేరువచేసేందుకు థీమ్ యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో జిల్లా అధికార యంత్రాంగం, ఆయుష్ శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికులు, విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వర్గం ప్రజలకు యోగాపై అవగాహన కల్పించేందుకు థీమ్ యోగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉపాధి హామీ పథకం శ్రామికులతో పాటు విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి యోగాసనాల అభ్యసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఎ.రాము, అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అధ్యక్షుడు ఏఎస్ఎన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పి.హరికృష్ణ, కోశాధికారి డి.రాజారావు, లయన్స్ క్లబ్, సిద్ధార్థ కళాశాల యోగా శిక్షణ కేంద్రం సభ్యులు, డీఎంహెచ్వో డాక్టర్ ఎం. సుహాసిని, ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి తదితరులు పాల్గొన్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ షేర్మహ్మద్పేట(జగ్గయ్యపేట): తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మంగళవారం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన చల్లా లింగయ్య మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చే సరికి తలుపులు తీసి ఉండటంతోపాటు బీరువాలోని రూ. 2.70 లక్షల నగదు కనిపించకపోవడంతో చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ తోట సూర్యశ్రీనివాస్ వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
డైవర్షన్ పాలిటిక్స్..
వెన్నుపోటు దినం సక్సెస్ అయ్యేసరికి కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. వైఎస్ జగన్ కంటే మెరుగైన పాలన అందిస్తామని ప్రజలను నమ్మించి వంచించారన్నారు. మహిళలను దారుణంగా మోసం చేసి ఉసురు పోసుకున్నారని ఆరోపించారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. అమ్మఒడి, చేయూత, ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా లక్షల మంది మహిళలకు వైఎస్ జగన్ అండగా నిలిచారన్నారు. శాంతిభద్రతల సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు మరే రాష్ట్రంలోనూ లేదన్నారు. కొమ్మినేని అరెస్టును ఖండిస్తున్నామని, మీడియా సంస్థపై దాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు. -
నేడు కృష్ణానదిలో ఫ్లోటింగ్ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంధ్ర–2025లో భాగంగా ఈ నెల 11వ తేదీన బెరం పార్కు వద్ద కృష్ణా నదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డును సొంతం చేసుకునేలా మెగా ఈవెంట్ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డును కై వసం చేసుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 200 వాటర్ క్రాఫ్ట్స్పై వెయ్యిమందితో కామన్ యోగా ప్రోటోకాల్తో యోగాసనాలు వేస్తున్నట్లు చెప్పారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ కార్యక్రమాన్ని పరిశీలించి, ప్రపంచ రికార్డుగా నమోదు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. మెగా ఈవెంట్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగంతో ఆయుష్ శాఖ, వైద్య ఆరోగ్యం, మునిసిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మత్స్య తదితర శాఖలతో పాటు అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ), స్విమ్మర్ల అసోసియేషన్, యోగా శిక్షణ సంస్థలు వంటివి కూడా భాగస్వాములవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు.. ఫ్లోటింగ్ యోగా నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు, సుశిక్షితులైన బోట్ ఆపరేటర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. బోట్లకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారన్నారు. సమావేశంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో డాక్టర్ తరుణ్ కాకాని, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రామత్లేహి, డీపీఆర్వో ఎస్వీ మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన.. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఫ్లోటింగ్ యోగా కార్యక్రమ ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మంగళవారం పరిశీలించారు. ప్రపంచ రికార్డ్ను సొంతం చేసుకునేలా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్లో యోగా ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొననున్నందున ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా భద్రత, ఇతర ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. బారికేడింగ్, సీటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు చూడాలని సూచించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, ప్రాంగణ అలంకరణ తదితరాలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఆయుష్ అధికారులు, ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ మేనేజర్ పి. కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మెకానిక్లు దుర్మరణం
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. హనుమాన్జంక్షన్కు చెందిన దాసరి ఫణివిక్రమ్ తన కారును మరమ్మతుల నిమిత్తం విజయవాడలోని మెకానిక్ నూతక్కి శ్రీనివాస్(37) వద్దకు ఆదివారం సాయంత్రం తీసుకువెళ్లారు. అయితే పాత కారు కావడంతో తన స్నేహితుడైన ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన మరో మెకానిక్ సర్పరాజ్ (30)ని పిలిపించాడు. ఇరువురు కలిసి అర్ధరాత్రి వరకు కారుకు మరమ్మతులు చేశారు. అనంతరం తెల్లవారుజాము వరకు కారులోనే విశ్రాంతి తీసుకుని ఉదయం ఫణివిక్రమ్తో కలిసి సర్పరాజ్, శ్రీనివాస్ కారులో హనుమాన్జంక్షన్ బయలుదేరారు. మార్గ మధ్యలో ఆత్కూరు ఫ్లై ఓవర్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అందరూ అందులో చిక్కుకుపోయారు. కారు నడుపుతున్న సర్పరాజ్, వెనుక సీట్లో కూర్చున్న శ్రీనివాస్కు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఎడమ వైపు కూర్చున్న ఫణివిక్రమ్ మాత్రం గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆత్కూరు పోలీసులు క్రేన్ సాయంతో కారు డోర్లను తెరచి గాయపడిన ఫణివిక్రమ్ను పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. సర్పరాజ్, శ్రీనివాస్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు శ్రీనివాస్కు భార్య, ఒక కుమారుడు ఉండగా, సర్పరాజ్ మాత్రం అవివాహితుడిగా పోలీసులు పేర్కొన్నారు. వలస కూలీల అనుమానాస్పద మృతి నందివాడ: వలస కూలీలు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెన్ననపూడి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అసోంకు చెందిన బిశాల్ బసుమత్రి (25), జహర్లల్ దోయిమరి (36) వెన్ననపూడి గ్రామంలో ఓ ఆక్వా చెరువు వద్ద కాపలాదారులుగా ఉంటూ అక్కడే కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం చెరువు వద్ద ఉన్న షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం.. పొగ బాగా కమ్ముకోవడంతో ఇరువురూ అక్కడికక్కడే మృతి చెందారు. వారి శరీరం కూడా సగం వరకూ కాలిపోయింది. ఘటనా స్థలంలో ఉన్న పరిస్థితిని బట్టి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఎవరైనా సిగరెట్ కాల్చి పడేయడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల శరీర భాగాలతో పాటు ఘటనా స్థలంలో ఉన్నటువంటి వస్తువులను మంగళగిరి ఆర్ఎఫ్ఎస్ ల్యాబ్కి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కారు కృష్ణాజిల్లా ఆత్కూరు వద్ద ఘటన -
అంతులేని అఘాయిత్యాలపై ఆందోళన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ కరువైందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యాలను నిరసిస్తూ ‘సేవ్ ఉమెన్, సేవ్ ఆంధ్ర’ పేరుతో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ అంబేడ్కర్ స్మృతివనంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం వద్ద మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి తదితర మహిళా నేతలతో కలిసి ఆమె ఆందోళన చేపట్టారు. పోలీసుల ఓవరాక్షన్.. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించేందుకు వచ్చిన మహిళా ప్రతినిధులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. మంగళవారం సెలవు దినం లోపలికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో గేటు వద్ద వైఎస్సార్ సీపీ మహిళ విభాగం ప్రతినిధులు ప్లకార్డులతో నినాదాలు చేశారు. టీడీపీ క్రూర మృగాల నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆడ బిడ్డల కన్నీళ్లతో కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. గేటు వద్దే నిరసన తెలియజేస్తున్న వారిలో కొందరిని లోపలకు పంపి మిగిలిన వారిని గేటు వద్ద నిలిపివేశారు. లోపలికి వెళ్లిన వరుదు కల్యాణి, మేయర్, డెప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లను అంబేడ్కర్ విగ్రహం ముందువైపునకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పక్కనే ఉండి వినతి పత్రం అందజేయాలని హుకుం జారీ చేశారు. ఆ సమయంలో పోలీసులకు ప్రతినిధులకు వాగ్వాదం జరిగింది. ఎవరైనా ముందుకు వెళ్లి వినతి పత్రం ఇస్తారని, పక్కనుంచి ఎలా ఇస్తారని వరుదు కల్యాణి నిలదీశారు. రెడ్బుక్ రాజ్యాంగం.. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు, నిరసన తెలిపేందుకు రాజ్యాంగ నిర్మాత విగ్రహం వద్దకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, తాము ప్రజాప్రతినిధులమని, తీవ్రవాదులం కాదన్నారు. తమ చేతుల్లో ఆయుధాలు లేవని పోలీసులు ఎందుకు అనుమతించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రత కల్పించడం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహిళా విభాగం ప్రతినిధులు విజిత, త్రివేణి రెడ్డి, సుభాషిణి, వేముల బేబీరాణి, తోపుల వరలక్ష్మి, బండి పుణ్యశీల కార్పొరేటర్లు పాల్గొన్నారు. కూటమి ఆటవిక పాలనపై వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నిరసన అంబేడ్కర్ స్మృతి వనంలోని విగ్రహానికి వినతి పత్రం సమర్పణ -
వెబ్ కౌన్సెలింగ్కు బ్రేక్
ప్రారంభమైన ఎస్జీటీల మాన్యువల్ బదిలీలు మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం వెబ్ కౌన్సెలింగ్ విధానానికి బ్రేక్ వేసింది. టీచర్ల బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, 53 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 2,800 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) బదిలీ ప్రక్రియ మంగళవారం సాయంత్రం విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు. సర్వర్ సమస్యలతో ఆలస్యం.. స్థానిక జిల్లా పరిషత్ (జెడ్పీ) సమావేశ మంది రంలో నిర్వహిస్తున్న మాన్యువల్ కౌన్సెలింగ్కు ఎస్జీటీలు మధ్యాహ్నం రెండు గంటలకే జెడ్పీకి చేరుకున్నప్పటికీ, అవసరమైన ఆన్లైన్ అనుమతులు ఆలస్యం కావడంతో అదే ప్రాంగణంలో గంటల తరబడి ఉపాధ్యాయులు పడిగాపులు కాశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన టీచర్లు చెట్ల కింద కూర్చొని అసహనానికి గురయ్యారు. కనీస వసతులు కల్పించలేదని పెదవి విరిచారు. కౌన్సెలింగ్ మొదటి రోజున 200 మంది ఎస్జీటీల బదిలీలను చేపట్టారు. టెక్నికల్ సమస్యలు ఎదురవడం, సర్వర్ మొరాయించటంతో ప్రక్రియలో జాప్యం జరిగింది. మొత్తం బదిలీల ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయుల అర్హతలు, ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. శాప్ పాలకవర్గ సభ్యులు వీరే.. విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) పాలకవర్గ సభ్యుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఒలింపిక్ క్రీడాకారులు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు, క్రీడలకు ప్రోత్సాహం అందించే వ్యక్తులకు పాలకవర్గంలో చోటు కల్పిస్తూ ప్రభుత్వ కార్యదర్శి వి.వినయ్చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒలింపిక్ హాకీ క్రీడాకారిణి ఇ.రజిని(చిత్తూరు), అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు ఎ.రమణరావు(విజయ వాడ), ఎం.డి.రమేష్కుమార్(విజయనగరం), వ్యాయామ విద్యా అధ్యాపకుడు ప్రేమ్రవీంద్రనాథ్(పశ్చిమగోదావరి), క్రికెట్ క్రీడాకారుడు ఎస్.సంతోష్కుమార్(విజయవాడ), కె.జగదీశ్వరి(ఎన్జీవో), క్రీడలకు ప్రోత్సాహం అందించే బి.శివ(అనంతపురం), పి.బి.వి.ఎస్.ఎన్.రాజు(అనకాపల్లి) సభ్యుల జాబితాలో ఉన్నారు. -
అరాచకాలు చూపిస్తే బ్యాన్ చేస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను చూపిస్తున్న చానళ్లు ప్రసారం కాకుండా బ్యాన్ చేస్తున్నారని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. వారిని బెదిరించి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికే అప్పుల ఊబిలో ఉందని, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేక పోయిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. మహిళలపై దాడులు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని, మహిళా హోం మంత్రి అయి ఉండి ఏమి మాట్లాడుతున్నారో తెలియడంలేదని విమర్శించారు. క్రిమినల్ని ట్రీట్ చేసినట్లు కొమ్మినేనిని చూడటం దుర్మార్గమన్నారు. -
సమిధలవుతున్న వనితలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రోజుకో ప్రాంతంలో వారిపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలతో కలిసి మంగళవారం అవినాష్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా, ఇచ్చిన హామీల అమలు శూన్యమన్నారు. తాము వెన్నుపోటు దినం ద్వారా నిరసన తెలిపితే కూటమి పాలకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. దారుణ రాజకీయాలు.. ఒక జర్నలిస్ట్ చానల్లో మాట్లాడితే దానిని వైఎస్ జగన్ కుటుంబానికి అంటగడుతూ విమర్శలు చేస్తున్నారన్నారు. కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసి కక్ష పూరిత రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అవినాష్ అన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం కల్పించామని, మహిళల పేరుతో అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. మహిళలు అంటే గౌరవంతో వైఎస్ జగన్ పాలన సాగించారన్నారు. అమరావతి ప్రాంతంలో పేద ప్రజలకు సొంతింటి కలను జగన్ నెరవేర్చారన్నారు. జగన్ చేసిన మంచి పనులను దమ్ముగా, ధైర్యంగా చెప్పగలమని, ఆయన గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, జాగ్రత్త అని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని, ఒక చానల్లో వచ్చిన దానికి కొమ్మినేని అప్పుడే క్షమాపణ చెప్పారని, ఆ మీడియా ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు వరుస దారుణ ఘటనలతో బెంబేలు డైవర్షన్ కోసమే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ మీడియాతో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ -
ఉర్వేళమ్మ ఉత్సవం.. సకల జనుల సంబరం
● మూడేళ్లకోసారి గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర ● నూరు వసంతాలుగా వెల్లివిరుస్తున్న మత సామరస్యం ● ఉర్వేళమ్మ జాతరలో తొలి పూజలు ముస్లిం సాహెబ్కే ● హిందూ భక్తులతో మదార్ సాహెబ్ సంబరం భావదేవరపల్లి(నాగాయలంక): నూరేళ్లుగా అచ్చమైన మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ గ్రామదేవత సంబరం. నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలో మూడేళ్లకు ఒకసారి నిర్వహించే గ్రామదేవత ఉర్వేళమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. జాతరకు ముందుగా పూర్వీకుల సంప్రదాయం రీత్యా మదార్ సాహెబ్ సంబరం జరపడం తప్పనిసరి. గ్రామంలో గుడారం, మదరా సాహెబ్ జెండా ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. వందేళ్ల క్రితం అప్పటి ఆలయ ధర్మకర్తలు భోగాది అప్పారాయుడు, మండలి వెంకటప్పయ్య, గ్రామపెద్దలు రాసిన ఇలియా (శాసనం) ప్రకారం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉర్వేళమ్మతో పాటు మదార్సాహెబ్ సంబరం మందుగా నిర్వహిస్తారు. వాస్తవానికి ఈ గ్రామంలో ముస్లిం కుటుంబాలు లేవు. అయినా అందుబాటులో ఉండే ముస్లిం పెద్దలు వచ్చి మదార్ సాహెబ్ సంబరం జరుపుతారు. తొలుత సాహెబ్ జెండా పట్టుకుని గ్రామ వీధుల్లో తిరిగి భక్తుల నుంచి కొబ్బరికాయలు, అగరొత్తులు, చిల్లర నాణేలు స్వీకరిస్తారు. అదే రాత్రికి మదార్ సాహెబ్ గుడారానికి చేరిన భక్తులు ఆ మత సంప్రదాయం మేరకు మూడు చొప్పున రొట్టెలు, గంధపు ఉండలు, జెండాలు, చిల్లర నాణేలు సమర్పించి పూజలో పాల్గొంటారు. హిందూ–ముస్లిం సమైక్యతతో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ క్రతువు ముగిసిన వెంటనే మద్ది రావమ్మ స్థావరానికి భక్తులు చేరుకుని వేడి నైవేద్యాలను సమర్పిస్తారు. 13వ తేదీ నుంచి ఉత్సవాలు ఎంతో వైవిద్యంతో కూడిన ఉర్వేళమ్మ జాతర మహోత్సవాన్ని గ్రామస్తులు ఈ నెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా 13న పోతురాజుస్వామి పోత తదుపరి మద్ది రావమ్మ, మదారా సాహెబ్ సంబరం జరుగుతాయి. 14న గ్రామంలో గుడారం, మదారా సాహెబ్ జెండా ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో సాహెబ్ జెండా పట్టుకుని భక్తులు నడుస్తారు. చివరి రోజు 15వ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఉర్వేళమ్మవారికి పూజ, రాత్రి ఏడు గంటలకు ఉర్వేళమ్మ దేవతకు వేడి నైవేద్యాలతో గ్రామస్తులు ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి పది గంటలకు ఆలయానికి చేరుకుని గ్రామంలోని 20 ముఠాల నేతృత్వంలో సంయుక్తంగా అమ్మవారి సంబరాన్ని అట్టహాసంగా జరుపుతారు. -
భక్తులతో పోటెత్తిన కార్తికేయుని ఆలయం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. స్వామివారి నిత్యకల్యాణంలో 73 జంటలు పాల్గొన్నాయి. ఈ ఒక్కరోజునే వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ.9,07,678 ఆదాయంగా వచ్చిందని ఆలయ ఈఓ దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. పాఠశాలల వేసవి సెలవులు ముగియనుండటం, చతుర్థశితో కూడిన మంగళవారం కావడంతో వేలాదిగా భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. ఆలయ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. బీచ్ ఫెస్టివల్ క్రీడా పోటీల విజేతలకు అభినందన విజయవాడస్పోర్ట్స్: మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్టివల్లో నిర్వహించిన జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల ప్రదర్శన భేష్ అని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎండీ పీఎస్ గిరీషా పేర్కొన్నారు. క్రీడల నిర్వహణలో శాప్ అధికారులు, డీఎస్డీఓలు, కోచ్లు, అసోసియేషన్ల బాధ్యుల కృషిని అభినందించారు. విజయవాడలోని శాప్ కార్యాలయ సమావేశపు హాలులో మంగళవారం బీచ్ ఫెస్టివల్ జాతీయ పోటీల్లో గెలుపొందిన ఏపీ క్రీడాకారులు, క్రీడా పోటీలు నిర్వహించిన శాప్ అధికారులు, సిబ్బంది, క్రీడా సంఘాల ప్రతినిధులను సత్కరించారు. తొలుత బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కెనాయింగ్ అండ్ కయాకింగ్ జాతీయ పోటీల్లో ఏపీ తరఫున తలపడి పతకాలు సాధించిన విజేతలను సత్కరించి, ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేశారు. శాప్ ఏఓ ఆర్.వెంకటరమణ నాయక్, టీఎస్ఓ ఎస్.వి.రమణ, ఎస్ఓలు కోటేశ్వరరావు, మహేష్, సురేంద్ర, కిషోర్, ఏడీ వేణు పాల్గొన్నారు. మెడికల్ అకాడమీ తరలింపును విరమించాలి కంకిపాడు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ ఐఐటీ మెడికల్ అకాడమీ తరలింపు యోచనను విరమించుకోవాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈడుపుగల్లులోని ఐఐటీ–మెడికల్ అకాడమీ వద్ద మంగళవారం విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ ఐఐటీ – మెడికల్ అకాడమీ 2017 నుంచి కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో బాలికలకు ప్రత్యేకంగా ఉన్న అకాడమీ ఇదొక్కటే అని గుర్తు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న అకాడమీని కేవలం అద్దె భారం సాకుతో మూతవేసి, విద్యార్థులను తరలించే ఆలోచన చేయటం దుర్మార్గమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ షైనింగ్ స్టార్ అవార్డుల పేరుతో ప్రభుత్వ విద్యార్థుల కంటే ప్రైవేటు విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. ఐఐటీ మెడికల్ అకాడమీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. రేపటి నుంచి ఇగ్నో పరీక్షలు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నిర్వహించే జూన్– 2025 టర్మ్ ఎండ్ పరీక్షలు ఈ నెల 12 నుంచి జూలై 19వ తేదీ వరకూ జరగనున్నాయని సంస్థ విజయవాడ ప్రాంతీయ కేంద్రం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ డి.ఆర్.శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అందరికీ హాల్ టికెట్లను ఇగ్నో వెబ్ సైట్లో అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు తమ అధ్యయన కేంద్రాలను థియరీ పరీక్షల అనంతరం సంప్రదించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించొచ్చని ఆ ప్రకటనలో సూచించారు. -
యథేచ్ఛగా లైంగిక దాడులు
కూటమి పాలనలో ● బాధితుల్లో ఆర్నెల్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధులు ● నేరాలకు పాల్పడుతున్న వారంతా టీడీపీ వారే ● మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకమే ఇందుకు కారణం ● మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. బాధితుల్లో ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాది కూటమి పాలనలో మహిళల మాన, ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయని, రాష్ట్రంలో మహిళలు బతకాలంటే భయపడుతున్నారని, బాలికల తల్లిదండ్రులు గజగజా వణికిపోతున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలకు పాల్పడిన వారంతా టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని మండిపడ్డారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు నిరస నగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు ఎంత దారుణంగా ఉన్నాయో చూస్తున్నాం. ఈ ఏడాది కాలంలో విపరీతంగా పెరిగాయి. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళలు బయ టకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. మహిళలు ఇంట్లో ఉన్నా, బడిలో, కళాశాలలో ఉన్నా, చివరికి పని ప్రదేశంలో ఉన్నా అఘాయిత్యాలు, లైంగిక దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఇటీవల హిందూపురం, అనంతపురంలో చిన్నారి తన్మయి. సత్యసాయి జిల్లాలో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడులే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు కూటమి పెద్దలు పనికిమాలిన విషయాలపై దృష్టి పెడుతున్నారని, మహిళలపై ఇన్ని ఘటనలు జరి గినా సీఎం, డెప్యూటీ సీఎం, హోం మంత్రి ఎక్క డైనా స్పందించారా అని వరుదు కల్యాణి ప్రశ్నించారు. కడప జిల్లాలో మూడేళ్ల బాలికపై లైంగికదాడి, హత్య చేశారని, ఉండి నియోజకవర్గంలో, భీమిలిలో ఇలా ఎక్కడా చూసినా ఇలాంటి ఘటనలు వినని రోజు లేదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రోజుకు 70 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయని, నమోదు కానివి ఇంకా ఎన్నో ఉన్నాయని, గంటకు మూడు, నాలుగు లైంగికదాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న ఒక్క రివ్యూ చేయకపోవడం సిగ్గుచేటని, అవసరం లేని విషయాలపై, కక్షపూరిత రాజకీయాలపై ప్రెస్మీట్లు పెట్టే హోం మంత్రి ఇలాంటి ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏరులై పారుతున్న మద్యం కూటమి పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వరుదు కల్యాణి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో గంజాయి రూపుమాపుతామని గొప్పలు చెప్పారని, హోం మంత్రి నివసిస్తున్న విశాఖలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతోందని, ఆమె నియోజకవర్గం మీదుగానే గంజాయి రవాణా జరుగుతోందని వివరించారు. కూటమి పాలనలో వీధికో గాంధార పుత్రుడు, వీధివీధినా గంజాయి పుత్రులే కనిపిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 20257వెబ్ కౌన్సెలింగ్కు బ్రేక్ ఉపాధ్యాయుల బదిలీల వెబ్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. నిత్య యోగాతో జీవితంలో నూతనోత్తేజంయోగాతో జీవితంలో నూతనోత్తేజం కలుగుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మంగళవారం ఉపాధి హామీ కూలీలు, విశ్రాంత పోలీసు అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. ఆడబిడ్డలకు రక్షణ ఏది? కూటమి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ మహిళా ప్రజాప్రతినిధులు విమర్శిం చారు. మహిళల మానప్రాణాలు కాపాడాలని కోరుతూ మంగళవారం ఆందోళన చేశారు. –8లోu -
రెడ్బుక్ లాఠీ
● ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా లాఠీ.. హుందాతనం కోల్పోతున్న ఖాకీ ● ఫలితంగా ఎన్టీఆర్ జిల్లాలో పెరిగిన రౌడీ, కేడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ ముఠాలు ● శాంతిభద్రతలను విస్మరించి, కూటమి నేతల అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న పోలీసులు ● ప్రజాక్షేత్రంలో పరువు పోగొట్టుకుంటున్న పోలీస్ కమిషనరేట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్లతో మొదలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కూటమి పాలనపై సోషల్ మీడియా యాక్టివిస్ట్లు గొంతు విప్పారు. ఫేస్బుక్, ఇన్స్టా గ్రాం, ఎక్స్, యూ ట్యూబ్, వాట్సాప్ వేదికగా ప్రశ్నించడం ఆరంభించారు. రానున్న రోజుల్లో ఈ ప్రశ్నలు విజృంభి స్తాయని గ్రహించిన కూటమి నేతలు వారిపైకి పోలీస్లను ఉసిగొల్పారు. ఫిర్యాది ఎవరో తెలియకుండానే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సోషల్మీడియా ఖాతాలపై కేసులు నమోదయ్యాయి. పదేళ్ల క్రితం చేసిన పోస్ట్ ఆధారంగా కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లా సైబర్ పోలీస్ స్టేషన్లో వారం రోజుల వ్యవధిలో 300లకు పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు రెండు వేల మందిని 41(ఏ) నోటీసులతో స్టేషన్కు పిలిపించి విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రెండు వేలకు పైగా కేసులు నమోదు చేశారు. వీటిలో చిన్నారులు, మహిళలపై అసభ్యకరంగా పోస్ట్ చేసిన ఖాతాలకు మినహా అన్ని కేసులు న్యాయస్థానంలో నిలబడలేకపోయాయి. ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్న పోలీసులు విజయవాడ: ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం కీలకపాత్ర పోషిస్తుంటాయి. తెలిసో.. తెలియకో అధికార పక్షం చేసే కొన్ని తప్పులను నిలదీసి, గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. అయితే అధికార పక్షం చేసే తప్పులను ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. భారత రాజ్యాంగం స్థానంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం, దానికి పోలీసులు వంతపాడటం సమాజ తిరోగమ నానికి దారితీస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీలు అలవికానివని, అమలుపై ప్రతిపక్షం, ప్రజా సంఘాలు కచ్చితంగా నిలదీస్తాయని కూటమి నేతలకు ముందే తెలుసు. ప్రశ్నించే ముందుగానే ఆ గొంతులను నొక్కేసే వ్యవహారానికి కూటమి శ్రీకారం చుట్టింది. అందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ను పావుగా వాడుకుంటోందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పేట్రేగిన దొంగలు, రౌడీలు, కేడీలు కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల్లోనే పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నుంచి ఎస్ఐ స్థాయి వరకు చకాచకా బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో పోస్టింగ్లు పొందిన పోలీసు అధికారులు కేవలం ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల దినచర్య లపై దృష్టి పెట్టారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి టాస్క్ఫోర్స్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితోపాటు నగరంలోని సీసీ కెమెరాలను సైతం ప్రతిపక్షం నేతల వైపే తిప్పారు. తమపై పోలీసుల నిఘా లేకపోవడంతో దొంగలు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. 2024 ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విజయవాడలో 2,500 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. చైన్స్నాచింగ్, గంజాయి సరఫరా విచ్చలవిడి అయింది. 2024 జూన్ నుంచి 2025 మే నెల వరకు జిల్లాలో 989 పరస్పర దాడుల కేసులు, 1,320 కబ్జా కేసులు, 1,662 మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి కేసులు, 110 ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, 1,407 రోడ్డు ప్రమాదాల కేసులు, 323 సైబర్ కేసులు, 550 చీటింగ్ కేసులు, 142 డ్రగ్స్ సరఫరా కేసులు పోలీస్ కమిషనరేట్లో నమోదయ్యాయి. 38 హత్య కేసులు, 112 హత్యాయత్నం కేసులు, 27 తీవ్రమైన దాడుల కేసులు, 791 స్వల్పదాడుల కేసుల నమోదయ్యాయి. 18 మంది మహిళలు హత్యకు గురవగా, వరకట్నం వేధింపులకు ఐదుగురు బలయ్యారు. 45 మంది మహిళలు, యువ తులపై లైంగికదాడులు జరగ్గా, 836 మంది గృహి ణులు వరకట్నం వేధింపులు ఎదుర్కొంటున్నారు. విద్యాసంస్థల్లో సైతం ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని 394 మంది విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇక చిల్లర దొంగతనాలకు హద్దేలేకుండా పోయింది. చోరీలను అదుపు చేయలేక రక్షణ వ్యవస్థ చేతులెత్తేసింది. మొత్తంగా కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతకు పెనుముప్పు తీసుకొచ్చెలా 3,437 మంది రౌడీలు, కేడీలను రెడ్బుక్ రాజ్యాంగం తయారు చేసింది. పోలీసు అధికారులకు కోర్టుల్లో చీవాట్లు కూటమి నేతల దృష్టిలో పడి మంచి పోస్టింగ్ కొట్టేద్దామని అత్యుత్సాహంతో అక్రమ కేసులు బనాయించిన పలువురు పోలీసు అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్న ఘటనలు తాజాగా వెలుగు చూస్తున్నాయి. రెడ్ బుక్ మోజులో పడి బీఎన్ఎస్ను అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి న్యాయస్థానంలో కొందరు పోలీసు అధికారులు చీవాట్లు తిన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులపై వైఎస్సార్ సీపీ నాయకులు సైతం తిరిగి కేసులు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసులు న్యాయస్థానం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో అభియో గాలు నిరూపితమైతే తమ ఉద్యోగాలకే ముప్పు వాటిల్లుతుందనే భయం సదరు పోలీసు అధికారులను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు ఆయా కేసులను వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకుల కాళ్లావేళ్లా పడుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెంనకు చెందిన శ్రీనివాసరావుకు విజయవాడ సైబర్ పోలీసుల నుంచి నోటీసు వెళ్లింది. సోషల్ మీడియాలో అసభ్యకర మెసేజ్ను పోస్ట్ చేశారని, విచారణకు రావాలని ఆ నోటీసు సారాంశం. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు చెందిన సుమారు 150 మందికి కూడా ఈ నోటీసులు వెళ్లాయి. వారంతా పోలీసులు చెప్పిన తేదీకి విజయవాడ సైబర్ స్టేషన్కు విచ్చేశారు. స్వతహాగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులైన వీరంతా ‘తెలంగాణ వైఎస్సార్ కుటుంబం’ పేరుతో నడిచే వాట్సాప్ గ్రూప్ సభ్యులు. గ్రూపు ‘డీపీ’గా వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నందుకు తమను విచారణకు పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని వారంతా అప్పట్లో గగ్గోలు పెట్టారు. ఇదేం అన్యాయం అంటూ ప్రశ్నించడంతో పోలీసులు వారిని వదిలేశారు. విజయవాడలో శాంతిభద్రతలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయనడానికి ఈ నెల ఎనిమిదో తేదీన మాచవరం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే నిదర్శనం. పట్టపగలు, నడిరోడ్డుపై యువకులు మద్యం మత్తులో కత్తులు, బీరు సీసాలతో పరస్పర దాడులు చేసుకుని స్థానికులను భయాందోళనకు గురి చేశారు. బ్యాచ్లర్ పార్టీలో తలెత్తిన ఈ వివాదం కత్తులు, బీర్ సీసాలతో దాడికి దారితీసింది. పోలీస్ స్టేషన్కు సమీపంలోనే దాదాపు గంటన్నర పాటు ఈ రాద్ధాంతం జరిగినా, గొడవ సద్దు మణిగే వరకు పోలీసులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం విమర్శలకు తావిచ్చింది. విలేకరులపై అక్రమ కేసులు,కూటమి పాలకుల అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చే విలేకరులపైనా పోలీస్ శాఖ జులుం ప్రదర్శిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని వారాలకే నందిగామలో కూటమి నేతల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సాక్షి విలేకరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బుడమేరు వరదల్లో పాలకుల వైఫల్యాన్ని, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆస్తి, ఆర్థిక నష్టాలను సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలి సిందే. ఆ తరువాత కూటమి నేతల మౌఖిక ఆదేశాలతో పోలీసులు అమాయక ప్రజలపై విరుచుకుపడుతున్న తీరును సాక్షి బహిర్గతం చేస్తోంది. ఈ నేపథ్యంలో సాక్షి గొంతుకను నొక్కేందుకు పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపైకి పోలీసులను కూటమి నేతలు ఉసిగొల్పారు. ముందస్తు నోటీసులు, న్యాయస్థానం ఆదేశాలు లేకుండా ఆయన ఇంట్లో తనిఖీలు చేసి ప్రజాస్వామ్యాన్ని పోలీసు శాఖ అపహాస్యం చేసింది. -
కూటమి సర్కార్ భారీ కుట్ర.. కొమ్మినేనిపై మరిన్ని కేసులు!
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్(Kommineni Srinivasa Rao) పై కక్ష సాధించడం కోసం కూటమి ప్రభుత్వం అడ్డదారులను ఎంచుకుంటోంది. టీవీ డిబేట్లో తన జోక్యం, ప్రమేయం లేకుండా జరిగిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేయించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు కక్ష చల్లారనట్లుంది!. అందుకే టీడీపీ నేతల(TDP Leaders)తో మరిన్ని కేసులు పెట్టిస్తున్నారు. తుళ్లూరు పీఎస్ కేసులో ఆయన సోమవారం అరెస్టు కాగా.. ఇవాళ మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు కొమ్మినేని విషయంలో ఒకే అంశంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. విజయవాడ సత్యనారాయణ పురం, పడమట పీఎస్, సాలూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతల ఫిర్యాదులతో కొమ్మినేనిపై కేసులు నమోదయ్యాయి. అయితే..ఇప్పటికే కొమ్మినేనిపై దాఖలు చేసిన సెక్షన్ల విషయంలో మంగళగిరి కోర్టు(Mangalagiri Court) ఇవాళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ.. ఆ సెక్షన్లను కొట్టేసింది. ఈ తరుణంలో ఆయనపై కేసు వీగిపోతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఒకవేళ ఈ కేసులో గనుక ఆయనకు బెయిల్ లభిస్తే.. మళ్లీ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం తాజా కేసులతో స్పష్టమవుతోంది. గతంలో పోసాని విషయంలోనూ ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేష్, పవన్లపై అనుచిత పోస్టులు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కూటమి నేతలతో కేసులు పెట్టించారు. దీంతో ఆయన్ని పీటీ వారెంట్ కింద వివిధ జైళ్లకు తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే.కొమ్మినేనిపై మరో మూడు కేసులు ఎక్కడ?.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది ఎవరు?.. టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంధ్యా రాణిఏయే సెక్షన్లు?.. 79BNS,67A ITA-2000-2008,75(3) BNS సెక్షన్ల కింద కేఎస్సార్పై కేసుఎక్కడ?.. విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పెట్టింది ఎవరు?.. సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1)(a),353(1)(b),61(2), r/w 3(5)BNS, 67A ITA 2000-2008 సెక్షన్ల కింద కొమ్మినేనిపై కేసుఎక్కడ?.. విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్లో పెట్టింది ఎవరు?.. ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1),353(3)b, 61(2),r/w 3(5) BNS, 67A ITA2000-2008 సెక్షన్ల కింద కేఎస్సార్పై కేసు నమోదు -
ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసనలు
విజయవాడ : ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా నేడు (మంగళవారం, జూన్ 10వ తేదీ)) రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నార వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు. చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది: ఆర్కే రోజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందిహోం మంత్రికి చీమ కుట్టినట్లు కూడా లేదుఅధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలిఅధికారంలో ఉన్నవాళ్లు వారే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారుమహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటునగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారుఅనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదుపరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చిందిడిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదుహోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి విజయవాడలో..రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు నిరసనగా వైస్సార్సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. కృష్ణాజిల్లా:లో.. సేవ్ ఉమెన్-సేవ్ ఆంధ్రా నినాదాలతో వైఎస్సార్సీపీ మహిళా నేతల తమ నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ మచిలీపట్నం లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు వైఎస్ఆర్సీపీ మహిళలు. దీనిలో భాగంగా మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్రం లో మహిళలపై, వృద్ధులపై, బాలికపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎవ్వరూ మమల్ని ప్రశ్నించకూడదు అని దాడులకు తెగబడుతున్నారు, పిల్లిని గదిలో పెట్టి దాడి చేస్తే ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో టీడీపీకి అదే గతి పడుతుంది. రాష్ట్రంలో మహిళా హోమ్ మినిస్టర్ గా ఉన్నా ఆమె పసుపు పార్టీకి కార్యకర్తగానే వ్యవహరిస్తుంది తప్పా అధికారాన్ని ఎక్కడా మహిళ ల పక్షాన్న చూపించడం లేదు’ అని మండిపడ్డారు.విశాఖలో..మహిళలపై జరుగుతున్న హత్యలు హత్యాచారాలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సిపి మహిళా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు మహిళ నేతలు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి.రాష్ట్రంలో మహిళలకు చిన్న పిల్లలకు రక్షణ కరువైంది.కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేసారు. హోం మంత్రి అనిత మహిళ అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. గత ముఖ్యమంత్రి జగన్ మహిళల రక్షణకు పెద్దపీట వేశారు.దిశ చట్టాన్ని అమలు చేసి మహిళలకు భద్రత కల్పించారు’ అని వైఎస్సార్సీపీ మహిళా నేతలు స్సష్టం చేశారు. అనంతపురంలో.. అనంతపురంలో చంద్రబాబు సర్కార్ పై మహిళల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలక భద్రత కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా అనంతపురం అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు మహిళల ద్రోహి అంటూ నిరసన చేపట్టారు.వైఎస్ఆర్ జిల్లా:కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళల ఆందోళనరాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, దారుణాలపై నిరసనరాష్ట్ర ప్రభుత్వానికి, హోంమంత్రి అనితకి వ్యతిరేకంగా నినాదాలుహోం మంత్రి మహిళ అయ్యి ఉండి కూడా న్యాయం చేయలేకపోతున్నారని మండిపాటుఆమెకు నిత్యం జగన్ను తిట్టి చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసే పనిలో ఉన్నారని విమర్శ32వేల మహిళలు ఇప్పుడు ఎక్కడున్నారని పవన్ కళ్యాణ్ కి ప్రశ్నమహిళల మన, ప్రాణాలను కాపాడలేని హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్32వేల మంది మహిళలను డిప్యూటీ సీఎం అయ్యాక కూడా తీసుకురాలేని పవన్ కళ్యాణ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్కాకినాడ జిల్లా:మహిళలపై జరుగుతున్న దాడులు,అఘాయిత్యాలను అరికట్టాలని కోరుతూ వైఎస్ఆర్ సిపి మహిళ విభాగం నిరసనడా.బి.అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందజేతపాల్గొన్న వంగా గీతా, జిల్లా అధ్యక్షురాలు సుజాతఏలూరు జిల్లా:సేవ్ ఉమెన్ సేవ్ ఆంధ్ర... నినాదంతో ఏలూరులో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నేతల నిరసనపాల్గొన్న ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు సరిత రెడ్డి, నగర అధ్యక్షురాలు విజయనిర్మల, పార్టీ మహిళా విభాగం నాయకులుఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మహిళ నాయకులుమహిళలు బాలికలకు బాబు పాలనలో భద్రత కరువైంది: సరిత రెడ్డికూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయికూటమి పాలనలో మహిళలు,చిన్నారులకు రక్షణ లేదుజగనన్న పాలనలో మహిళకు పెద్దపీట వేశారుచంద్రబాబు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం ఒక్క పథకం కూడా అమలు చేయలేదుఅంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారూజగనన్నదిశ యాప్ ద్వారా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే మహిళలకు అండగా నిలిచారుగత వారం రోజుల వ్యవధిలోని మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయిహోం మంత్రి మహిళ అయినా మహిళల పట్ల బాధ్యత లేదు కర్నూలు:కర్నూలు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు ఆందోళనమహిళలు, బాలికల పై జరుగుతున్న అఘయిత్యాలను నిరసిస్తూ వైఎస్సార్ సిపి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనరాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల విభాగం నేతలు చిత్తూరు జిల్లా: దర్గా సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమంఅంబేద్కర్కు వినతి పత్రం అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులురాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు..అంజలి రెడ్డికూటమి ప్రభుత్వం పాలనలో మహిళలు పై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.మహిళలు పై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే హోం మంత్రి మహిళగా ఉండి ఏం చేస్తున్నట్లు.. కార్పో రేటర్ హరిణి రెడ్డివైఎస్ జగన్ పాలనలో మహిళలకు ఎంతో రక్షణ ఉండేది.సంక్షేమ పాలన అందించారు..హరిణి రెడ్డిమహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకువచ్చారు,మహిళలకు గౌరవం,సంక్షేమాన్ని ఇచ్చారు జగనన్న.. మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి , -
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
విజయవాడ: ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వేసవి సెలవులు మగిసిన తర్వాత హైదారాబాద్ బయల్దేరారు ఏపీలోని ప్రజలు. అయితే ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సుల ఏర్పాటు చేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో ప్రయాణికలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. ప్రత్యేక బస్సులు నడపడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనబడింది. వేసవి సెలవులు ముగిశాయని తెలిసినా ప్రభుత్వం మాత్రం సాధారణ బస్సు సర్వీసులకే పరిమితమైంది. ఎటువంటి ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట చేయకపోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. గతరాత్రి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని, ప్రత్యేకంగా గత ఏడాది కూడా ఇలానే వచ్చినా ఈ తరహాలో బస్సులు లేకుండా ఇబ్బందులు పడలేదని ప్రయాణీకులు అంటున్నారు. -
సాగునీటి విడుదలపై సందిగ్ధం
కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా..(ఎకరాలు లక్షల్లో) కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51 లక్షలు – కేఈబీ 1.38 లక్షలు – ఏలూరు 0.56 లక్షలు 1,332 రైవస్ 2.17 లక్షలు 425 మొత్తం 5.62 1,757 ఈ ఏడాది కాలువల నిర్వహణ కోసం ప్రతిపాదించిన పనులు.. సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో సాగునీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. నీటిని విడుదల చేస్తే వరి పంట సాగు చేసేందుకుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ నిర్వాకం రైతుల శాపంగా మారుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కరువు పరిస్థితులు, నీటి ఇబ్బందులు ఉన్నా, పులిచింతలలో నీటిని నిల్వచేసి, జూన్ మొదటి వారంలోనే నీటిని విడుదల చేశారు. దీని ద్వారా పంట కోత సమయంలో తుఫాన్ల బారిన పడకుండా గట్టెక్కే పరిస్థితి ఉండేది. దీనికితోడు ముందుగా రెండో పంటగా మినుము సాగు చేయడంతో అధిక దిగుబడులు వచ్చేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు కష్టాలు తప్పడం లేదు. గతేడాది జూలై నెలలో నీటిని విడుదల చేయడంతో పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ల బారిన పడి తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో 25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తుగా రుతుపవనాలు రావడం, ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీటిని జూన్ మొదటి వారంలో విడుదల చేసే వెసులు బాటు ఉన్నా, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన నీటి పారుదల సలహామండలి సమావేశంలో జూన్ 10వ తేదీన నీటి విడుదల చేసేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీనిపైన అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెదవి విరచడంతో కృష్ణాడెల్టాకు నీటి విడుదలపైన నీలినీడలు కమ్ముకున్నాయి. ముందుచూపు లేకపోవడంతోనే.. జూన్ మొదటి వారంలో నీటిని విడుదల చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. సాగునీటి కాలువల్లో పూడిక తీత, గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు, గండ్లు పూడ్చడానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10 లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ అధికారులు కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షటర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, మార్చి నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే పనుల మంజూరులో ప్రభుత్వం జాప్యం చేసింది. మే నెలలో పనులను మంజూరు చేసింది. కాలువలకు నీటిని విడుదల చేస్తే పనులు చేసేందుకు అవకాశం ఉండదు. పనులు చేయకుండా మమ అనిపించి నిధులు స్వాహా చేసేందుకు మార్గం సుగమం చేసింది. ఇప్పటికి 40 శాతం పనులు కూడా ప్రారంభం కాలేదు. సకాలంలో పనులు చేయకపోతే చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల పెదవి విరుపు.. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే సాగునీటి కాలువల్లో పూడిక తీయకుండా, గండ్లు పూడ్చకుండా నీటిని ఎలా విడుదల చేస్తారని నిలదీశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రైతులే గండ్లు పూడ్చుకోవాల్సిన దుస్థితి ఉందని పామర్రు ఎమ్మెల్యే పేర్కొనడం ప్రభుత్వ డొల్లతనానికి అద్దం పడుతోంది. బుడమేరు కాలువలో పూడిక తీయకలేదని, మురుగునీరు కాలువల్లోనూ పూడిక తీయలేదని ఎమ్మెల్యేలు నీటి సలహా మండలి సమావేశంలో పేర్కొన్నారు. కొద్ది పాటి వర్షానికే డ్రెయిన్లు పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో ఎక్కువగా పంట పొలాలు మునుగుతున్నాయి. గుర్రపుడెక్క, తూడుతో మేట వేసుకుపోయి నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 5.62 లక్షల ఎకరాల ఆయకట్టు కాలువలకు గండ్లు పూడ్చని వైనం తూటికాడ, గుర్రపుడెక్కతో పేరుకుపోయిన కాలువలు, డ్రెయిన్లు నిధులు మంజూరైనా.. నత్తనడకన పనులు గత ప్రభుత్వ హయాంలో జూన్ మొదటి వారంలోనే నీటి విడుదల డివిజన్ పనుల విలువ సంఖ్య రూ.కోట్లలో కృష్ణా తూర్పు 121 8.45 కృష్ణా సెంట్రల్ 144 7.28 డ్రెయినేజీవిభాగం 288 9.00 స్పెషల్ 15 1.30 మొత్తం 650 26.03అధ్వానంగా కాలువలు ప్రధాన కాలువలన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా తూడు, గుర్రపుడెక్క, జమ్మితో మేట వేసుకుపోయాయి. ఖరీఫ్ సీజన్ వచ్చినా కాలువల్లో తూడు తొలగింపు పనులు చేపట్టలేదు. హడావిడిగా చేపట్టే పనులు వల్ల కళ్లనీళ్లు తుడవటమే తప్ప రైతులకు ఒరిగిందేమీ ఉండదు. కాలువ చివరి భూములకు సాగునీరు ప్రశ్నార్థకమే. – చెన్ను బాబూజీ, కౌలురైతు, గొడవర్రు -
యోగాంధ్రకు విశేష స్పందన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగా ఆవశ్యకతను చాటిచెప్పేందుకు నిర్వహిస్తున్న యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా నేడు విశ్వవ్యాప్తమవుతోందని, నేడు ఎన్నో దేశాల ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకుంటున్నారన్నారు. యోగాసనాలు వేయండి.. ఆరోగ్యాన్ని కాపా డుకోండి.. అనే నినాదంతో యోగాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ..అనంతరం ‘డ్రగ్స్ వద్దు బ్రో’ (1972 టోల్ ఫ్రీ నంబరు) నినాదంతో రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. డ్రగ్స్ భూతాన్ని సమాజం నుంచి తరిమేసే లక్ష్యంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, డ్రగ్స్ రహిత జిల్లా, రాష్ట్రం లక్ష్యంగా భాగస్వామ్య పక్షాలతో కలిసి కృషి చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. యోగా మెగా ర్యాలీ కార్యక్రమంలో ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ అసోసియేషన్స్, యోగా శిక్షణ సంస్థలు, యోగా గురువులు పాల్గొన్నారు.టీచర్స్ యోగా..యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సోమవారం బీఆర్టీఎస్ రోడ్డు యోగా స్ట్రీట్ నందు టీచర్స్ థీమ్ యోగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ టీచర్స్తో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు యోగాసనాల అభ్యసన ఉపయోగపడుతుందన్నారు. రిటైర్డ్ టీచర్ కె.ధనలక్ష్మి, కట్టుబడిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు టి.రాజేశ్వరి, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ ఉపాధ్యాయురాలు ఎం.మాధవి, జిల్లా ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డా. కొల్లేటి రమేష్, నగరపాలక సంస్థ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పోలీస్ స్పందనకు 64 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 64 మంది ఫిర్యాదులను అందజేశారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఏబీటీఎస్ ఉదయరాణి కార్యక్రమాన్ని నిర్వహించి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలకు సంబంధించి 34, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించి 9, దొంగతనాలు 03 , కొట్లాటలు 02, సైబర్ నేరాలు 03, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 13 ఫిర్యాదులను స్వీకరించామని డీసీపీ తెలిపారు. -
విద్యార్థులు సమాజ పురోగతికి దోహదపడాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి సమాజ పురోగతికి దోహదపడాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇదే ప్రతిభను కొనసాగిస్తూ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలన్నారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రతిభతో పాటు పట్టుదల కూడా ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. విద్యార్థుల విజయాల వెనుక ఉపాధ్యాయుల కృషి, నిబద్ధత ఉందన్నారు. ఈ సందర్భంగా షైనింగ్ స్టార్స్గా ఎంపికై న 131 మంది పదో తరగతి విద్యార్థులు, 43 మంది ఇంటర్ విద్యార్థులకు రూ.20 వేల చొప్పున నగదు, షీల్డ్, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావు, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఉమామహేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) జూలై – 2025 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా వివిధ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ డీఆర్ శర్మ తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్, డిగ్రీ, డిగ్రీ ఆనర్స్, పీజీ డిప్లొమో, డిప్లొమో, సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జూలై 15గా పేర్కొన్నారు. పీజీ రెండో సంవత్సరం, డిగ్రీ రెండవ, మూడవ సంవత్సరం, సెమిస్టర్ విధానంలో చదివే విద్యార్థులు రీ–రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా జూలై 15లోగా చెల్లించవచ్చన్నారు. వివరాలకు ఇగ్నో వెబ్సైట్ లేదా కొత్తపేటలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం లేదా 0866–2565253 ఫోన్ నంబర్కు సంప్రదించాలని చెప్పారు. -
భారత కాయక్, కెనోయింగ్ పోటీల్లో వర్షితరెడ్డి సత్తా
విజయవాడస్పోర్ట్స్: ఇండియన్ కాయక్ అండ్ కెనోయింగ్ పోటీల్లో విజయవాడ క్రీడాకారిణి గోగులూరి వర్షిత రెడ్డి ఐదు పతకాలు సాధించి సత్తా చాటింది. మచిలీపట్నంలో జరిగిన మసూల బీచ్ ఫెస్టివల్లో భాగంగా ఇండియన్ కాయక్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్(ఐకేసీఏ) నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వర్షితరెడ్డి అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శించి సికాయక్ అండ్ స్టాండప్ పెడలింగ్ విభాగంలో రెండు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకొని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. క్రీడాకారిణి వర్షితరెడ్డి విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. స్కూల్ ప్రిన్సిపాల్ రాయప్ప రెడ్డి, కోచ్లు ఎం.శ్రీనివాస్, తేజ ప్రోత్సాహంతో తాను ఈ విజయం సాధించినట్లు ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాయకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.బలరాంనాయుడు, ఐకేసీఏ డైరెక్టర్ ఆర్.ప్రదీప్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాయకింగ్ కెనోయింగ్ అసోసియేషన్ సెక్రటరీ శివారెడ్డి వర్షితను అభినందించారు. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా వేదికపై రాణించి రాష్ట్ర ఖ్యాతిని చాటాలని వారు ఆకాంక్షించారు. -
విద్యార్థులతో బంతాట
తాడేపల్లి రూరల్(గుంటూరు): కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ నీట్ మహిళా అకాడమీ (గురుకుల పాఠశాల)ని మైలవరానికి తరలించవద్దని విద్యార్థులు సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ 2017లో పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నీట్, ఐఐటీ శిక్షణకు అద్దె భవనాలలో అకాడమీని స్థాపించారని తెలిపారు. దీనిలో ఇంటర్మీడియెట్తో పాటు లాంగ్ టర్మ్ మెడికల్, ఐఐటీలకు శిక్షణ ఇస్తున్నారని పేర్కొన్నారు. ఏటా ఏడాది లాంగ్ టర్మ్తో కలిపి 220 మంది ఐఐటీకి, మరో 220 మంది విద్యార్థినులు నీట్ పరీక్షలకు హాజరు అవుతున్నారని చెప్పారు. అయితే అధికారులు అలసత్వం వహించి ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను తగ్గించారని, నిర్ణీత సమయానికి అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో ఆశయం పూర్తిగా నెరవేరలేదని విమర్శించారు. ఇప్పుడు అకాడమీని వేరే చోటుకు మారిస్తే మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని వాపోయారు. ఈ క్లిష్ట స్థితిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, భావితరాల వారి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ఈడుపుగల్లు భవనాల నుంచి విద్యార్థులను తరలించే కార్యక్రమాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈడుపుగల్లు నుంచి కుంటముక్కలకు ఐఐటీ నీట్ మహిళా అకాడమీ తరలింపు -
‘మాకు న్యాయం జరిగేలా చూడండి’
లబ్బీపేట(విజయవాడతూర్పు): కూటమి ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని, న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎండీయూ ఆపరేటర్లు సోమవారం వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ను కలిసి విన్నవించారు. గుణదలలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అవినాష్ను కలిసిన ఎండీయూ ఆపరేటర్లు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. వినతిపత్రంలో మిడ్ డే మీల్స్, అంగన్వాడీల బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, వెంటనే చెల్లించేలా ప్రశ్నించాలన్నారు. విజయవాడలో వరద బాధితులకు సహాయార్థం చేసిన వర్క్కు రావాల్సిన డబ్బులు తక్షణమే రిలీజ్ చేయించాలని, వాహనాల బీమా బకాయిల డబ్బులు రిలీజ్ చేయాలని, మొబైల్ క్యాంటీన్గా ఉన్న వెహికల్స్ని గూడ్స్ వెహికల్స్గా మార్చి క్లియరెన్స్ ఇప్పించాలన్నారు. వీటితో పాటు గత ప్రభుత్వంలో 90 శాతం రాయితీ, 10 శాతం తాము కట్టేలా ఒప్పందం జరిగిందని, కానీ ఇప్పుడు 30 శాతం డబ్బులు తమతో కట్టించుకున్నట్లు తెలిపారు. బాధితులకు అండగా ఉంటాం.. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని దేవినేని అవినాష్ అన్నారు. గతంలో వలంటీర్లను తొలగించారని, ఇప్పుడు ఎండీయూ ఆపరేటర్లను తొలగించి ఉపాధి కోల్పోయేలా చేశారన్నారు. ప్రతి బాధితునికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకూ పోరాడదామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అవినాష్ను కలిసిన వారిలో విజయవాడలోని పలు ప్రాంతాలకు చెందిన ఎండీయూ ఆపరేటర్లు ఉన్నారు. -
చైర్మన్ ఎన్నిక నిర్వహించలేని అసమర్థ ఎమ్మెల్యే వసంత
ఇబ్రహీంపట్నం: కొండపల్లి మున్సిపాలిటీకి గౌరవ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించలేని అసమర్థ ఎమ్మెల్యేగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఎద్దేవా చేశారు. సీల్ట్కవర్లో నిక్షిప్తమైన హైకోర్టు ఫలితాన్ని ప్రకటించకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించడంపై కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నిక ఫలితం మూడన్నరేళ్లుగా కోర్టు పరిధిలో ఉందన్నారు. సీల్డ్కవర్లో వచ్చిన ఫలితాన్ని నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎమ్మెల్యే వసంత ఉన్నాడని దుయ్యబట్టారు. టాస్ ద్వారా ఫలితాన్ని ప్రకటిస్తే వైఎస్సార్ సీపీ విజయం సాధించడం ఖాయమని భావించిన ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించడం సిగ్గుచేటు అన్నారు. నైతిక విజయం వైఎస్సార్ సీపీదే అని హర్షం వ్యక్తం చేశారు. టాస్ వేస్తే మున్సిపల్ చైర్మన్గా గుంజా శ్రీనివాస్, వైస్ చైర్మన్లుగా నల్లమోతు లక్ష్మి, బాడిస నాగరాజకుమారి చరిత్రాత్మక విజయం సాధించినట్లే అని స్పష్టం చేశారు. ఈనైతిక విజయాన్ని జగనన్నకు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నిక ఫలితాన్ని ప్రకటించకుండా టీడీపీ ఫలాయనం చిత్తగించిందని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ పేరుతో నమ్మించి మోసం చేశారు.. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఫలితంపై హైకోర్టు నుంచి సీల్డ్కవర్ వచ్చి 20 రోజులు దాటినప్పటికీ ఇన్ని రోజులు సమావేశం ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. పాలకవర్గం లేక మున్సిపాలిటీలో కనీసం బ్లీచింగ్ కొట్టే పరిస్థితి లేదన్నారు. కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. శాసన సభ్యుడి చేతకాని తనంతో మూడున్నరేళ్లుగా పాలకవర్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. ఈసమయంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇంటింటికీ సంక్షేమ పథకాలు వచ్చేవనే ఆశాభావం ప్రజల్లో వ్యక్తమవుతుందని చెప్పారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, వైఎస్సార్ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు పోరంకి శ్రీనివాసరాజు, రెంటపల్లి నాగరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు జోగి రాము, గుంజా శ్రీనివాస్, మొగిలి దయాసాగర్, మోటూరి అరుణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మేడపాటి నాగిరెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పచ్చిగోళ్ల పండు, నియోజకవర్గం వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.మున్సిపల్ ఎన్నికలో నైతిక విజయం వైఎస్సార్ సీపీదే హైకోర్టు ఫలితాన్ని ప్రకటించకుండా ఓటమి అంగీకరించిన టీడీపీ మాజీ మంత్రి జోగి రమేష్ -
నాణ్యమైన పరిష్కారమే లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో దరఖాస్తుదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ స్వీకరించిన అర్జీలకు సంబంధించి కింది స్థాయి అధికారులు సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం తీసుకుని, పునరావృతం కాకుండా సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీదారులను సంతృప్తి పరచడమే లక్ష్యంగా అధికారులు పని చేసి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చాలని సూచించారు శాతవాహన కళాశాలను పరిరక్షించాలి.. శాతవాహన కళాశాల భవనాలను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలని, కళాశాలను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర, ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి తదితరులు ఉన్నారు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పీజీఆర్ఎస్లో 130 అర్జీల స్వీకరణ వచ్చిన అర్జీలు ఇవే.. మొత్తం 130 అర్జీలు వచ్చాయని జేసీ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 39, పోలీస్ శాఖకు 21, ఎంఏయూడీ 26, పౌరసరఫరాలు 6, పంచాయతీరాజ్ 5, హెల్త్ 4, జలవనరులు 3, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ 3, ఏపీసీపీడీసీఎల్ 3, విద్య 2, ఆర్అండ్బీ 2, ఆర్డబ్ల్యూఎస్ 2, డీఆర్డీఏ 2, సర్వే 2, వ్యవసాయం, డ్వామా, ఉపాధి హామీ, మార్కెటింగ్, ఏపీఎస్ఆర్టీసీ, స్కిల్ డెవలప్మెంట్, బ్యాంకు రిలేటెడ్, బీసీ వెల్ఫేర్, రిజిస్ట్రేషన్, ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించిన ఒక్కొ క్క అర్జీతో కలిపి మొత్తం 130 అర్జీలను స్వీకరించామని జేసీ పేర్కొన్నారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇఫ్టూ ఆధ్వర్యంలో విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్ నందు సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్, ఇఫ్టూ రాష్ట్ర నాయకుడు ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారం కార్మికులను తొలగించే యత్నాలను చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు మోదీ సేవ ఆపి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె పరిష్కారానికి కృషి చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని, ఈ సమ్మెను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. జీతాల కోసం, క్రమబద్ధీకరణ కోసం కాకుండా ఉద్యోగ భద్రత కోసం సమ్మె చేస్తున్నారని నేతలు చెప్పారు. కార్మికులు జీవన్మరణ సమస్యగా భావించి పోరాటం చేస్తున్నారన్నారు. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులను 3వేల మందిని తొలగించారని, మరికొన్ని వేలమంది కార్మికులను తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే స్థాయికి తీసుకురావడం, కొత్త బాయిలర్లను, ఫర్నిస్లను ఏర్పాటు చేయటం, ఉన్న ఉద్యోగులను తొలగించకుండా లాభాల్లో నడిపే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెను విరమింపచేసే చర్యలు చేపట్టాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు మరీదు ప్రసాద్ బాబు, ఏసీసీటీయూ నాయకులు లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు ఎన్సీహెచ్ సుప్రజ, జిల్లా నాయకులు ఏం.సోమేశ్వరరావు, ఇఫ్టూ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో ప్రత్యేక తనిఖీలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైల్వే ఎస్పీ రాహుల్దేవ్ సింగ్ ఆదేశాల మేరకు రైల్వే ఆర్పీఎఫ్ పోలీసుల సమన్వయంతో డీఎస్పీ రత్నరాజు, జీఆర్పీ సీఐ జె.వి. రమణ సిబ్బంది, డాగ్ స్క్వాడ్తో కలసి విజయవాడ రైల్వే స్టేషన్లో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణపై ప్రత్యేక తనిఖీలు చేశారు. స్టేషన్లోని ప్లాట్ఫాంలు, వెయిటింగ్ హాల్స్, క్లాక్ రూమ్లు, పార్సిల్ కార్యాలయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఒడిశా, విశాఖపట్నం మీదుగా వచ్చే అన్ని రైళ్లలోని జనరల్, స్లీపర్, ఏసీ కోచ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రత్నరాజు మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల రవాణపై విజయవాడ జీఆర్పీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. నిరంతరం తనిఖీలు చేయడంతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్లోని సీసీ టీవీల ద్వారా అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తున్నామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను నిర్మూలించడంలో పౌరులు, పోలీసులు స్నేహపూర్వక స్వభావంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులను గుర్తించినా, గంజాయి రవాణపై తెలిసినా సమాచారం అందించాల్సిందిగా ప్రయాణికులు, స్టేషన్లోని వెండర్స్, పోర్టర్లకు ఆయన సూచించారు. తనిఖీల్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి
మచిలీపట్నం అర్బన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలను మాన్యువల్ కౌన్సెలింగ్ విధానంలోనే చేస్తామని ఉపాధ్యాయ సంఘాల సమక్షంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. మచిలీపట్నంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ఆదివారం ఉపాధ్యాయులు ముట్టడించారు. ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ కార్యాలయం గేట్లను తోసుకుంటూ లోపలకు ప్రవేశించారు. డీఈవో కార్యాలయానికి భారీగా చేరిన పోలీసులు ఉపాధ్యాయులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం కూటమి ప్రభుత్వం తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెబ్ కౌన్సె లింగ్ వద్దు, మాన్యువల్ కౌన్సెలింగ్ ముద్దు నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. అనంతరం డీఈఓను ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదికకు చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న వెబ్ కౌన్సెలింగ్ నిర్ణయం ఉపాధ్యాయులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ఎస్జీటీలకు వెబ్ కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు నిర్వహించాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం లీప్ యాప్లో వెబ్ కౌన్సెలింగ్ మోడల్ వీడియోను విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాంకేతిక తప్పిదాలతో నష్ట పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీయూఎస్, వైఎస్సార్ ఆర్టీఏఫ్, ఎస్టీఎఫ్, పీఈటీ అసోసియేషన్, ఎస్ఆర్టీఎఫ్, ఎన్టీఏ, ఎస్సీఎస్టీ యూనియన్ తదితర సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయకపోతే ఉద్యమమే టీచర్ల సంఘాల హెచ్చరిక డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాధ్యాయులు కార్యాలయం గేట్లు తోసుకుని లోపలికి ప్రవేశం లీప్ యాప్లో వీడియోపై తీవ్ర వ్యతిరేకత -
ముగిసిన స్పేస్ 2025 సదస్సు
గన్నవరం రూరల్: చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఈ) కార్యక్రమం ఆదివారం ముగిసింది. స్పేస్ 2025 పేరిట నిర్వహించిన సదస్సుకు కళాశాల డైరెక్టర్ జనరల్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై బేసిక్ మోనిట రింగ్, ఎక్విప్మెంట్పై వైద్య విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఆపరేషన్ సమయంలో రోగి నొప్పి అనుభవించకుండా ఉపయోగించే ముఖ్యమైన విధానాలు అవగాహన చేసుకోవాలన్నారు. ఆపరేషన్ థియేటర్లో అల్ట్రా సౌండ్ మిషన్, ఆక్సిజన్ సిలిండర్, సక్షన్ యంత్రం, వెంటిలేటర్ పరిశీలించాలన్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ అనస్తీషీయాలజీ, క్రిటికల్ కేర్ సంయుక్త విభాగంలో జరిగిన సదస్సులో నిపుణులు పాల్గొని విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మేజర్ ఎంవీ భీమేశ్వర్, అనస్తీషీయా హెచ్వోడీ డాక్టర్ సూర్యశ్రీ, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ గోవర్థిని, డాక్టర్ సుధాకర్, పీజీ, యూజీ విద్యార్థులు 200 మంది పాల్గొన్నారు. తొలుత డైరెక్టర్ జనరల్ డాక్టర్ నాగేశ్వరరావు, అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి, బ్రోచర్లు ఆవిష్కరించారు. -
రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక
పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి క్రీడాకారులను ఎంపిక చేశామని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం వివరాలు తెలుపుతూ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు ఈ నెల 22న పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యాన కావలిలో జరుగుతాయన్నారు. క్రీడా కారులను ఆదివారం మనోహర్ జిమ్లో ఎంపిక చేశామని తెలిపారు. క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. – 62 కేజీల విభాగంలో ఏసు, 65 కేజీల విభాగంలో ఎస్కే బాజిబాబా, 68 కేజీల విభాగంలో ఎం.దినేష్, 70 కేజీల విభాగంలో సూర్య, 73 కేజీల విభాగంలో పృధ్వీకృష్ణ, 75 కేజీల విభాగంలో వి.రాహుల్కృష్ణ, 75 కేజీల విభాగంలో కె.కొండల్ను ఎంపిక చేశామన్నారు. స్పోర్ట్స్ ఫిజిక్లో 160 సెంటీ మీటర్ల లోపు ఎం.దినేష్, శ్రీనును ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు కానూరు అశోక్ జిమ్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, పలు జిమ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. -
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి పుర పాలక సంఘం చైర్మన్, రెండు వైస్ చైర్మన్ పదవులకు సోమవారం నిర్వహించాల్సిన ఎన్నిక అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 నవంబర్లో పరోక్ష పద్ధతిలో జరిగిన చైర్మన్, రెండు వైస్ చైర్మన్ల ఫలితాలు హైకోర్టు సీల్డ్కవర్లో నిక్షిప్తం కావడంతో ఫలితాల వెల్లడికి ఈనెల 9వ తేదీ నిర్వహించాల్సిన ప్రత్యేక సమావేశం విజయవాడ ఆర్డీవో, ఎన్నికల నిర్వహణ అధికారి కావూరి చైతన్య వాయిదా వేశారని వివరించారు. సమావేశం తేదీని తర్వాత ప్రకటిస్తామని కమిషనర్ తెలిపారు దుర్గమ్మ నిత్యాన్న దానానికి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్ నివాసి వి.బాలాజీ, గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఇ.ఏడుకొండలు కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసిన బాలాజీ నిత్యాన్నదానానికి రూ.లక్ష, ఏడుకొండలు కుటుంబం రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. బాలాత్రిపురసుందరికి బంగారు ఆభరణాలు కూచిపూడి(మొవ్వ): కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ పసుమర్తి రామలింగశాస్త్రి, పద్మ దంపతులు (హైదరాబాద్–కూచిపూడి) నాట్యాచార్యుల ఇల వేల్పైన బాలాత్రిపురసుందరి అమ్మవారికి బంగారు ఆభరణాలను ఆదివారం అందజేశారు. దేవాలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి.. అర్చకులు పెనుమూడి సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన రెండు హారాలను, దాసాంజనేయ స్వామికి రూ. 38 వేల విలువైన 108 వెండి తమలపాకుల మాలను అందజేశారు. ఈ సందర్భంగా హారాలను అమ్మవారికి అలంకరింపజేసి పూజా కార్యక్రమాలు చేశారు. ఎన్జీ రంగా స్ఫూర్తితో ముందుకు సాగాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్య పోరాటాలకు ముందుకు సాగాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. రైతు నాయకులు ఆచార్య ఎన్జీ రంగా వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆదివారం బందరు లాకుల సమీపంలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో రైతు నాయకులు ఎన్జీ రంగా 30వ వర్ధంతి సభ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో జరిగింది. తొలుత రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమ కాలంలో రైతాంగం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి రంగా ఎనలేని కృషి చేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా సమర యోధుడుగా కీర్తి పొందారని, దేశ వ్యాప్తంగా రైతు రక్షణ యాత్రలు చేసిన ఘనత ఉందన్నారు. నేడు పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలు కార్పొరేట్ అనుకూల వైఖరికి.. వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన పేరుతో వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉందని గుర్తు చేశారు. గోగినేని ధన శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు కేవీవీ ప్రసాద్, వై. కేశవరావు, మోతుకూరి వెంకటేశ్వరరావు, కొలనుకొండ శివాజీ, కోనేరు బసవేశ్వరరావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బుడమేరుకు అవినీతి గండ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరుకు ‘అవినీతి’ గండ్లు పడ్డాయి. నిబంధనలు పాటించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు జీ హుజార్ అంటున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు వారికి దాసోహమంటున్నారు. అధికారులు నిబంధనలు పక్కన పెట్టి నోటి మాటలతో బుడమేరుకు సంబంధించి రూ. 43.91 కోట్ల పనులను అప్పనంగా ఇచ్చేశారు. సాంకేతిక అనుమతి లేకుండా.. పరిపాలన అనుమతి జారీ కాకుండానే, కనీసం వర్క్ అర్డర్ ఇవ్వకుండానే.. నోటి మాటపై 40 మంది కాంట్రాక్టర్లలకు రూ.43.91 కోట్ల విలువైన 126 పనులు పప్పుబెల్లాల్లా పంచేశారు. వెంటనే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభింపచేశారు. తూతూ మంత్రంగా పనులు కానిచ్చేసి. బిల్లులు చేసుకొని కోట్లాది రూపాయలు దోచుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ వ్యవహారంలో మైలవరం ప్రజాప్రతినిధికి అక్రమాల ‘కిశోరం’.. అవినితి ‘కోటీశ్వరుడు’ దళారులుగా వ్యవహరించి 15 శాతం కమీషన్ వసూలు చేశారు. కీలక మంత్రి నుంచి మైలవరం ప్రజాప్రతినిధి వరకు ముడుపులు అందడంతో ఆ పనులకు టెండర్లు నిర్వహించలేదని అధికార వర్గాలే వాపోతున్నాయి. టెండర్లు నిర్వహిస్తే మట్టి పనులు కాబట్టి కనీసం 25–30 శాతం నిధులు ఆదా అయ్యేవని ఇంజినీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆకాశమే హద్దుగా సాగుతున్న అక్రమాలకు బుడమేరు మరమ్మతులు వేదిక అయ్యాయి. అక్రమాల కథాకమామీషు ఇది. ఇన్నాళ్లూ ఊరుకుని వర్షాలు వచ్చే ముందు పనులు గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి పెను విపత్తుకు దారి తీసింది. దీంతో 126 చోట్ల గండ్లు పడి విజయవాడను ముంచెత్తింది. అపార ఆస్తి నష్టం వచ్చింది. నాడు బుడమేరు సమస్య లేకుండా చూస్తామని సీఎం చంద్రబాబు ఊదరగొట్టారు. ఎమ్మెల్యేలూ ఆయన బాటలోనే నడిచారు. వర్షాకాలం అక్టోబరు ఆఖరుతో పూర్తైంది. వెంటనే బుడమేరు గండ్లు పూడ్చివేత, మరమ్మతులు, ఆధునికీకరణ పనులను ప్రభుత్వం చేయాల్సి ఉంది. కానీ మిన్నకుండిపోయింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి చెదురు మదురుగా వర్షాలు కురుస్తున్న సమయంలో బుడమేరు గండ్లు పూడ్చివేత, మరమ్మతులకు శ్రీకారం చుట్టడాన్ని చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిలో డొల్లతనం వెల్లడవుతోంది. హడావుడిగా నామినేషన్పై పనులు ప్రభుత్వం పని మంజూరు చేయాలంటే క్షేత్ర స్థాయిలో ప్రాథమిక కొలతలు తీసుకోవాలి. పనులు ఏ పరిమాణంలో చేయాలన్నది నిర్ధారించి అంచనా వ్యయం లెక్క కట్టాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపాలి. వాటికి పరిపాలన అనుమతి ఇచ్చాక, వాటిని చేయడానికి ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్) సాంకేతిక అనుమతి జారీ చేయాలి. దీంతో ఆ పనులకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించాలి. అప్పుడు మాత్రమే.. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు యుద్ధ ప్రతిపాదిన దాని అధిగమించడానికి చేపట్టాల్సిన పనులు, అదీ రూ.10 లక్షలలోపు అంచనా వ్యయం ఉంటే వాటిని కాంట్రాక్టర్లకు నామినేషన్పై అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ నవంబరు నుంచి మే వరకు బుడమేరు మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం స్పందించలేదు. మరమ్మతులకు నోటిమాటపై 40 మందికి రూ.43.91 కోట్ల విలువైన 126 పనులు అప్పగింత మైలవరం ప్రజాప్రతినిధి.. అధికారులపై ఒత్తిడితెచ్చి సన్నిహితులకు పనులు కట్టబెట్టిన వైనం! 15 శాతం కమీషన్ వర్క్ ఆర్డర్, సాంకేతిక, పరిపాలన అనుమతులు లేకుండా పనులు ప్రారంభం తర్వాత ఈ నెల 5న పరిపాలన అనుమతి ఈ అక్రమాలపై విజిలెన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు, జల వనరుల ఉన్నతాఽధికారుల ఫిర్యాదు -
ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ ఏవై రావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు అడిషనల్ డైరెక్టర్ హోదాలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు(ఏవై రావు) విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ) ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న డాక్టర్ అశోక్కుమార్ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఆదివారం జీవో నంబర్ 359 విడుదల చేశారు. బదిలీ అయిన డాక్టర్ అశోక్కుమార్ గతేడాది అక్టోబరులో ఎస్ఎంసీ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన దాదాపు తొమ్మిది నెలల పాటు ఇక్కడ విధులు నిర్వహించారు. 1986–92లో ఇక్కడే ఎంబీబీఎస్ పూర్తి సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా నియమితులైన డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు ఇదే కళాశాలలో 1986–1992 బ్యాచ్లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం 1997లో ఉస్మానియా కళాశాలలో రేడియేషన్ అంకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశారు. 2023 జూలైలో అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి పొంది ఒంగోలు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రిన్సిపాల్తో పాటు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చదువుకున్న కళాశాలకు ఇప్పుడు ప్రిన్సిపాల్గా రావడం సంతోషంగా ఉందని, కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తానని డాక్టర్ ఏడుకొండలరావు అన్నారు.చదువుకున్న కాలేజీకి ప్రిన్సిపాల్గా.. -
పెళ్లి పేరుతో మాయలేడీ మోసం
కృష్ణలంక(విజయవాడతూర్పు)/అనంతపురం: తనకు పెళ్లి కాలేదని చెప్పిన ఒక మహిళ, అమాయకపు యువకుడిని పెళ్లి చేసుకుని మోసం చేసి కనిపించకుండా పోయిన ఘటనపై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల కథనం ప్రకారం సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామానికి చెందిన మైలవరపు రాజశేఖరరెడ్డి బెంగళూరులోని ఆటోమొబైల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలలుగా తన పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితుడైన కృష్ణారెడ్డి ద్వారా గుంటూరుకు చెందిన మల్లేశ్వరి, మంగళగిరికి చెందిన కొండలమ్మ అనే ఇద్దరు మధ్యవర్తులు పరిచయమయ్యారు. ఒక మంచి యువతిని ఇచ్చి పెళ్లి చేస్తామని మధ్యవర్తులు ఈ సందర్భంగా రాజశేఖరరెడ్డిని నమ్మించారు. కరుణావతి అనే యువతికి తల్లిదండ్రులు లేరని, ఎదురు కట్నంగా నగదు ఇస్తే పెళ్లి చేస్తామని నమ్మబలికారు. వారి మాటలను నమ్మిన రాజశేఖరరెడ్డి ఆ యువతి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎదురుకట్నంగా అతను మధ్యవర్తులకు రూ.2 లక్షలు చెల్లించి తన గ్రామంలోనే ఈ నెల ఒకటో తేదీన కరుణావతిని వివాహం చేసుకున్నాడు. ఈనెల 6న తన నాయనమ్మకు ఆరోగ్యం క్షీణించిందని, చనిపోయే పరిస్థితిలో ఉందని కరుణావతి భర్తకు చెప్పడంతో ఇద్దరు కలిసి బయలుదేరి శనివారం ఉదయం విజయవాడ బస్టాండ్కు చేరుకున్నారు.బస్టాండ్లో టాయిలెట్కు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన కరుణావతి ఎంతకూ తిరిగి రాలేదు. ఆమె సెల్ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది. ఎంతసేపటికీ ‘తన భార్య’ తిరిగి రాకపోవడంతో రాజశేఖరరెడ్డి కృష్ణలంక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు. వివరాలు తెలుసుకున్న సీఐ నాగరాజు, ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేశారు. ఆ టీమ్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు కొనసాగించారు. అయితే కొండపల్లి ప్రాంతానికి చెందిన ఈ మాయ‘లేడీ’కి అప్పటికే వివాహం జరిగి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది. -
AP EAPCET: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
విజయవాడ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు గాను గత నెలలో జరిగిన ఏపీ-ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ విద్యార్థి అనిరుద్రెడ్డికి తొలి ర్యాంక్ రాగా, శ్రీకాళహస్తి విద్యార్థి భాను చరణ్రెడ్డి రెండో ర్యాంక్ వచ్చిఇంది. ఇక పాలకొల్లు విద్యార్థి యశ్వంత్ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 89.9 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. అగ్రి, ఫార్మాసీలో సాయి హర్షవర్థన్కు తొలి ర్యాంకు రాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిశాంత్కు రెండో ర్యాంక్, కోనసీమ జిల్లా విద్యార్థి వినయ్ మల్లేశ్కు మూడో ర్యాంకు వచ్చింది. కాగా, గత నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఏపీ ఈఏపీ సెట్ నిర్వహించారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62, 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
‘సీజ్ ద షిప్ అన్న మీరు.. లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?’
విజయవాడ: ఏపీలో రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తారనే వార్తల నేపథ్యంలో సీపీఐ స్పందించింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. ‘రేషన్ కార్డులను రద్దు చేసి నగదు బదిలీ చేస్తామంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం డబ్బులిస్తామంటున్నారు. బియ్యం షిప్పుల్లో పోయినా.. లారీల్లో పోయినా ప్రభుత్వ పరిధిలోనే కదా జరిగేది. గతంలో పవన్ వెళ్లి సీజ్ ద షిప్ అన్నారు. పవన్ షిప్ను సీజ్ చేసినప్పుడు మీరు లారీలను సీజ్ చేయలేకపోతున్నారా?, కోటి 47 లక్షల కార్డులున్నాయంటున్నారు. వరల్డ్ బ్యాంక్ సర్వేలో బిలో ప్రోపర్టీ లైన్(బీపీఎల్) బాగా తగ్గి పోయింది. 5.3 శాతమే ఉందంటున్నారు. 5.3 శాతమే బీపీఎల్ కింద ఉంటే కోటి 47 లక్షల కార్డులు ఎందుకున్నాయ్?, ఆ కార్డులు ఎవరి పేరుతో ఉన్నాయ్ .. ఏ బీరువాలో మూలుగుతున్నాయ్. పక్కాగా మోసం జరుగుతుందని ప్రభుత్వానికి తెలుసు. ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందో, డబ్బులు వసూలు చేస్తున్నారో ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాన్ని అరికట్టలేక మొత్తం అంతా తొలగిస్తామంటున్నారు .మీతీరు ఇంట్లో ఎలకలు పడితే ఇంటికి అగ్గి పెట్టినట్లుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకుని వారి పై చర్యలు తీసుకోవాలి. అర్హులైన వారికి రేషన్ కార్డు ఇవ్వాలి. బియ్యం అవసరం లేని వర్గాలకు వేరే రకమైన కార్డులు ఇవ్వాలి. రేషన్ బియ్యం తినరు కాబట్టి అమ్ముతున్నారంటున్నారు.తెలంగాణ ప్రభుత్వం మంచి ఆలోచనతో సన్నబియ్యం ఇస్తోంది. జనం క్యూ కట్టి ఆ సన్నబియ్యాన్ని తీసుకుంటున్నారు. మీరు కూడా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యం ఇవ్వండి. రేషన్ బియ్యం పథకాన్ని కచ్చితంగా కొనసాగించాల్సిందే. పథకం తీసేస్తే నిజమైన లబ్ధిదారులు , పేదవారు నష్టపోతారు. టీడీపీ ప్రభుత్వమే రేషన్ పథకాన్ని తీసేస్తే ఎన్టీ రామారావుకే అన్యాయం చేసినట్లు. ప్రభుత్వం తమ ఆలోచన మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారు’ అని కె రామకృష్ణ ధ్వజమెత్తారు. -
శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, విజయవాడ: శాతవాహన కళాశాల ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి , వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిచంద్ర నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో శాతవాహన కాలేజీ భూములు కొట్టేసేందుకు రెండు ముఠాలుగా ఏర్పడ్డారని.. వైఎస్సార్, జగన్ హయాంలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదన్నారు.అర్ధరాత్రి కాలేజీను బుల్డోజర్లతో కూల్చేశారు.. దీనికి ఎవరు బాధ్యులు?. 48 గంటలు గడుస్తున్నా.. ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం, విద్యా శాఖ మంత్రి ఏం చేస్తున్నారు?. కాలేజీ కూల్చేస్తుంటే విద్యాశాఖ మంత్రికి పట్టదా?. ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలి. విశాఖ, అమరావతిలో రైతుల నుంచి వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఎందుకు ఈ కళాశాల భూమిని స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. మీ ఎమ్మెల్సీ జాతకం.. అర్ధరాత్రి కాలేజీని కూలగొట్టిన వారి జాతకం మీదగ్గర లేదా?’’ అంటూ మల్లాది విష్ణు మండిపడ్డారు.విద్యార్థుల పక్షాన వైఎస్సార్సీపీ: డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డిటీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా బెజవాడలో కోట్లాది రూపాయల భూములు కబ్జాకు గురవుతాయి. కోట్ల విలువైన ఆస్తులు కబ్జా చేసుకోవడానికే ఆలపాటికి ఎమ్మెల్సీ ఇచ్చారా?. పేద విద్యార్ధులు చదువుకునే కాలేజీని కూలగొట్టడం దారుణం. ప్రజలు, విద్యార్థుల పక్షాన మేం నిలుస్తాంలోకేష్.. రెడ్ బుక్ వదిలి.. పాఠ్య పుస్తకాలు అందించు: రవిచంద్రరెండు ముఠాల మధ్య ఆధిపత్యంలో భాగంగా శాతవాహన కాలేజీని కూల్చేశారు. విద్యార్ధుల సర్టిఫికెట్లు, రికార్డులు శిథిలాల కిందే ఉన్నాయి. ఆలపాటి రాజేంద్ర కిడ్నాప్ చేసి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించకున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఈ కాలేజీ భూముల కోసం కొట్టుకుంటున్నారు. తక్షణమే చంద్రబాబు, లోకేష్ జోక్యం చేసుకోవాలి. లోకేష్ రెడ్ బుక్ను వదిలి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలి. విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలి. -
మచిలీపట్నం బీచ్కు జాతీయస్థాయిలో పేరుకు కృషిచేస్తా
మచిలీపట్నంటౌన్: మంగినపూడి బీచ్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా తీర్చిదిద్దుతామని గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మసులా బీచ్ ఫెస్ట్–2025 వేడుకల్లో భాగంగా మూడవరోజు శనివారం మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. తొలుత మంత్రి రవీంద్ర పారా గ్లైడింగ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ మసులా ఫెస్ట్ –2025 కు సందర్శకులు విశేషంగా తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. వాటర్ స్పోర్ట్స్, పారా గ్లైడింగ్, హెలీ రైడింగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్ పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయన్నారు. సాయంత్రం వేళ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వేలాదిగా తిలకిస్తున్నారన్నారు. బీచ్లో రక్షణ ఏర్పాట్లపై అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయమన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు సైతం తలెత్తకుండా పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు బాగున్నాయన్నారు. అనంతరం సీ కయాకింగ్ పోటీలను మంత్రి రవీంద్ర తిలకించారు. ఈ సందర్భంగా అర్జున అవార్డు గ్రహీత, కయా కింగ్ కోచ్ జయంత కుమార్ను అభినందించారు. కయా కింగ్ క్రీడాకారులకు మంత్రి చేతుల మీదుగా జెర్సీలను అందజేశారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా, స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ మంగినపూడి బీచ్ పేరు దేశమంతా మార్మోగేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత బ్రదర్ కిరణ్పాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను శనివారం పెద్దఎత్తున భక్తులు, యాత్రికులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగియనుండటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటకలకు చెందిన యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. తెల్లవారుజామున అమ్మవారి ప్రధాన ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేసి, క్యూలైన్లో వచ్చే సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అర్ధగంట పాటు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో క్యూలైన్లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. క్యూలైన్లలో భక్తులు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంగణంలో భక్తులకు మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేశారు.సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయదాతలు, భక్తులు పాల్గొన్నారు. -
అపార్టుమెంట్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలో జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో నిర్మాణంలో వున్న ఒక అపార్టుమెంట్ పై నుంచి శనివారం సాయంత్రం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తాడేపల్లి పట్టణ సీఐ కల్యాణ్రాజు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు విద్యానగర్కు చెందిన గండు జగదీష్ (35) గుర్తించారు. ఇతను తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి వచ్చి ఐదు అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందకు దూకాడని, తలకు తీవ్రమైన గాయం ఏర్పడిందని, కొన ఊపిరితో ఉండడంతో భవనంలో పనిచేస్తున్న పనివారు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా జగదీష్ మృతి చెందినట్లు సీఐ కల్యాణ్రాజు తెలిపారు. జగదీష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా జగదీష్ బంధువులు మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి జగదీష్తో సన్నిహితంగా ఉండే బంధువులు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కారణం చేతే ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగదీష్ తమ్ముడిని వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా ఇప్పడు ఏమీ చెప్పలేనని, అన్నయ్యది ముమ్మాటికీ హత్యేనని, పోలీస్స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చనిపోయేటట్లు ప్రేరేపించారని ఆరోపిస్తున్న బంధువులు -
సీఎం చంద్రబాబును కలిసిన కేడీసీసీబీ చైర్మన్
చిలకలపూడి (మచిలీపట్నం): సీఎం నారా చంద్రబాబునాయుడును కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీరఘురామ్ వెలగపూడి సచివాలయంలో శుక్రవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా రఘురామ్ను ప్రభుత్వం ఇటీవల నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం చంద్రబాబును కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. మద్యం మత్తులో డ్రెయిన్లో పడి వ్యక్తి మృతి పెనమలూరు: మద్యం మత్తులో ఓ వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి డ్రెయిన్లో పడి మృతి చెందిన ఘటనపై కృష్ణాజిల్లా పెనమలూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని 40 ఏళ్ల వ్యక్తి మద్యం తాగి బందరు రోడ్డులో నడుస్తూ పీవీఆర్ ఐకాన్ వద్ద డ్రెయిన్లో పడిపోయాడు. ఈ మార్గంలో వెళ్తున్నవారు అతడిని గుర్తించి బయటకు తీసి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్సకు చేర్చారు. అయితే ఆ వ్యక్తి ఆస్పత్రిలో రాత్రి మరణించాడు. గుర్తు తెలియని వ్యక్తి వివరాలు తెలిసిన వారు 99517 46017 ఫోన్ నంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలపాలని పోలీసులు కోరారు. -
యోగాభ్యాసంతో మానసిక వికాసం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాంధ్ర మహోత్సవంలో భాగంగా విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం 18వ రోజు యోగాసనాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. యోగా ఔత్సాహికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, అర్బన్ పీహెచ్సీల వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు పాల్గొని యోగాసనాలు వేశారు. జిల్లాలో కనీసం పది లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్దఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 8వ తేదీ బెరంపార్కులో... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర మాసోత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని యోగాసనాలు సాధన చేయాలని కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం కృష్ణానదీ తీరంలోని బెరం పార్కులో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ఎం.సుహాసిని, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త జె.సుమన్, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ కొల్లేటి రమేష్, ఆయుష్ అధికారి రామత్లేహి, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు, శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8న హరిత బెరం పార్కులో ప్రత్యేక యోగాసనాల కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
చల్లపల్లి వీధుల్లో అంకినీడు అంతిమ యాత్ర
చల్లపల్లి: శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహదూర్(చల్లపల్లి రాజా)వారి కుమారుడు అంకినీడు ప్రసాద్(86) భౌతిక కాయం శనివారం సాయంత్రానికి చల్లపల్లికి చేరుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులోని స్వగృహంలో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. చల్లపల్లి ప్రధాన రహదారులపై పూలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో అంకినీడు ప్రసాద్ భౌతిక కాయాన్ని ఊరేగించారు. ఆటోనగర్ వద్ద తరిగోపుల ప్రాంగణం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర ప్రధాన రహదారి వెంబడి అవనిగడ్డ వైపు ఉన్న బ్రహ్మంగారి గుడి వద్ద వరకు వెళ్లి అక్కడ నుంచి వెనుదిరిగి మచిలీపట్నం రోడ్డులోని శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్(ఎస్ఆర్వైఎస్పీ) కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం రెండు గంటల పాటు అక్కడ ఉంచారు. ఆయన భౌతిక కాయాన్ని కడసారి చూసి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసి నివాళులు అర్పించారు. అనంతరం అదే వాహనంలో ఆయన భౌతికకాయాన్ని మచిలీపట్నంలోని శివగంగ ప్రాంగణానికి తరలించారు. అంకినీడు ప్రసాద్ భౌతికకాయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి సింహాద్రి రమేష్బాబు సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా సందర్శించి నివాళులు అర్పించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కడసారి వీక్షించేందుకు బారులు తీరిన ప్రజలు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మండలి, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల -
ఇష్టం లేకపోతే బయట పని చూసుకోండి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కేశఖండనశాలలో సిబ్బంది పని తీరుతో దేవస్థానానికి చెడ్డ పేరు వస్తే క్షమార్హం కాదు.. సేవా దృక్పథం ఉండాలి...లేనప్పుడు బయట వేరే పనులు చూసుకోండి.. భక్తుల నుంచి ఫిర్యాదులోస్తే అదే రోజు ఉద్యోగం నుంచి బయటకు పంపడమే కాదు పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తాం...ఉద్యోగం లేని రోజు.. ఎలా ఉంటుందో ఊహించుకోండని దుర్గగుడి ఈవో శీనానాయక్ హెచ్చరించారు. మహా మండపం ఆరో అంతస్తులో దుర్గగుడి కేశ ఖండనశాల సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందితో శనివారం ఆయన సమావేశమయ్యారు. భక్తులను ఇబ్బంది పెడితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శనివారం రెండు వీడియో ఫిర్యాదులు తన వద్దకు వచ్చాయని, దేవదాయ చట్టం ప్రకారం నిబంధనలు కఠినంగా ఉన్నాయని, భక్తులను ఇబ్బంది పెట్టే వారిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కేశఖండనశాలలో సిబ్బందికి ఇబ్బందులు, వేతనాల సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఫిర్యాదులపై అన్ని కోణాల్లో విచారి స్తామని, సిబ్బంది తప్పు ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులను గౌరవిస్తే ఆలయానికి మంచిపేరు భక్తులను గౌరవించాలని, ఆప్యాయతను చూపిస్తే ఆలయానికి మంచి పేరు వస్తుందని ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈవో సూచించారు. దాదాపు నెల రోజుల నుంచి సెక్యూరిటీ సిబ్బందిని గమనిస్తున్నానని, యాంత్రికంగానే ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. సుమారు వెయ్యి మంది సిబ్బంది ఉన్న ఆలయంలో భక్తులతో ఎలా ప్రవర్తిస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కొంత మంది సిబ్బంది తీరుతో దేవస్థానానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. -
నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ. 2.52 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోని రామచంద్రనగర్కు చెందిన బట్టు నాగేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. నాగేశ్వరరావు పేరిట రూ. 1,51,116 విరాళాన్ని, జిష్ణురావు పేరిట బంగారు తాపడం పనులకు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. నేడు ఏపీసీబీఈఏ రాష్ట్ర మహాసభలు చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీబీఈఏ) పదో రాష్ట్ర మహాసభలు మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోపీనాథ్ శనివారం తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్లోని రెవెన్యూ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. మహాసభలకు 13 జిల్లాల డీసీసీబీ ఉద్యోగులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు తప్పని సరిగా హాజరుకావాలని ఆయన కోరారు. రైల్వేస్టేషన్లో ఆహార భద్రతపై శిక్షణ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ రైల్వేస్టేషన్లోని స్టేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఆహార భద్రతపై రైల్వే ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎఫ్బీఓ (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్)లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథి రైల్వే హాస్పటల్ సీఎంఎస్ డాక్టర్ శ్రీనివాసులు ఆహార భద్రతపై పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. నిబంధనలకు అనుగుణంగా ఆహారం తయారీ, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహారాన్ని సక్రమంగా నిల్వచేయడం వంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ‘ఈట్ రైట్ ఉద్యమం’ ఆరోగ్యకరమైన ఆహార వాతావరణానికి బలమైన పునాది వేసిందని, ఆ దిశగా విజయవాడ రైల్వేస్టేషన్ ఆహార భద్రతపై నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో రైల్వే హాస్పటల్ ఏసీఎంఎస్ డాక్టర్ ఎం.జైదీప్, రైల్వే ఫుడ్ సేప్టీ ఆఫీసర్ ఎస్.కె. రెహ్మతుల్లా, స్టేషన్ డైరెక్టర్ శైలజ, స్టేషన్ మాస్టర్ సాంబశివరావు, ఐఆర్సీటీసీ ఏఎం రాజా తదితరులు పాల్గొన్నారు. వైభవంగా శోభాయాత్ర విజయవాడ కల్చరల్: వేంకటేశ్వరుడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండప ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దేవాలయంలో నిర్వహించిన వైదిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఉదయం వేంకటేశ్వర స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకీపై పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. దేవాలయన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీటీపీఎస్లో ఏపీఎస్పీఎఫ్ డీజీ ఇబ్రహీంపట్నం: ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ త్రివిక్రమ వర్మ శనివారం ఎన్టీటీపీఎస్ను సందర్శించారు. ప్రధాన గేటు వద్ద ముందుగా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ప్లాంట్లో స్టేజి 1 నుంచి 4 వరకు సందర్శించారు. కోల్ప్లాంట్లో వ్యాగన్ టిప్లర్ గురించి ఏడీఈ హేమానంద్ వివరించారు. ఎస్ఈ అనురాధ కోల్తో విద్యుత్ తయారీ విధానం.. యూనిట్ కంట్రోల్ బోర్డు ద్వారా వివరించారు. ఏపీఎస్పీఎఫ్ కమాండెంట్ ముద్దాడ శంకరరావు, అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణమాచారి పాల్గొన్నారు. -
కరోనాలో ముందుగానే వాహనమిత్ర
నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దపాప ఇంటర్. రెండో పాప పది పూర్తి చేసింది. చిన్నపాప టెన్త్ చదువుతోంది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా ఏటా రూ. 10 వేలు లబ్ధి చేకూరింది. కరోనా లాక్డౌన్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. బతకడం కష్టమైంది. ఆ సమయంలో ఆర్నెలలు ముందుగానే వాహనమిత్ర ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. అమ్మఒడి పథకంలో నాలుగేళ్లు లబ్ధి పొందాం. కూటమి ప్రభుత్వం బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్కు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చింది. ఏడాది నుంచి ఏ పథకం లేదు. తల్లికి వందనం కూడా ఇవ్వలేదు. పిల్లల చదువులు భారంగా మారాయి. – ఈశ్వర్, ఆటోడ్రైవర్ గొల్లపూడి ● -
త్యాగానికి ప్రతీక బక్రీద్
లబ్బీపేట(విజయవాడతూర్పు): త్యాగనిరతిని, దాన గుణాన్ని పెంపొందించేదే బక్రీద్ పండుగ అని జమాతే ఇస్తామీ హింద్(జేఐహెచ్) మహమ్మద్ రఫీక్ అహ్మద్ అన్నారు. లబ్బీపేట ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం బక్రీద్ సామూహిక నమాజు జరిగింది. వేలాది మంది ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ ఇంటిల్లిపాదీ జరుపుకునే పండుగలో బీదలు, బంధువులను, ఇరుగుపొరుగువారిని భాగస్వాములుగా చేసుకుని, మీకున్నంతలో దానమివ్వాలని ఇస్లాం చెబుతోందన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనే ఒక మత సంస్థ ఆస్తులను కబ్జాలు చేసుకునేలా ప్రోత్సహించే చట్టాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తూ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025 ను వెంటనే రద్దు చేయాలని మహమ్మద్ రఫీక్ అహ్మద్, ఇతర వక్తలు ప్రభుత్వాన్ని కోరారు. దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం, మైనార్టీ మతాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం, దేశ పౌరులందరకీ సమాన హక్కులు కల్పించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల బాధ్యత అన్నారు. ముస్లింల ధార్మిక సామాజిక అంశాలు భావి తరాల భవిష్యత్తు వక్ఫ్ బిల్లుతో ముడిపడి ఉన్నాయన్నారు. 1991 ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం అయోధ్య మినహా మరి ఎక్కడా ఉలాంటి వివాదాలకు ఆస్కారం ఉండకూడదని, 1947 ఆగస్టు 15న ఆయా ప్రార్థనా స్థలాలలో ఉన్న యథాతథ స్థితిని కొనసాగించాలి వారు పేర్కొన్నారు. ముస్లింలను వేధించటమే ధ్యేయంగా బీజేపీ రాజకీయాలు చేస్తోందన్నారు. అనంతరం ముఫ్తి హబీబ్ ఉరూ ప్రసంగం చేసి, నమాజ్ చదివించారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాలేషావలి, షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రశాంతంగా సామూహిక నమాజు నిర్వహించుకునేందుకు సహకరించిన నగరపాలక సంస్థ, పోలీసు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. సభ్యులు ఎండీ ఇర్ఫాన్, సయ్యద్ ఇంతియాజ్, ఎండీ అన్వర్ పాషా, షేక్ వలి, మఖ్బూల్ అహ్మద్ నద్వి తదితరులు పాల్గొన్నారు. ఐజీఎంసీ స్టేడియంలో ఘనంగా సామూహిక ఈద్నమాజ్ వక్ఫ్ చట్ట సవరణ రాజ్యాంగ ఉల్లంఘనేబక్రీద్ ప్రార్థనల్లో చిన్నారులు -
పైసలిస్తేనే పర్మిషన్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లాకు సంబంధించి పరిపాలనాపరమైన అన్ని కార్యకలాపాలు నిర్వహించే మచిలీపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అక్కడ నుంచి ఏ ఫైల్ కదలాలన్నా పైసలు చెల్లించాల్సిందేనని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ఏదైనా పర్మిషన్ల కోసం వెళితే ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఆ కార్యాలయ ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు చెపుతున్నారు. అంతేకాదు ఇటీవల ఏఎన్ఎంలకు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఉద్యోగోన్నతులు ఇచ్చారు. వారికి ఇచ్చిన ఆర్డర్లు అసంపూర్తిగా ఉండటంతో వాటిని తీసుకుని రెండు మూడు రోజులు ఏఎన్ఎంల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీనికంతటికీ కారణం ఉద్యోగోన్నతుల సమయంలో ముడుపులు అడిగితే ఇవ్వకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారనే అని అంటున్నారు. ఇలా ప్రతి అంశంలోనూ కృష్ణా డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. ప్రతి పనికీ ఓ రేటు... ● కృష్ణాజిల్లాలోని ఓ టీచింగ్ హాస్పిటల్లో మత్తు వైద్యుల సదస్సు జరగనుంది. ఆ సదస్సులో ఆల్ట్రాసౌండ్ స్కానర్ను ఉపయోగించి మత్తు ఇవ్వడంపై శిక్షణ ఇవ్వనున్నారు. ఆల్ట్రాసౌండ్ మిషన్ వినియోగించేందుకు డీఎంహెచ్ఓను అనుమతి కోరారు. అందుకు రూ.25 వేలు లంచం ఇస్తేనే అనుమతి ఇస్తామని కార్యాలయంలో తేల్చి చెప్పినట్లు తెలిసింది. ● గుడివాడలోని ఓ ట్రస్టు ఆధ్వర్యంలో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆ హాస్పిటల్కు అనుమతి కోసం అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి అనుమతి కోసం డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ఫైల్ పంపారు. అనుమతి ఇవ్వాలంటే రూ.25 వేలు అధికారులు, రూ.5 వేలు కన్సల్టెంట్ గుమస్తాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డబ్బుల కోసం ఫైల్ పక్కన పడేశారు. ఈ రెండే కాదు జిల్లాలోని వైద్యశాఖ ఉద్యోగులకు సంబంధించి ఏ పనిచేయాలన్నా ముడుపులు చెల్లించుకోవాల్సిందేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే పని చేయకుండా పక్కన పడేస్తున్నట్లు చెపుతున్నారు. ఇలా డీఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి ఊబిలో కూరుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏఎన్ఎం ఉద్యోగోన్నతుల్లోనూ... ఇటీవల సచివాలయాల్లో పనిచేస్తున్న 258 మందికి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. వాటి సచివాలయాల నుంచి వైద్యశాఖలో రిపోర్టు చేయాల్సి ఉంది. వారికి ఉద్యోగోన్నత ఉత్తర్వుల్లో రిలీవ్ ఎవరు చేయాలనే అంశం పేర్కొనక పోవడంతో గ్రామాల్లో ఎంపీడీఓలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ రెండు రోజులు రిలీవ్ చేయలేదు. అసంపూర్తిగా ఆర్డర్లు ఇవ్వడం వలనే అలా జరిగిందని ఏఎన్ఎంలు మండి పడుతున్నారు. ఏప్రిల్ 26న ఒకసారి కౌన్సెలింగ్ నిర్వహించారని ఆ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామనే అక్కసుతోనే తమను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఏప్రిల్లో నిర్వహించిన కౌన్సెలింగ్లో ఉద్యోగోన్నతులు పొందిన 15 మందికి ప్రస్తుతం కౌన్సెలింగ్లో రాలేదు. దీంతో వారు కూడా ఆందోళనకు దిగడంతో పాటు, కృష్ణా కలెక్టర్కు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కృష్ణా డీఎంహెచ్ఓ కార్యాలయం ఏఎన్ఎంల ఉద్యోగోన్నతుల్లోనూ అసంపూర్తిగా ఆర్డర్లు మూడు రోజులు కార్యాలయాల చుట్టూ తిరిగిన ఏఎన్ఎంలు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం : డీఎంహెచ్ఓనా దృష్టికి రాలేదు తమ కార్యాలయంలో డబ్బులు అడుగుతున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అనుమతుల కోసం ఎవరినీ డబ్బులు అడగడం లేదు. – డాక్టర్ శర్మిష్ట, డీఎంహెచ్ఓ, కృష్ణా -
రెడ్బుక్ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోయామని.. బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతేనన్నారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విష్ణు డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం శిథిలాల కింద ఉండి పోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ.. కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాలేజీకి చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయటానికే ఇలా దౌర్జన్యం చేశారు. కోర్టు తీర్పు ఉందని ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా?. బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారని ఇలాంటి దాడులు చేస్తారా?. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాలేజీల మీద కూడా చూపిస్తారా?. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.అక్రమంగా భూములు లాక్కుంటే లోకేష్ ఏమీ మాట్లాడరా?. బ్రాహ్మణులను బలహీనులుగానే చూస్తారా?. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని వైఎస్సార్సీపీ సీరియస్గా తీసుకుంటుంది. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు. -
నాడు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ప్రతి ఇంటి గడపనూ సంక్షేమం పలకరించింది. ఏడాది పొడవునా అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న చేదోడు, ఆసరా అంటూ అనేక పథకాలను అందరికీ అందించింది. పేద, మధ్యతరగతి వర్గాలు ఆ ఫలాలతో ఆనందంగా జీవించాయి. పిల్లల చదువుల దగ్గర నుంచి కుటుంబ జీవనం వరకూ ఎలాంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోయింది. ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి తారుమారైంది. సామాజిక పింఛన్లు మినహా ఏ ఒక్క సంక్షేమ పథకం అందలేదు. సూపర్సిక్స్ హామీలను విశ్వసించిన పేద, మధ్యతరగతి వర్గాలు భంగపాటుకు గురయ్యాయి. హామీల పేరుతో గద్దెనెక్కి వాటిని అటకెక్కించారంటూ ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. కూటమి మోసాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. నయవంచన పాలనపైపెదవి విరుస్తూ, గత ప్రభుత్వ సంక్షేమ పాలనను గుర్తు చేసుకుంటున్నాయి. నేడు కూటమి ఏడాది పాలనలో బతుకులు ఛిద్రం సూపర్ సిక్స్ పథకాల ఊసే ఎత్తని ప్రభుత్వం నమ్మి మోసపోయామంటూ ఆవేదన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోప్రతి కుటుంబానికి లబ్ధి నాటి సంక్షేమ పథకాలతో పేద, మధ్యతరగతి వారికి ఆర్థిక దన్ను -
నేతన్నలకు ఉచిత విద్యుత్ ఏది?
జగన్మోహన్రెడ్డి హయాంలో నేతన్నలకు ఏడాదికి రూ.24వేలు చొప్పున అందజేశారు. ఆర్థికంగా నేతన్నలు కోలుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం నేతన్నలు ఎదుర్కొని నిలబడ్డారంటే జగన్ పుణ్యమే. ఐదేళ్ల పాటు నేతన్న నేస్తం పథకం ద్వారా ఒక్కో నేత కార్మికుడు రూ.1.20లక్షల చొప్పున పొందారు. ఈ ప్రభుత్వంలో నేతన్నలకు ఉచిత విద్యుత్ అంటూ పేర్కొంది. 200యూనిట్లు వరకు ఉచితమంది. దీనికి సంబంధించి ఎటువంటి విధివిధానాలు విడుదల చేయకుండా నేతన్నలను దగా చేస్తోంది. – యర్రా టార్జన్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు -
విస్మరించొద్దు!
విస్తరిస్తోంది..క్రమంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులులబ్బీపేట(విజయవాడతూర్పు): ఐదేళ్ల కిందట గడగడలాడించిన కోవిడ్ మరోసారి విస్తరిస్తోంది. నగరంలోనూ పలువురు దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రి కోవిడ్ వార్డులో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతుండగా, నిర్ధారణ కాకుండా ఇంకా ఎక్కువ మందే ఉంటున్నట్లు భావిస్తున్నారు. అంతేకాక వేర్వేరు వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరి, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ఇప్పటికే ముగ్గురు మృత్యువాత పడినట్లు తెలిసింది. వారి మృతికి కోవిడ్ కారణం కాదని వైద్యులు అంటున్నారు. కోవిడ్పై ప్రజలు అప్రమత్తం కాకుంటే మరోసారి దాని ప్రతాపం చూపుతుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ముగ్గురు మృతి.. ● అదుపులో లేని మధుమేహం, రక్తపోటుతో తీవ్రంగా నీరసించిన 65 ఏళ్ల వృద్ధురాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెను అడ్మిట్ చేసిన వైద్యులు కోవిడ్ పరీక్ష కూడా చేశారు. ఆ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. కాగా ఆమె పరిస్థితి విషమించి వారం రోజుల కిందట మృత్యువాత పడింది. ● న్యూరో సర్జరీ విభాగంలో చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తికి బ్రెయిన్ సర్జరీ చేశారు. సర్జరీ అనంతరం జ్వరం రావడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయడంతో పాజిటివ్ వచ్చింది. అంతేకాక ఐదు రోజుల కిందట అతనూ మృత్యువాత పడ్డాడు. ● గిరిపురానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన శ్వాస సమస్యతో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. అతనిని కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తుండగా గురువారం ఉదయం 7 గంటల సమయంలో మృత్యువాత పడ్డాడు. పెరుగుతున్న బాధితులు.. కోవిడ్ బాధితులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ప్రస్తుతం కోవిడ్ వార్డులో నలుగురు రోగులు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. సాధారణ వ్యాధులతో వచ్చిన వారికి అనుమానిత లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారికి వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు. అలా చేస్తున్న వారిలో కొందరికి కోవిడ్ పాజిటివ్ వస్తోంది. అలాంటి వారిని కోవిడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ జీజీహెచ్కు వస్తున్న రోగులు ఇప్పటికే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన ముగ్గురు మృతి ఇతర వ్యాధులతో వచ్చిన వారికి పరీక్ష చేస్తే కోవిడ్ పాజిటివ్ ఏ మాత్రం అప్రమత్తం చేయని ప్రభుత్వం దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం అప్రమత్తత ఏదీ? ఒకవైపు కోవిడ్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ప్రజలను ఏమాత్రం అప్రమత్తం చేయడం లేదు. అవగాహన కల్పించడం లేదు. దీంతో ప్రజల రద్దీ ప్రాంతాల్లో సైతం మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకరి నుంచి మరొకరికి సోకి తీవ్రరూపం దాల్చే ప్రమాదం లేక పోలేదని ఒక సీనియర్ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్వీయ రక్షణ అవసరం.. ప్రజలు అవకాశం ఉన్నంత వరకూ రద్దీ ప్రాంతాల్లో తిరగడం మానుకోవాలని.. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతులను తరచూ శానిటైజర్తో శుభ్రపరుచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకూ ఎవరితోనూ కరచాలనం చేయవద్దంటున్నారు. ఒకవేళ కోవిడ్ లక్షణాలు ఎవరిలో అయిన కనిపిస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవడంతో పాటు ఇంట్లోనే క్వారంటైన్ అవ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు. -
తొలి రోజు డీఎస్సీ ప్రశాంతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీలో భాగంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన సెషన్లో 1,150 మంది అభ్యర్థులకుగాను 1,008(87.65 శాతం) మంది హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నగరంలోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (పీఎస్సీఎంఆర్)లోని పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే డీఎస్సీ పరీక్షలు రాసేందుకు దాదాపు 30 వేల మందికి ఏర్పాట్లు చేశామని, జిల్లా పరిధిలోని పది పరీక్ష కేంద్రాలకు ప్రత్యేకంగా అధికారులను నియమించామని తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) కావడంతో సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బృందాలతో డెస్క్టాప్, పవర్ బ్యాకప్ వంటి వాటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. తిరువూరు, మైలవరం వంటి ప్రాంతాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీశ -
కుటుంబాలు కుదేలు!
సంక్షేమ వెలుగులు లేక సంక్షోభ చీకట్లుపెడన: ప్రస్తుతం కూటమి సర్కారు ఏడాది పాలనలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు రిక్తహస్తమే మిగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్సిక్స్ అంతా ప్రచార ఆర్భాటమేనని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉందని, నిధులు లేవని, అప్పులు చేస్తున్నామని దాటవేస్తూ కూటమి నేతలు చెబుతున్న మాటలకు విసుగెత్తిపోతున్నారు. ఇప్పటి వరకూ తల్లికి వందనం కింద రూ.15 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు, 18 ఏళ్లు నిండిన మహిళలు నెలకు రూ.15 వేలు చొప్పున ఒక్కొక్కరూ ఆర్థికంగా చాలా నష్టపోయారు. మహిళలు ఉచిత బస్సు కనీసం కంటికి కనిపించక ఇదెక్కడి ప్రచారం తల్లో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఏడాదిలో సాగుకు అవసరమైన పెట్టుబడులు, విద్యార్థులు చదువులు పూర్తి చేయటానికి అందినకాడికి అప్పులు తెచ్చి కట్టుకోవాల్సి వచ్చిందంటూ వాపోతున్నారు. నేతన్నలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో 200 యూనిట్ల వరకు ఉచితమని చెప్పి నెలలు గడుస్తున్నా విధి విధానాలు ఏమీ విడుదల చేయకపోవడంతో నేతన్నలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పూట గడవటమే కష్టం అవుతున్న పరిస్థితుల్లో విద్యుత్ భారంతో మగ్గాలు కదలటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క ట్రూ అప్, సర్వీసు చార్జీలు పేరుతో విద్యుత్ చార్జీలు పెంచి ఎన్డీయే కూటమి సర్కారు పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వయం ఉపాధిపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఆదరణ కరువైంది. మరీ ముఖ్యంగా రోడ్ల వెంబడి దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవించే వాళ్లు, చిరు వ్యాపారులు, ఆటో వాలాలు కూటమి తీరుతో బతుకు భారంగా ఈడుస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా ఆయా వర్గాలకు వ్యాపార వృద్ధికి, వాహనాల మరమ్మతులకు అవసరమైన సొమ్మును రూ.10 వేలు ఆపైన నేరుగా వారి బ్యాంకు ఖాతాకే చేరేలా చేసింది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. వివిధ కార్పొరేషన్ల కింద ఇచ్చే రుణాల యూనిట్ల కేటాయింపు అంతా ‘పచ్చ’పక్షంగా సాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో వేలల్లో అర్జీలు వస్తే కేవలం 200 యూనిట్లు కూడా మించకుండా కేటాయింపులు చేసి మొక్కుబడిగా చేతులు దులుపుకున్నారు. ఇందులో కూడా కేవలం ఎమ్మెల్యేల సిఫారసులు ఉన్న టీడీపీ వర్గీయులకే రుణాలు మంజూరయ్యేలా చేశారు. దీంతో కోటి ఆశలతో వ్యాపారాలు చేసుకుని స్వయం ఉపాధి ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా వృద్ధి చేసుకుందామని ఆశించిన ఎందరో నిరుద్యోగులు, చిరు వ్యాపారులకు నిరాశ మిగిలింది. బీసీ కార్పొరేషన్ల ద్వారా పేద మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని చెప్పి చివరకు రిక్తహస్తమే చూపారు. దగా పడ్డ పేద, మధ్య తరగతి వర్గాలు ‘పచ్చ’పాతం.. వెన్నుపోటు.. -
జెడ్పీ హైస్కూలుకు 50సెంట్ల భూమి వితరణ
కంకిపాడు: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన విద్య అందాలని జెడ్పీ సీఈఓ కె.కన్నమ నాయుడు అన్నారు. మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన దాత అన్నే పద్మనాభరావు, ఉషారాణి దంపతులు రూ. 10 కోట్ల విలువైన 50సెంట్ల వ్యవసాయ భూమిని తన తల్లిదండ్రులు అన్నే రామలింగయ్య, రాజ్యలక్ష్మి జ్ఞాపకార్థం ఉప్పలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు వితరణగా అందించారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడుకి స్థల దస్తావేజులను శుక్రవారం అందజేశారు. తొలుత ఉప్పలూరు–వేల్పూరు రోడ్డు వెంబడి ఉన్న స్థలాన్ని ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి సందర్శించారు. అనంతరం దాత పద్మనాభరావు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఈఓ కన్నమనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటుగా దాతలు ముందుకు వచ్చి వసతుల కల్పనకు తోడ్పాటునందిస్తే పాఠశాలలు నూతన సొబగులు దిద్దుకుంటాయన్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం.. దాత అన్నే పద్మనాభరావు మాట్లాడుతూ ఉప్పలూరు, వేల్పూరు గ్రామాల విద్యార్థులు ఉన్నత పాఠశాల చదువు కోసం దూరంగా ఉన్న పునాదిపాడు, మంతెన గ్రామాలకు వెళ్లాల్సివస్తోందన్నారు. చాలా మంది విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉంటే అన్ని వర్గాల ప్రజలకు పాఠశాల అందుబాటులోకి వస్తుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మండల విద్యాశాఖ రూపొందించిన కరపత్రాన్ని సీఈఓ ఆవిష్కరించారు. జెడ్పీటీసీ బాకీ బాబు, ఏఎంసీ చైర్మన్ అన్నే ధనరామకోటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు మద్దాలి రామచంద్రరావు, కొణతం సుబ్రమణ్యం, ఎంపీపీ నెరుసు రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
యోగాతో ఒత్తిడి రహిత జీవితం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఒత్తిడి రహిత జీవితానికి యోగా దోహదపడుతోందని, డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్థూలకాయం వంటి జీవనశైలి రుగ్మతల నుంచి యోగా రక్షణ కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు యోగాస్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ బార్ అసోసియేషన్ భాగస్వామ్యంతో న్యాయవాదుల థీమ్ యోగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని, ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో భారతదేశ వారసత్వ సంపద అయిన యోగాను సమాజంలోని ప్రతి వర్గానికి చేరువచేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రోజుకో వర్గ ప్రజలతో థీమ్ యోగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం లాయర్లతో థీమ్ యోగా నిర్వహించారు. కామన్ యోగా ప్రోటోకాల్లో చాలా సరళమైన ఆసనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్డీవో కావూరి చైతన్య, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏకే బాషా, సెక్రటరీ కేవీ రంగారావు, మాజీ కార్యదర్శులు జున్ను శ్రీధర్, పుప్పాల శ్రీనివాసరావు, సభ్యులు పి.జయలక్ష్మి, టి.హరికృష్ణ, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు డాక్టర్ వి.రాణి, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం
ముండ్లపాడు క్రాస్రోడ్స్(పెనుగంచిప్రోలు):రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని జాతీయ రహదారిపై ముండ్లపాడు క్రాస్రోడ్స్ వద్ద చోటు చేసుకుంది. గొల్లపూడి నుంచి పెళ్లి సరుకులతో వెళ్తున్న ట్రాలీ ఆటో జాతీయ రహదారిపై నుంచి పెనుగంచిప్రోలు వెళ్లేందుకు సర్వీసు రోడ్డులోకి తిరుగుతుండగా వెనుక నుంచి తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఆటో పల్టీ కొట్టగా కారు పక్కన గోతిలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో మంగళగిరికి చెందిన ఆటో డ్రైవర్ షేక్ జానీ(55)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యమంలో మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్, కూకట్పల్లికి చెందిన విష్ణుబొట్ల శంకర్ భార్య ఇద్దరు పిల్లలకు ఎటువంటి గాయాలు కాలేదు. కారులో వారు సీటు బెల్టు పెట్టుకోవటంతో పాటు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. -
ప్లేస్మెంట్స్లో సత్తా చాటిన కేఎల్ విద్యార్థులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): క్యాంపస్ ప్లేస్మెంట్స్లో తమ కళాశాల విద్యార్థులు సత్తా చాటారని యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ శరవణబాబు తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇంజినీరింగ్ విభాగంలో 100 శాతం ప్లేస్మెంట్స్ రికార్డు సాధించామని చెప్పారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155 కు పైగా కంపెనీల్లో ప్లేస్మెంట్స్ సాధించారని పేర్కొన్నారు. 450 కి పైగా జాతీయ కంపెనీలు, 50 కి పైగా అంతర్జాతీయ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, ఎంహెచ్ ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విభాగం అసోసియేట్ డీన్ డాక్టర్ చలపతి పాల్గొన్నారు. -
కృష్ణానదిలో దూకి వ్యక్తి మృతి
కంచికచర్ల: అనుమానాస్పదస్థితిలో లారీ యజమాని కృష్ణానది పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు కంచికచర్లకు చెందిన దేవిరెడ్డి నాగరాజు (41)లారీలు నడుపుకుంటూ జీవిస్తున్నాడు ఇతరుల వద్ద కొంత అప్పుగా తీసుకుని లారీలు కొనుగోలు చేశాడు. చేసిన అప్పులు తీరతాయోలేదోనని మనస్తాపం చెంది సూసైడ్ నోటు రాసుకుని మరీ ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద కృష్ణానదిలో గురువారం దూకాడు. ఈ విషయం తెలుసుకున్న స్ధానికులు పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లను పిలిపించి కృష్ణానదిలో నాగరాజు కోసం వెతుకులాట ప్రారంభించారు. రాత్రి సమయం కావటంతో తిరిగి శుక్రవారం కృష్ణానదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కొంత సేపటి తర్వాత నాగరాజు మృతదేహం లభ్యమయింది. ఆ మృతదేహాన్ని కంచికచర్ల స్వగృహానికి తీసుకువచ్చారు. కంచికచర్ల పోలీస్స్టేషన్లో సూసైడ్ నోట్ ప్రకారం నాగరాజు తమ్ముడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు నాగరాజు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు వేమా సురేష్బాబు, దేవరకొండ గురవయ్య, కాలవ పెదబాబు తదితరులు ఉన్నారు. బీటెక్ ఎనిమిదవ సెమిస్టర్ ఫలితాలు విడుదల కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలకు సంబంధించిన బీటెక్ ఎనిమిదో సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శుక్రవారం విడుదల చేశారు. 204 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ తెలిపారు. పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పీవీ బ్రహ్మచారి పాల్గొని ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను ( www.kru.ac.in) వెబ్సైట్లో పొందుపరచినట్లు తెలిపారు. -
అమ్మ సన్నిధిలో అన్నీ నగదు లావాదేవీలే!
పెనుగంచిప్రోలు:ప్రతి ఒక్కరూ నేడు నగదు రహిత లావాదేవీలకు అలవాటై పోయారు. కొద్ది మొత్తం నగదుతో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి ఆలయంలో మాత్రం డిజిటల్ చెల్లింపులు అందుబాటులో లేవు. దీంతో భక్తులు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా భక్తులకు సౌలభ్యం కలగటమే కాకుండా ఆలయానికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. తిరుపతమ్మవారి ఆలయంలో దర్శనం టికెట్లు, వివిధ ఆర్జిత సేవా టికెట్లు, ప్రసాదాల కొనుగోలు, కేశఖండనశాల వంటి అన్ని సేవలకు నగదు చెల్లింపులు తప్పనిసరి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సరిపడా నగదు లేకపోతే వారి బాధలు చెప్పలేనివిగా ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లు అధికంగా వినియోగించే యువత సరిపడా నగదు తెచ్చుకోక ఏటీఎంల కోసం గ్రామంలో కిలోమీటరు మేర నడుచుకొని వచ్చి నగదు డ్రా చేసుకుని తీసుకెళ్తున్నారు. ఆలయ కౌంటర్ల వద్ద ఫోన్ పే, గూగుల్పే, పేటీఎం వంటి సౌకార్యాలు లేకపోవటంతో ప్రతి అవసరానికి నగదు కోసం ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. పెరగనున్న ఆదాయం.... డిజిటల్ పేమెంట్లు అందుబాటులో లేక పోవటంతో దేవస్థానం కొంత ఆదాయం నష్టపోతోందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నిత్యాన్నదాన పథకానికి, గోశాలలో గోవుల సంరక్షణకు విరాళాలు అందించే దాతలు చాలామంది ఉంటారు. ప్రస్తుతం వారంతా విరాళాలను నగదు, చెక్కు, డీడీ రూపంలో అందిస్తున్నారు. అయితే ఆలయానికి వచ్చిన తరువాత అమ్మవారి దర్శనం అనంతరం లేదా అన్నప్రసాదం స్వీకరించిన తరువాత ఆలయ ప్రాంగణంలో గోపూజ అనంతరం విరాళం ఇవ్వాలని భక్తులు భావిస్తుంటారు. అయితే చేతిలో నగదు అందుబాటులో లేకపోవటం, డిజిటల్ సేవలు లేక విరాళం ఇవ్వలేక వెళ్లిపోతున్నారు. డిజిటల్ చెల్లింపుల కోసం కౌంటర్ల వద్ద ప్రతిరోజూ భక్తులు అడుగుతుంటారు. డిజిటల్ చెల్లింపులతో చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తం వరకు విరాళాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల అమలులో అనేక సాంకేతిక సమస్యలతో పాటు నగదు దుర్వినియోగం కూడా జరిగే అవకాశం ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు చెబుతున్నది సరైనదే అయినప్పటికీ పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో కూడిన అత్యాధునిక సాప్ట్వేర్ వినియోగించి సమస్యను అధిగమిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు అవసరం... విరాళాలు, వివిధ సేవల కోసం ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాటు లేక పోవటంతో భక్తులు విరాళాలు ఎవరికి ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా విరాళాల కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే ఆలయంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన నగదు లావాదేవీలు జరిగే చోట రెగ్యులర్ ఉద్యోగులు విధుల్లో ఉండకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఎవరో ఒకరిని అక్కడ ఉంచి వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డిజిటల్ పేమెంట్లు లేక భక్తుల అవస్థలు విరాళాల సమర్పణలో నగదు రహిత చెల్లింపులతో మేలు భక్తులకు సౌకర్యంతో పాటు ఆలయానికి ఆదాయం -
యనమలకుదురు ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత
పెనమలూరు:యనమలకుదురు ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. క్వారీలోకి ఇసుక మాఫియా ప్రవేశించి విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టడంపై వివాదం తలెత్తింది. దీంతో లంక భూముల సొసైటీ సభ్యులకు ఇసుక తవ్వకాలు చేసే మాఫియాకు గురువారం రాత్రి గొడవ జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో గ్రామస్తులు ఘాట్ గేటుకు తాళాలు వేశారు. యనమలకుదురులో ఇసుక క్వారీని గత 20 సంవత్సరాల క్రితమే నిషేధించారు. ఈ క్వారీ కనకదుర్గ వారధికి కేవలం 2 కిలోమీటర్ల లోపు దూరం మాత్రమే ఉంది. ఇసుక క్వారీలో ఇసుక తవ్వకాలు చేస్తే వారధికి ప్రమాదం ఉంటుందని ఇసుక తవ్వకాలు అధికారికంగా నిలిపివేశారు. దీంతో యనమలకుదురు ఇసుక క్వారీకి వేలంపాటలు పెట్టలేదు. ఇసుక మాఫియానే అక్రమంగా నదిలోకి ప్రవేశించి తవ్వకాలు చేస్తున్నారు. నిషేధ యనమలకుదురు క్వారీలో చట్ట విరుద్ధంగా ఇసుక తవ్వకాలు విపరీతంగా చేస్తున్నారు. ఇసుక మాఫియా నదిలోకి చొచ్చుకు పోయి ఇసుక తవ్వకాలు చేయటం పై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణానదికి వరద వస్తే నిర్మించిన వాల్కు కూడా ప్రమాదం ఏర్పడే సరిస్థితి ఉంది. అలాగే కనకదుర్గ వారధికి సైతం రక్షణ ఉండదు. ఇక్కడ ఇంత తంతు జరుగుతున్నా ఏ ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియాతో అధికారులు చేతులు కలిపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెదపులిపాక ఇసుక క్వారీని మూసివేయటంతో ఇసుక ట్రాక్టర్లు ఒక్కసారిగా యనమలకుదురు క్వారీలోకి వచ్చాయి. సొసైటీ సభ్యులకు ఇసుక మాఫియాకు గొడవలు జరగటంతో ఉద్రిక్తత నెలకొంది. వివాదం ముదురుతుందని గ్రామస్తులు ఘాట్ గేటుకు తాళం వేశారు. అధికారులు ఇప్పటికై నా కళ్లు తెరిచి యనమలకుదురులో ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దుర్గాఘాట్లో పనులు పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దుర్గాఘాట్ శుభ్రంగా ఉండేలా పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ తెలిపారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే దుర్గాఘాట్ను శుక్రవారం ఈవో శీనానాయక్ తనిఖీ చేశారు. దుర్గాఘాట్ను చూసి భక్తులు కొండపై పరిశుభ్రతను అంచనా వేస్తున్నారని, ఘాట్ ఎంత శుభ్రంగా ఉంటే ఆలయమంత పరిశుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఘాట్ను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తులు దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్స్, సూచిక బోర్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నదిలో భక్తులు సబ్బులు, షాంపులు వినియోగించకుండా చూడాలని తెలిపారు. సబ్బులు, షాంపులు వినియోగించడం వల్ల నదీ జలాలు కలుషితం కావడమే కాకుండా నదిలో జీవరాశులు చనిపోతాయని తెలిపారు. దుర్గాఘాట్లో మైక్ ప్రచార కేంద్రం ఏర్పాటు చేసి, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హాకర్లు తమ పరిధి దాటి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. టాయిలెట్స్తో పాటు భక్తులు మరుగుదొడ్ల వద్ద కాళ్లు కడిగిన నీళ్లు తిరిగి స్నానఘాట్లోకి చేరకుండా చేపట్టిన పనులను ఏఈ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈవో శీనానాయక్కు వివరించారు. కృష్ణానది పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
హైడ్రా తరహాలో బుడమేరు ఆపరేషన్ నిర్వహించాలి
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ౖహెదరాబాద్ హైడ్రా తరహాలో నగరంలో బుడమేరు ఆపరేషన్ చేపట్టాలని రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని కోరుతూ ఈ నెల 14న నిరసన దీక్ష చేపట్టాలని సమావేశం తీర్మానించింది. గాంధీనగర్ రామా ఫంక్షన్ హాల్లో శుక్రవారం సీపీఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆపరేషన్ బుడమేరును అమలు పరచాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గతేడాది బుడమేరు వరదల వల్ల విజయవాడ పట్టణంతో సహా పలు గ్రామాలు, పంట పొలాలు దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని నిర్ణయించిందని, కానీ ఏడాది కావస్తున్నా ఆచరణకు నోచుకోలేదన్నారు. బుడమేరు డైవర్షన్ కాల్వ మరమ్మతులు అరకొరగా చేపట్టి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి బుడమేరు ప్రక్షాళన పనులు చేపట్టాలని కోరారు. విశ్రాంత ఇరిగేషన్ అధికారి కంభంపాటి పాపారావు మాట్లాడుతూ బుడమేరు వరద నివారణకు శాశ్వతమైన పరిష్కారాలు చేపట్టడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ పైభాగాన అవసరమైన జలాశయాలు నిర్మించి వరద ముంపును కొంతమేరకు తగ్గించే వీలుంటుందని చెప్పారు. రాయనపాడు నుంచి గుంటుపల్లి మీదుగా కృష్ణానదికి మరొక డైవర్షన్ చానల్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఇఫ్టూ నాయకులు ప్రసాధ్, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఈశ్వరయ్య, జి కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య,విద్యార్థి, యువజన, మహిళా, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ -
విజయవాడ: శాతవాహన కాలేజీని కూల్చేసిన పచ్చ మాఫియా
సాక్షి, విజయవాడ: ప్రొక్లెయిన్లతో శాతవాహన కాలేజీ భవనాలను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. ఇటీవల శాతవాహన కాలేజీ ప్రిన్సిపల్ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపాల్ కిడ్నాప్తో వివాదం మరింత ముదిరింది. తాజాగా బోయపాటి శ్రీనివాస అప్పారావు అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. శాతవాహన కాలేజీ స్థలంలో బోయపాటి శ్రీనివాసరావు.. బోర్డులు ఏర్పాటు చేశారు.కూల్చివేతలపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకుంటున్నారు. కూల్చేసిన శిథిలాల కిందే శాతవాహన కాలేజీ విద్యార్థులకు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని.. శాతవాహన కాలేజీ కూల్చివేతపై ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మండిపడుతోంది.విద్యార్థుల పరిస్థితి ఏంటి?శాతవాహన కాలేజీ భవనాలు కూల్చివేతతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస సమాచారం లేకుండా కూల్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే కళాశాల భవనాలు కూల్చివేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. శాతవాహన కాలేజీకికు దశాబ్ధాల చరిత్ర ఉందని.. కోర్టు ఆదేశాలను సాకుగా చూపి కళాశాల భవనాలు కూల్చేయడం దారుణమన్నారు.విద్యార్థుల భవిష్యత్తు, అధ్యాపకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. సర్టిఫికెట్లు, రికార్డులన్నీ శిథిలాల కిందే ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి?. తక్షణమే ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి లోకేష్ స్పందించాలి. విద్యార్ధులకు న్యాయం చేయాలి’’ అని రవిచంద్ర డిమాండ్ చేశారు. -
దుర్గమ్మ సేవలో మంత్రి వాసంశెట్టి
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం దర్శించుకున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ను ఈవో శీనానాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. కంకిపాడు లాకుల పరిశీలనసెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ ఇంజినీర్ల బృందం గురువారం కృష్ణాజిల్లా కంకిపాడు ఇరిగేషన్ సెక్షన్ను సందర్శించింది. లాకులు శిథిలావస్థకు చేరుకున్నట్లు నిర్ధారించింది.క్లాత్ బ్యాగుల పంపిణీరైల్వేస్టేషన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రయాణికులకు క్లాత్ బ్యాగులను అందజేశారు. -
హరితాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలి
విజయవాడరూరల్: మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యం, కుటుంబ, సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వనమహోత్సవం–2025 కార్యక్రమాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ జక్కంపూడి వద్ద నగర వనంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మొక్కలను నాటారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 29 శాతం గ్రీనరీని స్వర్ణాంధ్ర విజన్ 2047 నాటికి 50 శాతం పెంచేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ మానసిక వికాసానికి యోగాంధ్ర దోహదపడుతున్నట్లే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలను నాటి పచ్చదనం పెంచుదామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 11 శాతం ఉన్న గ్రీనరీని 33 శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అటవీ శాఖ అధికారి జి.సతీష్, డీపీఓ పి.లావణ్యకుమారి, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారావు తదితరులు పాల్గొన్నారు. చెట్లతోనే మానవాళికి మనుగడ: మంత్రి సవిత పెనమలూరు: చెట్లతోనే మానవాళి మనుగడ సాధ్యమని, హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కోటి మొక్కలు నాటుతున్నామని బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దిపోత్సవం సందర్భంగా గురువారం పోరంకిలో మంత్రి మొక్క నాటి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్కు అందరూ దూరంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచి హరితాంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తామని తెలిపారు. అనంతరం చెట్ల పెంపకంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
● ఏడాదిలో దిగజారిన వైద్య సేవలు ● పల్లెల్లో వైద్యం మిథ్య ● కుయ్యో.. మొర్రో అంటున్న 108 వాహనాలు ● ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్లకు బ్రేక్ ● గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం
రోగుల బారులు.. విజయవాడ జీజీహెచ్లో మందుల కోసం క్యూ కట్టిన రోగులు(ఫైల్)దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమానికి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది. మారుమూల గ్రామాలకు సైతం 104 వాహనంలో కుటుంబ డాక్టర్(ఫ్యామిలీ ఫిజీషియన్) కార్యక్రమం ద్వారా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి వైద్య సేవలు అందించే వారు. ఇప్పుడు అవి పడకేశాయి. గతంలో ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్ చేసి, ఎంపిక చేసిన తేదీల్లో కచ్చితంగా వైద్యులు, సిబ్బంది వెళ్లి సేవలు అందించేవారు. నడవలేని స్థితిలో మంచాన ఉన్న రోగుల ఇళ్లకే వెళ్లి వైద్యులు చూసేవారు. ఇప్పుడు అవేమి లేవు. గ్రామాల్లో ఉండే విలేజ్ హెల్త్ క్లినిక్లు సైతం నిర్వీర్యమయ్యాయి. దేశంలోనే తొలిసారిగా గత ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా స్పెషలిస్టు వైద్యులనే గ్రామాలకు పంపించి వైద్య పరీక్షలు చేసి ప్రజలకు భరోసా కల్పించింది. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, జనరల్ సర్జరీ ఇలా పలు విభాగాలకు చెందిన వైద్యులు గ్రామాలకే వెళ్లి సేవలు అందించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉంటే మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్కు తరలించేవారు. ఆ రోగి జీజీహెచ్కు వెళ్లి చికిత్స పొంది డిశ్చార్జి అయ్యే వరకూ ఆరోగ్య సిబ్బంది ఫాలో అప్ చేస్తూ ఉండేవారు. అంతేకాక ఆ శిబిరాల్లో అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించేవారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హైపోథైరాయిడ్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ నేడు ఆ కార్యక్రమం నిలిచిపోయింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు మందులు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.గత ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రికి వెళ్తే నాణ్యమైన సేవలు అందుతాయనే నమ్మకం కలిగించారు. ప్రస్తుతం ఆ నమ్మకం సన్నగిల్లింది. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండటం లేదు. రక్తపరీక్షలు సైతం ప్రైవేటు ల్యాబ్స్లో చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుండె ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేసిన ఆధునిక ఆపరేషన్ థియేటర్ నిరుపయోగంగా మారింది. పక్షవాతం రోగులను చూసే న్యూరాలజీ విభాగంలో ప్రొఫెసర్ లేని పరిస్థితి నెలకొంది. ప్రతి సూపర్స్పెషాలిటీ విభాగంలోనూ వైద్యుల కొరత వేధిస్తోంది. దీంతో గతంలో నిత్యం 3,200 నుంచి 3,500 వరకూ వచ్చే ఓపీ రోగులు నేడు 2,600లకు తగ్గారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని మళ్లీ గుంటూరుకు పంపించేస్తున్నారు. నిలిచిన నిర్మాణాలు.. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటు, ప్రభుత్వాస్పత్రిలో రోగులకు నాణ్యమైన సేవలు అందేలా పలు నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నాడు–నేడు పథకంలో రూ.170 కోట్లతో పలు భవన నిర్మాణాలు ప్రారంభమై 40 శాతంపైగా పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని కుట్రపూరితంగా నిలిపివేసింది. అత్యాధునిక క్యాజువాలిటీ నిర్మాణం 80 శాతం పనులు పూర్తి చేసుకున్నా దానిని నిలిపేశారు. ఇంటికి రానంటున్న ‘ఫ్యామిలీ డాక్టర్’ ఆరోగ్య సురక్షకు మంగళం.. పెద్దాస్పత్రిపై నమ్మకం పోయింది.. -
పెరిగిన దుర్గమ్మ హుండీ కానుకల ఆదాయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, వివాహ సుముహూర్తాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల హుండీ కానుకల ఆదాయం గణనీయంగా పెరిగింది. 22 రోజులకు గాను రూ. 4.11 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను గురువారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 22 రోజులకు గాను రూ. 4,11,96,190 నగదు, 394 గ్రాముల బంగారం, 8.010 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. కానుకల లెక్కింపును ఈవోతో పాటు దేవదాయ శాఖ అధికారులు పర్యవేక్షించగా, సేవా సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు.ఫిషింగ్ హార్బర్ సందర్శనమచిలీపట్నంటౌన్: నగర శివారులోని గిలకలదిండి సముద్ర తీరాన నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్పర్ను వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం సందర్శించారు. రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్, కార్పోరేటర్ తిరుమలశెట్టి వరప్రసాద్ తదితరులు ప్రత్యేక మర పడవలో ప్రయాణించి హార్బర్ను సందర్శించారు.పాఠ్యపుస్తకాలను పరిశీలించిన అబ్జర్వర్లునున్న(విజయవాడ రూరల్): నున్న గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్ స్టాక్ పాయింట్లోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కిట్ల రాష్ట్ర పరిశీలకులు ఎ.కృష్ణమోహన్, జిల్లా సీఎంఓ ఎన్.చంద్రశేఖర్, ఐఈడీ కోఆర్డినేటర్ ఎల్. వెంకటేశ్వరరావు పరిశీలించారు. పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు విద్యార్థి కిట్లు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, డిక్షనరీలు వచ్చాయని చెప్పారు.16 మందికి హెడ్ నర్సులుగా ఉద్యోగోన్నతిగుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్ నర్సులుగా పని చేస్తున్న 16 మందికి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించి హెడ్ నర్సులుగా ప్రమోషన్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు ప్రాంతీ య వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్కు 17 మంది స్టాఫ్ నర్సులను ప్రమోషన్ కోసం పిలవగా, ఒకరు ప్రమోషన్ వద్దని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రమోషన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో ఎనిమిది మంది, ఒంగోలు జీజీహెచ్లో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు హెడ్ నర్సులుగా చేరారు. సుమారు ఆరు నెలలుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ సిబ్బంది ఎట్టకేలకు కౌన్సెలింగ్ జరగడంతో నర్సింగ్ యూనియన్ నేతలతో కలిసి గురువారం మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్రాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీతోపాటు, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ షేక్ నాగూర్ షరీఫ్, సీనియర్ అసిస్టెంట్ సుబ్బారావు పాల్గొన్నారు. ఆర్డీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సునీత, అరుణ ఉన్నారు. -
మందులు సరిగా ఇవ్వడం లేదు..
ప్రభుత్వాస్పత్రుల్లో సరిగా మందులు కూడా ఇవ్వడం లేదు. గత ప్రభుత్వంలో ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి కాలనీలకే వచ్చి వైద్యుల పరీక్షలు జరపడంతో పాటు, అవసరమైన మందులు అన్నీ ఇచ్చే వాళ్లు. ఇప్పుడు సుగర్, బీపీ మందులు కావాలంటే ప్రభుత్వాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ గతంలో నెల రోజులకు ఇచ్చే వారు. ఇప్పుడు పదిహేను రోజులకు ఇవ్వడంతో నెలలో రెండు సార్లు ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – కె. విజయలక్ష్మి, ఏపీఐఐసీ కాలనీ, విజయవాడ -
రేపు ఐజీఎంసీ స్టేడియంలో బక్రీద్ నమాజు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వుుస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఎంజీరోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం(ఐజీఎంసీ)లో సామూహిక ఈదుల్ అజ్హా నమాజ్(బక్రీద్ నమాజు) నిర్వహిస్తున్నట్లు ఈద్ కమిటీ ప్రధాన కార్యదర్శి మునీర్ అహ్మద్ షేక్ తెలిపారు. గురువారం నమాజు నిర్వహించే ప్రాంగణంలో సామూహిక నమాజు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రవక్త మహ్మద్ సంప్రదాయం ప్రకారం ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో బక్రీద్ నమాజును ఏటా మాదిరిగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందు కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రసంగం, 7.30 గంటలకు ఈద్నమాజు ప్రారంభం అవుతుందన్నారు. సభ్యులు ఎండీ ఇర్ఫాన్, ఎండీ అన్వర్ పాషా, షేక్ వలీ, మఖ్బూల్ అహ్మద్ నద్వీ, ముక్తార్ అలీ, సయ్యద్ అలీమ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య కార్యక్రమాలేవి..
గత ప్రభుత్వంలో ఫ్యామిలీ ఫిజీషియన్, ఆరోగ్య సురక్ష పేరుతో నిత్యం వైద్యులు, స్పెషలిస్టు వైద్యులు గ్రామాల్లోనే ఉండేవారు. రోగులకు పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చేవాళ్లు. మంచంలో ఉన్న వారిని గుర్తించి వారి వద్దకే వెళ్లి పరీక్షలు చేసే వారు. ఇప్పుడు అవన్నీ నిలిచి పోయాయి. రోగులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. – చల్లా సుశీల షేర్ మహ్మద్ పేట, జగ్గయ్యపేట మండలం -
జీవితానికి యోగా తోడైతే అంతా ఆనందమే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జీవితానికి యోగా తోడైతే అంతా ఆనందమయమేనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. గురువారం విజయవాడ బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. విద్యార్థులు, పరిశ్రమల ప్రతినిధులు, యోగా ఔత్సాహికులు తదితరులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శరీరంలో కొత్త ఉత్సాహాన్ని నింపే యోగాసనాలను ప్రతిఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించేందుకు యోగాంధ్ర మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యానికి యోగాసనాల అభ్యసన ఎంత ముఖ్యమో పర్యవరణానికి మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి సంస్థలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటుదామన్నారు. హరిత విస్తీర్ణం పెంచుదాం.. ప్రజలు, అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో పెద్దఎత్తున మొక్కలు నాటి హరిత విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర@2047 లక్ష్యాల సాధనకు బాటలు వేస్తాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈఈ పి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, వన్ ఎర్త్–వన్ లైఫ్ ప్రతినిధులు ఏలూరి లీలా కుమారి, ఆయుష్ అధికారులు, రామ్కో, కేసీపీ, అల్ట్రాటెక్, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్, ఐడీఏ కొండపల్లి, ఐడీఏ జగ్గయ్యపేట ప్రతినిధులు, నర్సింగ్ విద్యార్థినులు తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ఇంద్రకీలాద్రిపై నవగ్రహ పునఃప్రతిష్ట
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఉదయం మండప పూజలు, మూలమంత్ర హవనం, అధివాసాలు వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం నవగ్రహ ప్రతిష్ట నిమ్తితం అవసరమైన యంత్రాలను ఆలయ అర్చకులు, వేద పండితులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ మల్లేశ్వరాలయానికి ఊరేగింపుగా తీసుకు రాగా, కార్యక్రమంలో ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో 7–52 గంటలకు నవగ్రహ పునఃప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట జరిగింది. అనంతరం నూతన యాగశాలలో మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్డీ. ప్రసాద్, కోట ప్రసాద్ , మల్లేశ్వర శాస్త్రిలు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించగా, ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం వేద ఆశీర్వచనం, ప్రసాద వితరణ జరిగాయి. శుక్రవారం నుంచి నవగ్రహ మండపంలోని భక్తులను అనుమతించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. కంకిపాడు లాకులను పరిశీలించిన ఇంజనీర్ల బృందం కంకిపాడు: సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్స్ ఇంజనీర్ల బృందం గురువారం కృష్ణాజిల్లా కంకిపాడు ఇరిగేషన్ సెక్షన్ను సందర్శించింది. ఇరువురు ఈఈల నేత్వత్వంలో పది మంది ఇంజనీర్ల బృందం కంకిపాడు లాకులు, అనుబంధ కాలువల లాకులు, గేట్లు, వాటి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు సేకరించారు. లాకులు పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరుకున్నట్లు బృందం నిర్ధారించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా లాకులు నమూనాలను రూపొందించి పంపుతామని వెల్లడించింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కాలువల పరిస్థితి, సాగు విస్తీర్ణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పరిశీలనలో ఇరిగేషన్ శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ ఈఈ ఆర్.రవికిరణ్, మచిలీపట్నం డీఈ అపర్ణ, కంకిపాడు ఏఈ టీ.నాగబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘హద్దులు’ దాటుతున్న దందా..
ఎన్టీఆర్ జిల్లాలో అధికారికంగా ఎనిమిది రీచ్లకు అనుమతులున్నారు. అయితే పార్లమెంటు ప్రజా ప్రతినిధి చక్రం తిప్పి కేవలం చందర్లపాడు మండలం కాసరబాద, కంచికచర్ల మండలం వేములపల్లి రీచ్ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. దీంతో పాటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి మండలంలో ఆలూరుపాడులో ఇసుక రీచ్ సైతం ఈయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి పార్లమెంటు ప్రజా ప్రతినిధి, ఈ ఇసుక రీచ్లను తన కనుసన్నల్లో ఉంచుకొని, లారీకి రూ.10వేల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. భారీగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమంగా తరలించి దోపిడీ చేస్తున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు సైతం తమకేమి పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ‘చినబాబు’ అండదండలు ఉండటంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. పేరుకే ప్రభుత్వం ఉచిత ఇసుక అని ఊదరగొడుతున్నా, సామాన్యునికి అందుబాటులో లేదని, ట్రాక్టర్కు ఇసుక లోడ్ చేయాలన్నా, డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జిల్లాలో 2.60 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఈ ఏడాది వన మహోత్సవం సందర్భంగా 2.60 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనంతో కళకళలాడుతూ జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ను తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఆధ్వర్యంలో నగరంలోని సత్యనారాయణపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు కారణం వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడమేనన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని సూచించారు. భూమిపైనే కాక భవనాలపై మిద్దెతోటలను పెంచితే నగరాన్ని కాలుష్యం కోరలు నుంచి కాపాడుకోగలుగుతామన్నారు. మొక్కలు నాటి సంరక్షించేందుకు ముందుకు వచ్చే ప్రతిఒక్కరికీ అవసరమైన మొక్కలను అందించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంటుందన్నారు. ర్యాలీలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఈఈ పి.శ్రీనివాస్, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, సేఫ్ ఎన్విరాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెలగపూడి వెంకటేశ్వరరావు, వన్ ఎర్త్–వన్ లైఫ్ ప్రతినిధి ఏలూరి లీలా కుమారి, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ -
రసవత్తరం... చదరంగ సమరం
విజయవాడస్పోర్ట్స్: ఆంధ్రా చెస్ అసోసియేషన్, స్కాట్స్ పైన్ స్కూల్, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న చదరంగం క్రీడా సంబరాలు గురువారం రసవత్తంగా సాగాయి. రాష్ట్రంలోని 100 క్రీడాకారులను గ్రాండ్ మాస్టర్లుగా తీర్చిదిద్దేందుకు నిర్వహించిన ఉచిత గ్రాండ్ మాస్టర్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవాడ శివారు కానూరులోని స్కాట్స్పైన్ స్కూల్లో ఈ నెల రెండో తేదీన ప్రారంభించారు. రాష్ట్ర క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ఇండియా 11వ గ్రాండ్ మాస్టర్ తేజస్ బక్రి (గుజరాత్) ఒకే సారి 100 మంది క్రీడాకారులతో చదరంగం క్రీడలో పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వరామంగా ఈ పోటీ కొనసాగింది. టాప్ రేటింగ్ క్రీడాకారులు కొల్ల భావన్(ఎన్టీఆర్ జిల్లా), కె.సందీప్ (కృష్ణా జిల్లా), సి.హెచ్.అనయ్య (రాజమండ్రి), వి.హర్షవర్ధన్ (నంద్యాల)తో పాటు 1600 నుంచి 1800 లోపు రేటింగ్ ఉన్న క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనటంతో పోటీ హోరాహోరీగా సాగింది. చదరంగ క్రీడాకారులను తయారు చేసేందుకు వినూత్న పద్ధతులను అవలంభిస్తున్న ఆంధ్రా చెస్ అసోసియేషన్ను, సహకరిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని బక్రి అభినందించారు. ఈ సమావేశంలో స్కూల్ ప్రిన్సిపాల్ చలసాని ప్రతిమ, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ ప్రతినిధి సాయిపావని, ఆంధ్రా చెస్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్.ఎం.ఫణికుమార్ పాల్గొన్నారు. -
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నివారిద్దాం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ పిలుపునిచ్చారు. ప్రంపచ పర్యవవరణ దినోత్సవాన్ని పురష్కరించుకుని గురువారం విజయవాడ డివిజన్ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేట్టారు. ఈ సందర్భంగా అధికారులు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వచ్చంద సంస్ధల వలంటీర్లతో కలసి డీఆర్ఎం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా బ్యానర్లు, ప్లాకార్డులతో క్లాక్ టవర్ నుంచి 1వ నెంబర్ ప్లాట్ఫాం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ వెయిటింగ్ హాల్ వద్ద పర్యావరణ హానికర ప్రభావాలను కళ్లకు కట్టినట్టుగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ప్రదర్శన ఆలోచింపజేసింది. అనంతరం డీఆర్ఎం మాట్లాడుతూ పర్యావరణ లక్ష్యాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చందగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రయాణికులకు క్లాత్ బ్యాగులను అందజేశారు. అనంతరం కృష్ణా కెనాల్లోని శిక్షణ కేంద్రంలో సిబ్బందితో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సీనియర్ డీఈహెచ్ఎం ఎం.కిషోర్, సీనియర్ డీఈ ఎస్.వరుణ్బాబులను ఆయన అభినందించారు. డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ -
కేడీసీసీబీని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణాజిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ (కేడీసీసీ) బ్యాంక్ను మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్(చిన్ని) ఆకాంక్షించారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా నియమితులైన నెట్టెం రఘురామ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన కేశినేని శివనాధ్ మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ పదవి ఆయనకు అలంకారం మాత్రమేనని, ఎందుకంటే గతంలోనే ఎన్నో పదవులు నిర్వర్తించి వివాద రహిత వ్యక్తిగా నిలిచారని అన్నారు. తన సుదీర్ఘ అనుభవంతో బ్యాంక్ను మరింత వృద్ధిలోకి తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్రావు, శ్రీరాం రాజగోపాల్, కొలికపూడి శ్రీనివాసరావు, నాగుల్మీరా తదితరులు పాల్గొని నెట్టెం రఘురామ్ను అభినందించారు. ఈ సందర్భంగా నెట్టెం రఘరామ్ మాట్లాడతూ బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ -
వక్ఫ్ భూములకు న్యాయం జరిగేనా..?
పెనమలూరు: కొండపల్లి ఖాజీకి చెందిన వక్ఫ్ భూములకు మోక్షం లభిస్తుందనే ఆశతో ముస్లిం మైనార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. గత 25 ఏళ్లుగా వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేసిన ఆక్రమణదారులు నయాపైసా కౌలు చెల్లించక పోవటంతో పేద ముస్లింల సఃక్షేమం జరగలేదు. సుదీర్ణ పోరాటం తరువాత ఈ నెల 11వ తేదీన వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయనున్నారు. కొండపల్లి ఖాజీ సర్వీస్ ఇనామ్ భూములు వక్ఫ్ పరిధిలో ఉన్నాయి. పెదపులిపాక గ్రామం ఆర్ఎస్ నెంబర్ 87లో 12.59 ఎకరాలు, తాడిగడప గ్రామంలో ఆర్ ఎస్ నెంబర్ 79లో 13.41 ఎకరాలు, 173లో 4.08 ఎకరాలు, 176లో 12.92 ఎకరాలు కలిపి మొత్తం 43 ఎకరాలు భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో భూముల ధర రూ.300 కోట్లకు పై మాటే. 43 ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమించి సాగు చేస్తున్న వారు ఖాజీకి గాని, వక్ఫ్ బోర్డుకు గాని నయాపైసా కౌలు చెల్లించలేదు. దీంతో పేద ముస్లింలకు న్యాయం జరగలేదు. దీనిపై వక్ఫ్ బోర్డు, కొండపల్లి ఖాజీ పోరాట బాట పట్టారు. హైకోర్టు కూడా వక్ఫ్ భూములకు కౌలు వేలం వేయాలని ఆదేశించింది. వేలం నిర్వహించాల్సిన రెవెన్యూ అధికారులు జాప్యం చేశారు. చివరకు ప్రభుత్వం కూడా ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించే యత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన పెనమలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూములకు కౌలు వేలంపాట నిర్వహించనున్నారు. వేలం నగదు రూపంలో ముందుగానే చెల్లించాలి. పాటదారులు రూ 50 వేలు డిపాజిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఆక్రమణదారుల చెరలో భూములు న్యాయం కోసం ఎదురు చూస్తున్న పేద ముస్లింలు ఈ నెల 11వ వేలం పాట -
కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. మండలంలోని కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఈప్రమాదం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో రాజమండ్రి వెల్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కిలేశపురం వద్ద నందిగామ నుంచి మచిలీపట్నం వెళ్తున్న కారును ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని కారు ఢీకొట్టడంతో రెండు వాహనాల మద్య కారు ఇరుక్కు పోయింది. కారులో ఉన్న నందిగామకు చెందిన ఆదిశేషు, పుష్పావతి వారి కుమారుడు సాయి శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. కుమార్తె హర్షిత, డ్రైవర్ రాంబాబుకు పెద్దగా గాయాలు కాలేదు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద వివరాలు సేకరించారు. బస్సును పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు నిలిపిన మూడు బైకులను బస్సు డ్రైవర్ ఢీకొట్టి మరో ప్రమాదానికి కారణమయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తవ్వుకో తమ్ముడూ!
● ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆగని ఇసుక దందా ● లారీకి రూ.10వేలు కడితేనే లోడింగ్ ● నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దోపిడీ ● తెలంగాణకు అక్రమంగా తరలింపు ● పార్లమెంట్ ప్రజాప్రతినిధి అనుచరుల అండతోనే అంతా ● పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు ● ఇసుక దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఉచిత ఇసుక పేరుతో సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులే ఇసుక రీచ్లను గుప్పెట్లో పెట్టుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇసుక రీచ్లో లారీకి రూ.7 నుంచి రూ.10 వేలు చెల్లిస్తేనే లోడింగ్ చేస్తున్నారు. లారీకి 40 టన్నుల చొప్పున ఇసుకను ఓవర్ లోడ్ చేసి తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా రోజుకు వందల లారీల ఇసుకను అక్రమ రవాణా చేస్తూ జిల్లా సరిహద్దులు దాటించి కోట్ల రూపాయలు దండుకొంటున్నారు. టీడీపీ నేతలు చేసే దోపిడీకి మైనింగ్, రెవెన్యూ, పోలీసులు అధికారులు దగ్గరుండి పచ్చ జెండా ఊపుతున్నారు. రీచ్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టామని, డ్రోన్లతో పర్యవేక్షణ చేస్తున్నామని, టోల్గేట్ల వద్ద నిఘా పెట్టామని అధికారులు గొప్పలు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే, ఇవన్నీ బూటకపు మాటలేనని స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్లు ఉన్నా ప్రాంతాల ప్రజలను ఎవ్వరినీ కదిపినా అక్కడ జరిగే దందాను కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. పేరుకు ఉచిత ఇసుక అని చెప్పడం తప్ప, రీచ్ వద్ద మాత్రం వారి చెప్పినంతా డబ్బు కట్టాల్సిందేనని వివరిస్తున్నారు. లేకపోతే వారికి ఇసుక లోడింగ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నట్లు వాపోతున్నారు. కొంత మంది ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. పక్కదారిలో పక్క రాష్ట్రానికి.. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంత ఇసుకకు తెలంగాణాలో భారీ డిమాండ్ ఉంది. మునేరు, కృష్ణానది ఇసుకకు మంచి ధర లభిస్తోంది. లారీ ఇసుక ధర ఖమ్మం తదితర ప్రాంతాల్లో రూ. 75వేలు ఉండగా హైదరాబాద్లో రూ. లక్ష వరకు పలుకుతోంది. దీంతో టీడీపీ నాయకులు ఆయా ప్రాంతాలకు ఇసుకను తరలించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.. ఆపేదెవరూ.. అడ్డొచ్చేదెవరు?కృష్ణా జిల్లాలో అడ్డూ అదుపూ లేకుండా.. కృష్ణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇక్కడ ఉన్న రీచ్లను కూటమి ప్రజా ప్రతినిధులు పంచుకున్నారు. పెనమలూరులోని చోడవరం రీచ్ నుంచి అనధికారికంగా నియోజక వర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో రోజుకు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారు. లారీ లోడింగ్కు రూ.8వేలకు పైగా వసూలు చేస్తున్నారు. రొయ్యూరు ఇసుక రీచ్ నుంచి గుడివాడకు చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి, మచిలీపట్నం పార్లమెంటు ప్రజాప్రతినిధి, రోజుకు వందల లారీలను పోర్టు పనులకు తరలిస్తున్నారు. ఈ రీచ్ను వీరికి చెందిన బినామీ సంస్థే దక్కించుకోవడం గమనార్హం. పామర్రు నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన బినామీ సంస్థకు నార్తు వల్లూరు ఇసుక రీచ్ వచ్చింది. ఈ రీచ్ను ఇప్పటికే ప్రతి రోజు ఎలాంటి అనుమతులు లేకుండా రోజుకు 300కు పైగా లారీల ఇసుకను అక్రమంగా తరలించి, కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. లంకపల్లి ఇసుక రీచ్ను ఓ మంత్రికి చెందిన బినామీ సంస్థ దక్కించుకొంది. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్లన్నింటినీ పచ్చనేతలు తమ కనుసన్నల్లో ఉంచుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీంతో పాటు చాగంటివారిపాలెం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే రోజుకు 200 లారీలకు పైగా ఇసుకను తరలిస్తున్నారు. -
ఏటీవీఎంల వినియోగంలో విజయవాడ ముందంజ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): డిజిటల్ టికెటింగ్ను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఏటీవీఎంల వినియోగంలో విజయవాడ డివిజన్ ముందంజలో ఉందని డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. గత 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏటీవీఎంల (ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్) ద్వారా రూ.78 లక్షలు ఆదాయం సాధించినట్లు తెలిపారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా 29 ప్రధాన రైల్వేస్టేషన్లలో 72 ఏటీవీఎం మిషన్లు అందుబాటులో ఉంచినట్లు, ఈ మిషన్ల వినియోగంలో ప్రయాణికులకు సహాయం చేసేందుకు 92 మంది ఫెసిలిటేటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల 41 లక్షల 51 వేల 165 అన్రిజర్వ్డ్ టికెట్ల విక్రయాలలో 33 శాతం ఏటీవీఎం మిషన్ల ద్వారా రూ.78 లక్షల 19వేల 581 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఏటీవీఎంల వినియోగాన్ని విజయవంతం చేయడం పట్ల ప్రయాణికులు, సిబ్బందిని డీఆర్ఎం అభినందించారు. ఏటీవీఎంల వినియోగంతో ప్రయాణికులు రద్దీ సమయంలో అన్రిజర్వ్డ్, ప్లాట్ఫాం, సీజన్ టికెట్ల కోసం ఎక్కువసేపు క్యూలైన్లో వేచి ఉండే అవసరం ఉండదన్నారు. రానున్న రోజుల్లో డివిజన్ వ్యాప్తంగా అన్ని స్టేషన్లలోను ఏటీవీఎం మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. -
జీవనోపాధి అవకాశాల మెరుగునకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధి అవకాశాల మెరుగుదలకు కృషి చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్ర శక్తి, సీఐఎఫ్, ముద్ర, పీఎంఈజీపీ, ఎంఎస్ఎంఈ వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికీ వెళ్లి అర్హులు తగిన వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంక్ లింక్డ్ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఆయా పథకాలకు గుర్తించిన లబ్ధిదారులకు చెందిన యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే వ్యాపారాలు చేసుకుంటున్న వారికి మరింత రుణ సదుపాయం కల్పించేలా కృషి చేయాలన్నారు. మహిళలకు వ్యాపార మెలకువలు.. కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు వ్యాపార మెలకువలపై శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాల మార్గాలను చూపాలని, ముఖ్యంగా ఆన్లైన్ విధానంలో తమ ఉత్పత్తులను ఎలా అమ్ముకోవాలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో మహిళ తరఫున ఆమె భర్త లేదా కొడుకు వ్యాపారం చేసుకునేందుకు ముందు కొచ్చినా పరిగణనలోకి తీసుకొని సహకారం అందించాలన్నారు. చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ద్వారా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు అవగాహన కల్పించాలని, వారి ఎదుగుదలతో ఇతరులకు ఉపాధి కల్పించిన వారవుతారని వివరించారు. డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షాహిద్ బాబు తదితరులు పాల్గొన్నారు.కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ఇంతకూ బీచ్ ఫెస్ట్ నేటి నుంచా..రేపటి నుంచా?
మంగినపూడి బీచ్ ఫెస్ట్ ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండు విధాలుగా ప్రచారం చేస్తుండటంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. నగరంలోని లక్ష్మీటాకీస్ సెంటర్లో బీచ్రోడ్లో ఏర్పాటు చేసిన స్వాగత ద్వారానికి బీచ్ఫెస్ట్ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విడుదల చేస్తున్న ప్రకటనలు, కరపత్రాల్లో ఈ నెల 5వ తేదీ గురువారం నుంచే ప్రారంభమవుతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుదాం అనుకునే వారు ప్రారంభ తేదీని నిర్వాహకులు రెండుగా పేర్కొంటుండటంతో గందరగోళ పడుతున్నారు. –మచిలీపట్నంటౌన్ -
40 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
కృష్ణలంక(విజయవాడతూర్పు): అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న పీడీఎస్(రేషన్) బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. విజయవాడ సర్కిల్–2 ఏఎస్వో శ్రీనివాసులుకు అందిన పక్కా సమాచారం మేరకు మంగళవారం రాత్రి ఆయన కృష్ణలంకలోని నెహ్రూనగర్ డొంకరోడ్డులో ఉన్న వ్యాన్ను తనిఖీ చేశారు. కృష్ణలంకకు చెందిన వ్యాన్ యజమాని సుబ్బారావును పిలిపించి వ్యాన్ను తెరిచి చూడగా అందులో ఒక్కొక్కటి 50 కేజీల చొప్పున 40 బస్తాల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడ నుంచి తరలిస్తున్నారని సుబ్బారావును ప్రశ్నించగా కృష్ణలంక, ద్వారకానగర్లోని ఒక రేషన్ డిపో నుంచి తరలిస్తున్నట్లు అంగీకరించాడు. వెంటనే వ్యాన్ను స్వాధీనం చేసుకుని కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. వ్యాన్ను సీజ్ చేసి రేషన్ డిపో డీలర్ కృష్ణమూర్తి, సుబ్బారావులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విరివిగా మొక్కలు నాటాలి చిలకలపూడిమచిలీపట్నం): విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం ఆయన వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువారం జిల్లా వ్యాప్తంగా 2.92 లక్షల మొక్కలను నాటే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వివిధ సంక్షేమ శాఖ వసతి గృహాల ఆవరణల్లో మొక్కలు నాటాలని సూచించారు. డ్వామా పీడీ ఎన్వీ శివ ప్రసాద్ యాదవ్, జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ ఇరువురు సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే ప్రక్రియను చేపట్టాలన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జి.కొండూరు: బైకుపై వెళ్తూ గేదెను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా తాడికొండ మండలం దామరపల్లికి చెందిన వీసా రాజేష్(26) గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులను చూసేందుకు సొంత గ్రామానికి వెళ్లిన రాజేష్, తిరుగు ప్రయాణంలో మైలవరం వైపు వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జి.కొండూరు శివారులోకి రాగానే 30వ నంబరు జాతీయ రహదారిపై గేదెను ఢీకొని కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్ని జి.కొండూరు పోలీసులు 108 అంబులెన్స్లో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ బుధవారం ఉదయం మృతి చెందాడు. చీకట్లో గేదె కనిపించక... రహదారిపై గేదెను భారీ వాహనం ఢీకొట్టడంతో గేదె మృతి చెంది రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో అటుగా బైకుపై వస్తున్న రాజేష్కు రోడ్డుపై మృతి చెందిన గేదె చీకట్లో కనిపించక ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి వీసా భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు. గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్ తిరువూరు: సీలేరు నుంచి విజయవాడకు ద్విచక్రవాహనంపై గంజాయి తరలిస్తూ ముగ్గురు యువకులు బుధవారం తిరువూరు పోలీసులకు పట్టుబడ్డారు. తిరువూరు మండలం లక్ష్మీపురానికి చెందిన మద్దిరాల లోకేష్, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన వంశీ మరో మైనర్ బాలుడితో కలసి 8 కిలోల గంజాయిని ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా, తిరువూరు సమీపంలోని ముత్తగూడెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సెక్టార్–1 ఎస్ఐ సత్యనారాయణకు పట్టుబడ్డారు. తహసీల్దారు లక్ష్మి సమక్షంలో పంచనామా అనంతరం మైనర్ బాలుడిని విజయవాడలోని జువైనల్ హోంకు తరలించి, ఇరువురు యువకులను అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపరచినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మేజిస్ట్రేట్ ఆదేశించారని చెప్పారు. హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరు గ్రామంలో గత ఏప్రిల్ నెలలో జరిగిన హత్య కేసులో పోలీసులు ప్రధాన నిందతుడిని బుధవారం అరెస్టు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు మహిళా మండలి కాల్వ కట్టపై దేరంగుల పిచ్చయ్య(40) నివసిస్తున్నాడు. అతని భార్య అతనిని వదిలేయటంతో ఇంటి పక్కన ఉండే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న తనతో ఉన్న మహిళపై పిచ్చియ్య దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న మహిళ బంధువు వేల్పుల రమణ అలియాస్ అఖిల్ తనతో పని చేసే బిహార్కు చెందిన ముగ్గురు వ్యక్తులతో ఆటోలో వచ్చి పిచ్చయ్యపై విచక్షాణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన పిచ్చయ్యను ఆస్పత్రిలో చికిత్సకు చేర్చారు. పోలీసులు ఈ ఘటనపై దాడి కేసు నమోదు చేసి నిందితులకు బెయిల్ ఇచ్చి వదిలేశారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య ఏప్రిల్ 25న మృతి చెందాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ఈ సమాచారం తెలిసి బెయిల్లో ఉన్న నిందితులు పరారయ్యారు. కేసులో ప్రధాన నిందితుడు అఖిల్ గన్నవరం మండలం చలుపలవారిగూడెంకు చెందిన వాడు కాగా, మిగతా ముగ్గురు బిహార్కు చెందిన వారు. గత నెలరోజులకు పైగా పోలీసుల గాలింపులో అఖిల్ను పోలీసులు ఎట్టకేలకు బుధవారం అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఉన్న బిహార్కు చెందిన ముగ్గురి ఆచూకీ మాత్రం తెలియలేదు. ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కుండల తయారీ పేరుతో మట్టి అక్రమ రవాణా
జి.కొండూరు: టీడీపీ నాయకులు మట్టి అక్రమ రవాణా కోసం వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరు జువ్వి చెరువులో మట్టిని రైతుల పొలాలకు మెరక పేరుతో అనుమతులు పొంది ఇటుక బట్టీలకు తరలించిన ఘటన మరవక ముందే జి.కొండూరు మండల పరిధి కోడూరు ఎర్ర చెరువులో మట్టిని కుమ్మరులకు కుండల తయారు చేసే పేరుతో ఇటుక బట్టీలకు తరలిస్తున్న ఘటన బుధవారం వెలుగుచూసింది. వివరాలలోకి వెళ్తే...కోడూరు ఎర్రచెరువు నుంచి మైలవరం మండల పరిధి గణపవరం గ్రామంలో కుండలు తయారు చేసే కుమ్మరులకు మట్టి తరలిస్తున్నామంటూ స్థానిక టీడీపీ నాయకులు బుధవారం ఉదయం మట్టి అక్రమ రవాణాకు తెరలేపారు. కుమ్మరులకు అవసరమైన మట్టిని తరలించిన అనంతరం ఆ పక్కనే ఉన్న ఇటుక బట్టీలకు మట్టిని తరలించడం ప్రారంభించారు. ఈ తవ్వకాల కోసం రెండు పొక్లెయిన్లు, వంద ట్రాక్టర్లతో మట్టి రవాణా చేస్తుండడంతో కోడూరు, గణపవరం గ్రామాలలో రహదారిపై దుమ్ము లేచిపోయి గ్రామస్తులు కొద్ది గంటల సేపు నరకయాతన అనుభవించారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒకదాని వెంట ఒకటి మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తున్న క్రమంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మట్టి తవ్వకాల సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తవ్వకాలను నిలిపివేశారు. దీనిపై ఎస్ఐ సతీష్కుమార్ని వివరణ కోరగా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలను కొనసాగిస్తున్నందున అడ్డుకున్నామన్నారు. -
యోగాసనాల సాధనతో శరీరానికి కొత్త శక్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): యోగాసనాల సాధనతో శరీరానికి, మనసుకు కొత్త శక్తి వస్తుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల్లో భాగంగా 15వ రోజు బుధవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ సైనికోద్యోగులు, పెన్షనర్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపద అయిన యోగాను నేడు ప్రపంచమంతా అనుసరిస్తోందని, ఇది మన దేశానికి గర్వకారణమని అన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఒత్తిడితో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల అభ్యసన ముఖ్యమన్నారు. జూన్ 21 నాటికి జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాదిమంది శిక్షకులను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రతిరోజూ ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో...జిల్లా ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలిసీ తెలియని వయసులో కొందరు యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారని, వారిని అలాంటి దురలవాట్ల నుంచి దూరం చేసేందుకు, డ్రగ్స్ రహిత రాష్ట్రం సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘ఈగల్ టీం (టోల్ఫ్రీ నంబరు 1972)కు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. మత్తుపదార్థాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని, డ్రగ్స్ను సమాజం నుంచి దూరం చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరించి చేయీచేయీ కలిపి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా సైనిక సంక్షేమ అధికారి కళ్యాణవీణ.కె, మాజీ సైనికుడు జగన్మోహన్, మాజీ సైనిక సంక్షేమ సంఘాలకు చెందిన సుబేదార్ కె.కె.నరసింహారావు(రిటైర్డ్), నాయబ్ సుబేదార్ మోటూరి శంకర రావు(రిటైర్డ్), ఈగల్ ఇన్స్పెక్టర్ టి.ధనుంజయనాయుడు, డీఎంహెచ్వో ఎం.సుహాసిని, కాలుష్య నియంత్రణ ఈఈ పి.శ్రీనివాస్, ఆయుష్ అధికారులు వి.రాణి, రామత్లేహి, రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఏపీకి ట్రబుల్ మేకర్గా చంద్రబాబు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అందించిన సంక్షేమం కంటే ఎక్కువే అందిస్తానంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్సీపీ వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా.. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాడు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమయ్యారు. జగన్ అందించిన నవరత్నాలను పూర్తిగా నాశనం చంద్రబాబు చేశారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. చంద్రబాబువి మోసపూరితమైన హామీలు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. మరి ఇప్పుడు ఏడాది పాలనకే రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారు. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడేం అవుతుంది?. రైతులు, వలంటీర్లు, ఎండీయూ వాహనదారులు.. ఇలా అందరినీ దగా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడం దుర్మార్గం. .. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. తెనాలిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీసులు రోడ్లమీద కొట్టడం దారుణం. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం.... విజయవాడ నగరాన్ని చెత్త నగరంగా మార్చింది కూటమి ప్రభుత్వమే. బుడమేరుకు వరద వస్తుందని తెలిసి కూడా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించలేదు. శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనే సంచలనగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ గోవిందా!. అప్పట్లో ఎన్టీఆర్ను ఎలా మోసం చేశారో.. ప్రజలను కూడా చంద్రబాబు ఇవాళ అలాగే మోసం చేశారు. ఈ రోజు వెన్నుపోటు దినం.. వంచన దినం. కాపుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇసుక కొట్టేసిన కూటమి నేతలు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రమంతా అవినీతిమయంగా మారింది అని వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంవత్సర కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ సిక్స్లో ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారు?. చంద్రబాబే స్వయంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వరంలో ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. -
ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఆమె వితంతువు. మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తమామలను హతమార్చేెందుకు ప్రయత్నించి పట్టుబడి పోయింది. ఆ ప్రియుడేమో ‘‘ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?. నా బ్యాక్గ్రౌండ్ తెలుసా?.. జనసేన లీడర్ని, ఇక్కడి ఎమ్మెల్యే పీఏని’’ అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగాడు. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటన వివరాల్లోకి వెళ్తే.. మమత అనే మహిళ భర్త ఐదేళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అత్తమామల దగ్గరే ఉంటూ వస్తోంది. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసి పెద్దలు ఆమెను మందలించారు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ల అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో.. ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తమామలను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన హనుమంతరావు.. కొబ్బరి కాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు, మంగమ్మలపై దాడి చేయబోయాడు. దీంతో వాళ్లు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా.. గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. ఆ సమయంలో తాను.. జనసేన లీడర్నని, నందిగామ ఎమ్మెల్యే పీఏ వాళ్లను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు.. హనుమంతరావు ఫోన్లోని ఫొటోలు, ఇతర వివరాల ఆధారంగా పోలీసులు జనసేన నేతగా నిర్ధారించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
చిలకలపూడి(మచిలీపట్నం): డెప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మంగళవారం రాత్రి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ బి.వి.సుబ్బారావు కథనం మేరకు.. మచిలీపట్నం నగరానికి చెందిన శ్రీజ టింబరు డిపో యాజమాని వి.రవీంద్రనాథ్ టింబరు డిపో రెవెన్యూవల్ కోసం రెండు నెలల కిందట ఆటవీ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించి రెన్యూవల్ చేయాలంటే రూ.25 వేల లంచంగా ఇవ్వాలని ఆటవి శాఖ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ జి.జయప్రకాష్ డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం రెన్యూవల్కు దర ఖాస్తు చేశానని, రూ.25 వేలు ఇవ్వలేనని రవీంద్ర నాథ్ తేల్చిచెప్పాడు. దీంతో రెన్యూవల్ చేసేందుకు జయప్రకాష్ ససేమీరా అన్నారు. చివరకు రూ.18 వేల లంచం ఇచ్చేలా రవీంద్రనాథ్ ఒప్పందం చేసుకున్నారు. అనంతరం జయప్రకాష్ తనను లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులను రవీంద్రనాథ్ ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రవీంద్రనాథ్ రూ.18 వేలను నగరంలోని ఆనందపేటలో ఉన్న ఆటవీశాఖ కార్యాలయంలో జయప్రకాష్కు అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసివున్న ఏసీబీ అధికారులు జయ ప్రకాష్ చేతిలో నగదు ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. జయప్రకాష్ చేతి వేలిముద్రలు, నగదు నోట్లుపై ఉన్న వేలిముద్రలు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. జయప్రకాష్పై 2017లో ఆటవీ శాఖ ఫ్లయింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్న సమయంలో ఏలూరులో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని, ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. రవీంద్రనాథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. టింబరు డిపో రెన్యూవల్ కోసం రూ.18 వేల లంచం డిమాండ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
పారదర్శకంగానే బదిలీల ప్రక్రియ
పామర్రు: బీసీ సంక్షేమ శాఖలో పారదర్శకంగా బదిలీలు చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్, పామర్రు నియోజకవర్గ ఎన్నికల ఎలక్ట్రోరల్ అధికారి జి.రమేష్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ జీఓను అనుసరించి వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల బదిలీలకు అర్హత గల వారి వివరాలను గత నెల 30న జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. వార్డెన్లు బదిలీలపై ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. అదే విధంగా కొందరు మహిళా వార్డెన్ల్పై బెదిరింపులకు పాల్పడుతున్నారనే సమాచారం తన దృష్టికి ఎవరూ తీసుకురాలేదని పేర్కొన్నారు. -
ఎగనామం
సూపర్ సిక్స్కు సూపర్ సిక్స్ హామీలను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుంగలో తొక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. మంగళవారం విజయవాడలో ఇళ్ల స్థలాల సాధన కోసం జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అధికారం దక్కిన తర్వాత వాటిని పూర్తిగా గాలికొదిలేసి ప్రజలను మోసం చేశారన్నారు. సొంత అజెండాతో పాలన సాగిస్తూ పేద ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని మండిపడ్డారు. మాట మార్చడం చంద్ర బాబుకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. – గాంధీనగర్(విజయవాడ సెంట్రల్) -
అంకితభావంతో పని చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. ఆమె చాంబర్లో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను మంగళవారం అందజేశారు. చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ పరిధిలో విధి నిర్వహణలో పని చేస్తూ అనారోగ్య కారణంగా చనిపోయిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా వాటిని భర్తీ చేశామని, అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతులను పారదర్శకంగా ఇచ్చి, వారు కోరిన ప్రాంతాలకు బదిలీ చేశామని చెప్పారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్లుగా ఏడుగురికి, సీనియర్ అసిస్టెంట్ల నుంచి ఏవోలుగా ఇద్దరికి నియామక పత్రాలు అందజేశామన్నారు. కారుణ్య నియామకాల ద్వారా ఆరుగురికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఒకరిని ఆఫీస్ సబార్డినేట్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. జెడ్పీ సీఈవో ఎ.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆర్.సి.ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిబద్ధత అవసరం.. చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అకస్మాత్తుగా మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు కల్పిస్తూ నియామక పత్రాలను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మంగళవారం రాత్రి అందజేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో వివిధ శాఖలలో 8 మందికి జూనియర్ అసిస్టెంట్లుగాను, ఇరువురికి ఆఫీసు సబార్డినేట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అంకితభావంతో అప్పగించిన విధులను నిర్వర్తించి పనిచేస్తున్న శాఖలలో అధికారుల మన్ననలను పొందాలని వారికి కలెక్టర్ సూచించారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఏవీఓ సీహెచ్ వీరాంజనేయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక -
టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మండంలోని కిలేశపురం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. బాపట్ల జిల్లా, బాపట్ల మండలం గుడిపూడికి చెందిన వెంపరాల ఆంజనేయులు (45), వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు(డ్రైవర్) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి కారులో వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు కిలేశపురం వద్ద అదుపుతప్పి ముదువెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ముందుసీటులో కూర్చున్న వెంపరాల ఆంజనేయులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన వెంపరాల నవీన్, వెంపరాల ఓలయ్య, బి.లక్ష్మి, వై.ముత్యాలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రెండు 108 అంబులెన్సులు, ఒక హైవే టోల్గేట్ అంబులెన్స్లో విజయ వాడ వైద్యశాలకు తరలించారు. ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకరు మృతి, మరో నలుగురికితీవ్ర గాయాలు తిరుపతమ్మ దర్శనానికి వెళ్లొస్తుండగా ప్రమాదం -
దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): దేశ రక్షణలో సైనికుల సేవలను మరువలేమని రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు ఆదరణ కల్పించేందుకు కర్నాటకలో వీర రత్న ఫౌండేషన్ను స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వీర నారీమణులను చైతన్యవంతులను చేసే అవగాహన కార్యక్రమాన్ని విజయవావడలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు కావాల్సిన వనరులను అందించి, వారి కుటుంబాల్లోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్ది, వారి కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు వీర రత్న ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. సైనికుల పిల్లల చదువు, ఆరోగ్యం, ఇతర విషయాల్లో సహాయ, సహాకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈఓ అర్చన చక్రవర్తి, సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వెంకటరెడ్డి -
కూటమి ప్రభుత్వ ఏడాది పాలన కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, అరాచకాలతో సాగింది. ఎటు చూసినా మోసం.. కుడి ఎడమల దగా అన్నట్లుగా పాలకుల తీరు నడిచింది. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలతో ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టారు. ఏ విద్యార్థి కనిపించినా త
బుధవారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2025–8లోuగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించింది. రాజకీయ నాయకులపై 89, సోషల్ మీడియా యాక్టివిస్టులపై 94, ప్రజా సంఘాలపై 11, జర్నలిస్టులపై 13 కేసులు నమోదయ్యాయి. రాజకీయ కక్షలతో బుక్కీపర్లు, ఉపాధి హామీ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తాజాగా ఎండీయూ వాహనాలను తొలగించారు. విజయవాడ నగరంలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఆస్తుల ధ్వంసం, వ్యాపారాలు దెబ్బతీసి ఆర్థికంగా కుంగదీశారు. యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ.. శాండ్, ల్యాండ్, మైన్, వైన్ కూటమి దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లు దోచుకుంటున్నారు. జిల్లాలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీకి కూటమి నేతలు తెరతీశారు. పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఊరూరా బెల్ట్ దుకాణాలు తెరిచి మద్యంలో దోపిడీ చేస్తున్నారు. పోలవరం మట్టి, గ్రావెల్స్ క్వారీలు, మైనింగ్లో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. సహజవనరులను టీడీపీ కూటమి అడ్డగోలుగా దోచుకుంటోంది. శత విధాలా మోసం.. మేనిఫెస్టోలో సూపర్సిక్స్తోపాటు సూపర్సిక్స్ 2.0 షణ్ముఖ వ్యూహం హామీ.. ఇదే పీ4, పూర్ టు రీచ్ అంటూ గొప్పలు చెప్పారు. పేదలను ధనికులు చేస్తామంటూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నందిగామ నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ప్రారంభించారు. కానీ ఇంతవరకు జిల్లాలో ఎంపికై న బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకులు దొరకలేదు. ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. ఇక అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ. 20వేలు అందిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి నేటికీ అతీగతీ లేదు. ఇలా విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలు ప్రతి వర్గాన్ని కూటమి వెన్నుపోటు పొడిచింది. న్యూస్రీల్ సూపర్సిక్స్ అంటూ అరచేతిలో వైకుంఠం ఒక్క హామీని సక్రమంగా అమలు చేయని కూటమి ప్రభుత్వం ఓటు వేసిన ప్రజానీకానికి వెన్నుపోటు కూటమి మోసాలను ఎండగడుతూ నేడు వైఎస్సార్ సీపీ నిరసన జిల్లా వ్యాప్తంగా ప్రజా భాగస్వామ్యంతో నిర్వహణకు ఏర్పాట్లు ఎడతెగని వంచన ఏడాది పాలన..కూటమి ఎన్నికల హామీల్లో సూపర్సిక్స్ పేరుతో ఊరూ వాడా ఊదరగొట్టారు. యువతకు ఉద్యోగాలు, నెలకు రూ. 3వేల ఉద్యోగ భృతి. ఏడాదిలో ఒక్కరికీ ఉద్యోగం లేదు.. భృతి లేదు. ఇక మెగా డీఎస్సీ పేరుతో పెద్ద దగా చేశారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15వేలు.. ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళ కు నెలకు రూ. 1500. ఈ హామీ ఊసే ఎత్తడం లేదు. ఉచిత బస్సు ఏడాదిగా హుళక్కే. షరతులతో ఎక్కువ మందికి వర్తించకుండా ఉచిత గ్యాస్ అమలు చేశారు. -
దగా చేస్తున్నారు..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అధికారంలోకి రాకముందు సంక్షేమ పథకాలన్నీ మీ ఇంటి ముంగిటకే వస్తాయని చంద్రబాబు నమ్మబలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చటం లేదు. చంద్రబాబు పాలన అంతా మోసం, దగా. నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా ముంచారు. – పాపట్ల స్వామి, కీసర ఈ ఏడాది వ్యవసాయం దండగ అనిపించింది. చెరువుల్లో నీరు లేదు. సకాలంలో వర్షాలు పడక ఇబ్బందులు పడ్డాం. ధాన్యం ధర కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతంలో క్వింటా ధాన్యం రూ.2,100 అమ్మితే ఈ ఏడాది రూ. 1200కు కూడా కొనేవారు లేరు. మొక్కజొన్న పంట పరిస్థితి అదే విధంగా ఉంది. విత్తనాలు, ఎరువులు ధరలు మాత్రం బాగా పెరిగాయి. బాగా నష్టపోయాం. – జె. శ్రీనివాసరావు, మైలవరం వ్యవసాయం దండగైంది.. -
దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వృద్ధులు, దివ్యాంగులకు ఇక్కట్లు తప్పడం లేదు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే వృద్ధులు, దివ్యాంగుల సౌలభ్యం కోసం దేవస్థానం రూ.8 లక్షలతో గాలిగోపురం వద్ద స్టేర్ లిఫ్ట్ను ఏర్పాటు చేసింది. అయితే ఆలయ ఇంజినీరింగ్ అధికారుల అల సత్వం కారణంగా నాణ్యత లేని స్టేర్ లిఫ్ట్ తరచూ మరమ్మతులకు గురవుతోంది. 15 రోజుల కిందట అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తామంటూ టెక్నికల్ సిబ్బంది స్టేర్ లిఫ్ట్ను తీసుకెళ్లారు. అయితే ఇంత వరకు ఆ లిఫ్ట్ సంగతిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ దివ్యాంగుడి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న ఆ దివ్యాంగ భక్తుడిని వీల్చైర్పై అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చారు. ఆలయంలోకి వెళ్లాలంటే గాలి గోపురం వద్ద మెట్లు దిగాల్సిందే. అక్కడ స్టేర్ లిఫ్ట్ లేకపోవడంతో వీల్చైర్పై వచ్చిన ఆ దివ్యాంగుడిని ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది, సేవా సిబ్బంది నలుగురు కలిసి మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. కనీసం ఇటువంటి వారిని చూసేనా ఆలయ అధికారులు స్పందించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
యోగాతో శ్రామికుల్లో నూతనోత్సాహం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిత్యం శారీరక శ్రమ చేసే కార్మికుల్లో యోగా సాధన నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ శాఖ, కార్మిక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల థీమ్ యోగాసనాల కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, ఉపకార్మిక కమిషనర్ సీహెచ్.ఆశారాణి, వీఎంసీ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్ కార్మికులతో కలిసి యోగ సాధన చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రోగాలబారిన పడకుండా ఉండటంతో పాటు మానసికంగా నూతన ఉత్తేజాన్ని పొందేందుకు యోగాను మించి దివ్య ఔషధం మరొకటి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు యోగాసనాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నెల రోజుల పాటు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు డాక్టర్ వి.రాణి, డాక్టర్ రామత్లేహి, డాక్టర్ రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్య నారాయణ, రామాంజనేయులు పాల్గొన్నారు. -
రాయనపాడులో మరిన్ని రైళ్లకు హాల్ట్
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడరూరల్: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మైలవరం నియోజకవర్గంలోని రాయనపాడు రైల్వేస్టేషన్ అభివృద్ధి కావడంతో మైలవరం ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఇదే స్కీమ్ కింద కొండపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ఎంపీ తెలిపారు. మంగళవారం కొండపల్లి, రాయనపాడు రైల్వేస్టేషన్లను స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. కొండపల్లి రైల్వే స్టేషన్ మాస్టర్తో పాటు, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాయనపాడు రైల్వేస్టేషన్లో మూడు, నాలుగు నంబర్ ప్లాట్ ఫామ్స్ కూడా రెడీ కాబోతున్నాయన్నారు. మరిన్ని రైళ్లు ఆగే విధంగా చూస్తామన్నారు. అకస్మాత్తుగా పొంగుతోంది.. అనంతరం కొండపల్లి ఎస్టీ కాలనీ వద్ద రైల్వే లైన్ కింద డ్రెయినేజీని కూడా ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ పరిశీలించారు. పూడికను తొలగించక పోవడం వల్ల అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల డ్రెయినేజీ నీటితోపాటు వరదనీరు ఉప్పొంగి సమీప గృహాలు వరద ముంపునకు గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే ఎంిపీకి వివరించారు. డీఆర్ఎం మీటింగ్లో ఈ సమస్యను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు, బీజేపీ ఇన్చార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలుచేయాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గోవధ నిషేధ చట్టం అమలుపై సమన్వయ శాఖల అధికారులతో మంగళవారం తన కార్యాలయంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో గోవధ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేయడం అధికారుల బాధ్యత అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని గోవధ నిషేధ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో మునిసిపల్, పంచాయతీ, రెవెన్యూ, పశుసంవర్ధక, రవాణా శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చట్టాల ఉల్లంఘనలు జరగకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు. అనంతరం గోవధ నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, డీపీఓ పి.లావణ్యకుమారి, గో సంరక్షణ సమితి ఐకాస సభ్యులు తోట సురేష్, నాగలింగం శివాజి, పోతురాజు వినోద్రాజ్ పురోహిత్, గోవిందసాబు, మిరి యాల శ్రీనివాసరావు, బాలకృష్ణ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం
పమిడిముక్కల: మండలంలోని కపిలేశ్వరపురం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు ధ్వంసమైంది. కొడాలి నాగేంద్రబాబు అనే వ్యక్తి డాబాపై నిద్రిస్తుండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని నాగేంద్రబాబు తెలిపాడు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పార్టీ నాయకులతో కలిసి ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటంబాన్ని పరామర్శించి, నష్టం వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అధైర్యపడవద్దని ఆదుకొంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పారదర్శకంగా క్రీడా కోటా అమలు శాప్ చైర్మన్ రవినాయుడు విజయవాడస్పోర్ట్స్: మెగా డీఎస్సీ క్రీడా కోటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు శాప్ అధికారులను ఆదేశించారు. నగరంలోని శాప్ కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ మాట్లాడుతూ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పకడ్బందీగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలన్నారు. ఉద్యోగానికి అర్హత కలిగిన ఏ ఒక్క క్రీడాకారుడు నష్టపోకుండా నిష్పక్షపాతంగా, అవినీతికి తావులేకుండా ఎంపిక జరగాలన్నారు. మెగా డీఎస్సీని అడ్డుపెట్టుకుని ఇప్పటికే కొన్ని క్రీడా సంఘాలు, సమాఖ్యలు ఫేక్ సర్టిఫికెట్లు ఎరవేసి సొమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగానికి కావాల్సిన అర్హతను కల్పిస్తూ ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసి క్రీడా సంఘాల ప్రతినిధులు లక్షలు కాజేస్తున్నారని అన్నారు. ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్నా, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాప్ ఏవో ఆర్.వెంకటరమణ, టీఎస్వో ఎస్.వి.రమణ, స్పోర్ట్స్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, మహేష్, సురేంద్ర, కిషోర్, ఏడీలు వేణు, మల్లేశ్వరిభాయ్ పాల్గొన్నారు. స్పైసెస్ బోర్డు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కొరిటెపాడు(గుంటూరు): ఎగుమతులు, విలువ జోడింపు – రైతు సాధికారతను పెంచడానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి స్పైసెస్ బోర్డు స్పైసెస్డ్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోందని స్పైసెస్ బోర్డు డీడీ ఆనంద్ దేవ్ వర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని స్పైసెస్ బోర్డు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ‘ఎగుమతి అభివృద్ధి కోసం ప్రగతిశీల, వినూత్న, సహకార జోక్యాల ద్వారా సుగంధ ద్రవ్యాల రంగంలో స్థిరత్వం’ అనే ప్రధాన పథకం కింద ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు. స్థిరత్వం, ఆవిష్కరణ, ఎగుమతి అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా భారతీయ సుగంధ ద్రవ్యాల రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ మే 26వ తేదీ నుంచి ప్రారంభమైందని, సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారుల కోసం స్పైస్డ్ పథకం యొక్క ఎగుమతి అభివృద్ధి, ప్రమోషన్ భాగాల కింద దరఖాస్తును ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వాటాదారులు www.indianspices. com ను సందర్శించి దరఖాస్తులను సమర్పించవచ్చని వెల్లడించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లాల 11వ సీనియర్ ఆక్వాటిక్ చాంపియన్షిప్– 2025 పోటీల్లో ఎన్టీఆర్ జిల్లా ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. రన్నర్స్ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్లో నిర్వహించిన ఈ పోటీలలో పురుషుల వ్యక్తిగత చాంపియన్షిప్ను ఎం.శరత్ (ఎన్టీఆర్ జిల్లా) సాధించగా, మహిళల విభాగంలో సన్వి కొంగర, యు.ప్రేమాంమృత (ఎన్టీఆర్ జిల్లా) సంయుక్తంగా వ్యక్తిగత చాంపియన్షిప్కు ఎంపికయ్యారు. ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించిన పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులను అభినందించారు. పోటీలలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్ర స్విమ్మింగ్ జట్టు క్రీడాకారులు త్వరలో ఒడిశాలోని భువనేశ్వర్లో జరగనున్న 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఓబుల్రెడ్డి, వెంకట్రామ్మోహన్, పల్నాడుజిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష్య, కార్యదర్శులు డాక్టర్ ఏ.ఏ.రామలింగారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, కోశాధికారి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్చాంప్ ఎన్టీఆర్ జిల్లా రన్నర్స్గా కర్నూలు జిల్లా -
ఎస్ఎన్ పురం మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో మోడల్ పోలీస్స్టేషన్లు నిర్మించడంతో పాటు ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ జీఎస్ రాజు రోడ్డులో నూతనంగా నిర్మించిన సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ను సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, పోలీసు అధికారులతో కలిసి ప్రారంభించారు. డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణ.. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. ఇక్కడ అన్ని వసతులు, ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన మోడల్ పోలీస్స్టేషన్ను తన చేతుల మీదుగా ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఏపీ పోలీసులు ముందున్నారని, టెక్నాలజీ ద్వారా నేరాలకు ఏపీలో అడ్డుకట్ట వేస్తున్నామని చెప్పారు. హాట్ స్పాట్లు ఎక్కువగా ఉన్న విజయవాడ లాంటి చోట పటిష్టమైన భద్రత అవసరమని, ఎన్టీఆర్ జిల్లా డ్రోన్, సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఉందన్నారు. పోలీస్ స్టేషన్లో జిమ్, యోగా రూమ్ కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. గంజాయి నిర్మూలనలో ఈగల్ టీమ్ పనితీరు బాగుందని.. శాంతిభద్రతలు రక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుందన్నారు. పోలీసులు కఠినంగా ఉంటేనే నేరాలు అదుపులో ఉంటాయని చెప్పారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. సత్యనారాయణపురాన్ని మోడల్ పోలీస్స్టేషన్గా నిర్మించి ప్రారంభించామన్నారు. ఆధునిక టెక్నా లజీ పరిజ్ఞానంతో నేరం జరిగిన 24 గంటలలోపే నేరస్తుడిని పట్టుకునేలా కమిషనరేట్ పని చేస్తోందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు వేలాది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని, ఇందుకు సహకరిస్తున్న ప్రజలు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మె ల్యే బొండా ఉమా, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్వీవీ లక్ష్మీనారాయణ, డీసీపీలు కేజీవీ సరిత, తిరుమలేశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీతో నేరాలకు అడ్డుకట్ట హోం శాఖ మంత్రి అనిత -
బాస్కెట్బాల్ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–23 బాస్కెట్ బాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా సీ్త్ర, పురుషుల జట్లను నూజివీడులోని వీటీహెచ్ మైదానంలో సోమవారం ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్షుడు జి.సుభాష్చంద్రబోస్ తెలిపారు. పురుషుల జట్టుకు జి.నాగబాబు, ఎస్కే యాసిన్, ఎ.తేజ, బి.సంజయ్శ్రీనివాస్, మహిళల జట్టుకు బి.ప్రభుదీపిక, షేక్ అస్రా, బి.ప్రణవి, బి.కుసుమ ఎంపికయ్యారన్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని చెప్పారు. ‘ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తారా ?’ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(పీడీఎస్ఓ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరికీ ఉచిత వైద్యం, వైద్య విద్య అంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మరచి, ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ కార్పొరేట్ దోపిడీకి తలుపులు తెరిచిందన్నారు. ఈ విధానాలు పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను, వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తున్నాయని, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించి, ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు కూడా జరిపిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించే కుట్ర చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, భవనాలను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే ప్రయత్నం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వంద శాతం సీట్లు కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ప్రజావాణిలో 78 ఫిర్యాదులు విజయవాడస్పోర్ట్స్: నగరంలోని పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 78 ఫిర్యాదులను స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఏబీటీఎస్ ఉదయరాణి తెలిపారు. భూ వివాదాలకు, ఆస్తి వివాదాలకు, నగదు లావాదేవీలపై 47, మహిళా సంబంధిత నేరాలపై ఆరు, సైబర్ నేరాలపై ఆరు, కుటుంబ కలహాలపై నాలుగు, చోరీలపై రెండు, కొట్లాటలపై ఒకటి, ఇతర వివాదాలపై 12 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం సదరు ఫిర్యాదులను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు డీసీపీ చెప్పారు. 6 నుంచి ఐటీఐ కౌన్సెలింగ్ గుడివాడ టౌన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కోర్సులలో చేరే విద్యార్థులకు ఈ నెల 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వాహిస్తామని స్థానిక కేబీఆర్ గవర్నమెంట్ ప్రిన్సిపాల్ ఎల్. గౌరీమణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10 జీపీఏ నుంచి 5.5 జీపీఏ వరకు, మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు 5.4 జీపీఏ నుంచి 1.5 జీపీఏ కలిగిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. కౌన్సెలింగ్కు వచ్చేవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆమె కోరారు. -
రైతుల సమస్యలను పరిష్కరిస్తాం
మోపర్రు(పెదపారుపూడి): రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, అధైర్యపడవద్దని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. మండలంలోని మోపర్రులో బుడమేరు వరదలకు వన్నేరు డ్రెయిన్కు పడిన గండ్లను ఆయన ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాతో కలిసి సోమవారం పరిశీలించారు. కొన్ని నెలల కితం వచ్చిన బుడమేరు వరదలకు మురుగునీరు సరిగా ముందుకు పారక వన్నేరు డ్రెయిన్ కట్టలు తెగిపోవటంతో పంటలు పూర్తిగా మునిగిపోయి నష్టపోయామన్నారు. మరలా అలాంటి నష్టం వాటిల్లకుండా కాలువ కట్టలను బలోపేతం చేసి తమను ఆదుకోవాలని రైతులు కలెక్టర్ను కోరారు. స్పందించిన ఆయన డ్రెయిన్ మరమ్మతుల కోసం ఏఏ నిధులు అందుబాటులో ఉన్నాయో జల వనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడి, గండ్లను పూడ్చడంతో పాటు గండ్ల బలోపేతానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రైతులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతు సేవ కేంద్రాల్లో విత్తనాలు లేవు.. ప్రభుత్వ రైతు సేవ కేంద్రాల్లో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు కలెక్టర్ బాలాజీకి ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, జలవనరుల శాఖ ఈఈ కిరణ్, తహసీల్దార్ వై.రంగారావు, రైతులు పాల్గొన్నారు. -
ఇన్నొవేషన్ హబ్ పనులను త్వరగా పూర్తి చేయండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రామవరప్పాడు: స్టార్టప్లు, ఆవిష్కరణలకు రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)తో సరికొత్త ఊపు రానుందని, ఈ హబ్తో పారిశ్రామిక రంగం రూపురేఖలు సమూలంగా మారనున్నాయని ఇందుకు సంబంధించి స్పోక్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. టాటా ఇన్నొవేషన్ హబ్– స్పొక్ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కార్యాలయం, మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎనికేపాడులో భవనాన్ని కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్టీఐహెచ్ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నాలుగైదు రోజుల్లో నాలుగో అంతస్తులోని ఒక బ్లాకు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హబ్కు అనుసంధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కావూరి చైతన్య, తహసీల్దారు బి. సుగుణ, ఆర్ అండ్బీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ -
బదిలీల్లో గందరగోళ పరిస్థితులు తొలగించాలి
మచిలీపట్నంఅర్బన్: ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు తొలగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నాయకులు సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్ప్లస్ ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు ఇప్పుడే సర్దుబాటు చేసి, క్రమబద్దీకరించిన ఖాళీల జాబితాను విడుదల చేయాలని కోరామన్నారు. పీఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీకి సర్ప్లస్ టీచర్లను అధికారులు ఫోన్లు చేసి దరఖాస్తుకు ఒత్తిడి చేయటం సరికాదన్నారు. పీఎస్ హెచ్ఎంకు వెళ్లాల్సిన టీచర్ల జాబితాను సబ్జెక్ట్ పరంగా విడుదల చేయాలని చెప్పారు. ట్రాన్స్ఫర్స్ సీనియారిటీ జాబితాలు పుట్టిన తేదీ ఆధారంగా తయారు చేశారని, బదిలీల జీఓ ప్రకారం సీనియారిటీ ఆధారంగా తయారు చేయాలని కోరామన్నారు. ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న పీఎస్ హెచ్ఎం(ఉర్దూ) పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ముందుగానే గ్రోవియన్స్ పరిష్కరించి ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.లంకేష్, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, జయ ప్రకాష్, జైగం అబ్బాస్ పాల్గొన్నారు. -
జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు సరళ యోగా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మనసు, శరీరాన్ని అనుసంధానించి జీవన నాణ్యతకు, శ్రేయస్సుకు ఉపయోగపడే సరళ యోగా అభ్యసనానికి రోజులో తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల సందర్భంగా సోమవారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు యోగా స్ట్రీట్ నందు జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల థీమ్ యోగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ నగరపాలకసంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, వివిధ శాఖల అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి.. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం విధులకు ఉపక్రమించే ముందు వీలున్నంత సమయాన్ని యోగాకు కేటాయించాలన్నారు. దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం చేకూరి ఉత్సాహంగా పనిచేసేందుకు వీలుంటుందని చెప్పారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్లో చాలా సరళమైన ఆసనాలు ఉన్నాయని, వీటిని చాలా తేలిగ్గా సాధన చేయవచ్చన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు యోగా విశిష్టతను వివరించి, ఆయా వర్గాల ప్రజలు జీవితాంతం యోగాసనాలను ఆచరించి ఆనందంగా జీవించేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర మాసోత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. ‘యోగా చేయండి.. ఆరోగ్యంగా ఉండండి, యోగా చేయండి.. రుగ్మతలకు దూరంగా ఉండండి, భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప దివ్య ఔషధం.. ’ అంటూ పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్, కమిషనర్ పాల్గొని, యోగా ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, డీఎంహెచ్వో ఎం.సుహాసిని, ఆయుష్ అధికారులు వి.రాణి, రామత్లేహి, రత్నప్రియదర్శిని, యోగా ట్రైనర్లు సత్యనారాయణ, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
శాతవాహన కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని, ప్రభుత్వమే నిర్వహించాలని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన కళాశాల ఎదుట ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ శాతవాహన కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఎప్పటి నుంచో కబ్జా చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా)ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. గతంలో చేసిన ప్రయత్నాలను ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు చేసిన పోరాటాల వల్ల వెనక్కు తగ్గాడన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ఆలపాటి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అందువల్ల శాతవాహన కళాశాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఆలపాటిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు.. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వరరాజు మాట్లాడుతూ.. విద్యారంగంలో వినూత్నమైన సంస్కరణలు తీసుకువస్తానని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చెప్పిన ఎమ్మెల్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు పాల్పడం సిగ్గుచేటు అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించినా పోలీసులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజాపై కేసు నమోదు చేయకపోవడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేష్, డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించి వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి ఆలపాటి రాజాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఆలపాటి రాజాపై చర్యలు తీసుకోకపోతే శాతవాహన కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేస్తామని విద్యార్థి, మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు. ఐద్వా నగర కార్యదర్శి సరోజ, నగర కమిటీ సభ్యులు షకీలా, ఆశ, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు కుమార స్వామి, కార్యదర్శి మాధవ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ సభ్యురాలు ఇజ్ఞాడ లక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ను కిడ్నాప్ చేసి బెదిరించిన ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలి విద్యార్థి, మహిళా సంఘాల డిమాండ్ -
నాలుగు నియోజకవర్గాల్లో మట్టి మాఫియా
ప్రకృతి సంపదలో ఒకటైన మట్టిపై కొంతమంది టీడీపీ నేతల కన్నుపడింది. చెరువులు, కుంటలను ఎంచుకుని రాత్రి వేళల్లో పొక్లెయిన్లతో లోతుగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు ఆ మట్టిని ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వెంచర్ల మెర కకు తరలించి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా పొలాలను మెరక చేసుకునేందుకు రైతుల నుంచి వసూలు చేసి మట్టిని అమ్ముతున్నారు. నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల మండలం పేరకలపాడు, గండేపల్లి, పరిటాల, గొట్టుముక్కల చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. వీరులపాడు మండలం జుజ్జూరు, జయంతి, చట్టన్న వరం తదితర గ్రామాలు, మైలవరం నియోజక వర్గంలోని జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో, జగ్గయ్యపేట నియోజకవర్గంలోని షేర్మహ్మద్పేట, పెనుగంచిప్రోలు మండలం, వత్సవాయి మండలం, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో యథేచ్ఛగా చెరువుల్లో మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. -
ట్రాఫిక్ మహిళా కానిస్టేబుళ్లకు షూలు, గ్లౌజులు పంపిణీ
విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్ సోమవారం స్పోర్ట్స్ షూ, మాస్క్లు, హ్యాండ్ గ్లౌజులను అందజేశారు. సీ్త్ర శక్తిని ప్రోత్సహించే సదుద్దేశంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఏడీసీపీ తెలిపారు. 33 మంది మహిళా కానిస్టేబుళ్లకు ఈ వస్తువులను అందజేశామని పేర్కొన్నారు. ట్రాఫిక్ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి నలు గురి ప్రాణాలు కాపాడిన నలుగురు కానిస్టేబుళ్లకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ పి.రామ చంద్రరావు, సీఐ బాలమురళీకృష్ణ, ఎస్ఐ నాగ దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జేసీగా ఇలక్కియ బాధ్యతల స్వీకారంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్గా ఎస్.ఇలక్కియ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జేసీ ఇలక్కియ మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులతో కలిసి కృషి చేస్తానన్నారు. తాను గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసినట్లు తెలిపారు. నూతన జాయింట్ కలెక్టర్కు విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, డీఎస్ఓ ఎ.పాపారావు, గ్రామ/వార్డు సచివా లయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఎస్.శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఔషధ మొక్కలపై అవగాహన కలిగిద్దాంగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఔషధ మొక్కల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో వన్ ఎర్త్–వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ గ్రూప్) సహకారంతో ఏర్పాటుచేసిన ధన్వంతరి వనాన్ని కలెక్టర్ లక్ష్మీశ సోమవారం ప్రారంభించారు. అక్కల కర్ర, నల్ల ఉమ్మెత్త, నేపాలం, చిత్రమూలం, తాని తదితర ఔషధ గుణాలు కలిగిన 40 రకాల ఔషధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వయంగా మొక్కనాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్యకరంగా జీవించడానికి పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు సేంద్రియ పద్ధతిలో పంటలను పండించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద న్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రకృతి వ్యవసాయంపై పెద్దఎత్తున రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలపైనా అవగాహన కల్పించి, ఇంట్లోనే పెంచుకునేలా ప్రోత్సహించడంలో సమష్టి కృషి అవసరమన్నారు. మిద్దె తోటల పెంపకాన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్లేందుకు వన్ ఎర్త్ – వన్ లైఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని కలెక్టర్ లక్ష్మీశ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వన్ ఎర్త్–వన్ లైఫ్ ప్రతినిధులు ఏలూరి లీలా కుమారి, మద్దిరాల కమలాకర్, విజయకుమార్ వెలగ, పాలడుగు సురేష్ తదితరులతో పాటు పీసీబీ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పి.శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎస్.శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రలోభాలు, బెదిరింపులతో గట్టెక్కిన టీడీపీ
తిరువూరు: ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్వీయ పర్యవేక్షణలో ఫ్యాను గుర్తుపై గెలిచిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ గట్టెక్కింది. 20 మంది కౌన్సిలర్లు ఉన్న తిరువూరు నగర పంచాయతీలో 17 మంది వైఎస్సార్ సీపీ సభ్యులే. చైర్ పర్సన్ కస్తూరిబాయి పార్టీ ఆదేశాల మేరకు రాజీనామా చేశారు. 15వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్కు చైర్పర్సన్గా అవకాశం కల్పించడానికి కౌన్సిలర్లు ఏకగ్రీ వంగా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మే నెల 19న చైర్పర్సన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. తదనుగుణంగా వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎన్నికకు సిద్ధమయ్యారు. అయితే టీడీపీ నేతలు ప్రలోభా లకు గురిచేసి ముగ్గురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు పచ్చ కండువాలు కప్పారు. అప్పటికీ వారికి బలం సరిపోకపోవడంతో ఎన్నిక ప్రక్రియకు విఘాతం కలిగించారు. ఎన్నికను సైతం వాయిదా వేయించగలిగారు. మర్నాడు మే 20వ తేదీన జరగాల్సిన చైర్పర్సన్ ఎన్నికను సైతం టీడీపీ శ్రేణులు విజయవంతంగా అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోకుండా కట్టడి చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కౌన్సిలర్లకు రక్షణ కల్పించి వారిని చైర్పర్సన్ ఎన్నికకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పోలీసులు, అధికారులు విఫలమయ్యారు. రెండో రోజు కూడా చైర్పర్సన్ ఎన్నిక జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఆ నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేల కనుసన్నల్లో తిరువూరు చైర్పర్సన్ ఎన్నిక వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల కొనుగోలుతో నెగ్గిన కూటమి పంతండబ్బు ఎరచూపి... వాయిదా పడిన చైర్పర్సన్ ఎన్నికను సోమవారం నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఆదేశించడంతో గత వారం రోజులుగా టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను మళ్లీ బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకోగలిగారు. అతి బలవంతం మీద వైఎస్సార్ సీపీ నుంచి ఏడుగురు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు పలికారు. టీడీపీ కౌన్సిలర్లతో కలిపి 10 మంది, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటుతో చైర్పర్సన్ పదవిని దక్కించుకోగలిగారు. -
క్వారీల్లో కంకర స్వాహా
ఎన్టీఆర్ జిల్లాలో రాతి క్వారీల్లో విచ్చల విడిగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో దాదాపు 154 రాతి క్వారీలు, 97 స్టోన్ క్రషర్లు ఉన్నాయి. కొన్ని క్వారీలకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. ఆ అనుమతులను అడ్డం పెట్టుకుని కొండల్లో అక్రమంగా కంకరను తవ్వుతు న్నారు. క్వారీల సమీపంలో సాగర్ కాలువలను సైతం కబ్జా చేసి రోడ్లు వేసుకుని రాతి క్వారీల గుత్తేదారులు రాళ్ల వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. అదేమంటే అమరావతి నిర్మాణానికి కంకర ఎంతో అవసరం కాబట్టే తామంతా వ్యాపారం చేస్తున్నామని బహిరంగంగా చెప్పుకొంటున్నారు. కంకర తీసే సమయంలో బ్లాస్టింగ్ చేసేటప్పుడు కనీసం ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించటంలేదు. అధిక మొత్తంలో పేలుడు పదార్థాలు ఉపయోగించటం ద్వారా క్వారీల్లో పనిచేసే కార్మికులు ప్రాణాలు పోగొట్టుకుంటు న్నారు. కార్మికుల ప్రాణాలు పోగొ ట్టుకుంటున్న సమయంలో వారి కుటుంబాలకు క్వారీల నిర్వాహకులు ఎంతో కొంత ముట్టజెప్పి పోలీసు కేసులు కాకుండా చూసుకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు రాతి క్వారీల నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుని అక్రమ తవ్వకాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. -
నేలతల్లికి గర్భశోకం
ఆదాయ వనరుగా ఇసుక గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇసుక కావా ల్సినంత దొరికేది. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు దోచుకుంటున్నారు. పెద్ద పెద్ద లారీలతో ఇసుకను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. – షేక్ పీర్సామియా, పండ్ల వ్యాపారి, పెండ్యాల, కంచికచర్ల మండలం రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు చెరువులు, కుంటల మట్టిని కూటమి నాయకులు అక్రమంగా తరలిస్తున్నారు. భారీ పొక్లెయిన్లతో లోతుగా మట్టిని తవ్వి రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. గతంలో ఇటువంటి గోతులు తీయటం వల్ల ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు పట్టడంలేదు. – కందుల అశోక్కుమార్, రైతు, పేరకలపాడు, కంచికచర్ల మండలం అధికారులకు పట్టడంలేదు క్వారీల్లో బిహార్, తమిళనాడు, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల కార్మికులు పనిచేస్తున్నారు. పేలుడు పదార్థాలు అధికంగా వాడటం వల్ల బ్లాసింగ్ సమయంలో కార్మికులు మృతి చెందుతున్నారు. వారి కుటుంబాలకు క్వారీ నిర్వాహకులు ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. – కోట కల్యాణ్, వ్యవసాయ, కార్మిక సంఘ ఎన్టీఆర్ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శికంచికచర్ల: అధికారం అండతో కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రకృతి సంపదను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సహజ సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. ఉచిత ఇసుక మాటున మాఫియాను నడిపిస్తున్నారు. ఒక్క ఇసుకే కాదు, మట్టి, కంకర ఇలా ఏ ఒక్క దానినీ వదలకుండా యథేచ్ఛగా దోచేస్తూ నేల తల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు. ఎక్కడ ప్రకృతి సంపద కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలి దోపిడీ పర్వానికి బాటలు వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ దోపిడీ పర్వం కొనసాగుతుండటంతో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారు. కళ్లముందే అక్రమాలు జరుగు తున్నా దృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. అధికారుల నుంచి కనీస చర్యలు కూడా కనిపించకపోవడంతో ప్రజాప్రతినిధుల అనుచరులు, నాయకులు, కార్యకర్తలు సైతం పేట్రేగిపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక దందా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఎంత కావాలన్నా లభించేది. ఇసుక ధరలు సైతం లబ్ధిదారులకు అందుబాటులో ఉండేవి. దీంతో ప్రతి ఒక్కరూ సకాలంలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసుకునేవారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించటంలేదు. పేరుకు ఉచిత ఇసుక అయితే పేదలకు మాత్రం దొరకడంలేదు. ఇసుక రీచ్ల్లో కాంట్రాక్టర్కు నగదు చెల్లిస్తే చాలు ఎంత కావాలంటే అంత ఇసుకను లోడ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడిపోతోంది. నో చలానా.. ఓన్లీ క్యాష్ అంటూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా లేకుండా విజయవాడ పార్లమెంట్ ముఖ్య ప్రజాప్రతినిధి అనుచ రులు ఒక్కో లారీకి రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. రూ.10 వేలు ఇస్తే చాలు ఎన్ని టన్నులయినా లారీలకు నింపుతామని బహిరంగంగా చెబుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన నాయకులకు ఎవరికీ సంబంధం లేకుండా ఏకపక్షంగా ఆ ప్రజాప్రతినిధి అనుచరులు మూడు రీచ్ల నుంచి ఇసుకను తోడేస్తున్నారు. జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో ఇసుక రీచ్ల నుంచి రోజుకు 300 నుంచి 400 లారీల వరకు ఇసుకను విక్రయిస్తున్నారు. వాటిలో కొన్ని లారీలను యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటు న్నారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే దందాకు పోలీసులు, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. కంచికచర్ల మండలం దొనబండక్వారీ నుంచి కంకరను తరలిస్తున్న లారీ ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు తెగబడుతున్న ‘పచ్చ’ మాఫియా సహజ సంపదను నిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్న వైనం ముఖ్య ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచ్చలవిడిగా దోపిడీ పర్వం ఈ అక్రమాలను పట్టించుకోని మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందుబాటులో ఇసుక ప్రకృతి సంపదను దోచేస్తున్న కూటమి గద్దలు -
ఉచిత ఇసుక పేరుతో చోటా నాయకుల దందా
కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టింది. అధికార పార్టీ చోటా నాయకులకు ఈ పథకం మంచి ఆదాయ వనరుగా మారింది. కృష్ణానది, మున్నేరు, ఇతర ఉపనదుల్లో ఉచిత ఇసుక పేరుతో పగలు ట్రాక్టర్లు ద్వారా ఇసుకను ఒడ్డుకు చేరుస్తున్నారు. రాత్రి సమయంలో పెద్ద లారీలకు లోడింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇసుకకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే ఇసుకను కూటమి నాయకులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నందిగామ మండలం కంచలవద్ద వర్షాకాలం కోసం నిల్వచేసిన ఇసుక -
అమాయక ప్రజలను బాబు మోసం చేశారు: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, రౌడీలు.. పోలీసుల రాజ్యమే నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం వెన్నుపోటు దినం (Vennupotu Dinam) నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిపి ఆయన మాట్లాడారు. ‘‘ప్రజలకు హామీ ఇచ్చి చంద్రబాబు వెన్నుపోటు(Chandrababu Vennupotu) పొడిచారు. అందుకే జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిరసన చేపడతాం. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి నష్టపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన దోపిడీతో మొదలైంది. సూపర్ సిక్స్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఆస్తి పన్ను, కరెంటు చార్జీలు కూటమి ప్రభుత్వం విపరీతంగా పెంచింది.. .. చంద్రబాబు ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత ఒక మాట చెబుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే సచివాలయాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదు. రేషన్ డోర్ డెలివరీ(Ration Door Delivery System) విధానాన్ని కూడా చంద్రబాబు తొలగించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం దారుణం. .. ఉచిత బస్సు, అమ్మకి వందనం అంటూ ప్రజలను మోసం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రౌడీరాజ్యం , పోలీసు రాజ్యం నడుస్తోంది. విజయవాడలో శాతవాహన కళాశాల 5 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం కబ్జా చేయడానికి చూస్తోంది. శాతవాహన కళాశాల ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేయడం దారుణం. అసలు బెజవాడ నగరంలో శాంతి భద్రతలు ఉన్నాయా?. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల విజయవాడ నగరంలో బుడమేరు వరదల్లో 12 డివిజన్లు నీట మునిగాయి అని మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి(Vijayawada Deputy Mayor Sailaja Reddy) మాట్లాడుతూ.. ‘‘జగన్ను ఒంటరిగా ఢీ కొనలేక మూడు పార్టీలు ముందుకు వచ్చాయి. చంద్రబాబు అమాయక ప్రజలను మోసం చేశారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో ఒక్క హామీ అమలు చేయలేదు. టీడీపీ మహానాడుతో ప్రజలకు ఏం ఉపయోగం లేదు. జగన్ను తిట్టేందుకు.. లోకేష్ ను పొగడ్తలతో ముంచేందుకే మహానాడు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారు అని అన్నారామె. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.ఇదీ చదవండి: అలాంటి వారిని ఇలాగే శిక్షస్తారా?.. మేడమ్! -
టీడీపీకి గుడ్బై.. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
సాక్షి, ఇబ్రహీంపట్నం: ఏపీలో అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది కూటమి ప్రభుత్వ తీరుకు విసుగు చెంది ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. పటాపంచల సాంబశివరావు, పటాపంచల గోపి, గంగుల నాగరాజు, గంగుల బాలాజీ, గంగుల వెంకట్రావు, గంగుల రమేష్ తదితరులకు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ..‘కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యం. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం. మైలవరం నియోజకవర్గంలో జూన్ నాలుగో తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందన్నారు. జి.కొండూరు మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ జడ రాంబాబు, ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగుల తిరుపతిరావు అధ్యక్షతన వైఎస్సార్సీపీలో చేరికలు శుభపరిణామమని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. షష్ఠిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజామున స్వామి వారి ఆలయంలో పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేష అలంకరణ జరిగాయి. అనంతరం స్వామి వారి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. వేదికపై అర్చకులు వేద మంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లగా భక్తులు, ఉభయదాతలు భుజం పట్టారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న స్మార్త వేద పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వేద పాఠశాల పునఃప్రారంభం కానుందని, విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ప్రవేశ దరఖాస్తులను పొందవచ్చని పేర్కొన్నారు. సమాజ వికాసానికి తోడ్పడే వేద విద్య అభ్యున్నతికి, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు దేవస్థానం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. హోరాహోరీగా తైక్వాండో పోటీలు విజయవాడస్పోర్ట్స్: ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి తైక్వాండో పోటీలు నగరంలోని ఆంధ్రా లయోల కాలేజీలో ఆదివారం హోరాహోరీగా జరిగాయి. కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను కాలేజీ వ్యాయామ విద్యా అధ్యాపకులు మహ్మద్ ఇబ్రహీం ప్రారంభించారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ సీ్త్ర, పురుషు విభాగాల్లో ఈ పోటీలు అత్యంత రసవత్తరంగా జరిగాయి. వయసు విభాగాల వారీగా జరిగిన ఈ పోటీల్లో 94 మంది విజేతలను జిల్లా జట్టుకు ఎంపిక చేశామని, ఈ జట్లు ఈ నెల 9, 10, 11 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని కృష్ణాజిల్లా తైక్వాండో సంఘం కార్యదర్శి ఎం.అంకమ్మరావు తెలిపారు. నేడు చైర్పర్సన్ ఎన్నిక తిరువూరు: తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక సోమవారం జరగనుంది. తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె. మాధురి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి ఎన్నిక జరుపుతారు. ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలో జరగనున్న ఎన్నికలకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యాలయ పరిసరాల్లో జన సంచా రం నిషేధించడంతో పాటు అన్ని మార్గాల్లో బారికేడ్లు కట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఏసీపీ ప్రసాదరావు పర్యవేక్షణలో సీఐ గిరిబాబు, ఎస్ఐలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడస్పోర్ట్స్: కృష్ణా జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జ్యోతిప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరిగోపాల్ ఎన్నికయ్యారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సంఘ ఎన్నికలు సంఘం కార్యదర్శి సైకం రామ్ప్రసాద్ పర్యవేక్షణలో జరిగాయి. టెన్నిస్బాల్ క్రికెట్ సంఘం రాష్ట్ర ప్రతినిధి ఆర్.డి.ప్రసాద్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా బి.మెహర్బాబు, ఉపాధ్యక్షులుగా జి.జగదీశ్వరరావు, ఎస్.కె.నబి, ఆర్.అప్పలస్వామి, సీనియర్ సహాయ కార్యదర్శులుగా ఎస్.కృష్ణప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా ఎ.శివగణేష్బాబు, జి.సాంబశివరావు, కార్యవర్గ సభ్యులుగా సి.హెచ్.కోటేశ్వరరావు, వి.రాజు, ఆర్.శివయ్య, పి.చంద్రమణిని సభ్యులు ఎన్నుకున్నారు. -
జీవితంలో యోగా భాగం కావాలి
ఏపీ జెన్కో ఎండీ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఇబ్రహీంపట్నం: యోగా మన భారతదేశ పౌరుల వారసత్వ సంపదని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతిఒక్కరూ రోజువారీ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా ఆయుష్, పర్యాటక, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక యోగాభ్యసన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యోగా ఔత్సాహికులు యోగాసనాలను అభ్యసించారు. ఈ సందర్భంగా చక్రధర్బాబు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు సూర్య నమస్కారాలు చేసినట్లు ప్రతి ఒక్కరూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రూఫ్టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోస్టర్ ఆవిష్కరణ.. డ్రగ్స్ రహిత రాష్ట్రం, జిల్లా లక్ష్యంగా ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, కలెక్టర్ లక్ష్మీశ, ఈగల్ ఎస్పీ ఎన్.నగేష్బాబు, ఇతర అధికారులతో కలిసి డ్రగ్స్ వద్దు (1972 టోల్ ఫ్రీ నంబర్) నినాదంతో రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీటీపీఎస్ సీఈ పి.శివరామాంజనే యులు, యోగాంధ్ర నోడల్ అధికారులు ఎం.సుహాసిని, శిల్ప, వి.రాణి తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతగా మొక్కలు నాటుదాం
చల్లపల్లి: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ముందుకువచ్చి పర్యావరణాన్ని కాపాడటంలో బాధ్యతగా వ్యవహరించాలని విజయవాడకు చెందిన వైద్యుల బృందం పేర్కొంది. 30 మందితో కూడిన ఎన్విరాన్మెంటల్ హెల్త్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా(ఫాగ్సి) బృందం స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమాల్లో ఆదివారం పాల్గొంది. 216 జాతీయ రహదారికి ఇరువైపుల, జంక్షన్ పాయింట్లో మొక్కలు నాటారు. వైద్యులు మాట్లాడుతూ జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు. అనంతరం పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 10 ఏళ్లుగా కొనసాగుతున్న స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమాలను స్వచ్ఛ రథసారఽథి డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి దంపతులు వివరించారు. -
స్వావలంబనకు ‘ఆర్థిక’ ఆయుధం..
వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారు. వైఎస్సార్ కాపునేస్తం ద్వారా కృష్ణాజిల్లాలో 90,057 మంది లబ్ధిదారులకు రూ. 135.09 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 31,906 మంది లబ్ధిదారులకు రూ. 47.85 కోట్లు వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 58,095 మంది లబ్ధిదారులకు రూ. 87.14 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా 56,898 మంది లబ్ధిదారులకు రూ. 85.35 కోట్లు నగదు జమ చేశారు. కనిపించని స్వావలంబన.. స్వలాభమే అంతా.. మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయటం లేదు. ప్రతి మహిళకు రూ.1500 నెలకు అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ హామీ గురించి ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. ఉచిత బస్సు ప్రయాణం హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి నాలుగు నెలలకు ఒక సిలిండర్ను అందజేసే విధంగా నిబంధనలు రూపొందించారు. అంతేకాకుండా ఇచ్చిన గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ కూడా లబ్ధిదారుల ఖాతాలో సరిగా జమ కావటం లేదని వారే వాపోతున్నారు. -
ఉపాధ్యాయులకు బలవంతపు బదిలీలు!
పీఎస్ హెచ్ఎంలుగా దరఖాస్తు చేయాలని ఎస్ఏలకు ఒత్తిడి మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను బలవంతపు బదిలీలు చేసేందుకు సిద్ధమైంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పీహెచ్సీ, విడోవర్స్, డైవోర్స్ టీచర్ల పట్ల అన్యాయం జరుగుతోంది. తాజాగా 2023లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొందిన టీచర్లను బలవంతంగా బదిలీకి దరఖాస్తు చేయమని జాబితా విడుదల చేసింది. ఈ టీచర్లను సర్ప్లస్, రీ–అపార్షన్లో చూపించలేదు. వీరికి బదిలీలతో సంబంధమే లేదు. అయినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయం మేరకు స్కూల్ అసిస్టెంట్లను హఠాత్తుగా ప్రైమరీ స్కూల్(పీఎస్) హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి చేయాలన్న యత్నం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బదిలీల ప్రక్రియ సంబంధించి స్పష్టమైన విధానం లేదని, బలవంతపు నిర్ణయాలు తీసుకుంటోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. దరఖాస్తు చేయాల్సిందే.. తప్పనిసరిగా పీఎస్ హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి కోసం దరఖాస్తులు చేయాలని స్కూల్ అసిస్టెంట్లను ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి కష్ణాజిల్లాలో పీఎస్ హెచ్ఎం పోస్టులకు సబ్జెక్టుల వారీగా 65 ఎస్ఏ తెలుగు, 01 ఎస్ఏ ఉర్దూ, 44 ఎస్ఏ ఇంగ్లిష్, 52 ఎస్ఏ గణితం, 13 ఎస్ఏ పీఎస్, 18 ఎస్ఏ బీఎస్, 37 ఎస్ఏ ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్లు పీఎస్ హెచ్ఎం పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు జిల్లాలో మొత్తం 19 ఖాళీలు గుర్తించారు. అందులో జెడ్పీ/ఎంపీ పాఠశాలల్లో 06 ఎస్ఏ గణితం, 10 ఎస్ఏ సోషల్, మునిసిపల్ పాఠశాలల్లో 01 ఎస్ఏ గణితం, 01 ఎస్ఏ సోషల్, ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో 01 ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉన్నాయి. పీఎస్ హెచ్ఎం వెబ్ ఆప్షన్స్ ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా.. ఉమ్మడి కృష్ణాలో స్కూల్ అసిట్టెంట్లకు.. లోకల్ బాడీస్ పాఠశాలల్లో 270 బయోలాజికల్ సైన్స్, 293 సోషల్, 521 గణితం, 8 స్పెషల్ ఏడు ఎడ్యుకేషన్, 153 ఫిజికల్ ఎడ్యుకేషన్, 317 ఫిజికల్ సైన్స్, 348 తెలుగు, 299 హిందీ, 387 ఇంగ్ల్లిష్, 4 సంస్కృతం పోస్టులు గుర్తించారు. మునిసిపల్ పాఠశాలల్లో 6 బయోలాజికల్ సైన్స్, 5 సోషల్, 10 గణితం, 2 ఫిజికల్ ఎడ్యుకేషన్, 6 ఫిజికల్ సైన్స్, 5 తెలుగు, 7 హిందీ, 8 ఇంగ్ల్లిష్, 01 నో సబ్జెక్ట్ పోస్టులు.. మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 37 బయోలాజికల్ సైన్స్, 35 సోషల్, 57 గణితం, 17 ఫిజికల్ ఎడ్యుకేషన్, 42 ఫిజికల్ సైన్స్, 20 తెలుగు, 35 హిందీ, 51 ఇంగ్ల్లిష్, 2 సంస్కతం, 38 నో సబ్జెక్ట్ పోస్టులు గవర్నమెంట్ పాఠశాలల్లో 10 బయోలాజికల్ సైన్స్, 13 సోషల్, 19 గణితం, 1 స్పెషల్ ఎడ్యుకేషన్, 4 ఫిజికల్ ఎడ్యుకేషన్, 16 ఫిజికల్ సైన్స్, 7 తెలుగు, 3 హిందీ, 10 ఇంగ్ల్లిష్, 1 సంస్కృతం, 1 ఉర్దూ పోస్టులకు ప్రొవిజషనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. వెబ్ ఆప్షన్స్ను పీఎస్ హెచ్ఎం బదిలీల ప్రక్రియ అనంతరం ప్రారంభించనుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)కు.. సంబంధించి లోకల్ బాడీస్ పాఠశాలల్లో 2,433, ప్రభుత్వ 11, మునిసిపల్ పాఠశాలల్లో 55 పోస్టులకు ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. -
‘డ్వాక్రా’కు భరోసా..
డ్వాక్రా సభ్యులకు ఆర్థిక చేయూతను అందించాలని వారు తీసుకున్న రుణాలకు వడ్డీ మాఫీతో పాటు రుణమాఫీ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత సున్నా వడ్డీ, జగనన్న తోడు పథకాల ద్వారా వారికి ఆర్థ్ధిక చేయూతను అందించారు. ఈ మూడు పథకాల ద్వారా కృష్ణాజిల్లాలో 1,35,745 మందికి గత ఐదేళ్లలో రూ. 135.75కోట్లు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 3,45,685 మంది లబ్ధిదారులకు రూ. 464.16కోట్లు అందజేశారు. అన్నింటా మొండిచెయ్యి.. డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పి ఇంత వరకు వారికి ఎటువంటి ఆర్థిక ఆసరాలు ప్రకటించలేదు. గతంలో డ్వాక్రా గ్రూపులను తామే ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నేడు డ్వాక్రా మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా మహిళలకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదు.