NTR
-
కొండపల్లి బొమ్మల పండుగ ప్రారంభం
ఇబ్రహీంపట్నం: కొండపల్లి బొమ్మలు, కొండపల్లి ఖిల్లా మన వారసత్వ సంపదని, వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, జిల్లా పర్యాటక ప్రాధికార సంస్థ, ఆధ్వర్యంలో కొండపల్లి బొమ్మల పండగ (సాంస్కృతిక వారసత్వ ఉత్సవం)ను కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. అనంతరం కొండపల్లి బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు కొండపల్లి బొమ్మలు, తోలుబొమ్మలు, కీలు బొమ్మల స్టాళ్లను సందర్శించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల వారసత్వ సంపదను భావితరాలకు వెలకట్టలేని బహుమతిగా అందించాలనే ఉద్దేశంతో బొమ్మల పండగను ఏటా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో హస్తకళల అభివృద్ధికి, హస్తకళాకారుల సంక్షేమానికి కృషిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మల తయారీలో నైపుణ్యత, సృజనాత్మక తతో నూతన ఆవిష్కరణలు చేసే వారిలో పది మందికి వచ్చే ఏడాది ఇదే రోజున రూ.50 వేలు చొప్పున రూ.5లక్షలు బహూకరిస్తామని ప్రకటించారు. ఉదయం ఖిల్లాపైకి ట్రెక్కింగ్ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోప్లతో ర్యాప్లింగ్ వాక్ చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అధికారుల వైఫల్యం వేడుకల నిర్వహణలో మునిసిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలొచ్చాయి. కలెక్టర్ వేదిక ఎక్కినా ప్రజలు లేకపోవడంతో అస హనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనూరాధ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, రీజనల్ డైరెక్టర్ వై.వి.ప్రసన్న, డీఈఓ ఎల్.చంద్రకళ, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, మెప్మా పీడీ మురళీకృష్ణ, డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు పాల్గొన్నారు. -
చేపల మేతగా కోళ్ల వ్యర్థాలను వాడితే కఠిన చర్యలు
జి.కొండూరు: చేపల మేతగా కోళ్ల వ్యర్థాలను వినియోగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా మత్స్యశాఖ అధి కారి సౌభాగ్య చక్రాణి, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి తేజశ్వి హెచ్చరించారు. జిల్లాలో కోళ్ల వ్యర్థాలను చేపల మేతగా వాడు తున్న వైనాన్ని వివరిస్తూ ఈ నెల 11వ తేదీన ‘గుట్టుచప్పుడు కాకుండా చల్లేస్తున్నారు’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. కథనానికి స్పందించిన మత్స్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. జి.కొండూరు మండలం కవులూరు శివారులో నిర్వహిస్తున్న చేపల చెరువులను సౌభాగ్య చక్రాణి, తేజశ్వి శనివారం తనిఖీ చేశారు. చెరువుల నుంచి వస్తున్న దుర్వాసనకు అధికారులే బెంబేలెత్తిపోయారు. కోళ్ల వ్యర్థాలను రవాణా చేస్తున్న రెండు వాహనాలను సీజ్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తున్న 30 ఎకరాల్లోని మూడు చెరువులను గుర్తించి, వాటిని నిర్వహిస్తున్న ముగ్గురు, గుంటూరు జిల్లా నులకపేట నుంచి కోళ్ల వ్యర్థాలను సరఫరా చేస్తున్న వాహన డ్రైవర్ పాలపర్తి సాంబయ్య , జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మరో వాహనం డ్రైవర్ ఎస్కే సలీమ్, కోళ్ల వ్యర్థాలను సరఫరా చేసే శ్రీనుపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోళ్ల వ్యర్థాలను వాడితే సహించేదిలేదని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. -
ఉర్రూతలూగించిన హెరిటేజ్ హార్మని
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో శనివారం రాత్రి హెరిటేజ్ హార్మనీ పేరుతో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఉర్రూతలూగిం చింది. గాయకులు ఎస్పీ శ్రీచరణ్, సునీత కలిసి ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము.. పాటతో సంగీత విభావరిని ప్రారంభించారు. వారితోపాటు సాహితి, అరుణ్ కౌండిన్య పలు పాటలను ఆలపించి అలరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. చారిత్రక సంపదను కాపాడి భావి తరాలకు అందించాల్సి అవసరం ఉందన్నారు. జిల్లాలో చారిత్రక సంపద గురించి నేటి తరానికి వివరించాలన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ సృజనాత్మకత కమిషన్ చైర్పర్సన్ తేజస్విని, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పాల్గొన్నారు. సభ అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు అందజేసి సత్కరించారు. 101 ఏళ్ల లక్ష్మయ్య, తెలుగు ఉపాధ్యాయుడు మెట్ట వెంకటేశ్వరరావు, డాక్టర్ సమరం, కార్పొరేషన్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న రమణ, ప్రమాద రహితంగా విధులు నిర్వహించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ జి.మోహన్రావు, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మ, 68 సార్లు రక్తదానం చేసిన ఎ.వి. సుధాకర్, యోగా ట్రైనర్ శీరీష, 50 ఏళ్లుగా పౌరోహిత్యం నిర్వహిస్తున్న వీరుపాక్ష సమస్యం తదితరులను కలెక్టర్ సత్కరించారు. సభ అనంతరం జరిగిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. -
పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ను నియమించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాను ప్రారంభించిన ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పాండు రంగ ప్రసాద్ మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన్ నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్, అసెస్మెంట్ బుక్స్ వంటి అశాసీ్త్రయ మైన విధానా లను తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయులపై పనిభారం తగ్గించి బోధనకే పరిమితం చేయాలన్నారు. టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్స్ను మినహాయించాలని సూచించారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేములపల్లి రాధిక, సయ్యద్ ఖాసీం మాట్లా డుతూ.. ఉపాధ్యాయులపై ఆన్లైన్ పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. నాలుగు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో రెండో పోస్టు మంజూరు చేయాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షలు పూర్ణ చంద్రరావు, అబ్దుల్ నయీం, అవని, శెట్టిపోగు రాము, కార్యదర్శులు రామారావు, బి.వసరాం, ఒ.లాలామద్, రమణ, ఖాజా, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మలకు భూ హక్కులు
జి.కొండూరు: రెవెన్యూ అధికారుల ఒంటెత్తు పోకడ రైతులకు తలనొప్పిగా మారింది. సమగ్ర భూ రీ సర్వే పేరుతో తప్పుల తడకగా రికార్డులను తయారు చేయడంతో దశాబ్దాల క్రితం మరణించిన వ్యక్తుల ఆత్మలకు సైతం భూ హక్కులు లభించాయి. ఎవరి భూమి ఎవరి పేరు మీదకు మారిందో కూడా అర్థంకాక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మరో వైపు తాము తాయారు చేసిన రికార్డుల ప్రకారమే పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామంటూ అధికారులు సిద్ధమయ్యారు. జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామంలో ఉన్న భూ రికార్డుల అన్నీ తారుమారు కావడం రెవెన్యూ అధికారుల వైఫల్యానికి అద్దంపడుతోంది. తప్పుల తడకగా రికార్డులు జి.కొండూరు మండల పరిధి ఆత్కూరు గ్రామంలో 1,524 ఎకరాల రెవెన్యూ భూమి ఉంది. అందులో ప్రభుత్వ భూమి పోనూ 1,254 ఎకరాల వరకు రైతుల పేరిట పట్టా భూమి ఉంది. అయితే ఈ గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల కోడ్ సమయంలో రీ సర్వే జరిగింది. ఈ సర్వేలో కొందరు రైతులు పాల్గొనలేదు. రీసర్వే పూర్తయిన వెంటనే ఎల్పీఎం నంబర్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎల్పీఎం నంబర్లను మూడేళ్ల వరకు ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు రూపొందించిన రికార్డుల ప్రకారం దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తులు, అసలు గ్రామానికే సంబంధం లేని వ్యక్తుల పేరిట భూములు ఉన్నాయి. భూమి ఉన్న రైతుకు లేనట్లు, భూమి లేని రైతుకు ఉన్నట్లు, ఒక రైతు భూమికి మరొక రైతును హక్కుదారుడిగా చూపుతూ పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేసేందుకు సిద్ధమయ్యారు. రీసర్వే జరిగిన అనంతరం ఈ రెండేళ్లలో మూడు వందలకుపైగా భూ ఖాతాల్లో భూమి క్రయవిక్రయాలు జరిగాయి. వందకుపైగా భూ ఖాతాల్లో భూ యజమానులు చనిపోగా వారి కుటుంబ సభ్యుల పేర్లతో రికార్డులను మార్చి ఇదే రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ చనిపోయిన వ్యక్తుల పేర్లతో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు రికార్డులను తయారు చేశారు. క్రయవిక్రయాలు జరిగిన భూమికి కొనుగోలు చేసిన వారి పేర్లతో రిజిస్ట్రేషన్లు పూర్తయితే పట్టాదారు పాసుపుస్తకాలను సైతం జారీ చేసిన రెవెన్యూ అధికారులు, ఇప్పుడు భూమిని విక్రయించిన రైతుల పేర్లతోనే పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రెవెన్యూ అధికారులు తయారు చేసిన రికార్డుల ప్రకారం భూమి కొలతల్లో వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. మరో వైపు క్రయవిక్రయాలు జరిగిన భూ ఖాతాల్లోనూ సమస్య ఉత్పన్నమవుతోంది. గ్రామంలో ప్రస్తుత రికార్డుల ప్రకారం 600 వరకు భూ ఖాతాలు ఉన్నాయి. 580కిపైగా భూ ఖాతాలు తప్పుల తడకగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆత్కూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ గ్రామ సభలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి బహిష్కరించారు. గ్రామంలో రీ సర్వే మళ్లీ జరిపించి రికార్డులను సరి చేయాలని కోరారు. మా గ్రామంలో నాకు ఖాతా నంబరు 95లో 8.5 ఎకరాలు భూమి ఉంది. అయితే ప్రస్తుతం 7.22 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ప్రస్తుత రికార్డుల్లో చూపుతున్నారు. అంతే మొత్తం భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మరోసారి రీసర్వే జరిపి వాస్తవంగా ఉన్న భూమిని నా పేరున రికార్డుల్లో ఎక్కించాలి. – కాటంనేని లక్ష్మీపతిరావు, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం నా భర్త కనగాల వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం మరణించారు. ఆయన పేరుమీద ఉన్న 6.32 ఎకరాల భూమిని నా పేరు మీదకు బదలాయించారు. అయితే ఇప్పుడు నా పేరుతో భూ ఖాతా నంబరు 15లో 2.79 ఎకరాలను తగ్గించి 3.53 ఎకరాలు మాత్రమే ఉందని పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మిగిలిన భూమిని ఎవరికి రాశారో చెప్పాలి. – కనగాల పద్మావతి, రైతు, ఆత్కూరు, జి.కొండూరు మండలం -
విజయవాడ మీదుగా వేసవి ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: వేసవిలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ ఒక ప్రటకలో తెలిపారు. ఎస్ఎంవీటీ బెంగళూరు–బాలుర్ఘాట్ (06551) ఈ నెల 17, 24 తేదీలలో శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఎస్ఎంటీవీ బెంగళూరులో బయలుదేరి, ఆదివారం ఉదయం 6 గంటలకు బాలుర్ఘాట్ చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06552) ఈ నెల 20, 27 తేదీలలో మంగళవారం ఉదయం 5.10 గంటలకు బాలుర్ఘాట్లో బయలుదేరి, బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. రెండు మార్గాలలో ఈ రైళ్లు కృష్ణార్జునపురం, బంగారుపేట్, కుప్పం, జోలార్పెట్టాయ్, కాట్పాడి, రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళంరోడ్డు, పలాస, బ్రహ్మపురం తదితర స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి–సంత్రగచ్చి (07677) ప్రత్యేక రైలు ఈ నెల 21న మంగళవారం ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రగచ్చి–హైదరాబాద్ (07678) ప్రత్యేక రైలు ఈ నెల 22న బుధవారం సాయంత్రం 4.45 గంటలకు సంత్రగచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.రెండు మార్గాలలో ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, ఖుర్ధారోడ్డు, భువనేశ్వర్, కటాక్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. కాకినాడ టౌన్–హిసార్ (07717) ప్రత్యేక రైలు ఈ నెల 21న మంగళవారం ఉదయం 5.40 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు హిసార్ చేరుకుంటుంది. ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మెడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ధర్మబాద్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. -
పేర్నినానిని కలిసిన రజక సంఘం నేతలు
పెనమలూరు: కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పేర్నినానిని ఆ పార్టీ రజక సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మచిలీపట్నంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ రజక, బీసీ సంఘాల నేతలు పేర్ని నానిని కలిసి గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చలు జరిపారు. రజక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పన్నీటి కాశయ్య, వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ శెట్టిపల్లి పూర్ణరజక, కృష్ణా జిల్లా వైఎస్సార్ సీపీ రజక విభాగం అధ్యక్షుడు లింగాల శోభన్బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు ఓలేటి అరవింద్, నాయకులు సత్తెనపల్లి శ్రీను, తాడేపల్లి సుబ్బారావు, పత్తికాయల శివ తదితరులు పాల్గొన్నారు. -
కాలువలు.. కడగండ్లు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సర్కార్ తీరుతో కృష్ణా డెల్టా రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేయడంతో రైతులకు కడగండ్లు తప్పడం లేదు. మే నెలలోనే సాగు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినా దానికనుగుణంగా కాలువల నిర్వహణపై ప్రభుత్వం శ్రద్ధ చూపటం లేదు. కాలువలు గుర్రపు డెక్క, తూటి కాడతో నిండిపోయాయి. వీటి నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఇప్పటికీ పనులకు అనుమతులు మంజూరు చేయలేదు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సరాసరిన నియోజకవర్గానికి రూ.3కోట్ల నుంచి రూ.4కోట్లతో అంటే దాదాపు రూ.38కోట్లతో ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పనులు త్వరితగతిన చేయకుంటే తర్వాత కాలువకు నీరు విడుదల చేస్తే పనులు చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత పనులు మంజూరైనా పనులు చేయకుండా మమ అనిపించి నిధులు మింగేసే అవకాశం ఉంది. వర్షాలు వస్తే డ్రెయిన్లు పొంగి పొలాల నుంచి నీరు బయటకు పోక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కాలువలకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసినా చివరి ఆయకట్టుకు నీరు అందని దుస్థితి నెలకొంటుంది. కృష్ణా డెల్టా పరిధిలో 13.08లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సింది. అధ్వానంగా కాలువలు ప్రధానంగా చంద్రయ్య డ్రెయిన్లో పనులకు రూ.22కోట్లు, కొమరవోలు డ్రెయిన్ మరమ్మతులకు రూ.11కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచినా పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు పనులు చేయకపోతే వర్షాకాలంలో చేయలంటే ఇబ్బందులు తప్పవు. ప్రధానంగా గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజక వర్గాల పరిధిలో పూడిక తీయక పోవడంతో అధ్వానంగా మారి పంట పొలాలు మునుగుతున్నాయి. దీనికి తోడు గుర్రపుడెక్క, తూటుతో మేట వేసుకుపోయాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాల్లీ, మోటూరు ఎల్ఎస్ మేజర డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. జిల్లాలో లజ్జబండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకొడు, వన్నేరు, ముస్తాఫాకొడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకొడు డ్రెయిన్లలో మురుగు నీరు సక్రమంగా దిగువకు ప్రవహించని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి నందివాడ మండలం ఎల్ఎన్ పురం వరకు ఉన్న బుడమేరులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. ఈ ఏడాదైనా పనులు సక్రమంగా చేపట్టకపోతే, రైతులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితులున్నాయి.. కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా.. కాలువ కృష్ణా ఎన్టీఆర్ బందరు 1.51లక్షల – ఎకరాలు కేఈబీ 1.38 – ఏలూరు 0.56 1,332 వేల ఎకరాలు రైవస్ 2.17 425 మొత్తం 5.62 లక్షల 1,757 వేల ఎకరాలు ఎకరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటి సంఘాలకు రూ.10లక్షల వరకు నామినేషన్పై పనులు కట్టబెట్టే వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ కాలువల్లో తూటికాడ, పిచ్చిమొక్కల తొలగింపు, షట్టర్ల మరమ్మతులు, కాంక్రీట్ పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గతేడాది కృష్ణా తూర్పు, కృష్ణా సెంట్రల్, డ్రెయినేజీ విభాగం, స్పెషల్ డివిజన్లో 650 పనులకు సంబంధించి రూ.26.03 కోట్లు మంజూరు చేశారు. కాలువలకు నీటి విడుదల తర్వాతే పనులు మంజూరు చేయడంతో, నీటి సంఘాల అధ్యక్షులు, నీటి పారుదల శాఖ అధికారులతో కుమ్మకై నామ మాత్రంగా పనులు చేపట్టి, మమ అనిపించారు. -
మేళాతో ప్రోత్సాహం
కళా వైభవం.. నేటి నుంచి కొండపల్లి బొమ్మల పండుగ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల పరిశ్రమ సుమారు 500 ఏళ్లకు పైగా విరాజిల్లుతోంది. అలాంటి కళా వైభవాన్ని భావితరాలకు అందించాలని కొండపల్లి బొమ్మల పండుగ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవాన్ని పుస్కరించుకొని శనివారం నుంచి 20వరకు వేడుకలకు ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న బొమ్మల మేళా కళాకారులకు చేయూతనిస్తోందనే ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బొమ్మల వేడుకలు విజయవంతం చేయాలని ఆదేశించారు. కొండపల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే బొమ్మల వేడుకలను బొమ్మల తయారీ కళాకారులతో పాటు ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం.. కొండపల్లి ఖిల్లా కోటను రెడ్డిరాజుల వంశానికి చెందిన ప్రోలాయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించే సమయంలో భవనాలపై చూడముచ్చటైన డిజైన్లు అద్దేందుకు రాజస్థాన్కు చెందిన రాజవంశీకులు ఇక్కడకు వలస వచ్చారు. రాజభవనాలపై డిజైన్(నగిషీలు)లు వేస్తూ రాజులు ఇచ్చే భరణాలతో జీవితాలు గడిపేవారు. కొందరు ఆ సమయంలోనే బొమ్మల తయారీ పరిశ్రమ కొండ కింద కొండపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం బ్రిటీష్ వారి పాలనలో బొమ్మల తయారీ పరిశ్రమను విస్తరించుకుని వారి జీవనభృతిని ఏర్పాటు చేసుకున్నారు. కొండపల్లి పరిధిలోని చుట్టుపక్కల అడవుల్లో లభించే తేలికపాటి తెల్లపొనికి చెక్కతో ఆకర్షణీయమైన బొమ్మలు ఇక్కడ తయారు చేసేవారు. రాజస్థాన్ కళాకారుల నుంచి ఈ ప్రాంతానికి చెందిన వారు సైతం బొమ్మల తయారీలో నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం సుమారు 150 కుటుంబాల వారు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. అట్టహాసంగా ఏర్పాట్లు.. బహుమతుల ప్రదానం.. కొండపల్లి బొమ్మల తయారీలో కళాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఫిబ్రవరి 3నుంచి మార్చి 8 వరకు నిర్వహించిన బొమ్మల పోటీల్లో కళాకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలను ఎక్స్పీరియన్స్ సెంటర్కు చేర్చారు. వేడుకలు ముగింపు రోజున న్యాయ నిర్ణేతల ప్రకటించిన విజేతలకు రూ.లక్ష విలువైన బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించనున్నారు. సుమారు 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల కోసం వేడుక ఈ ఏడాది జరగడం కళాకారుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ వేడుకలతో రెట్టింపు ఉత్సాహంతో కళాకారులు పరిశ్రమను ముందుకు తీసుకెళ్తారు. సుమారు 20ఏళ్లుగా నా కుటుంబం అత్యంత నైపుణ్యంతో బొమ్మల తయారీ పరిశ్రమ నడుపుతున్నాం. అనేక అవార్డులు కూడా వరించాయి. – కూరెళ్ల వెంకటాచారి, బొమ్మల కళాకారుడు, కొండపల్లి -
నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయండి
కంకిపాడు: పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. కంకిపాడు పోలీసుస్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీసుస్టేషన్ భవన నిర్మాణ పనులను గురువారం రాత్రి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. నిర్మాణ పరమైన అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అన్ని విభాగాలకు అధునాతన వసతులు సమకూరాలని సూచించారు. పోలీసుస్టేషన్ నిర్మాణ పనుల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐ జె.మురళీకృష్ణ, ఎస్ఐ డి.సందీప్లను ప్రత్యేకంగా అభినందించారు. హనుమాన్జంక్షన్ రూరల్: పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పారిశ్రామికవాడలో శాంతిభద్రతల పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యం అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఏపీఐఐసీ మోడల్ ఇండ్రస్టీయల్ ఎస్టేట్ను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవాడలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు, చోరీల నియంత్రణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, మహిళా ఉద్యోగులపై వేధింపులు వంటి పలు సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ మహిళా ఉద్యోగులు, కార్మికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఐ ఎల్.రమణ, వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ పాల్గొన్నారు. నందిగామ రూరల్: జిల్లాలో 35,945 మంది రైతులతో 42,088 ఎకరాలలో సాగు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. మండలంలోని కంచల గ్రామంలోని తత్వవనంలో సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ముందుగా మామిడి తోటలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. తర్వాత పీఎండీఎస్ (ప్రీ–మాన్ సూన్ డ్రై సోయింగ్) విత్తనాలు, విత్తన గుళికల తయారీని తెలుసుకుని ఐదు ఎకరాలలో విత్తనాలు నాటడాన్ని ప్రారంభించారు. ఆర్డీవో పోశిబాబు, తహసీల్దార్ సురేష్ బాబు, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అంజిరెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాసరావు, ఏవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దేవదాయ శాఖ ఎక్స్అఫీషియో సెక్రటరీ డాక్టర్ ఎం. హరిజవహర్లాల్ శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన హరిజవహర్లాల్ను అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అనంతరం మహామండపం రెండో అంతస్తులో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. అన్న భక్తులతో కలిసి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణపై పలు సూచనలు చేశారు. తన కుమార్తె పుట్టిన రోజును పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణకు ఆయన విరాళాన్ని అందజేశారు. -
హజ్ యాత్రికుల సురక్షిత ప్రయాణానికి ఏర్పాట్లు
గన్నవరం: హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. స్థానిక ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్లో హాజ్ యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. హజ్ యాత్రికులకు కల్పిస్తున్న సదుపాయలను ఆయన పర్యవేక్షించడంతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది విజయవాడ అంబార్కేషన్ పాయింట్ నుంచి 335 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. వీరిలో తొలి విడతలో శనివారం 160 మంది, ఆదివారం రెండో విడతలో 175 మంది వెళ్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాదిలో హజ్ యాత్రు వెళ్తున్న వారిలో 50 శాతం మహిళలు ఉన్నట్లు చెప్పారు. ముందుగా ఇక్కడికి చేరుకున్న సుదూర ప్రాంతాలకు చెందిన యాత్రికులకు ప్రత్యేక వసతి, భోజనం, వైద్య సదుపాయాలను ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్, హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ షేక్ హాసన్బాషా, కమిటీ సీఈఓ గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికుల వసతి కల్పిస్తున్న ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ను జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. -
ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్తో అగ్ని ప్రమాదాల నివారణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అమరావతి రాజధాని ప్రాంతంలో హైరేంజ్ బిల్డింగ్స్ రానున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు ఇంటిగ్రేటెడ్ అర్బన్ ప్లానింగ్ రూపొందించనున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీపీ వెంకటరమణ చెప్పారు. ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అమరావతి చాప్టర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం రాత్రి విజయవాడ నగరంలోని హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటరమణ ముఖ్యఅతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వెంకట రమణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటుగా తమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో త్వరలో 23 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా ఎన్నికై న వి.కాంతారావు, కార్యదర్శి వైవీ దుర్గారావు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ బి.ఉమామహేశ్వరరావు, ప్రాంతీయ డైరెక్టర్ శివరామకృష్ణన్, అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు రాఖీ దీపక్తో పాటుగా సభ్యులు పాల్గొని నూతన కమిటీని అభినందించారు. -
‘కృష్ణా’ రాజకీయాల్లో నెహ్రూ ఒక బ్రాండ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూ అంటే ఒక బ్రాండ్ అని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ) 9వ వర్ధంతిని పురస్కరించుకొని గుణదలలోని ఆయన ఘాట్ వద్ద శుక్రవారం ఆయన తనయుడు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెహ్రూ పార్టీలకు అతీతంగా అందరికీ సహాయం చేసేవారని, నెహ్రూ వారసుడిగా అవినాష్ రాజకీయాల్లో తన ఒరవడిని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ జెండా పట్టుకొని ప్రజల పక్షాన నిలిచారన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను నమ్మిన వాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా నెహ్రూ చూసుకున్నారన్నారు. నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రితో సాన్నిహిత్యంగా ఉన్న వారందరూ వచ్చి నివాళులర్పించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు కై లే అనిల్కుమార్, మొండితోక జగన్మోహనరావు, సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా నాయకుడు నెహ్రూ: పేర్ని నాని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని నెహ్రూ ఉమ్మడి కృష్ణాలో ప్రజానాయకుడిగా నిలిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్నినాని అన్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్(నెహ్రూ)9వ వర్ధంతిని పురస్కరించుకుని ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అన్ని విధాల అండగా నిలిచారని, విజయవాడ రాజకీయ పుస్తకంలో తనకంటూ ఒకపేజీని నెహ్రూ సృష్టించుకున్నారని కొనియాడారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అలాగే మొగల్రాజపురం నిమ్మతోట సెంటర్లో లంకా అబ్బినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 527.20 అడుగులకు చేరింది. ఇది 152.7328 టీఎంసీలకు సమానం.చిలకలపూడి : జన గణన– 2027కు సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఆయన చాంబర్లో స్వీయ గణన చేసుకున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తిపేరు మల్లయ్య. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామం. వయసు 32 సంవత్సరాలు. అతనికి ఇద్దరు కుమార్తెలు. పక్షవాతం వచ్చి రెండు కాళ్లూ పడిపోయాయి. పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ భారం అంతా అతని భార్యపై పడింది. పిల్లల చదువులు, భర్తకు మందులు, కుటుంబ పోషణ కష్టం మారింది. విధిలేని పరిస్థితుల్లో విజయవాడ వచ్చి భర్త ఆరోగ్యం చూసుకుంటూ వాచ్ఉమన్గా పనిచేస్తోంది. తన భర్తకు పెన్షన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ‘ఈ ఫొటోలో వ్యక్తిపేరు చింతలపూడి దుర్గారావు. ఇతనికి సొంతిల్లు లేదు. విజయవాడ సత్యనారాయణపురంలో అద్దె ఇంట్లో నివసివస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని ఎడమ కాలిని మోకాలి వరకు తొలగించారు. రెండో కాలుకు పైలేరియా సోకడంతో నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. పొట్టకూటి కోసం బీసెంట్ రోడ్డులో ఓ పక్కన పట్టా వేసుకుని కూర్చుని జూట్ సంచులు, పట్టీలు, చైన్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సదరం క్యాంప్లో వైద్యులు అతడిని పరీక్షించి 70 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేశారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుందామంటే రెండేళ్లుగా ఆన్లైన్లో సైట్ ఓపెన్ కాలేదు. గతేడాది దీపావళి సమయంలో బీసెంట్ రోడ్డులో పర్యటించిన సీఎం చంద్రబాబును దుర్గారావు కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. తనకు పెన్షన్, ఇల్లు మంజూరు చేయాలని, జీవనోపాధి కల్పించాలని కోరాడు. చంద్రబాబు స్పందించి అతనికి పెన్షన్, సొంతిల్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ఆరునెలలుగా నెరవేరలేదు. నాలుగైదు సార్లు పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేసుకున్నా స్పందన లేదు. 7 -
పెన్షనర్ల సామాజిక భద్రతకు ప్రభుత్వాల తూట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పెన్షనర్ల సామాజిక భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వరప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గుట్టుగా తెచ్చిన వ్యాలిడేషన్ చట్టంతో దేశంలోని కోటి మంది పెన్షనర్లకు ముప్పు పొంచి ఉందని, ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం మహాత్మాగాంఽధీరోడ్డులోని పీ అండ్ టీ క్వార్టర్స్ ప్రాంగణంలో పెన్షనర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాలిడేషన్ ఆఫ్ సీసీఎస్ పెన్షన్ నిబంధన చట్ట సవరణను రద్దు చేయాలని, ఎనిమిదో వేతన సవరణ కమిషన్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి. అశోక్బాబు, సర్కిల్ కన్వీనర్ ఎన్.రామారావు, జిల్లా కార్యదర్శి రమేష్బాబు, సుంకు సుబ్బారావు, భానుబాబు, కోటేశ్వరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్సీ బోస్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం ఇచ్చిన హామీకే అతీగతి లేదు
ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదు. ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు అంటూ హామీలు ఇచ్చారు. కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. నేరుగా పేదలను కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. పింఛన్లకు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి పేదలను ఆదుకోవాలి. – కామరాజ్ హరీష్, ప్రధాన కార్యదర్శి, బీసీఎస్ఎఫ్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూటమి నాయకులు ఊదరగొట్టారు. సామాజిక పింఛన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని, అర్హులు అందరికీ లబ్ధి చేకూరుస్తామని గొప్పల డప్పు కొట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించలేదు. పెన్షన్ వస్తూ భర్త చనిపోయిన వారికి స్పౌజ్ కేసు కింద ప్రభుత్వం పింఛనుకు అవకాశం కల్పించి చేతులు దులుపుకొంది. కొత్త పింఛన్ కోసం పీజీఆర్ఎస్లో దరఖాస్తు చేద్దామని వెళ్లిన వారికి రిసెప్షన్లో చేదు అనుభవం ఎదురవుతోంది. పింఛన్ మాటెత్తగానే అసలు అర్జీలు తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. పక్షవాతంతోనో, ప్రమాదాల్లో, ఇతర కారణాలతో కాళ్లు పోయి మంచానికే పరిమితమైన వారు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. మందులు, ఆహారం కూడా సమకూర్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వారు పింఛన్లు మంజూరు కాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునేవారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ మంజూరు చేసి తమను ఆదుకోవాలని ఎంతో ఆర్తిగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రావడం లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2,36, 237 పెన్షన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వంలో 2,26, 775 పింఛన్లు ఇస్తున్నారు. చంద్రబాబు సర్కార్ పింఛన్లలో కోత వేసింది. అమలుకు నోచని 50 ఏళ్లకే పింఛన్ హామీ అధికారంలోకి వస్తే 50 ఏళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు మంజూరు చేస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ రెండేళ్లయినా అమలుకు నోచుకోలేదు. ఈ రెండేళ్లలో యాభై ఏళ్లు దాటిన వారు సామాజిక భద్రత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ప్రకటించిన జిల్లా బడ్జెట్లో పెన్షన్లకు ప్రత్యేక కేటాయింపులు జరగలేదు. దీన్ని బట్టి ఈ ఏడాది కూడా కొత్త పింఛన్ల మంజూరు లేనట్లేనని కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హాకర్లు, పేదల బాగోగులు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు దీపావళి పండుగ రోజు బీసెంట్ రోడ్డులో పర్యటించారు. దుర్గారావు అనే వ్యక్తికి పింఛన్, ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తానని స్వయంగా హామీ ఇచ్చారు. ఇది జరిగి నెలలు గడస్తున్నా దుర్గారావుకు పింఛన్ మంజూరు కాలేదు. తనకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, పింఛన్ మంజూరు చేయా లంటూ అధికారుల చుట్టూ ఆనాటి ఫొటోలను చూపినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాళ్లు లేక ఇబ్బందులు పడుతున్న తనకు చంద్రబాబు రూపంలో కొండంత అండ దొరికిందని సంబర పడ్డానని, అయితే ఆయన ఇచ్చిన హామీనే అమలు చేయడంలేదని, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని దుర్గారావు వాపోయారు. దుర్గారావు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. -
యనమలకుదురు ఆలయ అర్చకులకు బెయిల్
పెనమలూరు: యనమలకుదురు శ్రీరామలింగేశ్వరస్వామివారి ఆలయంలో అర్చకులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆలయంలో భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఈవో ఎన్.భవాని, అర్చకులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్య స్వాహా చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి అర్చకులను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.50 వేలు రికవరీ కూడా చేశారు. ఈవో ఎన్.భవాని ముందస్తు బెయిల్ తీసుకోగా మిగతా ముగ్గురు అరెస్టు కావటంతో అవనిగడ్డ జైలుకు వెళ్లారు. ఇద్దరు అర్చకులు, ఒక ఉద్యోగికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవో, అర్చకులు సస్పెన్షన్లో ఉన్నారు. విచారణ పూర్తి ఆలయంలో జరిగిన అవినీతిపై గత కొద్ది రోజులుగా ఐదుగురితో కూడిన కమిటీ చేసిన విచారణ పూర్తైంది. ఆలయంలో రికార్డులు తనిఖీ చేశారు. విచారణ నివేదికను ఎండోమెంట్ కమిషనర్కు సమర్పిస్తారు. అయితే ఆలయంలో ఆభరణాలపై భక్తుల సమక్షంలో బహిరంగ విచారణ చేయాల్సి ఉంది. స్వామివారి ఆభరణాలు ఉన్నాయా... స్వాహా చేశారా అనే విషయం తేలాలి. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని ఫిర్యాదు గన్నవరం: సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ గురువారం స్థానిక పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఒక ప్రైవేట్ సమావేశానికి సంబంధించిన దృశ్యాలను అనధికారికంగా రికార్డు చేయడంతో పాటు ఆడియో, వీడియో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తనను అసభ్యకరంగా చిత్రీకరించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం గన్నవరం: సూరంపల్లి శివారు రామచంద్రపురం వద్ద జాతీయ రహదారి బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం... పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఇల్లూరి జగదీష్(27) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన జగదీష్ బుధవారం బైక్పై హనుమాన్ జంక్షన్లోని స్నేహితుడి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి కానూరు వస్తుండగా బైపాస్ రోడ్డులో రామచంద్రపురం వద్ద టోల్గేట్ దాటిన తర్వాత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఘనంగా రైల్వే వారోత్సవాలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో గురువారం రైల్వే వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో డీఆర్ఎం మోహిత్ సోనాకియా 2025–26లో డివిజన్ సాధించిన పురోగతిని వివరించారు. రికార్డు స్థాయిలో రూ. 5,939 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసిందని, 40.64 మిలియన్ టన్నుల అత్యధిక సరుకు రవాణాను సాధించడం డివిజన్కు గర్వకారణమని కొనియాడారు. రైళ్ల సమయపాలన 87 శాతానికి మెరుగుపడిందని పేర్కొన్నారు. డివిజన్లో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించడం, మూడవ లైన్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, దీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న వేగపరిమితులను తొలగించడం, పెద్ద ఎత్తున ట్రాక్ పునరుద్ధణ వంటి కీలక విజయాలను సాధించామన్నారు. రద్దీ నివారణకు డివిజన్ మీదుగా ఐదు వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడిపామన్నారు. ఈ సందర్భంగా విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 58 ఉద్యోగులకు రైల్ సేవా పురస్కారాలు, 12 మంది ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎంలు పీఈ ఎడ్విన్, కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీపీఓ ప్రేమ్కుమార్ లకావత్, పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టి కృషి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ లబ్బీపేట(విజయవాడతూర్పు): రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో గురువారం ‘పీఎం–రాహత్’ పథకం అమలు–ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాలతో గాయపడే వారికి తక్షణం ఉన్నత వైద్యాన్ని అందించడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పీఎం రాహత్ పథకం క్షతగాత్రులకు ఉపశమనాన్ని ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలోగా ఉచితంగా రూ.1.5 లక్షల వైద్యాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని అందరికీ వర్తింపజేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 656 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పీఎం రాహత్ కింద సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు పరిధిలో కనీసం 1,500 ఆస్పత్రుల్లో పీఎం–రాహత్ కింద వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. రోడ్డు ప్రమాదాల నిరోధంపై అన్ని జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు (రోడ్డు సేఫ్టీ) నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంఈ డాక్టర్ రఘునందన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బోస్, ఆషా అధ్యక్షులు డాక్టర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో డిసీజ్ మానిటరింగ్ కేంద్రం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల సాధన కోసం ప్రభుత్వ వైద్య కళాశాలలు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ర్యాంకింగ్ రావడం వల్ల వైద్య కళాశాలలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో రూ.6 కోట్లతో ఏర్పాటు కాబోతున్న డీఎండీసీ (డిసీజ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్) కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ లాన్సెట్ వంటి అంతర్జాతీయ స్థాయి జర్నల్స్లో రాష్ట్ర వైద్యుల పరిశోధన పత్రాలు ప్రచురితం జరిగేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయిసుధీర్, లక్ష్మీ సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్లపైకి మరోసారి బుల్డోజర్
పెనమలూరు/కంకిపాడు: కూటమి పాలకులు పేదల ఇళ్లపై కన్నెర్ర చేశారు. గోసాల–వణుకూరు రోడ్డులో ఉన్న పేదల ఇళ్లు బుధవారం నేలమట్టం చేశారు. పెద్ద ఎత్తున బుల్డోజర్లు తీసుకు వచ్చి విచక్షణారహితంగా ఇళ్లను కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా ఉండటానికి పెద్ద ఎత్తున పోలీసులు రంగంలోకి దించి బందోబస్తు పెట్టారు. ఏళ్లుగా ఉంటున్న ఇళ్లు కళ్ల ఎదుటే నేలమట్టం చేయటంతో బాధితులు బోరున విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని గోసాల–వణుకూరు ఆర్ అండ్బీ రోడ్డు పక్కనే గత 40ఏళ్లుగా చాలా మంది పేదలు ఇళ్లు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అయితే టీడీపీ నేతల కళ్లు పేదల ఇళ్లపై పడ్డాయి. దీంతో నాలుగు రోజుల క్రితం బుల్డోజర్లతో వచ్చి ఇళ్లను నేలమట్టం చేయాలని యత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి అడ్డుకున్నారు. పేదలను రోడ్డు పాలు చేస్తే సహించేది లేదని నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేయడంతో ఇళ్ల కూల్చి వేత ఆగింది. తెల్లవారుజామునే కూల్చివేత.. అయితే రెవెన్యూ, పోలీసు ఒక్కసారిగా బుధవారం ఉదయాన్నే హఠాత్తుగా రంగంలోకి దిగారు. గోసాల రోడ్డులో ఉన్న దాదాపు 25 పేదల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేశారు. ఎటువంటి గొడవలు జరగకుండా దాదాపు 100 పోలీసులు పహారా కాశారు. ఒక్కసారిగా బుల్డోజర్లు వచ్చి ఇళ్ల పై పడి కూల్చివేయటంతో నిద్రమత్తులో ఉన్న పేదలు ఉలిక్కిపడ్డారు. తమకు న్యాయం చేయాలని పేదలు వేడుకున్నా అధికారులు మనసు కరగలేదు. కాకీలను అడ్డు పెట్టుకుని మొత్తం ఇళ్లన్నీ నేలమట్టం చేయటంతో పేదలు ఆర్తనాదాలు పెట్టారు. పేదలకు తమ ఇళ్ల వద్ద కూడా ఉండనీయలేదు. గోసాల రహదారి పోలీసులు మూసివేశారు. రియల్టర్ల కోసమేనా? రోడ్డు ఆక్రమణలు తాము తొలగించామని, ఇక్కడి పేదలకు వేల్పూరులో ఇళ్ల స్థలాలు ఇచ్చామని రెవెన్యూ అధికారులు తెలిపారు. అయితే గోసాలకు వేల్పూరు చాలా దూరమని తాము అక్కడికి వెళ్లి ఏమి చేయాలని బాధితులు కంటతడి పెట్టారు. ఇక్కడ పనులు చేసుకునే తాము వేల్పూరుకు వెళ్లలేమని చెప్పినా వినలేదన్నారు. కేవలం రియల్టర్ల వ్యాపారం కోసమే పేదల ఇళ్లు నేలమట్టం చేశారని ఆరోపిస్తున్నారు. గోసాలలో 25 ఇళ్లు నేలమట్టం -
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ఈగల్ ఐజీపీ రవికృష్ణపెనమలూరు: రాష్ట్రంలో యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో బుధవారం విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ, ఈగల్ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ఇక్కడకు వచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ఈగల్ మిషన్ ద్వారా విద్యార్థులందరినీ కలిసి ఎన్డీపీ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాదకద్రవ్యాలను పట్టుకోవటానికి రైళ్లు, బస్సులు, కార్లపై నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్తో విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో పొగాకు, సిగరెట్లు విక్రయాలు నిషేధించామని తెలిపారు. 22 నాటికి ముగిస్తాం.. విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఫౌండర్ విజయ్కలాం మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీ నుంచి తిరుపతి వేంకటేశ్వర యూనివర్సీటీ నుంచి విశాఖపట్నంలో ఈ నెల 22వ తేదీ నాటికి ముగిస్తామన్నారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నాగేష్బాబు, అదనపు ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ ధర్మేంద్ర, సిద్ధార్థ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో ఉత్తమ ఫలితాలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు ఇంటర్మీడియెట్ – 2026 ఫలితాలలో చక్కని ఫలితాలను సాధించినట్లు అధికారులు ప్రకటించారు. జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలలో మొత్తం 804 మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 700 మంది ఉత్తీర్ణతను సాధించి, 87 శాతం నమోదు చేశారన్నారు. ముప్పాళ్ల గురుకులం (100), కుంటముక్కల (98), రంగా పురం (97), నర్సాపురం (96), జగ్గయ్యపేట (95), బల్లిపర్ర (91) శాతం చొప్పున విజయాలను అందుకున్నాయన్నారు. సీనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాలకు సంబంధించి మొత్తం హాజరైన విద్యార్థులు 944కాగా ఉత్తీర్ణులైన వారు 888 మొత్తం ఉత్తీర్ణత 94శాతంగా నమోదైంది. కుంటముక్కల పాఠశాల బాలికల ప్రతిభ జి.కొండూరు: ఇంటర్ ఫలితాల్లో కుంటముక్కల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో స్టేట్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 149 మంది విద్యార్థినులకు గానూ 146 మంది ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 61మంది విద్యార్థినులకు గానూ 60 మంది ఉత్తీర్ణత సాధించారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో పి.కల్యాణిలక్ష్మి 988/1000 ప్రథమ స్థానం, ఎం.నవ్యశ్రీ 984/1000 ద్వితీయస్థానం, సీహెచ్ లక్ష్మీకీర్తన 982/1000 తృతీయ స్థానంలో నిలిచారు. సీనియర్ బైపీసీలో పి.భవానీ 985/1000, ఎం.జెస్సీకా 982/1000, డి.జాస్మిన్ శాంతిప్రియ 981/1000, సీఎస్ తనూజీ 981/1000 మార్కులతో మొదటి మూడు స్థానాలలో నిలిచారు. జూనియర్ ఎంపీసీలో బి.పూజిత 465, పి.నిఖిత 462, కె.సంజన 462, ఎ.దీపిక 460 మొదటి మూడు స్థానాలలో నిలిచారు. జూనియర్ బైపీసీలో ఎస్.శ్రీలక్ష్మి 451/455, ఇ.లాస్య 450, టి.ప్రియ 450, పి.అనితాబాయ్ 450, బి.సంధ్యన 448మార్కులతో సత్తా చాటారు. -
ద్వితీయంలో తృతీయం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీ క్షల ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో తృతీయ స్థానంలో నిలిచారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 84 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచారు. గత ఏడాది 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తృతీయ స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది 89 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రథమ సంవత్స రంలో ఉత్తీర్ణత పెరగ్గా, ద్వితీయ సంవత్సరం తగ్గింది. మొత్తంగా 2024 సంవత్స రంలో ద్వితీయ స్థానంలో ఉన్న జిల్లా గడిచిన రెండేళ్లగా దిగజారుతోందని ఫలితాలు వెల్లడిస్తున్నాయి. బాలికలదే పైచేయి మొదటి సంవత్సరానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన విద్యార్థులు 34,510 మంది పరీక్షకు హాజరవగా 29,103 మంది ఉత్తీర్ణులయ్యారు. 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరంలో 36,151 మంది పరీక్షకు హాజరవగా 31,453 మంది ఉత్తీర్ణులయ్యారు. 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్ జనరల్ పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరం 16,658 మంది పరీక్షలు రాయగా 14,155 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 85 శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 16,835 మంది పరీక్షలకు హాజరవగా 14,670 మంది ఉత్తీర్ణతను సాధించారు. 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురి విషయంలో మొదటి ఏడాది 80, ద్వితీయ సంవత్సరం 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేట్ కళాశాలల ఉత్తీర్ణత ఇలా.. జిల్లాలో అన్ఎయిడెడ్ / ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి మొదటి ఏడాది 32,696 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా 27,593 మంది ఉత్తీర్ణత సాధించారు. 84 శాతం ఉత్తీర్ణత నమో దైంది. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 34,751 మందికి 29,939 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 86 శాతంగా నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మరోసారి రాష్ట్రంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2025–26 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం విద్యార్థులు 90, ద్వితీయ సంవత్స రంలో 92 శాతం ఉత్తీర్ణత సాధించి అగ్రస్థానం దక్కించుకున్నారు. 2024–25లో ప్రథమ సంవత్సరంలో 85, రెండో సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత ఒక శాతం తగ్గగా, ప్రథమ సంవత్సరంలో ఐదు శాతం పెరిగింది.ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో రెండో సంవత్సరం విద్యార్థులు 70 శాతం ఫలితాలను సాధించారు. జిల్లాలో సుమారుగా పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మొదటి ఏడాది పరీక్షకు 1,670 మంది విద్యా ర్థులు హాజరవగా 860 మంది ఉత్తీర్ణత సాధించారు. 51 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండో సంవత్సరానికి సంబంధించి 1,153 మంది విద్యార్థులకు 806 మంది ఉత్తీర్ణుయ్యారు. 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ మొదటి ఏడాది 86 శాతం, రెండో ఏడాది 92 శాతం, ఏపీటీడబ్ల్యూఆర్ మొదటి ఏడాది 97 శాతం, రెండో ఏడాది 95 శాతం, హైస్కూల్ ప్లస్ మొదటి ఏడాది 37 శాతం, రెండో ఏడాది 57 శాతం, మోడల్ స్కూల్ మొదటి ఏడాది 85 శాతం, రెండో ఏడాది 93 శాతం, కేజీబీవీ మొదటి ఏడాది 81 శాతం, రెండో ఏడాది 90 శాతం ఫలితాలను సాధించారు. -
ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రజలను, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేతిలో ఆయుధంగా మారిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ప్రతిపక్షాలను వేధిస్తూ రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ను ఆయన కార్యాలయంలో అంబటి రాంబాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా తనను తప్పుడు కేసులో ఇరికించి 18 రోజులపాటు జైల్లో నిర్బంధించిందని గుర్తు చేశారు. ఆ సమయంలో జడ శ్రావణ్కుమార్ తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారని పేర్కొన్నారు. రాజమండ్రి జైల్లో ఉన్న తనను కలిసి పరామర్శించారన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తనకు అండగా నిలిచిన జడ శ్రావణ్కుమార్కు ధన్యవాదాలు తెలిపేందుకు ఆయన కార్యాలయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్ తమ పార్టీ కాకపోయినప్పటికీ ఈ ప్రభుత్వం తన అరెస్టు విష యంలో అక్రమంగా వ్యవహరించిందని ప్రపంచానికి చాటారన్నారు. జడ శ్రావణ్ కుమార్ సమా జంలో జరిగే అన్యాయాలపై కంఠం వినిపిస్తున్నా రని, ఆయన మాటలు సమాజంపై ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని వైఎస్సార్ సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారన్నారు. నోటీసులు ఇస్తే సరిపోయే కేసుల్లో సమాజంలో పేరుగడించిన వ్యక్తులను రౌడీల్లా, సంఘ విద్రోహ శక్తుల్లా ఎత్తుకు పోవడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించి వేధించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని స్పష్టంచేశారు. పోలీసులు, ప్రభుత్వాలు ఉంది కక్ష తీర్చుకోవడానికి కాదని, ప్రజల సంక్షేమాన్ని చూసేందుకు పని చేయాలని హితవుపలికారు. ప్రభుత్వాలు కక్ష తీర్చుకునేందుకు పోలీసులు వాడుకునే నీచస్థాయికి దిగజారిపోయాయన్నారు. గుంటూరులో నిరసన నిరాహార దీక్ష ఈ నెల 18వ తేదీ ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు అంబటి రాంబాబు ప్రకటించారు. రెండు ప్రధాన డిమాండ్లతో 12 గంటల నిరసన నిరాహార దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అరెస్టయినప్పటి నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకు పోలీసులు ప్రవర్తించిన తీరు చట్టవ్యతిరేకమైందని స్పష్టంచేశారు. తనను హింసించాలని ప్రయత్నించిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణ జరపాలని, తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపాలనే డిమాండ్లతో దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులకు కనువిప్పు కలగా లని తాను చేస్తున్న దీక్షకు ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పక్షాలు మద్దతు తెలపాలని అంబటి రాంబాబు కోరారు. జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ పూడి శ్రీహరి అరెస్ట్ను ఖండించారు. ఇది మీడియాపై దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. -
దుర్గమ్మకు రూ.2.69 కోట్ల హుండీ ఆదాయం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తులు రూ.2.69 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులుగా సమర్పించారు. అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను బుధవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. ఆలయ ఈఓ శీనానాయక్ పర్యవేక్షణలో జరిగిన లెక్కింపులో 16 రోజులకు రూ.2,69,48,521 ఆదాయం సమకూరింది. నగదుతో పాటు 420 గ్రాముల బంగారం, 2.755 కిలోల వెండి లభ్యమైంది. 249 యూఎస్ఏ డాలర్లు డాలర్లు, 45 యూరప్ యూరోలు, 130 యూఏఈ దిర్హమ్స్, 180 థాయిలాండ్ బాత్స్, 200 ఓమన్ బైసాలు లభించాయి. రద్దయిన రూ.2 వేల నోట్లు 12 వచ్చాయి. కానుకల లెక్కింపును వన్టౌన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, సెక్యూరిటీ అధికారులు పర్యవేక్షించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టాలని ఫిర్యాదు చిలకలపూడి(మచిలీపట్నం): సోషల్ మీడియా, టీవీ మాధ్యమాల్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అరికట్టాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కోరారు. వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని)తో కలిసి ఆయన అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడుకు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వంశీమోహన్ మాట్లాడుతూ.. సామాజిక మాధ్య మాల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఇమేజ్ దెబ్బతీయడానికి కొంత మంది కుయుక్తులు పన్నుతున్నారని, వారి పోస్టుల వెనుక ఉన్న వారి కోసం విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు చెస్ ఆడటం వల్ల వారిలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయని దీని వల్ల విద్యలో కూడా రాణిస్తారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ చెప్పారు. స్థానిక కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు అమరావతిలోని విట్ యూనివర్సిటీలో త్వరలో జరగునున్న ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. బాల బాలికలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 24 మంది క్రీడాకారులను ఓపెన్ చెస్ ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపిక చేశామని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫణికుమార్ చెప్పారు. స్కూల్ సీఈవో కె.జాహ్నవితో పాటుగా ఆంధ్ర చెస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో నియామకాలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ హోదాల్లో నియమించారు. రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చలమాల నాగ సత్య నారాయణరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వానపల్లి సీతాదేవి నియమితులయ్యారు. జిల్లా అనుబంధ విభాగ కమిటీల్లో.. ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్య దర్శిగా వంగూరి కుమారి, ఇంటలెక్చువల్ ఫోరం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఇమ్మడి మురళీ కృష్ణ, మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ గౌస్ జానీ, సోషల్ మీడియా వింగ్ కార్యదర్శులుగా నల్లమోతు సురేష్బాబు, షేక్ మాబూ సుభాని నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
అగ్గి రాజేసిన ప్రొటోకాల్ రగడ
అవనిగడ్డ: అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం రసా భాసగా మారింది. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడంతో ఆయన వర్గీయులు బైఠాయించి ఆందో ళన చేశారు. శిలాఫలకాన్ని లాగేసి కాలువలోకి పారేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ నాయకుల మధ్య మరింత అగాధాన్ని సృష్టించింది. అన్న క్యాంటీన్ భవనం గోడకు ఆనుకుని టీడీపీ నేత విక్కుర్తి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈ ఫ్లెక్సీని తొలగించాలని పంచాయతీ, రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఫ్లెక్సీలో చంద్రబాబు, ఎన్టీఆర్ బొమ్మలు ఉండటంతో ఫ్లెక్సీ తీస్తే సహించేది లేదని కొందరు టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవం కొంత ఆలస్యమైంది. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం శిలాఫలకంపై ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు పేరు లేకపోవడం గమనించిన టీడీపీ నేతలు రావి నాగేశ్వరరావు, మెండు లక్ష్మణరావు (చంటి) శిలాఫలకం ముందు బైఠాయించి ఆందో ళన చేశారు. అనంతరం కొంతమంది ఈ శిలాఫ లకాన్ని లాగేసి పంటకాలువలో పారేసేందుకు యత్నించారు. వారిని గమనించిన టీడీపీ నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఈ శిలాఫలకాన్ని లాక్కుని భవనం దగ్గరకు తీసుకెళ్లారు. ఏఎంసీ చైర్మన్ పేరు లేకుండా శిలాఫలకం వేయడానికి వీలులేదని కొల్లూరు వర్గీయులు నినాదాలు చేశారు. కలెక్టర్, తహసీల్దార్కు వచ్చిన ప్రొటోకాల్ జాబితాలో ఏఎంసీ పేరుందని, కావాలనే ఆయన పేరుని తొలగించారని కొల్లూరి వర్గీయులు ఆరోపించారు. దీంతో కనపర్తి కలుగ జేసుకుని శిలాఫలకాన్ని తీసేసి ఏఎంసీ చైర్మన్ పేరు వేయించి మరో శిలాఫలకం ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఆందో ళనకారులు వెనక్కి తగ్గారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. ప్రొటోకాల్ విషయంలో పొరపాటు జరిగిందని, అందుకు క్షమించాలని సభావేదికపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రకటించడంతో కొల్లూరి వర్గీయులు శాంతించారు. ఈ ఘటన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ నేతల మధ్య అగ్గి రాజేసినట్టయిందని కొంతమంది బాహాటంగానే చెప్పారు. -
నేటి నుంచి స్వీయ గణన నగారా
వివరాలు వెల్లడించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశ ప్రగతి పథానికి దిక్సూచి అయిన జన గణన – 2027లో తొలి దశలో భాగంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) జరుగుతుందని.. ఇందులో ప్రజలు కీలకభాగస్వాములై ప్రక్రియను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జనగణనపై జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో స్వీయ గణన వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కచ్చితమైన డేటాతో పాటు కీలకమైన జనగణనలో విస్తృత ప్రజాభాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వివరించారు. ఇలా చేయాలి.. ఎస్ఈ.సెన్సస్.డాట్.జీఓవీ.ఇన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను పొందుపరుచుకోవచ్చని కలెక్టర్ సూచించారు. దీనివల్ల సమయం ఆదాతో పాటు దోష రహితంగా కచ్చితమైన డేటా లభిస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల ఎన్యూమరేటర్ భౌతిక పరిశీలనకు వచ్చినప్పుడు స్వీయ గణన ద్వారా అందించిన డేటాను త్వరితగతిన ధ్రువీకరించేందుకు వీలవుతుందన్నారు. బిల్డింగ్ నంబరు, కుటుంబంలో మొత్తం సభ్యులు, ఇంటి యాజమాన్య స్థితి, తాగునీటికి ప్రధాన వనరు, ఇంటర్నెట్ సౌకర్యం, టీవీ సౌకర్యం ఇలా మొత్తం 34 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు స్వీయ గణన ద్వారా స్వచ్ఛందంగా అందించవచ్చన్నారు. 15 రోజుల పాటు.. 15 రోజుల అవుట్రీచ్ క్యాంపెయిన్లో భాగంగా ఒక్కో రోజు ఒక్కో వర్గం లక్ష్యంగా స్వీయ గణనపై ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఏప్రిల్ 16న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను స్వీయ గణనలో భాగస్వామ్యం చేస్తామన్నారు. అదేవిధంగా 17వ తేదీన సచివాలయ సిబ్బంది, హెచ్వోడీ కార్యాలయాల సిబ్బంది, జిల్లా కార్యాలయాల సిబ్బంది, మండల కార్యాలయాల సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా ఏప్రిల్ 30 వరకు వివిధ వర్గాల ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు. సమావేశంలో మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం. వెంకట రామయ్య పాల్గొన్నారు. -
ఫెయిల్యూర్ గాయం కాదు.. ఒక పాఠం
లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్కులే జీవితం కాదు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించలేని ఎందరో భవిష్యత్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఉత్తీర్ణత సాధించలేదని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందకుండా పట్టుదలతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్తాపంతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలిక చికిత్స పొందుతోంది. ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫలితాలు వెల్లడైన ప్రతిసారి కొందరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చా యన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అందుకు వారు చదువులో ఎదుర్కొంటున్న ఒత్తిడి, తల్లిదండ్రులు ప్రభావం కూడా ఉంటోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాం, అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు రావాలి అంటూ తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై రుద్దుతున్నారు. దీంతో కొందరు పిల్లలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చలేకపోయామన్న బాధతో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఈ విధానం మారాలని, మార్కులు ప్రామాణికం కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. చదువు ఒక్కటే జీవితం కాదు చదువు ఒక్కటే జీవితం కాదు. జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువులో రాణించలేక పోయినా, ఇతర వృత్తుల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. ఒకసారి ఫెయిలైన వారు, తర్వాత పట్టుదలతో పరీక్షలు రాసి ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎందరో ఉన్నారనే వాస్తవాన్ని విద్యార్థులు గ్రహించాలి. ఆత్మహత్యలకు పాల్పడి తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగల్చడం సరికాదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పిరికితనంతో చేసే చర్యగా నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రుల పాత్రే కీలకం విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో తల్లిదండ్రుల పాత్రే కీలకమని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కొందరు తల్లిదండ్రులు రూ.లక్షల ఫీజులు చెల్లించి కార్పొరేట్ కాలేజీల్లో చేరుస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నాం, మంచి మార్కులు రావాలంటూ పదే పదే పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కొందరు పిల్లలు మానసికంగా కుంగిపోయి, ఫెయిలైనా, మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, తమ పిల్లలు ఫెయిలైనా మరో అవకాశం ఉంన్న ఓదార్పుతో మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇతర పిల్లలతో పోల్చడం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలను డాక్టరో, ఇంజి నీరో చేయాలని తల్లిదండ్రులు భావించడంతో తప్పులేదు. అయితే పిల్లల అభిప్రాయాలను తెలుసుకుని, వారు చదువులో రాణించగలరో లేదో అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలే దనో, తక్కువ మార్కులు వచ్చాయనో ఆత్మహత్యకు పాల్పడి సాధించేది ఏమీ లేదు. తల్లిదండ్రులకు విషాదాన్ని మిగల్చడమే. ఏదైనా జీవించి సాధించాలి. ఒకసారి ఫెయిలైనా మళ్లీ పట్టు దలతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. జీవితంలో ఎదిగేందుకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. చదువులో రాణించలేని వారు రాజకీయాల్లో, వ్యాపారాల్లో, వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారు ఎందరినో చూస్తున్నాం. మనకు నచ్చిన రంగంలో రాణించే అవకాశం ఉంది. ఆత్మహత్యలతో జీవితాలను అర్ధంతరంగా ముగించొద్దు. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్, విజయవాడ -
కృష్ణా జిల్లా: ఆటో బోల్తా.. ఆరుగురి పరిస్థితి విషమం!
సాక్షి, కృష్ణా జిల్లా: నాగాయలంక సాయిబాబా గుడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో గణపేశ్వరం గ్రామానికి చెందిన 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొక్కజొన్న పనుల నిమిత్తం బాపట్ల జిల్లా గొరికపూడి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగింది. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదుగురికి అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మరో ప్రమాదంలో నందిగామ రూరల్ మండలంలోని ఐతవరం గ్రామ శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. కంచికచర్లకు చెందిన లక్ష్మీనారాయణ (50) బుధవారం కంచికచర్ల నుంచి ద్విచక్ర వాహనంపై నందిగామ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐతవరం గ్రామ సమీపంలోకి వచ్చే సరికి వెనుకగా వస్తున్న కారు ఢీకొట్టింది.ఈ ఘటనలో లక్ష్మీనారాయణ తలకు తీవ్ర గాయాలు కావటంతో టోల్ప్లాజా అంబులెన్స్లో నందిగామలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం విజయవాడ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
న్యాయం కోసం 12 గంటలపాటు నిరసన దీక్ష: అంబటి
సాక్షి, విజయవాడ: ఈ నెల 18వ తేదీన గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన నిరాహార దీక్ష చేస్తున్నానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను అరెస్ట్ చేసిన దగ్గర్నుంచి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నాతో చట్టవ్యతిరేకంగా ప్రవర్తించారు. నన్ను హింసించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాను. నన్ను హింసించిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చాను’’ అని అంబటి తెలిపారు.‘‘నన్ను హింసించిన అధికారులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలి. నాపై, నా ఇల్లు, నా ఆఫీస్, నా కుటుంబంపై దాడి చేసి చంపాలని చూసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలి. నాకు జరిగిన అన్యాయంపై పోరాటంలో భాగంగానే 12 గంటల పాటు నిరసన నిరాహార దీక్ష చేస్తున్నా.. నా దీక్షకు మద్దతు పలకాలని అందరినీ కోరుతున్నా. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసుల్లో నన్ను ఇరికించింది. అన్యాయంగా నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్భంధించింది...నేను జైల్లో ఉన్నప్పుడు జడ శ్రావణ్ కుమార్ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. నా కుటుంబంతో పాటు జైల్లో ఉన్న నన్ను కలిసి జడ శ్రావణ్ కుమార్ ధైర్యం చెప్పారు. జడ శ్రావణ్ కుమార్కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన్ని కలిశాను. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా ఎత్తుకుపోయారు. కుప్పంలో సోషల్ మీడియా కేసు పెడితే రౌడీల్లాగా వచ్చి ఎత్తుకుపోయారు. పోలీసు వ్యవస్థ ఉన్నది దేనికి.. చంద్రబాబు, లోకేష్ చేతిలో ఆయుధంలా పనిచేయడానికేనా? ప్రభుత్వం, పోలీసులు ఉన్నది కక్ష సాధించడానికి కాదు’’ అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా: జడ శ్రావణ్ కుమార్ అంబటి రాంబాబును ప్రభుత్వం వేధించిన తీరు అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సాటి న్యాయవాదిగా నేను అంబటికి సంఘీభావం తెలిపాను. 2024 జూన్ 4 తర్వాత రాష్ట్రంలో అప్రజాస్వామ్యకమైన పాలన సాగుతోంది. పోలీసులు సీఆర్పీసీ, ఐపీసీని కాకుండా కూటమి నేతలు రాసిన రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో మతపరమైన అంశాలను చొప్పించాలని కూటమి నేతలు ప్రయత్నించారు.అంబటి రాంబాబు ఇంటిపై అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఆ రోజు పరిస్థితిని తలుచుకుని నేటికీ అంబటి కుటుంబం వణికిపోతోంది. అంబటి ఇంటిపై దాడి చేసేందుకే మీకు 164 సీట్లు ఇచ్చారా అని లోకేష్ ను ప్రశ్నిస్తున్నా. అంబటి రాంబాబు ఇంటిపై దాడిని ఖండించకుండా లోకేష్ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు. కత్తి పట్టిన వాడు కత్తికే పోతాడు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నా.ఇది మీడియాపైన దాడిగానే జై భీమ్ పార్టీ భావిస్తోంది. అరెస్టుల ద్వారా మీ చిలిపి ఆనందాలు తీర్చుకోవాలని భావిస్తున్నారు. మీరు తీర్చుకోవాల్సిన చిలిపి ఆనందాలు ఏవైనా ఉంటే ఈ రెండేళ్లలో తీర్చేసుకోండి. ఆ తర్వాత మీ చిన్న చిన్న ఆనందాలు మీకు పెద్ద శాపాలుగా మారడం ఖాయం. నన్ను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నిస్తోంది. కూటమి అన్యాయాల పై చేసే న్యాయ పోరాటాలకు నా మద్దతు కచ్చితంగా ఉంటుంది -
కొండంత
విజయవాడ సిటీపులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు. ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026అంబేడ్కర్ ఆశయ సాధన జగన్తోనే సాధ్యం దుర్గమ్మ ఆలయ ప్రాంగణం(ఫైల్) వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల భద్రత గాలిలో దీపంలా మారింది. అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో ఇంద్రకీలాద్రి ప్రతిష్ట మసకబారుతోంది. పట్టించుకోవాల్సిన చంద్రబాబు సర్కారు పూర్తిగా కాడి వదిలేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. అవి వృథా అవుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. వీటికి సాక్షాలుగా ఇటీవల ఆలయ పరిసరాల్లో చోటు చేసుకున్న సంఘటనలను భక్తులు ఎత్తి చూపుతున్నారు. పోలీసు శాఖ, ఆలయ అధికారులు, పాలకవర్గం ఎవ్వరూ ఆలయ భద్రతపై దృష్టి పెట్టకుండా వారివారి ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. వరుస చోరీలు.. దుర్గమ్మ ఆలయంలో ఇటీవల కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. గత నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగిన కుంభాభిషేక మహోత్సవానికి పోలీసు శాఖ ఉన్న సిబ్బందికి అదనంగా 15 వందల మందిని నియమించింది. అన్ని వందల మంది సిబ్బంది ఉన్నప్పటికీ సరిగ్గా అమ్మవారి అంతరాలయ ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద ఒక మహిళకు సంబంధించిన 125 గ్రాముల బంగారాన్ని ఒక మహిళ కాజేసి దర్జాగా మెట్లు దిగి వెళ్లిపోయింది. తాను బస చేసిన లాడ్జికి వెళ్లి అక్కడి నుంచి తన ఊరికి వెనుతిరిగింది. బంగారం విలువ సుమారుగా రూ.16 లక్షలుగా ఉంది. దీనిలో విశేషమేమిటంటే చోరీ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరా పని చేయకపోవటం. వాహనాల్లోనూ చోరీలు.. ఘాట్రోడ్డులో తరచూ వాహనాల్లో చోరీలు జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొద్ది మాసాల క్రితం ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ పాయింట్ సమీపంలో ఒక కుటుంబం తమ కారును పార్క్ చేసి అమ్మ వారి దర్శనానికి వెళ్లింది. దర్శనం ముగించుకొని వచ్చే సరికి వారి వాహనంలో ఉండాల్సిన బ్యాగ్ మాయమైంది. అందులో బంగారం చోరీకి గురైనట్లు పోలీసు లకు ఫిర్యాదు అందింది. అక్కడ సమీపంలో ఉన్న సీసీ కెమెరా సైతం పని చేయకపోవడం గమనార్హం. సీసీ కెమెరాలపై ఎందుకీ నిర్లక్ష్యం.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల భద్రత పూర్తిగా దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ ఆలయంలో కోట్లాది రూపాయాలు వ్యయం జరుగుతున్నప్పటికీ కనీసం ఆలయంలో సీసీ కెమెరాలు పనితీరును గాడిలో పెట్టే పరిస్థితులు లేకపోవటంపై సర్వత్రా విస్మయానికి గురవుతున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ సైతం వివిధ ఉత్సవాల్లో వేలాది మందిని నియమించి వారికి అవసరమైన టీఏ, డీఏల పేరుతో ఏటా కోట్లాది రూపాయాలు తీసుకొని వెళ్తున్నారే తప్పా ఆలయంలో భక్తుల భద్రత విషయంలో శ్రద్ద చూపటం లేదంటూ ఆలయంలోని పాలకవర్గ సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత! 7ఉగ్రవాద సానుభూతిపరులు, వారికి మద్దతు ఇస్తున్న వ్యక్తులను ఇటీవల పోలీసు శాఖ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితులు ఉన్న నగరంలో నిత్యం లక్షలాదిగా రాకపోకలు సాగించే అమ్మవారి ఆలయ భద్రత విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక మహిళ విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చి చక్కగా అమ్మవారి ఆలయానికి వెళ్లి దొంగతనం చేసి మళ్లీ ఆమె స్వస్థలానికి వెళ్లి పోయింది. చోరీ జరిగిన తరువాత ఆమెను పట్టుకున్నప్పటికీ అటువంటి సంఘటనలు జరగకుండా అరికట్టడంలో పోలీసు శాఖ చర్యలు లేకపోవటం, భద్రతపై చోటు చేసుకున్న నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మృతదేహం ఉన్న తెలియకపోవటం వంటి సంఘటనలు ఇతర ప్రమాదకర ఘటనలకు పురిగొల్పే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అమ్మవారి ఆలయ భద్రతపై దృష్టి పెట్టాలంటూ హితవు పలుకుతున్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పీస్ ఫోరం మంగళవారం విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించింది. కోడూరు: స్థానిక ఉల్లిపాలెంలోని గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు. దేవస్థానం దిగువన ఉన్న కనకదుర్గానగర్ సమీపంలో ఇటీవల ఒక మృతదేహం బయట పడింది. అక్కడ ఉన్న మరుగుదొడ్డిలో సిబ్బంది మృతదేహాన్ని చూసి ఉన్నతాధికారులకు వారి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ మృతదేహాన్ని చూసిన తరువాత విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆ మృతదేహం మూడు, నాలుగు రోజుల క్రితం మృతి చెందిన వ్యక్తిది కావటం. ఇక్కడ పోలీసులు, పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు రాకపోకలు సాగించే దుర్గగుడి పరిసరాల్లో నాలుగు రోజుల పాటు ఒక మృతదేహం మరుగుదొడ్డిలో ఉన్నా తెలియకపోవటం అధికారుల పాలనతీరుకు నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. -
నేటి నుంచి ‘నేస్తం బడికిరా’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా సహాధ్యక్షురాలు పి. భవానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి స్పాట్ జరుగుతున్న కేబీఎన్ కళాశాల వద్ద మంగళవారం సాయంత్రం మహిళా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయుల నుంచి సంతకాల సేకరణ చేశారు. రాష్ట్ర హోం మంత్రి అనిత, రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విద్యాశాఖ మంత్రి ఎన్. లోకేశ్ దృష్టికి తీసుకువెళడం కోసం ఆ సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు పి. లీల జిల్లా స్థాయిలో ఉమెన్ గ్రీవెన్స్ సెల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లను వివరించారు. మహిళా నేతలు ఎం. లలితశ్రీ, డి. విజయలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ఏసీబీ ఎస్పీ ఏ. సురేష్బాబు దంపతులు, కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కుటుంబ సమేతంగా మంగళవారం సాయంత్రం విడివిడిగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన వీరు నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. అనంతనం ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట చల్లపల్లి సీఐ కె. ఈశ్వరావు, ఎస్ఐ పి. గౌతమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు కోడూరు: భూమిలో పండే దుంపలు మూడు నుంచి నాలుగు కిలోల బరువు ఉంటా యి. సేంద్రియ పద్ధతుల్లో పండించిన దుంపలు ఆరు కిలోల వరకు కూడా ఉంటా యి. కానీ కృష్ణాజిల్లా కోడూరు మండలం ఇస్మాయిల్బేగ్పేట గ్రామానికి చెందిన కాలారి శ్రీమన్నారాయణ ఇంటి పెరట్లోని పెండలం దుంప ఏకంగా 12 కిలోల బరువు ఉండి అందరినీ అబ్బురపరుస్తోంది. ఏవిధమైన రసాయన ఎరువులు వినియోగించకుండానే దుంప పెరిగిందని శ్రీ మన్నారాయణ తెలిపారు. -
రైతుల సమస్యలపై వాదనలు శుభ పరిణామం
గుడివాడ టౌన్: దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో వ్యవసాయ ఉత్పత్తులు, కనీస మద్దతు ధర నిర్ణయం విధానంపై వాదనలు జరపడం శుభ పరిణామమని రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ పనిపై ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయం రైతులను ఏమాత్రం ఆదుకోవడం లేదని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ కూడా కనీస మద్దతు ధర ఉండాలని సిఫారసు చేసిందని గుర్తుచేశారు. వాస్తవ ఖర్చులు, కుటుంబ ఖర్చులు, భూమి లీజు, పెట్టుబడి వడ్డీలకు అనుగుణంగా మద్దతు ధర నిర్ణయం సరిగ్గా లేదని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎప్పటి నుంచో లేవనెత్తుతున్నామని, కనీస మద్దతు ధర నిర్ణయిస్తే సరిపోదని, ఆ ధర రైతుకు చేరేలా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు ప్రతినిధిగా ఈ విషయంపై సుప్రీంకోర్టులో వాదన జరగడం తాను స్వాగతిస్తున్నాని పేర్కొన్నారు. -
సుబ్బారాయుడి ఆదాయం రూ. 9.32లక్షలు
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 5,26,266, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,22,130, స్వామివారికి డొనేషన్ ద్వారా రూ. 2,37,792, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 37,600 మొత్తం కలిపి రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు వివరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సమర్పించారు. హైదరాబాద్ సనత్నగర్కు చెందిన జి. తనూజ కుటుంబం రూ.1.01,116, విజయవాడ భవానీపురం ఆశ్రమం రోడ్డుకు చెందిన జె.సీతారామాంజనేయులు, వాసవి సౌజన్య దంపతులు రూ.1,01,116, విజయవాడ ప్రసాదం పాడుకు చెందిన జి. వెంకట రామారావు, భవ్యశ్రీ రూ.1,01,116, గుంటూరు రెడ్డిపాలెం కాలనీకి చెందిన శ్రీవెంకట రాగ సుమంత్, జ్ఞాన చంద్రిక రూ.1.50లక్షల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
మట్టి పెళ్లలు పడి మహిళ దుర్మరణం
గంపలగూడెం: మట్టి పెళ్లలు విరగి పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలంలోని అమ్మిరెడ్డిగూడెంలో మంగళవారం జరి గింది. గ్రామస్తుల కథనం మేరకు.. అమ్మి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుంజు రాంబాబు ట్రాక్టర్తో ఇసుక, మట్టి తోలుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య ధనలక్ష్మి (30), కుమార్తె రాజి, కుమారుడు ప్రవీణ్, తల్లి నాగలక్ష్మి ఉన్నారు. రాజి ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తగా, ప్రవీణ్ ఐదో తరగతి చదువుతున్నాడు. గంగదేవరపాడు పరిధిలోని కట్టలేరులో ఇసుక తోడేందుకు రాంబాబు తన భార్య ధనలక్ష్మి (30), తల్లి నాగలక్ష్మితో కలిసి వెళ్లాడు. కట్టలేరులో పూర్తి స్థాయిలో ఇసుక తోడేశారు. ఎక్కడ మంచి ఇసుక దొకనందున తెలంగాణ పరిధిలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లి ఇసుక తవ్వకాలు చేపట్టారు. పైన మట్టి, కింద ఇసుక ఉండ టంతో సొరంగం చేసి ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఐదు అడుగుల లోతున 20 అడుగుల మేర సొరంగం చేసి ఇసుక తోడుతున్న నేపథ్యంలో పైనున్న మట్టి పెళ్లలు విరిగి ధనలక్ష్మి, నాగలక్ష్మిపై పడ్డాయి. దీంతో వారిద్దరు మట్టికింద చిక్కుకుపోయారు. హుటాహుటిన మూడు ట్రక్కుల మట్టి తొలగించి వారిద్దరిని బయటకు తీసి 108 అంబులెన్స్లో తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ధనలక్ష్మి (30) మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన నాగ లక్ష్మిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లి ఆస్పత్రి పాలై, భార్య తిరిగిరాని లోకాలకు చేరడంతో రాంబాబు తన ఇద్దరు బిడ్డలను అక్కున చేర్చుకుని రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో మహిళకు తీవ్ర ఆస్వస్థత -
విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ఆర్టీసీనే నడపాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. మంగళవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ‘ప్రైవేటు విద్యుత్ బస్సులు–ఆర్టీసీ–ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జిలాని బాషా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయత్యుత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నేతలు నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య మాట్లాడుతూ.. జీసీసీ పద్ధతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యుత్ ప్రైవేటు బస్సుల వల్ల ఆర్టీసీ డిపోలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డిపోలను, విలువైన స్థలాలను, బస్ స్టేషన్లను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పనంగా అప్పజెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. విద్యుత్ బస్సులను ప్రైవేటుకిస్తే ప్రజలపై భారం పెరుగుతుందని హెచ్చరించారు. ప్రజల అవసరాలకు అనుగు ణంగా ఆర్టీసీ బస్సులు పెంచాలని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు, ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి వి.ఎస్.రావు, నేషనల్ మజ్దూర్ యూనిటీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాజేష్ కుమార్, యునైటెడ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ.. ఆర్టీసీలోని ఉద్యోగ సంఘాలు అన్నీ ఐక్యంగా పోరాడితేనే ఈ ప్రైవేటు విద్యుత్ బస్సుల ప్రమాదం నుంచి ఆర్టీసీని రక్షించుకోగలమని పేర్కొన్నారు. అనంతరం సదస్సులో ‘విద్యుత్ బస్సులను నేరుగా ఆర్టీసీనే నడపాలి’ అని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యుత్ బస్సులపై రూపొందించిన బుక్లెట్ను సదస్సు ఆవిష్కరించింది. సదస్సులో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య, ఇఫ్టూ రాష్ట్ర నాయకులు మోహన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన అవసరం
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బందరులోని రేవతి సెంటర్ వద్ద అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించి అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను మంగళవారం ఆయన విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. అగ్నిప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాన్నారు. ఆపద సమయాల్లో ప్రాణాలను రక్షించటంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమైనదన్నారు. అనంతరం అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఉపయోగించే పలు పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఏసురత్నం, ఫైర్ ఆఫీసర్ ఆనం రమణారెడ్డి, ఫైర్మెన్లు వెంకటేశ్వరరావు, జకరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
కంచికచర్ల: స్థానిక వసంతకాలనీలో ఓ మహిళ తన ఇంటి వరండాలో నిద్రి స్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మంచంపై ఉన్న దిండుకింద చేయపెట్టగా గమనించిన ఆమె దొంగ.. దొంగా అని కేకలు వేసింది. దీంతో ఆ వ్యక్తి ఆమైపె కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల వసంతకాలనీలో బాలుర వసతి గృహం వెనుక ఓ ఇంట్లో నల్లకట్ల రమాదేవి(47) సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి వరండాలో నిద్రించింది. గుర్తు తెలియని ఆ ఇంటి వద్దకు వచ్చి తాళం చెవుల కోసం వెతికాడు. అవి కనిపించకపోవటంతో రమాదేవి నిద్రిస్తున్న మంచం వద్దకు వచ్చి దిండు కింద చేయి పెట్టాడు. ఈ అలికిడికి రమాదేవికి మెలుకువ వచ్చి, గుర్తుతెలియని వ్యక్తిని గమనించి దొంగ.. దొంగ అంటూ కేకలు వేసింది. వెంటనే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో ఆమె ముఖం, శరీ రంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. కేకలు విని రమాదేవి ఇంటికి వచ్చిన స్థానికులు గాయపడిన ఆమెను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపారు. -
బీఆర్ అంబేడ్కర్ అందరివాడు
చిలకలపూడి(మచిలీపట్నం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఏ ఒక్క సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరి వాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశపు హాలులో జరిగిన సభ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. మచిలీపట్నంలో అంబేడ్కర్ భవన్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ప్రతి మేధావిని ప్రభావితం చేసే వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలకొల్పడానికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. అంబేడ్కర్ మన జీవితాల్లో అస్పృస్యత లేకుండా అందరూ సమానంగా గౌరవించబడేలా రాజ్యాంగాన్ని నిర్మించగలిగారన్నారు. -
కొడుకు, తల్లి కళ్లెదుటే మృత్యు ఒడికి..
తిరువూరు: నిత్యం కృష్ణా నదిలో ఈతకు వెళ్లి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే క్రమంలో విజయవాడలో నివసిస్తున్న తిరువూరుకు చెందిన దంతవైద్యుడు సానికొమ్ము సురేష్ (46) మంగళవారం తన కుమారుడు, తల్లి కళ్లెదుటే నీట మునిగి దుర్మరణం చెందారు. ఇబ్రహీంపట్నం నిమ్రా కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సురేష్ విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలో నివసిస్తున్నారు. మంగళవారం తాడేపల్లి వద్ద కృష్ణానదిలో తన 12 కుమారుడితో కలసి ఈత కొట్టారు. అనంతరం బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ చేస్తూ రెండుసార్లు నీటి నుంచి బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్లిన సురేష్ తదుపరి ఊపిరాడక చనిపోయారు. తిరువూరు నుంచి విజయవాడ ఆస్పత్రిలో వైద్యపరీక్షల నిమిత్తం వచ్చిన తల్లి సానికొమ్ము కుమారి కూడా ఆ సమయంలో సురేష్ సమీపంలోనే నది ఒడ్డున ఉన్నారు. ఈత కొట్టిన అనంతరం తల్లిని తిరువూరు బస్సు ఎక్కిస్తానని ఇంటి నుంచి తనతో కూడా తీసుకొచ్చిన సురేష్ ఎంతసేపటికీ నీటిలో నుంచి బయటకు రాకపోవడంతో కుమారి ఆందోళనతో తల్లడిల్లింది. చుట్టుపక్కల వారికి చెప్పడంతో గజ ఈతగాళ్లు గాలింపు జరిపారు. ఫలితం లేకపోవడంతో ఎన్ఆర్డీఎఫ్ సిబ్బంది గాలించి సురేష్ మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసునమోదు చేసుకుని ఆయన మృత దేహాన్ని మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సురేష్ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తిరువూరు శివారు పీటీకొత్తూరు తరలించారు. ఆయన సోదరుడు ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, తండ్రి సీపీఎంలో, రైతుసంఘంలో జిల్లాస్థాయి పదవులు నిర్వహించారు. తల్లి కుమారి ఏపీ మహిళా సంఘ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించిన నివాళులర్పించారు. కృష్ణానదిలో మునిగి దంత వైద్యుడు మృతి -
పురుగుమందు తాగిన ఘటనలో మరొకరు మృతి
రెడ్డిగూడెం: పురుగు మందు తాగిన ఘటనలో ఆరు రోజుల క్రితం తల్లి మృతి చెందగా, కుమారుడు మంగళవారం చనిపోయారు. రెడ్డిగూడెం మండలంలోని కుదప గ్రామంలో నివసించే బొర్రా సావిత్రి(74), తిరుపతయ్య (47) తల్లీకుమారులు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో సావిత్రి, తిరుపతయ్య పురుగు మందు తాగారు. కొద్ది సేపటికి వారిద్దరిని గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోకి తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సావిత్రి ఈ నెల తొమ్మిదో తేదీన మృతి చెందింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతయ్య మంగళవారం ఉదయం పది గంటలకు మృతిచెందాడు. తాగుడుకు బానిసై... నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన బొర్రా తిరుపతయ్య కుటుంబం రెండు సంవత్సరాల క్రితం రెడ్డిగూడెం మండలం కుదప గ్రామంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి నివసిస్తోంది. తిరుపతయ్య లారీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. తిరుపతయ్య భార్య, కుమారుడు, కుమార్తె ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో తల్లి సావిత్రితో కలిసి పురుగు మందు తాగాడు. తిరుపతయ్య కొడుకు ప్రభాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరు రోజుల వ్యవధిలో తల్లీ కుమారులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుడివాడరూరల్: వృద్ధురాలి ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు గుడివాడ తాలూకా పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన జాస్తి నిర్మలాదేవి (81) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపతోంది. విజయవాడలో పలుమార్లు చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె ఈ నెల తొమ్మిదో తేదీన ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. అస్వస్థతకు గురైన నిర్వలాదేవిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవల అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకెళ్లారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నిర్మలాదేవి సోమవారం మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గూడూరు: బతుకుతెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన ఒడిశా కూలీ గూడూరు మండలం తరకటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. మంగళవారం పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాదంపై గూడూరు పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తి తరకటూరుపాలెం సమీపంలోని ఓ రైసు మిల్లులో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం పని ముగించు కుని విజయవాడ–మచిలీపట్నం రోడ్డు దాడుతుండగా విజయవాడ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కారు డ్రైవర్ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సీహెచ్.దివ్యప్రకాష్ ఘటనా స్థలంలో ముక్కలు ముక్కలుగా పడిపోయి ఉన్న వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టు మార్టం నిమిత్తం బందరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. మృతుడు స్థానికుడు కాకపోవడంతో అతని పూర్తి వివరాల కోసం పోసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం (ఒలింపిక్ డే) సందర్భంగా జూన్ 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడ్తామని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసో సియేషన్ (ఏపీఓఏ) అధ్యక్షుడు ఆర్.కె.పురుషోత్తమ్ తెలిపారు. త్వరలో ఒలింపిక్ జిల్లా సంఘాలకు ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏపీఓఏ జన రల్ బాడీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో మంగళవారం జరిగింది. సమావేశం అనంతరం జరిగిన పురుషోత్తమ్ విలేకరులతో మాట్లాడారు. 2036వ సంవత్సరంలో ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలన్న భారతదేశ ప్రతిపాదితకు గుర్తుగా జూన్ 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 2,036 మొక్కలను నాటాలని నిర్ణయించామన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) మార్గదర్శకాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లాకు చెందిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్, మాజీ జాతీయ హాకీ క్రీడాకారుడు డి.ఎస్.వెంకటరామనాయుడును ఏపీఓఏ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఒలింపిక్ సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఐఓఏ నుంచి ఆర్థిక సహాయంతో జిల్లా, రాష్ట్ర, దక్షిణ మండల (సౌత్ జోన్) స్థాయిలలో ఒలింపిక్ తరహా పోటీలను నిర్వహించడానికి ఏపీఓఏ ప్రణాళిక రూపొందిస్తోందని వివరించారు. మేఘాలయలో జరిగే 39వ జాతీయ క్రీడల్లో ఏపీఓఏ తరఫున రాష్ట్ర జట్లను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీఓఏ ఉపాధ్యక్షులు బడేటి వెంకటరామయ్య, నడెళ్ల బ్రహ్మాజీరావు, కోశాధికారి శ్రీనివాస్, సీఈఓ వెంకటరామ నాయుడు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మే 5, 6, 7 తేదీల్లో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో జరిగే ఐదో ఏపీ కప్ తైక్వాండో స్టేట్ చాంపియన్షిప్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కృష్ణలంక: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబును సోమవారం ట్రాఫిక్ ఏసీపీ డాక్టర్ శ్రీవేద బాధ్యతల స్వీకరణ అనంతరం మర్యాదపూర్వకంగా కలిశారు.చిలకలపూడి(మచిలీపట్నం): బందరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.భవానీపురం(విజయవాడపశ్చిమ): భక్తుల సౌకర్యం, భద్రత, మెరుగైన సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యులు నిర్ణయించారు. బ్రాహ్మణ వీధిలోని కార్యాలయంలో సోమవారం దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశం జరిగింది. దీనిలో దుర్గగుడి మాస్టర్ ప్లాన్ అమలు తీరు, కుంభాభిషేకం సమయంలో ఆలయ ఉద్యోగిపై జరిగిన దాడిపై చర్చించారు. ఎక్కెడెక్కడ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, రికార్డుల పరంగా ఉండాల్సిన భూముల్లో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి, ఎవరెవరు కౌలుకు తీసుకున్నారు, ప్రస్తుతం వారి చేతుల్లోనే భూములు ఉన్నాయా.. చేతులు మారాయా, కౌలుకు ఇచ్చిన భూముల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, కౌలుదారులు కౌలు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా వంటి అంశాలపై చర్చ జరిగింది. అమ్మవారి పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేందుకు క్యూ లైన్లలో టీవీలు ఏర్పాటు చేయాలని, ఆలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఆస్పత్రితో ఎంఓయూ కుదుర్చుకోవాలని, జూన్ నుంచి అన్నదానం, లడ్డూ పోటు ప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని 19 అంశాలను ఆమోదించగా 65వ అంశాన్ని తీర్మానించడం, 83, 84, 103 అంశాలను వాయిదా వేశారు. వాడీవేడిగా..!సమావేశంలో పలుఅంశాలపై వాడీవేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది. కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న బంగారం చోరీ ఘటన, దుర్గ గుడి అభివృద్ధి, దైనందిన కార్యకలాపాలపై చేసిన ప్రతిపాదనలపై ఆలయ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై మండలి సభ్యులు మండిపడ్డారని సమాచారం. ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఈఓ శీనా నాయక్, ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమ తదితరులు పాల్గొన్నారు.ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ కోసం విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోనిపటమటకు చెందిన పి.హరినాథ్బాబు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి తన తండ్రి వెంకట సుబ్బయ్య పేరిట రూ.లక్ష, తల్లి నాగమణి పేరిట మరో రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆయనకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఇచ్చారు. కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళాను విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళా వివరాలను ఆయన సోమవారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 18న ఖిల్లాపైకి ట్రెక్కింగ్ చేసిన అనంతరం బొమ్మల మేళా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రెండోరోజు ఈ మార్కెట్ లీడర్స్, ఈ హ్యాండీక్రాఫ్ట్, కార్టూన్ మేకర్స్, ఆన్లైన్ కార్టూన్ సిరీస్ను క్రియేట్ చేస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, చుట్టుకుదురు శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వత్సవాయి: మండల కేంద్రం వత్సవాయిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి ఎన్.సవిత సోమవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతి ప్రమాణాలు, నిర్వహణ, భోజన నాణ్యత తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి స్వయంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచిచూశారు. అనంతరం గ్రామానికి చెందిన ప్రవాసభారతీయుడు చిరుమామిళ్ల రాంబాబు తన సొంత నిధులు రూ.35 లక్షలతో పాఠశాల పైభాగంగా నిర్మాణం చేస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వో ప్లాంటును విద్యార్థులకు అందించిన జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బొగ్గవరపు వెంకటరాజారావును సన్మానించారు. నందిగామకు చెందిన మరియమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. గతంలో ఫ్యామిలీ ఫిజీషియన్ పథకం ఉండగా వైద్యులు ఇంటికే వచ్చి చూసే వాళ్లు. ప్రస్తుతం ఆ పథకం సేవలు నిలిచిపోవడంతో మందులు ఇచ్చే వాళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతోంది. గ్రామీణులకు భరోసా ఏది? నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్ పథకం కుయ్యో.. మొర్రో అంటున్న 108 దీర్ఘకాలిక రోగుల ఇబ్బందులు మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలను ఏర్పాటు చేసిందని, వాటిలో 2026–27 విద్యాసంవత్సరానికి ఎంపికలు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 నుంచి 2011 సంవత్సరాల మధ్య జన్మించిన 15 నుంచి 19 ఏళ్ల లోపు బాల బాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు తిరుపతిలో జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ క్రీడల్లో ఎంపికలు జరుగుతాయని, ఈ నెల 29, 30 తేదీల్లో కాకినాడలో జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో పోటీలు, మే 4, 5 తేదీల్లో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, విద్యార్థి బ్యాంక్ పాస్బుక్, విద్యాసంస్థ నుంచి స్టడీ సర్టిఫికెట్, క్రీడా సర్టిఫికెట్లు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒరిజినల్స్, సెట్ జిరాక్స్లు, పాస్ట్పోర్ట్ సైజ్ ఫోటోలు –10తో ఆయా జిల్లాలో ఉన్న డీఎస్డీవోలకు సంప్రదించాల్సిందిగా సూచించారు. క్రీడా దుస్తులు, కిట్ తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. 7 -
క్రికెట్ బెట్టింగ్ల కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్
పటమట(విజయవాడతూర్పు): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ కట్టడికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పేర్కొన్నారు. సాంకేతికత, పటిష్ట నిఘాతో బెట్టింగ్లకు పాల్పడే వారిపై తీసుకుంటామన్నారు. పోలీస్కమిషరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సైబర్ క్రైం డీసీపీ కృష్ణప్రసన్నతో కలిసి నలుగురు ఏసీపీలతో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందంతో సీపీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐపీఎల్ ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయిని పేర్కొన్నారు. బెట్టింగ్లపై హైటెక్ నిఘా ఏర్పాటు చేసి, బెట్టింగ్ నెట్వర్క్లపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ డిజిటల్ వార్ చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు, వెబ్సైట్లు, డార్క్ వెబ్ కార్యకలాపాలపై నిరంతరం పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో బెట్టింగ్ ప్రచారా లను గుర్తించాలని, ఈ సమాచారంతో ఎప్పటికప్పుడు సిబ్బందితో క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించి నిందితులను అరెస్టు చేసి, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డైల్ 100/112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టంచేశారు. -
చోరీ కేసులో సొత్తు రికవరీ
గుడివాడరూరల్: మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో జరిగిన చోరీ కేసును టూటౌన్ పోలీసులు ఛేదించారని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. గత నెల 14వ తేదీన మాజీ మంత్రి ఈశ్వర్కుమార్ సతీమణి మధురిమ హైదరాబాద్ వెళ్లి 18వ తేదీ తెల్లవారుజామున స్థానిక భయ్యావారివీధిలోని ఇంటికి తిరిగిచేరుకున్నారు. ఇంట్లో చోరీ జరిగిందని ఆమె గుర్తించారు. దొంగలు ఇంటి తాళం పగులకొట్టి బీరువాలోని వెండి వస్తువులను దొంగిలించినట్లు గుర్తించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో సీఐ జె.ఆర్.కె.హనీష్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన ఇంట్లో ఎటువంటి ఆధారాలు లభించకపోయినా సాంకేతిక పరిజ్ఞా నంతో సమాచారం సేకరించి, పాత నేరస్తుల కదలికపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో సోమవారం పట్టణంలో ముగ్గురు వ్యక్తులను సీఐ అదుపులోకి తీసుకుని విచారించగా వారే చోరీ చేసులో నిందితులని తేలింది. వారి వద్ద రూ.15 లక్షలు విలువైన ఐదు కిలోల వెండి వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతర్రాష్ట్ర దొంగ అయిన ఎన్టీఆర్ జిల్లా నందిగా టౌన్ రైతుపేట గ్రామానికి చెందిన దొడ్లోజి బాబు ఆలియాస్ రవిబాబు(56), అతనికి సహకరించిన రైతుపేట గ్రామానికి చెందిన తిరుమలశెట్టి అంజలి(38), గుడివాడ పట్టణం బేతవోలు సమీపంలోని నిమ్మతోటకు చెందిన తిరుమలశెట్టి వాణి(33)ని పోలీసులు అదుపులోకి అరెస్ట్ చేశారు. రవిబాబు లారీ క్లీనర్గా పని చేస్తూ వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. నిందితుడిపై హైదరాబాద్, ఎస్ఆర్నగర్, నెల్లూరు, చిలకలూరిపేట, తణుకు, ఎన్టీఆర్ జిల్లా తదితర ప్రాంతాల్లో 11 చోరీ కేసులు ఉన్నాయి. ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ పాలా శ్రీనివాస్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి కఠారి ఈశ్వర్కుమార్ ఇంట్లో చోరీని ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కేసు వివరాలు తెలిపిన ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
జ్వాలాముఖి అమ్మవారికి స్వర్ణకవచం సమర్పణ
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేతమైన అమరావతి అమరేశ్వరాల యంలో వేంచేసిన్న జ్వాలాముఖిదేవి అమ్మవారికి సోమవారం స్వర్ణకవచాన్ని సమర్పించారు. దేవదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎన్.శ్రీనివాసరెడ్డి అమ్మవారికి రాగిపై బంగారుపూత వేసిన కవచాన్ని సమర్పించారు. సుమారు 40గ్రాముల బంగారంతో సుమారు రూ.6 లక్షల విలువైన వెండి కవచాన్ని అర్చకులు సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి అలంకరించారు. తొలుత దాతలు అమరేశ్వరునికి అభిషేకం, బాలచాముండేశ్వరి, అమ్మవార్లకు, జ్వాలాముఖి అమ్మవారికి కుంకుమపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. -
అర్జీలను నిర్దేశిత గడువులో పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి అర్జీని నిర్దేశ గడువులో పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం తదితరులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 153 అర్జీలు జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 153 అర్జీలు అందాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 62, పోలీసు 16, పంచాయతీరాజ్కు 13, రెవెన్యూకు 9, విభిన్న ప్రతిభావంతుల శాఖకు 6, పౌరసరఫరాల శాఖకు 5, డీఆర్డీఏకు 4 అర్జీలు వచ్చాయన్నారు. పశుసంవర్ధక, గృహ నిర్మాణం, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, గ్రామీణ నీటి సరఫరా శాఖలకు మూడు చొప్పున అర్జీలు వచ్చాయన్నారు. విద్యుత్, విద్య, మార్కెటింగ్, మైన్స్, సాంకేతిక విద్య, కలెక్టరేట్ కోఆర్డినేషన్, డీసీహెచ్ఎస్ విభాగాలకు రెండు చొప్పున అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజా రవాణా, దేవదాయ, మత్స్య, భూగర్భ జలాలు, ఐసీడీఎస్, కార్మిక, మెప్మా, కాలుష్యం, రీజనల్ ఇంటర్మీడియెట్ ఆఫీసర్ (ఆర్ఐవో), రహ దారులు–భవనాలు, సాంఘిక సంక్షేమం, జలవనరులు శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు తెలిపారు. ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం శివారు కోమటికుంట గ్రామంలో 175 ఎకరాల అటవీ భూమిని దశాబ్దాలుగా 250 కుటుంబాలు సాగుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఉన్నతస్థాయి కమిటీ వేసి వీటికి పట్టాలు ఇవ్వాలి. ఆర్డబ్ల్యూఎస్ మైలవరం పైలట్ ప్రాజెక్టు మెయింట్నెన్స్ వర్క్స్ కాంట్రాక్ట్ తీరుపై పీజీఆర్ఎస్లో జేసీకి అర్జీ సమర్పించాం. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులతో పాటు, సూపర్వైజర్ను తొలగించారు. వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. దీనిపై జాయింట్ కలెక్టర్తో మాట్లాడాం. -
రెండేళ్లయినా రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు ఏవీ?
కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో పేదలు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘సెంటు కాదు, రెండు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. అది కూడా నగరాల్లోనే అని నమ్మబలికారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ స్థలాలు ఎందుకు ఇవ్వలేదు’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని పట్టణ పేదలు ప్రశ్నించారు. ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడు ఇళ్ల ఊసెత్తడం లేదంటూ మండిపడ్డారు. నగరంలో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్లు, టిడ్కో ఇళ్లు, సంక్షేమ పథకాలు అమలు కోరుతూ సీఐటీయూ, ఐద్వా, పౌర సంక్షేమ సంఘాల ఆధ్వ ర్యంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పేదలు తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు, దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు, అదానీ, అంబానీలకు వందల ఎకరాలను రాత్రికి రాత్రే ఎకరం రూపాయికే ఇస్తున్న ప్రభుత్వం పేద లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ భూములను ప్రజా ప్రతినిధులు కబ్జా చేసి కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి స్కీం పెడుతున్నానని చెబుతున్న సీఎం చంద్రబాబు, పేదలు పనులు లేక, ఇళ్లు లేక రోడ్డున పడుతున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కొండల పైన, కృష్ణా నది ఒడ్డున పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని, వాటికి రిజిస్ట్రేషన్ పట్టాలు లేవని పేర్కొన్నారు. పేదలు నివాసం ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాల న్నారు. విజయవాడలో డిస్నీ ల్యాండ్లో 57 ఎకరాల ఖాళీ స్థలం, ఇతర శాఖల భూముల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం ఆందోళన వద్దకు వచ్చి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, నగర ప్రజా సంఘాల నాయకులు బోయి సత్యబాబు, బి.రమణారావు, పి.కృష్ణ, సీఐటీయూ నాయకులు దుర్గారావు, నారాయణ, నాగేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.సరోజ, జి.ఆదిలక్ష్మి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
ధర భళా.. దిగుబడి బేల
జి.కొండూరు: మార్కెట్లో ధర ఉన్నా.. దిగుబడి లేకపోవడంతో నిమ్మ రైతు ఆందోళన చెందుతున్నాడు. వేసవి తాపాన్ని తీర్చడంలో నిమ్మకు ప్రాధాన్యమేర్పడింది. నిమ్మకు ధర ఉన్నా ఎన్టీఆర్ జిల్లాలో పురుగులు, తెగుళ్ల ప్రభావంతో దిగుబడి తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రెండు సీజన్లు కాపునకు వచ్చే నిమ్మ తొలకరిలో దిగుబడి బాగానే ఉంటున్నా ధర లేక.. ప్రస్తుతం గిట్టుబాటు ఉన్నా.. దిగుబడి లేక నిమ్మ పంటను సాగు చేస్తున్న రైతులు నష్టపోయారు. దిగుబడి లేక... ఎన్టీఆర్ జిల్లాలోని పదహారు మండలాల పరిధిలో 914.11ఎకరాల్లో నిమ్మసాగవుతోంది. అన్నీ కలిసొస్తే ఏడాదిలో ఎకరాకు యాభై కేజీల బస్తాలు.. 50 నుంచి 70 వరకు దిగుబడి వస్తుంది. ఇది మొక్కల వయస్సు, ఎకరంలో నాటిన మొక్కల మీద ఆధారపడి ఉంటుంది. గతేడాది తొలకరిలో దిగుబడి బాగా ఉన్నా, నిమ్మకాయల ధర కేజీ రూ.10 నుంచి రూ.12కి మించలేదు. ప్రస్తుతం కేజీ నిమ్మకాయల ధర రూ.80 నుంచి 110వరకు రైతుకు లభిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఎకరానికి 10నుంచి 15బస్తాలకు దిగుబడి మించడంలేదు. దీంతో పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనపడటం లేదు. చీడపీడలతో తీవ్ర నష్టం ఈ ఏడాది జనవరిలో కురిసిన వర్షాలు.. జిల్లాలో నిమ్మ సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. పూత రాలి దిగుబడి తగ్గింది. క్రాసింగ్ మొక్కజొన్న సాగు, మామిడి తోటల్లో ఉండే నల్లిలాంటి రెక్కల పురుగు నిమ్మపై దాడి చేసి నష్ట పరిచింది. ఈ పురుగుకు నివారణ లేక నిమ్మకాయలను గోకి తినడంతో తెల్లటి మచ్చ ఏర్పడి కాయ నాణ్యత కోల్పోయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిమ్మకాయల సైజు కూడా పెరగకపోవడంతో డిమాండ్ ఉన్నా నాణ్యత లేక సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారు. సాగుకు ‘ఉపాధి’లో ఆర్థిక సాయం నిమ్మసాగు చేయాలనుకునే రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం వందశాతం ఆర్థిక సాయం అందిస్తోంది. ఐదు ఎకరాలలోపు రైతులకు ఎకరానికి 110మొక్కలకు రూ.1.20 లక్షలను మూడేళ్లపాటు అందిస్తున్నారు. ఈ పథకంలో తోటలను వేసిన రైతులు ముందుగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. గతేడాది, ఈ ఏడాది అధికారులు పంటలను నమోదు చేసి ఆర్థిక సాయంకోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాక రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉపాధి హామీ పథకంలో ఉద్యాన పంటలను సాగు చేసేందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నిమ్మ సాగు వివరాలు మండలం సాగు ఎకరాల్లో ఎ.కొండూరు 94.25 చందర్లపాడు 73.72 గంపలగూడెం 20.02 జి.కొండూరు 40.86 ఇబ్రహీంపట్నం 6.82 జగ్గయ్యపేట 46.09 కంచికచర్ల 7.00 మైలవరం 60.87 నందిగామ 60.87 పెనుగంచిప్రోలు 59.99 రెడ్డిగూడెం 32.76 తిరువూరు 40.02 వత్సవాయి 47.48 వీరులపాడు 55.00 విజయవాడరూరల్ 11.09 విస్సన్నపేట 257.27 ఉద్యానసాగు పెంపులో భాగంగా నిమ్మసాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. వాతావరణ మార్పులు, చీడపీడలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు తోటలను వ్యాపారులకు లీజుకు ఇవ్వడంతో నిర్వహణ లోపం ఎదురవుతోంది. ప్రస్తుతం నిమ్మ కాయల ధర ఆశాజనకంగానే ఉంది. – పి.బాలాజీకుమార్, ఉద్యానశాఖ అధికారి, ఎన్టీఆర్ జిల్లా -
ఫిర్యాదులపై చట్టబద్ధంగా చర్యలు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యలపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పేర్కొన్నా రు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో మీ – కోసం కార్యక్రమంలో భాగంగా పలు వురు అర్జీదారులు ఇచ్చిన వినతిపత్రాలను, సమస్యలను ఆయన తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు సిఫార్సు చేశారు. వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ సమస్యలు చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాసమస్య లను ముఖాముఖిగా తెలుసుకుని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం అందించేందుకు జిల్లా పోలీస్శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు బదిలీ చేసి వాటిపై పూర్తి విచారణ జరిపి పరిష్కారం చూపించాల్సిందిగా ఆదేశించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా వారికి ఎదురైన సమస్యలను పోలీసులకు తెలపాలని ఎస్పీ సూచించారు. సత్వరమే న్యాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. మీకోసంలో ఆయన 35 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
జాతీయ రహదారిపై పాల వ్యాను బోల్తా
చల్లపల్లి: పాల వ్యాను అదుపు తప్పి పల్టీకొట్టిన ఘటన 216వ నంబరు జాతీయ రహదారిపై మండలంలోని రామానగరం వద్ద సోమవారం ఉదయం జరిగింది. వ్యానులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయ డెయిరీకి చెందిన పాల వ్యాను నాగాయలంక వరకు వెళ్లి మిల్క్ పాయింట్ల వద్ద లోడు దించి తిరుగు ప్రయాణమైంది. రామానగరం క్లబ్ రోడ్డుకు ముందు వ్యాను అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. జాతీయ రహదారిపై నుంచి మోపిదేవి మండలం కాసానగరం వద్ద సర్వీసు రోడ్డులోకి దిగి చల్లపల్లి వైపు రావాల్సిన వ్యాను తిన్నగా మచిలీపట్నం వైపు వెళ్లిపోయింది. కొత్త డ్రైవర్ డ్యూటీలోకి రావటం వల్ల రూటు మర్చిపోయి ముందుకు వెళ్లిపోయి ఉంటాడని చెబుతున్నారు. 11 నుంచి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు మే 11 నుంచి 13వ తేదీ వరకు కోనసీమ అంబేడ్కర్ జిల్లా అమలాపురంలో జరుగుతాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ కరపత్రికను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 1934లో దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన ఈ సంఘం ఐదు లక్షల సభ్యత్వాలు కలిగి ఉందన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, పేదల హక్కుల కోసం ఉపాధి హామీ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. 232 గ్రామాల్లో భూస్వాములు ఆక్రమించుకున్న వేలాది ఎకరాలు పేదల భూములను, ప్రభుత్వ భూములను తిరిగి పేదలకు ఇప్పించడంలో ప్రముఖపాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో నూతన కమిటీ ఎన్నుకుంటామని తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు శివ నాగరాణి, ఎ.రవి, కె.ఆంజనేయులు, కారం వెంకటేశ్వరావు, ఎం.పుల్లయ్య పాల్గొన్నారు. బీసెంట్ రోడ్డులో మహిళ హత్య గాంధీనగర్(గాంధీనగర్సెంట్రల్): విజయవాడ బీసెంట్ రోడ్డులో సోమవారం రాత్రి మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే అనుమానంతో కత్తితో నరికి చంపేసినట్లు సమా చారం. పోలీసులు కథనం మేరకు.. అజిత్సింగ్నగర్కు చెందిన నామాల రాఘవ, కృష్ణలంకకు చెందిన లక్ష్మి అలియాస్ ఇలియానా(30)తో కొంత కాలంగా సహజీనం చేస్తున్నాడు. రాఘవ భార్యను వదిలేశాడు. ఇలియానా భర్తను వదిలేసింది. ఇద్దరూ కలిసి కొంత కాలంగా సహజీనం చేస్తున్నారు. బీసెంట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. ఇద్దరి మధ్య వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇలియానాను అనుమానించిన రాఘవ సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో నవరంగ్ థియేటర్ సమీపంలో ఆమైపె కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు అతనిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాఘవకు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు తెలిసింది. -
సమస్యలు పరిష్కరించకుంటే ప్రజాపోరాటం
చిలకలపూడి(మచిలీపట్నం): కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పేర్కొన్నారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో పామర్రు నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలపై కలెక్టర్ డి.కె.బాలాజీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టర్తో ఆయన పలు సమస్యలపై చర్చించారు. అనంతరం అనిల్కుమార్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం ప్రజలను వంచనకు గురిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తిరిగి తమపై బురదజల్లే ప్రయత్నం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా ఆగడాలకు అడ్డూ అదుపు లేదన్నారు. ఎన్నికల హామీలను విస్మరించటమే కాకుండా ధనార్జనే ధ్యేయంగా ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సామాన్య ప్రజలే లక్ష్యంగా పోలీసుల అండదండలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఏడు ఎకరాల స్థలాన్ని సేకరించగా ఆ స్థలం పేదలకు ఇవ్వకుండా కోర్టుల్లో పిటీషన్లు వేసి తాత్సారం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్కు వివరించామని ఆయన త్వరలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని ఎమ్మెల్యే కుమార్రాజా బూటకపు హామీ ఇస్తున్నా రని విమర్శించారు. పామర్రు నియోజకవర్గంలో ఇరిగేషన్కు సంబంధించిన చెరువులోని మట్టిని, ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. లారీకి రూ.13 వేల చొప్పున రోజుకు 500 లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వివరించారు. అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే అండదండలతో రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్పష్టమైన ప్రణాళిక ద్వారా ఇసుక విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరామన్నారు. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే కుమార్రాజా రెవెన్యూ అధికారులు లంచాలు తింటున్నారని ఆరోపించి, వారి నుంచి సొమ్ము దండుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నా రని పేర్కొన్నారు. తన అధికారం కోసం అధికారులను పావుగా వాడుకుని వారిని బలిపశువులను చేస్తున్నారన్నారు. ఈ సమస్యలు అన్నింటినీ కలెక్టర్ బాలాజీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన పరిష్కరించని పక్షంలో ప్రజాపోరాటానికి సిద్ధమవుతామని కైలే అనిల్కుమార్ హెచ్చరించారు. వెంట పామర్రు ఎంపీపీ దాసరి అశోక్కుమార్, వైస్ ఎంపీపీ ఎ.రమాదేవి, రాజులపాటి రాఘవులు, ఎం.సుబ్రహ్మణ్యం, ఆరేపల్లి శ్రీనివాసరావు, నామా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పేదలు అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి ఇసుక అనధికార తవ్వకాలపై చర్యలు చేపట్టండి పామర్రు ఎమ్మెల్యే కనుసన్నల్లోయథేచ్ఛగా అవినీతి, అక్రమాలు కలెక్టర్ వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ -
టెన్త్ మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన కృష్ణా కలెక్టర్
మచిలీపట్నంఅర్బన్: లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన ప్రక్రియను పరిశీలించి, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. మూల్యాంకన కార్యక్రమంలో మొత్తం 775 మంది సిబ్బంది పాల్గొనగా, అందులో 80 మంది చీఫ్ ఎగ్జామి నర్లు, 461 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 234 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు తదితర అధికారులు పాల్గొన్నారు. హైవేపై ట్రాలీ లారీ బీభత్సం కృష్ణలంక(విజయవాడతూర్పు): స్థానిక జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ట్రాలీ లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపుతుండగా లారీ అదుపు తప్పి ముందు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు, కారును ఢీకొంది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారధి వైపు నుంచి ఒక ట్రావెల్స్ బస్సు, కారు బెంజిసర్కిల్ వైపు వెళ్తున్నాయి. జాతీయ రహదారిపై నేతాజీ వంతెన వద్ద ఉన్న సాయిబాబా గుడి సమీపానికి చేరుకోగానే గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నుంచి ఆటోనగర్ వెళ్తున్న ట్రాలీ లారీ మితిమీరిన వేగంతో వచ్చి ట్రావెల్స్ బస్సు, కారును వెనుకవైపు ఢీకొట్టింది. దీంతో బస్సు, కారు వెనుకవైపు భాగాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పరీక్షించి మద్యం తాగినట్లు గుర్తించారు. లారీ డ్రైవర్పై డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కృష్ణలంక పోలీసులు తెలిపారు. విశ్వబ్రాహ్మణ సంఘ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గం ఎన్నిక భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం రథసారథులుగా సాయికిరణ్, మోహన్ ఎన్నికయ్యారు. విజయవాడలో నిర్వహించిన సంఘ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేసిన కిరణ్ – మోహన్ ప్యానల్ 915 ఓట్లతో ఘన విజయం సాధించింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా పి.సాయి కిరణ్, కందు కూరి మోహన్ను ప్యానల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశ్రాంత గ్రేడ్–2 ఆఫీసర్ వినుకొండ భవానీ దుర్గాప్రసాద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రక్రియలో సంఘ ఆహ్వాన కమిటీ చైర్మన్ చల్లాల శివాజి, అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు, రామ కృష్ణ, శ్రీను, విజయవాడ నగర అధ్యక్షుడు గొర్తి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
మచిలీపట్నంఅర్బన్: సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్–జేఏసీ జిల్లా అధ్యక్షుడు కె.జాన్మోడీ డిమాండ్ చేశారు. బందరు మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హెచ్ఆర్ పాలసీ అమలు చేయడంతో పాటు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు 22 రోజుల పాటు నిర్వహించిన సమ్మె సమయంలో కూటమి పార్టీలు మద్దతు ప్రకటించి, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. డిమాండ్ల సాధన కోసం మే 15వ తేదీ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, హమామాలిని, సూరమ్మ, సాయి లక్ష్మి, ఎలిజబెత్ రాణి, అంజలి, దివ్య, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం గారూ.. హామీ సంగతేంటి సారూ!
నగరానికి చెందిన సీహెచ్ దుర్గారావు దివ్యాంగుడు. గతంలో బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారం చేసుకుంటూ బతికేవాడు. అనారోగ్యం కారణంగా ఒక కాలిని తొలగించి కృత్రిమ కాలు అమర్చారు. దీంతో జీవనోపాధికి ఏ పనీ చేయలేకపోతున్నాడు. కుటుంబ సభ్యులు పట్టించుకోని స్థితిలో దివ్యాంగ పింఛను కోసం అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. దీపావళి పండుగ రోజున సీఎం చంద్రబాబు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆకస్మిక పర్యటన అంటూ విజయవాడ బీసెంట్ రోడ్డుకు వచ్చారు. హాకర్లతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకునేందుకు వచ్చారు. దుర్గారావు సీఎం చంద్రబాబును కలిసి అర్జీ ఇచ్చాడు. ‘నీకు వెంటనే పెన్షన్, సొంత ఇల్లు మంజూరు చేయిస్తా. జీవనోపాధి కూడా కల్పిస్తా’ అంటూ కెమెరాల సాక్షిగా వరాలు కురిపించారు. పబ్లిసిటీ కోసం మంచిగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయించారు. ముఖ్యమంత్రే హామీ ఇచ్చాక అధికారులు కాదంటారా అని దుర్గారావు సంబరపడ్డాడు. అప్పటినుంచి ఎక్కే గుమ్మం.. దిగే గుమ్మం అన్నట్టుగా అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ‘సీఎం వరమిచ్చినా న్యాయం జరగలేదు’ అని రాసిన ఫ్లెక్సీతో కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చాడు. – నడిపూడి కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
ఆరునెలలుగా జీతాలు ఇవ్వడం లేదు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీనేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ నిర్వహిస్తున్న అమరావతి ఆస్పత్రి ఎదుట ఆస్పత్రి సిబ్బంది సోమవారం ధర్నా చేశారు. తమకు నెలల తరబడి పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆరు నెలలుగా 30 మందికి జీతాలు చెల్లించకుండా ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.60 వేల వరకు జీతం బకాయిలు రావాలని వివరించారు.వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైందని, పిల్లల ఫీజులు కట్టలేక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆక్రోశించారు. ఈ విషయమై తాము కలెక్టరుకు, లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇప్పటికి పలుమార్లు చర్చలు జరిపినా, ఆస్పత్రి యాజమాన్యం వేతనాల చెల్లింపునకు ముందుకు రానందున 1936 వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలని కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి ఇటీవల సూచించారని, తమకు ఎవరు న్యాయం చేస్తారని ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, వేతనాల కోసం శావల దేవదత్ వద్దకు వెళ్లిన సిబ్బందిని ఆయన స్పందించిన తీరు తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘మీడియాకు ఎక్కి పరువు తీస్తే జీతాలు ఇస్తారా? మీరు ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రి లోకేశ్కి చెప్పుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు’ అని దేవదత్ సిబ్బందితో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇంటికి వెళ్లి కొలికపూడిని కొడతా: దేవదత్తాను ఎన్నికల్లో టికెట్ కోసం ఎంపీ చిన్నికి డబ్బులిచ్చానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని దేవదత్ ఖండించారు. తన ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చేయడానికి తెరవెనుక ప్రోత్సహించే వారెవరో తెలుసని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని వదలబోనని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును హెచ్చరించారు. ఇలాంటివి ఆపకపోతే ఆయన ఇంటికి వెళ్లి కొడతానని దేవదత్ హెచ్చరించారు.రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్షాపులే..! ఇక్కడే ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివి? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ధ్వజమెత్తిన టీడీపీనేత దేవదత్ ‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బెల్టు షాపులు ఉన్నాయి.. ఒక్క తిరువూరు నియోజకవర్గంలో ‘బెల్టు షాపులు ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివయ్యా?.. నీకేంటి నొప్పి’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో బెల్టు దుకాణాలు అధికంగా ఉండడంతో ప్రజలు మద్యానికి బానిసై ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేత శావల దేవదత్ తీవ్రంగా స్పందించారు.ఆదివారం రాత్రి తిరువూరులో విడుదల చేసిన వీడియోలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు. ‘నీ చేతకాని తనంతో పార్టీపై ఆరోపణలు చేయద్దు.. నీ వల్ల ఏమైనా అవుతుందా? పల్లె కన్నీరు కారుస్తోందంటున్నావు. నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు’ అంటూ ఎమ్మెల్యేపై దేవదత్ ధ్వజమెత్తారు. కూర్చుని సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదంటూ దేవదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ntr జిల్లా కలెక్టరేట్లో అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు
సాక్షి,విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఓ వృద్ధురాలు అధికారులపై కారం చల్లారు. నేషనల్ హైవే నిర్మాణం కోసం అధికారులు ఆమె భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, బదులుగా ఇవ్వాల్సిన రూ.24 లక్షల నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని వృద్ధురాలు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అనేక సార్లు కలెక్టరేట్లో వినతిపత్రాలు సమర్పించినా, అధికారులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్కు వచ్చిన బాధితురాలు అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కారం చల్లారు. తన భూమి తీసుకుని వేరే వారికి డబ్బులు చెల్లించారని ఆరోపించారు. అధికారుల తీరుతో విసుగెత్తి ఈ చర్యకు దిగినట్లు వృద్ధురాలు మీడియా ఎదుట వెల్లడించారు. -
దివ్య దక్షిణ యాత్ర పేరుతో ప్రత్యేక పర్యాటక రైలు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం తదితర పుణ్యక్షేత్రాలతో ‘దివ్య దక్షిణ యాత్ర’ పేరుతో ప్రత్యేక భారత్ గౌరవ్ పర్యాటక రైలును నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జేజీఎం సత్య కిషోర్ తెలిపారు. ఆదివారం విజయవాడ రైల్వేస్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ యాత్రలో కాంచీపురంలోని కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబేశ్వర ఆలయం, శ్రీపరదరాజర్ పెరుమాళ్ ఆలయం, మహాబలిపురంలో తీర దేవాలయం, కృష్ణుని వెన్నముద్ద, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం, తిరుచిలో శ్రీరంగస్వామి ఆలయం, తంజావూరులో బృహదీశ్వర ఆలయం, తిరువణ్ణామలైలో అరుణాచలం ఆలయం సందర్శన ఉంటుందన్నారు. ఈ నెల 27 నుంచి మే 4 వరకు సాగే ఈ యాత్రలో రైలు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో బోర్డింగ్/డీబోర్డింగ్ సదుపాయం ఉందని తెలిపారు. ఈ యాత్రలో ఆన్బోర్డు/ఆఫ్బోర్డులో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి శాఖాహార భోజనం, పర్యటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రిళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కర్ట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్యాకేజీ ధరలు.. స్లీపర్ క్లాస్ పెద్దలకు ఒక్కొక్కరికీ రూ. 14,700, పిల్లలకు రూ.13,800గా టిక్కెట్ ధర నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్సైట్ లేదా విజయ వాడ రైల్వే రిటైనింగ్ రూమ్ వద్ద ఐఆర్సీటీసీ కార్యాలయంలో, లేదా 92814 95848, 92810 30714 ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం యాత్ర -
వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.8 లక్షలు ఆదాయం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం రూ.8,00,551 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. స్వామివారి సేవా టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.4,00,082లు, లడ్డు ప్రసాదం ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,24,075లు, డొనేషన్ ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,95,764లు, స్వామివారి కల్యాణకట్ట టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.33,480లు తదితర సేవా టికెట్ల ద్వారా మొత్తం రూ.8,00,551లు ఆదాయం సమకూరినట్లు వివరించారు. -
జ్యోతి సురేఖకు అభినందనల వెల్లువ
ప్రపంచకప్ స్టేజ్–1లో స్వర్ణం సాధించిన సురేఖ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మెక్సికోలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్– స్టేజ్–1లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో విజయవాడకు చెందిన తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ స్వర్ణ పతకం సాధించింది. మెక్సికోలో శనివారం జరిగిన ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్–1లో మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో మన దేశానికి స్వర్ణం సాధించడంలో వెన్నం జ్యోతి సురేఖ కీలకపాత్ర పోషించింది. జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్స్లో 233–232 స్కోర్తో అమెరికాకు చెందిన క్రీడాకారులు డీన్ ఓలీవియా, ఫియర్స్ ఫేజ్, రూయిజ్ అలెక్సిస్పై విజయం సాధించారు. వ్యక్తిగత, టీమ్ ఈవెంట్స్లో కలిపి జ్యోతి సురేఖ 12వ స్వర్ణం సాధించడంతో నగరానికి చెందిన క్రీడాకారులు జ్యోతి సురేఖకు అభినందనలు తెలిపారు. -
చెత్త రహిత స్వచ్ఛ నగరంగా మచిలీపట్నం
మచిలీపట్నంటౌన్: చెత్త రహిత స్వచ్ఛ మచిలీ పట్నంను తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ స్వచ్ఛ సైనికులుగా ముందుకు రావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డీకే బాలాజీ పిలుపునిచ్చారు. నగరంలో కలెక్టర్ స్వచ్ఛత కార్య క్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. నూతనంగా రూపొందించిన స్వచ్ఛ ఆయుధంను చేతబూని నగరంలోని 16వ డివిజన్ ఐదు రోడ్ల సెంటర్ ప్రాంతంలో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా చెత్తను, ప్లాస్టిక్ కవర్లను ఏరివేశారు. వారికి తోడుగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు, వసుధ జీవవైవిధ్య బృందం వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వచ్ఛ ఆయుధంతో చెత్త ఏరివేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ప్రజలు స్వచ్ఛ సైనికులుగా తరలివచ్చి ప్రతిరోజు ఉదయం ఒక అరగంట కేటాయించి చెత్తను ఏరివేస్తే వారి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, వసుధ జీవవైవిధ్య బృందం సభ్యులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షణ్, స్వర్ణ వార్డు సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరని మంటలు
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లా● తిరువూరు టీడీపీలో రగులుతూనే ఉన్న రావణకాష్ఠం ● అధిష్టానం జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గని పార్లమెంటు ముఖ్యనేత వర్గం ● కవ్వింపు చర్యలతో రెచ్చగొడుతున్న వైనం ● రోడ్డెక్కుతున్న నియోజకవర్గ ప్రజాప్రతినిధి 7సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజక వర్గ టీడీపీలో విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. నియోజకవర్గంలో పార్లమెంటు ముఖ్యనేత వర్గం కవ్వింపు చర్యలు అధిష్టానానికి సైతం తలబొప్పి కట్టిస్తున్నాయి. పార్టీ ప్రతిష్ట రోజురోజుకు మసక బారుతోంది. అక్కడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిని కాదని, ప్రత్యేకంగా ఓ ఇన్చార్జిని ఏర్పాటు చేసి తన వర్గంతో నియోజకవర్గ ప్రజాప్రతినిధిని దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తుండటంతో టీడీపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇరువురు నేతల మధ్య అంతరం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో వైరి వర్గాలు బహిరంగంగా తలపడుతున్నాయి. నియోజకవర్గ ముఖ్యనేత బహిరంగంగానే నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ రోడ్డెక్కడం చర్చనీయాంశంగా మారు తోంది. దీంతో అక్కడ పార్లమెంటు ముఖ్యనేత ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి దందా బట్ట బయలు అవుతోంది. నియోజకవర్గంలో జరిగే మట్టి, ఇసుక, పేకాట, మద్యం, రేషన్ మాఫియా దందా అంతా పార్లమెంటు ముఖ్యనేత గుప్పిట్లోనే పెట్టుకోవడంతో, నియోజక వర్గ ప్రజాప్రతినిధి బహిరంగంగానే ఆ దందాపై పోరాటం చేయటం నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంఽశంగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు ఇసుక దందా, గంజాయి వంటి వాటిపైన నియోజకవర్గ ప్రజా ప్రతినిధి విమర్శలు చేశారు. నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ఘటన తరువాత ఏకంగా తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. దీంతో పాటు ఓ అడుగు ముందుకు వేసి పేకాట క్లబ్బులు మూసేసినందుకు, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అన్నందుకు దాడులు చేస్తారా అని ప్రశ్నించడం గమనార్హం. ఇటీవల పార్లమెంటు ముఖ్యనేత అనుచర గణం, గంపల గూడెం తహసీల్దారును తన కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం సైతం వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గ ప్రజా ప్రతినిధి బెల్ట్ షాపులపైన ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విచ్చలవిడిగా బెల్ట్షాపుల నిర్వహణ వైన్ షాపుల యాజమాన్యం సిండికేట్గా మారి నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మార్పీ కంటే లిక్కర్ బాటిల్పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని, గ్రామాల్లో అయితే ఏకంగా రూ.50 అదనంగా వసూలు చేస్తూ మధ్యతరగతి కుటుంబాలు వీధిన పడేలా చేస్తున్నారని ఆరోపించారు. ఇంద్రకీలాద్రిలో భక్తుల కిటకిట తిరువూరు పట్టణంలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలతో పాటు, మున్సిపాలిటీలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఇటీవల నియోజకవర్గ ప్రజాప్రతినిధి రోడ్డుపైన బైఠాయించారు. దీంతో అధికారులు దిగి వచ్చి వారం రోజుల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పటంతో ఆందోళన విరమించారు. అయితే నియోజకవర్గ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా, పార్ల మెంటు ముఖ్యనేత వర్గం ఆందోళన చేయడంతో విభేదాలు మరింత రచ్చకెక్కాయి. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓ నియోజకవర్గ నేత నుంచి పార్లమెంటు ముఖ్యనేత టికెట్టు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు చర్చ సాగుతోంది. దీంతో ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పే విధంగా పావులు కదుపుతుండటంతో తిరువూరు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రావణకాష్ఠంలా రగులుతూనే ఉన్నాయి. మొత్తం మీద టీడీపీకి చెందిన నియోజకవర్గనేతలే అక్కడ జరుగుతున్న అవినీతిని బయటపెడుతుండటంతో పచ్చనేతల అవినీతి దందా బట్ట బయలై నియోజకవర్గంలో టీడీపీ ప్రజాదరణను కోల్పోతోంది. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. పటమట(విజయవాడతూర్పు): విజయవాడ సౌత్ డివిజన్ ఏసీపీగా బదిలీపై వచ్చిన డాక్టర్ కె.మానస ఆదివారం సీపీ రాజశేఖర బాబును మర్యాదపూర్వరంగా కలిశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యాణార్ధం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. -
క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా
● పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ● ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు కృష్ణలంక(విజయవాడతూర్పు): ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, బెట్టింగ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జరుగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు వీరే! క్రికెట్ బెట్టింగ్ను నియంత్రించేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న ఆధ్వర్యంలో ఏసీపీ (ఎస్బీ) భానుప్రకాష్రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ పవన్కుమార్, సౌత్ ఏసీపీ డాక్టర్ మానస, ట్రాఫిక్ ఏసీపీ వేదాతో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. బెట్టింగ్లో పాల్గొన్నా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఆంధ్రప్రదేశ్ జూద చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు, అరెస్టులు, సస్పెక్ట్ షీట్లు ఓపెన్, బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని, డిజిటల్ పరికరాల స్వాధీనంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశీ అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై కచ్చితమైన పర్యవేక్షణ ఉంచాలని, యువత తమ భవిష్యత్తును కాపాడుకునేలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు గమనించినా, ఆన్లైన్ ద్వారా జరిగినా వెంటనే 100/112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
తిరుపతమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మచిలీపట్నంఅర్బన్: ఎస్ఎస్సీ జవాబు పత్రాల మూల్యాంకనం ఏడవ రోజు ఆదివారం ప్రశాంతంగా కొనసాగిందని జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు తెలిపారు. మొత్తం 775 మంది సిబ్బందిలో 80 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 461 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 234 మంది సబ్జెక్ట్ అసిస్టెంట్లు మూల్యాంకన కార్యక్రమంలో పాల్గొన్నారని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. మిగిలిన మూల్యాంకనాన్ని ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుత్రకామేష్టి యాగాన్ని ఆదివారం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యాగానికి అపూర్వ స్పందన లభించింది. వేలాది మంది భక్తులు విచ్చేశారు. నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు భక్తుల సౌకర్యార్ధం ప్రసాదం, మంచినీరు, అన్న ప్రసాదాల ఏర్పాట్లను చేపట్టారు. ఉదయం తొమ్మిది గంటలకు యాగం ప్రారంభమైంది. సంతానం లేని దంపతులు ఈ యాగంలో అధికసంఖ్యలో వేలాదిగా పాల్గొని శ్రీ వేంకటేశ్వరుని కృపకు పాత్రులయ్యారు. స్వామివారి సన్నిధిలో ప్రతి ఏడాది ఏప్రిల్ నెల రెండో ఆదివారం ఈ యాగం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తులు ఆదివారం రూ.1.28 లక్షల విరాళాన్ని అందజేశారు. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన జయలక్ష్మి, వంశీకృష్ణ కుటుంబం ఆదివారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసిన వారు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.28,166 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. -
బీఎండబ్ల్యూ కారు ప్రమాదం.. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నందిగామ నందిగామ సీఐ చావన్ అన్నారు. కీసర టోల్గేట్ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ.. డ్రైవర్ అతివేగంగా లారీ నడపటం వల్లే డివైడర్ ఎక్కి ట్యాంకర్ కారుపై పడిందన్నారు. లారీ టాంకర్ ఒక్కసారిగా కారుపై పడటంతో లాయర్ శ్రీనివాస్ మృతి చెందారు. లారీ ఫిట్నెస్ను అధికారులు పరిశీలిస్తున్నారు. టోల్గేట్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా? లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.కాగా, అతి వేగంగా వస్తోన్న ఫ్లైయాష్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై పడిన ఘటనలో హైకోర్టు సీనియర్ న్యాయవాది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని కీసర టోల్ ప్లాజా వద్ద జరిగింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బొద్దులూరి శ్రీనివాసరావు (55) ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాది. ఈయన శనివారం కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. కీసర టోల్ప్లాజా వద్దకు కారు రాగానే..వెనుక నుంచి ఫ్లైయాష్ లోడుతో వస్తోన్న ట్యాంకర్ అతి వేగంగా వచ్చి ప్లాజా దిమ్మెను ఢీకొంది. అనంతరం అదుపు తప్పి శ్రీనివాసరావు కారుపై పడిపోయింది.దీంతో కారు నుజ్జునుజ్జయింది. ట్యాంకర్ కారుపై పడిన 3 నిమిషాల పాటు అందులో ఉన్న శ్రీనివాసరావు హారన్ మోగించినట్లు స్థానికులు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. భారీ ప్రొక్లెయిన్లు, గొలుసుల సాయంతో ట్యాంకర్ను పక్కకు తీశారు. ఆ తర్వాత ట్యాంకర్ కింద ఉన్న కారును మరో పొక్లెయిన్తో బయటకు తీయగా అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. కాగా, ట్యాంకర్ను అతివేగంగా నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే దానిపై విచారణ చేస్తున్నామని సీపీ చెప్పారు. -
విజయవాడలో అమానుషం..
విజయవాడ: నగరంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని పసిపిల్లను పబ్లిక్ టాయిలెట్స్ వదిలి వెళ్లిందో మహిళ. పసిపిల్లను తీసుకుని ఆటో ఎక్కిన ఓ మహిళ.. కృష్ణలంక స్టేషన్కి ఎదురుగా ఉన్న పబ్లిక్ టాయిలెట్ వద్దకు వచ్చేసరికి ఆటో ఆపింది. బాత్రూమ్కు వెళ్లాలని చెప్పిన సదరు మహిళ.. ఆ పసికందును ఆ టాయిలెట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. ఆ పసిప్రాణానికి బకెట్ అడ్డుగా పెట్టి అక్కడ నుంచి పరారైంది. అయితే బాత్ రూం కడిగేందుకు వెళ్లిన సమయంలో శానిటరీ సిబ్బంది ఆ పసిపిల్లను గుర్తించారు. దాంతో వారు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఆ పసికందును హుటాహుటీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా మహిళను తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పసిపాపను బాత్రూమ్లో వదిలేసిన తర్వాత రైల్వే స్టేషన్కు వెళ్లినట్లు గుర్తించారు. అస్సలు ఆ మహిళ ఎవ్వరు?, ఎక్కడ ప్రసవించింది?...ఇక్కడ ఎందుకు వదిలేసింది? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, కలెక్టర్ లక్ష్మీశతో కలిసి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని ప్రమాదకర ప్రాంతాల పరిశీలనకు 12 శాఖల అధికారులతో కలిసి శుక్రవారం బస్సు యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కేతనకొండ ప్రాంతం నుంచి ఎనికేపాడు వరకు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించి 28 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్ స్పాట్)లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడం వల్ల ట్రాఫిక్ తగ్గినా, వేగం వల్ల ప్రమాదాలు పెరిగాయన్నారు. ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. గత మూడేళ్ల డేటాను ఆధారంగా చేసుకొని 123 బ్లాక్ స్పాట్స్ గుర్తించి, వాటిలో ప్రమాదాల తీవ్రతను తగ్గించాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ రోజు 28 బ్లాక్ స్పాట్స్ను సందర్శించి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్, వీఎంసీ కమిషనర్, నేషనల్ హైవే అథారిటీ పీడీతో చర్చించామని పేర్కొన్నారు. ‘అస్త్రం’ టీమ్ కూడా తగు సలహాలు ఇచ్చినట్లు చెప్పారు సమగ్ర ప్రణాళికతో.. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రోడ్డు భద్రత కోసం సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, అవగాహన కల్పించారు. వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర, ట్రాఫిక్ డీసీపీలు షరీన్ బేగం, ఎన్. సూర్య చంద్రరావు, నేషనల్ హైవే అథారిటీ పీడీ విద్యాసాగర్, రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. -
చల్లేస్తున్నారు!
గుట్టుచప్పుడు కాకుండా చేపలకు ఆహారంగా చెరువుల్లోకి కోళ్ల వ్యర్థాలు జి.కొండూరు: పచ్చటి పొలాలతో కళకళలాడే నాటి కృష్ణాజిల్లా, ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలో సాగు భూములు చేపల చెరువులుగా మారుతున్నాయి. ఆక్వా కల్చర్ వేగంగా విస్తరిస్తోంది. రైతులకు అధిక లీజు వస్తోంది. ఇదంతా తెరకు ఒక వైపు మాత్రమే.. రెండో వైపు చూస్తే అంతా అనర్థమే కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి కనీస అనుమతులు పొందకుండా చేపల చెరువులను నిర్వహించడం ఒక ఎత్తయితే, ఆ చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను వేస్తూ, పర్యావరణానికి హాని చేస్తూ జనజీవనాన్ని అతలాకుతలం చేయడం మరో కోణం. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఎన్టీఆర్ జిల్లాలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. టన్నుల కొద్దీ వ్యర్థాలు.. ఎన్టీఆర్ జిల్లాలోని పదమూడు మండలాల పరిధిలో 945.79ఎకరాల విస్తీర్ణంలో 269 చెరువుల్లో ఆక్వా కల్చర్ సాగు కొనసాగుతోంది. దీనిలో 90శాతం చెరువుల్లో చేపలు, పది శాతం చెరువుల్లో రొయ్యల సాగు జరుగుతోంది. అయితే చేపల చెరువుల్లో మొత్తం ఫంగస్, రూప్చంద్ చేపలనే పెంచుతున్నారు. వీటికి మేతగా వినియోగించే ఫీడ్ను కొనుగోలు చేయాలంటూ కేజీ రూ.30వరకు వెచ్చించాలి. అయినప్పటికీ ఈ మేతతో ఈ రకం చేపలు త్వరగా పెరగవు. దీనితో కోళ్ల వ్యర్థాలను మేతగా ఎంచుకున్నారు. కోళ్ల వ్యర్థాలను తిని ఈ రకం చేపలు త్వరగా పెరుగుతాయి. ఈ విధంగా జిల్లాలో ఏడాదికి 2వేల టన్నులకు పైగా ఈ రకం చేపలు దిగుబడి వస్తుండగా వీటిని ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఎక్కడో వేరే రాష్ట్రాల్లో సాగే ఈ కోళ్ల వ్యర్థాల దందాను, చెరువుల నిర్వాహకులు ఎన్టీఆర్ జిల్లాకు పాకేలా చేశారు. కేజీ రూ.10 చొప్పున టన్నుల కొద్దీ కోళ్ల వ్యర్థాలను చికెన్ షాపుల నుంచి సేకరించడంతో పాటు కోళ్ల ఫారాలలో వ్యాధులతో మృత్యువాత పడిన కోళ్లను సైతం తీసుకొచ్చి చెరువుల్లో చేపల మేతగా వినియోగిస్తున్నారు. ఈ వ్యర్థాలను సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పని చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, పట్టణాల నుంచి వ్యర్థాలను సేకరించడంతో పాటు హైదరాబాద్ వంటి పెద్ద నగరాల నుంచి కూడా కోళ్ల వ్యర్థాలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. తీవ్ర కాలుష్యం.. జిల్లాలో ఆక్వా కల్చర్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో గ్రామాలకు ఆనుకొని ఈ చేపల చెరువుల నిర్వహణ సాగుతోంది. అయితే ఈ చెరువుల్లో విరివిగా కోళ్ల వ్యర్థాలను వేయడం వల్ల చెరువుల్లో నీరు మురుగుగా మారి దుర్వాసన వెదజల్లి గాలి కాలుష్యం ఏర్పడుతోంది. అంతే కాకుండా ఈ చెరువులో మురుగుగా మారిన నీరు పక్కనే ఉన్న పొలాలు, పంట కాల్వల్లోకి చేరి నీటి కాలుష్యం ఏర్పడుతోంది. ఈగలు, దోమలు ఉద్ధృతి ఎక్కువైపోయి చేపల చెరువులు నిర్వహణ సాగుతున్న గ్రామాల్లో వ్యాధులు ప్రభలుతున్నాయి. ఫంగస్ రకం చేపలురూప్చంద్ రకం చేపలుఅనధికారికంగా చేపల చెరువుల నిర్వహణ సాగుతోందని తెలిసినప్పటికీ, చెరువుల్లో కోళ్ల వ్యర్థాలతో చేపల పెంపకం జరుగుతోందనేది బహిరంగ రహస్యమైనప్పటికీ, సాగు కోసం వినియోగించే చెరువులు, ఎత్తిపోతల పథకాల కాలువల నుంచి అనధికారికంగా నీటిని చేపల చెరువులకు వినియోగిస్తున్నారనేది వాస్తవమైనప్పటికీ, అనుమతులు లేకుండా నిర్వహించే చేపల చెరువులకు ముడుపులందుకొని విద్యుత్ సరఫరాని సైతం అందించడం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులెవరూ అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతున్నప్పటికీ స్పందించని అధికారులు.. మీడియాలో కథనాలు వచ్చినప్పడు హడావుడిగా తనిఖీలు నిర్వహించి నోటీసులు అందించి మమ అనిపించి వదిలేయడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం జిల్లాలో పోలీసు, రెవెన్యూ, మత్యశాఖ, రవాణా శాఖ సంయుక్తంగా చేపల చెరువులను తనిఖీ చేసి నోటీసులు అందిస్తున్నారు. -
తవ్వుకో.. పంచుకో!
గుడివాడ రూరల్: మండలంలోని రామనపూడి గ్రామంలో అధికార పార్టీ నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా మట్టి తవ్వకాలకు తెరలేపారు. రామనపూడిలో ఉన్న పంచాయతీ చెరువులో గుడ్లవల్లేరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు గత రెండు రోజులుగా రాత్రి, పగలు తేడా లేకుండా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టి మాఫియాని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. భారీ టిప్పర్లు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రొక్లెయిన్ల ద్వారా చెరువులో మట్టి విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. టిప్పర్ మట్టి రూ.8వేలకు, ట్రాక్టర్ రూ.1,500 నుంచి రెండు వేలకు అమ్మకాలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. తవ్విన మట్టిని పామర్రు, గుడివాడలకు తరలిస్తున్నారు. ఫిర్యాదు చేసినా.. గత రెండు రోజులుగా గ్రామంలో విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు.. రామనపూడి గ్రామంలోని రహదారులపై అతివేగంగా టిప్పర్లు, ట్రాక్టర్లు భారీ శబ్దాలతో వెళ్లడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గ్రామానికి చెందిన కొంతమంది మట్టి మాఫియాని ప్రశ్నించేందుకు వెళ్లగా స్థానిక మాజీ సర్పంచ్ నేతృత్వంలో గ్రామస్తుడు సన్నాల మురళిపై దాడి చేశారు. దీంతో మురళి చేతికి ఐదు కుట్లు పడగా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సేవ చేసే సభ్యులకు ఐడీ కార్డులు
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో నిర్వహించే పండుగలు, ఇతర పర్వదినాలు, హుండీ లెక్కింపు సమయాల్లో పాల్గొని వివిధ ప్రదేశాల్లో సేవ చేసేందుకు, శాశ్వత సేవా సభ్యులుగా గుర్తింపు పొందుటకు ఆసక్తి గల పురుషులు, మహిళలకు ఐడీ కార్డులు ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఆలయ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తుల పూర్వాపరాలు పరిశీలించి గుర్తింపు కార్డులు ఇస్తారన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకునే సేవాదళం సభ్యులపై ఎటువంటి కేసులు ఉండరాదన్నారు. వివరాలకు 9115500444, 9553156143లో సంప్రదించాలన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం, పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, తెలుగుశాఖ సంయుక్తంగా ఈ నెల 15వ తేదీన తమ కళాశాల ఆవరణలోని వెబ్నార్ హాలులో తెలుగు వెలుగు పేరుతో తెలుగు భాషపై పోటీలను నిర్వహిస్తున్నామని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ చెప్పారు. స్థానిక సిద్ధార్థ అకాడమీ ఆవరణ కార్యాలయంలో పోటీలకు సంబంధించిన కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, శ్రీదుర్గామల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కన్వీనర్ చనుమోలు కృష్ణారావు, ఉయ్యూరులోని ఏజీ ఆండ్ ఎస్జీ కళాశాల కన్వీనర్ తాతినేని శ్రీహరిరావు, సిద్ధార్థ కళాశాల తెలుగు శాఖాధిపతి సశ్రీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 99898 44001లో పేర్లు నమోదు చేసుకోవాలని రమేష్ కోరారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు శ్రీకాకుళం రోడ్డు–తిరుపతి మధ్య రెగ్యులర్ వారాంతపు రైలు నడిపేందుకు రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ వారాంతపు రైలు 17440 నంబర్తో ఈ నెల 13 నుంచి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్డులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా 17439 నంబర్తో ఈ నెల 19 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4.55గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. రెండు మార్గాలలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయ నగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంది. -
మాతాశిశు మరణాలు తగ్గించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మాతా, శిశు మరణాల పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి ప్రాణమూ అత్యంత విలువైనది.. తీసుకున్న చిన్నచిన్న జాగ్రత్తలే మాతాశిశు ప్రాణాలకు రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే నమోదైన మాతా, శిశు మరణాలకు కారణాలను విశ్లేషించి, ఇలాంటి కారణాల తో భవిష్యత్తులో మరణాలు చోటుచేసుకోకుండా సమగ్ర కార్యాచరణను రూపొందించి, అమలు చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్వో డాక్టర్ ఎం.సుహాసిని, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం, వైద్య నిపుణులు, గైనిక్ హెచ్ఓడీ కేశవ చంద్ర, పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ సునీత పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సర్వే కార్యాలయం వద్ద శుక్రవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో కలెక్టర్తోపాటు జేసీ ఎం. నవీన్ రక్తదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సర్వే ఏడీ లక్ష్మణరావు, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వైస్చైర్మన్ ఎస్. భాస్కర్ పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పేదవాడి గుండెచప్పుడు వైఎస్సార్ సీపీ అని, వారికి న్యాయం చేయడానికై నా వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి రావాలని ఆ పార్టీ విజయవాడ పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. ఇందుకు పునాది ఏదైనా ఉందంటే అది కేవలం పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు మాత్రమేనన్నారు. శుక్రవారం విజయవాడలోని ఐలాపురం రామా ఫంక్షన్ హాలు నందు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా బూత్ కమిటీ విభాగ సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై అవగాహన కల్పించారు. సుబ్బారెడ్డి బూత్ లెవెల్ ఏజెంట్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐఆర్పై విస్తృత అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏల పాత్ర, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, డబుల్ ఓట్లు వంటి వాటి విషయంలో ఎలా వ్యవహరించాలో వివరించారు. కార్యకర్తలే బటన్ నొక్కాలన్నదే భావన.. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిగా మారారని.. గతంలో మాదిరి అధికారులతో బటన్ నొక్కించకుండా కార్యకర్తల చేత బటన్ నొక్కించాలనే భావనలో పార్టీ ఉందని మోదుగుల అన్నారు. చాలా మంది డీలిమిటేషన్ మోడ్లోకి వెళ్లిపోయారన్నారు. ఎస్సీలకు, మహిళలకు నియోజకవర్గాలు రిజర్వ్ అవుతాయనే భావనలో ఉన్నారని, అలసత్వం వీడి టీడీపీ దొంగ ఓట్లను తొలగించాలని, కొత్త ఓట్లను రాబట్టాలని సూచించారు. ఇందుకు ఎస్ఐఆర్ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. బీఎల్ఏలు అత్యంత కీలకంగా పనిచేయాలన్నారు. పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ ఉందని పేర్కొన్నారు. బీఎల్ఏలకు ఒక ప్రత్యేక బుక్లెట్ను రూపొందించి అందుబాటులోకి తేవాలని కోరారు. వైఎస్సార్ సీపీ కసి నుంచి వచ్చిన పార్టీ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది కేవలం ప్రతీకారం తీర్చుకోవడం కోసమేనని, ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం లేదన్నారు. సమావేశంలో నియోజకవర్గాల పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి, తంగిరాల రామిరెడ్డి, గౌస్ మొహిద్దిన్, ఆళ్ల చెల్లారావు, సర్నాల తిరుపతిరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సాయిరాం, బూత్కమిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ అలీం, మాజీ జెడ్పీటీసీ సుధారాణి నల్లగట్ల, మందపాటి బసవారెడ్డి, యరడ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ బూత్ లెవల్ ఏజెంట్లు కీలకమన్నారు. వేర్లు బలంగా ఉంటే చెట్టు బలంగా ఉంటుందన్నారు. రాజకీయ నాయకులకు మూడు దశల్లో నమ్మకమైన వ్యక్తులు కావాలన్నారు. ఓటర్ల జాబితా తయారీ చేసేవారు, పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో ఒకే వ్యక్తి ఉంటే పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి ప్రస్తావిస్తూ.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన సీపీ జోషి ఒక్క ఓటుతో ఓడిపోయిన సంగతి బీఎల్ఏలకు వివరించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అతి తక్కువ మెజార్టీతో గెలిచిన ఎంపీ, అలాగే అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి తానేనన్నారు. 10వేల పోస్టల్ బ్యాలెట్లు లెక్కించలేదన్నారు. ఒక బూత్లో తనకు వ్యతిరేకంగా ఒక్క ఓటు పోలైన ఓడిపోయే వాడినని, అలాగే ఒక బూత్లో రెండు ఓట్ల చొప్పున పోలైన ఎంపీగా గెలిచేవాడినన్నారు. మల్లాది విష్ణు కేవలం 25 ఓట్లతో నెగ్గారన్నారు. ఇవన్నీ మనకు గుణపాఠాలు అని వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు. ఓటర్లను తీసుకురావడం రాజకీయ పార్టీల మేనిఫెస్టో అని, ఆ మేనిఫెస్టోను అమలు చేయడానికి ఓటరు కావాలన్నారు. -
ఇదీ పరిస్థితి.. అమరావతిలో.. సీఎం, సీఎస్ వెళ్లే దారిలోనే..!
విజయవాడ: ఏపీలో నిబంధనలను తుంగలో తొక్కి బార్ అండ్ రెస్టారెంట్ను టెంట్ల్లో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిన ఘటన మరొకటి వెలుగుచూసింది. అమరావతిలో బార్ అండ్ రెస్టారెంట్కు టెంట్ వేసి మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో బరితెగించి ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అది కూడా అసెంబ్లీ, సచివాలయంకి వెళ్లే దారిలో కొత్త బార్ అండ్ రెస్టారెంట్ వెలిసింది. సీఎం, సీఎస్లు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఇది ఏర్పాటు చేయడం లిక్కర్ అమ్మకాల పాలసీని ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో అనే దానికి అద్దం పడుతోంది. రేకుల షెడ్డు, టెంట్ కిందే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..! -
విజయవాడ ఉగ్ర లింకుల కేసు.. సీపీకి ఎన్ఐఏ లేఖ
సాక్షి, విజయవాడ: విజయవాడ టెర్రర్ లింకుల కేసును తమకు అప్పగించాలని విజయవాడ పోలీసు కమిషనర్కు ఎన్ఐఏ(NIA) అధికారులు లేఖ రాశారు. ఏడు రాష్ట్రాలకు ముడిపడి ఉన్న కేసు కావడంతో తమకు అప్పగించాలని ఎన్ఐఏ అధికారులు లేఖలో పేర్కొన్నారు. ఉగ్ర లింకుల కేసులో ఇప్పటివరకు 13 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని కొత్తపేట పోలీసులతో పాటు, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. నిందితుల కస్టడీ పూర్తయ్యాక ఎన్ఐఏకి అప్పగించే అవకాశం ఉంది.కాగా, బెజవాడ ‘ఉగ్ర’ లింకులు దేశవ్యాప్తంగా విస్తరించినట్టు గుర్తించిన పోలీసులు వారి కోసం వేట మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు, విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. విజయవాడలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహమ్మద్ రహ్మతుల్లా షరీఫ్, మహమ్మద్ దానిష్, మీర్జా సోహైల్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. -
స్థానిక సంస్థల నిర్వీర్యానికి కుట్రలు
చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక విమర్శించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. చైర్పర్సన్ హారిక మాట్లాడుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా జిల్లా పరిషత్కు స్టాంప్ డ్యూటీ నిధులు రూ.23 కోట్లు రావాల్సి ఉండగా రెండేళ్లుగా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీని వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు రాక, చేసిన పనులకు ప్రారంభోత్సవాలు జరగక తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలామని, ఇలాంటప్పుడు స్థానిక సంస్థలను ప్రభుత్వం రద్దు చేస్తే బాగుంటుందని సూచించారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వండి ప్రస్తుత వేసవి నేపథ్యంలో ప్రజలకు సక్రమంగా తాగునీరు సరఫరా జరిగేలా చూడాలని చైర్పర్సన్ హారిక అధికారులకు సూచించారు. కో–ఆప్షన్ సభ్యుడు పరి శుద్ధ రాజు మాట్లాడుతూ.. తాగునీటి అవసరాలపై ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, తద్వారా సమ స్యను తక్షణం పరిష్కరించొచ్చని సూచించారు. కృత్తివెన్ను మండలంలో దాదాపు 30 గ్రామాల ప్రజలకు కలుషిత తాగునీరు అందుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్న కుమారి కోరారు. తాగునీరు కలుషితం కావటంతో ఆర్వో ప్లాంట్లను ప్రజలు ఆశ్రయిస్తున్నారని, వాటిపై పర్యవేక్షణ కొరవడిందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ స్పందిస్తూ.. తాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేలా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తా రని తెలిపారు. ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై ఫుడ్ సేఫ్టీ, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అధికారుల గైర్హాజరు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడు సబ్కలెక్టర్ వినూత్న తప్ప ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాకపోవ టంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు రాకుంటే తమ సమస్యలు ఎలా పరిష్కారమవు తాయని ప్రశ్నించారు. జెడ్పీ ద్వారా జరిగిన పనులకు ప్రారంభోత్సవాలు ఎప్పుడు జరుగుతాయని సభ్యులు ప్రశ్నించగా, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇచ్చిన తేదీల ప్రకారం నిర్వహిస్తామని అధికారులు బదులిచ్చారు. దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారులు ఒక తేదీని నిర్ణయించి, సంబంధిత ప్రజాప్రతినిధులను పిలవా లని సూచించారు. ఈ సమయంలో చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ.. ‘జెడ్పీ ఆవరణలో నిర్మించిన వాణిజ్య సముదాయానికి ప్రజాప్రతినిధులను మీరే పిలవాలి’ అని పీఆర్ డీఈ నగేష్ తనతో చెప్పటంతో ఆశ్చర్యపోయానని అన్నారు. ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులను అధికారులు పిలవాలా లేక ఎవరు పిలవాలని ప్రశ్నించారు. పీఆర్ ఎస్ఈ రమణరావు మాట్లాడుతూ.. డీఈ పొరపాటుగా చెప్పారన్నారు. దీనిపై జేసీ స్పందించి డీఈ నగేష్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గూడూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ వేముల సురేష్, సంగా మధుసూదనరావు మాట్లా డుతూ.. పోసినవారిపాలెం, మల్లవోలు, రాయవరం గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు నిర్మించి ప్రారంభోత్సవం చేయకుండా నిలుపుదల చేశారని, వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవా లని కోరారు. జెడ్పీ వైస్చైర్మన్ గరికిపాటి శ్రీదేవి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలంలోని దావు లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తు న్నారని, ఈ ఇసుకను హైదరాబాద్ తరలించి అమ్ము కుంటున్నారని, అనుమతులు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. జేసీబీల ద్వారా తవ్వకాలు జరుపుతున్నారని ఇలా అయితే ఆ ప్రాంత కూలీలకు ఉపాధి ఎలా దొరుకుతుందని నిలదీశారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్కలెక్టర్ వినూత్న, జెడ్పీ సీఈఓ జె.అరుణ, జెడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సాగు చేసిన మొక్కజొన్న, మినుమును మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతూ సభ్యులు పోడియం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. పెనుగంచిప్రోలు మండలంలో 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవగా, ప్రభుత్వం క్వింటా మద్దతు ధరను రూ.2,400గా నిర్ణయించిందని, దళారులు రూ.1600 మించి కొనడంలేదని పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపురి గాంధీ సభ దృష్టికి తెచ్చారు. తక్షణం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జేసీ నవీన్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి నివేదించామని ఉత్తర్వులు వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కసారిగా సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ. రైతులంటే అంత చులకనా, మొక్కజొన్న, మినుము పంట లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం ఏమిటని ప్రశ్నించారు. కొద్దిసేపు పోడియం వద్ద పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో అక్కడి ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని వివరించారు. పెనుగంచిప్రోలు మండలంలోని కొల్లికోళ్ల, 11 గ్రామాలకు వెళ్లే తాగునీటి పైప్లైన్ తరచూ పగిలిపోతోందన్నారు. ఇసుక తవ్వకాల వల్ల ఈ పైప్లైన్ పగిలినప్పుడు సుమారు పది రోజులు తాగునీటిని సరఫరా నిలిపివేస్తున్నారని ఎంపీపీ గాంధీ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక తవ్వకాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదన్నారు. -
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నా యని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో సమగ్ర, నాణ్యమైన వైద్య సేవలు అందించి, వైద్య పరిశోధనలను బలో పేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, ఎన్టీఆర్ జిల్లా కలె క్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆమె గురువారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, వ్యాధుల గుర్తింపు పరీక్షలు, సకాలంలో చికిత్స తీసుకునేలా ప్రోత్సహించడం వంటి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాధి నిర్ధారణకు అనుసరిస్తున్న విధానాలతోపాటు టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల ప్రచార కార్యక్రమం అమలును పరిశీలించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పోర్టబుల్ ఎక్స్రే వ్యవస్థను పరిశీలించారు. క్షయ రోగులకు పోషక ఆహార కిట్లను అందజేశారు. సత్వర వైద్య సేవలు పుణ్య సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను అను సంధానం చేస్తూ దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2024లో ప్రారంభమైన రెండో విడత ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ జన రల్ (సెంట్రల్ టీబీ డివిజన్) రఘురామ్రావు, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జేడీ (ఎన్టీఈపీ) డాక్టర్ రమేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు. -
బాలికలపై పెరిగిన లైంగికదాడులు
అమ్మో.. మృగాళ్లు సాక్షి, టాస్క్ఫోర్స్: అతను విద్యాబుద్ధులు నేర్పే గురువు. చదువుకునేందుకు వచ్చిన చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో అమ్మమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలిక ప్రైవేట్ పార్టులో పేపర్ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. బాలికను అమ్మమ్మ నిలదీయడంతో జరిగిన విషయం బయటపెట్టింది. ఈ అమాన వీయ ఘటన జరిగింది ఏ మారుమూల తండాలోనో కాదు. సాక్షాత్తూ విద్యలవాడగా పేరుపొందిన విజయవాడలో, అదీ పాఠశాలలో కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు సైకిల్ తొక్కుతుండగా అదే వీధిలో ఉంటున్న 45 ఏళ్ల వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తిరిగొచ్చి పాపతో అదే తీరుగా ప్రవర్తించాడు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన బాలికల రక్షణకు సవాల్గా మారింది. ఇటీవల విజయవాడలో బాలిక ప్రైవేటు భాగాల్లో యాసిడ్ పోసిన ఘటన సంచలనంగా మారింది. చిన్నారుల మంచి చెడ్డలు చూడాల్సిన డే కేర్ సెంటర్లోనే జరిగిన ఈ ఘటన బాలికల తల్లిదండ్రులను కలవర పెడుతోంది. మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైలవరంలో మరో బాలికపై లైంగికదాడి జరిగింది. ఇలా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, దాడులు నిత్య కృత్యమయ్యాయి. ‘ఆడబిడ్డలపై చేయివేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుంది’ అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ‘శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. బాలికలు, మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది’ అంటూ హోంమంత్రి అనిత సాక్షాత్తూ చట్టసభల్లోనే గొప్పలు చెప్పారు. వారి మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. నిత్యం ఏదో ఒక మూల మూడేళ్ల బాలిక నుంచి ముదుసలి వరకు లైంగికదాడులకు గురవుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రెండేళ్ల కాలంలో 196 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఏటేటా ఈ కేసులు రెట్టింపవుతున్నాయి. బాలికలు, మహిళలకు ఇంటాబయట రక్షణ కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్లు లైంగికదాడులకు తెగబడుతున్నారు. కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తుండగా, మరి కొన్ని ఘటనల్లో ఆడపిల్లల తల్లి దండ్రులు పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడిపోతున్నారు. మరి కొన్ని ఘటన లను ప్రైవేటు పంచాయితీల్లో సర్దుబాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వరుసగా అమనవీయ ఘటనలు పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో వరుసగా మూడు రోజుల వ్యవధిలో మూడు అమానవీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు ఘటనల్లోనూ పోలీసుల తీరు అనుమానాస్పదంగా మారింది. రెండు కేసుల్లో ఘటన జరిగిన 15 రోజుల వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్సీ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో కేసులో సెక్షన్లు మార్చి ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసినట్లు సమాచారం. బాలికల రక్షణపై పాలకుల ప్రకటనలు ఒకలా ఉంటే, కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు తీరు మరోలా ఉంది. బాలికలపై దారుణాలన్నీ ఇంటి ముందు వీధిలోనో, ఇంటి ఆవరణలోనో, బడిలోనో జరిగినవే. ఈ ఘటనల్లో నిందితులు బంధువులో, ఇరుగు పొరుగు వారో కావడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్షణ ఎలా అని ఆందోళన చెందుతున్నారు. శాంతి భద్రతలు అధ్వానంగా మారాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళలపై జరిగిన దాడులు అనేకం. వెలుగులోకి వచ్చినా చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్లుగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. బాలికలు, మహిళలకు రక్షణ కరువైంది. నడిరోడ్డుపై మహిళలపై కొందరు దారుణంగా దాడులు చేస్తున్నారు. చిన్నారులను చిదిమేస్తున్నారు. గత ప్రభుత్వంలో దిశ యాప్ ద్వారా రక్షణ కల్పించారు. మహిళల భద్రతకు అప్పటి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం మహిళల భద్రతను గాలికొదిలేశారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. బాలికలు, మహిళలకు భరోసా కల్పించాలి – సౌమ్య, న్యాయవాది -
కారుకూతలపై ఆగ్రహ జ్వాల
విజయవాడ వన్టౌన్ పీఎస్ వద్ద ఎస్ఐకు ఫిర్యాదు చేస్తున్న వెలంపల్లి, రాయన భాగ్యలక్ష్మి తదితరులు కారుకూతలపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్తున్న దేవినేని అవినాష్ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ నాయకులు మహిళలను కించపరుస్తూ కారుకూతలు కూసిన ఏబీఎన్ రాధాకృష్ణ, ఆ టీవీ చానల్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పత్రికా రంగం పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి ప్రమాదకరమని పలువురు విమర్శించారు. కారుకూతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు గురువారం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. – సాక్షి నెట్వర్క్ -
నాణ్యత, పోషకాల సమ్మేళం.. విజయ ఉత్పత్తులు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): వినియోగదారుడికి నాణ్యమైన, పోషకాలు కలిగిన ఉత్పత్తులను అందించడమే విజయ డెయిరీ లక్ష్యమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ నూతనంగా ఉత్పత్తి చేస్తున్న ఫ్లేవర్డ్ మిల్క్, సబ్జా లస్సీ, మీగడ పెరుగును పాలప్రాజెక్టు ఫంక్షన్ హాల్లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబుతో పాటు బోర్డు డైరెక్టర్లు హాజరయ్యారు. తొలుత ప్లాస్టిక్ బాటిల్లో వినియోగదారుడికి అందిస్తున్న ఆరు రకాల ఫ్లేవర్డ్ మిల్క్ను చైర్మన్, బోర్డు డైరెక్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. వినియోగదారుడి అభిరుచికి తగినట్లుగా విజయ డెయిరీ మార్కెట్లోకి బాదాం, చాక్లెట్, కాఫీ, స్ట్రాబెరీ, పిస్తా, రోజ్ ఫ్లేవర్లలో పాలతో పాటు వేసవిలో చల్లదనం కోసం సబ్జా ఉన్న లస్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టామన్నారు. వినియోగదారుల నుంచి అధికంగా డిమాండ్ ఉన్న గోల్డ్ పాలతో తయారు చేసిన గోల్డ్ పెరుగు కప్పులను (మీగడ పెరుగు)లను అందిస్తున్నామన్నారు. ఆరు దశాబ్దాల నమ్మకమే విజయ డెయిరీ అని, భవిష్యత్తులో వినియోగదారుడికి అవసరమైన అన్ని రకాల స్వీట్లు, ఐస్ క్రీమ్లను అందిస్తామన్నారు. తొలుత గణపతి శ్లోకంతో సాగిన నృత్య ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, కేటరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సమితి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరుతూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న పదో తరగతి స్పాట్ కేంద్రం బయట గురువారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కనీసం ఉద్యోగుల పీఆర్సీని పట్టించుకోలేదని విమర్శించారు. తక్షణం పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలు వచ్చే వరకూ ఐఆర్ 30 శాతం ఇవ్వాలన్నారు. ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను చేపట్టాలని కోరారు. ఫ్యాప్టో డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీ మనోహర్ కుమార్ మాట్లాడుతూ.. మలిదశ పోరాటంలో భాగంగా ఈ నెల 25, 26, 28 తేదీల్లో జరిగే నిరాహార దీక్షలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఫ్యాప్టో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఎ.సుందరయ్య, కార్యదర్శి ఇంటి రాజు నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కె.శ్రీనివాసరావు, జి.రామారావు, సయ్యద్ ఖాసీం, వి.రాధిక, జి.అనుగ్రహ ప్రసాద్, అరుణకుమారి, సురేష్ కుమార్, ఎం.కృష్ణయ్య పాల్గొన్నారు. -
మహిళా సాధికారతకు ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా జిల్లా పరిషత్ ప్రాంగణంలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించామని జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు. జెడ్పీ ద్వారా 15 శాతం సీ్త్ర, శిశు సంక్షేమ నిధులు రూ.2 కోట్లతో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని గురువారం జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్తో కలిసి హారిక ప్రారంభించారు. అనంతరం హారిక మాట్లాడుతూ.. మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల క్రితం ఈ వాణిజ్య సముదాయానికి శంకుస్థాపన చేశామన్నారు. మహిళలు చిన్నస్థాయి వ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ దుకాణాలను వారికి కేటాయించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. మచిలీపట్నంలో పది, అవనిగడ్డలో 12 దుకాణాలను మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం కోసం సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామన్నారు. త్వరలోనే బహిరంగ వేలం ద్వారా అర్హులైన వారికి దుకాణాలు కేటాయిస్తామన్నారు. ఈ వాణిజ్య సముదాయ నిర్మాణానికి సహకరించిన అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జె.అరుణ, డెప్యూటీ సీఈఓ ఆర్.సి.ఆనంద్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, జెడ్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి మచిలీపట్నంఅర్బన్: స్థానిక నోబుల్ కళాశాలలో నిర్వహించిన ఇంట ర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకనం గురువారంతో పూర్తయినట్లు కృష్ణా జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధి కారి ఎస్.సరళకుమారి తెలిపారు. మార్చి 25న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మొత్తం 2,03,757 జవాబు పత్రాలను బోర్డు నిబంధనల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూల్యాంకనం చేసినట్లు పేర్కొన్నారు. 540 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 108 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 108 మంది స్క్రూటినైజర్లతో ఇరవై రోజుల పాటు మూల్యాంకనం నిర్వహించామని వివరించారు. సహకరించిన ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సరళకుమారి కృతజ్ఞతలు తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలి భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక హౌసింగ్బోర్డ్కాలనీలోగల అన్న క్యాంటీన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చే ప్రజలతో మాట్లాడి ఆహారంలో నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్ వెలుపల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీలో ప్లాస్టిక్ గ్లాసులను వినియోగించడాన్ని కలెక్టర్ గుర్తించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగిస్తూ మజ్జిగ పంపిణీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. హజ్ యాత్రకుప్రభుత్వ సన్నాహాలు గన్నవరం: స్థానిక విమానాశ్రయం నుంచి ఈ నెల 18, 19 తేదీల్లో హజ్కు రాష్ట్రానికి చెందిన యాత్రికులు వెళ్లనున్నట్లు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. స్థానిక ఎస్ఎం కన్వెన్షన్లో గురువారం హజ్ కమిటీ రాష్ట్ర చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సీహెచ్.శ్రీధర్తో కలిసి హజ్ యాత్రికుల ఏర్పాట్లపై అధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన 337 మంది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలి పారు. యాత్రికులు ముందుకు క్యాంప్ వద్దకు చేరుకుంటారని, సదుపాయలను కల్పించాలని అధికారులు సూచించారు. తొలిరోజు హజ్ యాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నకిలీ అధికారుల హల్చల్!
తిరువూరు: నియోజకవర్గంలో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల అధికారులమంటూ కొందరు అనధికారిక వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో తిరువూరులో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో రవాణా, వాణిజ్య పన్నుల శాఖల చెక్పోస్టులు ఉండగా, రాష్ట్ర విభజన తదుపరి వీటిని తొలగించారు. స్థానికంగా ఆయా శాఖల కార్యాలయాలు లేకపోవడం, అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో కొందరు వ్యక్తులు వాహనదారులను బెదిరిస్తూ దండుకుంటున్నారు. గత నెలరోజుల్లో తిరువూరు సమీపంలోని అష్టలక్ష్మి దేవాలయం, పశువుల సంత, లక్ష్మీపురం సెంటర్లలో, అక్కపాలెం– పేరువంచ రహదారిలో రాత్రివేళల్లో వాహనాలు తనిఖీ చేసిన వ్యక్తులు తాము రవాణా శాఖాధికారులమని హంగామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీఎస్టీ, వాణిజ్య పన్నుల అధికారులమంటూ తనిఖీకి వచ్చేవారిలో ఎవరు అసలో, ఎవరు నకిలీనో తెలియట్లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేగనియంత్రణకు, ప్రమాదాల నివారణకు పోలీసులు రహదారులపై ఏర్పాటు చేసిన స్టాపర్ బోర్డులను అడ్డుపెట్టి పలువురు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. యూనిఫాం లేకుండానే తనిఖీలు.. ఇబ్రహీంపట్నం–జగదల్పూర్ జాతీయ రహదారిపై, లక్ష్మీ పురం–మచిలీపట్నం జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు యూనిఫాం లేకుండా తనిఖీలు నిర్వహిస్తుండటాన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు వ్యక్తులు సైతం వసూళ్లకు పాల్పడుతున్నారు. విజయవాడ, గన్నవరం నుంచి వస్తున్న ఆర్టీఏ అధికారుల తనిఖీలలో ఎన్ని వాహనాలపై జరిమానా విధించిందీ, ఎక్కడ తనిఖీ చేసిందీ వివరాలను తెలియజేయట్లేదు. తిరువూరు అసలు ఏ అధికారి పరిధిలో ఉందో కూడా వాహనదారులకు తెలియని పరిస్థితి నెలకొంది. కార్యాలయాల ఏర్పాటులో తీవ్ర జాప్యం.. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఐదేళ్ల క్రితం ఏర్పడినప్పటికీ తిరువూరులో ఇంతవరకు పలు కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. వాహనచోదకులకు నిత్యం అవసరమైన రవాణాశాఖ కార్యాలయం తిరువూరులో లేకపోవడం, గతంలో నూజివీడు ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరగ్గా, ఇప్పుడు గన్నవరం వెళ్లాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరువూరులో రవాణా శాఖ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు గతంలో పలుమార్లు స్థల పరిశీలన జరిపినా కార్యాచరణ జరగలేదు. అనధికారికంగా వాహనాల తనిఖీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవల పాత నేరస్తులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. వారిపై నిఘా ఉంచుతాం. – గిరిబాబు, ఇన్స్పెక్టర్, తిరువూరు పోలీస్స్టేషన్ -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267హనుమాన్జంక్షన్రూరల్: స్థానిక అభయాంజ నేయ స్వామిని హోం మంత్రి వి.అనిత గురువారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకరరావు, బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు.మచిలీపట్నంఅర్బన్: లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలి కోన్నత పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సజావుగా జరుగుతోందని కృష్ణా డీఈఓ యు.వి.సుబ్బారావు గురువారం తెలిపారు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు గురువారం విరాళాలు సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. -
భవనంపై నుంచి పడి కార్మికుడు దుర్మరణం
ఎ.కొండూరు: మండల కేంద్రంలో ఎన్టీఆర్ కాలనీకి చెందిన పిట్టా ఇస్సాకు (52) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మూడేళ్లుగా కిడ్నీ సమస్యలతో సతమతమవుతున్న ఇస్సాకు, డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఇప్పటివరకు సుమారు రూ.5లక్షల వరకు ఖర్చు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు, సీఐటీయూ మండల కార్యదర్శి జట్టి వెంకటేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
మచిలీపట్నంఅర్బన్: టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) 42 రోజుల వేసవి శిక్షణ కోర్సును మే 1 నుంచి జూన్ 11వరకు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో ఉన్నాయన్నారు. ఈ కోర్సులో ప్రవేశాలు పొందదలచిన అభ్యర్థులు మే 1వ తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి, గరిష్టంగా 45ఏళ్లు మించకూడదన్నారు. అర్హతలివి.. ఎస్ఎస్సీ లేదా సమానమైన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో లోయర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ వృత్తి విద్య కోర్సు ఉత్తీర్ణత, ఎస్బీటీఈటీ గుర్తించిన కోర్సులు, ఐటీఐల ద్వారా పొందిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, హ్యాండ్లూమ్ వీవింగ్ వంటి జాతీయ సంస్థల సర్టిఫికెట్లు లేదా పరిశ్రమల శాఖ జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలని తెలిపారు. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం లేదా సమాన సంస్థల నుంచి కర్ణాటక సంగీతం(గానం/వాద్యం)లో డిప్లొమా, లేదా ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ (బీఎఫ్ఏ) కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల వారు.. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు తమ విద్యా, సాంకేతిక అర్హతలను ఆంధ్రప్రదేశ్ వెలుపల బోర్డులు లేదా సంస్థలలో పొందినట్లయితే, ప్రవేశానికి ముందు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల నుంచి అనుమతి పొందాలని సూచించారు. ఈ కోర్సుకు దరఖాస్తులు ఏప్రిల్ 26వరకు స్వీకరిస్తామని చెప్పారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్www. bse.ap.gov.inను సందర్శించాలన్నారు. నాగాయలంక: సముద్ర జలాల్లో ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మెకనైజ్డ్, మోటారు బోటులలో మత్స్యకారుల చేపల వేటపై నిషేధం అమలులో ఉంటుందని అవనిగడ్డ మత్స్యశాఖ అభివృద్ధి అధికారి వానపల్లి సత్యనారాయణ గురువారం తెలిపారు. ఏపీ మత్స్య క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం జూన్14వరకు (61రోజులు) ఈ నిషేధం అమలు ఉంటుందని వివరించారు. ఈ కాలంలో మత్య్సకారులు సముద్రంలో చేపలు, రొయ్యల వేటలను పూర్తిగా నిలిపి వేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఇంజిన్ లేని సంప్రదాయక నావలకు మాత్రం నిషేధం వర్తించదని పేర్కొన్నారు. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి సమయం కాబట్టి తల్లి జాతిని సంరక్షించడం, చేపల జనాభా పెరుగుదలను ప్రోత్సహించడంతో సముద్రపు మత్స్య సంపద సుస్థిరత సాధించడం కోసమే ఏటా వేట నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కాలంలో చేపల వేట చేయకుండా మత్స్యకారులు మత్స్యసంపద అభివృద్ధికి సహకరించాలని, చట్టాన్ని అతిక్రమించి చేపలవేట సాగిస్తే శిక్షార్హులతారని చెప్పారు. విజయవాడలీగల్: నకిలీ మద్యం కేసులో గురువారం రిమాండ్ ముగియడంతో బెయిల్పై ఉన్న 14 మంది నిందితులు ఎకై ్సజ్ న్యాయస్థానంలో హాజరయ్యారు. మిగిలిన నిందితులలో ఏడుగురు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయగా, నలుగురు నిందితులు గైర్హాజరు పిటీషన్ దాఖలు చేయలేదు. 6వ అదనపు ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి లెనిన్బాబు నిందితులకు రిమాండ్ పొడిగిస్తూ, విచారణను ఈనెల 23వ తేదీ వరకు వాయిదా వేశారు. -
దుర్గగుడి టాయిలెట్స్లో గుర్తు తెలియని మృతదేహం
మూడు నాలుగు రోజుల క్రితమే మృతి చెందినట్లు అనుమానాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి దిగువన కనకదుర్గనగర్లోని టాయిలెట్స్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం గుర్తించారు. కనకదుర్గనగర్లోని పురుషుల టాయిలెట్స్ మొదటి బాత్రూమ్ నుంచి భరించరాని దుర్వాసన వస్తుండటంతో, అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది పక్క టాయిలెట్స్లో పైకి ఎక్కి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. టాయిలెట్స్ లోపల వైపున గడియ పెట్టుకుని ఉండటం, ఓ వ్యక్తి కింద పడిపోయి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు మృతుని ఒంటిపై ఉన్న ప్యాంట్, గోడపై ఉన్న షర్టులో అతనికి సంబంధించి గుర్తింపు కార్డులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. కనీసం మృతునికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను యాచకుడు అయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు, నాలుగు రోజుల కిందట మృతి చెంది ఉంటాడని దేవస్థాన అధికారులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఘటనలో శానిటేషన్ విభాగానికి చెందిన సూపర్వైజర్, సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. మూడు, నాలుగు రోజులుగా టాయిలెట్ డోర్ వేసి ఉంటే కనీసం లోపల ఎవరు ఉన్నారు.. అతని పరిస్థితి ఏంటని ఆరా తీయాల్సి ఉండగా, అదేమి పట్టనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. అసలు మూడు రోజులుగా శానిటేషన్ సిబ్బంది టాయిలెట్స్ను శుభ్రం చేయలేదని తెలుస్తోంది. టాయిలెట్స్లో ఉన్న వ్యక్తి బయటకు రాకపోయినా సిబ్బంది పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుర్తించలేని విధంగా మృతదేహం.. మృతిచెందిన వ్యక్తి మృతదేహం గుర్తించలేని విధంగా మారిపోయింది. ఘటన గురించి తెలుసుకున్న దుర్గగుడి ఈవో శీనానాయక్ కనక దుర్గనగర్కు చేరుకున్నారు. టాయిలెట్స్లో ఒకరు మృతి చెంది ఉన్నా కనీసం గుర్తించలేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనకదుర్గనగర్లో శానిటేషన్ పనులను పర్యవేక్షించే సూపర్వైజర్, స్వీపర్ ఒకరికి మరొకరు పొంతనలేని సమాధానం ఇవ్వడంపై వారిపై చర్యలు తీసుకుంటామని ఈవో పేర్కొన్నారు. మరో వైపున ఆలయంలో శానిటేషన్పై భక్తుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో గురువారం మధ్యాహ్నమే శానిటేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సమావేశంలో టాయిలెట్స్ను ప్రతి మూడు గంటలకు ఒక సారి శుభ్రం చేయాలని ఆదేశించారు. -
ఏబీఎన్ను ప్రజలు చీదరించుకుంటున్నారు
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను, ఆ చానల్ను ప్రజలు చీదరించుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై అగౌరవంగా మాట్లాడిన ఏబీఎన్ రాధా కృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం మాచవరం పోలీస్స్టేషన్లో పార్టీ నేతలతో కలిసి దేవినేని అవినాష్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని వైఎస్ జగన్ సూచించారన్నారు. అప్పటి నుంచి కూటమి నేతలు, ఎల్లో మీడియా వైఎస్సార్ సీపీపై విరుచుకుపడుతోందన్నారు. రూ.లక్షల కోట్లతో అమరావతి అభివృద్ధి చేసే బదులు రూ.20వేల కోట్లతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయవచ్చని చెప్పారన్నారు. కూటమి నేతల స్టాండ్ ఏమిటో ఈ ప్రాంత కూటమి నేతలు మాట్లాడాలన్నారు. మావిగన్ చెప్పినప్పటి నుంచి రోత మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీ పెట్టి పారిపోయినోళ్లు మాట్లాడుతున్నారు.. గతంలో ఐపీ పెట్టి నగరాన్ని వదిలి పారిపోయినోళ్లు ఇప్పుడు జగన్ గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. ఎంపీ అంటే మట్టి, పేకాటగా మార్చేశారన్నారు. అవినీతి, కబ్జాలకు కేరాఫ్గా కేశినేని చిన్ని ఉన్నారని ఆరోపించారు. ఇంకా మూడేళ్లే మీ అధికారం, ఆ తర్వాత మీ అడ్రస్ కూడా ఎవరికీ దొరకకుండా పారిపోతారన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ దారుణంగా మాట్లాడితే చంద్రబాబు, పవన్కల్యాణ్, నారా లోకేష్ ఏమయ్యారని ప్రశ్నించారు. రాబోయేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలని దేవినేని అవినాష్ అన్నారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, సీనియర్ నేతలు వెంకట సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు వియ్యపు అమర్నాథ్, తంగిరాల రామిరెడ్డి, పుప్పాల కుమారి, పార్టీ నేతలు నత్తా యోనారాజు, వడ్లమూడి సంపత్, ఇందు పల్లి సుభాషిణి, మాధవి, రమణ, ఆళ్ల చెల్లారావు, మాతంగి రాజేష్, సొంగా రాజ్కమల్ పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్కు చెందిన భక్తులు బుధవారం విరాళాలను అందజేశారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జి.ప్రణీత్కుమార్, పవిత్ర కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి తమ కుమారుడు చిన్నారి జి.దేవాశిష్ పేరిట రూ. 1,01,116, అలాగే పవిత్ర తల్లి ఈశ్వరి, సోదరుడు నిఖిల్ చిన్నారి జి.ధీరన్ సాయి పేరిట రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్ బాచు పల్లికి చెందిన జీఎన్ భాస్కరరావు దంపతులు, విజయవాడ వన్టౌన్ ప్రాంతానికి చెందిన ఎం. జైరామ్ కుటుంబం అన్నదానానికి రూ. లక్ష చొప్పున విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ పర్యవేక్షకుడు డీవీవీ సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): డ్రగ్స్ రహితంగా కమిషనరేట్ను చేయడమే ధ్యేయంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు పేర్కొన్నారు. బుధవారం కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ పరిసరాల్లో సిటీబస్ టెర్మినల్లో డ్రగ్స్పై దండయాత్ర 2.0 నేపథ్యంలో బుధవారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల అలవాటు ఉన్న వారిని గుర్తించడం కోసం మెడికల్ కిట్స్తో తనిఖీలు నిర్వహించారు. 64మంది అనుమానితులను తనిఖీచేసి ఆరుగురిని గుర్తించారు. ఈ సందర్భంగా రాజశేఖరబాబు మాట్లాడుతూ ప్రతి కళాశాలలో విద్యార్థులకు, యువతకు ప్రతి ఒక్కరికీ తనిఖీ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మధురానగర్(విజయవాడసెంట్రల్): జగ్గయ్యపేట మునిసిపాలిటీ, డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ఎస్ఆర్ఆర్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ డి. యుగంధర్ మూడు స్వర్ణం, ఒక రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా బుధవారం కళాశాలలో యుగంధర్ అభినందన కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56–60 సంవత్సరాల విభాగంలో తమ కళాశాల అధ్యాపకుడు మూడు స్వర్ణపతకాలు, ఒక రజతం సాధించటం కళాశాలకే గర్వకారణంగా పేర్కొన్నారు. ఆయన 200మీటర్ల ఫ్రీ స్టైల్, 25 మీటర్ల బటర్ఫ్లై, 100మీటర్ల ఇండివిడ్యువల్ మెడ్లీ విభాగాలలో స్వర్ణ పతకాలు, అలాగే మరొక విభాగంలో రజత పతకం సాధించినట్లు వివరించారు. అనంతరం యుగంధర్ను కళాశాల అధ్యాపకులు డాక్టర్ వీఎస్డీఎస్ బాలసుబ్రహ్మణ్యం, జె. నాగేశ్వరరావు, విజయదీప్ తదితరులతో కలిసి అభినందించారు. -
బహిరంగ క్షమాపణ చెప్పాలి..
మహిళలను కించపరిచేలా మాట్లాడిన రాధా కృష్ణ రాష్ట్ర మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ‘వైఎస్సార్ సీపీ నేతల భార్యలను దుర్భాషలాడితే చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఏమయ్యారు? స్కీమ్లు స్కామ్లతో కూటమి నేతలు ముందుకు వెళ్తున్నారు. రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్ మావిగన్ పేరుతో మంచి ప్రతిపాదన చేసేసరికి చంద్రబాబు ముఠాలో వణుకు మొదలైంది. జగన్ను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, పాలన గురించి మాట్లాడే సామర్థ్యం లేక అమరావతి అవినీతి నుంచి డైవర్ట్ చేయడానికి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు’ అని అనినాష్ విమర్శించారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానమే లక్ష్యం
వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ లక్ష్మీశ భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ సర్వేక్షణ్లో సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్ నిలబెట్టుకోవడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. సమష్టిగా పని చేసి ర్యాంకుల సాధనకు కృషి చేయాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, సమ్మర్ యాక్షన్ ప్లాన్, జనగణనపై బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మునిసిపల్ కార్పొరేషన్లోని వివిధ శాఖాధిపతులు, స్వర్ణ వార్డుల సిబ్బందితో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ వేసవికి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు పాల్గొన్నారు. సత్తా చాటుదాం.. పటమట(విజయవాడతూర్పు): స్వచ్ఛ సర్వేక్షణ్లో అగ్రస్థానమే లక్ష్యంగా అడుగేసి సత్తా చాటుదామని, వినూత్న కార్యాచరణ, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ఇది సాధ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనం సమావేశ మందిరంలో 30కు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్డబ్ల్యూఏ), టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి స్వచ్ఛతలో నగర కీర్తిప్రతిష్టలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల అమల్లో ఆర్డబ్ల్యూఏల భాగస్వామ్యంపై లక్ష్మీశ చర్చించారు. అసోసియేషన్ల ప్రతినిధుల సలహాలు సూచనలు తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే మంచి ర్యాంకులు సాధించామని, 2025–26కు సంబంధించి కూడా ముందంజలో నిలిచేందుకు కృషిచేస్తున్నామని మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. డెప్యూటీ డైరెక్టర్ (ఉద్యాన) చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ కంకిపాడు: గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త, వ్యర్థాలు పేరుకుపోకుండా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు చెత్తను తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. మండలంలోని నెప్పల్లి గ్రామంలో బుధవారం కలెక్టర్ బాలాజీ విస్తృతంగా పర్యటించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త, వ్యర్థాలు నిర్దేశించిన సంపద తయారీ కేంద్రానికి మాత్రమే తరలించాలన్నారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరువేరుగా పంచాయతీ సిబ్బందికి అందించాలని సూచించారు. శ్మశానవాటికల నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తామన్నారు. -
‘లులు’కు భూ కేటాయింపు.. వెనక్కి తగ్గిన బాబు సర్కార్
సాక్షి, విజయవాడ: విజయవాడలో లూలు మాల్కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్కు భూమి కేటాయింపు సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. లులు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది.కాగా, విజయవాడ నడిబొడ్డున పాత బస్టాండుగా వ్యవహరించే గవర్నర్పేట డిపోకు చెందిన 4.15 ఎకరాల భూమిని చంద్రబాబు సర్కారు లులు చేతిలో పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో రూ.600 కోట్లపైనే ఉంటుంది. జీ+3 విధానంలో లులు ఇక్కడ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకునేందుకు 99 ఏళ్లు లీజుపై ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.అయితే, లులుకి భూములు కట్టబెట్టడంపై ఆర్టీసి ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది. గతంలో లులు అద్బుతం అంటూ చంద్రబాబు పొగడ్తలు గుప్పించారు. హైకోర్టులో నేడు లులు మాల్కి కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. -
క్వాంటం వ్యాలీకి భూములివ్వం
కోమటిగుంట రైతులు ఎ.కొండూరు: క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు కోసం వ్యవసాయ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని ఎ.కొండూరు మండలం కోమటికుంట గ్రామ రైతులు స్పష్టం చేశారు. తహసీల్దార్ ఉదయ్ భాస్కరరావును మంగళవారం కలిసిన రైతులు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిగుంట రైతులు మాట్లాడుతూ ముత్తాతలు, తాతలు, తండ్రుల కాలం నుంచి వందల ఏళ్లుగా ఈ భూములను సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రాణంగా భావించే సాగు భూములను ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం సేకరించాలని చూడటం సరికాదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు వదులుకోబోమని వారు తేల్చిచెప్పారు. టీడీపీ సీనియర్ నేత గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ భూ సమీకరణ విషయంలో రెవెన్యూ అధికారులు రైతులకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు భూపరిశీలనకు రావడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన వివరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలని, వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులను కోరారు. వారి క్షేమమే ముఖ్యమని ఆయన తెలిపారు. దీనిపై తహసీల్దార్ మాట్లాడుతూ ఏపీఐఐసీ ద్వారా క్వాంటం వ్యాలీ ప్రతినిధులు భూములను కేవలం పరిశీలించడానికి మాత్రమే వచ్చారని తెలిపారు. పూర్తి వివరాలకు రైతులు కలెక్టర్ను కలిసి మాట్లాడాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో రైతులు వేములకొండ భాస్కరరావు, వేములకొండ సాంబశివరావు, కె. సురేష్, సీహెచ్ వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
ధర లేక.. దిక్కు తోచక!
● కొనుగోలు కేంద్రాలు లేవు ● మద్దతు ధర రూ.2,400.. వ్యాపారులిచ్చేది రూ.1700 ● వర్షాలకు నేలకొరిగిన పంట ● కోతకు అదనపు ఖర్చు ● వర్షాలు పడతాయన్న సూచనలతో రైతన్న ఆందోళన –జాజి గోపి, రైతు, శింగవరం, వత్సవాయి మండలం –ఏలూరి శివాజీ, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు గిట్టుబాటు ధర లేక... కొనుగోలు కేంద్రాలు ఏవీ! మార్క్ఫెడ్తో కొనుగోళ్లు చేయించండి -
కోడికి
విజయవాడ సిటీసాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 530.10 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 11,809 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పౌల్ట్రీపై వివక్ష ● గతేడాది జిల్లాలో బర్డ్ఫ్ల్లూతో 18వేలకు పైగా బ్రాయిలర్ కోళ్లు మృత్యువాత ● కల్లింగ్ చేసిన కోళ్లకే పరిహారం అందించి చేతులు దులుపుకొన్న ప్రభుత్వం ● ప్రభుత్వ భరోసా లేక జిల్లాలో ఏడాదికే తగ్గిన 3.35లక్షల కోళ్ల పెంపకం ● రూ.3.64 లక్షల పరిహారంతో సరి ● తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన మొక్కజొన్న రైతులు ● మద్దతు ధర రూ.2,400 చెల్లించాలి ● ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి ● రైతు సంఘం నేతలుమచిలీపట్నంఅర్బన్: స్వర్ణాంధ్ర విజన్ అమలును అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం మంగళవారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. నగరంలోని కలెక్టరేట్ ‘మీకోసం’ సమావేశ మందిరంలో కేంద్ర బృంద సభ్యులు వికాస్ కిచి (విద్యుత్), సంతోష్ ప్రసాద్ (పరిశ్రమలు, అంతర్గత వ్యాపార ప్రోత్సాహం) కలెక్టర్ డీకే బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో కీలక పనితీరు సూచికలు (కేపీఐ) మానిటరింగ్, స్వర్ణాంధ్ర విజన్ అమలు విధానంపై వివరాలు తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లా విజన్ కార్యాచరణ ప్రణాళిక, నియోజకవర్గాల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుతో పాటు కేపీఐల నెలవారీ నమోదు విధానాలను వారు పరిశీలించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: స్థానిక లేడీ యాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని మంగళవారం రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) నాగమణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మూల్యాంకన ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు. మూల్యాంకనం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఉపాధ్యాయులు బాధ్యతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జి.కొండూరు: ప్రభుత్వం తీరుతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి ‘కోడి’కి భరోసా కానరావడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో బర్డ్ప్లూ వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఇది వ్యాపించకుండా చేపట్టిన భద్రతా చర్యల్లో భాగంగా కోళ్లు మృత్యువాత పడిన కోళ్లఫారాల్లో బతికి ఉన్న కోళ్లతో పాటు గ్రామాల్లో బతికి ఉన్న నాటుకోళ్లను సైతం కల్లింగ్ చేశారు. జిల్లాలో గంపలగూడెంలోని అనుముల్లంక గ్రామంలో అత్తునూరి పద్మారెడ్డికి చెందిన కోళ్ల ఫారంలో 15వేల కోళ్ల వరకు మృత్యువాత పడ్డాయి. ఎ.కొండూరు మండల పరిధి దీప్లానగర్ హనుమాన్ ఫౌల్ట్రీ కోళ్ల ఫారంలో 3వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. పద్మారెడ్డి కోళ్ల ఫారంలో మిగిలి ఉన్న కోళ్లతో పాటు, అదే గ్రామంలో 70మంది రైతులు ఇళ్ల వద్ద పెంచుకునే కోళ్లతో కలిపి 7500ను అధికారులు కల్లింగ్ చేశారు. వీటి వరకు నష్ట పరిహారంగా రూ.3,20,000 అందజేశారు. దీప్లానగర్ హనుమాన్ పౌల్ట్రీఫారంలో బతికి ఉన్న కోళ్లతో పాటు అదే గ్రామంలో 12మంది రైతులకు చెందిన మొత్తం 300కోళ్లను అధికారులు కల్లింగ్ చేశారు. నష్ట పరిహారంగా రూ.44వేలను అందజేశారు. కల్లింగ్ చేసిన ఒక్కొక్క కోడికి రూ.135చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా దీనిలో కోత విధించి నిర్వహకులకు వెన్నుపోటు పొడి చారు. పరిహారం విషయంలో ప్రభుత్వ తీరుతో రూ.50 లక్షల వరకు బాధిత కోళ్ల ఫారాల నిర్వాహకులు నష్టపోయారు. బర్డ్ఫ్లూతో ఎన్టీఆర్ జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం పడింది. వైరస్ వ్యాప్తితో అధికారికంగా రెండు కోళ్ల ఫారాల్లో మాత్రమే కోళ్లు మృత్యువాత పడినా మిగిలిన ఫారాల్లో వేల సంఖ్యలో మృత్యువాత పడినట్లు తెలిసింది. నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం మొండిచేయి చూపడంతో కోళ్ల పెంపకం తగ్గుముఖం పట్టింది. వైరస్ వచ్చి పోయిన ఏడాది కాలంలోనే 29 బ్రాయిలర్ కోళ్ల ఫారాల నిర్వహణ నిలిచిపోయి 3,34,500 కోళ్ల పెంపకం తగ్గింది. మూడు నాటుకోళ్ల ఫారాలు తగ్గిపోయి 1100 వరకు కోళ్ల పెంపకం తగ్గిపోయింది. ఇటీవల మార్చిలో మళ్లీ బర్డ్ ప్లూ వ్యాప్తి చెందుతుందని పుకార్లు వచ్చాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక పెట్టుబడి పెరిగిపోయి ఉత్పత్తి తగ్గడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి కోళ్లు పెంచేందుకు నిర్వాహకులు పూర్తిగా వెనకడుగు వేశారు. గంపలగూడెంలో కోళ్ల పెంపకం నిలిపివేసిన కోళ్ల ఫారం మద్దతు ధర ఇవ్వండి ఎ.కొండూరు: అధికారులకు మొక్కజొన్న రైతు సెగ తగిలింది. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర దక్కేలా చూడాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఎ.కొండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు మంగళవారం ముట్టడించారు. రైతు సంఘం నేత ఆళ్ల అమ్మిరెడ్డి ఆధ్వర్యాన పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. రైతు సంఘం నేత అమ్మిరెడ్డి మాట్లాడుతూ మండలంలో సుమారు 8వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమన్నారు. అతి తక్కువ ధరకు అమ్మాల్సి వస్తోందిరైతులు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులకు అతి తక్కువ ధరకే అమ్ము కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2,400 మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని పది రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఇప్పటికే పంట అమ్ముకున్న రైతులకు బోనస్ ప్రకటించాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు. వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పానెం ఆనందరావు, రావుల రామకృష్ణ, సోమా యోహాను, పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 7జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం. గతేడాది వచ్చిన బర్డ్ ప్లూ వైరస్తో కొన్ని ఫారాలలో కోళ్ల పెంపకాన్ని ఆపేశారు. వైరస్లు దరి చేరకుండా ఉండేలా బయో సెక్యూరిటీ పద్ధతులను రైతులకు వివరిస్తున్నాం. ఎన్విరాన్మెంటల్లీ కంట్రోల్డ్ బ్రాయిలర్ ఫారాల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నాం. –ఎం.హనుమంతురావు, ఎన్టీఆర్ జిల్లా పశువైద్య శాఖ అధికారికోళ్ల ఫారంలో బర్డ్ ఫ్ల్లూతో చనిపోయిన కోళ్లతో పాటు అధికారులు చంపిన వాటితో కలిపి మొత్తం 15 వేలు చనిపోయాయి. ఒక్కొక్క కోడికి రూ.130 చొప్పున ఇస్తామని ప్రకటించి 6500 కోళ్లకు.. ఒక్కొక్క కోడికి రూ.35 చొప్పున రూ.2.28 లక్షలు ఇచ్చారు. రూ.35 లక్షల వరకు నష్టపోయాను. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారమైన ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి. అత్తునూరి పద్మారెడ్డి, ఫారం యజమాని, అనుముల్లంక మచిలీపట్నంఅర్బన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం బందరులో ర్యాలీ చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రేమ్చంద్ పాల్గొన్నారు.కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె. రాంజీ మంగళవారం బందరులో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. 2025 2026లో (బర్డ్ ఫ్లై సమయంలో) మొత్తం కోళ్ల ఫారాలు 116 84 బ్రాయిలర్ కోళ్ల ఫారాలు 83 54 లేయర్ ఫారాలు 25 25 బ్రాయిలర్ ఫారాల్లో కోళ్లు 9,30,000 5,95,500 నాటుకోళ్ల ఫారాలు 8 5 నాటు కోళ్ల ఫారాల్లో కోళ్లు 1800 710 సంవత్సరానికి ఉత్పత్తి అవుతున్న మాంసం 5,592టన్నులు 3,580టన్నులు -
హస్త కళాకృతులకు డిమాండ్
పెడన: గుర్రపు డెక్కతో తయారుచేసిన వివిధ రకాల హస్త కళాకృతులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, అందుకు తగ్గట్టుగా అందించడానికి కృషి చేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఆయన మంగళవారం పెడన మండలం చేవేండ్ర, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం పంచాయతీ లేళ్లగూడెం గ్రామాల్లో పర్యటించారు. సెర్ఫ్, డీఆర్డీఏ, వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు గుర్రపుడెక్కతో వివిధ హస్త కళాకృతుల తయారీలో శిక్షణ ఇస్తున్న నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాలకు శిక్షణ.. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏడాది క్రితం అసోం నుంచి కళాకారులను జిల్లాకు పిలిపించామని వారు మచిలీపట్నం మండలం చిన్నాపురంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 30 మందికి గుర్రపు డెక్కతో వివిధ రకాల బుట్టలు, చాపలు వంటి హస్త కళాకృతులు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. శిక్షణ తీసుకున్న డ్వాక్రా మహిళలు ఉత్పత్తి బాగా చేస్తుండటం గుర్తించామని, తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేశామన్నారు. చిన్నాపురంలో శిక్షణ పొందిన వారితో పలు ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇప్పిస్తున్నామని స్పష్టం చేశారు. కేవలం 20 రోజుల్లోనే బుట్టలు చాపలు వంటి అల్లికలు బాగా చేశారని కలెక్టర్ మహిళలను అభినందించారు. అనంతరం కలెక్టర్ లేళ్లగూడెం 9వ తరగతి విద్యార్థులతోనూ, వలంటీర్లతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ పర్యటనలో డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్, పెడన ఇన్చార్జి తహసీల్దార్ అనిల్ కుమార్, పెడన ఎంపీడీవో అరుణకుమారి, వెలుగు ఏపీఎం శ్రీదేవి, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
ఉన్నత ప్రమాణాలతో చేరువవుతోన్న ‘ఇగ్నో’
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థులకు మరింత చేరువవుతోందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె. మధుమూర్తి అన్నారు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 39వ స్నాతకోత్సవం విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆచార్య మధుమూర్తి స్నాతకోపన్యాసం చేశారు. ఇగ్నో 40ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యనూ అన్నీ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు. జాతీయ స్థూల నమోదు నిష్పత్తినీ పెంపొందించేందుకు కృషి చేస్తూ ‘మీ ఇంటి వద్దకే విద్య’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం 70 మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా డిగ్రీలను ప్రధానం చేశారు. రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత నివేదికను సమర్పిస్తూ దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా డిగ్రీలను ఈ స్నాతకోత్సవంలో అందుకోనున్నారని చెప్పారు. అలాగే విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో 1,626 మంది విద్యార్థులు డిగ్రీలు తీసుకునేందుకు అర్హత సాధించారన్నారు. ప్రాంతీయ కేంద్రం పరిధిలో పలు నూతన కోర్సులతో పాటు నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో నూతన అధ్యయన కేంద్రాలను రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇగ్నో డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రసాద్బాబు, ఇగ్నో అధికారులు డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ మమత, చెన్ను బాల చందర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి -
ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య
విస్సన్నపేట: ఒక ప్రైవేటు కళాశాలలో డీఫార్మసీ చదువుతున్న విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇవి.. మండలంలోని తాతకుంట్ల గ్రామానికి చెందిన మల్లాది కార్తీక్(22) స్థానిక పుట్రేలరోడ్డులోని ఫార్మసీ కళాశాలలో డీఫార్మసీ మొదటి సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వెళ్లిన కార్తీక్ను తన తండ్రి సోమవారం ఉదయం కళాశాలలో దిగబెట్టి వెళ్లాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున తన పక్క రూంలో ఉండే విద్యార్థులు వాష్ రూం కని వెళ్లగా.. దాని పక్కనే ఖాళీగా ఉండే ఒక గదిలో ఫ్యాన్ హుక్కు కార్తీక్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. మృతికి గల కారణం తెలియరాలేదు. ఈ మేరకు మృతుడి తండ్రి బాలక్రిష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ అలివేలు మంగ తెలిపారు. హాస్టల్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. విస్సన్నపేట సీహెచ్ిసీలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కృత్తివెన్ను: మండల పరిధిలోని లక్ష్మీపురం వద్ద 216 నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఒడుగు నాగేశ్వరావు (45) మృతి చెందగా, కుమారుడు కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో నరసాపురం వైపు వెళ్తున్న కారు బంటుమిల్లి వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న నాగేశ్వరరావు, కార్తీక్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన తండ్రి ఆస్పత్రిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడికి చికిత్స జరుగుతుందన్నారు. బాధితులు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లాంచీల రేవు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏ పైడిబాబు తెలిపారు. జి.కొండూరు: తల్లిదండ్రులు లేని చిన్నారిని మేనత్త వేధిస్తున్న ఘటన కట్టుబడిపాలెం గ్రామంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దళిత బహుజన రిసోర్స్సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత జి.కొండూరు పోలీసులను ఆశ్రయించారు. వివరాలలోకి వెళ్తే.. బీహర్ రాష్ట్రానికి చెందిన నిబాకుమారి, శివనత్దాస్ దంపతులు తమ ముగ్గురు కుమారులతో కలిసి ఐదేళ్ల కిందట జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నారు. కాగా నిబాకుమారి తన అన్నా, వదినలు బీహార్లోనే మృతి చెందగా వారి కుమార్తె ఆర్తీకుమారి(6)ని గత కొంతకాలంగా పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఆర్తీకుమారిపై మేనత్త నిబాకుమారి నిత్యం భౌతిక దాడి చేయడంతో పాటు సక్రమంగా అన్నం పెట్టక అనారోగ్యానికి గురైంది. చిన్నారిపై మేనత్త వేధింపుల విషయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న దళిత బహుజన రిసోర్స్ సెంటర్ క్లస్టర్ కోఆర్డినేటర్ నందేటి అనిత కట్టుబడిపాలెం వెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో గ్రామ మహిళా కానిస్టేబుల్ సాయంతో 108 అంబులెన్స్లో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం అనిత జి.కొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జి.కొండూరు ఎస్ఐ సతీష్కుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు విచారణ చేపట్టారు. -
పాఠశాలలో తనిఖీలు
రెడ్డిగూడెం: మండలంలోని రంగాపురం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని సమగ్ర శిక్ష జిల్లా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్. రమేష్బాబు(ఏపీసీ) మంగళవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని కిచెన్, క్లాస్ రూమ్స్, లైబ్రరీ, స్టాక్ రూమ్లను పరిశీలించారు. ఎస్వో, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థినులతో ముచ్చటించారు. జిల్లా కోఆర్డినేటర్ జీసీడీఓ, మండల విద్యాశాఖ అధికారి–2 పి. రమేష్బాబు, మండల ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 (డీఈఈసెట్) నోటిఫికేషన్ విడుదలైనట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరించనున్నట్లు చెప్పారు. దరఖాస్తుల స్వీకరణ మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు రూ.1,000 ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు భారతీయ పౌరులు అయి ఉండాలని, ఇంటర్మీడియెట్ లేదా సమాన అర్హతలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొన్నారు. సాధారణ వర్గాలకు కనీసం 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు అవసరమని తెలిపారు. అభ్యర్థులు కనీసం 17ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని సూచించారు. పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పార్ట్–ఏకు 60 మార్కులు (సాధారణ అంశాలు), పార్ట్–బీకు 40 మార్కులు (ఎంపిక చేసిన సబ్జెక్ట్) ఉంటా యన్నారు. ప్రభుత్వ డీఈఈటీ కళాశాలలు, ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో ర్యాంక్ ప్రకారం సింగిల్ విండో విధానంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. హాల్ టికెట్లు, పరీక్ష తేదీలు తదితర వివరాలు త్వరలో అధికారిక వెబ్సైట్లలో వెల్లడిస్తామని చెప్పారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ పూర్తిగా చదవాలని, సరైన ఫొటో, వివరాలను మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం https://cse.ap.gov.in,https://apdeecet. apcfss.in వెబ్సైట్లను పరిశీలించాలని చెప్పారు. రాష్ట్ర మంత్రి నారాయణ పెనమలూరు: మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా రహదారులు, డ్రెయినేజీలు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తామని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ కింద ఉన్న రోడ్లు నిర్మాణానికి రూ.103 కోట్లతో ఆయన మంగళవారం రాత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రోడ్లు, డ్రెయిన్లు, వేస్ట్ ఎనర్జీ ప్లా్ంట్స్ ఏర్పాటుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. మొదటి దశగా అన్ని మునిసిపాలిటీల్లో మౌలిక వసతులు కల్పన చేస్తామన్నారు. ఆ తరువాత పార్కులు, భవనాల నిర్మాణాలు, స్కూల్ ఏర్పాటుకు నిధులు ఇస్తానన్నారు. కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి శుభాష్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేసినేని చిన్ని, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. గుడివాడరూరల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30వేలు అపరాధ రుసుమును విధిస్తూ 11వ జిల్లా అదనపు జడ్జి జి.సుబ్రహ్మణ్యం తీర్పు వెల్లడించినట్లు గుడి వాడ తాలూకా ఎస్ఐ ఎన్.చంటిబాబు మంగళవారం తెలిపారు. మండలంలోని వలివర్తిపాడు గ్రామానికి చెందిన బల్లవరపు సుధాకర్, సిమ్మతి అనూషను 2013లో వివాహం చేసుకున్నాడు. వివాహం తదనంతరం అదనపు కట్నం కోసం సుధాకర్, అతని కుటుంబ సభ్యులు సుభాషిణి, సుధాంజలి, మేరమ్మ, భాస్కరరావు, ప్రభాకరరావు వేధించడంతో అనూష ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు తన కుమార్తె మృతికి కారణమైన వారిపై తాలూకా పోలీస్ స్టేషన్లో మృతురాలి తల్లి మరియమ్మ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన అప్పటి డీఎస్పీ విచారించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ పీపీ కంభంపాటి రవి సాక్ష్యాలను న్యాయమూర్తి ముందు సమర్పించడంతో నేరం రుజువు అయ్యింది. దీంతో మృతురాలి ఆత్మహత్యకు కారణమైన భర్త సుధాకర్కు ఐపీసీ–306 సెక్షన్ ప్రకారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20వేల అపరాధ రుసుము, 498ఐపీసీ కింద రెండేళ్ల జైలు, రూ.10వేలు జరిమానా విధించారు. -
జలవనరుల వినియోగంలో పొదుపు అవసరం
పెనమలూరు: భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని జలవనరులను పొదుపుగా వాడాలని డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. కానూరులోని ఏపీ ఎస్ఐఆర్డీ భవన్లో మంగళవారం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జలవనరుల స్థిరత్వం అంశంపై నిర్వహించిన వర్కుషాపును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రజలు ఇళ్లలో వాడే నీటిని తిరిగి భూమిలోకి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి కుటుంబానికి తగినంత నీరు ఇవ్వడానికి జల్జీవన్ మిషన్ 2.0 అమలు చేస్తామన్నారు. నీటి వినియోగంపై ఈ నెల 6 నుంచి జూలై 14 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ నైపుణ్యం కలిగిన వైద్యులుగా తీర్చిదిద్దుతాం
గుంటూరు మెడికల్: ప్రముఖ జాయింట్ రీప్లేస్ మెంట్ సెంటర్, మల్టీ స్పెషాలిటీ విభాగాలు కలిగిన సాయి భాస్కర్ హాస్పిటల్కు ఆర్థో విభాగంలో రెండు డీఎన్బీ సీట్లు కేటాయిస్తూ ఎన్.బి.ఇ.ఎం.ఎస్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్(ఎన్.బి.ఇ.ఎం.ఎస్ ) సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ను జాతీయస్థాయిలో ఆర్థోపెడిక్ పీజీ ట్రైనింగ్ సెంటర్గా గుర్తిస్తూ డిప్లమేట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ (డీఎన్బీ) సీట్లను కేటాయించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్లో గుజరాత్కు చెందిన డాక్టర్ జీల్ కటిరా, రాజస్థాన్కు చెందిన డాక్టర్ యశా జైన్లు సాయి భాస్కర్ హాస్పిటల్ను ఎంపిక చేసుకున్నారు. మంగళవారం అరండల్ పేటలోని హాస్పిటల్లో డాక్టర్ నరేంద్రరెడ్డి ఎదుట తమ తొలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డీఎన్బీ సీట్లను తమ హాస్పిటల్కు కేటాయించడం గర్వంగాను, ఆనందంగానే ఉందని తెలిపారు. మూడు సంవత్సరాల పాటు డీఎన్బీలో విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఎముకలు కీళ్ల విభాగంలో అన్ని విధాలా మెరుగైన విద్యను, ప్రాక్టికల్స్ను అందించి ఉత్తమ వైద్యులుగా తీర్చిదిద్ది తద్వారా జాతీయస్థాయిలో గుంటూరుకు గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని డాక్టర్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ కొనకల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చారిత్రక బావి.. చెత్తగా మారి!
గన్నవరం రూరల్: ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం కోరట బావి. దీనిలోని నీరు అమృతతుల్యమని ఏళ్లుగా ప్రతీక. మండలంలోని ముస్తాబాద తూర్పు భాగంలో కొండ పక్కన కోరట బావి శతాబ్దాల క్రితం గ్రామస్తుల దాహార్తిని తీర్చేది. ఈ బావి నీరు అత్యంత ప్రశస్తమైనదిగా భావించిన పూర్వీకులు మంచినీటి అవసరాల కోసం ఇక్కడి నుంచి నీటిని తీసుకుని వెళ్లేవారు. అంతేగాక సూరంపల్లి, ముస్తాబాద, పురుషోత్తపట్నం, కొండపావులూరు, గోపవరపుగూడెం గ్రామాల నుంచి రైతులు, మొకాసా దారులు ఈ నీటిని తీసుకువెళ్లేవారు. ఈ ప్రాంత రైతులు పొగాకును పండించేవారు. దొర పొగాకును ఉత్పత్తి చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా అప్పటి మద్రాసులో కంపెనీలు నిర్వహించేవారు. అక్కడికి ఈ కోరట బావి నీటిని వారు రైళ్లల్లో తీసుకు వెళ్లి మంచినీళ్లుగా వినియోగించటం జరిగేదని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఔషధగుణాలు.. కోరట బావి నీరు అమృతతుల్యమని భావిస్తారు. ఈ నీరు తాగితే మోకాళ్ల నొప్పులు రావని, తగ్గుతాయని చెప్పుకుంటారు. అంతేగాక దీర్ఘ రోగాలు తగ్గుతాయని భావిస్తారు. శతాబ్దాల ముస్తాబాద చరిత్రలో కోరట బావి పరిసరాల్లో సాధువులు, మహర్షులు బస చేసేవారని చెబుతారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి దీర్ఘకాల రోగులను ఇక్కడికి తీసుకువచ్చి నెలల తరబడి ఉంచి, కోరట బావి నీరు అందిస్తే వారి రోగాలు తగ్గి వెళ్లే వారని గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. కాలగర్భంలో కలిసిపోతూ.. అటువంటి చరిత్రగల కోరట బావి నీరు అడుగంటింది. కాలగర్భంలో కలసిపోయే విధంగా మొక్కలు అల్లుకుపోయాయి. 1965లో గ్రామానికి చెందిన యువక బృందం కోరట బావిని ఆధునికీకరించి అప్పటి పంచాయతీ సమితి అధ్యక్షుడు డాక్టర్ సీఎల్ రాయుడుతో ప్రారంభోత్సవం చేయించిన శిలాఫలకం నేటికి కనిపిస్తోంది. కోరట బావి నీరు అనంతర కాలంలో బావికి సమీపంలో ప్రభుత్వం హ్యాండ్ బోరు నిర్మించగా అక్కడ ఆ జల కనిపించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న పలు గ్రామాల ప్రజలు నిరంతరం కోరట బావి నీటిని ఈ హ్యాండ్ బోరు ద్వారా తీసుకువెళుతున్నారు. ముస్తాబాద శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న కోరట బావి ప్రాంతాన్ని ప్రభుత్వం రక్షించాలని, దాని విశిష్టతను భావితరాలకు తెలిపే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెట్ల వేళ్లతో పూడుకుపోయిన కోరట బావి కోరట బావి జల పాయ నుంచి హ్యాండ్ బోరు ద్వారా నీటిని తీసుకువెళుతున్న గ్రామస్తులు కోరట బావి చరిత్రను భావితరాలకు తెలియజేయాలి. అందుకు దీనిని సంరక్షించాలి. బాగు చేసి, చారిత్రక సంపదగా పరిగణించాలి. దీనిలోని నీరు ఔషధ గుణాలు కలిగినదిగా చెబుతారు. అందుకే ఇప్పటికీ పరిసరాల్లోని 5గ్రామాల ప్రజలు మంచినీటిని ఇక్కడి నుంచి తీసుకువెళతారు. – షేక్ గోరా మస్తాన్, రైతు, ముస్తాబాద -
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
గుడివాడ రూరల్: రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరి తర్వాత మొక్కజొన్నే అధికంగా సాగు చేశారని చెప్పారు. అకాల వర్షాల వల్ల మొక్కజొన్న పంట పాడై.. రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఉన్న కొద్దిపాటి పంటకు సైతం సరైన ధర లేకపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. వీరందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరా రు. లేదంటే వారికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి -
అతలాకుతలం
‘అకాల’ దెబ్బకు అకాల వర్షంతో రబీసాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న నేలవాలి తీవ్రంగా నష్టపోయిన రైతులకు సోమవారం మధ్యాహ్నం సమయంలో తీవ్ర పెనుగాలులతో కూడిన వర్షం కురవడంతో కోతలు పూర్తయి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు మండలాల్లో 4,496హెక్టార్లలో రబీ మొక్కజొన్న సాగవుతుండగా, 31,790టన్నుల మొక్కజొన్నలు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. అయితే ఇప్పటికే ఎనభైశాతం కోతలు పూర్తి కల్లాల్లో ఆరబోసి ఉండడంతో వర్షానికి తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు మండలాల్లో 250వరకు ఇటుక బట్టీలను నిర్వహిస్తుండగా వర్షం దెబ్బతో రూ.కోట్లల్లో నిర్వాహకులు నష్టపోయారు. అలాగే మామిడి కోతలు కోసే సమయం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణాజిల్లా హనుమాన్జంక్షన్లో మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. – జి.కొండూరు/హనుమాన్జంక్షన్ రూరల్ -
ఎన్టీఆర్ జిల్లాలో క్వాంటం వ్యాలీ హడావుడి
ఎ.కొండూరు: రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఎ.కొండూరు మండలంలో సోమవారం రాష్ట్ర క్వాంటం వ్యాలీ ఎండీ శ్రీధర్ పర్యటించి, ప్రాజెక్టుకు అనువైన స్థలాలను పరిశీలించారు. మండలంలోని చీమలపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న రామచంద్రాపురం గ్రామం, అలాగే కోమటికుంట గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో హార్డ్వేర్ ఎకో సిస్టమ్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్వాంటం వ్యాలీలో ప్రధానంగా కంప్యూటర్ హార్డ్వేర్ తయారీ పరిశ్రమలను నెలకొల్పనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి చెందిన ఖాళీ భూముల వివరాలను సేకరిస్తున్నామని, పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని ఎండీ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, ఈ ప్రాంతాన్ని ఒక హార్డ్వేర్ హబ్గా తీర్చిదిద్దడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక రంగం అభివృద్ధికి క్వాంటం వ్యాలీ ఎంతగానో దోహదపడుతుందని, హార్డ్వేర్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటై స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు, భూబాగం అనుకూలత వంటి అంశాలను అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో ఎ.కుమార్, తహసీల్దార్ ఎం.ఉదయ్ భాస్కర్, ఆర్ఐ దివ్య ప్రసాద్ సర్వేయర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి విరాళం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూరు గ్రామానికి చెందిన జి. వెంకటరమణ, పార్వతీ దంపతులు సోమవారం రూ. 1,00,116 విరాళంగా సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఈ విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. చల్లపల్లి: ఇటీవల చల్లపల్లి పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న పోలీసులను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మార్చి 31వ తేదీన పోలీస్ స్టేషన్లో మందుగుండు సామగ్రి తరలిస్తుండగా అట్టపెట్టెలో నుంచి ఉల్లి బాంబులు జారిపడి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. కాగా ప్రమాదంలో ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు, కోర్టు కానిస్టేబుల్ షేక్ అబ్దుల్లా, ఎస్ఐ కార్ డ్రైవర్ డి.నాగరాజు తీవ్రంగా గాయపడగా వారిని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు హోమ్ మంత్రి అనితకు వివరించారు. అనంతరం ఆమె వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు సోమవారం బంగారు మంగళ సూత్రాలను కానుకగా సమర్పించారు. విజయవాడ ఆచార్యరంగానగర్కు చెందిన జి.శరత్బాబు కుటుంబం సుమారు 22 గ్రాముల బంగారంతో తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలను ఆలయ చైర్మన్ రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్పై కారు దగ్ధం వన్టౌన్(విజయవాడపశ్చిమ): పోలీసు శాఖకు చెందిన ఒక కారు నుంచి మంటలు చెలరేగిన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కార్యాలయం ఉండేది. అయితే ఆ కార్యాలయాన్ని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం అమరావతికి తరలించింది. దాంతో పాత కార్యాలయం ప్రాంగణంలో ఉన్న వాహనాలను సైతం సిబ్బంది అమరావతికి తరలిస్తున్నారు. ఆ క్రమంలో అక్కడి నుంచి ఒక కారును అమరావతికి తరలిస్తుండగా కనకదుర్గ ఫ్లైఓవర్ పైన హెడ్ వాటర్ వర్క్స్ సమీపానికి వచ్చిన సమయంలో అందులో నుంచి మంటలు చెలరేగాయి. దాంతో అందులో ఉన్న డ్రైవర్ అప్రమత్తమై కారును నిలిపివేసి పక్కకు వచ్చేశాడు. అనంతరం అగ్నిమాపక శాఖకు, ఉన్నతాధికారులకు సమాచారమందించాడు. అగ్నిమాపక శాఖ వాహనం అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేసింది. -
జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శేషగిరిరావు
మైలవరం: ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు ఎన్నికయ్యారు. మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇండోర్ స్టేడియంలో సోమవారం ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా ఐ.మురహరి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వై.శేషగిరిరావు, ఉపాధ్యక్షులుగా ఆర్.రమేష్, ఎస్.సుబ్బారావు, కార్యదర్శి పి.బుజ్జి(ఏకగ్రీవం), సంయుక్త కార్యదర్శులుగా ఎల్.సతీష్ వర్మ, కె.రవిశంకర్, కోశాధికారిగా బి.చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా వై.హేమాంబిక, ఎం.మాధవీలత, బి.భారతి ఎన్నికయ్యారు. ఎన్నిక తదనంతరం జనరల్ బాడీ సమావేశంలో పది క్లబ్ ప్రతినిధులు, గౌరవ అధ్యక్షుడిగా పి.అజయ్కుమార్, చైర్మన్గా రానాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో కోఆప్షన్ సభ్యులుగా బి.ప్రేమ్ తేజా, మౌనిక, హర్షలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం 33 శాతం సీ్త్రలకు, 25 శాతం క్రీడా సంబంధిత వ్యక్తులను అసోసియేషన్ ద్వారా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి మురహరి తెలిపారు. -
డ్రగ్స్ కేసులో దొరికితే జీవితం నరకమే
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): డ్రగ్స్పై దండయాత్ర అంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారని.. డ్రగ్స్ కేసులో దొరికితే సహించేది లేదని.. చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. వాంబేకాలనీలోని వీఎంసీ కల్యాణమండపంలో ‘డ్రగ్స్పై దండయాత్ర 2.0’ కార్యక్రమం సోమవారం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో డ్రగ్స్పై సైకిల్ యాత్ర మంచి ప్రభావం చూపిందన్నారు ఇప్పటి వరకు ప్రేమతో చెప్పాం.. బతిమాలి చెప్పి చూశాం.. ఇంకా మార్పు రాకపోతే ఈసారి తప్పకుండా దండించి తీరుతామన్నారు. డ్రగ్స్ మహమ్మారి ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా వారి కుటుంబంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లానే ధ్యేయంగా యంత్రాంగం పనిచేస్తుందని.. అందుకే ప్రత్యేక కిట్లతో ఈ డ్రగ్స్ పరీక్షలను పోలీసులు, వైద్యుల సమక్షంలో జరుపుతున్నామన్నారు. డ్రగ్స్ తీసుకొని ఆరు నెలల సమయం గడిచినా కూడా ఈ పరీక్షల్లో కనిపిస్తుందని చెప్పారు. 149 హాట్ స్పాట్లు.. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 149 హాట్ స్పాట్స్లను గుర్తించామని ఈ హాట్ స్పాట్స్లలో 30 రోజుల పాటు 3000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా రోజుకు 100 మంది చొప్పున డ్రగ్స్ టెస్ట్ చేస్తామన్నారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీ చేసుకున్న వారిలో పాజిటివ్ వస్తే వారిని అడిక్షన్ సెంటర్కు తరలించే ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్రగ్స్పై దండయాత్ర కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రచార వాహనాలను జెండా ఊపి వారు ప్రారంభించారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, డ్రగ్ కంట్రోల్ ఏడీ శ్రీరామ్మూర్తి, డీఎంహెచ్ఓ సుహాసిని, డీసీపీలు, తదితరులు పాల్గొన్నారు. -
రైలులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైలు ప్రయాణంలో గర్భిణికి నొప్పులు రావటంతో తక్షణమే స్పందించిన మహిళా టీటీఐ అందుబాటులో ఉన్న ఇతరుల సహకారంతో రైలులోనే సుఖప్రసవం చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలివి.. ఆదివారం అలప్పుజ–ధన్బాద్ ఎక్స్ప్రెస్ (13352)లో బీ1 కోచ్లో తన కుటుంబంతో కలసి గర్భిణి ప్రయాణిస్తోంది. రైలు అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఆమె కుటుంబ సభ్యులు విధుల్లో ఉన్న మహిళా టీటీఐ జి.జ్యోతికి విషయం చెప్పారు. వెంటనే ఆమె స్పందించి కమర్షియల్ కంట్రోలర్తో సమన్వయం చేసుకుంటూ, వైద్యుల సూచనలను పాటిస్తూ అందుబాటులో ఉన్న మహిళల సహకారంతో ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రైలును యలమంచిలి స్టేషన్లో అత్యవసరంగా నిలిపివేసి 108లో తల్లి, బిడ్డను యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారు ఆరోగ్యంగా ఉన్నారు. సిబ్బందిని డీఆర్ఎం మోహిత్ సోనాకియా అభినందించారు. -
నీటి భద్రత.. సాగునీటి సంఘాల బాధ్యత
విజయవాడ ఎంపీ శివనాథ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నీటి వనరుల పరిరక్షణ, సమర్థ వినియోగం, భవిష్యత్ తరాలకు తగిన నీటి భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభమైన జలధార–నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా ముందడుగు వేద్దామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీశ.. అధికారులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దార్శనికతతో నీటి భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారని.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పటిష్ట కార్యాచరణతో జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. ఇప్పటికే జల భద్రతకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేద్దామని పేర్కొన్నారు. 100 రోజుల ప్రత్యేక కార్యచరణ.. కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుంచి జూలై 14 వరకు 100 రోజుల కార్యక్రమం జరగనుందన్నారు. నీటి సంరక్షణ, భూగర్భ జల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమీకృత నీటి నిర్వహణ, చెరువులు – కాలువల పునరుద్ధరణ, చెరువుల అనుసంధానం, నీటి సంరక్షణ విధానాలు, పచ్చదనం పెంపొందించడం, గ్రామ నీటి బడ్జెట్ లక్ష్యాలతో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లా నీటి వనరుల అధికారి (డీడబ్ల్యూఆర్వో) పి.రామచంద్రరావు, ఈఈ రామకోటయ్య, డీఈ బాబురావు, జల వనరుల శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి చర్యలు
శాప్ చైర్మన్ రవినాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అభివృద్ధికి శాప్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిద్దిడానికి ఖేలో ఇండియా నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్), విజయవాడ నగర పాలక సంస్థ సంయుక్తంగా పనులు చేపట్టనున్నారు. ఈ స్టేడియంలో వివిధ క్రీడాంశాలకు సంబంధించిన కోర్టులను నిర్మాణం చేయడానికి గాను రూ.60 కోట్ల విలువైన పనులను చేయాలని శాప్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించారు. ఈ అభివృద్ధి పనులకు ఖేలో ఇండియా నుంచి రూ.20 కోట్లు మంజూరయ్యాయి. ఈనెల 8వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొని భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. మూడు దశలు... రూ.60 కోట్లతో పనులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని రూ.60 కోట్లతో అభి వృద్ధి చేయనున్నారు. ఇందులో ఇప్పటికే రూ.20 కోట్లను ఖేలో ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మిగిలిన రూ.40 కోట్లను శాప్, విజయవాడ నగరపాలక సంస్థ ఖర్చు చేయనున్నాయి. మొదటి దశలో స్టేడియం లోపలి భాగంలో ఫుట్బాల్ గ్రీన్ ఫీల్డ్ కోర్టు, 4–టెన్నిస్ కోర్టులు, 2–వాలీబాల్ కోర్టులు, 2–బాస్కెట్ బాల్ కోర్టులు, హ్యాండ్బాల్ కోర్టులు, 400, 200 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్స్ నిర్మాణం చేస్తారు. రెండో దశలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, మూడో దశలో పరిపాలన భవనాలు, జిమ్తో పాటుగా ఫిజియోథెరఫీ సెంటర్ నిర్మాణం చేయనున్నారు. మొదటి దశ పనులకు సంబంధించి బుధవారం భూమి పూజ జరుగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం స్థలం కార్పొరేషన్ ఆధీనంలో ఉండటంతో కార్పొరేషన్తో శాప్ ఒప్పందం చేసుకుని కార్పొరేషన్, శాప్ సంయుక్తంగా ఈ పనులను చేపట్టనున్నాయి. -
గంజాయి, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు
పెనమలూరు: పలు ప్రాంతాల నుంచి గంజాయి, మాదక ద్రవ్యాలు తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పెనమలూరు పోలీస్స్టేషన్లో సోమవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పోరంకి ప్రభునగర్కు చెందిన షేక్ జాన్బాషా(జాన్బెర్రీ,24), రామవరప్పాడుకు చెందిన అబ్దుల్ అక్బర్(29) గంజాయి, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో సోమవారం పోరంకి శ్మశానవాటిక వద్ద అరెస్టు చేసి వారి వద్ద 4 కేజీల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నామన్నారు. షేక్ జాన్బాషా 14 వ ఏటే గంజాయికి అలవాటు పడ్డాడని, అతనిపై కృష్ణలంక, పెనమలూరు, రాజమండ్రి, విశాఖపట్నం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కృష్ణలంక పోలీస్స్టేషన్లో రౌడీషీటు కూడా ఉందన్నారు. అబ్దుల్ అక్బర్ 16వ ఏట నుంచే గంజాయి తాగుతూ బైక్ల దొంగతనాలు, గంజాయి అమ్మకాలు చేస్తున్నాడని, అతనిపై పెనమలూరు, అజిత్సింగ్నగర్, మాచవరం, నర్సీపట్నం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. మైనర్ పిల్లలకు గంజాయి ఎర పెనమలూరు పోలీస్స్టేషన్లో రౌడీషీటర్లు సాయిన అనంతకుమార్, కొక్కిలిగడ్డ మహేష్తో కలిసి విజయవాడలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి పొట్లాలు సరఫరా చేస్తూ విక్రయిస్తున్నారన్నారు. మైనర్ పిల్లలను టార్గెట్గా చేసుకుని వారికి గంజాయి అలవాటు చేశారన్నారు. విశాఖపట్నం, ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి నగర పరిధిలో వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. బెంగళూరులో అబ్దుల్ అక్బర్, నైజీరియన్ దేశస్తుల నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి విజయవాడ ప్రాంతంలో విద్యార్థులకు, ఆటో డ్రైవర్లకు అమ్ముతున్నారని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని వివరించారు. సమావేశంలో సీఐ వెంకటరమణ, ఎస్ఐలు సుశాకర్, తాతాచారి, సిబ్బంది పాల్గొన్నారు. -
స్మార్ట్ కిచెన్ల పేరుతో మమ్మల్ని రోడ్డున పడేయొద్దు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్మార్ట్ కిచెన్ల పేరుతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుకు అప్పగించాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్మార్ట్ కిచెన్ల పేరుతో కార్మికులను రోడ్లపై పడేయొద్దంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పథకాన్ని ప్రైవేటుకు అప్పగించొద్దంటూ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమం జరిగింది. అనంతరం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సుశీల, ఎన్సీహెచ్ సుప్రజ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక నిర్వహణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యత లేకుండా ప్రైవేటుకు అప్పగిస్తే నాణ్యత లోపిస్తుందన్నారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థలైన అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తున్న చోట పిల్లలు చల్లారి పోయిన, చప్పటి భోజనం తినలేక పడేస్తున్నారన్నారు. ప్రధాన డిమాండ్లు ఇవి.. రాష్ట్ర వ్యాప్తంగా కిచెన్ షెడ్లు లేని పాఠశాలలో కిచెన్ షెడ్లు నిర్మించాలని, పథకం అమలుకు మౌలిక సౌకర్యాలు (మంచినీరు, గౌజులు, మాస్కులు, యాప్రాస్) కల్పించాలని, పథకం నిర్వహిస్తున్న కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ. 10వేల వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్కో విద్యార్థికి రూ.20 మెస్ చార్జీలు ఇవ్వాలన్నారు. కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎ. వెంకటేశ్వరరావు, యూనియన్ నాయకులు డి.పద్మ, దుర్గాభవానీ, కె. రాజేశ్వరి, కుమారి, సావిత్రి, మహేశ్వరి, దుర్గ, ఉమాదేవి పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథక కార్మికుల యూనియన్ డిమాండ్ -
దుర్గగుడిలో నియమ నిబంధనలకు నీళ్లు..!
● ఆలయ మొదటి ప్రాకారంలో మీడియాతో ప్రసంగం ● చైర్మన్ సమక్షంలో అమరావతి రైతుల పేరిట అత్యుత్సాహం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో పాటించాల్సిన శాస్త్రాలను, నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి పెడుతున్నారు. అమరావతి రైతుల పేరిట కొంత మంది ఆలయ ప్రాంగణంలోని వేద ఆశీర్వచన మండపంలో(మొదటి ప్రాకారం) మీడియాతో ప్రసంగించిన ఘటన దుర్గగుడిలో సోమవారం చోటు చేసుకుంది. రైతు కుటుంబాల పేరిట దర్శనానికి వచ్చిన వారు ఆలయ ప్రాంగణంలో అత్యుత్సాహం ప్రదర్శించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఆశీర్వచన మండపంలో వారు ప్రసంగిస్తున్నా అడ్డుకోవాల్సిన వారు మిన్నకుండిపోయారు. అంతే కాకుండా వారి ప్రసంగాన్ని దేవస్థాన అధికారులే మీడియాకు ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తూ దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ సమక్షంలోనే ఈ తంతు జరగడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని పార్లమెంట్లో ఆమోదించిన నేపథ్యంలో సోమవారం కొంతమంది రాజధాని ప్రాంతానికి చెందిన వారు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలకడమే కాకుండా వేద ఆశీర్వచనం అందించారు. అయితే ఈ సమయంలో దర్శనానికి వచ్చిన వారు వేద ఆశీర్వచన మండపంలో మీడియాతో మాట్లాడటం వివాదానికి కారణమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు సైతం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తరుణంలో ఆలయం వెలుపల మీడియా పాయింట్ లేదా గాలిగోపురం, రాజగోపురం వద్ద మీడియాతో మాట్లాడతారు. ఇందుకు విరుద్ధంగా అమరావతి రైతుల పేరిట వచ్చిన వారు ఆశీర్వచన మండపంలో ప్రసంగాలు చేయడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ వ్యవహారాలలో వరుస వివాదాలకు కారణమవుతున్న దుర్గగుడి పాలక మండలి సభ్యులు, చైర్మన్లకు దేవస్థానంలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదనే కనీస అవగహన కల్పించాల్సిన అవసరం కలుగుతోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో ప్రజల నుంచి 75 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 30 ఫిర్యాదులు అందాయి. ఇతర ఫిర్యాదుల్లో కుటుంబ తగాదాలపై 7, వివిధ మోసాలపై 6, మహిళా సంబంధిత నేరాలపై 10, దొంగతనాలపై 5, కొట్లాటలపై 2, ఇతర వివిధ సమస్యలపై 17 ఫిర్యాదులు అందాయి. -
లారీని ఢీకొన్న టిప్పరు : డ్రైవర్కు తీవ్ర గాయాలు
కంకిపాడు: జాతీయ రహదారిపై రెండు లారీ లు ఢీకొన్న సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం...విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వెళ్తున్న సిమెంటు లోడు లారీ కంకిపాడు బైపాస్ మార్గంలోకి రాగానే లారీ టైరు పంక్చర్ అయ్యింది. దీంతో లారీ డ్రైవరు లారీని నిలిపివేశాడు. ఇదే మార్గంలో కంకరు లోడుతో వెళ్తున్న టిప్పరు సిమెంటు లోడు లారీని వెనుకగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో టిప్పరు ఇంజిను భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవరు కేబిన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో సుమారు అరగంట పాటు కష్టపడి కేబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవరును అతికష్టం మీద బయటకు లాగారు. గాయాలపాలైన డ్రైవరు ఘంటసాల మండలం అచ్చంపాలెంకు చెందిన తుమ్మపూడి నవీన్ (32)ను 108 అంబులెన్సులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. స్థానిక పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. -
గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలి
జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశగాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నందు ప్రజల నుంచి వచ్చే అర్జీలకు గడువు తేదీలోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జేసీ ఎస్. ఇలక్కియ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అర్జీపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పెండింగ్ అర్జీలపై అధికారులు క్రమం తప్పకుండా ఫాలో అప్ చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా పీజీఆర్ఎస్కు 97 అర్జీలు.. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు మొత్తం 97 అర్జీలు అందాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 17, పోలీసు శాఖకు 14, రెవెన్యూ శాఖకు 11, వైద్య ఆరోగ్యానికి 8 అర్జీలు వచ్చాయన్నారు. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులు, విద్య, పంచాయతీరాజ్ శాఖలకు 5 చొప్పున అర్జీలు వచ్చినట్లు వివరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, ఇరిగేషన్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్అండ్బీ, భవనాలు, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక విద్యకు రెండు చొప్పున అర్జీలు రాగా విద్యుత్, జెడ్పీ సీఈవో, పౌర సరఫరాలు, ఎండోమెంట్, మత్స్య, అడవులు, కార్మిక, మార్కెటింగ్, కాలుష్య నియంత్రణ, ఆర్ఐవో, గ్రామీణ నీటి సరఫరా, ఎస్సీ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చినట్లు వివరించారు. వచ్చిన అర్జీల్లో కొన్ని.. -
పదో తరగతి ‘స్పాట్’ ప్రారంభం
నల్ల రిబ్బన్లతో స్పాట్కు హాజరైన ఉపాధ్యాయులు వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఏ సుందరయ్య, కార్యదర్శి డాక్టర్ ఇంటి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో తరగతి మూల్యాంకనం విజయవాడ కేబీఎన్ కళాశాల ఆవరణలో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్లరిబ్బన్లతో విధులకు హాజరై ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సుందరయ్య, ఇంటి రాజులు మాట్లాడుతూ తక్షణం పీఆర్సీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరారు. నిరసనలో పాల్గొన్న ఫ్యాప్టో రాష్ట్ర నాయకుడు ఎం. రఘునాథ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా కనీసం ఉద్యోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవ న్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో రాష్ట్ర కేంద్రంలో నిరాహార దీక్షలు చేస్తున్నట్లు వివరించారు. ఫ్యాప్టో నాయకులు నాయకులు జి.రామరావు, వి. భిక్షమయ్య, సయ్యద్ ఖాసీం, వి.రాధిక, జి. అనుగ్రహప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫ్యాప్టో ఉద్యమ కార్యాచరణ నోటీసుని ఎన్టీఆర్ జిల్లా విద్యాధికారి ఎల్. చంద్రకళకు అందించారు. -
ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తాం!
సాక్షి టాస్క్ ఫోర్స్: తాము చెప్పినట్లు పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, పార్లమెంటు ముఖ్య నేతను కాదని ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తామంటూ గంపలగూడెం తహసీల్దారు రాజకుమారిని టీడీపీ నాయకులు సోమవారం తీవ్రంగా బెదిరించారు. కార్యాలయం లోపలకు వెళ్లనివ్వకుండా బయటే అడ్డుకుని వీరంగం సృష్టించారు. తమ మాట విననప్పుడు ఇక్కడ పని చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. లోపలున్న సిబ్బంది బయటకు రాకుండా తలుపులు వేసి మరీ దౌర్జన్య కాండ కొనసాగించారు. ఉద్యోగ వర్గాలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటల సమయంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, గంపలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ, తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత భర్త వీరారెడ్డి ఆధ్వర్యంలో పది మందికి పైగా కార్యకర్తలు వచ్చారు. గట్టిగా కేకలు వేస్తూ.. తహసీల్దారు రాజకుమారి వచ్చారా అంటూ హంగామా సృష్టించారు. ఆమె ఇంకా విధులకు రాలేదని సిబ్బంది చెప్పడంతో కార్యాలయంలోంచి వారెవరూ బయటకు రాకుండా తలుపులు వేసి బంధించారు.ఇంతలో కార్యాలయం వద్దకు చేరుకున్న తహసీల్దారు రాజకుమారి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ తాము చెప్పిన పనులు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. లోపలకు వెళ్లి కూర్చుని మాట్లాడుదామని తహసీల్దారు కోరినా వినిపించుకోకుండా రెచి్చపోయారు. గంపలగూడెంలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు. మీరు మాకు అక్కర్లేదు.. ‘మాకు అనుకూలంగా పనిచేయని అధికారి మాకొద్దు. చెప్పినట్లు వినండి.. లేదంటే వెళ్లిపోండి.. భూముల రీసర్వేలో మేము చెప్పినట్లు నడుచుకోనప్పుడు ఇక్కడ మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. మీరు లోపలకు వెళ్లడానికి వీలు లేదు. మేం ఏం పని చెప్పినా మీరు చేయడం లేదు. మేము చెప్పినట్లు సర్వే చేయడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? మిమ్మల్ని కార్యాలయంలోకి వెళ్ళనీయబోం’ అంటూ టీడీపీ నేతలు తహసీల్దార్పై విరుచుకుపడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి కూర్చొని, మీ సమస్య గురించి వివరంగా మాట్లాడుకుందామని తహసీల్దారు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఇష్టానుసారం మాట్లాడారు. సుమారు గంట సేపు అంటే 11.30 గంటల వరకు ఆమెను కార్యాలయం బయటే నిలబెట్టి.. బెదిరించారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. మొన్ననే వెలుగు అధికారిని కొట్టాను.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూములకు సంబంధించి తాము చెప్పినట్లు వినాలని, రీసర్వేలో తమకు అనుకూలంగా పని చేయాలని అనేకసార్లు టీడీపీ నేతలు తహసీల్దార్పై ఒత్తిడి తెచ్చారు. చేయగలిగే పనులు చేస్తూనే.. నిబంధనలకు పూర్తి విరుద్దంగా, మరొకరికి అన్యాయం జరిగేలా ఉన్న వాటిని చేయలేమని తహసీల్దార్ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం విజయవాడలో పార్లమెంటు ముఖ్య నేతను కలిసినట్లు సమాచారం. ఆయన ప్రోద్బలంతోనే సోమవారం వారు నేరుగా తహశీల్దారు కార్యాలయం వద్దకే వెళ్లి ఆమెను బెదిరించారు. ఈ క్రమంలో గంపలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ.. ‘కొద్ది రోజుల క్రితమే వెలుగు అధికారిని కొట్టాను.. నిన్ను కొట్టడం పెద్ద పని కాదు’ అని తహశీల్దారుపై రెచ్చిపోయారు. కార్యాలయంలో బందీలుగా ఉన్న సిబ్బంది, సందర్శకుల ద్వారా విషయం తెలుసుకుని జనం గుమికూడటంతో టీడీపీ నేతలు ఆమెను హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి ప్రధానంగా గంపలగూడెం మండలం సొబ్బాలలో ఇద్దరు రైతుల నడుమ భూ సమస్య నెలకొంది. ఒకరికి అనుకూలంగా సర్వే చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా యథాతథ స్థితి కొనసాగేలా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సర్వే ఆగిపోయింది. ఇదే విషయాన్ని తహసీల్దార్ చెప్పినా, టీడీపీ నేతలు పట్టించుకోక పోవడం గమనార్హం. బయటకు మాట్లాడకండి.. ఈ ఘటనపై తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కలెక్టర్కు తెలియజేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని తెలిసి విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో జేసీ.. బాధిత తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారని తెలిసింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో ఈ ఘటన గురించి బయటకు మాట్లాడొద్దని తహసీల్దార్కు జేసీ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.అందువల్లే ఆమె ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత తహశీల్దార్ను సంప్రదించగా సర్వేకు సంబంధించి టీడీపీ నేతలు వివరాలు అడిగారని చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన భాస్కరరావుపై కూడా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. మరో తహసీల్దారు ఆశియ్యను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టి ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. ఇప్పుడు తహసీల్దారు రాజకుమారి పట్ల కూడా అలానే వ్యవహరించారు. ఇలాగైతే ఏ అధికారి అయినా ఎలా పని చేస్తారని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆరుగురు మిత్రులు.. చోరీల్లో దిట్టలు
గూడూరు: వారు ఆరుగురు స్నేహితులు. 19 నుంచి 22 ఏళ్లలోపు వారే.. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఫెయిలై చదువుకు దూరమయ్యారు. చెడు వ్యవసనాలకు అలవాటు పడి, అందుకు అవసరమైన డబ్బు కోసం చోరీల బాట పట్టారు. చివరికి పోలీసులకు చిక్కారు. గూడూరు పోలీస్ స్టేషన్లో ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జి డీఎస్పీ కె.ధర్మేంద్ర ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆయన కథనం మేరకు.. గూడూరు మండలం మల్లవోలుకు చెందిన షేక్ అస్కర్, జాన్ వెస్లీ, పోలవరం గ్రామానికి చెందిన మువ్వల లీలాధర్, పెండ్ర దుర్గారావు, బులసర కోట నాగవెంకట సాయి, గుమ్మడి రాహుల్ దాదాపు ఒకే వయస్సు యువకులు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ ఫెయిలై ఇంటిపట్టునే ఉంటూ జల్సాలు, ఆకతాయి తిరుగుళ్లకు అలవాటు పడ్డారు. తమ అవసరాలకు కష్టపడకుండా డబ్బులు సమకూర్చడం కోసం చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. మల్లవోలు, పోలవరం, పెడన, విజయవాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పగలు ద్విచక్రవాహనాలపై గల్లీల్లో తిరగటం, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించడం, తర్వాత రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలోకి చొరబడి దొరికినంతా దోచుకెళ్లడం చేసేవారు. ఏడాదిన్నర కాలంలో ఎనిమిది చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. తీగలాగితే డొంక కదిలింది.. మల్లవోలు, పోలవరం గ్రామాల్లో ఇటీవలి కాలంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటిని సీరియస్గా తీసుకున్న గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్ ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. దొంగతనాలు జరిగిన ఇళ్లలో వేలిముద్రలు సేక రించి, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి, గతంలో చోరీలకు పాల్పడిన వారిని విచారిస్తూ కేసు దర్యాప్తు సాగించారు. ఈ నేపథ్యంలో ఆరుగురు స్నేహితుల్లో ఇద్దరు ఓ ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. ఆ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా ఆరుగురు చేసిన చోరీలు వెలుగు చూశాయి. సాంకేతికంగా కూడా ఆధారాలు సేకరించి ముఠాలో ఆరుగురు స్నేహితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద 99.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 437 గ్రాముల వెండి వస్తువులతో పాటుగా మూడు మోటారు సైకిళ్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచ క్యంగా వ్యవహరించిన పెడన సీఐ నాగేంద్ర ప్రసాద్, గూడూరు ఎస్ఐ చల్లపల్లి దివ్య ప్రకాష్, పెడన ఎస్ఐ షేక్ బషీర్, సీసీఎస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డులు ప్రకటించినట్లు డీఎస్పీ తెలిపారు. -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
మచిలీపట్నంఅర్బన్/వన్టౌన్(విజయవాడ పశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ కేబీఎన్ కాలేజీ, కృష్ణా జిల్లా యాంప్తిల్ ప్రభుత్వ బాలకల పాఠశాలలో స్పాట్ వాల్యుయేషన్కు ఏర్పాట్లుచేశారు. ఎన్టీఆర్ జిల్లాకు 1.73 లక్షలు, కృష్ణాకు 1.84 లక్షల సమాధాన పత్రాలు వచ్చాయి. మూల్యాంకన సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులను కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు మూల్యాంకనం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో.. మూల్యాంకన ప్రక్రియ కోసం ఎన్టీఆర్ జిల్లాకు మొత్తం 699 మంది సిబ్బందిని నియమించారు. అసిస్టెంట్ ఎగ్జామినర్స్ 409, చీఫ్ ఎగ్జామినార్స్ 75, స్పెషల్ అసిస్టెంట్స్ 215 మంది ఉన్నారు. కృష్ణా జిల్లాకు 741 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 433 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 78 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 230 మంది స్పెషల్ అసిస్టెంట్లు ఉన్నారు. ఉదయం 9 గంటలకు హాజరు తప్పనిసరి మూల్యాంకన కేంద్రంలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్ వద్ద అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు, ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. కేంద్రంలో సౌకర్యాల కల్పన మూల్యాంకన కేంద్రంలో సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం, లైట్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు బందోబస్తు కల్పించారు. ప్రథమ చికిత్స కోసం ఏఎన్ఎంలు, సిబ్బంది, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారు. ట్యాబ్ ద్వారా మార్కుల నమోదు ఈసారి సమాధాన పత్రాల మూల్యాంకనంతో పాటు మార్కులను ట్యాబ్లలో నమోదు చేసే విధానం అమలు చేస్తున్నారు. మాన్యువల్ ప్రక్రియ అనంతరం స్పెషల్ అసిస్టెంట్లు వెంటనే మార్కులను ఆన్లైన్లో నమోదు చేసి అప్లోడ్ చేయనున్నారు. స్పెషల్ అసిస్టెంట్లకు సూచనలు స్పెషల్ అసిస్టెంట్లు లీప్ యాప్లో లాగిన్ అయి కంట్రోల్ బండిల్, ఆన్సర్ స్క్రిప్ట్లను స్కాన్ చేసి మార్కులు నమోదు చేయాలి. నమోదు చేసిన మార్కులను పూర్తిగా తనిఖీ చేసి, ప్రివ్యూ అనంతరం కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదు. ఉపాధ్యాయులు, పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘పది’ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సోమవారం నుంచి నల్లబ్యాడ్జీలతో స్పాట్ వాల్యుయేషన్ విధులకు హాజరవుతూ నిరసన వ్యక్తం చేయనున్నారు. ఏప్రిల్ 9న మూల్యాంకన కేంద్రంవద్ద ఆందోళన, 25, 26, 27 తేదీల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఫ్యాప్టో కృష్ణా జిల్లా చైర్మన్ అంబటిపూడి సుబ్రహ్మణ్యం తెలిపారు. పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నగరంలోని కేబీఎన్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఆరు నుంచి 15వ తేదీ వరకూ స్పాట్ వాల్యూయేషన్ను నిర్వహిస్తున్నాం. స్పాట్ జరిగే ప్రాంగణంలో అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం. అప్పటికే ఉపాధ్యాయులందరికీ సమాచారం అందించాం. అలాగే ఉపాధ్యాయులందరూ ఈ వాల్యూయేషన్లో పాల్గొనున్నారు. –చంద్రకళ, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా జిల్లాలో స్పాట్ వాల్యుయేషన్ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మూల్యాంకన ప్రక్రియ సాగుతుంది. సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్యాబ్ల ద్వారా మార్కుల నమోదు వంటి ఆధునిక విధానాలను అమలు చేస్తున్నాం. మార్కుల నమోదుకు స్పెషల్ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇచ్చాం. ఉపాధ్యాయులు పరీక్షల నిష్పత్తి, నాణ్యతను కాపాడే విధంగా మూల్యాంకనం విధులు నిర్వర్తించి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి. –యూవీ సుబ్బారావు, కృష్ణా విద్యాశాఖాధికారి -
పారిశ్రామికవేత్తలకు డైనమిక్ వేదిక ‘ఫౌండర్స్ రూఫ్’
భవానీపురం(విజయవాడపశ్చిమ): పారిశ్రామికవేత్తలు, పెట్టుబడీదారులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఇటీవల ఏర్పాటైన ‘ఫౌండర్స్ రూఫ్’ కార్యకలాపాలు విజయవంతంగా ముందుకు సాగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. ఫౌండర్స్ రూఫ్ సంస్థను నెలకొల్పిన విష్ణు, జగ దీష్లు ఆదివారం భవానీపురంలోని హరిత బెరంపార్క్లో ఏర్పాటు చేసిన మీటప్ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారి ఆలోచనలు, భవిష్యత్ కార్యాచరణను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం నిర్వహించే ఫౌండర్స్ రూప్ మీటప్స్ ద్వారా ప్రత్యక్షంగా పరిచయాలు పెంచుకోవడం, పటిష్టమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం, స్టార్టప్ ఆలోచనలను ప్రదర్శించడం వంటి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విజయవాడ రూరల్ గుంటుపల్లిలోని రైజ్ కేంద్రం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. -
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్రామ్
కోనేరుసెంటర్(మచిలీపట్నం): బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబూజగ్జీవన్రామ్ అని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు పేర్కొన్నారు. భారత ఉపప్రధాని బాబూజగ్జీవన్రామ్ జయంతిని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్న జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిమ్నజాతుల అభ్యున్నతికి జగ్గీజవన్రామ్ కృషి మరువలేనిదన్నారు. విద్యార్థి దశ నుంచే అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను పటాపంచలు చేసిన మహోన్న తుడని పేర్కొన్నారు. క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమాల్లో సైతం మహాత్మగాంధీతో కలిసి అడుగులు వేసి ముందుకు సాగారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వస్తున్నారు.. మీరు దండేసేందుకు వీల్లేదు
పామర్రు: ‘ఎమ్మెల్యే వస్తున్నారు. మీరు దండ వేసేందుకు వీల్లేదు. ఇక్కడే ఉండండి’ అంటూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ను కృష్ణా జిల్లా పమిడిముక్కల పోలీసులు అడ్డుకున్నారు. గంట సేపటికి పైగా రోడ్డు పైనే నిలువు కాళ్లపై వేచి ఉండేలా నిర్బంధించారు. ప్రజాస్వామ్య దేశంలో దళిత నేత బీజేఆర్ విగ్రహానికి నివాళులర్పించాలన్నా పోలీసుల అనుమతి కావాలా? చంద్రబాబు ప్రభుత్వ రాక్షస పాలనకు ఇది నిదర్శనమని స్థానికులు వాపోయారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని పామర్రులో మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ ఆదివారం పర్యటనలు చేస్తూ బీజేఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో అనిల్కుమార్ పమిడిముక్కల గ్రామం చేరుకున్నారు. అక్కడ జగ్జీవన్రామ్ విగ్రహానికి పూలదండ వేయకుండా పమిడిముక్కల సీఐ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ‘ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పమిడిముక్కల వస్తున్నారు. ఆయన వెళ్లే వరకు మీరు గ్రామంలోకి రావడానికి వీల్లేదు’ అని హెచ్చరించారు. మాట వినకపోతే కేసులు బనాయిస్తాం తమ మాట వినకపోతే కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. అంతేకాదు కై లే కార్లను ముందుకు వెళ్లకుండా పోలీసులు నిర్బంధించారు. సుమారు గంటకు పైగా రోడ్డుపైన మాజీ ఎమ్మెల్యే అనిల్కుమార్, వైఎస్సార్ సీపీ నాయకులు వేచి ఉన్నారు. ఈ విషయమై కై లే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యే వస్తుంటే సామాన్యులు పనులు చేసుకునే అవకాశం లేదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు కావాలని రెచ్చగొట్టే ధోరణిలో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తాము దండ వేసి వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, ఆయన వర్గీయులు బీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేళ్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కార్లను వారి కార్లపై వేగంగా పోనించారు. టీడీపీ కార్యకర్తలు ఇలా ప్రవర్తించినా అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోకుండా చోద్యం చూశారు. పోలీసుల తీరుపై గ్రామస్తులు విస్మయం వ్యక్తంచేశారు. -
ఘనంగా బాబూ జగ్జీవన్రామ్ జయంతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. జింఖానా మైదానం సమీపంలోని బాబూజగ్జీవన్రామ్ విగ్రహం వద్ద ఆయన జయంతిని పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నేతలతో కలిసి జగ్జీవన్రామ్ విగ్రహానికి దేవినేని అవినష్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ దళితుల అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. దళితులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకున్న వ్యక్తి అని కొనియాడారు. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దళితుల సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగ్జీవన్రామ్ వంటి మహనీయులు చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్య క్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శరత్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శ్యామ్, కాలే పుల్లారావు, త్రివేణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దుర్గగుడి ప్రాంగణంలో రూ. 14 లక్షలతో చలువ పందిళ్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో వేసవి చలువ పందిళ్ల పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయ ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో సుమారు రూ. 14 లక్షల అంచనాతో చలువ పందిళ్ల ఏర్పాటుకు ఆలయ అధికారులు కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. అమ్మవారి ఆలయం ఎదుట, రాజగోపురం ఎదుట కళావేదిక, ఘాట్రోడ్డు, కనకదుర్గనగర్, నటరాజ స్వామి వారి ఆలయం, లక్ష్మీగణపతి విగ్రహం వద్ద ఇలా పలు ప్రాంతాల్లో చలువ పందిళ్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో త్వరితగతిన చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి గుంటూరు జిల్లా తాడేపల్లి వాస్తవ్యులు సుసర్ల వెంకట శశికృష్ణరాఘవ, జయ నందిని దంపతులు రూ. 1,00,111 ఆదివారం విరాళంగా సమర్పించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు తొలుత స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు విరాళాన్ని అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఈనెల 6 తేదీ సోమవారం యథావిధిగా జరగనున్నట్లు ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కార్య క్రమంలో ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం కోసం అర్జీలు అందజేయవచ్చని వివరించారు. ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
వేతన వేదన!
ఉపాధి హామీ కూలీలు వేతన వేదన అనుభవిస్తున్నారు. పనులు చేసినా మూడు నెలలుగా వేతనాలు అందక పస్తులు ఉండాల్సి వస్తోంది. ఉపాధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే పనులకు మళ్లించడంతో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురవు తోంది. పనులు చేసిన పదిహేను రోజుల్లో చెల్లించాలని నిబంధనలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కానరావడం లేదు. దీంతో కూలీలు ఇతర పనులకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మూడు నెలలకు రూ.8.15 కోట్ల వేతనాలు పెండింగ్ మూడు నెలలుగా ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికీ ఈ నెలలో వేతనాలు అందుతాయి. గత మూడు నెలల పెండింగ్ వేతనాలతో పాటు ఈ ఏప్రిల్ నెల జీతాలు కూడా అందేలా 2026–27 బడ్జెట్లో ప్రొవిజన్ ఇచ్చాం. పని చేసిన ప్రతి ఒక్కరికీ వేతనాలు వస్తాయి. ఎటువంటి సందేహాలు లేకుండా పనులకు హాజరు కావాలి. –అరవపల్లి రాము, డ్వామా పీడీ, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు: ఉపాధి హామీ కార్మికులు మూడు నెలలుగా వేతనాల వెతలు పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ తీరుతో వారికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పేదలకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పని చేసినా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. దీంతో కూలీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కూలీలు పస్తులను ఉండలేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఉపాధి పనులు టార్గెట్ పూర్తయ్యే అవకాశం లేక కూలీల సంఖ్యను పెంచాలంటూ ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచుతున్నారు. చేసిన పనికి వేతనాలు ఇవ్వకపోగా అదనంగా ఉపాధి పనులకు కూలీలను తీసుకురావాలనే ఒత్తిళ్లపై కింద స్థాయి సిబ్బంది రగిలిపోతున్నారని తెలుస్తోంది. రూ.8.15 కోట్ల వేతనాలు పెండింగ్ ఎన్టీఆర్ జిల్లాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2,80,956 పని దినాలకు రూ.8.15 కోట్ల వేతనాలను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. పథకం నిబంధనల ప్రకారం పదిహేను రోజులకోకసారి కూలీలకు వేతనాలను అందించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను ఇతర పనులకు చంద్రబాబు సర్కార్ బదిలీ చేయడంతో కూలీలకు చెల్లింపు ఆలస్యమవుతోందని విమర్శలు వస్తున్నాయి. వేతనాలు లేట్కావడంతో పని చేసినా పస్తులు ఉండాల్సి వస్తోందని ఉపాధి కార్మికులు భావిస్తున్నారు. అధిక వేతనం కూడా ఆశ చూపడంతో వ్యవసాయ పనుల వైపు కూలీలు మొగ్గు చూపుతున్నారు. దీంతో కూలీలు సక్రమంగా రాక ఉపాధి పనులు పెండింగ్ పడుతున్నాయి. మూడు నెలలుగా ఉపాధి పనులు చేస్తున్నా వేతనాలు ఇవ్వడం లేదు. వ్యవసాయ పనులకు వెళ్తే ఇంతకన్నా ఎక్కువే కూలీ వస్తుంది. వెంటనే డబ్బులు ఇస్తారు. ఈ పని ఎప్పుడూ ఉంటుందని వస్తే డబ్బులు అలస్యమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే వేతనాలను అందించాలి. –యర్రంశెట్టి అప్పారావు, చెవుటూరు ఉపాధి పనులకు వెళ్లినా ప్రయోజనం లేదు. పదిహేను రోజులకొకసారి ఇవ్వాల్సిన కూలి డబ్బులు.. మూడు నెలలు గడిచినా ఇవ్వకపోవడం దారుణం. కూలి చేసుకుంటేనే పూట గడిచే ఎన్నో కుటుంబాలు నరకయాతన పడుతున్నాయి. –యడ్లపల్లి తిరుపతమ్మ, చెవుటూరు -
క్రీస్తు సందేశం మానవాళికి శాంతి
లబ్బీపేట(విజయవాడతూర్పు): క్రీస్తు ప్రభు అనుసరించిన క్షమాగుణం, త్యాగం, కరుణ, శాంతి మానవాళికి శాంతి సందేశం కావాలని విజయవాడ కతోలిక పీఠం పీఠాధిపతులు (బిషప్) మోస్ట్ రెవ. తెలగతోటి జోసఫ్ రాజారావు పిలుపునిచ్చారు. ఈస్టర్ (పాస్క) పర్వదినం పురస్కరించుకొని బెంజిసర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్స్ చర్చిలో సజీవుడైన ఏసుక్రీస్తు పునరుత్థాన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు పాస్క సందేశమిస్తూ క్రీస్తు పునరుత్థానంతో మానవాళి చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైందన్నారు. మరణించిన మహోన్నతుడైన ఏసు మూడవరోజు సజీవుడై లేచిన రోజే ఈస్టర్ పర్వదినమన్నారు. పాస్క (ఈస్టర్) అంటే మరణం జయించడమేనని ఆయన వివరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పవిత్ర పూజాపీఠంపై బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఫాదర్ నక్కా డేవిడ్ రాజు, ఫాదర్ యం. ఉపేంద్ర, ఫాదర్ పి. అంబేద్కర్ ‘ఈస్టర్ సమిష్టి దివ్యపూజాబలి’ సమర్పించారు. అంతకుముందు బిషప్ రాజారావు (పాస్క) కొవ్వొత్తిని వెలిగించి ఈస్టర్ వేడుకలను ప్రారంభించారు. పవిత్ర జలాన్ని ఆశీర్వదించారు. పూజానంతరం బిషప్ జోసఫ్ రాజారావు విజయవాడ కతోలిక పీఠం పరిధిలోని ప్రజలందరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 20267నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక(పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సమస్యలపై అర్జీలు సమర్పించాలని ప్రజలను కోరారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5844 టీఎంసీలు.దుర్గమ్మకు పలువురు విరాళాలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఉచిత ప్రసాద వితరణకు, నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. –8లో -
డోకుపర్తి ఉపేంద్ర హైస్కూల్ ప్రారంభోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమాజం ద్వారా పొందిన జ్ఞానాన్ని, సహాయాన్ని తిరిగి అదే సమాజానికి అందించాలన్న మహనీయుల మాటలను స్ఫూర్తిగా తీసుకుని పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న ఎస్కేపీవీవీ గ్రూప్ యాజమాన్యం అభినందనీ యులని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. ఎస్కేపీవీవీ హిందూ హై స్కూల్స్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ జక్కంపూడి వైఎస్సార్ కాలనీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను ఆయన ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ.. ఆరున్నర ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ హై స్కూల్ విద్యలవాడగా పేరొందిన విజయవాడకే తలమానికంగా నిలుస్తుందన్నారు. ఈ హై స్కూల్ నిర్మాణానికి భూరీ విరాళం ఇచ్చిన డోకుపర్తి ఉపేంద్రను అభినందించారు. హిందూ హై స్కూల్స్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి. శేషయ్య, గోపిశెట్టి మల్లయ్య మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతివర్గాల విద్యార్థులకు తక్కువ ఫీజులతో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మీరా, హిందూ హై స్కూల్స్ కమిటీ ట్రెజరర్ గోళ్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి.నారా యణరావు, స్కూల్ ఇన్చార్జ్ సెక్రటరీ డాక్టర్ టి.శ్రీనివాసు, స్కూల్ ప్రిన్సిపాల్ పి.శ్యామల, కమిటీ సభ్యుడు వేముల హజరతయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డోకుపర్తి ఉపేంద్ర దంపతులను సత్కరించారు. -
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మహనీయుల ఆశయాలు సమాజానికి మార్గదర్శకం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాబూ జగ్జీవన్రామ్ వంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూజగ్జీవన్ రామ్ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ.. వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు, డీవీఎంసీ సభ్యులు తదితరులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను చదివి అర్థం చేసుకోవాలన్నారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత కెరీర్ను సొంతం చేసుకోవాలన్నారు. మరో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిని సొంతం చేసుకునేందుకు పారిశ్రామిక యూనిట్లు స్థాపించి, విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కేఎల్ హర్షిత, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్, లిడ్ క్యాప్ డైరెక్టర్ పి.ఏసురత్నం, డీఐసీసీఐ ఏపీ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వి.రాజమణి, సంఘాల నేతలు కండెల వరప్రసాద్, డా. దేవరాజ్, కేవీ నరసింహారావు, దువ్వూరి సుబ్బారావు, బాబురావు, పి.రమేష్, ఏఎస్డబ్ల్యూవో వీఎస్ఎస్ గణేష్ బాబు, సూపరింటెండెంట్ ఎన్.బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలోని సర్కారుతోటలో చోరీ జరిగింది. పోలీ సులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చిలకలపూడి పోలీసుల కథనం మేరకు.. సర్కారుతోటకు చెందిన మోతుకూరి లలిత మచిలీపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆప రేటర్గా పనిచేస్తున్నారు. లలిత తన తల్లితో కలిసి శనివారం ఇంటికి తాళం వేసి విజయవాడ వెళ్లారు. ఆదివారం ఉదయం పక్కింటి వారు లలితకు ఫోన్ చేసి వారి ఇంటి తలు పులు తెరచి ఉన్నట్లు చెప్పారు. దీంతో ఆమె హుటాహుటిన మచిలీపట్నంలోని ఇంటికి చేరుకున్నారు. బీరువా తలుపులు తెరచి ఉండటంతో పాటు, రూ.20 వేల నగదు, గాజులు, ఉంగరం, రూపులు కనిపించలేదు. చోరీ జరిగినట్లు గ్రహించిన లలిత చిలకలపూడి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మైలవరం మండలం పుల్లూరులోని చిలుకూరువారిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రెడ్డిగూడెం మండలం రుద్రవరం తండాకు చెందిన దేవావతు రవి (30) ద్విచక్రవాహనంపై మైలవరం బయలుదేరాడు. ఈ క్రమంలో పుల్లూరు సెంటర్ సమీపంలో ఉన్న చిలుకూరువారిగూడెం జెడ్పీ హైస్కూల్ వద్దకు వచ్చే సమయానికి మైలవరం నుంచి తిరువూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఢీకొని రవి రహదారిపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రవిని స్థాని కులు 108 వాహనంలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతి చెందాడు. సంఘనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రవికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కోర్టు ఆర్డర్ ఉంటే చూపించండి
మచిలీపట్నంటౌన్: రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సంస్కారం మరచి తనపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. స్థానిక రామానాయుడుపేటలో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి కృష్ణమూర్తి మరణంపై అబద్ధాలు వల్లెవేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తన తండ్రి అనారోగ్యం పాలైతే హైదరాబాద్, చైన్నె వంటి నగరాల్లోని ఆస్పత్రుల్లో నెలల పాటు వైద్యం చేయించానని గుర్తుచేశారు. తన తండ్రి తుదిశ్వాస విడిచేవరకు తాను, తన మరో తల్లి విక్టోరియమ్మ ఆయన్ను అంటిపెట్టుకుని ఉన్నామన్నారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆయన అనారోగ్య కారణాల రీత్యా తాను డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. ఎన్నికల ప్రచారం కూడా తానే ఎక్కువగా నిర్వహించానన్నారు. కానీ తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని కొల్లు రవీంద్ర దిగజారి మాట్లాడితే తాను వివరణ ఇవ్వడం తన కర్మగా భావిస్తున్నానని పేర్కొన్నారు. పరామర్శించడంలో తప్పేముంది కొబ్బరి తోటలో జనసేన కార్యకర్త శ్రీపతి వెంకటాచలం ఇల్లు కూల్చివేయాలని కోర్టు ఆర్డర్ ఉందని కొల్లు రవీంద్ర అంటున్నారని, ఆర్డర్ను కమిషనర్ ద్వారా చూపించాలని పేర్ని నాని సవాల్ విసిరారు. కోర్టు ఆర్డర్ ఉంటే వారు చెప్పే ఏ శిక్షకై నా తాను సిద్ధమని స్పష్టంచేశారు. ఆర్డర్ లేకుంటే ఏ శిక్షకై నా సిద్ధమేనా అని రవీంద్రను ప్రశ్నించారు. రూ.45 లక్షలు ఖర్చు చేసి నిర్మించిన గృహాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తే బాధితులు ఫోన్ చేయగా తాను అక్కడికి వెళ్లానన్నారు. బాధితులను పరామర్శించడంలో తప్పేముందని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్న 2015–16 కాలంలోనే ఈ స్థలానికి ఖాళీ స్థలం పన్నులు వేశారని, 2024లో భవనాలు నిర్మించా రని, అయితే అవి తన హయాంలో జరిగినట్లుగా అవాస్తవాలు చెప్పడం సరికాదని హితవు పలికారు. బినామీ ఆస్తులు లాక్కోండి తనకు బినామీ ఆస్తులు ఉన్నాయని విమర్శిస్తున్నా రని, బినామీ ఆస్తుల చట్టం ప్రకారం వాటిని లాక్కోవచ్చుగా అని పేర్ని నాని ప్రశ్నించారు. నగరంలోని పోలీస్ కాంప్లెక్స్, పోలీస్ కల్యాణ మండపం, ఇలా పలు కట్టడాలకు అనుమతులు లేవని వాటిని కూల్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. నగరంలో ఏఏ భవనాలకు అనుమతులు లేవో జాబితా ఇస్తానని, దమ్మూ ధైర్యం ఉంటే వాటిని కూల్చాలని సూచించారు. చేపల మార్కెట్ సమీపాన, బందరు కోట ప్రాంతాల్లో మంత్రి రవీంద్ర నిర్మిస్తున్న భవనాలకు అనుమతులు లేవని, వాటిని కూడా కూల్చే స్తారా అని ప్రశ్నించారు. బందరుకోట స్థలానికి అసలు లింకు డాక్యుమెంట్లే లేవని, ఈ స్థలంలో అక్రమ భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారని నిలదీశారు. ప్రధాన రహదారితో పాటు చిలకలపూడిలో రోడ్డు విస్తరణను స్థల యజమానులను ఒప్పించి చేయిస్తే దానిపై కూడా విమర్శలు చేయటం ఎంతవరకు సబబన్నారు. ప్రధాన రహదారిలో కల్పన టెక్స్టైల్ యజమాని గాంధీని రోడ్డు విస్తరణకు స్థలం ఇవ్వా లని తాను పలుమార్లు కలిసి బతిమిలాడానని, అయినా ఆయన ససేమిరా అనడంతో కోర్టు ఆదేశాల ప్రకారం రోడ్డుకు అవసరమైన మేర స్థలం తీసుకున్నామని గుర్తుచేశారు. తాను 2004 నుంచి 2014 వరకు, 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉండి బందరుకు కృష్ణ యూనివర్సిటీ, నర్సింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, పోర్టు మెడికల్ కళాశాల, ఫిషింగ్ హార్బర్ ఇలా ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చానని, పలు కాలనీల్లో రహదారులన్నీ అభివృద్ధి చేశానని వివరించారు. రవీంద్ర హయాంలో ఏ ప్రాజెక్టు తీసుకువచ్చారో ప్రజలకు చెప్పగలరా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టులన్నీ తాను కృషి చేయకుంటే గాలికి వచ్చాయా అని ఎద్దేవాచేశారు. జల్లూరి గోపిని విజయవాడ పిలిపించి బెదిరించి ఆయన స్థలాన్ని లాక్కోలేదా అని ప్రశ్నించారు. విజయవాడలో ఆరు టీవీ చానళ్లు మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో ఆరు టీవీ చానళ్లు నడుపుతున్నారని, నెలకు రూ.85 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఆ మొత్తానికి సంబంధించి బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా అని పేర్ని నాని ప్రశ్నించారు. తన తల్లి విక్టోరియమ్మ ఆస్తుల విక్రయాల సమయంలో తానే సాక్షి సంతకాలు సైతం చేశానని పేర్ని నాని తెలిపారు. తల కిందులుగా తపస్సు చేసినా తనను వేలెత్తి చూపలేవని కొల్లు రవీంద్రకు హితవు పలికారు. తానేంటో తన నైజం ఏంటో కార్యకర్తలను ఎలా చూసుకుంటానో టీడీపీ కార్యకర్తలనే అడిగి తెలుసుకోవాలని సూచించారు. నిజాలు మాట్లాడితే తప్పు లేదని, కుసంస్కారంతో నీచంగా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా కోశాధికారి బందెల డేవిడ్ థామస్నోబుల్, నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం
పెనమలూరు: తమ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆయన శనివారం పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.2162 కోట్లతో మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కోయా ఆనంద్ప్రసాద్, ఎంఈవో, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లోపాలు కనబడలేదా..? కాగా మంత్రి, ఎమ్మెల్యే పెనమలూరు పాఠశాలలో ఆస్మిక తనిఖీ చేసిన సమయంలో లోపాలు కనబడలేదా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన భోజనం పిల్లలకు పెట్టడం లేదని, ప్రతిరోజు మెను అమలు జరగటం లేదని వాపోయారు. మంత్రి తనిఖీలో రిజిస్టర్ చూసి ఉంటే కోడిగుడ్లు వ్యవహారం తేలేదని చెబుతున్నారు. గతంతో పోల్చితే మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యత లోపం కారణంగా ఆదరణ తగ్గిందని, ఇప్పటికై నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తల్లి దండ్రులు కోరుతున్నారు. మంత్రి కొల్లు రవీంద్ర -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పటమట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఉదయం విజయవాడ నగరంలోని గాంధీజీ మహిళా కళాశాల సమీపంలోని అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీచేశారు. టోకెన్ కౌంట ర్లో రూ.5 చెల్లించి క్యూలో నిలబడి, భోజనానికి వచ్చిన ప్రజలతో మాట్లాడారు. క్యాంటీన్లో వసతులు ఎలా ఉన్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. తాను కూడా ఆహార నాణ్యత పరీక్షించేందుకు భోజనం చేశారు. ఈ పర్యటనలో వీఎంసీ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు.ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. హైదరా బాద్ మోతీనగర్కు చెందిన పి.రజనీకాంత్ శర్మ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధి కారులను కలిసి వేలంమర్రి సాంబశివ శర్మ, పద్మావతి పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లె రైలుపేటకు చెందిన ద్రోణవజ్జల బ్రహ్మ అవధాని దంపతులు, విజయవాడ సూర్యా పేటకు చెందిన బమిడిపాటి శ్రీమన్నారాయణ కుటుంబం, బమిడిపాటి శారద కుటుంబం రూ.లక్ష చొప్పున విరాళాలు అందజేశాయి. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్.నాయుడు తీరుపై ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన గళం వినిపించాయి. ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జుల ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని బి.ఆర్.నాయుడుకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో.. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించా లని కోరుతూ విజయవాడ పటమట శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఎమ్మెల్సీ కల్పలత, మాజీ డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు తంగిరాల రామిరెడ్డి, వివిధ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. వైఎస్సార్ సీపీపై తన టీవీ చానల్లో అసత్య ప్రచారాలు చేసినందుకే బీఆర్నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. తమ కులదైవం వెంకటేశ్వరస్వామని చెప్పుకొనే చంద్రబాబు తక్షణం బి.ఆర్.నాయుడును పదవి నుంచి తప్పించాలన్నారు. విజయవాడ పశ్చిమంలో.. తిరుమల దేవస్థానం పవిత్రత కాపాడేందుకు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యాధర పురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. వెలంపల్లి మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని దెబ్బతీసేలా చంద్రబాబు చేస్తున్న చర్యలను హిందూ సమాజం చీదరించుకుంటోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్య లక్ష్మి, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్లో.. చైర్మన్ బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో మాచవరం దాసాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై చంద్రబాబుకు నిజమైన ప్రేమ ఉంటే వెంటనే బి.ఆర్.నాయుడును పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. పెనమలూరులో.. తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవభక్తుని చక్రవర్తి డిమాండ్ చేశారు. కానూరు తిరుపమ్మ ఆలయంలో శనివారం ఆయన పార్టీ నేతలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి విషయంలో టీడీపీ ప్రభుత్వం అలంబిస్తున్న తీరుతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.7విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 532.00 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 13,866 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఎంపీడీఓ కార్యాలయం ఎదుట మహిళా పోలీస్ నిరసన
ఎ.కొండూరు: మండల పరిధిలోని కేశ్యా గ్రామ పంచాయతీలోని తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వివరాలు... కేశ్యాతండాకు చెందిన భరోతు రవి కుమార్ (35)కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య కాపురానికి రాకపోవడంతో, ఈనెల 2వ తేదీన పురుగు మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అంతకు ముందు అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు రవి కుమార్ను చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత రెండురోజులుగా అక్కడ మృత్యువుతో పోరాడిన రవికుమార్ శనివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. రవికుమార్ మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహాలక్ష్మణుడు తెలిపారు. నందిగామరూరల్: ఓ చిరు వ్యాపారి టీవీఎస్పై వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలై మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన కోట స్వామి(59) నిత్యం ఓ టీవీఎస్పై చిరు వ్యాపారం చేస్తుంటాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి నుంచి కంచికచర్లకు బయలుదేరి కీసర సమీపంలోకి రాగానే హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న ఓల్వా బస్సు వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న భార్య సీతామహాలక్ష్మితో పాటు ఇద్దరు కుమార్తెలు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
చంద్రబాబు పాలనలో అన్నదాత అధోగతి
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అన్నదాతలు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని, రైతులను ఆదుకోకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తామని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. సింగ్నగర్ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు లేక, పాసుపుస్తకాలు లేక రైతులు దళారుల చేతిలో, పాలకుల చేతిలో దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారని, నేడు కనీసం రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ కేవలం తమ వాటాల కోసమే ఆరాటపడుతున్నారని, ప్రతి పనికీ మాకేంటని కమీషన్ల కోసం ఎమ్మెల్యేలే నేరుగా అడుగు తున్నారని, అదేమని అడిగితే తమ వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నాడని ఎంపీ బహిరంగం గానే చెబుతూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, రేషన్ బియ్యం, ఇసుక, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని, తక్షణమే రైతులు, ప్రజల సమస్యలను పరిష్క రించాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లాలోనే 20 మంది రైతులు ఆత్మహత్య : మల్లాది విష్ణు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ప్రభుత్వం పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 20 మంది వరకూ రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ముఖ్యంగా మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. పాస్ పుస్తకాల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పాస్ పుస్తకాలు ఇచ్చే నాథుడే లేడని, అసలు ఇప్పటివరకు ఎంతమందికి పాస్ పుస్తకాలు ఇచ్చారో, ఇంకా ఎంతమందికి ఇవ్వాలో, వారందరికీ ఎప్పుడు ఇస్తారో కూటమి ప్రభుత్వం, కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, నందిగామ ప్రాంతాల్లో ఇసుక, మట్టి మాఫియా రెచ్చిపోతోందని వందల ట్రిప్పుల ఇసుక తెలంగాణకు తరలిపోతున్నా మైనింగ్ అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. పీడీఎస్ బియ్యం మాఫియా జరుగుతోందని, బియ్యం రాష్ట్రాలు దాటిపోతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవాలయ భూములకు రక్షణ లేదని. గొడుగుపేట వేంకటేశ్వరస్వామి ఆలయ భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారని వైఎస్సార్ సీపీ పోరాటం వల్లే ఆ భూములను కాపాడగలిగామని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణం : వెలంపల్లి చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అటకెక్కించి, పేదలకు వైద్యం అందకుండా నిర్వీర్యం చేసిందని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణమని, రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీని పునరుద్ధరించి పేదలకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కేవలం టీడీపీ కార్యకర్తలకే పరిమితం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. జిల్లాలో కూటమి నేతలు సాగిస్తున్న అక్రమాలను, దౌర్జన్యాలను త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతామని, ప్రజల పక్షాన నిలబడి అక్రమాల్ని ఎండగడతామన్నారు. -
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
కంచికచర్ల: గంజాయి, మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు విక్రయించినా లేక తీసుకున్నా కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని కంచికచర్ల సీఐ డి.చవాన్ హెచ్చరించారు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల శివారు మద్దులమ్మ తల్లి ఆలయానికి వెళ్లే తోళ్లవాగు వద్ద కొంతమంది యువకులు గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ చవాన్ మాట్లాడుతూ కంచికచర్ల తదితర ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది యువకులు సీలేరు ప్రాంతం నుంచి 20 కేజీల గంజాయి తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలు కట్టి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిందని, ఆ సమాచారం మేరకు కంచికచర్ల, వీరులపాడు ఎస్ఐలు పి.విశ్వనాథ్, అభిమన్యులతో పాటు డెప్యూటీ తహసీల్దార్ వి.మానస, వీఆర్వోలతో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి గంజాయి విక్రయిస్తున్న 9 మంది యువకులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు. వారిని నందిగామ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి ఈనెల 17 వరకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేతల పేర్లు... గంజాయి విక్రయిస్తూ పట్టుబడిన వారిలో కంచికచర్ల ఇందిరాకాలనీకి చెందిన మేచర్ల శ్రీనివాస్, సత్రం స్కూల్ సమీపంలో ఉన్న మేచర్ల రాహుల్ కార్తికేయ, ఇందిరాకాలనీకి చెందిన అలుగుల తరుణ్, గద్దల కిరణ్కుమార్, గేరె విష్టు, గోగినేని శ్యాం సుందర్, ఆళ్ల వెంకటేశ్వర్లు, మేచర్ల మహేష్ ఉన్నారని సీఐ తెలిపారు. కాచవరంలో 6 కిలోల గంజాయి స్వాధీనం కాచవరం(ఇబ్రహీంపట్నం): కాచవరంలోని గ్రీన్ స్టార్ హౌసింగ్ వెంచర్లో సుమారు ఆరు కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ సుబ్రహ్మణ్యం, సెక్టార్ ఎస్ఐ రాజు పాత నేరస్తులపై దృష్టి పెట్టారు. వారికి అందిన సమాచారం మేరకు కాచవరంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కొల్లి నవీన్ కుమార్ వత్సవాయి మండలం, (ప్రస్తుతం కాచవరం), కొంక సురేంద్ర మూలపాడు, మరో మైనర్ బాలుడు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి నుంచి సుమారు ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. పదో తరగతి పరీక్షలు పూర్తి కావడం, మరో వైపున సుముహూర్తపు వేళ ఒక్కటైన నవ వధువరులతో పాటు శుక్రవారం రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. మహామండపం లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్రోడ్డులోని క్యూలైన్లులో భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహా నివేదన సమర్పించేందుకు అన్ని దర్శనాలు నిలిపివేశారు. దీంతో రద్దీ మరింత పెరిగింది. సర్వ దర్శనానికి రెండు గంటల సమయం, రూ. 100, రూ. 300 టికెట్లపై దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. రద్దీ నేపధ్యంలో ఉదయం 10 గంటల తర్వాత రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో క్యూలైన్లో వేచి ఉన్న వారికి మంచినీళ్లు, మజ్జిగను పంపిణీ చేశారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, దర్బారు సేవ, పల్లకీ సేవల్లో భక్తులు విశేషం గా పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణకు చర్యలు
పటమట(విజయవాడతూర్పు): మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణ అంశాలపై విజయవాడ నగర పాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని స్పెషల్ ఆఫీసర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. ఆదివారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి ఆయన విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ వద్ద బందర్ కెనాల్ బండ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బందర్ కెనాల్ బండ్పై నాటిన మొక్కలకు స్ప్రింక్లర్ వ్యవస్థ ద్వారా అందిస్తున్న నీటి సరఫరాను వారు సమీక్షించారు. మొక్కల సంరక్షణ, పచ్చదన విస్తరణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అలాగే నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా రహదారులపై కాలుష్య నియంత్రణ కోసం వినియోగిస్తున్న ప్రత్యేక (మిస్ట్) వాహనాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించి, మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. గుడివాడరూరల్: పరీక్ష సరిగ్గా రాయలేదని ఓ విద్యార్థిని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాధరపురంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. తాలూకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్ములూరు గ్రామ శివారు ఉన్న గంగాధరపురానికి చెందిన బండ్ల హనుమంతరావు కుమార్తె హాసిని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 1వ తేదీన పరీక్ష రాయడానికి కళాశాలకు వెళ్లింది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై పరీక్ష సరిగ్గా రాయకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. 2న కళాశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తల్లి ఆశాలత పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం ఫోన్ చేసింది. ఆ సమయంలో కుమార్తె హాసిని తనకు ఒంట్లో బాలేదని, వాంతులు అవుతున్నాయని తల్లికి తెలిపింది. వెంటనే తల్లి ఇంటికి వచ్చి చూడగా గదిలో హాసిని ఆపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో వెంటనే స్థానికుల సహాయంతో హాసిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం హాసిని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
నందిగామ టౌన్: హోం శాఖ మంత్రిగా మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో మహిళలకు ఇంటా, బయటా రక్షణ కరువైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వంగలపూడి అనిత సారథ్యంలోని హోంశాఖ లా అండ్ ఆర్డర్ కాస్త లేట్ అండ్ ఆర్డర్గా నడుస్తోందని ఎద్దేవాచేశారు. మహిళలపై ఇప్పటి వరకు జరిగిన అఘాయిత్యాలు, దాడులు, లైంగికదాడి ఘటనల్లో న్యాయం జరిగిందా? తప్పు చేసిన వారికి శిక్ష పడిందా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా మహిళలకు అన్యాయాన్ని చూస్తుంటే హోం మంత్రికి ఎలా ఉందో తెలియదు కానీ తాము మాత్రం సిగ్గు పడుతున్నామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో మహిళపై జరిగిన దాడి అత్యంత బాధాకరమన్నారు. ప్రతిపక్షంలో ఉండగా మహిళా రక్షణ కోసం గగ్గోలు పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు వైఎస్సార్ సీపీ ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని శ్యామల స్పష్టంచేశారు. కేవలం ప్రాంతం పేరు చెప్పుకొని చేసే దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు. రాజధానికి చట్టబద్దత అంటూ నానా హంగామా చేస్తున్నారని దీపాలు వెలిగిస్తున్నారని, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఇళ్లలో కూడా ఇలానే ఆనందంగా సంబరాలు చేసుకుని దీపాలు వెలిగిస్తున్నారా అని ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ప్లాట్లు అంటూ పట్టాలిచ్చారని, అవి ఎక్కడో భూమిపై చూపించలేని అసమర్థ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాజధాని రైతుల భూ సమస్యను పరిష్కరించాలని హితవుపలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదన రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమన్నారు. దీని ద్వారా రాజధాని నిర్మాణానికి ఖర్చు తగ్గటంతో అతి కొద్ది సమయంలోనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం శ్యామల దంపతులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు ఎంపీపీ కోటేరు లక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోటేరు నాగమల్లేశ్వరి, మార్త రజని, నాయకులు వేమా రోజ, షేక్ ఫాతిమ, వైఎస్ఎన్ ప్రసాద్, వేమా సురేష్బాబు, బుగ్గినేని సురేష్, కోటేరు సూర్య నారాయణ రెడ్డి, వేమూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి శ్యామల -
జబ్బున పడుతున్న సర్వరోగ నివారిణి
● వేసవిలో మాడిపోతున్న వేప చెట్లు ● గ్రామీణుల్లో అపోహలతో కూడిన ఆందోళన ● డై బ్యాక్ తెగులేనంటున్న నిపుణులు నాగాయలంక: భారతీయ ఆయుర్వేద వైద్యంలో సర్వరోగ నివారిణిగా, ఔషధ వృక్షంగా భావించే వేప చెట్లు రోగాల బారిన పడి చనిపోడంపై గ్రామీణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో వేప చెట్లు ఎండిపోతూ కనిపిస్తున్నాయి. తొలుత వేసవి కాలం కారణంగా ఆకులు ఎండి రాలిపోయి మళ్ళీ చిగురిస్తాయని తేలికగా తీసుకున్న ప్రజల్లో రాను రాను అధిక సంఖ్యలో వేప చెట్లు ఎండి చనిపోవడంతో ఆందోళన నెలకొంది. మూడేళ్ళ క్రితం 2023 ఏప్రియల్ మాసంలో కూడా ఇదే రీతిలో చెట్లు భారీ సంఖ్యలో మాడిపోయాయి. మళ్లీ ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల్లో వేసవి తాపాన్ని తీర్చి చల్లని వాతావరణం ఇచ్చే వేప చెట్లు ఎండిపోవడంపై ఉద్యానవన, అటవీశాఖ అధికారులు అధ్యయనం చేసి అపోహలు తొలగించాలని గ్రామీణులు కోరుతున్నారు. డై బ్యాక్ తెగుల్ల వల్లే.. వేపచెట్టు కొమ్మలు పై నుంచి ఎండుతూ కింది వరకు వచ్చే పరిణామాలను డైబ్యాక్ తెగులుగా ఉద్యానవన నిపుణులు చెపుతున్నారు. ఈ తెగులు తీవ్రత అధికమైనప్పుడు చెట్లు చనిపోయే అవకాశం ఉందంటున్నారు. దీని నివారణకు మూడు గ్రాముల బ్లైటెక్స్ మందును లీటరు నీటితో కలిపి చెట్టు చుట్టూ వేర్లు తడిచేలా పోస్తే నివారణకు అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. -
యానాదులకు రక్షణ, సౌకర్యాలు కల్పించాలి
ప్రస్తుతం పూర్తి సీజన్ కాకపోయినా నాగాయలంక మండలం మడ అడవుల తీరంలో యానాదులు పీతల వేటలో సౌకర్యాలు లేమితో ఇబ్బంది పడటం నిజమే. సొర్లగొంది నుంచి లైట్హౌస్ వరకు మడ అడవులు తీరంలో వంద కుటుంబాలు పీతల వేటలో ఉన్నారు. అయితే వీరిలో 80శాతం మందిని కొందరు వ్యాపారులు బందరు, బంటుమిల్లి, బాపట్ల, నెల్లూరు నుంచి తెస్తున్నారు. స్థానికులకు ఉపాధి కొరవడుతోంది. జిల్లా యంత్రాంగం యానాదులకు రక్షణ, ఉపాధి పెంపొందించాలి. – నక్కా విజయబాబు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర యానాది మహానాడు -
గుడ్ ఫ్రైడే
త్యాగానికి ప్రతీక త్యాగానికి ప్రతీకై న గుడ్ ఫ్రైడేను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పలుచోట్ల క్రైస్తవులు ప్రదర్శనలు చేశారు. శిలువపై క్రీస్తు చేసిన త్యాగం మానవాళికి రక్షణ సందేశం ఇచ్చిందని చర్చి ఫాదర్లు తెలిపారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన సందేశాన్నిచదివి వినిపించారు. గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో కొండపై శిలువ మార్గం చేశారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
తిరుపతమ్మకు బంగారు నక్లెస్ సమర్పణ
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారికి శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన బూరుగుపల్లి శివరామకృష్ణ, వాణి దంపతుల మేనకోడలు భోగవల్లి దివ్యతేజ 25 గ్రాముల, 950 మిల్లీ గ్రాముల నక్లెస్ను ఆలయ సూపరింటెండెంట్ రాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలను అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ మాజీ సభ్యుడు చుంచు రమేష్బాబు, నాయకులు రేగండ్ల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. యనమలకుదురుకు చెందిన గొట్టిపాటి పూర్ణచంద్రరావు, ప్రమీలరాణి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు దుర్గగుడికి విచ్చేశారు. వారి 60వ పెళ్లిరోజు పురస్కరించుకుని అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేయగా, కమిటీ చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారిని శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. గర్భాలయంలో ఉదయం అర్చకులు అభిషేకాలు చేస్తున్న సమయంలో మూలవిరాట్ను ఉదయం 6.30 నుంచి 6.45 గంటల మధ్యలో సూర్య కిరణాలు తాకాయి. అమ్మవారి పాదాల నుంచి ముఖం వరకు అమ్మవారిని సూర్య కిరణాలు వెలిగించిన దివ్య తేజస్సును చూసి భక్తులు పరవశులయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్డుపై నీటితో తడుపుతూ కాళ్లు కాలకుండా మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు. -
అంగరంగ వైభవంగా ..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామివార్లు శుక్రవారం కృష్ణానదిలో విహరించారు. దుర్గాఘాట్ సమీపంలోని వీఐపీ స్నానఘాట్ వద్ద ప్రత్యేకంగా అలంకరించిన పడవపై ఆది దంపతుల నది విహారాన్ని ఆలయ అర్చకులు జరిపించారు. తొలుత ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా వీఐపీ ఘాట్కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల కోలాట నృత్యాలు, కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన మధ్య ఊరేగింపు ముందుకు సాగింది. నవ దుర్గల రూపంలో చిన్నారులు అలరించారు. ఈవో శీనానాయక్ కుటుంబ సమేతంగా, ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం స్నానఘాట్లో నదీ విహారానికి ఏర్పాటు చేసిన పడవపై ఆది దంపతులను అధిష్టించగా, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ముల్లోకాలకు గుర్తుగా నదీలో మూడు పర్యాయాలు విహరించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తరలించారు. ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు, వేద పండితులు, ఈఈ ఎల్.రమ, ఇతర ఇంజినీరింగ్ అధికారులు నదీ విహారంలో పాల్గొన్నారు. ఆది దంపతుల నదీ విహారం -
వెట్టి వెతలు
నాగాయలంక మడ అడవుల మధ్య యానాదుల జీవనయానం.. కాలం మరిచిన గాథలా కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాదులకు అడవే వారి ఆశ్రయం.. ప్రకృతే ఆధారం. ఇతరుల కరుణపై ఆధార పడిన వీరికి పూట గడవాలంటే మాత్రం వెట్టి చాకిరీ తప్పడం లేదు. దీంతో అడవుల్లో చెట్ల నీడలో వీరు కన్నీరు పెట్టుకుంటున్నారు. పీతలు, రొయ్యలు, చేపల వ్యాపారుల చేతిలో వీరు ఉండటంతో.. జీవన పోరాటం చేయక తప్పడం లేదు.అడవి దాటనినాగాయలంక: నాగాయలంక మండలంలోని మడ అడవుల్లో వందకు పైగా యానాది కుటుంబాలు మాడిపోతున్నాయి. పీతలు, రొయ్యలు, చేపలు సాగు చేసే రైతులు.. పనిలో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని యానాదులు వాపోతున్నారు. మండలంలోని తీరప్రాంతం సొర్లగొంది నుంచి లైట్ హౌస్ వరకు వందకు పైగా యానాది(ఎస్టీలు) కుటుంబాలు నిత్య జీవన యానంలో వెట్టి చాకిరీతో కునారిల్లుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి.. సరైన సీజన్ కాక పోయినా పీతల వేట కొనసాగించేందుకు సంబంధిత వ్యాపారులు వెట్టి చాకిరీ చేయించుకోవడానికి బందరు, బంటు మిల్లి, బాపట్ల, నెల్లూరు జిల్లాల ప్రాంతాల నుంచి యానాదులను నాగాయలంక తీర ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక్కడ కృష్ణా నది పరీవాహకం, బంగాళాఖాతం సముద్ర పాయల వెంట పీతల వేటకు అను కూలంగా ఉంటుంది. దీంతో గంపగుత్తగా పీతల వ్యాపారం సాగించే వ్యాపారులు వీరిని చెప్పు చేతల్లో పెట్టుకుని వెట్టి చాకిరీ చేయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తరచూ తీర గ్రామాల్లో ఘర్షణ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి యానాదులను తీసుకొస్తున్నారు. దీంతో మండలంలోని స్థానిక యానాదుల జీవనోపాధికి గండి కొడుతున్నారు. పరాయి ప్రాంత ఎస్టీలను తీసుకురావడం తరచూ తీర గ్రామాల్లో ఘర్షణలకు తావిస్తోంది. వసతుల్లేక అల్లాడుతున్నారు సొర్లగొంది తీరంలో మడ అడవుల మాటున మండు వేసవిలో సరైన నివాసాలు, సౌకర్యాలు లేక పిల్లలతో అల్లాడుతున్నా వారిపై కనికరం ఉండదు. వ్యాపారుల లక్ష్యం వారు వేట సాగించి సరుకు అందించడమే. నామ మాత్రపు కూలీతో పని చేస్తున్నారు. యానాదుల పిల్లలు సైతం ఈ కఠిన జీవన యాత్రలో సమిధలు కావాల్సి వస్తోంది. వేసవిలో తాగునీరు అందదు, రాత్రిళ్లు తాత్కాలిక నివాస డేరాల్లో దోమలతో ఇక్కట్లు పడాల్సిందే. గ్రామాలకు దూరంగా మడ అడవుల్లో తీరం వెంట వారి జీవనం సాగుతోంది. స్థానికులైతే ఏరోజుకారోజు వేటకెళ్లి ఇళ్లకు తిరిగి వస్తుంటారు. ఇది లాభదాయకమైన వెట్టి చాకిరి కావడంతో ఈమధ్య కాలంలో పలువురు వ్యాపారులు ఎస్టీల వైపు చూస్తున్నారు. ఇటీవల ఐదు కుటుంబాలకు విముక్తి ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామానికి చెందిన పీతల వ్యాపారి నెలలు తరబడి దీవుల్లో యానాదుల (ఎస్టీలఉ)ను బంధించి వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్న తీరుపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఐదు కుటుంబాలకు చెందిన 15మందికి అధికారులు గత నెల 17న విముక్తి కలిగించారు. అంతకు ముందు ఈలచెట్టదిబ్బలో గ్రామ కమిటీకి వ్యాపారుల నడుమ ఘర్షణలు రచ్చకెక్కి కేసులు వరకు దారితీసిన విషయం తెలిసిందే. నాగాయలంక మడ అడవుల్లో మాడిపోతున్న యానాదుల జీవితాలు -
పేర్ని నాని కుటుంబంపై కూటమి సర్కార్ కక్ష సాధింపు
సాక్షి, కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. కొబ్బరితోటలో అక్రమంగా కూల్చేసిన ఇంటిని పరిశీలించేందుకు మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు వెళ్లారు.అయితే, పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐను దూషించారంటూ పేర్ని కిట్టుపై కేసు నమోదు చేశారు. కిట్టుతో పాటు పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు. ఇనకుదురు సీఐ పరమేశ్వర్ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, నగరంలోని 6వ వార్డు కొబ్బరి తోటలో నిర్మాణంలో ఉన్న శ్రీపతి వెంకటాచలం ఇంటిని అకారణంగా కూల్చివేసిన నేపథ్యంలో గురువారం ఆయన ఆ ఇంటిని పేర్ని నాని, పేర్ని కిట్టు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చనిపోయేలోపు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆశతో ఎంతో శ్రమకోర్చి రూపాయి, రూపాయి కూడబెట్టుకొని ఇల్లు నిర్మించుకుంటారన్నారు. అటువంటి ఇంటిని ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధాంతరంగా కూల్చివేయటం దారుణమన్నారు. -
అవినీతికి సైలో
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాu8లో గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్కు భరోసా ● అవినీతి మయంగా ఎన్టీటీపీఎస్ సైలో విభాగం ● ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అంతర్గత బదిలీలతో తీవ్ర ఒత్తిడి ● నూతన బదిలీల చర్చపై మండిపడుతున్న ఉద్యోగులు ఇబ్రహీంపట్నం: నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ సైలో (బూదిద ప్లాంట్)విభాగంలో అవినీతి తార స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఆదాయ మార్గంగా ఉన్న సైలో విభాగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను తొలగించి ఓ సామాజిక వర్గం వారిని మాత్రమే కొనసాగిస్తున్నారని సమాచారం. సైలో విభాగంలో వివిధ సిమెంట్ కంపెనీ లారీలకు లోడింగ్ ద్వారా వచ్చే నగదు, లారీ కాటా మాయాజాలంతో సంపాదించిన సొమ్ముల్లో వాటాలు రాజకీయ నేతల జేబుల్లోకి చేర్చేందుకే ఆ సామాజిక వర్గం ఉద్యో గులకు అక్కడ పెద్ద పీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక డీఈఈ స్థాయి అధికారి ఇటీవల కావాలని బదిలీ చేయించుకున్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలువడే సైలో(మెత్తటి బూడిద), ఎన్టీటీపీఎస్ చెరువులోకి వచ్చే బూడిదను లారీలకు లోడింగ్ చేసేందుకు ఏడాది క్రితం చైన్నెకు చెందిన రెప్లెక్స్ కంపెనీకి మూడేళ్లకు లీజుకు ఇచ్చారు. సైలో ప్లాంటు రెప్లెక్స్ కంపెనీకి అప్పగించాలనే నేపంతో ప్లాంటులో పని చేస్తున్న సుమారు 20 మంది ఉద్యోగుల్లో ఎనిమిది మంది ఎస్సీ ఉద్యోగులను వేరే ప్లాంటుకు బదిలీ చేశారు. సైలోలో కాసుల పంట పండటంతో వారిలో కొందరు రూ.50 వేల వరకు ఇచ్చి ఈ ప్లాంటు విధుల్లో చేరారు. అనతి కాలంలోనే వేరే ప్లాంటుకు బదిలీ చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మిగిలిన 12 మందికి కూడా బదిలీ తప్పదని ఏడాదిగా చెబుతున్నారే తప్ప చేయడంలేదు. కొందరు బదిలీ ఉత్తర్వులు తీసుకుని కూడా రాజకీయ పలుకుబడితో అక్కడే తిష్టవేశారని సమాచారం. ఎస్సీ, బీసీ ఉద్యోగులను సైలో నుంచి తప్పించడంలో అధికార పార్టీ నేతలు, యూనియన్ నాయకులు విజయవంతమయ్యారు. ఇప్పుడు విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి వద్ద స్థానిక టీడీపీ నాయులు సైలో లో నూతన నియామకాలు చేపట్టాలనే విషయాన్ని తరపైకి తెచ్చారని సమాచారం. ఈ తంతు విజయవంతమైతే ఉద్యోగులను నుంచి రూ.లక్షల్లో వసూలవు తుంది. ఉన్నవారిని తొలగించి నూతన బదిలీలు చేయడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సంస్థలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించలేని రాజకీయ నాయకులు, యూనియన్ నేతలు, అధికారులు ధన దాహంతో సైలో ప్లాంటులో మళ్లీ బదిలీలపై చర్చలు జరపడంపై మండిపడుతున్నారు. బదిలీలపై సైలో విభాగం అధి కారి వివరణ కోరగా.. సంస్థ చీఫ్ ఇంజినీర్ శివరామాంజనేయులు ఆదేశాల మేరకు ఉద్యోగులను వివిధ ప్రాంతాలకు అంతర్గత బదిలీలు చేశామన్నారు. కులాల వారీగా బదిలీ చేయాల్సిన అవసరం సంస్థకు లేదని పేర్కొన్నారు. సైలోలో నూతన బదిలీలు, నగదు వసూలు విషయం ఇప్పటి వరకు తన వద్దకు చేరలేదని స్పష్టం చేశారు. 7ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలువడే తడి బూడిద చెరువులోకి, మెత్తటి పొడి బూడిద సైలో ప్లాంటుకు చేరుతుంది. సైలో నుంచి వచ్చే బూడిదను సిమెంట్, సిమెంట్ ఇటుకల తయారీకి వాడతారు. దీంతో ఈ బూడిదకు భారీ డిమాండ్ ఏర్పడింది. లోడింగ్ సమయాల్లో డిమాండ్ను బట్టి భారీగా నగదు చేతులు మారుతుంది. పలు సిమెంట్ కంపెనీలు లారీ లోడింగ్కు నెలకు సుమారు రూ.3 లక్షల వరకు అక్కడి ఉద్యోగులకు ముట్టజెబుతారని సమాచారం. సిమెంట్ ఇటుకల కంపెనీలకు ఉచితగా బూడిద లోడింగ్ చేస్తామని పైకి చెబుతున్నప్పటికీ వారు కూడా ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. లోడింగ్ అయిన లారీలు కాటా పెట్టే సమయంలో అధిక లోడు పేరుతో ఒక్కొక లారీకి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తారు. రోజుకు 150 లారీల వరకు లోడింగ్ జరుగుతుంది. అధిక లోడు పేరుతో కాటా వద్ద రోజుకు మూడు షిప్టుల్లో సుమారు రూ.50 వేలు వరకు వసూలు చేస్తారు. అక్రమ మార్గాన సేకరించిన ఈ నగదు రాజకీయ నేతలు, ఉద్యోగులు, అధికారులు పంచు కుని సైలో ప్లాంటును అవినీతి మయంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో అధికారులు బుధవారం మరో కూల్చివేత పర్వానికి తెరలేపారు. ఇంటిని కూల్చొద్దని అడ్డుపడిన బాధితులను పోలీసులు ఈడ్చిపారేశారు. దుర్గగుడిలో చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఆదిదంపతులు బుధవారం సింహ వాహనంపై నగరోత్సవంలో విహరించారు. మోపిదేవి: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదానానికి హనుమకొండకు చెందిన ఎ.రాహుల్ రెడ్డి, సుస్మిత రూ.1.30 లక్షల విరాళం సమర్పించారు. -
జెడ్పీ చైర్పర్సన్ను కలిసిన సీఈఓ
చిలకలపూడి(మచిలీపట్నం): జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన జె.అరుణ బుధవారం ఆమె చాంబర్లో మర్యా దపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. ఇటీవల నిర్వహించిన బదిలీల్లో ఆమె జెడ్పీ సీఈఓగా నియమితులయ్యారు. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇబ్రహీంపట్నం: స్థానిక ఫెర్రీ ఇసుకరేవుపై తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, సీఐ ఎ.సుబ్రహ్మణ్యం బుధవారం ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో అనుమతులు లేకుండా కృష్ణానది గర్భం నుంచి ఇసుక తీసుకొచ్చిన పడవల నుంచి లోడింగ్ చేస్తున్న ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాల్టా చట్టం మేరకు ఒక్కొక ట్రాక్టర్కు రూ.10 వేల చొప్పున ఫెనాల్టీ విధించారు. ఫెనాల్టీ చెల్లించే వరకు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పడవలు, డ్రెడ్జింగ్ యంత్రాలు, మ్యా నువల్ క్రేన్ల జోలికి అధికారులు వెళ్లకపోవడం గమనార్హం. -
‘ప్రతిదీ మీకు చెప్పి చేయాలంటే కుదరదు’
సాక్షి, కష్ణా: జిల్లా డీఆర్సీ మీటింగ్లో కలెక్టర్ వర్సెస్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మధ్య మాటల యుద్ధం చర్చాంశనీయంగా మారింది. మాకు చెప్పకుండా మా నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తామంటూ కలెక్టర్పై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైరయ్యారు. ఆకస్మిక తనిఖీలు మీకు చెప్పి రాలేమంటూ కలెక్టర్ బాలాజీ సమాధానం ఇచ్చారు. ప్రతిదీ మీకు చెప్పి రావడం కుదరదని తేల్చి చెప్పారు. ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో డైలాగ్ వార్ జరగడంతో.. ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ డీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొన్న అధికారులు గుసగుసలాడుకున్నారు. -
తిరుపతమ్మ హుండీ ఆదాయం రూ.76.38 లక్షలు
పెనుగంచిప్రోలు: స్థానికంగా వేంచేసి ఉన్న శ్రీతిరుపతమ్మవారికి భక్తులు రూ.76.38 లక్షల నగదును కానుకల రూపంలో సమర్పించారు. ఆలయంలోని హుండీల్లోని కానుకలను మంగళవారం అమ్మవారి మండపంలో లెక్కించారు. 48 రోజులకు గాను నగదు రూపంలో రూ.76,38,287, బంగారం 20 గ్రాములు, వెండి 375 గ్రాములు వచ్చినట్లు ఆలయ ఈఓ బి. మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అలాగే యూఎస్ఏ డాలర్లు 34, సౌదీ రియాల్స్ 5, మలేషియా రింగిట్స్8, ఆస్ట్రేలియా డాలర్లు 175 వచ్చాయన్నారు. కానుకలను ఆలయ సిబ్బందితో పాటు పరిటాలకు చెందిన ఉమ సేవా సమితి సభ్యులు, గ్రామానికి చెందిన భక్తులు లెక్కించారు. కానుకల లెక్కింపును ఆలయ ఈఓతో గ్రూపు ఆలయాల ఈఓలు సీహెచ్ జయప్రకాష్బాబు, బీవీ సుబ్బారావుతో, ఏఈఓ జంగం శ్రీనివాసరావు, దేవదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ మాజీ సభ్యులు పర్యవేక్షించారు. చందాపురంలో కొనసాగుతున్న సర్వే లబ్బీపేట(విజయవాడతూర్పు): కలుషిత ఆహారం తిని అతిసారకు గురైన నందిగామ మండలం చందాపురంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది సర్వే కొనసాగుతోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని మంగళవారం తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. తాగునీటి పరిశుభ్రత, ఓవర్హెడ్ ట్యాంకులను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్లోరినేషన్ చేయడం వంటి అంశాలను సిబ్బందికి తెలియజేస్తున్నారు. అతిసారలో వేర్వేరు ఆస్పత్రుల్లో చేరిన వారిలో కొందరు డిశ్చార్జి కాగా ఇంకా నలుగురు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరు విజయవాడ జీజీహెచ్లో, ముగ్గురు నందిగామ సీహెచ్సీలో చికిత్స పొందుతున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి సత్కారం లబ్బీపేట(విజయవాడతూర్పు): సుధీర్ఘకాలం పాటు పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి పోలీస్ కమిషనరేట్లో మంగళవారం సత్కరించారు. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ కేజీవీ సరిత వారిని సత్కరించారు. పదవీ విరమణ పొందిన వారిలో ఎస్ఆర్పేట ఏఎస్ఐ కె. సూర్యప్రకాశరావు, హోంగార్డులు పి. రాయప్ప, బి. వెంకన్న, ఎం. దుర్గాభవానీ ఉన్నారు. పోలీసు అసోసి యేషన్ అధ్యక్షుడు సోమయ్య పాల్గొన్నారు. దొనబండలో ఎనిమిది రాతి క్వారీలు సీజ్ కంచికచర్ల: మండలంలోని పరిటాల శివారు దొనబండ రాతి క్వారీల్లో మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా లారీల్లో మెటల్ తరలిస్తున్నారా లేదా అని లారీలను ఆపి తనిఖీ చేశారు. అనంతరం మైనింగ్శాఖ ఏడీ వీరాస్వామి మాట్లాడుతూ పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధన మేరకు రాతి క్వారీలు నడపాలన్నారు. లారీలకు తప్పనిసరిగా పర్మిట్లు ఉండాలని లేకపోతే వాహనాలను కూడా సీజ్ చేస్తామని చెప్పారు. దొనబండ క్వారీల్లో పర్యావరణ అనుమతులు లేని 8 క్వారీలను సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో మైనింగ్ శాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


