NTR
-
తిరువూరులో ఎనీ టైం కిక్కు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో మద్యం మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గుడి, బడి..ప్రార్థనా మందిరాలు వంటి వాటి పక్కన పెట్టకూడదనే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి బార్ అండ్ రెస్టారెంట్లు వెలిశాయి. దీంతోపాటు గ్రామాల్లో ప్రజలకు తాగునీరు దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. వీధికో బెల్ట్షాపు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఎనీ టైం మద్యం మాత్రం లభిస్తోంది. ఎక్సైజ్ అధికారులు సైతం మామూళ్ల మత్తులో జోగుతూ, తూతూమంత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. దీంతో మద్యం మాఫియా బరితెగిస్తోంది. బెల్ట్షాపుల్లో నకిలీ కిక్కు గుప్పుమంటోంది.తిరువూరు నియోజకవర్గవ్యాప్తంగా 20 షాపులు ఉండగా, వీటికి అనుబంధంగా 640 బెల్ట్షాపులు నడుస్తున్నాయి. ఈ షాపుల నిర్వహణ వెనుక టీడీపీకి చెందిన పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉండడంతో, మద్యం మాఫియా మరింత రెచ్చిపోతోంది. సదరు నేతకు ప్రతి మద్యం షాపు నుంచి నెలకు రూ.లక్ష చొప్పున అంటే నెలకు రూ.20 లక్షలు చొప్పున ఏడాదికి రూ.2.40 కోట్లు దండుకుంటున్నారు. బెల్ట్ షాపు పెట్టుకునేందుకు మొదట్లో గుడ్విల్ కింద రూ.50 వేలు చొప్పున 640 బెల్ట్షాపులకు రూ.3.20 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారు.దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు, బెల్ట్షాపులు 24 గంటలు బార్లా తెరుచుకునే ఉంటున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు మద్యం బారిన పడి నాశనమవుతున్నాయి. పలు కుటుంబాలు చితికిపోయి వీధిన పడుతున్నాయి. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే పెడుతున్న స్టేటస్లు చంద్రబాబు సర్కారులో మద్యం, పేకాట వంటి అవినీతి అక్రమాలకు అద్దం పడుతున్నాయి. పేకాట, క్యాసినోలు.. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా గంపలగూడెం మండలం ఊటుకూరు, విసన్నపేటలో పేకాట, క్యాసినో ఏర్పాటు చేశారు. ఆ మూడు రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్లకు పైగా దండుకున్నారని, దీని వెనుక పార్లమెంటు ముఖ్యనేత హస్తం ఉన్నట్లు టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. గతంలోనూ కొలికపూడి ‘నువ్వు దేనికి అధ్యక్షుడివి.? పేకాట క్లబ్కా?, కొండ పర్వగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్, పేకాట కోసం ఆఫీసు పెట్టావంటే.. నువ్వు నిజంగా రాయల్..’’ అంటూ స్టేటస్ పెట్టడంతో అప్పుడు కూడా సంచలనంగా మారింది.సంచలనంగా ఎమ్మెల్యే కొలికపూడి స్టేటస్..తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పెట్టిన స్టేటస్, అక్కడ మద్యం మాఫియా దందాకు అద్దం పడుతోంది. ‘‘తిరువూరులో అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు, అంబేడ్కర్ గురుకులం ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. తియ్యమని చెప్పాను. బేరం మొదలు పెట్టారు. నెలకి లక్షన్నర.. బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో’’ అంటూ ఎమ్మెల్యే పెట్టిన స్టేటస్ సంచలనంగా మారింది. పార్లమెంటు ముఖ్యనేత ప్రోద్బలంతో ఎక్సైజ్ అధికారులు సైతం రూ.5.లక్షలు తీసుకుని, నిబంధనలను తుంగలో తొక్కి బార్కు లైసెన్సు ఇచ్చినట్లు అక్కడ చర్చ సాగుతోంది. గతంలో సైతం బస్టాండు సమీపంలో, దేవాలయాలకు దగ్గర మద్యం షాపులున్నాయని ఎమ్మెల్యే ధర్నా చేశారు. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా ఇష్టారీతిన మద్యం షాపులు పెట్టారనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే స్టేటస్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): పోక్సో చట్టం పటిష్టంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి సూర్యకుమారి అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి సీ్త్ర, శిశు సంక్షేమ, ఇతర సంక్షేమాధికారులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిష్పత్తి, పోక్సో చట్టం అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. జిల్లా లింగ నిష్పత్తిలో వెనుకబడి ఉందని, ముఖ్యంగా ప్రతి వెయ్యి మందికి మగ వారికి 921 మంది మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. 101 పిల్లలు తప్పిపోయారని వారిని వెతికి పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. యుక్తవయసులో గర్భధారణ అధికంగా ఉంటోందని దీనిపై తల్లిదండ్రులు, పెళ్లయిన యువతీయువకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయో, లేదో మండల ప్రత్యేకాధికారులను పంపించి పరిశీలించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ ఎం.ఎన్.రాణి, డీఐఓ డాక్టర్ ప్రేమచంద్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ షేక్ షాహెద్బాబు, గిరిజన సంక్షేమాధికారి ఎం.ఫణిదూర్జటి, డీఈఓ సుబ్బారావు పాల్గొన్నారు. -
పోర్టుకు విద్యుత్ సరఫరాపై సమీక్ష
పెడన: మండల పరిధిలోని కూడూరు గ్రామంలో 133/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి మచిలీపట్నం పోర్టుకు విద్యుత్ సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు పెడన తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రాంతాలను ఎంపిక చేసి స్థల సేకరణపై ఇన్ చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్తో సమీక్షించారు. నడుపూరు, కూడూరు, నందిగామ, కొంకేపూడి, పెడన, శింగరాయపాలెం గ్రామాలు మీదుగా మొత్తం 32 టవర్లను నిర్మించడానికి స్థల సేకరణ, సంబంధిత రైతుల భూములకు పరిహారం చెల్లింపు, రెవెన్యూ, పోరంబోకు, గ్రామ కంఠాలు తదితర వివరాలను చర్చించారు. ఈ సమావేశంలో మారిటైమ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఇన్చార్జి ఆర్ఐ విజయలక్ష్మి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. -
పదేపదే పునరావృతం
దేశంలో నీట్ పరీక్ష పేరుతో స్కామ్లు పదేపదే పునరా వృతం అవుతున్నాయి. విద్యార్థుల శ్రమను రూ.లక్షలకు అమ్ముకోవటం దుర్మార్గం. ఈ స్కామ్ల వల్ల రూ.లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారు. వైద్య విద్యకు దూరమవుతున్నారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో గెస్ పేపర్ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ప్రశ్నపత్రం అసలు ప్రశ్నపత్రంతో సరిపోలింది. దీనికి బాధ్యత వహిస్తున్న కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. నీట్ను పూర్తిగా రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించాలి. – ఎ.సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్ఓ -
ఏసీపీ నివాసంలో అగ్ని ప్రమాదం
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ పటమట ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏసీపీ సత్యానందం (1991 బ్యాచ్) డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ఆయన వీఆర్లో ఉన్నారు. ఆయన పటమటలంక నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రత్యుష అపార్టుమెంట్లో 302 ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. వేసవి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం విదేశాలకు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన నివాసం ఉంటున్న అపార్టుమెంట్ ఫ్లాట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో వంటగదిలోని గ్యాస్ సిలిండర్ పేలి ఎదురు అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తి తలకు గోడ శిథిలాలు తగిలాయి. విజయవాడ సిద్ధార్థ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న గొట్టిపాటి శ్రీనివాసరావుకు తలకు బ్లాస్టింగ్ శిథిలాలు తగిలి తీవ్ర గాయాల య్యాయి. ఆయన ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన గురించి తెలుసుకున్న పటమట అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని సీలింగ్, సామాన్లు కాలిపోయాయి. ఈ ప్రమాదకారణంగా సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగిందని అంచనా ఫైర్ సిబ్బంది అంచనా వేశారు. ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి పటమట ప్రత్యూష అపార్ట్మెంట్ ప్రమాద ఘటనను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పరిశీలించారు. పొరుగున ఉన్న అపార్ట్మెంట్ వాసు లతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తీరు దురదృష్టకరమని, ప్రమాదం సమయంలో అపార్ట్ మెంట్లో ఎవరూ లేరని, మంటలు వస్తుండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు అందరినీ అప్రమత్తం చేసే సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందన్నారు. ఇలాంటి ప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వేసవి కారణంగా నమోదవుతున్న ఉష్ణోగ్రత తీవ్రత దృష్ట్యా ప్రమాదం జరిగిందని ప్రాఽథమిక అంచనాకు వచ్చాం. అయితే ప్రమాదం జరిగిన కారణాలను అన్వేషిస్తున్నాం. ఈ ప్రమాదానికి రెండు కారణాలుగా తెలుస్తున్నాయి. విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణమా లేక గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనా అనే కోణంలో విచారణ చేపట్టాం. పోర్టుకోలో ఉన్న ఏసీ అవుట్లెట్ నుంచి జరిగిన షార్టు సర్క్యూటా లేక ముందే వంటగదిలో సిలిండర్ పేలిందా అనే కోణంలో విచారణ చేపట్టాం. – కె.దామోదర్, సెంట్రల్ జోన్ ఏసీపీ -
బాడీబిల్డింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పెనమలూరు: రాష్ట్ర స్థాయి బాడీబిల్డింగ్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశామని ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి తాళ్లూరి అశోక్ తెలిపారు. ఆయన కానూ రులో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఈ నెల 17వ తేదీన జరగనున్న రెండో మిస్టర్ రాష్ట్ర స్థాయి క్లాసిక్ బాడీబిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలకు విజయవాడ సింగ్నగర్ మనోహర్ జిమ్లో క్రీడాకారులకు ఎంపిక చేశామన్నారు. 55–60 కిలోల విభాగంలో జి.వాసుదేవ్, 60–65 కిలోల విభాగంలో టి. రవితేజ, బి.దయాకర్, పి.రామకృష్ణ, ఎం. అవినాష్, జి.నీరజ్, 65–70 కిలోల విభాగంలో పి.శ్రీధర్, పి.సాయికుమార్, బి.అశోక్, 70–75 కిలోల విభాగంలో ఆర్.దుర్గా ఆంజనేయులు, జి.అనురాగ్ముఖేష్, కె.శ్రీరామ్, కె.హరికృష్ణ, 80–85 కిలోల విభాగంలో ఎస్కె.ఇబ్రహీం, 85 కిలోలపై విభాగంలో ఎస్కే రెహన్, సీహెచ్. గోపీకృష్ణ, ఫిజిక్ స్పోర్ట్స్ విభాగంలో వై.ప్రణయ్తేజ్, టి.రవితేజ, ఎం.అవినాష్, పి.సాయి కుమార్, వి.సురేష్, జి.అనురాగ్, ముఖేష్ ఎంపికయ్యారని వివరించారు. టీమ్ మేనేజర్గా అల్లూరి శ్రీనివాస్రెడ్డి, కోచ్గా ఎస్కే ఖాదర్, ఇన్చార్జ్గా బాషా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రగతి సూచికల్లో ఏ– ప్లస్ను నిలబెట్టుకోవాలి గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర విజన్– 2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల్లో ఏ ప్లస్ స్థాయిని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ – కేపీఐల లక్ష్యాలను ఆయన మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాస్థాయి స్కోరు 90గా ఉందని.. దీనిని మరింత మెరుగుపరిచి ప్రగతి పథంలో పయనించేలా చూడాలన్నారు. కంచికచర్ల, వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం తదితర ఏ గ్రేడు మండలాలు ఏ ప్లస్ గ్రేడ్ సాధించేందుకు కృషి చేయాలన్నారు. గణాంక అధికారి డి.వి.ఎస్. ఆర్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాల్య వికాసంపై స్క్రీనింగ్ పరీక్షలు పెనమలూరు: బాల్య వికాసంపై స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టామని శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ బి.సుజాతరాణి తెలిపారు. పెనమలూరులో మంగళవారం ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్(ఈసీడీ) కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మూడేళ్ల లోపు చిన్నారుల అభివృద్ధి అవరోధాలు నివారించటానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈసీడీ పరీ క్షలు నిర్వహిస్తామన్నారు. తల్లితండ్రులు అంగన్వాడీ కేంద్రాలలో జరిగే స్క్రీనింగ్ చిన్నారులకు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు శ్రీలత, రెహనాబేగం, బేబీ, సచివాలయ కార్యదర్శులు మౌనిక, ఎస్.విజయలక్ష్మి, అంగన్వాడీ కర్యకర్తలు పాల్గొన్నారు. నవచేతన అమలు పరిశీలన లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక భ్రమరాంబపురంలోని అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మంగళవారం సందర్శించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న నవచేతన కార్యక్రమం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల అభివృద్ధి స్థాయిని అంచనా వేయొచ్చ సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను నమోదు చేస్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళాశిశు సంక్షేమ అధికారి షేక్ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆశలు మెడికిల్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు ఈ నెల మూడో తేదీన నిర్వహించిన ‘నీట్ – 2026’ను రద్దు చేయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరీక్షకు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 12,087 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఏకంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ‘నెలల తరబడి నిద్రాహారాలు మానుకుని కష్టపడి చదివి నీట్ పరీక్ష రాశాం. ఇప్పుడు పేపరు లీకై ంది, రద్దు చేశాం. మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం’ అంటే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు వాపోతున్నారు. పరీక్ష నిర్వహించిన ప్రభుత్వ ఏజెన్సీతో పాటు కేంద్ర ప్రభుత్వ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 34 కేంద్రాల్లో పరీక్ష ఈ నెల మూడో తేదీన నిర్వహించిన నీట్ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి 12,259 మంది విద్యార్థులను కేటాయించారు. వారిలో 12,087 మంది పరీక్షకు హాజరయ్యారు. 2025లో 13,625 మంది విద్యార్థులను కేటాయించగా 13,455 మంది హాజరయ్యారు. 2024లో సుమారు 15 వేల మంది పరీక్ష రాశారు. కలెక్టర్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ పరీక్ష నిర్వహణలో తలమునకలయ్యారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో గెస్ పేపర్ పేరుతో సోషల్ మీడియాలో తిరిగిన ప్రశ్నాపత్రం అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు తేలింది. దీంతో ఈ నెల మూడో తేదీ జరిగిన పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. తరచూ గందరగోళం నీట్ పరీక్షకు సంబంధించి తరచూ గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. గతంలోనూ నీట్ పరీక్ష పేపర్ ముందుగానే బయటకు రావటంతో కోర్టు వరకు వివాదం చేరింది. కొన్ని వందల మందితో మళ్లీ పరీక్ష రాయించారు. తాజాగా నీట్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావటం, అది నిజమైనదిగా స్పష్టం కావటంతో ఏకంగా పరీక్షను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ గందరగోళ పరిస్థితులు విద్యార్థులను మరింత కుంగదీస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎంతో కష్టపడి నీట్ పరీక్ష రాశాను. చాలా నెలలుగా ఇంటర్మీడియెట్ కోర్సుతో పాటుగా నీట్ పరీక్ష కోసం కష్టపడ్డాను. మా అమ్మ, నాన్న సైతం నాతో పాటుగా ఎంతో కష్టపడ్డారు. ఫీజులు కట్టి ప్రోత్సహించారు. అంతా సజావుగా జరిగిన తరువాత ఇప్పుడు నీట్ పరీక్ష రద్దు చేస్తున్నామని ప్రకటిస్తే ఎలా? ఇన్నాళ్ల కష్టం వృథయేనా? నాకే కాదు పరీక్ష రాసిన మా ఫ్రెండ్స్ అందరం బాధపడుతున్నాం. మళ్లీ పరీక్ష రాయాలంటే చాలా కష్టం. – సీహెచ్ ధేనుక, విద్యార్థిని, విజయవాడ నెలల తరబడి కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్షను ఒక్కసారిగా రద్దు చేసినట్లు ప్రకటించటంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి కృష్ణాజిల్లాలో శిక్షణ తీసుకుని నీట్ పరీక్షకు హాజరవుతారు. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటూ కుటుంబాలకు దూరంగా హాస్టళ్లలో ఉండి, వేకువ జాము నుంచి అర్ధరాత్రి వరకూ పుస్తకాలే లోకంగా చదువుతారు. అంతటి కష్టం బుడిదలో పోసిన పన్నీరుగా మారిందని విద్యార్థులు వాపోయారు. ఈ పరీక్షను చాలా బాగా రాశామని, సీటు వస్తుందన్న నమ్మకం ఉందని, మళ్లీ పరీక్ష రాయాలంటే తమకు నష్టమేనని పేర్కొన్నారు. ఇన్నాళ్లు తాము పడిన కష్టానికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. -
శాశ్వతంగా రద్దు చేయాలి
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్షను శాశ్వ తంగా రద్దు చేయాలి. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ అసమర్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని మూసివేయాలి. పేపర్ లీకేజీలను అరికట్టడంలో, పారదర్శకంగా పరీక్ష నిర్వహించడంలో ఎన్టీఏ ఘోరంగా విఫల మైంది. ఒక దేశం – ఒకే పరీక్ష పేరుతో కేంద్రం తీసుకొచ్చిన ఈ విధానం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యా వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్తోంది. – ఎం.సాయికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్ఎఫ్ -
గురుకులాలు, వసతి గృహ విద్యార్థులకు అభినందన
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతి గృహాల విద్యార్థులకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం అభినందన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎస్. సవిత పాల్గొని మాట్లాడారు. విద్యతోపాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలన్న ఉద్దేశంతో త్వరలో స్పోర్ట్స్ మెటీరియల్ అందజేయనున్నామని ఆమె తెలిపారు. ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో విద్యార్థిపై ఎంజేపీ గురుకులాల్లో రూ.1.50లక్షలు, బీసీ హాస్టళ్లలో రూ.75వేలు వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల సంఖ్యను 42 నుంచి 109కి పెంచామని చెప్పారు. ఆరు ఎంజేపీ గురుకుల పాఠశాలలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. వార్డెన్లు మార్గదర్శకత్వం చేయాలి.. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. హాస్టళ్లు గురుకులాల్లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులు మారుతున్న ప్రపంచ పోటీని ఎదుర్కొనేందుకు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డైరెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ టెన్త్, ఇంటర్లో బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులు ఈ ఏడాది గణనీయమైన ఫలితాలను సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంజేపీ కార్యదర్శి మాధవీ లత, అడిషనల్ డైరెకటర్ చంద్రశేఖరరాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పేరేపి ఈశ్వర్, వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు పాల్గొన్నారు. పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -
విధ్వంసం నుంచి వేడుక
వన్టౌన్(విజయవాడపశ్చిమ): అభివృద్ధి పేరుతో ఆలయాలను ధ్వంసం చేసి చెత్త బండిలో విగ్రహాలను తరలించిన హిందూ ద్రోహులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీతమ్మవారి పాదాల వద్ద గల శ్రీ దక్షిణ ఆంజనేయ స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించిన వెలంపల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణుతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ ముఖ ఆంజనేయస్వామి దేవాలయం ఇక్కడ దశాబ్దాలుగా వెలిసి ఉందన్నారు. కానీ 2014–2019 మధ్య అధికారంలో ఉన్న నాటి కూటమి ప్రభుత్వం కృష్ణా పుష్కరాల వంకతో ఈ దేవాలయాన్ని అత్యంత దుర్మార్గంగా కూల్చివేసిందన్నారు. కనీసం శాస్త్రోక్తంగా వైధిక పనులు చేయకుండా, స్వామి వారి విగ్రహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చెత్తబండిలో వేసి తరలించిన తీరు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందన్నారు. వైఎస్ జగన్ చొరవతోనే.. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారిందన్నారు. చంద్రబాబు హయాంలో కూల్చివేతకు గురైన ఆల యాలన్నింటినీ జగన్ పునర్నిర్మించారన్నారు. ఫలితంగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంత మంది భక్తులు ఇక్కడ స్వామి వారిని కొలుచుకుంటున్నారంటే అది కేవలం జగన్మోహన్రెడ్డి భక్తి, ధర్మంపై ఆయనకున్న గౌరవం వల్లనే సాధ్యమైందన్నారు. -
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. పేలిన గ్యాస్ సిలిండర్
విజయవాడ: పటమట ప్రత్యూష అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడో అంతస్తులో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఫైర్ అయిన సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ గోడ కూలింది. దీంతో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఎగిసి పడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ అపార్ట్మెంట్లోని 302 ఫ్లాట్లో ఏసీపీ సత్యానందం (1991 బ్యాచ్) నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వీఆర్లో ఉన్నారు. కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. -
ఎన్హెచ్ఎం ఉద్యోగుల ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రేషనలైజేషన్ పేరుతో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు నష్టం చేసే నిర్ణయాలు మానుకోవాలని ఏపీ ఎన్హెచ్ఎం జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్ నందు ఏపీ నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఎన్హెచ్ఎం ఉద్యోగులు ధర్నాకు తరలివచ్చారు. ధర్నా నుద్దేశించి జేఏసీ చైర్మన్ దయామణి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల పెండింగ్ వార్షిక ఇంక్రిమెంట్స్ వెంటనే విడుదల చేయాలన్నారు. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్లియర్ వేకెన్సీలు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62ఏళ్లకు పెంచాలని, బెనిఫిట్స్ అమలు చేయాలన్నారు. ధర్నాలో కన్వీనర్ ప్రభాకరరెడ్డి, కోశాధికారి జే సింహాచలం, ఎన్హెచ్ఎం ఉద్యోగులు పాల్గొన్నారు. -
బడి పిలుస్తోంది.. ప్రచార రథం ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘బడి పిలుస్తోంది’ పేరిట విద్యాశాఖ రూపొందించిన ప్రచార చైతన్య రథాన్ని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ప్రారంభించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ చైతన్య రథం ద్వారా జిల్లాలో ఈనెల 30వరకు ఒక్కో మండలంలో ఒక్కో రోజు చొప్పున బడి పిలుస్తోంది కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. బడి ఈడు పిల్లలు పాఠశాలలో చేరేలా చూడాలన్నారు. డీఈవో ఎల్.చంద్రకళ, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.రమేష్బాబు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
● జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో కలెక్టర్ లక్ష్మీశ ● ప్రజల నుంచి 160 అర్జీలు స్వీకరణ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు ప్రజల నుంచి 160 అర్జీలు అందాయని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. మొత్తం 160అర్జీలు అందాయని .. వీటిలో రెవెన్యూకి 40, పోలీస్ 23, ఎంఏయూడీ 28, పంచాయతీరాజ్ 10, వైద్య ఆరోగ్యం 8, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు 6, విద్యుత్ 5, డీఆర్డీఏ 4, ఏపీఎస్ ఆర్టీసీ 4, విద్య 4, పౌర సరఫరాలు 3, రవాణా 2, ఎస్సీ కార్పొరేషన్ 2, విభిన్న ప్రతిభావంతులు 2, మార్కెటింగ్ 2, డ్వామా 2, హౌసింగ్ 2, మత్స్య 2, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, మైన్స్, ఉపాధి, సమాచార పౌర సంబంధాలు, ఇరిగేషన్, కార్మిక, దేవదాయ, బ్యాంకింగ్కు సంబంధించి ఒక్కో అర్జీ వచ్చినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల అక్రమాలను అరికట్టి, రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించింది. నాణ్యత సాకుతో క్వింటాకు ప్రభుత్వ నిబంధనల కంటే ఎక్కువ మొత్తంలో తరుగు తీసుకోవడం అన్యాయమన్నారు. అధికారులు మిల్లర్లు కుమ్మకై ్క రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని అర్జీలో పేర్కొన్నారు. అర్జీ ఇచ్చిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య, ఎన్టీఆర్ జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బుడ్డి రమేష్, రైతులు చెరుకూరు కుటుంబరావు, తాటికొండ రమేష్, చెరుకూరి ఫణీంద్ర తదితరులు ఉన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4623 టీఎంసీలు. 718న దుర్గమ్మ హుండీ కానుకల లెక్కింపు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కులు, ముడుపులను 18వ తేదీన లెక్కించనున్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఆరోజు ఉదయం ఏడు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొనున్నారని తెలిపారు. కానుకల లెక్కింపు నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీ హనుమత్ దీక్షా పీఠంలో శ్రీ వీరాంజ నేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. చిలకలపూడి: కృష్ణాజిల్లా రవాణా అధికారిగా నియమితులైన షేక్ సలాం యాకూబ్ కలెక్టర్ డీకే బాలాజీని కలెక్టరేట్లో సోమ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఓ మంత్రితో ఎమ్మెల్యేలకు కొరవడిన సఖ్యత పార్లమెంటు ముఖ్యనేతతోనూ అదేతీరు కృష్ణాజిల్లా ప్రజా ప్రతినిధులపై చంద్రబాబు ఆగ్రహం సీటు మార్చడానికైనా వెనకాడనని లీకులు -
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి
● రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ● కృష్ణాజిల్లా కంకిపాడు, ఆత్కూరు పోలీసుస్టేషన్ భవనాల ప్రారంభం కంకిపాడు/గన్నవరం: శాంతి భద్రతల పరిరక్షణకు, మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో రూ.2.75 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని, ఉంగుటూరు మండలం ఆత్కూరులో రూ.1.40 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాలను, ఆత్కూరులో రూ.1.20 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డు, కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఐపీ ఆధారిత కెమెరాలను సోమవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ప్రారంభించారు. ఆయా చోట్ల జరిగిన సభల్లో హోం మంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యం.. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, పటిష్టంగా పోలీసింగ్ వ్యవస్థను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం కంకిపాడు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణంలో కీలక పాత్ర వహించిన కోఆర్డినేటర్ తుమ్మలపల్లి హరికృష్ణను హోం మంత్రి ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఐజీపీ అశోక్కుమార్, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
హనుమాన్జంక్షన్ రూరల్: ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఐదో రోజైన సోమవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకు లు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, శృంగారం వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నవకలశ స్నపన, శాంతి హోమం, సిందూర అర్చన జరిగాయి. ఆధ్యాత్మిక వేదికపై భక్తి సంకీర్తన చేశారు. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు, నక్షత్ర హారతి వైభవంగా నిర్వహించారు. అనంతరం కళావేదికపై ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అబ్బురపర్చాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు, ఆలయ పాలకమండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
తిరువూరు: డ్వాక్రా మహిళలు, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసగిస్తున్న అంతర్ జిల్లా నేరస్తుడిని తిరువూరు పోలీసులు సోమ వారం అరెస్టు చేశారు. తిరువూరు సీఐ గిరిబాబు కథనం మేరకు.. ఈ నెల ఐదో తిరువూరు రాజుపేట స్టేట్ బ్యాంకు శాఖకు డ్వాక్రా మహిళల రుణ వాయిదాలు, పొదుపు నగదు జమ చేయడానికి వచ్చారు. ఆ సమయంలో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదులకు చెందిన షేక్ నాగూర్మీరావలీ వారితో తాను బ్యాంకు ఉద్యోగినని పరిచయం చేసుకుని మోసపూరిత మాటలతో నగదు తస్కరించాడు. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి నగదు తీసుకుని ఖాతాలో జమ చేస్తానని నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ రబ్బరు స్టాంపులు, సంతకాలతో రూ.93 వేల నగదు కాజేశాడు. తరువాత తమ బ్యాంక్ ఖాతాలో నగదు జమకాలేదని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన తిరువూరు ఎస్ఐ శాతకర్ణి సోమవారం తిరువూరు ఆర్టీసీ బస్టాండులో నిందితుడిని అరెస్టు చేసి రూ.1.52 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నాగూర్ మీరావలీ ఆర్థికమోసాలకు పాల్పడగా 38 కేసులు నమోదయ్యాయి. నిందితుడిని తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ గిరిబాబు తెలిపారు. -
ఆహ్లాదం.. ఆధ్యాత్మికం
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నియోజకవర్గంతో ప్రముఖ వేసవి దర్శనీయ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కళాత్మకంగా కనిపించే ఎన్నో ఆలయాలు పచ్చదనం పరుచుకున్న ప్రకృతి నడుమ కొలువు దీరి ఆధ్యాత్మికతను, ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ నిత్యం ఉత్సవాలతో ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. భక్తుల సౌకర్యార్థ్యం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముక్తేశ్వరుని సన్నిధి ముక్త్యాల జగ్గయ్యపేటకు పది కిలో మీటర్ల దూరంలో ముక్త్యాల పుణ్య క్షేత్రం ఉంది. ఇక్కడ శ్రీభవానీ ముక్తేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఆలయం పక్కనే ముక్త్యాల రాజా వారి కోట ఉంది. కృష్ణానది ఇక్కడ ఉత్తర వాహినిగా ప్రవహించటం వల్ల ఈ ప్రదేశం పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకోటిలింగ హరిహర క్షేత్రం జగ్గయ్యపేటకు పది కిలో మీటర్ల దూరంలో ముక్త్యాలకు సమీపంలో శ్రీకోటిలింగ హరిహర క్షేత్రం ఉంది. ప్రధానాలయంలో పంచముఖ అమృతలింగేశ్వరస్వామి కొలుదీరి ఉంటారు. చుట్టూ శివలింగాలు ప్రతిష్ఠ జరుగుతోంది. ప్రధాన ఆలయం చుట్టూ ఎందరో దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. భక్తుల కొంగుబంగారం శ్రీతిరుపతమ్మ విజయవాడకు 60 కిలోమీటర్లు, జగ్గయ్యపేట, నందిగామకు 15 కిలోమీటర్లు దూరంలో పెనుగంచిప్రోలులో శ్రీతిరుపతమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగా రంలా విరాజిల్లుతోంది. జిల్లాలో విజయవాడలోని శ్రీకనకదుర్గమ్మవారి ఆలయం తరువాత రెండో స్థానంలో ఉంది. ఆలయం పక్కన మునేరు, చుట్టూ మామిడి తోటలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతాయి. భక్తులకు వసతి సదుపాయాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. -
477 విద్యుత్ సర్వీసులకు రూ.14.63 లక్షలు జరిమానా
కంచికచర్ల: కంచికచర్ల సెక్షన్లో విద్యుత్ వినియోగదారుల గృహాలు, వాణిజ్య సముదాయాలపై సోమ వారం విద్యుత్శాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం స్థానిక ఓసీ కల్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో విజిలెన్స్ శాఖ ఈఈ పి.విజయకుమారి మాట్లాడుతూ.. తాను, విజయవాడ రూరల్ ఈఈ టి.రవిచంద్ర, డీఈఈ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 41 బృందాలుగా ఏర్పడి 469 గృహ సర్వీసులు, ఎనిమిది వాణిజ్య సర్వీసుల సముదాయాలను తనిఖీ చేశామన్నారు. 477 సర్వీసులకు సంబంధించి అదనపు లోడ్ 665 కేవీ విద్యుత్ను చౌర్యం చేసి వినియోగించినట్లు గుర్తించి, బాధ్యులకు రూ.14.63 లక్షల జరిమానా విధించామని తెలిపారు. విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని, ఇందుకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగినట్లు గుర్తిస్తే 83310 14951, 83310 20537 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కంచికచర్ల ఏఈబీ, ఏఈలు, లైన్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. చల్లపల్లి: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని వక్కలగడ్డ ఐదో నంబర్ కాలువ వద్ద చల్లపల్లి–పామర్రు ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. చల్లపల్లి నారాయణరావునగర్కు చెందిన 70 ఏళ్ల పాస్టర్ కె.రాజేంద్ర ప్రసాద్ ద్విచక్రవాహనంపై దళితవాడ నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన యువకుడు అనిల్ బైక్పై చల్లపల్లి నుంచి వక్కలగడ్డ వైపు వెళ్తున్న క్రమంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. రాజేంద్రప్రసాద్కు కాలు విరిగి తలకు బలమైన గాయమైంది. అనిల్కు కూడా గాయాలయ్యాయి. చల్లపల్లి 108 ఈఎంటీ దాసి బసవరాజు, పైలెట్ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన చల్ల పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాస్టర్ రాజేంద్రప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. కొంతసేపటి తరువాత అనిల్ను కూడా మరొక అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రేమాలవారిపాలెం (నాగాయ లంక): స్థానిక వంతెన సెంటర్ లోని శ్రీఅభయాంజనేయ దేవస్థానంలో స్వామివారికి సోమ వారం రజత కవచ మహోత్సవం వైభవంగా జరిగింది. రేమాలవారిపాలెంనకు చెందిన గుడి కోటేశ్వరరావు – రత్నమంజుల, రాంబాబు – కృష్ణకుమారి స్వామికి 20 కిలోల వెండితో ఏడు అడుగుల కవచం సమర్పించిన నేపథ్యంలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా దాతల నేతృత్వంలో తొలుత వంతెన సెంటర్ నుంచి కవచ మహోత్సవ ఊరేగింపు నిర్వహించారు. కేరళ సంప్రదాయ చండీ మేళ తాళాలు, ఆధ్యాత్మిక కోలాట బృందాలతో భక్తులు నాగాయలంక ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. అనంతరం స్వామి విగ్రహానికి రజత కవచం సమర్పించి విశేషపూజ చేశారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. -
ఒకే కుటుంబంలో ముగ్గురికి గిన్నిస్ రికార్డు
పెనమలూరు: మండలంలోని కానూరుకు చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు గిన్నిస్వరల్డ్ రికార్డు సాధించారు. గత ఫిబ్రవరి రెండో తేదీన హైదరాబాద్లో 22 దేశాల నుంచి రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్యకారులు గంటపాటు కీబోర్డు ప్లే చేశారు. విజయవాడలోని హెల్లెల్ మ్యూజిక్ స్కూల్లో శిక్షణ పొందిన కానూరుకు చెందిన దంపతులు పాతూరి సురేష్బాబు, స్వర్ణలత తమ కుమార్తె షయాఫేత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ఎంపికయ్యారు. హెల్లెల్ మ్యూజికల్ స్కూల్లో రెండు రోజుల క్రితం జరిగిన కార్యక్రమంలో వారికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోమవా రం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో ప్రజల నుంచి 78 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి ప్రజలనుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలు తెలుసుకుని, సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి తగాదాలపై 46, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై ఐదు, మోసాలపై రెండు, మహిళా సంబంధిత నేరాలపై ఏడు, దొంగతనాలపై ఒకటి, ఇతర సమస్యలపై 17 ఫిర్యాదులు అందాయి. వ్యక్తి అనుమానాస్పద మృతి ఘంటసాల: మండలంలోని ఘంటసాలపాలెం గ్రామంలో ఓ వ్యక్తి సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్ఐ వేమన చందన కథనం మేరకు.. బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం ముల్పూరు గ్రామానికి చెందిన ఇంటూరి రమేష్ (42) ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వారు ఘంటసాలపాలెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం రమేష్తో సహజీవనం చేస్తున్న మహిళ అనారోగ్యం బారిన ఊపడి చిట్టూర్పు గ్రామానికి వెళ్లింది. రమేష్ ఒక్కడే ఇంటిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతను సోమవారం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. -
కొత్త ఆవిష్కరణలకు ముందుకు రావాలి
రామవరప్పాడు: సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు యువత, విద్యార్థులు ముందుకు రావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సోమ వారం ప్రాజెక్ట్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్ట్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి ప్రతిభ, పరిశోధనా దృక్పథం, సృజనాత్మక ఆలోచనలను అభినందించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. విద్యార్థులు పరిశోధనాత్మక దృష్టి అలవరుచుకుని దేశాభివృద్ధికి ఉపయోగపడేలా నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, స్మార్ట్ టెక్నాలజీస్, స్మార్ట్ హోమ్ సిస్టమ్స్, ఆటో మేటిక్ కంట్రోల్ మోడల్స్ వంటి ఆధునిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బి.ఎస్.అప్పారావు, సెక్రటరి శ్రీకృష్ణ, ప్రిన్సిపాల్ చైతన్య, జిల్లా యువజన సర్వీసుల అధికారి కొల్లెటి రమేష్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. చెస్ క్రీడాకారిణి రేణుకకు అభినందన మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని స్కౌట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గత నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన ఫిడే అర్బిటర్ ఎగ్జామ్లో ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న పోలదాస్ రేణుక క్వాలిఫై అయ్యి ఫిడే అర్బిటర్ టైటిల్ సొంతం చేసుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో రేణుకను సోమ వారం అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ పాషా మాట్లాడుతూ.. దేశం మొత్తం మీద వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 19 మంది ఈ పరీక్షకు హాజరవగా తొమ్మిది మంది మాత్రమే ఆర్బిటర్ టైటిల్కు అర్హత సాధించారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గోలి వేణు, కృష్ణా జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ ఎం.దివ్యతో పాటు పలువురు చెస్ క్రీడాకారులు పి.రేణుకను అభినందించారు. -
యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
రామవరప్పాడు: సరికొత్త ఆవిష్కరణల రూపకల్పన దిశగా యువ పారిశ్రామికవేత్తలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్)లో సోమవారం జిల్లా అధికార యంత్రాంగం, ఆర్టీఐహెచ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన టెక్ ట్రిక్స్ –2026ను ఆ సంస్థ సీఈఓ జి.కృష్ణన్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్ ట్రిక్స్ –2026 యువ పారిశ్రామికవేత్తలకు సువర్ణావకాశంగా నిలుస్తోందన్నారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రోత్సహించే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతలో సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా ఈ తరహా వేదికలు దోహదపడతాయన్నారు. ఆర్టీఐహెచ్ ద్వారా 500 వరకు స్టార్టప్లకు చేయూత ఇచ్చామని తెలిపారు. ఉత్తమ స్టార్టప్లుగా నిలిచిన వారికి వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు చొప్పున నగదు బహుమతులను ప్రకటించినట్లు వెల్లడించారు. టెక్ ట్రిక్స్ స్టార్టప్ ఎక్స్పోలో దాదాపు 120 స్టార్టప్ల ప్రదర్శన యువ మేధస్సుకు ప్రతిరూపాలుగా నిలిచాయన్నారు. చిన్నారుల్లో సులువుగా అభ్యసన నైపుణ్యాలు పెంపొందించే ఈసీ స్లేట్ డీప్ ల్యూర్, సేంద్రియ సాగుకు ఉపయోగపడే డబుల్ పవన్ పంప్సెట్ స్ప్రేయర్, అడ్వాన్స్డ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ టెక్నాలజీ, హైడ్రాలిక్ లిఫ్ట్, జెన్ సైన్స్ వంటి సంస్థలు, స్టార్టప్ల ప్రదర్శన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, సందర్శకులను ఆకట్టు కున్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ ఎ.ఎన్. వి.నాంచారరావు, జిల్లా యువజన సంక్షేమ అధి కారి కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
వైభవంగా వీరాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): హనుమాన్ దీక్షను ఆచరించడంతో పాటు హనుమాన్ చాలీసా పఠనం ద్వారా శక్తి, యుక్తి, కార్యసామర్థ్యాలను పెంపొందించుకుని దేశం, ధర్మం కోసం పని చేయాలని త్రిదండి చినజీయర్ స్వామిజీ సూచించారు. పాలప్రాజెక్టు ఎదుట ఉన్న శ్రీ హనుమత్ దీక్షా పీఠంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిస్ఠ, కుంభాభిషేకం మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పీఠాధి పతి దుర్గాప్రసాద్ స్వామిజీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా త్రిదండి చినజీయర్ స్వామిజీ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు, తెలంగాణ మాజీ మంత్రి హరీష్రావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, బీజీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు. తొలుత పీఠంలోని ప్రధాన ఆలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠను త్రిదండి చినజీయర్ స్వామి, దుర్గాప్రసాద్ స్వామిజీ నిర్వహించారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఆలయం సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల ఆవరణలో ప్రత్యేక హోమాలు, యాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంపై భాగంలో కలశస్థాపన, కుంభాషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రిదండి చిన జీయర్ స్వామి భక్తలకు అనుగ్రహ భాషణం చేశారు. హనుమంతుడి ఆవిర్భావం, విశిష్టతతో పాటు ఆయన మహిమలు, రామాయణంలో ధర్మరక్షణ కోసం హనుమంతుడు చూపిన శక్తి, యుక్తులు, కార్యసిద్ధిని త్రిదండి చినజీయర్ స్వామిజీ భక్తులకు వివరించారు. దుర్గాప్రసాద్ స్వామిజీ మాట్లాడుతూ.. 1912లో ప్రారంభమైన హనుమత్ దీక్ష పీఠం 2026 నాటికి వైభవంగా అభివృద్ధి చెందిందన్నారు. త్రిదండి శ్రీమన్నారాయణ దేవనాథ జీయర్, కమలానంద భారతీ స్వామి, హైదరాబాద్కు చెందిన సాయికుమార్ బాబాజీతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి హనుమత్ దీక్షను స్వీకరించిన పలువురు భక్తులు, ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. -
ఆరోగ్యంతో సెల్గాటం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జీవితంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. గడిచిన సమయంలో ఒక్క సెకను కూడా తిరిగిరాదు. నేడు విద్యార్థులు, యువత, పెద్దలు, ఉద్యోగులు ఇలా ఒక్కరేంటి అందరూ ఎక్కువ సేపు సెల్ఫోన్లు చూస్తూ కాలం గడిపేస్తున్నారు. ఇలా తమకు తెలియకుండానే జీవితంలో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అంతే కాదు అనేక రకాల శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగ్గుతున్న అన్యోన్యత స్మార్ట్ ఫోన్ల దెబ్బకి మనుషుల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్లు, టీవీ చూస్తూ కాలం గడిపేస్తున్నారు. పిల్లలే కాదు పెద్దవాళ్లు, భార్యాభర్తలు ఇద్దరూ చేరోవైపు కూర్చుని ఖాళీ దొరికితే చాలు ఫోన్ తీసుకుని రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీంతో తల్లిదండ్రులు, పిల్లల మధ్య అన్యోన్యత దెబ్బతింటోందని మానసిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. మానసిక సమస్యలు ఇలా.. అనారోగ్య సమస్యలు ఇలా.. .. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ క్లినిక్ కూడా జరుగుతుందని పేర్కొన్నారు.ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. దాతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.వన్టౌన్(విజయవాడపశ్చిమ): వాణిజ్య పన్నుల శాఖకు విజయవాడ రైల్వేస్టేషన్ కల్పతరువైంది. ఆ శాఖ సిబ్బంది అవినీతికి అడ్డాగా మారింది. దేశంలోనే కీలక రైల్వేస్టేషన్ ‘విజయవాడ’లో సరుకుల దిగుమతి ఎగుమతులు భారీగా జరుగుతుంటాయి. వాటిలో అనధికార లావాదేవీలే అధికంగా ఉంటాయి. వాటి రాకపోకలు వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి వరంగా మారుతున్నాయి. నిత్యం కోట్లాది రూపాయల సరుకు ఇక్కడ దిగుమతి కావటంతో పాటుగా ఎగుమతి సైతం జరుగుతుంటాయి. ఆ సరుకుపై కన్నేసి అందినకాడికి దండుకోవడం వాణిజ్య పన్నుల శాఖ సిబ్బందికి అలవాటుగా మారిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇక్కడ అనధికార విధులు నిర్వహించే సిబ్బంది ద్వారా మొత్తం ఆ శాఖకు సంబంధించిన వారందరికీ వాటాలు అందుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సిబ్బందికి కల్పతరువు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి గవర్నరుపేట సర్కిల్ కార్యాలయం పరిధిలో రైల్వేస్టేషన్ ప్రాంతం ఉంటుంది. ఈ సర్కిల్లో బాధ్యతలు నిర్వహించే అందరికీ ఈ రైల్వేస్టేషన్పై మంచి పట్టు ఉంటుందని ఆ శాఖ సిబ్బంది చెబుతుంటారు. ఏ సమయంలో ఏఏ రైలులో సరుకులు వస్తుంటాయనేది వారికి బాగా తెలిసి ఉంటుందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్త్రాలు అధికంగా వస్తుంటాయి. ఆయా సమయాల్లో రైల్వేస్టేషన్లో కాపు కాసి అందినకాడికి దండుకోవటం పరిపాటైందని వన్టౌన్కు చెందిన వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు ఇటీవల ఏసీబీ దాడుల్లో చిక్కిన గవర్నరుపేట సర్కిల్లో పని చేసే కొండపల్లి శ్రీనివాసరావుకు రైల్వే స్టేషన్, దాని పరిసర ప్రాంతాలే అడ్డాగా ఉన్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అతని ఇల్లు రైల్వేస్టేషన్కు సమీపంలో ఉండటంతో నిత్యం అనధికారక విధులు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడుతుంటాడని వ్యాపార వర్గాలు వివరిస్తున్నాయి. కొండపల్లికి అండగా ఇతర అధికారులు పని చేస్తుంటారని దీంతో ధైర్యంగా వాహనాలను నిలిపి అనధికారిక తనిఖీలు నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు లేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నెల రోజులు డ్యూటీలు వేసినా ఆ శాఖకు రూపాయి ఆదాయం రాని వైనం ఏటా సంక్రాంతి పర్వదినానికి ముందు నెల రోజుల పాటు రైల్వేస్టేషన్ ద్వారా నగరానికి భారీగా వస్త్ర వ్యాపారానికి సంబంధించిన సరుకు వస్తుంటుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సరుకు అధికంగా వస్తుంటుంది. వన్టౌన్లో సుమారు వెయ్యికి పైగా ఉన్న వివిధ వస్త్ర దుకాణాలకు చాలా సరుకు స్టేషన్ ద్వారా చేరుతుంటుంది. అధికారులు కాపలా ఒకవైపు ఉంటే మరోవైపు సరుకు బయటకు వెళ్లిపోతుంటుంది. దీనిపై వార్తలు వస్తుండటంతో వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు గడిచిన రెండేళ్లుగా అక్కడ ఆ నెల రోజులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఒక్క రూపాయి సైతం పట్టుకున్న దాఖలాలు లేవు. కానీ సిబ్బంది జేబులు భారీగా నిండాయనే ఆరోపణలు మాత్రం బలంగా ఉన్నాయి. రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించే వాణిజ్య పన్నుల శాఖ సిబ్బంది ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రైల్వేస్టేషన్ పరిసరాల్లో తనిఖీలు చేసేందుకు రైల్వే అధికారులు అంగీకరించడం లేదనే సాకుతో ప్రభు త్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు రైల్వేశాఖ అధికారులకు లేఖ రాయడం, రైల్వే సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తున్నారు. కానీ స్టేషన్ ప్రాంగణం నుంచి బయటకు వచ్చే సరుకును మాత్రం ఇప్పటి వరకూ పెద్దగా చూపించిన దాఖలాలు లేవని తెలిసింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.9640 టీఎంసీలు. రైల్వేస్టేషన్ ద్వారా బయటకు వస్తున్న సరుకును గుర్తించి సకాలంలో తనిఖీలు నిర్వహిస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ దిశగా సిబ్బంది తీరును మార్చడానికి ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, అవినీతి వసూళ్లలో వాటాలు అందడంతో ఇటీవల అవినీతి సిబ్బంది పుట్టుకొస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దీనికి పటిష్ట చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆందోళనకరంగా శ్వాసకోశ వ్యాధులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): వాయు కాలుష్యం, వాతావరణ మార్పులతో అలెర్జీ కారకాలు, ఓజోన్లో మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ వంటివి దీర్ఘకాలిక ఊపిరి తిత్తుల వ్యాధులకు దారితీస్తున్నట్లు పలువురు పల్మోనాలజిస్టులు పేర్కొన్నారు. వ్యాధులను నిర్ధారించడంలో జాప్యం జరగడంతో ముఖ్యంగా సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డీసీజ్) ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో ఆదివారం ఏరోఫోర్స్ సంస్థ ఆధ్వర్యాన ఏరోకాన్ పేరుతో పల్మోనాలజిస్టుల సదస్సు జరిగింది. 250 మంది వరకు స్పెషాలిటీ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై శాసీ్త్రయమైన చర్చలు జరిగాయి. ఏరోకాన్ కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కె.అనీల్కుమార్ మాట్లాడుతూ వ్యాధిని ముందుగానే గుర్తించడానికి, నిర్వహణకు పలు సూచనలు చేశారు. రోగులు ప్రతిరోజూ మెరుగ్గా శ్వాస తీసుకోవడానికి అవగాహన, నిరంతర వైద్య విద్య ప్రాముఖ్యాన్ని వివరించారు. సదస్సులో నూతన పరిశోధనలు, చికిత్స ఫలితాలు వంటి వాటిని విశ్లేషించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యాణార్థం దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ జరిగింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవను నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. కోనేరుసెంటర్: కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన ప్రతి సోమవారం నిర్వ హించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు తెలిపారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ప్రజలు సమస్యలను ఫిర్యాదుల రూపంలో అందజేయవచ్చని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతుందని పేర్కొన్నారు. మీ కోసంలో అందిన ప్రతి అర్జీని చట్ట పరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. గుడ్లవల్లేరు: భూ సమేత శ్రీ వేంకటేశ్వరాలయంలో స్వామివార్ల ఉత్సవ మూర్తులకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ పండితులు కనులపండువగా ఊంజల సేవను చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పల్లకీ సేవను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు తదితరులు ఉన్నారు. -
వసూళ్ల రాజ్యం!
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేస్తూ ఇద్దరు ఉద్యోగులు జోరుగా వసూళ్లు చేస్తున్నారు. ఏళ్లుగా అక్కడే తిష్ట వేసి అవినీతి బాగోతం నడుపుతున్నారు. అదెక్కడంటే బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో అవనిగడ్డ పంచాయతీ. దానిలో ఇద్దరు ఉద్యోగులు వసూల్ రాజాలుగా మారారు. పంచాయతీ పరిధిలో సుమారు 10 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. వారికి ఎంతో కొంత ముట్టచెప్పనిదే పని జరగదని అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నేళ్లయినా ఇక్కడే విధులు నిర్వహించడం చూస్తుంటే వీరి వసూళ్ల పర్వం ఎంత మేర జరుగుతోందో అని ప్రజలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. జలజీవన్ మిషన్ ద్వారా అధిక వసూళ్లు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ పథకానికి జిల్లాలో అవనిగడ్డ పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇది పంచాయతీలోని ఇద్దరు కీలక ఉద్యోగులకు పాడికుండలా మారింది. జలజీవన్మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమైతే వీరికి మాత్రం వసూళ్ల పర్వానికి ఉపయోగపడింది. కుళాయి కనెక్షన్ కోసం ఒక్కొక్క ఇంటికి రూ. 20 వేలు వసూలు చేసినట్లు ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఇలా పంచాయతీ పరిధిలో 1,465 కనెక్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా భారీ మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం. షాపుల కేటాయింపులోనూ చేతివాటం అవనిగడ్డ పంచాయతీ పరిధిలో 40 షాపులు ఉన్నాయి. మూడేళ్లకొకసారి వాటికి బహిరంగ వేలం నిర్వహించి అధిక మొత్తంలో పాడుకున్న వారికి షాపును అప్పగించాలనే నిబంధన ఉంది. వీరు చేతివాటం చూపి ఒక్కొక్క షాపు నుంచి రూ. 50 వేలు వసూలు చేసి బహిరంగ వేలం నిర్వహించినట్లుగా రికార్డులు చూపి తిరిగి వారికే షాపులు కేటాయిస్తున్నారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇద్దరు షాపు యజమానులు రూ. 9 లక్షల పాత బకాయిలు ఉండగా వారికి పంచాయతీ నుంచి లీగల్ నోటీసులు పంపి వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ ఆదేశాల్లో కూడా కార్యదర్శి తన చేతివాటాన్ని ప్రదర్శించి వారి నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి ఎటువంటి బాకీ లేదని ధ్రువీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ ముఖ్యఅధికారి అయిన అతను విధి నిర్వహణలో ప్రతిభ కనపరచకపోయినా ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడంలో తనదైనశైలి చూపుతారనేది అక్కడి ప్రజలు బాహాటంగానే చెబుతున్నారు. 2019 నుంచి ఇక్కడే పనిచేస్తున్న ఈ అధికారి ఇటీవల నడకుదురు పంచాయతీకి బదిలీ అయినా ఉన్నతాధికారుల సహకారంతో డెప్యూటేషన్ వేయించుకుని ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారంటే ఏ మేరకు వసూళ్ల పర్వం జరుగుతుందోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏటా ఉన్నతాధికారులకు డబ్బులు ముట్టజెప్పడంతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కుమారుడికి కూడా నెలసరి వాటాలు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పంచాయతీ పరిధిలో ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ప్లాన్ అప్రూవల్ కోసం రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు వీరికి చెల్లించకుండా అనుమతులు రావనేది అక్కడి ప్రజల వాదన. పంచాయతీలో ఎవరైనా ముందుగా జూనియర్ అసిస్టెంట్ను కలిసి వారు అడిగిన సొమ్ము ముట్టజెప్పనిదే అక్కడ పని పూర్తికాదనేది అవనిగడ్డ ప్రజల వాదనగా వినపడుతోంది. ఈ జూనియర్ అసిస్టెంట్కు రెండేళ్ల క్రితం పదోన్నతి వచ్చినప్పటికీ వద్దని లేఖ కూడా అధికారులకు రాసి ఇచ్చారంటే ఏ విధంగా ఇక్కడకు విధులకు, వసూళ్ల పర్వానికి అంకితమైపోయారో తెలుస్తోంది. ఏదైనా ధ్రువీకరణ పత్రాల కోసం వెళితే ఉచితంగా ఇవ్వాల్సింది పోయి రూ. 500 ఇవ్వనిదే ఇచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా వసూళ్ల పర్వాన్ని పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న శానిటరీ ఇన్స్పెక్టర్ వీరిని తరచూ ప్రశ్నిస్తున్నారని అడ్డుతొలగించేందుకు కావాలనే ఇటీవల ఏసీబీ దాడి కూడా చేయించినట్లు తెలుస్తోంది. 20 వార్డులు ఉన్న అతి పెద్ద ఈ పంచాయతీలో వీరిద్దరూ చేస్తున్న వసూళ్ల పర్వానికి ఉన్నతాధికారులు ఇప్పటికై నా విచారణ చేసి వారికి అడ్డుకట్ట వేయాలని అవనిగడ్డ ప్రజలు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
పెనుగంచిప్రోలు: మండల పరిధిలోని తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో వెనక వస్తున్న ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేక లారీని వెనుకగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సు వెనుకగా వస్తున్న ఓ కారు కూడా అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. అయితే కారులో ఉన్న వారు క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం వల్ల రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు -
ముగ్గురు యువకులకు కత్తిపోట్లు
పెనమలూరు: మండలంలోని ణుకూరు గ్రామంలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. పెనమలూరు పోలీసుల కథనం మేరకు.. వణుకూరు గ్రామంలో శనివారం రాత్రి కుంతీమాత ఆలయం వద్ద కొక్కిలిగడ్డ అభిషేక్(19) తన స్నేహితులు పెనుమూడి పవన్కుమార్(19), కోవలి అభిషేక్(19)తో కలిసి బైక్పై గోసాలకు బయలుదేరారు. అదే గ్రామానికి చెందిన మంజిత్కుమార్ పాతకక్షల కారణంగా వారిని అడ్డుకున్నాడు. దీంతో వీరి మధ్య గొడవ మొదలయింది. మంజిత్కుమార్ కత్తితో కొక్కిలిగడ్డ అభిషేక్, పవన్కుమార్, కోవలి అభిషేక్పై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కత్తితో వారిని పొడిచాడు. స్థానికులు అడ్డుకోవటంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. మంజిత్కుమార్కు నేర చరిత్ర ఉంది. గాయపడిన ముగ్గురిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. గన్నవరం: మండలంలోని చిన్నఅవుటపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. విజయ వాడ నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆటో చినఅవుటపల్లిలోని పిన్నమనేసి సిద్ధార్థ వైద్య కళాశాల వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అవనిగడ్డ: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి విజయవాడలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. మోపిదేవి మండలం చిర్లపాలెంనకు చెందిన వంగలపాటి వెంకటేశ్వరరావు(37) కోడూరు శివారు ఐబీపేటలో శనివారం వంట చేసేందుకు వెళ్లాడు. అనంతరం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా, రామచంద్రపురం దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల వద్ద మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అడ్డు వచ్చాడు. అతడిని తప్పించబోయి అదుపు తప్పి బైక్ పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వెంకటేశ్వరరావు తలకు బలమైన గాయాల య్యాయి. అతడిని హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. అక్కడి నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగివున్న లారీని ఢీకొని టిప్పర్ డ్రైవర్ దుర్మరణం
గన్నవరం: మండలంలోని చిన్న ఆవుటపల్లి వద్ద వెస్ట్ బైపాస్పై ఆదివారం తెల్లవారుజామున ప్రమాదంలో టిప్పర్ లారీ డ్రైవర్ మృతి చెందాడు. ఆత్కూరు పోలీసుల కథనం మేరకు.. జి.కొండూరులోని వైఎస్సార్ కాలనీకి చెందిన నాగకృష్ణారావు (34) టిప్పర్ లారీ డ్రైవర్గా జీవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో టిప్పర్పై ఏలూరు నుంచి విజయవాడ వైపు బయలుదేరాడు. చిన్న ఆవుటపల్లి వెస్ట్ బైపాస్ వద్ద ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ప్రమాదవశాత్తు టిప్పరు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందు భాగం నుజునుజ్జయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ నాగకృష్ణారావు క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ నాగకృష్ణారావును అతికష్టం మీద బయటకు తీసి అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే నాగకృష్ణారావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
స్వరరాగ గంగా ప్రవాహం
విజయవాడ కల్చరల్: ఆకాశవాణి (ప్రసార భారతి) 90 వసంతాల వేడుకలను తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వృత్తిరిత్యా వైద్యరంగంలో ఉన్నా కర్నాటక సంగీతంలో విశేష కీర్తిని సొంతం చేసుకున్న సర్వేపల్లి సోదరీమణులు శ్రేయ, రాజ్యలక్ష్మి నిర్వహించిన గాత్ర కచేరి శృతి లయ సమ్మేళనంగా సాగింది. కొలువుమరేగద, బ్రహ్మమొక్కటే, సిద్ధి వినాయకం, రామచంద్రం భావయామి, కీర్తనలను ఆలపించారు. వీరికి రమ్యకిరణ్మయి వయోలిన్పై, అరవింద్ మృదంగంపై, జి.వెంకటేష్ మోర్సింగ్ పై సహకరించారు. జానపద కళారూపమైన గరగ నృత్యాలను పసుపులేటి అయ్యప్ప బృందం ప్రదర్శించింది. ఆకాశవాణి కేంద్రం నిర్వహించిన సంగీత, సాహిత్య, నృత్య, వ్యాస రచనల పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ఆకాశవాణి అధికారులు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ముఖ్య అతిథి ఆకాశవాణి డీడీ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి కేంద్రం 90 సంవత్సరాలుగా ప్రజలతో మమేకమై పనిచేస్తోందన్నారు. సంగీత, సాహిత్యం, నాటకాలతో ప్రతిభ కలిగిన వారికి అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రోగ్రామ్ హెడ్ దివ్య గుడిపూడి ఆకాశవాణి భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షుడు శరత్శ్చంద్ర, ఆకాశవాణి అధికారులు పలువురు పాల్గొన్నారు. లాకాశవాణిలో పనిచేస్తున్న వివిధ విభాగాల అధిపతులు, కార్యక్రమాల నిర్వాహకులు పాల్గొన్నారు. చింతా వెంకట్ బృందం పలు సంప్రదాయ కీర్తనలకు నృత్యాలను అభినయించారు. అంగరంగ వైభవంగా ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
విజయవాడ కల్చరల్: అన్నమయ్య సంక్తీనా గాన ప్రచార భక్త బృందం ఆధ్వర్యంలో 15 రోజులుగా నిర్వహిస్తున్న అన్నమయ్య 619 జయంతి వేడకలు వీనుల విందుగా సాగుతున్నాయి. సంకీర్తనా స్రవంతి కార్యక్రమాలను సత్యనారాయణ పురంలోని సీతారామా కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమంలో ఆచార్య పప్పు సదాశివశాస్త్రి, కర్నాటక సంగీత విద్వాంసుడు కస్తూరి గోపాలరావు నిర్వహించిన గాత్రయుగళం ప్రేక్షకులను భక్తపారవశ్యంలో ఓలలాడించింది. పలు అన్నమయ్య సంకీర్తనలను మధురంగా ఆలపించారు. అన్ని మంత్రములు, చాటెనిదియే, దేవ దేవం భజే, నారాయణతే నమోనమో, నానాటి బ్రతుకు నాటకము వంటి సంకీర్తనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకుడు సదాశివశాస్త్రి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా అన్నమయ్య సంకీర్తనలు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. -
చాత్తాద శ్రీ వైష్ణవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగాంధీనగర్(విజయవాడసెంట్రల్): చాత్తాద శ్రీ వైష్ణవుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.సత్యనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ విధమైన ప్రగతిలేని చాత్తాద శ్రీ వైష్ణవులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పై చిలుకు జనాభా ఉన్న చాత్తాద శ్రీవైష్ణవులు కుల వృత్తులు దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల పైచదువులు భారంగా మారాయన్నారు. బీసీ రిజర్వేషన్లు పెద్ద కులాల మాత్రమే అందిపుచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వం తమను విస్మరించిందన్న భావన కలుగుతోందన్నారు. ప్రభుత్వం స్పందించి విజయవాడ పరిసరాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, దేవాలయాల పాలకవర్గంలో, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో శ్రీరంగనాయక వేద విద్యాపీఠం గురువు టి.ఎం.సూరి, వైస్ ప్రెసిడెంట్ టి.వి.రమణ, జనరల్ సెక్రటరీ ఎం.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎస్.నమ్మయ్య, టి.నారాయణమూర్తి, కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ టి.శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ ఎం.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు పంపించాం
స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు చేసింది. అందులో భాగంగా మార్గదర్శకా లను అనుగుణంగా జిల్లాలో ఎన్ని సార్ట్ కిచెన్లు కావాలో ఆ మేర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాం. మండలానికి రెండు స్మార్ట్ కిచెన్లు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అవి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రారంభమవుతాయా అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశానుసారం మేం చర్యలు తీసుకుంటాం. –ఎల్ చంద్రకళ, డీఈఓ, ఎన్టీఆర్ జిల్లా -
వంట ఏజెన్సీలపై స్మార్ట్ పిడుగు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం వేడివేడి భోజనం వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై ప్రభుత్వం స్మార్ట్గా వేటువేస్తోంది. స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి ఉపాధికి గండికొట్టే చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా సుమారు మూడు వేల మంది వంట కార్మికులు, సహాయకులు పని చేస్తున్నారు. సుమారుగా 21 సంవత్సరాలుగా అమలవుతున్న ఈ పథకంలో అప్పటి నుంచి వంట ఏజెన్సీల పేరుతో వంట కార్మికులు, సహాయ కులు సేవలు అందిస్తున్నారు. నామమాత్రం ఆదాయం తోనే వారంతా ఈ భోజన పథకంలో భాగస్వాములు అవుతున్నారు. గతంలో కుక్లకు కేవలం వెయ్యి రూపాయల గౌరవ వేతనం అందేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వారి వేతనాన్ని అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేలకు పెంచి ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను రోడ్డుపాలు చేయడానికి కంకణం కట్టుకుందని వంట ఏజెన్సీల కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో 883 ప్రభుత్వ విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో సుమారుగా 81,821 మంది విద్యా ర్థులు చదువుతున్నారని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విద్యార్థులు అందరికీ ప్రస్తుతం వంట ఏజెన్సీలు మధ్యాహ్న భోజనాన్ని వండి వేడివేడిగా సకాలంలో వడ్డిస్తున్నాయి. అయితే స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 48 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నట్లు తెలిసింది. జిల్లాలో 20 మండలాలు ఉండగా, ఒకొక్క మండలానికి రెండు స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను బట్టి ఐదు మండలాల్లో మూడు చొప్పున, రెండు మండలాల్లో ఒకొక్కటి చొప్పున స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేసేందుకు ఆ ప్రతిపాదనల్లో పేర్కొనట్లు సమాచారం. ఈ స్మార్ట్ కిచెన్ల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక వేడి భోజనం దూరమే.. మండలంలో ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పాటు చేసే స్మార్ట్ కిచెన్ల ద్వారా మండలంలోని అన్ని పాఠశాలలకు భోజనం పంపిణీచేయాలి. ఫలితంగా పాఠశాలకు భోజనం చేరేసరికి చల్లారుతుంది. ఫలితంగా విద్యార్థులకు వేడి భోజనం దూరమవు తుంది. రాష్ట్రంలో విద్యారంగంపై కూటమి ప్రభుత్వం కక్ష్య కట్టిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రక్షాళన చేసిన విషయం తెలిసిందే. గోరుముద్ద పేరుతో ఆరు రోజులు అన్ని పోషకాలతో కూడిన భోజనం వేడివేడిగా వడ్డించేలా ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డొక్కా సీతమ్మ పేరు పెట్టినా ఆ పథకాన్ని నీరు గారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. -
ఉపాధిని దూరం చేస్తే సహించం
రాష్ట్రంలో సుమారు 21 ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అప్పటి నుంచి జిల్లాలో సుమారు మూడు వేల మంది వంట కార్మికులం పని చేస్తున్నాం. సకాలంలో బిల్లులు రాకున్నా అప్పులు తెచ్చి వంట చేసి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నాం. ఇప్పుడు స్మార్ట్ కిచెన్ల పేరుతో మమ్మల్ని రోడ్డుపాలు చేయటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వేలాది మంది పని చేస్తున్న ఈ వ్యవస్థను మార్చేస్తే ఎలా? దీనిపై వేలాది మందితో పోరాటం చేస్తాం. – ఎన్.సీహెచ్.సుప్రజ, ప్రధాన కార్యదర్శి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా -
స్టార్టప్లు పరిశ్రమల స్థాయికి ఎదగాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని, సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టరేట్లోని ఎ.వి.ఎస్.రెడ్డి హాల్లో అర్బన్ జిల్లా సమాఖ్య, ఫౌండర్స్ రూఫ్, వివిధ స్టార్టప్ల ప్రతినిధులతో కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మహిళల భద్రత, స్మార్ట్ వెహికల్ మేనేజ్మెంట్, ప్రొటీన్ ఇన్ఫ్యూజ్డ్ కాఫీ, డీహైడ్రేషన్, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ వంటి వివిధ భాగాల్లో స్టార్టప్లు ప్రారంభించిన యువతతో సమాలోచనలు చేశారు. జిల్లాలో స్టార్టప్ల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని సూచించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారాలు సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో ముందుకు సాగితే పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదుగుతాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలో ముందుకు సాగాలని యువతకు సూచించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో మార్కెటింగ్ విధానాలు వేగంగా మారుతున్నాయని, సోషల్ మీడియా, ఈ –కామర్స్ వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ లభిస్తుందని వివరించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ప్రభుత్వం అందిస్తున్న శిక్షణలు, ఆర్థిక సహాయం, ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడ కుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ కె.మీనాక్షి, ఎస్హెచ్జీ పారిశ్రామికవేత్తలు వాణి, మాధురి, కృష్ణవేణి, ఫౌండర్స్ రూఫ్ సారథులు విష్ణు, జగదీష్, వివిధ స్టార్టప్ల స్థాపకులు ఉజ్వల్ బొర్రా, విఠల్, సతీష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితం దయనీయం
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026బకాయిల భారం.. గ్రంథాలయ ఉద్యోగులకు వేతన కష్టాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.80 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. శనివారం పుట్ట గొడుగులపై అవగహన కార్యక్రమం నిర్వహించారు. ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడ బాలాజీనగర్కు చెందిన పడాల సింహాచలం, సుజాత దంపతులు శనివారం రూ.1,01,116 విరాళం సమర్పించారు. పీఆర్సీ, మధ్యంతర భృతి, పెండింగ్ డీఏలు, నెలనెలా వేతనాలపై హామీసాక్షి టాస్క్ఫోర్స్: ‘పీఆర్సీ లేదు. ఐఆర్ ప్రకటించనే లేదు. పెండింగ్ డీఏలు అతీ గతి లేవు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల ఊసు అంత కన్నా లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఎన్నికల సమయంలో ఉద్యో గులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. నెలనెలా క్రమం తప్పకుండా చెల్లించాల్సిన జీతాల కోసం కూడా ఉద్యోగులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి’.. ఇదీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్న పౌర గ్రంథాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితి. గ్రంథాలయ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదు. పెన్షనర్ల పరిస్థితీ అంతే. డిసెంబర్ జీతం ఫిబ్రవరిలో ఇచ్చారు. జనవరి నెల జీతం మే నెలలో చెల్లించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నెలల తరబడి జీతాల బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. క్రికెట్ మ్యాచ్లు చూడటానికి ప్రత్యేక విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్న మంత్రి లోకేష్ తన శాఖ పరిధిలో ఉన్న తమ అవస్థలను పట్టించుకోవడం లేదని గ్రంథాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఓ వైపు ఖజానా ఖాళీ అంటూనే మంత్రులు మాత్రం విదేశీ పర్యటనలు చేస్తున్నారని, తాము ఏ పాపం చేశామని జీతాలు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పేరుకుపోయిన సెస్ బకాయిలు గ్రంథాలయాలకు సెస్ రూపంలో, ప్రభుత్వ గ్రాంట్ రూపంలో నిధులు సమకూరుతాయి. స్థానిక సంస్థల నుంచి సెస్ రూపంలో వచ్చే ఆదాయంతో గ్రంథా లయ నిర్వహణ, కరెంట్, వాటర్ బిల్లులు, పుస్తకాలు, పేపర్ల కొనుగోలుకు వాడాల్సి ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేస్తుంది. సెస్ వసూలు కాక గ్రంథాలయాల నిర్వహణ కష్టంగా మారింది. సకాలంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాకపోవడంతో ఉద్యోగుల జీతాలు అందడం లేదు. మొత్తం రూ.80 కోట్ల పై చిలుకు సెస్ బకాయిలు పేరుకుపోయాయి. కొన్ని నెలలుగా కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు, పేపర్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్ప డింది. గ్రాంట్ విడుదల చేస్తే తమ జీతాలు వస్తాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. గ్రంథాలయాల్లో పనిచేసే కింది స్థాయి సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెస్ వసూళ్ల కోసం కాళ్లరిగేలా.. సెస్ వసూళ్లకు జీతాలతో లంకె పెట్టడంతో గ్రంథాలయ సిబ్బంది సెస్ వసూళ్ల కోసం పంచాయతీలు, మునిసిపల్ కార్యాలయాలు, కార్పొరేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. సెస్ వసూలు చేసుకోండి .. జీతాలు తీసుకోండి అన్న పద్ధతిలో ప్రభుత్వ తీరు ఉందని ఉద్యోగులు మండిపడుతున్నారు. జీతాలు సర్దుబాటు చేస్తోందే తప్ప పూర్తిగా ఇవ్వడం లేదంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలకు రూ.1.20 లక్షలు, ఔట్సోర్సింగ్కు రూ.13 లక్షల గ్రాంట్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇది ఒక నెల జీతాలకు కూడా సరిపోదని ఉద్యోగులు అంటున్నారు. బకాయి ఉన్న మూడు నెలల జీతాలు ఏక కాలంలో చెల్లించాలని కోరుతున్నారు. 7నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లాకు అభినందనలు కోనేరుసెంటర్(మచిలీపట్నం): నేరాల నియంత్రణలో కృష్ణాజిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు అందాయి. మహిళలపై జరిగే నేరాల నియంత్రణను అరికట్టడంతో పాటు శారీరక దాడులను నియంత్రించటంలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ప్రథమస్థానం నిలిచింది. సమగ్ర నేర నియంత్రణలో సైతం నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లా ఎస్పీలతో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఏడో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కృష్ణా జిల్లా పోలీసు శాఖను అభినందించినట్లు ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా, నేరాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన చర్యలు కారణంగా ఈ ఘనత దక్కిందని పేర్కొన్నారు. నిరంతర పర్యవేక్షణ, సమర్థమైన బీట్ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలతో విధులు నిర్వర్తించటం కారణంగా మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు. వీటితో పాటు ప్రజల సహకారం అందుకు తోడ్పడిందన్నారు. కృష్ణాజిల్లాకు ఇంతటి ఘనత వచ్చేందుకు కృషి చేసిన జిల్లా పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో సిబ్బంది తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలతో పాటు ప్రభుత్వ మన్ననలు పొందేందుకు పాటుపడాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 109 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్ 1– 8, గ్రేడ్ 2 – 18, గ్రేడ్ 3 – 33 ఉన్నాయి. ఇవి కాక రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో 50 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది మొత్తం 200 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం అందించే గ్రాంట్ ద్వారా నెల నెలా జీతాలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులకు డిసెంబర్ నెల వరకు జీతాలు చెల్లించారు. డిసెంబర్ నెల జీతాలు ఫిబ్రవరిలో పడ్డాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మూడు నెలల జీతాల బకాయి పడ్డాయి. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల్లో ఆందో ళన మొదలైంది. మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో గ్రంథాలయ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, వివిధ రుణాలకు చెల్లించాల్సిన ఈఎంఐలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి వైద్య ఖర్చులు, పెన్షనర్లకు మందులు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు లేక అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నాలుగేసి నెలలు జీతాలు చెల్లించకపోతే తాము జీవనం సాగించేది ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మేం జీతాల్లేక అవస్థలు పడుతుంటే... తమ శాఖను నిర్వహిస్తున్న నారా లోకేష్ మాత్రం ప్రత్యేక విమానాల్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ జల్సాలు చేస్తున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
అభయాంజనేయునికి విశేష పూజలు
హనుమాన్జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా హనుమాన్జంక్షన్లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్ధానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మూడో రోజు శనివారం దేవస్థానాన్ని, స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయం వద్ద బారులు తీరారు. ప్రధాన అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు, అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, వెంకట శేషారామాచార్యులు అంజనీపుత్రునికి ప్రభాత సేవ, 1008 లిల్లీ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. అధ్యాత్మిక వేదికపై రాధాకృష్ణ భజన మండలి (కొయ్యూరు) భక్త బృందం సభ్యులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. విజయదుర్గ కోలాట బృందం (శేరినరసన్నపాలెం) మహిళలు ఆలయం వద్ద ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం హనుమంతునికి బంగారు, వెండి పుష్పాలతో ప్రత్యేక పూజలు, నక్షత్ర హారతి వైభవంగా నిర్వహించారు. అనంతరం కళావేదికపై చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించింది. నవజ్యోతి కళామందిర్ (గోపన్నపాలెం) ఆధ్వర్యంలో ‘పంచ రత్నాలు’ పేరిట ప్రదర్శించిన పౌరాణిక నాటక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి పితాని తారకేశ్వరరావు, ఆలయ పాలకమండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అండర్–15 బాలికల క్రికెట్ టీమ్ ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో అండర్–15 బాలికల టీమ్ జట్టు ఎంపికలను శనివారం నిర్వహించామని కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రవీంద్రచౌదరి తెలిపారు. టీమ్ కెప్టెన్గా టి.సౌమ్య, సభ్యులుగా బి.కార్తిక, డి.షాలీనీచౌదరి, కె.అక్షయ, కె.మేఘన, ఆర్. లక్ష్మీప్రసన్న, పి.మోక్షశ్రీ, పి.లక్ష్మి లోహిత, ఆర్. తేజస్విని, కె.రుత్విక ఆరాధ్య, సీహెచ్.నిహారిక, ఆర్.వర్షిణి, కె.లాస్య, ఎన్.హరి ప్రియ, ఎం. ఆరాధ్య, స్టాడ్బైగా టి.సీహెచ్.దేవీచరణ్య, బి.గీతావర్షిణి, పి.హసీనా, ఎస్కే.ముస్కానా, డి.రిషిత, వి.కీర్తన, కోచ్గా ఎస్.రామ్కుమార్ను ఎంపిక చేశారు. యువ స్టార్టప్లకు ఆహ్వానం మధురానగర్(విజయవాడసెంట్రల్): జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ శాఖ సౌజన్యంతో స్టార్టప్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ సహా ఎక్స్పోలో పాల్గొనడానికి యువ స్టార్టప్లను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తమ స్టార్టప్ అవార్డులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రైజ్ మనీ ద్వారా ప్రోత్సహిస్తారని పేర్కొన్నారు. ఉత్తమ స్టార్టప్కు ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.20 వేలు, తృతీయ బహుమతిగా రూ.15 వేలు అందజేస్తామని వివరించారు. విజయవాడ జోన్లోని అన్ని స్టార్టప్లు ఈ నెల 11వ తేదీ ఉదయం పది గంటలకు ఎనికెపాడులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ సదవకాశాన్ని యువ స్టార్టప్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మానవ అక్రమ రవాణా కట్టడే లక్ష్యం లబ్బీపేట(విజయవాడతూర్పు): మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరీకి సంబంధించిన కారణాలు, మార్గాలు, దర్యాప్తులో అనుసరించాల్సిన నిర్దేశిత విధి విధానాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో శనివారం శిక్షణ కార్యక్రమం జరిగింది. డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఐజీ బి.రాజకుమారి, ఐజేఎం ప్రతినిధులు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణలో ఆయా నేరాలకు పాల్పడే వారికి శిక్ష పడేలా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గెడ్డం రాజేశ్వరరావు పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. సాంకేతికత ఆధారాలను గుర్తించడం, సంరక్షించడం, విశ్లేషించడం, వడాక్యుమెంట్ చేయడం వంటి వాటిని వివరించారు. ఆ సంఘటనలను పునర్నిర్మించడానికి, ప్రాసిక్యూషన్కు మద్దతు ఇవ్వడానికి చైన్ ఆఫ్ కస్టడీ, దర్యాప్తులో అనుసరించాల్సిన నిర్దేశిత విధివిధానాలపై అవగాహన కలిగించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ కేసులతో ప్రారంభం అవుతుందని, మిస్సింగ్ కేసులను ఉపేక్షించరాదని, వాటిని కట్టడి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, పలువురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, యాంటీ ట్రాఫికింగ్, శక్తి బృందాల బాధ్యులు పాల్గొన్నారు. ఫోన్ల రికవరీలో ద్వితీయ స్థానం లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రజలు పోగొ ట్టుకున్న మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు శనివారం డీజీపీ హరీష్కుమార్ గుప్తా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబుకు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఫోన్ల రికవరీలో విశేష కృషి చేసి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిపిన సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్నను సీపీ రాజశేఖరబాబు అభినందించారు. -
పుట్ట గొడుగుల పెంపకం.. లాభదాయకం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పుట్టగొడుగుల పెంపకం లాభదాయకమైన స్వయం ఉపాధి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. స్వయ సహాయక సంఘాల సభ్యులు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గొల్లపూడిలోని డీఆర్డీఏ కార్యాలయంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు పుట్ట గొడుగుల పెంపకం, డిజైనింగ్ వస్త్రాల తయారీపై అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మీశ మహిళలనుద్దేశించి ప్రసంగించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం అందించే పుట్ట గొడుగుల పెంపకం మంచి ఆదాయ మార్గమని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగహన పెరుగుతున్న క్రమంలో పుట్ట గొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని వినియోగించుకుని ఆర్ధికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. పుట్టగొడుగుల పెంపకం, అవసరమైన ముడి సరుకులు, మార్కెటింగ్ అవకాశాలపై నిపుణులు నాగరాజు మహిళలకు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ. నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాదైనా అమలయ్యేనా?
ఏక్సాల్ కౌలు వేలం వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ రూ.24 లక్షలతో కౌలు వేలం సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం ఈ ఏడాదైనా న్యాయం జరుగుతుందా..? తాడిగడప, పెదపులిపాక గ్రామాల్లో ఉన్న కొండపల్లి ఖాజీ సర్వీస్ వక్ఫ్ భూముల ఏక్సాల్ కౌలు వేలం ఈ ఏడాదన్నా అమలు చేస్తారా లేక ప్రైవేటు వ్యక్తులకు అన్యాక్రాంతం చేస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం ఖాజీ సర్వీస్ భూములపై జోక్యం చేసుకుని చర్యలు తీసుకోకపోతే ఈ ఏడాది కూడా వక్ఫ్ ఆదాయానికి భారీగా గండి పడే ప్రమాదం ఉంది. -
గ్రంథాలయ గోడు!
మచిలీపట్నంఅర్బన్: విజ్ఞాన భాండాగారాలను నిధుల కొరత వేధిస్తోంది. నిధుల కోసం నిరీక్షణతో లైబ్రరీల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రజల నుంచి గ్రంథాలయ సెస్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా, అవి లైబ్రరీలకు చేరక ఉమ్మడి కృష్ణాలోని గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఆస్తి పన్ను, ఇంటి పన్నులపై లైబ్రరీ సెస్ వసూలు చేసి గ్రంథాలయ నిధికి జమ చేయాల్సి ఉంది. నిధుల విడుదలలో జాప్యం చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా 2024 నుంచి 2026 వరకు వసూలైన రూ.27 కోట్ల లైబ్రరీ సెస్ గ్రంథాలయాల ఖాతాలకు విడుదల కాలేదు. దీంతో ఇవి దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. బకాయిల భారం ఉమ్మడి జిల్లాలో లైబ్రరీల బకాయిలు మొత్తం రూ.82 కోట్లకు చేరాయి. ఇందులో ఎన్టీఆర్ జిల్లా నుంచి రూ.68 కోట్లు, ప్రస్తుత కృష్ణా జిల్లా నుంచి రూ.14 కోట్లు. నిధుల కొరతతో కొత్త పుస్తకాల కొనుగోలు, భవనాల మరమ్మతులు, ఆధునికీకరణ పనులు కుంటుపడ్డాయి. సిబ్బందికి జీతాలు చెల్లించడమే భారంగా మారింది. కనీస నిర్వహణకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. 110 గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో గ్రంథాలయాల విస్తరణ ఉన్నా సిబ్బంది కొరత, భారీ బకాయిల సమస్యలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో మొత్తం 110 గ్రంథాలయాలు పని చేస్తున్నాయి. వీటిలో 1 గ్రామీణ గ్రంథాలయం, 8 గ్రేడ్–1, 18 గ్రేడ్–2, 83 గ్రేడ్–3, గ్రంథాలయాలు ఉన్నాయి. అన్నింటిలో సుమారు 15,60,597 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. నాడు వైఎస్సార్ హయాంలో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో సెస్ వసూళ్లు నేరుగా గ్రంథాలయాల ఖాతాలకు జమయ్యేవి. వాటితో గ్రంథాలయాల అభివృద్ధి, భవనాల నిర్మాణం, పుస్తకాల కొనుగోలు వంటి కార్యక్రమాలు చేపట్టారు. పాత బకాయిలు విడుదలయ్యేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. ఖాళీ పోస్టులతో ఇబ్బందులు జిల్లాలో అవసరమైన 43 రికార్డు అసిస్టెంట్లకు కేవలం 27 మంది మాత్రమే పని చేస్తున్నారు. 67 మంది ఆఫీస్ సబార్డినేట్ల స్థానాల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. గ్రేడ్–1 పోస్టుల్లో 18 స్థానాలకు 7మంది, గ్రేడ్–2 పోస్టుల్లో 57 స్థానాలకు 19 మంది మాత్రమే ఉన్నారు. 61 లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ అవసరముండగా, కేవలం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గ్రంథాలయాలకు 2024–25, 26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి స్థానిక సంస్థల నుంచి భారీ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉంది. విజయవాడ కార్పొరేషన్ నుంచి సుమారు రూ.15 కోట్లు, మచిలీపట్నం కార్పొరేషన్ నుంచి రూ.కోటి, గ్రామ పంచాయతీల నుంచి రూ.8.5 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ.3 కోట్లు వసూలైన లైబ్రరీ సెస్ జిల్లా గ్రంథాలయ సంస్థకు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రెగ్యులర్గా పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి.గ్రంథాలయాలకు పెండింగ్లో ఉన్న ‘గ్రంథాలయ సెస్’ బకాయిల సమస్యను ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్ డీకే బాలాజీకి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని కలెక్టర్ ప్రస్తావించారని తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, చట్టరీత్యా సెస్ బకాయిల చెల్లింపునకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించి, వాటి ఆర్థిక పురోభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఆధునిక సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి కలెక్టర్ బాలాజీ ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఇందుకు గ్రంథాలయ సంస్థ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు బేగ్ పేర్కొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు శుక్రవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. నగరంలోని పటమటకు చెందిన పాలకొండ తులసి రాంబాబు, రమాదేవి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): విద్యార్థులను పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే బస్సుల్లో తనిఖీలు చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నామని విజయవాడ డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.పురేంద్ర తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని స్కూల్స్, కాలేజీ బస్సులను ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 1,571 విద్యాసంస్థలకు చెందిన బస్సులు నడుస్తున్నాయని, వాటిపై ఈ నెల 1 నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రతి బృందానికి సుమారు 130 బస్సుల చొప్పున తనిఖీ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 250 బస్సులను తనిఖీ చేయగా, ఈ నెల 20 లోపు తాము గుర్తించిన లోపాలు సరిచేయాలని ఆదేశించామన్నారు. తనిఖీల సందర్భంగా బస్సుల్లో అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించే విధానంపై ఎవాక్యువేషన్ డెమో నిర్వహించడంతో పాటు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ల వినియోగంపై డ్రైవర్లు, అటెండర్లు, విద్యాసంస్థల సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు పురేంద్ర తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు బస్సులను పూర్తి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసి, నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పురేంద్ర విజ్ఞప్తి చేశారు. నాగాయలంక: బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ నెల 5, 6, 7 తేదీల్లో కర్నూలు జిల్లా గోనిగండ్లలో రాష్ట్ర స్థాయిలో జరిగిన బేస్బాల్ బాలికల సబ్ జూనియర్ పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు ద్వితీయ స్థానం పొందింది. ఈ జట్టులో నాగాయలంక జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్ బాలికలు 10మంది ఉన్నారని హెచ్.ఎం పద్యాల రఘురామయ్య, పి.డి గాజుల లక్ష్మీ ప్రసాద్ శుక్రవారం విలేకరులకు చెప్పారు. వీరిలో అత్యుత్తమ క్రీడా ప్రతిభ చాటిన బాలికలు సబ్బినేని ఉష్మిత, పూషడపు వల్లిశ్రీ, పురమ లీలశ్రీ నేషనల్ జట్టులో స్థానం పొందారన్నారు. మే 22న భువనేశ్వర్లో జరగనున్న జాతీయ బేస్బాల్ పోటీల్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభతో రాణించిన ముగ్గురు బాలికలు జాతీయ స్థాయికి ఎంపి కై న రాష్ట్ర జట్టులో ప్రాతినిధ్యం వహిస్తారు. నేషనల్స్కు ఎంపికై న ముగ్గురు బాలికలను పాఠశాల విద్యాకుటుంబం అభినందించింది. -
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పొగాకు పుల్లారెడ్డి ఇబ్రహీంపట్నం: వేసవి కాలంలో వినియోగదారులకు ఏ విధమైన అసౌకర్యం కలుగకుండా గ్రామాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్, ఏపీజెన్కో ఇన్చార్జ్ డైరెక్టర్ పోగాకు పుల్లారెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ రూరల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ సబ్స్టేషన్ను శుక్రవారం ఆయన సందర్శించారు. రూరల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ ఉద్యోగుల విధుల నిర్వహణపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల గృహాలకు సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయడంలో లక్ష్యాలు పూర్తి చేయాలన్నారు. హెచ్టీ, ఎల్టీ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు కృషి చేయాలని సూచించారు. పశ్చిమ ఇబ్రహీంపట్నం, అంబారుపేట, మక్కపేట ఏరియాలో మూడు నూతన సబ్ స్టేషన్లను సుమారు రూ.14 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. టెక్నికల్ డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ఎస్ఈ యు.అన్నమయ్య, పలువురు ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. కంటెయినర్ లారీ ఢీకొని కూలీ మృతికొండపల్లి(ఇబ్రహీంపట్నం): ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కొండపల్లి ఆప్మెల్ సెంటర్లో 30వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. ఆప్మెల్ సెంటర్కు చెందిన వేముల వెంకటేశ్వరరావు (37) కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడు. కూలి పనికి వెళ్లి తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో తన టీవీఎస్ మోపెడ్పై ఇంటికి వస్తున్నాడు. ఆ సమయంలో హైవేపై మలుపు తిరుగుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వెంకటేశ్వరరావును కుటుంబ సభ్యులు విజయవాడ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏపీఈసెట్లో కృష్ణా విద్యార్థుల ప్రతిభ
మచిలీపట్నంఅర్బన్: ఏపీఈసెట్–2026 ఫలితాల్లో కృష్ణా జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గత నెల 23న జేఎన్టీయూ అనంతపురం, ఏపీ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీఎచ్ఈ) తరఫున నిర్వహించిన పరీక్షలో డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీతో ప్రవేశాలు పొందనున్నారు. జిల్లా నుంచి మొత్తం 1,050 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,002 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.49గా నమోదైంది. పరీక్షకు 674 మంది బాలురు, 376 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 640 మంది బాలురు, 362 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 94.36గా ఉండగా, బాలికల ఉత్తీర్ణత శాతం 96.28గా నమోదైంది. ఏపీఈసెట్ ఎఫ్డీహెచ్ అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ పరీక్షలో గుడివాడ సమీపంలోని మోటూరుకు చెందిన బొడ్డు రామచందు 160 మార్కులతో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు దక్కించుకున్నారు. ఉయ్యూరుకు చెందిన పట్టపు వైష్ణవి 128 మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్లో రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించింది. -
చిరు వ్యాపారులపై కక్ష సాధింపు
సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం చిరువ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దోనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. బీసెంట్ రోడ్డు మహంతి మార్కెట్ వద్ద శుక్రవారం హాకర్ల జీవనోపాధిని దెబ్బతీసే జోన్ల విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ చిరు వ్యాపారస్తుల తోపుడుబండ్ల యూనియన్( సి.ఐ.టి.యు)ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ నగరంలో 30వేల మందికి పైగా ఉన్న చిరువ్యాపారులను ప్రభుత్వాలు ప్రోత్సహించకపోగా వారిపై కక్ష సాధింపులకు దిగడం సరికాదని హితవు పలికారు. హాకర్లు నగర వ్యాప్తంగా రోడ్ల పక్కన, మార్కెట్లలో, కూడళ్ల వద్ద తోపుడు బండ్లు, సైకిళ్లు, రిక్షాల ద్వారా వ్యాపారాలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. వారి ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం రెడ్, గ్రీన్, అంబర్ జోన్ల విధానాన్ని తీసుకొస్తోందన్నారు. ఈ విధానంతో హాకర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విధానాన్ని తీసుకొస్తే అప్పట్లో పోరాటాల ద్వారా తిప్పి కొట్టామని గుర్తు చేశారు. గతంలో హాకర్లు ఐక్యంగా పోరాడారని, ఫలితంగా ఆ విధానం రద్దు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అదే విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని విజయవాడ హాకర్స్– తోపుడు బండ్ల యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కార్యక్రమంలో కె. దుర్గారావు, ఎం.సోమేశ్వరరావు, సీహెచ్ మురళి, బాలబొమ్మ లక్ష్మణ, ఎస్.కె మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
కామన్వెల్త్ చెస్ చాంప్నకు అర్బిట్రేటర్గా ఫణికుమార్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శ్రీలంకలో ఈ నెల 16 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న కామన్వెల్త్ చెస్ చాంపియన్షిప్–2026కు తమ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, చెస్ క్రీడాకారుడు ఎన్ఎం ఫణికుమార్ అర్బిట్రేటర్గా ఎంపికయ్యారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ సెక్రటరీ కె.జగదీష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెస్ చాంపియన్ షిప్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా, కెన్యా, మలేషియా, మాల్దీవులు, న్యూజి లాండ్, పాకిస్తాన్, స్కాట్లాండ్, సింగ్పూర్, మారిషస్, శ్రీలంక దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. ఎంపికై న ఫణి కుమార్ను ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవీ శర్మ, ప్రెసిడెంట్ అడుసుమిల్లి సురేష్, ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అక్బర్ పాషా, చెస్ క్రీడాకారులు అభినందించారు. కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన పీజీ, ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ ఫలితాలతో పాటు బీఫార్మసీ మొదటి, ఎనిమిదవ సెమిస్టర్, యూజీ మొదటి సెమిస్టర్, రీవాల్యూయేషన్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కూన రాంజీ శుక్రవారం విడుదల చేశారు. వీటిని విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని వీసీ తెలిపారు. ఉత్తీర్ణత శాతంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని ఆకాంక్షించారు. లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్, బీఫార్మసీ మొదటి సెమిస్టర్ రీ వాల్యూయేషన్ ఫీజును ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి గల విద్యార్థులు చెల్లించాలని పరీక్షల నియంత్రణాఽధికారి వీరబ్రహ్మచారి తెలిపారు. -
ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలు
జి.కొండూరు: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేదిలేదని జి.కొండూరు మండల ఇన్చార్జ్ తహసీల్దార్ విజయ్కుమార్ అన్నారు. మండల పరిధిలోని మునగపాడు, సున్నంపాడు గ్రామాల పరిధిలో జగనన్న కాలనీ ఏర్పాటు కోసం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ నిధులతో రైతుల నుంచి కొనుగోలు చేసిన భూమిని అక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ప్రభుత్వ భూమిపై పచ్చనేతల కన్ను’ కథనాన్ని సాక్షి శుక్రవారం ప్రచురించింది. ఈ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇన్చార్జ్ తహసీల్దార్ విజయ్కుమార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు బృందం ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కంప చెట్లను తొలగించి నేలను చదును చేస్తున్న జేసీబీలను అడ్డుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఎటువంటి కార్యకలాపాలు చేయడానికి వీల్లేదని, అక్కడి నుంచి వెళ్లకపోతే జేసీబీలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. -
మద్యం షాపు వాటాల్లో వివాదం
జి.కొండూరు: మద్యం సిండికేట్ సొమ్ము వ్యవహారంలో వివాదం తలెత్తడంతో ఎన్టీఆర్ జిల్లాలోని ఓ వైన్ షాపు వద్ద శుక్రవారం ర్షణ వాతావరణం నెలకొంది. వివరాలలోకి వెళ్తే... ప్రభుత్వం మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించిన సమయంలో 51 మంది సిండికేట్గా ఏర్పడి జి.కొండూరు మండల పరిధి కట్టుబడిపాలెం విజయ దుర్గ వైన్షాపును దక్కించుకున్నారు. ఈ క్రమంలో విక్రయాలు జరుగుతుండగా సిండికేట్ సొమ్ము పంపకాల వ్యవహారంలో సభ్యుల మద్య వివాదం తలెత్తింది. దీనితో సిండికేట్లో కొందరు వ్యక్తులు సొమ్మును స్వాహా చేసి తనకు అన్యాయం చేశారని సిండికేట్ సభ్యుడు ఇబ్రహీంపట్నంకు చెందిన వెల్లంకి సురేష్ అనే వ్యక్తి శుక్రవారం కట్టుబడిపాలెం వైన్ షాపు వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. విక్రయాలు జరపకుండా అడ్డుకొని షాపును క్లోజ్ చేశారు. దీనితో సమాచారం అందుకున్న ఎకై ్సజ్శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని షాపును తెరిపించేందుకు ప్రయత్నింగా తీవ్ర మనస్థాపానికి గురైన సిండికేట్ సభ్యుడు వెల్లంకి సురేష్ పెట్రోలు మీద పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీనితో అప్రమత్తమైన ఎకై ్సజ్శాఖ అధికారులు బాధితుడు సురేష్పై నీళ్లు పోసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడ్డుకున్నారు. బాధితుడు సురేష్కు నచ్చజెప్పి సిండికేట్ సభ్యలతో మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత షాపును తెరిపించారు. -
గజపతి చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్
ఆయుర్వేద హాస్పటల్ నిర్మాణానికి బ్రేక్ కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి ఆర్ఎస్ నంబర్ 433 గజపతి చెరువులో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువు స్థలంలో ఇటీవల కాలంలో ఆయుర్వే వైద్యశాల నిర్మాణంకు అధికారులు పూనుకున్నారు. ఆ స్థలం చెరువుది కావడంతో పట్టణానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విస్తీర్ణంపై హైకోర్టు ఆరా తీయగా 42.33 ఎకరాలకు ప్రస్తుతం 14 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని రెవెన్యూ అఽధికారులు కోర్టుకు తెలిపారు. ఆగ్రహించిన హైకోర్టు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువులో ఎటువంటి కట్టడాలు చేయడానికి వెళ్లేదని అది కోర్టు భవనమైనా కూల్చేయాల్సిందే అని గౌరవ న్యాయమూర్తి తెలిపారు. వెంటనే ఆక్రమణలో ఉన్న చెరువు స్థలంపై కౌంటర్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆస్థలంలో ఎన్టీటీపీఎస్ క్వార్టర్స్తో పాటు పట్టణ సచివాలయం, ఈఎస్ఐ వైద్యశాల, పలువురు పేదలు నిర్మించున్న గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. కారు ఢీకొని మరో కారు డ్రైవర్ దుర్మరణం కంచికచర్ల : రోడ్డు ప్రమాదంలో ఓ కారు డ్రైవర్ మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ పి.విశ్వనాధ్ కథనం మేరకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన నెల్లూరి సుజన తన కుటుంబసభ్యులతో కలిసి నిడమానూరులో వివాహ కార్యక్రమానికి గురువారం వచ్చారు. అదేరాత్రి తిరిగి ప్రయాణం అయ్యారు. కంచికచర్ల సమీపంలో మిశ్రా డాబా వద్దకు రాగానే శుక్రవారం తెల్లవారుజామున కారు రోడ్డు పక్కన ఆపి కారు డ్రైవర్ కొంగర ప్రశాంత్ కుమార్ మూత్ర విసర్జన కోసం వెళ్లాడు. తిరిగి కారు ఎక్కుతున్న సమయంలో వేగంగా వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తలకు తీవ్రగాయమయింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్దలానికి చేరుకుని బాధితుడిని వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్కుమార్ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. -
కలగర రైతు భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత
కలగర(ఎన్టీఆర్ జిల్లా): రైతుల కష్టాన్ని ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు దోచుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు ఎదురుతిరిగారు. విస్సన్నపేడ మండలం కలగరలో రైతు భరోసా కేంద్రంగా చిన్ని వర్గీయులు దందా నడిపిస్తున్నారని రైతులు ఆందోళన బాట పట్టారు. దళారుల పేరుతో దోచుకుంటున్నారని రైతులు ఎదురుతిరిగారు. అక్కడ రైతులు ఆందోళనకు దిగడంతో కలగర రైతు భరోసా కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో ఎంపీ చిన్నిపై గుర్రుగా ఉన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అక్కడకు చేరుకున్నారు. ఎంపీ వర్గం దోపిడీపై కొలికపూడి మండిపడ్డారు. ఎంపీ వర్గం వ్యక్తులకు సహకరిస్తున్న ఎమ్మార్వోపై ధ్వజమెత్తారు. దళారులకు ఎమ్మార్వో కొమ్ము కాస్తున్నారంటూ విమర్శించారు. ఉదయం నుంచి రైతుల ఆందోళన చేస్తుంటే మీకు పట్టదా అంటూ ఎమ్మార్వో తీరును తప్పుబట్టారు. ఎమ్మార్వోతో పాటు ఎంపీ వర్గంపై కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు పెద్ద రైతులత కోసం చిన్న రైతుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. ఎమ్మార్వోతో పాటు ఓ నలుగురు రైతులు దోచుకుంటున్నారని, దొంగలను ఎమ్మార్వో కాపాడుతున్నారన్నారు. ఎమ్మార్వోను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కొలికపూడి. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.8440 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ నిత్యా న్నదానానికి విజయవాడ గొల్లపూడికి చెందిన బుర్లే శ్రీనివాసరావు, భ్రమరాంబ దంపతులు గురువారం రూ.1,01,116 విరాళం సమర్పించారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న హోంగార్డుల పిల్లలు 21 మందిని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ చూపిన చిన్నారులను కమిషనరేట్లో గురువారం శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్లోని హోంగార్డుల పిల్లలు 21 మంది 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు. రేయింబవళ్లు ప్రజల సేవలో నిమగ్నమయ్యే హోంగార్డులు, తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని కొనియాడారు. తమ పిల్లల ప్రతిభను గుర్తించి, స్వయంగా పోలీస్ కమిషనర్ సత్కరించడంతో హోంగార్డులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత, హోంగార్డు కమాండెంట్ ఆనందబాబు, ఏఆర్ ఏడీసీపీ కె.కోటేశ్వరరావు, హోంగార్డు డీఎస్పీ ఎన్.వి.రమణ, ఆర్ఐ సుధాకరరెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు విజయవాడ, గుంటూరు మీదుగా విశాఖపట్నం – కొల్లం మధ్య రెగ్యులర్ వారాంతపు రైలుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం – కొల్లం (18501) రైలు ఈ నెల 12 నుంచి ప్రతి మంగళవారం, కొల్లం– విశాఖపట్నం (18502) రైలు ఈ నెల 13 నుంచి ప్రతి బుధవారం నడవనున్నాయి. రెండు మార్గాల్లో ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, గుంటూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్ పట్టాయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, యర్నాకుళం, కొట్టాయం, చెంగనూరు, కాయంకుళం స్టేషన్లలో ఆగుతుంది. కొండపల్లిలో ఉయ్యాల శ్రీను డెన్గా ఉన్న ప్రాంతంలో నిల్వ చేసిన సుమారు 40 బస్తాలు బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇతని ప్రాంతానికి వెళ్లేందుకు ఏ అఽధికారీ సాహసం చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం గోడౌన్ ప్రాంతాన్ని మార్పు చేసి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. కొండపల్లి శాంతినగర్ వద్ద డేరంగుల గోపీకి చెందిన 550 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఈలప్రోలులో నిల్వ చేసిన సుమారు 15 బస్తాలు, గుంటుపల్లిలో సుమారు 20 బస్తాల కోటా బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇవి కాకుండా యథేచ్ఛగా రవాణా జరుగుతూ లెక్కల్లోకి రాని బియ్యం వందల టన్నుల్లో ఉంటుందని అంచనా ఉంది. పేదల రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు, ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం: పేదలకు ఉచితంగా అందించే కోటా (రేషన్) బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అడ్డదారుల్లో దోచుకుంటున్నారు. ఆపై బహిరంగ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో పౌరసరఫరాల శాఖ అధికారులు కొండపల్లిలో జరిపిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రేషన్ మాఫియా ముఠా కొండపల్లి కేంద్రంగా సాగిస్తున్న దందాను చూసి అధికారులను సైతం విస్మయం చెందారు. దశాబ్దకాలంగా రేషన్ డాన్గా కొనసాగుతున్న ఉయ్యాల శ్రీను నిల్వ చేసిన సుమారు 40 బస్తాలు రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం డేరంగుల గోపీ నిల్వ చేసిన 550 క్వింటాళ్ల రేషన్ బియ్యంపై అఽధికారులు దాడిచేశారు. గతంలో షాదీఖానలో నిల్వచేసిన టన్నున్నర బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ లెక్కన కొండపల్లి కేంద్రంగా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తేటతెల్లమవుతోంది. ప్రతినెలా రూ.కోటికి పైగా వ్యాపారం కొండపల్లి మునిసిపాలిటీ, ఇబ్రహీంపట్నం మండల పరిధి గ్రామాల్లో కోటా బియ్యంతో ప్రతి నెలా రూ.కోటికి పైగా వ్యాపారం జరుగుతోందని సమాచారం. ఈ రెండు ప్రాంతాల నుంచి అక్రమంగా రేషన్ బియ్యం వేల క్వింటాళ్లు తరలిపోతోందని అంచనాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కొందరు అధికార పార్టీ నాయకులే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ సంబంధిత వాహనాలు, వ్యక్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేయక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కుబడిగా రేషన్ దుకాణాలు తనిఖీ చేస్తున్నప్పటికీ బియ్యం నిల్వలపై తేడాలు ఉన్నా కేసులు నమోదు చేయ డంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రేషన్ డాన్ల మధ్య ఆధిపత్య పోరు కొండపల్లి ప్రాంతంలో రేషన్ బియ్యం దందా మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లడంతో రేషన్ బియ్యం డాన్ల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఒకరు నిల్వ చేసిన బియ్యాన్ని మరొకరు పట్టిం చడం, ప్రాంతాల వారీగా ఆధిపత్యం చెలాయించడం, ఒకరిపై మరొకరు దాడి చేయించడం వంటి ఘటనలు మండలంలో వెలుగు చూస్తున్నాయి. గతంలో పవిత్ర సంగమంనకు వెళ్లే రోడ్డులో అర్ధరాత్రి వేళ రేషన్ డాన్లు ఒకరిపై ఒకరు దాడిచేసుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటనలు ఉన్నాయి. మూడు రోజుల క్రితం కొండపల్లిలో లభించిన 550 బస్తాల బియ్యం కూడా కావాలని పట్టించినట్లు తేలింది. ఈ ఘటనలో డేరంగుల శ్రీను, దుర్గారావుతో పాటు ఓ రైస్ మిల్లు యజమానిపై కూడా అధికారులు కేసు నమోదు చేశారు. రేషన్ డాన్లు తమ వ్యాపారం సక్రమంగా సాగేందుకు ఒక్కొరు రూ.50 వేల వరకు అఽధికారులకు ప్రతినెలా ముట్టజెబుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 7 -
చంద్రబాబు ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది
మైలవరం(ఇబ్రహీంపట్నం): ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గం సమన్వయ కర్త జోగి రమేష్ విమర్శించారు. మైలవరం వ్యవవసాయ మార్కెట్ యార్డ్లో వరి, మొక్కజొన్న కొనుగోలు చేసేవారు లేక 15 రోజులుగా రైతులు ఎదురుచూస్తున్నారు. వారికి మద్దతుగా ర్యాలీగా ఏఎంసీ యార్డ్కు చేరుకున్న జోగి రమేష్ రైతులకు అండగా నిలిచారు. పంటకు పెట్టిన పెట్టుబడి, ప్రభుత్వం కొనుగోలు చేయక కలిగిన నష్టాలను రైతుల నుంచి తెలుసుకున్నారు. కనీసం పట్టాలు, గోనె సంచులు ఇచ్చిన నాథుడు లేడని రైతులు జోగి రమేష్కు ఫిర్యాదు చేశారు. 15 రోజులుగా ఏఎంసీలో తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో మొక్కజొన్న, ధాన్యం ఏమవుతుందో తెలియడంలేదని ఆందోళన వారు వ్యక్తం చేశారు. రైతులకు సంచులనూ సరఫరా చేయలేరా? రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వ తీరును జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. కనీసం ధాన్యం సంచులను కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం రైతులకు ఏమి మేలు చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతులను ఆదుకునే దిశగా కలెక్టర్లకు సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న, వరి రైతుల సమస్యలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 చెల్లించి రైతులను ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తులు క్వింటాకు రూ.1750 చొప్పున కొంటామనడం రైతులను నిలువునా దోచుకోవడమేనని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదని, కనీసం సంచులు, పట్టాలు, ట్రాన్స్ పోర్టు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతులు స్థానిక ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే కనీసం సమాధానం చెప్పే పరిస్థితిలో ఆయన లేడన్నారు. ఆయనకు పావలా వాటా కోసం పోరాడటంతోనే సరిపోతోందని ఎద్దేవా చేశారు. మైలవరం నియోజకవర్గంలో రైతుల పరిస్థితిని సీఎం చంద్రబాబు ఒక సారి వచ్చి పరిశీలించాలన్నారు. సత్వరమే రైతుల ధాన్యం కొనుగోలు చేసి వెంటనే నగదు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు సమస్యలు పరిష్కరించకుంటే రైతుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గరికపాటి శ్రీదేవి, ఏఎంసీ మాజీ చైర్మన్ అప్పిడి సత్యన్నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు వేములకొండ తిరుపతిరావు, నాగు లూరి దుర్గాప్రసాద్, పామర్తి శ్రీనివాసరావు, పచ్చిగోళ్ల పండు, నల్లమోతు ప్రకాష్, నల్లమోతు దయాకర్, దేవరకొండ ఆంజనేయులు, జడ రాంబాబు, రెంటపల్లి నాగరాజు, పాల నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ -
సిద్ధార్థ యూనివర్సిటీ ఫలితాలు విడుదల
పెనమలూరు: మండలంలోని కానూరులో ఉన్న సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ఫలితాలను గురువారం విడుదల చేశారు. వర్సీటీ క్యాంపస్లో సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు ఎం.రాజయ్య, పాలడుగు లక్ష్మణరావు ఫలితాలను విడుదల చేసి వివరాలు వెల్లడించారు. 2026–2027 విద్యా సంవత్సరంలో అడ్మి షన్ల కోసం ప్రవేశ పరీక్ష (ఎస్ఈఈఈ) నిర్వహించామన్నారు. ఉత్తమ ప్రతిభ చాటిన ఆరుగురు విద్యార్థులకు నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సును పూర్తి ఫీజు రాయితీతో అడ్మిషన్ ఇస్తామన్నారు. ఎంట్రన్స్లో మొదటి ర్యాంక్ డి.భవదీప్, రెండో ర్యాంక్ సీహెచ్.హర్ష, మూడో ర్యాంక్ వి.నాగవెంకటరాకేశ్వర్ సాధించారని పేర్కొన్నారు. జేఈఈలో ఉత్తమ మార్కులు సాధించిన బి.శరన్, వి.నరసింహశ్రీనివాస్, జి.సమీర్రాజ్కు వంద శాతం ఫీజు రాయతీ వర్తిస్తుందన్నారు. ఈ నెల 13 నుంచి అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉప కులపతి డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్, డైరెక్టర్ ప్రొఫెసర్ బి.పాండురంగారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.రవిచంద్, డీన్ వెంకట్రావు, డీన్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి.ఎన్.స్వామి పాల్గొన్నారు. ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ, యూనియన్ బ్యాంక్ సంయుక్త సౌజన్యంతో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు పలు ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఈఎస్టీఐ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నెల రోజుల వస్త్ర చిత్ర కళ (మగ్గం) శిక్షణ ఈ నెల 11 నుంచి ప్రారంభ మవుతుందన్నారు. 14 రోజుల కాస్ట్యూమ్ జువె లరీ శిక్షణ, పదిరోజుల పుట్టగొడుగుల పెంపకం, 12 రోజుల కొవ్వొత్తుల తయారీలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 19 నుండి 50 ఏళ్లలోపు గ్రామీణ మహిళలు, యువతులు శిక్షణ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్తో పాటు టూల్ కిట్లు అంద జేస్తామని తెలిపారు. అసక్తి కలిగిన వారు ఈ నెల పదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర సమాచారం కోసం 63042 54730, 94900 11081 నంబర్లను సంప్రదించాలని కోరారు. చిలకలపూడి(మచిలీపట్నం): అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం ఎన్నో పోరా టాలు చేశారని కృష్ణా జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ.. సీతారామ రాజు మన్యం వీరుడిగా పేరుగడించారన్నారు. ఆయన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, కలెక్టరేట్ ఏఓ ఎ.ఎస్.ఎన్.రాధిక, సూపరింటెండెంట్ నెల్సన్పాల్బాబు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ గుర్తింపు, అనుమతి లేకుండా అడ్మిషన్లు చేపట్టొద్దని ప్రైవేట్ పాఠశాలలను కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గూడూరు మండలంలో ‘ఢిల్లీ వరల్డ్ స్కూల్’ పేరుతో నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలకు సంబంధిత శాఖల నుంచి సరైన గుర్తింపు, అనుమతులు లేవని స్పష్టంచేశారు. ఆ విద్యా సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తమ దష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దని సూచిం చారు. ఆ పాఠశాలల్లో చేరిస్తే విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుర్తింపు లేకుండా 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తున్న సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ పాఠశాలలు, వాటి నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు హెచ్చరించారు. -
స్కూల్ బస్.. ఫిట్లెస్
లబ్బీపేట(విజయవాడతూర్పు): పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు తీసుకెళ్లే పలు బస్సుల్లో అనేక లోపాలు ఉంటున్నాయి. రవాణాశాఖ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అవి బయటపడుతున్నాయి. ఈ లోపాలను గుర్తించిన అధికారులు, వాటిని సరిచేయాలంటూ ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. పదిహేను రోజుల్లో ఆ లోపాలను సరిచేస్తేనే మళ్లీ తనిఖీ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో రెండువేలకు పైగా స్కూల్, కళాశాల బస్సులు ఉండగా, ఇప్పటి వరకూ 250 బస్సులను రవాణాశాఖ అధికారుల బృందాలు తనిఖీలు చేశాయి. పలు బస్సుల్లో లోపాలు గుర్తించి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాయి. గుర్తిస్తున్న లోపాలు ఇవీ.. రవాణా శాఖ తనిఖీల్లో వీఎల్టీడీ డివైజ్లు లేక పోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు బయటకు వచ్చే అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయక పోవడం, అత్యవసర ద్వారాల వద్ద సీట్లు అమర్చడం వంటి లోపాలు అధికారులు గుర్తించి నోటీసులు ఇస్తున్నారు. వాటితో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హ్యామర్లు బస్సులో అందుబాటులో లేక పోవడం, మంటలను ఆర్పే ఫైర్ ఎక్విప్మెంట్ లేక పోవడం, ఎక్స్పైరీ డేట్తో ఉండటం వంటి వాటిని రవాణా శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. పిల్లలను తీసుకెళ్లే స్కూల్, కళాశాల బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. వీటిపైనే దృష్టి.. రవాణాశాఖ అధికారులు వారి తనిఖీల్లో ముఖ్యంగా టైర్లు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎక్కే డోర్ మెట్లు సక్రమంగా ఉన్నాయా, గ్రిల్స్, సీట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ కిట్, వైఫర్స్, ఇండికేటర్స్, హెడ్ లైట్స్, గ్లాస్, బస్సు కండీషన్, రూఫ్ వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు విద్యార్థులు బయటకు వచ్చేందుకు ఎమర్జెన్సీ డోర్ సరిగాయ ఉన్నాయా లేవా అని తనిఖీ చేస్తున్నారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్కూల్స్, కళాశాలల బస్సులను తనిఖీ చేస్తున్నాం. భద్రతా ప్రమాణా లయిన ఏఐఎస్–63, ఏఐఎస్ –52, ఏఐఎస్ –135, ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ రూల్స్లోని 185(జీ), 125(హెచ్) ప్రకారం పరిశీలన చేస్తున్నాం. తనిఖీల్లో నిబంధనల ప్రకారం లేని బస్సులకు సంబంధించి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి, 15 రోజుల్లో సరిదిద్దుకోవాలని ఆదేశిస్తున్నాం. వాటిని సరిదిద్దిన తర్వాత మరో సారి తనిఖీ చేసి అన్నీ బాగుంటే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తాం. ఇప్పటి వరకూ 200 బస్సుల వరకూ తనిఖీలు చేశాం. – ఆర్.ప్రవీణ్, ఆర్టీఓ, విజయవాడ గత ఏడాది డిసెంబరులో స్కూల్, కళాశాలల బస్సులకు సంబంధించి రవాణాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దాదాపు పది ప్రత్యేక బృందాలతో రెండు రోజుల పాటు 125 బస్సుల వరకూ తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో స్కూల్ బస్సు డ్రైవర్ వయస్సు, అనుభవం, లైసెన్స్, అత్యవసర ద్వారం ఇతర అంశాలను తనిఖీ చేశారు. రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో స్కూలు బస్సుల డొల్లతనం బయటపడింది. ఏకంగా 28 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు అలాంటివి చోటుచేసుకోకుండా ముందస్తుగానే తనిఖీలు చేస్తున్నారు. -
దుర్గమ్మ భక్తుల కోసం వాటర్ ప్లాంట్ వితరణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి విచ్చేసే భక్తుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన మినరల్ వాటర్ ప్లాంట్ను ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్బాబు, శ్రీదేవి దంపతులు దేవస్థానానికి అందచేశారు. ఘాట్రోడ్డులో సుమారు రూ.లక్ష వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను దాత వెలగపూడి శంకర్బాబు దంపతులు గురువారం పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. సుమారు 300 లీటర్ల సామర్ధం కలిగిన ఈ వాటర్ప్లాంట్ ద్వారా భక్తులకు స్వచ్చమైన తాగునీరు అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సేవ చేసే భాగ్యం తన కుటుంబానికి కలిగినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
రైతులు సంఘటితమైతే అద్భుత ఫలితాలు
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తోట్లవల్లూరు: రైతులు సంఘటితంగా ముందుకు సాగి దళారీ వ్యవస్థను అధిగమించగలిగితే అద్భుత ఫలితాలు సాధించొచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ పేర్కొన్నారు. మండలంలోని చాగంటిపాడులో ఉద్యానశాఖ సహకారంతో శ్రీవిఘ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యాన రూ.62 లక్షలతో ఏర్పాటు చేసిన పసుపు, కారం, కారప్పొడుల ప్రాసెసింగ్ యూనిట్ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యాన, వ్యవసాయ, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ బాలాజీ సందర్శించారు. అరటి మార్కెట్లో విక్రయాల తీరును తెలుసుకున్నారు. రైతులు ఐకమత్యంగా ఉంటూ తాము పండించిన పంట ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా అమ్ముకోగలిగితే మంచి లాభాలు వస్తాయని, దీనికి గుజరాత్లోని అమూల్ సంస్థను ఉదాహరణగా తీసుకోవచ్చని సూచించారు. శ్రీవిఘ్నేశ్వర రైతుల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ నిర్వహణ, అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు తమ పంట ఉత్పత్తుల అమ్మకాల కోసం ఎఫ్పీఓలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులకు డివిడెండ్లు పంపిణీ చేశారు. నాబార్డు ఏజీఎం మిలేన్, జిల్లా వ్యవసాయశాఖాధికారి పద్మావతి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సీహెచ్.నరసింహులు, జిల్లా ఉద్యాన శాఖాధికారి జె.జ్యోతి, డీఆర్ డీఏ పీడీ హరిహరనాథ్, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజు, తహసీల్దార్ కుసుమకుమారి, ఎంపీడీఓ రవికాంత్, నేస్తం ఎన్జీఓ సంస్థ సీఈఓ సురేష్, శ్రీవిఘ్నేశ్వర ఎఫ్పీఓ సీఈఓ కొల్లి స్వర్ణపూజిత, డైరెక్టర్లు కొల్లి కేశవచంద్రమోహన్రెడ్డి, జొన్నల రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల సందర్శన చాగంటిపాడు, పెనమకూరు గ్రామ సచివాలయాలను కలెక్టర్ బాలాజీ సందర్శించారు. ఆయా సచివాలయాలను పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. చాగంటిపాడు మండల పరిషత్ పాఠశాలను బాలాజీ సందర్శించారు. అక్కడ గ్యారంటరీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (జీఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం అమలుపై ఆరా తీశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, వలంటీర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్ట్రీమ్లైన్ విద్యార్థుల అభ్యాసన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పెనమకూరులో డ్రోన్ ద్వారా విత్తనాలు చల్లే విధానాన్ని కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. ఎంఈఓలు వెంకటేశ్వరరావు, సురేష్, డెప్యూటీ ఎంపీడీఓ శాంసన్బాబు, ఈఓపీ ఆర్డీ వెంకటేశ్వరమ్మ, ఏఓ గూడపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయండి
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వేసవి నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. స్థానిక ఏపీసీపీడీిసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని జిల్లాల ఎస్ఈలు, ఈఈలతో సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు తీరు గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టర్(ప్రాజెక్టు) డైరెక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. రవాణా శాఖ ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు లబ్బీపేట(విజయవాడతూర్పు): రవాణాశాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పలువురికి సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు బుధవారం ప్రాంతీయ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డే సుందర్ ఉద్యోగోన్నతి పత్రాలు అందజేశారు. కాగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉండటంతో సిబ్బందిపై పనిభారం పెరిగిందని, అర్హతగల జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఇటీవల రవాణాశాఖ ఉద్యోగులు సంఘం ప్రతినిధులు కలిసి విన్నవించారు. వారి వినతి మేరకు అర్హత గత జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. దీంతో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రాజబాబు తదితరులు ఆర్జేటీసీ సుందర్ను కలిసి అభినందించారు. -
కౌలు రైతు భార్య ఆత్మహత్యాయత్నం
పెడన: మండలం పరిధిలోని చెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు యర్రంశెట్టి నాగరాజు భార్య యర్రంశెట్టి వెంకటలక్ష్మి మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామస్తుల కథనం మేరకు.. భీమవరానికి చెందిన కె.వరలక్ష్మికి చెందిన సుమారు 23 ఎకరాలను నాగరాజు కొన్ని సంవత్సరాలుగా కౌలుకు సాగుచేస్తున్నాడు. ఈ పొలాలు పక్కనే చేపల చెరువులు చేస్తున్నారు. దీంతో వరలక్ష్మి తన 23 ఎకరాలను కూడా చేపల చెరువులకు ఇచ్చేందుకు ఆసక్తి చూపించారు. పక్కనే చేపల చెరువులు వస్తే వరి పొలాలను బీడు పెట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో నాగరాజును సంప్రదించి పరిస్థితి వివరించినట్లు సమాచారం. అయితే తాను ఈ ఏడాది కూడా కౌలుకు చేస్తానని, వచ్చే ఏడాది నుంచి మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలని ఆమెను నాగరాజు కోరాడు. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో చర్చలు జరుగుతున్నాయని సమా చారం. ఈ క్రమంలో తనకు పొలం అప్పగించ కుండా చెరువులుగా చేయడానికి వెళ్లిన వారిపై నాగరాజు దాడికి దిగుతున్నాడని, తనకు కౌలు డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మూడు రోజుల క్రితం పెడన పోలీస్స్టేషన్లో నాగురాజుపై వరలక్ష్మి కేసు పెట్టింది. కేసు విచారణ నిమిత్తం నాగరాజును మంగళవారం సాయంత్రం పెడన పోలీస్స్టేషన్కు పిలిపించారు. గ్రామపెద్దలతో కలిసి నాగ రాజు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఈ విషయం తెలిసిన అతని భార్య వెంకటలక్ష్మి ఇంటి వద్ద పురుగుముందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 20267మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వస్వామివారి నిత్యాన్నదాన పథకానికి మచిలీపట్నంకు చెందిన టి. హరికృష్ణ బుధవారం రూ. లక్ష విరాళంగా అందజేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 33.9760 టీఎంసీలు. పెంచిన గ్యాస్ ధరలతో చిరు వ్యాపారుల బతుకు ఛిద్రమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. గ్యాస్ ధర పెంపుకు నిరసనగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్ సందర్శన
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లిలోని బొమ్మల ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఎన్టీఆర్ కలెక్టర్ జి.లక్ష్మీశ బుధవారం సందర్శించారు. ఇటీవల నిర్వహించిన కొండపల్లి బొమ్మల ఉత్సవం విజయవంతమైన నేపథ్యంలో హస్తకళాకారులు సరికొత్త ఉత్సాహం, వినూత్న డిజైన్లతో కళాత్మక వైభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన కొనియాడారు. కొండపల్లి బొమ్మల ఉత్సవంపై కళాకారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హస్తకళాకారుల ప్రగతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్థంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ విస్తరణ, సాంకేతిక సహాయం, ప్రోత్సాహం అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని తెలిపారు. కొండపల్లి బొమ్మలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడంలో అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. మురుగునీటి శుద్ధీకరణకు చర్యలు పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని మురుగునీటిని శుద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు యూనిడో ప్రతినిధులకు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర వివరించారు. బుధవారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లోని సమావేశపు గదిలో యూనిడో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనిడో నిధులతో చేపట్టిన రామలింగేశ్వర నగర్లో 20ఎంఎల్డీ సామర్థ్యం గల సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సింగ్నగర్, జక్కంపూడి, రామలింగేశ్వర నగర్లో గల గ్యాస్ జనరేషన్ ప్లాంట్ గురించి సమీక్షించారు. జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేసి, త్వరగా నగరంలోని వాడుక నీరు మొత్తం శుద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చీఫ్ ఇంజినీర్ ఇన్చార్జ్ పి.సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేఖ, యూనిడో ప్రతినిధులు డాక్టర్ ఎంపీ సింగ్, దీపిక, ఎన్యూ గౌరవ వర్మ, ఇంజినీరింగ్ సిబ్బంది ాల్గొన్నారు. కొత్త ఆర్డీవోల ప్రమాణ స్వీకారం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో)గా వెన్నెల శ్రీను బుధవారం నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్డీవోకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. నందిగామ ఆర్డీవోగా అనిల్కుమార్ నందిగామ రూరల్: డివిజన్లోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు ఆర్డీవో అనిల్కుమార్ పేర్కొన్నారు. నందిగామ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించిన పోసిబాబు అటవీశాఖకు బదిలీపై వెళ్లగా.. ఆయన స్థానంలో స్కిల్ డెవలప్మెంట్లో పని చేస్తున్న అనిల్ కుమార్ ఇక్కడకు వచ్చారు. హనుమజ్జయంతికి ఏర్పాట్లు తాడేపల్లి రూరల్: హనుమజ్జయంతి వేడుకలను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు బుధవారం పేర్కొన్నారు. తాడేపల్లి పట్టణ పరిధి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మూడు రోజులు కైంకర్యాలు జరుగుతాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. -
కమ్మేస్తున్న కాలుష్యం!
పెరుగుతున్న వాహనాలు.. తగ్గుతున్న పచ్చదనం లబ్బీపేట(విజయవాడతూర్పు): పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందా.. అకాల వర్షాలకు కారణం అదేనా అంటే అవుననే అంటున్నారు పర్యావరణ నిపుణులు. రెండేళ్ల కిందట వచ్చిన కుండపోత వర్షాలకు బెజవాడ సగం మునిగింది. ఇప్పుడు కూడా కాలంతో పరిమితం లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అందుకు కారణంగా అధిక కాలుష్య ప్రభావమేనని చెబుతున్నారు. ఢిల్లీ, చైన్నె, ముంబయి, హైదరాబాద్ నగరాల తర్వాత బెజవాడలోనే వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని.. దీంతో భూమిపై నుంచి 15 మీటర్ల వరకూ గాలిలో వాస్తవంగా ఉండాల్సిన ఆక్సిజన్ కంటే తక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. దీంతో మనిషికి సరిపడా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలా పీల్చినప్పుడు విషవాయువులు అధికంగా శరీరంలోకి చేరి వ్యాధులు వ్యాపిస్తాయని.. ఊపిరితిత్తులు, గుండె, న్యూరోలాజికల్, నేత్ర సంబంధ వ్యాధులతో పాటు క్యాన్సర్కు ఇవి మూలకారణంగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. 600 రెట్లు పెరిగిన వాహనాలు.. ఆరోగ్యకరమైన నగరంలో ప్రతి లక్ష మంది జనాభాకు 5వేల వాహనాలు ఉండాలి. అంతకు మించి ఉంటే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలి. ఈ లెక్కన విజయవాడ జనాభా 12లక్షలు కాగా, వాహనాలు 60వేలే ఉండాలి. కానీ ప్రస్తుతం 7 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. వీటిలో ట్రాన్స్పోర్టు వాహనాలు 97వేలు, మోటారు సైకిళ్లు అత్యధికంగా 5.21లక్షలు. నగరం మీదుగా జాతీయ రహదారిపై రోజుకు 40వేల వరకూ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో సిటీ బస్సుల్లో అధికశాతం 10 లక్షలకు పైగా కిలోమీటర్లు తిరిగినవే ఉన్నాయి. ఇలా కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల నుంచి సల్ఫర్ డై ఆకై ్సడ్, నైట్రిక్ ఆకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్, కార్బన్ డై ఆకై ్సడ్ వెలువడుతోంది. వ్యర్థం.. అనర్థం.. విజయవాడలో రోజుకు 600 మెట్రిక్ టన్నుల తడి–పొడి చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను రీ సైక్లింగ్ చేసేందుకు సైంటిఫిక్ డంపింగ్ యార్డులు లేవు. ప్రస్తుతం చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగడం లేదు. ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్వగట్లు వెంబడి పడేసి ఒకేసారి కాల్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మిథేన్, బొగ్గు వాయువులు, కార్బన్ డై ఆకై ్సడ్ వంటివి గాలిలో కలుస్తున్నాయి. దీంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి ఇతర వాయువులు పెరుగుతున్నాయి. బాబోయ్ హాట్ ఐల్యాండ్.. విజయవాడ రానున్న రోజుల్లో హాట్ ఐల్యాండ్గా మారే ప్రమాదం ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. కొద్దికాలంగా నగరంలో ఎక్కడా భారీ వృక్షాలు కనిపించడం లేదు. విశాలమైన పార్కులు కుచించుకుపోయి పూల మొక్కలకే పరిమితం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వాతావరణ సమతుల్యత దెబ్బతిని ఆకస్మికంగా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. విజయవాడలో 20 కిలోమీటర్ల పరిధిలో బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపు వృక్షాలన్నీ కూల్చేశారు. ఎండ తీవ్రతకు వచ్చే ఉష్ణాన్ని ఇంటి శ్లాబ్, సీసీ రోడ్లు పీల్చుకుని, రాత్రిళ్లు వేడిని తిరిగి విడుదల (రీ రేడియేషన్) చేస్తున్నాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రత సాధారణంగా 28 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 32 నుంచి 34 డిగ్రీల స్థాయిలో ఉంటోంది. జనసాంధ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో విజయవాడ ఒకటి. కానీ హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ తరహాలో హరిత వనాలు ఇక్కడ లేవు. కాలువల సుందరీకరణ జరగలేదు. ఇక్కడ పబ్లిక్ వాహనాల కంటే వ్యక్తిగత వాహనాల వినియోగం ఎక్కువగా ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. దీంతో కాలుష్యం కోరలు చాస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 60 శాతం దాటకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. డిస్నీల్యాండ్ లాంటి ప్రాంతంలో హరిత వనాలు అభివృద్ధి చేయాలి. కొండలపై గ్రీనరీ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. – డాక్టర్ తుమ్మల శ్రీకుమార్, పర్యావరణ నిపుణుడు, విజయవాడవాయు కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు, పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో పాటు, ఎక్కువ కాలం కాలుష్య ప్రభావానికి గురైన వారిలో జన్యుపరమైన లోపాలు తలెత్త వచ్చు. బ్రెయిన్ స్ట్రోక్తో పాటు, మెదడుపై ప్రభావం చూపి ఇతర సమస్యలు వస్తాయి. చర్మ వ్యాధులతో పాటు లంగ్స్ దెబ్బతినడం, హార్ట్ ఫెయిల్యూర్కు దారితీయొచ్చు. కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మాస్కులు ధరించడం ఉత్తమం. – డాక్టర్ దేవనబోయిన అనిల్కుమార్, న్యూరాలజిస్ట్, విజయవాడ -
హోరాహోరీగా ఎడ్లబండ లాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో వేంచేసియున్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం రాత్రి జరిగిన ఒంగోలు జాతి సీనియర్ విభాగం ఎడ్ల బండ లాగుడు పోటీలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నిర్వహించిన న్యూ కేటగిరీ విభాగం ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో 20 నిమిషాల వ్యవధిలో 1.450 టన్నుల బరువును పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామానికి చెందిన మంగు రమాదేవి ఎడ్ల జత 4,050 అడుగుల దూరం లాగి ప్రథమ స్థానం, గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండబాలవారిపాలెంనకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షిత, పోతిన లక్షిత్కి చెందిన ఎడ్ల జత 4,006 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలకు చెందిన పిన్నెబోయిన సతీష్ కుమార్ యాదవ్, పల్నాడు జిల్లా రేపల్లెకు చెందిన సుఖవాసి సతీష్బాబు ఎడ్ల జత 3,947 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామలక్ష్మీపురానికి చెందిన కొప్పుల హేమలతారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎడ్ల జత 3,750 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.50 వేలు, రూ.45 వేలు, రూ.40 వేలు, రూ.35 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. -
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
పామర్రు: ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్ అన్నారు. పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలం చోరగుడి, కూడేరు శివారు సమితగుంట గ్రామంలో మద్దతు ధర లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న మొక్కజొన్న రైతులను పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరామర్శించారు. ఆరబోసిన మొక్కజొన్నను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హామీల అమలేది? అనంతరం అనిల్కుమార్ మాట్లాడుతూ కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు రైతులు, ప్రజలకు హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక రైతులను పట్టించుకోకపోవడం ఏమిటని నిలదీశారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని, ఇది నెరవేరిన దాఖలాలు లేవని చెప్పారు. గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం బస్తా మద్దతు ధర రూ.1,775 ఉండగా.. రైతులు మాత్రం రూ.1000 నుంచి రూ.1,300లకే తెగనమ్ముకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ.2,300 ఉండగా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులు రూ.1,200 నుంచి రూ.1,300 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తద్వారా రైతులు నష్టపోతున్నారన్నారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మందా శ్రీనివాస్రెడ్డి, పామర్రు నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు మర్రి బాబూరావు, పమిడిముక్కల మండల పార్టీ అధ్యక్షుడు యలమంచిలి గణేష్, వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోలిమెట్ల కృష్ణ, వైస్ ఎంపీపీ కొడమంచిలి మహేష్, మండల కోఆప్షన్ సభ్యులు అలీ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ -
నిలిపి ఉంచిన ఆటోలో మృతదేహం
చల్లపల్లి: నిలిపి ఉంచిన ఆటోలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రెండు రోజుల తరువాత బుధ వారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. చల్లపల్లి ప్రధాన సెంటర్లో బందర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ పక్కన వీధిలో మరమ్మతులకు గురైన ఆటో ఒకటి కొద్దిరోజులుగా నిలిపి ఉంది. బుధవారం ఉదయం ఆ ఆటోలో ఈగలు ముసురుతుండటంతో కొందరు దగ్గరకు వెళ్లి చూడగా ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ దంపనబోయిన దుర్గాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడిని చల్ల పల్లి మండలం పురిటిగడ్డ కాలనీకి చెందిన ప్రయివేటు ఎలక్ట్రీషియన్ మత్తి శోభనాద్రి(45)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శోభనాద్రి తాగుడుకు బానిస కావటంతో అతని భార్య కొంత కాలంగా దూరంగా ఉంటోంది. ఈ నెల నాలుగో తేదీ రాత్రి 11 గంటల సమయంలో శోభనాద్రి పెట్రోల్ బంకు వద్ద రోడ్డుపై అటూ ఇటూ తిరగడం, ఆటోలోకి వెళ్లిన తరువాత బయటకు రాకపోవడం సమీపంలోని సీసీటీవీ పుటేజీలో రికార్డయింది. ఎస్ఐ దుర్గాంజనేయులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటోలో శోభనాద్రి మృతదేహం మృతదేహం ఉన్న ఆటో -
గ్రంథాలయాల అభివృద్ధికి కీలక నిర్ణయాలు
మచిలీపట్నంఅర్బన్: కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం.ఎస్.బేగ్ అధ్యక్షతన కేంద్ర గ్రంథాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 50 మండలాల్లో గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునికీరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలను సభ్యులు ఆమోదించారు. జిల్లాలోని అనేక శాఖా గ్రంథాలయ భవనాలకు భవనాలకు రంగులు వేయడానికి నిధులు కేటాయించాలని నిర్ణయించారు. బంటుమిల్లిలో కొత్త శాఖా గ్రంథాలయ భవన నిర్మాణానికి కొమ్మారెడ్డి బ్రదర్స్ 406.5 చదరపు గజాల భూమిని దానం చేయడానికి అంగీకరించగా, ఆ భూమిని గ్రంథాలయ సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడానికి సుమారు రూ.1.50 లక్షలు ఖర్చు చేయడానికి కమిటీ ఆమోదం తెలిపింది. డిజిటలైజేషన్కు ప్రాధాన్యం ఉమ్మడి జిల్లా పరిధిలోని 109 శాఖ గ్రంథాలయాల కోసం ప్రతి గ్రంథాలయానికి రెండు సీసీ కెమెరాలు, ఒక కంప్యూటర్ సమకూర్చాలని నిర్ణయించారు. ఇప్పటికే 70 గ్రంథాలయాలకు కంప్యూటర్లు ఉండగా, మిగిలిన గ్రంథాలయాల కోసం 60 కంప్యూటర్లు కొనుగోలు చేయాలని, వాటి నిర్వహణ కోసం ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించారు. గ్రంథాలయాల ఆధునికీకరణకు సంబంధిం రూ.5 లక్షల లోపు పనులను జిల్లా స్థాయిలోనే నామినేషన్ పద్ధతిలో చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రంథాలయాలను ప్రజలకు ఉచితంగా సేవలు అందిస్తున్న విద్యాసంస్థలుగా పరిగణించి, ప్రాపర్టీ టాక్స్ను సెక్షన్ 80సీ ప్రకారం రద్దు చేయాలని, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరాలని నిర్ణయించారు. పాతబడిన, ఉపయోగం లేని పుస్తకాలను తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడంతో పాటు, దెబ్బతిన్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలను తొలగించేందుకు అనుమతి కోరాలని నిర్ణయించారు. పాఠకుల అభ్యర్థన మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఈ సంద ర్భంగా తీర్మానించారు. భవనాల మార్పులు, సౌకర్యాలు.. ఎలమరు శాఖ గ్రంథాలయ భవనం నిర్మాణ పనుల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న పుస్తకాలను తాత్కాలికంగా వేరే భవనానికి తరలించేందుకు సభ్యులు ఆమోదం తెలిపారు. శిథిలావస్థలో ఉన్న మధురానగర్ శాఖ గ్రంథాలయాన్ని వేరే భవనానికి మార్చా లని నిర్ణయించారు. అవసరమైన గ్రంథాలయాల్లో ఎయిర్ కండీషనర్లు ఏర్పాటు చేయడానికీ కమిటీ ఆమోదం తెలిపింది. అజెండాలోని పలు అంశాలను అధ్యక్షుల అనుమతితో సభ్యులు సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రవికుమార్ వయోజన విద్య డీడీ హాజీబేగ్, సమాచార పౌర సంబంధాలశాఖ డీడీ ఎం.వెంకటేశ్వర ప్రసాద్, విద్యాశాఖ ఏడీ విద్యాలత, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ డీసీఆర్బీ అధికారి ఉమర్ అలీ, డీఎల్పీఓ రజావుల్లా, ఎన్టీఆర్ డీపీఓ కార్యాలయం ఏఓ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు కోనేరుసెంటర్(మచిలీపట్నం): పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలు భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఆకాంక్షించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం ఎస్పీ తన కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివితే విజయాలు దరి చేరతాయన్నారు. ప్రజల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు నిమగ్నమైన ఉండే సిబ్బంది కుటుంబాల్లోని పిల్లలు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించటం ఎంతో గర్వంగా ఉందన్నారు. అందుకు పిల్లల తల్లిదండ్రులందరినీ జిల్లా పోలీసు శాఖ తరపున అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులతో పాటు జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్యకిషోర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లీ వ్యథ!
చెదిరిన కల.. విజయవాడలోని 27వేల కుటుంబాల ఆశలు గల్లంతు గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో మాకు ఇంటి స్థలం కేటాయించడంతో ఎంతో సంతోషించాం. కానీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో మాకిచ్చిన స్థలాలు రద్దు చేశారు. వాటి స్థానంలో మరోచోట ఇస్తామంటూ అప్పట్లో హామీ ఇచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఆ హామీ నెరవేరలేదు. మాకు సొంతిళ్లు కలగానే మిలిలేలా ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలి. లబ్ధిదారులకు స్థలాలతో పాటు ఇల్లు కట్టుకునేందుకు సహకరించాలి. – జె. కోటేశ్వరి, కృష్ణలంక సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదలపై చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల సమయంలో పేదలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఊదరగొట్టి.. అధికారంలోకి రాగానే.. రాజధానిలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కత్తి కట్టింది. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని సరికొత్త భాష్యం చెప్పింది. అమరావతిలో పేదలు ఉండకూడదనే పంతాన్ని నెగ్గించుకొంది. గత నెలలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పేదలకు కేటాయించిన భూములను రెవెన్యూ శాఖ నుంచి తిరిగి సీఆర్డీఏకు అప్పగించాలని నిర్ణయించింది. దీంతో పేదల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. పైగా ఈ లబ్ధిదారులకు టిడ్కో గృహాలు నిర్మించి ఇస్తామని హామీనిచ్చి వారిని మభ్యపెడుతోంది. అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఈ అంశం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది. విజయవాడ నగరంలోని 27,031 మంది పేదలతో పాటు గుంటూరు జిల్లాలోని కొంతమంది లబ్ధిదారులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలను 2023 మే నెలలో మంజూరు చేసింది. సీఆర్డీఏ పరిధిలోని అనంతవరం, కురగల్లు, మందడం, నిడమర్రు, పిచ్చుకలపాలెం గ్రామాల పరిధిలో మొత్తం 737 ఎకరాల విస్తీర్ణంలో ఆర్–5 జోన్ పేరిట 14 లేఅవుట్లను సిద్ధం చేసి, జియో ట్యాగింగ్ పూర్తి చేసింది. ఆ లేఅవుట్లను చదును చేసి, అంతర్గత రోడ్లు వేయడంతోపాటు మౌలిక వసతులకు సంబంధించిన పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలకు అనుమతులు తీసుకొచ్చి, ఇళ్లకు శంకుస్థాపన సైతం చేసింది. అయితే రాజధాని రైతులు కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఫుల్ బెంచ్ స్టే ఇవ్వడంతో నిర్మాణాలకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. దానిని తొలగించాలని గత ప్రభుత్వం పేదల తరఫున సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఈ దశలో ప్రభుత్వం మారడంతో.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరావడంతోనే పేదలపైన కక్షపూరితంగా వ్యవహరించింది. సీఆర్డీఏ పరిధిలో ఇచ్చిన ఇంటి స్థలాల పట్టాలు రద్దు చేసింది. పేదల కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించింది. మాకు కూడా స్థలం వచ్చింది. దీంతో సొంత ఇల్లు నిర్మించుకోవచ్చని చాలా సంబరపడ్డాం. కానీ మా ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం మాకిచ్చిన స్థలాలను రద్దు చేసింది. మరో ప్రాంతంలో ఇస్తామని హామీ ఇచ్చారే కానీ, ఇప్పటి వరకూ వాటి ఊసే లేదు. ఎప్పుడిస్తారో తెలియడం లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మాలాంటి వారి సొంతింటి కలను నిజం చేయాలి. – పంతాల విజయకుమారి, కృష్ణలంక గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాల స్థానంలో ఎక్కడి వారికి అక్కడే పేరుతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని లబ్ధిదారులకు టిడ్కో గృహాలు నిర్మించి ఇస్తామని కూటమి ప్రభుత్వం పేదలను మభ్య పెట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో 260, గుంటూరు జిల్లాలో 210 ఎకరాలు టిడ్కో గృహా నిర్మాణాల కోసం స్థలం అవసరం అవుతోందని, స్థలాన్వేషణ చేస్తున్నట్లు కలరింగ్ ఇచ్చింది. అయితే వాటి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గత ప్రభుత్వం ఆరు దశల్లో జల్లెడ పట్టి, అర్హులైన పేదలను గుర్తించింది. చంద్రబాబు సర్కారు ఇంటి పట్టాలు మంజూరైన జాబితాలను పరిశీలించి, అర్హులను గుర్తిస్తామంటూ చెప్పినప్పటికీ ఆ దిశగా ఏ మాత్రం అడుగులు పడకపోవటంతో, ఇళ్ల స్థలాలు మంజూరైన పేదలు చంద్రబాబు సర్కారు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లిదండ్రుల చెంతకు చిన్నారి
త్రినేత్రిగా చిన్నారికి నామకరణం కృష్ణలంక(విజయవాడతూర్పు): మానవత్వంతో పసికందును రక్షించిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు బుధవారం తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. చిన్నారికి త్రినేత్రి అని పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు నామకరణం చేశారు. గత నెల 11వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణలంక రైతుబజార్ వెనుకవైపు జాతీయ రహదారి పక్కనే ఉన్న బాత్రూంలో పాలకొల్లు ప్రాంతానికి చెందిన ఒక మహిళ పసికందును ప్రసవించి అక్కడే వదిలి వెళ్లిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు వెంటనే స్పందించి చిన్నారిని రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. సీసీ పుటేజీ ఆధారంగా పాప తల్లిదండ్రులను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం చిన్నారిని వారి చెంతకు సురక్షితంగా చేర్చారు. పోలీసుల స్పందనను అభినందిస్తూ పాలకొల్లుకు చెందిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ పోలీస్ కమిషనర్ను కలిశారు. ఈ సంద ర్భంగా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లా డుతూ.. మూడో కన్నులా పనిచేసిన సీసీ కెమెరాల సహాయంతో కుటుంబ సభ్యులను గుర్తించిన నేపథ్యంలో చిన్నారికి త్రినేత్రి అని పేరు పెట్టినట్లు తెలిపారు. సాంకేతికత కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాకుండా ప్రాణాలను కాపాడటానికీ ఉపయోగపడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సామాజిక బాధ్యతగా తమ ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్, కృష్ణలంక ఇన్స్పెక్టర్ నాగరాజు, నల్లి రాజేష్, చిన్నారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పెరిగిన గ్యాస్ ధరలతో చిరు వ్యాపారులు కుదేలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పెంచిన గ్యాస్ ధరలతో చిరు వ్యాపారులు కుదేలయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అన్నారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కాళేశ్వరరావు మార్కెట్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం ఆందోళన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈశ్వరయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో నెలవారీ బడ్జెట్ పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పెంపుతో పరోక్షంగా పేద మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగియగానే, ఏమాత్రం కనికరం లేకుండా గ్యాస్ ధరలు అమాంతం పెంచడం ప్రజలను వంచించడమేనని కేంద్రాన్ని దుయ్యబట్టారు. ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,251.50కి చేర్చారన్నారు. దీనివల్ల హోటళ్లు, ఇతర చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ‘అచ్చే దిన్’ అని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాన్యుడికి ‘చచ్చే రోజులు’ తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు, కార్యవర్గ సభ్యులు ఇ.రమణబాబు, తూనం వీరయ్య, ఓర్సు భారతి, నజీర్, నాయకులు బండల రాజు, కంచర్ల నాగేశ్వరరావు, కరోతి వెంకటేశ్వరరావు, బెవర శ్రీనివాసరావు, బుర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పేదల స్థలాలను కబ్జా చేస్తున్నారు!
● జగనన్న కాలనీల లబ్ధిదారులకు అన్యాయం జరిగితే సహించం ● గృహనిర్మాణశాఖ అధికారులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని చిలకలపూడి(మచిలీపట్నం): జగనన్న కాలనీలకు సంబంధించిన లబ్ధిదారులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సుమారు 25వేల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చిందన్నారు. అలాగే జిల్లాలో లక్షకు పైగా ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి వారికి అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేసే పాలకులు మారినా వారి హక్కులు మాత్రం మారవన్నారు. కావాలనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తూ, పలు అడ్డంకులు సృష్టించి.. లబ్ధిదారుల్లో ఉత్సాహం లేదని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. కావాలనే జగనన్న కాలనీలను నిర్వీర్యం చేయటంతో పాటు ఆ కాలనీలను అధికార పార్టీ కార్యకర్తలు కబ్జా చేసే విధంగా చూస్తున్నారన్నారు. 2 వేల టన్నుల స్టీల్ తరలించేస్తున్నారు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం కోసం జిల్లాకు 2 వేల టన్నుల స్టీలు కేటాయించారని, ప్రస్తుత పాలకులు అధికారులతో కుమ్మకై ్క అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆర్డర్లు లేకపోయినా హౌసింగ్ పీడీ కావాలనే అప్పటికప్పుడు ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో తరలిస్తున్నారని.. అప్పటికప్పుడు ఆర్డరు తయారుచేయడానికి ఆయనకు అధికారం ఉందా అని ఆయన ప్రశ్నించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు తరలిస్తున్నామని హౌసింగ్ పీడీ చెబుతున్నారని, అక్కడ గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇక్కడ ఎందుకు నిర్మించుకోవటం లేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాలన్నారు. జిల్లాలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం కోసం నిల్వ చేసిన ఇసుక, సిమెంటు, స్టీలు నిల్వలు ఏమయ్యాయో, ఎలా మాయమయ్యాయో నిగ్గు తేలుస్తామని పేర్ని నాని అన్నారు. ప్రతి బాగోతాన్ని బయటకు తీస్తామన్నారు. గుడివాడలో స్టీలు దొంగతనం జరిగిందని అధికారులు చెబుతున్నారని అవి నిజంగానే దొంగతనం జరిగిందా, లేక అమ్ముకున్నారో తేలుస్తామన్నారు. వీటన్నింటిపై తాను త్వరలో ఏసీబీ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. ఒక వేళ ఏసీబీ అధికారుల విచారణను కూడా పాలకులు అడ్డుకుంటే నిజాలు నిగ్గు తేల్చేలా హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మట్టా మోహననాంచారయ్య, కేశన నాని, మాచవరపు రాంప్రసాద్, చీలి చక్రపాణి, బొల్లా చక్రవర్తి తదితరులు ఉన్నారు. -
బుడమేరు హామీలు.. వరదలకే సరి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలను చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది. బెజవాడ దుఃఖదాయనిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతోంది. బుడమేరు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం అడుగులు వేయటం లేదు. వర్షాకాలాన్ని తలచుకొని బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజలు హడలిపోతున్నారు. 2024లో బుడమేరు అనుభవాలు నీడలా వెంటాతుండటంతో అక్కడ ప్రజల్లో భయాందోళనలు తొలగిపోవటం లేదు. వరదలకు ముందు ఆప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. తరువాత వరద ఆ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. రియల్ రంగం కుదేలైంది. స్థిరాస్తి లావాదేవీలు భారీగా తగ్గిపోయాయి. వరదలు వచ్చి 20 నెలలు గడుస్తున్నా బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం పనులు చేపట్టటం లేదు. ఈ వేసవిలో పనులు చేయకపోతే మళ్లీ వర్షాకాలం ఆందోళనకరమేనని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాబు మాటలు నీటిమూటలే బుడమేరుకు 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారానికిపైగా విజయవాడ కలెక్టరేట్లో బసచేసి హడావుడి చేశారు. విజయవాడలో ముంపు నివారణ కోసం ఎన్నికోట్లు అయినా ఖర్చుచేస్తామంటూ ఆర్భాటంగా చెప్పారు. అంతే.. తరువాత మళ్లీ దాని గురించి పట్టించుకోలేదు. బుడమేరు ఆధునికీకరణకు నిధుల కేటాయింపులో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మొదటిదశలో బుడమేరు ప్రక్షాళన కోసం రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కేవలం గేట్ల మరమ్మతు పనులతో సరిపెట్టారు. గత ఏడాది బుడమేరు గండ్లు పూడ్చివేతకు రూ.43.25కోట్లు మాత్రం మంజూరు చేశారు. ఇందులో కూడా నిబంధనలకు తిలోదకాలిచ్చారు. నిధుల మంజూరుకు ముందే తూతూ మంత్రంగా గండ్లు పూడ్చిన 18 పనులకు సంబంధించి రూ.20కోట్ల పనులకు టెండర్లు పిలిచి మమ అనిపించారు. మిగిలిన రూ.23 కోట్ల పనుల గురించి పట్టించుకోలేదు. తాత్కాలికంగా గండ్లు పూడ్చినా.. కట్టల బలోపేతం, పూడికతీత, సెక్షన్ చేయడం వంటి పనుల ఊసేలేదు. ప్రతిపాదనలకే పరిమితం.. మొదటిదశలో బెజవాడలో బుడమేరు కాలువ సామర్థ్యాన్ని 5వేల క్యూసెక్కుల నుంచి 10వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. ఇందుకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. 13.25 కిలోమీటర్ల వరకు బుడమేరు ఆక్రమణలకు గుర్తెంది. ఇందులో విధ్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 202 ఎకరాలకుగాను 70 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ఈ ఆక్రమిత భూమిలో 3,051 ఇళ్లు నిర్మించినట్లు గుర్తించారు బుడమేరుకు వచ్చే వరద నీటిని సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించేలా ప్రణాళిక రచించారు. దీంతోపాటు చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు యూటీల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎనికేపాడు–కొల్లేరు మధ్య 50.6 కిలోమీటర్ల మేర కాలువ గట్లను మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ఇవన్నీ ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. ఈ వేసవిలోనైనా పనులు చేస్తే వర్షాకాలం ముప్పును తప్పించే అవకాశం ఉంది. అటకెక్కిన బుడమేరు అధునికీకరణ పనులు పలుచోట్ల కనీసం గండ్లుపూడ్చని వైనం విజయవాడ నగరంలో తొలగించని ఆక్రమణలు బుడమేరు పరీవాహక ప్రాంత ప్రజల్లో తొలగని భయాలు ఈ వేసవిలో పనులు చేస్తేనే వర్షాకాలంలో నిశ్చింత -
క్రమశిక్షణతో విజయం సాధ్యం
మచిలీపట్నంఅర్బన్: ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, వ్యక్తిత్వ వికాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతూ ఇటీవల జరిగిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన 56 మందిని సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాషకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, దాన్ని అర్థం చేసుకోవడం, మాట్లాడడం, రాయడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.. ట్రైనీ కలెక్టర్ నమ్రత అగర్వాల్ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ విద్యలో రాణించాలని అన్నారు. డీఈవో యూవీ సుబ్బారావు మాట్లాడుతూ కలెక్టర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులను ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించి పతకాలు, ప్రేరణాత్మక పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, డీటీడబ్ల్యూవో ఫణి ధూర్జటి, మచిలీపట్నం ఆర్డ్డీఓ సాంబశివరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ -
ఎస్సీల సమీకృత ఆర్థికాభివృద్ధికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ కుటుంబాల సమీకృత ఆర్థిక అభివృద్ధికి సమష్టిగా కిృషషి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. సమీకృత ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం (ఐఈడీపీ) ద్వారా ఎస్సీ కుటుంబాల సమగ్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. విజయవాడ కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం ఐఈడీపీపై జిల్లా అధికార యంత్రాంగం, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్డీసీ) ఆధ్వర్యంలో భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్. జి.లక్ష్మీశతో పాటు ఎన్ఎస్ఎఫ్డీసీ చీఫ్ జనరల్ మేనేజర్ సి.రమేష్ రావు, డీజీఎం అమిత్ భాటియా తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఎస్సీ కుటుంబాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకునేలా అందించాల్సిన ప్రోత్సాహంపై చర్చించారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–సూక్ష్మ రుణ సంస్థలు, సహకార సొసైటీలు, సహకార బ్యాంకుల ద్వారా అమలయ్యే పథకాలకు సంబంధించి ఎన్ఎస్ఎఫ్డీసీ అధికారులు వివరించారు. ఎన్ఎస్ఎఫ్డీసీ.. కేశినేని ఫౌండేషన్ భాగస్వామ్యంతో తొలిదశలో నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఐఈడీపీ అమలు చేయనున్నట్లు తెలిపారు. తర్వాత జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. జీవనోపాధికి ప్రోత్సాహకాలు.. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, సీ్త్ర నిధి, ఏపీఎస్ఎఫ్సీ, భాగస్వామ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రాయితీ రుణాలు అందించడం ద్వారా ఎస్సీ కుటుంబాలకు అవసరాల ఆధారంగా జీవనోపాధి కార్యక్రమాలను ప్రోత్సహించడం సమీకృత ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎఫ్డీసీ సీజీఎం సి.రమేష్రావు మాట్లాడుతూ.. ఇంకా ఐఈడీపీ మొత్తం వ్యయం రూ. 20 కోట్లు కాగా, సుమారు 2000 మంది ఎస్సీ లబ్ధిదారులకు యూనిట్కు సగటున రూ. లక్ష చొప్పున రుణం అందించనున్నట్టు చెప్పారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పశు సంవర్థక, ఉద్యాన రంగాల్లో అభివృద్ధికి పుష్కల అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ రంగంలో ఏ2 మిల్క్, ది గోట్ ట్రస్ట్ ద్వారా వినూత్న ప్రాజెక్టుల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, ఎల్డీఎం కె.ప్రియాంక, పశు సంవర్థక అధికారి డాక్టర్. ఎం.హనుమంతరావు, ఉద్యానశాఖ అధికారి పి.బాలాజీ కుమార్, డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈవో పీటీ సెల్వి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ‘ఎఫ్సీఐ’ క్రికెట్ టోర్నమెంట్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) దేశానికి ఆహార భద్రతతో పాటుగా భరోసాను ఇస్తోందని ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ జనరల్ మేనేజర్ విజయ్కుమార్ యాదవ్ చెప్పారు. ఎఫ్సీఐ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ప్రమోషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఆధ్వర్యంలో 6వ అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం డాక్టర్స్ స్పోర్ట్స్ అకాడమీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో మంగళవారం జరిగింది. ఈ టోర్నమెంట్లో శ్రీకాకుళం, వైజాగ్, కాకినాడ, తాడేపల్లిగూడెం, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, రీజినల్ ఆఫీస్ అమరావతికి చెందిన 8 టీమ్లు పోటీపడ్డాయి. మొదటి రోజు (సోమవారం) పోటీల అనంతరం కాకినాడ, వైజాగ్, విజయవాడ, అమరావతి టీమ్లు సెమీ ఫైనల్స్కి చేరాయి. మంగళవారం ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో కాకినాడ, వైజాగ్ టీమ్లు ప్రతిభ చూపి ఫైనల్స్కు చేరుకున్నాయి. మధ్యాహ్నం జరిగిన ఫైనల్స్లో ముందుగా కాకినాడ టీమ్ బ్యాటింగ్కు దిగి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు సాధించగా, వైజాగ్ టీమ్ 13.5 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. ముగింపు వేడుకలలో ముఖ్య అతిథులుగా ఎఫ్సీఐ ఆంధ్రప్రదేశ్ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ యాదవ్ పాల్గొని విజేతలకు బహుతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటుగా ఐక్యత పెంపునకు క్రీడలు దోహదం చేస్తాయని, ఏటా ఎఫ్సీఐ ఉద్యోగులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. -
అనాలోచితం.. గందరగోళం
విద్యా శాఖ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల పాఠ్యపుస్తకాలన్నీ తీసుకుని బ్రిడ్జి కోర్సు పేరుతో 9 నుంచి 10లోకి వస్తున్న విద్యార్థులకు ఇప్పించారు. ఈనెల 25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు అని ప్రకటించారు. తప్పిన విద్యార్థులకు పరీక్షలకు చదువుకోవడానికి వారి దగ్గర పాఠ్య పుస్తకాలు లేకుండా పోయాయి. పరీక్షలకు చదివేదెలా అంటూ వారు వాపోతున్నారు. మచిలీపట్నంఅర్బన్: ఎస్.ఎస్.సి సప్లిమెంటరీ పరీక్షకు సిద్ధమవ్వాల్సిన విద్యార్థులు పాఠ్యపుస్తకాలు లేక గందరగోళంలో పడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రారంభించిన బ్రిడ్జ్ కోర్స్ తీవ్ర ప్రభావం ఎస్ఎస్సి ఫెయిల్ విద్యార్థులపై పడింది. 2025–26 ఏడాది పరీక్షలు పూర్తవటంతోనే 10 వ తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకాలు తీసుకుని ఈ ఏడాది 9వ తరగతి నుంచి 10లోకి ప్రవేశించే విద్యార్థులకు పంపిణీ చేశారు. దీంతో ప్రస్తుతం ఫెయిల్ అయిన విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు లేవు. పుస్తకాలు తీసుకున్న విద్యార్థులు వేసవి సెలవుల కారణంగా వారి వద్ద నుంచి తిరిగి పొందే అవకాశం లేదు. మరోవైపు సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. సమయం చాలా తక్కువగా ఉండటంతో పరీక్షలకు సిద్ధం కావటానికి ఎలా చదివి పాస్ అవ్వాలన్న ఆందోళన విద్యార్థులలో తీవ్రమైంది. జిల్లాలో గణితం, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో గణనీయ సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరికి ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో పాటు ఒక ఊళ్లో విద్యార్థులను వేరే ఊళ్లో ఉన్న పాఠశాలలకు మ్యాపింగ్ చేసిన విధానం కూడా ఆటంకంగా మారింది. లక్ష్యం నెరవేరని బ్రిడ్జ్ కోర్సు.. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బ్రిడ్జ్ కోర్సు క్షేత్రస్థాయిలో విఫలమైంది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 23 వరకు మొత్తం 43 రోజులపాటు ఈ కోర్సును నిర్వహించి, వేసవి సెలవుల నాటికి 25 శాతం సిలబస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అమలు సమయంలో మెజారిటీ ఉపాధ్యాయులు పదో తరగతి పరీక్షల మూల్యాంకన విధుల్లో నిమగ్నమయ్యారు. పాఠశాలల్లో విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం అందలేదు. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు స్వయంగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్రిడ్జ్ కోర్సు లక్ష్యం పూర్తిగా దెబ్బతింది. అంతేకాక బ్రిడ్జ్ కోర్సు విద్యార్థులకు ఇచ్చిన పాఠ్యపుస్తకాలు తిరిగి తీసుకునే అవకాశం లేక సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. ఫలితాల్లో బయటపడిన లోపాలు మార్చి–2026 ఎస్.ఎస్.సి పబ్లిక్ పరీక్షల ఫలితాలు జిల్లాలో విద్యా వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గణాంకాల ప్రకారం మొత్తం 21,053 మంది పరీక్షలకు హాజరుకాగా 18,540 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో మొత్తం 2,513 మంది ఫెయిల్ అవగా అందులో గణితంలో 1,252 మంది, సైన్స్ 1,431 మంది, సోషల్ 770 మంది ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా సైన్స్, గణితం వంటి కీలక సబ్జెక్టుల్లో అధిక సంఖ్యలో ఫెయిల్ నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మండలాల వారీగా... మండలాల వారీగా మచిలీపట్నంలో 192 మంది గణితం, 220 మంది సైన్స్ సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. గుడివాడలో 115 మంది గణితం, 135 మంది సైన్స్లో, పెనమలూరులో 140 మంది గణితం, 155 మంది సైన్స్లో ఫెయిల్ అయ్యారు. గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు వంటి మండలాల్లో కూడా వందల సంఖ్యలో విద్యార్థులు ముఖ్య సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడం గమనార్హం. పదో తరగతిలో తప్పిన విద్యార్థులకు అదే పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, దూర ప్రాంతాల పాఠశాలలకు మ్యాపింగ్ చేయడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి రావడంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. మొవ్వ మండలం కాజ హైస్కూల్లో తప్పిన విద్యార్థులను నిడుమోలు హైస్కూల్కు, మొవ్వ హైస్కూల్ విద్యార్థులను చిన్నముత్తేవి హైస్కూల్కు, కూచిపూడి విద్యార్థులను భట్లపెనుమర్రుకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మ్యాపింగ్ విధానం వల్ల విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కార్మికులపై కక్ష సాధింపు సరికాదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆర్టీసీ యాజమాన్యం కక్షపూరిత చర్యలకు నిరసనగా మంగళవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుందరయ్య అక్రమ సస్పెన్షన్ను రద్దు చేసి వెంటనే విధుల్లో తీసుకోవాలని ఎస్డబ్ల్యూఎఫ్ డిమాండ్ చేసింది. ధర్నాలో పాల్గొన్న ఎస్డబ్ల్యూఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఏలూరులో ఆర్టీసీ నిర్వహించే అవుట్లెట్ డీజిల్ బంకులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. దీనిలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని, ఎలాంటి సంబంధం లేని సుందరయ్య అక్రమ సస్పెన్షన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫెడరేషన్ ప్రతినిధులు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యంను కలిసి చర్చించారు. ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ కట్ట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కానాల గంగాధర్ రావు పాల్గొన్నారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురానికి చెందిన అన్ని త్రివిక్రమ్బాబు కుటుంబం మంగళవారం దుర్గమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచన అనంతరం దాతలకు ఆలయ అధికారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరబాబు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో కూటమి ఎన్నికల వాగ్దానమైన 50ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఎప్పుడు అమలు చేస్తారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న జనగణనలోని బీసీల గణన అవకతవకలు లేకుండా సక్రమంగా చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్రంజన్ మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేసన శంకరరావు మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, క్రీమిలేయర్ ఎత్తేయడం, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ, ఏసీబీ/విజిలెన్స్ కేసుల సత్వర పరిష్కారానికి సహకరించాలని కోరారు. యాచక, సంచార, అర్ధసంచార, సేవా, సామాజిక వృత్తులు నిర్వహించే బీసీ వర్గాల వారందరి ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా 50 శాతం సబ్సిడీ రుణాలను ఇవ్వాలని విన్నవించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఎన్వీఎస్ మూర్తి, యువజన అధ్యక్షుడు పారేపల్లి మహేష్ పాల్గొన్నారు. హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లో ఏటా వైభవంగా నిర్వహించే హనుమజ్జయంతి ఉత్సవాలకు అభయాంజనేయ స్వామి దేవస్థానం ముస్తాబవుతోంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు దేవదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఉదయం హనుమంతునికి సుప్రభాత సేవ, అర్చన, 1008 పూలతో ప్రత్యేక పూజ, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, సాయంత్రం కోలాటం ప్రదర్శన, వెండి, బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలతో పాటు కళావేదికపై నృత్య, మ్యూజికల్, పౌరాణిక, సాంఘిక నాటకాల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. 12వ తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు అంజనీపుత్రునికి పంచామృతాలతో అభిషేకం, ప్రభాత సేవ, అర్చన అనంతరం భక్తులకు దర్శన కల్పిస్తారు. మధ్యాహ్నం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ, సాయంత్రం స్వామి వారి లడ్డూ ప్రసాదం వేలం పాట, గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 7ఎ.కొండూరు: మాధవరంలో సీఎం చంద్రబాబు ఈనెల 9న పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ జి.లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు మంగళవారం ఏర్పాట్లు పరిశీలించారు. సాక్షి విజయవాడ: వీధి విక్రయదారుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ విజయవాడ మునిసిపల్ కార్యాలయం వద్ద హాకర్లు ధర్నా నిర్వహించారు. -
సమ్మర్ కోచింగ్ క్యాంపులను సమర్ధంగా నిర్వహించాలి
శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండీ భరణి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో 26 జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్లను సమర్థవంతగా నిర్వహించాలని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్లపై 26 జిల్లాల్లోని డీఎస్డీవోలు, పీడీలు, పీఈటీలతో అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రవినాయుడు మాట్లాడుతూ కొన్ని జిల్లాలో క్యాంప్ల్లో క్రీడాకారుల సంఖ్య చాలా తక్కువగా నమోదు అయిందని, మరింత ఎక్కువ మంది శిక్షణ తీసుకునేలా డీఎస్డీవోలు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. శిక్షణకు వచ్చిన వారి వివరాలను క్రీడా యాప్లో రిజిస్టర్ చేయాలన్నారు. క్యాంపులను అత్యుత్తమంగా నిర్వహించిన డీఎస్డీవో, పీడీ, పీఈటీలు, యూత్ సర్వీస్ అధికారులను ముగింపు సభలో సత్కరిస్తామన్నారు. డీఎస్డీవోలు, పీఈటీలు, యూత్ సర్వీస్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కంచికచర్ల : ఈదురుగాలులకు రోడ్డుపై కూలిపోయిన చెట్టును తప్పించే క్రమంలో ఆటో పల్టీ కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలంలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... కంచికచర్లలో ఓ ఇంటి శ్లాబ్ వేసేందుకు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నడకుదిటి పోలీసు ఇబ్రహీంపట్నం మండలం దొనబండ గ్రామానికి చెందిన షేక్ మీరాబీ, కె.జానమ్మ, ఒడిశాకు చెందిన దొనబండలో నివాసం ఉండే సావిత్రి, కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన కె.చంద్రతో పాటు మరో ఇద్దరు కార్మికులను ఆటోలో ఎక్కించుకుని కంచికచర్ల వస్తున్నాడు. రాత్రి సమయంలో ఈదురుగాలులు వీచటంతో పరిటాలలో రోడ్డుపక్కన ఉన్న చెట్టు రోడ్డుపై పడింది. దీంతో ఆటో డ్రైవర్ రోడ్డుపై పడిన చెట్టును తప్పించే క్రమంలో ఆటో పల్టీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కంచికచర్ల, నందిగామ 108 వాహన సిబ్బంది నలుగురు క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురిని కంచికచర్ల పీహెచ్సీకి తరలించారు. ఆటో డ్రైవర్ కుడి చేయి విరిగింది. బాధితుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై తమకు సమాచారం అందలేని పోలీసులు తెలిపారు. -
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా...
విద్యార్థుల భవిష్యత్తుతో విద్యాశాఖ ఆడుకుంటోంది. బ్రిడ్జ్ కోర్సు పేరిట ముందస్తు ప్రణాళిక లేకుండా పాఠ్యపుస్తకాలను తీసుకుని పదో తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చేతిలో పాఠ్యపుస్తకాలు లేకుండా చేశారు. మ్యాపింగ్ పేరుతో విద్యార్థులను దూర ప్రాంతాలకు పంపించడం, పుస్తకాలు లేకుండా చదవమని చెప్పడం వంటి నిర్ణయాలు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనాలు. – అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ -
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
పామర్రు: భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను అతి కిరాతకంగా ఇనుప రాడ్డుతో మోది హతమార్చిన ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని గుడివాడ డీఎస్సీ పి.శ్రీనివాస్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం డీఎస్పీ నిందితుల వివరాలను వెల్లడించారు. దిమ్మిటి ప్రసన్నకుమారి(30) తన భర్త మురళీ కృష్ణతో వివాదాల కారణంగా భర్తను వదిలేసి మరో వ్యక్తితో పామర్రులో సహజీవనం చేస్తోంది. తనతో కాపురం చేయకుండా కుటుంబ పరువు తీస్తున్నట్లుగా భావించిన మురళీకృష్ణ తన అన్నదమ్ములను వెంట బెట్టుకుని ఈనెల 4వ తేదీ ఉదయం రెండు బైక్లపై పామర్రు వచ్చాడు. ప్రసన్నకుమారి ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఇనుప రాడ్డుతో మోది చంపాడు. అనంతరం నిందితులు అక్కడ నుంచి పారిపోతూ దుస్తులు, ఆమెను చంపడానికి ఉపయోగించిన ఇనుపరాడ్డును గుడివాడ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పోదలలో పడవేసి వెళ్లి పోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి గోళ్ల రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీప్రసన్న కుమారిని తన అల్లుడు మురళీ కృష్ణ, అన్నయ్య రాంబాబు, మరో తమ్ముడు నాగేశ్వరరావు అలియాస్ చంటి తన అన్నయ్య రాంబాబు కుమారుడు మైనర్ అయిన మరో వ్యక్తితో కలిసి తన కుమార్తెను ఇనుప రాడ్డుతో కొట్టి చంపినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొన్నారు. దీనిపై అప్పటి పామర్రు ఇన్ఛార్జి గుడివాడ టూ టౌన్ సీఐ హనీష్ కొంది మంది సాక్షులను విచారించగా తదుపరి పామర్రు సీఐగా బాధ్యతలు స్వీకరించిన సీహెచ్ నాగ ప్రసాద్ విచారణను కొనసాగిస్తూ మరి కొందరు సాక్షులను విచారించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో పామర్రు నుంచి గుడివాడ వెళ్లే రోడ్డులో కొత్తూరు దాటిన తర్వాత కొడాలి రామేశ్వరరావు మునగతోట పక్కన నిందితులు వారు దాచిన ఇనుప రాడ్డు బట్టలు వెతుకుతుండగా, పామర్రు సీఐ సీహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ కె.శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నిందితులను పట్టుకున్నారు. ఇనుపరాడ్డు, దుస్తులు, వారు వాడిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. నిందితులను తదుపరి విచారణ కోసం కోర్టులో హాజరు పరుస్తామన్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పామర్రు సీఐ, ఎస్ఐలను ఆయన అభినందించారు. -
11 ఏళ్లకే పెళ్లి.. 12 ఏళ్లకు తల్లి
హై రిస్క్ ప్రెగ్నెన్సీ.. ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముక్కుపచ్చలారని 11 ఏళ్ల బాలికకు వివాహం జరిపించారు. ఆ బాలిక పెళ్లయిన ఏడాదిలోనే గర్భం దాల్చింది. 12వ ఏట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు విజయవాడ నగరంలోనే జరి గింది. విజయవాడకు చెందిన 11 ఏళ్ల బాలికకు, గన్నవరం ప్రాంతానికి చెందిన యువకుడితో ఏడాది క్రితం పెళ్లి చేశారు. బాల్య వివాహాలను అరికడుతున్నామని చెబుతున్న మాతా శిశు సంక్షేమ శాఖ, అంగన్వాడీ కేంద్రాలు, బాలికల సంరక్షణ కోసం పని చేస్తున్న సంస్థలు, పోలీసుల కళ్లు గప్పి ఏడాది క్రితం ఈ బాల్య వివాహం చేయించారు. ఆ బాలిక గర్భం దాల్చింది. డెలివరీ సమయంలో హైరిస్క్ కావడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆస్పత్రిలో సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా బాల్య వివాహాలను అరికట్టి.. బాలికలను రక్షించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కిశోర బాలికల సాధికారతకు వేసవి శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కిశోర బాలికల వేసవి శిబిరాలకు సంబంధించిన వాల్పోస్టర్ను కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కిశోర బాలికల సమగ్రాభివృద్ధి కోసం మే ఒకటి నుంచి ప్రారంభం కాగా దీనికి సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. జూన్ 11 వరకు కార్యక్రమం నిర్వహించాలన్నారు. బాలికలు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, ఆరోగ్యమేళా, రక్తహీనత నివారణ తదితర అంశాలపై శిబిరాల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమం అమలులో మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య, పోలీస్శాఖలు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశుసంక్షేమశాఖ పీడీ ఎంఎన్ రాణి, జిల్లా బాలల సంరక్షణాధికారి బి.కిషోర్, నోడల్ అధికారి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ లీగల్: ఇటీవల దేశద్రోహం కేసులో అరైస్టెన 11 మందికి ఈనెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను వర్చువల్గా విజయవాడ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు బి.రాధారాణి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ను మరోసారి పొడిగిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. పెనమలూరు: కానూరులో బాలుడిపై ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ పడటంతో మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తట్టికోట ధనలక్ష్మి భర్త సాయి తాడేపల్లిలో ఉంటారు. వారికి దేవాన్ష్ (3) కుమారుడు ఉన్నాడు. ధనలక్ష్మి 7 నెలల గర్భిణి. ఆమె కానూరు తులసీనగర్లో ఉన్న పుట్టింటికి ఇటీవల వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రేకుల షెడ్డులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటి పనులు చేయడం కోసం కుమారుడిని రేకుల షెడ్డులో పడుకోబెట్టింది. అయితే రేకుల షెడ్డు పై ఉన్న మంచినీటి ట్యాంక్ ఒక్కసారిగాపై నుంచి నిద్రిస్తున్న బాలుడి పై పడింది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యవసర చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఘటన పై తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
తాళపత్ర గ్రంథాలు ఇక కొత్తగా..
తాళ పత్ర గ్రంథాలు అనగానే ఒక మతపరమైనవి అన్న అపోహ వీడాలి. వందల ఏళ్ల నాడు ప్రతీది తాళపత్ర, తామ్ర పత్ర గ్రంథాల్లోనే లభించేది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముందుగా ఈ మాన్యుస్క్రిప్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేస్తున్నాం. ఠాగూర్ గ్రంథాలయంలో రామాయణంలోని యుద్ధకాండ, ఉత్తర కాండకు సంబంధించినవి ఉన్నాయి. ఆయుర్వేదానికి సంబంధించిన తాళపత్రాలు లభ్యమయ్యాయి. వీటన్నింటిని స్కాన్ చేసి జ్ఞాన భారతం మిషన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. ఎవరి వద్దనైనా తాళ పత్ర గ్రంథాలు ఉంటే వాటిని డిజిటలైజేషన్ చేసిన తర్వాత తిరిగి అప్పగిస్తాం. –డాక్టర్ ఇందిర మలపాక, డైరెక్టర్, మాన్యుస్క్రిప్ట్స్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏఐ, డిజిటల్ యుగంలో ఒక్క క్లిక్తో కావాల్సిన సమాచారం మన ముందుంటుంది. వందల ఏళ్ల నాడు కాగితం, కలం లేని రోజుల్లో జ్ఞానమంతా తాళ పత్ర, తామ్ర పత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. ఇతిహాసాలు, సకల శాస్త్రాలు, రోజువారీ వ్యవహారాలను తాళ పత్ర గ్రంథాల్లో భద్రపరిచేవారు. అయితే తాళపత్ర గ్రంథాలు.. విశిష్టత.. అవి అందించిన జ్ఞాన సంపద నేటి తరానికి తెలీదు. ఎలక్ట్రానిక్ యుగం మొదలైనా. నేటికీ కొన్ని మ్యూజియాలు, గ్రంథాలయాల్లో, కళాశాలల్లో, పరిశోధనాలయాల్లో అక్కడక్కడ తాళ పత్రాలు గ్రంథాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని పూర్తిగా శిథిలం కాగా... మరికొన్ని పాక్షికంగా పాడయ్యాయి. తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమైన జ్ఞానాన్ని, ఆ వారసత్వ సంపదను భావితరాలకు అందించడానికి నడుం కట్టింది ‘జ్ఞాన భారతం’ మిషన్. ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే జ్ఞానభారత్ మిషన్లో భాగంగా మాన్యుస్క్రిప్ట్స్ అయిన తాళపత్రాలు, తామ్ర పత్రాలను డిజిటలైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సర్వే, క్యాటగైరేజషన్, ప్రిజర్వేషన్, డిజిటలైజేషన్ చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని గ్రంథాలయాల్లో ప్రారంభమైంది. ఠాగూర్ గ్రంథాలయంలో రామాయణం 2, చిత్తరంజన్ గ్రంథాలయంలో ఆయుర్వేదానికి ఒకటి తాళ పత్ర గ్రంథాలు ఉన్నట్లు గుర్తించారు. పీబీ సిద్ధార్థ కళాశాలలో 5 తాళ పత్రాలు, ఆర్కియాలాజికల్ మ్యూజియం, ఓరియంటల్ లైబ్రరీలో వివిధ రకాలైన మాన్యుస్క్రిప్ట్లను గుర్తించారు. వీటిని డిజిటలైజేషన్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించారు. చెద, దుమ్ము , ధూళి దులిపి వేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న వాటికి స్పిరిట్ పూస్తున్నారు. వాటి జీవిత కాలం పెంచేందుకు నిమ్మగడ్డి రసం రాస్తున్నారు. ఈ ప్రక్రియ తర్వాత వాటిని స్కాన్ చేసి .. మొత్తం డిజిటలైజ్ చేస్తారు. ఇప్పటికే దాదాపుగా ఈ ప్రక్రియ ముగియవచ్చింది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 20269గంపలగూడెం: నెమలి శ్రీ వేణుగోపాలస్వామి వారికి సోమవారం చందన అలంకరణ చేసినట్లు ఆలయ ఏసీ ఎన్ సంధ్య తెలిపారు. వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు చేశారు.మోపిదేవిలోని: శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి వి.గోపాలకృష్ణారావు దంపతులు సోమవారం దర్శించుకున్నారు.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 525.30 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
మరిన్ని విజయాలు అందుకోవాలి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పది ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు మరిన్ని విజయాలు అందుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు సంబంధించి టెన్త్ ఫలితాల్లో 580, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులతో పాటు 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సోమవారం సత్కరించారు. ఈ కార్యక్రమం నగరంలోని సాయి జువెల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్కు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. విద్యార్థులను పతకాలు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అందరి చొరవ ఫలితంగా ఈ ఏడాది పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించామన్నారు. 72 శాతం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ‘పది’ పరీక్షల్లో మరింత ఉన్నత విజయాలు సొంతం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడానికి సత్కారంతో పాటు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మహమ్మద్ ఎ.ఫర్హీన్ 595 మార్కులు, కె.నాగదుర్గారాణి 593, జి.నిత్య సాత్విక 591 మార్కులతో ఇలా ఎందరో విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకునేందుకు మనసుస్న మార్గదర్శులు ‘పీ4’ ద్వారా ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎల్.చంద్రకళ, డెప్యూటీ డీఈవోలు సాంబశివరావు, గుర్నాథం, శ్యాంసుందర్, మార్గదర్శి యు.నిరుపమ బలరాం, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలి
పీజీఆర్ఎస్లో కలెక్టర్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా ప్రజల నుంచి వచ్చే అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని ఎన్టీఆర్ జిలా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాస్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషిచేయాలని ఆదేశించారు. అర్జీదారులకు సకాలంలో సమాచారం అందిస్తూ పారదర్శకత పాటించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి వ్యవహరించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. మొత్తం 98 అర్జీలు పీజీఆర్ఎస్ ద్వారా వివిధ శాఖలకు సంబంధించి 98 అర్జీలు అందాయన్నారు. వీటిలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 29 అర్జీలు, రెవెన్యూ 21 దరఖాస్తులు, పోలీసు శాఖ 12, పంచాయతీరాజ్కు 9 అర్జీలు వచ్చాయి. డీఆర్డీఏకు 8, పౌర సరఫరాలు, ఏపీఎస్ ఆర్టీసీలకు మూడు చొప్పున, విద్య, విద్యుత్ శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, రవాణా, బీసీ సంక్షేమం, ఇరిగేషన్, కాలుష్య నియంత్రణ, కార్మిక, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్ అండ్ బీ శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున అందాయన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనం రద్దు చేసి రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. దీంతో ఉదయం 11గంటల కల్లా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. మరో వైపున అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులోని పార్కింగ్ ప్రదేశం పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో కార్లు ఇతర వాహనాలను కనకదుర్గనగర్కు మళ్లించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దుర్గాఘాట్ స్నానాల రేవులో అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవులోని గట్టుపై మట్టి, వ్యర్థాలు నదిలో పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. -
ప్రశాంతంగా నీట్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్–2026 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 11,496మంది విద్యార్థులను కేటాయించగా అందులో 11,345మంది విద్యార్థులు హాజరవగా.. 98.69 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు జిల్లాలో 32 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం ఈ పరీక్షను నిర్వహించారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్ష కొనసాగింది. విద్యార్థులను 11.00 గంటల నుంచి పరీక్ష జరిగే ప్రాంగణాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల ప్రధాన ద్వారాలను మూసివేశారు. అభ్యర్థుల హాల్టికెట్తో పాటుగా ఇతర గుర్తింపు కార్డుల ఉంటేనే లోపలకు అనుమతించారు. పొడవాటి దుస్తులు, బూట్లు, నగలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించి అభ్యర్థులను లోపలకు అనుమతించారు. అనంతరం విద్యార్థులు బయోమెట్రిక్ పరిశీలన చేసి ఆ తదుపరి పరీక్ష గదిలోకి అనుమతించారు. సందడి వాతావరణం.. విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రా ల పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. వారి వాహనాలతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. మధ్యా హ్నం 1.30 గంటల వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు గేట్ల వద్దనే నిలిచి ఉన్నారు. స్థానిక పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించటంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూశారు. -
రామాలయం నిర్మాణానికి రూ.లక్ష విరాళం
సంకీర్తనలతో భక్తిభావం విజయవాడకల్చరల్: అన్నమాచార్యుని 618 జయంతి సందర్భంగా అన్నమయ్య సంకీర్తన అకాడమీ (శ్వాస) లబ్బీపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యాన ఆదివారం అన్నమయ్య సంకీర్తన యజ్ఞం 12 గంటలపాటు నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన బాల, యువ, సంగీత కళాకారులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తి భావాన్ని పంచాయి. పరాశరం వరేణ్య, లలితా శ్రీవల్లి, కె.వైష్ణవి, పోపూరి షణ్ముఖ ప్రియ, నాగనందిని, సీహెచ్ హరిత, అనూరాధ, ద్దాదశి అనూష, గురుచరణ సంగీత మండలి శిష్య బృందం, తదితరులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. సంస్థ బాధ్యులు సత్యబాలు, ప్రసాద్ నిర్వహించారు. దేవాలయం ఇన్ చార్జి ఆర్.రామ్మోహనరావు, మేనేజర్ శర్మ పాల్గొన్నారు. ● సీతారామ కల్యాణ మండపంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ముఖ్యఅతిథి డేవిడ్రాజు మాట్లాడుతూ అన్నమయ్య పదాలు తెలుగు భాషా వీచికలు అని అభివర్ణించారు. గాయకులు పప్పు సదాశివశాస్త్రి, పీవీఎస్ మూర్తి, వడ్డాది కామేశ్వరి, బి.కామేశ్వరిని నిర్వాహకుడు చింతకాయల చిట్టిబాబు ఆత్మీయంగా సత్కరించారు. నవ్వు దివ్య ఔషధం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మనిషి ఆరోగ్యకరమైన జీవితానికి నవ్వు దివ్య ఔషధమని లాఫ్టర్ యోగా క్లబ్ ఫౌండర్ చైర్మన్ తొండెపు వెంకట హనుమంతరావు చెప్పారు. స్థానిక ఎంజీ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలోని విజయవాడ వాకర్స్ అసోసియేషన్ హాలు వద్ద ప్రపంచ నవ్వుల దినోత్సవం ఆదివారం జరిగింది. హనుమంతరావు మాట్లాడుతూ నవ్వు నవ్వించు, ఆనందంగా జీవించు అనే నినాదంతో స్టేడియంలో నడకయాత్ర చేశారు. లాఫింగ్ యోగా జాతీయ వ్యవస్థాపకులు మదన్ కొఠారియా పంపిన సందేశాన్ని చదివారు. వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రావి కృష్ణారావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రభాకరరావు, బి.సంజీవరావు, పీవీఎస్ఎన్ శర్మ, బి.రాంబాబు, చుక్కపల్లి అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి వీరులపాడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనలో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిమన్యు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు మండలంలోని జయంతి గ్రామానికి చెందిన గల్లా పుల్లారావు శుభకార్యాల్లో వినియోగించే మేళతాళాల వాయిద్యకారుడిగా పని చేస్తుంటాడు. వృత్తిలో భాగంగా శనివారం ఉదయం పెద్దాపురం గ్రామంలోని శుభకార్యంలో పాల్గొని సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినట్లు తెలిపారు. అతపిరి అలసటగా, గుండెలో నొప్పిగా ఉందని భార్యకు తెలపగా హుటాహుటిన నందిగామలోని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. మృతుని భార్య దుర్గ ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వర్షంతో నిలిచిన బండలాగుడు పోటీలు
నందిగామ రూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు ఆదివారం నిలిచిపోయాయి. సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో నాలుగు పళ్ల విభాగం పోటీలను నిలిపివేసినట్లు రైతు కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం వర్ష ప్రభావం లేకపోతే పోటీలు యథావిధిగా సాగుతాయని చెప్పారు. రెండు పళ్ల విభాగంలో విజేతలు గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన రెండు పళ్ల విభాగం.. ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీల్లో తొమ్మిది జతలు పాల్గొన్నాయని రైతు కమిటీ సభ్యులు తెలిపారు. పది నిముషాల వ్యవధిలో ఎనిమిది క్వింటాళ్ల బరువును 3,648 అడుగుల దూరం లాగి ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన బెల్లం రిత్విక్ చౌదరి, యువరాజ్ చూదరి, పల్నాడు జిల్లా నరసారావుపేట మండలం దొండపాడు గ్రామానికి చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జతలు ప్రథమ స్థానంలో నిలిచాయి. పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం కావూరిలింగంగుంట్లకు చెందిన మైలం త్రివేణి నాయుడు ఎడ్ల జత మూడు వేల అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలవగా పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యవరానికి చెందిన పయ్యావుల ఝాన్సీలక్ష్మి, బాలనాగరాజు, యలం వెంకటరావు ఎడ్ల జత 2,906.7 అడుగుల దూరం లాగి తృతీయ స్థానం, గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కేలం పద్మనాయుడు ఎడ్ల జత 2,500 అడుగుల దూరం లాగి నాలగవ స్థానంలో నిలిచింది. విజేతల ఎడ్ల జత యజమానులకు వరుసగా రూ.25 వేలు, 20 వేలు,18 వేలు,15 వేల నగదు బహుమతి, జ్ఞాపికను ఆలయ కమిటీ చైర్మన్ చిరుమామిళ్ల లక్ష్మీ సాయిబాబు, రైతు కమిటీ సభ్యులు అందజేశారు. రైతు కమిటీ సభ్యులు వడ్లమూడి పెద్దశ్రీను, ఉమ్మనేని విక్రం, అత్తలూరి వెంకట్రావు, దిగుమర్తి రాంబాబు, గంటా శివాజీ, చిరుమామిళ్ల రాంబాబు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మకు కానుకగా బంగారు గాజులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు ఆదివారం బంగారు గాజులను కానుకగా సమర్పించారు. హైదరాబాద్కు చెందిన ఎంపిడి కల్యాణి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణను కలిసిన దాతలు సుమారు 24 గ్రాముల బంగారంతో రూ. 3లక్షల వెచ్చించి తయారు చేయించిన గాజులను అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. వైభవంగా ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం పెనుగంచిప్రోలు: నూతనంగా నిర్మించిన శ్రీఈశ్వరీదేవి అమ్మవారి ఆలయ, విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఆదివారం భక్త జన సందోహం మధ్య వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీవిశ్వజ్యోతిర్లింగ పీఠాధిపతి రామడుగు నరసింహాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు, హోమాలు పూర్ణాహుతితో ముగిశాయి. అమ్మవారి విగ్రహంతో పాటు కుమారస్వామి, వినాయకుడి విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠా కార్యక్రమం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించా. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి వేసవి శిక్షణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిమ్నాస్టిక్స్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్ సోమవారం నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కార్యదర్శి బి.బాబూరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏడు నుంచి 16 ఏళ్ల లోపు వయస్సు బాలబాలికలు ఈ కోచింగ్ క్యాంప్లో పాల్గొనవచ్చని, ఆటోనగర్ ఆర్టీసీ కాలనీలోని జేబీఎస్ విద్యాధర్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. జిమ్నాస్టిక్స్లో జాతీయ స్థాయి క్రీడాకారులు ఎస్.ఐశ్వర్య, వి.నీలవేణి, ఎస్.కీర్తన ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ శిక్షణలో పాల్గొంటారని వివరించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష ఎ.కొండూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9న ఎ.కొండూరు మండలం మాధవరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని, హెలీప్యాడ్ కోసం కేటాయించిన స్థలాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు రాజముద్రతో కూడిన సరికొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. సీఎం పర్యటనలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, పర్యటనను దిగ్విజయం చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్తోపాటు జేసీ ఇలక్కియా, ఆర్డీవో ఎ.కుమార్, సీఐ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ హియరింగ్ హ్యాండీ క్యాప్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీహెచ్హెచ్ఈఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోమ్లో ఆంధ్ర ప్రదేశ్ హియరింగ్ హ్యాండీక్యాప్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీహెచ్హెచ్ఈఏ), అమరావతి నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా వి.కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎ.వెంకట్రెడ్డి, ప్రధానకార్యదర్శిగా ఎ.కన్నా, కోశాధికారిగా ఎస్కే ఇమామ్ ఖాసీం ఎన్నికయ్యారు. -
విద్యుదాఘాతంతో పెయింటర్ మృతి
బంగారు గొలుసు కోసం.. వృద్ధురాలిపై హత్యాయత్నం పామర్రు: పమిడిముక్కల మండలం ధూళిపూడిపాలెంలో వృద్ధురాలికి ఉన్న బంగారు నగ కోసం స్థానికుడు హత్యాయత్నం చేసిన సంఘటనపై ఆదివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం ధూళిపూడి పాలెంకు చెందిన మైనేని సీతామహాలక్ష్మి వృద్ధురాలు. వేసవి కాలం కావడంతో ఇంటి వరండాలో శనివారం రాత్రి నిద్రకు ఉపక్రమించింది. అదే గ్రామానికి చెందిన ధూళిపూడి గురవయ్య అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి నిద్ర పోతున్న సీతామహాలక్ష్మి మెడలో ఉన్న బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన దుండగుడు తనతో పాటు తెచ్చిన కొడవలితో ఆమె తలపై, చేతిపై గట్టిగా నరికాడు. ఇంతలో స్థానికులు అక్కడికి చేరుకోవడంతో గురవయ్య పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత మహిళను విజయవాడ ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. స్థానికుల ఫిర్యాదుపై గురవయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పమిడిముక్కల మండలం ఎస్ఐ బి.శ్రీను తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం కృష్ణలంక(విజయవాడతూర్పు): కృష్ణానదిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పద్మావతి ఘాట్ సమీపంలో రైల్వేట్రాక్ కింద కృష్ణానదిలో ఒక వ్యక్తి మృతదేహం తేలుతున్నట్లు ఆదివారం ఉదయం 9 గంటలకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని వయస్సు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చని, ఊరు, పేరుకు సంబంధించి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడు బ్లూకలర్ ఫుల్ అండర్వేర్, రెడ్ కలర్ మొలతాడు ధరించి ఉన్నాడని చెప్పారు. నదిలోకి స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94921 48188, 98498 08555 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
కోట్లాది రూపాయల స్థలంపై కన్ను!
టాస్క్ఫోర్స్(విజయవాడ): నగరంలో అధికార పార్టీకి చెందిన వారు విలువైన స్థలాలపై కన్నేసి లబ్ధి పొందే విష సంస్కృతికి పాల్పడుతున్నారు. ఆర్ఎస్ నంబరు 785/3 దాఖలా నున్న రోడ్డులో డీమార్ట్కు పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలం ఉంది. దీనిపై కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. స్థలంలో ప్రస్తుతం ఓ వర్గంవారు పొజిషన్లో ఉన్నారు. దీనిపై పూర్తి హక్కులు మద్దాలి వివేకానందకు వర్తిస్తాయని ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన వర్గీయులు శనివారం నున్న పీఎస్లో చూపించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. అదే సమయంలో సెంట్రల్ నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్యనేత తన అనుచరులను స్థలం వద్దకు పంపారు. కొన్నేళ్లుగా పొజిషన్లో ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రెండు వర్గాల వారిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి కొంతసేపటికి తిరిగి పంపేశారు. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నేత తన మనుషులతో ఎండనుంచి రక్షణ కోసం కూలర్లు ఏర్పాటు చేసుకుని మరీ స్థలంలో తిష్ట వేశారు. ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేత ఈ విషయంలో ఆసక్తి చూపడంతో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్ నందు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివిధ సేవా టికెట్ల ద్వారా ఆదివారం రూ. 5,68,242 వచ్చినట్లు ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. -
ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్
కంకిపాడు: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగోన్నతులు త్వరితగతిన కల్పించాలని ఉమెన్ హెల్త్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర చైర్ పర్సన్ వీకేఎన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం కంకిపాడులో నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ మూడేళ్లుగా ఉద్యోగోన్నతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న రవాణా భత్యాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కృష్ణాజిల్లా కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా శ్యామల, కార్యదర్శిగా ప్రమీలారాణి, ఉపాధ్యక్షురాలిగా రేణి రాజ్యం, ఉప కార్యదర్శిగా మంజుల, అసోసియేటెడ్ అధ్యక్షురాలిగా డి.నిర్మల ఎన్నికయ్యారు. ఏలూరు జిల్లా అధ్యక్షురాలు మోహనబాయి, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. -
దళితులంతా ఐక్యంగా ముందుకు సాగాలి
కృష్ణలంక(విజయవాడతూర్పు): దళితవాడల అభివృద్ధి కోసం, దళితవాడలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించాలంటే దళితులంతా ఐక్యంతో ముందుకు సాగాలని అంబేడ్కర్స్ ఇండియన్ మిషన్(ఏఐఎం) వ్యవస్థాపకుడు, ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్కుమార్ పేర్కొన్నారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఏఐఎం ఆధ్వర్యంలో ఆదివారం ‘మన వాడ – మన పంచాయతీ – మన పాలన’ అంశంపై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ.. దళితవాడల అభివృద్ధి కోసం పాలకులు కోట్ల రూపాయల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు కేటాయిస్తున్నా వాటి అభివృద్ధి నామమాత్రంగానే ఉందని, ఏటా రూ.10 వేల కోట్లకు పైగా మిగులుతున్నాయని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి కోసం, దళితవాడల అభ్యున్నతి కోసం ఆయా ప్రాంతాలను గ్రామపంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంత వాసులే సర్పంచులుగా విధులు నిర్వర్తించుకొని ఆయా వాడలను అభివృద్ధి చేసుకుంటారని సూచించారు. మాల మాదిగలు అందరూ ఐక్యతతో ముందుకు సాగడానికి కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.జె.విద్యాసాగర్ మాట్లాడుతూ దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగానే పరిగణించాలని డిమాండ్ చేశారు. అణగారిన కులాలన్నీ ఒక్కటై ప్రధాన శత్రువును గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, సీపీఐ నాయకుడు దోనెపూడి శంకర్, ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు మందా వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమేష్, ఉపాధ్యక్షుడు జె.వెంకటప్పయ్య పాల్గొన్నారు. ఏఐఎం వ్యవస్థాపకుడు సునీల్కుమార్ -
అకాల వర్షం.. ఈదురుగాలులు
పెనుగంచిప్రోలు: అకాల వర్షం, ఈదురు గాలులు మామిడి రైతులను నష్టపరిచింది. ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణం మారడం.. నల్లని మేఘాలు కమ్ముకుని వచ్చిన వర్షం గాలులకు మామిడి నేలరాలింది. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి, ధాన్యం తడిసి పోయింది. అసలే అంతంత మాత్రం కాపు వచ్చిన మామిడి ఈదురు గాలులకు వర్షార్పణమైందని రైతులు వేదన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న, మిర్చి పట్టాలు కప్పినా భారీ గాలికి కొట్టుకు పోయాయి. ఈఏడాది రబీసాగు చేస్తున్న రైతులతో పాటు, మామిడి, మొక్కజొన్న మీద ఆశలు పెట్టుకున్న రైతులందరికీ చేదు అనుభవమే ఎదురైంది. రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు పట్టాలు కూడా ప్రభుత్వం అందించలేక పోతోందని అంటున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నారు. గాలులకు అనిగండ్లపాడు–గుమ్మడిదుర్రు రోడ్డులో మూడు విద్యుత్ స్తంభాలు కూలడంతో రాకపోకలతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలంలో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. -
దయనీయంగా ధర్మాస్పత్రులు!
సాక్షి నెట్వర్క్: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా, కొన్ని ఆస్పత్రుల్లో సేవలన్నీ నర్సింగ్ విద్యార్థులే చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంది. మరోవైపు మందులు సైతం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో రోగులు డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. మరోవైపు ప్రసవాలు చేసే సమయంలో సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. ధర నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘సాక్షి’ బృందం ఇటీవల జిల్లాలోని పలు ఆస్పత్రులకు విజిట్ చేయగా అనేక లోపాలు గుర్తించారు. పేటలో గర్భిణులకు గడ్డుకాలం.. జగ్గయ్యపేటలో 50 పడకల ఆస్పత్రి ఉంది. నిత్యం 250 మంది వరకూ రోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ సిబ్బంది కొరత ఉండటంతో మందులు ఇవ్వడం నుంచి అన్ని సేవలు నర్సింగ్ విద్యార్థులే చేస్తున్నారు. ఇక్కడ 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 8 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందులో గైనకాలజిస్టు, మత్తు వైద్యుల మధ్య సమన్వయం లేక పోవడంతో ఒకరు ఉంటే, మరొకరు ఉండని పరిస్థితి నెలకొంది. దీంతో సిజేరియన్ల కోసం విజయవాడ తరలివెళ్తున్నారు. గైనకాలజిస్టు ఉన్నా ఆల్ట్రాసౌండ్ స్కాన్ లేక ప్రైవేటుకు వెళ్లాల్సి వస్తోంది. ప్రసవాలు అరకొరగా చేస్తున్నారు. ఇక్కడ బి కాంప్లెక్స్, కాల్షియం మందులు కూడా అందుబాటులో లేని దయనీయ స్థితి నెలకొంది. విజయవాడ రిఫర్ చేసిన కేసులను తీసుకెళ్లేందుకు ఉన్న అంబులెన్స్ మరమ్మతులకు గురికావడంతో ప్రైవేటు అంబులెన్స్ల దందా నడుస్తోంది. మైలవరంలో ప్రసవాల దందా.. మైలవరం ఆస్పత్రిలో ప్రసవాలకు వసూళ్ల దందా నడుస్తోంది. ప్రసవం చేస్తే రూ.1500 చెల్లించుకోవాల్సిందే. ఏ మాత్రం తగ్గినా తీసుకోరు. వారిని వేధిస్తుంటారు. ఇక్కడ 10 మంది వైద్యులు, 15 మంది స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రతిరోజూ 300 మంది వరకూ రోగులు వస్తుంటారు. మందులు సైతం అరకొరగా ఉండటంతో, అత్యవసర మందులు బయటే కొనుగోలు చేయాల్సి వస్తోంది. సిజేరియన్ల కోసం కొన్ని సార్లు విజయవాడకు పంపుతున్నారు. నందిగామలో అరకొర మందులు.. నందిగామ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో మందులు లేవు. వైద్యులు మందులు రాస్తే, వాటిలో సగం బయట కొనుగోలు చేయాల్సి వస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. అంతేకాదు అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శనిలా ఈ ఆస్పత్రి పరిస్థితి మారింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు వైద్యులు ఉన్నా, ప్రతి కేసును విజయవాడకు తరలించేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. రోగులు తాగేందుకు మంచినీటి సౌకర్యం లేదు. మరుగు దొడ్లు అధ్వానంగా ఉన్నాయి. రోగులు వాటిని వినియోగించలేని దయనీయ స్థితిలో ఉన్నాయి. విజయవాడలోని షేక్ రాజా ఆస్పత్రిలో సైతం అరకొర సౌకర్యాలతో కునారిల్లుతోంది. అక్కడ కేవలం గైనకాలజీ సేవలకే పరిమితమవుతున్నారు. ఇతర విభాగాలు కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రసూతి విభాగంలో తిరువూరు కమ్యూనిటీ సెంటర్ జాతీయ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు అక్కడ ప్రసూతి వైద్యులే లేని దయనీయ స్థితి నెలకొంది. ఆపరేషన్ థియేటర్లో సైతం సౌకర్యాలు లేక పోవడంతో కు.ని సర్జరీలకు సమీపంలోని పీహెచ్సీకి పంపాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్న పీడియాట్రిక్, ఎనస్థీషియన్, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబులెన్స్ లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ రిఫర్ చేస్తే ప్రైవేటు అంబులెన్స్లలో వెళ్లాల్సిందే. మందులు సైతం పూర్తిస్థాయిలో లేక, బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది. -
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు అంశాన్ని పునః పరిశీలించాలి
దళిత హక్కుల పోరాట సమితి మహాసభ తీర్మానం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు అంశాన్ని సుప్రీం కోర్టు పునఃపరిశీలించాలని దళిత హక్కుల పోరాట సమితి(డీహెచ్పీఎస్) ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో డీహెచ్పీఎస్ 3వ మహాసభ జరి గింది. తొలుత డీహెచ్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని మహాసభలో ఏకగీవ్రంగా తీర్మానించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ వివక్ష, అవమానాలకు గురైన ఎస్సీ, ఎస్టీలు సామాజిక న్యాయం పొందడానికి ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమానత్వానికి పోరాడాల్సి వస్తోందన్నారు దళితుల హక్కుల సాధన కోసం భారీ ఉద్యమానికి డీహెచ్పీఎస్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు కులానికి, మతానికి ముడిపెట్టి దళిత క్రై స్తవులకు ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో డీహెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువాది సుబ్బారావు, జేవీ ప్రభాకర్, తెలంగాణ డీహెచ్పీఎస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అప్గ్రేడ్తో సరి!
తరగతుల నిర్వహణకు ఢోకా లేదు అప్గ్రేడ్ అయిన ఐదు హైస్కూళ్లలో తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేదు. కొద్దిపాటి పనులను పూర్తి చేసి కట్టుబడిపాలెం హైస్కూలు భవనాన్ని త్వరలో వినియోగంలోకి తెస్తాం. చెర్వుమాధవరం హైస్కూలు భవనంలో రెండు అదనపు గదుల నిర్మాణం త్వరలో ప్రారంభిస్తాం. చెవుటూరు హైస్కూలుకు ఆట స్థలం కోసం స్థలం సర్వే చేస్తున్నాం. వెల్లటూరు హైస్కూల్ భవనం, ఆట స్థలం కోసం రెండు ఎకరాలను గుర్తించాం. భవనాలు అందుబాటులోకి వచ్చే వరకు తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. –ఎం.వీరాస్వామి, మండల విద్యాశాఖ అధికారి–2, జి.కొండూరు జి.కొండూరు: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. నాడు–నేడు పేరుతో గత వైఎస్సార్ సీపీ గవర్నరమెంట్.. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు ఊతమిచ్చేందుకు మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణం వంటి ఎన్నో చర్యలను చేపట్టింది. ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ భవనాలను నిలిపివేసి వివక్షను చాటింది. ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025–26 విద్యా సంవత్సరంలో చెర్వుమాధవరం, వెల్లటూరు, కుంటముక్కల ప్రాథమికోన్నత పాఠశాలలను జెడ్పీ హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేశారు. చెర్వుమాధవరం పాఠశాలను అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వంలోనే నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి రూ.60 లక్షలతో ఐదు అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. మూడు గదుల నిర్మాణం పూర్తైన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణాన్ని ఆపేసింది. ఇక్కడ భవనం లేక ఇరుకు గదుల్లోనే ఈ ఏడాది తరగతులను నిర్వహించాల్సి ఉంది. ఇటీవల అప్గ్రేడ్ అయిన వెల్లటూరు, కుంటముక్కల హైస్కూళ్లకు ప్రత్యేక భవనాలు లేకపోవడంతో ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే తరగతులను నిర్వహించాల్సి ఉంది. ఈ రెండు స్కూళ్లకు ఆట స్థలాలు లేవు. విద్యార్థులు పెరిగితే తరగతి గదులు లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఐదు శాతం పూర్తి చేయలేదు జి.కొండూరు మండల పరిధిలో గంగినేని, జి.కొండూరు, వెలగలేరు, కవులూరు, కోడూరు హైస్కూళ్లు గతం నుంచి కొనసాగుతుండగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2017లో కట్టుబడిపాలెం, చెవుటూరు ప్రాథమికోన్నత పాఠశాలలను జెడ్పీ హైస్కూళ్లుగా అప్గ్రేడ్ చేశారు. ఈ క్రమంలో కట్టుబడిపాలెం హైస్కూలు భవన నిర్మాణానికి నాడు–నేడు నిధులు 1.92కోట్ల కేటాయించారు. ఈ భవన నిర్మాణం అప్పట్లోనే ప్రారంభమై 95శాతం పూర్తైంది. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఐదు శాతం పనులను పూర్తి చేయలేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. దీనితో ప్రాథమిక పాఠశాల భవనంలోనే చాలీ చాలని గదుల్లో తరగతులను నిర్వహిస్తున్నారు. చెవుటూరు హైస్కూలు భవన నిర్మాణానికి అప్పట్లోనే ప్రయత్నాలు చేసినప్పటికీ స్థలం సమస్యతో పనులను ప్రారంభించలేదు. విద్యార్థులు పెరిగితే ఇక్కట్లే.. జి.కొండూరు మండల పరిధిలో 2025–26 విద్యా సంవత్సరంలో కుంటముక్కల హైస్కూల్లో 148 మంది, వెలగలేరు హైస్కూల్లో 289 మంది, కోడూరు హైస్కూల్లో 134 మంది, కట్టుబడిపాలెం హైస్కూల్లో 112 మంది, జి.కొండూరు హైస్కూల్లో 307 మంది, వెల్లటూరు హైస్కూల్లో 141 మంది, గంగినేనిపాలెం హైస్కూల్లో 155 మంది, కవులూరు హైస్కూల్లో 169 మంది, చెర్వుమాధవరం హైస్కూల్లో 134 మంది, చెవుటూరు హైస్కూల్లో 121మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ ఏడాది విద్యార్థులు సంఖ్య పెరిగితే నూతనంగా అప్గ్రేడ్ అయిన ఐదు పాఠశాలల్లో తరగతుల నిర్వహణ కష్టంగా మారుతుంది. రెండేళ్లుగా ప్రారంభానికి నోచుకోని కట్టుబడిపాలెం హైస్కూలు భవనం మధ్యలోనే ఆగిపోయిన చెర్వుమాధవరం హైస్కూలు భవనం -
చిరు వ్యాపారులపై కొరడా
ఇబ్రహీంపట్నం: స్థానిక రింగ్సెంటర్లో చిరు వ్యాపారులపై కొండపల్లి మునిసిపాలిటీ అధికా రులు కొరడా ఝుళిపించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు వందల మంది పోలీసులతో మునిసిపల్ అధికారులు రింగ్ వద్దకు పొక్లెయిన్లతో చేరుకుని ఫుట్పాత్లపై ఉన్న దుకాణాలను తొలగించారు. 400 మంది చిరు వ్యాపారులు రోడ్ల పక్కన సీజనల్ పండ్లు, ఫ్యాన్సీ సరుకులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. రింగ్ సెంటర్ను యాక్సి డెంట్లు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్గా గుర్తించారు. ఆ ప్రభావం చిరువ్యాపారులపై పడింది. పోలీసులు, మునిసిపల్ సిబ్బంది వందలాదిగా తరి వచ్చి దుకాణాల తొలగింపు చేపట్టడంతో చిరువ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎందరికో ఉపాధి అవకాశాలు రెక్కాడితేగాని డొక్కాడని చిరువ్యాపారులు 50 ఏళ్లుగా రింగ్ సెంటర్ ప్రాంతాన్ని నమ్ముకుని బతుకీడుస్తున్నారు. పాత ఆర్అండ్బీ రోడ్డు ఉన్నప్పటి నుంచి, 2003లో నాలుగు లైన్ల జాతీయ రహదారిగా మారినప్పటికీ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చిరువ్యాపారాలు చేస్తున్నారు. ఈ వ్యాపారాలపై వచ్చే ఆదాయంతోనే తమ బిడ్డలను చదివించుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా దుకాణాలు శాశ్వతంగా తొలగించడంతో వారు తల్లడిల్లుతున్నారు. వ్యాపారం చేసుకునేందుకు అభివృద్ధి చేసిన స్థలాన్ని నామమాత్రపు అద్దెకు కేటాయించాలని కోరారు. యాక్సిడెంట్ స్పాట్గా ఉన్నందునే.. గత నెలలో కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమా దాలకు గల కారణాలపై సర్వే నిర్వహించారు. ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించి. ఈ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్గా గుర్తించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రింగ్ వద్ద రోడ్డు విస్తరణ చేపట్టేందుకు నిర్ణయించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చిరువ్యాపారులను తొలగించామని మునిసిపల్, పోలీస్ అధికారులు తెలి పారు. రోడ్డును వెడల్పు చేయడం ద్వారా రింగ్ సెంటర్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగదని వారు భావిస్తున్నారు. దుకాణాలను కోల్పోయిన చిరు వ్యాపారులకు సీఐటీయూ మద్దతు తెలిపింది. దుకాణాలను తొలగించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపకపోతే ఈ నెల ఐదో తేదీన ధర్నా చేస్తామని హెచ్చరించారు. సీజనల్గా వచ్చే పండ్లు, పూలు, ఇతర వస్తువులతో 40 ఏళ్లుగా చిరువ్యాపారం చేస్తున్నా. 18 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. ఈ వ్యాపారంపైనే నలుగురు బిడ్డలను చదివించి వివాహాలు చేశాను. బిడ్డలు పొరుగూరుల్లో బతుకుతున్నారు. వ్యాపారం లేకుంటే నాకు జీవనం కష్టం. ప్రత్యామ్నాయంగా స్థలం చూపించాలని కోరుతున్నా. – ఇంజిమూడి కుమారి, చిరువ్యాపారి -
ఆలయాలను చీకట్లోకి నెట్టిన ప్రభుత్వం
మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పటమట(విజయవాడతూర్పు): హిందూ ధార్మిక సంస్థల్లో భక్తుల భద్రత అగమ్యగోచరంగా మారిందని, ఆలయాల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వం చేతివాటం చూపిస్తోందని దేవదాయ శాఖ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియో జకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రంతోపాటు ఆలయాలనూ చీకట్లలోకి నెకట్టిందని దుయ్యబట్టారు. పటమటలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో హిందువులను చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. జరగని విషయాలపై శ్రద్ధ చూపే ప్రభుత్వం జరిగిన అంశాలపై చర్యలు తీసుకోకపోవటం శోచనీయమన్నారు. కనకదుర్గమ్మ ఆలయానికి వినియోగించే డీజిల్ను సైతం ప్రభుత్వం అమరావతికి మళ్లించడంతో ఇటీవల ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే జనరేటర్లు పనిచేయక భక్తులు చీకటిలో చిక్కుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఆలయ టాయిలెట్లోకి ఇటీవల ఓ ఆగంతకుడు వచ్చి మహిళలను అసభ్యంగా ఫోన్లో చిత్రీకరించటం, అంతకు ముందు ఓ వ్యక్తి చనిపోవటంపై కూడా కూటమి పెద్దలు మౌనంగా ఉన్నారని దుయ్యబ ట్టారు. డెప్యూటీ సీఎం పవన్కల్యాణ్ జరగని విషయంపై వైఎస్సార్ సీపీపై దుష్ప్రచారం చేస్తూ దుర్గగుడి మెట్లు కడిగారని, అయితే ఇటీవల ఆలయంలో జరిగిన ఘటనలపై పెదవి విప్పకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
హనుమాన్జంక్షన్ రూరల్: స్థానికంగా సంచలనం సృష్టించిన చిన్ని ఎంటర్ప్రైజస్, కేకే హెచ్–మార్ట్ల యాజమాని వడ్డి క్రాంతికిరణ్ హత్య కేసులో నిందితుడు రామి నేని వెంకట శివరామకృష్ణను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను హనుమాన్జంక్షన్ పోలీస్స్టేషన్లో సీఐ ఎల్.రమేష్ మీడియాకు వివరించారు. ఆయన కథనం మేరకు.. ఏప్రిల్ 28వ తేదీ రాత్రి కేకే హెచ్–మార్ట్కు తాళాలు వేసి స్నేహితుడితో కలిసి బైక్పై ఇంటికి వెళ్తున్న వడ్డి క్రాంతికిరణ్ను పాత కక్షల నేపథ్యంలో రామినేని వెంకట శివరామకృష్ణ పక్కా పథకం ప్రకారం కాపుకాసి కారుతో ఢీకొట్టి హతమార్చాడు. గతంలో రామినేని వెంకట శివరామకృష్ణ చెల్లి కేకే హెచ్–మార్ట్లో పని చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ ఘటనపై ఏలూరు జిల్లా పెదపాడు పోలీస్స్టేషన్లో వడ్డి క్రాంతికిరణ్పై కేసు కూడా నమోదైంది. తన చెల్లెలు మరణానికి క్రాంతికిరణే కారణమని భావించిన రామినేని వెంకట శివరామకృష్ణ హత్యకు పథకరచన చేశాడు. పాత కక్షల నేపథ్యంలోనే వడ్డి క్రాంతికిరణ్ను హత్య చేసినట్లుగా విచారణలో నిందితుడు వెంకట శివరామకృష్ణ వెల్లడించాడని సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి నూజివీడు కోర్టుకు తరలించారు. -
నీట్కు విస్తృత ఏర్పాట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఈ నెల మూడో తేదీన జరిగే జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష (నీట్) –2026 నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ) సమావేశ మంది రంలో నీట్–2026 ఏర్పాట్లపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోఆర్డినేటర్లు, అబ్జర్వర్లు, పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమతమ విధులపై పూర్తిస్థాయిలో అవగాహనతో అప్రమత్తతతో ఉండాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. నీట్ సిటీ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎం.గోపీ కృష్ణ, ఎం.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పరీక్షకు విద్యార్థులు తప్పనిసరిగా ప్రింట్ చేసిన అడ్మిట్ కార్డ్, ఒరిజినల్ ఫోటో ఐడీ వంటివి తీసుకెళ్లాలన్నారు. జిల్లాలో 32 కేంద్రాల్లో 12 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు తప్పనిసరిగా ధ్రువీకరణ, బయోమెట్రిక్ హాజరు, ప్రిస్కింగ్ ప్రక్రియలు ఒకే ప్రవేశ ద్వారం ద్వారా జరుగుతాయని వివరించారు. విద్యార్థులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టంచేశారు. -
తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలి
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ పటమట(విజయవాడతూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో పెండింగ్లో ఉన్న, తొలగించిన పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. అవినాష్ ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ శనివారం పటమటలోని ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి వీఎంసీ సర్కిల్–3 కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్కిల్–3 జోనల్ కమిషనర్ షమ్మీకి వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పింఛన్లు కూటమి ప్రభుత్వం తొలగించిందని, దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనధికారిక గెజిట్ పత్రికయిన ఈనాడులోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని, దీనికి పాలకులు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అర్హుల పింఛన్లు తొలగిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏమి చేస్తున్నారని నిలదీశారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏమీ జరగకపోయిన గగ్గోలు పెట్టిన గద్దెకు ఇప్పుడు కళ్లు కనపడటం లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అర్హులు అందరికీ పింఛన్లు మంజూరు చేయగా, కూటమి హయాంలో అన్ని రకాల ఫించన్లు తొలగించారని విమర్శించారు. 50 ఏళ్లు దాటిన వారికి పింఛన్లపై ప్రభుత్వం మాట తప్పిందన్నారు. పింఛన్లు అందక దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లాది విష్ణు మాట్లా డుతూ.. విజయవాడలో తొలగించిన ఫించన్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో నవ రత్నాలను అమలు చేసి, వాస్తవాలు చెప్పే వారని, రాష్ట్ర వ్యాప్తంగా 33 లక్షల నూతన పింఛన్లు ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఆళ్ల చెల్లారావు, సర్నాల తిరుపతి రావు, పలువురు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసమే మూలధనం
భవానీపురం(విజయవాడపశ్చిమ): మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించాలని, ఆత్మ విశ్వాసమే మూలధనంగా ముంద డుగు వేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. గొల్లపూడిలోని డీఆర్డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యాన శనివారం భారతీయ యువశక్తి ట్రస్ట్ భాగస్వా మ్యంతో పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమం (ఈడీపీ) జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, రుణ సదుపాయాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారతీయ యువ శక్తి ట్రస్ట్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతను ఉద్యోగ అన్వేషణ నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు, లావణ్య కుమారి పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్ సజీవ దహనం
● ఆగి ఉన్న టిప్పర్ను ఢీకొట్టిన కంటైనర్ ● బాపులపాడు మండలం వీరవల్లి వద్ద దుర్ఘటనహనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం వీర వల్లి వద్ద చెన్నయ్ – కోల్కతా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవంగా దహనమయ్యాడు. ఆగిన ఉన్న టిప్పర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ లారీ ఢీ కొట్టింది. కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ దుర్ఘటన జరిగింది. వీరవల్లి బైపాస్ రోడ్డులోని ఫ్లై ఓవర్పై శనివారం తెల్లవారు జామున మరమ్మతుల కారణంగా టిప్పర్ ఆగిపోయింది. దీనిని గమనించని కంటైనర్ లారీ వెనుక వేగంగా వచ్చి టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో కంటైనర్ లారీ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గన్నవరం, హనుమాన్జంక్షన్ ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరు కుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కంటైనర్ లారీ క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ తవిటికి సురేంద్ర (22) సజీవంగా దహనమయ్యాడు. సురేంద్ర స్వస్థలం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరారం. కంటై నర్ లారీలో ఉన్న మరో డ్రైవర్ వంగలపూడి ప్రసాద్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మేడే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ కార్మిక దినోత్సవం (మేడే) ఉత్సవాలను ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ డిపో, గవర్నర్పేట 1, 2 డిపోల వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జీవీ నరసయ్య పాల్గొని యూనియన్ జెండా ఆవిష్కరించారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకుంటే మేడే స్ఫూర్తితో ఉద్యమిస్తామన్నారు. ఎం.శంకరరావు, ఎస్కే మొహిద్దీన్, జీఎస్ నారాయణ, ఎస్ఎస్ నారాయణ, ఎన్హెచ్ఎన్ చక్రవర్తి, జోనల్ కార్యదర్శి వైఎస్ రావు, జిల్లా అధ్యక్షులు ఏకే సాగర్, జిల్లా కార్యదర్శి జీఎం రావు, పాల్గొన్నారు.మేడే వారసత్వాన్ని కొనసాగించడమంటే నోయిడా పారిశ్రామిక ప్రాంతంలోని కార్మిక వర్గం సాగిస్తున్న పోరాటాలను దేశమంతా సృష్టించడమేనని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి అన్నారు. విజయవాడ బస్టాండ్ ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ , సిటీ టెర్మినల్ గేటు వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీవీ సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.గంగాభవాని ఎర్రజెండాలు ఎగురవేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. పోలారి మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో దాది శ్రీను, సీహెచ్ పెద్దిరాజు, వై.అప్పారావు, ఏ.సూరిబాబు, రఫీ, వలీ, సుబ్బారావు, సూర్యనారాయణ, శంకర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్డులోని మహంతి మార్కెట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సభ జరిగింది, ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొని ప్రసంగించారు. కార్మిక పోరాటాలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మేడే స్ఫూర్తితో నాలుగు లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడాలన్నారు. సీఐటీయూ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. -
జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో జూన్ నెలాఖరు నాటికి టిడ్కో గృహాల పనులు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో టిడ్కో గృహాల నిర్మాణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా జిల్లాలో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 11,520 టిడ్కో గృహాలను త్వరలో పూర్తి చేయాలన్నారు. జక్కంపూడిలో 6,576 గృహాలకు గాను 2,256 టిడ్కో ఇళ్లు అందించామని, మరో 4,320 ఇళ్లు లబ్ధిదారులకు అందించాల్సిన ఉందని చెప్పారు. ఇందులో జూన్ నాటికి కనీసం 3 వేల గృహాలు లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేక సబ్ రిజిస్ట్రార్ ఏర్పాటు.. జగ్గయపేటలో 2 వేలు, తిరువూరులో 672 గృహాలు జూన్ నాటికి అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. జక్కంపూడి టిడ్కో గృహాల కోర్టు కేసులను వారం రోజుల్లో పూర్తి చేసి పనుల అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ రూరల్ తహసీల్దార్ను ఆదేశించారు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ లీడ్ బ్యాంకు(ఎల్డీఎం)ను ఆదేశించారు. ప్రతి మంగళ, గురువారాలలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి రిజిస్టేషన్లలో ఎదురయ్యే సమస్యలపై పరిష్కరించి రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందుకు ప్రత్యేకంగా సబ్ రిజిస్ట్రార్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ జిల్లా రిజిస్ట్రార్ను ఆదేశించారు. సమావేశంలో వీఎంసీ కమిషనర్ హెచ్ఎం ధాన్యచంద్ర, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు, ఎల్డీఎం ఎం.ప్రియాంక, విజయవాడ రూరల్ తహసీల్దార్ బి.సుగుణ జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, టిడ్కో గృహ నిర్మాణ ఏజెన్సీలు ఎన్సీసీ లిమిటెడ్, ఎల్అండ్టీ లిమిటెడ్, వెల్కో ప్రాజెక్ట్స్ హరి ఇన్ఫ్రా రాఘరాం, ఎంఎస్ఆర్ ద్వారకా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అకాల వర్షం...అపార నష్టం
● ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం కల్లాల్లోనే నిల్వ ఉండిపోయి అకాల వర్షానికి తడిసిన ధాన్యం ప్రభుత్వ కొనుగోళ్లు లేక వర్షం పాలైన మొక్కజొన్న పెనుగాలులకు భారీగా నేలరాలిన మామిడి కాయలు ప్రభుత్వ భరోసా లేక లబోదిబోమంటున్న రైతులు –ఇరుగుల మురళీరెడ్డి, మామిడి రైతు, మునగపాడు -
ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
ఘంటసాల: కృష్ణాజిల్లా ఘంటసాలలో 2570వ బుద్ధ జయంతి వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంతే ధమ్మ ధజ థెరో ఆధ్వర్యంలో అమరావతి బుద్ధ విహార్లో ఏర్పాటు చేసిన అమరావతి సంకల్ప సిద్ధి బౌద్ధ స్థూపంలోని ధ్యాన బుద్ధ విగ్రహాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ప్రారంభించారు. బుద్ధుని ప్రతిమతో ర్యాలీగా వెళ్లి స్థూపం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుద్ధ జయంతి సభావేదిక వద్ద జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ బుద్ధజయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఘంటసాలలోని బౌద్ధ స్థూపానికి మాత్రమే మహాచైత్యంగా గుర్తింపు ఉందన్నారు. దీంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు శయన బుద్ధ ప్రాజెక్టుకు దాత గొర్రెపాటి రంగనాథబాబు స్థలాన్ని అందించగా వందలాదిమంది సమక్షంలో ప్రారంభమైన ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో కొనియాడబడుతున్న బౌద్ధానికి మన ప్రాంతంలో ఆదరణ లేకపోవడం బాధాకరమన్నారు. అనంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన ధమ్మపథం పుస్తకాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను దుశ్శాలువాతో సత్కరించి, బహుమతులు అందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి పి.సాయిబాబు, ఎంపీడీవో డి.సుబ్బారావు, తహసీల్దార్ బి.విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జనగణన శాఖ సంయుక్త సంచాలకుడు ప్రసన్నకుమార్ గన్నవరం: మండలంలోని కేసరపల్లిలో జన గణన జరుగుతున్న ఎన్యూమరేషన్ బ్లాక్ 95ను శుక్రవారం జనగణన శాఖ సంయుక్త సంచా లకుడు ప్రసన్నకుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లతో సమావేశమైన ఆయన జన గణనపై మార్గనిర్దేశం చేశారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి డ్యాష్ బోర్డ్లో రిపోర్టులు ఎలా చూడాలి, డౌన్లోడ్ చేయడం, వాటి ఆధారంగా ఎన్యూమరేటర్లకు సూచనలు ఇవ్వడంపై చార్జ్ ఆఫీసర్లకు వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, జనగణన పురోగతిపై సమీక్షించారు. జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. జనగణన లో భాగంగా ఎన్యూమరేటర్లు అడిగే 33 ప్రశ్నలకు ప్రజలు సరైన సమాచారం అందించాలని తెలిపారు. తహసీల్దారు కె.వెంకటశివయ్య, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడతూర్పు): విద్యార్థులకు వేసవి సెలవుల సందర్భంగా తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్లను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, శాప్ ఎండీ ఎస్.భరణి కోరారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ ఈ క్యాంపులు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని, మొత్తం 55 క్రీడా విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు. క్రీడాకారులందరూ క్రీడా యాప్లో వివరాలు నమోదు చేసుకోవాలని, ఎటువంటి సమస్యలు ఉన్నా యాప్ ద్వారా తెలియజేయవచ్చునన్నారు. కార్యక్రమంలో శాప్ ఎండీ ఎస్.భరణి, శాప్ బోర్డ్ సభ్యులు సంతోష్, రమణరావు, ఏవో వెంకట రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్ – హిసార్ మధ్య రెగ్యులర్ వీక్లీ ట్రైన్ రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు కాకినాడ టౌన్ – హిసార్ మధ్య నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైలును రెగ్యులర్ రైలుగా నడిపేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. కాకినాడ టౌన్ – హిసార్ (18295) రైలు ఈ నెల 12 నుంచి ప్రతి మంగ ళవారం, అదే విధంగా హిసార్ – కాకినాడ టౌన్ (18296) రైలు ఈ నెల 15 నుంచి ప్రతి శుక్రవారం రెగ్యులర్ సర్వీసుగా నడవనుంది. -
భవిష్యత్ను అంచనా వేయడం అవసరం
● ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయభాస్కరరావు ● కేయూలో సాఫల్య దినోత్సవం ● తల్లిదండ్రుల చేతుల మీదుగా విద్యార్థులకు నియామక పత్రాలు అందజేత కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో అచీవర్స్ డే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన ప్రాంగణ ఎంపికల్లో అర్హత సాధించిన ఇంజినీరింగ్, ఫార్మసీ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కృష్ణా యూనివర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు 100 శాతం ఉద్యోగ అవకాశాలు సాధించిన క్రమంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విశ్వవిద్యాలయ ప్రాంగణానికి ఆహ్వానించి ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఎస్.విజయభాస్కరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్ను అంచనా వేస్తూ తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం లేకుండా బయటకు వెళితే ఎదుర్కొనే కష్టాలను వివరించారు. మరో అతిథిగా విచ్చేసిన బెల్ కంపెనీ డెప్యూటీ జనరల్ మేనేజర్ బి.వి. నాగరాజు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులకు, తాను ఉద్యోగం సాధించిన నాటి పరిస్థితులను బేరీజు వేసి నేటి పరిస్థితుల్లో ఉద్యోగ అవకాశం దాని ఆవశ్యకతను విద్యార్థులకు కూలంకషంగా వివరించారు. ఉపకులపతి ఆచార్య కె.రాంజీ మాట్లాడుతూ విద్యార్థులకు డిగ్రీ కన్నా ముఖ్యం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భావ వ్యక్తీకరణ అని అన్నారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని వారాల పాటు ఇంజినీరింగ్, ఫార్మసీ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల నిమిత్తం శిక్షణ ఇచ్చామని, తత్ఫలితంగానే నూరు శాతం ఉద్యోగ అవకాశాలు సాధించడానికి మార్గం సుగమం అయిందని చెప్పారు. వర్సిటీ ఉపాధి, ఉద్యోగ అవకాశాల డైరెక్టర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వైకే సుందరకృష్ణ మాట్లాడుతూ సీఎస్ఈ విభాగం లో 134 మందికి, ఈసీఈ లో 57 మందికి, ఫార్మసీ నుంచి 105 మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభించినట్టు చెప్పారు. అదే సమయంలో ఈ విద్యార్థులంతా వాళ్ల తల్లిదండ్రులను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి వాళ్ల చేతుల మీదగా ఈ ఆఫర్ లెటర్స్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాంబాబు, వర్సిటీలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఇన్చార్జులు కేజీ వెంకటకష్ణ, డాక్టర్ అలీమీర్జా, డాక్టర్ హనుమంతరావు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 20267ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ కృష్ణలంకకు చెందిన కోటకం వెంకట శ్రీనివాసరావు, శివపార్వతి దంపతులు శుక్రవారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారికి శుక్రవారం ఘటకేసర్ మండలం అవుషాపూర్ వాసి సంకూరి హనుమంతరావు 675 గ్రాముల వెండి త్రిశూలాన్ని బహూకరించారు. వేసవి సెలవులు, ఇంటర్, టెన్త్ ఫలితాల వెల్లడి నేపథ్యంలో దుర్గగుడికి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులతో ఇంద్రకీలాద్రి శుక్రవారం కిటకిటలాడింది. -
14 నుంచి టాలీలో శిక్షణ
ఆత్కూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో శ్రీవిష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యాన ఈ నెల 14 నుంచి ‘టాలీ’లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డాక్టర్ బి.వి. రాజు ఫౌండేషన్ ప్రతినిధి అంకమరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 60 రోజుల పాటు ఉండే ఈ శిక్షణకు బీకామ్ బీబీఏ, ఎం.కామ్, ఎంబీఏ చదివిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు నూరు శాతం ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ–మెటీరియల్, సర్టిఫికెట్లను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర సమాచారం కోసం 91000 33552, 93466 07845 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురంలో నివసించే సుంకరి శ్యామ్ దుర్గాప్రసాద్(34) ఎల్బీఎస్నగర్కు చెందిన సిదిల గురుమూర్తి (33) కలిసి శుక్రవారం మధ్యాహ్నం పైపులరోడ్డులోని ఓ బార్లో మద్యం సేవించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వ్యక్తిగత వివాదం తలెత్తి వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శ్యామ్ దుర్గాప్రసాద్ గురుమూర్తిని కొడుతుండగా గురుమూర్తి అతని తోసేశాడు. దీంతో శ్యామ్ దుర్గాప్రసాద్ నేలపై పడిపోయాడు. అతడు లేవకపోవడంతో అక్కడ ఉన్నవారు అతని ముఖంపై నీళ్లు చల్లి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరిశీలించి అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కనకదుర్గానగర్లో.. వన్టౌన్(విజయవాడపశ్చిమ): వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో కనకదుర్గానగర్లోని బలిపీఠం వద్ద స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. అతడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి వయస్సు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటుందని గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టెన్త్ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్. విజయభాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు 600 మార్కులకు అత్యధికంగా 597, 594 కై వసం చేసుకున్నారని చెప్పారు. ముగ్గురు విద్యార్థులు 593 సాధించగా, 592 మరో ముగ్గురు, ఐదుగురు విద్యారులు 591, 590కు పైగా 17 మంది, 580 పైన 74 మంది, 570 పైన 176 మంది, 560 పైన 271, 550కు పైగా 344, 540కి పైగా 423, 530కి పైగా 490, 520కి పైగా 543 మంది, 510కి పైగా 593, 500కు పైగా 641, 500లోపు 641 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 1200 మంది విద్యార్థులకు గాను మ్యాథ్స్లో 104 మందికి 100 మార్కులు, 248 మందికి 95 పైన మార్కులు, తెలుగులో 108 మందికి 100 మార్కులు, 357 మందికి 95 మార్కులపైన మరియు సోషల్లో 71 మందికి 100 మార్కులు, 351 మందికి 95 పైన మార్కులు, సైన్స్లో 19 మందికి 100 మార్కులు, 243 మందికి 95 పైగా మార్కులు, హిందీలో 19 మందికి 100 మార్కులు, 230 మందికి 95 పైగా మార్కులు, ఇంగ్లీష్లో 230 మందికి 95కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఆక్స్ఫర్డ్ ఘన విజయం సాధించిందని కొనియాడారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రాన్సిస్రెడ్డి, వైస్ చైర్మన్ అరోన్రెడ్డి, డైరెక్టర్ జోసఫ్రెడ్డి, ఇన్చార్జ్లు మనోజ్, భాస్కర్ విద్యార్థులను అభినందించారు. -
సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకం
● కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రాధాన్యం ● మేడే వేడుకల్లో ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ● గుణదలలోని జిల్లా కార్యాలయంలో పార్టీ ట్రేడ్ యూనియన్ పతాకం ఆవిష్కరణ కార్మికుల సంక్షేమం విస్మరించిన చంద్రబాబు : గౌతంరెడ్డి -
దుర్గగుడికి పెరిగిన రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, శుక్రవారం రద్దీ, వివాహ సుముహుర్తాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. గడిచిన వారం రోజులుగా నామమాత్రంగా కనిపించిన భక్తుల రద్దీ శుక్రవారం అనూహ్యంగా పెరిగింది. భక్తుల రద్దీకి తోడు ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు ఉభయదాతలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉదయం 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో రద్దీ కనిపించింది. శుక్రవారం నాడు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వ దర్శనం క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి రెండున్నర గంటల సమయం పట్టింది. ఆర్జిత సేవలకు డిమాండ్ పౌర్ణమి నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలకు డిమాండ్ కనిపించింది. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు జరిగే ఖడ్గమాలార్చన రెండు షిప్టులలో, నూతన యాగశాలలో చండీహోమం, నూతన పూజామండపంలో నిర్వహించిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, గణపతి హోమం, రుద్రహోమంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1.20 గంటలకు ఈవో శీనానాయక్ ఆలయానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. దుర్గాఘాట్ ఎదుట ఉన్న కేశకండనశాల, కనకదుర్గ్గానగర్లో సేద తీరుతున్న భక్తులతో మాట్లాడారు. రాత్రి 10 గంటల తర్వాత విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడో షిప్టు విధులు నిర్వహించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహామండపం 5వ అంతస్తులోని దుకాణాలను పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
వన్యప్రాణులు విలవిల
పెనుగంచిప్రోలు: జగ్గయ్యపేట రేంజ్ పరిధిలో సుమారుగా 5 వేల హెక్టార్లలో అటవీ భూమి విస్తరించింది. దీనిలో 2 వేల హెక్టార్లలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణానదీ పరివాహక ప్రాంతం అంతా ఒకప్పుడు పచ్చని చెట్లు, కొండలతో పాటు కృష్ణమ్మ సొగసులు పర్యాటకులను కట్టి పడేసేవి. నేడు అక్రమ మైనింగ్లతో పాటు బ్లాస్టింగ్లతో అటవీ ప్రాంతం నామరూపాలు లేకుండా పోతోంది. వన్యప్రాణులకు ఆవాసం.. జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గుండబోయినపాలెం గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో జింకలు, దుప్పులు, కుందేళ్లు, అడవి పందులు, నెమళ్లు ఉడుములతో పాటు పలు పక్షుజాతులు సంచరిస్తూ ఉండేవి. అలాగే అటవీ ప్రాంతంలో ఔషధ మొక్కలు ఉన్నట్లు వృక్షశాస్త్ర నిపుణులు కూడా గుర్తించారు. ముక్త్యాలలోని రాజా గారి కోటలో ఔషధ కేంద్రం నిర్వహించటంతో పాటు అటవిలో నుంచి ఔషద మొక్కలను సేకరించేవారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానరాని నెమళ్లు.. కృష్ణానదీ పరివాహక ప్రాంతంతో పాటు జగ్గయ్యపేట మండలంలోని గండ్రాయి, షేర్మహ్మద్పేట, రామచంద్రునిపేట ఉన్న అటవీ భూముల్లో గతంలో నెమళ్లు పెద్ద సంఖ్యలో ఉండేవి. అయితే అవి కూడా అంతరించే ప్రమాదంలో ఉన్నాయి. అడవుల్లో కొండలను కొల్లగొట్టి గ్రావెల్ తరలిస్తుండటం, చెట్లు నరకటంతో వన్యప్రాణులు సంఖ్య తరగిపోతోంది. రక్షణ చర్యలు నిల్.. అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణకు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. అడవులు తగ్గిపోతుండటంతో అడవి పందులు, జింకలు, దుప్పులు వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న సుబాబుల్ తోటల్లోకి నీటి కోసం వస్తున్నాయి. ఈక్రమంలో రోడ్లు దాటుతూ ప్రమాదాలకు గురై మృతి చెందుతున్నాయి. తాజాగా పెనుగంచిప్రోలు మండలం కొణకంచి క్రాస్రోడ్స్ వద్ద రోడ్డు దాటుతో కారు ఢీకొని మృతి చెందింది. ఈప్రాంతంలో పదుల సంఖ్యలో కనిపిస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో కూడా ముండ్లపాడులో జనావాసంలోకి వచ్చిన జింకను కుక్కలు కరవడంతో చనిపోయింది. వీరులపాడులో సోమవారం రాత్రి వేటగాళ్లు పెట్టిన ఉచ్చులో విద్యుత్ తీగలు తగిలి జింక మృతి చెందింది. అలాగే పెనుగంచిప్రోలు మండలంలోని వెంకటాపురం గ్రామంలో ప్రతి ఏడాది విదేశీ పక్షులు (ఎర్రకాళ్ల కొంగలు) సందడి చేస్తుంటాయి. అవి కూడా వేటగాళ్లు ఉచ్చులో పడుతున్నాయని, వాటికి కూడా రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రావెల్ తవ్వకాలు నిషేధం.. అటవీశాఖ నోటిఫై చేసిన ప్రదేశంలో ఎలాంటి గ్రావెల్ తవ్వకాలు జరపకూడదు. వన్యప్రాణుల సంరక్షణ కోసం నీటి తొట్టెలు, కుంటలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా వీటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. జగ్గయ్యపేట రేంజ్లో మొత్తం అటవీభూమి 5 వేల హెక్టార్లు ఉండగా, 2 వేల హెక్టార్లు సిమెంట్ పరిశ్రమల పరిధిలో ఉంది. – రవివర్మ, జగ్గయ్యపేట సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ -
వైభవంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వైశాఖ పౌర్ణమి నేపథ్యంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత దుర్గగుడి ఘాట్రోడ్డు ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్ ఆది దంపతులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనులపండువగా సాగింది. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, సితారా, పాలప్రాజెక్టు, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు ప్రసాదాలను పంపిణీ చేసింది. -
తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 21వ డివిజన్లో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. ఎన్ఎస్ఎం స్కూల్ నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పెద్ద ఎత్తున వృద్ధులు పాల్గొన్నారు. రెండేళ్లుగా కొత్త పింఛన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం లేదు.. పాత పింఛన్లు సైతం తొలగించింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.నమ్మించి చంద్రబాబు మోసం చేశారు: దేవినేని అవినాష్వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పింఛన్లు కూటమి ప్రభుత్వం తొలగించింది. దీనిపై జోనల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందచేశాం. చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క పథకం కూడా అమలు చేయటం లేదు. మహిళలకు వైఎస్ జగన్ పెద్ద పీట వేశారు. చంద్రబాబు వారిని మోసం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ఈనాడు పేపర్లోనే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది?.పింఛన్లు తీసివేస్తే స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఏమి చేస్తున్నాడు? వైఎస్సార్సీపీ హయాంలో ఏమి జరగక పోయిన గగ్గోలు పెట్టిన గద్దెకు ఇప్పుడు కళ్ళు కనపడటం లేదా?. అర్హత ఉన్న వారికి కూడా పింఛన్లు తొలగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. షో చేయటానికి చంద్రబాబు.. పింఛన్లు లబ్ధిదారులకు స్వయంగా ఇస్తున్నారుప్రచార ఆర్భాటాలు తప్ప.. అమలు లేదు: వెల్లంపల్లి శ్రీనివాస్కూటమి హయాంలో అన్ని రకాల పింఛన్లు తొలగించారు. వైఎస్ జగన్ హయాంలో పింఛన్ల సంఖ్య పెంచారు. పింఛన్లు పెంచి ఇస్తున్నామని ప్రచార ఆర్భాటాలు తప్ప అమలు లేదు. దివ్యాంగులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 50 సంవత్సరాలు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తాం అని మాట ఇచ్చి తప్పారు. కొత్తగా ఎవరికీ శాంక్షన్ చేయటం లేదు. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అనేది అబద్ధం. మహిళలను నమ్మించి చంద్రబాబు మోసం చేశారు. ఏ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదు.అయినా చంద్రబాబుకి చలనం లేదు: మల్లాది విష్ణు విజయవాడలో తొలగించిన పింఛన్లు విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇదే వైఖరి అవలంబిస్తుంది. వైఎస్ జగన్ నవరత్నాలు అమలు చేసే వాస్తవాలు చెప్పేవారు. 33 లక్షల నూతన పింఛన్లు వైఎస్ జగన్ నాలుగేళ్లలో ఇచ్చారు. అర్హత ఉన్న వారు అందరికీ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాలి. మీ పత్రికలే వాస్తవాలు చెబుతున్నాయి అయినా చంద్రబాబుకి చలనం లేదు. విజయవాడలో ఉన్న అన్ని శాఖలు ప్రజల ఆదరణ కోల్పోయాయి. ఇసుక, బూడిద, మట్టి ప్రసాదం లాగా కూటమి నేతలు తినేస్తున్నారు. -
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలకు కష్టాలు
గంపలగూడెం: చంద్రబాబు, కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో పర్యటించి ధాన్యం కొనుగోలుపై రైతులను ఆరా తీశారు. స్థానిక మార్కెట్యార్డులో వారాల తరబడి మొక్కజొన్న, ధాన్యాన్ని ఆరబోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న రైతులతో మాట్లాడి చలించిపోయారు.అమ్మిరెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలంగాణలో మొక్కజొన్న క్వింటా రూ. 2400 వరకు కొనుగోలు చేస్తుంటే, ఇక్కడ రైతులకు రూ.1500 కూడా దక్కడం లేదన్నారు. ధాన్యం ఎక్కడపడితే అక్కడ రాశులు పోసి కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలను పట్టించుకునే నాధుడు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు సైతం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోందన్నారు.రైతుల ఇబ్బందులు పట్టవా?సాగు ఖర్చు పెరిగి, గిట్టుబాటు ధర లేక.. చివరికి పండిన పంటలు సైతం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రులు మాత్రం మలేసియా, సింగపూర్ ట్రిప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం తరలించడానికి వాహనాలు లేవు, సంచులు లేవు, రైతే ఖర్చు భరించి తరలించాలని అధికారులు సూచనలు చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనం అన్నారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆ మాటను నేడు నిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రైతులు కన్నీరు పెడుతుంటే మంత్రి లోకేశ్ జాడ తెలియడం లేదని, మిగతా మంత్రులు మాట్లాడే ధైర్యం లేక మౌనం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని అవినాష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వం స్పందించేంత వరకూ పోరాటాలు చేస్తామన్నారు. ఆయన వెంట తిరువూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏలూరు శివాజీ, ఉపాధ్యక్షుడు అత్తనూరి వెంకట శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి వినయ్కుమార్, జెడ్పీటీసీ కోట శామ్యూల్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. -
విజయవాడ దుర్గగుడిలో తీవ్ర ఇబ్బందులు పడ్డ భక్తులు
విజయవాడ దుర్గగుడిలో శుక్రవారం రాత్రి విద్యుత్ అంతరాయం నెలకొనడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. డీజిల్ లేకపోవడంతో జనరేటర్ ఆన్ కాలేదు. భక్తులకు ఎదురైన ఇబ్బందులపై అధికారులు పట్టించుకోలేదు. 45 నిమిషాల తర్వాత కరెంట్ రావడంతో భక్తులకు ఉపశమనం కలిగింది. -
విద్వేషాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
గన్నవరం: సోషల్ మీడియా వేదికగా సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా తన వీడియో, ఆడియోలను మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటానని గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం గన్నవరం పోలీస్స్టేషన్కు వచ్చిన ఆయన గతంలో పీజీఆర్ఎస్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబ్లో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సెక్షన్ 94 బీఎన్ఎస్ఎస్ కింద నోటీసులు జారీచేయాలని కోరారు. కొంత కాలంగా తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరి 21న అనారోగ్యంతో బాధపడుతున్న యలమంచిలి జయప్రకాష్ను పరామర్శించేందుకు వెళ్లినట్లు చెప్పారు. మరికొంత మందితో కూర్చుని ఉండగా రహస్యంగా వీడియోలు తీసి మావిగన్ ప్రతిపాదనను తప్పు పట్టినట్లు, తమ పార్టీ అధినేతను దూషించినట్లుగా వీడియో, ఆడియోలు మార్ఫింగ్ చేసి యూట్యూబ్లో వైరల్ చేస్తున్నారని విమర్శించారు. అసలు మావిగన్ ప్రతిపాదన అప్పటికీ బయటకు రాలేదని చెప్పారు. అయినప్పటికి ఓ పథకం ప్రకారం తనపై తప్పుడు ప్రచారం చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు. గతంలోనూ దుష్ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం నుంచి సరైన రక్షణ కూడా కల్పించడం లేదని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సీఐ బి.వి.శివప్రసాద్ నిరాకరించారు. కనీసం యూట్యూబ్ నుంచి సదరు వీడియో, ఆడియోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్న అప్లోడర్ వివరాలు పొందడానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 కింద నోటీసులు జారీ చేసేందుకు కూడా సీఐ అంగీకారం తెలపలేదు. దీనిపై వంశీమోహన్తో పాటు ఆయన న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత పోలీసులు తమకు అనుకూలంగా ముందుగా సిద్ధం చేసిన స్టేట్మెంట్పై సంతకాలు చేయాలని వంశీమోహన్ను కోరగా నిరాకరించారు. దీంతో సీఐ స్వయంగా వంశీమోహన్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్ -
గుర్తున్నాయా బాబూ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల వేళ ఉమ్మడి కృష్ణా ప్రజలకు హామీలపై హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మరిచిపోయినట్టున్నారు. సీఎం చంద్రబాబు శుక్రవారం పామర్రు నియోజక వర్గంలోని పమిడిముక్కల మండలంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీల వివరాలతో ప్రత్యేక కథనం. బాబూ మీరిచ్చిన హామీలివే నాడు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరులో పాములలంక వద్ద కృష్ణా నదిపై వంతెనను ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపే నిర్మిస్తామని వాగ్దానం చేశారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న వంతెన నిర్మాణం పనులు మొదలు కాలేదు. పామర్రులో ఐటీ టవర్ ఏర్పాటు మాటను మరిచారు. ఈ ప్రాంతంలో 3,800 మంది లబ్ధిదారులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. తోట్ల వల్లూరులోనూ స్థలాలు ఇస్తామని జనాలను మభ్య పెట్టారు. అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలను పట్టించుకోలేదు. తోట్లవల్లూరు నుంచి ఉయ్యూరు వరకు రహదారి ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. పోర్టు నిర్మాణం 2026కు పూర్తి చేస్తామని చెప్పారు. పెడనలో కలంకారీ క్లస్టర్ నిర్మాణానికి ఇచ్చిన హామిని గాలికొదిలేశారు. బుడమేరు ఆధునికీకరణ హామీ అటకెక్కింది. పెనమలూరు నియోజకవర్గంలో నాడు ఉయ్యూరు ప్రధాన సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సిక్స్ హామీలతో పాటు స్థానికంగా ఉన్న టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. ఉయ్యూరులో చక్కెర ఫ్యాక్టరీకి అనుబంధంగా పారిశ్రామిక అభివృద్ధి చేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినా అడుగు ముందుకు పడలేదు. ‘తిరువూరు’లో.. అధికారంలోకి వచ్చాక తిరువూరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రూ.4,900కోట్లతో, విస్సన్నపేట మండలం పిట్లవారిగూడెం ఎత్తిపోతల పథకాన్ని రూ.6,900 కోట్లతో చేపడతామన్నారు. కట్టలేరు వాగు వద్ద వంతెన, ఎ.కొండూరు, గంపలగూడెంలో కిడ్నీ సమస్యల మూలాలను గుర్తించి పరిష్క రిస్తామన్నారు. మామిడి ఆధారిత పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. తిరువూరు నియోజకవర్గం లో లెదర్ పార్క్ ఏర్పాటు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటు అంటూ హడావుడి చేశారు. ‘నందిగామ’లో గత ఏడాది ఏప్రిల్ 5న చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో సీఎం చంద్రబాబు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. అక్కడ వేదాద్రి ఎత్తిపోతల పథకం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామన్నారు. చందర్లపాడు మండలం ఏటూరు నుంచి కంచికచర్ల మండలం మోగులూరు మునేటిపై కాజువే నిర్మిస్తామని తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించినా ఇంత వరకు జరగలేదు.. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు గొట్టుముక్కలలోని ఏనుగు గడ్డ వాగుపై బ్రిడ్జిల నిర్మాణ పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. పీ4లో భాగంగా ముప్పాళ్ళ గ్రామంలో 40 కుటుంబాలు ఎంపిక చేశారు. వారిలో కేవలం మూడు కుటుంబాలు మాత్రమే మార్గదర్శకులు ద్వారా ఆటోలు, గేదెలు ఇప్పించ్చారు. ఇలా అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు. -
చెస్లో వైద్య విద్యార్థుల సత్తా
లబ్బీపేట(విజయవాడతూర్పు): అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏప్రిల్ 23 నుంచి 25 వరకూ జరిగిన జాతీయ స్థాయి క్రీడా మహోత్సవంలో పాల్గొని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులు చెస్లో సత్తా చాటారు. ఎంబీబీఎస్ 2022 బ్యాచ్కు చెందిన ఎం.సాయిదివ్య , 2025 బ్యాచ్కు చెందిన టి. వెంకటసాయి జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారు. వీరిద్దరూ పురుషులు, మహిళల విభాగంలో ప్రతమ స్థానంలో నిలిచి గోల్డ్మెడల్స్తోపాటు, రూ.3 వేలు నగదు బహుమతిని అందుకున్నారు. వారిని గురువారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుతో పాటు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ కె. ప్రశాంతి, డాక్టర్ ఎస్.గోవిందు, డాక్టర్ కె.ప్రభాకరరావు అభినందించారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ జె. రాము ఉన్నారు. సందడిగా సంగీత కళాశాల వార్షికోత్సవం విజయవాడ కల్చరల్: దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాల 66 వ వార్షికోత్సవాన్ని కళాశాలలోని గోకరాజు గంగరాజు కళా వేదికపై గురువారం నిర్వహించారు. కార్యక్రమాలను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఆర్. మల్లికార్జునరావు ప్రారంభించారు. వార్షికోత్సవం సందర్భంగా వయోలిన్ విద్వాంసురాలు బీవీ దుర్గా భవానిని ఆత్మీయంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా జరిగిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): గంజాయి కలిగి ఉన్న ఇద్దరు యువకులను కొత్తపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2.750 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని బంగారయ్య కొట్టు సెంటర్లో కొంతమంది గంజాయిని కలిగి ఉన్నారని సమాచారం అందింది. దీంతో సెక్టార్ ఎస్ఐ ఉమామహేశ్వర్రెడ్డి తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా, బంగారయ్య కొట్టు కొండ ప్రాంతానికి చెందిన పొన్నాడ ఏసుబాబు(21), మీసాల పార్థు దుర్గా పరమేష్(18) అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా వారి వద్ద 2.750 కేజీల గంజాయిని గుర్తించారు. నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బాలికలదే పైచేయి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా బాలికలు పైచేయి సాధించారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణ శాతం అధికంగా ఉంది. గతేడాది టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 8వ స్థానంలో ఉంటే ఈ ఏడాది 11వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదలైన ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత శాతం 87.91గా నమోదైంది. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగినా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కిందకు దిగజారింది. జిల్లాలో వందరోజుల ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి విద్యాశాఖాధికారులు కృషి చేశారు. గతేడాది ప్రభుత్వ విద్యాసంస్థల ఫలితాలు 75.90 శాతం ఉండగా ఈ ఏడాది అది మూడు శాతం పెరిగింది. పెరిగిన బాలికల ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది కూడా జిల్లాలో బాలికలదే పైచేయి. 13,788 మంది బాలురు, 13,351 మంది బాలికలు మొత్తం 27,139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 11,786 మంది బాలురు, 12,071 మంది బాలికలు మొత్తం 23,857 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురుతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణత 78.95 శాతం ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి 4,999 మంది బాలురు, 5,960 మంది బాలికలు మొత్తం 10,959 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో బాలురు 3,658 మంది, బాలికలు 4,994 మంది మొత్తం 8,652 మంది ఉత్తీర్ణత సాధించి 78.95 శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు సంబంధించి 8,789 మంది బాలురు, 7,391 మంది బాలికలు మొత్తం 16,180 మంది పరీక్షలకు హాజరుకాగా అందులో 8,128 మంది బాలురు, 7,077 మంది బాలికలు మొత్తం 15,205 మంది ఉత్తీర్ణతను సాధించి 93.97 శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 79 విద్యాసంస్థలు నూరు శాతం ఫలితాలను సొంతం చేసుకున్నాయి. అందులో 12 ప్రభుత్వ విద్యాసంస్థలు, 67 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ఒక్క ప్రైవేట్ విద్యాసంస్థ మాత్రం జీరో ఫలితాలను సాధించినట్లు అధికారులు ప్రకటించారు. వత్సవాయి మొదటి స్థానం.. విజయవాడ రూరల్ చివర జిల్లాలో విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లు ఉండగా అందులో 20 మండలాలు కొనసాగుతున్నాయి. 20 మండలాల్లో వత్సవాయి మండలంలోని ప్రభుత్వ విద్యాసంస్థలు 92.70 శాతం ఫలితాలను సాధించి మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో రెడ్డిగూడెం (91.03), పెనుగంచిప్రోలు మండలం (89.89) ఫలితాలను సాధించాయి. చివరి స్థానంలో నందిగామ మండలం (64.98) నిలిచింది. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల ఏపీ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్స్కూల్) ఆధ్వర్యంలో జరిగిన పది, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ గురువారం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా పదో తరగతికి సంబంధించి 4.45 శాతం ఉత్తీర్ణతను సాధించగా, ఇంటర్మీడియెట్కు సంబంధించి 24.67 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. ఇంటర్మీడియెట్లో 1,232 మంది బాలురు, 791 మంది బాలికలు మొత్తం 2,023 మంది పరీక్ష రాయగా అందులో 255 మంది పురుషులు, 244 మంది బాలికలు మొత్తం 499 మంది ఉత్తీర్ణతులయ్యారు. పదో తరగతిలో 683 మంది బాలురు, 530 మంది బాలికలు మొత్తం 1,213 మంది పరీక్ష రాయగా అందులో 19 మంది బాలురు, 38 మంది బాలికలు మొత్తం 54 మంది ఉత్తీర్ణులయ్యారు. మే 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్థులు మే 2 నుంచి 11వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా పరీక్ష రుసుంను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. గోసిపాట నిత్యశాత్విక జిల్లా మూడో స్థానంఎండీ అఖిలా ఫార్హీన్ జిల్లా మొదటి స్థానం -
విజయవాడ సిటీ
వైభవంగా ఎదుర్కోలోత్సవం శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం అశ్వవాహనంపై ఎదుర్కోలోత్సవం ఘనంగా జరిగింది.ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2026జి.కొండూరు: మండలంలోని వెలగలేరులో గురువారం కల్కి భగవాన్ విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు సతీసమేతంగా పాల్గొన్నారు. రుద్ర చండీహోమం గొట్టుముక్కల(కంచికచర్ల): గొట్టుముక్కల అంకమ్మ ఆలయం 11వ వార్షిక వేడుకల్లో భాగంగా గురువారం రుద్ర చండీహోమం జరిగింది.7 -
పారదర్శకంగా కేడీసీసీ బ్యాంక్ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): కేడీసీసీ బ్యాంకు సేవలను పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో డిజిటలైజేషన్ చేసినట్లు ఆ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. బుధవారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డిజిటల్ సేవలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అన్ని సర్క్యులర్లను ఒకే పోర్టల్లో అందుబాటులోకి తీసుకువచ్చే నూతన వ్యవస్థను తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి వేగవంతంగా అందిస్తామన్నారు. ఈ పోర్టల్ ద్వారా సిబ్బంది, ఖాతాదారులు, సంబంధిత వర్గాలు బ్యాంక్ సర్క్యులర్లను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చునన్నారు. సీఈఓ శ్యామ్ మనోహర్, జీఎంలు చంద్రశేఖర్, రంగబాబు, డీజీఎం వరలమ్మ, ఏజీఎంలు వాసవి కుమారి, ప్రభా, శ్రీదేవి పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు: అసభ్య ప్రవర్తనపై స్థానిక బీసీ కాలనీ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం పెనుగంచిప్రోలులో కేసు నమోదైంది. బండి ఆదినారాయణ అనే వ్యక్తి బాత్రూమ్లో మహిళల వీడియోలు తీస్తున్నాడని బీసీ కాలనీ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఆదినారాయణ ఫోన్ను తనిఖీ చేయగా మొత్తం 6 నుంచి 8 మంది వరకు మహిళల ఫొటోలు, వీడియోలు ఉన్నట్లు గుర్తించారని తెలుస్తోంది. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఇసుక రీచ్లకు టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్లకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరాపై కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇసుక, పట్టా భూముల్లో ఇసుక తొలగింపు, కొత్త రీచ్లకు అనుమతులు, అక్రమ రవాణా నివారణ చర్యలపై చర్చించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జగ్గయ్యపేట, చందర్లపాడు, కంచి కచర్ల మండలాల్లో రీచ్లకు సంబంధించిన టెండర్లు ఖరారు కాలేదని, తిరిగి టెండర్లు పిలిచే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పట్టా భూముల్లో మేట వేసిన ఇసుక తొలగింపునకు రైతులకు అనుమతి ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో మైన్స్ డీడీ శ్రీనివాస్ కుమార్, ఏడీ కె. వీరస్వామి, డీపీఓ లావణ్యకుమారి, డీటీసీ ఎం. పురేంద్ర, కేసీ డివిజన్ ఈఈ రవికాంత్, నందిగామ ఆర్డీఓ కె.పోసిబాబు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, పరీక్షల సమన్వయకర్త మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే మూడో తేదీన జరిగే పరీక్షకు కృష్ణా యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రెండు కేంద్రాల్లో 480 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. 64 మంది ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రం, తేదీ లేదా షిఫ్ట్ మార్పులపై ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాల విద్యార్థులకు పవర్ లిఫ్టింగ్ పోటీలు బుధవారం ఉత్సాహంగా జరిగాయి. సిద్ధార్థ కళాశాల ఆధ్వరంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఎనిమిది కళాశాలల నుంచి 35 మంది క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. బహు మతి ప్రదానోత్సవానికి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ హాజరై ప్రసంగించారు. జూన్ మూడు నుంచి ఎనిమిదో తేదీ వరకు చెన్నయ్ లోని హిందుస్థాన్ యూనివర్సిటీ ఆవరణలో అంతర విశ్వవిద్యాలయ పవర్ లిఫ్టిగ్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీ జట్టుకు ఎంపికై న సభ్యులు ప్రతిభ చూపాలన్నారు. కృష్ణా జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హేమచంద్రరావు, సిద్ధార్థ కళాశాల క్రీడా విభాగాధిపతి డాక్టర్ టి.వి.బి.కృష్ణారెడ్డి పోటీల విజేతలను అభినందించారు. వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్లు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ దేవినేని అవినాష్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: సోషల్ మీడి యాలో ప్రజల సమస్యలపై ప్రశ్నించినందుకు తమ పార్టీ మైనార్టీ నాయకుడు కరిముల్లాపై టీడీపీ నాయకులు దాడి చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవి నేని అవినాష్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలపై ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కుని తెలిపారు. ఆ హక్కును అణచివేయడానికి కూటమి ప్రభుత్వం హింసాత్మక మార్గాలకు తెగబడుతోందని దుయ్యబట్టారు. సోషల్ మీడియా వేదికగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం తప్పుకాదని, ఆ గొంతు లను టీడీపీ నేతలు భయపెట్టడం అసహ్యమని పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవా లని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరిముల్లాకు తగిన రక్షణ కల్పించి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
కలుపు మొక్కే కల్పతరువు
పెడన: గుర్రపు డెక్క ఓ కలుపు మొక్క. పంట కాలువలు, మురుగు కాలువల్లో దట్టంగా అల్లుకు పోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. దీని వల్ల ఇబ్బందులు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటి కలుపు మొక్కతో అద్భుతమై కళాకృతులు చేయొచ్చని, వాటిపై డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇస్తే ఆర్థికంగా ఎదుగుతారని అధికారులు భావించారు. బందరు మండలం చిన్నాపురం డ్వాక్రా మహిళలకు అసోం నుంచి వచ్చిన వారితో శిక్షణ ఇప్పించారు. వారు గుర్రపుడెక్కతో తయారు చేసిన బట్టలు, యోగా మ్యాట్లు, డిన్నర్ సెట్ మ్యాట్లు, టోపీలు, పలు అలంకరణ సామగ్రిని చూసి పలువురు మహిళలు అబ్బురపడ్డారు. తాము కూడా శిక్షణ పొంది పలు రకాల అలంకరణ సామగ్రిని తయారుచేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం పెడన మండలం చేవేండ్ర గ్రామం, బంటుమిల్లి మండలం మణిమేశ్వరం పంచా యతీ లేళ్లగూడెం గ్రామంలో డ్వాక్రా మహిళలు గుర్రపు డెక్కతో అలంకరణ సామగ్రి తయారీలో శిక్షణ పొందుతున్నారు. రెండు నెలల శిక్షణ ప్రస్తుతం చేవేండ్ర గ్రామంలో సుమారు 26 మంది శిక్షణ పొందుతున్నారు. లేళ్లగూడెంలో కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. శిక్షణకు హాజరవుతున్న మహిళలకు రోజుకు రూ.300 చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. శిక్షణ పొందిన మహిళలు ఒక్కొక్కరు రోజుకు రెండు లేదా మూడు డైనింగ్ టేబుల్పై వాడే డిన్నర్ మ్యాట్లు తయారు చేస్తున్నారు. యోగా మ్యాట్ రోజుకు ఒకటి పూర్తి చేస్తున్నారు. రకాన్ని బట్టి బుట్టకు రెండు లేదా మూడు రోజుల సమయం పడుతోంది. శిక్షణ పొందిన మహిళలతో సొసైటీ ప్రారంభించి చిన్నపాటి కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారు. పెడనకు చెందిన కలంకారీ వ్యాపారి, లేపాక్షి కో ఆర్డినేటర్ జంపాన శ్రీనివాస్ డ్వాక్రా మహిళలు శిక్షణ పొందేలా ప్రోత్సహిస్తున్నారు. పంట కాలువలు, మురుగు నీటి కాలువలు, చెరువుల్లో పెరిగిన గుర్రపు డెక్కను సేకరిస్తారు. ఆ డెక్కను ఎండబెట్టి నారను తయారు చేస్తారు. దీనితో వివిధ రకాల వస్తువులను తయారు చేస్తారు. ప్రస్తుతం ఎండబెట్టిన గుర్రపు డెక్క కిలో ధర రూ.70 వరకు పలుకుతోంది. గుర్రపు డెక్క నారతో యోగా మ్యాట్లు, డిన్నర్ సెట్ మ్యాట్లు, పూజా సామగ్రిని తీసుకెళ్లే బుట్టలు, ఇంటిలో అలంకరణకు వాడుకునే పూల బుట్టలు, వివిధ శుభకార్యాల్లో అతిథులకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేందుకు వివిధ రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. -
నటరాజుకు నృత్యాభిషేకం
విజయవాడ కల్చరల్: కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్య సంప్రదాయాలను మేళవిస్తూ ఘంట సాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో రెండు రోజులుగా నిర్వహించిన ప్రపంచ నృత్య దినోత్సవాలు బుధవారం ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, అమరావతి శాసీ్త్రయ నాట్యాచార్యుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో నగరానికి చెందిన రెండు వందల మందికి పైగా చిన్నారులు పాల్గొని నట రాజ స్వామికి నృత్యాభిషేకం సమర్పించారు. శివస్తుతి, దశావతారాలు, గరుడ గమన, రారా మా ఇంటికి కృష్ణయ్య, అష్టలక్ష్మి నృత్యం, తరంగం, థిల్లానా, కొండలలో నెలకొన్న, అఖిలాండ కోటి, అయిగిరి నందిని, తదితర కీర్తనలకు నృత్యాలను అభినయించారు. ముఖ్య అతిథి, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ సి.జ్యోతిర్మయి మాట్లాడుతూ.. భారతీయ నృత్య సంప్రదాయాలు విశిష్టమైనవన్నారు. అమరావతి నాట్యాచార్యుల బృందాన్ని అభినందించారు. కూచిపూడి కళానికేతన్ వ్యవస్థాపకుడు వేదాంతం వెంకటనాగ చలపతి పాల్గొన్నారు. నృత్య కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. కూచిపూడి నాట్య సంప్రదాయానికి కృషి చేస్తున్న నాట్యాచార్యుడు ఏలేశ్వరపు శ్రీనివాస్, వాద్య సహకారం అందిస్తున్న పాలపర్తి ఆంజనేయులు, రాగ నిపుణుడు చల్లారావును నిర్వాహ కులు సత్కరించారు. నాట్యాచార్యులు డాక్టర్ వేదాంతం పార్థసారథి, డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, పద్మశ్రీ హేమంత్, యల్లా జోస్యల అనూరాధ,భాగవతుల సౌమ్య, భాగవతుల వెంకట్రామ శర్మ, జోస్యుల శ్రీరామచంద్రమూర్తి, శారద రామకృష్ణ, ఉమామహేశ్వర పాత్రుడు, చదలవాడ ఆనంద్, రాయన శ్రీనివాసరావు, ఉషా మాధవి, దేవరకొండ చంద్రశేఖర్, సీహెచ్ అజయ్కుమార్, సప్పా శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల ఎక్స్ప్రెస్ గుంతకల్ వరకు పొడిగింపు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఇప్పటి వరకు విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ (18522/18521)ను ప్రయాణికుల డిమాండ్ మేరకు గుంతకల్ వరకు పొడిగిస్తూ రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. గుంతకల్లు–విశాఖపట్నం తిరుమల ఎక్స్ప్రెస్ (18522) మే 12 నుంచి, విశాఖపట్నం–గుంతకల్లు తిరుమల ఎక్స్ప్రెస్ (18521) మే 13 నుంచి రెగ్యులర్ సర్వీసుగా ప్రకటించారు. రైలు షెడ్యూల్ ఇదీ.. విశాఖపట్నం–గుంతకల్లు (18521) ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి 2.33కి గుంతకల్లులో చేరుకుంటుంది. అక్కడ నుంచి మరుసటి రోజు ఉదయం 7.03కి కడప, 7.38కి యర్రగుంట్ల, 8.10కి కొండాపురం, 8.33కి తాడిపర్తి, 9.13కి గుత్తి అక్కడ నుంచి 11.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (18522) మధ్యాహ్నం 1.30 గంటలకు గుంతకల్లులో బయలుదేరుతుంది. అక్కడ నుంచి 1.55కి గుత్తి, 2.50కి తాడిపర్తి, 3.13కి కొండాపురం, సాయంత్రం 5.38కి కడప చేరుకుని, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దువ్వాడ, 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. -
పోలీసుల అదుపులో హత్యకేసు నిందితుడు?
హనుమాన్జంక్షన్ రూరల్: హనుమాన్జంక్షన్లో కలకలం రేపిన చిన్ని ఎంటర్ప్రైజెస్, కేకే హెచ్–మార్ట్ల అధినేత వడ్డి క్రాంతి కిరణ్ (చిన్ని) హత్య కేసులో నిందితుడు, మాజీ రౌడీషీటర్ రామినేని రామకృష్ణ (ఆర్కే) పోలీసుల అదుపులో ఉన్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. స్థానిక విజయవాడ రోడ్డులోని కేకే హెచ్–మార్ట్ను మూసివేసి మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్తుండగా వడ్డి క్రాంతి కిరణ్ (చిన్ని)ని వెనుక నుంచి వేగంగా కారు ఢీకొట్టి హత్య చేసిన విషయం విదితమే. పాత కక్షల నేపథ్యంలో మాజీ రౌడీ షీటర్ ఆర్కే ఉన్మాదంగా వ్యవహరించి ఈ దురాగతానికి పాల్పడటంతో పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. ఈ తరుణంలో బుధవారం గన్నవరం సమీపంలో నిందితుడు ఆర్కే ఆచూకీని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన ప్రాంతాన్ని మచిలీపట్నం క్లూస్ టీం, హనుమాన్జంక్షన్ ఇన్చార్జి సీఐ శివప్రసాద్ పరిశీలించి ఆధారాలను సేకరించారు. అవనిగడ్డ: చారిత్రక ప్రసిద్ధి నొందిన లక్ష్మీనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా నిర్వహించారు. వేకువజామునే పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయగా అర్చకులు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా వెండి నాగపడగను ఆలయ ధర్మకర్త పోతరాజు భాస్కరరావు, వెంకట శ్రీకాంత్, వెంకట లక్ష్మీకిరణ్మయి బహూకరించారు. ఈఓ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సమ్మిళితమైన ఎమ్మెస్సీ (ఎకనామిక్స్), ఎమ్మెస్సీ (సైకాలజీ) కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఆ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సీహెచ్ సతీష్కుమార్ చెప్పారు. విజయవాడలో కోర్సుల పోస్టర్ను ఆవిష్కరణను బుధవారం నిర్వహించారు. ఆచార్య సతీష్కుమార్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాముఖ్యత కలిగిన కార్నెగీ మెలన్ యూనివర్సిటీతో ఏపీ ఎస్ఆర్ఎం ఎంవోయూ చేసుకొని తమ సంస్థలోని పలువురు ప్రొఫెసర్లకు శిక్షణ ఇప్పించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వీటిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెస్సీ (ఎకనామిక్స్ )లో బలమైన ఆర్థిక సిద్ధాంతాన్ని ఏఐ ఆధారిత గ్లోబల్ సవాళ్లను పరిష్కరించేందుకు సహాయపడుతుందన్నారు. దేశంలో ఇలాంటి కోర్సు అరుదుగా ఉందన్నారు. ఎమ్మెస్సీ (సైకాలజీ) కోర్సునూ ప్రత్యేకంగా రూపొందించారన్నారు. నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగిన విద్యార్థులకు ఒక సంవత్సరం ప్రోగ్రామ్గా, మూడేళ్ల కాలపరిమితి కలిగిన డిగ్రీ కలిగిన వారికి రెండు సంవత్సరాల ప్రోగ్రామ్గా దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. డిగ్రీలో వారు సంపాందించిన మార్కుల ఆధారంగా ఫీజు రాయితీ ఉంటుందని వివరించారు. సమావేశంలో ఈశ్వరీ స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ డీన్ డాక్టర్ విష్ణుపథ్, ఎకనామిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఉబైద్ ముస్తాక్, సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఆయేషా తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నిలిచిన మట్టితవ్వకం పనులు 7చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా పంచాయతీ అధికారిగా ఎం.ధనలక్ష్మిని నియమిస్తూ పీఆర్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ డీపీఓగా జెడ్పీ సీఈఓ జె.అరుణ వ్యవహరిస్తున్నారు.ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మను మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ రామ సుబ్రమణియన్ కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు.క్రమశిక్షణ చర్యలు పునఃపరిశీలించాలి భవానీపురం(విజయవాడపశ్చిమ): ఐవీఆర్ఎస్ నివేదికల ఆధారంగా స్వర్ణ గ్రామ/వార్డు సచివా లయ ఉద్యోగులపై క్రమశిక్షణ పేరుతో హెచ్చరికలు, మెమోలు, సస్పెన్షన్ వంటి చర్యలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, వాటిని పునఃపరిశీలించాలని ఏపీ గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ ఆటోనగర్లోని ఎస్జీఎస్డబ్ల్యూ శాఖ డైరెక్టర్ ఎం. శివప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అర్లయ్య మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ నివేదికల ఆధారంగా జారీ చేసిన మెమోలు, సస్పెన్షన్ చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. సంస్థ కృష్ణా జిల్లా కార్యవర్గ సభ్యులు బడుగు సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: పట్టణంలో వేంచేసిన శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ముఖ మండపంలో స్వామికి బుధవారం అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సాక్షి, ప్రతినిధి విజయవాడ: మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన గిలకదిండి ఫిషింగ్ హార్బర్కు రెండేళ్లుగా ‘చంద్ర’ గహణం పట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 67 శాతం పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు పాల నలో నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లలో కేవలం ఐదు శాతం లోపు పనులే జరిగాయి. 2024లో మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే హార్బర్ పనులు ఈ పాటికే పూర్తయ్యేవని పలువురు మత్స్యకారులు పేర్కొంటున్నారు. హార్బర్లో మిగిలిన 30 శాతం పూర్తి చేయకుండా తమ జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం అడు తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చూస్తున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదన్న భావన మత్స్యకారుల్లో ఉంది. వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మత్స్యకారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను వేగవంతం చేసింది. ఇక్కడ పాతికేళ్ల క్రితం నిర్మించిన హార్బర్ ఉపయోగంలో లేదు. హార్బర్ ఇసుక మేటలు వేసి పూడిపోవడంతో సముద్రంలోకి బోట్లు వెళ్లే వీలు లేకుండాపోయింది. ఫలితంగా మత్స్యకారులు పోటు సమయంలోనే అతికష్టంమీద వేటకు వెళ్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఇతర జిల్లాలోని హార్బర్లపైన ఆధారపడి వేట చేయాల్సి వచ్చేది. ఈ సమస్యలకు పరిష్కారం చూపుతూ గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిలకలదిండి హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరో 50 ఏళ్ల వరకు మత్స్యకారుల వేటకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక వసతులతో ఫిషింగ్ హార్బర్ పనులను రూ.421.71 కోట్లతో చేపట్టి మార్చి 2021లో ప్రారంభించారు. ఫిషింగ్ హార్బర్ను 550 బోట్లు నిలిపే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే 3,300 మంది మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఫిష్ ల్యాండింగ్ కెపాసిటీ 23,500 టన్నులుగా నిర్ణయించారు. ప్రధానంగా 764 మీటర్ల క్వే (గట్టు )కు సంబంధించి 95 శాతం పనులు పూర్తయ్యాయి. 21.55 లక్షల క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ (మట్టి పనులు) చేయాల్సి ఉండగా 18.28 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది. మౌలిక వసతులకు సంబంధించిన పనులు ప్రారంభయ్యాయి. బ్రేక్ వాటర్ పనులకు సంబంధించి రాక్ సరఫరాతో, ప్లేస్మెంట్ సైతం పూర్తయ్యాయి. సీసీ స్లాబ్, క్రో వాల్ పెండింగ్లో ఉన్నాయి. అసంపూర్తిగా మౌలిక వసతులు చేపల అమ్మకం షెడ్లు, లోడింగ్ సదుపాయాలు, పరిపాలన భవనం, మత్స్యకారుల విశ్రాంతి భవనాలు, డార్మెటరీలు, రేడియో కమ్యూనికేషన్ టవర్, కోస్టల్ పోలీసు స్టేషన్, అంతర్గత రోడ్లు, కోల్డ్ స్టోరేజీలు, ఐస్ ప్లాంట్లు, రక్షిత మంచినీటి ట్యాంకు, డ్రెయినేజీ ఇలా పలు మౌలిక వసతులకు సంబంధించిన భవనాల నిర్మాణం కొన్ని అసంపూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని ప్రారంభమే కాలేదు. హార్బర్ పనులు నత్తనడకన సాగడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండెనక బండి కట్టి.. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 33.9320 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రారంభమైన హార్బర్ పనులు నామమాత్రంగానే సాగుతున్నాయి. గతంలో వేగంగా జరిగేవి. రెండేళ్ల నుంచి నత్తనడకన సాగుతున్నాయి. వేటకు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు మత్స్యకారులు ముఖద్వారం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పోటు వచ్చినప్పుడే సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోంది. ఏ సమయంలోనైనా వేటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలి. – లంకే వెంకటేశ్వరరావు, మైకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడుమచిలీపట్నం హార్బర్ నిర్మాణంతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఏ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైనా కానీ అన్ని సదుపాయాలతో హార్బర్ నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం పనులు నిలిచిపోకుండా త్వరితగతిన పూర్తి చేసి మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురావాలి. – సైకం ఆంజనేయులు, డీప్ సీ ఫైబర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇసుక మేటలను నివారించి సముద్రంలోకి పడవలు వెళ్లటానికి వీలుగా సముద్ర మొగకు కృష్ణా నది దక్షిణం వైపు 1,240 మీటర్లు, తూర్పు వైపు 1,150 మీటర్ల వరకు గోడలు నిర్మించాల్సింది. దీంతో పాటు 14 మీటర్ల లోతున 10.50 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సింది. ఈ పనులు పూర్తిగా నిలిచిపో యాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలోనే హార్బర్ నిర్మాణానికి అవసరమైన 56 ఎకరాల భూమిని సేకరించి కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. చంద్రబాబు సర్కారు వచ్చాక పనులు పూర్తిగా పడకేశాయి. -
తప్పని పడిగాపులు
తరగని క్యూలు.. డీజీల్ అందుబాటులో లేకపోవడంతో విజయవాడ గాంధీనగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిచిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంధన సంక్షోభం రైతులు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా డీజిల్ కొరత ఇంకా వేధిస్తోంది. ముఖ్యంగా ప్రైవేటు బస్సులు, కారు ట్రావెల్స్ నిర్వాహకులకు డీజిల్ షాక్ తగిలింది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు కొన్ని బంకుల వద్ద క్యూ కట్టి దర్శనమిచ్చాయి. అక్కడక్కడ కొన్ని బంకులు తెరుచుకోలేదు. కొన్ని బంకుల యాజమాన్యం లోడ్ రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మూసివేశామ ని వాహనదారులకు సమాధానమిస్తున్నారు. రెండు రోజులుగా వాహనాదారులు బంక్ల వద్ద ఇబ్బందులు పడుతూ వచ్చారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడంతో రద్దీ తగ్గింది. రైతుల కష్టాలు తీరేదెలా? జిల్లాలోని కొన్ని మండలాల్లో 20, 30 గ్రామాలకు ఒకటి రెండు పెట్రోల్ బంకులే అందుబాటులో ఉన్నాయి. అటువంటి చోట రైతులు అసౌకర్యానికి గురయ్యారు. ట్రాక్టర్లు, వరి, మొక్కజొన్న కోసే యంత్రాలు పొలాల్లో ఉంటే సహాయకులు బైక్లపై క్యాన్లతో డీజిల్ అందిస్తూ ఉంటారు. దగ్గర్లో బంకులు లేక పోవడం... ఇవాళ కూడా కొన్ని బంకులు పరిమితులు విధించడంతో రైతుల అవసరాలకు సరిపడా అందలేదని చెబుతున్నారు. ఇక ఆటో వాలాలు దూర ప్రాంత కిరాయిలు రద్దు చేసుకున్నారు. రూ. 200, రూ. 300కే డీజిల్ పోశారని చెబుతున్నారు. ట్రావెల్స్ బస్సుల క్యూ.. నగరంలో హనుమాన్పేట ప్రైవేటు ట్రావెల్స్కు అడ్డా. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులతో ఉదయాన్నే బస్సులు నగరానికి చేరుకుంటాయి. సాయంత్రం ప్రయాణికులతో తిరుగు ప్రయాణం అవుతాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు డీజిల్ కోసం క్యూ కట్టాయి. రాత్రిళ్లు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి వచ్చామని, పగలు నిద్ర పోకుండా డీజిల్ కోసం క్యూలో బస్సులు నిలుపుకోవాల్సి వచ్చిందని డ్రైవర్లు వాపోయారు. జిల్లాలో పలు చోట్ల బంకులు మూసి ఉంచారు. వాహనదారులు అడిగితే లోడ్కు డబ్బులు కట్టామని, లోడ్ వచ్చే వరకు పెట్రోల్, డీజిల్ పోయలేమని సమాధానం చెబుతున్నారు. ధర పెంచిన ప్రైవేటు బంక్లు.. జిల్లాలో ప్రైవేటు బంకులు ధరలు పెంచేశాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.109.21 ఉండగా డీజిల్ రూ.97.07గా ఉంది. ప్రైవేటు బంకుల్లో లీటర్కు రూ.5 చొప్పున పెంచేశారు. ప్రైవేటు బంకుల్లో పెట్రోల్ రూ. 114.19కు చేరింది. అసలే ర్యాపిడో, ఓలా, ఊబర్ లతో పాటు ఫ్రీ బస్సుల వల్ల ఆటో కిరాయిలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆటోకు అవసరమైన డీజిల్ కోసం పెట్రోల్ బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎక్కడ డీజిల్ దొరుకుతుందో అర్థం కావటం లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ కేవలం రూ. 200 డీజిల్ మాత్రమే పోస్తున్నారు. దీనివల్ల బేరాలను వదులు కోవాల్సి వస్తోంది. – ఆర్. కృష్ణ, ఆటో డ్రైవర్కుదేలవుతున్న రవాణా వ్యవస్థ ఆయిల్ లోడ్ రాకపోవడంతో తెరుచుకోని బంక్లు గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఆటోలు, కార్లకు పరిమితులు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లపై పెట్రో కష్టాలు మరింత ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులను ఆదుకోవాలి.. ఆటో కార్మికులు ఇబ్బంది పడకుండా డీజిల్, పెట్రోల్ ప్రత్యేకంగా అందించేలా చర్యలు తీసుకోవాలి. – డి. నాయుడు ఆటో డ్రైవర్ -
తాళం వేస్తే.. ఇల్లు ఖాళీ!
సెలవులకు ఊరెళ్లేవారు తస్మాత్ జాగ్రత్త! ● పగలు రెక్కీ చేసి, రాత్రి వేళ దొంగతనాలు చేస్తున్న నేరగాళ్లు ● విలాసాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్న వైనం ● పోలీసుల అదుపులో వరుస చోరీల నిందితులు ● విజయవాడ కృష్ణలంక శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఈ నెల మొదటి వారంలో అయోధ్యకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తాళం పగలకొట్టి ఉండటంతో ఉలిక్కిపడింది. బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని వాంబే కాలనీకి చెందిన పాత నేరస్తుడు ములకల నిరంజన్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం : 112 ఏసీపీ క్రైమ్ : 9440627040 సీఐ క్రైమ్ : 8333993112 లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కోసం : 9440627040– ఎం. రాజారావు, అడిషనల్ డీసీపీ ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇస్తే, లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారు. ఇంట్లోని ఖరీదైన బంగారు నగలు, నగదును బ్యాంక్ లాకర్లో ఉంచి, అవసరమైనప్పుడు తీసుకోవాలి. ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి పర్మినెంట్ అడ్రసు, వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వారి వద్దకు ఎవరైనా వస్తున్నారా, రాత్రి వేళల్లో వారి చర్యలను గమనించాలి. ఇంటి పరిసరాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసు స్టేషన్కు తెలియజేయాలి. రాత్రి వేళల్లో పడుకునే ముందు ఇంటి తలుపులు, కిటికీలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఖరీదైన వస్తువులు కిటికీల వద్ద పెట్టవద్దు. ఇంటి తలుపులు, కిటికీలకు ఎలక్ట్రికల్ సెక్యురిటీ అలారమ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అపరిచిత వ్యక్తులు ఇంటికి రాకుండా చూడాలి. కిటికీలో నుంచి మాట్లాడి పంపించి వేయాలి. పనిమనిషి, సెక్యూరిటీ, వాచ్మెన్ను నియమించే సమయంలో వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇంటి మెయిన్గేటు, ప్రధాన గుమ్మం వద్ద, హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. -
ఇది సర్కారు తెచ్చిన సంక్షోభం
పెట్రోల్, డీజిల్ కొరత చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే విజయవాడ భవానీపురంలోని ఓ బంకు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వెలంపల్లి విజయవాడ ధర్నా చౌక్ వద్ద మినీ వ్యాన్ను తాడుతో లాగుతూ నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తదితరులు విజయవాడ మహానాడు రోడ్డు సిగ్నల్ వద్ద ఉన్న పెట్రోల్ బంక్ ఎదుట నిరసన తెలుపుతున్న దేవినేని అవినాష్, ఆటోడ్రైవర్లు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇంధన కొరత ఏర్పడిందని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. ప్రజలు నమ్మి కూటమికి ఓట్లేస్తే డీజిల్, ఎరువుల కోసం రైతులను, పెన్షన్ల కోసం వృద్ధులను, రేషన్, గ్యాస్ కోసం మహిళలను రోడ్డెక్కించిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పెట్రోల్ బంక్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లతో ఆటోలను లాగుతూ నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ● వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో దేవినేని రాజశేఖర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. అవినాష్ తాడుతో ఆటో లాగి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వమని, ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా అందించలేకపోతోందన్నారు. సర్కారు వైఫల్యాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. ● విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్ వద్ద మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి విజన్ లేదన్నారు. అన్ని విషయాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవానీపురం బ్యాంక్ సెంటర్ వద్ద పెట్రోల్ బంక్ను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ 70శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డు కనిపిస్తోందన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అన్నీ ఉన్నాయంటూ అబద్దాలు చెబుతోందన్నారు. ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ధరలు పెంచేందుకు కృత్రిమ కొరత సృష్టించిందని ఆరోపించారు. ● తిరువూరు, జగ్గయ్యపేటలో ఆయా నియోజక వర్గాల ఇన్చార్జిలు నలగట్ల స్వామిదాసు, తన్నీరు నాగేశ్వరరావు మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వైఎస్సార్ సీపీ నాయకులు అన్ని వర్గాలను రోడ్డున పడేసిందంటూ ఆవేదన ఇంధన కొరతపై జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసన -
ఉత్సాహంగా చెస్ టోర్నీ
ఉయ్యూరు: ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర 4వ మహాసభలు మంగళవారంతో ముగిశాయి. ఉయ్యూరులోని వీఆర్కేఎం పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్రెడ్డి హాజరై రైతులు, కౌలురైతుల సంక్షేమం, హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన అంశాలపై సూచనలు చేశారు. పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలమన్నారు. అనంతరం మహాసభ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 45మంది సభ్యులతో కూడిన కమి టీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పి.బలరాం, కార్యదర్శిగా మాగంటి హరిబాబు, కోశాధికారిగా వై.రాధాకృష్ణ, ఉపాధ్యక్షులుగా వి.శ్రీనివాసరావు, రాజబాబు, రామాంజనేయులు, లక్ష్మణస్వామితో కూడిన కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కౌలురైతుల పోరాటాలపై పలు తీర్మానాలను ఆమోదించారు. హనుమాన్జంక్షన్ రూరల్: హనుమజ్జయంతి వేడుకలు మే 7 నుంచి 12వ తేదీ వరకు జరుగుతాయని అభయాంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు, కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు. హనుమాన్ జంక్షన్లోని ఆలయ ప్రాంగణంలో హనుమజ్జయంతి ఉత్సవాల పోస్టర్లు, కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తామని, ఆలయ అధ్యాత్మిక వేదికపై భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పావులూరి రామారావు, ఆలయ ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యులు, పుర ప్రముఖులు, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ట్రాక్ల నిర్వహణ కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–తిరుపతి(18505) రైలును ఈ నెల 29న, తిరుపతి–విశాఖపట్నం (18506) రైలును ఈ నెల 30న తిరుచానూరు –తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఈ నెల 28న చర్లపల్లి–తిరుచిరాపల్లి(07615) రైలు పాకాలా, చిత్తూరుకు బదులుగా రేణి గుంట, మెల్పక్కం క్యాబిన్, కాట్పాడి మీదుగా దారి మళ్లించారు. తిరువన్నమలై–నర్సాపూర్ (07220) రైలు ఈ నెల 30న చిత్తూరు, పాకాలా, తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. మే ఒకటో తేదీన కన్యాకుమారి–ఎస్ఎంవీడీ కత్రా (16317) రైలును చిత్తూరు, తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం –ఓఖా తిరుపతికి బదులుగా కాట్పాడి, మెల్పక్కం క్యాబిన్, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
దుర్గగుడి ప్రాంగణంలో దారుణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండే మహా మండపం ఆరో అంతస్తులోని మహిళల టాయిలెట్లలోకి ఓ యువకుడు ప్రవేశించాడు. టాయిలెట్కు వెళ్లిన వారిని గోడ ఎక్కి చూడటంతో లోపల ఉన్న ఇద్దరు మహిళలు కేకలు వేశారు. ఆలయ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మహా మండపం నాలుగో అంతస్తులో సెక్యూరిటీ సిబ్బందితో ఆలయ ఈఓ, వన్టౌన్ పోలీసులు సమావేశమయ్యారు. అదే సమయంలో మహా మండపం ఆరో అంతస్తులోని టాయిలెట్లలోకి చిట్టినగర్ వాగు సెంటర్కు చెందిన మహేష్ ప్రవేశించాడు. కొద్ది నిమిషాల తర్వాత ఆలయంలో సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న మహిళలు టాయిలెట్ల లోపలకు వెళ్లారు. కాలకృత్యాలు తీర్చుకునే తరుణంలో గోడపై నుంచి ఎవరో తమను చూస్తున్నట్లు గుర్తించారు. తలపైకి ఎత్తి చూసే సరికి మహేష్ కనిపించడంతో వారు కేకలు వేస్తూ బయటకు పరుగు పెట్టారు. సెక్యూరిటీ సిబ్బంది కేకలతో అక్కడికి చేరుకున్న ఆలయ సిబ్బంది టాయిలెట్లలో ఉన్న మహేష్కు దేహశుద్ధి చేసి నాల్గో అంతస్తులో ఉన్న పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ యువకుడి వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అతని ఫోన్ను పోలీసులు తనిఖీ చేస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. -
జీజీహెచ్లో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
లబ్బీపేట(విజయవాడతూర్పు): తమ రెండు నెలల పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజైన మంగళవారం కూడా విధులు బహిష్కరించి ఆందో ళన కొనసాగించారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే సోమవారం రాత్రి కూడా కార్మికులు నిరసన శిబిరంలోనే ఉన్నారు. తమకు జీతాలు ఎప్పుడు చెల్లించేదీ రాత పూర్వక హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. తమకు జీతాలు రాక పోవడంతో ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, పొదుపు రుణాలు చెల్లించలేక పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వాస్పత్రిలో పాలు, పాత ఆస్పత్రి, దంత వైద్య కళాశాల, సిద్ధార్థ వైద్య కళాశాలల్లో పనిచేసే కార్మికులంతా ఈ నిరసనలో పాల్గొన్నారు. కార్మికులు విధులు బహిష్కరించడంతో మంగళవారం చేయాల్సిన సర్జరీలను వాయిదా వేశారు. ఒక దశలో ఉద్రిక్తత విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న కార్మికులు సూపరింటెండెంట్ కార్యాలయం ముట్టడించేందుకు వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు మూకుమ్మడిగా సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లడానికి వీలులేదని సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం ఇన్స్పెక్టర్ డి.వి. రమణ, పోలీసులు తేల్చిచెప్పారు. దీంతో అక్కడే కొద్దిసేపు బైఠాయించారు. తమకు పెండింగ్ జీతాలతో పాటు, పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు వెల్లడించాలన్నారు. కార్మికులకు సీఐటీయూ నేతలు అండగా నిలిచారు. మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం లబ్బీపేట(విజయవాడతూర్పు): మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం మాతృ, శిశు మరణాలపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ కె.వి.ఎన్. అనీల్కుమార్, ఎన్హెచ్ఎం రివ్యూ అధికారి డాక్టర్ సతీష్కుమార్, స్టేట్ కన్సల్టెంట్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ రత్న ఫాక్సీ, జీజీహెచ్ స్పెషలిస్టు నిపుణులు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన ఆరు మాతృ మరణాలపై సమీక్షించారు. జగ్గయ్యపేటలో రెండు, వెలగలేరు, చంద్రాల, గోళ్లమూడి, గంపలగూడెంలలో ఒక్కో మాతృమరణం జరిగిందని డీఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, హై–రిస్క్ కేసులను ముందుగానే గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతీదేవి పాల్గొన్నారు. -
జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తేవాలని ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట పత్రికా విలేకరి జగన్మోహన్రెడ్డిని కిరాతకంగా హత్య చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. చావా రవి మాట్లాడుతూ.. గంధం మాఫియాపై వరుస కథనాలు రాయడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు జగన్మోహన్రెడ్డిని హత్య చేశారన్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు జర్నలిస్టుల రక్షణ చట్టం తక్షణమే తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్కే బాబు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, జర్నలిస్టు నాయకులు దారం వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, నారాయణ, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో గుప్పుమంటున్న గంజాయి
మైలవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన నాటి నుంచి గంజాయి పల్లెపల్లెకు పాకింది. మత్తుకు బానిసలైన యువత గంజాయి తాగడంతో పాటు రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్న ఘటనలు విస్మయానికి గురి చేస్తు న్నాయి. పట్టణ, నగర ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం గంజాయి చేరడం నిఘా వైఫల్యానికి అద్దం పడుతోంది. గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు పోలీసులకు పట్టుబడిన ఘటన మైలవరంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బదాస్ లోహోర, గుప్తా హారిజస్ జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడు శివారులో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల్లో కొద్ది కాలంగా పనిచేస్తున్నారు. వీరిద్దరితో పాటు ఏలూరు జిల్లా, నూజివీడుకు చెందిన చింతం విజయ్ బాబు, షేక్ మెహర్బాబా, మైలవరానికి చెందిన షేక్ ఆసిఫ్, వెల్వడం గ్రామానికి చెందిన తన్నీరు గోపీకృష్ణ ఒక ముఠాగా ఏర్ప డి మైలవరం, తిరువూరు, నూజి వీడు, ప్రాంతాల్లో గంజాయి విక్రయి స్తున్నారు. బదాస్ లోహోర, గుప్తా హారిజస్ ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి మైలవరం పాత ఎన్ఎస్పీ క్వార్టర్స్ వద్ద ముఠాలోని మిగతా నలుగురుకి అందజేస్తుండగా మంగళవారం ఉదయం పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ఉన్న మరొక వ్యక్తి పరారయ్యాడు. ఆరుగురు నిందితులు గతంలో గంజాయి కేసులలో పట్టుబడిన వారేనని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో ఏసీపీ వై.ప్రసాదరావు ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో సీఐ కె.కిషోర్ బాబు, ఎస్ఐలు కె.సుధాకర్, గిరిసాయి, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల పట్టుబడిన ఘటనలు ● ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కాచవరం గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గల ఓపెన్ ప్లాట్లలో ఖాళీ ప్రదేశంలో ఉన్న ముగ్గురు యువకుల నుంచి సుమారు ఆరు కిలోల గంజాయిని ఇబ్రహీంపట్నం పోలీసులు ఈ నెల నాలుగో తేదీన స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు యువకుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఏడాది మార్చిలో కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల రోడ్డులో గంజాయి పొట్లాలు విక్రయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో కంచికచర్ల మండలంలోని పరిటాలలో ఆరుగురు వ్యక్తుల నుంచి మూడు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్పై దండయాత్రలో భాగంగా ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం ముత్తవరపు కల్యాణ మండపంలో పోలీసులు 95 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 25 మంది గంజాయి తాగినట్లు తేలింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. విజయవాడలో పట్టుబడ్డ మరో ముఠా అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): మరో గంజాయి ముఠా విజయవాడ పోలీసులకు పట్టుబడింది. సింగ్నగర్ పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని అపార్ట్మెంట్ల ప్రాంతాలను స్థావరాలుగా మార్చుకొని గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల కథనం మేరకు.. న్యూరాజరాజేశ్వరీపేటలోని కేజీఎఫ్ అపార్ట్ మెంట్ల వద్ద గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా పెట్టి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా గుమ్మడి సంజయ్, నాగభూషణం, జాన్సీ, లక్ష్మీనారాయణ, అహ్మద్ నావేల్, అన్సార్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి దొరికింది. వీరందరిపై గతంలో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. వారం రోజుల వ్యవధిలోనే సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు గంజాయి ముఠాలు పట్టుబడటం గమనార్హం. ఈ మూడు ముఠాల నుంచి మొత్తం పదిన్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 15 మందిని పోలీసులు అరెస్ట్చేశారు. మైలవరంలో ఆరుగురు గంజాయి విక్రేతలు అరెస్ట్ నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి స్వాధీనం వరుసగా పట్టుబడుతున్న గంజాయి ముఠా సభ్యులు -
వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు డిస్ట్రిక్స్ స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ యూత్ వెల్ఫేర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిచే వేసవి శిక్షణ శిబిరాలను ఎన్టీఆర్ జిల్లాలోని బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ కె.కోటేశ్వరరావు సూచించారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణ లోని డీఎస్డీఓ కార్యాలయంలో ఆయన మంగ ళవారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరాగాంధీ స్టేడియంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మొత్తం 50 శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 27 క్రీడల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. ఎనిమిది నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు శిక్షణ శిబివరాలను సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. జిల్లా యూత్ వేల్ఫేర్ ఆఫీసర్ కె.రమేష్ పాల్గొన్నారు. అవసరాలకు అందుబాటులో ఇంధనం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉందని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాకు నిత్యం ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్, ఆరు లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా అవుతోందన్నారు. పెట్రోల్ డీజిల్ సరఫరాపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో మంగళవారం ఉదయం కలెక్టర్ లక్ష్మీశ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లా డుతూ.. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇంధన సరఫరాపై ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454లో సంప్రదించాలని కోరారు. ఆయిల్ బంకుల పర్యవేక్షణలో కలెక్టర్ వెంట విజయవాడ రూరల్ తహసీల్దార్ బి.సుగుణ, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన గుడ్లవల్లేరు: మండల కేంద్రమైన గుడ్లవల్లేరులో మే ఒకటో తేదీన ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పర్యటిస్తారని, పకడ్బందీ ఏర్పాట్ల చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. ఆయన మంగళవారం గుడ్లవల్లేరులో పర్యటించారు. ఫార్మా కంపెనీ అధినేత జాస్తి వెంకట్ రూ.15 కోట్లతో నిర్మించిన ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బాలాజీతో పాటు ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హెలీప్యాడ్ నిర్మాణం పనులను పరిశీలించారు. అనంతరం ఎల్వీ ప్రసాద్ వైద్య విజ్ఞాన సంస్థ భవనాన్ని సందర్శించారు. గుడివాడ ఇన్చార్జి ఆర్డీఓ పోతురాజు, విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, మచిలీపట్నం ఆర్డీఓ సాంబశివరావు, అగ్నిమాపక అధికారి ఏసురత్నం, బీసీ సంక్షేమ సాధికారత అధికారి రమేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలు.. ప్రతిభకు వేదికలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): వేసవి వచ్చేసింది. పరీక్షలు అన్నీ ముగి యడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కొంత మంది చిన్నారులు వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్య, బంధువుల ఇళ్లకు వెళ్లి సెలవులను సరదాగా గడిపి, ఆత్మీయత, అనురాగాలు నింపుకొని వస్తుంటారు. ఇంకొందరు విజ్ఞాన, విహార యాత్రలకు వెళ్తారు. మరి కొందరు విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాల్లో చేరి తమ నైపుణ్యాలను మరింత పెంచుకుంటారు. విద్య, క్రీడలు, యోగ, చిత్రలేఖనం వంటి శిబిరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పలు సంస్థలు ఉచితంగా, మరి కొన్ని నామమాత్రపు ఫీజుతో వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏ శిబిరం ఎక్కడ జరుగుతోందో తెలుసుకుందాం పదండి.. శిక్షణ శిబిరాల వివరాలు ఇవీ.. ● విజయవాడ అజిత్సింగ్నగర్లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్ ఆవరణలో కరాటే, చదరంగం, కర్రసాము, సంగీతం, స్పోకెన్ ఇంగ్లిష్, తెలుగు వెలుగు, కూచి పూడి నృత్యం, భగవద్గీత శ్లోకాలు, హిందీ పరిచయం, డ్రాయింగ్, కంప్యూటర్ కోర్సుల్లో వేసవి శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నారు. వివరాలకు 85002 89429 సెల్ నంబరులో సంప్రదించొచ్చు. ● మొగల్రాజపురంలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల ఆవరణలో బ్యాడ్మింటన్, యోగా, జిమ్, ఏరోబిక్స్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. వివరాలకు 63041 90057, 99599 59530 సెల్ నంబర్లను సంప్రదించాలి. ● విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు వివిధ క్రీడాంశాల్లో వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. గాంధీనగర్, గురునానక్ కాలనీ, చిట్టినగర్లో కె.ఎల్.రావు స్మిమ్మింగ్ పూల్స్లో స్మిమ్మింగ్లో శిక్షణ ఇస్తారు. బందరురోడ్డులో దండమూడి రాజగోపాలరావు, పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియాల్లో బ్యాడ్మింటన్, సత్యనారాయణపురంలోని జి.వి.ఎస్.శాస్త్రి ఉద్యానవనం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం, భవానీ పురంలోని రోజ్ గార్డెన్ పార్కు ఆవరణలో స్కేటింగ్, పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో యోగాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆయా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలి. ● బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని ఈ–బ్లాక్లో ఉన్న అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉదయం 5.30 నుంచి ఏడు గంటల వరకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 77318 77444 సెల్ నంబరులో సంప్రదించాలి. ● బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (ఎంబీవీకే)లో స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ తరగతులు నిర్వ హిస్తున్నారు. వివరాలకు 94900 98042 సెల్ నంబరులో స్పందించాలి. ● పటమటలోని సర్వోత్తమ గ్రంథాలయ ఆధ్వర్యంలో చిన్నారులకు విజ్ఞానదాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలనే ఉద్దే శంతో లిటిల్ రీడింగ్ చాంప్–2026 పేరుతో పలు కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తు న్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు గ్రంథాలయానికి వచ్చి 100 గంటలకు పైగా పుస్తకం పఠనం చేసిన వారికి బహుమతులను అందజేస్తారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు టాయ్ లైబ్రరీ పేరుతో విద్యార్థుల్లో ఉచ్చారణ మెరుగు పరచడానికి పుస్తకాల్లోని అంశాలను అందరికి వినబడేలా చదవడం, భావ నైపుణ్యాలు పెంపొందించడానికి కథలు చెప్పడం, కథలు రాయడం, వంటి అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. ● మొగల్రాజపురంలోని రావిచెట్టు సెంటర్లో ఉన్న జనశిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో విద్యుత్ వాహన సర్వీసింగ్, రిపేరింగ్, అసెంబ్లింగ్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాలకు 0866 – 2470420 ఫోన్ నంబరులో సంప్రదించాలి. ● మే మూడు నుంచి జూన్ రెండో తేదీ వరకు కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ కోచింగ్ శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎనిమిది నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు బాలబాలికలు మాత్రమే అర్హులు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సీ–బ్లాక్లో ఉన్న కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి. విజయవాడ లోని సిద్ధార్థ మెడికల్ కళాశాల మైదానంలో శిక్షణ పొందాలనుకునేవారు 91779 91616, అజిత్సింగ్నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో శిక్షణ పొందాలనుకునేవారు 93934 44279, జగ్గయ్యపేటలో శిక్షణ పొందాలనుకునే వారు 93469 68443, నూజివీడులో శిక్షణ పొందాలనుకునేవారు 73863 47777 నంబర్లలో సంప్రదించాలి. ● కృష్ణాజిల్లా క్రీడాభివృద్థి సంస్థ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు ఎనిమిది నుంచి 16 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంతో పాటుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ క్రీడాంశాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంప్లను నిర్వహించనున్నారు. -
శ్రీమన్నారాయణుడి సేవలో వైఎస్సార్ సీపీ నేతలు
కోడూరు: మండలంలోని ఉల్లిపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీగోద, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామిని వైఎస్సార్ సీపీ నేతలు మంగళవారం దర్శించుకున్నారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్బాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పండితులు వారికి పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిజీ వారికి ఆలయ విశిష్టను వివరించారు. అనంతరం 13 యాగశాలల్లో జరుగుతున్న హోమ క్రతువును నేతలు తిలకించారు. వేదికపై అష్టాక్షరీ స్వామిజీ అధ్యక్షతన జరిగిన సభలో ప్రసంగించారు. త్వరలో ఈ క్షేత్రాన్ని తమ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శిస్తారని చెప్పారు. అనంతరం అష్టాక్షరీ స్వామిజీని వెలంపల్లి, మల్లాది, సింహాద్రి సత్కరించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాబుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026u8లో ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. 7పెండింగ్ వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రభుత్వాస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు రెండో రోజు కూడా విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. జగ్గయ్యపేట: వేదాద్రిలోని యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి తిరుక్కల్యాణ మహోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామి వారి శేషవాహన సేవను నిర్వహించారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
ఉయ్యూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బస్సు క్లీనరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 14 మంది గాయపడ్డారు. రమణ ట్రావెల్స్కు చెందిన బస్సు యానాం నుంచి 33 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరింది. ఉయ్యూరులోని జియో పెట్రోలు బంకు సమీపంలో చేపల లోడుతో ఆగి ఉన్న లారీని అర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సు వెనుకగా వచ్చి ఢీకొంది. బస్సు ముందు భాగం నుజ్జునజ్జయింది. బస్సు క్లీనరు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం సంత చెరువు మార్కెట్ చెందిన ఎరబాల సూర్యచంద్రశేఖర్ (20) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. డ్రైవరుతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. తొమ్మిది మంది ప్రయాణి కులు విజయవాడలో, ఐదుగురు ప్రయాణికులు ఉయ్యూరులోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. క్లీనరు సూర్యచంద్రశేఖర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భీతిల్లిన ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యానాం నుంచి బయ లుదేరిన సమయం నుంచి డ్రైవరు అతి వేగంగానే బస్సును నడుపుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. కొత్త హైవే మీదుగా మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటాక జియో పెట్రోలు బంకు వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టడంతో వచ్చిన శబ్దానికి ప్రయాణికులు భీతిల్లారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. ఏం జరిగిందో అర్థం కాక ప్రాణభయంతో అరుపులు, కేకలు పెట్టారు. ఈ ప్రమాదాన్ని పెట్రోలు బంకులో పనిచేస్తున్న సిబ్బంది ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు గుర్తించి క్షతగాత్రులను బయటకు లాగటంలో సహాయపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.క్లీనరు మృతి, 14 మందికి గాయాలు


