breaking news
NTR
-
‘చంద్రబాబుది దుర్మార్గమైన పాలన’
విజయవాడ: గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో హత్యలు, అఘాయిత్యాల, అమానుషాలు, దాడులు, వివక్ష, వెలివేతలు కోకొల్లలుగా సాగుతున్నాయని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోందని మండిపడ్డారు. కూటమి పాలనలో శాంతి భద్రతలపై ఈరోజు(మంగళవారం, జూన్ 30వ తేదీ) విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మేరుగ మాట్లాడారు. ఏ ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాలి. సామాజిక అసమానతలు రెచ్చగొట్టేలా ఏపీలో పాలన సాగుతోంది. పరిపాలనలో తన., మన బేధాలు పాటిస్తున్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు పాలన దుర్మార్గమైన పాలన. ముద్దాయిలుగా ఉన్న నేతలతో కలిసి పాలన చేస్తున్నారు. దళిత ప్రిన్సిపాల్ ను వేధించిన కూన రవికుమార్ పై ఇప్పటి వరకూ నో కేస్. విజయనగరం జిల్లాలో ఎస్సీలు, బీసీల పై దాడులు చేస్తే నో కేస్. విశాఖ జిల్లాలో మహిళను వివస్త్రగా మార్చితే ఎమ్మెల్యే పై నో కేస్. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించే పిఠాపురంలో దళితులను వెలివేస్తే నో కేస్. కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ దళిత ప్రిన్సిపల్ ను చెంపదెబ్బ కొడితే నో కేస్. రాజమండ్రిలో సాగర్ అనే దళిత యువకుడిని బట్టలిప్పి నిలబెడితే నో కేస్. సాయికృష్ణ , క్రాంతికుమార్ కుటుంబాలకు న్యాయం చేయాలి. దళిత మహిళ హోంమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తోంది’ అని పేర్కొన్నారు. -
‘ఇది ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది’
విజయవాడ: ఏపీ రాష్ట్ర ప్రజలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపోను సందర్శించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బండి పుణ్యశీల, కాలే పుల్లారావు తదితరులు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యాధరపురం డిపో కూల్చివేత కేవలం ఒక డిపో కూల్చివేత కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటుపరం చేసే కుట్రకు నాంది అని వారు పేర్కొన్నారు. ఈ-బస్సుల పేరుతో విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని ఆక్షేపించారు.ఈ–బస్సుల విధానం ముసుగులో ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు విజయవాడ నగరంలోని విద్యాధరపురం ఆర్టీసీ డిపోను పూర్తిగా కూల్చివేసి...శిథిలాలను కూడా తొలగించారు. ఈ స్థలాన్ని వైఎస్సార్సీపీ నాయకులు సందర్శించి ప్రభుత్వ తీరును ఖండించారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు ఇదే నిదర్శనం: వెలంపల్లి30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఆర్టీసీ భవిష్యత్తుపై ఉద్యోగులను, ప్రజలను సంప్రదించకుండా విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణం. విద్యాధరపురం డిపో కూల్చివేత కూటమి ప్రభుత్వ విధ్వంసకర పాలనకు నిదర్శనం. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ భూములను బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాన్నివైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆర్టీసీ ఆస్తులు, భూములు, డిపోలు పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే కొనసాగాలి, ఉద్యోగాలు కూడా ఆర్టీసీ పరిధిలోనే ఉండాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనావైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది" అని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.ఖరీదైన ఆర్టీసీ స్థలాలపై కూటమి నేతల కన్ను: దేవినేని అవినాష్,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖరీదైన ప్రభుత్వ, ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గతంలో లూలు మాల్ కోసం విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఖరీదైన ఆర్టీసీ స్థలాన్ని కేటాయించే ప్రయత్నాన్నివైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఇప్పుడు విద్యాధరపురం డిపో స్థలాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోంది. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా బినామీల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది. విద్యాధరపురంతో ఆగకుండా రాష్ట్రంలోని మరో 11 డిపోల భూములను కూడా ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోంది.ప్రజలు ఈ దోపిడీని గమనిస్తున్నారు. తగిన సమయంలో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం కార్మికులతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపట్టి పోరాడతాం" అనివైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు.ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: మల్లాది విష్ణుఇసుక, మట్టి, కొండల తర్వాత ఇప్పుడు విలువైన ఆర్టీసీ భూములపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. రాష్ట్రంలోని 12 ఆర్టీసీ డిపోలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియలో భాగంగానే విద్యాధరపురం డిపోను లక్ష్యంగా ఎంచుకున్నారు. వైయస్ జగన్ హయాంలో ఆర్టీసీ బలోపేతానికి రూ.5 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ హోదా కల్పించారు. కానీ నేడు ఆర్టీసీని బలోపేతం చేయాల్సింది పోయి రూ.6 వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను బినామీలకు ధారాదత్తం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజారవాణా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ చర్యలనువైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విద్యాధరపురం డిపో స్థలంతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత. కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం" అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. -
విజయవాడ: రైతులపై పోలీసుల దాష్టీకం
సాక్షి, విజయవాడ: ధర్నాచౌక్లో తీవ్ర ఉధ్రిక్తత చోటుచేసుకుంది. రైతులపై పోలీసుల దాష్టీకానికి పాల్పడ్డారు. ధర్నా చౌక్లో రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. సీఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటి సీఎం ఇంటికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో సీఎం ఇంటికి వెళ్లి తీరుతామని రైతులు అంటున్నారు.అన్నదాతల కష్టాలపై ఏపీ రైతు సంఘం నిరసనలు చేపట్టింది. పొగాకు, మామిడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీ ఎప్సెట్ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్సెట్ (AP EAPCET) 2026 ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఈ మధ్యాహ్నాం ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కారణాలు చెప్పకుండా అది వాయిదా వేశారు. దీంతో విద్యార్థుల్లో నిరాశ నెలకొంది.ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కీలక పరీక్షలు ఈ ఏడాది మే 12 నుంచి మే 20 వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.29 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ర్యాంకుల కోసం నెలలుగా ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలు ఎప్పుడు వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే వివిధ సాంకేతిక, నిర్వహణ కారణాలను చూపుతూ అధికారులు పలుమార్లు వాయిదా వేశారు. తాజాగా ఇవాళ విడుదలవుతాయని ప్రచారం జరిగినా.. ఫలితాలు వెలువడకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాల విడుదల ఆలస్యం కావడంతో కౌన్సెలింగ్ షెడ్యూల్పైనా ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. జులై 2న విడుదల చేయొచ్చని అధికారులు చెబుతున్నా.. విడుదలయ్యే దాకా గ్యారెంటీ కనిపించడం లేదు. -
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్స్టేషన్లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది.సాయికృష్ణ లాకప్డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్జోన్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు. నాలుగు హార్డ్ డిస్క్లను ఫార్మెట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది. కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా, కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్టేషన్కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేశ్ గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
నా వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: తాను మహిళలపై ఎలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయలేదని.. తనను రెచ్చగొట్టిన వ్యక్తిపై మాత్రమే విమర్శలు చేశానని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉద్ఘాటించారు. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్కు వివరణ ఇచ్చేందుకు మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో మహిళా కమిషన్కు పూర్తిగా వివరిస్తానని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. యావత్ మహిళా లోకాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన వ్యక్తినే విమర్శించానని చెప్పారు."ప్రతి మనిషికి ఒక సహనం ఉంటుంది. ఆ సహనం కోల్పోయేలా ఎదుటి వ్యక్తులు మాట్లాడకూడదు. నా వ్యాఖ్యలను మహిళలకు ఆపాదిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వారే నవ్వులపాలయ్యారు" అని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మహిళల భద్రతపై కూడా అమర్నాథ్ ప్రశ్నలు సంధించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, అలాంటి ఘటనలపై మహిళా కమిషన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. సాయి కృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా? అని ప్రశ్నించిన ఆయన.. నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపై కూడా మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు.తనపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి మహిళా కమిషన్కు పూర్తి వివరణ ఇస్తానని, తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ వివాదంగా మార్చారని అమర్నాథ్ అన్నారు. మహిళా కమిషన్ ఎదుట ఆయన ఇవ్వబోయే వివరణ, అనంతరం కమిషన్ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. -
ముగిసిన సురభి నాటకోత్సవాలు
భూ కైలాస్ నాటకంలోని రసవత్తర ఘట్టాలువిజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి ఆధ్వర్యంలో వినాయక నాట్యమండలి ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాలు సోమ వారం ముగి శాయి. చివరి రోజు ప్రదర్శించిన భూ కౌలాస్ నాటకం ఆద్యంతం అలరించింది. తల్లి కై కసి కోరిక మేరకు శివుడి ఆత్మలింగం కోసం రావణుడు తపస్సు చేయడం, ఆయనలో మాయ ప్రవేశించి మాత పార్వతిని ఇల్లాలిగా కోరుకోవడం, ఆ తర్వాత తప్పు తెలుసుకుని శివుడికి శిరస్సు అర్పించడం, భోళా శంకరుడు ఆత్మలింగం సమర్పించడం, నారదుడి మాయచేత శివలింగం భూమి మీదనే ప్రతిష్ఠం కావడం తదితర అంశాలతో ఈ నాటకం సాగింది. రావణ బ్రహ్మగా దినకర, శివుడిగా శివయ్య, నారదుడిగా పరిమళ, విరూపాక్షుడిగా శుభకర, మండోదరిగా మానస వీణ అద్భుతంగా నటించారు. నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణకు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా నిర్వాహకులు సత్కరించారు. మంగళవారం ప్రేక్షకుల కోరిక మేరకు మంగళవారం ప్రత్యేక ప్రదర్శనగా మాజా బజార్ నాటక ప్రదర్శ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
కాలం చెల్లిన ఆహారం అమ్మితే సీజ్
ఏదైనా షాపులో కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, వారివద్ద స్టాక్ ఉన్న షాపులు సీజ్ చేస్తాం. ఆహార పదార్థాల తయారీ, అమ్మకం, హోల్సేల్, రిటైల్ వ్యాపారులు విధిగా ఫుడ్ లైసెన్స్ పొందాలి. ఆ తర్వాత మాత్రమే వ్యాపారం ప్రారంభించాలి. అపరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండటం, హానికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలపై కేసులు నమోదు చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో జరిమానాలు విధించాం. – బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ -
విద్యుత్ సంస్థ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పీస్ రేట్ కార్మికులు, జేఎల్ఎంలు, స్టోర్ హమాలీలు, బిల్ కలెక్టర్స్, మీటర్ రీడర్లు, కంప్యూటర్ ఆపరేటర్లగా పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తమ సమస్యలపై ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోను కలిసి కమిటీ వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా యూఈఈయూ రీజనల్ అధ్యక్ష కార్యద ర్శులు ఎల్.రాజు, జి.కనకలింగేశ్వరరావు మాట్లా డుతూ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, వేతనాల్లో వ్యత్యాసాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. వేజ్ రివిజన్ కమిటీ వెంటనే వేయాలని, పెండింగ్ డీఏలను రిలీజ్ చేయాలని, ఏరియర్స్ ఒకే విడతలో చెల్లించాలని కోరారు. జేఎల్ఎం గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్ల నుంచి జేఎల్ఎంలుగా కన్వర్షన్ అయినా ఉద్యోగులకు మూడు డిస్కమ్లలో ఒకే పద్ధతిని పాటించి వెంటనే అసిస్టెంట్ లైన్మెన్లుగా ఉద్యోగోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు పెయిడ్ హాలిడేస్ చెల్లించాలని, పదేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి సర్వీస్ ఇన్సెంటివ్ ఇవ్వాలని, హైయిర్ పెన్షన్ సమస్యను పరిష్కరించాలని, పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఖాళీగా ఉన్న కింది స్థాయి పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులతోనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూని యన్ నాయకులు పి.అనిల్ కుమార్, ఆర్.హేమంత్ కుమార్, వి.మణికంఠ కుమార్, ఎ.వెంకటేశ్వర రావు, వై.సుబ్బారావు తదితరులు ఉన్నారు. -
దేశానికి వెన్నెముక రైతన్న
ఏరువాక పౌర్ణమి వేడుకలో కలెక్టర్ లక్ష్మీశ కన్నెవీడు(వత్సవాయి): దేశానికి వెన్నుముక రైతన్న అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. సోమవారం గ్రామంలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా గ్రామ శివారు నుంచి ఎడ్లబండిపై ఊరేగింపుగా గ్రామంలోని తోడ్కోని వెళ్లారు. ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధశాఖల వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి అరక దున్నారు. యంత్ర సాయాన్ని వినియోగించుకోవాలి.. కలెక్టర్ మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి తెలుగు సంప్రదాయాలలో అత్యంత విశిష్టమైనదని తెలిపారు. సాగులో వస్తున్న అత్యాధునిక యంత్రాలను ఉపయోగించి వ్యవసాయాన్ని సాగించి నట్లయితే శ్రమ తగ్గడంతోపాటు పెట్టుబడులు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. భూమాత ఆశీస్సులతో ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడి సమృద్ధిగా పంటలు పండాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్, తహసీల్దార్ జి. వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఎన్. రాంబాబు, ఏవో జి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏజెన్సీల మాయాజాలం
బందరులో గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వినియోగదారులకు చేస్తున్న మోసాలపై విచారించి తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నేను సెలవులో ఉన్నాను. విధుల్లో చేరాక ఏజెన్సీల నిర్వహణ తీరుపై విచారించి చర్యలు తీసుకుంటాం. ఇకపై ఎలాంటి పొరపాట్లు జరక్కుండా చూస్తాం. – ఆంజనేయులు, డెప్యూటీ తహసీల్దార్, బందరు మచిలీపట్నంటౌన్: గ్యాస్ ఏజెన్సీల మాయాజాలానికి వినియోగదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల ఇరాన్ యుద్ధం నెపంతో కృత్రిమ గ్యాస్ కొరతను సృష్టించి.. ఇబ్బందులకు గురి చేసిన ఏజెన్సీల నిర్వాహకులు.. ఇంకా అదే పంథాని అవలంభిస్తున్నారు. దీంతో నగరం, పట్టణం, పల్లె అనే తేడాలేకుండా అన్ని ప్రాంతాల్లోనూ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లాలో పలు కంపెనీలకు చెందిన 42 ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 3లక్షలకు పైగా డొమెస్టిక్ వినియోగదారులకు సిలిండర్ల సరఫరా జరుగుతోంది. ‘బ్లాక్’ దందా.. గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అర్జెంటుగా కావాలని వచ్చేవారి నుంచి రూ.1600 నుంచి రూ. 1700కు అంటే దాదాపు రూ. 800 అధిక ధరకు విక్రయిస్తున్నారని వివరిస్తున్నారు. ముఖ్యంగా బందరులోని ఓ హెచ్పీ ఏజెన్సీ వద్ద బ్లాక్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురు వినియోగదారుల ఫోన్ నంబర్లను మార్చేసి వారికి ఆన్లైన్లో బుకింగ్ కాకుండా కంప్యూటర్లో మార్పు చేసి, ఏజెన్సీకి చెందని కొందరి నంబర్లను ఆన్లైన్లో జోడించి బుక్ చేసి ఆ గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో విక్రయించుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్లో నుంచి గ్యాస్ కోసం ఆన్లైన్లో బుకింగ్ చేద్దామని చూస్తే ఈ నంబర్ సరికాదని చెబుతోందని, తీరా ఏజెన్సీ వద్దకు వచ్చి ఆరాతీస్తే మీరు లింకు చేసిన ఫోన్ నంబర్ తప్పుగా చెప్పి ఉంటారని ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిసింది. బందరుకు చెందిన వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసినా రోజుల తరబడి గ్యాస్ సిలిండర్ సరఫరా చేయని పరిస్థితి ఇక్కడ నెలకొంటోందని చెబుతున్నారు. గ్యాస్ బుక్ చేసినా ఏజెన్సీల నిర్వాహకులు సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో బుకింగ్ క్లోజ్ అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా రెండు, మూడు సార్లు బుక్ చేసినా గ్యాస్ ఇంటికి అందని పరిస్థితులు నెలకొంటున్నాయని వాపోతున్నారు. గ్యాస్ రాలేదని వినియోగదారులు ఏజెన్సీలకు వెళితే ఇరాన్ యుద్ధం తర్వాత గ్యాస్ బుకింగ్ను త్వరితగతిన రద్దు చేస్తున్నారని, అందువల్లే గ్యాస్ మీకు ఇవ్వలేకపోయామని వంకలు చెబుతున్నారని వివరిస్తున్నారు. ఇంటికి గ్యాస్ను సరఫరా చేసే కార్మికులు సైతం వినియోగదారుల నుంచి రూ. 30 నుంచి రూ. 40 వీలును బట్టి అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అధిక ధరలు.. డెలివరీలు సక్రమంగా కాక వినియోగదారులే గోడౌన్కు వెళ్లి తెచ్చుకుంటున్నా.. అదనపు వసూళ్లు ఆగడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి వినియోగదారుడే వెళ్లున్నాడు కాబట్టి డెలివరీ చార్జీలు తగ్గించాల్సి ఉంటుంది. కానీ అలా జరగడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైతు సంక్షేమమే లక్ష్యంగా కేడీసీసీబీ సేవలు
చిలకలపూడి(మచిలీపట్నం): రైతు సంక్షేమం, సహకార రంగ అభివృద్ధి, పారదర్శక పాలన, సభ్యులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించటం కేడీసీసీ బ్యాంక్ ధ్యేయమని చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో 2026–27 వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 2015కు ముందు రుణాలు పొంది వివిధ కారణాలతో చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వన్టైమ్ సెటిల్మెంట్ అమలు చేస్తున్నామన్నారు. రూ. 3 లక్షల వరకు పంట రుణాలు తీసుకుని మరణించిన అప్పుదారుని కుటుంబాలకు వడ్డీ పూర్తిగా మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. పీఏసీ ఎస్లో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగుల జీతాల చెల్లింపుల కోసం జిల్లా స్థాయి సహకార నిధికి రూ. 4.43కోట్ల మంజూరుకు సర్వసభ్య సమావేశంలో ఆమోదించామన్నారు. కేడీసీసీబీ ప్రొఫెషనల్ డైరెక్టర్ మురళీధర్, ఆప్కాబ్ జనరల్ మేనేజర్లు జమున, చంద్రశేఖరరెడ్డి, కేడీసీసీబీ జనరల్ మేనేజర్ బీఎల్ చంద్రశేఖర్, రంగబాబు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లామంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 20267గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మ ఆలయ ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా చండీహోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. లబ్బీపేట: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లోని టెక్నికల్ వింగ్ డీసీపీగా ఏవీఆర్బీపీ ప్రసాద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. సీపీ రాజ శేఖరబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి పోరంకికి చెందిన డి. అనిల్, సరిత దంపతులు రూ. లక్ష విరాళాన్ని సోమవారం అందజేశారు. -
కేసులకు భయపడం.. పోరాటం ఆపం
లబ్బీపేట(విజయవాడతూర్పు): అక్రమ కేసులకు భయపడి అమరావతి రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంతమంది పోలీసులను, గూండాలను, మాఫియా ముఠాలను దించి తమపై దాడులకు ఉసిగొల్పినా.. రైతుల కోసం మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటామని చెప్పారు. అమరావతికి భూములివ్వని రైతులను ప్రభుత్వమే వేధిస్తూ బలవంతపు భూసేకరణకు పాల్పడుతోందన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులు నిజం కాబట్టి, అవి బయటి ప్రపంచానికి తెలియకుండా చేయాలన్న కుట్రతోనే రైతు పరిరక్షణ కమిటీగా వెళ్తున్న తమపై టీడీపీ గూండాలు ఉండవల్లిలో దాడులు చేశారని ధ్వజమెత్తారు. పైగా తామే రౌడీలతో దాడులకు వెళ్తున్నట్టు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. తాము పిలిస్తేనే వైఎస్సార్ సీపీ నేతలు వచ్చారని పెనుమాక రైతులు ప్రెస్మీట్ పెట్టి చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దోపిడీ వెలుగులోకి వస్తుందని భయం.. ఆంధ్రప్రదేశ్లో బిహార్ని మించిన జంగిల్ రాజ్ పాలన సాగుతోందని అవినాష్ విమర్శించారు. ప్రభుత్వ దోపిడీ, అరాచకాలను తట్టుకోలేక రైతులు వైఎస్ జగన్ను కలిస్తే కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ రైతు పరిరక్షణ కమిటీ రైతులను కలవడానికి వెళ్తుంటే అడ్డుకోవడమే అప్రజాస్వామికం అయితే, తమ మీదనే దాడులు చేసి.. తిరిగి తమ మీదనే కేసులు పెట్టడం జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమన్నారు. టీడీపీ గూండాలతోపాటు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ముఠాలతో కూడిన వందల మంది రౌడీలు తమపై దాడికి తెగబడ్డారని వివరించారు. పోలీసులు చట్టాలను ఉల్లంఘించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారని విమర్శించారు. అమరావతికి వ్యతిరేకం కాదు.. వైఎస్సార్ సీపీ అమరావతికి వ్యతిరేకం అని ఎప్పుడూ చెప్పలేదని అవినాష్ స్పష్టం చేశారు. రాజధాని పేరుతో జరుగుతున్న వేల కోట్ల అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్నారు. అమరావతికి భూములిచ్చిన ఒక్క రైతుకై నా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చి ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. వారికి మేలు జరిగితే న్యాయం కోసం తమ వద్దకు ఎందుకొస్తారని ప్రశ్నించారు. అటకెక్కిన విజయవాడ అభివృద్ధి.. ఈ కూటమి ప్రభుత్వం విజయవాడను ఎప్పుడో గాలికొదిలేసిందని అవినాష్ విమర్శించారు. అమరావతి కోసం విజయవాడ నగర అభివృద్ధిని గొంతు పిసికి చంపేస్తున్నారన్నారు. అమరావతి బాధిత రైతులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ చెప్పిన మాటను నిలబెట్టుకునే తీరుతామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అమరావతి అవినీతి, దోపిడీని కోర్టుల్లోనే రుజువు చేస్తామని దేవినేని అవినాష్ చెప్పారు. -
పకడ్బందీగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీచిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లాలో ‘సర్’ ప్రక్రియలో క్లయిమ్లు, అభ్యంతరాలతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి ఆర్డీవోలు, ప్లానింగ్ సెక్రటరీలు, ఎన్నికల విభాగం అధికారులతో సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ సులభంగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ పట్టణాలు వాటి స్వరూపం కలిగిన ప్రాంతాల్లో కష్టతరంగా ఉంటుందన్నారు. జూలై 14వ తేదీలోపు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సంబంధించి తొలిదశ పనులు పూర్తి చేయాలన్నారు. డిజిటలైజేషన్ వేగవంతం.. సర్ ప్రక్రియలో నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అధికారులు వేగంగా పనిచేయాలన్నారు. పంపిణీ ప్రక్రియను వెంటనే ముగించి అందుబాటులో లేని వారి ఇళ్లకు వెళ్లి ధ్రువీకరణ చేపట్టాలన్నారు. అందుబాటులోకి రాని దరఖాస్తులను నిబంధనల ప్రకారం అన్ కలెక్టబుల్గా నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 79 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): G±-t-BÆŠ‡ hÌêÏ ´ùÎ‹Ü MýSÑ$çÙ¯]l-Æó‡-sŒæÌZ ÝùÐ]l$ÐéÆý‡… °Æý‡Ó-íßæ…_¯]l {ç³gê çÜÐ]l$-çÜÅÌS ç³Ç-ÚëPÆý‡ Ðól¨MýS (ï³i-BÆŠ‡-G‹Ü)ÌZ {ç³fÌS ¯]l$…_ ÑÑ«§ýl çÜÐ]l$çÜÅ-ÌSOò³ 79 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$. ´ùÎ‹Ü MýSÑ$-çÙ-¯]lÆŠ‡ G‹Ü.Ñ.Æ>-f-ÔóæQ-Æý‡-»êº$ B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ yîlïÜï³ G.¼.-sìæ.-G-‹Ü.-E§ýl-Ķæ$-Æ>×ìæ {ç³fÌS ¯]l$…_ AÈjË$ ïÜÓMýS-Ç…-_, ÐéÇ çÜÐ]l$-çÜÅ-ÌS¯]l$ AyìlW ™ðlË$çÜ$-MýS$¯é²Æý‡$. A¯]l…-™èlÆý‡… Ðésìæ° çÜ…º…-«¨™èl G‹Ü-òßæ^ŒlKÌS™ø Ð]l*sêÏyìl ç³Ç-çÙP-Ç…-^éÌS° B§ól-Õ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ¿¶æ*, BíÜ¢ ÑÐé-§éË$, ¯]lVýS§ýl$ ÌêÐé§ólÒÌSOò³ 32, ¿êÆ>Å-¿ýæ-Æý‡¢Ë$, MýS$r$…º MýSÌSà-ÌSOò³ BÆý‡$, ️Ñ-Ñ«§ýl Ððl*ÝëÌSOò³ 糨, Ð]l$íßæâê çÜ…º…-«¨™èl ¯ólÆ>-ÌSOò³ BÆý‡$, MösêÏ-r-ÌSOò³ Ð]lÊyýl$, §ö…VýS™èl-¯é-ÌSOò³ Æð‡…yýl$, C™èlÆý‡ çÜÐ]l$çÜÅ-ÌSOò³ 20 íœÆ>ŧýl$Ë$ A…§éƇ$$. కారులో చెలరేగిన మంటలు జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని విజయవాడ రోడ్డులో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద సోమవారం రాత్రి ఓ కారులో మంటల చెల రేగాయి. పట్టణంలోని చెరుకూరివారి వీధికి చెందిన చౌడవరపు సుధీర్ తన కుటుంబ సభ్యులతో కారులో జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు వైపు వెళ్తున్నారు. పట్టణంలోని విజయవాడ రోడ్డులో ఛత్రపతి శివాజీ విగ్రహం సమీ పంలోకి రాగానే అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. కారు వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగా యని ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మహిళ ఆత్మహత్య కృష్ణలంక(విజయవాడతూర్పు): అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి గురై ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణలంక పోలీస స్టేషన్ పరిధిలో సోమ వారం జరగింది. పోలీసుల కథనం మేరకు.. దాకమర్రి లక్ష్మి (45), గొల్లా భార్యాభర్తలు. వారు కృష్ణలంక బియ్యంకొట్ల బజార్లోని ఒక అపార్ట్మెంట్కు వాచ్మన్గా పనిచేస్తూ అదే భవనంలో నాల్గో అంతస్తులోని రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్ని నెలలుగా లక్ష్మి రకరకాల రోగాలతో బాధప డుతూ ఆస్పత్రిలో చూపించుకుని మందులు వాడుతుంది. రోగాలు తగ్గకపోవడంతో ఆ బాధలు తట్టుకోలేక మూడు రోజుల నుంచి చనిపోతానని భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు కాపడుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఎవరి పనుల్లో వారు ఉండగా లక్ష్మి భవనంపై నుంచి రోడ్డు మీదకు దూకింది. కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ కిందకు వెళ్లి చూడగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల అరెస్టు పెనమలూరు: దొంగతనాలకు ప్పాడుతున్న ఇద్దరు నిందితులను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ ధర్మేంద్ర సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. పెనమలూరుకు చెందిన డి.సాయితేజ (బబ్లూ) (26), విజయవాడ చిట్టినగర్కు చెందిన బిరుదుకోట పవన్కుమార్ (20), మరో బాలుడు ముఠాగా ఏర్పడ్డారు. వీరు గతంలో పలు దొంగతనాలు, ఏటీఎంల వద్దకు వచ్చిన వారిని మోసగించడం, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన కానూరులో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. కామయ్యతోపు సెంటర్ వద్ద ఉన్న ఏటీఎం వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న బోలెం సుమంత్ను నమ్మించి తమకు ఆన్లైన్లో సొమ్ము బదిలీ చేస్తే చేతికి నగదు ఇస్తామని నమ్మించారు. సుమంత్ ఫోన్పే ద్వారా రూ.8 వేలు వారికి బదిలీ చేశాడు. అనంతరం డబ్బులు ఇస్తామంటూ సుమంత్ను హోటల్ రూమ్కు తీసుకు వెళ్లారు. అక్కడ వారు అతడిని చంపేస్తామంటూ బెదిరించి మరో రూ.14,400 ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సుమంత్ వద్ద ఉన్న బంగారు గొలుసు, రెండు వెండి ఉంగరాలను దౌర్జన్యంగా లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తుండగా ఆదివారం సాయంత్రం నిందితులు డి.సాయితేజ, పవన్కుమార్ కానూరు వద్ద పట్టుబడ్డారు. వారి వద్ద 16 గ్రాముల బంగారు గొలుసు, ఎనిమిది గ్రాముల వెండి ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరీని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడైన బాలుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐలు టి.వి.వెంకటేశ్వరరావు, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
చూస్తే లొట్టలు.. తింటే తిప్పలు
లబ్బీపేట(విజయవాడతూర్ఫు): వారాంతాల్లో కుటుంబ సమేతంగా బయటకు వెళ్లి రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాటిలో లంచ్, డిన్నర్ చేయడం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. అంతే కాదు సాయంత్రం అయితే చాలు బయట ఆహారం తినేందుకే ఇప్పటి జనరేషన్ ప్రాధాన్యం ఇస్తోంది. ఉన్నత వర్గాలకు చెందిన వారు సైతం రోడ్డు పక్కన ఫుడ్ తినడం ఫ్యాషన్గా భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలపై జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీలు ఎన్నో చేదువాస్తవాలు బయటపడ్డాయి. కొన్ని చోట్ల ఆకస్మికంగా, మరికొన్ని చోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 16 చోట్ల ఆహారం తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, అపరిశుభ్రమైన పరిసరాలు, హానికరమైన వాతావరణం ఉన్నా యని గుర్తించారు. ఆయా రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులపై ఈ నెల 27న జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5.65 లక్షల జరిమానాలు విధించారు. జరిమానాలు ఇలా.. అపరిశుభ్ర పరిసరాలు, హానికర వాతావరణంలో వ్యాపారం చేస్తున్నారంటూ విజయవాడ ప్రకాశం రోడ్డులోని రామయ్య మెస్కు రూ.లక్ష, కళానగర్ లోని యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్కు రూ.75 వేలు, బిస్మిల్లా బిర్యానీ (పీవీపీ రోడ్డు)కి రూ.10 వేలు, వత్సవాయిలోని శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి హోటల్కు రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు కలిగి ఉన్నందుకు విజయవాడ కబేళా దగ్గర జీఎం ఫుడ్ ప్రొడక్స్కు రూ.50 వేలు, గులాబీ తోట మోడరన్ ఫుడ్స్కు రూ.50 వేలు, బెంజిసర్కిల్ వద్ద నుంచి క్విక్ బాక్స్ రిటైల్ సర్వీస్ (స్విగ్గీ ఇన్స్టా మార్ట్)కు రూ.75 వేలు, లబ్బీపేటలోని ఫుడ్ రిపబ్లిక్కు రూ.75 వేలు, ఆటోనగర్ సుభానీ హోటల్కు రూ.25 వేల చొప్పున జరిమానాలు విధించారు. వీటితో పాటు మరి కొన్ని ఆహార కేంద్రాలకు ఫుడ్ లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నందుకు జరిమానాలు విధించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం రంగు రుచి కోసం కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీల్లో సింథటిక్ కలర్లను మితిమీరి వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని ఫుడ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. అలాంటి ఆహారం తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటి కల్తీ ఆహారం తినే వారిలో పేగు పూతలు, సరిగ్గా జీర్ణం కాకపో వడం, గ్యాస్టైటీస్, ఇన్ఫ్లమేటరీ పేగు వ్యాధి (ఐడీబీ), వాంతులు, విరేచనాలు వంటివి రావచ్చంటున్నారు. దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం వద్ద డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇన్లాండ్ వాటర్ వేస్ అఽథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో పాటు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు మేడపాటి నాగిరెడ్డి, లంకె అంకమోహనరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లమోతు ప్రకాష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నల్లమోతు దయాకర్ మాట్లాడుతూ.. పవిత్ర సంగమం వద్ద ఇసుక మాఫియా డ్రెడ్జింగ్ చేసి కృష్ణానదీ గర్భాన్ని కొల్లగొడుతోందన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగుతోందన్నారు. ఫంటు పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. ఇక్కడ నుంచి భారీ వాహనాల్లో ఇసుకను హైదరాబాద్కు తరలిస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మైనింగ్, ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం చేపడతామన్నారు. జేసీకి పిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు -
ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి
పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్–పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీపైనా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. 147 అర్జీలు.. కార్యక్రమంలో జేసీ ఇలక్కియ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కా ర వేదిక కార్యక్రమంలో మొత్తం 147 అర్జీలు అందా యని తెలిపారు. వీటిలో రెవెన్యూ 37, పోలీస్ 25, ఎంఏయూడీ 16, ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్ 12, పంచాయతీరాజ్ 11, ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 46 అర్జీలను స్వీకరించినట్లు జేసీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీ స్వీకరిస్తున్న జేసీ ఇలక్కియ -
లైంగిక దాడికి యత్నం కేసులో జైలు, జరిమానా
చిలకలపూడి(మచిలీపట్నం): ఓ వృద్ధ వితంతువుపై లైంగిక దాడికి యత్నించిన యువకుడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.రాజావెంకటాద్రి సోమవారం తీర్పు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని రాఘవపురానికి చెందిన 60 ఏళ్ల వితంతువు 2023 ఏప్రిల్ ఎనిమిదో తేదీన పొలాల్లో గేదెలను మేపుతోంది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని చూసిన అదే గ్రామానికి చెందిన కోట్ర గోపీ లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయటంతో భయపడిన గోపీ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీపీ అద్దెపల్లి నిరంజన్ ఆరుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షులను విచారించిన అనంతరం గోపీపై నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి పెనమలూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పోరంకి గ్రామానికి చెందిన వరహాలరావు(55) తాపీ కార్మికుడిగా జీవిస్తున్నాడు. ఈ నెల 21వ తేదీన రాత్రి బైక్ పై బందరు రోడ్డుపై వెళ్తుండగా పచ్చళ్ల కంపెనీ వద్ద ప్రమాదవశాత్తు వాహనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన పోరంకిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరహాలరావు పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పి.శాంతకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ రహదారిపై కారు బీభత్సం గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో అదుపుతప్పిన కారు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించింది. ఈ ఘటన రామవరప్పాడు రింగ్ రోడ్డులో సోమవారం జరిగింది. రామవరప్పాడు ప్రాంతానికి చెందిన అనిల్ తన కారులో వ్యక్తిగత పనుల నిమిత్తం కుమార్తెతో కలిసి బయలుదేరాడు. పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఏలూరు రోడ్డులో గుణదల వద్దకు వచ్చే సరికి ఆయన అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పిగా ఉందని కుమార్తెకు చెప్పాడు. రామవరప్పాడు రింగ్ రోడ్డుకు చేరుకునే సరికి నొప్పి తీవ్రమై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం ఓ ద్విచక్రవాహనాన్ని సైతం ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ప్రేమ్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడగా, వాహనం నుజ్జునుజ్జయింది. గుండె నొప్పితో బాధపడుతున్న అనిల్ను ఆయన కుమార్తె స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. నడిరోడ్డు పై కారు, ద్విచక్రవాహన పెద్ద శబ్దంతో ఢీకొనడంతో స్థానికులు భయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా ఆ రోడ్డులో ట్రాఫిక్ జామైంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. జేసీబీ సాయంతో కారును పక్కకు తొలగించారు. బాధితుడు ప్రేమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. వైద్య విద్యార్థి జ్ఞాపకార్థం గోల్డ్మెడల్ లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాళహస్తికి చెందిన లిఖిత్ సాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఏటా అనాటమీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థికి లిఖిత్ సాయి జ్ఞాపకార్థం గోల్డ్మెడల్ అందించేందుకు అతని తల్లిదండ్రులు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా లిఖిత్సాయి తల్లిదండ్రులు స్పాన్సర్షిప్ లేఖను ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కుమారు డిని కోల్పోయి తీవ్ర విషాదంలోనూ సమాజానికి ఉపయోగపడేలా గోల్డ్ మెడల్ ప్రదానం చేసేందుకు ముందుకొచ్చిన లిఖిత్ సాయి తల్లిదండ్రుల ఉదాత్త నిర్ణయాన్ని అభినందించారు. వ్యక్తిగత దుఃఖాన్ని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే శాశ్వత వారసత్వంగా మార్చిన ఈ సేవాభావం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ చిత్ర, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ శారదాంబ తదితరులు పాల్గొన్నారు. -
ఇంద్రగిరి.. భక్తసిరి
దుర్గమ్మ కొండపై పండుగ వాతావరణంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నిజ జ్యేష్ట పౌర్ణమి, మూలానక్షత్రం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించగా, మూలా నక్షత్రం నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోని యాగ శాలలో సరస్వతి హోమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. మరో వైపున ప్రాంగణంలోనే రైతులు ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. వైభవంగా గిరిప్రదక్షిణ.. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం వైభవంగా నిర్వహించారు. ఘాట్రోడ్డు లోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బొర్రా రాధా కృష్ణ, ఏసీ రంగారావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి కొలువై ఉండగా, దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగింది. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భక్త జనుల కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ఘాట్రోడ్డు నుంచి కుమ్మరిపాలెం, విద్యాధరపురం, నాలుగు స్తంంభాల సెంటర్, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీ రోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా ఆలయానికి చేరుకుంది. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు అమ్మవారికి పూజా సామగ్రిని సమర్పించి పూజలు జరిపించుకున్నారు. ఆలయ డీఈవో కిశోర్కుమార్ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానప్రదాయినీ నమోస్తుతే.. మూలా నక్షత్రం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి సన్నిధిలో సరస్వతి హోమాన్ని నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత యాగశాలలో ఆలయ అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన పలువు రు విద్యార్థులు హోమాన్ని దర్శించుకుని తమకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిచారు. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఏరువాక సంబరం.. దేవదాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి నాడు అనాదిగా భూమాతను, పశువులను, గంగమ్మను పూజించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించామని వారు తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను స్వర్ణకవచంతో అలంకరించారు. పెద్ద ఎత్తున భక్తులు, ప్రముఖులు, వీఐపీలు తరలివచ్చారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడితో పాటు పలువురు న్యాయమూర్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవలోనూ ప్రముఖులు విశేషంగా పాల్గొన్నారు. -
పాఠశాల పరిశీలన
పెనుగంచిప్రోలు: ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కేవీఆర్ జెడ్పీ హైస్కూల్ను సమగ్రశిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు సందర్శించారు. పీఎంశ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన పాఠశాలలో అమలవుతున్న పథకాలను, మనబడి–మన భవిష్యత్తుకు సంబంధించి మంజూరైన అదనపు తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల సిలబస్, పాఠ్య పుస్తకాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర స్థాయి అధికారులు బట్టు సురేష్, అశోక్, ఎంఈఓ డి. రవీంద్ర, హెచ్ఎం కె. జలజ తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం సోమవారం మొదలైంది. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులైన ఎన్సీసీ, క్యాప్ కేటగిరికి చెందిన 1 నుంచి 60వేల ర్యాంకు వరకు, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్ కేటగిరీకి చెందిన వారికి మొదటి నుంచి చివర ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను సోమవారం పరిశీలించారు. సోమవారం మొత్తం 321 మంది సర్టిఫికెట్లను పరిశీలించామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి చెప్పారు. నేటి షెడ్యూల్.. మంగళవారం ఉదయం 9గంటల నుంచి క్యాప్, ఎన్సీసీ అభ్యర్థులకు 60,001 నుంచి చివరి ర్యాంకు వరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గౌడ్స్ అభ్యర్థులకు మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని విజయసారథి చెప్పారు. గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే గ్రామసభలతో పారదర్శకమైన పాలన ప్రజలకు అందుతోందని పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ మల్లేశ్వరి తెలిపారు. మండలంలోని గుంటుపల్లి గ్రామంలో మాల్దీవుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆమె గ్రామ పంచాయతీలు, గ్రామ సభల నిర్వహణ, వాటి ప్రయోజనాలపై వారికి వివరించారు. స్థానిక జెడ్పీ పాఠశాల, గ్రామ పంచా యతీ కార్యాలయాల వద్ద నిర్వహించిన మహిళలు, బాలలు, గ్రామస్తులతో వేర్వేరుగా గ్రామసభలు నిర్వహించారు. గతంలో జరిగిన గ్రామసభలో నిర్ణయించిన పనుల వివరాలు మాల్దీవుల బృందానికి తెలిపారు. వాటిలో ఇప్పటి వరకు ఏ మేరకు పనులు పూర్తి చేశారనే అంశాలను వివరించారు. జిల్లా పంచాయతీ అధికారి సీతామహాలక్ష్మి, ఎన్ఐఆర్డీ సంస్థ ప్రతినిధి శిరీష, డీఎల్పీఓ రాఘవన్, ఎంపీడీఓ డి.శకుంతల తదితరులు పాల్గొన్నారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు పటిష్ట భద్రత కల్పించామని, అయిన్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన సోమవారం గొల్లపూడిలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఆవరణలోగల ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పని తీరుతోపాటు అగ్నిమాపక, విద్యుత్ పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి (వైఎస్సార్ సీపీ), యేదుపాటి రామయ్య (టీడీపీ), మురళీకృష్ణ(ఐఎన్సీ), జె. శ్రీనివాసరావు (జనసేన) తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం
● 22ఏ జాబితా అర్జీల పరిష్కారానికి కృషి ● ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో భూ వివాద రహిత గ్రామాలే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. 22(ఏ) జాబితాకు సంబంధించి వచ్చిన అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే 180 అర్జీలను పరిష్కరించామని తెలిపారు. కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి 22–ఏ నిషేధిత భూముల జాబితాలో పొరపాటున నమోదైన కొందరు పట్టాదారులకు సంబంధించిన ప్రైవేటు భూములను ఆ జాబితా నుంచి తొలగింపు ఉత్తర్వులను కలెక్టర్ లక్ష్మీశ సోమ వారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ క్లినిక్లు నిర్వహించినట్లు తెలిపారు. రెవెన్యూ క్లినిక్లో వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సరైన విధివిధానాలు పాటించకుండా 22ఏ జాబితాలో చేర్చిన భూములకు ఆ జాబితా నుంచి ఉపశమనం కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ సమీక్ష నిర్వహిస్తున్నారని, వచ్చిన దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారని వివరించారు. పరిష్కరించి రిజిస్ట్రేషన్కు వీలుకల్పించిన దరఖాస్తుల్లో ఐదు నుంచి 15 ఏళ్లపాటు సైతం అపరిష్కృతంగా ఉన్నవి కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేవదాయ శాఖకు చెందని భూములు కూడా పొరపాటున 22ఏలో నమోదైనన సందర్భాల్లో దేవదాయ శాఖ కమిషనర్ నివేదికను అనుసరించి 22ఏ జాబితా నుంచి తొలగింపు ప్రక్రియ చేపట్టామన్నారు. ఏపీఐఐసీ భూముల విషయంలో కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రికార్డుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ, సంబంధిత పత్రాల ధ్రువీకరణ అనంతరం అర్హమైన కేసులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వేతో పాటు కలెక్టరేట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీ కేశినేని చిన్ని భారీ భూ దోపిడీ!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హైదరాబాద్లో భారీ భూదోపిడీకి తెర లేపారని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. కూకట్పల్లి సమీపంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. ఈ భూకబ్జాను అడ్డుకుని, క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. పదవిని దుర్వినియోగం చేస్తున్నారు.. ‘మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండల పరిధిలోని షంషీగూడ గ్రామ సర్వే నంబర్ 57లో ఉన్న 112.72 ఎకరాల విలువైన భూమిని అక్రమంగా చేజిక్కించుకోవడానికి కేశినేని చిన్ని ఒక పెద్ద సిండికేట్ను నడుపుతున్నారు. టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం ప్రతిపాదించిన ఈ ప్రభుత్వ భూమిని కాజేయడానికి ఎంపీ తన కుమారుడు కేశినేని వెంకట్ చౌదరిని (ఎక్సెల్లా ప్రాపరీ్టస్ మేనేజింగ్ పార్టనర్) ప్రాక్సీగా వాడుకుంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్తులను చేజిక్కించుకోవడానికి ఢిల్లీ నుండి తన రాజ్యాంగ పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భూమిపై అక్రమంగా హక్కులు పొందడానికి నాగమ్మ గుడి ఎదురుగా భారీ ఎర్త్ మూవర్లను, బారికేడ్లను మోహరించారు..’అని నాని తన లేఖలో తెలిపారు. కోర్టును మోసం చేస్తున్నారు.. ‘ఈ భూమిపై ఎలాంటి ప్రైవేట్ యాజమాన్య హక్కులు లేవని 2026 మార్చి 19 నాటి కౌంటర్ అఫిడవిట్లో జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎంపీ సిండికేట్ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 142 కింద మోసపూరిత ప్రైవేట్ రాజీ దరఖాస్తులను దాఖలు చేసింది. సర్వే నంబర్ 57లోని మొత్తం 274.33 ఎకరాలు (కబ్జాకు ప్లాన్ చేసిన 112.72 ఎకరాలతో కలిపి) ’పోరంబోకు సర్కారీ’ భూమిగా ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. పైగా అస్మాన్ జాహి వారసుల ప్రైవేట్ క్లెయిమ్లను అతియాత్ కోర్టు (25.11.1957న), రెవెన్యూ బోర్డు (06.05.1976న) తిరస్కరించాయి. 1959 నాటి ప్రాథమిక రాజీ డిక్రీ (దీనిలో ప్రభుత్వం భాగస్వామి కాదు) కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అనుమతిపై ఆధారపడి ఉంది. కానీ అది ఎప్పుడూ జరగలేదు. అంతేకాకుండా ఈ ఆస్తి వెనుక పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణానికి సంబంధించిన నిధుల మళ్లింపు ఉందనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనే కాషన్ నోటీసు ఇచ్చింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) స్టే ఆర్డర్ కూడా ఉంది. ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టి కోర్టును సైతం మోసం చేస్తున్నారు. ప్రైవేట్ రాజీ ద్వారా వీటిని దాటవేయడం పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ నిరోధక చట్టం)లోని తీవ్రమైన నేరాలు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ (నమ్మకద్రోహం) కిందకు వస్తుంది..’అని నాని పేర్కొన్నారు. నకిలీ ప్రీ–లాంచ్ స్కామ్లు ‘ఈ సిండికేట్ కేవలం భూకబ్జాలకే పరిమితం కాకుండా టీఎస్–రెరా అనుమతులు లేకుండా కేశినేని డెవలపర్స్, ఎక్సెల్లా ప్రాపర్టీస్ పేరుతో హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12, గచ్చిబౌలి, ప్రగతినగర్, శంకర్పల్లి, పటాన్చెరు, దుండిగల్ వంటి ప్రాంతాలలో నకిలీ ప్రీ–లాంచ్ స్కామ్లకు పాల్పడింది. ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు. లేని ప్లాట్లను చూపిస్తూ వందలాది మధ్యతరగతి కుటుంబాల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ నిధులను భూకబ్జా కార్యకలాపాలకు మళ్లించారు..’అని కేశినేని నాని ఆరోపించారు. ఖాతాలను ఫ్రీజ్ చేయండి.. ‘తెలంగాణ ప్రభుత్వ ఆస్తులను, సామాన్య పౌరుల కష్టార్జితాన్ని కాపాడటానికి సీఎం రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టులో ఎంపీ సిండికేట్ వేసిన ప్రైవేట్ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యేలా చర్యలకు అడ్వకేట్ జనరల్ను ఆదేశించాలి. వివాదాస్పద 112.72 ఎకరాల భూమిని తక్షణమే హైడ్రా ఆధీనంలోకి తీసుకుని, అక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన కుమారుడు వెంకట్ చౌదరి, ఇతరులపై క్రిమినల్ ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్, టీఎస్–రెరా ద్వారా సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం జరిగేలా సదరు కంపెనీలు, నిందితుల బ్యాంక్ ఖాతాలను తక్షణమే స్తంభింపజేయాలి..’అని నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీలను హైడ్రా కమిషనర్, టీజీఐఐసీ ఎండీ, తెలంగాణ డీజీపీ, రెరా చైర్మన్లకు కూడా తదుపరి చర్యల కోసం పంపినట్లు నాని తెలిపారు. -
సురభి నాటక వైభవం
విజయవాడ కల్చరల్: ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ సృజనాత్మక సమితి ఆధ్వర్యాన దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో ప్రదర్శిస్తున్న సురభి నాటకోత్సవాలు నయన మనోహరంగా సాగుతున్నాయి. వినాయక నాట్యమండలి (సురభి సంస్థ) వారు ఆదివారం భక్తప్రహ్లాద నాటకాన్ని ప్రదర్శించారు. దర్శకుడు సురభి ఆర్.వేణుగోపాల్. వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి మహారుషులు వస్తారు. వారిని ద్వారంలో ఉన్న జయవిజయులు అడ్డుకుంటారు. రుషులు వారిని రాక్షసులవుతారని శపిస్తారు. హిరణ్యకశిపుడు హరి ద్వేషం, ప్రహ్లాదుని హరి భక్తి అంశాలుగా నాటకం సాగుతుంది. హిరణ్యకశిపుడిగా దినకర్, నారదునిగా పరిమళ, ఇంద్రునిగా శుభకర, ప్రహ్లాదునిగా నైమిక శాయి, లీలావతిగా శాంతిలు నటించారు. నాటకంలో ప్రధాన ఘట్టాలను వైర్ వర్క్తో అద్భుతంగా ప్రదర్శించారు. సంప్రదాయం కాపాడుకోవాలి ముఖ్య అతిథి ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 140 సంవత్సరాల చరిత్రకలిగిన ప్రాచీన సురభి నాటక సంప్రదాయాన్ని కాపాడుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సంప్రదాయ కళ ఉందన్నారు. కొండపల్లి బొమ్మలు, కూచిపూడి నాట్యం, సాహిత్యం మన జిల్లా సొత్తు అన్నారు. సురభి కళాకారులను అభినందించారు. పౌరాణిక నాటకాలతో కనువిందు భక్త ప్రహ్లాద నాటకంలో ఓ సన్నివేశంహిరణ్యకశిపుడి సంహార ఘట్టం -
మంత్రి ఇలాకాలో పేకాట జోరు
కోనేరుసెంటర్: నగరంలో అతనో సాదాసీదా ఆటో డ్రైవర్.. రోజూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే అతి సాధారణ వ్యక్తి... అయితే ఇదంతా కేవలం పైకి కనిపించే ముసుగు మాత్రమే... ఆ ఆటో డ్రైవర్ దినచర్య లోతుగా వెళ్లి పరిశీలిస్తే అతనో పేకాట కింగ్. అవును.. బందరులో ఇప్పుడు ఓ ఆటో వాలానే లీడర్గా సాగిస్తున్న పేకాట శిబిరం జిల్లాలోని పేకాటరాయుళ్లలో హాట్టాపిక్గా మారింది. చట్టాన్ని తన చుట్టంగా మార్చుకున్నాడో లేదంటే అధికార పార్టీ నేతలను తనకు అండగా పెట్టుకున్నాడో తెలీదు గానీ అతని పేకాట శిబిరం మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు. రాష్ట్ర మంత్రి ఇలాకాలో ఆటో డ్రైవర్ ఆధ్వర్యంలో పేకాట జోరుగా సాగుతోంది. మూడు పువ్వులు.. ఆరు కాయలు.. ఈ పేకాట శిబిరం ఏదో సాదాసీదాగా సాగుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. హై–ప్రొఫైల్ జూదరులను ఆకర్షించేలా ఈ శిబిరం సాగుతోందనటంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ ఆటలో అడుగు పెట్టాలంటేనే కళ్లు బైర్లు గమ్మే రూల్స్ ఉన్నాయి. ఆటలో కూర్చోవాలంటే పందెం రాయుళ్ల నుంచి (ఎంట్రీ ఫీజు) రూ.వెయ్యి నిర్వాహకుడు (ఆటో వాలా) ముక్కు పిండీ వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. రోజుకు లక్షలాది రూపాయలు చేతులు మారే ఈ జూద శిబిరానికి బందరుకు చెందిన పేకాటరాయుళ్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ రకాల వ్యాపారవేత్తలు, ఇతర సంపన్నులతో పాటు పలువురు ఉద్యోగులు సైతం వస్తుండటం గమనార్హం. దీంతో నిర్వాహకుడి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఆటగాళ్ల నుంచి ఒక్కో షోకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్న నిర్వాహకుడు అదే స్థాయిలో పందెం కట్టాలంటే రూ.10 వేలకు తగ్గకూడదనే ఆంక్షల మీద పేకాట నిర్వహిస్తున్నాడు. దీంతో ఈ ఆటలో ప్రతి రోజు లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. పోలీసులపై ఆరోపణలు.. నగర నడిబొడ్డు అదీ కాకుండా ఓ రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధి ఇంటికి సమీపంలో ఇంత పెద్ద ఎత్తున జూదం జరుగుతున్నా సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. అలాగే నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా పట్టించుకోకపోవడం, పోలీసులు ఈ శిబిరం వైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న అంతర్యమేంటో అర్థం కావటంలేదంటూ నగర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా సంబంధిత పోలీసులకు నిర్వాహకుడి నుంచి రోజువారీ మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ఆటో వాలా ముసుగులో ఉన్న ఆర్గనైజర్ వెనుక రాజకీయంగా ఏవో పెద్ద తలకాయలే ఉండి పోలీసులను మేనేజ్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికై నా స్పందించి దాడి చేస్తారా లేక ప్రజాభిప్రాయానికి తలొగ్గి తప్పు ఒప్పుకుంటారో వేచిచూడాలి. మంత్రి ఇంటికి సమీపంలోనే శిబిరం.. అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే. ఈ పేకాట శిబిరాన్ని ఎక్కడో అడవుల్లోనో... నిర్మానుష్య ప్రాంతాల్లోనో నిర్వహించడం లేదు. ఏకంగా రాష్ట్ర మంత్రి ఇంటికి అతి సమీపంలో పేకాట శిబిరం కొన్ని నెలల నుంచి యథేచ్ఛగా కొనసాగుతుండటం అందరినీ అవాకై ్కయ్యేలా చేస్తుంది. ‘దీపం కిందే చీకటి’ అన్నట్లు రాష్ట్ర మంత్రి ఇల్లు పక్కనే ఉన్నా భయం లేకుండా ఇంత పెద్ద పేకాట శిబిరాన్ని ఓ సామాన్య ఆటోవాలా (హౌస్ గ్యాంబ్లింగ్) నడుపుతుండటం వెనుక ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా కాకుంటే ఓ సామాన్య ఆటోడ్రైవర్ నగర నడిబొడ్డున ఇంతటి సాహసానికి ఒడిగట్టటం జరగదంటూ నగరవాసులు చెప్పుకుంటున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 20267గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కారవేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదివారం ఒక ప్రక టనలో తెలిపారు.నందిగామ రూరల్: మాగల్లు వైకుంఠ నారాయణ క్షేత్రానికి జగద్గురు శంకరాచార్య హింపీ విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి ఆదివారం రాత్రి విచ్చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దాతలకు అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు.కలెక్టర్ లక్ష్మీశ మధురానగర్(విజయవాడసెంట్రల్): దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. నగరంలోని అయోధ్యనగర్ పట్టణ ఆరోగ్యకేంద్రంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీలు, పట్టణ ప్రాంతాల్లోని యూపీహెచ్సీల పరిధిలో 966 పోలియో కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోందన్నారు. 4,274 మంది వ్యాక్సినేటర్లు, 104 మంది రూట్ సూపర్వైజర్లు పాల్గొన్నట్లు తెలిపారు. రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో 35 ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఏదైనా కారణాలతో ఆదివారం పోలియో చుక్కలు వేసుకోనట్లయితే సోమవారం, మంగళవారం వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఇంటింటి సందర్శనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ ఇందుమతిదేవి, డాక్టర్ చిలకపాటి రామ్చంద్, డాక్టర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు. 1,79,712 మందికి చుక్కలమందు వేయాలన్నది లక్ష్యంకాగా, 2,05,291 మందికి వేయడంతో 114.23 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో సమగ్ర ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్న వేళ అధికారుల ప్రకటనలు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉందన్న చర్చ జోరందుకుంది. జిల్లా లోని ఏడు నియోజకవర్గాల్లో సర్వేకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓటరు జాబితాకు సంబంధించి అధికారులు నియమించిన బీఎల్వోలు పూర్తిస్థాయిలో పనిలో నిమగ్నం కాకపోవటంతో ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొంతన లేని ప్రకటనలు జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసేందుకు 1,792 మంది బీఎల్వోలను ప్రభుత్వం నియమించింది. వీరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ బూత్ల ప్రకారం ఓటర్ల ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాల్సి ఉంది. ఆదివారం ఉదయం వరకూ జిల్లా వ్యాప్తంగా 14,99,852 మందికి ఫారాలను అందించే కార్యక్రమం 87.53 శాతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో అంతమేర పంపిణీ జరగలేదని రాజకీయ పక్షాలు చెబుతున్నాయి. ఇంత స్థాయిలో పూర్తి చేసినట్లయితే ఇంకా చాలా ప్రాంతాల్లోని ఓటర్లుకు ఫారాలు అందలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో చాలా ఇళ్లకు చేరని ఫారాలు విజయవాడలో పశ్చిమ, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలకు సంబంధించి చాలా డివిజన్లు కొండ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రధానంగా పశ్చిమలోని సగం ప్రాంతం కొండ ప్రాంతాలతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ నివాసితులకు ఇప్పటి వరకూ చాలా మందికి ఫారాలు అందలేదని చెబుతున్నారు. వారిలో చాలా మంది ఉదయం పనులకు వెళ్లి రాత్రికి ఇళ్లకు చేరుకుంటారు. ఈ సర్వే గురించి వారికి అవగాహన లేకపోవటం, బీఎల్వోలు ఆ దిశగా పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్దేశం నెరవేరడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్గదర్శకాలను పాటించాలంటున్న రాజకీయ పక్షాలు చాలా మంది బీఎల్వోలు ఆయా ప్రాంతాల్లో ఒక చోట కూర్చొని వచ్చిన వారికి తమ వద్ద ఉన్న ఫారాలను అందజేసి తిరుగు పయనమవుతున్నారు. దీంతో బూత్లో ఉన్న ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఒక ఇంటిలో నాలుగైదు ఓట్లు ఉంటే కేవలం రెండు ఫారాలు అందించి మిగిలినవి తర్వాత ఇస్తామని చెబుతున్నా రని, మళ్లీ వాటిని ఇవ్వడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బీఎల్వోలు మార్గదర్శకాలను అనుసరించి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. అధికారులు ప్రకటిస్తున్నట్లుగా 14,99,852 మందికి (87.53 శాతం) ఫారాలను అందించే కార్యక్రమం పూర్తి చేస్తే కేవలం 1,84,411 ఫారాలు మాత్రమే డిజిటలైజేషన్ అయినట్లుగా అధికారులే చెబుతున్నారు. దీన్ని బట్టి రెండిటి మధ్య పొంతన లేదనే విషయాన్ని వారే స్పష్టంగా చెబుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఉన్నతాధికారులు సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నా క్షేత్రస్థాయిలో బీఎల్వోలు చురుకుగా లేరనే విషయాన్ని గమనించటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఓటర్లు తమ ఓట్లను కోల్పోయే ప్రమాదముందని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేకు ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ గడువు ఉంది. నగరంలోని చాలా మంది బీఎల్వోలు గడువులోపు ఈ సర్వే ప్రక్రియను పూర్తి చేయలేమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉన్న బీఎల్వోలపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు లేఖలు పంపినట్లు తెలిసింది. పశ్చిమలో ఇద్దరు, తూర్పు, సెంట్రల్లో సుమారుగా పది మంది బీఎల్వోలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి వారి నుంచి సంజాయిషీ కోరినట్లుగా తెలిసింది. కొంతమంది బీఎల్వోలు తమ వ్యక్తిగత సమస్యల కారణంగా కొండ ప్రాంతాల్లో తిరగలేమని చెబుతున్నారు. -
దుర్గమ్మకు రూ.5 లక్షల బంగారు ఆభరణాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనక దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం రూ. 5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. విజయవాడ కానూరుకు చెందిన కొండవీటి ఈశ్వరరావు, మాధవి దంపతులు రూ. 5 లక్షలు వెచ్చించి బంగారు బొట్టు, బులాకి, నత్తులను తయారు చేయించారు. బంగారు ఆభరణాలను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ (ఎన్సీసీ, క్యాప్, ఆంగ్లో ఇండియన్స్, దివ్యాంగులు) ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్లో సోమవారం నుంచి మొదలుకానుంది. సోమవారం ఎన్సీసీ, చిల్డ్రన్స్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్ (క్యాప్) కేటగిరీకి చెందిన వారికి 1 నుంచి 60 వేల ర్యాంకు వరకు, దివ్యాంగులు, ఆంగ్లో ఇండియన్స్ వారికి మొదటినుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. మంగళవారం క్యాప్, ఎన్సీసీ అభ్యర్థులకు 60,001 నుంచి చివర ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గౌడ్స్ అభ్యర్థులకు మొదటి నుంచి చివరి ర్యాంకు పొందిన వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ విజయసారథి తెలిపారు. పరిశీలన పూర్తైన జనరల్ కేటగిరి అభ్యర్థులు సోమవారం నుంచి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చన్నారు. గుడివాడటౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో 11వ రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం జరిగాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 200 మంది పైగా క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో ప్రతినెలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయన్నారు. క్రీడలను ప్రోత్సహించి యువ క్రీడాకారులను తయారుచేసే కార్ఖానాగా స్టేడియం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, కమిటీ సభ్యులు ప్రవీణ్కుమార్, జైన్, ఎం.లక్ష్మణరావు, పి.వెంకట్రామయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విజేతలకు గుడివాడ డీఎస్పీ శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ సోమవారం జరగనుంది. ఉదయం 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూల వాహనంపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లు, దేవస్థాన ప్రచార రథంపై కొలువై ఉన్న మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరిప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు. -
అమరావతి రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
పెనుగంచిప్రోలు: అమరావతి రైతులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలులో పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ముందుగా చెరువుకట్ట సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు, శ్రీతిరుపతమ్మవారి ఆలయం మీదుగా ప్రధాన రహదారి గుండా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగనన్న నినాదాలతో హోరెత్తించారు. ఈసందర్భంగా పార్టీ జగ్గయ్యపేట ఇన్చార్జీ తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతిలో రైతుల భూములను లాక్కుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వద్దకు రైతులు వస్తే వారి తరుఫున మద్దతుగా వైఎస్సార్ సీపీ నేతలు వెళ్తుంటే టీడీపీ గూండాలు, రౌడీలు దాడి చేయటం అత్యంత దారుణమన్నారు. అక్కడ రైతులు ఒక్కరూ కూడా లేరన్నారు. మేమంతా జగన్ సైనికులమని, మహానేత వైఎస్సార్ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వానికి గొయ్యి తీసి పాతరేసే రోజులు వచ్చాయని చెప్పారు. సగం సినిమా అయిందని, రెండేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి హీరో అన్నారు. జగ్గయ్యపేటలో కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. పోలీసులు ఇబ్బందులు పెట్టినా, వర్షం వచ్చినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం మరువలేనిదన్నారు. కూటమికి భయమెందుకు ? మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ.. అమరావతి రాజధాని టీడీపీ వారిదేనని.. శాసనం చేస్తే ఎవరు రారన్నారు. మేము రాజధానికి వ్యతిరేకం కాదని, తక్కువ ఖర్చుతో నిర్మించాలనేది ధ్యేయమన్నారు. కూటమి నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులను చూసి భయపడటం ఎందుకు అన్నారు. తన్నీరు మాట్లాడుతూ.. కూటమి రెండేళ్ల పాలనంతా రెడ్బుక్ రాజ్యాంగం మీదే ఆధారపడి ఉందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ, జెడ్సీటీసీ సభ్యురాలు వూట్ల నాగమణి, ఎస్సీ, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కన్నమాల శామ్యూల్, బత్తుల రామారావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, రాష్ట్ర కార్యదర్శి నంబూరి రవి, మండల, గ్రామ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు, గుడిమెట్ల శంకర్, నాయకులు పసుపులేటి సత్యశ్రీనివాసరావు, నాగబాబు, ఫిరోజ్ఖాన్, కొత్తపల్లి పెంటయ్య, దామాల శిరీస్, దేరంగుల శ్రీనివాసరావు, మెండెం రామారావు, వూట్ల నాగేశ్వరరావు, చేని రాంబాబు, చేని కుమారి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు రేపల్లె/చల్లపల్లి/కోడూరు: బాపట్ల జిల్లా రేపల్లె–పెనుమూడి ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇరాలి గ్రామానికి చెందిన గంజాల బాపనయ్య తన భార్య నాంచారమ్మ, కుమారుడు సంతోష్ కుమార్లతో కలిసి తన ద్విచక్ర వాహనంపై రేపల్లె వైపు వస్తున్నాడు. పనులకు వెళ్లి వస్తుండగా.. చల్లపల్లి మండలం, లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీకి చెందిన కాకి రాకేష్(27) ప్రకాష్ల ద్విచక్ర వాహనం రేపల్లె నుంచి కృష్ణా జిల్లా వైపు వస్తున్నారు. పెనుమూడి రోడ్డులోని టపాసులగూడం వద్ద వీరు బాపనయ్య వాహనాన్ని ఢీకొన్నారు. బాపనయ్య, కాకి రాకేష్ (27) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాంచారమ్మ, సంతోష్ కుమార్, ప్రకాష్లకు తీవ్ర గాయాలయ్యాయి. రాకేష్ కాంక్రీటు పనులు చేస్తుంటాడు. ఇందులో భాగంగానే ఆదివారం రేపల్లె నుంచి పనులు ముగించుకుని వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించినట్లు సమాచారం. వీరి మృతితో లక్ష్మీపురం, ఇరాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బి.అశోక్కుమార్ తెలిపారు. -
సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ జట్ల ఎంపికలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని గాంధీనగర్లో సర్ విజ్జి మున్సిపల్ కార్పొరేషన్ స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్, జూనియర్ విభాగాల జిల్లా స్థాయి పోటీలు ఆదివారం జరిగాయి. జూలై 18, 19 తేదీల్లో విశాఖ పట్నంలో జరగనున్న 11వ సబ్ జూనియర్, జూనియర్ అంతర్ జిల్లా స్విమ్మింగ్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి క్రీడాకారులను ఎంపిక చేశామని ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఐ.రమేష్ చెప్పారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులను అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కొంగర రవికాంత్, స్విమ్మింగ్ పూల్ ఇన్చార్జ్ నవీన్, కోచ్లు ఎం.మాల్యాద్రి, లక్ష్మణ్, ఎస్కే.రఫీ, ఆర్.గౌతమ్ అభినందించారు. ఎంపికై న క్రీడాకారులు వీరే సబ్ జూనియర్స్ గ్రూప్–1 విభాగంలో జి.జితేంద్ర, కె.శక్తిధర్, ఎం.ఎల్.గీతిక, ఎన్.పవన్సరయు, పి.అభిషేక్సాయి, గ్రూప్–2లో పృధ్వీరాజ్, డి.రామస్వామి, కె.ప్రభుసాత్విక్, వడ్లమూడి లిపి, ఎం.యజ్ఞసాయి, మహమ్మద్ ముజ్ఫర్, పి.అభిరామ్, పి.రమ్యశ్రీ, సానా శ్యామ్నాథ్ జూనియర్ గ్రూప్–3లో ఎ.హేమంత్రాజ్, జి.అక్షయ, బి.నాగ లక్ష్మీ కృతిక, జి.అక్షయ, జి.జతిన్, కె.రఘు వెంకట సత్యప్రకాష్, కె.వినయ్, ఎం.చిత్ర, ఎం.జీసశ్రీ, ఎం.సుజీత, ఎన్.పర్ణిక, ఎన్టీ నారీష్, పి.వెంకట అర్జున్, గ్రూప్–4 విభాగంలో డి.మను కార్తీక్, ఈ.గగన్, కె.లోహిత్సాయి, కరణం సుమేధ, ఇ.గగన్ తేజ్, కె.సింధూర, ఎం.చేతన్ సాయిశ్రీ, ఎం.హర్షిత, ఎం.రామ్మణికంఠ, పి.భార్గవ్ సాయి, ఆర్.హర్షిత, రీషాన్ రాజన్, ఎస్టీ.అక్షిత్, ఎస్.యశస్విని దీపిక, సానా అక్షిత్, వి.భావన శివగామి, యానా జైన్ ఎంపికయ్యారని తెలియజేశారు. -
పేరుపాలెం బీచ్లో విషాదం
● స్నానానికి దిగి యువకుడు మృతి ● మరో విద్యార్థి గల్లంతు నరసాపురంరూరల్: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి దిగి ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో పాలిటెక్నిక్ విద్యార్థి అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షనన్కు చెందిన జిజ్జువరపు ఉమామహేశ్వరరావు (26) తన స్నేహితులతో కలిసి ఆదివారం సరదాగా గడిపేందుకు పేరుపాలెం బీచ్కు వచ్చాడు. అందరూ కలిసి సముద్రంలో స్నానానికి దిగగా, ప్రమాదవశాత్తు ఉమామహేశ్వరరావు మృతి చెందాడు. మృతుడి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీచ్లో లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదే బీచ్లో జరిగిన మరో ప్రమాదంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్ల గ్రామానికి చెందిన సీహెచ్ సుభాష్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న సీఐ నాగరాజు గాలింపు చర్యలు చేపట్టారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం గన్నవరం: జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాజీలేని పోరాటాలు సాగిస్తుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు తెలిపారు. స్థానిక రోటరీ ఆడిటోరియంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ వర్కంగ్ జర్నలిస్టు ఫెడరేషన్(ఏపీడబ్ల్యూజేఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టు జర్నలిస్టు అసోసియేషన్(ఏపీబీజేఏ) జిల్లా కమిటీల మహాసభ నిర్వహించారు. వెంకట్రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీబీజేఎ రాష్ట్ర కన్వీనర్ వీసం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జర్నలిస్టులపై దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని అమరావతి ప్రెస్క్లబ్ ప్రధాన కార్యదర్శి చిగురుపాటి సతీష్బాబు కోరారు. తొలుత ఫెడరేషన్ జెండాను సీనియర్ పాత్రికేయుడు ఉడతా రామకృష్ణ ఎగురవేశారు. ఎంపీపీ అనగాని రవి, ఫెడరేషన్ నాయకులు వెలమా రామారావు, షేక్ ఖాజావలి, వల్లభనేని సురేష్, ఎంబీ నాథన్, ఎన్.శ్రీనివాసరావు, హలీమ్, ఎం.రామారావు, కళ్లం వెంకటేశ్వరరావు, కాట్రగడ్డ రామచంద్రజోషి పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. నూతన జిల్లా అధ్యక్షుడిగా దొండపాటి ఉదయ్కుమార్, కార్యదర్శిగా జొన్నా రవిశంకర్, గౌరవ అధ్యక్షుడిగా ఉడతా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా కె.శ్రీనివాస్, రవీంద్రనాథ్ ఠాగూర్, చిట్టిబాబు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా బి.రమేష్, పి.వేణుగోపాలస్వామి, కోటయ్య, ఇంద్రగంటి గోపికృష్ణ, కోశాధికారి అచ్యుతరావు, మరో ఏడుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. నేషనల్ ఐస్ స్కేటింగ్ పోటీల్లో చైత్ర దీపికకు కాంస్యం మొగల్రాజపురం(విజయవాడతూర్పు): డెహ్రాడూన్లో జరుగుతున్న 21వ నేషనల్ ఐస్ స్కేటింగ్ చాంపియ న్షిప్ పోటీల్లో నగరానికి చెందిన క్రీడాకారిణి పెదిరెడ్ల చైత్రదీపిక ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ చాంపియన్ షిప్లో ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన చైత్రదీపిక ఆదివారం జరిగిన ఐస్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీ–7 విభాగంలో ప్రతిభ చూపి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. జాతీయ స్థాయి ఐస్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు పతకం పొందడం ఇదే మొదటి సారి. ఆర్టిస్టిక్ స్కేటింగ్, ఐస్ స్కేటింగ్ విభాగాల్లో ఏకంగా 62 పతకాలను ఇప్పటి వరకు చైత్రదీపిక సాధించింది. చైత్రదీపికను నగరంలోని క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందించారు. -
ఆపేవాడెవడు.. రైట్ రైట్!
కంకిపాడు: మమ్మల్ని ఆపేదెవరు అనుకుంటూ అధిక లోడుతో ఇసుక, కంకర లారీలు, ట్రాక్టర్లు రయ్మంటూ దూసుకుపోతున్నాయి. వాహన దారులు నిబంధనలను గాలికొదిలేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వాహనాలు ప్రధాన రోడ్లపై యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నా అధికారులు ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారు. ప్రజలు మాత్రం ప్రమాదాల భయంతో ఆందోళన చెందుతున్నారు. రక్షణ చర్యలు సున్నా పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాల్లోని గ్రామాలకు ఇసుక, కంకర లోడు వాహనాలు భారీగా వెళ్తున్నాయి. ప్రధానంగా కరకట్ట వెంట ఉన్న ఇసుక స్టాక్యార్డుల నుంచి నిత్యం వందల సంఖ్యలో హెవీ లోడు లారీలు, ట్రాక్టర్లులో ఇసుక తరలిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల పరిమితికి మించి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. రవాణా సమయంలో ఇసుక గాల్లో లేచి వాహనచోదకులపై పడి గమ్యస్థానాలకు చేరే సమయంలో చిన్న చిన్న ప్రమాదాల బారిన పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఇసుక జారకుండా, గాలికి ఎగిరి వాహనదారుల కళ్లలో పడకుండా రక్షణ చర్యలు తీసు కోవాలి. కనీసం ఇసుక, కంకర వాహనాలను పూర్తిగా కమ్ముతూ పరదాలు కప్పటం లేదు. దీంతో సమస్య జఠిలమవుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని క్వారీల నుంచి కంకర లోళ్లు ఈ ప్రాంతానికి వస్తున్నాయి. ఇవి కూడా పరిమితికి మించి లోడింగ్ చేయించుకుని రోడ్లపై సంచరిస్తున్నాయి. ఆందోళనలో ప్రజలు రోడ్లపై జారిపడుతున్న ఇసుక, కంకర, మట్టితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం ప్రమాదం అంచున జీవనం సాగుతుండటంతో భయంతో వణికిపోతున్నారు. రోడ్డు మార్జిన్లలో పేరుకుపోతున్న ఇసుక, వ్యర్థాలను శుభ్రం చేయడంలో స్థానిక సంస్థలు అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ద్విచక్ర వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్న దుస్థితి. స్పందన లేని అధికారులు పరిమితికి మించి రవాణా అవుతున్నా ఏ ఒక్క అధికారీ పట్టించుకోవడం లేదు. గతంలో అడ్డగోలు రవాణాకు తనిఖీలతో బ్రేక్ పడేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అధిక లోడుతో వెళ్లే వాహనాలను అడ్డుకోవడం, జరిమానాలు విధించడం జరగటం లేదు. ఫలితంగా అధిక లోడుతో వాహనాలను రోడ్లపై దర్జాగా నడిపించేస్తున్నారు. -
బతుకుదెరువు కోసం వచ్చి అనంతలోకాలకు..
పెనుగంచిప్రోలు: బతుకుదెరువు కోసం వచ్చిన వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన ఘటన స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం వత్సవాయి మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన అలగండుల సతీష్కుమార్(41) ఆలయం వద్ద వాహనాల పార్కింగ్కు సంబంధించి రుసుం వసూలు చేసే పనిలో రెండు రోజుల క్రితం చేరాడు. భార్య మాధవి కూడా కొంతకాలంగా ఆలయం వద్ద పొంగళ్ల షెడ్డులో పని చేస్తోంది. ఈక్రమంలో సతీష్కుమార్ పార్కింగ్ రుసుం వసూలు చేస్తూ ఆలయ ప్రవేశద్వారం పిల్లర్ వద్ద ఉండగా ఎదురుగా వచ్చిస జగ్గయ్యపేట ఆర్టీసీ బస్సు ఢీకొనగా బస్సు, పిల్లర్కు మధ్య ఇరుక్కుని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇటీవలనే వివాహం అయినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని చూసి భార్య మాధవి బోరున విలపించిన తీరు అందరినీ కలచి వేసింది. కుంచించుకు పోయిన రహదారి.. తిరుపతమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారి పోలీస్స్టేషన్ సెంటర్ నుంచి ఆక్రమణలతో కుంచించుకు పోయింది. రోడ్డుకు రెండు వైపులా అసలే ఇరుకుగా ఉండే రహదారిపైనే వ్యాపారులు బండ్లు, బల్లలు, కుండల వ్యాపారాలతో పాటు కోళ్లు విక్రయాలు చేస్తుండటంతో రహదారిపై ఎదురెదురుగా వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి తోడు మరీ ముఖ్యంగా ఆలయం వద్ద వాహనాల పార్కింగ్కు డబ్బులు వసూలు చేసుకునే హక్కు పొందిన కాంట్రాక్టర్ వాహనాలు రోడ్డు మీద పెట్టి డబ్బులు వసూలు చేస్తుండటంతో ట్రాఫిక్తో నిలిచిపోతుంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన భక్తులు, యాత్రికులతో ఆదివారం తెల్లవారుజాము నుంచి రద్దీ కనిపించింది. ఉదయం 7 గంటల నుంచి అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. మరో వైపున అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం జరిగిన లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. రద్దీ నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రూ.500 టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. అంతరాలయ దర్శనం రద్దు చేయడంతో భక్తులు రూ.300 టికెట్లు కొనుగోలు చేసి బంగారు వాకిలి ద్వారా అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ డీఈవో కిశోర్కుమార్ పర్యవేక్షణలో ఏఈవోలు చంద్రశేఖర్, వెంకటరెడ్డి, రమేష్బాబులు క్యూలైన్లను పర్యవేక్షించారు. మహా నివేదన అనంతరం రద్దీ మరింత పెరిగింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత రూ. 500 టికెట్లను తిరిగి విక్రయించారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయమే ఆలయానికి చేరుకున్న భక్తులు సైతం మధ్యాహ్నం వరకు వేచి ఉండి, అంతరాలయ దర్శనం చేసుకోవడం విశేషం. -
దుర్గమ్మకు పలువురి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు తెనాలి మారీస్పేటకు చెందిన అట్లూరి బాపూజీ కుటుంబం రూ.2,01,116 విరాళాన్ని అందజేసింది. అమ్మవారి అన్నదాన పథకానికి విజయవాడకు చెందిన రవీంద్రభారతి విద్యా సంస్థల చైర్మన్ వీరమాచినేని వంశీకృష్ణ కుటుంబం రూ.1,11,111ల విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించి, అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.కొండపల్లిలో మాల్దీవుల బృందం కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మాల్దీవుల గణతంత్ర దేశానికి చెందిన 33 మంది సభ్యుల బృందం ఆదివారం ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించింది. కొండపల్లిలో వారసత్వ సంపద ప్రాంతాలను సందర్శించింది. కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను బృంద సభ్యులు పరిశీలించారు. హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీపీఆర్ సంస్థ ఈ బృందానికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల తయారీ విధానం, వికేంద్రీకృత పాలనా పద్ధతులపై అవగాహన కల్పించేందుకు జూన్ 28 నుంచి 30 వరకు జిల్లాలో క్షేత్రస్థాయిలో ఈ బృందం పర్యటిస్తోంది. సోమవారం గుంటుపల్లిలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ, బాల సభ, మహిళా సభ, పంచాయతీ అధికారులతో సమావేశాలు జరుపుతారు. మంగళవారం జుపూడి గ్రామ పంచాయతీలోని ఎస్డబ్ల్యూ పీసీ షెడ్ సందర్శన అనంతరం అధికారులతో చర్చిస్తారని ఎంపీడీఓ శకుంతల తెలిపారు. బందరు కాలువలో పడి బాలుడు మృతి కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లబ్బీపేట, ఫకీర్గూడెంలో బందరు కాలువ సమీపంలో ఎండీ వజీర్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను కారు డ్రైవర్గా పనిచేస్తుండగా అతని భార్య ఆయేషా ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తుంది. వీరికి కుమారుడు సబీర్(7), కుమార్తె సోఫియా జైన్(6) ఉన్నారు. సబీర్ రెండో తరగతి చదువుతుండగా సోఫియా ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఆదివారం మధ్యాహ్నం అన్నాచెల్లెలిద్దరు ఆడుకోవడానికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బందరు కాలువ ఒడ్డుకు చేరుకున్నారు. కాలువ మెట్ల మీద ఆడుకుంటుండగా సోఫియా నీటిలోకి జారిపోయింది. పక్కనే ఉన్న సబీర్ తన చెల్లిని గమనించి నీటి నుంచి పైకి తోసి ప్రమాదవశాత్తు అతను నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికీ కనిపించకపోవడంతో సోఫియా తన ఇంటికి వెళ్లి కాలువలో మునిగి అన్న కనిపించడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు ఘటనా స్థలానికి వెళ్లి చూసి తన కుమారుడు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్లు బందరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. మునిగిన ప్రాంతంలోనే సబీర్ను గుర్తించి పైకి తీసుకొచ్చారు. అతనిని పరీక్షించి చూసి మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి గంపలగూడెం: తునికిపాడు గ్రామంలో ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన వేల్పుల బిక్షాలు(55) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 23న పొలం గట్టు విషయంలో బిక్షాలు అతని తమ్ముడు వరసైన వేల్పుల వెంకటేశ్వరరావుల మధ్య ఘర్షణ జరిగింది. దీనిని పురస్కరించుకొని 24న ఉదయం వేల్పుల వెంకటేశ్వరరావు కుమారులు గోపి, ఆజయ్కుమార్లతో పాటు అనిల్, చిన్నికృష్ణ, చిట్టిబాబులు రోకలిబండ, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. క్షతగాత్రుడిని ఖమ్మం ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహానికి ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో హత్యాయత్నం కేసును హత్య కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గిరిబాబు తెలిపారు. -
గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఏపీ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గ్రంథాలయాల సందర్శన యాత్ర జరిగింది. తొలుత ఈ బస్సు యాత్రను సివిల్ కోర్టుల సమీపంలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం వద్ద కలెక్టర్ లక్ష్మీశ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఏపీ రచయితల సంఘం ఇటువంటి యాత్ర చేపట్టడం హర్షణీయమన్నారు. వీబీఎఫ్ఎస్ కాన్ఫరెన్స్ హాల్లో రచయితల సంఘం ఉపాధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అధ్యక్షతన ప్రారంభ సభ జరిగింది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతిలో అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ నిర్మాణ పనులకు జూలైలో శంకుస్థాపన చేయబోతున్నట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణ చంద్, సాహితీ వేత్తలు గుమ్మా సాంబశివరావు, వేముల హజరత్తయ్య గుప్తా, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కె. లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు. యాత్ర ఉద్దేశాలను రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్ సభకు వివరించారు. ఈ సందర్భంగా చెన్నాప్రగడ శర్మ రచించిన కవిత్వం కురిసింది కవితా సంకలనం, ఎం.ఎన్.వి. ప్రసాద్ రచించిన ఆవకాయ్ శతకం, ఎస్.ఆర్. పృథ్వి రచన ఆరుద్ర సప్తతి ఉత్సవం పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం బస్సుల్లో కవులు, రచయితలు బయలు దేరి నగరంలోని ఠాగూర్ గ్రంథాలయం, రామ్మోహన్ లైబ్రరీ, హనుమంతరాయ గ్రంథాలయం, సర్వోత్తమ గ్రంథాలయాలను సందర్శించి వాటి విశిష్టతలను, అక్కడ పుస్తకాలను పరిశీలించారు. సంఘం తరఫున ప్రభుత్వ ఉగాది పురస్కార విజేత దుర్గాప్రసాద్ను సత్కరించారు. సంఘ ప్రతినిధులు నానా, సోమేపల్లి వశిష్ట, శర్మ సీహెచ్, రాజశేఖర్, పుష్పాదేవి, లక్ష్మీ సుజాత, సుధారాణి తదితరులు పర్యవేక్షించారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
మాజీ ఎంపీ కేశినేని నాని మరో సంచలన పోస్ట్
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని మరో సంచలన పోస్టు పెట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని భూ కబ్జాను అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్కి లేఖ రాశారు. హైదరాబాద్లోని ప్రగతి నగర్, షంషిగూడలో టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం కేటాయించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని కేశినేని నాని కోరారు.ఈడీ జప్తు ఆదేశాలు, ఎన్సీఎల్టీ ఆంక్షల విషయాన్ని దాచిపెట్టారు. ఈ భూమిపై ప్రైవేట్ యాజమాన్య హక్కులు ఏమాత్రం లేవు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ అఫిడవిట్ స్పష్టం చేసినప్పటికీ అక్కడ ఆక్రమణలు మొదలయ్యాయి. తెలంగాణ సీఎంవో అడ్వకేట్ జనరల్ ద్వారా దీనిని అడ్డుకోవాలి. ఆ స్థలాన్ని ఖాళీ చేయించడానికి హైడ్రాను రంగంలోకి దించాలి. బాధ్యులపై తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలి’’ అని కేశినేని నాని ట్వీట్ చేశారు.MULTI-THOUSAND-CRORE GOVT LAND GRAB EXPOSEDI have petitioned CM @revanth_anumula to halt the illegal takeover of 112.72 Acres of public land in Shamshiguda,Pragathi Nagar,Hyderabad allotted for TGIIC IT Park.Vijayawada MP Kesineni Sivanath (Chinni) & proxies (M/s Exella… pic.twitter.com/kPbMexMaOU— Kesineni Nani (@kesineni_nani) June 28, 2026 -
ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ రామవరప్పాడు: యువత దేశాభివృద్ధికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణల దిశగా ఆలోచనలకు పదును పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దినోత్సవం సందర్భంగా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ –2016ను ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో శనివారం ప్రారంభించారు. ఈ ఉత్సవ్లో యువత, మహిళలు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులకు సంబంధించి 80కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త దార్శనికతకు అనుగుణంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు చేయూతనిస్తున్నారన్నారు. యువ మేధస్సుకు అనుభవాన్ని జతచేసి ఆ ఆలోచనలను ఆవిష్కరణల వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధన దిశగా పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తుతున్నామన్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు కూడా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకుని తమ కాళ్లపై నిలబడుతూ మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికు ఎదిగేలా ఆర్టీఐహెచ్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలతో పాటు వర్క్షాప్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి.భాస్కరరావు మాట్లాడుతూ దాదాపు వేలాది స్టార్టప్లు ఆర్టీఐహెచ్ ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాయన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇండస్ట్రీ 4.0 టెక్నికల్ సెషన్ నిర్వహించారు. 500 మందికి పైగా పారిశ్రామిక ప్రతినిధులు, సందర్శకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, జేఆర్డీ టాటా ఐలా చైర్మన్ టి.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఇ.మధు, ఆర్టీఐహెచ్ సీఈవో రవితేజ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర ఓటరు జాబితాకు సర్ కసరత్తు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనకు సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ద్వారా కసరత్తు జరుగుతోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాల్లో శనివారం కలెక్టర్ లక్ష్మీశ విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ నియోజకవర్గాల్లో సర్ ఇంటింటి సర్వే పకడ్బందీగా జరుగుతోందన్నారు. జిల్లాలో 14,99,852 (87.53 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగిందని, 1,84,411 ఫారాల డిజిటలైజేషన్ పూర్తైందన్నారు. నియోజకవర్గాల వారీగా ఫారాల పంపిణీ తిరువూరులో 1,96,351 (94.08 శాతం), విజయవాడ పశ్చిమ 2,04,853 (79.72 శాతం), విజయవాడ సెంట్రల్ 2,30,320 (82.9 శాతం), విజయవాడ తూర్పు 2,27,376 (84.3 శాతం), మైలవరం 2,49,135 (87.36 శాతం), నందిగామ 1,94,997 (93.98 శాతం), జగ్గయ్యపేట 1,96,820 (94.83 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వివరించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను ఇతర అధికారులు ఉన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానం నిమిత్తం ఒక రోజు అయ్యే రూ. 6 లక్షల వ్యయం మొత్తాన్ని ఓ భక్తుడు శనివారం అందజేశారు. అమరావతి సాఫ్ట్వేర్ ఇన్పోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ అనిల్కుమార్ చింత కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ఈవో శీనానాయక్ను కలిసి అన్నదానం నిమిత్తం రూ. 6 లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. మరో భక్తుడి విరాళం రూ. లక్ష హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన చిన్మయి సాయి కుటుంబం అమ్మవారి అన్నదానానికి రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. -
● హైందవజాతికి స్ఫూర్తి ఛత్రపతి శివాజీ
హైందవజాతికి స్ఫూర్తినిచ్చిన మహానీయుడు ఛత్రపతి శివాజీ అని విశ్వహిందూ పరిషత్ నేత చల్లా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక సమితి ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోని ఆదిశంకర మార్గ్లో శనివారం ఛత్రపతి శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భవానీ వీర శివాజీ.. జైభవానీ.. వీరశివాజీ.. సంఘటనమే శక్తి హై అంటూ విజ్ఞాన విహార్ పాఠశాలతోపాటు నగరానికి చెందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. శివాజీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు నాగలింగం శివాజీ, వివిధ సంఘాలకు చెందిన కొణకల సురేష్, కృష్ణభగవాన్, సూర్యతేజ పాల్గొన్నారు. – విజయవాడ కల్చరల్ -
మరణంలోనూ తీరని గోడు
ఊరు పొమ్మన్నా.. కాడి రమ్మనలేదు..!! కాటి రేవు నీటిపాలు.. కడసారి వీడ్కోలు పరాయిపాలు కృత్తివెన్ను: మనిషి బతికున్నప్పుడు పడిన కష్టాలు చాలవన్నట్టు, కన్నుమూశాక కూడా ఆత్మశాంతికి నోచుకోని దైన్యం అది. ‘ఊపిరి పోయింది.. ఊరు పొమ్మంది.. కానీ కాటి నేల మాత్రం రమ్మనలేదు.’ ఆధునిక సమాజంలో చంద్రమండలానికి వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆఖరి మజిలీలో గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు ఆరడుగుల నేల కరువైంది. కృత్తివెన్ను మండలంలోని పీతలావ గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఓ ఘటన చూస్తే ఎవరికై నా కన్నీళ్లు ఆగవు. సముద్రం పోటు.. వర్షం నీరు.. అంతిమయాత్రకు తీరని లోటు! పీతలావ గ్రామంలో దాదాపు 140 ఇళ్లు, సుమారు 500 మంది జనాభా నివసిస్తున్నారు. దశాబ్దాలుగా వీరికి సరైన శ్మశాన వాటిక లేదు. ఊరి చివర ఉన్న పర్రభూమినే వీరు శ్మశానంగా వాడుకుంటున్నారు. అయితే సముద్రపు పోటు వచ్చినప్పుడల్లా, వర్షాలు కురిసినప్పుడల్లా ఆ కాస్తా భూమి జలమయమైపోతుంది. తాజాగా శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. సరిగ్గా అదే సమయంలో గ్రామంలో ఒకరు మరణించారు. కడసారి చూపు చూసుకుని గుండెలవిసేలా ఏడుస్తున్న బంధువులకు, ఆ మృతదేహాన్ని ఎక్కడ దహనం చేయాలో పాలుపోలేదు. చుట్టూ చూస్తే నీరు.. కళ్లల్లో అంతకంటే ఎక్కువ కన్నీరు. పరాయి ఊరిలో ప్రయాసల మధ్య... ‘మా ఊరి నేల మా వాడిని సాగనంపడానికి చోటివ్వలేదు. బతికుండగా ఎలాగో అష్టకష్టాలు పడ్డాడు, పోయాక కూడా ఈ నరకమా?’ అంటూ మృతుడి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేక, పక్కనే ఉన్న కృత్తివెన్ను గ్రామస్తులను వారి కాటి రేవులో దహన సంస్కారాలు చేసుకోవడానికి అనుమతి కోరారు. ఆఖరికి, కన్నవారి చేతుల మీదుగా సాగాల్సిన అంతిమ సంస్కారాలు, పరాయి ఊరి శ్మశానంలో, అపరిచిత నేలపై అశ్రునయనాల మధ్య పూర్తి చేయాల్సి వచ్చింది. మృతదేహాన్ని మోసుకుంటూ వేరే గ్రామానికి తరలిస్తున్న ఆ దృశ్యం స్థానికులను తీవ్రంగా చలింపజేసింది. పాలకులారా.. మా గోడు వినపడదా? ‘ఈ సమస్య ఈ రోజుది కాదు. పాలకులకు, అధికారులకు, స్థానిక శాసనసభ్యులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాథుడే కరువయ్యాడు’ అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు, కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పే అధికారులు.. చనిపోయిన వారికి దక్కాల్సిన కనీస గౌరవాన్ని కూడా కల్పించలేకపోవడం శోచనీయం. ఇప్పటికై నా పాలకులు కళ్లు తెరవాలి. పీతలావ గ్రామస్తుల దశాబ్దాల గోడును ఆలకించి, భవిష్యత్తులో ఇలాంటి కన్నీటి గాథలు పునరావృతం కాకుండా తక్షణమే శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. -
వీడని మిస్టరీ!
● మాజీ సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్ను విచారణ చేస్తున్న సిట్ ● క్రాంతికుమార్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మిస్టరీ మాత్రం వీడటం లేదు. శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించిన ఇద్దరు హెడ్కానిస్టేబుళ్లు ఆయన అరెస్టు అయిన రోజే పరారయ్యారు. ఈ నేపథ్యంలో ఏసీపీ మానస, సీఐ మురళీకృష్ణతో పాటు సిట్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటి వెళ్లి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. పరిసరాల్లో సీసీ పుటేజిని పరిశీలించారు. బెంగళూరు, హైదరాబాద్కు ప్రత్యేక బృందాలు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిల కోసం బెంగళూరు, హెదరాబాద్కు ప్రత్యేక బృందాలను పంపి గాలిస్తున్నారు. మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను, ఓ కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అతని నుంచి కీలక సమాచారాన్ని సిట్ పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ బృందం సైతం మాజీ సీఐ నాగ రాజుతో పాటు, ఈ ముగ్గురే కేసులో భాగస్వామ్యమయ్యారు అనే రీతిలో ఆధారాలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ నలుగురిపైనే కేసు పెట్టి, మిగతా సూత్రధారులను, పాత్రధారులను సురక్షితంగా తప్పించే విధంగా సిట్ దర్యాప్తు సాగుతోంది. సాంకేతిక ఆధారాల సేకరణపై.. శవాన్ని ఎలా మాయం చేశారనే డిక్లరేషన్ను ఈ నెల 29 తేదీ హైకోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కోర్టుకు ఏ విధమైన నివేదిక సమర్పించాల్సి, అందుకోసం అవసరమైన సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించే దిశగా సిట్ ప్రయత్నిస్తోంది. మే 6వ తేదీ మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చినట్లు పోలీసులు స్పష్టత ఇచ్చారు. లాకప్లో ఉండగా ఓ ఎస్ఐ చూశారని, బాధితుడి తల్లి విజయలక్ష్మి మా అబ్బాయిని కొడుతుంటే కేకలు వినిపించాయని, రెండు కాళ్లు కట్టి పడేయటం చూశానని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సిట్ బృందం సాయికృష్ణ లాకప్డెత్ అయ్యారని స్పష్టత ఇచ్చారు. మిస్టరీ వీడే దిశగా కొనసాగని సిట్ దర్యాప్తు శవాన్ని ఎలా మాయం చేశారు.. సాయికృష్ణను ఎందుకు తెచ్చారనే మిస్టరీ వీడే దిశగా మాత్రం సిట్ దర్యాప్తు సాగడం లేదు. తూతూ మంత్రంగా కంటి తుడుపు దర్యాప్తుతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేస్తోంది. సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మాజీ సీఐ సీఐ నాగరాజుతో పాటు, పలువురి ప్రభుత్వ, పోలీసు పెద్దల హస్తం ఉండటంతో, నాగరాజుకే పరిమితం చేసి, వీరిందని పక్కాప్రణాళికతో కరకట్ట ప్యాలెస్ కనుసన్నల్లో తప్పించే కుట్ర సాగుతుందనేది స్పష్టం అవుతోంది. క్రాంతికుమార్ కేసుపై దర్యాప్తు.. మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సత్యానందంను నియమించారు. ఆయన శనివారం సాయంత్రం పేరుపోగు క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి. అతని తండ్రి, భార్య, కుటుంబసభ్యులను విచారణ చేశారు. ఆత్మహత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు రావాలని క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును కోరారు. దళిత సంఘాలు, న్యాయవాదుల సలహా తీసుకొని పోలీసు విచారణకు వెళ్లనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రాంతికుమార్తో సన్నిహితంగా మెలిగిన, సస్పెండ్ అయిన ఓ కానిస్టేబుల్ను కూడా విచారణ చేసినట్లు సమాచారం. కరకట్ట ప్యాలెస్ కనుసన్నల్లో సాగుతున్న దర్యాప్తును, ఏకంగా పోలీసు బాసే పర్యవేక్షిస్తూ, కేసును నీరుగార్చే కుట్రకు తెరలేపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే మాజీ సీఐ నాగరాజుపై కేసు నమోదు అయిన వెంటనే ఆయన పారిపోకుండా సర్వెలెన్స్ పోలీసులను ఏర్పాటు చేశారు. అయితే కీలకంగా నాగరాజుకు సహకరించింది కానిస్టేబుల్స్ ఇద్దరే అని, వీరితో పాటు మరికొంత మంది పాత్ర ఉందని బాధితుడి తల్లి విజయలక్ష్మి, బంధువులు ఫిర్యాదు చేశారు. అయినా వీరిపై మాత్రం పోలీసులు నిఘా పెట్టలేదు. పోలీసుబాస్లే వీరిని బయటికి పంపించారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజాలు వెలుగులోకి రాకుండా వారి ఇద్దరిని పోలీసు పెద్దలే అజ్ఞాతంలోకి పంపి డ్రామా ఆడుతున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. వీరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే, అసలు నిజాలు వెలుగులోకి వస్తాయనే భావనతో, పోలీసు పెద్దలే ఈ డ్రామాకు తెరలేపారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకోవడం పెద్ద కష్టం కాకపోయినా, కేసును సాగదీసి, కాలయాపన చేసే విధంగా దర్యాప్తు సాగుతోంది. పోలీసు పెద్దలను తప్పించి, చిన్న చేపలకు గాలం వేసి పట్టుకొని మమ అని పించే రీతిలో సిట్ దర్యాప్తు చేస్తోందనే భావన పలువురిలో వ్యక్తం అవుతోంది. -
సబ్జైలును సందర్శించిన జిల్లా జడ్జి
గన్నవరం: స్థానిక సబ్జైలును శనివారం జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.గోపి సందర్శించారు. సబ్జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సదుపాయాలను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.వరలక్ష్మితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి గోపి మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సబ్జైలును సందర్శించినట్లు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా సబ్ జైలులో ఖైదీలకు వసతులను కల్పించడంతో పాటు అవసరమైన వైద్య సేవలందించాలని తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్.గాయత్రి, జైలు సూపరింటెండెంట్ బి.రాంబాబు, జైలు విజిటింగ్ లాయర్ ఎల్.భగీరథి, పలువురు కోర్టు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ రూరల్: పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగితే చర్యలు తీసుకోవచ్చని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ అన్నారు. విజయవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం ఉమ్మడి కృష్ణా జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గత 6 నెలలుగా గ్రామ పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి మాడ్యుల్స్ ఇవ్వకపోవడంతో డీజల్ హెడ్లోనే పాత బకాయిలకు సంబంధించిన బిల్లులను పంచాయతీ అభివృద్ధి అధికారులు డ్రా చేశారన్నారు. ఎక్కడైనా నిధుల దుర్వినియోగం జరిగితే.. అందరిపై బురద చల్లడం సరికాదన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి.శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.బసవలింగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు జి.నరసింహరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గంగూరు కార్యదర్శి ప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ఆన్లైన్లో కొనసాగుతోంది. ఈ ప్రక్రియను ఏపీ సాంకేతిక విద్యాశాఖ మొదటి సారిగా ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో చేపట్టింది. దీని కోసం నగరంలో మూడు హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఆన్లైన్లో ఫీజు చెల్లించిన వెంటనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తైనట్లుగా ఆన్లైన్లోనే సందేశం వస్తోంది. అలా రాని వారు మాత్రమే పాలిసెట్ కౌన్సెలింగ్ హెల్ప్లైన్ సెంటర్కు స్వయంగా వచ్చి వారి సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకోవాలి. నగరంలోని రమేష్ ఆస్ప రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాల, గుణదలలోని ఆంధ్రా లయోల కాలేజీ, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ఆవరణలో హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇది పూర్తయిన వారికి మాత్రమే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ల ఎంపికకు అర్హత ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయిన వారు ఈ నెల 29 నుంచి జూలై 3 తేదీ లోపు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారఽథి చెప్పారు. జూలై 4వ తేదీ.. నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని, 6న సీట్ల కేటాయింపును ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. జూలె 7 నుంచి 10వ తేదీలోగా సీటు కేటాయించిన కళాశాలకు అభ్యర్థులు స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన తెలియజేశారు. -
తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దు..
స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువున్న పిల్లవాడు 3 కిలోలకు మించి బరువు మోయడం మంచిది కాదు. రెండు భుజాలపై వేసుకునే బ్యాగ్ మాత్రమే ఉపయోగించాలి. బ్యాగ్ రెండు పట్టీలను సమానంగా బిగించి వీపుకు దగ్గరగా ఉంచాలి. బరువైన పుస్తకాలను బ్యాగ్లో వీపుకు దగ్గరగా అమర్చాలి. అవసరం లేని పుస్తకాలు, వస్తువులు రోజూ బ్యాగ్లో పెట్టకుండా పాఠశాలల్లో లాకర్ లేదా తరగతి గదిలో ఉంచే సదుపాయం ఉంటే ఉపయోగించాలి. పిల్లలు రోజూ కనీసం గంటసేపు ఆరుబయట ఆటలు, శారీరక వ్యాయామం చేయాలి. పిల్లలు తరచుగా వెన్నునొప్పి, మెడనొప్పి లేదా భుజాల నొప్పి గురించి చెబితే త ల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించాలి. -
కనకదుర్గ వారధిపై ఇంజిన్ ఆయిల్ లీక్
కృష్ణలంక(విజయవాడతూర్పు): కనకదుర్గ వారధిపై శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి విజయవాడ వస్తున్న గుర్తు తెలియని వాహనం నుంచి ఇంజిన్ ఆయిల్ లీకై ప్రమాదకరంగా మారింది. ఆయిల్ మీదుగా ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తుండడంతో టైర్లు స్క్రిడ్ అయి ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు నెమ్మదిగా వెళ్తుండడంతో వారధిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఐదో ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లీకై న ఆయిల్పై ఇసుక చల్లారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. హోం మంత్రి అనిత భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశాభివృద్ధికి యువశక్తే పెట్టుబడి అని, అటువంటి యువత డ్రగ్స్ బారినపడి నిర్వీర్యమైపోవడం బాధాకరమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నేటి తరం పిల్లలు ఎంతో చురుగ్గా ఉన్నా అవగాహన లోపంతో డ్రగ్స్ బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ రవాణా చేసినా, దగ్గర ఉంచుకున్నా, వినియోగించినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి, ఈగల్ వింగ్ ఎస్పీ నగేష్ కుమార్, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ సంస్థ రాష్ట్ర సమన్వయ అధికారి ఉమారాణి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ఎల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు సంస్కారం, నైతిక విలువలు అలవర్చుకోవాలి ఆత్కూరు(గన్నవరం): చదువుతో పాటు మంచి సంస్కారం, నైతిక విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి వంటి లక్షణాలను ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో వృత్తి విద్య కోర్సులో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన శుక్రవారం ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...విద్య ఉద్యోగానికే కాకుండా సమాజ వికాసానికి దోహదపడేదిగా ఉండాలని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించే బాధ్యతను విద్యార్థులు గుర్తుంచుకోవాలని తెలిపారు. వృత్తి విద్య యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేలా ఆత్మవిశ్వాస్వాన్ని పెంపొందిస్తుందన్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న వృత్తి విద్య కోర్సులను యువతీ, యువకులు సద్వినియోగం చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ట్రస్ట్ ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
● పిల్లల బరువులో బ్యాగు బరువు 10 శాతానికి మించరాదంటున్న వైద్య నిపుణులు
● బుడిబుడి అడుగుల వయసులోనే వీపున బండెడు పుస్తకాల భారం మోస్తున్న బుడతలు లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన సిద్దు ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తరచూ వెన్నునొప్పి అని చెప్పి స్కూల్కు డుమ్మా కొడుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లవాడు బడి ఎగ్గొట్టి ఇంటి వద్ద ఆడుకోవటానికి వంక చెబుతున్నాడని భావించారు. రోజూ ఇదే సమస్య చెబుతుండటంతో ఇటీవల వైద్యుడ్ని సంప్రదించారు. పరీక్షించిన అనంతరం వెన్నెముకకు ఇబ్బంది ఏర్పడటమే నొప్పికి కారణమని నిర్ధారించారు. స్కూల్లో, ఇంట్లో ఏసీ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ శరీరానికి ఎండ తగలక విటమిన్ డి లోపం ఏర్పడి ఇలాంటి సమస్యలు వస్తున్నట్టు తేల్చారు. సిద్దులాగే విద్యార్థులు తన శరీర బరువు కంటే అధిక మొత్తంలో బ్యాగ్ బరువు మోస్తూ ఉండటం.. వెన్నెముకపై అధికభారం పడటం వల్ల పిల్లల్లో ఈ సమస్యలు వస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. గదుల్లోనే మగ్గుతున్న బాల్యం.. ఆడుతూ పాడుతూ సరదాగా సాగాల్సిన బాల్యం పోటీ ప్రపంచంలో పుస్తకాల మోత బరువుతో పాఠశాల గదుల్లోనే మగ్గిపోతోంది. పలక బలపం పట్టుకుని బడికెళ్లే బాల్యం నేడు మచ్చుకై నా కనిపించటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కాన్వెంట్ స్కూల్స్పై మోజు పెరిగిపోయి బుడిబుడి అడుగులు వేసే బుడతలకు బండెడు పుస్తకాలు మూటగట్టి వీపున వేస్తున్నారు. నర్సరీ ఎల్కేజీ చదువుతున్న చిన్నారులకే డ్రాయింగ్ బుక్స్, హోంవర్క్ పుస్తకాలు, ఇతర పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు 20 నుంచి 30 వరకు పుస్తకాలు ఇస్తున్నారు. ఫలితంగా చిన్న వయస్సులోనే పిల్లలు వెన్ను సమస్యల బారిన పడుతున్నారు. లేత వెన్నుపై అధిక భారం మోపటం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో వచ్చే సమస్యలు ఇవే.. స్కూల్కు వెళ్లే పిల్లలు ఎక్కువ సేపు స్కూల్స్ బ్యాగ్స్ మోయటం, ఎక్కువ సేపు ఒకే భంగిమలో స్కూల్స్లో, ట్యూషన్ సెంటర్స్లో కూర్చోవటం వల్ల నడుము నొప్పి వస్తుంది. కొంత మంది పిల్లల్లో పుట్టుకతోనే ఎముకలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం వల్ల స్పయిన్ ఫ్యూజన్ వంటి సమస్యలొస్తాయి. స్కోలియోసిస్ వచ్చిన వారిలో వెన్నుముక సీ లేదా ఎస్ ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. ఫలితంగా భుజాలు లేదా నడుం భాగం అసమానంగా ఉంటుంది. కై ఫోసిస్ వల్ల పిల్లలు ముందుకు గుండ్రంగా వంగి కూర్చునట్లు కనిపిస్తారు. వెన్నునొప్పి లక్షణాలు.. నడకలో తేడా కనిపిస్తుంది. నిలబడటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా పిల్లలు అలసిపోతారు. నడుము లేదా మెడనొప్పి ఉంటుంది. వెన్నెముక భాగం వంకరగా కనిపిస్తుంది. వెనుక భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిపాటి లేదా విపరీతమైన నొప్పి వెన్ను భాగంలో వస్తుంది. రాత్రి వేళల్లో నొప్పి వల్ల పిల్లలు సరిగా నిద్రపోరు. జ్వరంగా ఉంటుంది. ఆటలు ఆడేందుకు సైతం ఇబ్బంది పడతారు. -
అక్రమార్జన కోసం దిగజారుడు రాజకీయాలు
పెనమలూరు: స్వార్థ రాజకీయాలు, అక్రమార్జన కోసం ఎమ్మెల్యే బోడెప్రసాద్ వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని, వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి విమర్శించారు. దీనికోసం కార్యకర్తలను బలి చేస్తున్నాడని, తాను దీనిని సమర్థవంతంగా అడ్డుకుంటానని చెప్పారు. కానూరులో పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రసాద్ అక్రమార్జన కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే మాయలో పడి కేసులు పెట్టించుకోవద్దని హితవు చెప్పారు. తాము టీడీపీ కార్యకర్తలతో గొడవలు పడటానికి ఇష్టపడనన్నారు. అయితే ఎమ్మెల్యే మాటలు విని ఎవరైన దాడులకు దిగితే ప్రతిదాడులు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి పనుల్లో భారీ అవినీతి.. ఎమ్మెల్యే అవినీతి అక్రమాలను తాను అడ్డుకుంటున్నాననే అక్కసుతో అమాయక కార్యకర్తలతో కలిసి దాడులకు దిగుతున్నాడని చక్రవర్తి విమర్శించారు. అవినీతి, దందాలపై తాము ప్రశ్నిస్తే ఎమ్మెల్యే నుంచి జవాబులేదన్నారు. కానూరులో జరిగిన అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. టెండర్లు, టెక్నికల్ సాంక్షన్, పరిపాలన మంజూరు లేకుండానే అక్రమార్జన కోసం పనులు చేశారన్నారు. ఇలా చట్ట విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే తాను అభివృద్ధిని అడ్డుకుంటున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఖండించారు. ఎటువంటి పరిపాలన, సాంకేతిక ఆమోదం లేకుండా అభివృద్ధి పనులు చేయవచ్చని ఇంజినీరింగ్ శాఖ అధికారులతో ప్రకటన చేయిస్తే తాను రాజకీయాలు విరమించుకుంటానని సవాల్ విసిరారు. పాస్పోర్టు ఉంటేనే ప్రయాణం చేయాలా..? తాను విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి పై ప్రయాణం చేయాలంటే పాస్పోర్టుతో ఎమ్మెల్యే ప్రసాద్ అనుమతి తీసుకోవాలా అని చక్రవర్తి ప్రశ్నించారు. పోలీసు వాహనంపై అల్లరి మూకలు దాడులు చేస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కానూరులో టీడీపీ దిమ్మను తాను ధ్వంసం చేయమని చెప్పానని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాడిగడప వద్ద వైఎస్సార్ విగ్రహం ఎలా తొలగించారని ప్రశ్నించారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని సమయం వచ్చినప్పుడు సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నేతలు వేమూరి బాలకృష్ణ, ప్రతివాడ రాఘవరావు, సిద్దిక్, మండూరు కోటేశ్వరరావు, నందిపాటి బిందుమాధవి, కాసాని ఫణి, తోకల ఉమాదేవి పలువురు పాల్గొన్నారు. -
29న దుర్గమ్మ సన్నిధిలో గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు వైదిక కమిటీ నిర్ణయించింది. 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. ప్రత్యేక పూలవాహనంపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు, దేవస్థాన ప్రచార రథంపై మూర్తులతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఘాట్రోడ్డు వద్ద ఆలయ అర్చకులు, ఈవోలు పూజా కార్యక్రమాలను నిర్వహించి ఊరేగింపు ప్రారంభిస్తారు. కుమ్మరిపాలెం, నాలుగు స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, నెహ్రూబొమ్మ సెంటర్, బ్రహ్మణ వీధి మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణలో భక్తులు, సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొననున్నారు. 4న ట్రస్ట్ బోర్డు సమావేశం... శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం జూలై 4వ తేదీన బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలో నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో ఆషాఢ సారె ఉత్సవాలు, శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాల నేపధ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. -
సరుకు రవాణాలో విజయవాడ డివిజన్ కీలకం
డీఆర్ఎం మోహిత్ సోనాకియారైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): సరుకు రవాణా భాగస్వామ్యాలను బలోపేతం చేసే దిశగా సౌత్ కోస్ట్ రైల్వే విజయవాడ డివిజన్ శుక్రవారం వ్యాపారవేత్తలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న డీఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ బలమైన పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంపొందించడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, సరుకు రవాణా పరిధిని విస్తరించేందుకు ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సౌత్కోస్ట్ రైల్వే వ్యాప్తంగా సరుకు రవాణాలో విజయవాడ డివిజన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. డివిజన్ వ్యాప్తంగా 24 ప్రైవేటు స్లైడింగ్లు, టెర్మినల్స్, 29 సరుకు రవాణా గూడ్స్ షెడ్ల విసృత నెట్వర్కు ద్వారా బొగ్గు, ఎరువులు, సిమెంట్, ఆహార ధాన్యాలు, ఇనుప ఖనిజం, అల్యూమినియం, పీఎల్ఓ, లాటరైట్ వంటి కీలక వస్తువులను రవాణా చేస్తుందన్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో డివిజన్ 40.64 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ. 4,136 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు తెలిపారు. తద్వారా పారిశ్రామిక ఆర్ధిక వృద్ధికి తోడ్పడటానికి డివిజన్ కీలకంగా మారిందన్నారు. నూతన ఆవిష్కరణలు, బలమైన పభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల ద్వారా మాత్రమే నిరంతర సరుకు రవాణా వృద్ధిని సాధించగలమని తెలిపారు. సరుకు రవాణా మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైల్వేలకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్కుమార్, సీసీఎం డి.సత్యనారాయణ, సరుకు రవాణా వినియోగదారులు పాల్గొన్నారు. -
నేడు డాక్టర్ పూర్ణచందుకు నాగ భైరవ సాహిత్య పురస్కారం
విజయవాడ కల్చరల్: శతాధిక గ్రంథకర్త, కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు 2026 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మకమైన నాగభైరవ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. గుంటూరులోని వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే సభలో ఆయనకు పురస్కారం ప్రదానం చేయనున్నారు. డాక్టర్ పూర్ణచందు మినీ కవితను ఉద్యమంలో ప్రజలలోకి తీసుకొని వెళ్లారు. ఆయన 120 పైగా వైద్య, సాహిత్య సంబంధించిన గ్రంథాలను రచించి ప్రచురించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం వ్యవస్థ్ధాపకుడిగా ఐదు సార్లు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను విజయవంతంగా నిర్వహించారు. తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. సాహిత్య సవ్యసాచి అటు సాహిత్య గ్రంథాలతోపాటు ఆయుర్వేద గ్రంథాలను ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉగాది, కళారత్న పురస్కాలతో సత్కరించింది. జీవీ పూర్ణచందు పురస్కారం అందుకుంటున్న సందర్భాన్ని పురస్కారించుకొని అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్, సాహితీవేత్తలు గుత్తికొండ సుబ్బారావు, డాక్టర్ గుమ్మాసాంబశివరావు, చలపాక ప్రకాష్లు అభినందించారు. -
మేత కరువై.. పాడి బరువై
పచ్చిక మైదానాలు గత జ్ఞాపకాలే రోజురోజుకూ తగ్గుతున్న పశుసంపద పాల ఉత్పత్తిపైనా ప్రభావం –పిన్నెంటి పూర్ణచంద్రరావు, పాలసొసైటీ అధ్యక్షులు, గాంధీనగరం పల్లెటూరి జీవన విధానంలో పంటలతో పాటు పాడి పరిశ్రమ కూడా ఒక భాగం. రైతుకు ఒక కన్ను వ్యవసాయమైతే రెండో కన్ను పాడిపరిశ్రమ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే పాడి పరిశ్రమ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోతోంది. పశువులకు కడుపునిండా మేత దొరకని పరిస్థితి ఎదురవుతోంది. వాటిని సాకలేక.. పోషణ భారమై.. పాడి రైతులు వారి జీవనాధారమైన మూగజీవాలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. –జన్యావుల వెంకన్న, పాడిరైతు, గాంధీనగరం -
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
5న కృష్ణవేణి కవితోత్సవం మధురానగర్(విజయవాడసెంట్రల్): తెలుగు భాషా సాహిత్యాల ఔన్నత్యాన్ని పెంపొందింపజేయాలనే సంకల్పంతో జూలై 5వ తేదీన సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త నిర్వహణలో 169వ అఖిల భారత ద్విశతాధిక కవి సమ్మేళనాన్ని ‘కృష్ణవేణి కవితోత్సవం’ పేరుతో నిర్వహించనున్నట్లు శ్రీశ్రీ కళావేదిక ఎన్టీఆర్ జిల్లా గౌరవాధ్యక్షుడు, నిర్వహణ కమిటీ కన్వీనర్ డాక్టర్ కేఆర్జీ శేషుకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రిజిస్టర్ అయిన వారిలో ఎంపిక చేసిన సుమారు 250 మంది తెలుగు కవులు ద్విశతాధిక కవిసమ్మేళనంలో పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో తెలుగు భాషా సాహిత్యాలకు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ప్రముఖులను ‘అక్షర రత్న’ పురస్కారాలతో ఘనంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు. యాప్తో ఎరువుల విక్రయంలో ఇబ్బందులు మచిలీపట్నంటౌన్: రైతులకు యాప్ ద్వారా ఎరువుల విక్రయాలకు వ్యతిరేకంగా రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే), సచివాలయాలు, మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. మచిలీపట్నంలోని జ్యోతిబా పూలే విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఏపీ రైతు, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.శివనాగేంద్రం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏపీ రైతు సంఘం సీనియర్ నేత వై.కేశవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తీసుకు వచ్చిన యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు విధానంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ మాట్లాడుతూ యాప్ విధానంతో క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సంఘం ఆధ్వర్యాన ఈనెల 30న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, జగన్, పి.జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా భాగస్వామ్యంతో డ్రగ్స్ నిర్మూలన
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా భాగస్వామ్యంతో డ్రగ్స్ను నిర్మూలిద్దామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయ వాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి (ఓల్డ్ జీజీహెచ్) వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వారందరూ ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదాలు చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా పని చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయో వృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ ఏపీ లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈగల్ ఏపీ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 వేలకుపైగా ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూనిట్ చైర్మన్ సమరం, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, ఎన్ఎస్ఎస్, ఎన్ సీ సీ అధికారులు, విద్యార్థులు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
రుధిర తర్పణం..!
మచిలీపట్నంటౌన్: నగరంలోని చారిత్రక కోనేరుసెంటర్ శుక్రవారం ముస్లింలు భక్తి భావంతో చిందించిన రక్తంతో తడిసి ముద్దయింది. మొహర్రం దుఃఖ దినాల సందర్భంగా కోనేరు సెంటర్లో ముస్లింలు రక్త తర్పణం చేశారు. ప్రవక్త మహమ్మద్ మనవడైన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ ఆయన అనుచరులు కర్బలా మైదానంలో జరిగిన యుద్ధంలో వారు చేసిన సర్వోన్నత త్యాగాలను స్మరిస్తూ.. మచిలీపట్నంలో ముస్లింలు మొహర్రం దుఃఖ దినాల్లో భాగంగా 11వ రోజును భక్తిశ్రద్ధలతో, శోకతప్త హృదయాలతో రక్త తర్పణ నిర్వహించారు. ఇమామ్ హుస్సేన్ అమరత్వానికి ప్రతీకగా షియా సమాజ ముస్లింలు నల్లటి వస్త్రాలు ధరించి పాల్గొన్నారు. వారి కుటుంబీకులు ఓ వైపు రుధిర తర్పణ చేస్తుంటే మహిళలు, చిన్నారులు సైతం శోక గీతాలకు అనుగుణంగా మాతం చేస్తూ భక్తిని చాటు కున్నారు. మసీదుల్లో, కోనేరు సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలే కాకుండా పలు రాజకీయ పార్టీల నేతలు ఇతర మతాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లింలకు నేతలు, స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, నిమ్మరసం, తాగునీరు పంపిణీ చేసి మతసామరస్యాన్ని చాటారు. అలీనఖీపాలెంలో పమడిముక్కల: మొహర్రం సందర్బంగా అలీనఖీపాలెంలోని రెండు మసీదుల్లో వేర్వేరుగా షియా ముస్లింలు చెస్ట్బీటింగ్ చేశారు. రక్తం చిందించి కర్బలా అమర అమరవీరులకు నివాళుల ర్పించారు. తొలుత గ్రామంలో పీర్లను ఊరేగించి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వీరంకిలాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలందించారు.మొహర్రం సందర్భంగా ముస్లింల చెస్ట్ బీటింగ్ -
రైతుకు కన్నీరు!
ఒకప్పుడు పచ్చని పైర్లతో కళకళలాడే చేలతో అన్నపూర్ణగా విలసిల్లిన పంట పొలాలు.. నేడు క్వారీల నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి పొరల కింద ఊపిరాడక విలవిలలాడుతున్నాయి. క్వారీల నుంచి ఎగసిపడే తెల్లని ధూళి మేఘాలు పంటలపై పేరుకుపోవడంతో దిగుబడి తగ్గిపోతోంది. ఫలితంగా కంచికచర్ల సమీపంలోని దొనకొండ రాతి క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడే ధూళితో సారవంతమైన భూములు సైతం జీవం కోల్పోయి గుండె కోత మిగిల్చే బీడు భూములుగా మారుతున్నాయి. ఈ ఇబ్బందులపై రైతులు ఆందోళన చెందుతుంటే పాలకుల అండతో క్వారీల యజమానులు వీరిని బెదిరిస్తున్నారు. క్వారీల దుమ్ము.. క్వారీల నుంచి లారీలతో కంకరను తరలిస్తున్న సమయంలో పంట పొలాల్లోకి ఎగిసిపడుతున్న దుమ్ము, ధూళి.... కంచికచర్ల: క్వారీల నుంచి వచ్చే దుమ్ము, ధూళి రైతుకు కన్నీరు తెప్పిస్తోంది. కంచికచర్ల సమీపంలో జాతీయ రహదారి పక్కన దొనబండ రాతి క్వారీలు, క్రషర్ల నుంచి వెలువడే దుమ్ము ధూళి కారణంగా రెండు పంటలు పండే పంట పొలాలన్నీ బీడు భూములుగా మారుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు సమయంలో సాగర్ కాల్వను పూడ్చటంతో పంటలకు మూలపాడు మేజర్ కెనాల్ ద్వారా సాగునీరు అందక ఎండుతున్నాయి. తమ పొలాలను అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో కొనుగోలు చేద్దామనుకుంటే క్రషర్ యజమానులు వాటిని విక్రయించవద్దని బెదిరిస్తున్నారు. తమ కుటుంబాలను ఏ విధంగా సాకాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 83 రాతి క్వారీలు.. 22 క్రషర్లు కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ సమీపంలో 801 సర్వే నంబర్లో 83కు పైగా రాతి క్వారీలు, 22 క్రషర్లు ఉన్నాయి. వీటి సమీపంలో సుమారు 450 ఎకరాలు రెండు పంటలు పండే పంట భూములున్నాయి. వీటిలో రైతులు సాగు చేద్దామన్నా భూములు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. నిత్యం వందల సంఖ్యలో లారీలకు భారీగా లోడింగ్ చేసి కంకర, మట్టి, పెద్ద పెద్ద కంకరను తరలిస్తున్నారు. దీంతో పంట పొలాల్లోకి కాలుష్యం నిరంతరం వెదజల్లుతోంది. బ్లాస్టింగ్ ద్వారా పొలాల్లోకి వస్తున్న బండరాళ్లు రాతి క్వారీలో నాణ్యతలేని నాసిరకం పేలుడు పదార్థాలను బ్లాస్టింగ్ సమయంలో వాడటంతో అవి పెద్ద పెద్ద శబ్దంతో పేలుళ్లు వినిపిస్తున్నాయి. అనుభవం లేని కార్మికులతో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఆ బండరాళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పడుతున్నాయి. అదే సమయంలో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలకు తీవ్రగాయాలైన సంఘటనలు ఉన్నాయి. నాణ్యత, మన్నిక లేని నాసిరకం పేలుడు పదార్థాలు గాతాల్లో పెట్టి రాళ్లను పేల్చుతున్నారు. వాటి ధాటికి ఇంటి గోడలు పెచ్చులూడి పడుతున్నాయి. -
భూములను క్రషర్ల యజమానులకే ఇవ్వాలని బెదిరింపులు.
తమ పంట పొలాలను తక్కువ ధరకు ఇవ్వాలని లేకపోతే ఇతరులకు ఎవ్వరికీ విక్రయించినా ఊరుకునేది లేదని క్వారీల కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని రైతులు అంటున్నారు. పాలకుల అండతో వీరు చెలరేగిపోతున్నారని వాపోతున్నారు. రాజధానికి అతి సమీపంలో ఉన్న తమ పొలాలు బయట మార్కెట్లో ఎకరం భూమి రూ. 2.20 కోట్ల వరకు కొనుగోలు జరుగుతున్నాయని, క్వారీ నిర్వాహకులు కేవలం ఎకరం భూమిని రూ.60 లక్షలకే ఇవ్వాలని బెదిరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ భూముల్లో దుమ్ము ధూళి రాకుండా చర్యలు తీసుకోవాలని పరిటాల, నక్కలంపేట, దొన బండ రైతులు అధికారులను కోరుతున్నారు. -
సాయికృష్ణ లాకప్డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
ఢిల్లీ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయ్యింది. పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కు ఎన్హెబ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా ఘటనపై యాక్షన్ టేకెన్ రిపోర్టు పంపాలని ఆదేశించింది సిట్ దర్యాప్తు వివరాలు, పోలీసులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.పోలీసు స్టేషన్లో డిలీట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేయాలి. గాదె సాయి కృష్ణ అస్థికలను కనుగొనాలి. సాయికృష్ణ తల్లికి రక్షణ కల్పించాలి. ఈ ఘటనలో సాక్షులను కాపాడాలి. బాధితులకు ఇచ్చిన మధ్యంతర నష్టపరిహారం సహాయం వివరాలను అందజేయాలి’’ ఎన్హెచ్ఆర్సీ కోరింది. తదుపరి విచారణ వారం తర్వాత చేపడతామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. -
క్రాంతికుమార్ది ప్రభుత్వ హత్యే
మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కృష్ణలంక(విజయవాడ తూర్పు): కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. గురువారం వారు పేరుపోగు క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరావును పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఐ నాగరాజు అరాచకాలకు క్రాంతికుమార్ బలవడం బాధాకరమన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అన్నారు. సీఐ నాగరాజుతో పాటు ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వ గెలుపు కోసం పని చేసిన పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబం పట్ల మరణించిన క్రాంతి కుమార్ ఆత్మహత్య విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గాదె సాయికృష్ణ కేసు విషయంలో సీఎం చంద్రబాబు ఏ విధంగా అయితే న్యాయం చేశారో అలాగే క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించి సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఘటన జరిగి 30 రోజులు దాటినా ఈ కేసులో పురోగతి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. -
నవ్విపోదురు గాక!
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026ఒకటే చెత్త లారీకి రెండు సార్లు ప్రారంభోత్సవాలుఆటోనగర్(విజయవాడతూర్పు): ఐలా అధికారులు ఒకే లారీకి రెండుసార్లు ప్రారంభోత్సవాలు నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. గతేడాది నవంబర్ మొదటి వారంలో ఓ కంపాక్టర్ చెత్త లారీని తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్, ఐలా కమిషనర్ బాబ్జి ప్రారంభించారు. ఈ చెత్తలారీ (కంపాక్టర్)ను జమాక్ ముందున్న ఏపీఐఐసీ ఖాళీస్థలంలో ఎనిమిది నెలలపాటు ఉంచారు. మరలా ఇదే చెత్త లారీని స్వచ్ఛాంధ్ర చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి చేత గురువారం ఆటోనగర్ గుంటతిప్ప వద్ద పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇలా ఒకే లారీని రెండుసార్లు ప్రారంభించడంపై ఇదేమి చోద్యమంటూ స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు అడ్మిషన్ల కౌన్సెలింగ్లో భాగంగా పాలిసెట్–2026 ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన వారి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది. పాలిసెట్ రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈ ఏడాది నుంచి ఆన్లైన్లోనే పరిశీలించి ధ్రువీకరిస్తామని పాలిసెట్–2026 ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.విజయసారధి చెప్పారు. ఆన్లైన్లో ఫీజు చెల్లించిన వెంటనే ఆన్లైన్లోనే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి అయినట్లుగా మెసేజ్ వస్తుందని, ఆన్లైన్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కాని వారు మాత్రం హెల్ప్లైన్ సెంటర్కు స్వయంగా సర్టిఫికెట్లతో వచ్చి ధ్రువీకరించుకోవాలని చెప్పారు. హెల్ప్లైన్ సెంటర్ వెరిఫికేషన్ ఆఫీసర్ జీవీ ఈశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వ్యవసాయం, దాని అనుబంధ రంగాల రైతులకు సుస్థిర ఆదాయం లభించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యానపంటలు దిశగా వెళ్లడంతో పాటు పంటల మార్పిడిపై మండలాల వారీగా ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, తెలిపారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయం, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం–కిసాన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన తదితర కేంద్ర, రాష్ట్ర అనుసంధాన పథకాల అమలు తీరుపై సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలామృతం ప్లస్ పోస్టర్లను ఆవిష్కరించి.. బాలామృతం కిట్లను అందజేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, జెడ్పీ సీఈఓ జె. అరుణ, టాటా ట్రస్టుల జిల్లా ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన అంబటి జయవేంకట చలపతి, వెంకటలక్ష్మి దంపతులు రూ.5 లక్షల విరాళాన్ని గురువారం సమర్పించారు. ఈ మేరకు చెక్కును ఈవో నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. ఏటా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల పేరు మీద అన్నదానం చేయాలని ఆమె కోరారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్–2026ను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. అదే రోజున యువతకు మెగా మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ఆర్టీఐహెచ్–విజయవాడ సీఈవో జి.కృష్ణన్, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.దుర్గా ప్రసాద్, జేఆర్డీ టాటా ఐలా చైర్మన్ టి.వినోద్బాబు, ప్రకాస స్పెక్ట్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ టి.పార్థసారథి, జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధుతో కలిసి ఎంఎస్ఎంఈ మహోత్సవ్ పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) రాష్ట్ర, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. -
జోగి రమేష్ స్టేట్మెంట్ రికార్డు చేసిన డీఎస్పీ
ఇబ్రహీంపట్నం: మామిళ్లపల్లిలో జరిగిన సంఘటనపై మాజీ మంత్రి జోగి రమేష్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు చేసిన ఫిర్యాదు మేరకు తెనాలి డీఎస్పీ జనార్ధనరావు బృందం గురువారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. ఎన్హెచ్ఆర్సి ఆదేశాల మేరకు బుధవారం హాజరుకావల్సిన డీఎస్పీ గైర్హాజరయ్యారు. ఈనేపథ్యంలో వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గం సమన్వకర్త అంబటి మురళీకృష్ణ మరళా ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని ప్రకటించారు. దీంతో గురువారం జోగి రమేష్ ఇంటికి డీఎస్పీ చేరుకుని ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. మేనెల 18న పొన్నూరు నియోజకవర్గం, మామిళ్ళపల్లిలో మొక్కజొన్న రైతును పరామర్శించడానికి వెళ్ళిన జోగి రమేష్, పలువురు రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన పోలీసుల తీరు, బలవంతంగా అరెస్ట్ చేసిన అంశాన్ని జోగి రమేష్ లిఖిత పూర్వకంగా అందజేశారు. అప్పట్లో ఆయనపై జరిగిన దాడి, దుర్భాషలకు చెందిన ఫొటోలు క్లిప్పింగ్లు ఫైల్, వీడియోల పెన్డ్రైవ్ను ఇచ్చారు. విచారణలో పాల్గొని స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా జోగి రమేష్కు విచారణ పత్రాల సెట్టును అందించిన పోలీసులు తిరిగి వెళ్లారు. -
పోరంకిలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జి దేవభక్తుని చక్రవర్తిపై దారికాచి దాడికి యత్నించారు. నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడకు చక్రవర్తి వస్తుండగా.. పోరంకి వద్ద భారీగా మోహరించిన టీడీపీ గూండాలు.. చక్రవర్తి కారును అడ్డుకున్నారు. టీడీపీ గూండాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూశారు.టీడీపీ గూండాలు చుట్టుముట్టడంతో కారు దిగిన చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చక్రవర్తిని తరలిస్తున్న పోలీసు వ్యాన్పై టీడీపీ గూండాలు దాడి చేశారు. పచ్చిబూతులతో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. -
రామాయపట్నం పోర్ట్ ప్రైవేటుపరం
విజయవాడ: ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని భావించిన ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేయడానికి కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకోవడమే కాకుండా జీవో సైతం జారీ చేశారు. DBFOT పద్దతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయించారు. పోర్ట్ ఆపరేటర్ ఎంపికకు ఆర్ఎఫ్పిని పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పోర్ట్ అభివృద్ధి, ఆపరేషన్స్, నిర్వహణ అప్పగించడానికి సన్నద్ధమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే రామాయపట్నం పోర్ట్ నిర్మాణం చేపట్టారు. సుమారు రూ. 4,929 కోట్లతో నిర్మాణం చేపట్టింది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వైఎస్ జగన్ హయాంలోనే 90 శాతంపైగా పోర్ట్ నిర్మాణం పూర్తికాగా, ఇప్పుడు దానిని ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.కోస్తా తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ.4,902 కోట్ల పెట్టుబడి అంచనాతో 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తొలిదశలో 34.04 ఎంఎంటీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానమ్) సామర్ధ్యంతో నాలుగు బెర్తులు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) నిర్మాణాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా బ్రేక్ ఫీడర్ల నిర్మాణంతో పాటు, డ్రెజ్జింగ్, ఒక బల్్కబెర్తు నిర్మాణం, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాలకు చెందిన బిల్డింగ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు.బల్్కబెర్త్ నిర్మాణం పూర్తికావడంతో రామాయపట్నం పోర్టు నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి మొదటి ఓడను నిలపాలని భావించారు. తరువాత ప్రభుత్వం మారడంతో అది సాధ్యం కాలేదు. -
విపత్తు సామర్థ్యాల బలోపేతం
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రాల మధ్య విపత్తు సంసిద్ధత, పరస్పర సమన్వయం, అత్యవసర ప్రతిస్పందన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో అంతర్ రాష్ట్ర మాక్ ఎక్సర్సైజ్–2026 జరిగింది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విద్యుత్, మత్స్య, పశుసంవర్ధక, నీటిపారుదల, పంచా యతీరాజ్ శాఖలు పాల్గొన్నాయి. వరద పరిస్థితుల్లో నిర్వహించాల్సిన శోధన, రక్షణ చర్యలు, ప్రభావిత ప్రాంత ప్రజల తరలింపు, వైద్య సహాయం, సహాయక శిబిరాల నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థల సమన్వయం ఈ విన్యాసాలలో ప్రదర్శించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో వరదలు, తుఫాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా సంభవిస్తున్న నేపథ్యంలో ఇటువంటి మాక్ ఎక్సర్సైజ్లు విపత్తు సంసిద్ధతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక విలువల వినియోగం, సమర్థమైన సమన్వయ వ్యవస్థలు, ముందస్తు సంసిద్ధత చర్యల ద్వారా ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని అధికారులు పున రుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఏపీఎస్పీ బెటాలియన్స్/ఏపీఎస్డీఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. రాజకుమారి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్నకుమార్ సహకారంతో ఏపీఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకత్వంలో ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)ఎన్.మధుసూదనరెడ్డి, డీఐజీపీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి, డీఐజీపీ (ఏపీ ఎస్పీ బెటాలియన్స్) డి.ఉదయ్ భాస్కర్, ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రకర్జైన్, కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, మచిలీపట్నం ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు సమన్వయంతో దక్షిణ ప్రాంత సంయుక్త విపత్తు నిర్వహణ విన్యాసం విజయవంతంగా ముగిసింది. పాలకాయతిప్పలో దక్షిణ ప్రాంత సంయుక్త విపత్తు నిర్వహణ విన్యాసం పర్యవేక్షించిన ఏపీఎస్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్న ఆరు రాష్ట్రాల అధికారులు -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
జగ్గయ్యపేట అర్బన్: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీఐహెచ్), విజయవాడ సీఈవో జి.కృష్ణన్ అన్నారు. అంత ర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల వారోత్సవాలు–2026 లో భాగంగా బుధవారం ఆర్టీఐహెచ్, విజయవాడ, మెప్మా, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మహిళా పారిశ్రామికవేత్తల సాధికార కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఐహెచ్ సీఈవో కృష్ణన్ మాట్లాడుతూ ఎంటర్ప్రెన్యూర్ షిప్,ఈ–కామర్స్, జీఎస్టీ, ట్రేడ్మార్క్, బ్రాండింగ్, మార్కెట్ యాక్సెస్, వ్యాపార అభివృద్ధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో 30 మందికి పైగా ఉద్యమ్ యాప్లో పేర్లు నమోదు చేసుకున్నారు.ఆర్టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్ -
యనమలకుదురు ఆలయ హుండీ ఆదాయంరూ.14,20,491
పెనమలూరు: యనమలకుదురులోని శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానం హుండీ కానుకలను బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారుల సమక్షంలో లెక్కించారు. 125 రోజుల వ్యవధిలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు రూ 14,20,491 ఆదాయం వచ్చింది. బంగారం 6 గ్రాముల 330 మిల్లీ గ్రాములు, వెండి 910 గ్రాములు, యూఎస్ డాలర్లు 30, సౌత్ ఆఫ్రికన్ 100 ర్యాండ్ ఒక నోటు, థాయ్ల్యాండ్ 20 డాట్ రెండు నోట్లు, యూకే 5 పౌండ్ ఒక నోటు హుండీలో భక్తులు వేశారు. జిల్లా దేవాదాయ సహాయ కమిషనర్ లలిత, యనమలకుదురు కనకదుర్గ అమ్మవారి ఆలయ ఈవో యు.వీ.ప్రసాదరావు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి దాత సంగా నరసింహారావు, ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, సేవా సభ్యులు, పలువురు పాల్గొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ‘జాబ్ మేళా’ జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతీ, యువకులు జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు. మేళాలో ఎంపిక అయిన వారికి నెలకు రూ.12 వేల నుంచి రూ. 50వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. మరిన్ని వివరాలకు 9032633548, 9985759304 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన ఎనిమిది మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. విజయవాడ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ నెల 10 నుంచి 23 వరకూ నిర్వహించిన తనిఖీల్లో 101 మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానాల్లో ప్రవేశ పెట్టగా, వారిలో ఒకరి మూడు రోజులు, మరో ఏడుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించిన ప్రభుత్వం, మరో 93 మందికి రూ.9.95 లక్షల జరిమానా విధించింది. 5 కేజీల గంజాయి స్వాధీనం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ బృందం అరెస్ట్ చేసింది. వారి నుంచి 5 కేజీల గంజాయి, బైక్, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మధ్య నిషేధ, అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ లావణ్య ఆదేశాలు మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం బుధవారం సితార సెంటర్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు యమహా ఎంటీ–15 బైక్పై గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిని తనిఖీ చేయగా మూడు ప్యాకెట్లలో మొత్తం 5 కేజీల గంజాయి పట్టుబడింది. ఆ ఇద్దరు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన కుంచాల సూర్య తేజ, ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన కలపాల తేజలుగా గుర్తించారు. వీరికి ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దుకు చెందిన కార్తీ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఎన్ఫోర్స్మెంట్ బృందం ఇరువురిని భవానీపురం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు సరఫరా చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. సూర్యతేజ, కలపాల తేజలను అరెస్ట్ చేసి వారి వద్ద 5 కేజీల గంజాయి, బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టు ముందు హాజరు పరచగా రిమాండ్ విఽధించినట్లు ఎకై ్సజ్ సీఐ టి.గోపాలకృష్ణ తెలిపారు. -
పీఎండీఎస్తో పశుగ్రాస కొరతను నివారిద్దాం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): పశుగ్రాస కొరతను అధిగమించేందుకు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని అనుసరించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ బుధవారం పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి పీఎండీఎస్కు సంబంధించి అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎండీఎస్ విధానంలో వర్షాలు రాకముందు పొడి భూమిలో విత్తనాలు వేసి తక్కువ తేమను వినియోగించుకొని మొలకెత్తేలా చేయడమని.. ఈ విధానంలో భూమి ఖాళీగా ఉండదని, పచ్చదనం, జీవంతో నిండిన నేల రైతులకు క్రమంగా ఆదాయం వచ్చేలా చేస్తుందని వివరించారు. ఈ విధానం వల్ల తేమ నిల్వతో పాటు నేలసారం పెరుగుతుందని, రైతుకు అధిక ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. పశుగ్రాసాల సాగు, పాల ఉత్పత్తి పెరుగుదల, స్వల్పకాలిక మిశ్రమ పంటలు వల్ల చీడపీడల ప్రభావం తగ్గుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి.. ఎల్నినో ఇబ్బందులను అధిగమిద్దామని సూచించారు. రైతులు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పంటలపై అవగాహన పెంపొందించుకొని, పీఎండీఎస్ కోసం సరైన పంటలను ఎంపిక చేసుకోవాలని, తద్వారా అధిక ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, ఏడీ డా. సునంద, పశువైద్యులు డాక్టర్ మనోజ్, డాక్టర్ పంకజ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ -
ఫలితాలపై టీచర్లు శ్రద్ధ పెట్టాలి
● సమాజంలో మార్పు తెచ్చేందుకే విద్యాశాఖను ఎంచుకున్నా ● విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొక్కిలిగడ్డ(మోపిదేవి): సజాజంలో మార్పు తెచ్చేందుకే తాను విద్యాశాఖను ఎంచుకున్నానని రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులు తెచ్చి దేశంలోనే ఆదర్శవంతంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురాలన్నది తన ధ్యేయమన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలోని కొక్కిలిగడ్డ గ్రామంలో దాతల సహకారం రూ. 1.40 కోట్లతో నిర్మించిన పాఠశాల తన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామని, ఇక ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ద వహించాలని సూచించారు. ఈ పాఠశాలలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ తప్ప అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. వెనకబడిన విద్యార్థుల పనితీరుని మెరుగుపర్చేందుకు బ్రిడ్జి కోర్సు మెటీరియల్ అందచేస్తామని, నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప నిచేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల చిత్రాలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని తెలిపారు. త్వరలో క్లిక్కర్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. లీప్ యాప్ను విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని, తమ బిడ్డల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోవాలని సూచించారు. సర్ ప్రక్రియ కారణంగా ఇంటింటికి ప్రచారం కార్యక్రమం జూలై 10కి వాయిదా వేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. జూలై మూడో వారంలో తల్లికి వందనం రెండో విడత నగదు జమచేయబోతున్నామని తెలిపారు. కృష్ణాజిల్లా ఇన్ఛార్జీ మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, సీఎంఓ కార్యక్రమాల సమన్వయకర్త, జోనల్ ఇన్ఛార్జీ సత్యనారాయణరావు, నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, జడ్పీటీసీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీల విజేత విజయవాడ
విజయనగరం: విద్యుత్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో విజయవాడ క్రీడాకారులు సత్తా చాటారు. వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ నేతృత్వంలో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఇంటర్ సర్కిల్ పురుషుల వాలీబాల్, అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు బుధవారంతో ముగిశాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన పోటీల్లో వాలీబాల్ పోటీల్లో విజయవాడ జట్టు విజేతగా నిలవగా.. ద్వితీయ, తృతీయ స్థానాలను విశాఖ, ఆతిధ్య విజయనగరం జట్లు చేజిక్కించుకున్నాయి. అథ్లెటిక్స్లో ఓవరాల్ చాంపియన్ షిప్ను విజయవాడ జట్టు దక్కించుకోగా.. రెండు, మూడుస్థానాల్లో తిరుపతి, విజయనగరం జట్లు నిలిచాయి. దాసన్నపేట విద్యుత్ భవనం ప్రాంగణంలో విజేతలకు ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టి.వి.సూర్యప్రకాష్, ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు, పార్వతీపురం–మన్యం జిల్లా ఎస్ఈ పెద్దింటి త్రినాథరావులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టి.వి.సూర్యప్రకాష్, ఎస్.హరిబాబు మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ఒత్తిడి జీవనం సాగించే విద్యుత్ ఉద్యోగులకు క్రీడా పోటీలు ఉపశమనం కలిగించడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్నొన్నారు. కార్యక్రమంలో విజయనగరం డివిజన్ ఈఈ పి.హరి, ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్స్ స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు వడివేలు, స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
26వారాలకే జన్మించిన కవల శిశువులు
62 రోజుల చికిత్సతో సాధారణ స్థితికి.. లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భం దాల్చిన 26 వారాలకే జన్మించిన కవల శిశువులకు 62 రోజుల చికిత్సతో సాధారణ స్థితికి తీసుకు వచ్చారు అక్కినేని ఆస్పత్రి వైద్యులు. ఈ సందర్భంగా డాక్టర్ బి.సౌమ్య వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన షణ్ముఖ దేవికి 26 వారాల గర్భధారణలోనే ఒక మగ, ఆడ శిశువులు జన్మించారు. పుట్టిన సమయంలో వారి బరువు మగ శిశువు 850 గ్రాములు, ఆడశిశువు 812 గ్రాములు మాత్రమే ఉన్నారు. పిడియాట్రిక్ నిపుణులు డాక్టర్ డి.నరేంద్రబాబు, డాక్టర్ ఎం.పురంజయ్ నియోనాటల్ యూనిట్లో 62 రోజుల పాటు ఆ కవల శిశువులకు చికిత్స అందించారు. దీంతో శిశువులు ఇద్దరు బరువు దాదాపు 2 కేజీలకు పెరగడంతో వారిని డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఏపీ ఎన్జీవోతోనే సాధ్యం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఏపీ ఎన్జీవోతోనే సాధ్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.సత్యనారాయణరెడ్డి, పి.రమేష్ అన్నారు. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవడంలో నిరంతరం కృషి చేసిన ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ను జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు బుధవారం ఎన్జీవో హోమ్లో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు మేలు జరిగేలా ఉద్యోగ విరమణ వయసు పెంపు, పాత పెన్షన్ విధానం అమలుపై రాష్ట్ర కేబినెట్ మెమో–57 అమలు ద్వారా సుమారు 11 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు జీవితాంతం భరోసా లభిస్తుందన్నారు. ఈ మెమో రావడం వెనుక విద్యాసాగర్ కృషి ఎంతో ఉందన్నారు. మెమో–57 సమస్య అనేక సంవత్సరాలుగా వేలాది మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్న అంశమని, ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం లభించడం ఆయన పట్టుదల, దూరదృష్టి, అంకితభావానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు వేమూరి ప్రసాద్, బి. సతీష్ కుమార్, బీవీ రమణ, రామకృష్ణ, నగర కార్యవర్గ సభ్యులు బి.రాజశేఖర్, ఎస్కే నజీరుద్దీన్, శివశంకర్, కాశీం సాహెబ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.సత్యనారాయణ రెడ్డి, పి.రమేష్ -
అంకితభావంతో విధులు నిర్వర్తించండి
● జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ● జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు చిలకలపూడి(మచిలీపట్నం): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పలువురికి ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామక పత్రాలను బుధవారం జెడ్పీ కార్యాలయంలో ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ హయాంలో ఎంతోమందికి నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతులు, మరణించిన వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశామన్నారు. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, నలుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, ఒకరికి రికార్డు అసిస్టెంట్ నుంచి టైపిస్ట్గా ఉద్యోగోన్నతి కల్పించామన్నారు. వివిధ హోదాల్లో ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ వారసులను టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్లుగా నియమిస్తూ నియామకపత్రాలు అందజేశామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్సీ ఆనంద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్రాంతి కేసుపై మౌనమేల..?
దళితులంటే చిన్నచూపేలలబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కేసును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారం రోజులుగా వివిధ సంఘాలు, పార్టీలు వారి కుటుంబాన్ని పరామర్శిస్తూ, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు. దళితులంటే ప్రభుత్వానికి లెక్కలేనితనంగా ఉందంటూ దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 26న కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. దానిలో కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేకున్నానని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొనడమే కాకుండా, మాదిగగా పుట్టడమే నా తప్పంటూ మాట్లాడిన వైనంపై దళిత సంఘాల నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. క్రాంతికుమార్ స్వయంగా మరణవాంగ్మూలం ఇచ్చినా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్తో పాటు, దళిత ఉద్యోగుల సంఘం, వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులు క్రాంతికుమార్ కుటుంబసభ్యులను పరామర్శించి వారికి తమ మద్దతు ప్రకటించారు. క్రాంతికుమార్ మరణంపై చంద్రబాబు స్పందించాలని మృతుని తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావుతో పాటు, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్రాంతికుమార్ కుటుంబానికి సాయం అందించాలని, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వమే చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక సీఐ కారణంగా దళితుడు మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని, హోం మంత్రి దళితురాలై ఉండి కూడా ఇప్పటివరకూ నోరు విప్పకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అనేక సామాజిక సమస్యలపై పోరాటం చేసిన నాయకుడికే న్యాయం జరగకుంటే, ఇంకెవరికి చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కాపు యువకుడు సాయికృష్ణ లాకప్డెత్ కేసుతో ప్రభుత్వానికి తలబొప్పి కట్టడంతో గత్యంతరం లేని పరిస్థితిలో సీఐ నాగరాజును అరెస్టు చేసి చేతులు దులిపేసుకుంది. అయితే ఇదే సీఐ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు క్రాంతికుమార్ కేసును మాత్రం పట్టించుకోవడం లేదు. దళితులంటే కూటమి ప్రభుత్వానికి మొదటి నుంచీ చిన్నచూపేనని, అందుకే క్రాంతికుమార్ కేసును పట్టించుకోవటం లేదని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్యపై పట్టించుకోని ప్రభుత్వం సీఐ నాగరాజు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతూ సెల్ఫీ వీడియో ఆ సెల్ఫీ వీడియోను మరణ వాగ్మూలంగా పరిగణించరా? ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న దళిత సంఘాలు కార్యాచరణ నిమిత్తం ఈ నెల 26 సమావేశం సీబీఐ విచారణతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో కేసు కట్టాలని డిమాండ్ మృతుని కుటుంబానికి పరిహారం, భార్యకు ఉద్యోగం ఇవ్వాలంటున్న దళిత సంఘాలు -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
నందివాడ: మండలంలోని రుద్రపాక గ్రామంలో ఉన్న పిన్నమనేని వీరయ్య చౌదరి స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గ్రామానికి చెందిన నలుగురు అన్నదమ్ములు రూ.10 లక్షలను విరాళంగా అందజేశారు. గ్రామంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తమ తండ్రి కొడాలి శ్రీరాములు జ్ఞాపకార్థం ఆయన కుమారులు కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి వీరయ్య, కొడాలి శేషగిరిరావు, కొడాలి వెంకట శ్రీనివాసరావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఐదు లక్షలు, జూనియర్ కళాశాలకు ఐదు లక్షలు చొప్పున మొత్తం రూ.10 లక్షలను చెక్కు రూపంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో పిన్నమనేని వీరయ్య చౌదరి, పిన్నమనేని పూర్ణ వీరయ్య (బాబ్జి), పాలడుగు నానారావ్, తమ్మారెడ్డి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపాల్ పి. సాల్మన్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ సుబ్బారావు, గ్రామ ప్రముఖులు జాస్తి సాములు, శేషగిరి, నైనవరపు వెంకట కృష్ణ పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈల నిర్వహణలో సీఏల పాత్ర కీలకం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిర్వహించడం అంటే కేవలం అమ్మకాలు చేయడం మాత్రమే కాదని లెక్కలు, చట్టాలు ఉంటాయని వాటిని సక్రమంగా సకాలంలో నిర్వ హించే వారే చార్టర్డ్ అకౌంటెంట్స్ అని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయ వాడలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విజయవాడ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఎమ్ఎస్ఎంఈ మహోత్సవ్–2026 కార్యక్రమం ఐసీఏఐ భవన్లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర చాలా కీలకమన్నారు. యువతకు ఉపాధి కల్పనలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలు చాలా అవసరమని చెప్పారు. ఎంఎస్ఎంఈల స్థాపనకు సింగిల్ విండో విధానంలో అనుమతులు, సబ్సిడీలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, బ్యాంకుల నుంచి రుణాలను అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సౌకర్యాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ప్రతి యువకుడు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నారు. లోకల్ ఎంఎస్ఎంఈల నుంచి ఉత్పత్తి అయిన వస్తువులను ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. త్వరలో ఎంఎస్ఎంఈ శాఖతో ఒప్పందం ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ ఉప్పులూరి జయంత్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు తమ బ్రాంచ్ ఆధ్వర్యంలో యువతకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. త్వరలో తమ బ్రాంచ్ ఎంఎస్ఎంఈ శాఖతో ఎంవోయూ కుదుర్చుకోనుందని చెప్పారు. ఐసీఏఐ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ చైర్మన్ ఎం.సుబ్బారావు, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ కార్యదర్శి వేముల వీరపవన్ కుమార్తో పాటుగా ఐసీఏఐ సభ్యులు, సీఏలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ను ఐసీఏఐ బ్రాంచ్ సభ్యులు సత్కరించారు. ఎంఎస్ఎంఈ మహోత్సవ్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ -
మంత్రి లోకేష్కు షాకిచ్చిన మహిళలు
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో పర్యటించిన మంత్రి నారా లోకేష్కు మహిళలు షాకిచ్చారు. అవనిగడ్డలో బెల్టు షాపుల బాగోతాన్ని లోకేష్ ముందే మహిళలు బయటపెట్టారు. తమ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని లోకేష్ను మహిళలు నిలదీశారు. మద్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయన్నారు.మీ గ్రామంలో మద్యం షాపు ఉందా? అంటూ లోకేష్ ప్రశ్నించారు. అవనిగడ్డలోని వైన్ షాపు నుంచి తెచ్చి తమ గ్రామంలో మద్యం అమ్ముతున్నారని మహిళలు చెప్పారు. తమ గ్రామంలో బెల్టు షాపు లేకుండా చేయాలని మహిళలు కోరగా.. తాను చూసుకుంటానంటూ అక్కడ్నుంచి మంత్రి లోకేష్ జారుకున్నారు. -
గంగమ్మ లాకప్డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్పై దాఖలైన పిల్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
సాయికృష్ణను లాకప్ డెత్ చేశారు: కోర్టులో సిట్
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసు మిస్టరీ అధికారికంగా వీడింది. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, అది కస్టడీయల్ డెత్ కేసుగా పేర్కొంటూ దర్యాప్తు బృందం కోర్టుకు నివేదిక సమర్పించింది. అలాగే ఈ కేసులో అరెస్టయిన కృష్ణలంక సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (2nd AJM) కోర్టులో ఈ కేసు నిందితుడు సీఐ(సస్పెండెడ్) నాగరాజును హాజరుపరిచిన సిట్ అధికారులు.. దర్యాప్తులో వెలుగుచూసిన పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టుకు సిట్ చెప్పిన షాకింగ్ నిజాలుసాయికృష్ణను తీసుకెళ్లి మాయం చేశారుసాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశాంమొత్తం 17 మంది సాక్షులను విచారించాంమే 6న సాయికృష్ణను మార్కాపురంలో అరెస్ట్ చేశారుఅదే తేదీన టాస్క్ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజుకు అప్పగించారునాగరాజు 24 గంటల్లోపు సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టలేదునాన్బెయిలబుల్ వారెంట్ ఉన్నా కూడా కోర్టులో ప్రవేశపెట్టలేదుసాయికృష్ణను నాగరాజు కస్టడీలో ఉండగా పీఎస్లో చూసినట్లు ఓ ఎస్సై వాంగ్మూలం ఇచ్చాడుమృతదేహాన్ని కూడా చూసినట్లు తర్వాత అదే ఎస్సై స్టేట్మెంట్ ఇచ్చాడుసాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక.. డెడ్బాడీని మాయం చేశారుకృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీఫుటేజీ లేదుమే 1 నుంచి జూన్ 1 దాకా ఫుటేజీలు లేవువాటిని ఎవరు? ఎందుకు మాయం ఎందుకు చేశారనేది తేలాల్సి ఉందిఅయితే మే 6-8 తేదీల మధ్య.. ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్లు చెప్పాడుఇతర సాక్ష్యాలను పరిశీలించాకే.. కస్టోడియల్ డెత్గా నిర్ధారించుకున్నాంఈ కేసులో నిందితుడైన నాగరాజును అరెస్ట్ చేశాంఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదుఅక్రమ నిర్బంధం, పోలీస్ కస్టడీలో మరణం.. డెడ్బాడీ మాయం చేశారుహైకోర్టులో నిజాలు దాచి అత్యంత తీవ్రమైన నేరం చేశారుఆధారాలు మాయం కావడం సహా అన్నింటికీ నాగరాజే కారణమని భావిస్తున్నాంసిట్ తరఫున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది ప్రకారం.. మార్కాపురంలో టాస్క్ఫోర్స్ పోలీసులు గాదె సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) ఉన్నప్పటికీ, చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదని తెలిపారు. ఇది కోర్టు ధిక్కరణ (Contempt of Court) కిందకు వస్తుందని పేర్కొన్నారు.అలాగే దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్లు ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు వెల్లడించారు. మృతి విషయాన్ని మెజిస్ట్రేట్కు తెలియపర్చకుండా.. మృతదేహాం మాయం చేశారని తెలిపారు. అయితే సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారన్న ఆరోపణలకు ఆధారాలేమిటని న్యాయమూర్తి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. నాగరాజు నుంచి కీలక ప్రశ్నలకు సమాధానం దొరకలేదని సిట్ కోర్టుకు తెలిపింది. సాయికృష్ణను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు?లాకప్ డెత్ తర్వాత సాయికృష్ణ డెడ్బాడీని ఏం చేశారు?పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందన సిట్ కోర్టుకు తెలిపింది. అందుకే మరింత దర్యాప్తు అవసరమని పేర్కొంది.నాగరాజుకు రిమాండ్రిమాండ్ రిపోర్ట్ నేపథ్యంలో.. సాయికృష్ణ లాకప్ డెత్ కేసు నిందితుడు నాగరాజుకు 14 రోజుల రిమాండ్ను విధించింది కోర్టు. జులై 8న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టమని సిట్ను ఆదేశించింది. దీంతో అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.ఇదిలా ఉండగా, తన కుమారుడు కనిపించడం లేదంటూ సాయికృష్ణ తల్లి ఇప్పటికే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ, సిట్ దర్యాప్తు, తాజాగా కోర్టులో వెల్లడైన అంశాలు కేసును మరింత కీలక దశకు తీసుకెళ్లాయి. సీఐ(సస్పెండెడ్) నాగరాజు రిమాండ్ రిపోర్టులో నమోదైన అంశాలు, సిట్ కోర్టుకు సమర్పించిన వివరాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
సాయి కృష్ణ కేసులో మరో సంచలన మలుపు!
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు.. రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితుడు.. కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అధికారులు ఐదు గంటలపాటు ప్రశ్నించినా మౌనం వహించినట్లు తెలుస్తోంది. దీంతో కోర్టుకు సిట్ ఎలాంటి సమగ్ర దర్యాప్తు నివేదికను సమర్పిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ వెలుగులోకి రావడం మరింత కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ “సాయి కృష్ణ ఎక్కడ?” అన్న ప్రశ్న చుట్టూ తిరిగిన వ్యవహారం ఇప్పుడు “సాయి కృష్ణ బతికే లేడు” అనే విషయాన్ని ధృవీకరించే దిశగా వెళ్తోంది. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని, అనంతరం ఆధారాలు లేకుండా శవాన్ని తగులబెట్టారని ఆరోపిస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు కాపీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఫిర్యాదులో ఏముంది?ఈ నెల 19వ తేదీన సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తన కుమారుడు సాయి కృష్ణను మే నెల మొదటి వారంలో పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) కేసు పేరుతో కృష్ణలంక, మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. మార్కాపురం నుంచి తీసుకొచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరచకుండా అక్రమంగా నిర్బంధించారని, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.దండ రెడీ చేసుకో..విజయలక్ష్మి చేసిన ఫిర్యాదులో సీఐ నాగరాజుపై సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత సీఐ నాగరాజు తనతో “నీ కొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో” అని చెప్పారని విజయలక్ష్మి ఆరోపించారు. అలాగే లాకప్లో సాయి కృష్ణను తీవ్రంగా కొడుతున్న సమయంలో అతడి అరుపులు, కేకలు తాను స్వయంగా విన్నానని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుమారుడిని తనతో పంపించాలని కోరగా.. సీఐ నాగరాజు తనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు.అందుకే హైకోర్టుకు.. సాయి కృష్ణ ఆచూకీ లభించకపోవడంతో తన కుమార్తె ద్వారా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్లు విజయలక్ష్మి తన ఫిర్యాదులో వివరించారు. అయితే అప్పటికే సాయి కృష్ణ మరణించాడని, ఆ విషయం బయటపడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో అతడి మృతదేహాన్ని గుర్తుపట్టలేని విధంగా తగులబెట్టారని ఆరోపించారు. తన కొడుకును కిరాతకంగా చంపిన నాగరాజును కఠినంగా శిక్షించాల్సిందేనని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఫిర్యాదు ఆధారంగా సీఐ నాగరాజుపై అక్రమ నిర్బంధం, ఆధారాలను నాశనం చేయడం, హత్యాయత్నం తదితర అభియోగాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.విచారణలో నాగరాజు ఏమైనా కీలక విషయాలు వెల్లడించాడా? సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత ఇచ్చాడా? ఎవరు చెబితే ఇదంతా చేశాడు?.. సీసీటీవీ పుటేజీ ఎందుకు మాయం చేశాడు?.. అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో నాగరాజుకు రాజకీయ భవిష్యత్తుపై హామీలు ఇచ్చారని, అందుకే విచారణలో పూర్తిగా నోరు విప్పడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
ఈసీ డెప్యూటీ కమిషనర్కు స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర ఎన్నికల సంఘం డెప్యూటీ కమిషనర్ భానుప్రకాష్ ఏటూరుకు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ పర్యటన నిమిత్తం ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్తో కలిసి ఆయన ఎయిరిండియా విమానంలో న్యూఢిల్లీ నుంచి ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలంకారీ ఉత్పత్తులను అందజేసి సాదర స్వాగతం పలికారు. గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం, ఎయిర్పోర్ట్ సీఎస్ఓ కె. ధర్మేంద్ర తదితరులు ఉన్నారు. డైట్సెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి గుడ్లవల్లేరు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డి.ఎల్.ఎడ్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డి.ఎల్. ఎడ్ సెట్ – 2026) హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని అంగలూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ మంగళవారం తెలిపారు. ఈ పరీక్ష జూలై 1వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తమ హాల్ టికెట్లోని పేరు, ఫొటో, సంతకం, పరీక్ష కేంద్రం తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా పొరపాట్లు గమనించినట్లయితే వెంటనే డైట్, అంగలూరు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. పరీక్ష రోజు అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పని సరిగా తీసుకురావాలని చెప్పారు. చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ సమావేశ హాలులో జరుగుతున్న ఆధునికీకరణ పనులను మంగళవారం చైర్పర్సన్ ఉప్పాల హారిక పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులతో చైర్పర్సన్ మాట్లాడుతూ పనులు జరుగుతున్న తీరును, నాణ్యతను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోగా ఆధునికీకరణ పనులను సమావేశపు హాలుతో పాటు సీఈవో, చైర్పర్సన్ చాంబర్లను కూడా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్సీఏ ఆనంద్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు తదితరులు పాల్గొన్నారు. పట్టుబడిన మాదకద్రవ్యాలు జిందాల్ ప్లాంట్లో దహనం యడ్లపాడు(పల్నాడు జిల్లా): కృష్ణా–ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి, ఇతర నార్కోటిక్ సంబంధిత పదార్థాలను పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లో మంగళవారం దహనం చేశారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 364 కిలోల గంజాయి, 20 గ్రాముల ఎండీఎంఏ, 69 కిలోల ఎన్డీపీఎస్ పదార్థాలను, కృష్ణాజిల్లాకు సంబంధించి 911 కిలోల గంజాయిని శాసీ్త్రయ పద్ధతిలో దహనం చేశారు. విజయవాడ డ్రగ్స్ డిస్పోజబుల్ కమిటీ చైర్మన్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు సీహెచ్ లావణ్య, రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ అధికారి నజీనాబేగం తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు
దుర్గమ్మకు తొలి సారె సమర్పించనున్న దుర్గగుడి ఈవో ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాసోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తిని మహా మండపం ఆరో అంతస్తులో ప్రతిష్టించనున్నారు. ఆషాఢ మాసంలో తొలి రోజైన 15వ తేదీ బుధవారం ఉదయం 8.30 గంటలకు దేవస్థానం తరఫున ఆలయ ఈవో శీనానాయక్ అమ్మవారికి మొదటి సారెను సమర్పించనున్నారు. నెల రోజుల పాటు సాగే మాసోత్సవాలలో భక్తులు, సేవా బృందాలు, భక్త బృందాలు, ఆలయ ట్రస్టీలు, దేవస్థానాల తరఫున అమ్మవారికి చీరలు, పూజా సామగ్రి, మిఠాయిలు, కాయలు, పండ్లు, పసుపు, కుంకుమను సారెగా సమర్పిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఆషాఢ మాసం చివరి రోజైన ఆగస్టు 12వ తేదీ బుధవారం దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారెను సమర్పిస్తారు. పక్కా ఏర్పాట్లు.. ఆషాఢ మాసోత్సవాలకు తోడు జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు, తెలంగాణ బోనాలను పురస్కరించుకొని నెల రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈవో శీనానాయక్ ఆలయానికి చెందిన కీలక విభాగాల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
అంగన్వాడీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
గన్నవరం: మండలంలోని దావాజిగూడెం, అల్లాపురం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. తొలుత దావాజీగూడెం మోడల్ స్కూల్ ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి వసతులను పరిశీలించారు. అంగన్వాడీకి వచ్చే చిన్నారుల సంఖ్యను పెంచాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు హాజరు, పౌష్టికాహారం పంపిణీ వివరాలను యాప్ ద్వారానే నిర్వహించాలని చెప్పారు. హాజరు పట్టికలు, రికార్డుల్లో రాయడం వంటి పాత పద్ధతులకు స్వస్తి పలకాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులు ఎత్తు, బరువులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అల్లాపురం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన డైరెక్టర్ టాయిలెట్స్, టీవీ, తాగునీటి సదుపాయలను పరిశీలించారు. కేంద్రం నిర్వహణపై ఐవీఆర్ఐ కాల్స్లో ప్రజలు ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తపరచడంపై విచారించారు. ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎన్ రాణి, గన్నవరం ప్రాజెక్ట్ సీడీపీఓ జి. మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వీధివీధినా ఎం‘చుక్క’.. వ్యాపారం
కోనేరుసెంటర్: కూటమి పాలనలో మద్యం సిండికేట్ రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటోంది. బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తూ ప్రజా ధనాన్ని దోపిడీ చేసేస్తోంది. నియోజకవర్గంలో ఓటర్లకు చుక్క నీరు దొరకని పరిస్థితి ఉందేమోగానీ.. మందు చుక్క దొరకని సందు లేదు అనటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ముఖ్యంగా బందరు మండలంలోని కొంత మంది మద్యం వ్యాపారుల అవినీతి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. వైన్ షాపుల్లోని మద్యాన్ని పల్లెలతో పాటు పట్టణంలోనూ ఏరులై పారిస్తున్నారు. వైన్షాపుల్లో నడిచే వ్యాపారం చాలదన్నట్టు పచ్చటి పల్లెల్లో బెల్టుషాపులు పెట్టించి మరీ దొడ్డిదారిన లిక్కర్ బాటిళ్లను సరఫరా చేస్తూ లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ తతంగమంతా ఎకై ్సజ్శాఖకు తెలిసే నడుస్తున్నా పట్టించుకునే నాథుడు ఉండటంలేదని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడు.. బందరు మండలంలో మద్యం వ్యాపారులు అంతా కుమ్మక్కయ్యారు. పార్టీలు ఏవైనా ఒకరికొకరు స్నేహంతో మెలుగుతున్నారు. సొమ్ము ఎవడికి చేదు అన్నట్టు బెల్టుషాపులకు మద్యాన్ని తరలించి అక్రమార్జనను తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు పంచుకుంటున్నారు. దీంతో అందరూ అధిక ధరలకు మద్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. -
ఆర్టీసీని కాపాడుకునేందుకే ఉద్యమం
ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 88 నేపథ్యంలో ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునేందుకే ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందని ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ఆర్టీసీ సంస్థ విలువైన ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకుని, సంస్థను ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ రెండు రోజులు తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం విద్యాధరపురం ఆర్టీసీ జోనల్ వర్క్షాప్ వద్ద ధర్నా – గేట్ మీటింగ్ నిర్వహించింది. జేఏసీ నాయకులు ఎస్. కల్యాణ్ కుమార్, స్వామి, శ్రీనివాస్ (ఎన్ఎంయూ), రాష్ట్ర నాయకులు కె. కోటేశ్వరరావు, వి. శ్రీధర్, ప్రసాద్ (ఈయూ), పాపారావు (కార్మిక పరిషత్) పాల్గొని మాట్లాడారు. విద్యుత్ బస్(ప్రైవేట్) ఆపరేటర్ల కోసం రన్నింగ్లో ఉన్న డిపోలను ఖాళీ చేయించే విధానాలను మానుకోవాలన్నారు. సీ్త్ర–శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే నాలుగు వేల కొత్త బస్లను ప్రవేశపెట్టాలని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10వేల పోస్టులను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలి.. అన్ని రకాల బస్లు నడపగలిగే సామర్థ్యం ఉన్న డ్రైవర్లు ఆర్టీసీ సంస్థలో ఉండగా ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థకు అప్పగించకుండా ఏపీఎస్ఆర్టీసీ సంస్థే సొంతంగా నిర్వహించాలని జేఏసీ నాయకులు కోరారు. ఆర్టీసీ సంస్థలో అపరిష్కృతంగా ఉన్న మరి కొన్ని సమస్యలపై బుధవారంకూడా ధర్నా కొనసాగుతుందని తెలిపారు. -
సీఐ నాగరాజును మరోసారి విచారిస్తున్న సిట్
విజయవాడ: సీఐ నాగరాజును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి విచారిస్తోంది. కమాండ్ కంట్రోల్ వద్దకి అధికారులు మళ్లీ చేరుకున్నారు. ఇప్పటికే మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయికృష్ణను 6 గంటలపాటు విచారించింది సిట్.. అనంతరం, రెండు గంటల విరామం తర్వాత మళ్లీ విచారణ ప్రారంభించింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ఆరా తీసింది. ఇప్పటికే సేకరించిన వివరాలతో క్రాస్ వెరిఫికేషన్ చేస్తోంది. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతోంది. విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సాయి కృష్ణ హత్య కేసులో సిట్ సీఐ నాగరాజును ఇవాళ తొలిసారి విచారించిన అనంతరం కమాండ్ కంట్రోల్ నుంచి సిట్ చీఫ్ ఐజీ రవి ప్రకాశ్ వెళ్లిపోయారు. నివేదికను సిద్ధం చేసినట్లు సిట్ బృందం చెబుతోంది. నేటి రాత్రి లేదంటే రేపు ఉదయం సీఐ నాగరాజుని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
సాయికృష్ణ కేసు: సీఐ నాగరాజు అరెస్ట్!
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ(సస్పెండెడ్) నాగరాజు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ క్రమంలో అతని నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్.. మంగళవారం నాగరాజు నివాసానికి వెళ్లింది. పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు అక్కడ తోపులాట, వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు బలగాలను మోహరించారు.అయితే తమ విధులకు ఆటంకం కలిగించిన అనుచరులను పోలీసులు చెదరగొట్టగా.. సిట్ అధికారులు నాగరాజు ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం.. నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ కోసం నాగరాజును పోలీస్ గెస్ట్హౌజ్కు తరలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అక్కడ వైద్యపరీక్షల అనంతరం.. కోర్టులో ప్రవేశపెట్టే చాన్స్ ఉంది. నాగరాజు అరెస్ట్పై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీసులు లాకప్ డెత్ చేసి ఉంటారనే అనుమానాల నడుమ.. ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. కేసుకు సంబంధించిన కీలక ఆధారాల సేకరణతో పాటు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ కేసులో కీలక ఆధారమైన కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజీని నాగరాజు మాయం చేసినట్లు.. లాకప్డెత్ తర్వాత సాయికృష్ణ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బూడిద చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, విజయవాడ: సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. ఈ వ్యవహారంలో సస్పెండైన సీఐ నాగరాజు పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ రికార్డులను పరిశీలించిన సిట్ అధికారులు, మే 1 నుంచి జూన్ 1 వరకు ఉండాల్సిన ఫుటేజ్ పూర్తిగా అందుబాటులో లేకపోవడాన్నిగుర్తించినట్లు సమాచారం. నెల రోజుల వ్యవధిలో.. కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రంగా ఉంచబడినట్లు తేలింది. మిగతా రికార్డులు ఉద్దేశపూర్వకంగానే తొలగించబడ్డాయా? గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక ఆధారాలు లేకుండా చేయాలనే ప్లాన్ చేశారా? నాగరాజే వీటి వెనుక ఉన్నాడా? అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సీసీటీవీ దృశ్యాలను కనీసం నెల రోజుల పాటు భద్రపరచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలకు ముందే మే నెలకు సంబంధించిన ఫుటేజ్ తొలగించబడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఇది సాధారణ సాంకేతిక లోపమా లేదంటే కీలక ఆధారాలను చెరిపివేసే ప్రయత్నమా? అనే దానిపై విచారణ ముమ్మరమైంది.సాయికృష్ణ కేసు దర్యాప్తుకు ఈ సీసీటీవీ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్కు వచ్చిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాలు, పోలీసుల వ్యవహార శైలి వంటి అంశాలపై స్పష్టత ఇవ్వగల ఆధారాలు ఇవేనని దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ ఫుటేజ్ లేకపోవడం కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. సీఐ నాగరాజే ఉద్దేశపూర్వకంగా వాటిని మాయం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అలాగే.. సాయికృష్ణ కేసులో కీలక ఆధారాలు అందుబాటులో లేకుండా పోవడంతో అప్పటి పోలీసు అధికారుల పాత్ర, కేసు నిర్వహణ తీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీ ఫుటేజ్ మాయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన సిట్, బాధ్యులపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం సాయికృష్ణ కేసులో మరో కీలక మలుపుగా మారింది. -
పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు పంచి పెడుతూ.. ఇసుక నుంచి మట్టి దాకా అన్నింటినీ ఆదాయ వనరుగా మార్చుకుని బంధుగణానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యనేత పోలవరంలో మరో దోపిడీకి పచ్చ జెండా ఊపారు! ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో బరి తెగించిన పచ్చ ముఠాలు పోలవరం కాలువను కుళ్లబొడుస్తూ లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాయి. వేలాది టిప్పర్ల మట్టిని విక్రయిస్తూ పోలవరం కుడి ప్రధాన కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. కాలువకు రక్షణగా ఉన్న ప్రధాన గట్లను (బండ్స్) కూడా వదలకుండా రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో తవ్వేస్తూ నిత్యం వేలాది లారీల మట్టిని తరలించి జేబులు నింపుకొంటున్నారు. విజయవాడకు కూతవేటు దూరంలో సీఎం చంద్రబాబు నివాసానికి అత్యంత చేరువలో కేజీఎఫ్ గనులను తలదన్నేలా ఈ మట్టి దందా సాగుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి పరిసరాల్లో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలతో కాలువ గట్లు బలహీనపడి వరద ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెజవాడను బుడమేరు ముంచెత్తిన రీతిలో.. ఇక్కడ కాలువ గట్లు తెగితే విజయవాడ రూరల్, జి.కొండూరు ఇబ్రహీంపట్నంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్న పోలవరం కాలువలో మట్టి దందా ఇలా ఉంది..!మట్టి గుట్టలు మాయం..పోలవరం కుడి ప్రధాన కాలువ మట్టిని మింగేసేందుకు ముఖ్యనేత డైరెక్షన్లో టీడీపీ పార్లమెంట్ ప్రజాప్రతినిధి పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) అవసరాల కోసం పోలవరం కాలువ 167.040 కిలోమీటరు వద్ద 4,908 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తవ్వేందుకు అనుమతులు పొందారు. నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలు పరిమితంగా పగటి పూట మాత్రమే చేపట్టాలి. దీనికి విరుద్ధంగా రోజు భారీ యంత్రాలతో రేయింబవళ్లు కాలువ గట్లను ఛిద్రం చేసి వేలాది లారీల మట్టిని అక్రమంగా తరలించారు. అడ్డగోలు తవ్వకాలపై సామాజిక కార్యకర్త జమలయ్య ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. జీపీఎస్ మ్యాపింగ్ ఫొటోలతో నీటి పారుదలశాఖ అధికారుల దృష్టికి సైతం తెచ్చినా స్పందించలేదు. ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. దీంతో మరింత బరి తెగించి పోలవరం కుడికాలువ 166 కి.మీ. నుంచి 168 కి.మీ. వరకు రెండు కిలోమీటర్ల మేర కాలువకు ఇరువైపులా గట్లను తవ్వడంతో భారీ మట్టి గుట్టలు మాయమయ్యాయి. కొన్ని చోట్ల బండ్ను మాయం చేశారు. దీంపాటు ఇదే ప్రదేశంలో కాలువ గట్టుకు సమీపంలో ఉన్న దండ తిప్పలు కొండలను సైతం బాంబులతో పెకిలించి గ్రావెల్ను తరలిస్తున్నారు.రూ.350 కోట్ల మట్టి దందా!– సీఎంకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ మట్టి దందాకు అండదండలు అందిస్తున్న విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్నిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీ కేశినేని నాని (శ్రీనివాస్) సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయవాడ రూరల్ పరిధిలోని పోలవరం కుడి ప్రధాన కాలువ రక్షణ గట్లను, బుడమేరు డైవర్షన్ కాలువ(బీడీసీ) పరిసరాల్లోని ప్రభుత్వ సంపదను కొల్లగొట్టి ఎంపీ కేశినేని చిన్ని రూ.350 కోట్లు పోగేశారని ఆరోపించారు. పదవిని, ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని ఒక పెద్ద బినామీ నెట్వర్క్ ద్వారా ఈ దోపిడీకి తెర తీసినట్లు పేర్కొన్నారు. మట్టి మాఫియా ఆర్థిక లావాదేవీల కీలక చర్చలన్నీ విజయవాడ గురునానక్ కాలనీ ‘రావూరి విస్టా’ అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 301 కేంద్రంగా సాగినట్లు వెల్లడించారు. అక్కడ తక్షణమే దాడులు నిర్వహించి సోదాలు చేస్తే ఈ కుంభకోణానికి సంబంధించి తిరుగులేని సాక్ష్యాధారాలు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. కేవలం ఐదు వేల క్యూబిక్ మీటర్ల తవ్వకానికి అనుమతి పొంది ఏకంగా రెండు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని కాలువ గట్ల నుంచి తవ్వేందుకు వ్యూహం రచించారని తెలిపారు. జేసీబీలు, పొక్లెయిన్లతో రాత్రింబవళ్లు తవ్వకాలు జరిపించారన్నారు. వందలాది టిప్పర్ల మట్టిని అమరావతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా తరలించి విక్రయించారని చెప్పారు. ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండా మైనింగ్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐతో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.మైలవరంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఫిర్యాదుమైలవరం నియోజకవర్గంలో టీడీపీ ప్రజాప్రతినిధి మట్టి, ఇసుక, గ్రావెల్ దందాపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశకు మాజీ మంత్రి జోగి రమేష్ సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు.సహజ వనరుల లూటీరాజధాని నిర్మాణం ముసుగులో టీడీపీ నేతలు అమరావతిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మట్టి, ఇసుక, గ్రావెల్, బూడిద, సహజ వనరులన్నింటిని దోచేస్తున్నారు. పోలవరం గట్లను సైతం మాయం చేస్తున్నారు. నామమాత్రంగా అనుమతులు తీసుకుని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తవ్వేసి వందల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. ఈ మట్టి దోపిడీ కేజీఎఫ్–3 సినిమాను తలపిస్తోంది. యథేచ్ఛగా మట్టి దోచేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదు. మట్టి దోపిడీపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.– జోగి రమేష్, మాజీ మంత్రి -
ప్రైవేటీకరణపై మున్సిపల్ కార్మికుల శంఖారావం
సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీల్లో మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పార్కులు, రోడ్లు, వాహనాలు వంటి 14 రకాల సేవలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై కార్మికులు కన్నెర్రజేశారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన కార్మికులంతా సోమవారం విజయవాడ ధర్నా చౌక్కు చేరుకుని ప్రభుత్వ తీరుకు నిరసనగా శంఖారావం పూరించారు. మున్సిపల్ సేవలు ప్రైవేటుపరమైతే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 60 వేల మంది కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొట్టేందుకు సిద్ధమైందని మండిపడ్డారు.చీకటి జీవోలు 673, 975 వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గతంలో చెత్త పన్నుపై నానా యాగీ చేసిన ఇదే చంద్రబాబు.. ఇప్పుడు అదే చెత్త పన్ను తీసుకొస్తున్నారని.. ఉమ్మేస్తే కూడా పన్ను వసూలు చేసేలా ఉన్నారని మండిపడ్డారు. కరోనా సమయం, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మున్సిపల్ కార్మికులతో గొడ్డు చాకిరీ చేయించుకుని దేవుళ్లు అని పొగిడిన చంద్రబాబు ఇప్పుడు వారందర్నీ బలిపశువులుగా మార్చేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు చీకటి జీవోలతో పొట్టగొడతారా! కార్మికులను ఉద్దేశించి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం కోర్టు తీర్పులను సైతం తుంగలో తొక్కుతూ చీకటి జీఓలతో మున్సిపల్ కార్మికుల పొట్టకొట్టేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో 14 సేవలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పేందుకు సిద్ధం కావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ ప్రైవేటుపరమైతే అన్ని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న 60 వేల మంది మున్సిపల్ కార్మికుల జీవితాలు బుగ్గిపాలవుతాయన్నారు.ఇదే చంద్రబాబు 2014–19 కాలంలో జీవో నం.279 తెచ్చి మున్సిపల్ కార్మికుల బయటకు గెంటేసి, ప్రైవేటుపరం చేయాలని చూశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు జీవోలు 975, 673 తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నారన్నారు. ఈ జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.నాగభూషణం మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సేవలను ప్రైవేటుపరం చేయొద్దని, సేవలందించే వారిని పర్మినెంట్ చేయాలని కోరుతూ వేలాదిమంది కార్మికులు సంతకాలు చేశారని, ఆ ప్రతులను మున్సిపల్ మంత్రి నారాయణ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కార్మిక నేతలు కాశీనాథ్, వెంకటరెడ్డి, వెంకటరావు, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్రలను విరమించుకోవాలి
సాక్షి, విశాఖపట్నం: ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విశాఖ కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్న్నేతలు పీవీ సురేష్ , రాయపురెడ్డి అనిల్కుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు, కార్మిక నేతలు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ను కలిసి వినతిపత్రమిచ్చారు.అనంతరం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పలువురు ట్రేడ్ యూనియన్, కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ..విద్య, వైద్యం, ప్రజా రవాణా వంటి కీలక రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం అయితేనే పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు జాన్వెస్లీ, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్ టీయూసీ జోనల్ ఇన్చార్జి నారపరెడ్డి రాజారెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విశ్వనాథ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గోవిందరాజులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీశకు వైఎస్సార్టీయూసీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ చక్రం ప్రజా ప్రగతికి చిహ్నమనే నినాదం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన చేస్తోందన్నారు. కూటమి పాలనలో ఆర్టీసీ ఉద్యోగులపై, ప్రజల పాలిట కర్కోటకంగా వ్యవహరిస్తోందన్నారు. 2015 –16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే.. ఆ సంఖ్య ప్రస్తుతం తగ్గిందన్నారు. గతంలో అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే, ఇప్పుడా సంఖ్య 10,700 వచ్చిందన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కొత్త బస్సుల కొనుగోలు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బస్సులను వారి ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీని నష్టాలు సాకుగా చూపి ప్రైవేటుకు ధారాదత్తం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, బస్డిపోలను అద్దెకు ఇచ్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ధోరణి ఇదేవిధంగా కొనసాగితే అన్ని సంఘాలు, ప్రజల సహకారంతో ఉద్యమిస్తామన్నారు. ఆర్టీసీని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జీవీ నారాయణ రెడ్డి, జిల్లా నాయకులు ఎస్కే అక్బర్, ఎం.రామారావు, బి.రాజేష్, ఎస్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ టీయూసీ -
కౌన్సెలింగ్ బహిష్కరించి ఆందోళన
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేల్) ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మరోసారి గందరగోళానికి దారితీసింది. బదిలీలకు సంబంధించిన పూర్తి ఖాళీల వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరచకుండానే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధపడటంపై ఉపాధ్యా యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పారదర్శకత లేకుండా కౌన్సెలింగ్ నిర్వహించడంతో ఉపాధ్యాయులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ–2008, డీఎస్సీ–1998 బ్యాచ్లకు చెందిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. ముందుగా డీఎస్సీ–2008, అనంతరం డీఎస్సీ–1998 ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఖాళీల వివరాలు ఏవి? అయితే జిల్లాలో ఉన్న అన్ని ఖాళీల వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల్లో అనుసరించే ప్రమాణాలు ఎంటీఎస్ ఉపాధ్యాయుల విషయంలో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. పూర్తి ఖాళీల జాబితాను ప్రకటించకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇది ఉపాధ్యాయుల ఎంపిక హక్కును పరిమితం చేసే చర్యగా మారుతుందని విమర్శించారు. దీంతో కౌన్సెలింగ్ను బహిష్కరించిన ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. మొత్తం ఖాళీలు ప్రకటించాలని, పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో చర్చల అనంతరం ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ సోమవారం పొద్దుపోయాక ప్రారంభమైంది. పారదర్శకత లేని బదిలీలపై ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆగ్రహం -
‘ఫీజు’ బకాయిలను విడుదల చేయాలని ధర్నా
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్ మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రూ. 10వేల కోట్లు పైచిలుకు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మూతబడ్డ 4,500 పాఠశాలలను పునఃప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, దీపక్, యశ్వంత్, సాయి, దివ్య తదితరులు పాల్గొన్నారు. హనుమాన్జంక్షన్ రూరల్: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఒకరి మరణానికి కారకుడైన వాహన చోదకుడు అంకం ప్రవీణ్ శ్రీనివాస్కు నూజివీడు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇవి.. 2023 డిసెంబర్ 22వ తేదీన బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి హైవే మధ్యలో ఉన్న డివైడర్ను సైతం దాటుకుని అవతల వైపు రోడ్డు మీదకు వెళ్లింది. ఆ రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొనటంతో ఆ కారులో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన లాజర్ పి.థామస్ (60) అనే వ్యక్తి దుర్మరణం చెందటంతో పాటుగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు గ్రామంలోని కాఫీ ఫ్యాక్టరీలో మిషనరీ పరిశీలించేందుకు కేరళ నుంచి వచ్చిన థామస్ తిరిగి వెళ్లేందుకు కారులో గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరగా, ఈ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై అప్పటి వీరవల్లి ఎస్ఐ ఎం.చిరంజీవి కేసు నమోదు చేయటంతో పాటుగా విచారణ పూర్తి చేసి కోర్టుకు చార్జీషీట్ సమర్పించారు. ఈ కేసులో ఏపీపీ వి.ప్రసన్న వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుడు అంకం ప్రవీణ్ శ్రీనివాస్కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్ నందు మామయ్య మోహనరావు ఇబ్రహీంపట్నం: యూట్యూబర్, సినీ నటి రమానందన (నందు) భర్త తండ్రి జాగర్లమూడి మోహనరావును ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం స్టేషన్లో విచారించారు. ఇప్పటికే నందు కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. తన వ్యక్తిగత లాయర్తో కలిసి మోహనరావు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోలు తీయరాదని మీడియా ప్రతినిధులతో అతడి లాయర్ గొడవకు దిగారు. విచారణలో.. నందు దంపతులు ఎక్కడున్నారు? వారు చేసే వ్యాపారంలో మీ పాత్ర ఏమిటి? ఇప్పటి వరకు ఎంత మంది వీసాలు రెన్యూవల్ చేశారు? వీసాల రెన్యూవల్లో మీ కుటుంబంతో పాటు ఇంకా బయట వ్యక్తులు ఎవరెవరు ఉన్నారనే ప్రశ్నలు పోలీసులు వేసినట్లుసమాచారం. అసలేం జరిగిందంటే.. పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ తన యూకే వీసా రెన్యూవల్ చేయాలని గతంలో డెస్టినీ సంస్థను ఆశ్రయించగా, ఇండియాలో ఉన్న తమ సంస్థకు రూ.15 లక్షలు చెల్లించాలని వారు నమ్మబలికారు. రూ.15 లక్షలు తీసుకున్న తర్వాత ముఖం చాటేయడంతో అతను ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు నిందితులుగా ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన, మధుకర్ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేశారు. నందు దంపతులు అందుబాటులో లేకపోవడంతో మోహనరావును తీసుకువచ్చి విచారించిన అనంతరం పంపించేసినట్లు పోలీసులు తెలిపారు. -
నర్సాపూర్ నుంచి రెండు జతల రెగ్యులర్ సర్వీసులు
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు నర్సాపూర్ నుంచి తిరువణ్ణామలై, ఎస్ఎంవీటీ బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న రెండు జతల వారంతపు ఎక్స్ప్రెస్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చడానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. నర్సాపూర్ – తిరువణ్ణామలై (17291) వారంతపు ఎక్స్ప్రెస్ జూలై ఒకటి నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు నర్సాపూర్లో బయలుదేరి, గురువారం తెల్లవారుజామున 4.55 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17292) జూలై రెండు నుంచి ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరి, శుక్రవారం మధ్యరాత్రి రెండు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుంది. నర్సాపూర్ – ఎస్ఎంవీటీ బెంగళూరు (17293) జూలై మూడు నుంచి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు నర్సాపూర్ లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17294) జూలై నాలుగు నుంచి ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ఎస్ఎంవీటీ బెంగళూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు పాలకొల్లు, విరసవరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్, బంగారుపేట్, కృష్ణార్జునపురం స్టేషనల్లో ఆగుతుంది. -
యూరియా సరఫరాకు పటిష్ట కార్యాచరణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఖరీఫ్ సీజన్లో యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. అన్ని రకాల ఎరువుల సరఫరాకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో ఖరీఫ్ యూరియా, ఇతర ఎరువుల సరఫరాపై సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ యూరియా, ఇతర ఎరువుల శాసీ్త్రయ సమతుల్య వినియోగంతో పాటు ఏపీ ఎయిమ్స్ యాప్, పంట వైవిధ్యం, నానో ఎరువులు, డ్రోన్ స్ప్రేయింగ్ తదితరాలపై ఇంటింటి సందర్శనల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పీఏసీఎస్ వద్ద తాగునీరు, టెంట్, కుర్చీలు వంటి వసతులు కల్పించాలని సూచించారు. ఎరువుల సరఫరా, పంపిణీ లేదా ఇతర వ్యవసాయ సంబంధిత సమస్యలు ఎదురైన సందర్భంలో రైతులు కాల్ టు కలెక్టర్ 91549 70454లో సంప్రదించి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. జేసీ ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, సహకార అధికారి అజిత కుమారి, మార్క్ఫెడ్ డీఎం కె.నాగమల్లిక, వ్యవసాయ శాఖ ఏడీలు, వర్చువల్గా ఆర్డీవోలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
బుడమేరు ప్రక్షాళన మరిచారు
బుడమేరు ప్రక్షాళన చేస్తామని, బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు మాట ఇచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇంత వరకు కనీస చర్యలు చేపట్టలేదు. తూడు తొలగింపు పనులు సక్రమంగా చేపట్టలేదు. బుడమేరులో చెత్త్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంది. బుడమేరులోకి మురుగు, సెప్టిక్ వ్యర్థాలను సైతం వదలివేస్తున్నారు. బుడమేరులో చెత్త్తాచెదారం సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసకేంద్రంగా మారింది. గత వరదల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. వర్షకాలం వస్తోందంటే భయమేస్తోంది. అధికారులు స్పందించి బుడమేరును ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. –పూర్ణ, బుడమేరు మధ్య కట్ట -
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
ఇబ్రహీంపట్నం: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీటీపీఎస్ పాత గేటు వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రీజనల్ అధ్యక్షుడు ఎస్కే సలీం, రీజనల్ కార్యదర్శి ఎం.రవీంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా కార్మికుల వేతనం రూ.43వేలు, పెండింగ్లో ఉన్న కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. రమేష్, కోశాధికారి ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు టి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల అధికారి
పెనమలూరు: ప్రత్యేక సత్వర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని (సర్) పరిశీలించడానికి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్యాదవ్ పెనమలూరులో సోమవారం పర్యటించారు. ఆయన 132,134 పోలింగ్ బూత్లకు సంబంధించి సర్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పని చేస్తున్నారా లేదా పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, ఇంటింటి సర్వే నిర్వహణ, మరణించిన ఓటర్ల గుర్తింపు, వలస వెళ్లిన ఓటర్ల నమోదు, తాళం వేసి ఉన్న ఇళ్ల విషయంలో అనుసరిస్తున్న విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెనమలూరు నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి ఎస్.కరుణకుమారి వివరాలు తెలుపుతూ ఎన్యూమరేషన్ ఫారాలను 71.44 శాతం పంపిణీ చేశామని, ఇంటికి తాళాలు వేసిన కేసుల్లో బీఎల్వోలు మూడుసార్లు గృహాలు సందర్శించారని తెలిపారు. చనిపోయిన ఓటర్ల కేసుల్లో మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పంచనామా చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్యాదవ్ మాట్లాడుతూ సర్ విషయంలో బీఎల్వోలు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఈఆర్వో శివకుమార్రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఏపీ పీటీడీ (ఆర్టీసీ) విజిలెన్స్, సెక్యూరిటీ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా బాధ్యతలు తీసుకున్న ఎస్.వినోద్కుమార్ను సోమవారం పీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిసి అభినందించారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి.అంకినీడు ఆధ్వర్యాన విజయవాడ ఆర్టీసీ హౌస్లో జోనల్, రీజనల్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీ కొండారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి, నాయకులు రవి, అనంతకుమార్, ఆదామ్, జాన్బాబు, గురవయ్య తదితరలు పాల్గొన్నారు. మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్లో పల్స్ పోలియోపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జేసీ నవీన్ పల్స్ పోలియో ప్రచార వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా పకడ్బందీ ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యుగంధర్ మాట్లాడుతూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేసేలా మైక్రో ప్లానింగ్ రూపొందించడం, బూత్ల ఏర్పాటు, వ్యాక్సిన్ సరఫరా, కోల్డ్చైన్ నిర్వహణ, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అనంతరం మిగిలిపోయిన పిల్లలను గుర్తించి ఇంటింటి సందర్శనలతో పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె.ప్రేమ్చంద్ మాట్లాడుతూ విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, రవాణా శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖలతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంపూర్ణ సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. -
అభివృద్ధి.. కనపడని చిత్తశుద్ధి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గతంలో వరదలు సృష్టించిన బీభత్సం నుంచి విజయవాడ పూర్తిగా తేరుకోలేదు. అప్పుడే వర్షాకాలం వచ్చేసింది. అయితే బుడమేరు ఆధునికీకరణపై ప్రభుత్వంలో చిత్తశుద్ధి కొరవడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గండ్లుపడిన చోట గతేడాది చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులే ఇప్పటికీ పూర్తి కాలేదు. వెలగలేరు వద్ద బుడమేరు హెడ్ రెగ్యులేటర్ పనులను మమ అనిపించి వదిలేశారు. అరకొరగా నిధులు బుడమేరు హెడ్రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు 11.90 కిలోమీటర్ల మేర బుడమేరు డైవర్షన్ కెనాల్ ఉంది. బుడమేరు ఆధునికీకరణలో భాగంగా దీన్ని పూర్తిగా లైనింగ్ చేయాల్సి ఉంది. వరదలొచ్చిపోయిన 20 నెలల తర్వాత ఇప్పుడు 0 కిలోమీటరు నుంచి 8.3 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు ప్రభుత్వం రూ.121కోట్లను మాత్రమే కేటాయించింది. మరో 3.600 కిలోమీటర్ల కెనాల్ పనుల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. నిధులను ఇటీవల విడుదల చేయడంతో కాంట్రాక్టర్ లైనింగ్ పనులను ఏప్రిల్ 18న మొదలు పెట్టారు. ఈ పనులకు కావాల్సిన వ్యవస్థను తరలించి పూర్తి స్థాయిలో చేపట్టేందుకు మరో నెల అంటే మే నెల సగంలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి వానలు పడుతుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పునాది దశలోనే బ్యాలన్స్ రిటైనింగ్ వాల్ బుడమేరుకు 2024 ఆగష్టు 31న వచ్చిన వరదలకు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున మూడు చోట్ల, కుడి వైపున ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున పడిన గండ్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం అంటూ 2025, మార్చి 21వ తేదీన రూ.39.77కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓను విడుదల చేసింది. ఇది ఇచ్చిన యాభై రోజుల తర్వాత మే 15న శంకుస్థాపన చేసి రూ.28కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.1.80కోట్లతో రెగ్యులేటర్ మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. వీటిలో భాగంగా శాంతినగర్ వద్ద డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు నిర్మించే రిటైనింగ్ వాల్ 8.65 మీటర్ల ఎత్తు, 1.4 మీటర్ల వెడల్పు 500 మీటర్ల పొడవునా, కుడి వైపు అంటే శాంతినగర్ వైపున ఇదే కొలతలతో యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ను నిర్మించాల్సి ఉంది. పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీటిని విడుదల చేయడంతో ఎడమవైపు 360మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ని నిర్మించి జూన్ 9న పనులు ఆపేశారు. ఇంకా ఎడమ వైపున బ్యాలన్స్ ఉన్న 140 మీటర్లు పొడవు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభమై పునాది దశలోనే ఉండగా కుడి వైపున యాభై మీటర్ల పొడవునా నిర్మించాల్సిన రిటైనింగ్ వాల్ పనులు ఇంకా ప్రారంభించలేదు. బుడమేరు డైవర్షన్ కెనాల్ లైనింగ్ పనులు చేయడానికి వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద డైవర్షన్ కెనాల్ వైపు వరదనీరు వెళ్లకుండా ఉండేలా భారీ కట్టను నిర్మించారు. డైవర్షన్ కెనాల్లో సైతం అక్కడక్కడా అడ్డుకట్టలను నిర్మించారు. ఇవే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక వైపు పనులు నత్తనడకన సాగుతుండటం.. వర్షాలు కూడా పడుతుండడంతో ఏ క్షణంలోనైనా భారీ వర్షం పడి గతంలో వచ్చినట్లు వరద మళ్లీ వస్తే పెను ప్రమాదమే జరిగే అవకాశం ఉంది. డైవర్షన్ కెనాల్కు అడ్డకట్టలు వేయడంతో ప్రస్తుతం వచ్చిన వరద హెడ్ రెగ్యులేటర్ గేట్ల నుంచి దిగువకు అంటే విజయవాడ వైపు బుడమేరులో ప్రవహించాల్సి ఉంది. ఈ రెగ్యులేటర్ 11అడుగుల ఎత్తుతో 11 గేట్లు మాత్రమే ఉండి 15వేల క్యూసెక్కుల వరద మాత్రమే అవుట్ ఫ్లో సామర్ధ్యం ఉంది. వరద పోయేందుకు మరో మార్గం కూడా లేకపోవడంతో ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జూలై నెలలో పట్టిసీమ నీళ్లను సైతం విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్న క్రమంలో లైనింగ్ పనులు పూర్తిగా ఆగిపోయి మరో ఆరు నెలల పాటు వేచి ఉండక తప్పదు. -
అప్పు తిరిగి చెల్లించమన్నందుకు మహిళపై దాడి
మైలవరం: అప్పుగా ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇవ్వమని మహిళ అడిగితే ఆమైపె దాడి చేసిన సంఘటన మైలవరం మండలం తోలుకోడు గ్రామంలో సోమవారం జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి(చల్లా కోటయ్య) ఇటుక బట్టీలు వ్యాపారం నిర్వహిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో 2020లో అతను వెంకటేశ్వరమ్మ వద్ద నుంచి రూ. 4లక్షలను వ్యాపారం నిమిత్తం తీసుకుని 4, 5 నెలల్లో తిరిగి వడ్డీతో చెల్లిస్తానని చెప్పాడు. వీరి ఒప్పందం ప్రకారం సమయం దాటిపోయిన డబ్బులు చెల్లించకపోవడంతో బాధితురాలు వెంకటేశ్వరమ్మ పదేపదే తన డబ్బులు తనకు ఇవ్వమని అడుగుతోంది. తన పిల్లలు, భర్తతో కలిసి ఆ వ్యక్తిని పలుమార్లు అడిగారు. దానికి బదులుగా ఆ వ్యక్తి నేను ఇవ్వను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరమ్మ తనకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి అడగ్గా అసభ్య పదజాలంతో దూషించి ఆ వ్యక్తి ఆమైపె దాడి చేశాడు. ఈ అవమాన భారంతో వెంకటేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ట్యాబ్లెట్స్ మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన భర్త, కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మను ఆటోలో మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైలవరం పోలీసులకు కుటుంబ సభ్యులు వెంకటేశ్వరమ్మ పరిస్థితిని వివరించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
జి.కొండూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మైలవరంలో సోమవారం రాత్రి పది గంటల సమయంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామానికి చెందిన తమండ్రు వేణు(25) తన బైక్పై మైలవరం నుంచి కుంటముక్కల వెళ్తుండగా మైలవరం మార్కెట్ యార్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన వేణు తలకి తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రుడిని స్థానికులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడు వేణు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
ప్రజా విశ్వాసమే పని తీరుకు ప్రమాణం
పీజీఆర్ఎస్ను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల విశ్వాసమే అధికారుల పనితీరుకు అసలైన ప్రమాణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జి.సాయిప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం.. అన్నింటికీ కంటే ముఖ్యంగా నాణ్యత, సంతృప్తికర పరిష్కారం ముఖ్యమన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సీఎస్ సాయిప్రసాద్.. సీసీఎల్ఏ జి.జయలక్ష్మితో కలిసి సందర్శించారు. కొంత సమయం ప్రజల అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై లిఖిత పూర్వకంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి రెవెన్యూ సేవలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి స్వీకరిస్తున్న వినతులు, వాటి ఆన్లైన్ నమోదు విధానం, సంబంధిత శాఖలకు పంపిణీ, పరిష్కార చర్యలు, అధికారుల మధ్య సమన్వయం, పర్యవేక్షణ తదితర అంశాలను సీఎస్ పరిశీలించారు. ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించడంతో ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. జిల్లాస్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమ నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ, వాటి నమోదు తీరుతెన్నులు, పరిష్కారానికి అనుసరిస్తున్న విధానం తదితరాలను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ జి.లక్ష్మీశ వివరించగా సీఎస్ సాయిప్రసాద్ అభినందించారు. మొత్తం 177 అర్జీలు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 177 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ 51, పోలీస్ 33, ఎంఏయూడీ 28, పంచాయతీరాజ్ 22, ఏపీఎస్ డబ్ల్యూఆర్ఐఈఎస్ 6, డీఆర్డీఏ 4, విద్య 4, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ 4, ఏపీసీపీడీసీఎల్ 3, గనులు 3, ఏపీఎస్ ఆర్టీసీ 2, వైద్య 2 అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, బ్యాంకింగ్ సేవలు తదితర విభాగాల నుంచి ఒక్కో అర్జీ వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి జి.జ్యోతి, అధికారులు పాల్గొన్నారు. -
గాలి హోరు.. వాన జోరు
కొడాలి ప్రధాన రహదారిపై కూలిన తాటిచెట్టు, విద్యుత్తు స్తంభం కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారి పై ఈదురు గాలులకు కూలిన వృక్షం ఘంటసాల: వాతావరణంలో వచ్చిన ఆకస్మిక మార్పులతో ఘంటసాల మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయం కాగా చెట్లు, విద్యుత్ స్తంభాలు ప్రధాన రహదారులపై కూలిపోయాయి. ● ఘంటసాల ప్రధాన సెంటర్తో పాటు ఘంటసాల – అంబేడ్కర్, మల్లంపల్లి వెళ్లే రోడ్లు పూర్తి జలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● ఘంటసాల మండలం కొడాలి ప్రధాన రహదారిలో తాటిచెట్లు కూలి విద్యుత్ వైర్ల మీద పడటంలో స్తంభం కూడా కూలిపోయింది. ● కొడాలి – శ్రీకాకుళం ప్రధాన రహదారిలో కొడాలి రైస్ మిల్లు సమీపంలో, చినకళ్లేపల్లి వెళ్లే రోడ్డులో, గోగినేనిపాలెం వెళ్లే దారిలో భారీ వృక్షా లు కూలిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ నయీమ్ స్పందించి సిబ్బందితో కలసి చెట్లను తొలగించడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ● ఘంటసాల మండలంలో తాడేపల్లి, కొడాలి, శ్రీకాకుళం శివారు సూరపనేనిపాలెం గ్రామాల్లో నాలుగు విద్యుత్తు స్తంభాలు పడిపోయినట్లు విద్యుత్తు శాఖ ఏఈ రవి కుమార్ వివరించారు. నేలవాలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, పలు రోడ్లు జలమయం -
నిత్యాన్నదానానికి రూ,10 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన భక్తులు సోమవారం రూ.10 లక్షల విరాళం సమర్పించారు. మంగళగిరి సమీపంలోని కృష్ణాయపాలేనికి చెందిన వై.జయశంకర కిషోర్బాబు, మహాలక్ష్మి దంపతులు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధా కృష్ణను కలిసి నిత్యాన్నదానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. కల్వకుర్తికి చెందిన భక్తులు తాడూరి సురేష్కుమార్ కుటుంబం ఆలయ అధికారులను కలిసి తాడూరి రాఘవేంద్ర పేరిట నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–సర్ ప్రక్రియకు సంబంధించి ఇంటింటి సర్వే వేగవంతంగా జరుగుతోందని కలెక్టర్ జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉన్నారని, బీఎల్వోలు ఇప్పటివరకు 7,96,696 మంది (46.87 శాతం) ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందించినట్లు పేర్కొన్నారు. 46,871 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తైనట్లు వెల్లడించారు. ఇంటింటి సర్వేలో భాగంగా జులై 14వ తేదీ వరకు బీఎల్వోలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారని, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారని, ఇందుకు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు వెళ్లనున్నారని తెలిపారు. -
‘కేజీఎఫ్’ను మించిన రీతిలో అక్రమ క్వారీయింగ్
● అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించాలి ● కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి జోగి రమేష్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మైలవరం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, మైనింగ్ దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులను తప్పకుండా చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా దాములూరి ఇసుక క్వారీలో అక్రమాలను బహిర్గతం చేశామన్నారు. అలాగే జి. కొండూరు మండలం శేగురెడ్డిపాడు గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చామన్నారు. ఆ గ్రామంలో పర్యావరణ విధ్వంసం కొనసాగుతోందన్నారు. అనుమతులు ఒక చోట తీసుకొని మరో చోట మైనింగ్ సాగిస్తున్నారన్నారు. అక్కడ కేజీఎఫ్ సినిమాను తలపించే రీతిలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందజేశారు. మైనింగ్ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో వీడియో క్లిప్పింగ్, ఫొటోలతో ఆధారాలన్నీ కలెక్టర్కు అందజేశారు. నియోజక వర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే సాగిస్తున్న దోపిడీపై జాయింట్ ఇన్స్పెక్షన్ చేపట్టాలని కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఊసరవెల్లిలా ఎమ్మెల్యే.. ఇసుక, గ్రావెల్, బూడిద, మైనింగ్ దోపిడీ ఏ విధంగా జరుగుతుంది? ఎంత పరిమాణంలో దోచుకున్నారు? జాయింట్ ఇన్స్పెక్షన్లో తేల్చి.. నాలుగైదు రెట్లు జరిమానా విధించాలని కలెక్టర్ను కోరినట్లు జోగి రమేష్ చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇసుక, గ్రావెల్, లిక్కర్, బూడిద ఇలా ప్రతిదాంట్లో పావలా వాటా వెళ్తోందన్నారు. ఆయన ఊసరవెల్లిగా మారారన్నారు. పార్టీలు మారడం, సూట్ కేసులు పంపడం ఆయన ప్రవృత్తిగా మారిందన్నారు. పంపిన సూట్కేసులకు సరిపడా మైనింగ్ ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు. నిర్భయంగా, యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారన్నారు. సర్కారుకు దమ్ముందా? గుంటుపల్లి, ఫెర్రీ పవిత్ర సంగమంలో ఫంటు పేరుతో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని జోగి ఆరోపించారు. కొత్తూరు తాడేపల్లి, వెలగలేరులో గ్రావెల్ ద్వారా కోట్లాది రూపాయలు దండుకుంటున్నారన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్కు ఇక్కడ ఎమ్మెల్యే చేసే దాన్లో వాటా ఉందా అని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేసే దమ్మూ ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే అవినీతి నిరూపించి న్యాయ స్థానంలో నిలబెడతామన్నారు. -
ఉపాధి పనుల పరిశీలన
ఘంటసాల: ఘంటసాలలో 2025–26లో జరిగిన ఉపాధి హామీ పథకం పనులను ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఆడీట్ సీఓఎం వనీత చౌదరి, పింకు కుమార్ మండల కంప్యూటర్ సెంటర్లో బిల్లులను ఎఫ్టీఓలు ఎలా అప్లోడ్ చేస్తున్నారో గమనించారు. పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖలో నిర్మించిన సీసీ రోడ్లు ఫైల్స్ ఎం బుక్, రికార్డులు చూడటంతో పాటు ఆన్లైన్లో కూడా సక్రమంగా ఉన్నాయో లేవో చూశారు. పశువుల షెడ్లు, మేకలు, గొర్రెల షెడ్లు నిర్మాణాలు, వినియోగం, పంట బోదెలు, పంట కాలువల్లో చేసిన ఉపాధి ఫైల్స్, ఏడు రిజిస్టర్ల నమోదును క్షుణ్ణంగా తనఖీ చేశారు. పశువుల షెడ్లను పరిశీలించి యజమానులతో మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు. ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రావడంతో మండలంలోని ఇతర గ్రామాల్లో పర్యటించకుండానే కేంద్ర బృందం వెనుతిరగడంతో కొన్ని గ్రామాల ఎఫ్ఏలు, అధికారులు ఊపిరిపీల్చుకోవడం కొసమెరుపు. ముందుగా ఘంటసాల మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన కేంద్ర ఆడిట్ బృందం సభ్యులు వనిత చౌదరి, పింకు కుమార్ను ఎంపీడీవో సుబ్బారావు సత్కరించారు. డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్ యాదవ్, మచిలీపట్నం, ఉయ్యూరు ఏపీడీలు రామమోహన్, లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్లో 90 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 90 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజలు నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. వారి సమస్యలు తెలుసుకుని, సత్వరమే పరిష్కరించాలని సంబంధిత ఎస్హెచ్ఓలను డీసీపీ ఉదయరాణి ఆదేశించారు. కాగా భూ, ఆస్తి వివాదాలకు సంబంధించి 31, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 12, వివిధ మోసాలపై 9, మహిళా సంబంధిత నేరాలపై 5, కొట్లాటలపై 2, దొంగతనాలపై 5, ఇతర వివిధ సమస్యలపై 26 ఫిర్యాదులు అందాయి. పెనమలూరు: యనమలకుదురు కొండ వెనుక గత కొద్ది రోజుల క్రితం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పెనమలూరు పోలీసులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన యనమలకుదురు కొండ వెనుక నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీ కొట్టడంతో అతను మృతి చెందాడు. అయితే పోలీసులు వివిధ కోణాల్లో విచారించి మృతుడు పశ్చిమబెంగాల్ రాష్ట్రం బిర్బూమ్ జిల్లా బారాలుండా పోస్టు పార్సిములై గ్రామానికి చెందిన లాలుబాస్కీగా గుర్తించారు. అతను పనులు చేయటానికి యనమలకుదురుకు వచ్చి ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు బంధువులకు సమాచారం అందించగా.. వారు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. పీఎం అనంతరం మృతదేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. జి.కొండూరు: చెత్త లోడుతో వస్తున్న లారీ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడిన ఘటన హెచ్. ముత్యాలంపాడు వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన డ్రైవర్ బొర్రా వీర నాగ శ్రీనివాసరావు లారీలో చెత్తను నింపుకొని జి.కొండూరు వైపు వస్తున్నాడు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తుండటంతో జి.కొండూరు మండల పరిధి హెచ్. ముత్యాలంపాడు వద్ద బుడమేరు వంతెన దాటగానే లారీ అదుపు తప్పి సైడ్ కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన వీర నాగ శ్రీనివాసరావుని స్థానికులు దగ్గర్లో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘంటసాల: పదేళ్ల వయస్సులో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కోలవెన్ను ప్రణతి చేసిన నాట్య ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ఘంటసాల గ్రామంలో చేసిన గాన కచేరి 60ఏళ్లయిన సందర్భంగా ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో శ్రీజలధీశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం ఈ నృత్య ప్రదర్శన నిర్వహించారు. నృత్య ప్రదర్శన అనంతరం ఘంటసాల కళాసమితి ఆధ్వర్యంలో సమితి గౌరవాధ్యక్షుడు గొర్రెపాటి రామకృష్ణ చిన్నారి ప్రణతిని ఘనంగా సత్కరించారు. కళా సమితి అధ్యక్ష, కార్యదర్శులు ఘంటసాల కృష్ణ మోహన్, పోతన వెంకటేశ్వరరావు, పామర్రులోని ఘంటసాల కళాపీఠం వ్యవస్థాపకుడు కాటూ రు వెంకట మురళీ కృష్ణ, ప్రణతి తల్లిదండ్రులు విజయ్ కుమార్, బాల భార్గవి పాల్గొన్నారు. -
లాకప్డెత్ సాక్షిగా హైడ్రామా..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సరికొత్త డ్రామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు ఒకవైపు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా మరోవైపు పోలీసు బాస్ను కాపాడేందుకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు ధ్వంసమయ్యాక 40 రోజుల తరువాత తాపీగా సిట్ ఏర్పాటు పేరుతో చేతులు దులుపుకొంటోంది. ఈ ఘటనను సీఐ నాగరాజుకు ఆపాదించి తూతూమంత్రంగా దర్యాప్తు ముగించే యత్నం చేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ప్రతిష్ట మంటగలిసి పోవడంతో దీన్ని కప్పిపుచ్చేందుకు సర్కారు పడరాని పాట్లు పడుతోంది. సాయికృష్ణ ఉదంతంపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ‘ఎవరో కులం వాడు క్రిమినల్ పనులు చేస్తే నేను బాధ్యత వహించాలా? ఎంపీలు, ఎమ్మెల్యేలు నోరు విప్పరా..?’ అంటూ సాయికృష్ణ మిస్సింగ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో సాయికృష్ణ కుటుంబం జనసేన తరపున పని చేయలేదా? అని పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఏమైంది? తొలుత తాము సాయికృష్ణను తీసుకురాలేదని బుకాయించినా తరువాత విధిలేని పరిస్థితుల్లో టాస్్కఫోర్స్, కృష్ణలంక పోలీసులు కలిసి వెళ్లి మార్కాపురం నుంచి మే 9న సాయికృష్ణను విజయవాడకు తెచ్చామని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని ఇప్పటికే విచారణాధికారి ఎదుట వెల్లడించినట్లు సమాచారం. ప్రభుత్వ పెద్దలకు, పోలీసు బాస్కు ముందుగానే దీనిపై సమాచారం ఉందని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తెచ్చామని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని, 70 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం పదేపదే చెబుతోంది. ప్రత్యేకించి విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం వాడటంలో దిట్టలు అని, నగరంలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎన్నో కేసులు చేధించామని ప్రకటించే ఉన్నతాధికారులు సాయికృష్ణ ఆచూకీపై నోరు మెదపకపోవడం సందేహాలకు దారి తీస్తోంది. దీన్నిబట్టి ఈ వ్యవహారం అంతా ప్రభుత్వ పెద్దలు, పోలీసు బాస్ కనుసన్నల్లోనే జరిగినట్లు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. కరుడు గట్టిన నేరస్తుల నుంచి సమాచారాన్ని రాబట్టే పోలీసులు సాయికృష్ణ అదృశ్యంపై వివరాలను సేకరించడం పెద్ద కష్టమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కానిస్టేబుళ్లను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నా ఆ దిశగా దృష్టి సారించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. ల్యాండ్ డీల్ వ్యవహారమేనా..! సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏముందనే కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక భూ వివాదం దీనికి కారణమని.. ఎంపీ, పోలీసుబాస్ పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రాంతి కుమార్ ఆత్మహత్య... సీఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియోలో వెల్లడించినా ఇంతవరకు దీనిపై పోలీసులు విచారణ చేపట్టలేదు. క్రాంతి కుమార్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదని దళిత సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. సీఐ ఇంటి వద్ద హైడ్రామా.. తనపై కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు సీఐ నాగరాజు ఇంటి వద్ద హైడ్రామా నడుపుతున్నారు. సీఐపై చర్యలు తీసుకోవద్దంటూ కొందరు యువకులు, మహిళలను పోగు చేసి ఆదివారం ఆందోళన చేయించారు. కొందరు పోలీసులు నాగరాజు ఇంటికి చేరుకుని విచారణ పేరుతో మంతనాలు సాగించారు. ఇక సాయంత్రం ధర్నా చౌక్ ప్రాంతం వద్ద సీఐకు అనుకూలంగా ధర్నా చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినా పోలీస్ బాసులు వారించడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గడం గమనార్హం. ఇవన్నీ కేసును పక్క దారి పట్టించేందుకు చేస్తున్న కుట్రలేనని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
క్రాంతికుమార్ది ప్రభుత్వ హత్యే
లబ్బీపేట/కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలీసుల వేధింపుల వల్లే పేరుపోగు క్రాంతికుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడని, ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుపోగు క్రాంతికుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపి అందుకు కారకులైన పోలీసులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్ల గతనెల 21న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరి గౌతమ్ రెడ్డి, విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ అధికార ప్రతినిధి షేక్ ఆసిఫ్, పార్టీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, సోషల్ మీడియా స్టేట్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఆదివారం పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులను వాడుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం తీరు వల్లే రక్షకభటులు భక్షక భటులుగా మారుతున్నారని, ప్రజలు, సామాన్యులపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. ఇప్పటికే పోలీసు వేధింపులకు రాష్ట్రంలో 12 మంది చనిపోయారని మండిపడ్డారు. ట్యాక్సీ నడుపుకుంటూ బతుకుబండి లాగుతున్న క్రాంతిని ఇన్ఫార్మర్గా మారాలని సీఐ నాగరాజు వేధించారని, లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించారని, ఈ వేధింపులకు భయపడే క్రాంతి ఆత్మహత్య చేసుకున్నాడని ధ్వజమెత్తారు.క్రాంతి బలవన్మరణానికి సీఐతోపాటు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, డీజీపీ, సీఎం, హోంమంత్రి బాధ్యత వహించాలని, క్రాంతి ముగ్గురు పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత తక్షణం ఆ కుటుంబాన్ని పరామర్శించి క్షమాపణ చెప్పి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం క్రాంతి కుటుంబం పనిచేసిందని, దానికి కానుకగా అతని శవాన్ని ప్రభుత్వం ఇచ్చిందని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు వెలుగులోకి వచ్చేవి కావని, ఈ రెండు ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని పేర్కొన్నారు. సాయికృష్ణ, క్రాంతి మరణాలపై పవన్కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. -
పవన్ పరిధి చాలా చిన్నది
సాక్షి, విజయవాడ : డెప్యూటీ సీఎం పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది కాదని.. ఆ విషయం పవన్కళ్యాణ్ తెలుసుకోవాలని అడ్వొకేట్ రజని హితవు పలికారు. ఆయన పరిధి చాలా చిన్నదని, ఆయనకు కేటాయించిన శాఖలు ఆయన చూసుకుంటే చాలన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్క్లబ్లో ‘సాయికృష్ణ లాకప్డెత్–పౌరహక్కులు’ అంశంపై జరిగిన మహిళా ఐక్యవేదిక సమావేశంలో ఆమె ప్రసంగించారు. నేరస్తులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులకే వారిని శిక్షించే అధికారంలేదని.. అలాంటిది డెప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కాలుకు కాలు.. చేయికి చేయి తీసేస్తా.. తొక్కిపట్టి నారతీస్తా అనడం ఏంటని ఆమె ప్రశ్నించారు.రజని ఇంకా ఏమన్నారంటే.. పవన్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారా? లేక సామంత రాజునని అనుకుంటున్నారా? ఆయన వాడే పదజాలం పబ్లిక్లో ఉన్నప్పుడు వాడకూడదని ఎవరూ ఆయనకు చెప్పకపోవడం దౌర్భాగ్యం. డెప్యూటీ సీఎం హోదాలో ఉన్నవ్యక్తి ఇలా పిచ్చి మాటలు మాట్లాడడం ఏమిటి? హోంమంత్రి మీద అంత ప్రేమ ఉంటే పవన్ రాఖీ కట్టించుకోవాలి. ఆయన శాఖలో పనిచేస్తున్న ఒక దళిత మహిళను నడిరోడ్డుపై పోలీసు లాఠీతో జనసేన నేతలు కొందరు కొడితే పవన్ ఎందుకు స్పందించలేదు? తప్పు జరగకపోతే ప్రభుత్వం సిట్ ఎందుకు ఏర్పాటుచేసినట్లు? సామాజికవేత్త వసుంధర కుర్రా, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ గంగాభవానీ మాట్లాడుతూ.. ‘40 రోజులుగా కనిపించకుండాపోయినా సాయికృష్ణ ఉన్నాడా? లేడా?.. ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏమీ జరగకపోతే ప్రభుత్వం ఎందుకు సిట్ ఏర్పాటు చేసింది? సిట్ అధికారులు స్వర్గపురి శ్మశానంలో వివరాలు సేకరిస్తున్నారంటే తప్పు జరిగిందనే కదా.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏదో జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో పబ్లిక్గా డ్రగ్స్ తీసుకునే ఎంపీలు, అమ్మాయిలను వేధించే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ వారిని ఏమీ అనరు. కర్నూలులో గంగమ్మ అనే మహిళ పోలీసుల కస్టడీలో ఉండగానే చనిపోయింది. వీటిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు. -
టీడీపీ నేతల అక్రమ తవ్వకాలు.. అడ్డుకున్న జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు మండలం చేగిరెడ్డిపాడులో టీడీపీ నేతల అక్రమ గ్రావెల్ తవ్వకాలను మాజీ మంత్రి జోగి రమేష్, వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రావెల్ తరలిస్తున్న లారీలు, జేసీబీలను జోగి రమేష్ అడ్డుకున్నారు. జోగి రమేష్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా అధికారులు, జి.కొండూరు ఎస్ఐ సతీష్ స్పందించలేదు. జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన జోగి రమేష్.. జాయింట్ కలెక్టర్తో పాటు ఏసీపీ ప్రసాదరావుకు కూడా ఫోన్ చేశారు.జోగి రమేష్తో ఫోన్లో ఏసీపీ వాగ్వాదానికి దిగారు. టీడీపీ నేతల గ్రావెల్ దోపిడీపై జోగి రమేష్ మండిపడ్డారు. మామిడి తోటలను నాశనం చేస్తూ అటవీ భూములను దోచుకుంటున్నారని.. పచ్చని ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పావలా ప్రసాద్ ఆధ్వర్యంలోనే గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. వాటా లేకుండా, వసంత కృష్ణ ప్రసాద్కి తెలియకుండా ఇంత జరుగుతుందా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.కొత్తూరు వద్ద పర్మిషన్ తీసుకుని శేగిరెడ్డిపాడు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ స్పందించాలి. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దోపిడీపై చర్యలు తీసుకోవాలి. మైలవరం నియోజకవర్గంలోని సహజ సంపదను ఎమ్మెల్యే, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి కూడా భాగం ఉందని ప్రజలు భావిస్తారు’’ అంటూ జోగి రమేష్ ధ్వజమెత్తారు. -
చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి: దేవినేని అవినాశ్
విజయవాడ: క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతల బృందం పరామర్శించింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. క్రాంతికుమార్ తండ్రి వెంకటేశ్వరరావును దేవినేని అవినాశ్, రాయన భాగ్యలక్ష్మి, పూనూరు గౌతమ్ రెడ్డి, పోతిన మహేశ్,షేక్ ఆసిఫ్ పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు.నెలరోజుల క్రితం ఇదే రోజు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని దేవినేని అవినాశ్ చెప్పారు. ‘‘పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ప్రభుత్వ హత్యలే. 8 ఏళ్ల క్రితం క్రాంతి కుమార్ పై కేసులున్నాయి. ఇప్పుడు క్రాంతి కుమార్ పై ఎలాంటి కేసులు లేవు. తండ్రి కొనిచ్చిన కారును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమ దందాల కోసం, గంజాయి అమ్మకాల కోసం పోలీసులు వేధిస్తున్నారు. క్రాంతి కుమార్ మృతికి చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలి. 2024 ఎన్నికల్లో క్రాంతి కుమార్ కుటుంబం కూటమి కోసం పనిచేశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ కుటుంబాన్ని ఇప్పటి వరకూ సీపీ పరామర్శించలేదు. డీజీపీ, సీపీ బయటికి రావాలి. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. క్రాంతి కుమార్ ను కులం పేరుతో పోలీసులు దూషించారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారుల వరకూ అందరిపై కేసులు నమోదు చేయాలి. కూటమి అధికారంలోకి వచ్చాక పోలీసులే గంజాయి అమ్ముతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించకపోతే సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు బయటికి వచ్చేవా? జగన్ కలిశాకే సాయికృష్ణ విషయంలో ప్రభుత్వం కేసు నమోదు చేసింది. సాయికృష్ణ,క్రాంతి కుమార్ కేసులో సీబీఐ విచారణ జరిపించాలి. క్రాంతి కుమార్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది’’ అని తెలిపారు.ఇంకెప్పుడు ఆగుతాయి?మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ... క్రాంతి కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని అన్నారు. ప్రభుత్వ హత్యలు ఇంకెప్పుడు ఆగుతాయని నిలదీశారు. సాయికృష్ణ, క్రాంతి కుమార్ చనిపోయినా చంద్రబాబు, పవన్, హోంమంత్రి నోరుమెదపడం లేదని విమర్శించారు. చంపేసి సెటిల్మెంట్ చేసుకోవాలని చూడటం దుర్మార్గమని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేదంటే వైసీపీ తరఫున ఉద్యమం చేస్తామని తెలిపారు.వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో పోలీసులంటేనే భయపడేలా చేస్తున్నారని చెప్పారు. క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైసీపీ నేత షేక్ ఆసిఫ్ చెప్పారు. క్రాంతి కుమార్,సాయికృష్ణవి ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైసీపీ నేత పోతిన మహేశ్ మాట్లాడుతూ.. పోలీసుల వేధింపుల వల్లే క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కూటమి అధికారంలోకి రావాలని జనసేన పార్టీ కార్యకర్తలు, క్రాంతి కుమార్ కుటుంబం పనిచేసిందని అన్నారు. కూటమి నిజస్వరూపాన్ని ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. -
అన్నదానానికి రూ. 50 వేల విరాళం
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణాకు డీఎస్సీ–2008, 1998లలోని మినిమం టైమ్స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులకు ఈ నెల 22న బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా డీఎస్సీ–2008, అనంతరం డీఎస్సీ–1998 ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణాకు సంబంధించిన మినిమం టైమ్స్కేల్ ఉపాధ్యాయుల జాబితాను వెబ్సైట్ doekrn.wee by.com లో పొందుపరిచినట్లు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 22న ఉదయం 10.30 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్కు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. హాజరుకాని ఉపాధ్యాయులకు మిగులు ఖాళీలు కేటాయించనున్నట్టు డీఈఓ స్పష్టం చేశారు. -
యోగాతో జీవన శైలి వ్యాధుల నిర్మూలన
మంత్రి సత్యకుమార్ యాదవ్ గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): యోగా సాధనతో జీవన శైలి వ్యాధులు దూరమవుతాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యోగాంధ్ర–2026లో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మూడు రోజులుగా గుంటుపల్లి డాన్బాస్కో పాఠశాలలో జరిగిన యోగా పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో సుమారు 1600 మంది పాల్గొనగా, ప్రతిభకలిగిన 108 మంది విజేతలుగా నిలిచారు. వారికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కె.వి.ఎస్.చక్రధర్బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియాతో కలసి జ్ఞాపికలు, సర్టిఫికెట్లను మంత్రి అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రాచీన వారసత్వ సంపదను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి నుంచి విశేష కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాతో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత, ఏకాగ్రత పెరుగుతా యని వివరించారు. ఈ సంవత్సరం ఆరోగ్యకర వృద్ధాప్యానికి యోగా థీమ్తో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతున్నామని పేర్కొన్నారు. నిత్యం 45 నిమిషాలు యోగాకు కేటాయించాలని సూచించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. యోగా సాధన వల్ల ఆరోగ్యం మాత్రమే కాకుండా మనసు, శరీరం మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమన్వయ అఽధికారులు సుజాత, కృష్ణవేణి, సుకన్య, జిల్లా ఆయుష్ అధికారి రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర కీలకం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెమ్మసాని గుడ్లవల్లేరు: గ్రామీణాభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో 25వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెమ్మసాని పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంపాదించిన డిగ్రీని కేవలం విద్యార్హతగా కాక సమాజాభివృద్ధికి దోహదపడే సాధనగా మలచుకోవాలన్నారు. వ్యవసాయం, పారిశుద్ధ్యం, తాగునీరు, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో యువ ఇంజినీర్ల సేవలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంజినీరింగ్ కళాశాలలు పరిశోధకులు, వ్యవస్థాపకులను తయారు చేసే సంస్థలుగా రూపుదిద్దుకోవాలని సూచించారు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల విద్య ప్రతిభావంతులకు, జ్ఞాన సముపార్జనకు, శ్రేష్ఠతకు నిలయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణ, సహ కార్యదర్శి వల్లూరు పల్లి రామకృష్ణ, కళాశాల సభ్యులు వల్లూరుపల్లి వెంకట కిరణ్, ముసునూరి శ్రీరామ్, డైరెక్టర్ డాక్టర్ పి.సిద్ధయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్, యాజమాన్య సలహాదారు డాక్టర్ పి.రవీంద్రబాబు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ పి.కోదండ రామారావు, డాక్టర్ ఎం.ఆర్.సి.హెచ్.శాస్త్రి, పీజీసీఆర్డీ డైరెక్టర్ డాక్టర్ జి.వి.ఎస్.ఎన్.ఆర్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 20267గొల్లపూడి ఏఎంసీ ప్రాంగణంలో శనివారం అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మను యోగా గురు బాబా రామ్దేవ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ హంసా ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ సిటీ విభాగాల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి సెమినార్ హాలులో జరిగిన అసోసియేషన్ సమావేశంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసి యేషన్ విజయవాడసిటీ ప్రెసిడెంట్గా జాలం సరోజిని, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎం.ఎస్.ఆర్.కె.ప్రసాద్, కార్యదర్శిగా కె.బి.సి.శేఖర్, కోశాధికారిగా జె.పుష్పలీల ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా వి.రామకృష్ణ, అసోసియేట్ ప్రెసిడెంట్గా వి.రోషిబాబు, సెక్రటరీగా రాజశేఖర్, కోశాధికారిగా కె.ఎ.ఎల్.ప్రసన్న ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవానంద్ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర మహిళా కార్యదర్శి పాగోలు రమ పరిశీలకులుగా వ్యవహరించారు. అనంతరం ఎన్నికై న వారందరూ బాధ్యతలు స్వీకరించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.81 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. 17 రోజులకు హుండీల ద్వారా రూ.3,81,94,846 నగదు 230 గ్రాముల బంగారం, 4.300 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. కానుకల లెక్కింపును ఈఓతో పాటు ఆలయ ట్రస్ట్బోర్డ్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పలువురు సభ్యులు పర్యవేక్షించారు. ఇతర దేశాలకు చెందిన కరెన్సీ లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. 1,707 అమెరికా డాలర్లు, 195 యూఏఈ దిర్హమ్స్, 52 సౌదీ రియాల్స్, 50 ఆస్ట్రేలియా డాలర్లు లభించాయి. కానుకల లెక్కింపులో రద్దయిన రూ.2000 నోట్లు 15, రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. కోనేరుసెంటర్(మచిలీపట్నం): మండలంలోని మంగినపూడి బీచ్ సమీపంలోని సత్రవపాలెం గ్రామంలో శనివారం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్ఎఫ్డీబీ) బృందం పర్యటించింది. రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ శ్రీరామ శంకర్నాయక్, సీఈఓ డాక్టర్ విజయ్కుమార్ బెహర్ ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఎల్ వనామీ నెక్యూలియర్ బ్రీడింగ్ సెంటర్కు అవసరమైన స్థలాన్ని సేకరించేందుకు ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. పర్యటనలో జిల్లా మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ జి.లక్ష్మీశ ప్రారంభించిన ఇగ్నైట్ సెల్కు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో శనివారం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కలెక్టర్ తరఫున జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు కార్యక్రమంలో పాల్గొని అవార్డు స్వీకరించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. దేశంలో పరిపాలన, అభివృద్ధి, సృజనాత్మక కార్యక్రమాల అమల్లో విశిష్ట సేవలను గుర్తిస్తూ అందజేసే ఈ అవార్డుకు ఇగ్నైట్ సెల్ ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. స్కోచ్ సంస్థ నిర్వహించిన కఠినమైన, పారదర్శకమైన, ఫలితాల ఆధారిత మూల్యాంకన ప్రక్రియలో అన్ని దశలను విజయవంతంగా పూర్తిచేసిన అనంతరం ఇగ్నైట్ సెల్ ప్రాజెక్టు అవార్డుకు ఎంపిౖకైందన్నారు. జాతీయ స్థాయి పురస్కారం టీమ్ ఎన్టీఆర్ జిల్లా సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేందుకు ఇగ్నైట్ సెల్ ఉపయోగపడుతోందని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉరుకుల పరుగుల జీవన విధానంతో యువత నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ ఒత్తిళ్ల బారిన పడుతున్నారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించేందుకు జీవన పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పని వత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి వాటితో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత కొరవడింది. దీంతో శారీరక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్వ జీవన విధానంలో భాగమైన యోగాపై ప్రజలు దృష్టి సారి స్తున్నారు. ఇటీవల కాలంలో యోగాతో లభించే ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన పెరి గింది. విజయవాడ నగరంలో అనేక యోగా కేంద్రాలు వెలిశాయి. ఉదయం సాయంత్రం వేళల్లో యోగా క్లాసులు నిర్వహించడంతో ఎవరికి అనువైన సమయంలో వారు వెళ్తున్నారు. ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్స వాన్ని జరుపుతున్నారు. వయసుతో నిమిత్తం లేదు యోగాసనాలతో ప్రయోజనం యోగాతో పాటు పలు రకాల ఆసనాలు, యోగా థెరపీతో పలు రకాల వ్యాధులు, నొప్పులతో భాదపడుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెన్ను నొప్పితో భాదపడే వారికి భుజంగ ఆసనంతో పాటు మరికొన్ని ఆసనాలు చేయిస్తారు. అంతేకాకుండా ఆస్తమా, సైనస్, ఎలర్జీలకు ప్రాణయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, గర్భిణులకు ప్రీ నాటల్ యోగా వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. గర్భిణులు ఆసనాలు చేయడం ద్వారా గర్భస్థ శిశువుకు సమతుల్యంగా రక్త ప్రసరణ, బ్రీతింగ్ జరుగుతుంది. ఇలా అనేక రకాల ఆసనాలు ప్రజలకు ఉన్న సమస్యలను బట్టి అందుబాటులో ఉన్నాయి. యోగా దినచర్యలో భాగం కావాలి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.3600 టీఎంసీలు. ఎగువ నుంచి 400 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. మధుమేహ వ్యాధి గ్రస్తులకు యోగా చాలా కీలకం. మెరుగైన ఆరోగ్యాన్ని కోరుకునే మధుమేహ బాధితులకు యోగాతో సాధారణ వ్యాయామమే కాకుండా క్యాలరీలు ఖర్చయ్యి బరువు తగ్గడం, బీపీ, షుగర్లు అదుపులో ఉంటాయి. ప్రాణాయామం శ్వాసమీద ద్యాసను పెంపొందించడమే కాక కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో ఊపరితిత్తుల పనితీరును మెరుగుపరిచి, మధుమేహాన్ని అదుపుచేస్తుంది. అంతేకాక ధ్యానంతో మైండ్ రిలాక్స్, హైపోథా లమస్కు ప్రయోజనం చేకూరుస్తుంది. దీంతో ప్రాంక్రీయాస్, ఇతర అవయవాల పని తీరు మెరుగుపడుతుంది. – డాక్టర్ ఎం.సునీత, మధుమేహ నిపుణురాలు కండరాలను సాగదీయడానికి, బలోపేతం చేయడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. కండరాల ఓర్పు, సమతుల్యతను మెరుగుపర్చడానికి దోహదం చేస్తుంది. వత్తిడిని తగ్గించి చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. సున్నితమైన ఆసనాలు కీళ్లలో కదలికను మెరుగుపరిచి, ఆర్థరైటీస్ వంటి నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. భుజంగాసనం, మకరాసనం వంటివి వెన్నెముకను దృఢపరుస్తాయి. ప్రాణాయామం, లోతైనా శ్వాస తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. – డాక్టర్ జి.శ్రీరమ్య, ఫిజియోథెరపిస్ట్ -
స్వయం ఉపాధికి నిచ్చెన
‘సాక్షి’ మైత్రి మహిళ శిక్షణ.. మెలకువలు నేర్చుకుంటున్న మహిళలుశిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందుకుంటున్న మహిళలుకృష్ణలంక(విజయవాడతూర్పు): మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు ‘సాక్షి’ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్యూటీషియన్ కోర్సు శిక్షణ శనివారం విజయవంతంగా ముగిసింది. సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణలంకలోని మేఘన హెర్బల్ బ్యూటీ క్లినిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ నెల రోజులపాటు సాగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మహిళలు థ్రెడింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ ప్యాక్, డాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బ్రైడల్ మేకప్స్, గ్రూమింగ్, ఫేషియల్స్ తదితర అంశాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు. బ్యూటీషియన్ వృత్తిలో నైపుణ్యాలు తెలుసుకున్నా మని, తద్వారా ఆర్థిక స్వావలంబన సాధిస్తామని శిక్షణ పొందిన మహిళలు ఆత్మ విశ్వాసంతో చెప్పారు. ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా బ్యూరో ఇన్చార్జి ఓ.వెంకట్రామిరెడ్డి అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొని శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఈవెంట్ మేనేజర్ శ్రీహరి పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళల అభిప్రాయాలు వారి మాటల్లోనే... సాక్షి మైత్రి మహిళతో కలిసి బ్యూటీషియన్ శిక్షణ తరగతులు నిర్వ హించాం. నెల రోజుల శిక్షణలో 20కి పైగా అంశాలతో పాటు ప్రాక్టికల్స్ కూడా చేయించాం. కస్టమర్ వస్తే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా మెలగాలో చక్కగా నేర్చుకున్నారు. శిక్షణ పొందిన మహిళలకు బ్యూటీపార్లర్ పెట్టుకోగలమనే నమ్మకం వచ్చింది. మహిళలకు స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్న ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు – అందె నాగలక్ష్మి, ట్రైనర్, మేఘన హెర్బల్ బ్యూటీ క్లినిక్ అండ్ ట్రైనింగ్సెంటర్ -
ఏపీకి అలర్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: రాగల మూడు గంటల పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికను ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసింది. మన్యం, విజయనగరం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.శ్రీకాకుళం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ను విపత్తుల సంస్థ ప్రకటించింది. పిడుగులతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.విశాఖపట్నంలో వర్షం దంచికొడుతోంది. బీచ్ రోడ్డులో వరద నీరు భారీగా చేరింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సుమారు గంట నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. -
సాయికృష్ణ కేసు.. పోలీసుల అదుపులో బాషా!
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారంలో పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాధ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు.విచారణలో భాగంగా ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అతడి మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకుని సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో సాంకేతికంగా పరిశీలిస్తున్నారు. శ్మశాన వాటికలో విధి నిర్వహణలో ఏమైనా లోపాలు జరిగాయా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
వచ్చే నెల 27 నుంచి శాకంబరీ ఉత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జూలై 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు శాకంబరీదేవి ఉత్సవాలు జరగనున్నాయి. 27న ఆకుకూరలు, 28న కాయగూరలు, 29వ తేదీన కాయలు, పండ్లతో అమ్మవారిని అలంకరించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. శాకంబరీ ఉత్సవాలలో భాగంగా శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఇతర ఉపాలయాల్లో దేవతా మూర్తులను ఆకుకూరలు, కాయగూరలతో విశేషంగా అలంకరిస్తారు. అమ్మవారిని అలంకరించేందుకు అవసరమైన పండ్లు, కాయగూరలు, ఆకుకూరలను రైతులు, హోల్సేల్ వ్యాపారుల నుంచి సేకరించనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 20 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను దాతల ద్వారా సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కదంబం.. ప్రత్యేకం.. శాకంబరీదేవిగా దుర్గమ్మను దర్శించుకున్న భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఈ ఉత్సవాలలోనే ప్రత్యేకంగా తయారు చేసే కదంబ ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉంది. శాకంబరీదేవి ఉత్సవాలలో రోజూ 50 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా వీలుగా ఏర్పాట్లు చేయాలని దుర్గగుడి ఈవో శీనానాయక్ ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు, అర్చకులు, వైదిక కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజుల పాటు ఉత్సవం -
రాష్ట్రంలో 5వేల ఆలయాల నిర్మాణం
పెనుగంచిప్రోలు: తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో 5 వేల ఆలయాలను నిర్మించనున్నామని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్ అన్నారు. గ్రామంలో వేంచేసి ఉన్న తిరుపతమ్మవారిని శుక్రవారం ఆయన కటుంబసభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ఈఓ బి. మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఈఓ అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 27,500 ఆలయాలు ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకారులు నివసించే ప్రాంతంలో 5వేల ఆలయాలు రాబోవు మూడేళ్ల కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 1,275 ఆలయాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలో అంతా ఆన్లైన్.. రాబోవు రోజుల్లో ఆలయాల్లో అన్ని రకాల సేవలను భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకుంటారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో 40 శాతం ఆన్లైన్లో టికెట్లు బుకింగ్ చేసుకుంటుంటే అన్నవరంలో మాత్రం 95 శాతం అమలవుతుందన్నారు. రాష్ట్రంలో 22 ముఖ్య ఆలయాలు ఉంటే వీటిలో 7 ఆర్జెసీ, 15 డీసీ కేడర్లో ఉన్నాయన్నారు. ఆదాయపరంగా, భక్తుల పరంగా ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 6(ఎ) ఆలయాలు 175 ఉన్నాయని, వీటిల్లో కూడా సిబ్బంది, భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, దర్శనాలుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కేశ ఖండనశాల, ఆలయ పరిసరాల్లో భక్తులకు అందుతున్న సేవలను వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ -
ప్రతి ఒక్కరి జీవితంలో యోగాతో ఆనందం
గుడ్లవల్లేరు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అంగలూరులోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ(డైట్)లో నిర్వహిస్తున్న పోస్టర్ మేకింగ్ పోటీలు శుక్రవారంతో ముగిశాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల విద్యార్థులకు జిల్లా స్థాయి పోస్టర్ మేకింగ్ పోటీలను రెండు రోజుల పాటు ప్రభుత్వ డైట్ కళాశాల, అంగలూరులో విజయవంతంగా నిర్వహించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబించే పోస్టర్లను రూపొందించారు. కృష్ణా జిల్లా విజేతగా జి. అపూర్వ (10వ తరగతి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, అంగలూరు), ఎన్టీఆర్ జిల్లా విజేతగా ఎస్కే హఫ్సా తహ్సీన్ (10వ తరగతి, పి.ఎం. శ్రీ ఎం.కె. బైగ్ ఎం.సి.హెచ్.ఎస్, విజయవాడ) నిలిచారు. వీరితో పాటు రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందించామని డైట్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీనారాయణ తెలిపారు. రైల్వేస్టేషన్( విజయవాడ పశ్చిమ): దక్షిణ రైల్వే జోన్ అరక్కోణం జంక్షన్లో జరుగుతున్న నాన్–ఇంటర్లాకింగ్, స్టేషన్ ఆధునికీకరణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడుస్తున్న పలు రైళ్లను తాత్కాలికంగా దారి మళ్లించి నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్ఓ నుస్రత్ మండ్రు ప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న విల్లుపురం–ఖరగ్పూర్ (22604), 24న తిరు నెల్వేలి–పురూలియా (22606), 25న టాటా నగర్–యర్నాకుళంం (18189) రైళ్లు మెల్పక్కం, తిరుత్తాని, రేణిగుంట, గూడూరు మీదుగా దారి మళ్లించి నడపనున్నారు. -
ఐజీఎంసీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
పటమట(విజయవాడతూర్పు): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం(ఐజీఎంసీఎస్)లో చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక, యోగా సాధన ప్రదేశం, అతిథులు, యోగా సాధకులు, ప్రజల కోసం చేపట్టిన ఏర్పాట్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, జోనల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
మందుల్లేవ్.. సౌకర్యాలూ లేవు
● దయనీయ స్థితిలో ప్రభుత్వాస్పత్రులు ● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సౌకర్యాలు లేక నిరుపేద రోగులు అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేద వాడి ప్రాణాల కంటే.. ప్రచారానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుతాస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు రంగులు వేసి, తామే చేసినట్లు బిల్డప్ ఇవ్వడం మినహా చేసిందేమీ లేదని ఆరోపించారు. వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు ఉండవు.. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో నిత్యం 3వేల మంది వరకూ రోగులు వస్తుంటారని, నడవలేని వారికి కనీసం వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉండని పరిస్థితి నెలకొందని విష్ణు ఆరోపించారు. పేదవాడికి సంజీవని లాంటి ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించిందన్నారు. వైద్యం పొందాలంటే ఇళ్లు, వంటిపైన నగలు తాకట్టు పెట్టాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాని ంగ్ మెషిన్లు పనిచేయకున్నా పట్టంచుకునే వారు లేరన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి మీటింగులు పెట్టడం కాదని విజయవాడ జీజీహెచ్కి వచ్చి ఎక్స్–రే రూమ్, ఎమ్మారై రూమ్ల ముందు క్యూ కట్టిన పేద రోగుల కష్టాలను కళ్లారా చూడాలని విష్ణు హితవు పలికారు. -
రామలింగేశ్వరుని సేవలో సుప్రీంకోర్టు మాజీ సీజే
వీరులపాడు: మండలంలోని పొన్నవరం గ్రామంలో వేంచేసియున్న పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు, అభిషేకాల అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణాన్ని జరిపించారు. కల్యాణోత్సవంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ముందుగా వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎన్వీ రమణ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతోనే తాను ఇంతటి స్థాయికి చేరుకున్నానని తెలిపారు. -
కూటమి ప్రభుత్వంలో వాతలే కాదు.. కోతలూ బోనస్
● అరగంట ఆన్.. పావు గంట ఆఫ్.. ● సర్కారు వారి అప్రకటిత విద్యుత్ కోతలు ● చినుకు పడితే కట్.. చెట్టు ఊగితే కట్ ● ఉక్కపోతతో అవస్థలు పడుతున్న ప్రజలు డీటీఆర్లపైన ఉండే హెచ్జీ ఫ్యూజ్ వైర్ గుండా ఉడతలు, బల్లులు వెళ్లటం వల్ల ఫీడర్లు ట్రిప్ అయి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో నందిగామ పట్టణంలోని అయ్యప్ప స్వామి వారి ఆలయ సమీపంలో డీటీఆర్ కేబుల్ వైర్కు ట్రాక్టర్ తగలడం వల్ల ఫీడర్ ట్రిప్ అయి కొంత సమయం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమస్య తలెత్తిన వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. – నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ ఏఈ, నందిగామ టౌన్ నందిగామ రూరల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా పరిస్థితి అర గంట ఆన్.. పావు గంట ఆఫ్.. అన్న చందంగా మారింది. విద్యుత్ శాఖాధికారులు విధిస్తున్న అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రోజుల నుంచి ఎండ వేడిమి తగ్గినప్పటికీ భరించలేని ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. చిన్నారులు, వృద్ధుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. దీనికి తోడు గంటల తరబడి విద్యుత్ కోతలను దశల వారీగా అమలు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో గంటకు 10 నుంచి 20 నిముషాల చొప్పున దశల వారీగా రోజు మొత్తం మీద ఐదారు గంటలకు పైగా అనధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని మండిపడుతున్నారు. నందిగామ, అనాసాగరం, చందాపురం గ్రామాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్ల ద్వారా పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సబ్ స్టేషన్ల పరిధిలో చిన్నపాటి వర్షం పడినా.. చిరు గాలులకు చెట్లు కదిలినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ప్రజలు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే నందిగామలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని విద్యుత్ శాఖాధికారులు అనధికారిక కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఈఎల్ఆర్(ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని వాపోతున్నారు. మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కూడా అప్రకటిత కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. దీంతో లైన్ ట్రిప్ అయినా.. లేక ఏదైనా సమస్య వచ్చినా దానిని పునరుద్ధరించడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ఇక కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, పెడన, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో సైతం కోతలు అధికంగానే ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిన సమయంలో సమాచారం తెలుసుకునేందుకు ఫోన్ చేసినా కనీసం స్పందించటం లేదని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు లైన్మెన్లు మరొకడుగు ముందుకేసి ఈఎల్ఆర్(ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్) పేరుతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్ సరఫరాకు సమయం పడుతుందని వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు తప్ప విద్యుత్ సరఫరా సమాచారం మాత్రం చెప్పటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. విద్యుత్ శాఖాధికారులు స్పందించి అనధికారిక విద్యుత్ కోతలు విధించకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 33.0520 టీఎంసీలు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 4130 క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గన్నవరం: విమానాశ్రయంలో యోగా గురువు బాబా రాందేవ్కు శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయవాడలో 21న జరగనున్న యోగా దినోత్సవంలో ఆయన పాల్గోనున్నారు. -
రెండోసారి నీట్గాఏర్పాట్లు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): వైద్య విద్య ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ ఈ నెల 21న జరగనుంది. గత నెల మూడో తేదీన జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా ప్రభుత్వం దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ పరీక్షను తాజాగా ఈ ఆదివారం దేశ వ్యాప్తంగా నిర్వహించేందుకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 12 వేల మంది అభ్యర్థులకు 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా.. ప్రత్యేక కారణాల రీత్యా మరో 15 నిమిషాలు అధికంగా సమయాన్ని ఇవ్వనున్నారు. పరీక్ష సాయంత్రం 5.15 నిమిషాల వరకూ కొనసాగనుంది. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే అభ్యర్థులను ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. వస్త్రధారణపై ఆంక్షలు.. నీట్కు హాజరయ్యే అభ్యర్థులు వస్త్రధారణపై జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ గత అనుభవాల రీత్యా పలు ఆంక్షలు విధించింది. అభ్యర్థులు చెవులకు దిద్దులు, చేతులకు గాజులు, ముక్కుపుడకతో సహా ఆభరణాలు, వాచీలు, జీన్స్ ప్యాంట్లు, టోపీలు, సన్గ్లాసెస్ ధరించకూడదు. సెల్ఫోన్లు, స్మార్ట్బాండ్లు వంటి ఇతర ఎటువంటి వస్తువులను అనుమతించరు. ట్రాఫిక్ అలర్ట్.. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న దృష్ట్యా నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు ట్రాఫిక్ ఇబ్బందులను గమనంలో ఉంచుకొని ముందుగానే బయలుదేరి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): నీట్ పరీక్ష నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు బందరులో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారన్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా పర్యవేక్షణ కోసం ఈ నెల 20, 21వ తేదీల్లో కలెక్టరేట్లో జిల్లా స్థాయి కంట్రోల్రూమ్(08672–252399)ను ఏర్పాటు చేశామన్నారు. 20వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 21వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందన్నారు. రేపటి పరీక్షకు ఎన్టీఆర్ జిల్లాలో 31 కేంద్రాలు -
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
మరోసారి చంద్రబాబు సర్కార్ దగా
సాక్షి, విజయవాడ: మరోసారి కూటమి సర్కార్ దగా చేసింది. ఆక్వా మేత ధర కిలోకి రూ.4 తగ్గిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన అమలు కాలేదు. కిలోకి రూ.2 మాత్రమే ఫీడ్ కంపెనీలు తగ్గించాయి. చంద్రబాబు ఆదేశాలు అమలు కాకపోవడంతో తమను మళ్లీ మోసం చేశారంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రొయ్యలు, చేపల సాగుకు వినియోగించే అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నాయే తప్ప ఆక్వా ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు వాపోయారు. ముడిసరుకుల ధరలు పెరిగినప్పుడు ఫీడ్ ధర పెంచుతున్న కంపెనీలు.. వాటి ధరలు తగ్గినప్పుడు మాత్రం కూడా తగ్గించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, చంద్రబాబు ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకం అన్నదాతల పాలిట దుఃఖీభవ పథకంగా మారింది. రాష్ట్రంలోని రైతులందరికీ కేంద్ర ప్రభుత్వ సాయంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నమ్మబలికారు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ పథకంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది అదీ ఇవ్వకుండా పెట్టుబడి సాయాన్ని నిస్సిగ్గుగా ఎగ్గొట్టారు.రెండో ఏడాది అరకొర సాయం అందించిన చంద్రబాబు.. మూడో ఏడాది కూడా రైతులను వంచించేందుకు యత్నిస్తున్నారు. 2026–27 వ్యవసాయ సీజన్కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. అది కూడా అరకొరగానే ఇస్తున్నారు. కౌలు రైతులకు ఈసారీ మొండి చేయే చూపించారు. -
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శ తర్వాతే ఈ కేసులో.. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాల్లో కదలికలు రావడం గమనార్హం. గురువారం రాత్రి 11గం. సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు దిశా పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవ ప్రసాద్ను విచారణ అధికారిగా నియమించినట్లు విజయలక్ష్మితో సీపీ రాజశేఖర్ చెప్పినట్లు సమాచారం. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం కేసు విచారణను మరింత కీలక దశకు తీసుకెళ్లింది. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాయికృష్ణ ఇంటికి వైఎస్ జగన్ వెళ్లడంతోనే ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వం.. ఆగమేఘాల మీద పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు చర్చ నడుస్తోంది. మరోవైపు.. సస్పెండైన కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్ తప్పదని.. ఆ తర్వాత ఈ కేసులో మరికొంత మంది ఖాకీలపైనా చర్యలు ఉంటాయంటూ లీకులు వస్తున్నాయి. ఈ కేసులో సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్పీ నరసింహ కిశోర్ ఇవాళ విజయవాడ రానున్నారు. డీజీపీ హరీష్కుమార్ గుప్తా, విజయవాడ సీపీ రాజశేఖర బాబులను కలిశాకే.. కృష్ణలంక స్టేషన్కు వెళ్తారని సమాచారం. ఇదీ చదవండి: సీఐ నాగరాజు.. మాములోడు కాదు! -
కింకర్తవ్యం?
సాక్షి టాస్క్ఫోర్స్: విజయవాడ కృష్ణలంక యువకుడి లాకప్డెత్ ఘటన నుంచి బయట పడేందుకు చంద్ర బాబు కూటమి సర్కారు వేయని ఎత్తుగడ లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ బాధితులను భయాందోళనలకు గురి చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ, ఆ ఘటనను తెరమరుగు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. లాకప్డెత్ జరిగిందని, ఓ వైపు పోలీసు వర్గాలే బాహాటంగా చర్చించుకొంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీల్లో సైతం ఈ ఘటన హాట్ టాపిక్గా మారింది. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గంలో కలకలం రేపింది. మన ప్రభుత్వంలో మన కాపులకే అన్యాయం జరుగుతోందని వారు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ప్రశ్నించాల్సిన జనసేన రాజీ చేస్తుండటం దిగ్భ్రాంతి పరుస్తోందని వాపోతున్నారు. ఇందుకు విజయవాడ తూర్పు నియోజకవర్గ నేతను రాయబారానికి పంపడమే సాక్ష్యమని ఎత్తి చూపుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై భాదితులను సంతృప్తి పరిచేందుకు పోలీసు పెద్దలు ఇంకో అడుగు ముందుకు వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నగదు ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇంకా అవసరం అయితే ప్రభుత్వం తరపు నుంచి కూడా సాయం చేస్తారని భరోసా ఇస్తునట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వాస్తవానికి చనిసోయిన కుర్రాడికి రౌడీషీటర్ ముద్ర వేసి, అతనిని ఎన్కౌంటర్ చేసుంటే సరిపోయేదని, అదే జరిగి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావని ఓ పోలీసు పెద్ద వ్యాఖ్యనించినట్లు చర్చ జరుగుతోంది. తమదాకా రాకుండా... తమదాకా రాకుండా పోలీసు స్థాయిలోనే కేసు క్లోజ్ కావాలని ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ విషయానికి సంబంధించి ఏదైనా ఉంటే, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడి నిర్ణయం తీసుకొండని మరోమారు సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. తూతూ మంత్రంగా కంటి తుడుపుగా సీఐని సస్పెండ్ చేసి, సమస్య తీవ్ర పెరగకుండా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, రాష్ట్రంలో జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దిక్కుతోచక కర్తవ్యం ఏంటని, డిఫెన్స్లో పడింది. సాయికృష్ణ బతికి ఉంటే, సీఐను సస్పెండ్ చేయరని, రాజీయత్నాలకు ప్రయత్నించారనే భావన వ్యక్తం అవు తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఘటన నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక విలవిల్లాడుతోంది. పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చంపడం, కనీసం శవాన్ని కూడా ఇవ్వకుండా కాల్చివే యటం ఏంటనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న చర్చ. చంద్రబాబు, చినబాబు రెడ్బుక్ రాజ్యంగం నడుస్తోందని, దీంతో పోలీసులు రెచ్చి పోతున్నారనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఖాకీలు కూడా కర్కశంగా వ్యవహారించి నెలరోజులుగా హైడ్రామా నడిపి, సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి చంపండం, కనీసం శవం ఇవ్వకుండా ప్రవర్తించడం వెనుక, రెడ్బుక్ అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పౌరుల ప్రాణాలకు రక్షణ లేదా, అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిలదీస్తున్నారు. కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే వరకు పోలీసుల్లో చలనం లేదని, ఈ విషయం అంతా సీఎం, డిప్యూటీ సీఎం, చినబాబుకు తెలియకుండా జరుగుతుందా ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు అండగా ప్రభుత్వం నిలవడంపై కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. లాకప్ డెత్ ఉదంతం కూటమి ప్రభుత్వ పతనానికి నాంది పలుకనుందని, విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీలు
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): మండలం పరిధి లోని గుంటుపల్లి డాన్బోస్కో స్కూల్లో రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. యోగాంధ్రలో భాగంగా జరిగిన యోగా పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 800 మంది యోగా సాధకులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి డాక్టర్ సుజాత, పోటీల రాష్ట్ర నోడల్ అధికారి ఝాన్సీలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఎస్.ఇలక్కియ పాల్గొని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈ పోటీలు యోగాంధ్ర– ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేజ్ థీమ్తో జరుగుతున్నాయన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని వివరించారు. వ్యక్తిగత కేటగిరీ, గ్రూపు కేటగిరీల్లో జూనియర్, యంగ్, సీనియర్ గ్రూప్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై.రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీ.. పొక్లయినర్ డ్రైవర్ మృతి
ఉయ్యూరు: మండలంలోని కాటూరు గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొక్లయినర్ డ్రైవర్ మృతి చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని ముదునూరు గ్రామానికి చెందిన పొక్లయినర్ డ్రైవరు దోమతోటి అర్జునరావు(33) సొంత పనుల నిమిత్తం ఉయ్యూరు వచ్చాడు. బైక్పై ఇంటికి వెళ్లే క్రమంలో కాటూరు పెట్రోల్ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఉయ్యూరుకు చెందిన డాక్టర్ కడియాల విశ్వేశ్వరరావు కాటూరు నుంచి కారులో ఉయ్యూరు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైక్ వేగంగా ఢీకొనటంతో అర్జునరావు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అర్జునరావు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్బాబు తెలిపారు. కాగా డాక్టర్ విశ్వేశ్వరరావు కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. మృతుడు అర్జునరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటింది. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు దాసే రవి ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. పేద కుటుంబం కావటంతో అర్జునరావు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.2 లక్షల విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ అభివృద్ధి పనులకు విజయవాడకు చెందిన భక్తులు రూ.2 లక్షల విరాళం సమర్పించారు. విజయ వాడ భారతీనగర్కు చెందిన హెచ్.భాగ్యలక్ష్మి గురువారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు శ్రీనివాసరావు, సూపరిండెంటెంట్ నాగేశ్వరరావు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జపాన్లో ఇటీవల జరిగిన మహిళల అండర్–18 హాకీ ఆసియా కప్ పోటీల్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి నమ్మి గీతశ్రీని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ ఎ.రవినాయుడు సత్కరించారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయంలో రవినాయుడును గీతశ్రీ గురువారం కలిసి తాను ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి తెలిపింది. భవిష్యత్తులో జరగనున్న జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించి భారతదేశానికి పతకాలు అందించాలని గీతశ్రీకి రవినాయుడు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాప్యం లేకుండా 12వ పీఆర్సీ కమిషనర్ను నియమించాలని ఏపీ జేఏసీ, అమరావతి ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ బత్తిన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు హక్కుల సాధన కోసం ఉద్యమా నికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వివిధ జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగులను కలిసి అవగాహన కల్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఐఆర్ విడుదల చేయాలని, వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరారు. తిమ్మసర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు డి.వెంకటేశ్వరరావు, ప్రసాద్, సోము శేఖర్, బంక్ శ్రీను, బాషా, సుబ్బారావు, గోపి, దీపక్ కుమార్, సులోమాన్ రాజు, శ్యాం తదితరులు పాల్గొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యుత్ వినియోగదారుల సమస్యలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదేశించారు. స్థానిక గుణదలలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జిల్లా విద్యుత్ అధికారులతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం గురువారం జరిగింది. పుల్లారెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో లైన్ లాసెస్ లేకుండా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. రెవెన్యూ వసూలుపై దృష్టి పెట్టాలని సూచించారు. పీఎం సూర్యఘర్, పీఎం–కుసుమ, ఎల్టీ నెట్వర్క్ అభివృద్ధి అంశాలపై వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీసీపీడీసీఎల్ ఎన్టీఆర్ జిల్లా సూపరింటెండింగ్ ఇంజినీర్ హనుమయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆపరేషన్స్ విభాగం అధికారులు, ఏపీసీపీడీసీఎల్ (టెక్నికల్) డైరెక్టర్ ఎ.మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వి.ఎస్.ఎన్.మూర్తి,ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణలంక యువకుడు సాయికృష్ణ ఘటనపై అత్యున్నత విచారణ సంస్థలతో నిష్పాక్షికంగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయా లని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవన్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాయి కృష్ణ ఘటనలో 40 రోజులు గడుస్తున్నా నేటికి అధికారులు, ప్రభుత్వం నోరు విప్పకపోవడం సమంజసం కాదన్నారు. నగరంలో ఈస్థాయి ఘటనలు జరుగుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీలు కనీసం స్పందించదని విమర్శించారు. బాధిత కుటుంబానికి ముఖ్యంగా యువకుడు తల్లి, ఒంటరి మహిళకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు భూపతి రమణారావు, పుప్పాల కృష్ణ, బోయ సత్యబాబు పాల్గొన్నారు. -
శుభ ఘడియలు షురూ
● చాలా రోజుల విరామం తరువాత ప్రారంభమైన ముహూర్తాలు ● రానున్న నాలుగు మాసాల్లో వేలాది వివాహాలు ● జోరుగా క్యాటరింగ్, కల్యాణ మండపాల బుకింగ్ ● తర్వాత పుష్కరాలు ఉండటంతో త్వరపడుతున్న వైనం వన్టౌన్(విజయవాడపశ్చిమ): చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వివాహ ముహూర్తాలు ప్రారంభం కావటంతో ఆయా కుటుంబాలు పెళ్లి పనులను ప్రారంభించాయి. అధిక జ్యేష్ట మాసం ముగిసి రెండు రోజుల క్రితమే నిజజ్యేష్ట మాసం ప్రారంభమైంది. దాంతో అన్ని ప్రాంతాల్లో శుభకార్యాలకు సంబంధించి హడావుడి ప్రారంభమైంది. ఆయా ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంది. శుభకార్యాలపై ఆధారపడిన వర్గాల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. నెలవిడిచి నెల శుభముహూర్తాలు.. అధిక జ్యేష్టమాసంలో ముహూర్తాలు ఉండవు. నిజ జ్యేష్టమాసం ప్రారంభం కావటంతో ఈ నెల 16 నుంచి నెల రోజుల పాటు ముహూర్తాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల పాటు వివాహాలకు, గృహప్రవేశాలకు ఇతర శుభకార్యక్రమాలకు అనువుగా ఉన్నట్లు పండితులు వివరిస్తున్నారు. అలాగే నెల తరువాత మళ్లీ శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా శ్రావణమాసం అన్ని కార్యక్రమాలకు మంచి మాసంగా, ఏ శుభకార్యక్రమమైనా ఆ మాసంలో చేసుకోవటానికి అనువైన ముహూర్తాలు ఉంటాయని వారు వివరిస్తున్నారు. ఆ తరువాత మళ్లీ ఆశ్వీయజ మాసంలో మంచి ముహూర్తాలు ప్రారంభమవుతాయని ఆ మాసంలోనూ వివాహ ముహూర్తాలకు అవకాశమున్నట్లు వారు చెబుతున్నారు. ఆషాఢం, భాద్రపదాలు శూన్యమాసాలు.. నిజ జ్యేష్టమాసం ముగిసిన తరువాత వచ్చే ఆషాఢంలో ముహూర్తాలు ఉండవు. జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకూ దాదాపుగా ఆ నెల రోజులు శుభకార్యక్రమాలకు బ్రేక్ పడుతుంది. ఆ తరువాత మళ్లీ భాద్రపద మాసంలోనూ శుభకార్యక్రమాలకు అవకాశముండదని పండితులు చెబుతున్నారు. అంటే సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 11వ తేదీ వరకూ ఈ మాసం ఉంటుంది. ఆ మాసంలో ఎటువంటి ముహూర్తాలు ఉండవని వారు వివరిస్తున్నారు. వివాహాల జోరు.. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగు మాసాల్లో వేలాది వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదారు వేల కల్యాణమండపాలు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాల్స్కు డిమాండ్ పెరిగింది. ఇంటి వద్ద వివాహాలు జరుపుకోవటానికి అవకాశమున్నప్పటికీ అధిక శాతం కుటుంబాలు కల్యాణమండపాలు, ఇతర వేదికల వద్దనే వివాహాలు జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా వాతావరణ పరిస్థితులు కావచ్చు, సోషల్ స్టేటస్ తదితర కారణాల రీత్య బయటే వివాహాలు జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఫుల్ డిమాండ్.. వివాహాల సీజన్పై చాలా విభాగాలు దానిపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా కల్యాణ మండపాలు పక్కన పెడితే ముఖ్యమైనది భోజనాలు దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో వేలాది మంది క్యాటరింగ్ నిర్వాహకులు ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో వివాహాలు సీజన్ ముఖ్యమైనది కావటంతో వారికి గిరాకీ పెరిగింది. వారితో పాటుగా వివాహాలు జరిపించే పండితులు, మండపాలను ఆకర్షణీయంగా అలంకరించే డెకరేటింగ్, బాజాభజంత్రీలు, ఆర్కెస్ట్రా కళాకారులు ఇలా అనేక మంది ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈవెంట్ మేనేజర్లు సైతం ఈ సీజన్ను ఉపయోగించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో రెండు ముఖ్యనదుల పుష్కరాలు జరగనున్నాయి. ముఖ్యంగా గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. అలాగే కృష్ణానదికి సైతం 2028 ఆగస్టు మాసంలో ప్రారంభమవుతాయి. పుష్కరాలు జరిగే సంవత్సరాల్లో వివాహాలు చేయకూడదనే ఆచారాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలను చాలా కుటుంబాలు పాటిస్తాయి. కనుక వచ్చే రెండేళ్లలో రానున్న పుష్కరాల దృష్ట్యా చాలా కుటుంబాలు తమ ఇళ్లలో వివాహాలు ఈ ఏడాదిలో వచ్చే ముహూర్తాల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నాయి. నిజజ్యేష్టం, శ్రావణం, ఆశ్వీయజ మాసాల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అధిక జ్యేష్టం, ఆషాఢం, భాద్రపదాలు శూన్యమాసాలు కావటంతో ముహూర్తాలు ఉండవు. కాబట్టి ముహూర్తాలు ఉన్న మాసాల్లో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరగటానికి అవకాశముంది. ఇప్పటికే చాలా మంది వివాహ ముహూర్తాలు నిర్ణయించుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయా మాసాల్లో వారివారి జన్మనక్షత్రాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ముహూర్తాలు నిర్ణయం అవుతాయి. – పొన్నంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పురోహితుడు -
25 సూచికల్లో 100 శాతం ప్రగతి
ఇబ్రహీంపట్నం: ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేస్తున్నా మని కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్బాబు పేర్కొన్నారు. 38 సూచికలకు ఇప్పటికే 25 సూచికల్లో 100 శాతం పురోగతి సాధించామని తెలిపారు. మిగిలిన 13 సూచికల్లోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషిచేస్తామన్నారు. నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్, కేంద్ర ప్రభారీ అధికారి అశోక్బాబు గురువారం ఇబ్రహీం పట్నం మండలంలో అధికారులతో కలిసి పర్యటించారు. కొటికలపూడిలోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాల తీరును పరిశీలించారు. మూలపాడు లోని ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టిన మునగ, నిమ్మ ప్లాంటేషన్ ప్రాంతాలు, బటర్ ఫ్లై పార్కును సందర్శించారు. కొండపల్లిలో ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలతో పాటు గుంటుపల్లిలో వ్యవసాయ క్షేత్రాలు, రైజ్ కేంద్రాన్ని సందర్శించి, మహిళలు స్వయం ఉపాధి దిశగా అమలు చేస్తున్న వినూత్న శిక్షణ కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 500లకు పైగా ఆకాంక్షిత బ్లాకులను కేంద్ర ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 15 బ్లాకులు ఉండగా, ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు మండలాలు ఉన్నా యన్నారు. మిగిలిన మండలాలతో సమానంగా ప్రగతి సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా, గృహ నిర్మాణం వంటి వాటికి సంబంధించిన సూచికల్లోనూ సంతృప్తికర స్థితికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సారథ్యంలో బ్లాకు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి అన్ని సూచికల్లో ప్రగతి దిశగా తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు డి.శకుంతల, రామకృష్ణ నాయక్, డెప్యూటీ ఎంపీడీఓలు వి.మనోజ్, బి.ప్రసాద్, బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈఓ పుష్పలత, సీడీపీఓ పుష్పలత, డీఆర్డీఏ పీడీ నాచారరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 20267లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ వైద్య కళాశాల స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం జీజీహెచ్, వైద్య కళాశాల ప్రాంగణాల్లో డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు పాల్గొన్నారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ శాక్స్ ఎండీ బాచు స్మరణ్రాజ్ గురువారం పాత ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్టీ, ఐసీటీసీ కేంద్రాలను పరిశీలించారు. జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): స్థానిక ఈవీఎం గోదామును కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం తనిఖీ చేశారు. ఇన్చార్జ్ డీఆర్వో పోతురాజు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.సాయికృష్ణ కేసులో మంత్రి లోకేష్ ఏ–1 ముద్దాయి -
పాపం.. పసివాళ్లు
ప్రక్షాళనతోనే గాడిలోకి.. మచిలీపట్నంటౌన్: వారంతా పదేళ్లలోపు చిన్నారులు.. నా అన్నవారు లేని అభాగ్యులు.. ప్రభుత్వ శిశుగృహంలో వసతి పొందుతున్న ఆ పసివారి ఆలనా పాలన చూడాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమ మధ్య విభేదాల నేపథ్యంలో చిన్నారుల ఆకలిదప్పులను విస్మరిస్తున్నారు. మచిలీపట్నం నగరంలోని ప్రభుత్వ శిశుగృహ నిర్వహణపై ఆరోపణలు వినవస్తున్నాయి. సిబ్బంది మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయని, ఫలితంగా శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న నాలుగు నుంచి పదేళ్ల మధ్య వయసున్న ఎనిమిది మంది చిన్నారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అవసరమైన అన్నిరకాల నిత్యావసరాలు, వంట సామగ్రి ఉన్నా చిన్నారులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నారులకు పాలకు బదులు గంజి ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. శిశుగృహలో ఆరుగురు ఆయాలు, సామాజిక కార్యకర్త పనిచేస్తున్నారు. వారి మధ్య సఖ్యత లేకపోవడంతో పాటు విధి నిర్వహణలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా రని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు సెలవులు పెడుతూ చిన్నారులను సాకడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. పలువురు సిబ్బంది ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఉద్యోగాలు పొందిన వారు కావడంతో వారి వ్యవహార శైలి ఇలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. పరికరాల వినియోగంలోనూ అలసత్వం శిశుగృహలోని పలు గృహోపకరణలను వినియోగించడంలో ఇక్కడ సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వాషింగ్ మిషన్లలో నిర్లక్ష్యంగా డైపర్లను పడేస్తున్నారు. ఫలితంగా ఇటీవల కాలంలో మూడు వాషింగ్ మిషన్లు మూలకు చేరాయి. మిక్సీలు సైతం మరమ్మతులకు గురయ్యాయి. మరో వైపు శిశుగృహానికి దాతలు ఇస్తున్న వస్తువులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. చిన్నారుల దాతలు ఇస్తున్న ఆహార పదార్థాలతో పాటు వెండి, బంగారు వస్తువులను సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారనే పలు వురు విమర్శిస్తున్నారు. నిబంధన ప్రకారం దాతలు నుంచి వితరణలు తీసుకోకూడదు. దీనికి భిన్నంగా ఇక్కడి సిబ్బంది వ్యవహరిస్తున్నారని, కొంత మంది సిబ్బంది ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. శిశుగృహం సిబ్బంది వ్యవహారంపై విచారించి చర్యలు తీసుకుంటాం. సిబ్బంది మధ్య విభేదాలు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. కొంత మంది ముందస్తు సమా చారం లేకుండానే సెలవు పెట్టేస్తున్నారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. చిన్నారులకు దాతలు వెండి, బంగారు వస్తువులు ఇవ్వలేదు. వస్తువులు పక్కదారి పట్టలేదు. చిన్నారులకు గంజి ఇవ్వడం అవాస్తవం. మెనూ ప్రకారమే వారికి ఆహారం అందిస్తున్నాం. కొంత మంది కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారు. – ఎం.నూర్జహాన్ రాణి, ఐసీడీఎస్ కృష్ణాజిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ స్థానిక శిశుగృహలో సిబ్బంది వ్యవహారంతో ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు ఇబ్బందులు తొలగాలంటే కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ దృష్టిసారించి ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక్కడి సిబ్బందిని ఇంకా కొనసాగిస్తే ఇలానే ఎప్పుడు విభేదాలతో వ్యవహరిస్తూ చిన్నారుల ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితులు ఉంటాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్ స్పందించి తక్షణమే శిశుగృహ వ్యవహారంపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: కృష్ణలంకలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని పరామర్శించి ఓదార్చారు. సాయికృష్ణ అదృశ్యం, పోలీసుల వైఖరిపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ తెలిపారు.అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున దారుణ ఘటన జరిగిందని.. సీపీ, ఏసీసీ, సీఐ కూడా ఇందులో ఉన్నారని.. డీజీపీకి కూడా దీంతో సంబంధం ఉందన్నారు. ‘‘మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు. తన కొడుకు ఎక్కడున్నాడని ఈ తల్లి పోలీసులను అడిగింది. కొడుకును చూపించమని పోలీస్స్టేషన్కు వెళ్లని రోజు లేదు. నీ కొడుకు ఫొటోకు దండ వేసుకోమని ఆ తల్లికి చెప్పారు. ..బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను చెత్తబుట్టలో వేశారు. సాయికృష్ణ తల్లితో బేరసారాలు చేశారు. సాయికృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేసింది. బాధితులకు మేం సపోర్ట్గా నిలబడ్డాం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘గత్యంతరం లేక సీఐని సస్పెండ్ చేశారు. చంపారని ఒప్పుకున్నారు కాబట్టే సీఐని సస్పెండ్ చేశారు. ఒకరి కాదు.. ఇద్దరి చావుకు సీఐ నాగరాజు కారణమయ్యాడు. చంద్రబాబు మాత్రం అతన్ని కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు. సీపీ, ఏసీసీ, డీజీపీపై మర్డర్కేసు పెట్టాల్సింది పోయి.. కేవలం సీఐ నాగారాజును సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. సాయికృష్ణ తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయి. కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపేశారు. సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.‘‘కంటితుడుపుగా సీఐ నాగారాజును మాత్రమే సస్పెండ్ చేశారు. ఈ క్రైమ్లో సీఐ ఒక్కడినే బాధ్యుడిని చేయడం కాదు. నేరంలో సీపీ, ఏసీపీ, డీజీపీకి కూడా భాగం ఉంది. వీళ్లందరిపై మర్డర్ కేసు పెట్టి శిక్షించాలి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
సాయికృష్ణ కేసులో వాటిని భద్రపరచాలని కోర్టు ఆదేశం
విజయవాడ రెండో ఏజేఎం కోర్టు గాదె సాయికృష్ణ కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ భద్రపరచాలని ఆదేశించింది. సీసీ ఫుటేజ్తో పాటు కాల్డేటాను కూడా భద్రపరచాలని కోర్టు చెప్పింది. కాగా, గాదె సాయి కృష్ణ లాకప్ డెత్కు గురయ్యారనే వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. గాదె సాయి కృష్ణ నెల రోజుల క్రితం కనపడకుండాపోయారు. ఆయన ఆచూకీ గల్లంతయిన కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టులోనూ విచారణ జరిగింది. ఆ సమయంలో న్యాయస్థానం సీఐ నాగరాజుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 29లోగా బాధితుడిని హైకోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించింది. లేకపోతే సీఐ నాగరాజుపై కేసు నమోదు చేస్తామని చెప్పింది. కాగా, విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని.. మార్కాపురం జిల్లాకు చెందిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మీడియాకు చెప్పారు. -
‘వారికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?’
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ దుర్ఘటన జరిగి చాలా రోజులైందని.. వెలుగులోకి రావడానికి చాలా రోజులు పట్టిందంటే వ్యవస్థలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలుస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇవాళ(గురువారం) కృష్ణలంకలోని గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, వంగవీటి నరేంద్ర పరామర్శించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘గాదె సాయికృష్ణను మే 9వ తేదీన తీసుకొచ్చారు. మే 9వ తేదీ నుంచి సాయికృష్ణను కోసం తల్లి విజయలక్ష్మి తీవ్రంగా ప్రయత్నించారు. విజయలక్ష్మి చెల్లి దుర్గ డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. హ్యూమన్ రైట్స్ వద్దకు వెళితే అడ్డుపడ్డారు. హెబియస్ కార్పస్ వేయకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. జూన్ 15వ తేదీన కోర్టు ఆర్డర్ వచ్చాక మా దృష్టికి తెలిసింది. సాయికృష్ణ కుటుంబం మాకు బాగా తెలిసిన వారే..సాయికృష్ణ పై ఓ వర్గం మీడియా దుర్మార్గంగా ప్రచారం చేస్తోంది. కేసులున్నంత మాత్రాన చంపేస్తారా?. కసబ్ను కూడా విచారించాకే శిక్ష విధించారు. సాయికృష్ణ డెడ్బాడీ లేకుండా చేశారు. కనీసం బూడిదైనా ఇవ్వండని సాయికృష్ణ తల్లి వేడుకుంటోంది. సాయికృష్ణ కుటుంబం మా పార్టీ కాదు. అయినా మానవత్వంతో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేం రాజకీయాలు చేయాలంటే చాలా అంశాలున్నాయి..సాయికృష్ణ అంశాన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సాయికృష్ణ లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. పార్టీలకు అతీతంగా అందరూ సాయికృష్ణ కుటుంబం కోసం కలిసిరావాలి. పోలీసుల దుర్మార్గపు చర్యలను నిలదీద్దాం. మేం ఆ కుటుంబానికి అండగా ఉంటాం. నేను విడుదల చేసిన ఫోటోలు సాయికృష్ణవి కాకపోతే అతన్ని తీసుకురండి. మానవసమాజం తలదించుకునే ఘటన ఇది.ఇలాంటి ఘటనలను పౌరసమాజం కచ్చితంగా స్పందించాలి. పోలీస్ కమిషనర్, డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వానికి తెలియకుండానే సీఐ ఇదంతా చేశారా?. అందరికీ తెలిసే సాయికృష్ణ మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలి. పోలీసు విచారణతో న్యాయం జరగదు. సీబిఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సాయికృష్ణను చంపి బూడిద చేసినట్లే కేసును కూడా బూడిద చేయాలని చూస్తున్నారు. కేంద్రం స్థాయిలో ఈ అంశాన్ని తీసుకువెళతాం. సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతోనే నేరం సగం అంగీకరించారు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు: జడ శ్రవణ్
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ కేసుపై ప్రముఖ న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై, ప్రభుత్వ పెద్దలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏదైనా కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తప్పనిసరిగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాల్సిన నిబంధన ఉందని అన్నారు. అయితే గాదె సాయికృష్ణ వ్యవహారంలో ఆ నిబంధనలు పాటించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇంకా ఆయన ఏమన్నారంటే.. సాయికృష్ణ కేసులో కూటమి ప్రభుత్వ పనితీరు.. ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చ. భారతదేశ చరిత్రలో ఇంత హీనమైన, హేయమైన ఘటన ఎప్పుడూ లేదు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని మూటకట్టి అటకపై పడేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఏ రాజ్యాంగం ప్రకారమైనా తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచాలి. రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండే కొందరు పోలీసులు చేసేదే లాకప్ డెత్. చట్టాలు అప్ గ్రేడ్ అయినట్లు పోలీసులు కూడా అప్ గ్రేడ్ అయినట్లున్నారుఏపీ హోంమంత్రికి ఓ కత్తెర మంత్రి. ఇన్ విజిబుల్ పోలీసింగ్ అని ఏదో ఒక్క అర్ధం చెబుతున్నారామె. నా పాతికేళ్ల న్యాయవృత్తిలో ఇలాంటి పదాలు నేనెప్పుడూ వినలేదు. లాకప్ డెత్ లు జరిగినపుడు పోలీసులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారుసాయికృష్ణను చంపేసి బూడిద చేశారని అతని తల్లి ఆరోపిస్తోంది. తన కొడుకుని చూపించమని పోలీసులను సాయికృష్ణ తల్లి వేడుకుంది. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేవరకూ నేను అండగా ఉంటా. న్యాయపరంగా అవసరమైతే సాయం అందిస్తా. సాయికృష్ణకు జరిగిన అన్యాయం పై కులమతాలకు అతీతంగా అండగా నిలవాలిహోంమంత్రికి చిత్తశుద్ధి ఉంటే.. మే 9 నుంచి ఈరోజు వరకూ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని బయటపెట్టాలి. స్టేషన్ మొత్తం సిసి కెమెరాలు ఉంటే.. సీఐ రూమ్లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు. ఏపీలో ప్రతీ స్టేషన్లో ఇంటరాగేషన్ కోసం వ్యక్తిగత రూమ్ లు ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణలంక సీఐ వ్యక్తిగత రూమ్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయిసాయికృష్ణ మృతి కేసులో ఏ1 ముద్దాయి మంత్రి లోకేష్. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే ఏపీలో లా అండ్ ఆర్డర్ పాతరేశారు. ఏ2 ముద్దాయి సీఎం చంద్రబాబు. చంద్రబాబు కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడు. లోకేష్ దుర్యోధనుడి మాదిరి రెడ్ బుక్ పాలన చేస్తున్నాడు. ఈ కేసులో ఏ3 ముద్దాయి పవన్ కళ్యాణ్. పవన్ తనకు దేవుడిచ్చిన అన్న అని లోకేష్ అంటున్నాడు. పదేళ్లక్రితం ఇదే దేవుడిచ్చిన అన్నను పచ్చి బూతులు తిట్టించింది లోకేష్ కాదా?. కౌరవులకు ఉన్న ఏకైక సోదరి హోంమంత్రి అనిత*తెనాలిలో ఎన్డీపీఎస్ కేసులో ముగ్గురు యువకులను నడిరోడ్డు పై పోలీసులు చితకబాదారు. తెనాలి ఘటన చూశాక న్యాయవాదులు, న్యాయ మూర్తులు నీళ్లులేని బావిలో దూకి చావాలి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయవ్యవస్థ.. పోలీసులు కాదు. కాపీ కొట్టి పాసై టీచర్ అయిన హోంమంత్రి ఈ విషయం తెలుసుకోవాలి. సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్పడానికి కాదు నీకు హోంమంత్రి పదవి ఇచ్చింది. హెరిటేజ్ మీద ఎవరైనా మాట్లాడగానే సీఎఫ్ఓ మాదిరి హోంమంత్రి తెరపైకి వస్తారు. ఎందుకు సాయికృష్ణ అంశం పై హోంమంత్రి మాట్లాడలేదు. ఎందుకు హోంమంత్రి సీఐపై మాట్లాడలేదు. జడ్జీలను సైతం కొనేద్దామని భావన ఈ పోలీసులు, మంత్రులది.సాయికృష్ణ చనిపోయిన రోజునే పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుకి తెలుసు. సీఎం, హోంమంత్రి మనల్ని కాపాడతాడని సీఐకి సీపీ భరోసా ఇచ్చారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని తక్షణమే సస్పెండ్ చేయాలి. సీపీతో పాటు ఆరోజే హోంమంతికి కూడా ఈ విషయం తెలుసు. వారం రోజుల తర్వాత సీఎం,డిప్యూటీ సీఎంకు కూడా తెలుసు.. హోంమంత్రిని తక్షణమే బర్త్ రఫ్ చేయాలి. రాజశేఖర్ బాబు ఇక్కడ ఉండగా విచారణ సజావుగా సాగదు. కాబట్టి సీపీగా రాజశేఖర్ బాబును సస్పెండ్ చేయాలి. క్రైమ్ రేట్ తగ్గిందని హోంమంత్రి అద్భుతంగా అబద్ధాలు ఆడుతున్నారు. పోలీస్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని చెబుతున్నారు. ఇలా లాకప్ డెత్ లు చేయడమేనా పోలీస్ వ్యవస్థ అద్భుత పనితీరు?. రెండు కేసులున్న వ్యక్తిని లాకప్ డెత్ చేస్తే.. 40 కేసులున్న చంద్రబాబును ఏ స్టేషన్కు పంపిస్తారు?. వందల కోట్లు దోచుకున్నాడని ఆరోపణలున్న లోకేష్ ను ఏ స్టేషన్ కు పంపిస్తారు?. హోంమంత్రి మేకప్ మీద పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా నీ శాఖ పై పెడితే బాగుంటుందిఈ రెండేళ్లలో ఆడపిల్లల పై ఏపీలో జరిగిన నేరాల సంఖ్య 44,586. శిక్షలు పడింది కేవలం 541 కేసుల్లో మాత్రమే. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేవలం నాలుగు కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన డేటా 10 క్లాస్ ఫెయిల్ అయిన మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చాడా?. హోం శాఖ నిర్వహిస్తున్న హోంమంత్రికి.. డీజీపీకి సిగ్గుండాలిసీఎం సొంత జిల్లాలో కేవలం 10 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. డిప్యూటీ సీఎం జిల్లాలో శిక్షపడింది 14 కేసుల్లో మాత్రమే. రాష్ట్రంలో 46 వేల మంది ఆడిపిల్లలకు అన్యాయం జరిగితే ఏనాడైనా వారి ఇంటికి వెళ్లారా డిప్యూటీ సీఎం?. ఉపముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏంపీకారు?. పోలీసు వ్యవస్థ పనిచేసే తీరు ఇదేనాగతంతో పోల్చుకుంటే 24 శాతం ఆడపిల్లల పై నేరాలు పెరిగాయి. పోలీస్ డిపార్ట్ మెంట్కు క్రెడిట్ ఇవ్వాలని అడగడానికి సిగ్గుందా?. సాయికృష్ణ మృతదేహాన్ని కాని..అతని బూడిదను కానీ ఇచ్చి అప్పుడు క్రెడిట్ తీసుకోండి. సాయికృష్ణ తల్లి కన్నీళ్లకు సమాధానం చెప్పి క్రెడిట్ తీసుకోండి. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ బ్రతికేహక్కుంది. మోకీళ్లు తీసేస్తా ... అరచేతిలో రేఖలు చెరిపేస్తానని డిప్యూటీసీఎం చెబుతుంటే పోలీసులకు ఏం ఇండికేషన్ ఇచ్చినట్లు?. సిగ్గులేకుండా సోషల్ మీడియాలో సాయికృష్ణ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. సాయికృష్ణ తల్లి కడుపుకోతతో బాధపడుతోంది. ఆ తల్లికి దళితసోదరులంతా అండగా నిలవాలి. కాపుల ఓట్లు వేయించుకుని పవన్ కాపులను గాలికి వదిలేశారు. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు అని జడ శ్రవణ్ మండిపడ్డారు.ఇదిలా ఉండగా.. గాదె సాయికృష్ణ ఏమయ్యాడు? అనే అంశం ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా పోలీసు శాఖ నుండి పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది. -
రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ 'జనసేన' బెదిరింపు
నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..! సీఐ నాగరాజు నా కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడు. ఫొటో చేయించి దండేసుకో అన్నాడు. చివరకు కనిపించకుండా చేశాడు. నా కుమారుడిని కొట్టి పోలీస్స్టేషన్ బాత్రూమ్లో పడేశారు. స్టేషన్లో చంపేసి, ఇద్దరు పోలీసులు బైక్పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు’ అంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది.లబ్బీపేట/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘నా బిడ్డ ఉంటే చూపించండి.. లేదంటే బూడిదైనా ఇవ్వండి..!’ అంటూ విజయవాడ కృష్ణలంకకు చెందిన యువకుడు సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశించారు. తమ బిడ్డను తీసుకొచ్చి చంపేస్తే..రూ.50 లక్షలు ఇప్పిస్తా, రాజీ చేసుకుందామంటూ జనసేన తూర్పు ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు బెదిరిస్తున్నారని కంటతడి పెట్టారు. ‘మేం జనసేనకు చెందిన వాళ్లమే.. అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్ ఈ విషయంలో స్పందించాలి..’ అని సాయికృష్ణ చిన మేనమామ ముళ్లపూడి నవరంగ్ కోరారు. బుధవారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులైతే... చంపి తగలబెడతారా? సీఐ నాగరాజు తన కుమారుడిని చంపేస్తా అని హెచ్చరించాడని, ఫొటో చేయించి దండేసుకో అన్నాడని, చివరకు కనిపించకుండా చేశాడంటూ సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. ‘నా బిడ్డకోసం పోలీస్ స్టేషన్కు వెళ్లా.. అక్కడ కుర్రాళ్లను కొడుతుంటే తట్టుకోలేకపోయా. నా కుమారుడిని చూపించమంటే చూపించలేదు. నా కుమారుడిని కొట్టి బాత్రూమ్లో పడేశారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్లో చంపేసి.. ఇద్దరు పోలీసులు బైక్పై శవాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. సీఐకి ఎవడు ఇచ్చాడు అధికారం చంపేయమని? పోలీసులు అయినంత మాత్రాన చంపి తగలబెడతారా? నాకు మద్దతుగా నిలిచిన వారిపై నిందలు వేస్తున్నారు. నా కుమారుడికి రాజకీయాలు అంటగట్టొద్దు. న్యాయం చేయమని కోరుతున్నాం’ అని విజయలక్ష్మి విలపించారు.మాఫియా, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? పోలీసులు అన్ని కేసులు ఉన్నాయి.. ఇన్ని కేసులు ఉన్నాయని చెబుతున్నారు. మరి అలాంటి వాడిపై పీడీ యాక్ట్ ఎందుకు పెట్టలేదు? ఫోటోల్లో గొడ్డలి పెట్టి ట్రోల్ చేస్తున్నారు. కోర్టు వాయిదాకి వచ్చి కనిపిస్తే కొడతారని భయపడి మార్కాపురం వెళ్లి జొమాటోలో పనిచేస్తూ రోజుకు రూ.350 ఆదాయంతో బతికాడు. అంత పెద్ద మాఫియా డాన్, గంజాయి డాన్ అయితే రూ.350కి పని చేస్తాడా? గంజాయి ఫాల్స్ కేసులు పెట్టారు. ఆ కేసులు ఏవీ నిరూపణ కాలేదు. మా పిల్లోడిని మాకు అప్పగించాలి. చనిపోతే బాడీ అయినా ఇవ్వండి. పోలీసులు అంబేడ్కర్ విగ్రహం వద్దకి వచ్చి కేసులు ఉన్నాయని నిరూపించాలి. – ముళ్లపూడి నాగేశ్వరరావు, సాయికృష్ణ మేనమామరెండు కేసులే ఉన్నాయి: కనకదుర్గ, అడ్వొకేట్ సాయికృష్ణపై రెండు కేసులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఆ రెండు కేసుల్లో వాయిదాలకు హాజరు కాలేదని తీసుకొచ్చి కొట్టారు. బందర్ రోడ్డులో కూర్చుంటా. పోలీసులు వచ్చి ఎన్ని కేసులు ఉన్నాయో నిరూపించాలి. సాయికృష్ణకు రాజకీయాలతో సంబంధం లేదు. ప్రశ్నిస్తానన్న పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? ప్రశ్నిస్తా అని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? అనేక కేసుల్లో ఆందోళనలు చేశారు. మా అబ్బాయి విషయంలో ఏం చేస్తారు? మేమంతా జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్, లోకేశ్ కోసం పని చేశాం. పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలి. సాయికృష్ణను స్టేషన్కు తీసుకొచ్చి చంపేస్తే డీజీపీ అడగరా..? కేసు సెటిల్ చేసుకుందామని, రూ.50 లక్షలు ఇప్పిస్తామని జనసేన నేత అమ్మిశెట్టి వాసు బెదిరించినా మేం ఒప్పుకోలేదు. మేం పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాం. ఈ కేసుతో సంబంధం ఉన్న సీఐతో పాటు అశోక్, బాబూరావు, సుబ్రహ్మణ్యం, మురళీకృష్ణ, మరికొంతమంది స్టేషన్లో ఉన్న వాళ్లను సస్పెండ్ చేయాలి. కేసులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా తీసుకొచ్చి కొట్టి చంపేస్తారా? మావాడు రౌడీ అంటున్నారు. మీరు చేసిందేమిటి? మీరు హంతకులు కాదా? సామాన్యులకు న్యాయం జరగదా? అన్యాయం జరిగిందని మాకు అండగా నిలుస్తున్న వారికి పారీ్టలను అంటగడతారా? మాకు పారీ్టలు లేవు.. కులం లేదు. మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు. మాకు న్యాయం చేయండి. విజయవాడలో వందల మంది రౌడీ షీటర్లు ఉన్నారు. కానీ మావాడినే తీసుకొచ్చి చంపేశారు. మేం రాజకీయాలు చేసే వాళ్లం కాదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్, లోకేష్, హోం మంత్రి అనిత స్పందించాలి. మేం పనిచేసిన పార్టీ వాళ్లు మా కోసం ఏమీ చేయలేదు. కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులు మాకు అండగా నిలుస్తూ, న్యాయం కోసం పోరాడుతున్నారు. – ముళ్లపూడి నవరంగ్, సాయికృష్ణ మేనమామ -
అక్రమ తవ్వకాల అడ్డగింత
దాములూరు(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం మండలంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఇసుక రేవులో కృష్ణానది గర్భం నుంచి తవ్వి అక్రమంగా ఇసుక తరలింపుపై ఆ మధ్య కాలంలో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు అడ్డుకట్ట వేశారు. నెలరోజులు తిరగకుండానే మళ్లీ అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. కొత్తగా దాములూరు ఇసుక క్వారీ నుంచి యంత్రాలతో తవ్వి లారీలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఇసుక మాఫియాను మాజీ మంత్రి జోగి రమేష్ బుధవారం సాయంత్రం పార్టీ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి అడ్డుకున్నారు. వారిని చూసి లోడింగ్ అయిన లారీలు, లోడింగ్ చేస్తున్న పొక్లెయిన్ల డ్రైవర్లు పారిపోయారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ప్రతి పనికి వాటా తీసుకుంటున్న పావలా ప్రసాద్(ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్), ఆయన బావమరిది అక్రమాలను సంబంధిత అధికారులు అడ్డుకోకపోతే ఏదో రోజు మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. దాములూరు శాండ్ సప్లయిర్స్ పేరుతో దొంగ బిల్లులు ప్రింట్ చేయించి ఇసుక దోపిడీకి తెగబడ్డారన్నారు. నదీ ప్రాంతంలో పొక్లెయిన్లు, జేసీబీలతో తవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. నదికి అవతల వైపు ఉండే సీఎం చంద్రబాబు ఇవతల వైపు జరుగుతున్న దోపిడీపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను ఈ నియోజకవర్గం నుంచి పంపకపోతే ప్రకృతి వనరులు భవిష్యత్ తరాలకు మిగలవని మండిపడ్డారు. అధికారులు తక్షణం ఇసుక దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ రాత్రి 7.40 గంటల వరకు రేవు వద్ద బైఠాయించారు. ఫోన్లో రెవెన్యూ, మైనింగ్ అధికారులను ప్రశ్నించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గరికపాటి శ్రీదేవి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలానికి చెందిన నాయకులు మేడపాటి నాగిరెడ్డి, గుంజా శ్రీనివాస్, నల్లమోతు ప్రకాశ్, పచ్చిగోళ్ల పండు, రెంటపల్లి నాగరాజు, లంకే అంకమోహనరావు, పఠాన్నాగుల్మీరా, కుమ్మరి నాగరాజు, గోగులమూడి రాణి, శెట్టి ఈశ్వరి, సందిపాము రాజేష్, బాణావత్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం పూర్తి చేయాలి
అధికారులకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆదేశం విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ను దసరా ఉత్సవాల నాటికి పూర్తి చేసే లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి నూతన టెర్మినల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని ఎయిర్పోర్ట్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు వివరించారు. అనంతరం శ్రీనివాసవర్మ మాట్లాడుతూ సవరించిన అంచనాల ప్రకారం రూ.824.28 కోట్ల వ్యయంతో ఏడాదికి 3.5 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యంతో అత్యాధునిక సదుపాయాలతో టెర్మినల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 51,315 చదరపు మీటర్ల వైశాల్యంలో నిర్మిస్తున్న టెర్మినల్లో 24 చెక్ – ఇన్ కౌంటర్లు, 8 కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, ఆరు ఏరో బ్రిడ్జ్లు, 9 డిపార్చర్ గేట్లు, పది ఎస్కలేటర్లు, 19 ఎలివేటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నూతన టెర్మినల్ అందుబాటులోకి వస్తే షార్జా, సింగపూర్తో పాటు మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీస్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయన వెంట ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎల్.లక్ష్మీకాంతరెడ్డి, విమానాశ్రయ అధికారులు ఉన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై నిష్పాక్షక దర్యాప్తు చేయాలి గూడూరు: గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఏపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాఽథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో సాయికృష్ణ తల్లి, మేనమామ చేస్తున్న ఆరోపణలు అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న వాస్తవాలను త్వరితగతంగా వెలికితీయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేసులో వస్తున్న ఆరోపణలపై వేగవంతంగా విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు. అవసరమైతే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఈడీ రెగ్యులర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు బుధవారం విడుదల చేశారు. ఏఎన్యూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 2026 ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 6,985 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 5,870 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యూషన్కు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు ఫారాల 24వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఎ. వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చన్నారు. గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి గుడివాడరూరల్: ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కార్యదర్శులు ఎస్.సమరం, సీహెచ్ వెంకటేశ్వరరావు జిల్లా గురుకుల పాఠశాలల డీసీవో మురళీకృష్ణకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని గురుకుల పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని, విద్యార్థులకు ఆట స్థలాలు కేటాయించాలని కోరారు. తాగునీటి సౌకర్యం, బోర్లు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ, విస్సన్నపేట, నందిగామ, తిరువూరు గురుకుల పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో కోతుల బెడద అధికంగా ఉందన్నారు. రుద్రవరంలోని డాక్టర్ గురుకుల పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలని, మోటూరు గురుకుల పాఠశాలలో తాగునీటి బోర్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు. -
అసత్య ప్రచారాలు ఇకనైనా ఆపండి
నందిగామ టౌన్: కేంద్రియ విద్యాలయంపై పాలక పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు అన్నారు. పట్టణంలోని హనుమంతపాలెం గ్రామ సమీపంలోని టిడ్కో ఇళ్ల వద్ద గత ప్రభుత్వ హయాంలో కేంద్రియ విద్యాలయం శాశ్వత భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రియ విద్యాలయానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా కేటాయించలేదని పాలక పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రియ విద్యాలయం, వంద పడకల ఆస్పత్రి మంజూరుపై దగా మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా హనుమంతపాలెంలో ఐదెకరాల స్థలాన్ని కేంద్రియ విద్యాలయం ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు. మున్సిపల్ శాఖాధికారుల అనుమతితో స్థలాన్ని చదును చేయించి హనుమంతపాలెం, టిడ్కో ఇళ్ల నివాసితులు, విద్యాలయానికి వచ్చే విద్యార్థుల సౌకర్యార్ధం రూ.80 లక్షల వ్యయంతో రోడ్డు కూడా నిర్మించినట్లు గుర్తు చేశారు. భవన నిర్మాణానికి సాయిల్ టెస్ట్ సైతం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అయితే గత ప్రభుత్వంలో కేటాయించిన స్థలంలో నిర్మించకుండా రాఘవాపురం కొండల్లో కేంద్రియ విద్యాలయ భవన నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రియ విద్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆయుష్ ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని నిప్పులు చెరిగారు. కేంద్రియ విద్యాలయం, వంద పడకల ఆస్పత్రిపై చర్చకు సిద్ధమని జగన్మోహనరావు అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నైనా.. గాంధీ సెంటర్లో నైనా మీరు చెప్పిన చోటుకు వస్తామని అన్నారు. ఇప్పటికై నా అసత్య ప్రచారాలు మానుకుని పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని సూచించారు. -
ఎల్నినో...ఎలా సాగునో..!
పెనుగంచిప్రోలు: ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై ఏర్పడి వర్షపాతంలో భారీగా తేడాలుంటాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చిన సంగతి విదితమే. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయి కరువు పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు. ఎల్నినో కారణంగా సాధారణం కంటే తక్కువగా లోటు వర్షపాతం నమోదు కానుంది. ఇదే జరిగితే ఖరీఫ్లో వర్షాధారంతో సాగయ్యే పంటల పరిస్థితి ఏమవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు భరోసా కల్పించనున్న ప్రీమాన్సూన్ డ్రైసోయింగ్... వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో ఏర్పడే తక్కువ వర్షపాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అమలు చేస్తున్న ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)విధానం రైతులకు కొత్త భరోసాను కల్పిస్తోంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందే విత్తనాలు చల్లటం ద్వారా నేలలో తేమ లభించిన వెంటనే మొలకలు రావటం, పంటల పెరుగుదల వేగవంతం కావటం ఈ విధానంలో ప్రత్యేకత. ఒకే పొలంలో 27 నుంచి 30 రకాల పలు పంటల విత్తనాలు సాగు చేయటం వల్ల మట్టి సారం పెరగటంతో పాటు నీటి వినియోగం తగ్గుతుంది. రైతుకు ఒకే పంటపై ఆధారపడకుండా స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మొదట దీర్ఘకాలిక పంటలను విత్తన గుళికలు తయారు చేసి లైన్ సోయింగ్ పద్ధతి ద్వారా నాటుకుని మిగతా 27 నుంచి 30 రకాల విత్తనాలను పొలంలో చల్లుకోవాలి. దీర్ఘకాలిక పంటల్లో కందులు, బొబ్బర్లు, ఆముదాలు, మొక్కజొన్న, గోరుచిక్కుడు, నువ్వులు మొదలైనవి. ఈ పంటలు వర్షాభావ పరిస్థితులకు తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. పొలంలో చల్లిన రైతుకు ఎంతోకొంత ఆదాయం వస్తుంది. వర్షాభావం వలన పశువులకు మేత సమస్య రాకుండా పంటల అవశేషాలను పశువులకు మేత లభించటంతో పాటు పాల దిగుబడి కూడా బాగుంటుంది. రైతులందరూ 27 నుంచి 30 రకాల విత్తనాలను ఎకరానికి 15 నుంచి 20 కిలోల వరకు భూమిలో చల్లుకుంటే భూమి సారం పెరగటమే కాకుండా రైతుకు ఆదాయం కూడా లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకు పీఎండీఎస్ విధానం ద్వారా 13,622 మంది రైతులకు చెందిన 13,083 ఎకరాల్లో విత్తనాలు నాటారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ప్రకృతి వ్వవసాయ పద్ధతులపై దృష్టి పెట్టాలి. ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్, విత్తన గుళికలు తయారీ విధానం ద్వారా రైతులు ఖర్చులు తగ్గించుకోవటంతో పాటు స్థిరమైన దిగుబడులు, ఆదాయం పొందవచ్చు. రైతులకు ఈ విధానాలపై గ్రామాల్లో అవగాహన కల్పించటంతో పాటు విస్తృతంగా విత్తనాలు విత్తే కార్యక్రమాలు చేపడుతున్నాం. –వి నాగప్రమీలారాణి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విత్తన గుళికల తయారీ కూడా తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాయి. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘన జీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు, పొరలుగా కలపటం ద్వారా సాధారణ విత్తనం కంటే పెద్దగా విత్తన గుళికలు తయారవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి రక్షించబడతాయి. మట్టిలో 10 నుంచి 15 మి.మీ వర్షం కురిసినా విత్తనాలు మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా సుమారుగా ఆరు నెలల వరకు జీవంతో ఉండి మొలకెత్తిన తరువాత కూడా నీటి ఎద్దడిని తట్టుకుంటాయని ప్రకృతి వ్యవసాయం ప్రతినిధులు చెబుతున్నారు.


