breaking news
NTR
-
మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం కేసులో ఏ1 టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావుకు చెందిన గోడౌన్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు నిర్వహించగా.. భారీ కల్తీ మద్యం తయారీ డెన్ బయటపడింది.పచ్చ నేత కల్తీ మద్యం డెన్ను పరిశీలించిన మాజీ మంత్రి జోగి రమేష్.. టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించడంతో ఆయనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. తమ విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎక్సైజ్ ఎస్ఐ పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్తో పాటు మరో 25 మందిపై కేసు నమోదైంది. -
ఏపీ కల్తీ మద్యం కేసు.. రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు
సాక్షి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు. నకిలీ మద్యం తయారు చేయుటలో టీడీపీ నేత జనార్థన్ రావు, అతని సోదరుడు జగన్మోహన్రావు ప్రధాన పాత్ర పోషించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.మద్యం అమ్మకాలలో అధిక లాభాలు ఆర్జించడం కోసమే నకిలీ మద్యం తయారీ విధానం మొదలు పెట్టినట్లు నిందితుడు జగన్మోహన్రావు ఒప్పుకున్నట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. నాలుగు నెలల నుంచి మొలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యం డెన్ మొదలు పెట్టినట్టు రిమాండ్ రిపోర్ట్లో అధికారులు పేర్కొన్నారు. మూడు నెలల క్రితం ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేసి వివిధ వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ల లో అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు.హైదరాబాద్కి చెందిన రవి అనే వ్యక్తి నకిలీ లేబుళ్లు తయారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం తీసికొనివచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నకిలీ మద్యం తయారీలో బెంగుళూరుకు చెందిన బాలాజీది కీలక పాత్ర వహించినట్లు పోలీసులు నిర్థారించారు. మద్యం బాటిళ్లకు ఫేక్ సీల్స్ బెంగుళూరు నుంచి బాలాజీ పంపినట్లు పోలీసులు గుర్తించారు.నకిలీ మద్యం కేసులో నిందితుల పై U/sec.13 (e), 1 3 (1), 34(a) =/w 34 (a)(1)(ii), 34 (e), 3 4 (f), 34 (h) r/w 34 (2) & 36 (1)(b)& (c), 37, 42, 50, 50(B) of A.P. Excise (Amendment) Act, 2020 OF PROH.& EXCISE సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఒరిజినల్లా ఉండేలా బాటిళ్లపై సీల్స్ తయారు చేయడంతో అనుమానం రాకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణ తేలింది. -
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కృష్ణలంక(విజయవాడతూర్పు): సనాతన ధర్మం పేరిట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి హేయమైన చర్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనం వద్ద గిరిజన, దళిత, మైనారిటీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన ఘటన న్యాయవ్యవస్థ పైనే కాకుండా మొత్తం జాతి మీద జరిగిన దాడి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రజలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. -
చెట్టు పైనుంచి పడి కూలి మృతి
గుణదల(విజయవాడ తూర్పు): చెట్టు పై కొమ్మలు కొడుతున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రీ నగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉయ్యూరుకు చెందిన ఆళ్ల రమణ(36) కూలి పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడ గాయత్రీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాల వద్ద విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలు నరికేందుకు చెట్టు పైకి ఎక్కి కొమ్మలు నరుకుతుండగా అకస్మాత్తుగా అదుపుతప్పి కొమ్మలతో పాటే కిందికి పడిపోయాడు. దీంతో తలకు బలమైన గాయమైంది. ఇది గమనించిన స్థానికులు అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని భోరున విలపించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృత దేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు.గూడు చెదిరి.. గుండె పగిలి వృద్ధుడు మృతిగుణదల(విజయవాడ తూర్పు): నాలుగు దశాబ్దాలుగా తాను నివసిస్తున్న ఇంటిని కోల్పోతున్నాననే బాధతో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన విజయవాడ గుణదల ప్రాంతంలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గుణదల పుల్లేటి కట్ట రోడ్డు ప్రాంతానికి చెందిన తోటకూర నాంచారయ్య (60) చిరువ్యాపారి. వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. గుణదల పుల్లేటి వాగు వీధిలో ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈ రోడ్డును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల స్థానికుల ఇళ్లు తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేసింది. కొన్ని ఇళ్లు తొలగించడంతో బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయం ఇవ్వకుండా తమ ఇళ్లను తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న నాంచారయ్య ఇళ్ల తొలగింపు విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. త్వరలోనే తన ఇల్లు తొలగిస్తారని నాంచారయ్య తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో మంగళవారం ఉదయం గుండెపోటు వచ్చి ఇంట్లోనే కన్ను మూశాడు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల పాలిట శాపంగా పరిణమించాయని కుటుంబసభ్యులు వాపోతున్నారు.మహిళను హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదువిజయవాడలీగల్: దొంగతనం కోసం వచ్చి మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.రాజేశ్వరి మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో నివసించే యేదుపాటి పద్మావతి 2020 జనవరి 31వ తేదీ సాయంత్రం తన ఇంట్లో హత్యకు గురైంది.గుర్తు తెలియని దుండగుడు పద్మావతి గొంతు కోసి పొట్ట, ఛాతీ బాగాలలో కత్తితో పొడిచి, ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో పాటు, ఇంట్లో ఉన్న బంగారం, వస్తువులు, నగదు తస్కరించాడు. హతురాలి భర్త ఫిర్యాదుమేరకు అప్పటి భవానీపురం పోలీస్స్టేషన్ సీఐ డి.కె.ఎన్.మోహన్రెడ్డి దర్యాప్తు చేసి అదే సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన పెనమలూరు మండలం చోడవరం గ్రామానికి చెందిన నిందితుడు గవిరినేని అనిల్ కుమార్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి.రాధ, ఎం. జ్ఞానాంబ, సీఎంఎస్ సీఐ జగదీశ్వరరావు, ప్రస్తుత భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు, సీఎంఎస్ సిబ్బంది పర్యవేక్షణలో 27 మంది సాక్షులను విచారించారు. నిందితుడిపై నేరం రుజువైనందున మంగళవారం మహిళా సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జి.రాజేశ్వరి నిందితునికి జీవిత ఖైదు, 2వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. -
ధాన్యం సేకరణపై ప్రణాళిక రూపొందించాలి
పెనమలూరు: ఖరీఫ్ ధాన్యం దిగుబడులపై ప్రణాళిక సిద్ధం చేసి సకాలంలో రైతుల వద్ద ధాన్యం సేకరించి మిల్లులకు పంపాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. కానూరు పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో మంగళవారం ఏపీ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఉయ్యూరు డివిజన్ స్థాయిలో రెవెన్యూ, ఏవోలు, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ ఖరీఫ్ వరి సాగు దిగుబడులు త్వరలో ప్రారంభం అవుతాయని, వరి దిగుబడుల పై అధికారులు పూర్తి అవగాహనతో ఉండి అంచనా వేయాలని సూచించారు. ఈ–క్రాప్ చేయటం వలన ఎంత దిగుబడి వస్తుందో ముందుగా అంచనా రూపొందించాలని సూచించారు. రైతులకు ఈకేవైసీ చేయటం వలన రైతుల, పంట సాగు వివరాలు ఉంటాయని, ఏఏ ప్రాంతంలో పంట దిగుబడి ముందుగా వస్తుందో గుర్తించి, రైతులకు రవాణా, గన్నీ బ్యాగ్లు అందజేయాలని సూచించారు. వరి పంట తేమ 17 శాతం ఉండే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. తేమ శాతం సక్రమంగా ఉంటే గిట్టుబాటు ధర రైతులకు అందుతుందని తెలిపారు. మిల్లులకు సకాలంలో ధాన్యం తరలించాలన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వాలి ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని జాయింగ్ కలెక్టర్ నవీన్ అన్నారు. సాధారణ రకం 75 కేజీల బస్తా(కామన్) రూ.1777, ఎ గ్రేడ్ రకం 75 కేజీల బస్తా రూ.1792 ధర ఇవ్వాలన్నారు. రైతుల అవసరాలకు టోల్ ఫ్రీ నంబర్ 8247693551 అందుబాటులో ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో హేలాషారోన్, సివిల్ సప్లయిస్ డీఎం టి.శివరామ్ప్రసాద్, డీఎస్వో మోహన్బాబు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి, డివిజన్ పరిధిలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వాలి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ -
సమష్టి కృషితోనే దసరా ఉత్సవాలు విజయవంతం
భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ధన్యవాదాలు తెలిపారు. దసరా శరన్నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహించిన సమావేశానికి ఆయనతో పాటు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడంలో కృతకృత్యులయ్యామని చెప్పారు. గత ఏడాది కంటే అధికంగా 16.5 లక్షల మంది వచ్చారని, అయినా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశామని అన్నారు. గత ఏడాది దసరా అనుభవాలతో నగర పోలీస్ కమిషనర్ ఒక పుస్తకం రూపొందించారని, ఇప్పుడు అన్ని శాఖల అభిప్రాయాలతో ఒక పుస్తకాన్ని రూపొందిస్తామని, భవిష్యత్లో దసరా నిర్వహణకు ఈ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాల బందోబస్తు తన 27 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్గా అభివర్ణించారు. నేరస్తులు ఎవరైనా వస్తున్నారా అనేది తెలుసుకోవడానికి 1.40 లక్షల మంది ఫొటోలతో ఎఫ్ఆర్ఎస్ కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ పూర్తి సమన్వయం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ ఉత్సవాల నిర్వహణే నిదర్శనమన్నారు. సమావేశంలో డీసీపీ సరిత తదితరులు మాట్లాడారు. అనంతరం పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ, వీఎంసీ కమిషనర్ -
20 వరకూ ఇగ్నో పరీక్ష గడువు పెంపు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) డిసెంబర్ –2025లో నిర్వహించే టర్మ్ ఎండ్ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా చెల్లించే పరీక్ష ఫీజు గడువు తేదీని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుమలత తెలిపారు. ఈనెల 21 నుంచి 26వ తేదీ వరకు రూ.1100 ఆలస్య రుసుముతో ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని పేర్కొన్నారు. డిసెంబర్ సెషన్కు సమర్పించే అసైన్మెంట్ తేదీని ఈ నెల 31 వరకు పొడిగించినట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారికి కేటాయించిన అధ్యయన కేంద్రాలలో సమర్పించాలని ఆమె తెలిపారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేటలోని హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని స్వయంగా గాని లేదా 0866–2565253 ఫోన్ నంబర్ ద్వారా గాని సంప్రదించవచ్చని తెలియజేశారు. గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ మండలంలోని రామనపూడి గ్రామంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు సోమవారం రాత్రి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామానికి చెందిన గూడపాటి నాగేంద్రబాబుకు ఇద్దరు కుమార్తెలు. ఆరేళ్ల చిన్న కుమార్తె మోక్షిత ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు మీద పడి దాడి చేశాయి. చిన్నారి ఎడమ కాలి తొడ పట్టుకుని కుక్కలు వదలకపోవడంతో అక్కడే ఉన్న స్థానికులు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించారు. వారిపై కూడా దాడి చేసేందుకు కుక్కలు ప్రయత్నించాయి. కొంత సమయానికి మరికొంతమంది అక్కడకు వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని వెంటనే కుటుంబ సభ్యులు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కలు పెరిగిపోయాయని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
స్వచ్ఛతలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుదాం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛ అవార్డు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ అని, సమష్టి కృషితో స్వచ్ఛతలో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుదామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ త్వరలో పట్టణాలు, గ్రామాల్లో స్వచ్ఛ సేవక్ దళాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. గ్రామాలకు త్వరలో 12 వేల ట్రైసైకిళ్లు అందిస్తామని, 1,600 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర సాకారానికి స్వచ్ఛాంధ్ర కీలకం కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నగరంలో వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు తమ శాఖ కీలక భాగస్వామ్యం అందిస్తుందని చెప్పారు. స్వచ్ఛాంధ్ర పురస్కారాలతో ఆరోగ్యకర పోటీ విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొల్పేందుకు స్వచ్ఛాంధ్ర పురస్కారాలు దోహదం చేస్తాయని అన్నారు. కార్యక్రమంలో డీసీపీ కేజీవీ సరిత, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డీపీఓ పి.లావణ్య కుమారి, ఆర్డీఓలు కావూరి చైతన్య (విజయవాడ), కె.బాలకృష్ణ (నందిగామ), కె.మాధురి (తిరువూరు), గ్రీన్ అంబాసిడర్స్ బి.భూషణం, బి.సామ్రాజ్యం, శంకర్, పురస్కార గ్రహీతలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ -
కలెక్టరేట్లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహర్షి వాల్మీకి జీవితం, ఆయన సమాజానికి అందించిన రామాయణ మహా కావ్యం గొప్ప స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కొనియాడారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు మంగళవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వాల్మీకి కవిగా, మహర్షిగా తన జీవితాన్ని మలుచుకోవడమే కాకుండా అద్భుతమైన రామాయణ మహా కావ్యాన్ని ఈ సమాజానికి అందించడం ద్వారా గొప్ప సందేశాన్ని అందించారన్నారు. మనిషి సంకల్పిస్తే ఏదైనా సాధించగలమని వాల్మీకి జీవితం ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. -
ఎస్ఆర్ఆర్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఎంతో ఘన చరిత్ర కలిగిన మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం డిగ్రీ ఫైనల్ విద్యార్థి కళాశాల భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయటం కలకలం రేపింది. కళాశాలలో అందరూ చూస్తుండగానే భవనంపై నుంచి విద్యార్థి దూకటంతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇప్పటి వరకు ప్రైవేటు కళాశాలల్లో మాత్రమే ఇటువంటి సంఘటనలు జరిగేవి. విద్యార్థులలో వత్తిడి పెరిగిపోవటమే ఈ దుర్ఘటనకు కారణమని, వత్తిడి తగ్గించేందుకు కళాశాలలో తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. వివరాలలోకి వెళితే... కృష్ణలంకకు చెందిన ఎస్.వెంకట రవి డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ పూర్తికానుండటంతో తాను చదివిన చదువుకు ఉద్యోగం వస్తుందో రాదోనని, తనకు మంచి మార్కులు వస్తాయో రావోనని మథన పడుతున్నాడు. ఇదే విషయంపై తనకు ఉద్యోగం వస్తుందోలేదోనంటూ ఇంట్లో సోమవారం ఆందోళన వ్యక్తం చేయగా తల్లిదండ్రులు ఉద్యోగం వస్తే వస్తుంది.. లేకపోతే వేరే పనిచేసుకోవచ్చంటూ సర్ది చెప్పారు. ఈ నేపథ్యంలో రవి మంగళవారం కళాశాలకు వచ్చిన తరువాత అధ్యాపకులు పరీక్షల జవాబు పత్రాలు ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా అందరినీ తోసుకుంటూ వెళ్లి రెండో అంతస్తు నుంచి దూకేశాడు. కిందపడిన రవి రెండు కాళ్లు విరిగిపోవటంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు 108కు ఫోన్ చేయగా అరగంట వరకు రాలేదు. 108 వచ్చిన తరువాత చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా రెండు కాళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలియజేసి, మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రవి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదని, కాళ్లకు మాత్రం సర్జరీ చేయాలని తెలియజేశారు. అధ్యాపకుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం? కళాశాలలో అధ్యాపకుల వేధింపుల వల్లే రవి ఆత్మహత్యాయత్నం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా కళాశాల సిబ్బంది వ్యవహరిస్తున్నారని విద్యార్థులు అంటు న్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మిని వివరణ అడిగితే పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో మధ్యాహ్నం జరగాల్సిన సైన్స్ తరగతులు రద్దు చేశారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. కళాశాల రెండో అంతస్తు నుంచి కిందకు దూకిన విద్యార్థి అధ్యాపకుల వేధింపుల వల్లే అంటూ ఆరోపణలు..? ఉన్నతాధికారులు విచారణ చేయాలంటూ డిమాండ్ -
ప్రజలందరికీ బాబు వెన్నుపోటు
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) విమర్శించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని, దేశంలో ఎక్కడా లేని వింత వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 16 నెలలుగా నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 85 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 40 నుంచి 50 లక్షల మందికే అందజేశారని విమర్శించారు. లైసెన్సు ఉన్న డ్రైవర్లందరికీ ఆర్థిక సాయం అందజేస్తానన్న చంద్రబాబు కేవలం ఆటోలు తోలే డ్రైవర్లకు అది కూడా కోత విధించడం దారుణమన్నారు. పేదలకు ఇళ్లు కట్టి ఇస్తామని ఆశ పెట్టి అధికారంలోకి వచ్చి మాట తప్పారన్నారు. నకిలీ మద్యం సరఫరాతో చంద్రబాబు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో బూంబూం అంటూ విమర్శలు గుప్పించిన కూటమి నాయకులు ఇప్పుడు ఆ బ్రాండ్తో పాటు సూపర్ సిక్స్ అనే బ్రాండ్ మద్యాన్ని కూడా అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమలో నకిలీ మద్యం ప్లాంట్లు రెండు బయటపడడం, వీటి వెనుక టీడీపీ కీలక నేతలే ఉండడం, ఉత్తరాంధ్రలోనూ నకిలీ మద్యం ప్లాంట్లు ఉన్నాయని సమాచారం రావడంతో రాష్ట్రంలో మద్యం ప్రియుల వెన్నులో వణుకు పుడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని ప్రజలకు అర్ధమైందన్నారు. నకిలీ మద్యం ఎలా తయారు చేయాలో కూటమి నాయకులకు ఆఫ్రికాలో శిక్షణ ఇచ్చి ఆ ఫార్ములా ద్వారా నకిలీ మద్యాన్ని ప్రభుత్వ పెద్దలే ఏరులై పారిస్తున్నారని విమర్శించారు. మందు తాగొద్దు.. తస్మాత్ జాగ్రత్త ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఒక కలుగు నాయుడుగా మిగిలిపోయారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అరవటం, రెచ్చిపోవటం, ఊగిపోవటం, తూగిపోవటం, జుట్టు పీక్కోవటం లాంటి చేష్టలు చేసిన ఆయన ఇప్పుడు మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా మాట్లాడకుండా కలుగులోనే ఉంటున్నారని విమర్శించారు. సొంత అన్నయ్యను బాలకృష్ణ అగౌరవపరిచినా బయటకు రాకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం అని వ్యాఖ్యానించిన కూటమి నాయకులు ప్రస్తుతం సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లు తయారుచేసి వైన్ షాపులు, బెల్టుషాపుల్లో విక్రయిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి మద్యం బాటిల్ను డిస్టిలరీల్లోనే తయారు చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతోందని ధ్వజమెత్తారు. మందు బాబులు ఈ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, తస్మాత్ జాగ్రత్త అని పేర్ని నాని హెచ్చరించారు. కూటమి సర్కారు పాపాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. పవన్ ఓ కలుగు నాయుడు ఎన్ని అరాచకాలు జరుగుతున్నా బయటకు రావడం లేదు రాష్ట్రంలో 16 నెలలుగా ఏరులై పారుతున్న నకిలీ మద్యం అవన్నీ సీబీఎన్, పీకే, ఎల్కే బ్రాండ్లే వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం -
సొమ్మొకరిది.. షోకొకరిది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఉత్సవ్ పేరుతో టూరిజం నిధులకు ఎసరు పెట్టారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడకు ‘ఏపీ ప్రభుత్వ సహకారంతో’ అనే ట్యాగ్ తగిలించి.. రూ. 5 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజయవాడ ఉత్సవ్ కమిటీ టూరిజం శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి టెండరు పిలువకుండా, నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి టూరిజం అధికారులు సైతం ఫైల్ను ఆగమేఘాల మీద సిద్ధం చేశారు. దీని వెనుక టీడీపీ పెద్దల హస్తం ఉందని తెలుస్తోంది. అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఎలాగైనా నిధులు మంజూరు చేయించుకోవాలని టీడీపీ పెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నిధులు రేపోమాపో విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నిధులన్నీ స్వాహా చేసేందుకేనని, టీడీపీ వర్గాల్లోనూ ప్రస్తుతం చర్చ సాగుతోంది. కనకదుర్గమ్మ ఉత్సవాలకు పైసా విదల్చని ప్రభుత్వం, ప్రైవేటు కార్యక్రమానికి నిధులు మంజూరు చేయడం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతా ఫ్లాప్ షో.. పున్నమీ ఘాట్లో ఉత్సవాల ప్రారంభం రోజున జనాలు లేక వెలవెలబోయింది. ప్రారంభం చేసేందుకు వచ్చిన నేతలు సైతం అప్పట్లో పెదవి విరిచినట్లు అంతా చెప్పుకున్నారు. ఉపరాష్ట్రపతి హాజరైన సమయంలో కూడా జనాలు రాకపోవడంతో పరువు పోతుందని, హడావుడిగా డ్వాక్రా మహిళలను తరలించినట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. దుర్గమ దర్శనం ఉచితంగా కల్పిస్తే.. అక్కడ జరిగే కార్యక్రమాలకు ‘మీషో’ ద్వారా టికెట్ల అమ్మకాలు చేసి సొమ్ము చేసుకున్నారు. రెండు గంటల షోలకు భారీగా టికెట్టు ధర పెట్టి దండుకున్నారు. ఇంతలా ప్రజల నుంచి దోచుకున్న ఆ ప్రైవేటు కార్యక్రమానికి ఇప్పుడు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం ఏంటనే ప్రశ్న పలువురి నుంచి వ్యక్తం అవుతోంది. విజయవాడ ఉత్సవ్ పేరుతో జరిగిన ప్రతి కార్యక్రమం వ్యాపార కోణంలోనే జరిగిందనే భావన విజయవాడ వాసుల్లో సైతం ఉంది. అమ్మవారి ఉత్సవాల ప్రాశస్త్యం తగ్గించేలా, విజయవాడ ఉత్సవ్కు చేసిన భారీ ప్రచారంపైనా పలువురు పెదవి విరుస్తున్నారు. -
గ్రీన్ క్లైమేట్ ఫండ్తో మత్స్యకారులకు ఉపాధి
కృష్ణా కలెక్టర్ బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో చేపట్టే కార్యకలాపాలపై సంబంధిత అధికారులతో మంగళవారం రాత్రి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ. 85 లక్షలు గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులు జిల్లాకు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. జిల్లాలో 1420 ఎకరాలను మడ అడవులుగా రూపొందించేందుకు గుర్తించామన్నారు. ఏం చేయాలాంటే.. ఈ సంవత్సరం వినూత్నంగా గ్రీన్ క్లైమేట్ ఫండ్ నిధులతో పీతలు, అలంకార చేపలు, సముద్రనాచు పెంపకం ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలన్నారు. ఇందులో భాగంగా 40 పీతల పెంపకం యూనిట్లు, 23 అలంకార చేపల పెంపకం యూనిట్లు, 25 సముద్ర నాచు పెంపకం యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టు మేనేజర్ ఉష, డీఎఫ్వో సునీత, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, ఆర్డీవో స్వాతి, మత్స్యశాఖ జేడీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గురువుల గర్జన
బెజవాడలో కదంతొక్కిన ఉపాధ్యాయులు బోధనేతర పనులు బహిష్కరణ వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యా, ఉపా ధ్యాయ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది గురువులు బెజవాడలో కదంతొక్కారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యారంగంలో చోటు చేసుకున్న సమస్యలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్రంలోని 26జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు విజయవాడకు తరలివచ్చారు. ధర్నాచౌక్లో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు సైతం తరలివచ్చి మద్దతు ప్రకటించారు. గాంధీనగర్లోని అలంకార్ సెంటర్, సాంబమూర్తిరోడ్డుతో పాటుగా ఆపరిసర ప్రాంతాలన్నీ ఉపాధ్యాయులతో కిక్కిరిసి కనిపించాయి. పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో.. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నేతలు ‘మమ్మల్ని విద్యార్థులకు పాఠాలు చెప్పనివ్వండి మహాప్రభో’ అంటూ ప్రభుత్వానికి విన్నవించారు. బోధనేతర పనులతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ల పేరుతో ఉపాధ్యాయులకు ఎక్కడా తీరిక లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి పనులతో ఉపాధ్యాయులను రోడ్లపైకి తీసుకురావటం వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి బోధనేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించవద్దంటూ వారంతా పెద్దపెట్టున విజయవాడ ధర్నాచౌక్లో నినదించారు. కారుణ్య నియామకాలను చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు నగరంలోని చలో విజయవాడ కార్యక్రమానికి హాజరై తమ సంఘీభావం తెలిపారు. సుమారు 900 మంది కారుణ్య నియమకాల కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అలాగే తాము ఆర్థిక ఇబ్బందులతో ఇక్కట్లు పడుతున్నామంటూ వాపోయారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి తమ సమస్యను వివరించామని, కానీ ఆయన ఆదేశించినా ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించే అన్ని బోధనేతర పనులను బహిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు తీర్మానించి పిలుపునిచ్చారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం మినహా మిగిలిన పనులేమి ఉపాధ్యాయులు చేయరని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారులకు మెమోరాండాలు ఇవ్వనున్నారు. -
నల్ల జెండాలతో నిరసన తెలుపుదాం
రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల పిలుపుకృష్ణలంక(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న దోపిడీ చర్యలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమర్ధించడం దారుణమని, భూమి, అడవులు, జీవనాధారాన్ని కాపాడుకునేందుకు పోరాటం ఉద్ధృతం చేయాలని రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ అధ్యక్షతన మంగళవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ, అటవీ హక్కులు, చట్టాలను ధిక్కరించి ఆదివాసీలను జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం అదాని, నవయుగ, మెగా, షిర్డీ సాయి కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదివాసీలు నల్ల జెండాలతో ఆదివాసీ గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని తీర్మానించారు. దుర్మార్గమైన చర్య.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జీవోలు 2,13,51 రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగించాలన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆమోదం లేకుండా చట్టాలు ధిక్కరించి ప్రాజెక్టు నిర్మాణం చేయడం దుర్మార్గమన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పల నర్స, మైదానం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిసర ప్రభాకర్, గిరిజన ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ బాలాజీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
శోభాయమానంగా గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము 5.55 గంటలకు ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభమైంది. తొలుత ప్రత్యేకంగా పూలతో అలంకరించిన రథంపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్లు అధిష్టించగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, అర్చకులు ఆర్. శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దుర్గగుడి ఈవో శీనానాయక్, దేవదాయ శాఖ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్జేసీ భ్రమరాంబ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తజన కోలాహలం.. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యా ల నడుమ.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులు ఆది దంపతుల వెంట ముందుకు సాగారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ కోర్కెలు నెరవేసి, సుఖ సంతోషాలతో ఉంటా రని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆదిదంపతులకు పూజలు నిర్వహించారు. స్వర్ణకవచాలంకృతా పాహిమాం.. పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ స్వర్ణకవచం ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, స్వర్ణకవచం అలంకరణ, అనంతరం అంతరాలయంలో ఖడ్గమాలార్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాలార్చనకు 26 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఇక ఆలయంలో నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సుప్రభాతవ సేవలో 9 మంది, ఛండీహోమంలో 110 మంది ఉభయదాతలు, లక్ష కుంకుమార్చనలో 11 మంది, శ్రీచక్రనవార్చనలో 37 మందితో పాటు పరోక్ష సేవలోనూ ఉభయదాతలు విశేషంగా తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. అమ్మవారికి స్వర్ణకవచంలో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ నెల 2వ తేదీతో దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ ఆదివారం వరకు భవానీల రద్దీ కొనసాగింది. 11న ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం.. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం 11వ తేదీన జరగనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆ రోజు కార్యక్రమాన్నీ ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట గానీ, మహామండపం ఆరో అంతస్తులో గానీ నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. -
దుర్గమ్మ దసరా హుండీ ఆదాయం రూ.10.30కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భక్తులు హుండీల ద్వారా రూ.10.30కోట్లను సమర్పించారు. ఉత్సవాల్లో అమ్మవారికి సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారంతో పూర్తయింది. తొలిరోజున రూ.3,57,92,708నగదు, 122 గ్రాముల బంగారం, 9.7కిలోల వెండి లభ్యమవగా.. రెండో రోజు రూ.6,73,02,813నగదు, 265 గ్రాముల బంగారం, 9.750కిలోల వెండి లభ్యమైంది. దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా 480 సంచులతో దుర్గమ్మకు కానుకలు వచ్చాయి. వీటిని లెక్కించగా రూ.10,30,95,521నగదు, 387గ్రాముల బంగారం, 19.450 కిలోల వెండి లభ్యమైంది. గతేడాది కంటే దాదాపు కోటి రూపాయలు హుండీల ద్వారా అదనంగా లభించింది. -
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశం
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బుధవారం ఎన్టీఆర్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. రామవరప్పాడు రింగ్ సమీపంలోని కరెన్సీనగర్ ఎం కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే ఈ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్లమెంటు పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి పాల్గొని పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు హాజరు కావాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కోరారు. -
మా సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే
లబ్బీపేట/పటమట (విజయవాడ తూర్పు): తమ సమస్యల పరిష్కారం కోసం పీహెచ్సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పందించి.. స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. తమ డిమాండ్ల పరిష్కారానికి మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీహెచ్సీ వైద్యులు 20 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకుండా పనిచేస్తున్నారని.. తమతోపాటు ఇతర శాఖల్లో చేరిన వారు రెండు, మూడు పదోన్నతులు పొందారని వివరించారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లు, ఇన్–సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.వైద్యుల సమ్మెకు జీడీఏఏ మద్దతు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మెకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని జీడీఏఏ (గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కార్యదర్శి డాక్టర్ బాబ్జీ శ్యామ్కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్సీ వైద్యుల డిమాండ్లు నెరవేర్చాలని, డీఎంఈ వైద్యులకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఇప్పటికే వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన రిలే దీక్షలో పాల్గొన్న పీహెచ్సీ వైద్యులు -
నకిలీ మద్యం భారీ డంప
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి నెట్వర్క్: రంగు, వాసన, ఏమాత్రం తేడా లేకుండా కార్మెల్, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం తయారీ... ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్కు నకిలీ సరుకు సిద్ధం... అక్కడ ఎటుచూసినా.. కార్టన్ బాక్స్ల్లో స్పిరిట్ నింపిన క్యాన్లు.. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అతికించిన నకిలీ మద్యం బాటిళ్లే.. ఎవరికీ అనుమానం రాకుండా బాక్సుల్లో అమర్చి పాల వ్యాన్లలో సరఫరా! ఏకంగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్ల నడుమ నకిలీ మద్యం తయారీ!విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా పచ్చముఠాలు, కల్తీ కేటుగాళ్లు సాగించిన నకిలీ మద్యం దందా ఇదీ!! తాజాగా అక్కడ తనిఖీల్లో భారీగా బయటపడ్డ స్పిరిట్ ఖాళీ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారంటే ఏ స్థాయిలో దందా సాగిందో ఊహించవచ్చు. పాత ఏఎన్నార్ బార్ భవనంలో నకిలీ తయారీ..టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాలవారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తోంది. బరి తెగించి అన్ని చోట్లా మద్యం, బెల్ట్ షాపులకు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసి రూ.కోట్లు పిండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో నకిలీ మద్యం తయారీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ సమీపంలోని గోడౌన్, హైవే పక్కన ఉన్న పాత ఏఎన్నార్ బార్ (ఖాళీ భవనం)లో సోమవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి.గోడౌన్లో సుమారు 162 కేసుల మద్యం సీసాలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్లు, మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, బ్లెండ్ (క్యారామిల్, రెక్టిఫైడ్ స్పిరిట్ ద్రావణం), పెద్ద సంఖ్యలో ఖాళీ సీసాలు, పలు కంపెనీల లేబుల్స్, సీసాలకు బిగించే మూతలు, మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్నార్ బార్ భవనంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్పిరిట్, క్యారామిల్ ద్రావణం కలిపేందుకు వినియోగిస్తున్న పీవీసీ ట్యాంక్, వివిధ రంగులు మిక్స్ చేసే యంత్రాలు లభ్యమయ్యాయి.రెండు గదుల నిండా ఉన్న స్పిరిట్ ఖాళీ క్యాన్లు, రెండు పెద్ద స్టీల్ డ్రమ్ములు, మద్యం తయారీ సామగ్రిని భవానీపురం ఎక్సైజ్ స్టేషన్కు తరలించారు. ఏడాదిన్నరగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్ల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ రాకెట్ నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నకిలీ మద్యాన్ని ఏఎన్ఆర్ బార్తో పాటు జనార్దన్రావుకు వాటాలున్న కంచికచర్ల, భవానీపురంలోని శ్రీనివాస వైన్స్లో విక్రయాలు చేస్తుంటారు. వీటితో పాటు కొండపల్లి, ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, కోస్తా జిల్లాలోని పలు వైన్ షాపులు, బెల్ట్ షాపులకు ఇక్కడి నుంచే నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన అట్టపెట్టెలపై చింతలపూడి మండలం, పేదవేగి మండలం అని రాసి ఉండటం గమనార్హం.టీడీపీ ప్రజాప్రతినిధి అండతో..జనార్దనరావుకు స్థానిక టీడీపీ కీలక నేతలతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆయన బావమరిదితో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి అండదండలు లేకుండా జనావాసాల మధ్య పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. జనార్దనరావు సోదరుడు అద్దెపల్లి జగన్మోహనరావు, మరో నిందితుడు కట్టా రాజును రెండు రోజులుగా విచారించడంతో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దనరావుకు చెందిన ఏఎన్నార్ బార్ను ఆదివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.కూటమి అధికారంలోకి రావడంతో.. ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తంబళ్లపాలెం టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డితో స్నేహం ఏర్పడింది. నిషేధించిన ప్రాంతంలో సుమారు పదేళ్ల క్రితం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నకిలీ సర్టిఫికెట్తో ఏఎన్నార్ బార్ ఏర్పాటు చేశాడు. 2024 ఎన్నికల ముందు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అ«ధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె, ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. అమాయకులు బలి..రూ.99కే నాణ్యమైన మద్యం వైన్ షాపుల ద్వారా విక్రయిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు సమీపంలోని ఓ వైన్స్లో ఇటీవల దాములూరుకు చెందిన వ్యక్తి మద్యం తాగిన కొద్దిసేపటికి అక్కడే మృతి చెందాడు. జూపూడి వైన్స్లో కిలేశపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మద్యం తాగి ఇంటికి వెళుతూ దారిలో మృత్యువాత పడ్డాడు. ఈ రెండు ఘటనల్లో అక్రమ మద్యం వ్యాపారులు మృతుల కుటుంబాలతో రాజీ కుదుర్చుకున్నారు. ఇక వెలుగు చూడని కల్తీ మద్యం చావులు మరెన్నో ఉన్నాయి.నకిలీ మద్యంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇంతకాలం తాము తీసుకున్నది నకిలీ మద్యం అని తెలియడంతో మద్యం ప్రియులకు నోట మాట రావడం లేదు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఐఆర్లో తెనాలి ఐతానగర్కు చెందిన కొడాలి శ్రీనివాసరావును ఏ–12గా చేర్చారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న భవనం లీజు అగ్రిమెంటు శ్రీనివాసరావు పేరుతో ఉండడంతో ఆయన్ను నిందితుడిగా చేర్చినట్లు పేర్కొన్నారు.కాగా తెనాలిలోని శ్రీనివాసరావు ఇంట్లో ఎక్సైజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఎలాంటి సామగ్రి లభ్యం కాలేదని తెలుస్తోంది. కాగా నకిలీ మద్యంతో తంబళ్లపల్లె టీడీపీ నాయకులకు సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లె జనార్దనరావు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఆరోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని తెలిపాడు.భారీగా నకిలీ మద్యం సీజ్.. ములకలచెరువు నుంచి అందిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నంలోని గోడౌన్పై దాడులు చేశాం. దాడుల్లో నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్ , పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, ఎటువంటి లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్ను సీజ్ చేశాం. గోడౌన్లో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో (ఒక్కో క్యాన్ 35 లీటర్లు) 3,325 లీటర్ల స్పిరిట్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ 384 బాటిళ్లు, మంజీర బ్లూ 24 బాటిళ్లు మొత్తం 1,272 బాటిల్స్ సీజ్ చేశాం.లేబుల్స్ లేని మద్యం 136 కేసులు, 6578 బాటిల్స్ , ఓఏబీ లేబుల్స్ 6500, ఖాళీ బాటిల్స్ 22,000, ఖాళీ క్యాన్లు 6, పైపులు 2, మిషన్–1 సీజ్ చేశాం. ఏ–1 ముద్దాయి అద్దెపల్లి జనార్దనరావు సోదరుడు జగన్మోహన్రావును అదుపులోకి తీసుకుని విచారించాం. జనార్దన్ సన్నిహితుడు కట్టా రాజును అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం గోడౌన్ను తనిఖీ చేశాం. జనార్దనరావు స్వదేశానికి రాగానే అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతాం. – టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్, విజయవాడ -
గోదాములో అగ్ని కీలలు
● ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరిచే గోదాము దగ్ధం ●విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లేప్రమాదమని అనుమానం ● సుమారు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా రామవరప్పాడు(గన్నవరం): విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని ఓ ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరిచే గోదాములో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాములో నిల్వ ఉంచిన ఎలక్ట్రానిక్స్ పరికారాలైన ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, మైక్రో ఓవెన్లు, వాషింగ్ మిషన్లు వంటి విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.5కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఏం జరిగిందంటే.. ఎనికేపాడు గ్రామంలోని డెకథ్లాన్ వెనుక ప్రాంతంలో సీఅండ్ ఎఫ్ఏ–శ్రీ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ప్యానసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గోదాము ఉంది. మాగంటి అంజనీకి చెందిన ఐదు ఏకరాల స్థలంలో 16 వేల అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో ఎలక్ట్రానిక్స్ పరికరాలు భద్రపరుస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల డీలర్లకు సరఫరా చేస్తుంటారు. ఉదయం 7.40 గంటల సమయంలో దట్టమైన పొగతో కూడిన మంటలు గోదాము నుంచి ఎగసి పడ్డాయి. తొలుత గోదాముకు ఒక వైపు మంటలు అంటుకోవడంతో అవి క్రమేణా వ్యాపించాయి. అగ్నికీలల ధాటికి గోదాములోని ఆఫీసు రూమ్తో పాటు ఎలక్ట్రానిక్స్ పరికాలకు మంటలు అంటుకున్నాయి. అట్ట పెట్టెల్లో పార్సిల్ చేసి ఉన్న పరికరాలకు మంటలు అంటుకున్నాయి. అసలే మండే స్వభావం ఉంచే థర్మాకోల్తో పార్సిల్ చేసి ఉండటంతో మంటలు మరింతగా ఎగసి పడ్డాయి. పెద్ద పెద్ద శబ్దాలతో ఎలక్ట్రానిక్స్ వస్తువులు పేలడంతో పరిసర ప్రాంత ప్రజలు ఉలిక్కి పడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న గోదాము మేనేజర్ షాజహన్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు గంటలకు పైగా శ్రమించి.. భారీ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఆటోనగర్, కొత్తపేట తదితర ప్రాంతాల నుంచి ఏడు ఫైర్ ఇంజిన్లతో ప్రమాద స్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కష్టపడ్డారు. గోదాములోకి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో జేసీబీ సహాయంతో గోడను ధ్వంసం చేసి సహాయక చర్యలు మొదలు పెట్టారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు 11గంటలు దాటే వరకూ కొనసాగాయి. ఎగసి పడుతున్న మంటలకు గోదాము మొత్తం వ్యాపించక ముందే అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గోదాములోని ఆఫీసు రూమ్లో భద్రపరచిన రికార్డులు, మూడు వంతులకు పైగా గోదాము అగ్నికి ఆహుతి అయ్యింది. ఎగసిపడిన మంటల ధాటికి గోదాము పైకప్పు రేకులు కూడా ఊడిపడ్డాయి. అగ్ని జ్వాలల వేడిమికి గోదాముకు మరో వైపు ఉన్న ఏసీల ఇండోర్ యూనిట్లు కరిగిపోయాయి. ఎలక్ట్రానిక్స్ గోదాములో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై విచారణ చేపడతాం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా లేక అదృశ్య శక్తుల ప్రమేయం ఉందా అన్నది క్లూస్, ఫోరెన్సిక్ టీమ్, ఎలక్ట్రికల్, ఫైర్ డిపార్టుమెంట్ల సహయంతో విచారణ చేస్తాం. రికార్డులు కాలిపోవడంతో స్టాక్ వివరాలు పూర్తి స్థాయిలో గుర్తించలేకపోయాం. ఎలక్ట్రానిక్స్ పరికాలు కాలిపోయిన ఫ్రేమ్ల బట్టి ఏయే వస్తువులు ఎన్ని కాలిపోయాయో అంచనాకు వస్తాం. – దామోదర్, సెంట్రల్ ఏసీపీ -
అక్రమార్కులకు గేట్ వే
ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మల్కాపురం ఉచిత ఇసుక పథకం పేరుతో అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తూ జేబులు నింపు కొంటున్నారు. రాత్రింబవళ్లూ తేడా లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. వాహనాల రణగొణ ధ్వనులతో గ్రామంలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. జగ్గయ్యపేట మండలం మల్కాపురం తెలంగాణ రాష్ట్రానికి సరి హద్దులో ఉండటంతో అక్రమార్కులకు గేట్ వే గా మారింది. మల్కాపురం(జగ్గయ్యపేట): జగ్గయ్యపేట మండలం మల్కాపురం గ్రామంలోని మునేరులో మూడు చోట్ల ఇసుక ర్యాంపులు ఉన్నాయి. అందులో మొలకవాగు, గొల్లగుండు, శ్మశానవాటికకు వెళ్లే రహదారిలోని ఇసుక రేవులు ఉన్నాయి. అక్రమార్కులు తెలంగాణకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే మొలకవాగు, గొల్లగుండు ర్యాంపులను ఎంచుకుని ఇసుక అక్రమ రవాణాకు బాటలు వేశారు. ర్యాంపునకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉండటంతో ఇటీవల రోడ్డును గ్రావెల్తో అభివృద్ధి చేయడంతో పాటు మూడు చోట్ల కాలువలు ఉండే ప్రాంతాలలో తూములు ఏర్పాటు చేసి మరీ రోడ్డు నిర్మించారు. దీంతో మునేరు నుంచి గ్రామంలోని ప్రధాన రోడ్డు వరకు ఎక్కడా ఏ గొయ్యి లేకుండా ట్రాక్టర్ క్షణాల్లో బయటకు వచ్చేస్తోంది. ఈ ర్యాంపుల్లో ఇసుక 25 మీటర్ల మేర వెయ్యి ఎకరాల్లో ఉంటుంది. మార్కెట్లో ఈ ఇసుక విలువ రూ.300 కోట్లుగా ఉంటుంది. వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్కు... మునేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రేయింబవళ్లూ తెలంగాణకు తరలిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో 100కు పైగా ట్రాక్టర్లు ఉన్నాయంటే ఏ మేరకు ఇసుక అక్రమ రవాణా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలో వ్యవసాయ పనులు కూడా మానేసి కూలీలు ముఠాలుగా ఏర్పడి ఇసుక లోడింగ్కు వెళుతున్నారు. ఒక్కో ముఠాలో నాలుగు నుంచి ఎనిమిది మంది ఉంటారు. ముఠా ట్రాక్టర్ ఇసుక లోడింగ్ చేసినందుకు రూ.800 నుంచి రూ.1100 వరకు అక్రమార్కులు చెల్లిస్తున్నారు. రోజుకు ఒక్కో ముఠా 30 నుంచి 50 ట్రాక్టర్ల వరకు లోడింగ్ చేస్తుండటంతో ఒక్కో కూలీకి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తోంది. దీంతో కూలీలు కూడా పూర్తిగా వ్యవసాయ పనులు మానేసి ఇసుక లోడింగ్కు వెళుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. గ్రామానికి కూతవేటు దూరంలో ఉండే తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద మండవ ఇసుక రేవు ఉన్నప్పటికీ అక్కడి ఇసుకకు నాణ్యత లేకపోవడంతో మల్కాపురం మునేరు ఇసుకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఒక్కో ట్రక్కు ట్రాక్టర్ ఇసుక ధర రూ. 8 వేల నుంచి రూ.11 వేల వరకు పలుకుతోంది. ట్రాక్టర్ల యజమానులకు వ్వవసాయం కూడా ఆశాజనకంగా లేకపోవడంతో అక్రమార్కులకు ట్రాక్టర్లను అద్దెకు ఇస్తున్నారు. రోజుకు రూ.2 వేల వరకు అద్దె లభిస్తుండటంతో అదే బాటలో మిగతా వారు అద్దెకు ఇస్తున్నారు. రుణాలు తీసుకొని ట్రాక్టర్లు కొనుగోలు గ్రామంలో ఇసుక వ్యాపారం ఆశాజనకంగా ఉండటంతో గతంలో 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉండగా ఈ ఏడాదిన్నర కాలంలోనే ఆ సంఖ్య 100కు చేరింది. బ్యాంకు రుణాలు తీసుకుని మరీ ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే యువత ఉంటే వారికి రోజుకు రూ.800 వరకు ఇస్తున్నారు. కొంతమందికి పూర్తి స్థాయిలో డ్రైవింగ్ రాకపోగా ఇష్టానుసారంగా నడుపుతుండటంతో ఇటీవల గ్రామంలో మూగ జీవాలపై దూసుకెళ్లి మృత్యువాత పడ్డాయి. 18 గ్రామాలకు తరలిపోతున్న ఇసుక తెలంగాణ రాష్ట్రంలోని వల్లభి, నేలకొండపల్లి, చెరువు మాధవరం, ముజ్జుగూడెం, గోండ్రాల, తమ్మర, బుద్దారం, రాయిగూడెం, రాజేష్పురం, చిమ్మిరాల, కోదాడ, బాణాపురం, పెదమండవ తండా, చిన్నమండవ, మంగాపురం తండా, కృష్ణాపురం, కమలాపురం గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ గృహాలకు ఇసుక తరలిస్తున్నారు. తరలింపు కూడా ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. ముఖ్యంగా మునేరు నుంచి ఇసుక ట్రాక్టర్లు బయలుదేరి రెండు కిలోమీటర్ల దూరంలో గల పెద్ద మండవ సరిహద్దు ప్రాంతానికి వెళ్తాయి. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన అక్రమార్కులు ఏపీ నుంచి తీసుకువచ్చిన ఇసుక లోడ్ ట్రక్కును అక్కడ పార్క్ చేసి, అక్కడి నుంచి వేరే ట్రక్కును తీసుకొచ్చి, మళ్లీ ఇసుక లోడు చేసిన తరువాత అక్కడికి తీసుకెళ్తారు. తెలంగాణ రిజి స్ట్రేషన్ ట్రక్కులతో ఇసుక రవాణా చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
పోలీస్ గ్రీవెన్స్లో 85 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 85 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వృద్ధులు, నడవలేని వికలాంగుల వద్దకే వెళ్లి ఫిర్యాదులు అందుకున్నారు. గ్రీవెన్స్లో భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 36, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 11, కొట్లాటకు సంబంధించి 03, వివిధ మోసాలపై 06, మహిళా సంబంధిత నేరాలపై 09, దొంగతనాలకు సంబంధించి 03, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 17, ఇలా మొత్తం 85 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయం కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్నాయుడు పేర్కొన్కారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసంలో మొత్తం 42 అర్జీలు ప్రజల నుంచి అందినట్లు తెలిపారు. -
పెనమలూరు సర్పంచ్గా భాస్కరరావు కొనసాగింపు
పెనమలూరు: పెనమ లూరు సర్పంచిగా లింగా ల భాస్కరరావును కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావు గ్రామంలోని పల్లిపేట కాలువ కట్టపై సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే దీనిపై కలెక్టర్కు ఫిర్యాదులు అందటంతో జిల్లా పంచాయతీ అధికారి విచారించారు. ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా రోడ్డు వేశారని అభియెగాలు చూపు తూ డీపీవో నివేదిక ఇచ్చారు. దీంలో కలెక్టర్ గత మే నెలలో సర్పంచి భాస్కర రావును 3 నెలలు సస్పెండ్ చేసి చెక్పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై భాస్కరరావు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు అప్పీల్కు వెళ్లారు. అయితే అప్పీల్ పెండింగ్లో ఉంచి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో సర్పంచి హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు. కోర్టు ఈ ఘటనపై పూర్తి విచారణ చేసింది. సర్పంచి సస్పెన్షన్ చేసి మూడు నెలలు గడిచినా ఎటువంటి విచారణ చేయకుండా సస్పెన్షన్ కొనసాగించటం సరైన చర్యకాదని కోర్టు భావించింది. సర్పంచిగా లింగాల భాస్కరరావును కొనసాగించి, అఽధికారాలు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సర్పంచిగా భాస్కరరావు బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు ఉత్తర్వులు జారీ -
షార్ట్ సర్క్యూటే కారణమా?
గోదాములో సంభవించిన ఈ అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గోదాములోని ఆఫీసు రూమ్ వద్ద విద్యుత్ బాక్స్ల నుంచి నిప్పు రవ్వలు రాలి పడటంతో మంటలు అంటుకుని ఉంటాయని భావిస్తున్నారు. మరో పక్క ఈ ప్రమాదానికి ఉద్దేశపూర్వకంగా అదృశ్య శక్తులు మరెవరైనా కారణమై ఉంటారన్న అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. ఆఫీస్ కార్యాలయంలోని రికార్డులు, స్టాక్ వివరాలు అగ్నికి ఆహుతవ్వడంతో ఎంత నష్టం జరిగి ఉంటుందని పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోతున్నారు. సమాచారం అందుకున్న విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోదాము మేనేజర్, యజమానితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటన పై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణా మిల్క్ యూనియన్కు స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో భాగంగా కృష్ణా మిల్క్ యూనియన్కు బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం సోమవారం జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరగగా, బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ– మెగా, భారీ పరిశ్రమల కేటగిరీలో మొదటి ర్యాంకును కృష్ణా మిల్క్ యూనియన్ వీరవల్లిలోని కామధేను ప్లాంట్ను వరించింది. ఈ అవార్డును సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అందుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు పాల్గొన్నారు. ●లక్షల మంది తాగేనీటిలో బూడిద అవశేషాలు ●బూడిద కాలుష్యంపై సీఎం, డెప్యూటీ సీఎంలు స్పందించాలి ●మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ ఇబ్రహీంపట్నం: కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాంతమైన పవిత్ర సంగమాన్ని కూటమి నేతలు, ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద నీటితో అపవిత్రం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద నీటిని బుడమేరు కాలువ ద్వారా కృష్ణానదిలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర సంగమ ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న సీఎం చంద్రబాబు బూడిద నీటి కాలుష్యాన్ని పరిశీలించాలన్నారు. అమరావతి, విజయవాడ, దివిసీమ, కై కలూరు డెల్టా ప్రాంత వాసులు కొన్ని లక్షల మందితో పాటు సీఎం చంద్రబాబు ఇంట్లో సైతం వాడేది కృష్ణాజలాలే అన్నారు. కాలుష్య నివారణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దీనిపై దృష్టి సారించాలన్నారు. కాలుష్యంతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు, పవన్కల్యాణ్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు పార్టీలకు అతీతంగా మరో పోరాటం చేద్దామని పిలుపు నిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, అతని బావమరిది బూడిద దోపిడీపై కోట్లు సంపాదిస్తున్నారన్నారు. తనను అరెస్టు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మేడపాటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారులకు సంతృప్తికర పరిష్కారం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) వచ్చిన అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీదారులతో సంబంధిత అధికారి మర్యాదగా ప్రవర్తించాలని, ఎండార్స్మెంట్ తప్పకుండా ఇవ్వాలని చెప్పారు. వ్యవహార శైలి, పరిష్కార విధానం సరిగా లేవన్న అభిప్రాయం అర్జీదారుల నుంచి ఎట్టి పరిస్థితిలోనూ రాకూడదని స్పష్టం చేశారు. రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ అంశాలకు సంబంధించిన అర్జీల పరిష్కారంలో సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 182 అర్జీలు: జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 182 అర్జీలు అందాయి. వీటిలో రెవెన్యూ విభాగంలో అత్యధికంగా 53, పోలీస్ 36, పురపాలక, పట్టణాభివృద్ధి 24, పంచాయతీరాజ్ 14, రవాణా 10, డీఆర్డీఏ 9, ఆరోగ్యశాఖ 6, పౌరసరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, దేవదాయ, విద్యాశాఖ, బ్యాంకు లకు సంబంధించిన అర్జీలు మూడు చొప్పున, ఎకై ్సజ్, మార్కెటింగ్, సర్వే శాఖలకు సంబంధించిన అర్జీలు రెండు చొప్పున, గనులు, భూగర్భ శాఖ, నీటిపారుదల, గృహ నిర్మాణం, గ్రామీణ నీటిసరఫరా, కార్మిక, ఉపాధి కల్పన, రిజిస్ట్రేషన్ – స్టాంపులు, నైపుణ్యాభివృద్ధి, డ్వామా శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ అందాయి. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ప్రధాన అర్జీలు... ●రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగించాలని ఇంగ్లిష్ మీడియం విద్యా పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త ఏడుకొండలు షెపర్డ్ కలెక్టర్ను కలిసి అర్జీ సమర్పించారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్ కోర్సులను ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొల్పాలన్నారు. వేదిక సభ్యులు మహమ్మద్ నూరు, ఈదర గోపీచంద్ తదితరులు ఉన్నారు. ●డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, జీవనం దుర్భరంగా ఉందని, తమకు జీతాలు ఇప్పించాలని కాంట్రాక్ట్ కార్మికులు అర్జీ సమర్పించారు. -
రేపు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వరి రైతులు తరచూ ఎదుర్కొంటున్న ఎలుకల సమస్యను నివారించి, పంటను కాపాడటానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి సాగు చేసే ప్రాంతాలలో ఈనెల 8వ తేదీ బుధవారం ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎలుకల వల్ల తీవ్ర పంట నష్టం సంభవిస్తోందని, దీనిని నివారించడానికి సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల నుంచి బ్రోమోడయోలోన్ ఎలుకల మందును కలిపిన ఎరను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఎలుకలు ఉన్న బొరియలను గుర్తించి వాటిని మట్టితో కప్పి ఉంచాలని, మరుసటి రోజు తెరుచుకుని ఉన్న బొరియలలో బ్రోమోడయోలోన్ ఎలుకల మందు కలిపిన ఎరను ఉంచి మూసివేయాలని తెలిపారు. రైతులంతా సామూహికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, తద్వారా వరి పంటను ఎలుకల బారి నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ కుమారి, డీఆర్ఓ లక్ష్మీ నరసింహం, డెప్యూటీ కలెక్టర్ కె.పోశి బాబు, వ్యవసాయ శాఖ ఏడీ అనిత భాను పాల్గొన్నారు. -
స్వచ్ఛతకు పురస్కారాల పట్టం
భవానీపురం(విజయవాడపశ్చిమ): పారిశుద్ధ్యం నిర్వహణ, పరిశుభ్రతలో ఉత్తమ ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలు–2025లో ఎన్టీఆర్ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు లభించాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విజేతలకు పురస్కారాలను అందజేశారు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలలో ఎనిమిది జిల్లాకు వచ్చాయి. ప్రత్యేక కేటగిరీ అవార్డ్ (స్వచ్ఛ సర్వేక్షణ్)లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కు దక్కగా, స్వచ్ఛ కాలనీల విభాగంలో విజయవాడ లోని కేపీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్కు లభించింది. స్వచ్ఛ ఆస్పత్రుల విభాగంలో విజయవాడ భవానీపురంలోని హెచ్బీకాలనీలోగల యూపీహెచ్సీ, పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు అవార్డులు లభించాయి. స్వచ్ఛ అంగన్వాడీల విభాగంలో కేదారేశ్వరపేట–3 అంగన్వాడీ కేంద్రం, స్వచ్ఛ బస్ స్టేషన్ల విభాగంలో విజయవాడ బస్ స్టేషన్, స్వచ్ఛ పాఠశాలల కేటగిరీలో విజయవాడ కృష్ణ లంకలోని వీఎంఆర్ఆర్ (జీ) మునిసిపల్ కార్పొ రేషన్ హైస్కూల్, స్వచ్చతా ఎన్జీఓల కేటగిరీలో రైజ్ సంస్థ అవార్డులు సాధించగా ఆయా సంస్థలు, పాలనా యూనిట్ల ప్రతినిధులు సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందుకున్నారు. కలెక్టర్ లక్ష్మీశ అభినందనలు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ముంద డుగు వేస్తూ స్వచ్ఛాంధ్ర పురస్కారాల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపినందుకు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాల స్ఫూర్తితో జిల్లాను మరింత స్వచ్ఛత దిశగా నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రులు పి.నారాయణ, కె.పార్థసారథి, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కోర్టు కేసులున్నా.. లెక్కలేనితనం!
కౌలు రైతుల భూముల్లో అక్రమంగా సరుగుడు పంట దోపిడి కృత్తివెన్ను: కోర్టులో కేసు నడుస్తున్న భూముల్లో కౌలురైతులు పెంచుకున్న పంటను నిర్భయంగా, దౌర్జన్యంగా కొట్టుకుపోతున్నా సంబంధిత యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై స్థానిక రైతులతో పాటు, కిసాన్సంఘ్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం దీవిలో కొన్నేళ్లుగా సరుగుడు తోటల వ్యవహారంలో వివాదం నెలకొంది. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన పెద్ద వివాదం చెలరేగింది. జిల్లాకు చెందిన ఒక మంత్రి అండతో కొందరు వ్యక్తులు అక్రమంగా తమ తోటల్లోకి ప్రవేశించి రైతులను బెదిరించి పంటను కోసుకుపోవడంతో పెద్ద రచ్చ జరిగింది. దీంతో అక్రమార్కులు కొంత నెమ్మదించారు. అయితే గత వారం రోజులుగా ఇదే భూముల్లో తిరిగి అక్రమంగా సరుగుడు తోటలను కొట్టేసి దౌర్జన్యంగా తరలించుకుపోతున్నారంటూ సమాచారం అందుకున్న కిసాన్సంఘ్ రాష్ట్ర కోశాధికారి వల్లభనేని ఆశాకిరణ్ ఆధ్వర్యంలో సభ్యులు సోమవారం గొల్లపాలెం చేరుకుని ట్రాక్టర్లు, లారీలో తీసుకువెళుతున్న కర్రల లోడును అడ్డుకుని కిందికి దించేశారు. విషయం ఏమిటంటే.. చినగొల్లపాలెంలో ఆర్ఎస్ నంబర్ 213, 217, 572/1లో దాదాపు 40 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిపై వివాదం ఉండటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ భూముల్లో ఉన్న పంటను కోర్టుతీర్పు వచ్చే వరకు ఎవ్వరూ కొట్టరాదని స్థానిక రైతులు చెబుతున్నారు. అయినా సరే కొందరు వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఒక మంత్రి అండతో కోర్టు కేసులో ఉన్న భూముల్లో దాదాపు 20ఎకరాల్లోని పంటను నరికేసి తీసుకుపోయినట్లు వాపోతున్నారు. ఈ భూములన్నీ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కౌలుకు చేస్తున్నారని వాటిలో పంటను తరలించుకుపోతున్నట్లు వారు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి దౌర్జన్యాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. చినగొల్లపాలెంలో కోర్టుకేసుల్లో ఉన్న భూముల్లో నరికేసిన సరుగుడు కర్రలు లారీలో తరలించడానికి సిద్ధంగా ఉన్న కర్రలను కిందికి దించేస్తున్న రైతులు అధికారులు పట్టించుకోరా? ఇక్కడ భూముల్లో కొన్నేళ్ల క్రితం కొందరు స్థానికులు కౌలుకు భూములు తీసుకుని సరుగుడు పంటను వేసుకున్నారు. ప్రస్తుతం ఆ భూముల వ్యవహారం కోర్టులో ఉంది. న్యాయస్థానాన్ని గౌరవించకుండా కేవలం అధికార అహంకారంతో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా తోటలను కొట్టేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన రెవెన్యూ, ఫారెస్ట్, పోలీసు యంత్రాంగాలు వారికి వత్తాసు పలుకుతూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నాయి. – వల్లభనేని ఆశాకిరణ్, కిసాన్సంఘ్ రాష్ట్ర కోశాధికారి ఈ భూముల వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోంది. తీర్పు వచ్చేవరకు ఎవ్వరూ కూడా భూముల్లో ప్రవేశించకూడదు. కానీ కొందరు వ్యక్తులు కోర్టును సైతం ధిక్కరించి దాదాపు 20 ఎకరాల భూముల్లోని పంటను నరికేసి తీసుకుపోయారు. ఇది చాలా దారుణమైన విషయం. నాతో పాటు ఇక్కడి కౌలురైతులకు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. – ఎండూరి రవీంద్రమూర్తి, రైతు -
ఇబ్రహీంపట్నం గోడౌన్లో భారీగా పట్టుబడిన కల్తీ మద్యం
జి.కొండూరు/ఇబ్రహీంపట్నం: ములకలచెరువులో కల్తీ మద్యం రాకెట్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నంకు చెందిన టీడీపీ నేత అద్దేపల్లి జనార్దన్రావు వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో ఆయన ఏ1 నిందితుడు కావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఇబ్రహీంపట్నంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో జనార్దన్రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్ని ఆదివారం రాత్రి సీజ్ చేసిన పోలీసులు సోమవారం ఉదయం సోదాలు చేపట్టారు. జనార్దన్రావు పరారీలో ఉండడంతో ఆయన తమ్ముడు జగన్మోహన్ రావును, గుమస్తా కట్టా రాజుని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్కు సమీపంలో ఉన్న ఏఎన్ఆర్ బార్కి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లోని ఓ గోడౌన్లో భారీగా కల్తీ మద్యం, బాటిలింగ్ చేసే యంత్రం, ఖాళీ క్వార్టర్ బాటిళ్లు, కల్తీ మద్యం నింపిన బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు జనార్దన్రావు గతంలో బార్ నిర్వహించిన పాత భవనంలో కల్తీ మద్యం తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఇక్కడ కల్తీ మద్యం మిక్సింగ్ చేసే యంత్రాలు, స్టీలు డ్రమ్ములు, గతంలో మద్యం నింపిన ఖాళీ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.ఇబ్రహీంపట్నంలో పట్టుబడిన మద్యంభారీగా పట్టుబడిన కల్తీ మద్యంను గొల్లపూడిలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయానికి తరలించినట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన కల్తీ మద్యంలో ఓల్డ్ అడ్మినరల్ పేరుతో ఉన్న 129.6లీటర్ల 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ పేరుతో ఉన్న 25.92 లీటర్ల 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ పేరుతో ఉన్న 69.12 లీటర్ల 384 బాటిళ్లు, మంజీరా బ్లూ పేరుతో ఉన్న 4.32 లీటర్ల 24 బాటిళ్లు, లేబుళ్లు అతికించని 1175.04 లీటర్ల 6528 బాటిళ్ల మద్యం, 95 క్యాన్లలో ఉన్న మిక్సింగ్ స్పిరిట్ 3325 లీటర్లు, ఓల్డ్ అడ్మినరల్ పేరుతో ఉన్న 6500 లేబుళ్లు, 2200 ఖాళీ బాటిళ్లు, క్యాన్లు 4, పైపులు రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్ఆర్ బార్ భవనంలో తయారీ కేంద్రంలో లభ్యమైన కల్తీ మద్యం తయారీ యంత్రాలు, స్టీలు డ్రమ్ములు, ప్లాస్టిక్ క్యాన్లు అదనంగా దొరికాయి.పేద మందుబాబులే టార్గెట్పేద, మధ్య తరగతికి చెందిన మందుబాబులే టార్గెట్గా కల్తీ మద్యం రాకెట్ నడిచింది. బెల్టు షాపులు, బార్లలో అధికంగా విక్రయాలు జరిగే బ్రాండ్ల పేరుతోనే నకిలీ లేబుళ్లను తయారు చేసి కల్తీ మద్యం నింపి విక్రయించినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చిన నాటి నుంచి ఈ దందాను కొనసాగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో బెల్టు షాపులను ఎంపిక చేసుకుని మరీ సరఫరా చేశారని సమాచారం. రూ.కోట్లల్లో ఈ దందా కొనసాగింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావు టీడీపీ నేత కావడంతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ కల్తీ మద్యం రాకెట్లో ఎవరి పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది.కల్తీ మద్యం తయారీ ఇలా...వేల లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ని క్యాన్లలో తీసుకొచ్చి దానికి క్యారెమెల్, వాటర్ కలిపి స్పూరియస్ లిక్కర్(కల్తీ మద్యం) తయారు చేస్తారు. ఈ విధంగా ఒక లీటరు స్పిరిట్కు 180 ఎంఎల్ కల్తీ మద్యం బాటిళ్లను 135 వరకు తయారు చేస్తారు. ఈ విధంగా తయారైన కల్తీ మద్యంను మార్కెట్లో ఉన్న మద్యం బాటిళ్ల లేబుళ్లు మాదిరిగా డూప్లికేట్ లేబుళ్లను తయారు చేసి ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి బెల్టు షాపులు, బార్లకు విక్రయిస్తారు. ఈ కల్తీ మద్యంను ఒక్కొక్క బాటిల్పై ఎంఆర్పీను బట్టి రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గించి హోల్సేల్ ధరలకు బెల్టు షాపులు, బార్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్రావుకు చెందిన ఏఎన్ఆర్ బార్తో పాటు అతని భాగస్వామ్యంతో నడుస్తున్న భవానీపురం శ్రీనివాస వైన్స్, కంచికచర్లలోని ఓ వైన్షాపుతో పాటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కల్తీ మద్యం తయారీకి స్థానికంగా ఉండే కార్మికులైతే గుట్టు రట్టయ్యే అవకాశం ఉండడంతో జనార్దన్రావు గుమస్తా కట్టా రాజు పర్యవేక్షణలో ఒడిశా, కేరళకు చెందిన కార్మికులతో కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారని తెలుస్తోంది. ములకలచెరువులో కల్తీ మద్యం గుట్టురట్టు కావడంతో కార్మికులను వెంటనే ఇబ్రహీంపట్నంలో ఉన్న తయారీ కేంద్రం నుంచి వారివారి ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.తీగ లాగితే డొంక కదిలినట్టు ములకల చెరువులో కల్తీ మద్యం రాకెట్ వెనుక ఇబ్రహీంపట్నం టీడీపీ నేత హస్తం బట్టబయలైంది. స్థానికంగా ఆయనకు చెందిన ఒక గోడౌన్లో ఇతర రాష్ట్రాల కార్మికులతో కల్తీ మద్యం తయారు చేయించి, ఆ బాటిళ్లపై ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు వేసి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో బెల్టు షాపులకు, బార్లకు సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం వెల్లడవడంతో ఈ ప్రాంత మందుబాబులు ఉలిక్కిపడుతున్నారు. -
సైన్స్ అండ్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): పర్యాట క, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో సోమవారం ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్గా నియమితులైన మందలపు రవికుమార్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ సైన్స్ అండ్ టెక్నాలజీని వినియోగించుకుని అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్. రోషన్కుమార్, బడేటి రాధాకృష్ణ, ఎం.వెంకటరాజు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొని రవికుమార్ను అభినందించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రత్యేక రైలులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్రను నవంబర్లో ప్రారంభించనున్నామని భారతీయ రైల్వేస్ భారత్ గౌరవ ట్రైన్, సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పర్యాటక రైలులో తమిళనాడు, కేరళలో ఉన్న దేవాలయాలు, పంచ ద్వారక, మహదేవ్, జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చని తెలిపారు. నవంబర్ 16వ తేదీన మొదటి విడత యాత్ర, 26న రెండో విడత యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే, మొదటి భారత్ గౌరవ్ రైలు, సౌత్ స్టార్ రైల్, అతిపెద్ద టూరిస్ట్ రైలు ఆపరేటర్ టూర్ టైమ్స్ ఈ యాత్ర చేపట్టిందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైలు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో లేదన్నారు. రిజర్వేషన్ల కోసం టూర్ టైమ్స్ను నేరుగా 93550 21516 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చన్నారు. అందుకోసం www.tourtimes.in సందర్శించాలన్నారు. -
నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు డబ్బులకు కక్కుర్తి పడి నకిలీ మద్యం తయారు చేసి.. బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరుపుతున్నారంటూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం చిత్తూరు నుంచి విజయవాడ లింక్లు పెరిగిపోయాయి.. ఇప్పుడు అవే బట్టబయలయ్యాయి.‘‘ఎన్నికలకు ముందు 99 రూపాయలు మద్యం అమ్ముతామంటే ఎదో అనుకున్నాం.. ఇలా నకిలీ మద్యం తయారు చేసి అమ్మకాలు చేస్తారు అనుకోలేదు. ఇబ్రహిపట్నంలో ఇప్పుడు నకిలీ మద్యం దొరికింది. టీడీపీకి చెందిన జనార్ధనరావు అనే వ్యక్తికి ఇబ్రహీంపట్నంలో వైన్ షాపు ఉంది. ఇక్కడ నుండే అన్ని బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. నకిలీ మద్యానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ. ఎంపీ మిథున్ రెడ్డి, ధనుంజయ్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు.. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?. టీడీపీ నాయకుడు జనార్ధన్ రావు వెనుక ఎవరు ఉన్నారో వారి పై చర్యలు తీసుకోవాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. -
AP: ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడింది. నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. టీడీపీ నేత అద్దేపల్లి జనార్ధనరావు గోడౌన్గా గుర్తించారు. జనార్ధన్ సోదరుడు జగన్మోహన్రావు, అనుచరుడు కట్టా రాజులను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగన్మోహన్రావు, కట్టా రాజు ఇచ్చిన సమాచారంతో జనార్ధనరావు గోడౌన్లో తనిఖీలు చేపట్టారు. గోడౌన్లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు.నకిలీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లు, 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్ చేశారు. హోలోగ్రామ్ స్టిక్కర్లు , వందల కొద్దీ ఖాళీ బాటిళ్లు, కేరళ మార్ట్, ఓఎస్డీ బ్రాండ్లకు చెందిన స్టిక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్, కారిమిల్ను మిక్స్ చేసి నకిలీ మద్యాన్ని నిందితులు సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ మద్యం కేసులో టీడీపీ నేత, ఏ1 జనార్థన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనార్ధన్ ఆఫ్రికా పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. జనార్ధన్ విదేశాల్లో ఉన్నట్లు తెలిసిందని ఎక్సైజ్ సీఐ తెలిపారు.మరోవైపు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం తయారీ డంప్వద్ద బయటపడ్డ డైరీ ఆధారంగా ఎక్సైజ్ పోలీసులు సోదాలు చేపట్టారు. పీటీఎం మండలం సోంపల్లి గ్రామంలో బెల్ట్షాపుపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. పక్క జిల్లాలకు కల్తీ మద్యం సరఫరా చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
ఒక్క రోజులో బెజవాడ రైల్వే డివిజన్కు రూ.5 కోట్ల ఆదాయం
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): ఒకేరోజు అత్యధిక మంది ప్రయాణికుల నిర్వహణ, ఆదాయంలో విజయవాడ డివిజన్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈనెల 4న విజయవాడ డివిజన్ నుంచి ఇతర ప్రాంతాలకు 2.8 లక్షల మంది ప్రయాణికుల రవాణా ద్వారా రూ.5 కోట్ల ఆదాయం సాధించింది. ఇది కేవలం ఒక్కరోజులో డివిజన్ సాధించిన సరికొత్త మైలురాయిగా నిలిచింది. దీంతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ డివిజన్కు వచ్చే ప్రయాణికులతో కలుపుకొని మొత్తం 5.5 లక్షల మంది ఒక్క రోజు ప్రయాణం చేశారు. అందులో విజయవాడ స్టేషన్ నుంచి 82 లక్షల మంది ఇతర ప్రాంతాలకు ప్రయాణించడం ద్వారా రూ.2 కోట్లు ఆదాయం వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ స్టేషన్లో దిగిన వారితో కలుపుకొని 1.7 లక్షల మంది ప్రయాణికులుగా నమోదైంది. ప్రయాణికుల రద్దీ పెరుగుదలను సమర్థంగా నిర్వహించడానికి డివిజన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డివిజన్లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో అదనంగా 25 బుకింగ్, రిజర్వేషన్ కౌంటర్లను ప్రారంభించారు. 72 ఏటీవీఎం (ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్లు) ఏర్పాటు, ప్రయాణికులకు సహాయం చేసేందుకు 110 ఏటీవీఎం ఫెసిలిటేటర్లను 24 గంటలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మోహిత్ సోనాకియా అరుదైన రికార్డు సాధించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఎయిర్పోర్ట్కు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే
గన్నవరం: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే ఆదివారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. ఆమరావతి పర్యటన నిమిత్తం ఆయన తిరుపతి నుంచి సాయంత్రం ఇక్కడికి విచ్చేశారు. విమానాశ్రయంలో అథవాలేకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ జె.రంగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా ఉప సంచాలకులు ఎం.రమాదేవి తదితరులు స్వాగతం పలికారు. ● నవంబర్ 8,9 తేదీల్లో నరసరావుపేటలో నిర్వహణ ● వెల్లడించిన పల్నాడు జిల్లా బాలోత్సవ్ కమిటీ సభ్యులు నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావు పేటలోని శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆవరణలో నవంబరు 8,9 తేదీల్లో ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా బాలోత్సవ్ కమిటీ అధ్యక్షుడు, ఈశ్వర్ ఇంజినీరింగ్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు పేర్కొన్నారు. కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పల్నాడు బాలోత్సవం పిల్లల పండుగలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించిందని, అదేస్ఫూర్తితో ఈ ఏడాది పల్నాడు బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందన్నారు. గౌరవ సలహాదారుడు, శ్రీకృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు పోటీల్లో పాల్గొని విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. పోటీల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.అంజిరెడ్డి, గౌస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనేలా రూపకల్పన చేసి తమ కళలను ఆవిష్కరింప చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. పోటీలో పాల్గొనదలచిన ఉపాధ్యాయులు ఈనెల 26వ తేదీలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 98665 62260, 99498 09821 నంబర్లలో లేదా palnadubalotsavam @gmail. com మెయిల్ ఐడీలో సంప్రదించాలని సూచించారు. -
ఉత్సాహంగా కరాటే పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): శారీరక దారుఢ్యంతో పాటుగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వాడో–ఆర్వైయూ చీఫ్ ఇన్స్ట్రక్టర్ జేఎం దాస్ చెప్పారు. స్థానిక సీతారామపురంలోని ఐకాన్ స్కూల్ ఆవరణలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఆదివారం జరిగాయి. పోటీల ప్రారంభ సందర్భంగా జేఎం దాస్ మాట్లాడుతూ విద్యార్థులు కరాటేలో శిక్షణ తీసుకోవడం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి చదువులో కూడా రాణిస్తారన్నారు. ఐకాన్ స్కూల్ డైరెక్టర్ పార్థసారఽథి మాట్లాడుతూ కరాటే పోటీలకు తమ పాఠశాల ఆవరణ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరై పలు అంశాల్లో ప్రతిభ చూపారు. ఆదిల్ పాషా బ్లాక్ బెల్ట్ సాధించగా.. 22 మంది ఎల్లో బెల్ట్, 10మంది ఆరెంజ్ బెల్ట్, 12 మంది గ్రీన్ బెల్ట్,10మంది పర్పుల్ బెల్ట్, 25 మంది బ్రౌన్బెల్ట్ సాధించారు. వీరికి జేఎం దాస్, పార్థసారథి సర్టిఫికెట్లను అందజేశారు. మహిళలు ఫిట్నెస్పై దృష్టి పెట్టాలి లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఫిట్నెస్పై దృష్టి సారించాలని, అప్పుడే ఆరోగ్యకర జీవనం సాధ్యమవుతుందని రాష్ట్ర సీ్త్ర శిశు సంక్షేమశాఖ కార్యదర్శి ఎ. సూర్యకుమారి అన్నారు. మొగల్రాజపురంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన హర్ హెల్త్ ఉమెన్ సెంటర్ను ఆదివారం ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ ఇలాంటి సెంటర్ వల్ల మహిళలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సెంటర్ సీనియర్ ఫిజియోథెరపిస్టు డాక్టర్ ఆర్. అర్చన మాట్లాడుతూ ఇక్కడ గర్భవతులకు చైల్డ్ బర్త్ క్లాసులు, బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టేషన్, ప్రసవానికి ముందు, తర్వాత యోగా తరగతులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో గైనకాలజిస్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు డాక్టర్ ఎం. త్రిపురసుందరీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక మచిలీపట్నంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) కృష్ణా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం ఏపీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి ఎం. శ్రీని వాసరావు, పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. అనిత వ్యవహరించారు. కృష్ణా జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడిగా అంబటిపూడి సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా వి. సాంబశివరావు, కార్యదర్శులుగా పి. శివాజీ, గణేష్, సీహెచ్ నాగప్రసాద్, వై. శ్రీనివాసరావు, ఎన్. శివలక్ష్మి, వైవీ కృష్ణకాంత్, ఉపాధ్యక్షులుగా పి. సత్యనారాయణ, జేకే కిరణ్ కుమార్, డి. సాంబశివరావు, నాగరాజు, కల్యాణి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఏ. రాంగోపాల్, జి. వెంకటేశ్వరరావు, సీహెచ్ నారాయణ మూర్తి, ఎస్. పద్మావతి ఎన్నికయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. రామారావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, జిల్లా పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, టి. కోటేశ్వరరావు పాల్గొన్నారు. బయ్యవరం(క్రోసూరు): మండలంలోని బయ్యవరం గ్రామంలో శనివారం ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆరు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు, ఆదివారం నాలుగు పళ్ల విభాగంలో ఎనిమిది జతలు పోటీలో నిలిచాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఎడ్లపోటీలు తిలకించేందుకు హాజరయ్యారు. -
హైస్కూల్ ప్రహరీని ఢీకొన్న ప్రైవేటు బస్సు
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ ఎలక్ట్రికల్ బస్ రహదారికి అవతల వైపు ఉన్న హైస్కూల్ ప్రహరీ గోడను ఢీకొట్టి లోపలకు దూసుకు వెళ్లింది. అదృష్టవశాత్తు అవతల రోడ్లో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి సుమారు 10.30 గంటలకు న్యూగో ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్ విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరింది. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్ దాటిన తరువాత రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర బస్ నిలిపి డ్రైవర్ టీ తాగారు. అనంతరం బస్ స్టార్ట్ చేసి ఒక వాహనం అడ్డుగా ఉండటంతో దాన్ని తప్పిస్తూ స్టీరింగ్ను కుడి వైపునకు తిప్పి మళ్లీ ఎడమ వైపునకు తిప్పుదామనుకునే లోపు అదుపు తప్పి అదే వైపునకు వెళ్లి సెంట్రల్ డివైడర్ పైకి ఎక్కి రోడ్డుకు అవతల ఉన్న శ్రీపోసాని నరసింహారావు చౌదరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ఢీకొంది. ఆ వేగానికి పాఠశాల లోపలకు కొంత మేర దూసుకుపోయింది. ఆ సమయంలో బస్లో ముగ్గురు ప్రయాణికులే ఉండటంతో వారికి గానీ, డ్రైవర్కు గానీ ఏమీ కాలేదు. జాతీయ రహదారి కావడంతో వాస్తవానికి ఆ సమయంలో గొల్లపూడి వైపు నుంచి వాహనాలు వస్తుంటాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో ఎటువంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
పత్తి రైతు చిత్తు
●అధిక వర్షాలతో రంగు మారుతున్న పత్తి పైరు ● పూత రాలిపోయి కాపు లేక వెలవెలబోతున్న వైనం ● క్రాప్ ఇన్సూరెన్స్ లేకపోవడంతో తీవ్రంగా నష్టం ● పెట్టుబడులు కూడా రాని వైనం ఈ ఏడాది పత్తి పంట ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడులు కూడా రావు. వర్షాలకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. పెరిగిన పెట్టుబడులు, కౌలుతో పత్తి రైతుకు నష్టం తప్పదు. – ఎన్.లక్ష్మీనారాయణ, మక్కపేట, వత్సవాయి మండలం వ్యవసాయాధికారులు గ్రామాలలో పర్యటించి నష్టపోయిన పత్తి పంటను నమోదు చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందించాలి. వ్యవసాయశాఖ నివేదిక మేరకు నష్టపరిహారం చెల్లించి రైతును ఆదుకోవాలి. – కనగాల రమేష్, వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వత్సవాయి/జి.కొండూరు: ఈ ఏడాది పత్తి పంట రైతులను చిత్తు చేసింది. అధిక వర్షాలకు గిడసబారి పత్తి కాయ పగిలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు సక్రమంగా లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. పత్తి తీతకు వచ్చే దశలో వర్షాలు పడుతుండడంతో పూత రాలిపోయి, కాయలు మచ్చలు వచ్చి రాలిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు. నష్టాల్లో ఆదుకునే క్రాప్ ఇన్సూరెన్స్ సైతం ప్రభుత్వం తొలగించడంతో నష్టాలను పూడ్చుకునే మార్గం కనిపించక పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. భారీగా పెరిగిన పెట్టుబడులు... గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చులు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు ధర రూ.20 వేల వరకు ఉండగా, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతుంది. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.7 వేలు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. లేనిపక్షంలో నష్టాలు తప్పవు. మొక్కజొన్న సాగుపై ఆశ... పత్తి పంట దెబ్బతినడంతో రెండవ పంటగా రైతులు మొక్కజొన్నపై ఆశలు పెట్టుకుంటున్నారు. తీతకు వచ్చిన పత్తిని తీసుకుని వెంటనే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న పంట వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది కూడా పత్తి పంట నష్టం రావడంతో రెండవ పంటగా మొక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి క్వింటా రూ.2 వేల పైనే పలకడంతో రైతులకు కొంత ఊరట లభించింది. ఈ సీజన్ కూడా రైతులు మొక్కజొన్నపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. -
సూర్యలంక తీరంలో ఇద్దరు గల్లంతు : కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది
బాపట్ల టౌన్: సూర్యలంక సముద్రతీరంలో స్నానాలు చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమిట్ల గ్రామానికి చెందిన బొద్దు శ్రీను, నల్గొండ జిల్లాకు చెందిన కత్తుల వినేష్లు తమ కుటుంబ సభ్యులతో ఆదివారం మధ్యాహ్నం సూర్యలంక తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ఇరువురు నీటిలో మునిగారు. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమైన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లారు. కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లను ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. తీరానికి వచ్చే పర్యాటకులు పోలీస్ సిబ్బంది ఆదేశాలను పాటించి, సముద్రస్నానాలు చేయాలని ఆయన సూచించారు. -
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వం
మధురానగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ(ఆర్.సి.పి.ఐ) రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్క్లబ్ లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా పారిశ్రామిక విధానాన్ని ముందుకు తీసుకు వెళుతోందని, కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మికుల శ్రమను యాజమాన్యాలకు దోచిపెట్టే విధంగా ముందుకు సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుచేసి యువతను ప్రోత్సహిస్తామని చెప్తున్నప్పటికీ ఎక్కడా అమలు కావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ నాయకుడు దేవర నాగన్న మాట్లాడుతూ కడప ఉక్కు పరిశ్రమను వెంటనే ప్రారంభించాలని, రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, శివకోటి రాజు, వి.మంగ, సుగుణమ్మ, రియాజ్, అరుణ్ పాల్గొన్నారు. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ కుమార్ -
బుడమేరులోకి ఎన్టీటీపీఎస్ బూడిద నీరు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ నుంచి వెలువడే బూడిద నీటిని సమీపంలోని వేడినీటి కాలువ (బుడమేరు)లోకి అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ పరిణామాలతో బుడమేరు కాలువలో నీరు మొత్తం బూడిద రంగులోకి మారింది. నెలరోజులకు పైగా జూపూడి సమీపంలోని బూడిద చెరువులో లారీలకు బూడిద లోడింగ్ నిలిచిపోయింది. దీంతో చెరువు మొత్తం బూడిద నిల్వలతో నిండిపోయింది. ప్రత్యామ్నాయ మార్గంగా ఆర్డబ్ల్యూఎస్ పంపింగ్ స్కీమ్ సమీపంలో బుడమేరులోకి బూడిద నీరు విడుదల చేస్తున్నారు. కృష్ణానదిలో చేరిన బూడిదతో నదీ పరీవాహక గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంది. ఫిల్టరైజేషన్ లేని గ్రామాల్లో నేరుగా తాగునీటిని సరఫరా చేస్తే బూడిద నీటినే పంపిణీ చేయాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో బూడిద నీటిని తాగిన ప్రజలు అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు భయపడుతున్నారు. నదిలోకి బూడిద నీటిని వదలడం నిలిపివేయాలని కోరుతున్నారు. -
బందరు కాలువలో పడి యువకుడు గల్లంతు
పెనమలూరు: యనమలకుదురులో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బందరు కాలువలో పడి గల్లంతైన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పెనమలూరు సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం యనమలకుదురు ఇందిరానగర్కు చెందిన ఉద్దగిరి లక్ష్మి తన ఇద్దరు కుమారులతో కలసి ఉంటోంది. పెద్ద కుమారుడు వెంకటేష్ (20) తాపీ పనులు చేస్తాడు. అతను శనివారం పనికి వెళ్లి సాయంత్రం వచ్చి బందరు కాలువ వంతెన వద్ద కూర్చున్నాడు. తల్లి లక్ష్మి కుమారుడు వెంకటేష్ను ఇంటికి రమ్మని చెప్పగా, వెంకటేష్ తల్లిని ఇంటికి వెళ్లమని తాను వెంటనే వస్తానన్నాడు. అయితే వంతెనపై కూర్చున్న వెంకటేష్ రాత్రి 9 గంటలకు ప్రమాదవశాత్తు వంతెన పైనుంచి బందరు కాలువలో పడి గల్లంతయ్యాడు. ఇది చూసిన స్థానికులు వెంకటేష్ తల్లి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు వచ్చి కాలువలో గాలించినా వెంకటేష్ ఆచూకీ తెలియలేదు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అధికారులు రంగంలోకి దించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బందరు కాలువలో వెంకటేష్ కోసం గాలిస్తున్నారు. ఇంకా ఆచూకీ తెలియలేదు. -
సర్కారు నిర్లక్ష్యం వల్లే గిరిజన బాలికలకు అస్వస్థత
మహారాణిపేట(విశాఖపట్నం): కురుపాం గిరిజన బాలికల పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురికావడం, ఇద్దరు బాలికలు చనిపోవడానికి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి సర్కారే బాధ్యత వహించాలని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్పశ్రీ వాణి, పి.రాజన్నదొర ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న కురుపాం గిరిజన బాలికలను పుష్పశ్రీవాణి, రాజన్నదొర, అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు తదితరులు పరామర్శించారు. అనంతరం కేజీహెచ్ వైద్యులతో మాట్లాడి విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పుష్పశ్రీ వాణి మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాలల నిర్వహణను కూటమి సర్కారు గాలికొదిలేసిందని విమర్శించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అసమర్థురాలని ధ్వజమెత్తారు. పాఠశాల హాస్టల్లో కలుషిత నీరు తాగి పచ్చకామెర్ల బారిన పడి అంజలి, కల్పన అనే ఇద్దరు విద్యార్థులు మృతిచెందారని, సుమారు 120 మంది ఆస్పత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంజలి మృతికి నాటు వైద్యం కారణమని సర్కారు సాకులు వెతుకుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక్క గురుకుల పాఠశాలకు కూడా ఈ సర్కారు దోమతెరలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఆదివారం తీరుబడిగా స్పందించిన మంత్రి సంధ్యారాణి పాఠశాలల్లో నీరు బాగానే ఉందని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు కలుషిత నీరు వల్లే చనిపోయారని, కల్పన సికిల్ సెల్ అనేమియాతో చనిపోయిందని మంత్రి ప్రకటించడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఎంపీ డాక్టర్ తనూజా రాణి మాట్లాడుతూ కూటమి సర్కారు ఆశ్రమ పాఠశాలల్లో కనీస వసతులు కలి్పంచడం లేదని మండిపడ్డారు. కలుషిత నీరే ఇద్దరు చిన్నారులను బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతమంది పిల్లలు పచ్చకామెర్ల బారిన పడుతుంటే కూటమి సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. వైద్యానికి డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి పి.రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన పిల్లల వైద్యం కోసం డబ్బులు లేవని ఐటీడీఏ పీఓ చెప్పడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. పేద చిన్నారులకు వైద్యం చేయించలేని మంత్రి, సర్కారు పెద్దలు పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి సర్కారు నిర్లక్ష్యం వల్లే ఇంతమంది పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్లు చిన్న వ్యాధి అని కూటమి ప్రతినిధులు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను, వారి వెంట ఉన్న తల్లిదండ్రులను పట్టించుకునే నాథుడు లేడని, పర్యవేక్షణకు ఒక్క అధికారినీ నియమించలేదని విమర్శించారు. -
సుగర్ అదుపులో లేకుంటే ముప్పే..
ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో బ్రెయిన్స్ట్రోక్కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీస్తోంది. రక్తనాళాలు కుచించుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మెదడు రక్తప్రసరణపై ప్రభావం చూపుతాయి. మధు మేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొలెస్ట్రాల్, రక్తం పలుచబడే మందులు కూడా వైద్యుల సూచన మేరకు వాడాలి. సక్రమంగా మందులు వాడటం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం ద్వారా స్ట్రోక్ రాకుండా చూడవచ్చు. – డాక్టర్ డి. అనీల్కుమార్ న్యూరాలజిస్ట్ ● -
క్రమం తప్పకుండా మందులు వాడాలి..
మధుమేహులు దుష్పలితాలు రాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. చాలా మంది ఒకసారి వైద్యుడు రాసిన మందులనే నెలల పాటు వాడుతుంటారు. అది మంచిది కాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సుగర్లెవల్స్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మందులు పనితీరు తెలుసుకోవచ్చు. అవసరమైతే వైద్యులు మందులు మార్చడం, డోసు పెంచడం, తగ్గించడం చేస్తారు. సక్రమంగా మందులు వాడటం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే స్ట్రోక్ బారిన పడకుండా చూడవచ్చు. – డాక్టర్ ఎం. శ్రీకాంత్, మధుమేహ నిపుణుడు -
క్యూ కట్టిన వాహనాలు
కంచికచర్ల(నందిగామ): దసరా సందర్భంగా సొంతూరు బాట పట్టిన ప్రజలు ఆదివారం తిరుగు పయనమయ్యారు. సెలవులు పూర్తవటం, సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పని ప్రదేశాలకు వివిధ వాహనాల్లో బయలు దేరారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. దీంతో కంచికచర్ల మండలం కీసర టోల్ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు బారులుదీరాయి. టోల్ప్లాజా వద్ద ఫాస్టాగ్ సిస్టం ఉన్నప్పటికీ, ప్లాజా వద్ద ఐదు లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కువ వాహనాలు రావటంతో ఆలస్యం అవుతోందని ప్రయాణికులు అంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 15 వేల వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయని టోల్ప్లాజా మేనేజర్ జయప్రకాష్ తెలిపారు. -
తీరు మారలేదే!
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. తిరువూరు మండల, పట్టణ టీడీపీ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసే నిమిత్తం నెలరోజులుగా పనులు జరుగుతున్నాయి. ఆదివారం ఈ కార్యాలయ ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం శనివారం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన సమాచారాన్ని స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు నియోజకవర్గ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా పాల్గొంటారని ఎంపీ కార్యాలయం జారీ చేసిన కార్యక్రమ పత్రంలో పేర్కొంది. అయితే తన ప్రమేయం లేకుండా ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఎమ్మెల్యే విముఖత చూపి వేరే కార్యక్రమాలు ఖరారు చేసుకున్నారని ఆయన వర్గీయులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఆహ్వానించడానికి వెళ్లిన నాయకులను సైతం ఎమ్మెల్యే పట్టించుకోలేదని సమాచారం. చివరికి ఎంపీ కేశినేని మాత్రమే కార్యాలయాన్ని ప్రారంభించారు. వారం రోజుల్లో తిరువూరు పట్టణంలోని వార్డుల్లో, రాజుగూడెం గ్రామంలో కూడా పార్టీలోని ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ పరిశీలకుడు సుఖవాసి శ్రీనివాసరావు ఎంపీతో కలిసి కార్యక్రమాలకు హాజరవుతుండగా, ఎమ్మెల్యే గైర్హాజరుపై పార్టీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. తన ప్రమేయం లేకుండానే తిరువూరు నియోజక వర్గంలోని పలు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులను కేటాయించడం కూడా ఎమ్మెల్యే అలకకు కారణంగా భావిస్తున్నారు. ఎంపీ క్యాంపు కార్యాలయమేనా? తిరువూరులో ఆదివారం ప్రారంభించిన టీడీపీ కార్యాలయం విజయవాడ ఎంపీ కేశినేని క్యాంపు కార్యాలయంగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కార్యాలయాల్లో ఎంపీ సిబ్బంది నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. తారస్థాయికి ఎంపీ వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే ఫైట్ టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే కొలికపూడి డుమ్మా -
పిన్నిని ముక్కలుగా నరికి..!
వన్టౌన్(విజయవాడపశ్చిమ): స్వయాన అక్క కొడుకే ఆమె పాలిట రాక్షసుడిగా మారాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడానికి పిన్నే కారణమని భావించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వృద్ధురాలని కూడా చూడకుండా తన మైనర్ కొడుకుతో కలిసి ముక్కలుముక్కలుగా నరికి గోనె సంచుల్లో చుట్టి వేర్వేరు కాలువల్లో పడవేశాడు. సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భవానీపురం ఊర్మిళానగర్లో విజయలక్ష్మి(60) ఒంటరిగా నివసిస్తోంది.ఆమె ఇంటికి కొద్ది దూరంలో ఆమె అక్క కుమారుడు వంకదార హనుమాన్జీ సుబ్రహ్మణ్యం కుటుంబం నివసిస్తోంది. కొద్ది రోజులుగా సుబ్రహ్మణ్యం, అతని భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీనికి కారణం పిన్ని విజయలక్ష్మి చెప్పుడు మాటలేనని సుబ్రహ్మణ్యం భావించాడు. ఆమెపై పగ పెంచుకొని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం కొద్ది రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం గత బుధవారం విజయలక్ష్మి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి మాయమాటలతో తన ఇంటికి ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చాడు.ఆ తరువాత ఆమెపై ఒక్కసారిగా కత్తితో దాడికి దిగాడు. ఆమెపై దాడి చేయటానికి సుబ్రహ్మణ్యం మైనర్ కుమారుడు సహకరించాడు. విజయలక్ష్మిని ముక్కలుగా చేసి ఆమె శరీర భాగాలను వేరు చేశారు. వాటిని వేర్వేరు గోనెసంచుల్లో మూటకట్టి ఊర్మిళానగర్, గొల్లపూడి తదితర ప్రాంతాల్లో మురుగుకాలువల్లో పడేశాడు. అయితే విజయలక్ష్మి కనపడటం లేదని భవానీపురం పోలీసులకు ఫిర్యాదు అందింది. శనివారం గొల్లపూడి పంటకాలువ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో అవి విజయలక్ష్మి శరీరభాగాలుగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసుల విచారణలో సుబ్రహ్మణ్యమే ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. ఘటన తర్వాత నంద్యాల పరారైన సుబ్రహ్మణ్యం, అతనికి సహకరించిన కుమారుడిని నగరానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నట్లు సమాచారం. విజయలక్ష్మి శరీర భాగాలు పూర్తిగా లభించకపోవటంతో విచారణ కొనసాగుతోంది. -
గుంటూరు రైల్వే స్టేషన్లో ఏటీబీ ప్రారంభం
లక్ష్మీపురం (గుంటూరువెస్ట్) : ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు గుంటూరు రైల్వే స్టేషన్లో ఎనీ టైమ్ బ్యాగ్ (ఏటీబీ)యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రాన్ని రైల్వే డివిజనల్ మేనేజర్ సుధేష్ఠ సేన్ శనివారం ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా పది రూపాయలకే క్లాత్ బ్యాగ్ను సులభంగా పొందవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ను తగ్గించి క్లాత్ బ్యాగ్ను వినియోగించే పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చందోలు(కర్లపాలెం): చందోలులో ప్రసిద్ధి గాంచిన బగళాముఖి అమ్మవారిని శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత న్యాయమూర్తికి ఆలయ ఈవో నరసింహమూర్తి, ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మ వారికి పూజా కార్యక్రమాల నిర్వహణ అనంతరం జస్టిస్ శ్రవణ్కుమార్కు వేద ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ అమ్మవారి ఆలయ విశేషాలను న్యాయమూర్తికి వివరించారు. న్యాయమూర్తి వెంట బాపట్ల రెండవ అడిషనల్ జడ్జి పి.రాజశేఖర్, పీవీపాలెం తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఎం.వశివకుమార్, సిబ్బంది ఉన్నారు. -
ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల ఆగ్రహం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక గురుకుల (మైనార్టీ బాలికల) పాఠశాలను తరలించా లని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర (బొద్దనపల్లి) గ్రామంలో పొలాల మధ్యలో ఉన్న పాత కాలేజీ భవనంలోకి తరలించాలని ఏపీఆర్ సూల్స్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య గత నెల ఐదో తేదీన ఉత్వర్వులు ఇచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి ఏపీఆర్ స్కూల్స్ ఉన్నతాధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్ గుట్టు చప్పుడు కాకుండా, విద్యార్థినుల తల్లిదండ్రులకు ముందస్తు సమా చారం ఇవ్వకుండా పాఠశాలను తరలించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గత నెల 25వ తేదీ నుంచి స్కూల్ పేరెంట్స్ కమిటీ, పిల్లల తల్లిదండ్రులకు విషయం తెలిసి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు గత నెల 28న పాఠశాల వద్దకు వచ్చి తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు. పాఠశాలను ఇప్పటికిప్పుడు తరలించొద్దని సంబంధిత అధికారులను కోరారు. అదే రోజు సాయంత్రం పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ కూడా పేరెంట్స్తో మాట్లాడి సమస్య తెలుసు కుని పరిష్కరిస్తామని, భయపడవద్దని హామీ ఇచ్చారు. అయినా పాఠశాల తరలింపుపై నేటి వరకు సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అయితే గురుకుల పాఠశాల గోడలకు పాఠశాలను బొద్దనపల్లికి మారుస్తున్నామంటూ పాఠశాల భవనం ఫొటోలను శుక్రవారం అంటించడం గమనార్హం. విద్యాసంవత్సరం మధ్యలో వద్దు గురుకుల పాఠశాల తరలింపుపై తమకు అభ్యంతరం లేదని, అయితే ఎన్టీఆర్ జిల్లాలోనే రవాణా వసతి, సౌకర్యాలు ఉన్న ప్రాంతానికి తరలించా లని విద్యార్థుల తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి వారు రోజూ భవానీపురంలోని పాఠశాల వద్దకు వచ్చి, విద్యా సంవత్సరం పాఠశాలను తరలించడం అన్యాయమని వాపోతున్నారు. కనీసం ఈ విద్యాసంవత్సరం ముగిశాక పాఠశాలన తరలించాలని అధికారులను వేడుకుంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని మండిపడుతున్నారు. తమకు ఇష్టమైతే వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలో పిల్లలను కొనసాగిస్తామని, లేకపోతే టీసీలు తీసుకుని వేరే పాఠశాలలో చేర్పిస్తామని తెగేసి చెబుతున్నారు. ఇప్పుడున్న పాఠశాలకు కూతవేటు దూరంలో గొల్లపూడి పరిధిలోని హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లో ఉన్న భవనాన్ని ఇదే అద్దె ప్రాతిపదికపై తాము ప్రిన్సిపాల్కు చూపించామని, అక్కడికి తరలించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏమిటో తమకు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయంపై పునరాలోచించి, విద్యా సంవత్సరం పూర్తయిన తరువాత మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలపై బాధ్యత ఏదీ? పాఠశాల నగరంలో ఉంది కదా అని ఆడపిల్లలను ఇక్కడ చేర్పిస్తే, ఎటువంటి రక్షణ, భద్రత లేని మారుమూల పల్లెకు తీసుకెళ్తే ఎలాగని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అక్కడ విద్యార్థులకు జరగరానిదేదైనా జరిగితే బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించి మహిళలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైన కూటమి ప్రభుత్వ పాలనలో ఏ ధైర్యంతో తమ కుమార్తెలను పొలాల మధ్య ఉన్న భవనంలోకి పంపగలమని కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లల భద్రతపై పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లలో స్పందన లేదని వాపోతున్నారు. అదేమని అడిగితే ప్రభుత్వ నిర్ణయమని తప్పించుకోవడంపై మండిపడుతున్నారు. బాలికల మంచి కోసమే.. గురుకుల పాఠశాల తరలింపుపై ఏపీఆర్ స్కూల్స్ ఆంధ్ర, రాయలసీమ రీజియన్ల డెప్యూటీ సెక్రటరీలు సురేష్ బాబు, ఉబేదుల్లా (ఆర్డీ సీలు)ను వివరణ కోరగా.. గురుకుల పాఠశాల అంటేనే పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. బాలికల మంచి కోసమే ఈదర గ్రామానికి పాఠశాలను తరలిస్తున్నామని, పిల్లలకు అక్కడ అలవాటయితే ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు. -
మునేరులో గల్లంతయిన కీర్తన మృతి
కంచికచర్ల: మండలంలోని వేములపల్లి గ్రామం వద్ద శుక్రవారం నాయనమ్మతో కలసి దుస్తులు ఉతికేందుకు వెళ్లి మునేరులో గల్లంతైన బాలిక మృతిచెందింది. మునేరులో గల్లంతయిన ఉప్పెల్లి కీర్తన (10) ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు శనివారం ఉదయం ఆరు గంటలకు శనివారం గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్న సమయంలో కీర్తన మృతదేహం లభించింది. నాటు పడవ సాయంతో కీర్తన మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన తల్లి మరియమ్మ, నాయనమ్మ గుండెలవిసేలా రోదించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పెనుగంచిప్రోలు మండలం గుమ్ముడుదుర్రు గ్రామానికి చెందిన కీర్తన రెండో తరగతి చదువుతోంది. దసరా సెలవులను ఆదనందంగా గడిపేందుకు నాయనమ్మ ఇంటికి వచ్చింది. శుక్రవారం కీర్తన నాయనమ్మ రమణతో కలసి దుస్తులు ఉతికేందుకు మునేరు వద్దకు వెళ్లింది. నీటిలో దిగి గల్లంతయిన కీర్తన శవమై కనిపించటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపారు. మునేరులో అక్రమ తవ్వకాలే కారణం కూటమి నాయకులు వేములపల్లి వద్ద మునేరులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరపటం వల్లే అక్కడక్కడా లోతు ఎక్కువగా ఉందని, ఇసుక తవ్విన గోతిలో పడి కీర్తన మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మునేరులో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపినా రెవెన్యూ, మైనింగ్, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. మునేరులో అక్రమ తవ్వకాలు జరపకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): పెన్షనర్లకు రూ.30 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయం కల్పించినట్లు ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వేశాఖ చీఫ్ బ్రాంచ్ మేనేజర్ పాల సుకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎస్బీఐ ఆధ్వర్యంలో పెన్షనర్లకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా శనివారం ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వేబ్రాంచ్, స్టేషన్ రోడ్డు బ్రాంచ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు లాకులు సమీపంలోని ఓ హోటల్లో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో ఆయుష్ హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొని పెద్ద సంఖ్యలో హాజరైన పెన్షనర్లకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. ఎస్బీఐ దక్షిణ మధ్య రైల్వే, స్టేషన్ రోడ్డు బ్రాంచ్ల మేనేజర్లులు సుకుమార్, కోమల్ దాసరి మాట్లాడుతూ.. పెన్షనర్ల ఆరోగ్యం, ఆర్థిక భరోసాకు ఎస్బీఐ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెన్షనర్ల కోసం గతంలో లేని విధంగా 78 ఏళ్లు వరకు కూడా వారి పెన్షన్పై రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. వారికి రూ.30 లక్షల ఉచిత ప్రమాదా బీమా పథకం కూడా అందుబాటులో ఉందని వివరించారు. పెన్షనర్లు ఈ సదుపాయాలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, పెన్షనర్ల సంఘ నాయకులు, పెన్షనర్లు, ఎస్బీఐ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో పల్టీ ఎనిమిది మందికి గాయాలు
హనుమాన్జంక్షన్ రూరల్: చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు భవానీమాల ధరించారు. మరో ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇద్దరు మాలధారులు దీక్ష విరమించిన అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. బొమ్ములూరు టోల్ప్లాజా సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది రోడ్డుపై పడటంతో స్వల్పంగా గ్రాయపడ్డారు. వారిని ఎన్హెచ్ఏఐ అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పనులను వేగవంతం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్యానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య, ఇంజినీరింగ్ పనుల పురోగతిపై సంబంధిత మునిసిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులతో శనివారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు, పెడన పట్టణ ప్రాంతాల్లో పది ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటి వరకు మచిలీపట్నం, ఉయ్యూరు, పెడనలో ఒక్కొక్క ఆరోగ్య కేంద్రమే పూర్తయిందని కలెక్టర్ పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని, గుడివాడలో టెండర్ల ప్రక్రియలోనే ఉందని వివరించారు. మచిలీపట్నం నారాయణపురంలో స్థలం త్వరితగతిన ఎంపిక చేయాలన్నారు. తాడిగడప మునిసిపాలిటీలో కానూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించేందుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. అమాత్ 2.0 పథకం కింద మచిలీపట్నం, గుడివాడ, పెడన, తాడిగడప మునిసిపాలిటీల్లో రూ.181.31 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తాగునీటి పైపులతో కలవకుండా చూడాలని, లీకేజీ ఉండకుండా కాంట్రాక్టర్లు వాటిని సరిగా నిర్మిస్తున్నారో లేదో పర్యవేక్షించాలని సూచించారు. మచిలీపట్నంలో ఇంకా మిగిలిపోయిన 30 వేల టన్నుల వ్యర్థాల చెత్త బుట్టలను కూడా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెడన మునిసిపాలిటీలో పది రోజుల్లో పూర్తిగా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తను తొలగించిన ప్రదేశం ఆక్రమణకు గురికాకుండా నిఘా ఉంచి పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహరరావు, నజీర్, రామారావు, ప్రజారోగ్యశాఖ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ బాలాజీ -
చేపల వేటకు వెళ్లి వృద్ధుడి దుర్మరణం
అవనిగడ్డ: మండలంలోని పులిగడ్డ పల్లెపాలెం గ్రామానికి చెందిన సింగోతు నాగూర్(60) శుక్రవారం చేపల వేట నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. స్థానిక లూప్ చానల్ వద్ద నాగూర్ మృతదేహం పంట కాలువలో పైకి తేలింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్ఐ కె.శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని సందర్శించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సింగోతు నాగూర్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో సందర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితు కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
● సప్త వర్ణ శోభితం
ప్రకృతి రమణీయమైనది. సాయంసంధ్య వేళల్లో ప్రకృతి అందాలను చూస్తే ఎవరైనా సరే మైమరచిపోవలసిందే. నగర జీవి బిజీ బతుకుల్లో పట్టించుకోవడం లేదు కాని...కాస్త తీరిక చేసుకుని ప్రకృతి వైపు ఓసారి కన్నేసి తిలకిస్తే అలసి సొలసిన మనసుకు ఆహ్లాదంతో పాటు మానసిక ప్రశాంతత లభించడం ఖాయం. శనివారం విజయవాడ కరకట్ట శివారులో సూర్యాస్తమ సమయాన కనిపించిన ఈ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ఇబ్రహీంపట్నం: పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ షరీఫ్ వేడుకలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌసే ఆజం చిహ్నమైన జెండాను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ ఊరేగింపు చేశారు. పండగ సందర్భంగా ఈనెల 10వ తేదీన మసీదు వద్ద భారీ అన్నదానం నిర్వహిస్తున్నట్లు మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా తెలిపారు. కార్యక్రమంలో మసీదు కమిటీ కోశాధికారి కరీముల్లా, హసన్ అహ్మద్, షేక్ దావూద్, షేక్ గోరే, అలీఖాన్, కరిముల్లా ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో గ్యార్మీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు -
7న ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 7వ తేదీన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. 7వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 5:55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితార సెంటర్, కబేళా, పాలప్రాజెక్టు, కేఎల్రావు నగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రాహ్మణ వీధి మీదుగా గిరిప్రదక్షిణ సాగుతుందని తెలిపింది. ఆదిదంపతుల ఉత్సవ మూర్తులతో పాటు దేవస్థాన ప్రచారరథం, భక్తజనుల కోలాట నృత్యాల మధ్య సాగే గిరిప్రదక్షిణలో భక్తులందరూ పాల్గొనాలని దేవస్థాన అధికారులు కోరారు. అనిగండ్లపాడు(పెనుగంచిప్రోలు): మండలంలోని అనిగండ్లపాడు ఆయుర్వేద వైద్యశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్టుకు ఉత్తమ స్వచ్ఛ ఆయుష్ కేంద్రంగా ఎంపికై ంది. వైద్యశాల పరిసరాల పరిశుభ్రత, ఆవరణలో వివిధ రకాల ఔషధ మొక్కల ఏర్పాటు, టాయిలెట్, ఫ్లోరింగ్, హాండ్ వాష్, డస్ట్బిన్స్ తదితర అంశాలలో పలు రకాల తనిఖీల అనంతరం వైద్య శాలను రాష్ట్రస్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపిక చేశారని వైద్యాధికారి డాక్టర్ రత్నప్రియదర్శిని తెలిపారు. సోమవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నట్టు తెలిపారు. ఈ వైద్యశాలకు వై.రత్న ప్రియదర్శిని వైద్యాధికారిగా వచ్చినప్పటినుంచి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందటంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులలకు చికిత్స, పంచకర్మ సేవలు అందుబాటులోకి వచ్చాయని రోగులు చెపుతున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలువురు హర్షం వెలిబుచ్చారు. డాక్టర్ ప్రియదర్శినికి అభినందనలు తెలియజేశారు. మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని శనివారం న్యూఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతివెంటి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు తిరువూరు: ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు సూచించారు. తిరువూరు వాహినీ ఇంజినీరింగ్ కళాశాలలో 2025 డీఎస్సీలో ఎంపికై న నూతన ఉపాధ్యాయులకు నిర్వహించే వారం రోజుల శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యాలయాలు బలోపేతానికి ఉపాధ్యాయుల కృషే కీలకమన్నారు. మారుతున్న విద్యార్థుల అభిరుచుల కనుగుణంగా బోధనల మెళకువలను పెంపొందించుకుని మంచి ఫలితాల సాధనకు తోడ్పడాలని సూచించారు. ఉపాధ్యాయుడు కూడా నిరంతర విద్యార్థేనని, బోధనలో నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే రాణిస్తారని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ విధానంలో 250 మంది నూతన ఉపాధ్యాయులకు తిరువూరులో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు. -
స్థిరంగా సాగుతున్న వరద ప్రవాహం
కంకిపాడు: ఏటిపాయలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం వరద తగ్గుముఖం పట్టినా ప్రవాహం అలాగే ఉంది. ప్రస్తుతం మద్దూరు, కాసరనేనివారిపాలెం వద్ద ఏటిపాయ అంచులు తాకుతూ వరదనీరు ప్రవహిస్తోంది. ఏటిపాయలోని లంక భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు, కూలీలు పడవలను ఆశ్రయిస్తున్నారు. పడవలపై పొలాలకు వెళ్లి పొలం పనులు పూర్తి చేసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఏటిపాయ లో కొనసాగుతున్న వరద ఉధృతికి పంట పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. మద్దూరు, కాసరనేనివారిపాలెం పరిధిలోని ఏటిపాయ వెంబడి లంక భూముల్లోకి చేరిన వరదనీరు ఇంకా పొలాల్లోనే ఉండిపోయింది. ప్రవాహం కొనసాగుతున్న కారణంగా పొలాల్లో ఉన్న వరదనీరు ఏటిపాయకు మళ్లటం లేదు. దీంతో పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. పంటపై పెట్టిన పెట్టుబడులు చేతికి అందుతాయో? లేదో? అన్న భయం రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. -
రెడ్క్రాస్ శాఖను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మచిలీపట్నంఅర్బన్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) కృష్ణా జిల్లా శాఖను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఐఆర్సీఎస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తొలుత రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు జీన్ హెన్రీ డ్యూనంట్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కమిటీకి డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాద్ను చైర్మన్గా, సిర్విశెట్టి భాస్కర్ను వైస్ చైర్మన్గా, దాసరి రామకృష్ణ, వి.సుందర్ రామ్, జి.మెహర్ ప్రసాద్, పి.సుకుమార్, ఎన్.లీలా బ్రహ్మేంద్ర, బి.శివ విష్ణువర్ధన్, టి.వీరేంద్రనాథ్, బి.వెంకటేశ్వరరావు, బి.శంకర్నాథ్, పి.రాంప్రసాద్ సభ్యులుగా, డాక్టర్ ఎం.సూర్యశేఖర్, డాక్టర్ ఎస్.శర్మిష్ఠ, పి.వెంకట సుబ్బారావు, జె.బాబూరావులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారు. కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ అబ్జర్వర్ రామచంద్ర రాజు, జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, రెడ్ క్రాస్ ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్, జీవిత సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎన్సీసీ శిక్షణ శిబిరం
ఉయ్యూరు: ఉయ్యూరు శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థల ఆఽవరణలో నిర్వహిస్తున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 17వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో క్యాడెట్లకు బంకర్ బ్లాస్టింగ్, ఫీల్డ్ క్రా్ఫ్ట్ట్, బ్యాటిల్ క్రాఫ్ట్ట్, ఫైరింగ్ అంశాల్లో శిక్షణ ఇచ్చారు. 619 మంది క్యాడెట్లు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెప్ట్నెంట్ కల్నల్ జీసీ పాండే క్యాడెట్లకు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆపరేషన్ సింధూర్, జవాన్ల పాత్రపై అవగాహన కల్పించారు. -
రిలే దీక్షలకు దిగిన పీహెచ్సీ వైద్యులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటివరకూ అమలుచేయకపోగా, వాటికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన వైద్యులు.. తాజాగా విజయవాడ ధర్నా చౌక్లో రిలే దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రారంభించిన ఈ రిలే దీక్షలు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కొనసాగుతాయని అసోసియేషన్ నేతలు ప్రకటించారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. ⇒ అన్ని విభాగాల్లో 20 శాతం ఇన్సర్వీస్ పీజీ సీట్లు కొనసాగించాలి. టైమ్»ౌండ్ ఉద్యోగోన్నతులు ప్రకటించాలి. డీసీఎస్, సీఎస్ ఉద్యోగోన్నతులకు కాలపరిమితి నిర్ణయించాలి. ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. ⇒ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వెంటనే ట్రైబల్ అలవెన్స్ మంజూరుచేయాలి. ⇒ సంచార వైద్యసేవలకు తక్షణమే సదుపాయాలు కలి్పంచాలి. వాయిదా పడిన వేతన పెంపును తక్షణమే అమలుచేయాలి. రోగులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంలేదు.. రోగులను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశంకాదని, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తోనే సమ్మెకు వెళ్లినట్లు తెలిపారు. తాము సమ్మెకు వెళ్తామని అధికారులకు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకూ తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆమోదయోగ్యమైన డిమాండ్లు సీఎం దృష్టికిసాక్షి, అమరావతి: పీహెచ్సీ వైద్యుల డిమాండ్లలో ఆమోదయోగ్యమైన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు. వెంటేనే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. శనివారం సత్యకుమార్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. ఇన్ సర్వీస్ కోటా, ఉద్యోగ సర్వీస్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. -
ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?: పేర్ని నాని
సాక్షి, కృష్ణా జిల్లా: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్-6 హామీలకు తూట్లు పొడిచారంటూ చంద్రబాబు, పవన్, లోకేష్లపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మచిలిపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్లకు ఎన్నో హామీలిచ్చారు.. ఇప్పుడు చేతులెత్తేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు రాష్ట్రవాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు.. ఇప్పుడు జిల్లా సరిహద్దులు దాటడానికి వీల్లేదంటున్నారు’’ అంటూ చంద్రబాబు సర్కార్పై నిప్పులు చెరిగారు.మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడంటూ పేర్ని నాని నిలదీశారు. చంద్రబాబు ఆటో డ్రైవర్లకు సాధికారిత సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు? ఏమైంది?. ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల ప్రమాద బీమా చేస్తామన్నారు, చేశారా?. ఆటో డ్రైవర్ల పిల్లల చదువులకు రుణాలు ఇప్పిస్తామన్నారు, ఇచ్చారా?. ఆటో మీద చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నలు గుప్పించారు.చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పండని చంద్రబాబు చెప్పాడు. ఎవరైనా ప్రశ్నిస్తే తోలు తీస్తామన్నారు. ఏడాదైనా ఫ్రీ బస్సు ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారు. వైఎస్ జగన్, ప్రజలు, ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. ఫ్రీ బస్సులో జిల్లాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని సాక్షాత్తూ మంత్రులే చెప్పారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో పల్లె వెలుగులో రాష్ట్రమంతా తిరగొచ్చని ప్రకటించారు. బస్సులను తగ్గించేశారు.చంద్రబాబు దెబ్బకు ఆటోవాళ్లంతా రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఊకదంపుడు ప్రసంగం చేసిన చంద్రబాబు, పవన్ను నిలదీశారు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్లు వేశామని చంద్రబాబు చెబుతున్నాడు. భూ ప్రపంచం మీద తనే ఆటో డ్రైవర్లను ఆదుకున్నానని బిల్డప్ ఇచ్చాడు. చంద్రబాబు స్పీచ్ దెబ్బకు ఆటో డ్రైవర్లకు చెవుల వెంట రక్తం ఒక్కటే తక్కువ. ఆటో వాళ్ల కోసం యాప్ పెడతా.. కంట్రోల్ రూమ్ పెడతానంటున్నాడు. ఆటో, క్యాబ్, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు పండగే పండగ అని చంద్రబాబు చెబుతున్నాడు. చంద్రబాబు తీరు సినిమాలో బ్రహ్మానందం క్యామెడీ సీన్లా ఉంది...వాహనమిత్ర పథకం ప్రారంభించింది వైఎస్ జగన్. పాదయాత్రలో వైఎస్ జగన్ ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకున్నారు. మచిలీపట్నంలో ఆటో డ్రైవర్ల సమస్యలు స్వయంగా విన్నారు. తమకు ఏడాదికి పది వేలైనా ఇవ్వమని ఆటో డ్రైవర్లు అడిగారు. సొంతంగా ఆటో కొనుక్కుని నడుపుకుంటున్న వారికి 10 వేలు ఇస్తామని ఏలూరు వేదికగా ప్రకటించారు. జగన్ సీఎం అయిన వెంటనే 2 లక్షల 36 వేల మందికి వాహనమిత్ర ఇచ్చారు. ఎన్నికల సంవత్సరం కూడా వైఎస్ జగన్ 2 లక్షల 75 వేల మందికి వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పుడు జగన్ కంటే చంద్రబాబు కేవలం 14 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చారు. చంద్రబాబు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం చాలా చెప్పాడు..డ్రైవర్లను ఓనర్లు చేసేస్తామన్నాడు. బ్యాడ్జి కలిగిన ప్రతీ ఆటో, ట్యాక్సి డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15 వేలు ఇస్తామని చెప్పారు. మీరు చెప్పినట్లు ప్రతి డ్రైవర్కి రూ.15 వేలు ఇచ్చారా?. ఏ ఒక్క ఆటో డ్రైవర్కైనా 4 లక్షల రుణం ఇప్పించారా? ఆటో డ్రైవర్లకు బీమా కల్పించారా?. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు .. చేశారా?. చలాన్లు ఉంటే డబ్బులు వేయరా?. 15 వేలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు పెడతారా?. 13 లక్షల మంది లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లు ఉన్నారని లోకేష్ యువగళంలో చెప్పారు. ఈ రెండేళ్లలో లైసెన్సులున్న వాళ్లు పెరగరా?బ్యాడ్జి కలిగిన ప్రతీ ఒక్కరికీ ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఈ రోజు మోసం.. దగా చేసి పండుగ చేసుకోమంటున్నారు. వైఎస్ జగన్ ఒక్క షరతు కూడా పెట్టకుండా వాహనమిత్ర ఇచ్చారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాటను జగన్ నిలబెట్టుకున్నారు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్ మీ మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు?. ఇప్పుడు ఏం చేశారు?. ఈ రోజు జరిగింది ఆటో డ్రైవర్ల సేవ కాదు.. దగా. మీ మామ ఎన్టీఆర్కు ఏం చేశారో.. ఆటో డ్రైవర్లకు కూడా అదే చేశారు. ఒక సంవత్సరం ఎగ్గొట్టి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారు.రోడ్లన్నీ వేసేశామంటున్న చంద్రబాబుకు ఇదే నా సవాల్. ఆటో ఎక్కి రండి.. బందరు వస్తారా..? అవనిగడ్డ వస్తారా?. కైకలూరు వస్తారా?. గుడివాడ వస్తారా?. ఆటోలో రండి గోతులున్న రోడ్లు మీకు చూపిస్తాం. ఆటోలో ప్రయాణించిన మీరు బందరు ఆసుపత్రిలో చేరడం ఖాయం. లోకేష్ సిగ్గు లేకుండా మహిళా ఆటోడ్రైవర్లతో బూతులు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆటో డ్రైవర్లందరినీ వంచన చేశారు’’ అంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. -
ఆ లీజు వెనుక అసలు రహస్యం ఏంటి బాబూ?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణలకు వ్యతిరేకంగా ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ నెల 8న శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 28న విజయవాడలో సభతో ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక పాదయాత్ర ముగియనుంది. ఏపీలో రోజురోజుకీ రైతాంగం భూమి ప్రశ్నార్థకంగా మారుతోందని చంద్రబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు.తమ భూమి ఉంటుందో ఊడుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారని.. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం కొత్త జమీందారులను సృష్టిస్తోందంటూ శోభనాద్రీశ్వరరావు దుయ్యబట్టారు. లక్షలాది ఎకరాలు నయా జమీందారులకు కట్టబెడుతున్నారు. విజయవాడలో ఆర్టీసీ స్థలం లూలుకి అప్పగించారు. రూ. 600 కోట్ల విలువైన భూమిని 99 ఏళ్లు లీజుకు ఇవ్వడం వెనుక చిదంబర రహస్యం ఏంటి?. లూలు మీద నీకు ఎందుకంత ప్రేమ చంద్రబాబు? వందల కోట్ల ఖరీదైన భూములు ఎలా కట్టబెడతారు’’ అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు నిలదీశారు.‘‘ఏపీలో జరుగుతున్న భూదోపిడీపై ప్రజల్లో చైతన్యం చేస్తాం. ఆంధ్రా ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామని మహాదేవ్ అన్నారు. అక్టోబర్ 8న ఉద్ధానంలోని వెన్నెలవలస, మందస నుంచి ప్రారంభం ప్రారంభం కానుందని.. ప్రతీ చోటా హ్యూమన్ రైట్స్కు ప్రజల ద్వారా పిటిషన్లు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. చివరిగా విజయవాడలో 28న బహిరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇస్తామని మహాదేవ్ వెల్లడించారు. -
ఇది దసరా కానుక కాదు.. దగా, మోసం: ఆటో కార్మిక సంఘం ఫైర్
విజయవాడ: ఆటో కార్మికులకు దసరా కానుక పేరుతో ఈరోజు(అక్టోబర్ 4వ తేదీ) జరిగే సభ మోసపూరిత సభ అంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలోని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ధ్వజమెత్తింది. తాము చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి కలెక్టర్ను, ఎమ్మెల్యే బోండాను కలిస్తే, సీఎంను కలవడానికి వీల్లేదంటూ షరతులు పెట్టారని మండిపడ్డారు మరి అటువంటుప్పుడు ఈ రోజు జరగే సభ మోసపూరిత సభ కాకపోతే ఇంకేంటని ప్రశ్నించారు ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పోలారి. ‘ఆటో కార్మికులను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. మా సమస్యల పై వినతిపత్రం తీసుకోవడానికి జంకుతున్నారు. ఈ రోజు జరిగే సభలో వినతి పత్రం ఇస్తామని కలెక్టర్ను కలిశాం , ఎమ్మెల్యే బోండా ఉమాను కలిశాం. సీఎంను కలవడానికి వీల్లేదని మా వినతిని తిరస్కరించారు. ఈరోజు జరిపే సభ మోసపూరిత సభ. ఆటో డ్రైవర్లను బలవంతంగా బెదిరించి అధికారులు సభకు తీసుకెళ్లారు. సభలకు తరలిస్తే మంచి చేసినట్లు కాదు. నిజంగా మీరు మంచి చేస్తే స్వచ్ఛంధంగా మేమే తరలివస్తాం. సభకు బలవంతంగా ఆటో డ్రైవర్లను తరలించడం కాదు. ఇది దసరా కానుక కాదు..దగా మోసం. సూపర్ సిక్స్ పథకాలను భ్రష్టుపట్టించారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. ఏడాదిన్నరలో రూ. 2 లక్షల కోట్లు అప్పు తెచ్చిన మీరు ఆటో డ్రైవర్లకు రూ. 400 కోట్లు ఇవ్వలేకపోతున్నారా?, ఈ సభలోనైనా మీ హామీలను నెరవేరుస్తూ ప్రకటన చేయాలి. లేని పక్షంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అన్ని సంఘాలను కలుపుకుని పోరాడుతాం’ అని ఆయన హెచ్చరించారు. ఐఎఫ్టీయూ ప్రధానకార్యదర్శి డి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘చంద్రబాబు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారు. మా వినతిపత్రాలను కూడా తీస్కోవడం లేదు. ఎన్నికల ముందు మేం అడగకుండానే హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామన్నారు. జగన్ రూ. 10 వేలు ఇచ్చాడు మేం రూ. 15 ఇస్తున్నామంటున్నారు. .చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తెలియదు.పవన్ను చూసి ఓటేసిన నిరుద్యోగులు, యువత మోసపోయారు. మాకు ఇస్తామన్న ఆటో డ్రైవర్ లేవలో అనేక కొర్రీలు పెట్టారు. పెండింగ్ చలానాలు కడితేనే వాహనమిత్ర ఇస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించడం సిగ్గు చేటు. జీవో నెంబర్ 21 రద్దు చేయలేదు. చంద్రబాబు నువ్వు మర్చిపోతే నీ ఎన్నికల మ్యానిఫెస్టోను చదువుకో. వీడియోలు చూసి గుర్తు తెచ్చుకో.సింగ్ నగర్ వేదికగా మాకు ఇచ్చిన ఐదు హామీలు నెరవేర్చాలి. అప్పటి వరకూ మా ఉద్యమం ఆగదు’ అని వార్నింగ్ ఇచ్చారు.ఇక్కడ చదవండి: ఇంకో దుర్మార్గానికి తెర లేపుతున్నారు! -
AP: ఛలో విజయవాడకు పీహెచ్సీ వైద్యులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యుల సమ్మె ఎనిమిదో రోజు శుక్రవారం కొనసా గింది. గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు సైతం బహిస్కరించి సమ్మె చేస్తున్నారు. మెడికల్ పీజీ ఇన్- సర్వీస్ కోటా మరింపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. 20 శాతం ఇన్ సర్వీస్ కోటా అన్ని వీటి క్లినికల్ బ్రాంచ్ కోర్సులకు వర్తింది. జేయాలని వైద్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని డీఎం హెచ్, కలెక్టర్ కార్యాలయాల ముందు శిబిరాల్లో పెద్ద ఎత్తున వైద్యులు ఆందోళన కార్యక్ర మాలు చేపట్టారు. వైద్యులతో ఉన్నతాధికారులు రెండు పర్యాయాలు నిర్వహించిన దర్శలు విఫల -మయ్యాయి. శుక్రవారం మూడోసారి ఏదీ దీహెచి వైద్యుల సంఘం ప్రతినిధులతో ప్రజారోగ్య కుటుం డాక్టర్ పద్మావతి, ఆరోగ్య కుటుంబ సంక్షేము కమిషనర్ వీరపాండియన్ సుదీర్ఘంగా భేటీ అయి. వైద్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ చర్చలు విఫల మయ్యాయి. ప్రభుత్వం చెప్పిన ప్రదిపాదనలకు వైద్యులు తలొగ్గలేదు. యధావిధిగా సమ్మెను కొన సాగిస్తామని వైద్యులు ప్రభుత్వానికి తేల్చి చెప్పాడు. శనివారం ఛలో విజయవాడలో భాగంగా ధర్నాచౌక్ లో ధర్నా చేయనున్నారు. దీనిలో భాగంగా పీహెచ్సీ వైద్యులు పె ద్ద సంఖ్య లో అక్కడ చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఆదివారం. నుంచి ఆమరణ దీక్షలు చేపడతామని ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చారు. -
శాంతియుత ఉద్యమాల పితామహుడు గాంధీజీ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత పోరాటానికి జాతిపిత మహాత్మాగాంధీ ఆద్యులు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కొనియాడారు. మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా పాతబస్తీ గాంధీపార్కులోని గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ ఏనాడూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థను ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్ పోరాటం చేశారు తప్ప ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదన్నారు. సుమారు 4,500 మంది కమ్యూనిస్టులు నాటి పోరాటంలో రక్తతర్పణ చేశారని అన్నారు. ఈ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందని స్వయంగా దేశ ప్రధాని పేర్కొనటం చరిత్రను వక్రీకరించటమేనని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు బుట్టిరాయప్ప, తాడి పైడియ్య, అప్పురబోతు రాము, సంగుల పేరయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెత్త ఇస్తే సరుకులు ఇస్తాం
మచిలీపట్నంటౌన్: మచిలీపట్నం నియోజకవర్గం పరిధిలో పొడి చెత్తను తీసుకొచ్చిన వారికి బదులుగా నిత్యవసర సరుకులు అందిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని కోనేరు సెంటర్లో మంత్రి రవీంద్ర కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి గురువారం స్వచ్ఛ రథం వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథం వాహనాలను ప్రారంభించామన్నారు. వ్యర్థాలను సేకరించేందుకు కృష్ణాజిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏడు స్వచ్ఛ రథాలను కేటాయించామని తెలిపారు. వీటి ద్వారా ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు వంటి పొడి చెత్తను సేకరిస్తారన్నారు. పొడి చెత్తను సేకరించి అందించిన వారికి స్వచ్ఛ రథం వాహనం దగ్గర దానికి సమానమైన నిత్యావసర సరుకులు అందిస్తారన్నారు. చెత్తను తరలించేందుకు ఉన్న రెండు కంపాక్టర్లకు అదనంగా మరో కంపాక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందని, వీటి ద్వారా జిల్లాలోని చెత్తను ఎప్పటికప్పుడు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఏడు స్వచ్ఛ రథాలను ప్రారంభించామని, వీటి ద్వారా గ్రామాల్లో గృహాల వద్ద వృథాగా పేరుకుపోయిన ఇనుము, ప్లాస్టిక్, పేపర్లు, అట్ట పెట్టెలు, గాజు సీసాలు తదితర పొడి చెత్తను సేకరించి స్వచ్ఛ రథం వద్ద అందిస్తే దానికి సమానమైన కందిపప్పు, మినప గుళ్లు, పేస్టు, షాంపూ, కొబ్బరి నూనె, సబ్బులు, పెన్నులు, ఉల్లిపాయలు తదితర నిత్యవసర వస్తువులను అందిస్తారన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందడంతో పాటు పర్యావరణానికి మేలు చేసినట్లు అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా అధికారి, జెడ్పీ డెప్యూటీ సీఈవో డాక్టర్ ఆనంద్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోయ నాగమణి, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంబాపురంలో టీడీపీ కార్యకర్తల దాడి
విజయవాడరూరల్: గ్రామాల్లో పచ్చమూకల ఆగడాలు మితిమీరుతున్నాయి. దసరా పండుగ వేళ అంబాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ముగ్గురు కలిసి ఒక వ్యక్తిపై మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో మేరుగ కిరణ్ అనే వ్యక్తి దవడ రెండు చోట్ల విరిగిపోయింది. ఈ సంఘటన గురువారం అంబాపురం గ్రామం తోటమూల సెంటర్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వడ్డేశ్వరపు ఆనంద్ పై టూటౌన్ పోలీసు స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అతని అనుచరులు చోడవరపు ప్రవీణ్కుమార్, దొప్పలపూడి సుధీర్లతో కలసి ఆనంద్ తోటమూల సెంటర్లో తన స్నేహితులతో వెళుతున్న మేరుగ కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. కిరణ్తో పాటు ఉన్న అతని స్నేహితులు పరారు కాగా, ఆనంద్ అతని స్నేహితులు కలిసి కిరణ్పై దాడి చేశారు. దేహమంతా అనేక గాయాలు అవడంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతనిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి దవడ ఎముక రెండు చోట్ల విరిగిపోయిందని, సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. బాధితుడు మేరుగ కిరణ్ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుల అండదండలతో వడ్డేశ్వరపు ఆనంద్ తన అనుచరులను వెంటపెట్టుకుని మద్యం తాగుతూ గ్రామంలో దాడులకు తెగబడుతుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటువంటి అల్లరి మూకలను గ్రామ బహిష్కరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
హమ్మయ్య.. ఉత్సవం ముగిసింది!
వన్టౌన్(విజయవాడపశ్చిమ)/లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు లేకుండా ముగియటంతో జిల్లా అధికార యంత్రాంగం హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంది. గత నెల 22 నుంచి ఈ నెల రెండో తేదీ వరకూ 11 రోజుల పాటు దసరా మహోత్సవాలు కొనసాగాయి. కొనసాగుతున్న భవానీల రాక దసరా ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలో చాలా మంది భక్తులు భవానీదీక్షలను స్వీకరించి, దీక్షా విరమణకు అమ్మవారి సన్నిధికి తరలివస్తారు. దాంతో గడిచిన రెండు రోజులుగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి అధికంగా భవానీ దీక్షాపరులు అమ్మవారి సన్నిధికి తరలివస్తున్నారు. భవానీల రాకతో శుక్రవారం సైతం రద్దీ కొనసాగింది. మరో రెండు రోజుల పాటు భవానీల రాక కొనసాగనుంది. కూటమి నేతల హడావుడితో ఇక్కట్ల పాలైన భక్తులు ఈ ఏడాది కూటమి నాయకులు అమ్మవారి దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంపైన తమ ప్రతాపాన్ని చూపించారు. ఎటువంటి పాసులు లేకున్నా దర్శనానికి రావటం, అధికార యంత్రాంగంతో ఘర్షణకు దిగటంతో ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల సమస్యలు తలెత్తాయి. కొంతమంది మంత్రుల పీఏలు సైతం ఆలయంలో పోలీసు అధికారులను దుర్భాషలాడి ఘర్షణకు దిగిన సందర్భాలు ఉన్నాయి. జంబో ఉత్సవ కమిటీతో సమస్యలు దసరా ఉత్సవాల సందర్భంగా కూటమి ప్రభుత్వం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి జంబో ఉత్సవ కమిటీని నియమించింది. సుమారుగా 96 మందితో నియమించిన ఈ ఉత్సవ కమిటీ ఆలయ ప్రాంగణంలో అధికారులకు తలనొప్పిగా మారారని ఉన్నతాధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చివరి రోజు ట్రాఫిక్తో భక్తుల అష్టకష్టాలు దసరా పండుగ రోజు విజయవాడ నగరంలో ట్రాఫిక్ అష్టదిగ్బంధనం అయింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎంజీ రోడ్డులో డైవర్షన్తో పాటు, కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం రాజీవ్గాంధీ పార్కు వద్ద, గొల్లపూడి ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. బందరు రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ ఉదయం మారథాన్ నిర్వహించారు. ఉదయం 10 గంటల వరకూ రాకపోకలకు అనుమతించలేదు. దీంతో బందరు రోడ్డుకు ఇరువైపుల నివాసాలు ఉన్న వారు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సాయంత్రం కళాకారులతో కార్నివాల్ నిర్వహించడంతో మధ్యాహ్నం 4 గంటల నుంచి ట్రాఫిక్ను నిలిపివేశారు. ట్రాఫిక్ను డైవర్డ్ చేయడంతో ఆయా రోడ్లలో వాహనాలు బారులు తీరాయి. ముఖ్యంగా మదర్థెరిస్సా విగ్రహం సమీపంలో అమ్మవారి ఉత్సవాలకు వచ్చే భక్తులు సైతం ట్రాఫిక్తో ఇబ్బంది పడ్డారు. కూటమి నేతలు ఆర్భాటంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ నగర ప్రజలకు, ఉత్సవాలకు చాలా సమస్యలు సృష్టించింది. ప్రధానంగా ఆలయానికి సమీపంలో పున్నమి ఘాట్ వద్ద ఒక ప్రధాన వేదికను ఏర్పాటు చేయటంతో అటుగా భక్తుల రాకపోకలకు తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మంత్రులు ఇతర వీవీఐపీల రాకపోకలతో పోలీసులు గంటల తరబడి వాహనాలను మళ్లించటం వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ముఖ్యమంత్రి పర్యటనలతో... ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంజీరోడ్డులో నిర్వహించిన కార్నివాల్తో పాటు, గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పాల్గొన్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ను నిలిపివేయడంతో భవానీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ ప్రారంభం వద్ద భవానీలు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. బస్టాండ్ అవుట్గేట్ వరకూ వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు చంద్రబాబు రాకతో, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో గొల్లపూడి వద్ద ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. -
వైఎస్సార్ సీపీ ఎస్ఈసీ సభ్యుడిగా డాక్టర్ మెహబూబ్ షేక్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా విజయవాడకు చెందిన డాక్టర్ మెహబూబ్ షేక్ నియమితులయ్యారు. ఈమేరకు పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలియజేసింది. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఆయన క్రియాశీలక నేతగా ఉన్నారు. మూడుసార్లు వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైద్య విభాగం జోనల్ ఇన్చార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం వైద్య విభాగంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పార్టీకి అందించిన సేవలను గుర్తించి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమించారు. మెహబూబ్ షేక్ ఉమ్మడి కృష్ణాజిల్లా వైద్య విభాగం ఆధ్యక్షుడిగా ఉన్న సమయంలో మెగా వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. గ్రహణ మొర్రితో బాధపడుతున్న వారికి ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 2019 ఎన్నికల సమయంలో సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరించారు. తనపై నమ్మకంతో పార్టీ ఎస్ఈసీ సభ్యుడిగా నియమించినందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్కు, ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మెహబూబ్ షేక్కు అభినందనలు తెలిపారు. -
సెలవులకొచ్చి మునేరులో పడి గల్లంతు!
వేములపల్లి(కంచికచర్ల): దసరా సెలవుల్లో నాయనమ్మ, ఇతర బంధువులతో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ మునేటిలో పడి గల్లంతయిన ఘటన కంచికచర్ల మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన ఉప్పెల్లి ముసలయ్య అలియాస్ వెంకట్రావు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ముసలయ్య మరణానంతరం అతని భార్య మరియమ్మ తన ఇద్దరు పిల్లలతో పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామంలో నివాసముంటోంది. పెద్ద కుమార్తె కీర్తన(10) నాల్గవ తరగతి చదువుతోంది. రెండవ కుమార్తె సుసన్న అలియాస్ ప్రియదర్శిని రెండవ తరగతి చదువుతోంది. దసరా సెలవులు రావటంతో తల్లి మరియమ్మ తన పెద్ద కుమార్తెను వేములపల్లి గ్రామంలో నాయనమ్మ ఇంటి వద్ద ఉంచి గుమ్మడిదుర్రు గ్రామానికి తిరిగి వెళ్లింది. దుస్తులు ఉతికేందుకు శుక్రవారం నాయనమ్మ రమణమ్మతో కలసి మునేరుకు వెళ్లిన కీర్తన ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయింది. రమణమ్మ పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మునేరులో వెతికారు. అయినా కీర్తన ఆచూకీ తెలియలేదు. చీకటి పడటంతో వెతుకులాట ఆపారు. రెవెన్యూ, పోలీసు అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు వేములపల్లి గ్రామంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ఉదయం 11 గంటలకు మునేరులో గల్లంతయినా రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు మండిపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్, లేదా ఎస్టీఆర్ఎఫ్ బృందానికి తెలియజేయకపోవటంతో వారు వెతికేందుకు గ్రామానికి రాలేదని, ఇందుకు పూర్తిగా రెవెన్యూ, పోలీసు అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. -
కృష్ణానదిలో మునిగి గత ఈతగాడు మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రమాదవశాత్తు కృష్ణానదిలో మునిగి గజ ఈతగాడు మృతిచెందాడు. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక, వల్లూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఒడుగు కృష్ణ(35) అనే వ్యక్తి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వివాహమైంది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అతను గజ ఈతగాళ్ల డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు డ్యూటీకి వెళ్లాడు. డ్యూటీలో భాగంగా శనైశ్వరస్వామి గుడి వెనుక నదిలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బట్టలు శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి కనిపించలేదు. గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టినా కృష్ణ ఆచూకీ లభించలేదు. మునిగిన ప్రదేశంలోనే శుక్రవారం ఉదయం నీటిలో తేలుతూ శవమై కనిపించాడు. మృతదేహాన్ని నదిలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈతకు వెళ్లి యువకుడు దుర్మరణం నందిగామ రూరల్: స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు పట్టణంలోని అనాసాగరానికి చెందిన కర్రి శ్రీనివాసరావు కుమారుడు నరేష్ (28) గురువారం ముగ్గురు స్నేహితులతో కలిసి మండలంలోని పల్లగిరి సమీపంలోని మున్నేరులో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నరేష్తో పాటు అతని స్నేహితులు నీటిలో గల్లంతయ్యారు. అయితే ముగ్గురు స్నేహితులు సురక్షితంగా బయటకు వచ్చినప్పటికీ నరేష్ ఆచూకీ లభించకపోవటంతో మున్నేటిలో ముమ్మరంగా గాలించారు. నరేష్ను వెతికి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అభిమన్యు తెలిపారు. -
టీడీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
బూదవాడ(జగ్గయ్యపేట): పాతకక్షల నేపథ్యంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని బూదవాడ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం ఏసుబాబు, మరో నాయకుడు శీలం లక్ష్మయ్యకు గత కొన్ని రోజులుగా పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ కావటంతో లక్ష్మయ్య వర్గానికి చెందిన పల్లపాటి తిరుపారావు, పోతుమర్తి సాయి రాత్రి సమయంలో గ్రామంలోని బ్రిడ్జిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో ఏసుబాబు వర్గానికి చెందిన గడ్డం సత్యనారాయణ, గడ్డం లక్ష్మణ ఎదురవటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పక్కనే ఉన్న మధ్యం సీసాలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో పల్లపాటి తిరుపారావు, పోతుమర్తి సాయిలకు తీవ్ర గాయాలు కాగా సత్యనారాయణ, లక్ష్మణ్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ తరలించారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలుండటంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. ఘర్షణకు సంబంధించి ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో మరోసారి ఘర్షణలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టు
మైలవరం: జాతీయ కబడ్డీ పోటీలకు కృష్ణా విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేసినట్లు లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అంతర్ కళాశాలల కబడ్డీ పోటీల ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇళ్ళ రవి శుక్రవారం తెలిపారు. గత వారం స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కృష్ణా యూనివర్సిటీ పురుషుల అంతర్ కళాశాల కబడ్డీ పోటీల నుంచి మెరుగైన క్రీడాకారులను కృష్ణా విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపిక చేశామన్నారు. కృష్ణా విశ్వ విద్యాలయం జట్టు కర్నాటకలోని రాణి చెన్నమ్మ యూనివర్సిటీ బెల్లావిలో ఈ నెల 4 నుంచి 7 వరకు నిర్వహించే దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీలలో పాల్గొంటుందన్నారు. ఈ పోటీలను నాక్ ఔట్ కమ్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తారన్నారు. ఈ పోటీలకు కృష్ణా వర్సిటీ జట్టుకు మేనేజర్గా మైలవరం లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామిని, కోచ్గా నలంద కళాశాలకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావును, టీమ్ కెప్టెన్గా శ్యామ్ కుమార్ను నియమించినట్టు తెలిపారు. జట్టు సభ్యులుగా విజయ వ్యాయామ కళాశాల నుంచి శ్యామ్కుమార్, సాయి ప్రసన్న, వెంకటేశ్వర్లు, సిద్ధార్థ కళాశాల నుంచి మహేష్, మధు, ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి శామ్యూల్ రాజ్, కిరణ్, కేబీఎన్ కళాశాల నుంచి ఫిరోజ్, తేజ, ఎల్హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అజయ్బాబు, నలంద కళాశాల నుంచి యశ్వంత్ కుమార్, ఏజీఎస్జీఎస్ కళాశాల నుంచి గోపీచంద్, వికాస్ కళాశాల నుంచి వెంకటేశ్వరరావు, లయోలా కళాశాల నుంచి మహేష్ ఎంపికయ్యారన్నారు. -
AP: రాజధాని కోసం బలవంతంగా భూములు లాక్కోవాలని నిర్ణయం
విజయవాడ: ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలను అమరావతి రాజధాని కోసం సేకరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు బలవంతపు భూ సేకరణ కోసం సిద్ధమైంది. ఎవరైనా భూములు ఇవ్వను అంటే మాత్రం బలవంతంగా లాక్కోవాలని నిర్ణయిచింది. ఈ మేరకు దీనికి ఏపీ కేబీనెట్ ఆమోదం తెలిపింది ల్యాండ్ పూలింగ్లో భాగంగా భూములు ఇవ్వనివారి నుంచి బలవంతంగా లాక్కోవాలని నిర్ణయించారు గతంలో స్వచ్ఛందంగా భూములు తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు భూమలు ఇవ్వనివారిపై జులుం ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారు. దాంతో రెండో విడతలో భూముల కోసం రైతులకు ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినట్లయ్యింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటివరకు అమరావతి రాజధాని కోసం సుమారు 79,365 ఎకరాలు భూమిని సేకరించింది. ఇందులో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా, మరో 44,676 ఎకరాలు తాజా భూసేకరణ ద్వారా పొందనున్నారు రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణ వివరాలు ఇలా..ల్యాండ్ పూలింగ్ ద్వారా (2014–2019)34,689 ఎకరాలు 29 గ్రామాల నుంచి రైతుల సహకారంతో సేకరించారు.రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, విద్య, ఆరోగ్య సదుపాయాలు హామీ ఇచ్చారు.తాజా భూసేకరణ (2025)44,676 ఎకరాలు అదనంగా సేకరించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధంగ్రామాలుతూళ్లూరు మండలం: హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి – 9,919 ఎకరాలుఅమరావతి మండలం: వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల – 12,838 ఎకరాలుతాడికొండ మండలం: తాడికొండ, కంతేరు – 16,463 ఎకరాలు- మంగళగిరి మండలం: కాజా – 4,492 ఎకరాలుగతంలో రైతుల కోసం హామీలు ఇలా..బలవంతం లేకుండా భూసేకరణప్రోత్సాహక ప్యాకేజీలుభవిష్యత్తు మౌలిక వసతులపై హామీఇప్పుడు ఇలా..భూములు ఇవ్వకపోతే బలవంతంగా సేకరించేందుకు నిర్ణయంఇదీ చదవండి: ‘చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు’ -
విజయవాడలో దారుణం.. లాడ్జిలో మహిళ స్నానం చేస్తుండగా..
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన తెలంగాణకు చెందిన మహిళపై వేధింపులకు పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యవకులు.. మహిళ నగ్న వీడియోలు చిత్రీకరించారు. గవర్నర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.గవర్నర్పేటలోని ఓ లాడ్జిలో స్నానం చేస్తున్న మహిళను పక్క రూమ్లో నుంచి ఇద్దరు యువకులు వీడియో చిత్రీకరించారు. అలజడి కావడంతో యువకుల్ని బాధితురాలు గుర్తించింది. బాధితురాలు గవర్నర్పేట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా, ఇటీవల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి దేవస్థానం టీటీడీ సదనంలో ఒక భక్తురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉద్యోగికి భక్తురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఆపై అధికారులకు ఫిర్యాదు చేయగా, సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన (మంగళవారం, సెప్టెంబర్ 23) తెల్లవారుజామున జరిగింది. -
వైభవంగా దసరా వేడుకలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): స్థానిక సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో విశ్వమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో బుధవారం అమ్మవారి శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. గోపూజ, సూర్యనమస్కారాలు, చండీహోమం, సుహాసిని పూజ, దంపతుల పూజ జరిగాయి. మధ్యాహ్నం ఆరు వేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం గాయత్రీనగర్, మొగల్రాజపురం ప్రాంతాల్లో అమ్మ వారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారు గురువారం శ్రీ విజయరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తామని నిర్వాహకుడు వైట్ల కృష్ణప్రసన్న తెలిపారు. -
నేటి అలంకారం
శ్రీరాజరాజేశ్వరీదేవి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింప చేసే అపరాజితా దేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలం కారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారానే మనకు లభిస్తాయి. -
వరదొచ్చినా...ముంపు భయం లేదు
కృష్ణలంక/లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణా నదికి పది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా కృష్ణలంక కరకట్ట ప్రాంత వాసులకు వరద భయం లేదు. తట్టా బుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మూడు రోజులుగా ఏడు లక్షల పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తున్నా... దసరా పండుగను సంతోషంగా తమ ఇళ్లలోనే జరుపుకొంటున్నామని ఆ ప్రాంత ప్రజలు ఆనందంతో చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే సుమారు 70 వేల మంది ప్రజల ముంపు సమస్యను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిష్కరించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలా... ప్రస్తుతం కృష్ణానదికి 7 లక్షల క్యూసెక్యులకు పైగా వరద వస్తోంది. ఒకప్పుడు ఇంత వరద వచ్చిందంటే కృష్ణలంక ప్రాంతంలోని రణదీవె నగర్, తారకరామా నగర్, భూపేష్గుప్తా నగర్, రామలింగేశ్వర నగర్ పోలీస్కాలనీలు నీట మునిగేవి. ఆ ప్రాంత ప్రజలు తట్టాబుట్టా సర్దుకుని పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాల్సి వచ్చేది. వరద ఎప్పుడు తగ్గుతుందా అంటూ ఎదురుచూసే వారు. కూలిపనులకు కూడా వెళ్లే అవకాశం ఉండేది కాదు. పిల్లలు స్కూలుకు వెళ్లేవారు కాదు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులు లేక వ్యాధుల బారిన పడేవాళ్లు. ఆ రోజులను గుర్తు చేసుకుంటేనే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. రిటైనింగ్ వాల్తో వరద సమస్యకు చెక్ కృష్ణలంక వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. కనకదుర్గమ్మ వారధికి ఎగువన ఒక కిలోమీటరుతో పాటు, దిగువన భూపేష్గుప్తా నగర్ వరకూ వాల్ నిర్మించారు. కృష్ణానదికి గత ఏడాది 11 లక్షల క్యూసెక్యులకు పైగా నీరు వచ్చినా వరద ముప్పులేకుండా రిటైనింగ్ వాల్ కాపాడగలిగింది. సంతోషంగా పండుగ చేసుకుంటున్నాం ఇళ్లు మునుగుతాయనే భయం లేదు నాడు పండుగలు ఉండేవి కాదు -
ఎన్సీఆర్బీ డేటా.. ఎల్లో మీడియా వక్రీకరణ: కైలే అనిల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై ఎన్సీఆర్బీ నివేదికలోని వాస్తవాలను కూడా చంద్రబాబు కోసం వక్రీకరించే దుస్థితికి ఎల్లో మీడియా దిగజారిందని, ఆ నివేదికను ఉటంకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను అచ్చేసిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనీల్కుమార్ మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా జరిపించి, విత్తనం నుంచి విక్రయం వరకు వారికి అండగా నిలబడటం వల్ల గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని అన్నారు.వ్యవసాయం దండగ అని నమ్మే చంద్రబాబు సుదీర్ఘ పాలనలో రైతులకు కష్టాలు, కడగండ్లు, ఆత్మహత్యలు తప్ప మరేమీ దక్కలేదని మండిపడ్డారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను తక్షణం ఆదుకున్న మానవత్వం వైఎస్ జగన్ది అయితే, వారి కుటుంబాలను గాలికి వదిలేసిన రాక్షసత్వం చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరుగుతోంది. వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి, రైతులను డిస్ట్రస్ నుంచి తప్పించడానికి వైఎస్ జగన్ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటన్నింటినీ రద్దు చేసి, మళ్లీ వ్యవసాయంలో సంక్షోభాన్ని తీసుకువచ్చిన చంద్రబాబుని కాపాడేందుకు ఎల్లోమీడియా ఇవాళ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకుంది. 2023లో ఎన్సీఆర్బీ డేటాను తీసుకుని, చిలువలు పలవలు చేసి, వక్రీకరించి తప్పడు ప్రచారం చేయడం మొదలు పెట్టింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ హయాంలో రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకున్నారనే అభిప్రాయాన్ని కలిగించడానికి నానా ప్రయత్నాలు చేస్తోంది.ఆత్మహత్య చేసుకున్న రైతులు.. మద్యం తాగి చనిపోయారన్న చంద్రబాబువైఎస్సార్సీపీ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి. 2021లో రాష్ట్రంలో 481 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో భూయజమానులైన రైతులు 359 మంది ఉండగా, కౌలు రైతులు 122 మంది ఉన్నారు. కాగా 2022లో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 369 కు తగ్గాయి. వారిలో భూ యజమానులైన రైతులు 309 మంది ఉండగా, కౌలు రైతులు 60 మంది ఉన్నారు. 2021లో 584 మంది వ్యవసాయ కూలీలు ఇతరత్రా కారణాలతో ఆత్మహత్య చేసుకోగా.. 2022లో వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 548కు తగ్గాయి. మొత్తం మీద వ్యవసాయంపై ప్రత్యక్షంగా ఆధారపడేవారు 2021లో 1,065 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2022లో అవి 917కు తగ్గాయి.2023లో ఏడాదిలో రైతుల ఆత్మహత్యల సంఖ్య 925. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. దీనిపై పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నారు. పోనీ ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి చంద్రబాబు ఏరోజైనా పట్టించుకున్నాడా అంటే అదీ లేదు? రైతుల ఆత్మహత్యలను గుర్తించడానికి, వారి కుటుంబాలను కాపాడ్డానికి ఏ రోజు కూడా చంద్రబాబు తన 14 ఏళ్ల పరిపాలనా కాలంలో కాని, ఇవాళ కాని ముందుకు రావడం లేదన్నసంగతి తెలిసిందే. 2014-19 మధ్య రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే, వారంతా వ్యక్తిగత సమస్యలతోనూ, మద్యం తాగి చనిపోయినట్టుగానే చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సాక్షాత్తూ రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రైతుల పట్ల, వారి కష్టాల పట్ల చంద్రబాబుకు మానవత్వం లేదనే విషయం ప్రతిసారి రుజువు అవుతూనే ఉంది. ఈ సారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. ఆయా కుటుంబాల పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు.చంద్రబాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయంధాన్యం దగ్గర నుంచి మిర్చి, పొగాకు, మామిడి సహా ప్రస్తుతం ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అప్పులు ఊబిలో కూరుకు పోయారు. రాష్ట్రంలో ఏ రైతుకు కూడా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దీనికి తోడు ఎరువుల కొరత కూడా రైతులను తీవ్రంగా వేధిస్తోంది. గతేడాది పెట్టుబడి సహాయాన్ని ఎగ్గొట్టారు, ఉచిత పంటల బీమా ఎగ్గొట్టారు, ఇ-క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలను నీరుగార్చారు. సీఎం యాప్ను తీసేశారు. ఈ పరిస్థితులన్నీ రైతులను తీవ్ర నిరాశాజనక వాతావరణం లోకి నెట్టేశాయి. పరిస్థితులను తట్టుకోలేక వారు బలవ్మనరణాలకు పాల్పడుతుంటే.. కనీసం ఆ కుటుంబాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం జాలి కూడా చూపడంలేదు.కానీ వైఎస్ జగన్ రైతులకు ప్రతి చోటా చేదోడు వాదోడుగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని గొప్ప విదానాలు తీసుకువచ్చి రైతుల్ని ఆదుకునే ప్రయత్నాలు చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఉంచడానికి ముఖ్యమంత్రిగా ఆయన అహర్నిశలు పని చేశారు. వైయస్సార్సీపీ పరిపాలనాకాలంలో 1794 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడితే వారందరికీ కూడా పరిహారం చెల్లించారు.ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకున్నారన్న సమాచారం తెలియగానే.. వెంటనే జిల్లా కలెక్టర్ను పంపి, ఆ కుటుంబాలకు బాసటగా నిలిచి, 48 గంటల్లోపే ఆ కుటుంబాలకు సహాయం అందించిన ఘటనలు కోకొల్లలు. మరి ఇప్పుడు ఎందుకు ఆ విధానాన్ని తీసేశారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడ్డం లేదు? ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదు? అంతేకాదు 2014-19 మధ్య పునర్విచారణ జరిపి, 474 మందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు అందేలా చేశారు. చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగింది. ఇలా దాదాపుగా రూ.117 కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారంగా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది.ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల పట్ల 'బాబు' నిర్లక్ష్యం2014-19 మధ్య ఆత్మహత్య చేసుకున్న రైతులను కాపాడేందుకు చంద్రబాబు ముందుకు రాకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి. అరకొరగా ఆయా కుటుంబాలను గుర్తించి ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారంఅనేవారు. దాంట్లో రూ.1.5 లక్షల్నిఅప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. ఎప్పుడో ఐదేళ్లకో.. పదేళ్లకో ఆ డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇది ఏరకంగా బాధిత కుటుంబాలను ఆదుకున్నట్టు అవుతుంది? రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచింది. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్బడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది.వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే కౌలు దారులకు రూ.7 లక్షలు పరిహారాన్ని కూడా ఈ ప్రభుత్వం అందించింది. జగన్మోహన్రెడ్డిగారు అత్యంత మానవతావాదిగా వారికి సహాయం చేశారు? ఇప్పుడు చంద్రబాబు రైతుల పట్ల, వారి కుటుంబాల పట్ల అత్యంత అన్యాయంగా వ్యవహరిస్తూ.. వారి ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు పరిపాలనా విధానం ప్రధాన కారణం. వ్యవసాయ రంగంలో ఆయన సృష్టించిన సంక్షోభమే దీనికి కారణం. ధరల స్థిరీకరణ నిధిని ఎత్తివేసి రైతుల ఉసురు పోసుకున్నారు.వైఎస్ జగన్ ఇదే నిధితో దాదాపు రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్నారు. మరి రైతు ద్రోహి ఎవరు? ఉచిత పంటల బీమాను జగన్ పెడితే, చంద్రబాబు దాన్ని రద్దు చేశారు. గత ఏడాది అందాల్సిన పంటల బీమా ఇప్పటి వరకూ అందలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా.. నష్టాల గణనే లేకుండా పోయింది. వందల మంది రైతులు చంద్రబాబు వచ్చిన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వ్యవసాయ రంగంలో సంక్షోభం మీద వార్తలు ఇవ్వకుండా కేవలం చంద్రబాబును జాకీలు పెట్టి లేపే పనిని ఎల్లో మీడియా మానుకుంటే మంచిది.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తగ్గిన నేరాలుఇక ఎన్సీఆర్బీ డేటా విషయాని కొస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చిన విషయం చాలా స్పష్టంగా డేటాలో కనిపించింది. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో అన్నిరకాల నేరాలు తగ్గాయని ఎన్ఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. నేరాలకు పాల్పడితే నమోదు చేసే ఐపీసీ సెక్షన్ల కేసులు, పౌరులు చట్టబద్ధంగా వ్యవహరించేలా చేసేందుకు నమోదు చేసే నాన్ కాగ్నిజబుల్ కేసులు కూడా తగ్గడం శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వ సమర్థతకు నిరద్శనం. 2020లో ఐపీసీ కేసుల 1,88,997 కాగా, 2021లో 1,79,611, 2022లో 1,58,547 మాత్రమే నమోదయ్యాయి, 2023లో 1,53,867 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రతి ఏటా తగ్గుదల చాలా స్పష్టంగా కనిపిస్తోంది.ఇక స్పెషల్ లోకల్ లా కేసులను చూస్తే 2020, 21, 22 సంవత్సరాల్లో క్రమంగా తగ్గుకుంటా వచ్చాయి. 2020లో 49,108, 2021లో 42,588, 2022లో 36,737గా ఉన్నాయి. 2023లో 30,436కు పరిమితం అయ్యాయి. నేరాలకు పాల్పడే వారిని న్యాయస్థానం ద్వారా విచారించి వారికి శిక్షలు పడేలా చేయడంలో వైయస్సార్సీపీ హయాంలో గట్టిగా కృషి జరిగింది. కేంద్ర హోంశాఖ నిర్దేశిచిన ఛార్జిషీటు దాఖలకు పెట్టిన గడువు 60 రోజులు అయితే, నమోదైన కేసుల్లో 91.6 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసి రాష్ట్రం, దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది.శాంతిభద్రతల నిర్వహణ, కేసులు దర్యాప్తు, విచారణ, తర్వాత న్యాయ ప్రక్రియలో వైఎస్ జగన్ ప్రభుత్వం సమర్థతకు నిదర్శనం ఇది. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హత్యలు కూడా గణనీయంగా తగ్గాయి. 2021లో రాష్ట్రంలో 956 మంది హత్యకు గురికాగా... 2022లో హత్యల సంఖ్య 925కు తగ్గింది. 2023లో హత్యలు 922. అంటే హత్యలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దిశ యాప్, దిశ వ్యవస్థ వంటి విప్లవాత్మక విధానాలతో మహిళల భద్రత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మహిళల పై వేధింపులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.ప్రధానంగా అత్యాచారాలు, వరకట్న వేధింపుల కేసులు తగ్గడం వైఎస్ జగన్ ప్రభుత్వ సమర్థతకు అద్దం పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించకుండా పోయారంటూ మహిళలు, అమ్మాయిలు, బాలికల విషయంలో నమోదైన కేసుల్లో 85.7 శాతం రికవరీ 2023లో ఉంది. దేశంలో 54 శాతం మాత్రమే. దేశంలోనే రాష్ట్రం పనితీరు బాగున్నట్టుగా నివేదిక పేర్కొంది.ఎన్నికలకు ముందు 39 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయినట్టుగా ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. ఇవన్నీ అవాస్తవాలని ఎన్సీఆర్బీ రిపోర్టు కొట్టి పారేసింది. పైగా వైఎస్సార్సీపీ హయాంలో ఫిర్యాదు చేయడానికీ, వాటిపై కేసుల నమోదుకూ, విచారణకూ పగడ్బందీ వ్యవస్థలు ఉండేవి. వీటి నమోదు ద్వారా నంబర్లు పెరుగుతాయని, తద్వారా కేసులు ఎక్కువగా ఉన్నాయనే భావన ఉన్నప్పటికీ, వివిధ సంస్కరణలతో రిపోర్టింగ్ విధానాన్ని బలోపేతం చేశారు. ఇన్ని రకాలుగా ప్రభుత్వం మెరుగ్గా పనిచేసినప్పటికీ వక్రీకరణలతో ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. -
డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ముపై చంద్రబాబు కన్ను: రాయన భాగ్యలక్ష్మి
సాక్షి, తాడేపల్లి: డ్వాక్రా మహిళల పొదుపు నిధులపై కూడా చంద్రబాబు సర్కార్ కన్నేయడం దారుణమని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఉచితంగా కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద ఇచ్చిన లబ్ధిని నేడు కూటమి ప్రభుత్వం వడ్డీతో కూడిన రుణంగా ఇస్తామనడం దుర్మార్గం కాదా అంటూ మండిపడ్డారు.మహిళల పొదుపు సొమ్మును పథకాల పేరుతో మళ్ళించి, తమ ఘనతగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. ఒక వైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా, వడ్డీతో కూడిన విద్యాలక్ష్మి రుణాలను ఇస్తామనడం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని అన్నారు. వీటిని పథకాలు అని చెప్పుకోవడానికి సీఎం చంద్రబాబు సిగ్గపడాలని, ఇవి మహిళలకు చేస్తున్న ఢోకా కాదా అని నిలదీశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..డ్వాక్రా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును 'స్త్రీనిధి' సంస్థ ద్వారా దాచుకుంటారు. ఈ స్త్రీనిధి సంస్థ కూడా ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం కింద డబ్బును వడ్డీకి తీసుకువచ్చి, వాటిని డ్వాక్రా సంఘాలకు రుణంగా ఇస్తుంది. ఇలా డ్వాక్రా సంఘాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు, వాటి ఆర్థిక అవసరాలను స్త్రీనిధి సంస్థ సమకూరుస్తుంటుంది. మహిళల పొదుపుసొమ్ము కూడా ఈ స్త్రీనిధి లోనే జమ అవుతూ ఉంటుంది. ఇటువంటి సంస్థ నుంచి కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేస్తామని చెబుతున్న ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాల పేరుతో ఏకంగా రూ.1000 కోట్లు సేకరిస్తోంది.ఈ సేకరించిన డబ్బును కూడా ఆయా పథకాల లబ్ధిదారులకు నాలుగు శాతం వడ్డీతో కూడిన రుణాలుగా ఇస్తామని చెబుతోంది. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం షాదీ తోఫా, కళ్యాణమస్తు పథకాల కోసం అయిదేళ్ల కాలంలో రూ.427 కోట్లు ఖర్చు చేసింది. ఈ సొమ్మును కూడా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయడం ద్వారా వారికి అండగా నిలిచింది. నేడు చంద్రబాబు ఈ పథకాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని వడ్డీతో కూడిన రుణంగా మార్చేయడం అత్యంత దుర్మార్గం.ఇదేనా మహిళలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి? పైగా డ్వాక్రా పొదుపు నిధులతో ఆర్థికంగా పరిపుష్టం అయిన స్త్రీనిధి నుంచి సొమ్మును తీసుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఆ సంస్థ పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. చివరికి స్త్రీనిధి మనుగడే ప్రశ్నార్థకం కూడా అవుతుంది. మహిళలకు మంచి చేయాల్సింది పోయి, వారి పొదుపు సొమ్మును కూడా గల్లంతు చేసే పనిలో చంద్రబాబు సర్కార్ తలమునకలు అవుతోంది.గత ప్రభుత్వంలో సున్నా వడ్డీ కింద రూ.4969 కోట్లు లబ్ధి2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు రూ.25,571 కోట్లు రుణమాఫీ చేస్తానని చెప్పి, దారుణంగా మోసం చేసింది. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 3,86,82,882 మంది డ్వాక్రా గ్రూప్ లబ్ధిదారులకు దాదాపు రూ.4,969 కోట్లు సున్నావడ్డీ పథకం కింద లబ్ధి చేకూర్చారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో సున్నావడ్డీ కింద వేయాల్సిన సొమ్మును జమ చేసేందుకు సిద్ధమైనా, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయింది. ఎన్నికలు అయిపోయిన తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మొత్తాన్ని డ్వాక్రా గ్రూపులకు జమ చేయాల్సి ఉన్నా, నేటికీ దానిని పట్టించుకున్న పాపాన పోలేదు.ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో చేయూత, ఆసరా, భరోసా, తోడు ఇలా అనేక పథకాలను మహిళల కోసం అమలు చేశారు. రేషన్ కార్డుల్లోనూ ఇంటి యజమానిగా మహిళల పేరు, పేదలకు ఇచ్చిన ఇళ్ళస్థలాలు కూడా మహిళల పేరు మీదే ఇచ్చారు. నేడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మహిళలను నమ్మించి మోసం చేస్తున్నారు. సున్నావడ్డీ, కళ్యాణమస్తు వంటి పథకాలను ఎగ్గొట్టారు.గత ఎన్నికలకు ముందు కూడా సూపర్ సిక్స్ పేరుతో ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే, అంతమందికీ రూ.18వేలు చొప్పున స్త్రీ నిధి కింద ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంత వరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు. 19-59 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళలకు ప్రతినెలా రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారు. దీని ఊసే లేదు. -
టీటీలో నగర క్రీడాకారులకు పతకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలోని వైవీ రావు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సెప్టెంబర్ 29న జరిగిన యూటీటీ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో దామూస్ టీటీ అకాడమీ క్రీడాకారులు పలు పతకాలు సాధించినట్లు అకాడమీ కోచ్ వై.దామోదర్ రెడ్డి తెలిపారు. బాలుర అండర్ 15 విభాగంలో జి.లోహిత్ స్వర్ణ పతకం, బాలికల అండర్ 11 విభాగంలో జి.మహి మన్విక స్వర్ణ పతకం, జి.మిషిక కాంస్య పతకం కై వసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరందరూ పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య నగర పాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను కృష్ణాజిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈ.రామిరెడ్డి, వి.భార్గవి, కోశాధికారి ఎ.రామచంద్రరావు, వీఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ఎ.శ్రీధర్, శిక్షకులు స్వపన్ గంగోపాధ్యాయ అభినందనలు తెలిపారు. రెండు స్వర్ణ, ఒక కాంస్యం కై వసం -
నడిరోడ్డుపై టీడీపీ నేతల బాహాబాహీ
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు టీడీపీలో ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. రెండు రోజుల క్రితం టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ మంగళవారం వెలుగుచూసింది. ఓ రహదారి మరమ్మతుల అంశంపై సర్పంచ్ సర్నాల గంగారత్నం భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ, గన్నవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ గూడవల్లి నరసయ్య వారి వారి అనుచరులతో ఘర్షణకు దిగిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈనెల 28న గూడవల్లి నరసయ్య గ్రామంలోని బీఎంపీఎస్ రోడ్డులో మనుషులను పురమాయించి రహదారిపై గోతులను పూడ్పించేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ భర్త, వార్డు సభ్యుడు సర్నాల బాలాజీ ఘటనా స్థలానికి వెళ్లి మీరెవరు పనులు చేయించడానికని ప్రశ్నించాడు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు వ్యక్తులతో పంచాయతీ రోడ్డులో పనులు ఎలా చేయిస్తారని నిలదీశాడు. సుమారు రూ.82లక్షలతో ఈ రహదారి అభివృద్ధికి అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించామన్నారు. రహదారిపై గోతులు పడి అధ్వానంగా మారినా పంచాయతీ పట్టించుకోనందునే తాము పనులు చేయిస్తున్నామని గూడవల్లి నరసయ్య బదులిచ్చారు. మాటా మాటా పెరిగి బాలాజీ, నరసయ్య మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నువ్వు ఎంతంటే నువ్వు ఎంతంటూ దూషించుకున్నారు. గొడవ కాస్తా పెద్దదవడంతో ఇరు వర్గాల అనుచరులు ఒకరినొకరు తోసుకుంటూ నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. దీంతో స్థానికులు కలుగజేసుకుని ఇరు వర్గాలకు నచ్చచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఒకే పార్టీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ గొడవ కాస్తా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి వెళ్లడంతో పార్టీ పరువు బజారు కీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సర్పంచ్, ఏఎంసీ చైర్మన్ వర్గీయుల మధ్య తోపులాట -
వేద మంత్రోచ్చరణతో మారుమోగిన ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం వేదసభ నిర్వహించారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది వేద పండితులు హాజరయ్యారు. మహామండపం ఆరో అంత స్తులో నిర్వహించిన సభ ప్రారంభానికి ముందు వేద పండితుల వేద మంత్రోచ్చరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు చింతపల్లి ఆంజనేయ ఘనాపాటి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దుర్గగుడి ఈఓ శీనానాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన వేద పండితులను ఘనంగా సత్కరించి, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. -
7 లక్షల క్యూసెక్కులు వస్తున్న వరద నీరు
కంచికచర్ల: ఎగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణానదికి మంగళవారం 7లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని అధికారులు అంటున్నారు. కంచికచర్ల మండలం కొత్తపేట, గనిఆత్కూరు, మున్నలూరు, కునికెనపాడు, చెవిటికల్లు గ్రామాల్లోని పంట పొలాల్లోకి కృష్ణానది వరదనీరు చేరుతోంది. రాత్రికి ఇంకా వరద నీరు పెరిగే అవకాశాలు ఉన్నాయని డెప్యూటీ తహసీల్దార్ వి.మానస తెలిపారు. ఇప్పటికే నదీతీర ప్రాంత ప్రజలు కృష్ణానదిలోకి దిగకుండా అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ సిబ్బందిని నదీతీర గ్రామాల వద్ద కాపలా ఉంచామని చెప్పారు. కృష్ణానది తీర గ్రామాల సమీపంలో రైతులు సాగుచేసిన మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలన్నీ నీట మునిగాయి. సుమారు 100 ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లంక భూముల్లో ఉన్న రైతులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీటీ తెలిపారు. -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి అన్నారు. నగరంలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో జరుగుతున్న ఆరవ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్ షిప్–2025–26 పోటీలను మంగళవారం ఆమె పరిశీలించారు. మెప్మా డైరెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ నగరంలో ఓ వైపు దసరా ఉత్సవాలు, మరో వైపు జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరుగుతుండడంతో నగరానికి రెట్టింపు కళ వచ్చిందన్నారు. సత్యసాయి ధ్యానమండలి వ్యవస్థాపకుడు బిక్షమయ్య గురూజీ మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్, అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం విజేతలకు అతిథులు పతకాలు అందజేసి అభినందించారు. విజేతల వివరాలు.. సీనియర్ పురుషులు బాడీ ట్విస్టింగ్ వ్యక్తిగత విభాగలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్సీబీ)ప్రథమ, రాజేష్కుమార్ సోని (మధ్యప్రదేశ్) ద్వితీయ, దిలీప్కుమార్ (బీహార్) తృతీయ బహుమతులు పొందారు. జూనియర్ పురుషుల హ్యాండ్ బ్యాలెన్స్ వ్యక్తిగత విభాగంలో ఆయుష్ భౌమిక్ (పశ్చిమ బెంగాల్), రితిక్ బిష్ణోయ్ (రాజస్థాన్), బి.మనోజ్ (తమిళనాడు), బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో రాజ్ రాజోల్ (మధ్యప్రదేశ్), సౌనవ హజ్రా (సీఎస్ఎసీసీఈ), చందన్ శర్మ (బీహార్), జూనియర్ మహిళల బ్యాక్ బెండ్ వ్యక్తిగత విభాగంలో అనిక రాణా (ఉత్తరప్రదేశ్), ఎస్.హేమమాలిని (తమిళనాడు), అమృత సర్గులె (మహారాష్ట్ర), ఆర్టిస్టిక్ వ్యక్తిగత విభాగంలో రుద్రాక్షి భావె, రియా (మహారాష్ట్ర), రీత్ శ్రీవత్సవ్ (ఢిల్లీ) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలు గెలుపొందారు.శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భరణి -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
ప్యాకేజీల కోసమే ● పేద విద్యార్థుల కలలను కల్లలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ● ప్రైవేటీకరణను విరమించి ప్రభుత్వమే కాలేజీలను నడపాలి ● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ప్రైవేటీకరణపై నిరసన గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్యాకేజీల కోసమే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు విమర్శించారు. విజయవాడ అజిత్సింగ్నగర్లోని సెయింట్ ఆన్స్ హాస్పిటల్ ఎదుట ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన కార్యక్రమం జరిగింది. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొలిమెట్ల శరత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యకుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, మొండితోక జగన్మోహనరావు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి, విద్య, వైద్యం ప్రభుత్వ నిర్వహణలోనే ఉండాలని కోరుతూ తొలుత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ప్రసంగించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు వైద్య విద్య అభ్యసించాలనే తలంపుతో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి, తరగతులు నడుస్తున్నాయని, మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయకపోగా వాటిని ప్రైవేటీకరించేందుకు పూనుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ప్యాకేజీల కోసం పీపీపీ విధానంలో తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్ని స్తున్నారని విమర్శించారు. డాక్టర్ కావాలన్న లక్షల మంది పేద విద్యార్థుల కలలను కూటమి ప్రభుత్వం కల్లలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం దాచుకో.. దోచుకో విధానాన్ని అవలంబిస్తోందని ఎమ్మెల్సీ రుహుల్లా విమర్శించారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అప్పగించి దోచుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. వైద్య విద్యను, వైద్యాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ శీరంశెట్టి పూర్ణచంద్రరావు, బూదాల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు వేల్పుల రమేష్, కన్నెగంటి జీవరత్నం, కోట దాసు, కొమ్ము చంటి, పొదిలి చంటి, జాన్ కెనడీ, కాలే పుల్లారావు, గుండె సుందర్పాల్, శామ్యూల్, తాడంకి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి అవుతు శ్రీనివాసరెడ్డి, ఆళ్ల చల్లారావు, స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, తంగిరాల రామిరెడ్డి, జానారెడ్డి, తోలేటి శ్రీకాంత్, బందెల కిరణ్రాజ్, దుర్గారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. -
9వ రోజు ఆదాయం రూ.40.12 లక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుంటూరు జిల్లా తురకపాలెంలో సంభవించిన మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పిచ్చుక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. గాంధీనగర్ ప్రెస్క్లబ్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తురకపాలెంలో మరణించిన వారంతా గ్రామంలో కంకర క్వారీల్లో పనిచేసేవారని తెలిపారు. అక్కడి ప్రజలు తాగే నీటిని చైన్నె ల్యాబ్కు పంపించగా నీటి కాలుష్యాన్ని ధ్రువీకరించిందన్నారు. ప్రభుత్వం స్పందించి మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతుల వితంతు మహిళలకు ఉద్యోగ భరోసా కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సభ్యులు అన్సారీ, వెంకట్, సతీష్, వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు కె.ఎం.సుభాన్, లక్ష్మణరావు, బాషా, సలాం తదితరులు పాల్గొన్నారు. గుడివాడ టౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 15 జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహించగా మొదటి స్థానం చిత్తూరు జిల్లా జట్టు దక్కించుకుందని న్యూ గుడివాడ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నమనేని పూర్ణ వీరయ్య(బాబ్జి) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రా పురం జట్టు రెండో స్థానం, ఎస్ఆర్ఎంఏపీ అమరావతి జట్టు మూడో స్థానంలో నిలిచా యని వివరించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కె.రంగప్రసాద్, జీవితకాల సభ్యులు, కోచ్లు పాల్గొన్నారు. గన్నవరం రూరల్: ఓ వ్యక్తి అవయవదానంతో నలుగురికి పునర్జన్మ లభించింది. గన్నవరం మండలం చిన అవుటపల్లి డాక్టర్ పిన్నమనేని మెడికల్ కళా శాల బోధనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు పెనమలూరు మండలం చోడవరానికి చెందిన మొవ్వ ప్రదీప్కుమార్(46) గత నెల 25వ తేదీన వస్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న అతనికి 29వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అవయవ దానం చేసేందుకు ప్రదీప్కుమార్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. హాస్పిటల్లోని జీవన్ధాన్ ప్రక్రియ ద్వారా లివర్, కిడ్నీలు రెండు, లంగ్స్ను రాష్ట్రంతో పాటు తెలంగాణ పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రదీప్ కుమార్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
సోషల్ మీడియా పోస్టుల నెపంతో 9 మందిపై కేసు
కంచికచర్ల: సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పోస్టులు పెట్టా రంటూ పోలీసులు కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన 9 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ముగ్గురు రైతులు కాగా, ఒకరు జేసీబీ ఆపరేటర్, మరో ఇద్దరు యువకులు చైన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మరో ముగ్గురు వ్యక్తులు వైఎస్సార్ సీపీలో చురుకై న కార్యకర్తలు. అక్రమ అరెస్ట్ల విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు, జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మార్త శ్రీనివాసరావు, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల రమేష్, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు మంగలపూడి కోటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు నాయకులు రాయల నరసింహారావు, ఎస్సీ సెల్ నాయకులు ముప్పాళ్ల శివాజీ, మాజీ సొసైటీ అధ్యక్షుడు వేమవరపు పురుషోత్తం తదితరులు కంచికచర్ల పోలీస్ స్టేషన్ ముందు మంగళవారం తెల్ల వారుజామున ఆందోళన చేశారు. ఆందోళన విషయం కంచికచర్ల, చందర్లపాడు ఎస్ఐలు విశ్వనాఽథ్, ధర్మరాజు రూరల్ సీఐ చవాన్కు సమాచారం అందించగా ఆయన హుటాహుటిన పోలీస్ స్టేషన్కు వచ్చారు. నాయకులను స్టేషన్లోకి పిలిచి ఆందోళన విరమించాలని కోరారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, తమకు సహకరించాలని సీఐ కోరారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆందోళన విరమించారు. పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిని నందిగామ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 9 మందిపై అక్రమంగా కేసు నమోదు... మండలంలోని మోగులూరు గ్రామానికి చెందిన 9 మందిని సోషల్ మీడియాలో అధికార పార్టీ నాయకులను కించపర్చారనే ఫిర్యాదు మేరకు అన్యాయంగా అక్రమంగా కేసు నమోదు చేశారు. అరెస్టు అయిన వారిలో బండి ఽశ్రీనివాసరావు, కాశిబోయిన భిక్షాలయ్య, బండి రామారావు, బండి నాగశివరావు, రాయల త్రిశాంక్, యర్రగుంట వెంకటేశ్వరరావు, షేక్ మహ్మద్ ఆరీఫ్, షేక్ జాన్సైదా, బండి మురళీ చౌదరి ఉన్నారు. కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేసిన వైఎస్సార్ సీపీ నాయకులు -
పీహెచ్సీ వైద్యుల సమ్మె ఉధృతం
మచిలీపట్నం అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యుల సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి తెలిపారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా కుదింపుతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం జిల్లాలోని పీహెచ్సీలలో వైద్య సేవలను వైద్యులు బహిష్కరించారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దీప్తి మాట్లాడుతూ గురువారం చలో విజయవాడకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు దిగుతామన్నారు. వైద్యులు 20 శాతం పీజీ ఇన్ సర్వీస్ కోటా అన్ని క్లినికల్ స్పెషాలిటీలకూ వర్తించాలని, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నందుకు ప్రత్యేక అలవెన్స్, ఉద్యోగోన్నతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పలువురు పీహెచ్సీ వైద్యులు మాట్లాడుతూ గతంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్లో 50 శాతం ఇన్ సర్వీస్ కోటా ఉండేదని, అయితే కూటమి ప్రభుత్వం గత ఏడాది క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్లో 30 శాతానికి తగ్గించిందని తెలిపారు. గతేడాది వైద్యుల ఆందోళనల తర్వాత క్లినికల్ కోర్సుల్లో 20 శాతం వరకు పెంచి, ఈ విద్యా సంవత్సరానికి మళ్లీ కోటాను 15 శాతానికి తగ్గించడంతో సమ్మె చేస్తున్నామన్నారు. ఈ ఉద్యమానికి ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. సమ్మెను జటిలం చేయకుండా ప్రభుత్వం వెంటనే డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.బాలాజీ (కపిలేశ్వరపురం పీహెచ్సీ), డాక్టర్ స్ఫూర్తి (రామాపురం పీహెచ్సీ), డాక్టర్ రాజా (పెనమలూరు పీహెచ్సీ), డాక్టర్ చంద్రిక (ఉప్పులూరు పీహెచ్సీ), డాక్టర్ పర్వేజ్ (పెడన పీహెచ్సీ), డాక్టర్ తేజ( మోటూరు పీహెచ్సీ), డీఎంహెచ్ఓ కార్యాలయం డాక్టర్లు అరుణ్ కుమార్, నిరీక్షణ, అవనిగడ్డ పి.పి యూనిట్ డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి గ్రామీణ వైద్య సేవలకు బ్రేక్ -
శాఖల సమన్వయం... పటిష్టమైన బందోబస్తు
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని అన్ని శాఖల సమన్వయం, పటిష్టమైన పోలీసు బందో బస్తుతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో కలిసి సీపీ రాజశేఖరబాబు మంగళవారం క్యూలైన్లను పరిశీలించారు. అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేయడమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ రాజశేఖరబాబు తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా మరో 1400 మంది పోలీసు సిబ్బందితో 200 రోప్ పార్టీలను ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడా తొక్కిసలాట జరగకుండా ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం అయ్యే విధంగా బందోబస్తును ముందు రోజు అర్ధరాత్రి నుంచి స్వయంగా పర్యవేక్షించామన్నారు. భవానీలకు ఏర్పాట్ల పరిశీలన భవానీలు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారన్న అంచనాతో సీపీ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో కలిసి బస్ స్టాండ్, మున్సిపల్ కార్యాలయం, సీతమ్మ వారి పాదాలు, వినాయక టెంపుల్ పరిసర ప్రాంతాలలోని హోల్డింగ్ ఏరియాలను, క్యూలైన్లను నడుచు కుంటూ వెళ్లి పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు ఎవరూ నదిలోనికి వెళ్లకుండా కేవలం జల్లు స్నానాలు వినియోగించే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కేశఖండన శాల పరిసర ప్రాంతాలలో రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు పంపించే విధంగా సిబ్బంది తగు సూచనలు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. హోల్డింగ్ ఏరియాలలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్ని వసతులు అందుతున్నాయా లేదా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనే విషయాన్ని గమనించి వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్చంద్ డీసీపీలు కె.తిరుమలేశ్వరరెడ్డి, ఎస్.వి.డి.ప్రసాద్ , ఏడీసీపీ జి.రామకృష్ణ, సౌత్ ఏసీపీ పావన్ కుమార్, రామచంద్ర రావు, ఇతర శాఖల అధికారులు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం సీపీ ఎస్వీ రాజశేఖరబాబు భవానీల రాక సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన -
బాలల భవిష్యత్ మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో ఉత్తమ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక తరం భవితవ్యాన్ని మార్చగలడన్నారు. లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో ఎస్ఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో డీఎస్సీలో టీచర్ పోస్టులు పొందిన వారికి మంగళవారం అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి పార్థసారథి మాట్లాడుతూ డీఎస్సీలో ఉద్యోగం సాధించిన వారు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. ప్రభుత్వ స్కూల్స్కు వచ్చే పేద పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు తమ వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా, సేవగా భావించి అంకితభావంతో పనిచేయాలన్నారు. ఎస్ఎస్ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాకం శేషావలి మాట్లాడుతూ తమ వద్ద శిక్షణ పొందిన అనేక మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు పొందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేషాద్రి నాయుడు, విత్తనాల వంశీకృష్ణ లకు రూ.50,000 చెక్ లను మంత్రి పార్థసారథి చేతుల మీదగా అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, కె.శ్రీనివాస్, సైకాలజిస్ట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదివేది పేద పిల్లలే రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కేపీ సారథి -
ఎక్స్పోలో ‘నాలా చెఫ్–వింగ్మాన్’ ఆవిష్కరణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో ఏర్పాటు చేసిన విజయవాడ ఎక్స్పో(ఎగ్జిబిషన్)లో ఆటోమేటెడ్ రోబోటిక్ నాలా చెఫ్–వింగ్మాన్ ఆవిష్కృతమైంది. ఈ స్టాల్ను ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో తయారీ, ఆవిష్కరణలు ప్రపంచ స్థాయికి చేరుకుంటున్నాయని, నాలా చెఫ్ ఇందుకు నిదర్శనమన్నారు. ఇది టెక్నాలజీ ఆధారిత కొత్త వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందన్నారు. ‘నాలా చెఫ్–వింగ్మాన్’ రూపొందించిన పారిశ్రామికవేత్త అనిల్ సుంకర మాట్లాడుతూ నాలా చెఫ్ ఒక ఉత్పత్తి మాత్రమే కాదని, ఇది భవిష్యత్ వంటకాల సాంకేతికతకు నిదర్శనమని చెప్పారు. విజయవాడ నుంచే ఈ భారతీయ ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసి గ్లోబల్ కిచెన్స్కు కొత్త నిర్వచనం ఇవ్వటమే తమ లక్ష్యం అన్నారు. -
పాపం.. భవానీద్వీపం!
● భవానీ ద్వీపానికి దెబ్బ మీద దెబ్బ ● ద్వీపంలోకి ప్రవేశించిన వరద నీరు ● వృథాగా మారిన పునరుద్ధరణ పనులుభవానీపురం(విజయవాడపశ్చిమ): నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన భవానీ ద్వీపంపై ప్రకృతి పగబట్టిందా అంటే.. వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. గత ఏడాది ఆగస్ట్లో సంభవించిన వరద సందర్భంగా తీవ్రంగా (దాదాపు రూ.10 కోట్ల మేర అధికారుల అంచనా) నష్ట పోయిన భవానీ ద్వీపంలో పునరుద్ధరణ పనులు చేపట్టటంతో ఇప్పుడిప్పుడే పర్యాటకులు తిరిగి వస్తున్నారు. రిసార్ట్స్ బుకింగ్, రెస్టారెంట్, అడ్వంచర్ గేమ్స్, మిర్రర్ ఇమేజ్ వంటి కార్యకలాపాలు మళ్లీ మొదలవుతున్నాయి. ఈ తరుణంలో మళ్లీ వరద ఉధృతి పెరిగి సుమారు ఆరు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజికి చేరింది. దీంతో భవానీ ద్వీపానికి మళ్లీ వరద తాకిడి తగిలింది. సోమవారం నాటికే వరద నీరు ద్వీపంలోకి చేరి అతలాకుతలం చేసింది. పునరుద్ధరణ పనులు వృథాయేనా! గత ఏడాది వరద కారణంగా ధ్వంసమైన ద్వీపానికి దెబ్బమీద దెబ్బ తగలటంతో చేసిన పునరుద్ధరణ పనులన్నీ వృథాయేనా అని పర్యాటక శాఖ అధికా రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో ఆధునికీకరించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మళ్లీ వచ్చిన వరద పోటుతో ఈనగాచి నక్కల పాలైన విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు, వరదలు వెంటాడుతుంటే ఎప్పటికి కోలుకుంటాం..పర్యాటకులను ఆకర్షించే విధంగా ఎప్పటికి సిద్ధం చేయగలమని మథనపడుతున్నారు. హరిత బెరం పార్క్ (పున్నమి హోటల్) పరిస్థితి అలానే ఉండటం గమనార్హం. దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల ప్రజలు ఇక్కడికి వస్తారని, తద్వారా ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చని ఎదురు చూసిన పర్యాటక శాఖ వారికి నిరాశే ఎదురయింది. -
హాస్పటల్లో వైద్యం వికటించి బాలింత మృతి
ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని స్మైలీ హాస్పటల్లో వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. పట్టణంలోని చెరువు బజారు చెందిన గుంజా గాయత్రి (25) ని ప్రసవం కోసం నిన్న హాస్పిటల్ లో జాయిన్ చేసిన కుటుంబ సభ్యులు.ప్రసవం అయిన తర్వాత గాయత్రి పరిస్థితి విషమించడంతో ఆమెను విజయవాడలోని స్మైలీ ప్రధాన ఆసుపత్రికి తరలించారు .అయితే తనకు బ్లడ్ గ్రూప్ మార్చి రక్తం ఎక్కించడంతో చికిత్సపొందుతూ గాయత్రి మరణించింది. దాంతో గాయత్రి మృతదేహాన్ని జగ్గయ్యపేట స్మైలి హాస్పిటల్కు తీసుకువచ్చి ఆందోళన చేపట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన బంధువులు. భారీగా మోహరించిన పోలీసులు. -
ఏపీకి వర్ష సూచన.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్
విజయవాడ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దాంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రధానంగా రాగల మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు ఎవరూ చెట్ల కింద నిలబడరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రేపు(అక్టోబర్ 1వ తేదీ) బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఆతరువాత పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి దక్షిణఒడిశా- ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రేపు ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. వైఎస్సార్సీపీ నిరసనలు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అజిత్సింగ్ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ రాహుల్లా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో సామాన్యుల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు మెడికల్ విద్య చదవాలని కాలేజీలు తీసుకువచ్చారు. ప్రైవేట్ కాలేజీలు ఇచ్చిన ప్యాకేజి తీసుకోవాలని చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రైవేట్పరం చేయాలని చూస్తున్నారు. డబ్బు మీద ప్రేమతో సామాన్యుల కలను చిదిమేస్తున్నాడు మెడికల్ కాలేజీల పరిశీలనకు వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారు.. కేసులు పెట్టారు. నిర్బంధంతో పోరాటం ఆపలేరు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణ ఆపకపోతే పోరాటం తీవ్రతరం చేస్తాం’ అని హెచ్చరించారు.విశాఖ: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయొద్దంటూ వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కుటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. గొల్ల బాబురావు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కూటమి సర్కార్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో చంద్రబాబు పెడుతున్నారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. దళితుల జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేస్తాం’’ అంటూ గొల్ల బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్సార్ జిల్లా: కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.అనంతపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేశాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయవద్దని డిమాండ్ చేస్తూ.. నల్లబ్యాడ్జీలు, బెలూన్లతో నిరసన తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తిరుపతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్సీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం పేద వర్గాల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఉమ్మడి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజేంద్ర మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. పునరాలోచన చేయాలంటూ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.గుంటూరు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గెడ్డేటి సురేంద్ర ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మంగళగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు, పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
సమ్మెలోకి పీహెచ్సీ వైద్యులు
మచిలీపట్నంఅర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యులు తమ డిమాండ్ల సాధన కోసం సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. ఈ క్రమంలో ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ, అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లు ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్ (ఏపీపీహెచ్సీడీఏ) ప్రకటించింది. ఈ నెల 26 వ తేదీ నుంచి పీహెచ్సీ డాక్టర్లు దశలవారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే కలెక్టరు బాలాజీ, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎ.వెంకట్రావులకు సంఘం తరఫున జిల్లా నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు సమ్మె చేపట్టారు. పీజీ కోటా తగ్గింపుపై ఆగ్రహం సర్వీస్ వైద్యుల పీజీ కోటాను తగ్గించిన కూటమి ప్రభుత్వ నిర్ణయంపై డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ సీట్లు ఉండగా, వాటిని 15 శాతానికి తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకు తక్కువ కాలంలోనే ప్రమోషన్లు లభిస్తుంటే, 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో పని చేస్తున్న డాక్టర్లు ఇంకా సీనియర్ మెడికల్ ఆఫీసర్లుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 49 పీహెచ్సీలు, 14 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో దాదాపు 110 మంది వైద్యులు సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న సమయంలో సమ్మె ప్రారంభం కావడంతో పేద రోగులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వైద్యుల డిమాండ్లు వైద్యుల ప్రధాన డిమాండ్లలో పీజీ కోటాను పునరుద్ధరించడం, టైం బౌండ్ ప్రమోషన్లు కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్ ఇవ్వడం, చంద్రన్న సంచార చికిత్స పథకానికి ప్రత్యేక భృతి కేటాయించడం ఉన్నాయి. అదనంగా అర్బన్, నేటివిటీ కౌన్సెలింగ్ గడువును ఆరేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించాలని కోరుతున్నారు. సేవలను గుర్తించని కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన సర్వేలు, పల్స్ పోలియో కార్యక్రమాలు, వరదలు, విపత్తుల సమయంలోనూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఉద్యోగోన్నతులు అందకపోవడం వైద్యులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. జాయిన్ అయినప్పుడు ఉన్న అదే కేడర్లో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమ సేవలకు సరైన గుర్తింపు లభించడం లేదని పీహెచ్సీ వైద్యులు ఆరోపిస్తున్నారు. -
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యోగ సాధనను జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగుతున్న 6వ జాతీయ జూనియర్, సీనియర్–సీ యోగాసన చాంపియన్షిప్–2025–26లో పతకాలు పొందిన పలు విభాగాల క్రీడాకారులకు మంత్రి రవీంద్ర సోమవారం పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాను ఒలింపిక్స్లో ప్రవేశపెడితే భారత్కు తప్పకుండా పతకాలు వస్తాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమా పోటీలను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకష్ణ ప్రసాద్ ,ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, ఉపాధ్యక్షుడు రాజశేఖరరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. విజేతల వివరాలు... హ్యాండ్ బ్యాలెన్స్ మహిళల వ్యక్తిగత విభాగంలో పి.ప్రసూన (ఆంధ్రప్రదేశ్) ప్రథమ, ఆష్మా దాస్ (పశ్చిమ బెంగాల్) ద్వితీయ, పంపం దేవి (గోవా)తృతీయ స్థానంలో నిలిచారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో ఇంద్రజిత్ (ఏఐపీఎస్ సీబీ), వినాయక్ ఎం.కొంగి (కర్ణాటక), తన్మే అధికారి (ఉత్తరాఖండ్), బ్యాక్ బెండింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో అర్చన కవాటేకర్ (మహారాష్ట్ర), బిన్నీ కుమారి బాల (బీహార్), శీతల బైస్య (అసొం), పురుషుల వ్యక్తిగత విభాగంలో అయ్యంపిళ్ళై (తమిళనాడు), బీరేంద్రకుమార్ యాదవ్ (హరియాణ), రాహుల్ శాండోర్ (మహారాష్ట్ర) ఒక్కో విభాగంలో వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని షాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి షాబాద్ గ్రామానికి చెందిన పేరం పాండురంగారావు గ్రామానికి సమీపంలోని టిడ్కో ఇళ్లకు వాచ్మెన్గా పని చేస్తుంటాడు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో పాండురంగారావు టిడ్కో ఇళ్ల చుట్టూ పరిశీలించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై పాండురంగారావు భార్య వెంకటేశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం కొండపై ఎవరో మనిషి ఉన్నాడని తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లారు. పాండురంగారావును కిందకు తీసుకువచ్చే క్రమంలో కాలు జారి కింద పడి తలకు గాయాలయ్యాయి. వెంకటేశ్వరమ్మ అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, వారు వచ్చే సమయానికి పాండురంగారావు చనిపోయాడు. వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర -
పొంగి పొర్లుతున్న చంద్రమ్మ కయ్య
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం మండలంలోని ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు నుంచి 5.69 లక్షల క్యూసెక్కుల వరద నీటిని 16 గేట్ల ద్వారా విడుదల చేస్తుండటంతో మండలంలోని కృష్ణానది పరివాహక గ్రామాలైన ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామాలలో కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ముక్త్యాల–జగ్గయ్యపేట రహదారిలోని చంద్రమ్మ కయ్య పొంగి పొర్లుతుండటంతో రెండవ రోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కేసీపీ కర్మాగారంలో నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. రావిరాల బీసీ కాలనీ ప్రజలు రెండవ రోజు కూడా పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్నారు. ముక్త్యాల, రావిరాల, కె.అగ్రహారం గ్రామాలలోని పత్తి, మిర్చి పంటలు వరద నీటిలో మునిగాయి. మరో మూడు రోజుల పాటు వరద ఉధృతి ఉంటుందని అధికారులు చెబుతుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు సూచనలు చేస్తున్నారు. -
విమానాశ్రయంలో కెఫే స్టాల్ ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. స్థానిక విమానాశ్రయంలోని టెర్మినల్ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉడాన్ యాత్రి కెఫే స్టాల్ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయ ఆవరణలో ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ విమానాశ్రయాల్లో సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటు ధరల్లో టీ, కాఫీ, స్నాక్స్ విక్రయించేందుకు ఉడాన్ యాత్రి కెఫేను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆరు విమానాశ్రయాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రయాణికుల వృద్ధి రేటు 15 శాతం పెరిగిందన్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్త విమాన సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కు మరో నెలలో విమాన సర్వీస్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా అహ్మదాబాద్, వారణాసి, కొచ్చి, పుణేకు సర్వీస్లు నడపనున్నట్లు చెప్పారు. ఏడాదికి 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నూతన టెర్మినల్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఉడాన్ యాత్రి కెఫే స్టాల్ మెనూ కార్డును ఆయన ఆవిష్కరించారు. ఏఏఐ బోర్డు సభ్యులు డాక్టర్ హెచ్.శ్రీనివాస్, డాక్టర్ శరద్కుమార్, విమానాశ్రయ సలహా కమిటీ సభ్యుడు పొట్లూరి బపసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామాచారి, ఎయిర్పోర్ట్ డెరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, పలువురు ఎయిర్పోర్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
పంట పొలాల్లోకి వరద నీరు
పెనమలూరు: కృష్ణానదిలో సోమవారం దాదాపు 6.5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రావటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామాల్లో వరద నీరు పంట పొలాల్లోకి వచ్చాయి. ప్రస్తుతానికి పంటలకు ఇబ్బంది లేకపోయినా వరద నీరు ఇంకా పెరిగితే పంటలు నీట మునిగే పరిస్థితి ఉందని రైతులు తెలిపారు. పసుపు, కంద, వరి, కూరగాయల పంటలకు ప్రమాదం పొంచి ఉంది. పల్లపు ప్రాంతాల్లో వరద నీరు ఇప్పటికే ఇళ్ల వద్దకు చేరుకుంది. వరద ఉధృతి పెరిగితే వరద నీరు నేరుగా ఇళ్లను ముంచెత్తే ప్రమాదం ఉంది. పెదపులిపాక, యనమలకుదురు ప్రాంతాల్లో కరకట్ట దిగువన ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. వరద నీరు పెరుగుతుండటంతో పంట పొలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. -
తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు
కలెక్టర్ డీకే బాలాజీ చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను జీఎస్టీ –2.0తో తక్కువ ధరలకు సూక్ష్మ సేద్యం సాగు పరికరాలు లభిస్తున్నాయని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ రత్నాచార్యులు ముద్రించిన వాల్పోస్టర్లను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సూక్ష్మ సేద్యం పద్ధతిలో సాగు చేపట్టే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు తక్కువ ధరకే లభిస్తాయని, ఆ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గిందని. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2.5 శాతం తగ్గింపుతో పరికరాలను అందిస్తోందన్నారు. జేసీ ఎం.నవీన్, అసిస్టెంట్ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, బందరు ఆర్డీవో కె.స్వాతి, ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి పాల్గొన్నారు. రవాణాశాఖ అవగాహన ర్యాలీ ధరల తగ్గింపుపై రవాణాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం కలెక్టరేట్లో జెండా ఊపి ప్రారంభించారు. జీఎస్టీ –2.0 ద్వారా వాహనాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయని, వీటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.నవీన్, జిల్లా రవాణాధికారి యూ ఎన్ఎస్ శ్రీనివాసరావు, కమర్షియల్ డెప్యూటీ కమిషనర్ రాంబాబు, అసిస్టెంట్ కమిషనర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
దుర్గమ్మ సాక్షిగా చంద్రబాబు పచ్చి అబద్ధాలు
సాక్షి,అమరావతి: దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడటం హేయమని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడకూడదని కనీస ఇంగిత జ్ఞానం సీఎం చంద్రబాబుకి లేదా అని ఆయన ప్రశ్నించారు. పైగా అమ్మవారి సమక్షంలోనైనా నిజాలు మాట్లాడకుండా సీ్త్రశక్తి పథకం సూపర్ హిట్ అని పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం మల్లాది విష్ణు మీడియాకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఉచిత బస్సు పచ్చి మోసం.. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని హామీ ఇచ్చిన చంద్రబాబు గతేడాది పథకాన్ని అమలు చేయలేదని మల్లాది గుర్తు చేశారు. ఈ ఏడాది ఆగస్టు 15న సీ్త్ర శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తూ కేవలం 5 రకాల బస్సులకే వర్తింపజేసి మహిళలను తీవ్రంగా వంచించారన్నారు. రాష్ట్రంలో 11,256 బస్సులుంటే సగం బస్సులకు కూడా పథకం వర్తించడం లేదని చెప్పారు. అంతర్ జిల్లాలకు, ఎక్కువ దూరం ప్రయాణించే సూపర్ లగ్జరీ, వెన్నెల, గరుడ, వెన్నెల వంటి బస్సులకు పథకం వర్తించడం లేదన్నారు. తూతూమంత్రంగా పథకాన్ని అమలు చేసి దాదాపు 2కోట్ల మంది మహిళలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన దానికి భిన్నంగా ఆంక్షలతో పథకాన్ని వర్తింపజేయడమే తప్పయితే, అమ్మవారి సమక్షంలో పచ్చి అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకి దేవుళ్లన్నా భయం లేదు, భక్తి లేదని చెప్పడానికి నిదర్శనమని మల్లాది విష్ణు అన్నారు. -
కృష్ణమ్మ కన్నెర్ర
ఏటిపాయకు భారీగా వచ్చిన వరద లంక గ్రామాలను చుట్టుముట్టింది. పెనమలూరు మండలంలో కరకట్ట వెంబడి గ్రామాల్లో నివాసం ఉంటున్న వేలాది నివాస ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆయా గ్రామాల్లోని నివాసితులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తోట్లవల్లూరు మండలంలో రొయ్యూరు శివారు తోడేళ్లదిబ్బ లంక, వల్లూరుపాలెం శివారు రావిచెట్టు లంక, పాములలంక, తుమ్మలపచ్చిక లంక, చాగంటిపాడు శివారు పిల్లివానిలంక, దేవరపల్లి శివారు పొట్టిదిబ్బలంక, ఐలూరు శివారు కనిగిరిలంక, ములకల లంక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. దీంతో అక్కడి ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగించాల్సిన పరిస్థితి. కాసరనేనివారిపాలెం వద్ద నీట మునిగిన శివాలయం గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/కంకిపాడు: ప్రకాశం బ్యారేజ్కు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా కృష్ణమ్మ పోటెత్తింది. రెండు రోజులుగా బ్యారేజ్కు వరద ఉద్ధృతి అంత కంతకూ పెరుగుతోంది. దీంతో బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 6,54,876 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఇందులో 6,39,737 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలివేశారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి 6,74,971 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో సాయంత్రానికి స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద 15.9 అడుగుల నీటి మట్టం ఉంది. వరద కారణంగా నది పరీవాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి.. ఏడిపిస్తున్న ఏటిపాయ.. పెనమలూరు, పామర్రు, దివిసీమ ప్రాంతాల్లో ఏటిపాయ వెంబడి ఉన్న ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. వరదనీరు కరకట్ట అంచులు తాకుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు, కంకిపాడు మండలాల్లో కరకట్ట వెంబడి సాగులో ఉన్న పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. ప్రధానంగా అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగాయి. గతేడాది సెప్టెంబర్ ఏటిపాయకు వరద భారీగా రావటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరలా ఈ ఏడాది సెప్టెంబర్లోనే వరద ముంచుకురావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ రోజులు వరదనీరు పంట పొలంలో నిలిచిపోతే పంటలు కుళ్లిపోయే ఆస్కారం ఉందని వాపోతున్నారు. అయ్యో ఎడ్లంక.. దివిసీమ పరిధిలోని ఎడ్లంక గ్రామంలోకి వరదచొచ్చుకొచ్చింది. దీంతో రహదారి మార్గం మూసుకుపోవటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. ఇక్కడి పలు నివాసాల్లోకి సైతం నీరు చేరటంతో ఇళ్ల చుట్టూ నీరు చేరింది. దీంతో నివాసితులు సామాన్లను తరలించి భద్రపర్చుకుంటున్నారు. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో లంక గ్రామాలు, కరకట్ట వెంబడి ప్రాంతాలు ముంపు బారిన పడే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డ మండలంలోని పలు ప్రాంతాల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం విస్తృతంగా పర్యటించారు. పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించారు. పులిగడ్డ, పల్లెపాలెం ప్రాంతాల్లో వరదను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. -
ఆనంద పరవశం
అశేష భక్తజనావళి జయజయధ్వానాలతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. అక్షర ప్రదాయిని వైదేహి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో దుర్గమ్మ ఆలయం పోటెత్తింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సోమవారం జగన్మాత జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవిగా కొలువుదీరారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలో బారులు తీరారు. ఉదయమంతా భక్తి భావం.. సాయంత్రం వేళ సాంస్కృతిక వైభవంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఆమూలాగ్రం.. అక్షర ప్రదాయినికి భక్తి హారతి పట్టిన జనం దుర్గగుడిపై నేడు ఆలయం బయట కంపార్ట్మెంట్లలో వేచియున్న భక్తులు (ఇన్సెట్) సరస్వతీదేవిగా దుర్గమ్మఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో కీలకమైన అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రాన్ని పురస్కరించుకుని అశేష భక్తజనం ఇంద్రకీలాద్రికి తరలివచ్చి సర్వసతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి 11గంటల నుంచే భక్తులు క్యూలైన్లో వేచి ఉండటం కనిపించింది. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం 1.30గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రెండు సర్వ దర్శనం క్యూలైన్లతో పాటు రూ. 100, రూ. 300 టికెట్ క్యూలైన్లో సైతం భక్తులకు ఉచితంగా దర్శనానికి అనుమతించారు. రాత్రి 12గంటలకే వినాయకుడి గుడి క్యూలై న్లు నిండిపోవడంతో భక్తులను సీతమ్మవారి పాదాలు, వీఎంసీ కార్యాలయం సమీపంలోని కంపార్టుమెంట్లలోకి మళ్లించారు. దుర్గమ్మ సేవలో డీకే శివకుమార్.. అమ్మవారిని తెల్లవారుజామున పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దంపతులు దర్శించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర భక్తుల రద్దీని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. హోల్డింగ్ పాయింట్ల నుంచి కొండపైకి చేరుకునేందుకు నాలుగు గంటలకు పైగా సమయం పట్టిందని భక్తులు పేర్కొంటున్నారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సీఎం చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంటల నుంచే ఘాట్రోడ్డుపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. సర్వ దర్శనంలో ఉన్న భక్తులకు గోశాల వద్ద నుంచి వీఐపీ క్యూలైన్లోకి అనుమతించారు. కుమ్మరిపాలెం క్యూలైన్లలో రద్దీ.. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో వినాయకుడి గుడి క్యూలైన్లతో పాటు కుమ్మరిపాలెం క్యూలైన్లను దేవస్థానం ఏర్పాటు చేసింది. గతంలో హెడ్ వాటర్ వర్క్సు వరకు మాత్రమే క్యూలైన్లు ఏర్పాటు చేసేవారు. అయితే ఈ ఏడాది కుమ్మరిపాలెం సెంటర్ వరకు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో వన్టౌన్, గట్టువెనుక ప్రాంతాల భక్తులకు సులభంగా అమ్మవారి దర్శనం అయిందనే చెప్పాలి. కుమ్మరి పాలెం వైపు ఉన్న క్యూలైన్లోకి చేరుకున్న భక్తులకు రెండు నుంచి మూడు గంటలలోపే అమ్మవారి దర్శనం పూర్తి కావడం విశేషం. ఆర్జిత సేవలకు డిమాండ్.. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి నిర్వహించిన పలు ఆర్జిత సేవలలో ఉభయదాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెల్లవారుజామున ఆరు గంటలకు నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చనకు 63 మంది ఉభయదాతలు, ప్రత్యేక చండీయాగానికి 52 మంది ఉభయదాతలు, ప్రత్యేక కుంకుమార్చనకు 174 మంది, ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు 25 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఉచిత లడ్డూ పంపిణీ.. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం సోమవారం ఉచితంగా చిన్న లడ్డూలను పంపిణీ చేసింది. కొండపై రాయబార మండపం, అన్న ప్రసాద వితరణ వద్ద లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంస్కృతిక అంశాల్లో ప్రదర్శన ఇస్తున్న కళాకారిణిఆది దంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి పూలు, పండ్లతో అలంకరించిన పల్లకీపై ఇంద్రగిరి వీధుల్లో విహరించారు. సోమవారం యాగశాల నుంచి ప్రారంభమైన నగరోత్సవం.. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కనుల పండువగా సాగింది. మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్, ఘాట్రోడ్డు మీదగా ఆలయానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో రాజగోపురం ఎదుట ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తారు. శరన్నరరాత్రులలో దుర్గాదేవిని అర్చించటం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. -
విజయవాడలో గుండెపోటుతో ఎస్ఐ మృతి
పూసపాటిరేగ: విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్స్టేషన్లో ఎస్ఐ–2గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గుండెపోటుతో విజయవాడలో సోమవారం ఉదయం మృతి చెందారు. విజయవాడలోని దుర్గాదేవి ఆలయం వద్ద దసరా ఉత్సవాల బందోబస్తు విధులకు వచ్చిన ఎస్ఐ విజయవాడ హనుమాన్పేటలోని ఓ లాడ్జిలో బస చేశారు. ఉదయం విధులకు వెళ్లేందుకు బయలుదేరేలోపు బాత్రూంలో విగత జీవిగా పడి ఉండడంతో తోటి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. -
ప్రశ్నిస్తే అణచివేస్తారా?.. మైలవరం పీఎస్ ముందు వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధిపై ప్రశ్నించినందుకు మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ విభాగం అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావును అక్రమంగా అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో కోటేశ్వరరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. మైలవరం పోలీస్స్టేషన్కు తరలించారు.వైఎస్సార్సీపీ నేత అక్రమ అరెస్ట్పై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయనతో పాటు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. మైలవరం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కోటేశ్వరరావును వెంటనే విడుదల చేయాలంటూ జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఆయన్ని మైలవరం సీఐ కార్యాలయం ఎదుట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
జగ్గయ్యపేట: ఎగువ నుంచి కృష్ణానదికి వరద నీటిని విడుదల చేయటంతో పులిచింతల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రెండు రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండటంతో మండలంలోని నదీ పరివాహక గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి 7లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల నుంచి విడుదల చేయటంతో నది పరీవాహక గ్రామామైన రావిరాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. అంతే కాకుండా ముక్త్యాల, జగ్గయ్యపేట గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుముట్టిన వరద.. కృష్ణానది ఒడ్డున ఉన్న రావిరాల గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. ఆ సమీపంలోని ఒడ్డున ఉన్న గృహాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో నది ఒడ్డున నివాసం ఉంటున్న ప్రజలను పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంతేకాకుండా ముక్త్యాల, వేదాద్రి, రావిరాల గ్రామంలోని మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చారు. ముక్త్యాల వద్ద కోటిలింగ హరిహర మహాక్షేత్రం సమీపంలోని చంద్రమ్మకయ్య ఉద్ధృతంగా ప్రవహించడంతో జగ్గయ్యపేటకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పరీవాహక ప్రాంత గ్రామాలను ఇన్చార్జ్ తహసీల్దార్ మనోహర్, చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ ప్రజలను అప్రమత్తం చేశారు. -
లయ తప్పుతున్న లబ్ డబ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె స్పందన అదుపు తప్పుతోంది. యుక్త వయస్సులోనే గుండెపోటు మరణాలను చూస్తున్నాం. కారణం ఏదైనా... ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే నడుస్తూ నడుస్తూనే కుప్పకూలి మరణించే వారిని ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఉమ్మడి కృష్ణాలో ప్రతిఏటా ఐదు వేల మందికి పైగానే గుండెపోటుకు గురవుతున్నారు. వారిలో మరణాలు సంభవిస్తున్నాయి. గుండె ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతిఏటా ఒక నినాదంతో సెప్టెంబరు 29న వరల్డ్ హార్ట్ డేను జరుపుకొంటున్నాం. ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్. ప్రతి గుండె స్పందన కీలకమని, గుండె ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, చెకప్లను ఆలస్యం చేయొద్దని, గుండె సంబంధిత సమస్యల హెచ్చరిక సంకేతాలపై అప్రమత్తంగా ఉండాలనేది ఈ నినాదం అర్ధం. యువతలో గుండెపోటు ప్రస్తుతం యువత గుండెపోటుకు గురవడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. గుండెపోటుకు గురయ్యే వారిలో 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారే ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. యువత గుండెపోటుతో మరణిస్తే ఆ ప్రభావం కుటుంబంపై, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి మూడు మరణాల్లో గుండెపోటు మరణం ఒకటిగా నమోదవుతోంది. అన్ని రకాల క్యాన్సర్ల కంటే గుండెపోటు మరణాలే ఎక్కువగా ఉంటున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటు మరణాల్లో 80 శాతం నివారించవచ్చునని వైద్యులు చెబుతున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఇలా చేయాలి... ● క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ● వత్తిడిని తగ్గించుకోవాలి. ● ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ● ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ●బీఎంఐ 18.5–25 మధ్య ఉండేలా చూసుకోవాలి. ● ప్యాక్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్ఫుడ్, రెడ్మీట్ తీసుకోకుండా ఉండటం మంచిది. ● ఆహారంలో ఉప్పును తగ్గించాలి. వ్యాధులను ఇలా అదుపులో ఉంచుకోవాలి ● మధుమేహం ఉన్న వారు హెచ్బీఏ1సీ 6.5 లోపు ఉండేలా చూసుకోవాలి. హెచ్బీఏ1సీ ఒక శాతం పెరిగితే గుండె జబ్బులు వచ్చే రిస్క్ 11 శాతం ఉంటుంది. ● మధుమేహం, కిడ్నీ జబ్బులు ఉన్న వారు బీపీ 120/80 ఉండేలా చూసుకోవాలి. మామూలు వ్యక్తులకు 130/80 ఉండొచ్చు. ● మధుమేహుల్లో ఎన్డీఎల్ కొలస్ట్రాల్ 50 కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి. సాధారణ వ్యక్తుల్లో 100 లోపు ఉండొచ్చు. జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కొలస్ట్రాల్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణాలు. ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి మధుమేహం ఉండగా, ప్రతి పది సెకన్లకు ఇద్దరు మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం అదుపులో లేని వారిలో 75 శాతం మందికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహులు సైలెంట్ హార్ట్ ఎటాక్కు గురవడం వలన గుండెపోటు వచ్చినట్లు కూడా తెలియదు. మధుమేహుల్లో 25 శాతం మందిలో హార్ట్ ఫెయిల్యూర్కు దారితీయొచ్చు. ప్రీ డయాబెటీస్ ఉన్న వారికి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు ఉన్న వారికి గుండె పెరగడం వంటి సమస్యతో పాటు గుండెపోటుకు గురవుతున్నారు. మెటబాలిజం సిండ్రోమ్ కూడా గుండెపోటుకు కారణమే. నేడు వరల్డ్ హార్ట్ డే.. ఈ ఏడాది నినాదం డోంట్ మిస్ ఎ బీట్ మీ గుండె స్పందన తెలుసుకోండి రెగ్యులర్గా గుండె చెకప్ చేయించుకోండి గుండెపోటుకు గురయ్యే వారిలో 25 శాతం యువకులే జీవనశైలి వ్యాధులే కారణం అంటున్న వైద్యులు ఛాతీలో నొప్పిని అశ్రద్ద చేయొద్దు ప్రతి ఏటా ఉమ్మడి కృష్ణాలో ఆరు వేల మందికి పైగా గుండెపోటుకు గురవుతున్నట్లు అంచనా -
రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి
వయస్సు 40 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. 50 ఏళ్లు దాటితే సీటీ కాల్షియం స్కోర్ పరీక్ష చేయించుకుంటే మంచిది. ఒక్కోసారి ఈసీజీ నార్మల్ వచ్చినా గుండెపోటు రావచ్చు. చాలా మందికి గుండెపోటు గ్యాస్ నొప్పిలానే ఉంటుంది. ఛాతీలో వచ్చిన నొప్పిని అశ్రద్ధ చేయకుండా, వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం ఉన్న వారు తరచూ గుండె పరీక్షలు చేయించుకోవాలి. ప్రీ డయాబెటీస్ ఉన్న వారు కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియాలజిస్ట్, సెంటినీ విజయవాడ ● -
కారు ఢీకొని మహిళ మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా పామూరు మండలం, మార్కొండపురం గ్రామానికి చెందిన రాగిపిండి విజయదుర్గ (35), చంద్రశేఖర్రెడ్డి భార్యాభర్తలు. వారు మరమరాలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. వారి కుమారుడు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో ఒక ప్రైవేట్ ఇంటర్మీడియెట్ కళాశాలలో చదువుతున్నాడు. దసరా సెలవుల సందర్భంగా కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు భార్యాభర్తలు ఇద్దరు శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బందరురోడ్డులోని వివంతా హోటల్ వద్దకు ఆదివారం తెల్లవారుజాము ఒంటి గంట సమయంలో చేరుకున్నారు. చంద్రశేఖర్రెడ్డి ఆటో దిగి డ్రైవర్కు డబ్బులు ఇస్తుండగా విజయదుర్గ లగేజీ తీసుకుంటూ ఆ వాహనంలోనే ఉండిపోయింది. అదే సమయంలో బెంజిసర్కిల్ వైపు నుంచి కంట్రోల్ రూమ్ వైపు అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో కొంచెం ముందుకు వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆటోలో ఉన్న విజయదుర్గ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. ఆటోడ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. చంద్రశేఖర్రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెన్షన్ పొందడం ప్రతి ఉద్యోగి నైతిక హక్కు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాజ్యాంగ బద్ధంగా విశ్రాంత ఉద్యోగులకు కల్పించిన హక్కుల పరిరక్షణకు పెన్షనర్లందరూ సమష్టిగా కృషి చేయాలని విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సి.పి.రావు అన్నారు. ఆదివారం విజయవాడ గాంధీనగర్లోని ఓ హోటల్లో ఆదివారం జరిగిన ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సె్స్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఐదో సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ పొందటం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నైతిక హక్కు అన్నారు.మరో అతిథి విశ్రాంత కస్టమ్స్ చీఫ్ కమిషనర్ బి.హరేరామ్ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు సమాజంలో గౌరవంగా బతకడానికి బ్రిటీష్ ప్రభుత్వం 1871లో పెన్షన్ పథకాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు. సమావేశంలో సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్, పెన్షనర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గద్దె తిలక్, టి.వివేకానంద తదితరులు మాట్లాడారు. అనంతరం 75 ఏళ్లు నిండిన పెన్షనర్లను సత్కరించారు. క్రీడల్లో మెడల్స్ సాధిస్తున్న విశ్రాంత ఉద్యోగి కరాడే శివ ప్రసాదరావుకు జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో సెంట్రల్ జీఎస్టీ అసి స్టెంట్ కమిషనర్లు ఎం.నాగరాజు, రవి కుమార్, పెన్షనర్ల సంఘ నాయకులు పాల్గొన్నారు. మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సూచించారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఆరో జాతీయ జూనియర్, సీనియర్– సీ యోగాసన చాంపియన్షిప్ పోటీలను ఆయన ఆదివారం ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ నగరంలో జాతీయ స్థాయి యోగాసన పోటీలు జరగడం విజయవాడకు గర్వకారణమన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 1,500 మందికి పైగా హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎ.రాధిక, గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రదర్శించిన యోగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
ఇక తాడోపేడో!
సాక్షి టాస్క్ ఫోర్స్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పెత్తనం ఏంటని, ఎమ్మెల్యే వర్గం భగ్గుమంటోంది. దీంతో ఇటీవల బహిరంగంగానే ఎమ్మెల్యే కొలికపూడి తన అనుచరులతో కలిసి రాష్ట్ర టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేశారు. పార్టీ కమిటీలు, ఇతర పదవులు నియోజకవర్గంలోని నాయకుల కార్యకర్తల ప్రమేయం లేకుండా నడుస్తున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కనీసం వార్డు కమిటీల నియామకంలో కూడా సంప్రదించలేదని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చర్చ సాగుతోంది. పైకి బాగానే ఉంటున్నా.. ఎమ్మెల్యే, ఎంపీ పైకి చెట్ట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం కత్తులు దూసుకొంటున్నారు. తిరువూరు టీడీపీలో ఎమ్మెల్యేకు సమాంతరంగా, ఎంపీ ఓ వర్గాన్ని ప్రోత్సహించటంతోపాటు, వారికి షెల్టర్గా ఎంపీ కార్యాలయం మారటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఎస్సీ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి కావడంతోనే, ఎంపీ కర్ర పెత్తనం చేస్తున్నారని టీడీపీ నాయకులే పెదవి విరుస్తున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత లేకుండా, ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీల్డ్ కవర్లలో పదవులు కేటాయించి పంపిచటం ఏంటని పలువురు నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అవినీతిలోనూ అంతా ఆయనే.. అవినీతి దందాల విషయంలో పార్లమెంట్ ముఖ్యనేతదే పైచెయ్యిగా మారింది. రేషన్ బియ్యం మాఫియా చేసే వ్యక్తిని, తన కార్యాలయంలోనే ఉంచుకొని రేషన్ బియ్యం, నెలవారీ మామూళ్లు దండుకోవటాన్ని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు. తిరువూరు నియోజకవర్గంలో పెద్దవరం చెక్పోస్టు నుంచి తెలంగాణకు బియ్యం రవాణా చేస్తున్నది పార్లమెంట్ ముఖ్యనేత అనుచరులేనని, ఎమ్మెల్యే వర్గీయులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. తిరువూరులో గంజాయి మాఫియాకు పార్లమెంట్ ముఖ్యనేత వత్తాసు పలుకుతున్నారనే భావన ఎమ్మెల్యే వర్గీయుల్లో వ్యక్తం అవుతోంది. నియోజకవర్గంలోని పార్టీ పదవులు, దేవాలయాల చైర్మన్ పదవులు పార్లమెంట్ ముఖ్యనేత బేరం పెట్టి అమ్ముకున్నారని, ఆది నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్ ముఖ్యనేత ఓ ఎన్ఆర్ఐతో డబ్బులు ఖర్చు పెట్టించి, గెలిచాక కరివేపాకులా తీసి వేశారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మొత్తం మీద ఎమ్మెల్యే వర్గం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతోంది. తిరువూరు టీడీపీలో తారస్థాయికి విభేదాలు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే కొలికపూడి ఫిర్యాదు నియోజకవర్గంలో విజయవాడ ఎంపీ పెత్తనంపై ఆగ్రహం ఎవరి మాట వినాలో తెలియక ఇరుకున పడుతున్న అధికారులు పార్టీ, నామినేటేడ్ పదవులకు సీల్డ్ కవర్లో పేర్లు పంపడంపై రగిలిపోతున్న ఎమ్మెల్యే వర్గీయులు -
అక్టోబర్ 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై అక్టోబర్ ఏడో తేదీన విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సుంద రయ్య, డాక్టర్ రాజు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ధర్నా పోస్టర్, ఆవిష్కరణ, జిల్లా స్థాయి సమావేశం జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన డెప్యూటీ సెక్రటరీ జనరల్ నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అప్లోడ్, డౌన్లోడ్, బయోమెట్రిక్, మెగా పీటీఎం, యోగాంధ్ర, పరీక్షలు బుక్స్లో రాయటం, గ్రీన్ పాస్పోర్ట్ తదితర కార్యక్రమాలు బోధనకు ఆటంకాలుగా మారాయన్నారు. అక్టోబర్ 10 లోపు బోధనేతర పనులు తగ్గించకపోతే ఫ్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరణకు పిలుపునిస్తామని నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫ్యాప్టో జిల్లా చైర్మన్ ఎ.సుందరయ్య మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆర్థిక బకాయిలు, డీఏలు, పీఆర్సీ నియామకం, మధ్యంతర భృతి అంశాలపై ప్రభుత్వం స్పందించాలన్నారు. ఫ్యాప్టో జిల్లా కార్యదర్శి డాక్టర్ రాజు మాట్లాడుతూ విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025భక్తి భావం.. జన ప్రవాహం గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దసరా ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.విద్యార్థులకు దసరా సెలవుల నేపథ్యంలో అందరూ సొంతూరు బాట పట్టారు. దీంతో ఆదివారం విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. కోనేరుసెంటర్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయు డు అన్నారు. ఆదివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సిబ్బందికి యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు.దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆదివారం అర్ధరాత్రి భక్తజనం పోటెత్తారు. ఆలయ పరిసరాలతో పాటుగా పాతబస్తీలోని ప్రధాన వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజామున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి పది గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో వారందరినీ నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన హోల్డింగ్ ప్రాంతం వైపు అధికారులు మళ్లించారు. రద్దీ కారణంగా తొక్కిసలాట లేకుండా బ్లాక్లుగా భక్తులను విడదీస్తూ ఎక్కడికక్కడ నిలిపివేశారు. సుమారు 12గంటల సమయంలో వారిని వినాయకునిగుడి వద్ద ఉన్న క్యూలైన్లలోకి అనుమతించారు. ఆలయ పరిసరాలతో పాటుగా బయట వైపు భక్తులెవరిని ఉంచకుండా వినాయకునిగుడి వైపునకు మళ్లించారు. – వన్టౌన్(విజయవాడపశ్చిమ) ఆదివారం అర్ధరాత్రి 12గంటల సమయంలో కంపార్ట్మెంట్ బయట వేచి ఉన్న భక్తులు7 -
వైఎస్సార్ సీపీలో చేరిన వైఎస్సార్ కాలనీ మహిళలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీకి చెందిన పలువురు మహిళలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాలనీకి చెందిన పెద్ది రాంబాయిమ్మ ఆధ్వర్యంలో 30 మంది మహిళలు తెలుగు దేశం పార్టీ నుంచి వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ జోగి రమేష్ నివాసంలో ఆదివారం ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన మహిళలను ఆయన సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విజయవాడ రూరల్ మండలం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు బయ్యారపు రవికిషోర్, ఎంపీటీసీలు కొరగంజి సత్యనారాయణ, షేక్ సైదాబీ వలీ, కాలనీ నాయకులు నక్కా ప్రభుదాస్, మారపాక రాంబాబు, కుంభా నాగరాజు, ముళ్ల లాజర్, టీఎల్ రాజు, ఎస్కే షరీఫ్, గద్దల లాజర్, విన్నపాల రంగారావు, చల్లా అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన మహిళలు జోగి రమేష్ను సత్కరించారు. చిల్లకల్లు(జగ్గయ్యపేట): పద్నాలుగేళ్ల మైనర్ బాలికను గర్భవతిని చేసిన కేసులో ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చిల్లకల్లు ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక అదే గ్రామానికి చెందిన నాదెండ్ల నాగరాజు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నాగరాజు స్నేహితుడు అమరబోయిన గోపి పరిచయమై శారీరకంగా కలిశారు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావటంతో తల్లి వైద్య పరీక్షలు చేయించటంతో ఏడు నెలల గర్భవతి అని తేలింది. దీంతో ఆమె ఆదివారం పోలీసులకు ఫిర్యాదుచేయగా నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణంమరొకరికి తీవ్ర గాయాలు కంచికచర్ల: వేగంగా వెళుతున్న కారు ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహ నాన్ని ఢీకొనగా ఒక వ్యక్తి మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గా యాలయ్యాయి. ఈ ఘటన కంచికచర్లలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న కారు కంచికచర్ల ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వేగంగా వచ్చి ఢీ కొంది. ఈ ఘటనలో కారులో వెనుక సీట్లో కూర్చున్న హైదరాబాద్కు చెందిన వట్టికూటి చలపతిరావు(45) అక్కడికక్కడే మృతిచెందారు. విజయవాడకు చెందిన కారు డ్రైవర్ విశ్వనాథపల్లి గణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్య చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పాఠశాల విద్యపై మంత్రి చూపే శ్రద్ధ ఇదేనా?
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘‘విద్యాశాఖ మంత్రిగా దాన్ని వదిలేసి మిగిలిన అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న నారా లోకేష్ గారూ..పాఠశాల విద్యపై మీరు చూపే శ్రద్ధ ఇదేనా’’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో గత నాలుగేళ్లుగా ఉన్న ఏపీ గురుకుల పాఠశాల (మైనార్టీ బాలికలు)ను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం పరిధిలోని పొలాల మధ్యగల మూతబడిన కాలేజీ భవనంలోకి తరలించటంపై విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. వారికి వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ లతోపాటు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. దొంగచాటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల(శ్రీకాకుళం నుంచి నెల్లూరు)కు చెందిన మైనార్టీ బాలికలు చదువుకుంటున్న ఈ గురుకుల పాఠశాల యాజమాన్యం, కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల భద్రతతో మారుమూల ప్రాంతానికి తరలించటం బాధాకరం అన్నారు. పేరెంట్స్ కమిటీని సంప్రదించి ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్పాల్సిన కనీస బాధ్యత విద్యా శాఖ అధికారులకు లేదా అని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ విజయవాడ ఉత్సవ్ పేరుతో బిజీబిజీగా ఉండటంతో విద్యార్థినుల తల్లిదండ్రుల ఘోష పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నారు. స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే చదివించండి లేదా టీసీలు తీసుకుని పొమ్మని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం బాధాకరమన్నారు. విద్యార్థినుల జీవితాలతో ఆడుకుంటున్నారు విద్యా సంవత్సరం మధ్యలో అర్ధంతరంగా స్కూల్ను తరలించటం విద్యార్థినుల జీవితాలతో ఆడుకోవడమేనని వెలంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఉంది.. పూర్తి రక్షణ ఉంటుదని పిల్లలను ఇక్కడ చదివిస్తుంటే, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో స్కూల్ పెడితే వైద్యం, ఇతర సహాయం కావాలంటే పట్టించుకునే వారెవరని మండిపడ్డారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు స్కూల్ను ఇక్కడే ఉంచాలని, లేదంటే తల్లిదండ్రులను పిలిచి మీటింగ్ పెట్టి వారికి అభ్యంతరం లేదని చెబితే తప్ప మార్చటానికి వీలు లేదని వెలంపల్లి స్పష్టం చేశారు. స్కూల్ మార్చాల్సివస్తే తల్లిదండ్రులకు ఎందుకు తెలియపరచరు? ఇదేనా ఆడపిల్లల భద్రత గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించేది? మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల తరలింపుపై మాజీ మంత్రి వెలంపల్లి ఆగ్రహం -
ఉద్యోగ భద్రత, భరోసా కల్పించండి
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): తమకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత, భరోసా కల్పించాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆప్కాస్ ఏర్పాటు చేసిందని, దీంతో ఉద్యోగులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ వచ్చి మేలు జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే, తమకు సర్విస్ రూల్స్ నియమ నిబంధనలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
లారీ ఢీకొని పాత్రికేయుడు దుర్మరణం
గన్నవరం: లారీ ఢీకొని సీనియర్ జర్నలిస్ట్ దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం వద్ద శనివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం...స్థానిక గౌడపేటకు చెందిన నెక్కలపు శ్రీనివాసరావు(50) ప్రజాశక్తి విలేకరిగా, వీకేఆర్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కళాశాల విధులకు హాజరై తిరిగి బైక్పై గన్నవరం బయలుదేరారు. దుర్గాపురంలోని హెచ్సీఎల్ వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బీవీ. శివప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం శ్రీనివాసరావు భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయుడిగా పనిచేసిన శ్రీనివాసరావుకు పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.హనుమాన్జంక్షన్ రూరల్:చైన్నె–కోల్కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం అంపాపురం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొటనంతో భవానీ మాల ధరించిన వ్యక్తి దుర్మరణం చెందాడు. అంపాపురంలోని పతాంజలి పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న టీ స్టాల్లో శనివారం టీ తాగి రోడ్డు దాడుతుండగా ఓ వాహనం భవానీ మాల ధరించిన వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోతుందని స్థానికుల నుంచి సమాచారం అందటంతో వీరవల్లి పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడు సుమారు 55 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడని, మృతుడి దుస్తుల్లో అడ్రస్కు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనాన్ని పట్టుకునేందుకు వీరవల్లి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
హస్తకళలు కాపాడుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ):దేశ సంస్కృతిలో భాగమైన హస్తకళలు కనుమరుగవ్వకుండా కాపాడుకోవాలని సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. విజయవాడ భవానీపురంలోని హరిత బెరంపార్క్లో ‘అపిటికో’, రాష్ట్ర హస్తకళాకారుల సంస్థలు శనివారం సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్షాప్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ భిన్న మతాలు, జాతులు, తెగల సంస్కృతుల మధ్య దేశంలో కొనసాగతోన్న ఏకత్వానికి హస్తకళారూపాలు, నాట్య, సంగీత, సాహిత్యాలు దోహదపడతాయని పేర్కొన్నారు. తరతరాల నుంచి వస్తున్న హస్తకళల వారసత్వాన్ని భవిష్యత్ తరాలు అందిపుచ్చుకునేలా కృషి చేయాలని సూచించారు. హస్తకళల వృత్తి నైపుణ్యాన్ని, వ్యాపార ధోరణులను నేర్చుకోవాలని కోరారు. ప్రస్తుత అధునాతన వాణిజ్య పోకడలతో తమ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవాలని తెలిపారు. మన హస్త కళాకృతులను అమెజాన్ వంటి సంస్థల సహకారంతో దేశవిదేశాల్లో ఖ్యాతి గడించాలని ఆకాంక్షించారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లాభపడాలని కోరారు. ప్రొఫెసర్ ఆదినారాయణ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి, మార్కెటొంగ్ సదుపాయాలపై హస్తకళాకారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్ పి.సుధీర్కుమార్ పాల్గొన్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న చత్తీస్ఘడ్ వాసులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు చత్తీస్ఘడ్ నుంచి భక్తులు విచ్చేశారు. సుమారు 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక వాహనంపై విజయవాడకు విచ్చేసి వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకుని తమ సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి తాము పండించిన పలు పండ్లను అందచేశారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఏటా పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి వస్తుంటామని చెప్పారు. అమ్మవారి దయతో తామంతా ఏ ఇబ్బంది లేకుండా సుఖసంతోషాలతో ఉంటున్నామని పేర్కొన్నారు. దర్శనం అనంతరం కొండపై ఘాట్రోడ్డులోని ఓం టర్నింగ్ వద్ద లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. తమ గ్రామానికి చెందిన వారితో పాటు బంధువులందరికీ అమ్మవారి ప్రసాదాలు అందచేస్తామన్నారు. -
నేటి అలంకారం శ్రీమహాచండీదేవి
● వైభవంగా దసరా ఉత్సవాలు ● శ్రీలలితాత్రిపురసుందరీదేవిగా దుర్గమ్మ దర్శనం ● ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భక్తులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ శనివారం శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులను కరుణించారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దుర్గమ్మ దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లు, ఆలయ పరిసరాలు కిక్కిరిసి కనిపించాయి. తెల్లవారు జాము నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము టైం స్లాట్కు ప్రముఖులు, వీఐపీలు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన వీఐపీ టైం స్లాట్లో ఎక్కువ రద్దీ కనిపించింది. దుర్గగుడి అధికారులను అడ్డుకున్న పోలీసులు శనివారం రెండో షిప్టు విధులకు హాజరయ్యే ఆలయ అధికా రులు, ఇంజినీరింగ్ సిబ్బందిని పోలీసులు లిఫ్టు వద్ద అడ్డుకున్నారు. లిఫ్టు మార్గంలో ఎవరినీ అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. లిఫ్టు మీదగా కొండ పైకి ఎవరినీ అనుమతించొద్దన్న ఉన్నతాధికారుల ఆదేశాలనే తాము పాటిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులు తీరుతో ఏఈఓలు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. కనకమహాలక్ష్మి, ద్వారకా తిరుమల ఆలయాల నుంచి పట్టువస్త్రాలు దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మకు విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి తరఫున ఆ ఆలయ అధికారులు దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. కనకమహాలక్ష్మి ఆలయ ఈఓ కె.శోభారాణి, ఆలయ అర్చకులు, అధికారులు పట్టువస్త్రా లతో ఇంద్రకీలాద్రికి చేరుకోగా దుర్గగుడి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు, పూలు, ఉత్తరాంధ్ర సంప్రదాయం ప్రకారం కావడితో అరటిపళ్ల గెలలను అందజేశారు. అనంతరం దుర్గగుడి అధికా రులు అమ్మవారి ప్రసాదాలను అందించారు. దుర్గమ్మకు శనివారం ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ఈఓ ఎన్.వి.ఎస్.ఎన్. మూర్తి దంపతులు, చైర్మన్ కుమారుడు నివృత్తి రావుతో పాటు కుటుంబ సభ్యులు ఇంద్రకీలాద్రికి రాగా దుర్గ గుడి ఈఓ శీనానాయక్, ఆలయ వైదిక కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఈఓ తదితరులు దుర్గగుడి ఈఓకు పట్టు వస్త్రాలు అందజేశారు. అర్చక సత్కారం దసరా ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అర్చకలను ఘనంగా సత్కరించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలు, దేవస్థానాలకు చెందిన 200 మంది అర్చకులను సత్కరించి, నగదు పురస్కారాలు అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ విచ్చేసి అర్చకులను ఘనంగా సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.4,500 చొప్పున మొత్తం రూ.9 లక్షలను అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శీనానాయక్, దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. గాలిగోపురం వద్ద పుష్పాలంకరణ ఆలయ ప్రాంగణంలోని గాలిగోపురం వద్ద పత్యేక పుష్పాలంకరణ చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ చేయకపోవడంపై వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం గాలిగోపురంతో పాటు లక్ష్మీగణపతి ప్రాంగణంలోనూ పుష్పాలంకరణపై ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపారు. చూసిన కనులదే భాగ్యం శ్రీగంగాపార్వతి సమేతంగా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవం శనివారం సాయంత్రం కనుల పండువగా సాగింది. ఈ వేడుకలో ఆదిదంపతుల వెంట అడుగులో అడుగు వేయాలని భక్తులు పరితపించారు. దసరా ఉత్సవాల వేళ తమకు కలిగిన భాగ్యాన్ని తలుచుకుని మురిసిపోయారు. సారెతో విశాఖపట్నం మహాలక్ష్మి ఆలయ ఈఓ శోభారాణి తదితరులుఅమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ద్వారకా తిరుమల చైర్మన్, ఈఓలు శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ ఆదివారం శ్రీమహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీమహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభిస్తాయి. సంకల్పాలు నెరవేరి భక్తులకు విజయం సిద్ధిస్తుంది. -
డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘ఇప్పుడు రెడ్బుక్ పేరుతో మా కార్యకర్తలను ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, వారికి డిజిటల్ బుక్ అంటే ఏమిటో చూపిస్తాం’ అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సామాన్యులను కూటమి పార్టీల నాయకులు వేధిస్తున్నారని విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులతో కలిసి దేవినేని అవినాష్ డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. ఈ నెల 24వ తేదీన తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను ఆవిష్కరించారని గుర్తుచేశారు. రెడ్ బుక్ తరహాలో తాము చిల్లరగా వ్యవహరించబోమని స్పష్టంచేశారు. కూటమి నాయకులతో పాటు కొంత మంది అధికారులు కూడా వైఎస్సార్ సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటా మని స్పష్టంచేశారు. అసెంబ్లీకి తాగొచ్చిన బాలకృష్ణ నూటికి నూరు పాళ్లు బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చాడని వైఎస్సార్ సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బాల కృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్ అని గుర్తుచేశారు. పవన్ కల్యాణ్, నాగబాబు ఏం చేస్తు న్నారు, తమ అన్నయ్య చిరంజీవిని వాడూ వీడూ అని బాలకృష్ణ హేళన చేసినా స్పందించరా అని ప్రశ్నించారు. నాగబాబు, పవన్కల్యాణ్ తమ అమ్మను తిట్టించిన వారికి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవాచేశారు. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకు చెక్ పెట్టేలా డిజిటల్ బుక్ తీసుకొచ్చామన్నారు. కొందరు అధికారులు కూటమి ప్రభుత్వానికి బానిసలుగా పని చేస్తున్నారని, డిజిటల్ బుక్లో ఏ అధికారి పేరు వస్తుందో వారిపై తాము అధికారంలోకి వచ్చాక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, పార్టీ జగ్గయ్య పేట ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ -
గుట్టుగా గురుకుల పాఠశాల తరలింపునకు యత్నం!
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ (మైనార్టీ బాలికల గురుకుల విద్యాలయం)ను గుట్టుగా తరలించేందుకు చేస్తున్న యత్నం వివాదాస్పదమైంది. విజయవాడ భవానీపురంలోని ఐరన్యార్డ్ పారంతంలో ఉన్న గురుకుల పాఠశాలను ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామం బొద్దనపల్లెకు మార్చాలని ఏపీఆర్ స్కూల్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య ఈ నెల ఐదో తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ గీతాంజలి సన్నాహాలు చేపట్టారు. ప్రస్తుతం దసరా సెలవులకు విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఈ తరుణంలో తమకు సమాచారం ఇవ్వకుండా స్కూల్ తరలించే యత్నాలను తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పాఠశాలను మారుమూల గ్రామంలో సుమారు ఏడేళ్ల క్రితం మూతబడిన కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన ఎటువంటి రక్షణ లేని కాలేజీ భవనంలోకి తరలిస్తే, అక్కడ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో వద్దని.. ఇప్పుడు కావాలని.. విద్యాధరపురంలోని ఆర్టీసీ ట్రైనింగ్ స్కూల్ భవనంలో గురుకుల పాఠశాల 16 ఏళ్లు నడిచింది. ఆర్టీసీ యాజమాన్యం ఖాళీ చేయాలనటంతో నాలుగేళ్ల క్రితం భవానీపురం ఐరన్యార్డ్లోని ఒక భవనంలోకి మార్చారు. ప్రస్తుతం ఇక్కడ వివిధ జిల్లాల నుంచి సుమారు 211 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది జూలైతో భవనం అద్దె అగ్రిమెంట్ గడువు ముగిసింది. అంతకు ముందు నుంచి వేరే భవనం కోసం గాలిస్తున్నారు. ఈదర గ్రామంలో ఉన్న కుంద ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన డిగ్రీ కాలేజీ భవనాన్ని గతంలో పరిశీలించగా ఎక్కడో దూరంగా మారుమూల ఉండటంతో ఏపీఆర్ స్కూల్స్ సెక్రటరీ వి.ఎన్.మస్తానయ్య తిరస్కరించారని సమాచారం. ఆయనే ఇప్పుడు అదే భవనంలోకి మార్చాలని ఉత్తర్వులు జారీ చేయడానికి ఈ గురుకుల పాఠశాలలో గతంలో ప్రిన్సిపాల్గా పని చేసిన వ్యక్తి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న స్కూల్ను వేరే జిల్లాకు మార్చకూడదన్న జీఓ ఉంది. అయినా అధికారులు దానికి వ్యతిరేకంగా వ్యవహరించడం గమనార్హం. పాఠశాల తరలింపు విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ స్కూల్ వద్దకు వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. ఏడేళ్ల క్రితం మూతబడిన కాలేజీలో ఏర్పాటుకు చర్యలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో ఇదే భవనాన్ని తిరస్కరించిన ఏపీఆర్ స్కూల్ సెక్రటరీ -
సీఎం పర్యటనపై సమీక్ష
వన్టౌన్(విజయవాడపశ్చిమ):దసరా ఉత్సవాల నేపథ్యంలో మూలానక్షత్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని అధికారులు బందోబస్త్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. కమాండింగ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ఈ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశా, నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనానాయక్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. 29వ తేదీన మూలనక్షత్రం సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా అమ్మవారి దర్శనం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చివరి ఐదు రోజుల్లో స్థానిక భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం వస్తారని పేర్కొన్నారు. నీరు, పాలు, ఆహారం మొదలైనవి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నేటి నుంచి జాతీయ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్షిప్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలో ఆదివారం నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 6వ జూనియర్, సీనియర్–సీ విభాగాల నేషనల్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2025–26 నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ చెప్పారు. కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగాసన భారత్, ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జూనియర్స్ (14 నుంచి 18 ఏళ్లు), సీనియర్–సీ (45 నుంచి 55 ఏళ్లు) వారు ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు పాల్గొంటారని వెల్లడించారు. బాల బాలికల విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, గ్రూపు, ట్రెడిషనల్ స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్, సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, రిథమిక్ పెయిర్ ఈవెంట్లతో పాటు సీనియర్–సి విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత, స్పెసిఫికేషన్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారిని అంతర్జాతీయ యోగాసన పోటీల్లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎ.రాధిక, యోగాసన భారత్ స్పోర్ట్స్ ప్రతినిధి శ్రేయస్ మార్కండేయ, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ప్రేమ్కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.రాజశేఖరరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె.రామకృష్ణ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు డి.దుర్గారావు, ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కొంగర సాయి పాల్గొన్నారు. -
ఆదిదంపతుల నదీ విహారంపై సందిగ్ధం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్స వాల ముగింపును పురస్కరించుకుని ఆది దంపతులు నదీ విహారం చేసేందుకు అవసరమైన హంసవాహనం ముస్తాబవుతోంది. దుర్గాఘాట్లో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. విజయ దశమిని పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణా నదిలో విహరిస్తారు. ఇందు కోసం హంసవాహనాన్ని రంగులతో ముస్తాబు చేయడం పూర్తగా, విద్యుత్ దీపాలంకరణ పనులు జరుగుతున్నాయి. అయితే నదికి వరద పోటెత్తిన నేపథ్యంలో నదీ విహారం అనుమానమేనని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. రెండు రోజులుగా మూడు లక్షల క్యూసెక్కు లకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో హంసవాహనం (ఫంట్) నదిలోకి వెళ్లడం ఇబ్బందికరమేనని అధికారులు పేర్కొంటున్నారు. దుర్గాఘాట్ వద్దే హంసవాహనంపై ఆదిదంపతులకు పూజలు నిర్వహించి, ఫంటును మూడు సార్లు ముందుకు, వెనక్కి నడిపించి కార్యక్రమాన్ని పూర్తి చేసే అవకాశం సమాచారం. -
సామాన్య భక్తులకే పెద్దపీట
లబ్బీపేట(విజయవాడతూర్పు):దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. అందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా శనివారం జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశాతో కలిసి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు సామాన్య ప్రజలు ఏ విధంగా దర్శనం చేసుకుంటున్నారు, వారికి క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయాలను పరిశీలించారు. సామాన్య భక్తులు లాగా వినాయక టెంపుల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నడుచుకుంటూ పర్యవేక్షించారు. అంతరాలయం, శివాలయం ఏరియా, మహామండపం, లిఫ్ట్ మార్గం, అన్నదానం, ప్రసాదం తయారు చేసే ఏరియాలను, కనకదుర్గా నగర్, ప్రసాదం కౌంటర్లు, రథం సెంటర్, వినాయక టెంపుల్, కేశఖండనశాల, హోల్డింగ్ ఏరియాలను పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు అనధికారికంగా లిఫ్ట్ మార్గం ద్వారా దర్శనాలకు తీసుకువెళుతున్నారనే సమాచారం మేరకు లిఫ్ట్ మార్గాన్ని పరిశీలించి అక్కడి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలను జారీ చేశారు. అన్నదానం జరిగే ప్రదేశం వద్ద భక్తులను ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం క్యూలైన్లను పరిశీలించి అక్కడి సిబ్బందికి భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ సంయమనం పాటించాలని ఆదేశించారు. వారి వెంట ఎస్పీ గంగాథర్, పశ్చిమజోన్ ఏడీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్ తదితరులు ఉన్నారు. -
ప్రజాప్రతినిధులకు విన్నవించాం
పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యా శాఖ మంత్రి, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ ఆఫీసుల్లో వినతి పత్రాలు అందజేశాం. ఇంత వరకు ఎవరూ స్పందించలేదు. నగరానికి 20 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ప్రాంతానికి స్కూల్ను మారిస్తే, అక్కడ ఏదైనా జరిగితే మేము వెళ్లాలన్నా గంట సమయం పడుతుంది. స్కూల్ భవనం ఎక్కడున్నా సమస్యలు ఎదురవుతుంటాయని ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా చెబుతున్నారు. – భూమన రామకృష్ణ, స్కూల్ పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ -
‘10 చెప్పి 3 అమలు చేస్తే సూపర్హిట్ అవుతుందా?’
విజయవాడ: శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఎదురుదాడి లేదా తప్పించుకుని తిరిగే తప్పా, ప్రభుత్వం నుంచి బాధ్యతాయుతమైన సమాధానం రాలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు(శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ) శాసనమండలి సమావేశాల అనంతరం బొత్స మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ‘ రైతులు ఇబ్బందులు పడుతున్నా యూరియా పై చర్చించడానికి ఒప్పుకోలేదు. మేము ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. 10 చెప్పి 3 అమలు చేస్తే సూపర్ హిట్ అవుతుందా?, కార్మికుల పని గంటలు పెంచే బిల్లు వ్యతిరేకించాం.. ఆ బిల్లులో భాగస్వామ్యం కామని చెప్పాం. క్రిడాల్లో దేశానికి, రాష్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తికి జాబ్ ఇవ్వడానికి బిల్లు పెడితే మేము సమర్ధించాం. కానీ రాజకీయ గొడవలతో చనిపోయిన కుటుంబంలో వ్యక్తికి జాబ్ ఇస్తామని బిల్లు పెడితే వ్యతిరేకించాం. ఈ బిల్లు పాస్ అయితే రాష్ట్రంలో కక్షలు-కార్పణ్యాలు పెరిగిపోతాయి. ప్రభుత్వానికి రాజకీయ ఆలోచన తప్ప ప్రజలు వారి అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి లేదు. ఒంటెద్దు పోకడలతో ప్రభుత్వం పోతుంది. చైర్మన్కి జరిగిన అవమానంపై కూడా సభలో చర్చించాం.. ఇక ముందు జరగదని చెప్పారు’ అని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించడంతో టీడీపీ కార్యక ర్త రామాంజనేయులు ఉద్యోగం బిల్లు ఆమోదం పొందలేదు. దాంతో ఆ బిల్లు ఆమోదం పొందకుండానే శానస మండలి నిరవధిక వాయిదా పడింది. ‘బాలయ్య అంతేసి మాటలన్నా స్పీకర్ పట్టించుకోరా?’ -
బాధితులకు అండగా ఉండటం అందరి బాధ్యత
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాధితులకు అండగా నిలవడంతోపాటు వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినిత అన్నారు. విజయవాడ హనుమాన్పేట ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని వన్స్టాప్ సెంటర్ను శుక్రవారం ఆమె సందర్శించారు. మహిళలకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలను పరిశీలించారు. వన్స్టాప్ సెంటర్ పనితీరును సమీక్షించారు. రికార్డులు తనిఖీ చేశారు. సెంటర్ సిబ్బంది స్వప్న, డబ్ల్యూఎస్ఐ ప్రేమలత ఇతర సిబ్బందితో సమావేశమై బాధితులకు అందుతున్న సాయం, కేసుల పరిష్కారం గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు. ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని వినీత పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు, ఆమెకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎనస్థీషియాలజిస్ట్స్(ఐఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ వై.అచ్యుతరావు, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ డీవీ మహేశ్వరరావు ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ యు.తారక ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా డాక్టర్లు అల్లు పద్మజ, డి.రాజశేఖర్, కె.అపరంజి, సీహెచ్ రాకేష్, పి.అనిల్ కుమార్, కె.వినీలనాథ్, ఉదయ్శంకర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి ఐఆర్సీఎఫ్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సీ చక్రరావు, ఐఎస్ఏ నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎ.కామేశ్వరరావు తదితరులు అభినందనలు తెలిపారు. -
దుర్గమ్మ సన్నిధిలో జర్నలిస్టుల ఆందోళన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ సరిగా లేదంటూ భక్తుల అభిప్రాయాలను కథనాలు, స్క్రోలింగ్లు ప్రసారం చేయడంపై ఈవో శ్రీనానాయక్ ఆగ్రహం వ్యక్తంచేయడంపై మీడియా ప్రతినిధులు ఆందోళన చేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రసారం చేయడం చేయడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే..ఆలయంలో పుష్పాలంకరణ గతేడాది బాగా చేశారు. ఈ ఏడాది నామమాత్రంగా ఉందంటూ భక్తులు విషయాన్ని మీడియా ప్రతినిధులకు తెలియజేయడంతో వారు తమ చానళ్లలో స్క్రోలింగ్లు ఇచ్చారు. ఈక్రమంలో మీడియా ప్రతినిధులు పెట్టిన స్రోల్లింగ్పై ఆలయ ఈవో శీనానాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది పుష్పాలంకరణ బాగా చేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయా? అని మీడియా ప్రతినిధులను ప్రశ్నించడమే కాకుండా తనను అడగకుండా స్క్రోల్లింగ్ ఎలా పెడతారని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధులంతా ‘మీకు చెప్పి ఎందుకు స్రోల్లింగ్ పెట్టాలి...చేసే పనిసరిగా లేదని మాత్రమే చెబుతామని ఈవోకు బదులివ్వడంతో ఆయన మిన్నకుండిపోయారు. ఆలయ ప్రాంగణంలో బైఠాయింపు.. మరోవైపున ఆర్డీవో మాధురి ఆలయంలోకి వెళ్లే మార్గాలకు తాళాలు వేయడం, మహిళా ప్రతినిధులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం వెళ్లకుండా అడ్డుకోవడం, మీడియా ప్రతినిధుల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో నిరసన వ్యక్తమైంది. దీంతో ఆలయ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులు బైఠాయించారు. ఆలయ ఈవో శీనానాయక్ మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి వారిని సముదాయించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మరో వైపున వీఐపీ దర్శనాల పేరిట ఇష్టానుసారంగా కొండపైకి వచ్చే వారిని మీడియా ప్రతినిధులు నిలువరించారు. వీఐపీ టైం స్లాట్ లేకపోయినా ఇష్టానుసారం దర్శనాలకు వస్తున్నారని దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొంటూ వారిని కూడా క్యూలో వచ్చి దర్శనం చేసుకోవాలని పేర్కొనడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఏడీసీపీ జీ.రామకృష్ణ, వన్టౌన్ సీఐ గురుప్రకాష్ వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు వినలేదు. చివరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దుర్గగుడికి చేరుకుని మీడియా ప్రతినిధులు, మహిళా మీడియా ప్రతినిధులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని విభాగాలు తమ బంధువులను దర్శనానికి తీసుకువస్తున్నా పట్టించుకోకుండా, మీడియా ప్రతినిధులు ఎందుకు అన్నిసార్లు తిరుగుతున్నారని ప్రశ్నించడమే కాకుండా ఆంక్షలు విధించడం సరికాదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మరో మారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని, ఉత్సవాలలో ఇటువంటి పరిస్థితి చోటుచేసుకోవడం బాధకరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఆందోళన గంటపాటు సాగగా, చివరికి కలెక్టర్ సముదాయించడంతో మీడియా ప్రతినిధులు ఆందోళనను విరమించారు. -
లక్షమందికి రుణాలివ్వడమే లక్ష్యం
భవానీపురం(విజయవాడపశ్చిమ): కాల్మనీ, అధిక వడ్డీలతో సతమతమవుతున్న చిరు వ్యాపారులకు తమసంస్థ తరఫున అతితక్కువ వడ్డీతో రుణాలిచ్చి చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని గోదావరి–కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ (జీకె) లిమిటెడ్ చైర్మన్ మేడూరి జీవన్ వెంకట్రావ్ తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా లక్ష మంది చిరువ్యాపారులకు రుణాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి శివారులోని సీఎ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఆసంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూ.83.60 కోట్ల డిపాజిట్లు కలిగి ఉన్నామని, అందులో రూ.59.41 కోట్లు మేర రుణాలను ఇచ్చి లాభాల బాటలో అడుగుపెట్టామని తెలిపారు. ధర్మ నిధి ఇన్కం స్కీమ్ ద్వారా ఆలయాలు, చర్చిలు, మసీదులు, వృద్ధ, అనాధ ఆశ్రమాలు వంటి స్వచ్చంద సేవా సంస్థల నిర్వాహకుల నుంచి సేకరించే డిపాజిట్లపై 14.4 శాతం వడ్డీ అందించున్నట్లు తెలిపారు.సొసైటీజనరల్ సెక్రటరీ పూర్ణిమ దామెర్ల, డైరెక్టర్లు, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు. మేడూరి జీవన్వెంకట్రావ్ -
‘విజయ’ అవుట్లెట్లలో డ్వాక్రా ఉత్పత్తుల విక్రయం
హనుమాన్జంక్షన్ రూరల్: మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేస్తున్న నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ‘విజయ’ బ్రాండ్ పేరిట విక్రయించేందుకు కార్యాచరణ చేపట్టామని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. స్థానిక విజయవాడరోడ్డులోని కాకాని భవనంలో చలసాని అధ్యక్షతన 35వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఏకగ్రీవ తీర్మానాలు చేయడంతోపాటు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. గత ఆరేళ్లలో గణనీయమైన వృద్ధి సాధించామని తెలిపారు. 2018–19లో పాల సేకరణ 6.04 కోట్ల లీటర్లు కాగా, ప్రస్తుతం 10.29 కోట్ల లీటర్లకు చేరిందని పేర్కొన్నారు. యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, పాలకవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నృత్యరూపకం
నయన మనోహరం.. విజయవాడ కల్చరల్: దసరా మహోత్సవాల సందర్భంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం (సిద్ధార్థ అకాడమీ అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థా అకాడమీ కళావేదికపై శుక్రవారం ప్రదర్శించిన మహాకాళి నృత్యరూపకం నయన మనోహరంగా సాగింది. హైదరాబాద్ ఆర్ట్ ఇండియా ఫౌండేషన్ అనూరాధ బృందం ప్రదర్శించిన రూపకం ఆసక్తికరంగా సాగింది. దేవీభాగవతం, దేవీ సప్తశతి ఆధారంగా కథను రూపొందించారు.అనూరాధ జొన్నలగడ్డ, నృత్యపర్యవేక్షణలో కాత్యాయని, అపర్ణ, వైష్ణవి, అనూషా తదితరులు నృత్యాలను అభినయించారు. నాట్యాచార్యుడు, వేదాంతం రాధేశ్యాం. డాక్టర్ చింతా రవి బాలకృష్ణ కళాపీఠం నిర్వాహకులు లలిత్నారాయణ ,వెల్లంకి నాగభూషణరావు, బీవీఎస్ ప్రకాష్ కళాకారులను సత్కరించారు. -
బాలకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ిసనీ హీరో చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనాలని, తక్షణమే బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ, కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ దేవినేని అవినాష్ వందలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి శుక్రవారం విజయవాడలోని భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మంచి చేసిన వారిని తూలనాడటం బాల కృష్ణకు అలవాటేనన్నారు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి.. మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ అన్నారు. సభలో లేని వ్యక్తినే కాకుండా, అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా తూలనాడారన్నారు. చిరంజీవిని కించపరిచేలా మాట్లాడినా.. కనీసం ఖండించలేని స్థితిలో జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండటం సిగ్గుచేటన్నారు. గౌరవం పోయింది.. ఎన్టీఆర్, వైఎస్సార్ అంటే తమకు దైవ సమానమని అవినాష్ అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా బాలకృష్ణపై ఉన్న గౌరవం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో పోయిందన్నారు. రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు మంచి చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని, ఆయనపైనా దుర్భాషలాడటం దారుణమన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
దుర్గమ్మ సేవలో శాసన మండలి చైర్మన్
వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను శుక్రవారం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజానీకం సుఖసంతోషాలతో ఉండాలని, పకృతి వైపరీత్యాలు లేకుండా పాడిపంటలు, పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. కబడ్డీ పోటీలు ప్రారంభం మైలవరం: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల కబడ్డీ పోటీలు మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని 12 కళాశాలలోని విద్యార్థులు పాల్గొంటున్నట్లు కళాశాల పీడీ మేజర్ మన్నే స్వామి తెలిపారు. మొదటి రోజు ఈ పోటీలను లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. అప్పారావు ప్రారంభించారు. డాక్టర లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ మేజర్ మన్నే స్వామి మాట్లాడుతూ నాకవుట్ పద్ధతి పోటీలు నిర్వహించామని, దీనిలో కేబీఎన్ కళాశాల, సిద్ధార్థ కళాశాల, ఎస్ఆర్ఆర్ కళాశాల, విజయ కళాశాల లీగ్ దశకు అర్హత సాధించాయని తెలిపారు. నాట్యాచార్య పిళ్లాకు ప్రతిష్టాత్మక పురస్కారం విజయవాడ కల్చరల్: నగరానికి చెందిన నాట్యాచార్యుడు పిళ్లా ఉమామహేశ్వర పాత్రుడుకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్రనాట్య రూప శిల్పి నటరాజ రామకృష్ణ పురస్కారం లభించింది. 2024 సంవత్సరానికి గానూ తనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఉమామహేశ్వరపాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ గురువారం హైదరాబాద్లో జరిగిన సభలో అవార్డ్తోపాటు నగదు బహుమతిని విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెలిదండ్ల నిత్యానందరావు, తెలంగాణ ఉన్నత విద్యాకార్యదర్శి డాక్టర్ యోగితారాణా, ఉస్మానియా విశ్వవిద్యాలయం సంచాలకులు డాక్టర్ ఎస్. భూపతిరావు చేతులమీదుగా అందజేశారని పేర్కొన్నారు. -
మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
విజయవాడ: శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజుకు జరిగిన అవమానంపై సీఎం చంద్రబాబు నాయుడు వివరణ ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ప్రధానంగా అసెంబ్లీ భననాల ప్రారంభ కార్యక్రమానికి, తిరుపతిలో జరిగిన మహిళా ఎమ్మెల్యేల సదస్సుకి ఇలా పలు సందర్భాల్లో మండలి చైర్మన్ మోషేన్ రాజును ఆహ్వానించకపోవడాన్ని వైఎస్సార్సీపీ ప్రశ్నించింది. ఈరోజు(శుక్రవారం, సెప్టెంబర్ 26వ తేదీ) మండలి సమావేశాల్లో భాగంగా ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ.దీనికి మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ.. మోషేన్ రాజు తిరుపతి సభకు రానన్నారని, అధికారులు ఈ విషయం చెప్పారన్నారు. దీనిపై చైర్మన్ మోషేన్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టించకండి అంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మండలి చైర్మన్పై మంత్రి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. గతంలో ఓ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా కూడా మండలి చైర్మన్ను అవమానించిన సంగతిని బొత్స గుర్తు చేశారు. మండలి చైర్మన్గా ఉన్న వ్యక్తి దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని అవమానించినందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.దీనిలో భాగంగా మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. మండలి చైర్మన్ను అవమానించినందుకు సీఎం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు దీనిపై ఎదో ఒకటి తేల్చండి అని మండలి చైర్మన్ కోరగా, మంత్రులు ఎవరూ నోరు మెదపలేదు. దీంతో వైఎస్సార్సీపీ ఆందోళన చేపట్టింది. దాంతో సభను వాయిదా వేశారు చైర్మన్.విషయంలోకి వెళితే.. నిన్న(గురువారం, సెప్టెంబర్ 25 వతేదీ) అసెంబ్లీలో పలు భవనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి కనీసం మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజును ఆహ్వానించలేదు. ఇదే విషయాన్ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రధానంగా ప్రస్తావించారు. స్పీకర్, మంత్రులు ఉండి కూడా చైర్మన్ను ఆహ్వానించలేదన్నారు. తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు జరిగిందని, దానికి కూడా మండలి చైర్మన్ను ఆహ్వానించలేదని బొత్స పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన సదస్సు మీ పార్టీదా? అంటూ ప్రశ్నించారు బొత్స. మండలి చైర్మన్కు పదే పదే అవమానం జరగడాన్ని ఖండించారు బొత్స. దీనికి మంత్రి లేదా సభా నాయకుడు, ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పారా..? చెప్పాలి’ అంటూ బొత్స డిమాండ్ చేశారు. ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడం లేదు..ప్రభుత్వం అందరికీ పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు బొత్స. స్పౌజ్ పెన్షన్లలో ఎవరో ఒకరు చనిపోతే ఆ తర్వాత వాళ్ళలో ఒకరికి ఇస్తున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వటం లేదన్నారు. 16 నెలల నుంచి పెన్షన్ల కోసం ఎంతో మంది చూస్తున్నారని, పెన్షన్లను ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఇవ్వలేదన్నారు. ‘ మా ప్రభుత్వ హయంలో అర్హులందరికీ ఇచ్చాం. విడో పెన్షన్లు ప్రతీ ఏటా రెండు విడతలుగా అర్హులను గుర్తించి ఇచ్చాం. మంత్రులు పూర్తిగా వాస్తవాలు కనుక్కుని చెప్పాలి’ అని బొత్స సూచించారు.ఎవరిది రాజకీయం?.. లోకేష్పై ఏయూ విద్యార్థుల ఆగ్రహం -
జనసేన బానిసత్వం ఇంకెన్నాళ్లు?: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో బసవతారకం ఆస్పత్రికి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎంతో సహకరించారని, అలాంటి వ్యక్తిపై నోరు పారేసుకుని నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తప్పు చేశారని వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ, వైఎస్ జగన్పై చేసిన అనుచిత వ్యాఖ్యపై శుక్రవారం నిరసన చేపట్టారాయన. శుక్రవారం బాడవ పేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పణలో దేవినేని అవినాష్(Devineni Avinash) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మంచి చేసిన వ్యక్తి వైఎస్ జగన్. అలాంటి వ్యక్తిపై అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు(Balayya Comments On YS Jagan) సభ్యసమాజానికి సిగ్గుచేటు. ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ మాకు దైవ సమానులే. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై కూడా మీకు గౌరవం ఉండేది. కానీ, ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణపై ఉన్న గౌరవం పోయింది. గతంలో తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ఏ ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా?. కనీసం అలాంటి ఆలోచనైనా చేశారా?. ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన దమ్ము వైఎస్ జగన్ది. ఆయన అధికారంలో ఉండగా బాలకృష్ణ సినిమాలకే కాదు.. బసవతారకం ఆస్పత్రికి కూడా సహకరించారు. మంచి చేసిన వారిని తూలనాడటం బాలకృష్ణకు అలవాటు. బెజవాడ సాక్షిగా మోదీ తల్లిని తిట్టి మళ్లీ వాటేసుకున్న వ్యక్తి బాలకృష్ణ. అలాంటి వ్యక్తి ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు.. ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. వైఎస్సార్, జగన్ వల్ల మీ కుటుంబానికి జరిగిన మేలును బాలకృష్ణ ఓసారి గుర్తు చేసుకోవాలి. సభలో లేని.. అసలు సంబంధంలేని చిరంజీవిని కూడా బాలకృష్ణ తూలనాడారు. చిరంజీవిని తులనాడినా(Balayya on Chiru).. జనసేన తరఫు నుంచి కనీసం స్పందన లేదు. సభలో ఉన్న జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. ఎందుకు ఇంకా మీకు ఇంతటి బానిసత్వం?. నిండు సభలో చిరంజీవిని అవమానిస్తే ఏమైపోయారు మీరంతా?. మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారంతో తిరిగి ఏమీ అనలేకపోతున్నాం. కూటమి ఎమ్మెల్యేలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని అంబేద్కర్ ను కోరుకున్నాం. బాలకృష్ణ తక్షణమే జగన్ మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాటు విజయవాడ డిప్యూటీ మేయర్లు బెల్లందుర్గ , అవుతు శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: చిరు.. ఎవడు?? -
పర్యాటకుల పులకింత..
బంగాళాఖాతం –కృష్ణానది సంగమ తీరంలో లైట్హౌస్ మడ అడవుల సోయగం నదీ తీరాన రామలింగేశ్వర మండపం ప్రకృతి పలకరింత.. ●ఆహ్లాదంగా నాగాయలంక తీరం● సూర్యాస్తమయం సందర్శకులకు నిత్య వసంతం ●పెరుగుతున్న పర్యాటకులు నాగాయలంక: మండలంలోని తీర ప్రాంతం పర్యాటకులకు పులకింత కలిగిస్తుంది. ప్రకృతి రమణీయత మధ్య సందర్శకులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక అనుభూతికి, ఆహ్లాదకర సందర్శనకు దక్షిణ బంగాళాఖాతం, పశ్చిమ కృష్ణా పరీవాహక తీర ప్రాంతం నిత్యం సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. దివిసీమ ద్వీపంతో అనుసంధానమైన నాగాయలంక మండలంలో మరో రెండు దీవులు (ఎదురుమొండి– ఈలచెట్లదిబ్బ) భౌగోళికంగా ఈ ప్రాంత పర్యాటక ఔన్నత్యానికి భరోసా ఇస్తున్నాయి. నిత్యం ఆహ్లాదకరం చేకూరుస్తూ కృష్ణానది, నౌకా దిక్సూచి లైట్హౌస్, స్థానిక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్, నవలంక పర్యాటక వేదికలయ్యాయి. గ్రామ పంచాయతీ సహకారంతో స్వచ్ఛ నాగాయలంక సొసైటీ టీమ్ సఫలం కావడంతో స్వచ్ఛతా పర్యాటకానికి ఎనలేని ప్రాచుర్యం చేకూరింది. 2016 పుష్కరాల తర్వాత ఈ ఘాట్ను సంరక్షించడంలో స్వచ్ఛ సేవా కార్యకర్తలు కీలకపాత్ర వహించటంతో క్రమేణా సందర్శకుల రాకకు ప్రాధాన్యం పెరిగింది. సందర్శకులు కృష్ణానదిలో బోటు షికారు చేసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రైవేటు బోట్లను కిరాయికి మాట్లాడుకుని సరదాగా నదిలోకి సమీపంలోని నవలంకలోకి వెళ్లి రౌండ్స్ కొడుతున్నారు. ఈ 17 ఎకరాల ఐలెండ్ను ఆధునిక ఫ్రీ వెడ్డింగ్ షూట్లకు సైతం వినియోగిస్తున్నారు. ప్రధానంగా కృష్ణానది ఆవల పశ్చిమ తీరంలో ప్రతి నిత్యం కనిపించే సూర్యాస్తమయ విభిన్న దృశ్యాలకు సందర్శకులు మంత్ర ముగ్ధులవుతూ ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేయడం పరిపాటిగా మారింది. దృష్టి పెట్టని పర్యాటక శాఖ.... ఇంతగా పర్యాటక వైచిత్యం కనిపిస్తున్నా సంబంధి పర్యాటకశాఖ మాత్రం ఇటువైపు దృష్టి పెట్టడంలేదు. పర్యాటక శాఖ రూ.1.25 కోట్లతో ఫుడ్ కోర్టు భవనాన్ని 90 శాతం పూర్తి చేసినప్పటికీ నిర్వహణ విస్మరించి టీడీపీ నాయకులకు అప్పగించడం గమనార్హం. అన్ని జాగ్రత్తలతో పర్యాటక శాఖ ఇక్కడ బోటు షికారు పాయింట్ నిర్వహిస్తే మంచి ఆదరణ అభిస్తుందని సందర్శకులు అంటున్నారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నెలకొల్పిన వాటర్ స్పోర్ట్స్ అకాడమీ జలక్రీడల శిక్షణ చాలాకాలంగా ఆగిపోయింది. సందర్శకుల దిక్సూచిగా కూడా అలరిస్తున్న మరో పర్యాటక సువర్ణావకాశం కృష్ణా సాగర సంగమ తీరంలో ఆకర్షించేది కేంద్ర నౌకాయాన శాఖకు చెందిన నాగాయలంక లైట్హౌస్. కృషానది దక్షిణ పాయ నాగాయలంక దిగువున మరో మూడు పాయలుగా చీలిక ఏర్పడి సాగర సంగమం చెందే సమీపంలో ఈ దీప స్తంభం విశేషంగా అలరిస్తుంది. సొర్లగొంది, గుల్లలమోద నుంచి సముద్ర పాయల్లో బోట్లపై ప్రయాణిస్తే లైట్హౌస్ పరిసరాల్లో విస్తరించిన వేలాది ఎకరాల మడ అడవుల సౌందర్యం తనివితీరా చూడవచ్చు. దశాబ్దాల కలగా కృష్ణానదిపై తలపెట్టిన ఎదురుమొండి వంతెన నిర్మాణం జరిగితే రెండు దీవుల నడుమ ఉన్న ఈప్రాంతం అలరించే పర్యాటక ప్రదేశంగా మారడంలో అతిశయోక్తి ఉండదు. -
ఫార్మసిస్టులు ప్రాణదాతలు
సెంటర్(మచిలీపట్నం): నేటి ప్రపంచంలో వెలుగు చూస్తున్న భయంకరమైన వైరస్ల బారి నుంచి ప్రజల ప్రాణాలు ఫార్మాసిస్టులు కాపాడుతున్నారని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ పేర్కొన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ప్రపంచ ఫార్మసీ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రంగం ఫార్మా అని, అందులో రూ.3 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు జీతం పొందేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఎస్.ఎల్.ఎన్.ప్రసాదరెడ్డి ఫార్మా రంగంలో దేశీయంగా చోటుచేసుకుంటున్న మార్పులను వివరించారు. తొలుత ఫార్మసీ పితామహుడుగా పేరొందిన స్కాఫ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్ ఉష, ఫార్మసీ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మను బంగారు వాకిలి నుంచి దర్శించుకున్న కలెక్టర్వన్టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ దంపతులు క్యూలైన్లో వెళ్లి బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నారు. గురువారం రాత్రి తొమ్మిది గంటల తరువాత వీఐపీ టైం స్లాట్ ముగిసిన తరువాత క్యూలైన్ ద్వారా బంగారు వాకిలి నుంచి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీఐపీ దర్శనాలకు దేవస్థానం కేటాయించిన సమయాల్లో మాత్రమే దర్శనం చేసుకోవాలని సూచించారు. వీఐపీలు గర్భగుడిని కాకుండా బంగారు వాకిలి దర్శనం చేసుకుంటే సామాన్య భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించొచ్చని పేర్కొన్నారు.బందోబస్త్ ఏర్పాట్ల పరిశీలనలో డీజీపీవన్టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్గుప్తా అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శ్రీదుర్గామళ్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని కమాండింగ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఇతర సాంకేతిక అంశాలను డీజీపీ గురువారం పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆయనకు సీసీ కెమెరాలను చూపిస్తూ ఆయా ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లు, బందోబస్తు గురించి వివరించారు. ఆధునిక ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు, రద్దీ సమయంలో తీసుకునే చర్యలు ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను వివరించారు. -
కృష్ణమ్మ విలవిల.. కాసులు గలగల
నదీగర్భాన్ని తోడేస్తున్న ఇసుకాసురులు వాల్టా చట్టానికి తూట్లు ఇసుక తవ్వకాల నిబంధనలు గాలికి రోజుకు రూ.లక్షల్లో సంపాదన కృష్ణానది నుంచి తవ్విన ఇసుకను రోజుకు 500 ట్రాక్టర్లు అక్రమ మార్గాన తరలించి రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఒక్కొక ట్రాక్టర్ లోడింగ్కు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాదారుల నుంచి మునిసిపాలిటీ ఆశీలు టెండర్ దారులు ట్రాక్టర్కు రూ.100 లెక్కన వసూలు చేస్తూ అక్రమ సంపాదనలో భాగమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ తవ్వకాలు అరికట్టాల్సిన వారే అక్రమ వసూళ్లకు పాల్బడటం విడ్డూరంగా ఉంది. ఇసుక రవాణాకు ప్రజాప్రతినిధి అండదండలు పుష్కలంగా ఉండ టంతో మైనింగ్ రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మైనింగ్ ఏడీ వీరాస్వామి ఆరు నెలల క్రితం ఇదే ఇసుక రేవులో దాడిచేసి 24 ట్రాక్టర్లు, 18 క్రేన్లు, 10 పడవలను సీజ్ చేసి డ్రైవర్లపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా తిరిగి యథేచ్చగా ఇసుక రవాణాతో అక్రమ సంపాదనకు తెరతీశారు. -
రెచ్చిపోతున్న
ఇసుక మాఫియా మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, ఫెర్రీ వద్ద నదిలో ఇసుక తవ్వుతూ కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. భారీసైజు పడవల్లో డ్రెడ్జింగ్ యంత్రాలు బిగించి ఇసుక తోడేస్తున్నారు. ఒడ్డుకు చేరిన ఇసుక మ్యాన్యువల్ క్రేన్ల ద్వారా ట్రాక్టర్లలో లోడింగ్ చేస్తున్నారు. 20 పడవల ద్వారా కృష్ణానది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిపి కృష్ణమ్మకు గర్భశోకం మిగుల్చుతున్నారు. 20 పడవల ద్వారా వచ్చిన ఇసుకను 18 మ్యాన్యువల్ క్రేన్లతో ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారు. పడవల యజమానులు క్రేన్, తాము ఆక్రమించిన స్థలానికి నెలకు రూ.3 లక్షల అద్దె డిమాండ్ చేస్తున్నారంటే ఫెర్రీ రేవులో ఇసుకకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. -
బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ లబ్బీపేట(విజయవాడతూర్పు): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలిపారు. శాసనసభలో హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు. అలా తాము కూడా మాట్లాడగలమని, కానీ మాకు సంస్కారం ఉందన్నారు. ప్రజా సమస్యలు చర్చించేందుకు శాసన సభ నిర్వహిస్తున్నారా... మాజీ ముఖ్యమంత్రిని విమర్శించడానికి సభ నిర్వహిస్తున్నారో ప్రజలకు అర్థం కావడం లేదని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, చెప్పుకోవడానికి చేసిందేమి లేక, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి, సూపర్సిక్స్ను సూపర్ ప్లాప్ చేసి వాటి నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని తెలిపారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి విచ్చలవిడిగా దొరు కుతుందని, వాటిని అరికట్టడంతో విఫలమైన ప్రభుత్వం, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టారన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే బాలకృష్ణ శాసనసభలో ఎలా హుందాగా వ్యవహరించాలో తెలుసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ పామర్రు:అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోసం మాజీ మంత్రి పేర్రి నానికి కాల్ చేయటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ పెద్ద సైకో అని ధ్వజమెత్తారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వస్తే వారి సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టి సైకోలా ప్రవర్తించింది బాలకృష్ణనే అన్నారు. వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి కూటమి ప్రభుత్వంలో ఏ నాయకుడికీ లేదన్నారు. తమ నాయకుడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే మాకేం లాభం?
విజయవాడ జాతీయ ప్రధాన రహదారిలో గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఎదురుగా పెద్ద గుంత ఊర్మిళనగర్ నుంచి కబేళా సెంటర్కు వెళ్లే మార్గంలో రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలుడబ్బు దండుకునే దార్లు వెతుక్కోవడమే అధికార పార్టీ నేతలకు లక్ష్యంగా మారింది. ప్రజాప్రయోజన కార్యక్రమాల జోలికి వెళ్లకుండా ఉత్సవాల పేరిట జనం జేబులు ఖాళీ చేసే పనులకే పెద్దపీట వేస్తున్నారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి నగరంలో వివిధ ప్రదేశాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 27వ తేదీ నుంచి గొల్లపూడి వై జంక్షన్ సమీపంలో పంటకాలువ రోడ్డులో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారు. ఇంత హడావిడి చేస్తున్న నేతలకు కనీసం ఈ ప్రాంతానికి చుట్టుపక్కల అధ్వానంగా ఉన్న రహదారులను బాగు చేయాలన్న కనీస స్పృహ లేకపోవడం విచారకరం. ఈ రోడ్లపై వెళ్లే వాహనదారులు ఉత్సవాల స్వాగత ద్వారాలు చూసి డబ్బు దండుకోవడానికే ఈ కార్యక్రమాలంటూ అధికార పార్టీ నేతల తీరును బహిరంగంగానే విమర్శిస్తున్నారు. – నడిపూడి కిషోర్, సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ -
కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు
విజయవాడ: భవానీపురంలో ఓ కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు. విజయవాడ భవానీపురం సెంటర్లో ఈ ఘటన జరిగింది. భవానీపురం పెట్రోల్ బంక్ వద్ద కారును వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టిన గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి.కారును ఢీకొట్టడంతో అభినవ్ చౌదరిని నిలదీసిన కారు డ్రైవర్ మనోహర్. మనోహర్ కు అభినవ్ చౌదరికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కారు డ్రైవర్ సెల్ ఫోన్ ,కారు కీ లాక్కున్న అభినవ్ చౌదరి.మాటా మాటా పెరగడంతో కారు కీతో మనోహర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన అభినవ్ చౌదరి. దాడిలో మనోహర్ మెడ పై తీవ్రగాయం అయింది. -
కుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలు
గుడివాడ టౌన్: ఆడుకుంటున్న ఏడే ఏళ్ల బాలుడిపై కుక్క దాడికి తెగబడిన ఘటన గుడివాడ పట్టణంలో బుధవారం జరిగింది. స్థానిక లీలామహల్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్లో బాలుడు సైకిల్పై ఆడుకుంటుండగా వీధి కుక్క దాడికి పాల్పడింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వస్తున్న కొందరు వ్యక్తులు దీనిని గమనించి కుక్కను తరిమి బాలుడిని రక్షించారు. వీధి కుక్కల బారి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు మునిసిపల్ కమిషనర్ను కోరారు. కృత్తివెన్ను: గ్రామంలోని ప్రధాన సెంటర్లో 216 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎంపీ తెలగంశెట్టి వెంకటరమణ నాగేశ్వరరావు (58) దుర్మరణం చెందారు. పాలకొల్లు నుంచి బంటుమిల్లి వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి రమణను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. రమణకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ పైడిబాబు తెలిపారు. మండల పరిసర గ్రామాల్లో పేద ప్రజలకు డబ్బులు డిమాండ్ చేయకుండా ఇచ్చినంత తీసుకుని వైద్యం చేయడంలో రమణకు మంచి పేరు ఉంది. ఆయన మరణవార్త తెలుసుకుని మండలం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. గూడూరు:ేస్నహితులతో కలసి మంగళవారం స్నానం చేసేందుకు జొన్నలరేవు దగ్గర రామరాజుపాలెం కాలువలో దిగి గల్లంతైన వెలుపూడి జీవన్కుమార్ (12) బుధవారం శవమై తేలాడు. మంగ ళవారం రాత్రి నుంచి తల్లిదండ్రులతో పాటుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం తెల్లవారుజామున మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిపై రామరాజుపాలెం వంతెన కింద కట్టిన వలకు జీవన్కుమార్ మృతదేహం చిక్కింది. పోలీసులు శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని బందరు సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం చేయించారు. అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. తమ కళ్లెదుట ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్లవాడు విగతజీవిగా మారడం పట్ల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదించారు. గూడూరు ఏఎస్ఐ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కానూరులో గంజాయి పట్టివేత
పెనమలూరు/ఉయ్యూరు: పెనమలూరు మండలం కానూరులో గంజాయి నిల్వ ఉంచిన ఇంటిపై ఉయ్యూరు సర్కిల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.శేషగిరిరావు తన సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేశారు. 14 కిలోల 950 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని కానూరులో రెండంతస్తుల భవనంలో గంజాయి ఉంచారన్న సమాచారంతో దాడులు నిర్వహించామని సీఐ తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని పానెం రామమోహన్రావు, యలమంచిలి మురళీకృష్ణప్రసాద్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఉయ్యూరు జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపర్చగా రిమాండ్ విధించారని తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది నంది కేశవరావు, వేణుగోపాలరావు, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
గోడు పట్టదు.. గోస తీరదు!
ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు తప్పని నిరీక్షణ గన్నవరం: విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్నప్పటికీ నిర్వాసితులకు ఎటువంటి న్యాయం జరగలేదు. వారికి కేటాయించిన ఆర్అండ్ఆర్ స్థలంలో మౌలిక వసతుల కల్పనకు, గృహ నిర్మాణాలకు నిధులు కేటాయించలేదు. కనీసం అద్దె బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తొమ్మిదేళ్లుగా ఎదురుచూపులు.. విమానాశ్రయ విస్తరణ కోసం 2016లో దావాజిగూడెం, అల్లాపురం, బుద్ధవరం గ్రామాల్లో 423 కుటుంబాలకు చెందిన ఇళ్లు, స్థలాలను సేకరించేందుకు ప్రభుత్వం గుర్తించింది. వీరికి ప్రత్యామ్నాయంగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద గృహ నిర్మాణాలు చేపట్టేందుకు 51 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. సదరు భూమిని మెరక చేసి ఐదు సెంట్లు చొప్పున ప్లాట్లుగా విభజించినప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముందడుగు.. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లాటరీ పద్ధతిలో నిర్వాసితులకు ప్లాట్లు కేటాయించింది. స్టాంప్ డ్యూటీ మినహాయించి ఉచితంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి నిర్వాసితులకు దస్తావేజులను పంపిణీ చేసింది. గృహ నిర్మాణాలు చేసుకునేందుకు రెండు విడతలుగా రూ. 9లక్షలు ఇచ్చేందుకు ముందుకువచ్చింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ స్థలంలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి, విద్యుత్ వంటి సదుపాయాల కల్పనకు రూ. 80.48కోట్లు కేటాయించింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా నిధులు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో అడుగు ముందుకు వేయకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన మొదలైంది. నిధులు కోసం.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను కూటమి ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. మౌలిక సదుపాయలు కల్పించి తొలి విడత సాయం మంజూరు చేస్తే గృహ నిర్మాణాలు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ప్రజా ప్రతి నిధులు, అధికారులను పలుమార్లు కలిసి విన్నవించుకున్నట్లు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ మైక్రో కెనాల్ కోసం దావాజీగూడెం ఎస్సీ కాలనీలో 54 కుటుంబాలకు చెందిన గృహాలను ఖాళీ చేయించారు. వీరికి ఏడాదికి రూ. 50వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. ఈ అద్దె బకాయిలు కూడా సక్రమంగా చెల్లించకపోవడం కారణంగా ఒక్కొ కుటుంబానికి రూ. లక్షల్లో ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. మా ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ విమానాశ్రయ విస్తరణ కోసం తమకు వారసత్వంగా వచ్చిన ఇళ్లు, స్థలాలను ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు ముందుకు వచ్చాం. ప్రత్యామ్నాయంగా గృహ నిర్మాణాలు చేసి న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంత వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. అద్దె ఇళ్లలో బతుకుతున్నాం. గృహ నిర్మాణాలు చేపట్టాలని అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ కనికరించడం లేదు. – టి. ఏసురత్నం, ఎస్సీ కాలనీ, దావాజీగూడెం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితుల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు. మైక్రో కెనాల్ నిర్మాణంలో మా ఇంటిని తొలగించడంతో ఆరేళ్లుగా కుటుంబంతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఏటా ఇస్తామని చెప్పిన అద్దెను కూడా చెల్లించడం లేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. పాలకులు స్పందించి, ఆదుకోవాలి. – ఎన్. కోటేశ్వరరావు, దావాజీగూడెం