NTR
-
నిల్వ చేసిన ఆహారం విక్రయిస్తే చర్యలు
నందిగామ టౌన్: రంగు కలిపిన, నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే సహించేది లేదని ఉమ్మడి కృష్ణాజిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. నందిగామ పట్టణంలోని పలు హోటళ్లు, స్వీట్ దుకాణాల్లో ఆయన ఆదివారం విస్తృత తని ఖీలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. స్వీట్ షాపులు, హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరు ఆహార భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రామలింగేశ్వర స్వీటు దుకాణం, విజయ దుర్గ హోటల్లోని ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ఫుడ్ లైసెన్స్, తదితర అనుమతి పత్రాలు ఉండాలని చెప్పారు. వేసవి కాలంలో కావటంతో నిల్వ ఉంచిన మాంసాహారాలు, ఆహార పదార్థాలు అందించటం వల్ల ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరించారు. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలను గుర్తించి బయట పడేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్రరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వెంకన్న దర్శనానికి భక్తుల రద్దీ
గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రులో వేంచే సిన భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారికి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. నిర్వాహకులు కొమ్మారెడ్డి బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): లోక కల్యా ణార్థం, సకల ప్రాణ కోటికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని కోరుతూ ఆదివారం దుర్గమ్మ సన్నిధిలో సూర్యోపాసన సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయప్రాంగణంలోని లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించి సూర్యనారాయణుడికి కేసరిని నివేదనగా సమర్పించారు. అనంతరం అందరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ భక్తులకు ప్రసాద పంపిణీ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలను ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మ వారి దర్శనానికి అనుమతించారు. కంచికచర్ల: మండలంలోని కీసర సమీపంలో జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో ఉన్న 10 ఎకరాల జామాయిల్ తోటకు ఆదివారం రాత్రి నిప్పంటుని దగ్ధమైంది. ఆకతాయిలు నిప్పంటించారని స్థానికులు పేర్కొంటున్నారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది సంఘట నా స్థలానికి చేరుకుని జామాయిల్తోటలో ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు. అప్పటికే పది ఎకరాల్లో ఉన్న జామాయిల్ తోట పూర్తిగా దగ్ధమైందని, రూ.11 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని ఫైర్ అధికారి శివారెడ్డి తెలిపారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో పోలీసులు పేకాట, కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఒక్క రోజే 133 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్లను అరికట్టాలంటూ ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో దాడులు నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వారిని స్థానిక తహసీల్దారుల ఎదుట బైండోవర్ చేశారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్లకు సంబంధించి ప్రజల వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా సంబంధిత పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
టిడ్కో ఇళ్లు ఎప్పుడిస్తారు?
● ఆశగా ఎదురుచూస్తున్న నిరుపేదలు ● డబ్బులు చెల్లించినా మంజూరు కాని ఇళ్లు ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు తిరువూరు: సొంతిల్లు లేని పేద కుటుంబాలకు 2017లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. తిరువూరు పట్టణంలోని 1,536 మంది లబ్ధిదారులకు నేటికీ ఇళ్లు పంపిణీ జరగలేదు. మూడు కేటగిరీలలో నిర్మించే ఈ ఇళ్లకు పలువురు లబ్ధిదారులు తమ వాటా సొమ్ము కూడా చెల్లించినా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. కేటగిరీ–1లో 300 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, కేటగిరీ–3లో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను నిర్మించాలి. కేటగిరీ–1 ఇళ్లకు రూ.5.72 లక్షలు యూనిట్ ధర కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం భరిస్తుండగా, మిగిలిన రూ.2.71 లక్షలను బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. ఈ కేటగిరీ ఇళ్లకు లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. కేటగిరీ–2లో యూనిట్ నిర్మాణ వ్యయం రూ.6.74 లక్షలు. రూ.50 వేలను లబ్ధిదారు వాటాగా నాలుగు విడతల్లో చెల్లించాలి. కేటగిరీ–3 ఇళ్లకు లబ్ధిదారులు నాలుగు విడతలుగా రూ.లక్ష చెల్లించే అవకాశం కల్పించారు. అయితే, కేటగిరీ 2, 3 ఇళ్లకు లబ్థిదారులు వాటా సొమ్ము చెల్లించినా డిమాండ్కు సరిపడా ప్లాట్ల నిర్మాణం చేపట్టకపోగా, వారికి మంజూరు చేసిన యూనిట్లను రద్దు చేసినట్లు అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే వారు చెల్లించిన సొమ్ము మాత్రం ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. నత్తనడకన నిర్మాణ పనులు తాము అధికారంలోకొస్తే వెంటనే టిడ్కో ఇళ్ల పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలునేటికీ నెరవేరలేదు. ఉగాది పండుగకే ఈ ఇళ్లను పంపిణీ చేస్తామని పదే పదే అధికారులు ప్రకటనలు గుప్పించారు. అయితే పనులు పూర్తికాకపోవడంతో ఇప్పట్లో టిడ్కో ఇళ్ల సముదాయంలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే అవకాశం కనిపించడం లేదు. -
1న ఉపాధ్యాయుల నిరాహార దీక్ష
మచిలీపట్నంఅర్బన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి యూటీఎఫ్ రణభేరి 3.0లో భాగంగా కృష్ణా కలెక్టరేట్ ఎదుట ఏప్రిల్ ఒకటో తేదీన ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు ఆదివారం తెలిపారు. నిరాహార దీక్ష నోటీసును శనివారం రాత్రి డీఆర్వో చంద్రశేఖర్కు అంద జేసినట్లు పేర్కొన్నారు. పీఆర్సీ, డీఏ, బకాయిలు, మెమో 57 అమలు వంటి ఆర్థిక సమస్యల పరి ష్కారం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. 11వ పీఆర్సీ అమలు సమయంలో ఆర్థిక ప్రయోజనాలు సక్రమంగా అందక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ సమస్యల పరిష్కారంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ను నియమించలేదని విమర్శించారు. పెండింగ్ డీఏలు విడుదల చేయకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు 18 నెలలుగా గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లింపులు జరగకపోవడం ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహించినట్లు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మరోమారు ఉద్యమానికి దిగుతున్నామని వెల్లడించారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించి, 29 శాతం బేసిక్ రివిజన్ ప్రకటించాలన్నారు పెండింగ్ డీఏలు విడుదల చేయడం, ఉద్యోగులు – పెన్షనర్ల బకాయిల చెల్లింపునకు స్పష్టమైన రోడ్మ్యాప్ ప్రకటించాలని చెప్పారు. కోవిడ్ సమయంలో మరణించిన పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండి షౌకత్ హుస్సేన్, బి.కనకారావు, గౌరవాధ్యక్షుడు జె.లెనిన్ బాబు, జిల్లా కార్యదర్శి కె.రంగనాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వి.సత్యనారాయణ, కె.అర్జున్, సుబ్రహ్మణ్యం, పి.పాపయ్య, ఒ.వి.నాగేంద్రం, అడపా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన యువ సంకీర్తనా గానం
విజయవాడ కల్చరల్: శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో నెలవారీ సంగీత మహోత్సవంలో భాగంగా ఆదివారం నిర్వహించిన యువ సంకీర్తనా గానం శాసీ్త్రయ సంగీత వైభవాన్ని చాటింది. యువ సంగీత విద్వాంసులు ఎస్.హిరణ్మయి వీణపై సద్గురువులు ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి రచించిన సంకీర్తనలను హృద్యంగా పలికించారు. కార్తికేయ ఆదినారాయణ వాద్య సహకారం అందించారు. విశాఖపట్నానికి చెందిన తిరువీధుల సుజాతాదేవి నిర్వహించిన గాత్ర సంగీత కచేరి అలరించింది. హనుమంత్ రామ్చరణ్ వయోలిన్పై, కార్తికేయ ఆదినారాయణ మృదంగంపై వాద్యసహకారం అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత విద్వాంసుడు మోదుమూడి సుధాకర్ మాట్లాడుతూ.. యువ సంగీత విద్వాంసులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సంగీత సమితి కార్యదర్శి సి.వి.రావ్ మాట్లాడుతూ.. సంస్థ ప్రతి నెలా యువ సంగీత కళాకారులను ప్రోత్సహించడానికి సంగీత వేదికలను కల్పిస్తోందన్నారు. -
సుర్రుమన్న సూరీడు
పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోని ఫై ్లఓవర్ జనసంచారం లేక వెలవెలబోతున్న బందరురోడ్డు నిర్మానుష్యంగా కనిపిస్తున్న కంట్రోల్ రూం జంక్షన్ ఎండలు మండుతున్నాయి. మార్చి చివరి వారం నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం ఎనిమిది గంటలు దాటితే చాలు రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప పగటి వేళ రోడ్డు ముఖం చూడటంలేదు. దీంతో ఉదయం పది గంటలు దాటితే రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లపై సైతం వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఆదివారం ఎండ తీవ్రత పెరగడంతో విజయవాడ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
మెరుగైన ఫలితాలే శ్రీ గోసలైట్స్ లక్ష్యం
కంకిపాడు: ఏటా మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా తమ సంస్థలో విద్యాబోధన సాగుతోందని విజయవాడ శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ చైర్మన్ నరేంద్రబాబు పేర్కొన్నారు. శ్రీగోసలైట్స్ మెడికల్ అకాడమీ రీ–యూనియన్ ఫెస్టివిటీస్ కార్యక్రమం ఆదివారం కంకిపాడులోని అయానా ఫంక్షన్ హాలులో జరిగింది. నరేంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అకాడమీలో శిక్షణ పొంది అత్యుత్తమ ర్యాంకులతో జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో మెడికల్ సీట్లు సాధించిన మెడికోలను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ.. స్థాపించిన నాటి నుంచి ప్రతి ఒక్క తర గతి గదిని పూర్తి స్థాయిలో డిజటలైజ్ చేసి స్మార్ట్ బోర్డుల ద్వారా విద్యార్థులకు బోధన అందిస్తున్న ఏౖకైక విద్యాసంస్థ శ్రీగోసలైట్స్ అని పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో అద్భుత విజయాలను తమ విద్యార్థులు సాధించేలా బోధనా పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు. నీట్ 2021లో 724, 2022లో 1,013, 2023లో 1,237, నీట్ 2024లో 1,392, నీట్ 2025లో 1,413 సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ, మెడికల్ సీట్లు సాధిస్తున్నామన్నారు. శిక్షణ బృందం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం
పామర్రు: రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన పామర్రులో ఆదివారం జరిగింది. ఆరేపల్లి షణుఖ వెంకటేశ్వరరావు వేరే ఊరి నుంచి వస్తున్న తన బంధువుల కోసం పామర్రు – గుడివాడ రహదారిలోని ఫ్లై ఓవర్ వద్దకు బయలుదేరాడు. ఇంటి సమీపంలో నివసించే బావిశెట్టి జగదీష్(14)ను బైక్ ఎక్కించుకుని ఫ్లై ఓవర్ వద్దకు చేరుకున్నారు. ఇంతలో గుడివాడ నుంచి వేగంగా వచ్చిన లారీ అదుపు తప్పి బైక్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న జగదీష్ రోడ్డుపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన జగదీష్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. జగదీష్ పామర్రులో జెడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పామర్రు ఎస్ఐ రాజేంద్రప్రసాద్ ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వృద్ధుడిని హత్య చేసిన ఆగంతకులు
నందిగామ టౌన్: ఇంటి వరండాలో నిద్రించిన వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చింతలపాడు గ్రామానికి చెందిన రెబ్బగొండ్ల వెంకటపతి (85) ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని భార్య గతంలోనే మరణించారు. ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి తన నివాసంలోని వరండాలో వెంకటపతి నిద్రించాడు. ఆదివారం ఉదయం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి ముఖంపై కొడవలితో దాడి చేసిన గాయాలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధర్మరాజు తెలిపారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026ఆయుర్వేదానికి 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5448 టీఎంసీలు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ప్రారంభమవుతుందని కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ వారిని ఆదివారం నైమిషారణ్య పీఠాధిపతి, హిందూ ధార్మిక సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బాల బ్రహ్మానంద సరస్వతి దర్శించుకున్నారు. -
ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించాలి..
● మందులు, టెస్టులు అన్నీ బయటకే.. ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ● దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల అవస్థలు ● రాష్ట్రంలోని ఏకై క టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిపై సర్కారు సవతి ప్రేమ లబ్బీపేట(విజయవాడతూర్పు): సంప్రదాయ దేశీయ వైద్యమైన ఆయుర్వేదంపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలోనే ఏకై క ప్రభుత్వ టీచింగ్ ఆయుర్వేద ఆస్పత్రిగా ఉన్న విజయవాడలోని డాక్టర్ ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేద ఆస్పత్రి అరకొర సౌకర్యాలతో కునారిల్లుతోంది. దుష్ఫలితాలు లేని వైద్యమని ఆశతో వస్తున్న రోగులకు నిరాశే ఎదురవుతోంది. మందులు, రక్తపరీక్షలతో పాటు, ఫైల్స్, ఫిస్టులా వంటి వ్యాధులతో వచ్చే వారు దూది.. సూది కూడా బయట కొనుగోలు చేసి తీసుకు రావాల్సిన దయనీయ స్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో ఎలాంటి మందుల కొరత ఉండేది కాదు. కానీ నేడు వారి వద్ద ఉన్న వాటినే రోగులకు ఇచ్చి పంపుతున్నారు. లేనివి బయట కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు. డబ్బులు లేక ప్రభుత్వాస్పత్రికి వస్తే.. ఇక్కడ మందులు కూడా లేవంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి ఎవరికై నా అల్ట్రాసౌండ్, సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్లు అవసరమైతే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికెళ్లి తీయించుకోమని చెప్పవచ్చు. కానీ కమీషన్ల కోసం కొందరు వైద్యులు ప్రైవేటు స్కానింగ్ సెంటర్లకు రాస్తున్నారు. దీంతో ఆ స్లిప్పులు తీసుకుని అక్కడకు వెళితే రూ.వేలల్లో చెబుతున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణకు రక్తపరీక్షలు సైతం బయటకు రాస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల అత్యాశ వెరసి రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో పంచకర్మ విభాగంలో అనేక రకాల చికిత్సలు అందించే వారు. ఊబకాయం, మైగ్రేన్, నడుము నొప్పి, మెడనొప్పిలతో పాటు, వివిధ రకాల చర్మ వ్యాధులకు చికిత్సలు చేసేవారు. ఇప్పుడు పంచకర్మ విభాగం దాదాపు మూలనపడింది. అరకొరగా సేవలు అందిస్తున్నారు. పంచకర్మ చికిత్సలు చేసేందుకు అవసరమైన తైలాలు అందుబాటులో ఉండటం లేదు. అంతేకాకుండా నాల్గో తరగతి సిబ్బంది కొరత ఉండటంతో చికిత్సలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు నిరుత్సాహంగా తిరిగి వెళ్తున్నారు. ప్రజలకు విద్య, వైద్యం ఎంతో అవసరం. ప్రభుత్వాలు ఆ రెండు రంగాలను విస్మరించకూడదు. సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదం పట్ల నిర్లక్ష్యం చేయడం తగదు. ఇక్కడ మంచి వైద్యం అందుతుందని దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తున్నారు. కానీ మందులు సరిగా ఇవ్వకుండా బయట కొనుక్కోమనడం, దూది కూడా లేక పోవడం దురదృష్టకరం. ప్రభుత్వం స్పందించి, సౌకర్యాలు కల్పించాలి. – ఎండీ నాహిద్, లబ్బీపేట విజయవాడ వన్టౌన్కు చెందిన లక్ష్మీ నడుము నొప్పితో చికిత్స కోసం ఆయుర్వేద ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించి వైద్యులు ఆరు రకాల మందు లు రాశారు. చీటీ తీసుకుని ఫార్మసీ వద్దకు వెళ్లగా మూడు రకాలు చేతిలో పెట్టి, మిగిలినవి బయట కొనుక్కోమని ఉచిత సలహా ఇచ్చి పంపారు. విజయవాడ గాంధీనగర్కు చెందిన వెంకటేశ్వరరావు ఫిస్టులా సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు రెండు రోజులకోసారి డ్రెస్సింగ్ చేయాల్సి వస్తోంది. ఆస్పత్రిలో స్టెరిలైజ్డ్ దూది లేక పోవడంతో బయట కొనుక్కొని తీసుకెళ్తున్నాడు. అంతేకాదు కుట్లు వేసేందుకు సూది కూడా లేని పరిస్థితి ఉంది. ఇలా వీరిద్దరే కాదు ఆస్పత్రికి వచ్చే రోగుల్లో మూడొంతుల మంది సగం మందులు బయట కొనుగోలు చేయాల్సిన దయనీయ స్థితి నెలకొంటుంది. కూటమి ప్రభుత్వం ఆయుర్వేదంపై సవతిప్రేమ చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు. -
కొత్త వాటికి అనుమతి లేదు..
2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలో ఒక్క కొత్త ప్రైవేట్ పాఠశాలకు కూడా అనుమతి ఇవ్వలేదు. కొత్తగా ప్రారంభమవుతున్నట్లు ప్రచారం చేస్తున్న ఏ విద్యాసంస్థకూ అధికారిక అనుమతులు లేవు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్నట్లు మా దృష్టికి వచ్చిన విద్యాసంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. ప్రచార హోర్డింగులు, బోర్డులు వెంటనే తొలగించాలని స్పష్టంగా పేర్కొన్నాం. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అడ్మిషన్లు చేసేటప్పుడు సంబంధిత పాఠశాలల అనుమతుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. – యూవీ సుబ్బారావు, విద్యాశాఖాధికారి, కృష్ణా జిల్లా -
దుర్గమ్మను దర్శించుకున్న ఎన్హెచ్ఆర్సీ చైర్మన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సతీ సమేతంగా విచ్చేసిన జస్టిస్ రామ సుబ్రహ్మణియన్కు ఆలయ ఈవో శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. జస్టిస్ రామసుబ్రహ్మణియన్ దంపతులకు ఆలయ ఈవో అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
విద్యార్థులకు కార్పొరేట్ వల!
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో అనుమతులు లేని కార్పొరేట్ విద్యాసంస్థలు భారీగా అడ్మిషన్లు చేపడుతుండగా, వాటిని అడ్డుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోంది. ఇప్పటికే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని విద్యావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు చిన్న ప్రైవేట్ పాఠశాలలపై కఠిన నిబంధనలు అమలు చేస్తూ, మరోవైపు కార్పొరేట్ విద్యాసంస్థలకు సడలింపులు ఇస్తోంది. జిల్లాలో 196 ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి. కాగా కొత్తగా అనుమతులు లేని కొన్ని కార్పొరేట్ సంస్థలు టీడీపీ నేతలు అండతో నిర్భీతిగా అడ్మిషన్లు కొనసాగిస్తున్నాయి. అనుమతులు లేకుండానే అడ్మిషన్లు.. జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్తగా ఎలాంటి ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇవ్వలేదని అధికారులు చెబుతున్నప్పటికీ, కొత్త కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్న పరిస్థితి తల్లిదండ్రుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. మచిలీపట్నం రూరల్ మండలంలోని ధర్మక్షేత్ర ఇంటర్నేషనల్ స్కూల్, గూడూరు మండలంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వంటి సంస్థలు అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించాయి. ప్రభుత్వ ఒత్తిడి.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే విద్యాధికారులు మౌనం వహిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని విద్యావర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘సీబీఎస్ఈ’ పేరుతో ఆకర్షణ.. అనుమతులు లేకపోయినా ‘సీబీఎస్ఈ స్కూల్’ పేరు తో తల్లిదండ్రులను ఆకర్షిస్తూ యాజమాన్యాలు అడ్మి షన్లు చేపడుతున్నాయి. సీబీఎస్ఈ పాఠశాల అయినా జిల్లా విద్యాశాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరి అనే నిబంధన ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి అనుమతులు పొందాలంటే 2025 డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి చలాన్ చెల్లించి దరఖాస్తు చేయాలి. ఈ నిబంధనలో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని కొన్ని కార్పొరేట్ యాజమాన్యాలు భవన నిర్మాణం పూర్తికాక ముందే అడ్మిషన్లు ప్రారంభించాయి. వాస్తవానికి పాఠశాలకు పూర్తి స్థాయి భవనం, తరగతి గదులు, బోధనా సిబ్బంది, క్రీడా మైదానం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. కానీ ఈ నిబంధనలను పక్కన పెట్టి భారీ ప్రచారం చేస్తూ కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. ‘సీబీఎస్ఈ’ పేరిట అడ్మిషన్ల దందా! అనుమతులు లేకుండానే దోపిడీకి శ్రీకారం జిల్లా విద్యాశాఖ ఎన్ఓసీ తప్పనిసరైనా పట్టించుకోని వైనం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
నూతన కార్యవర్గం ఎన్నిక
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి వివిధ సేవా టికెట్లు ద్వారా రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ స్వామివారి సేవా టికెట్ల ద్వారా రూ.4,64,890, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,51,980, నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా రూ.1,10,395, శాశ్వత అన్నదానం ద్వారా రూ.1,24,368, స్వామివారి కల్యాణ కట్ట ద్వారా రూ.24,080, స్వామివారి దర్శన టికెట్ల ద్వారా రూ.45,800 తదితరాలు కలిపి మొత్తం రూ. 9,57,703 ఆదాయం వచ్చినట్లు వివరించారు. గుణదల(విజయవాడ తూర్పు): విద్యార్థులు క్రీడారంగంలో సైతం ప్రావీణ్యం పెంపొందించుకోవాలని లయోల ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఫాదర్ జోజిరెడ్డి అన్నారు. కళాశాల ఆవరణలో ఆదివారం చతురంగ–2026 పేరుతో చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. యూత్ ఎంపవరింగ్ సర్వీస్, చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన 148 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం ద్వారా విద్యార్థుల్లో మానసిక ఎదుగుదల, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. నగరానికి చెందిన 3 ఏళ్ల 11 నెలల చిన్నారి ఇవాన్ ఈ పోటీలలో పాల్గొని, గెలిచి అందరినీ ఆకట్టుకున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం టోర్నమెంట్లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఏపీ చెస్ అసోసియేషన్ సెక్రటరీ రాజీవ్, ఫాదర్ బాల బొల్లినేని, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పార్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల్లోనే అతిసార బాధితులు
● వివిధ ఆస్పత్రుల్లో 17 మందికి చికిత్స ● రోగులను పరామర్శించిన డీఎంహెచ్ఓ లబ్బీపేట(విజయవాడతూర్పు): నందిగామ మండలం చందాపురంలో శనివారం సోకిన అతిసార అదుపులోకి వచ్చినట్లు ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ఆమె ఆదివారం అతిసార సోకిన చందాపురంతో పాటు, వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. చందాపురంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ఆదివారం స్వల్ప విరేచనాలతో ముగ్గురు రాగా, వారికి అవసరమైన చికిత్స అందించినట్లు తెలిపారు. కాగా 17 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆమె వివరించారు. వారిలో నందిగామ ఏరియా ఆస్పత్రిలో 10మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరుగురు, విజయవాడ జీజీహెచ్లో ఒకరు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. వారికి అందుతున్న వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలి.. ప్రజలు ఒకటి, రెండు సార్లకు మించి విరేచనాలు, వాంతులు అయితే వెంటనే వైద్య సిబ్బందికి తెలిపి సత్వర చికిత్స పొందాలని డీఎంహెచ్ఓ సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కాకుండా, వేడి ఆహార పదార్థాలను తినాలని, క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. డోర్టు డోర్ సర్వే.. వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి డోర్ టు డోర్ సర్వే చేస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. అక్కడ సాధారణ పరిస్థితి వచ్చే వరకూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇంధుమతి, డాక్టర్ నవీన్, డాక్టర్ సునీల్, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
లోక రక్షకా.. హోసన్నా
గుణదల(విజయవాడ తూర్పు): సర్వ మానవ పాప పరిహారార్థమై జనియించిన లోక రక్షకుడైన క్రీస్తును ప్రతి ఒక్కరూ విశ్వసించి కీర్తించాలని గుణదల మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. పుణ్యక్షేత్ర ఆవరణలో మట్టల ఆదివారం సందర్భంగా ప్రత్యేక సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవాళినీ సన్మార్గంలో నడిపించేందుకు ఏసుక్రీస్తు ప్రయత్నించారని, ఆయనను విశ్వసించి దేవుని నియమాలను పాటించిన వారికి శాంతి, సమాధానాలు లభిస్తాయన్నారు. మానవాళి రక్షణ కోసం ఏసుక్రీస్తు చేసిన సిలువ త్యాగాన్ని గుర్తించాలన్నారు. అనంతరం పుణ్యక్షేత్ర ప్రధానాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. భక్తులకు దివ్య సత్ప్రసాదాన్ని అందజేశారు. అటుపై పుణ్యక్షేత్ర గురువులు, విశ్వాసులు మట్టలను చేతపట్టి గుణదల పుర వీధులలో పవిత్ర యాత్ర నిర్వహించారు. ఈత మట్టలు చేతపట్టుకొని హోసన్నా.. ఏసన్నా.. రాజుల రాజ నీకే జయం.. శాంతి ప్రదాత నీకే స్తోత్రం.. అంటూ నినాదాలు చేస్తూ క్రైస్తవ విశ్వాసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో మట్టల ఆదివారం ప్రార్థనలు -
కార్మిక పక్షపాతి వైఎస్ జగన్
● వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి ● ఘనంగా ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం మధురానగర్(విజయవాడసెంట్రల్): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. స్థానిక సత్యనారాయణపురం ఫుడ్ జంక్షన్లో శనివారం వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం సుమారు 80 సంఘాలతో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ బలోపేతమయిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దర్జీలు, ధోబీలు, ఆటో డ్రైవర్లు వంటి వివిధ చేతివృత్తుల కార్మికులకు ఏడాదికి రూ.10,000 నేరుగా లబ్ధి చేకూరిందని అన్నారు. యానిమేటర్ల వేతనాన్ని గత ప్రభుత్వం రూ.3,000 నుంచి రూ.10,000 కు పెంచారని, పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.8,000 నుంచి ఏకంగా రూ.21,000కు ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, ఫ్యాక్టరీల ద్వారా మరో 34 లక్షల మందికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధి కల్పించారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, కార్మిక వర్గాల సంక్షేమం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని గౌతం రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, జోనల్ ఇన్చార్జ్ ఎన్.రాజారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ విశ్వనాథ రవి, రవీంద్ర రెడ్డి, బత్తుల గోవింద్, సామంతపూడి చిన్న, దుర్గాప్రసాద్, ప్రభు, వర్మ, కమ్మిలి రత్నకుమార్, బి.కిషోర్ పాల్గొన్నారు. -
గ్రామ వ్యవసాయ సహాయకులకు రీ–కౌన్సెలింగ్
చిలకలపూడి(మచిలీపట్నం): కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులకు శనివారం రీ–కౌన్సెలింగ్ నిర్వహించారు. గత సంవత్సరం జూలై నెలలో జరిగిన కౌన్సెలింగ్లో తమకు అన్యాయం జరిగిందని గ్రామ వ్యవసాయ సహాయకులు హైకోర్టును ఆశ్రయించటంతో కోర్టు రీ–కౌన్సెలింగ్ నిర్వహించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.పద్మావతి ర్యాంకుల ఆధారంగా సీనియార్టీ జాబితా ప్రకటించి వారికి రీ–కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో 103 మంది పాల్గొన్నారు. కమిటీ సభ్యులు ఎన్టీఆర్ వ్యవసాయాధికారి విజయకుమారి, ఏలూరు జిల్లా ఏడీ వెంకటమణి, ఆచార్యులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్బీఐ ఎస్జీఎస్పీ చెక్కుల పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని వీఎంసీ అదనపు కమిషనర్(జనరల్) ఎ.రవీంద్రరావు అన్నారు. వీఎంసీ ప్రాంగణంలోని ఎస్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ అమలు చేస్తున్న ఎస్బీఐ ఎస్జీఎస్పీ (స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్) గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం లబ్ధిదారులకు శనివారం ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణాల వల్ల మృతి చెందితే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ఆలంబన ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి వారి వేతనాలు జమయ్యే ఎస్బీఐ బ్రాంచ్లో ఈ పథకం అమలులో ఉంటుందని, ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వీఎంసీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన ఐదుగురు పబ్లిక్ హెల్త్ వర్కర్స్, ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక శానిటరీ మేసీ్త్ర, కుటుంబ సభ్యులకు వారి బీమా పరిహారపు చెక్కులు అందించారు. ఎస్బీఐ వీఎంసీ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకం కింద రిటైర్మెంట్ వరకు బీమా రక్షణ ఉంటుందని, ఈ బీమా కవరేజ్ పూర్తి ఉచితంగా, ఎటువంటి ప్రీమియం లేకుండా అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వీఎంసీ అకౌంట్స్ ఆఫీ సర్ బి.ఎస్.ఎన్.మూర్తి, చీఫ్ మేనేజర్ (డిపాజిట్స్ – వీఏఎస్) ఎం.భాస్కర్ రావు, వీఎంసీ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శివరాం పాల్గొన్నారు. -
సోషల్ మీడియా శక్తిమంతమైన ఆయుధం
● గ్రామ స్థాయి నుంచి వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యం ● సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ పెనుగంచిప్రోలు: డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఒక శక్తిమంతమైన సాధనమని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. స్థానిక మునేరు అవతల స్నేహ గార్డెన్స్లో శనివారం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో మొదటిగా పార్టీ సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అవినాష్ మాట్లాడుతూ ఏ వ్యవస్థ అయినా సమర్ధంగా పనిచేయాలంటే అందుకు తగిన కచ్చితమైన, పటిష్టమైన నిర్మాణం ఉండాలన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కన్వీనర్ల నియామకం చేపట్టామన్నారు. కూటమి నాయకులు ప్రతిపక్ష పార్టీ కుటుంబసభ్యులపై కూడా దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండించాలన్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి భయపడొద్దు... సోషల్ మీడియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీకి సోషల్ మీడియా వెన్నెముకగా పనిచేస్తోందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు అత్యంత దారుణంగా పోస్టులు పెడుతున్నారని, మనం ఆ విధంగా పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదని, మన నాయకుడు చేసిన మంచిని, ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిని సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సోషల్ మీడియా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు పడిగపాటి చైతన్య రెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏలూరి శివాజీ, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి పసుపులేటి సత్యశ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సాయిరాం, నియోజకవర్గ పరిశీలకుడు ఆళ్ల చెల్లారావు, తిరుపతి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, తిరుపతి ఉత్తర మండల అధ్యక్షుడు బృంగి నవీన్, పార్టీ బీసీ, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బత్తుల రామారావు, కన్నమాల శామ్యూల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపత విజిత, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు అంబోజి నవీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా నవీన్ పాల్గొన్నారు.లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం 2028లోపు శాశ్వత రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెబుతున్నారని, మళ్లీ దానిని మారుస్తారనే ప్రచారం ఎందుకని వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం పేరిట డ్రామా ఆడుతున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉందని, రాజధాని పనులను అడ్డుకునే వారు కూడా లేరన్నారు. కానీ రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు అప్పులు తెచ్చి అవినీతి చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి బయటపడుతుందనే భయంతోనే అసెంబ్లీ తీర్మానాల పేరిట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని, భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకోలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు లక్ష్యం రాజధాని నిర్మాణం కాదని, దాని పేరుతో సంపదను తన అనుచరులు, బినామీలకు దోచిపెట్టడమేనని విమర్శించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కోడూరుపాడులోని ఎన్జీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు శనివారం మాక్డ్రిల్ నిర్వహించాయి. జి.కొండూరు: సున్నా పెట్టుబడి.. నిత్యం ఆదాయం.. ఆపై ఉపాధి కల్పన అంటూ గొప్పగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సాహం అందించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జీరో పెట్టుబడితో ఉద్యాన సాగు అంటూ స్వల్ప కాల పంట లను సాగు చేసే రైతులను సైతం ఉద్యాన సాగు వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్స హించింది. అప్పులు చేసి ఉద్యాన సాగుపై పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ ఏడాది మెటీరియల్ నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వచ్చే ఏడాది ఉద్యాన సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో... జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎన్టీఆర్ జిల్లాలో 1,307 మంది రైతులు 2,500 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేశారు. అయితే ఈ సాగుకు 2025–28 వరకు మూడేళ్ల కాలానికి కూలీల ఖర్చు కింద రూ.1,170.23 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.507.02 లక్షలు మంజూరు చేశారు. మొదటి ఏడాది 2025–26 సంవత్సరానికి కూలీల ఖర్చు కింద రూ.257.16 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.109.86 లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే మెటీరియల్ ఖర్చుకు సంబంఽధించిన నిధులను ఒక్కరూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కూలీల ఖర్చు నిధులను 20 శాతం ఇంకా విడుదల చేయలేదని సమాచారం. ఇదే కాకుండా 2024–25 సంవత్సరానికి సాగు చేపట్టిన రైతులకు ఈ ఏడాది విడుదల కావాల్సిన నిర్వహణ ఖర్చులు సైతం 20 శాతానికి పైగా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని నమ్మి అప్పులు చేసి సాగు చేపట్టిన రైతులు రాయితీ నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. పథకం ఇలా... ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వందశాతం రాయితీతో ప్రోత్సహిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు మూడేళ్ల కాల పరిమితితో విడతల వారీగా నిర్వహణ ఖర్చులను విడుదల చేస్తారు. పండ్ల తోటలకు ఒక రైతుకు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు సాగు చేపట్టేందుకు ఈ పథకంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అయితే డ్రాగన్, గడ్డి, గట్లు వెంబడి మొక్కల పెంపకానికి గరిష్టంగా ఎకరం వరకు ఆర్థికసాయాన్ని అందిస్తారు. ఈ విధంగా సాగు చేపట్టిన రైతులు ఉపాధి హామీ పనులకు వెళ్లకుండా తమ తోటలోనే ఏటా వంద రోజులు పనిదినాలు పొందే అవకాశం ఉంటుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యాన సాగు చేపట్టిన రైతులకు పెట్టుబడి నిధులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతో రైతులు అప్పులు చేసి పెట్టుబడులకు వెచ్చించారు. ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పితే ఉద్యాన సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. కూలీల నిధులను వెంటనే విడుదల చేయాలి. – కోట కల్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి I2025–26 ఏడాదికి ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు అందాల్సిన నిధులు ఇలా.. మండలం రైతులు కూలీల ఖర్చు మెటీరియల్ ఖర్చు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) ఎ.కొండూరు 133 33.20 7.86 చందర్లపాడు 73 12.52 11.21 జి.కొండూరు 53 7.76 3.92 గంపలగూడెం 65 11.73 2.91 ఇబ్రహీంపట్నం 28 5.43 2.83 జగ్గయ్యపేట 56 9.39 6.73 కంచకచర్ల 44 5.67 3.84 మైలవరం 168 35.93 19.45 నందిగామ 77 11.56 4.49 పెనుగంచిప్రోలు 61 7.43 5.61 రెడ్డిగూడెం 139 29.86 7.99 తిరువూరు 94 19.29 10.35 వత్సవాయి 75 13.38 7.33 వీరులపాడు 66 16.23 6.46 విజయవాడరూరల్ 32 6.00 2.85 విస్సన్నపేట 143 31.79 6.03 విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది. -
ముగిసిన వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించు కుని దేవస్థానం తరఫున అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. గులాబీలు, చామంతులు, మల్లెలు, విరజాజులు, తామర పూలు, కాగడాలతో ఆలయ అర్చకులు అమ్మవారికి పుష్పార్చన జరిపించారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని ఆలయ వైదిక కమిటీ నిర్వహించింది. స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. భవానీపురం(విజయవాడపశ్చిమ): స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు తయారయ్యే ప్రదేశంలోనే వాటిని వేరు చేయడం ద్వారా గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సూచించారు. గొల్లపూడిలోని స్వర్ణ వార్డ్ వద్ద శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర –స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రాంగణంలో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేయించారు. ఇంటి నుంచి తడి–పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడంలో కృషి చేసినవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీపీఓ లావణ్య కుమారి, మండల పరిషత్ అధికారి కె.పార్థసారథి, డెప్యూటీ ఎంపీడీఓ మన్నే దుర్గ వరప్రసాద్, గ్రామ పెద్దలు బొమ్మసాని సుబ్బారావు, నూతులపాటి వెంకటేశ్వరరావు, ఎన్.బాల కోటేశ్వరరావు, బి.తిరుపతిరావు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన దేవి నేని రామకృష్ణ, కనకదుర్గాంబ అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులకు నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం అందచేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సముద్రాల వీరభద్రరావు, శ్రీలత అమ్మ వారి నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మ వారి దర్శనం, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
ఘంటసాలలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
ఘంటసాల: దేశంలోని ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం వంటి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని అంబే డ్కర్ మనవడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్ రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. ఘంటసాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు ఉప్పులేటి దేవీప్రసాద్తో కలసి ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పల్లె, నగరంలో అంబేడ్కర్ విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య మాట్లా డుతూ.. ఎస్సీలు క్రైస్తవులైతే ఎస్సీ రిజర్వేషన్లు చెల్లవంటూ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. ఢిల్లీస్థాయిలో గొంతు వినిపించి ఎస్సీలకు రక్షణ కల్పించాలన్నారు. ముందుగా ఘంటసాల వారసత్వ విగ్రహాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సభావేదిక వద్ద బౌద్ధ సంప్రదాయాలతో భంతే ధమ్మ ధజ థెరో ప్రత్యేక పూజలు చేసి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు వేమూరి వెంకట్రావు, వేమూరి ప్రవీణ్, నలకుర్తి సురేష్, జుజ్జువరపు భాగ్యారావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పంత గాని రమేష్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్, తూమాటి బసవ సుధాకర్, కోటే రామ్నాథ్, గద్దె కోటినాగులు, ఏపీ న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ వెలగపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ కాలువలో పడి యువకుడి దుర్మరణం
తిరువూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి కాలువలో పడిన సంఘటనలో తిరువూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ శాతకర్ణి తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు 12వ వార్డుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నల్లబోతుల సూర్యకుమార్(25) ద్విచక్ర వాహనంపై బైపాస్ రోడ్డు నుంచి సుందరయ్య కాలనీ మీదుగా మధిర రోడ్డు వెళుతూ పక్కనే ఉన్న తిరువూరు మేజరు నాగార్జున సాగర్ కాలువలో జారి పడిపోయాడు. రాత్రివేళ ఎవరూ గుర్తించకపోవడంతో నీట ముని గి ఊపిరాడక చనిపోయా డు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమార్ మృతదేహానికి తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు. -
బీబీఏ అధ్యక్షుడిగా విష్ణుభొట్ల ఏకగ్రీవ ఎన్నిక
విజయవాడలీగల్: బెజవాడ బార్ అసోసియేషన్ 2026–2027 ఎన్నికలకు నామినేషన్లు దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికలు ఈ నెల 31వ తేదీన జరగనున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సీనియర్ న్యాయవాది విష్ణుభొట్ల లక్ష్మీనారాయణ ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ముఖ్య ఎన్నికల అధికారి డీపీ రామకృష్ణ ప్రకటించారు. సాంస్కృతిక కార్యదర్శి పదవికి, ఈసీ కేటగిరీలో 30 ఏళ్లు పైబడిన, 20 ఏళ్లు, 10 ఏళ్లు పైబడిన మహిళల కేటగిరీలో ఒక్కో నామినేషన్ మాత్రమే అందడంతో వారు కూడా ఎన్నికై నట్లు ప్రకటించారు. 10 ఏళ్లు పైబడిన కేటగిరీలో 8 మంది సభ్యులను ఎన్నుకోవలసి ఉండగా, ఇరువురు అభ్యర్థులు ఉపసంహరించుకోగా మిగిలిన 8 మంది, పదేళ్ల కేటగిరీలోని పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు రామకృష్ణ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి, జాయింటు సెక్రటరీ, లైబ్రేరియన్, ఇతర పదవులకు పోటీచేసే అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోనందున పోటీ అనివార్యమైంది. -
కలుషిత ఆహారంతో 28 మందికి అస్వస్థత
నందిగామ టౌన్: శ్రీరామ నవమి వేడుకల్లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వాంతులు, విరేచనాలతో పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్, ఇతర అధికారులు పరామర్శించారు. సేకరించిన సమాచారం మేరకు.. నందిగామ మండలం చందాపురం గ్రామంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. భోజనం తిన్న వారిలో 28 మంది అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలతో శనివారం తెల్లవారుజామున నందిగామ పట్టణంలోని ఆస్పత్రిలో చేరారు. వారిలో 20 మంది డిశ్చార్జ్ కాగా మరో ఎనిమిది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీశ, వైద్యారోగ్య, ఫుడ్ సేఫ్టీ, తదితర శాఖల ఉన్నతాధికారులు శనివారం గ్రామానికి చేరుకున్నారు. భోజనాలు, శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. భోజనానంతరం ఆర్వో నీటిని తాగినట్లు తెలిసిందని, ఘటనకు కారణాలను తెలుసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. నీరు, భోజన శాంపిళ్లను ల్యాబ్లకు పంపామన్నారు. కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్వో ఇందుమతి, ఆర్డీవో పోశిబాబు, మున్సి పల్ కమిషనర్ లోవరాజు, తహసీల్దార్ సురేష్బాబు, సీఐ వైవిఎల్ నాయుడు, గ్రామ నాయకులు చిరుమామిళ్ల శ్రీనివాసరావు, బొగ్గవరపు రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
అత్యధిక పాల సేకరణ ధర ఘనత విజయ డెయిరీదే
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దేశంలో అత్యధిక పాల సేకరణ ధర, పాడి రైతులకు బోనస్ అందిస్తున్న ఘనత కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)ది అని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ 36వ సర్వ సభ్య సమావేశం శని వారం పాలప్రాజెక్టు ఆవరణలోని ఫంక్షన్ హాల్లో జరిగింది. యూనియన్ మాజీ చైర్మన్ మండవ జానకీ రామయ్య చిత్రపటానికి చైర్మన్, ఎండీ, సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది యూనియన్ బోర్డు, సంస్థ ఉద్యోగులు సంయుక్త కృషితో సాధించిన వివరాల గురించి చైర్మన్ సభ్యులకు వివరించారు. సమావేశం అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. పాడి రైతులు ఆర్థికంగా నిలబడటమే కాకుండా వారికి తోడ్పాటును అందించాలనే కృత నిశ్చయంతో పాల సేకరణ ధరను రూ.30 పెంచి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆవుపాల ధరను లీటర్కు రూ.20 పెంచేందుకు సర్వ సభ్య సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లించబోతుందన్నారు. పాడి రైతులకు బోనస్గా రూ.15 కోట్లు డిసెంబర్ నుంచి మార్చి వరకు పాడి రైతులకు బోనస్గా రూ.15 కోట్లు చెల్లిస్తామని చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.45 కోట్లు బోనస్గా రైతులకు చెల్లించామన్నారు. గత ఏడేళ్లలో కృష్ణా మిల్క్ యూనియన్ రూ.716 వార్షిక టర్నోవర్ను రూ.1,265 కోట్లకు పెంచామని, రూ.96 కోట్ల సమితి మిగులు నిధులను రూ.250 కోట్లకు చేర్చామని వివరించారు. సమితి స్థిరాస్తులను రూ.64 కోట్ల నుంచి రూ.320 కోట్లకు పెంచామన్నారు. వీరవల్లిలోని యూనియన్ కొత్త యూనిట్కు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు సబ్సిడీ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సమితి పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, సంఘ అధ్యక్షులు, సమితి అధికారులు పాల్గొన్నారు. -
శ్రీరామనవమి అన్నదానంలో ఫుడ్ పాయిజన్ కలకలం
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం చందాపురం గ్రామంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. కమిటీ వారు నిన్న ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలు, టిఫిన్లు ఏర్పాటు చేశారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత గ్రామస్థులు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే సుమారు 50 మంది గ్రామస్థులను అత్యవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. కాగా జరిగిన ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, కలెక్టర్ దర్యాప్తు ప్రారంభించారు. వంటకు ఉపయోగించిన సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపనున్నారు. ఇటీవల రాజమండ్రి కల్తీ పాల ఘటన జరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పండుగ సందర్భంగా నిర్వహించిన అన్నదానం ఇలా విషాదానికి దారితీసినందుకు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ల్యాబ్ నివేదికల ఆధారంగా ఫుడ్ పాయిజన్కు కారణం ఏమిటో త్వరలో వెల్లడించనున్నారు. -
ఈనాడు పత్రికపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: ఈనాడు పత్రికపై పోలీసులకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్ట దెబ్బతీసేలా ఈనాడు పత్రికలో కార్టూన్ ప్రచురించారని.. ఈనాడు పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేశారు. జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
దుర్గగుడిలో అంతర్గత బదిలీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అంతర్గత బదిలీలు చేస్తూ ఆలయ ఈవో శీనానాయక్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ల స్థాయి నుంచి అవుట్ సోర్స్ సిబ్బంది వరకు బదిలీలు నిర్వహించడం గమనార్హం. జూనియర్ అసిస్టెంట్ వి.జగన్నాధరావు, డీవీఎన్ రాజు, వైవీఎన్ దుర్గాప్రసాద్, ఎ.నాథూరాం, సీహెచ్ రమేష్బాబు, ఆర్.శ్రీలత, పి.కోటేశ్వరమ్మ, ఎ.శుభాకర్ బదిలీ అయ్యారు. ఇక రికార్డు అసిస్టెంట్స్ పి.శ్రీనివాసులు, ఎం.మనోహర్, ఎన్.గంగాధర్, పి.రవికుమార్, ఎం.పద్మ, కె.జయ, జి.చిన్న, పీజీ రాజు, ఏకేడీ శివకుమార్, పి.ప్రసాద్ బదిలీ అయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు అటెండర్లు, స్వీపర్లు, కండక్టర్లు, ఎన్ఎంఆర్లకు సైతం బదిలీలు జరిగాయి. పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్, ఓల్గా మెమోరియల్ నేషనల్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2300 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్లు పాల్గొంటున్నారు. పోటీలు ఏప్రిల్ 7వరకు కొనసాగుతాయి.రెడ్డిగూడెం: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్దం కావడంతో ఓ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శ్రీరామపురం గ్రామానికి చెందిన బడిపాటి జమలయ్య(68) తన పూరింట్లో నిద్రిస్తుండగా గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న జమలయ్య సజీవదహనం అయినట్టు ఎస్ఐ ఎస్.శ్రీను తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతుడి మనవడు బడిపాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): బీరువాలో భద్రపరిచిన నగదుతో పాటు బంగారు, వెండి నగలు చోరీకి గురైన సంఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక, మంటాడవారి వీధిలో ఒక ఇంటిలో నూలు వెంకట దుర్గారావు, తన తల్లి, సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను పని మీద గురువారం బయటకు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీసి ఇంట్లోకి వెళ్లి మరలా తలుపు వేసి గడియ మాత్రం పెట్టలేదు. అప్పటికే తల్లి, సోదరుడు భోజనం చేసి నిద్రపోయారు. అతను కూడా భోజనం చేసి నిద్రపోయాడు. ఉదయం 6 గంటలకు దుర్గారావు తల్లి నిద్రలేచి చూడగా బీరువా తలుపులు తీసి లోపల చిందరవందరగా ఉండడాన్ని గమనించింది. వెంటనే నగదు, నగలు చూసుకోగా కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి లోపలకు ప్రవేశించి బీరువాలో దాచిన నగదు, బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ.2లక్షలు ఉంటుందని దుర్గారావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పామర్రు: భార్యాభర్తల మధ్య మనస్పర్థల నేపథ్యంలో వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక చాట్లవానిపురానికి చెందిన చాట్ల శిరీష(19) సుమారు పది నెలల క్రితం పామర్రుకు చెందిన బాబా సాహెబ్ను ప్రేమ వివాహం చేసుకుంది. బాబా సాహెబ్ ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది కాలంగా ఆటోకు సక్రమంగా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయమై భార్యా భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. వేధింపులు తాళలేక శిరీష గురువారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని మృతి చెందింది. ఘటనా స్థలానికి గన్నవరం డీఎస్పీ శ్రీనివాస్ చేరుకుని స్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. శిరీష తండ్రి చాట్ల చిన్న అర్జున్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాబా సాహెబ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పామర్రు సీఐ సుభాకర్ పాల్గొన్నారు. -
సీతారాముల కల్యాణోత్సవంలో డీసీపీ దంపతులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహాత్మాగాంధీ రోడ్డులోని పోలీస్ క్వార్టర్స్లో ఉన్న సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో డీసీపీ కృష్ణకాంత్ పటేల్ సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేయగా, ఇతర అధికారులు పాల్గొన్నారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ దంపతులు వేదమంత్రోచ్చరణ నడుమ సంప్రదాయ పద్ధతిలో స్వామి వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహ మూర్తులకు వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీలు కేజీవీ సరిత, బి.లక్ష్మీనారాయణ, కృష్ణప్రసన్నలతో పాటు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది, రామాలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఏఆర్ క్వార్టర్స్ రామాలయంలో ఘనంగా నిర్వహణ -
ఇంద్రకీలాద్రిపై సీతారాముల కల్యాణం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక శ్రీరామ కల్యాణోత్సవానికి వేదికై ంది. తొలుత ఆలయ ప్రాంగణం నుంచి శ్రీ సీతారామ లక్ష్మణ స్వామి వారి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కళావేదిక వరకు ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ దంపతులు స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ ఉప ప్రధాన అర్చకుడు కోట ప్రసాద్, ముఖ్య అర్చకుడు ఆర్. శ్రీనివాసశాస్త్రి, వేద పండితుల బృందం కల్యాణ క్రతువును జరిపించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో ఆలయ అర్చకులు స్వామి వారి తరఫున మాంగల్యధారణ జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు స్వామి వారికి తలంబ్రాలను సమర్పించారు. కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు తరలిరాగా, వారికి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు స్వామి వారి కల్యాణ తలంబ్రాలు, వడపప్పు, పానకంను ప్రసాదాలుగా పంపిణీ చేశారు. నేడు శ్రీరామ పట్టాభిషేకం శనివారం ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్ద శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని కోరారు. దుర్గమ్మ సన్నిధిలో మైలవరపు ఆధ్యాత్మిక ప్రవచనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం వసంత నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని భాషా ప్రవీణ, సంస్కృత భాషా ప్రచారకుడు మైలవరపు లక్ష్మీ నరసింహ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళా వేదికపై త్రిశక్తి వైభవం, శ్రీరామ నవమి విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో రామకథను వినడం భక్తులకు కనువిందుగా నిలిచిందని, అమ్మవారి భక్తికి, రాముని ధర్మానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని లక్ష్మీ నరసింహ తన ప్రసంగంలో చక్కగా విశ్లేషించారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, శంకర శాండిల్య మైలవరపు లక్ష్మీ నరసింహను శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. దుర్గమ్మను దర్శించుకున్న తాప్సీ ఉపాధ్యాయ దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు బుల్లెట్పై భారతదేశ యాత్ర చేస్తున్న తాప్సీ ఉపాధ్యాయ శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన తాప్సీ ఉపాధ్యాయకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డు సభ్యులు శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. -
దళిత సమస్యలపై నిర్మాణాత్మక సంస్కరణల ఆవశ్యకత
పటమట(విజయవాడతూర్పు): ఆంధ్రప్రదేశ్లో దళిత సముదాయాలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక, నిర్మాణాత్మక సవాళ్లపై తక్షణ చర్య తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(బీఏ) జాతీయ అధ్యక్షుడు భీమ్రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత, గౌరవం సాధించడంలో గణనీయమైన అంతరాలు ఇంకా కనిపిస్తున్నాయన్నారు. భూమి హక్కులు జీవనోపాధి భద్రత రాష్ట్రంలో స్పష్టంగా కన్పిస్తోందని, దళితులు భూమి లేని వారు లేదా డి–ఫారం పట్టాలపై ఆధారపడి ఉన్నారన్నారు. అత్యాచార చట్టాల అమలు ఎస్సీ,ఎస్టీ (అత్యాచార నివారణ) చట్టం కింద కేసులు నమోదవుతున్నప్పటికీ, పరిశోధనలో ఆలస్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనం అందించినప్పటికీ, నైపుణ్య అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టిసారించటంలేదన్నారు. దళిత విద్యార్థులు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు పోటీ అవకాశాలలో అసమానతలను ఎదుర్కొంటున్నారన్నారు. దళితులు ఎన్నికై న సంస్థల్లో ప్రాతినిధ్యం పొందినప్పటికీ, ప్రభావవంతమైన నిర్ణయాధికారం పరిమితంగా మారుతోందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవీ ప్రసాద్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఆర్పీఐ(బీఏ) అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉందని, దీన్ని తమ పార్టీ భర్తీ చేస్తుందని చెప్పారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(బీఏ) జాతీయ అధ్యక్షుడు భీమ్రావ్ యశ్వంత్ అంబేడ్కర్ -
డివైడర్ను ఢీకొని బైకిస్టు మృతి
కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మేడికొండ అన్వేష్(27), జెట్టి అజయ్(17), మేడికొండ అఖిల్బాబు (15), పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన ఈదులమూడి రాజ్కుమార్(24) స్నేహితులు. అజయ్, అఖిల్బాబు ఐటీఐ చదువుతుండగా అన్వేష్ పెయింటర్గా పనిచేస్తుంటాడు. రాజ్కుమార్ గుండిమెడలోని సోదరి ఇంటిలో ఉంటూ పెయింటింగ్ పనులకు వెళ్తుంటాడు. వీరు నలుగురు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సెల్ఫోన్ రిపేరు నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై గుండిమెడ నుంచి గవర్నర్పేటలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్కు బయలుదేరారు. ద్విచక్ర వాహనాన్ని రాజ్కుమార్ నడుపుతుండగా వెనుక అజయ్, తర్వాత అఖిల్, ఆ తర్వాత అన్వేష్ కూర్చున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వారధి దాటి ట్రాఫిక్ సబ్ కంట్రోల్ సమీపానికి చేరుకోగానే అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో నలుగురు కింద పడిపోయి రోడ్డుకు గుద్దుకున్నారు. అన్వేష్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ ముగ్గురిని అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం, అన్వేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
లారీ ఢీకొని సైక్లిస్టు దుర్మరణం
గుడివాడరూరల్: లారీ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం బేతవోలు నిమ్మతోటకు చెందిన జంగం తంబియ్య(49) ప్రతిరోజు మాదిరిగానే సైకిల్పై కోతిబొమ్మ సెంటర్లో ఉన్న చర్చికి వెళ్తుండగా వెనుకనుంచి వేగంగా దూసుకువచ్చిన లారీ ఢీకొట్టడంతో తంబియ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి స్వస్థలం ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామం కాగా గత మూడు నెలల నుంచి బేతవోలు ఏరియాలో నిమ్మతోటలో నివసిస్తూ ఇంటి వద్దనే కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగానే కోతిబొమ్మ సెంటర్లో చర్చికి వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగిరాని లోకాలకు చేరడంతో భార్య, కుమార్తెలు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్–1 ఎస్ఐ లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని స్టేషన్కు తరలించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు శుక్రవారం విరాళాలు అందించారు. విజయ వాడ అజిత్సింగ్నగర్కు చెందిన ఎం. శివరామ ప్రసాద్, రమాదేవి కుటుంబ సమేతంగా ఆలయ అధికారులను కలిసి రూ.1,01,116, విజయవాడ చుట్టుగుంటకు చెందిన డాక్టర్ రాజీవ్, ప్రశాంతి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. మోపిదేవి: భక్తులకు మరింత సేవలు అందించేందుకు మూడు కియోస్క్ మిషన్లు అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు శుక్రవారం వెల్లడించారు. మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో కరూర్ వైశ్యా బ్యాంకు వారు అందించిన మూడు కియోస్క్ మిషన్లను ఆలయ ప్రధానార్చకుడు బుద్ధు పవన్కుమార్ శర్మ బ్రహ్మత్వంలో శుక్రవారం ఉదయం పూజలు, హారతులు అందించి సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ ఈ మిషన్ల ద్వారా భక్తులు టికెట్ కౌంటర్ల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించకుండా నేరుగా సేవా టికెట్లు పొందడం, ఈ–హుండీ ద్వారా విరాళాలు సమర్పించడం, దేవస్థానానికి సంబంధించిన వివిధ సమాచారాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందని వివరించారు. ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, కరూర్ వైశ్యా బ్యాంకు అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధుల క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు మధ్యప్రదేశ్పై 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు రోజులుగా స్థానిక అరండల్పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంధుల క్రికెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంధుల క్రికెట్ ఇన్క్ల్లూజివ్ ఛాలెంజర్స్ ట్రోఫీ‘ టీ20 బైలేటరల్ సిరీస్ను ఆంధ్ర జట్టు ఏకపక్ష విజయాలతో నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్స్లో జట్టు సమష్టిగా ఆడి విజయం నమోదు చేసింది. పోటీతత్వం భేష్.. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ పోటీతత్వం ముందు అంధత్వం ఓటమి చెందిందన్నారు. యువ క్రీడాకారులకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ‘దృష్టి లోపం ఉన్నా, గుండె నిండా ధైర్యంతో మైదానంలో ప్రదర్శించిన పోరాట పటిమ అద్భుతమన్నారు. అనంతరం విజేతలతో పాటు రన్నర్స్కు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. అంతర్జాతీయ అంధుల మాజీ క్రికెటర్ అజయ్కుమార్రెడ్డి, ఎస్బీఐ డీజీఎం. కృష్ణకుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణప్ప, ఏఐబీఓసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయకుమార్, వీసీవైఏ అధ్యక్షుడు ఎల్.రత్నరాజ్ పాల్గొన్నారు. -
ఎన్నాళ్లో వేచిన ఉదయం!
● పాగోలులో 70 ఏళ్ల తర్వాత సీతారాముల కల్యాణం ● జెడ్పీటీసీ సభ్యురాలు కల్యాణి, శివప్రసాద్ దంపతుల చొరవతో సాధ్యమైందన్న గ్రామస్తులు చల్లపల్లి: దాదాపు 70 ఏళ్ల తరువాత ఆ గ్రామంలో సీతారాముల కల్యాణం శుక్రవారం కనుల పండువగా జరిగింది. సాధారణంగా రామాలయం లేని ఊరు ఉండదంటారు. కానీ ఇక్కడ ఆలయం ఉన్నా ఇప్పటి వరకూ ఎటువంటి ఉత్సవాలకు నోచుకోకపోవడం గమనార్హం. అదే చల్లపల్లి మండల పరిధిలోని పాగోలు పంచాయతీ శివారు మేకావారిపాలెంలోని శ్రీసీతారామ లక్ష్మణ సమేత అభయాంజనేయస్వామి ఆలయం. అసలు ఏమైందంటే.. దాదాపు 70 ఏళ్ల క్రితం గ్రామంలో జరిగిన గొడవల కారణంగా అప్పటి నుంచి ఆ ఆలయంలో నవమి వేడుకలు గానీ, ఉత్సవాలు గానీ నిర్వహించలేదు. చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, ఆమె భర్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజులపాటి శివప్రసాద్ దంపతులు కొన్ని రోజుల క్రితం మేకావారిపాలెం వెళ్లి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో విగ్రహాలు లేకుండా ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఊర్లోని పెద్దవారిని ఆరా తీయగా.. ఏడు దశాబ్దాలుగా ఆ ఆలయంలో ఎటువంటి పూజలు జరగటంలేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. విషయం తెలిసిందే తడవుగా వారు వెంటనే గ్రామస్తులతో మాట్లాడటంతో రూ.30వేల వరకూ విరాళాలు వచ్చాయి. వారు సొంతంగా మరో రూ. లక్ష సమకూర్చి ఆలయాన్ని పునర్నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠించారు. కల్యాణి, శివప్రసాద్ల ఆధ్వర్యంలో ఆలయానికి కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే శుక్రవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని వైభవంగా కల్యాణ వేడుకలు జరిపించారు. తొలుత సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహాలతో కల్యాణి దంపతులు వారి ఇంటి నుంచి నడుచుకుంటూ ఆలయం వరకూ ఊరేగింపుగా వచ్చి, గ్రామంలోని మరికొందరు దంపతులతో కలిసి పీటలపై కూర్చొని పూజలు జరిపించారు. చాలా ఏళ్ల తరువాత తమ గ్రామంలోని ఆలయంలో జరుగుతున్న సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై తరించారు. జెడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కల్యాణి, శివప్రసాద్ దంపతులను, ఇతర దాతలను, కమిటీ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. -
ప్రైవేటుకు బైపాస్ అవుతున్నాయ్!
జయ జయహే జానకీ నాయక జగదానందకారకుడు శ్రీరామచంద్రుడు.. సుగుణాల రాశిసీతమ్మల కల్యాణ వేడుక అంబరాన్ని తాకింది. లోక కల్యాణం కోసం ఏటా నిర్వహించే ఈ వేడుక భక్తుల మదిని పులకింప జేసింది. వందలాదిగా తరలివచ్చిన భక్తజనంతో జిల్లాలోని రామాలయాలు కిటకిటలాడాయి. జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయాయి. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణం కమనీయమై సాక్షాత్కరించింది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధితో పాటు ఇరు జిల్లాల్లోని ప్రధాన రామమందిరాలు భక్తులతో కిక్కిరిశాయి. భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ భక్తులకు తలంబ్రాలు అందిస్తున్న అర్చకుడు ఇంద్రకీలాద్రిపై సీతారాముల కల్యాణాన్ని జరిపిస్తున్న అర్చకులు విజయవాడ బీసెంట్ రోడ్డులోని రామాలయంలో కొలువుదీరిన సీతారాములు -
కమిషనర్ కార్యాలయం సీరియస్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సాక్షి దినపత్రికలో ఇటీవల ప్రచురించిన ‘దివ్వెల పండుగలో దోపిడీ పర్వం’ కథనంపై వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర కార్యాలయం స్పందించింది. ఈ కథనానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలోని వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్–1, డివిజన్–2, డివిజన్–3 అధికారులను వివరణ ఇవ్వవల్సినదిగా కోరింది. ప్రధానంగా ఒకవైపు ఆదాయం లేక ప్రతి రోజు సమావేశాలను నిర్వహించి అన్నిచోట్ల ఆదాయం పెరగాలని జిల్లాలోని అధికారులపై కమిషనర్ కార్యాలయం ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరించిన అధికారుల తీరుపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా డివిజన్–3 పరిధిలో జరుగుతున్న వ్యవహారాలను అధికారులు పట్టించుకోకపోవటంపై కమిషనర్ కార్యాలయం ప్రశ్నించినట్లుగా సమాచారం. గుడివాడలో వచ్చిన ఆరోపణలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం, రిటర్న్స్లోనూ జరిగిన వ్యాపారాన్ని చూపకపోవటం వంటి అంశాలపై అధికారులు స్పందించకపోవటంపై ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆరోపణలు ఉన్న సర్కిల్స్పై ఉన్నతాధికారులు ఎవరు మద్దతుగా ఉన్నారనే విషయాలను తెలుసుకుంటున్నట్లు తెలిసింది. అమరావతి: దక్షిణ కాశీ క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన అమరావతిలోని కోదండ రామాలయంలో వేంచేసియున్న సీతాసమేత కోదండరామస్వామికి శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా వైభవంగా కల్యాణం నిర్వహించారు. స్వామి వారిని తొలుత దేవాలయంలో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంపై ఉంచి కల్యాణం నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి పరాశరం రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమానుసారం కల్యాణం జరిపించారు. -
ఉషోదయానికి ముందే హుషార్!
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పరిధిలో మద్యం అమ్మకాలకు వేళాపాళా లేకుండా పోతోంది. తెల్లవారుజామున వాకర్స్ కంటే ముందుగానే రోడ్లపై కూర్చొని మద్యం తాగేవారు హల్చల్ చేస్తున్నారు. దీంతో పాదచారులు అవాక్కవుతున్న పరిస్థితి. వైవీ రావు ఎస్టేట్ నుంచి సింగ్నగర్ పైపుల రోడ్డు వరకు ఉదయం వేళ వాకింగ్ చేసే వారు అధికంగా వస్తుంటారు. తెల్లవారుజామున టీ దుకాణాల కంటే ముందుగానే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ వైపరీత్యంపై స్థానికులు కొందరు శుక్రవారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొత్తపేట పోలీసులు పాముల కాల్వ వద్ద కీర్తి రెస్టారెంట్ అండ్ బార్, వైవీ రావు రింగ్ సమీపంలోని శ్రీలక్ష్మీ వైన్స్లలో తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న కీర్తి రెస్టారెంట్ క్యాషియర్, హెల్పర్లపై కేసులు నమోదు చేశారు. ఆయా బార్లు, వైన్ షాపు నిర్వాహకులు తెల్లవారుజామున 5గంటల నుంచి వైన్ షాపులు, బార్లు తెరిచి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కూలీలు, ఇసుక ముఠా పనులు చేసే వారు వైన్స్, బార్ల ఎదుట క్యూ కడుతున్నారు. ఇప్పుడు విచ్చలవిడిగా.. గతంలో అడపా దడపా విక్రయాలు సాగించినా వారిని కూర్చొని మద్యం తాగేందుకు అనుమతించే వారు కాదు. అయితే ఇటీవల వైన్ షాపుల నిర్వాహకులు అక్రమంగా మద్యం అమ్మకాలు చేయడమే కాకుండా, మద్యం కొనుగోలు చేసిన వారిని లోపల కూర్చొని తాగేందుకు సైతం అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితులు తిరిగి తలెత్తకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ రూరల్లో తెల్లవారుజామునే తెరుచుకుంటున్న బార్లు, వైన్ షాపులు టీ దుకాణాల కంటే ముందుగానే మద్యం షాపులు రెడీ వాకర్స్ కన్నా ముందే మందుబాబుల హల్చల్ పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు -
విజయవాడ జీజీహెచ్లో గుండె గోడు వినేదెప్పుడు?
● ఆస్పత్రిలో ఆధునిక సౌకర్యాలున్నా సర్జరీలు చేయని వైనం ● ఇద్దరు వైద్యులున్నా నిరుపయోగం ● వైద్యం కోసం రోగులు ప్రైవేటుకు వెళ్లాల్సిన దయనీయ స్థితి ● వైద్య రంగంపై చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదల అవస్థలు అన్నీ ఉన్నా సమస్యే.. ఆధునిక సౌకర్యాలున్నా... ప్రభుత్వ చొరవ ఏది? ప్రైవేటుకు వెళ్లాల్సిన పరిస్థితి.. -
‘మీ ఆఫీస్ ఎదుటే పెట్రోల్ పోసుకుని చనిపోతా’
విజయవాడ: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. ఇందులో తనకు జరిగిన అన్యాయంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సూటిగా ప్రశ్నించారు. తనకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్ దర్జాగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నాడని, ఇక జనసేన పార్టీ విచారణ జరిపి ఏం లాభమని పవన్ కళ్యాణ్ను నిలదీశారు. జనసేన పార్టీ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటుందన్నారు. తనకు అన్యాయం జరిగిందని గత మూడు నెలలుగా చెబుతూనే ఉన్నానని, త్రిసభ్య కమిటీ వచ్చి రెండు నెలలవుతున్నా అరవ శ్రీధర్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. మీవైపు తప్పుంది కాబట్టే కమిటీ నివేదిక ఇవ్వడం లేదని, తనకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని చనిపోతానని హెచ్చరించారు. మీరంతా కలిసి నన్ను సక్సెస్ ఫుల్ గా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రేపు మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే.. మా పార్టీనే కదా అని ముడుచుకుని కూర్చుకుంటారా?, మీ అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినా సరే మీరు ఇలాగే వదిలేస్తారా? అని పవన్ను నిలదీశారు. -
పూల పరిమళం.. భక్తి పరవశం
దుర్గమ్మకు సంపంగి, చామంతి, మల్లెలతో అర్చన ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజు గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని కళావేదిక నుంచి ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ అర్చకులు, సిబ్బంది అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు పుష్పాలను సమర్పించారు. అనంతరం అర్చకులు పుష్పాలతో అర్చన నిర్వహించారు. పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఆ పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆంజనేయ స్వామికి విశేష పూజలు.. చైత్రమాస అష్టమి, శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడైన వీరాంజనేయ స్వామి వారికి గురువారం విశేష అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని రావిచెట్టు వద్ద ఆంజనేయ స్వామి వారికి, ఘాట్రోడ్డులోని స్వామి వారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరువూరు: ఇప్పటివరకు నగర పంచాయతీగా ఉన్న తిరువూరును గ్రేడ్–2 మునిసిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత కౌన్సిల్ సమావేశంలో తిరువూరును మునిసిపాలిటీగా వర్గోన్నతి చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపగా, గ్రేడ్–2 మునిసిపాలిటీ హోదా కల్పిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. గత రెండు సంవత్సరాల్లో నగర పంచాయతీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెనమలూరు: కానూరులో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కానూరు సెక్టార్ ఎస్ఐ జి.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు కల్పనానగర్లో కొందరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు గురువారం అక్కడకు వెళ్లారు. ఆసమయంలో నలుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారు. పోలీసులను చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మరో ఇద్దరు పట్టుబడ్డారు. వారి వద్ద రెండు బ్యాగుల్లో ఆకుపచ్చని ఎండిన ఆకులు, కాండం, పువ్వులు, విత్తనాలు కనపడ్డాయి. పట్టుబడిన వారిలో కానూరుకు చెందిన సయన అనంత్కుమార్(32), తాడిగడప గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ మహేష్(26) వద్ద పోలీసులు వివరాలు సేకరించారు. పోలీసులకు చిక్కకుండా పారిపోయిన షేక్ జాన్బాషా(జాన్బెర్రీ), రామవరప్పాడు చెందిన అక్బర్తో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నామని వారు తెలిపారు. విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి తీసుకు వస్తున్నామన్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ మాదకద్రవ్యం కూడా తీసుకువచ్చామని తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నామన్నారు. నిందితుల వద్ద 5 కిలోల గంజాయి, ఒక గ్రాము ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పారా కబడ్డీ రాష్ట్ర పురుషుల జట్టు ఎంపిక
గన్నవరం: పారా కబడ్డీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్ ఇండోర్ హాలులో గురువారం పారా పురుషుల రాష్ట్ర కబడ్డీ జట్టు ఎంపిక నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ సెలక్షన్స్కు హాజరయ్యారు. వీరిలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచిన 14మంది క్రీడాకారులకు రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెలగపూడి ఉజ్వల్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు చండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. జట్టు కోచ్గా డీఎన్ నాగరాజు, మేనేజర్గా చరణ్తేజ వ్యవహరించనున్నారన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉజ్వల్, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కేపీ రావు అభినందించారు. -
పటిష్ట భద్రతలో ఈవీఎం, వీవీ ప్యాట్లు
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు(ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించినప్పటికీ నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోదామును పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందిస్తున్నామని తెలిపారు. డీఆర్ఓ లక్ష్మీనరసింహం, యరడ్ల ఆంజనేయరెడ్డి (వైఎస్సార్ సీపీ), కాకాని తరుణ్, బి. కృష్ణారెడ్డి (బీజేపీ), కాకొల్లు సురేష్ (టీడీపీ) తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ -
యనమలకుదురులో కొనసాగుతున్న విచారణ
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారి సొమ్ము స్వాహా ఘటనపై విచారణ కమిటీ విచారణ గురువారం కొనసాగింది. ఆలయంలో హుండీలో సొమ్ము నకిళీ తాళంతో స్వాహా చేశారని ఆలయ ఈవో భవాని, పూజారులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్యలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాలని ఎండోమెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆలయ రికార్డులను విచారణ కమిటీ తనిఖీ చేస్తున్నారు. మరో రెండు వారాల పాటు విచారణ కొనసాగనుందని తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు అర్చకులపై దుర్గగుడి ఈవో శీనానాయక్ సస్పెన్షన్ వేటు వేశారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో 3వ షిఫ్టులో ఉప ప్రధాన అర్చకుడు పి. శ్రీనివాసశర్మ, పరిచారకుడు కె. నాగరాజు విధులు నిర్వర్తించాల్సి ఉంది. బుధవారం రాత్రి ఈవో శీనానాయక్, ఇతర అధికారులు మల్లేశ్వరాలయానికి వెళ్లగా అక్కడ ఇద్దరు అర్చకులు విధులకు హాజరు కాలేదు. సదరు విషయాన్ని ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇద్దరు అర్చకులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంటూ.. ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు ఎవరైనా సరే వారికి కేటాయించిన విధుల్లో ఉండాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 8 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చిట్టినగర్(విజయవాడపశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న రెండు హోటళ్లపై పౌర సరఫరాల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. చిట్టినగర్లోని బాబాయ్ హోటల్, సౌమ్య థియేటర్ సమీపంలోని ఓ టిఫిన్ హోటల్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సౌమ్య థియేటర్ సమీపంలోని టిఫిన్ హోటల్లో ఉన్న ఐదు గ్యాస్ సిలిండర్లు, చిట్టినగర్ బాబాయ్ హోటల్లో మూడు గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారాల కోసం వినియోగించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చిట్టినగర్లో పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారనే సమాచారంతో సెంటర్లోని మరి కొన్ని టిఫిన్ హోటళ్లు, బళ్ల నిర్వాహకులు తాళాలు వేసి పరుగులు తీశారు. -
యూపీహెచ్సీలో ఆకస్మిక తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని చిట్టినగర్ యూపీహెచ్సీని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోజూ ఎంత ఓపీ నమోదు అవుతుంది, అభా ఐడీలు చేస్తున్నారా లేదా, ఆన్లైన్ పక్రియ సక్రమంగా జరుగుతుందా అనే అంశాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఫార్మసీలో అత్యవసర మందులు సరఫరా, రోగులకు ఇచ్చిన మందుల వివరాలు, మందుల లభ్యత, వాటిన భద్రపరుచే విధానం వంటి అంశాలను తనిఖీ చేశారు. రోగులకు రక్త పరీక్షల ఎలా నిర్వహిస్తున్నారు.. రిపోర్టులు సక్రమంగా ఇస్తున్నారా అని అక్కడ ఉన్న రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు సిబ్బంది పనిచేయాలని పిలుపునిచ్చారు. -
రైల్వేలో మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్(డబ్ల్యూడబ్ల్యూఓ) మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ వందన శ్రీవాస్తవ అన్నారు. గురువారం విజయవాడ డివిజన్లో పర్యటించిన ఆమె పలు అభివృద్ధి పనులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియాతో కలసి వందన శ్రీవాస్తవ ముందుగా పునరుద్ధరించిన జాక్ అండ్ జిల్ స్కూల్ను ప్రారంభించారు. అనంతరం వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినుల్లో ఆత్మగౌరవం పెంచేలా శానిటరీ డిస్పోజల్ యూనిట్ను ఆమె ప్రారంభించారు. అదే విధంగా డివిజన్లోని పలు కార్యాలయాల్లో ఏర్పాటు చేసేందుకు మరో 14 శానిటరీ డిస్పోజల్ యూనిట్లను డివిజన్ ఆర్గనైజేషన్కు అందజేశారు. డివిజన్కే గర్వకారణం.. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ ప్రెసిడెంట్ వర్షా సొనాకియా మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న పరివర్తన డివిజన్కే గర్వకారణం అన్నారు. పాఠశాల పునరుద్ధరణ, ఆధునిక పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన విద్యార్థులు, సమాజంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ విజయవాడ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కొండా వీణా చందన, సెక్రటరీ నిహారిక, స్కూల్ సెక్రటరీ ఆర్.పవిత్ర, వి.సింధూర లక్ష్మి పాల్గొన్నారు. -
వేసవిలో పశు పోషకులు జాగ్రత్త వహించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): రానున్న వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పశుపోషకులు పశువులను జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్ను గురువారం ఆయన చాంబర్లో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల కారణంగా పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గటం, ఆహార స్వీకరణ సరిగ్గా లేకపోవటం వంటి సమస్యలు తలెత్తి మరణించే అవకాశాలు ఉంటాయన్నారు. ఇందుకోసం పశువులకు ఎప్పటి కప్పుడు చల్లటి తాగునీరు అందించాలన్నారు. నీడ ఉన్న ప్రదేశాల్లో ఉంచాలన్నారు. పశువుల్లో వేడి లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యుని సంప్రదించాలన్నారు. వీటన్నింటిపై గ్రామ పశువైద్యసిబ్బంది యజమానులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, డ్వామా పీడీ ఎన్వీ శివప్రసాద్, డీఈవో యూవీ సుబ్బారావు ఉన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ -
ఇసుక ట్రాక్టర్ ఢీకొని డెలివరీ బాయ్ మృతి
పెనమలూరు: ఇసుక ట్రాక్టర్ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. విజయవాడ–అవనిగడ్డ కరకట్టపై ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో డెలివరీ బాయ్ దుర్మరణం చెందాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనమలూరు పల్లిపేటకు చెందిన కొక్కిలిగడ్డ దుర్గేష్ (32) భార్య వీరలక్ష్మి, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. అతను డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. కాగా బుధవారం సాయంత్రం పెదపులిపాక శ్రీనగర్కాలనీలో డెలివరీ ఇవ్వటానికి బైక్పై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ అతి వేగంగా వచ్చి అతనిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో దుర్గేష్ తీవ్రంగా గాయపడి స్పాట్లో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య వీరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యార్థులు విలువలతో ఎదగాలి
కృష్ణా వర్సిటీ వీసీ ఆచార్య రాంజీ వన్టౌన్(విజయవాడపశ్చిమ): సాంకేతిక విప్లవం నేపథ్యంలో ఉన్నత విలువలతో విద్యార్థులు ఎదగాలని కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంజీ కూన చెప్పారు. కేబీఎన్ కళాశాల 61వ వార్షికోత్సవం రెండో రోజైన గురువారం సాయంత్రం కళాశాల ప్రాంగణంలో విద్యార్థుల కేరింతల నడుము సందడిగా జరిగింది. తొలుత శ్రీ పద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ రాంజీ కూన మాట్లాడుతూ సాంకేతిక ఏదైనా విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా విద్యనభ్యసించి ఉన్నతి సాధించాలన్నారు. క్వాంటం టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీలు ప్రపంచంలో నూతన విప్లవానికి నాంది పలకనున్నాయన్నారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ చదలవాడ సుధా నాగేశ్వరరావు దంపతులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ప్రయోజకులు కావాలన్నారు. కేబీఎన్ కళాశాల సెక్రటరీ డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేబియన్ కళాశాల విద్యార్థులు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. కృష్ణవేణి వార్షిక నివేదికను అందించారు. ఎస్కేపీవీవీ హిందూ హైస్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్ల బాబా విజయకుమార్, కేబీఎన్ కళాశాల అధ్యక్షుడు ఉసిరిక ఉమా మహేశ్వర రావు, ఉపాధ్యక్షులు చిట్టూరి నాగేంద్ర కుమార్, కోశాధికారి హరగోపాల్, కమిటీ ఏవో డాక్టర్ వి. నారాయణరావు తదితరులు ప్రసంగించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.3.50 లక్షలు నగదు, 304 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల జిల్లాలో రాత్రి సమయాల్లో జరుగుతున్న చోరీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, దొంగతనం కేసుల్లోని సంఘటనా స్థలంలో సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానితులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం తమకు అందిన సమాచారంలో వన్టౌన్ తారాపేట రైల్వేస్టేషన్ వద్ద వెహికల్ చెక్ చేస్తుండగా నిందితుడు ఆరేపల్లి దుర్గారావు కంగారు పడి, తన మోటార్ సైకిల్ను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు చేసినట్లు అంగీకరించాడని తెలిపారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని చోరీ కేసులో రూ. 3.50 లక్షలు నగదు రికవరీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా పెడన, ఏలూరు పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసుల్లో 304 గ్రాముల వెండిని రికవరీ చేసినట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసై.. కాగా మచిలీపట్నం మేకవారిపాలెంకు చెందిన ఆరేపల్లి దుర్గారావు వ్యసనాలకు బానిసై పనులకు వెళ్లి సంపాదించే డబ్బులు సరిపోక, నేరాలకు పాల్పడుతున్నట్లు తేలిందన్నారు. ఇప్పటి వరకూ విజయవాడ సిటీతో పాటు, పరిసర జిల్లాలో 80 వరకూ దొంగతనాలకు పాల్పడినట్లు ఏడీసీపీ రాజారావు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంతో ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ కిషోర్బాబు తమ సిబ్బంది కృషి చేసినట్లు పేర్కొన్నారు. -
బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలిపై హత్యాయత్నం కేసా!
చిలకలపూడి(మచిలీపట్నం): అభం శుభం తెలియని బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై పామర్రు పోలీసులు అకారణంగా హత్యాయత్నం కేసు నమోదు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఇటీవల పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్ పరిధిలోని హోంగార్డు కోటేశ్వరమ్మపై హత్యాయత్నం చేశారనే కేసును సుప్రియపై నమోదు చేశారు. దీనిపై రిమాండ్కు వచ్చిన ఆమెను మచిలీ పట్నం సబ్జైలులో గురువారం పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్తో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ తెలుగు తమ్ముడు గణేష్ కళ్లలో ఆనందం కోసం పోలీసులు తీసుకున్న చర్యలు సరికాదని హితవు పలికారు. పొలంలో మినపకాయలు లాగుతున్న సమయంలో తన తండ్రిపై నేరం మోపేందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్కు పిలిపించారని ఆమె తెలిపారన్నారు. సోదరుడు తేజను దుర్భాషలాడితే దీనిపై సుప్రియ ప్రశ్నించినందుకు హోంగార్డు కోటేశ్వరమ్మతో బట్టలు చిరిగిపోయేలా ఆమెను లాక్కెళ్లటం అఘాయిత్యం కాదా అని పేర్ని ప్రశ్నించారు. మహిళ అని కూడా చూడకుండా ఛాతీపై చెయ్యి పెట్టి తోసేశారని ఆ అభాగ్యురాలు చెబుతుంటే నిర్ఘాంతపోయామన్నారు. సీఐ, ఎస్సైలు ఆమైపె దాడి చేయడంతో రక్తం వస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆటోలో బందరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందినట్లు తమకు తెలియజేసిందన్నారు. మూడు రోజులైనా వాంగ్మూలం రికార్డు చేయడానికి పోలీసులు రాకపోవడం దారుణమని తెలిపారన్నారు. విన్నవించుకుందామని వస్తే అరెస్టు చేస్తారా? తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ‘మీ కోసం’లో కలెక్టర్ బాలాజీ ఎదుట వ్యక్తం చేస్తే, ఆయన డీఎస్పీ శ్రీనివాసరావుకు అర్జీని బదిలీ చేస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. డీఎస్పీ ఆమెను నమ్మబలికి పామర్రు పోలీసులకు అప్ప చెప్పారన్నారు. వారు గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం కోర్టులో హాజరుపరిచారని ఇలా చేయడం న్యాయమా అని పోలీసులను పేర్ని నాని ప్రశ్నించారు. కలెక్టర్కు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారో గ్రహించాలన్నారు. ఎస్పీ నాయకత్వంలో పోలీసులు హోంగార్డు కోటేశ్వరమ్మను పావుగా ఎలా వాడుకున్నారో తెలుసుకోవాలన్నారు. కావాలంటే సీసీ ఫుటేజీని పరిశీలించాలని కోరారు. పోలీసులు ఆమెకు రిమాండ్ విధించేలా చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతో మంది టీడీపీ, జనసేన రౌడీలు రాజ్యమేలుతున్నా వారికి మాత్రం స్టేషన్ బెయిల్ తప్ప రిమాండ్ ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు. ఈ పాపం ఊరికే పోదు.. టీడీపీ నాయకుడు గణేష్ కళ్లలో ఆనందం కోసం.. పోలీసులు ఆమె విషయంలో చేసిన పాపాలు ఊరికేపోవన్నారు. గణేష్ ఎన్నికల కౌంటింగ్కు ముందు జుజ్జువరపు చిన్ని తమ్ముడి ఇంటిని తగలబెడితే కేసు నమోదు చేయలేదన్నారు. దళితురాలి విషయంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అర్థమవుతోందన్నారు. డీసీఎం పవన్ కల్యాణ్కు.. 50 మంది పోలీసులతో బందోబస్తు, ఒక విమానం ఇస్తే ఇలాంటి ఘటనలు కనపడవా అని ప్రశ్నించారు. ఓదార్పు మాటలు చెప్పి దళిత మహిళను జైల్లో పెట్టిస్తారా అని డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీతారాముల కల్యాణం చూతము రారండి
ధర్మవరప్పాడుతండ(జగ్గయ్యపేట): శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శుక్రవారం సీతారాముల కల్యాణానికి రావాలంటూ ధర్మవరప్పాడుతండ గ్రామస్తులు బుధవారం ఇంటింటికీ శుభలేఖలు అందించారు. గ్రామంలోని జెండా చెట్టు వద్ద గత ఐదేళ్లుగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆరో వార్షికోత్సవం సందర్భంగా కల్యాణానికి రావాలని కోరుతూ గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి శుభలేఖలు అందజేస్తూ ఆహ్వానించారు. మహిళలు కల్యాణ తలంబ్రాల తయారీకి పసుపు దంచి కల్యాణ ఏర్పాట్లను ప్రారంభించారు. -
జిల్లాలో ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి
మూలపాడు(ఇబ్రహీంపట్నం): జిల్లాలో సమగ్ర పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఎకో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మండలంలోని మూలపాడు బటర్ ఫ్లై పార్కు నగరవనాన్ని గురువారం ఆయన సందర్శించారు. 50 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న పార్కును పరిశీలించి అభివృద్ధి ప్రణాళికలపై అటవీ శాఖ అధికారులతో చర్చించారు. జిప్లైన్ కార్యకలాపాలు, ప్రధాన నడక దారి, ట్రెక్కింగ్ మార్గం తదితరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎకో టూరిజం అనేది ప్రకృతి సంరక్షణతో పాటు స్థిరమైన అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ప్రకృతి ప్రేమికులకు సీతాకోక చిలుకుల సోయగాలతో మధురానుభూతులు అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్, సైక్లింగ్ ట్రాక్, యోగా సెంటర్, వాటర్ ఫౌంటైన్, రెస్ట్ రూమ్స్తో పాటు తాగునీటిని అందిస్తామని వెల్లడించారు. అటవీ శాఖ అధికారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సుల్లోనే బతుకులు బుగ్గి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రైవేట్ బస్సులంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు.వరుసగా ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురికావడం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో ప్రయాణికులు హడలిపోతున్నారు. గతేడాది కర్నూలు జిల్లాలో, కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ జిల్లా కీసర సమీపంలో.. తాజాగా మార్కాపురంలో ఇలా రాష్ట్రంలో ఏదో ఒక చోట ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వరుసగా జరుగుతున్నా ప్రభుత్వం ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేస్తున్నారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది, మార్కాపురం బస్సు ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. ప్రైవేటు ట్రావెల్స్కు విజయవాడ రాజధాని ప్రైవేటు ట్రావెల్స్కు విజయవాడ.. రాజధానిగా మారింది. ఇక్కడ నుంచి నిత్యం 500 పైగా బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో చాలా వరకు సరైన పర్మిట్లు, ఫిట్నెస్ లేకపోవడం, సేఫ్టీ పాటించకుండానే రోడ్లెక్కుతున్నాయి. అతి వేగం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్ వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. ఒకే నంబరుతో ఒక బస్సు హైదరాబాద్, మరో బస్సు బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్తున్నా అధికారులకు తెలిసీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బస్సుల్లో సిబ్బంది వంట కోసం సామగ్రి, స్టౌ, గ్యాస్ వంటివి బస్సు కింది భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో పెడుతున్నారు. కొందరు అందులోనే మద్యం తాగుతున్నారు. మరికొన్ని బస్సులు సరుకు రవాణా చేస్తున్నాయి. ఎక్కవగా టైర్లు తరలిస్తున్నారు. అనుకోని ప్రమాదం జరిగి టైర్లకు నిప్పంటుకుంటే మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడే అవకాశం ఉంది. హనుమాన్పేట నుంచి బయలు దేరే బస్సుల్లో సరుకు రవాణా చేస్తున్నా.. ఏ ఒక్క అధికారి వాటి వంక కన్నెత్తి చూడడం లేదు. బస్సు బయలు దేరిన దగ్గర నుంచి సిటీ దాటే వరకు డబ్బులు ఇస్తూ ప్రైవేటు బస్సుల యాజమాన్యం తనిఖీలు చేయకుండా పనికానిచ్చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సి ఉంది.ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి గుంటూరుకు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సు వెనుక భాగంలో ఉన్న ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. నిత్యం రాష్ట్రంలో ఏదో మూల ప్రైవేటు బస్సులు కాలిబూడిదైపోతున్నాయి. ప్రయాణికులు చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించదా? ఇంకెన్ని అమాయక ప్రాణాలు పోవాలి? నిబంధనలు పాటించని ప్రైవేటు ట్రావెల్స్పై చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు భద్రత కల్పించాలి. – వేమా సురేష్, కంచికచర్ల -
అవార్డులు బాధ్యతలను పెంచుతాయి
విజయవాడ కల్చరల్: అవార్డులు బాధ్యతలను పెంచుతాయని కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాహితీ సమితి వ్యవస్థాపకుడు గోళ్ళ నారాయణరావు అన్నారు. 2026 సంవత్సరానికి ఉగాది పురస్కారాలు అందకున్న చిత్రకారులకు అభినందన సభను బాలోత్సవ భవన్లో పోలవరపు సాహితీ సమితి, డ్రీమ్ వర్క్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యాన నిర్వహించారు. గోళ్ల నారాయణరావు చిత్రకారులను అభినందించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు మాట్లాడుతూ చిత్రకళలో వస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. చిత్రకారులు ఎన్ఎస్ వెంకట్రావు, వజ్రగిరి, కళాసాగర్, పి.రమేష్, పట్నాల సుధాకర్ను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో మోతుకూరి ఆంజనేయులు, డాక్టర్ సీహెచ్ రామచందర్, కె. సుధాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు ఉపేంద్ర, ఆంజనేయులు, ప్రసాద్ పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి వాడపల్లికి చెందిన భక్తులు గురువారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన కొప్పుల దుర్గా దివ్య కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ఆధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళంగా ఇచ్చారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.భక్తి పరవశం దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది.గాయనీగాయకులకు సత్కారం విజయవాడ కల్చరల్: ‘మహానటి సావిత్రి’ కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యాన గురువారం విజయవాడలో గాయనీగాయకులను సత్కరించారు. 1 -
మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు
విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కేసులు బనాయిస్తుంది కూటమి ప్రభుత్వం. తాజాగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై మరో అక్రమ కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు స్టేషన్లో ఫిబ్రవరి 2న జోగి రమేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని జోగి రమేష్కు నోటీసులు ఇచ్చాఉ భట్టిప్రోలు పోలీసులు. గత నెలలో జోగి రమేష్పై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వాహించారని. జన సమూహాన్ని పోగు చేశారంటూ సెక్షన్ 30 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పీఎస్లో జోగి రమేష్పై నమోదు చేశారు. మళ్లీ నెల వ్యవధిలోనే ఏదో కారణం చూపుతూ జోగి రమేష్పై కేసు నమోదు చేశారు. -
‘దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు పట్టించుకోవడం లేదు’
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితుల ఓట్లు మాత్రమే కావాలి తప్ప, వారిపై దాడులు జరిగితే మాత్రం పట్టించుకోవడం లేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మరోసారి ధ్వజమెత్తారు. అంబేద్కర్ పేరు పెట్టిన జిల్లాలో దుర్మార్గం జరిగితే చర్యలేవి చంద్రబాబు? అని ప్రశ్నించారు.‘పవన్ సొంత నియోజకవర్గంలో దళితులపై వివక్ష కొనసాగుతుంది. దళితుడి చనిపోతే అగ్రకులాలు శవాన్ని తీసుకెళ్లనివ్వని పరిస్థితి. ఇంత జరుగుతుంటే పవన్ ఎందుకు స్పందించడం లేదు. పిఠాపురం నియోజకవర్గంలో కులవివక్ష కనిపించడం లేదా పవన్? అని నిలదీశారు. టీటీడీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే, డ్రగ్స్ తీసుకున్న ఎంపీపై చర్యలేవని ప్రశ్నించారు. బర్త్ డే పార్టీలు, ఆట పాటల్లో హోంమంత్రి బిజీగా ఉన్నారని, ఇక డిప్యూటీ సీఎం పవన్ షూటింగ్స్లో బిజీగా ఉన్నారంటూ విమర్శించారు. -
మద్యం అక్రమ కేసులో రిమాండ్ పొడిగింపు
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో రిమాండ్ ముగిసిన ప్రతిసారీ సిట్ అధికారులు ఏ సెక్షన్ల ప్రకారం రిమాండ్ పొడిగింపు కోరుతున్నారో సంబంధిత రిపోర్టులో పేర్కొనకపోవడంపై న్యాయవాది యక్కంటి పుల్లారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. మద్యం అక్రమ కేసులో నిందితుల రిమాండ్ బుధవారం ముగియడంతో రిమాండ్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి, రోణక్కుమార్ను ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇదే కేసులో బెయిల్పై ఉన్న ఎంపీ మిథున్రెడ్డి, చెరుకూరి వెంకటేష్నాయుడు, యద్దల నవీన్కృష్ణ గైర్హాజరు పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్పై ఉన్న మిగిలిన నిందితులు ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముప్పిడి అవినాష్రెడ్డి, పైలా దిలీప్, అనిల్ చోక్రా, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్రెడ్డి ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి భాస్కరరావు జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నిందితులకు వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేశారు. పోలీసు కస్టడీకి వాసుదేవరెడ్డి, ప్రణోయ్ప్రకాష్ మద్యం అక్రమ కేసులో గుంటూరు జైలులో రిమాండ్లో ఉన్న దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ప్రణోయ్ ప్రకాష్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం వారిద్దరికి తొలుత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి విచారించారు. తిరువూరు: రబీ సీజన్లో ధాన్యం కొనుగోలులో రైతులు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలకియా సూచించారు. తిరువూరు వాహినీ కాలేజీలో రబీ ధాన్యం కొనుగోలుపై కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా రెవెన్యూ, వ్యవసాయ, సహకార, సచివాలయ, రైతుసేవా కేంద్రాల సిబ్బందికి బుధవారం శిక్షణ తరగతి నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రైతు సేవా కేంద్రాల్లో నిర్ణీత ప్రమాణాల ననుసరించి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారిణి వాణి, తిరువూరు ఆర్డీఓ కుమార్, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
4న విజయవాడలో ఏఐ సమ్మిట్
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో తొలిసారిగా ఏప్రిల్ నాలుగో తేదీన ఆర్టిఫిషియల్ ఇటెలిజెన్స్ (ఏఐ) సమ్మిట్ జరుగుతుందని ఏపీడీటీఐ చైర్మన్ శ్రీధర్ కొసరాజు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎస్టీపీఐ సహకారంతో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంజీ రోడ్డులోని ఓ హోటల్లో ఆయన బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో వస్తున్న మార్పులు, పరిశ్రమల్లో ఎలా వినియోగిస్తున్నారు, ఉద్యోగ సాధన కోసం, ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఎటువంటి నైపుణ్యాలు పెంపొందించుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మిట్ కోచైర్మన్ సురేష్ నర్రా, ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఇంద్రజిత్ అన్నే మాట్లా డుతూ.. ఏఐ ట్రెండ్స్ను అందరికీ తెలపాలనే ఉద్దేశంతో సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రెండు మూడేళ్లలో ఏఐ ప్రభావంతో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. -
వ్యాధుల పర్యవేక్షణను సమర్థంగా నిర్వహించాలి
మచిలీపట్నంఅర్బన్: నైపుణ్యాలు పెంచుకుని వ్యాధుల పర్యవేక్షణను మరింత సమర్థంగా నిర్వహించాలని కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ పి.యుగంధర్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్లో భాగంగా ఐహెచ్ఐపీ ఫీల్డ్ సర్వైలెన్స్పై గ్రామ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు సామర్థ్య వృద్ధి శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సంద ర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వ్యాధుల సమాచార సేకరణ, సమ యానికి నివేదికల సమర్పణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. సకాలంలో కచ్చితమైన సమాచారం అందితే వ్యాధుల నియంత్రణ చర్యలను వేగంగా చేపట్టొచ్చని సూచించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయకృష్ణ, జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ సాయి కిరణ్ శిక్షణ అందించారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా కలిగే అనారోగ్య సమస్యలను నివారించేందుకు అవసరమైన జాగ్రత్తలు, చికిత్స విధానాలపై వివరించారు. కృష్ణా డీఎంహెచ్ఓ డాక్టర్ యుగంధర్ -
నున్నలో మామిడి కొనుగోళ్లు ప్రారంభం
విజయవాడరూరల్: ఆసియాలోనే పెద్ద మామిడి మార్కెట్గా గుర్తింపు పొందిన నున్నలో బుధవారం మామిడి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్), చెరుకు రసం కాయలు ఆరు టన్నులను నున్నకు చెందిన వెంకటరెడ్డి, ఆగిరిపల్లికి చెందిన సుమంత్, ఈదరకు చెందిన నారాయణ తీసుకొచ్చారు. రత్నావత్ కిషోర్ నాయక్ మామిడి కాయలను కొనుగోలు చేశారు. బంగినపల్లి మామిడికాయ రకం టన్ను ధర రూ.1.25 లక్షలు పలికిందని రైతులు తెలిపారు. ఈ సీజన్లో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు. ఇప్పటి నుంచి దాదాపు మూడు నెలలు వ్యాపారం కొనసాగుతుంది. మామిడి కాయల వ్యాపారం ప్రారంభోత్సవానికి పలువురు వ్యాపారులతో పాటు మ్యాంగో గ్రోయర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని 2,800 మంది ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ స్కాలర్షిప్స్ అందజేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా ఈ స్కాలర్షిప్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మలబార్ రెస్ట్ ఆఫ్ ఇండియా రిటైర్ ఆపరేషన్స్ హెడ్ సిరాజ్ పీకే మాట్లాడుతూ.. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్లు విలువైన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2,800 మందికి రూ.2.52 కోట్లను స్కాలర్షిప్ రూపంలో అందజేశామని వివరించారు. ఈ కార్యక్ర మంలో సిద్ధార్థ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మజ, మలబార్ హైదరాబాద్ షరీజ్ కే, జోనల్ హెడ్ సెంట్రల్ ఆంధ్రా, రాయలసీమ నిశిల్ చంద్రన్, డెప్యూటీ హెడ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
స్వామిత్వ సర్వేపై కలెక్టర్ పునఃపరిశీలన
పెడన: ఇంటి స్థలాలు, ఖాళీ స్థలాలకు సంబంధించి స్వామిత్వ సర్వే ప్రక్రియపై కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ బుధవారం పునఃపరిశీలన చేశారు. పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సచివాలయంలో స్వామిత్వ సర్వేకు సంబంధించి ఏర్పాటు చేసిన గ్రామ మ్యాపులు, రికార్డులను పరిశీలించడమే కాకుండా ల్యాప్టాప్లో వివరాలను పరిశీలించారు. కొన్ని విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించారు. అనంతరం సచివాలయానికి వెళ్లి పన్నుల వసూలు తీరును తనిఖీచేశారు. ఏ విధంగా వసూళ్లు చేస్తున్నది పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మీడియాతో మాట్లాడారు. స్వామిత్వ సర్వే ఎలా జరి గిందో పరిశీలించామన్నారు. కొన్ని అభ్యంతరాలు వచ్చాయని, వాటిని పరిష్కరించి సంబంధిత యాజమానులకు ప్రాపర్టీ కార్డులు అందజేస్తామన్నారు. రీసర్వేకు సంబంధించి ఆగ్రికల్చరల్ ల్యాండ్స్పై సర్వేను కూడా నందిగామలో పరిశీలించామని తెలిపారు. పెనుమల్లి గ్రామంలో తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, చాలా మంది మోటర్లు ద్వారా మంచి నీటిని తోడేసుకుంటు న్నారని కలెక్టర్కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి తాగునీటిని తోడే మోటార్లను పంచాయతీ కార్యాలయానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. సర్వే ఏడీ పి.లక్ష్మణరావు డీడీఓ జి.పద్మ, డీఎల్డీక్ష రాజావుల్లా, ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్, ఎంపీడీఓ ఎ.అరుణ కుమారి, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, సర్పంచ్ గరికపాటి వెంకటరామానాయుడు, తదితరులు పాల్గొన్నారు. పెనుమల్లిలో పర్యటన సందర్భంగా తొమ్మిది నుంచి పదో తరగతిలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి వేసవి సెలవుల్లో సబ్జెక్టులపై పట్టు సాధించాలని సూచించారు. ఎంఈఓ–1, 2 ఎన్.సలోమి, హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రముఖ న్యాయవాది, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుదీర్ఘ కాలంగా న్యాయవాదిగా పని చేస్తున్న శ్రీహరి సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. నేషనల్ కాపు ఫెడరేషన్ పేరుతో కాపు ఉద్యమానికి అండగా నిలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ కార్యదర్శిగా పని చేశారు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆధ్వర్యంలో మద్య విమోచన ప్రచారానికి కృషి చేస్తూ ప్రత్యేకంగా మద్యానికి వ్యతిరేకంగా పత్రికను నిర్వహించారు. పాతబస్తీ అభివృద్ధి పోరాట సమితి పేరుతో ఈ ప్రాంత అభివృద్ధికి పలు కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు న్యాయ వాదిగా సుదీర్ఘకాలం పని చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు నరహరిశెట్టి శ్రీహరి అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురి నివాళి శ్రీహరి మరణ వార్త తెలియగానే ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి వన్టౌన్లోని ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా, కిలారు రోశయ్య, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్) అధినేత ఉమారెడ్డి రమణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్, మహాదేవు అప్పాజీరావు, నరేంద్ర, కొనిజేటి రమేష్ నివాళులర్పించారు. -
భూ పంపిణీతో సకల సమస్యలకు పరిష్కారం
కృష్ణలంక(విజయవాడతూర్పు): సంపూర్ణ పేదరిక నిర్మూలన జరగాలంటే పేదలకు భూ పంపిణీ ఒక్కటే మార్గమని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడు గుంటూరు బాపనయ్య వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బా రావు అధ్యక్షతన వలస కార్మికులకు రక్షణ చట్టం చేయాలని, 2005 ఉపాధి హామీ చట్టం అమలని కోరుతూ సెమినార్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చంద్రబాబు ఊదర కొడుతున్నా రని, ఎక్కడ, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళలో వామపక్షపాలనలో భూ సంస్కరణలు అమలు జరగడం వల్లే దేశంలోనే అక్షరాస్యత, పేదరిక నిర్మూలనలో ఆ రాష్ట్రం ముందుందని వివరించారు. వ్యవసాయ కార్మికులకు రక్షణ చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ అని గుర్తుచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేసిందని, ఫలితంగా వలసలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. 2023–24లో కూలీలకు 25.54 కోట్ల పనిదినాలు కల్పించి రూ.2500 కోట్లు ఖర్చు చేస్తే ఈ ఏడాది రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చు చేసి కేవలం 18 కోట్ల పనిదినాలు కల్పించారని వివరించారు. గతంలో కుటుంబం సగటున 55 రోజులు పని చేస్తే ఇప్పుడు 42 రోజులకు పడిపోయిందన్నారు. రాష్ట్రంలో 200 మందికి పైగా వలస కార్మికులు ప్రమాదాల్లో చనిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతికుటుంబానికి 200 రోజల ఉపాధి హామీ పని కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు. ఈ సెమినార్లో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి, వ్యవసాయ సంఘం రాష్ట్ర నాయకులు కోట కళ్యాణ్, అప్పారావు, పిల్లి రామకృష్ణ, రవి, ఆంజనేయులు, కోటేశ్వరి పాల్గొన్నారు. -
మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనాలి
● ఆకాల వర్షాలకు నష్టపోయినరైతులను ఆదుకోవాలి ● జేసీకి వినతి పత్రం అందజేసిన తన్నీరు నాగేశ్వరరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ డిమాండ్ చేశారు. తక్షణం మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2400కు కొనుగోలు చేయాలని కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇలక్కియాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 18వ తేదీన కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న పంట దెబ్బతిన్న రైతులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. దెబ్బతిన్న పంటల వివరాలను వెంటనే సేకరించాలన్నారు. నష్టపోయిన వరి, మామిడి, బొప్పాయి, అరటి రైతులను గుర్తించి నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ నెల 18వ తేదీ కురిసిన వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. వరిలో ధాన్యం రాలిపోయి వట్టి కంకులు మాత్రమే మిగిలాయన్నారు. పెనుగంచిప్రోలు మండలంలో గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాలలో 800 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లిందన్నారు. కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసిందని, పొలంలో కోయని కాయలు రాలిపోయాయని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు శివరాత్రి పృథ్వీరాజ్, భైరబోయిన బాబు తదితరులు పాల్గొన్నారు. -
బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా శ్రీకాంత్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): తమ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా నియమితులయ్యారని ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కె.వి.ప్రభావతి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల వడోదరలో జరిగిన అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) వార్షిక సర్వసభ్య సమావేశంలో కబడ్డీ అభివృద్ధికి శ్రీకాంత్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా బీచ్ కబడ్డీ జాతీయ కమిషన్ చైర్మన్గా నామినేట్ చేస్తూ ఏకేఎప్ఐ ప్రతినిధులు నియమకపత్రం అందజేశారని తెలిపారు. శ్రీకాంత్కు ఆంధప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నక్కల అర్జునరావు, సంయుక్త కార్యదర్శి కె.వి.నాంచారయ్య, కోశాధికారి ఎం.సుబ్బరాజు తదితరులు అభినందనలు తెలిపారు. వేదాద్రి(జగ్గయ్యపేట): స్థానిక యోగానంద లక్ష్మీ నరసింహ స్వామికి భక్తులు హుండీల్లో సమ ర్పించిన కానుకల ద్వారా రూ.14.58 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ సురేష్బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీ కానుకలు లెక్కించారు. మూడు నెలల 21 రోజులకు ఈ ఆదాయం వచ్చింది. దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ పవన్కల్యాణ్, కేసీపీ ప్రతినిధి రాంప్రసాద్ పాల్గొన్నారు. ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు ఎన్ఆర్ఐ ఇంజినీరింగ్ కళాశాలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభించింది. ఈ మేరకు యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ రావి వెంకట్రావు బుధవారం మాట్లాడారు. 2007లో ఎన్ఆర్ఐ ఫార్మసీ, 2008లో ఎన్ఆర్ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని స్థాపించగా, 2018లో అటానమస్ హోదా లభించిందన్నారు. ఇప్పటివరకు అనేకమంది విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా ప్రమాణాలందించి, అంతర్జాతీయ సంస్థల్లో అవకాశాలు కల్పించామని వివరించారు. డీమ్డ్ యూనివర్సిటీ ఉత్తర్వులను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పెనమలూరు: గంగూరులో యూనియన్ పెట్రోల్ బంక్పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఉయ్యూరు మండలం పెదఓగిరాలకు చెందిన ముగ్గురు యువకులు యూనియన్ పెట్రోల్ బంక్కు బైక్పైవచ్చారు. పెట్రోల్ పోసిన తరువాత సొమ్ము చెల్లించే విషయంలో బంక్ సిబ్బందితో వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఆ ముగ్గురు సిబ్బందిపై దాడికి దిగి గాయపరిచారు. అంతటితో ఆగకుండా బంక్ ఫర్నిచర్, అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. అదే సమయంలో పెట్రోల్ పోయించుకోవటానికి వచ్చిన వాహనదారులు బెంబేలెత్తారు. కొద్ది సమయం యువకులు రెచ్చిపోయిన తరువాత తేరుకున్న బంక్ సిబ్బంది, స్థానికులు తిరగబడటంతో ఇద్దరు యువకులు పారిపోగా ఒక యువకుడు దొరికాడు. పోలీసులకు సమాచారం ఇవ్వ టంతో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
వైభవంగా వసంత నవరాత్రోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన బుధవారం అమ్మ వారికి తామర, గన్నేరు, సన్నజాజులు, ఎర్ర మందారాలు, మరువంతో విశేష పుష్పార్చన జరిగింది. తొలుత ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం ఎదుట కళావేదిక నుంచి అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు పూజలో పాల్గొనే ఉభయదాతలు, భక్తులు అమ్మవారికి సమర్పించే పుష్పాలతో ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం నూతన పూజా మండపంలోఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులు పుష్పా గంపలను అందించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణ మధ్య పుష్పార్చన కనుల పండువగా జరి గింది. పూజ అనంతరం ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాగురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026సిద్ధంగా లేకుంటే మున్ముందు ముప్పే! మే ఒకటో తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు లా పరీక్ష కేంద్రంలో వీసీ తనిఖీ సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 536.70 అడుగులకు చేరింది. ఇది 181.5216 టీఎంసీలకు సమానం. ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వేస్టేషన్లో గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను ఈగల్ బృందం అరెస్టు చేసి, వారి నుంచి 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఈగల్ బృందం, ఆర్పీఎఫ్, జీఆర్పీ, డాగ్ స్క్వాడ్ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారంతో ఈగల్ బృందం, ఇతర భద్రతా దళాలతో కలసి జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఈ తనిఖీల్లో సుమారు 66 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిని తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన 8 మంది అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి.. గంజాయి ముఠా సభ్యులు ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని కేరళ, తిరుపతి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. విజయవాడ మీదుగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఈగల్ ఇన్స్పెక్టర్ ఎం.రవీంద్ర హెచ్చరించారు. ఈ తనిఖీల్లో జీఆర్పీ ఇన్స్పెక్టర్లు జె.వి.రమణ, డి.నాగార్జున, ఎస్లు ఎం. వీరాంజనేయులు, రాంబాబు, డాగ్ స్వ్కాడ్ ఆర్ఎస్ఐ దుర్గాప్రసాద్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు సమర్థంగా పనులు చేపట్టి ఐదేళ్ల కాలంలో ఎన్టీఆర్ జిల్లాలో 1,10,727 ఇంటింటి కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక ఈ పథకం మరుగున పడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న అన్నదానానికి, ఉచిత ప్రసాద వితరణకు ముదునూరుకు చెందిన భక్తులు బుధవారం రూ. 2.75లక్షల విరాళాన్ని అందజేశారు. యలమంచిలి రంగారావు అమ్మవారి అన్నదానానికి రూ. 1.40లక్షలు, యలమంచిలి సీతా మహాలక్ష్మి ఉచిత ప్రసాద వితరణకు రూ. 1.35లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. దాతలకు వేద పండితుల ఆశీర్వచనంతో పాటు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో ఆలయ అధికారులు, అర్చకులు సత్కరించారు. కోడూరు: సముద్ర కాలుష్యాన్ని నివారించే అరుదైన ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పిల్లలను అటవీ అధికారులు బుధవారం సముద్ర బాట పట్టించారు. హంసలదీవి సాగరతీరం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో తాబేళ్ల సంతానోత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆలీవ్ రిడ్లే తాబేళ్లు తీరంలోని ఇసుకతిన్నెల వెంట గుడ్లు పెట్టగా, వాటిని అటవీ సిబ్బంది సేకరించి నిర్ణీత ఉష్టోగ్రత దగ్గర సంతానోత్పత్తి కోసం ప్రత్యేక కేంద్రంలో వాటిని భద్రపర్చారు. ప్రస్తుతం తొలివిడతగా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 123 తాబేళ్ల పిల్లలను సముద్ర బాట పట్టించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొని, తాబేళ్ల పిల్లలను సముద్రం వైపునకు విడిచిపెట్టారు. వైల్డ్ లైఫ్ ఏలూరు డివిజన్ డీఎఫ్ఓ త్రిమూర్తుల రెడ్డి, అటవీ రేంజర్ ఎస్వీకే కుమార్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి టి.నాగమణి, ఎఫ్బీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎ.కొండూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం అమలుపై ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ బుధవారం ఎ.కొండూరు మండలంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎ.కొండూరులోని పాత సినిమాహాలు వద్ద జరుగుతున్న సర్వే పనులను తహసీల్దార్ ఎన్.అరవింద్తో కలసి పరిశీలించారు. భూ సర్వే పక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వేలో ఉపయోగిస్తున్న పరికరాలను జేసీ పరిశీలించారు. సర్వే ద్వారా స్పష్టమైన రికార్డులు సిద్ధమవుతాయని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల్లో రూ. 89,17,515 నగదు రూపంలో వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు, బోగిరెడ్డిపల్లి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్. అరుణ సమక్షంలో కానుకలు లెక్కించారు. డీసీ శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడుతూ మొత్తం 76 రోజులకు గాను రూ. 89,17,515నగదు, బంగారం 44.004 గ్రాములు, వెండి 1.686 కిలోలు, అమెరికా డాలర్లు 129, ఇంగ్లాండ్ కరెన్సీ 5, ఆస్ట్రేలియా కరెన్సీ 20 సమకూరినట్లు వివరించారు. లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.జి.కొండూరు: వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలలో క్రమక్రమంగా తాగునీటి సమస్య తలెత్తుతోంది. మోటార్లు, పైపులైన్ల మరమ్మతుల సమస్యతో తాగునీటి సరఫరాకి బ్రేక్పడి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఆపదలో ఆదుకోవాల్సిన చేతి పంపులు మరమ్మతులకు నోచుకోక మూలన పడుతున్నాయి. వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నద్ధత లేకనే సమస్య ఉత్పన్నమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోతే కరువు సంభ విస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిది నెలలుగా తాగునీరు లేక.. జి.కొండూరు మండల పరిధిలో దుగ్గిరాలపాడు గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణా నీరు సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు నరకయాతన పడుతున్నా రు. గ్రామంలో 1200మంది వరకు జనాభా ఉండగా గ్రామంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటంతో వీరంతా కృష్ణావాటర్పైనే ఆధారపడ్డారు. దీంతో వీరు ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న గంగినేని వెళ్లి ప్యూరిఫైడ్ వాటర్ని తెచ్చుకుంటున్నారు. వీలుకాని వాళ్లు ఫ్లోరైడ్ నీటినే తాగుతున్నారు. అదేవిధంగా గంగినేని, తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, గడ్డమణుగు, చెర్వుమాధవరం గ్రామాలకు పైపులైన్ సమస్యతో నెలకు ఒకసారి చొప్పున కృష్ణా నీటిని విడుదల చేస్తున్నారు. భీమవరప్పాడు, చిన్ననందిగామ గ్రామాలకు కృష్ణావాటర్ పైపులైను లేక తాగునీరు అందుబాటులో లేక వాటర్ ప్లాంట్లకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు.. మా గ్రామానికి ఎనిమిది నెలలుగా కృష్ణావాటర్ రావడం లేదు. తాగేందుకు నీరులేక గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. పైపులైన్లు లీకుల వల్ల నీళ్లు రావడంలేదని చెబుతున్నారు. ఎనిమిది నెలలుగా లీకులకు మరమ్మతులు చేయకపోవడం దుర్మార్గం. గ్రామస్తులంతా వాటర్ ప్లాంట్లకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. – జడ రాంబాబు, సర్పంచ్, దుగ్గిరాలపాడు ● సేవలకు సత్కారం వన్టౌన్(విజయవాడపశ్చిమ): దీపావళి బాణసంచా వ్యాపారం వాణిజ్య పన్నుల శాఖలోని కొంతమంది ఉద్యోగులకు భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది! ఉమ్మడి కృష్ణాజిల్లాలో బాణసంచా వ్యాపారం ఏటా పెరుగుతుంటే వాణిజ్య పన్నుల శాఖ నివేదికల్లో మాత్రం భారీగా దిగజారుతోంది. అయితే ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి ఆ శాఖలో ఉద్యోగులే గండికొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు ఇటీవల ఆ శాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లోని లెక్కలే ఆధారాలుగా కనిపిస్తున్నాయి. అసలు ఏమైందంటే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో దీపావళి పర్వదినం సందర్భంగా నెల రోజుల ముందు నుంచే భారీగా బాణసంచా వ్యాపారం జరుగుతుంది. రెండు జిల్లాల్లో విజయవాడతో పాటుగా గుడివాడ, గన్నవరం, మచిలీపట్నం, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో భారీగా వ్యాపారం సాగుతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యాపారుల ద్వారా సుమారుగా రూ.150కోట్ల నుంచి రూ.175కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే ఆ వ్యాపారం అధికారిక లెక్కల్లో మాత్రం కనపడటం లేదు. దాంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులకు భారీగా గండి పడుతోంది. మొత్తం అధికారికంగా లెక్కల్లోకి వస్తే సుమారుగా 28 శాతం జీఎస్టీ చొప్పున రూ.40 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అధికారిక లెక్కల్లో ఇలా.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇటీవల జరిగిన దీపావళి బాణసంచా వ్యాపారం కనీసం రెండు కోట్లు సైతం దాటలేదని ఆ శాఖ నివేదికలు తెలియజేస్తున్నట్లుగా తెలిసింది. విజయవాడ డివిజన్–1, డివిజన్–2, డివిజన్–3 కొనసాగుతున్నాయి. మూడు డివిజన్ల పరిధిలో 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. డివిజన్–1 పరిధిలో సుమారుగా రూ.25 లక్షలు, డివిజన్–2 పరిధిలో సుమారుగా కోటి రూ.20 లక్షలు, డివిజన్ –3 పరిధిలో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వ్యాపారం జరిగినట్లుగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు లెక్కిస్తే మొత్తం కలిపినా రెండు కోట్లు దాటలేదని కొంతమంది ఉద్యోగులు చెబుతున్నారు. గత ఏడాదిలో మూడు డివిజన్ల పరిధిలో రూ.18 కోట్ల మేర వ్యాపారం జరిగినట్లుగా తెలిసింది. 40 మంది శాశ్వత వ్యాపారులు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా 30 నుంచి 40 మంది వ్యాపారులు దశాబ్దాలుగా అన్ని లైసెన్స్లు కలిగి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వీరు శాశ్వత పద్ధతిలో ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీరు కాకుండా ప్రతి ఏడాది రెండు నుంచి మూడు వందల మంది తాత్కాలికంగా ఆ పండుగ సమయంలో ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించి అనుమతి తీసుకొని వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. అయితే ఆ లెక్కన కేవలం డివజిన్–2 పరిధిలో మాత్రమే అధిక సంఖ్యలో తాత్కాలిక వ్యాపారులు నమోదు చేసుకొని వ్యాపారం చేసినట్లుగా, ఆ మేర ప్రభుత్వానికి పన్ను చెల్లించినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. డివిజన్–3 పరిధిలో.. దీపావళి సమయంలో అత్యధికంగా బాణసంచా విక్రయాలు చేసే పెద్ద దుకాణాలు డివిజన్–1 పరిధిలో నాలుగైదు ఉండగా.. విజయవాడ–3 డివిజన్ పరిధిలో అత్యధికంగా ఉన్నాయి. వీరంతా గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నారు. గుడివాడ పరిధిలో ఇటీవల జరిగిన వ్యాపారం సమయంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు భారీగా ముడుపులు తీసుకొని ఉన్నతాధికారులకు చిక్కారు. తమిళనాడు నుంచి భారీగా బాణసంచా నిల్వలను తెప్పించిన వ్యాపారికి సంబంధించి సరుకును అధికారులు గుర్తించటంతో దానిని సద్దుమణిగించటానికి ముడుపులు చెల్లించారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వివాదం ఆ తరువాత వదిలేశారు. ఆ వివాదంలో ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు కేవలం గృహిణులుగా కాకుండా వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన ఉమెన్ హుడ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామీణ మహిళల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘రైజ్’ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి ముందస్తు అనుభవం లేకపోయినా, కేవలం ఆలోచనతో వస్తే చాలని, వారికి అవసరమైన శిక్షణ, మార్కెటింగ్ మెలకువలు, సాంకేతిక సహకారాన్ని ఈ సెంటర్ల ద్వారా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నర్వీల్ ఇంటర్నేషనల్ మాజీ కోశాధికారి సరిత లునాని, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్ పర్సన్ అమ్రిత కుమార్, కలెక్టర్ సతీమణి సుప్రిత, ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ సీనియర్ చైర్ పర్సన్ సుప్రియ మలినేని తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశమొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని శాప్ చైర్మన్ ఏ. రవినాయుడు చెప్పారు. స్థానిక బందరు రోడ్డులోని శాప్ ప్రధాన కార్యాలయంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. శాప్ ఎండీ ఎస్.భరణీతో పాటుగా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, నగరాల్లోని పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంఘాలు, ఇతర విద్యాసంస్థలను కలుపుకొని ఈ వేసవి క్రీడా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ శిక్షణ శిబిరాల నిర్వహణకు శాప్ కోచ్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, రిటైర్డ్ ఉద్యోగులు సేవలను వినియోగించుకుంటామన్నారు. విద్యార్థులు, యువత ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిందిగా ఆయన కోరారు. కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న లా పరీక్షల కేంద్రాన్ని బుధవారం కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె.రాంజీ తనిఖీ చేశారు. బుధవారం ప్రారంభమైన లా మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి కృష్ణా విశ్వ విద్యాలయ ఫార్మసీ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. మచిలీపట్నం దైత శ్రీరాములు హిందూ లా కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి రాంజీ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 7ఎన్టీఆర్ జిల్లాలో ఆర్డబ్ల్యూఎస్ కింద తాగునీటి సరఫరా వివరాలు తాగునీటి సరఫరా హ్యాబిటేషన్లు 794 గ్రామాలు 321 జనాభా 9,87,854 కుటుంబాలు 2,67,574 ఇంటింటి కుళాయి కనెక్షన్లు 1,10,727 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు 19 ట్యాంకులు రక్షిత మంచినీటి పథకాలు 375 ట్యాంకులు మీడియం రక్షిత మంచినీటి పథకాలు 63 ట్యాంకులు డైరెక్ట్ పంపింగ్ స్కీములు 508 చేతి పంపులు 7,846 డివిజన్–3 పరిధిలోని ఒక వ్యాపారి తమిళనాడు నుంచి సుమారుగా తొమ్మిది కోట్ల మేర సరుకును తెప్పించినట్లుగా తెలిసింది. ఈ మేరకు పక్క రాష్ట్రం నుంచి వేబిల్లును సైతం తెచ్చారని ఒకరిద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఒకే వ్యాపారి ఇంత పెద్ద ఎత్తున సరుకు తీసుకొస్తే 40 మంది పెద్ద వ్యాపారులు మొత్తం ఎంత సరుకు దిగుమతి చేసుకొని ఉంటారో అర్థం చేసుకోవచ్చని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీపావళి పండుగ సమయంలో అత్యధిక వ్యాపారం జరిగే దుకాణాలు, పెద్ద వ్యాపారులు డివిజన్–3 పరిధిలోనే ఉన్నట్లుగా గతంలో జరిగిన నివేదికలు వివరిస్తున్నాయి. అయితే ప్రస్తుతం పండుగ సమయంలో జరిగిన వ్యాపారానికి సంబంధించిన నివేదికల్లో కనిపిస్తున్న నామమాత్రం లెక్కలు చూసి ఆ శాఖ అధికారులు సైతం విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
ఆదాయానికి మించి ఏఎంవీఐ ఆస్తులు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏవీఎంఐ)గా పనిచేస్తున్న పిల్లుట్ల లోకనాథప్రసాద్ ఇల్లు, కార్యాలయాల్లో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలుచేసి భారీగా ఆస్తి పత్రాలు, బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన లోకనాథప్రసాద్ బందరులో ఏవీఎంఐగా పనిచేస్తున్నారు. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు మంగళవారం విజయవాడలోని లోకనాథప్రసాద్ ఇల్లు, అతడి సోదరుడు ఇంటితో పాటు మచిలీపట్నంలోని కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో లోకనాథప్రసాద్ పేరిట ఉన్న సుమారు 2.75 ఎకరాల వ్యవసాయ భూమి దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో మరో మూడు భవనాల దస్తావేజులు, 450.2 గ్రాముల బంగారు, 1,496 గ్రాముల వెండి వస్తువులు, రెండు కార్లు, మూడుబైక్లు, రూ.18.80 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లు, రూ.2.54 లక్షల నగదు, ఒక బ్యాంకు లాకర్ తాళం చెవిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.40 వేలను సీజ్ చేశారు. తాళంచెవి దొరికిన బ్యాంకు లాకర్ను సోదా చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తులు కలిగిన లోకనాథప్రసాద్పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. -
మరమ్మత్తులో సీటీస్కాన్
లబ్బీపేట(విజయవాడతూర్పు): జబ్బు చేసి వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కు వచ్చే పేదలకు ఇబ్బందులు తప్పడంలేదు. సీటీ స్కాన్ అవసరమైతే వారి పరిస్థితి వర్ణనాతీతమే. ప్రభుత్వాస్పత్రిలోని రెండు సీటీ స్కాన్ యంత్రాలు ప్రస్తుతం పనిచేయడం లేదు. పదేళ్ల క్రితం పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ తరచూ మొరాయిస్తోంది. దాని స్థానంలో కొత్త యంత్రం ఏర్పాటు పనులు వారం రోజులుగా జరుగుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లోని మరో సీటీ స్కాన్ యంత్రం కూడా తరచూ మొరాయిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ఏదైనా యంత్రం మరమ్మతులకు గురైతే వెంటనే బాగు చేసే వాళ్లు. ప్రస్తుతం మరమ్మతులకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. మంగళవారం ఒక రోగి నడవలేని స్థితిలో ప్రభుత్వాస్పత్రికి రాగా, అతనికి వైద్యులు సీటీ స్కాన్ రాశారు. దీంతో రోగిని అతని బంధువులు మండుటెండలో స్ట్రెచ్చర్పై ఉంచి ప్రభుత్వా స్పత్రికి 700 మీటర్ల దూరంలో వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఉన్న అమరావతి సెంట్రల్ ల్యాబ్కు నెట్టుకెళ్లి సీటీ స్కాన్ తీయించాల్సి వచ్చింది. వారం రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో ఇదే పరిస్థితి కొనసాగుతోందని రోగులు వాపోయారు. -
అట్రాసిటీ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026u8లో సాక్షి, ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖచిత్రం మరోసారి మారనుంది. కొత్తగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొత్తగా ఒక లోక్సభ స్థానం ఏర్పాటు కానుంది. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 50 శాతం మేర పెరగనుంది. 2011 జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లాలో 17.35 లక్షలు, ఎన్టీఆర్ జిల్లాలో 22.18 లక్షల చొప్పున మొత్తం 39.53 లక్షల మంది జనాభా ఉన్నారు. కృష్ణా జిల్లాలో 8.66 లక్షల మంది, ఎన్టీఆర్ జిల్లాలో 11.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. మహిళలకు 33 శాతం స్థానాలను రిజర్వేషన్ చేయనుంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన అనంతరం వీటి సంఖ్య 21కి చేరుకోనుంది. లోక్సభకు సంబంధించి ప్రస్తుతం విజయవాడ, మచిలీపట్నం పార్లీమెంటరీ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన తరువాత మరో కొత్త లోక్సభ స్థానం ఏర్పడ నుంది. మహిళలకు ఐదు శాసన సభ స్థానాలు రిజర్వు కానున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు జిల్లాలో పలు నియోజకవర్గాల స్వరూపాల్లో సైతం మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొన్ని నియోజకవర్గాల పేర్లు మారే అవకాశం ఉంది. విజయవాడ పరిసరాల్లోనే మార్పులు.. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ నగరంలో ప్రస్తుతం విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. నగరాన్ని ఆనుకుని ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని మైలవరం, కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే జనాభా అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ చుట్టు పక్కలే కొత్తగా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విజయవాడ రూరల్, భవా నీపురం, ఇబ్రహీంపట్నం, కృష్ణలంక, కానూరు ప్రాంతాలను కలుపుతూ కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. విజయవాడ నగరంలోని ప్రస్తుతం ఉన్న మూడు నియోజకవర్గాలు, ఆరు నియోజకవర్గాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉందని అంచనా. కృష్ణా జిల్లాలో కంకిపాడుతోపాటు, గుడివాడ, పామర్రు మధ్య మరో కొత్త నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్య పేట, నందిగామ మధ్య మరో నియోజకవర్గం పెరిగే సూచనలు ఉన్నాయి. ఎస్సీ నియోజకవర్గాలు కూడా మారే అవకాశం ఉంది. లోక్సభ స్థానంపై చర్చ అసెంబ్లీతోపాలు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఉమ్మడి జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కేంద్రాలుగా లోక్ సభ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన అనంతరం మరో స్థానం ఏర్పడనుంది. దీనిని ఏ పేరుతో ఏర్పాటు చేస్తారనే చర్చ సాగుతోంది. విజయవాడ నగరమే ఓ లోక్సభ స్థానంగా ఏర్పడుతుందని అంచనా. ఎన్టీఆర్ రూరల్ జిల్లా, విజయవాడ చుట్టు పక్కల ఉన్న కృష్ణా జిల్లా పరిధిలోని ప్రాంతాలతో కొత్తగా లోక్సభ స్థానం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ పునర్విభజతో రాజకీ యంగా చైతన్య వంతమైన కృష్ణాలో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. తిరువూరుజగ్గయ్యపేటనందిగామౖమైలవరంగన్నవరంగుడివాడపెనమలూరుపెడనపామర్రుమచిలీపట్నంఅవనిగడ్డకోనేరుసెంటర్(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ అనుబంధ సంస్థ బోర్డు ఆఫ్ ఏప్రింటిషిప్ ట్రైనింగ్ (చైన్నె)తో కృష్ణా విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. విశ్వవిద్యాలయ ట్రైనింగ్, ప్లేస్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ఉపకులపతి ఆచార్య కె.రాంజీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, బోట్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజమణి రాజు మంగళవారం అవగాహన ఒప్పంద పత్రాలపై సంత కాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం విద్యార్థులకు అప్రెంటిస్షిప్, ఉద్యోగ అవకాశాలను బోర్డు ఆఫ్ ఏప్రింటిషిప్ ట్రైనింగ్ సంస్థ కల్పించనుంది. విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇదొక సదవకాశం అని ఉపకుల పతి ఆచార్య రాంజీ పేర్కొన్నారు. గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ సూచించారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సమస్యల పరిష్కారంపై కమిషన్ చైర్మన్ మంగళవారం ఎన్టీఆర్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో జవహర్ మాట్లాడారు. జిల్లాలో 51 అట్రాసిటీ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటిని సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన రాముడు, సభ్యులు శ్రీపతి బాబు, డి.ఆర్.గౌతమ్, మేకల దాస్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కె.ఎల్.హర్షిత, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా లయ సంస్థ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 1.60 లక్షల మంది ఓటర్లు ఉంటారని అంచనా. విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాలతో పాటు, చుట్టూ పక్కల ఉన్న గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో రెండు లక్షల మందికిపైనే ఓటర్లు ఉండటం గమనార్హం. ఎస్సీ రిజర్వుడు స్థానాల సంఖ్యపెరగడం, నియోజకవర్గాల మార్పు జరుగుతుండటంలో ఉమ్మడది జిల్లా ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రధానంగా 2029 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఐదు సీట్లు మహిళలకు రిజర్వుడు కానున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. జిల్లాలో ఎక్కడా చూసినా నియోజకవర్గాల పునర్విభజన పైనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఐదు సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. చివరిగా 2008వ సంవత్సరంలో జరిగింది. దాదాపు 20 సంవత్సరాల తరువాత మరోమారు నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ పురుషుల మహిళల థర్డ్ జెండర్ మొత్తంనియోజకవర్గం సంఖ్య సంఖ్య సంఖ్యతిరువూరు (ఎస్సీ) 99,241 1,01,363 9 2,00,613 విజయవాడ వెస్ట్ 1,21,538 1,23,888 34 2,45,460 విజయవాడ సెంట్రల్ 1,32,902 1,38,615 59 2,71,576 విజయవాడ ఈస్ట్ 1,26,150 1,30,967 17 2,57,134 మైలవరం 1,30,824 1,37,943 18 2,68,785 నందిగామ (ఎస్సీ) 96,418 1,02,189 9 1,98,616 జగ్గయ్యపేట 94,936 1,02,021 11 1,96,968 మొత్తం 8,02,009 8,36,986 157 16,39,152 అసెంబ్లీ పురుషుల మహిళల థర్డ్ జెండర్ మొత్తంనియోజకవర్గం సంఖ్య సంఖ్య సంఖ్యగన్నవరం 1,35,478 1,46,504 9 2,81,991 గుడివాడ 97,987 1,07,036 13 2,05,036 పెడన 83,054 84,876 0 1,67,930 మచిలీపట్నం 94,836 1,01,946 10 1,96,792 అవనిగడ్డ 1,03,652 1,07,313 11 2,10,976 పామర్రు (ఎస్సీ) 88,721 94,906 3 1,83,630 పెనమలూరు 1,43,120 1,53,848 3 2,96,971 మొత్తం 7,46,848 7,96,429 49 15,43,326 -
అన్నింటిలోనూ జనసేనకు తీవ్ర అన్యాయం: బొలిశెట్టి శ్రీనివాస్
విజయవాడ: తమ పార్టీకి అన్నింటిలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. టీడీపీకి తాము ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ వారు తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు. ప్రతిదాంట్లో జనసేన అసంతృప్తిగానే ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలకు న్యాయం జరగడం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యమిస్తున్నాం.. మాకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే సమన్వయ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. -
పిల్లల విక్రయం కేసు.. జనసేన నేత తల్లి అరెస్టు
సాక్షి,కైకలూరు: రాష్ట్రంలో కలకలం రేపుతున్న పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీగలాగితే డొంకంత కదిలిందన్న చందంగా పిల్లల విక్రయం కేసులో నిందితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. తాజాగా, పిల్లల విక్రయాల్లో సూత్రధాని జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ ప్రమేయం ఉన్నట్లు తేలింది. అబ్బిశెట్టి వీరమ్మతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయ ముఠా సభ్యురాలు ఫరీనాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్జైల్లో ఉన్న ఫరీనాను పిటి వారెంట్పై విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కైకలూరు పోలీసులు పీటీ వారెంట్పై విచారించనున్నట్లు కైకలూరు పోలీసులు తెలిపారు. -
‘ఇది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడమే’
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించడాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రశ్నించారు. లోక్సభలో పైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా మిథున్రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించొద్దన్నారు. ‘ కేంద్ర బడ్జెట్లో పోలవరం ఎత్తు 41.15 మీటర్లుగా నిర్ణయించారు. కానీ వాస్తవానికి పోలవరం ఒరిజినల్ ఎత్తు 45.72 మీటర్లు ఉండాలి. నిర్మాణానికి 55,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఒరిజినల్ ప్రణాళిక ప్రకారం పోలవరం నిర్మించాలి. పోలవరం నిల్వ సామర్థ్యాన్ని 190 టీఎంసీల నుంచి 120 కి తగ్గించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయడమే. ఆంధ్రప్రదేశ్ అప్పు రెండేళ్లలో 3 లక్షల 36,000 కోట్ల రూపాయలు దాటింది. ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఏపీలో అప్పులు పెరుగుతున్నాయి...జీఎస్టీ రాబడి తగ్గుతోంది. ఏపీ తీవ్ర ఆందోళనకర పరిస్థితిలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దెందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఏపీలో అత్యధిక 8.2 శాతం నిరుద్యోగ రేటు ఉంది. జాతీయ సగటు 5.2 ఉంటే ఏపీ ది అత్యధికంగా 8 శాతం ఉంది. మహిళల్లో నిరుద్యోగ రేటు 10% గా ఉంది. వైఎస్ జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 32 లక్షల పట్టాలు ఇచ్చి .. ఇల్లు మంజూరు చేశారు. ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో 14 లక్షల 20 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2024 నుంచి 26 మధ్య టిడిపి ప్రభుత్వం రూ. 1165 కోట్ల రూపాయలను ఇల్ల నిర్మాణానికి వినియోగించకుండా వదిలేసింది. ఏపీలో ఇళ్ల నిర్మాణానికి నిధులను తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందిచాలామంది ప్రజలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటకీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదు. రాజకీయాలు పక్కన పెట్టి పోలవరం కోసం పనిచేసేందుకు ముందుకు వస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. కొత్త స్టీల్ ప్లాంట్ కు సంబరాలు చేస్తున్న ప్రభుత్వం.... ఉన్న స్టీల్ ప్లాంట్ను ఎందుకు చంపుతుంది?, విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించాలి. కడప బెంగళూరు రైల్వే లైన్కు రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయించాలి. చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ బకాయిలకు చిన్న వ్యాపారులను శిక్షించొద్దు. ఎంఎస్ఎమ్ఈలకు జీఎస్టీ ఇన్కమ్ టాక్స్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
నాడు అభివృద్ధికి రూపం .. నేడు దుబారాకు కలరింగ్!
అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు. ఇందుకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చే నిదర్శనం.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట. ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజెన్లకే వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు. ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం. ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు.. అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని నవ్వుకోక మానరు.రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 230 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు అవుతున్న ఖర్చు పోలిస్తే ఇది బాగా తక్కువ. మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.ఆ భవనాలపై వికృత రాజకీయంరాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా వైఎస్ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. రూ. 230 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు. అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు.. ఇప్పుడొక కవరింగ్. ఇది బాబుగారి రాజనీతి పాలన.మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఏ విషయంలోనైనా జగన్ మార్క్ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్ అంటూ మెచ్చుకున్నది మీరే. ఇది కూటమి పెద్దల తీరు. అయితే, మరి ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్ భవనాలను పోల్చి చూస్తే.. కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది. నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు ఏంటని చర్చించుకుంటున్నారు. -
వైఎస్ జగన్ సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు : కొడాలి నాని
సాక్షి,కృష్ణా: 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. దొంగ వాగ్ధానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జొన్నపాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో కొడాలి నాని వ్యాఖ్యానించారు‘వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పరని ప్రజలకి తెలుసు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది. సూపర్-6 అంటూ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దొంగ వాగ్ధానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేశారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని చెబుతారు. 2029లో వైఎస్ జగన్ను ప్రజలు గెలిపిస్తారు.ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ విలువ తెలిసింది. జగన్ను వదులుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. జగన్ ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేదలు భావిస్తున్నారు. జగన్ను సీఎం కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదు. కావాలనే వైఎస్ జగన్పై నిందలు మోపుతున్నారు. తండ్రి చనిపోతే తండ్రి ఆస్తిలో వాటాలు ఇచ్చే వారిని చూశాం. తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి జగన్. వైఎస్ జగన్పై దారుణంగా మాట్లాడుతున్నారు. జగన్ ఎప్పుడూ చెల్లెళ్ల గురించి తప్పుగా మాట్లాడలేదు. లడ్డూ విషయంలో దేవుడు కూటమికి మొట్టికాయలు వేశాడు’అని వ్యాఖ్యానించారు. -
తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం చుట్టూ అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేదదీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలో వాహనాల రద్దీ కొనసాగింది. విజయవాడ కల్చరల్: పరాభవనామ ఉగాది వేడుకల సందర్భంగా శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యంలో జీవీఆర్ సంగీత కళాశాలలో ఆదివారం నిర్వహించిన భువన విజయం సాహితీ రూపకం సాహిత్య పరిమణాలు వెదజల్లింది. సాహితీ సమరాంగణ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు భువన విజయం స్ఫూర్తితో నిర్వహించిన సాంస్కృతిక రూపకం పూర్తిగా విజయవంతమైంది. శ్రీ కృష్ణదేవరాయలుగా కేతవరపు శివరామకుమార్, మహామంత్రి తిమ్మరసుగా ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారయణ మూర్తి, అల్లసాని పెద్దగా డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, నంది తిమ్మనగా దండిభట్ల దత్తాత్రేయ శర్మ, మాదయగారి మల్లనగా డాక్టర్ గుమ్మా సాంబశివరావు, పింగళి సూరనగా డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, భట్టుమూర్తిగా పోవూరి గౌరీనాథ్, అయ్యలరాజు రామభద్రునిగా కుందా విజయరామశర్మ, ధూర్జటిగా కోట వెంకట లక్ష్మీనరసింహం, తెనాలి రామ కృష్ణుడిగా మల్లాప్రగడ నందకిషోర్, బాల కవిగా మల్లాప్రగడ అభిరాం తమ సాహిత్య గ్రంథ విశేషాలను వివరించారు. శ్రీ సద్గురు సంగీత సభ అధ్యక్షుడు బీవీఎస్ ప్రకాష్, సంగీత కళాకారులు గాయత్రీ గౌరీనాథ్, చారుమతీ పల్లవితోపాటు పలువురు భాషా పండితులు పాల్గొన్నారు. రేపల్లె: రేపల్లె పట్టణ గ్రామదేవత బూరగలమ్మ అమ్మవారి పుష్కర కుంభాభిషేక మహోత్సవం నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఆలయ మహాకుంభాభి షేక మహోత్సవం సోమవారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకుడు నందివెలుగు భానుసుధాకర్ గురుకులు ఆదివారం తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకమారు ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరుగుతాయని దీనిలో భాగంగా విశేష పూజలతోపాటు ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 25వ తేదీ ఉదయం 9.50 గంటలకు ఆలయ శిఖరానికి, అమ్మవారికి ఏకకాలంలో అభిషేకం జరుగుతాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం 11.30 గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి మహాకుంభాభిషేక మహోత్సవం జయప్రదం చేయాలని కోరారు. అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివానతోపాటు పిడుగు పడటంతో విజయ్కుమార్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహన్ని అమరావతి సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
మనోహర్నాయుడుకు సత్కారం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): సమాజ హితం కోసం కృషి చేస్తున్న విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్నాయుడుది ఉన్నతమైన వ్యక్తిత్వం అని సీపీఐ జాతీయ నాయకుడు కె. నారాయణ కొనియాడారు. విశాలాంధ్ర పబ్లికేషన్స్ మేనేజర్, విజయవాడ బుక్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్నాయుడుకు కళారత్న అవార్డు ప్రభుత్వం నుంచి అందుకున్న సందర్భంగా బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలో ఆయనకు అభినందన సభను నిర్వహించారు. సాహిత్య అకాడమీ ప్రముఖుడు ఎమెస్కో విజయకుమార్ అధ్యక్షతన జరిగిన ఈసభకు కె. నారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రచన ప్రపంచం చాలా ప్రాముఖ్యమైందని, అందరితో మమేకమయ్యే దృక్పథంతో పనిచేస్తే సత్ఫలితాలు దక్కుతాయని చెప్పారు. మనోహర్నాయుడు అందరివాడు.. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడుతూ మనోహనాయుడు అందరివాడని ప్రభుత్వం నుంచి అవార్డు ఆయనకు దక్కడం గర్వకారణమన్నారు. అనంతరం మనోహర్నాయుడు ఆయన కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరనాథ్రెడ్డి, ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ లక్ష్మయ్య, విజయవాడ బుక్ పెస్టివల్ సభ్యులు వెంకట నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచాలి
వీఎంసీ ఇంజినీరింగ్ అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు పటమట(విజయవాడతూర్పు): పెరుగుతున్న నగర విస్తీర్ణం, జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఎస్టీపీ సామర్థ్యానికి తోడు నిర్మాణంలో ఉన్న రెండో ఎస్టీపీ పనులను త్వరితగతిన పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి. లక్ష్మీశ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం విజయవాడ రామలింగేశ్వర నగర్లోని 20 ఎంఎల్డీ సామర్థ్యమున్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ)ని సందర్శించారు. మురుగునీటి శుద్ధి ప్రక్రియ, వినియోగంలో ఉన్న సాంకేతిక విధానాలు, నిర్వహణ తీరు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ సామర్థ్యానికి అనుగుణంగా శుద్ధి జరుగుతోందా లేదా అన్న దానిపై సమగ్రంగా సమీక్షించారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో 20 ఎంఎల్డీ సామర్థ్యమున్న ప్లాంటు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రెండో ఎస్టీపీ పనుల పురోగతిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. నగర ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ ఇన్చార్జ్ సీఈ పి.సత్యకుమారి, ఇతర అధికారులు ఉన్నారు. -
ఆంధ్ర నాట్యం
సమ్మోహనం.. విజయవాడ కల్చరల్: డాక్టర్ నటరాజ రామకృష్ణ జయంతి సందర్భంగా నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్కు చెందిన స్వరనర్తన సంస్థలు, ఏపీ సృజనాత్మక సమితి సహకారంతో పటమట స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో ఆదివారం పంచశత ఆంధ్రనాట్య సంగమం త్రివేణీ సంగమంలా సాగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి వచ్చిన నాట్యాచార్యులు ఆంధ్రనాట్య సంప్రదాయంలో పలు అంశాలను 500 మంది ఏకకాలంలో నృత్యాలను అభినయించారు. పంచశత నాట్య సమ్మేళన రూపకర్త నాట్యాచార్యుడు పిళ్ళా ఉమామహేశ్వర పాత్రుడు నిర్వహించారు. ఆంధ్ర నాట్యానికి పూర్వవైభవం తీసుకురావాలి ఆంధ్ర నాట్యానికి పూర్వవైభవం తీసుకురావాలని నటరాజ రామ కృష్ణ ప్రత్యక్ష శిష్యుడు కళాకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ మరుగున పడిన ఆంధ్ర నాట్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి జీవితాంతం కృషి చేశారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూచిపూడి నాట్యానికి ప్రాధాన్యమిచ్చినట్లే ఆంధ్ర నాట్యానికి కూడా ఇవ్వాలని సూచించారు. ఆంధ్ర నాట్యాచార్యులు పి.ఉమాహేశ్వర పాత్రుడు, దెందులూరి పద్మామోహన్, కర్నాటి నవతలు ఆంధ్రనాట్య విశిష్టతను వివరించారు. నాట్య ప్రదర్శనలో పాల్గొన్న నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ శిష్యప్రశిష్యులు కావడం విశేషం. -
కేవీఎస్లో అడ్మిషన్లు ప్రారంభం
నందిగామ టౌన్: నందిగామలో నూతనంగా ఏర్పాటవుతున్న కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ రెండులోగా https://admission.kvs.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అదే విధంగా రెండో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆఫ్లైన్ ద్వారా ఏప్రిల్ రెండు లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ కేవీఎస్ సంగటన్ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐదో అంతస్తులో దుకాణదారులకు ఈవో హెచ్చరిక ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పూజా సామగ్రి, కొబ్బరికాయలను నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేసినా, భక్తులు నడిచే దారిని ఆక్రమించినా వెంటనే లీజ్ రద్దు చేస్తామని దుర్గగుడి ఈవో శీనానాయక్ దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం మహామండపం ఐదో అంతస్తులో పూజా సామగ్రి షాపింగ్ కాంప్లెక్స్ను ఈవో, దేవస్థాన అధికారులు ఆదివారం తనిఖీ చేశారు. దుకాణదారులకు కేటాయించిన స్థలం కంటే అదనంగా స్థలాలను ఆక్రమిస్తున్నారని, తద్వారా భక్తుల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపున నిర్ణీత ధరల కంటే అధికంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో ఆర్టీజీఎస్ ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని ఏఈవో ఎన్. రమేష్బాబును ఆదేశించారు. ఈవో వెంట ఈఈ ఎల్.రమా, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తున్న ఓ కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొనడంతో ధ్వంసమైన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2గంటల సమయంలో గుంటూరు నుంచి ఓ వ్యాన్ కృష్ణాజిల్లాలోని ఉయ్యూరుకు వెళ్తోంది. ఆ వాహనం స్క్రూబ్రిడ్జి దాటి బెంజిసర్కిల్ సమీపానికి చేరుకోగానే వ్యాన్ డ్రైవర్ వేగాన్ని తగ్గించాడు. దాని వెనకాలే మచిలీపట్నం వెళ్తున్న ఒక కారు డ్రైవర్ ముందు వ్యాన్ను గమనించి వెంటనే కారు ఆపాడు. ఆ సమయంలో స్క్రూబ్రిడ్జి నుంచి బెంజిసర్కిల్ వైపునకు అతివేగంగా వెళ్తున్న మరో కారు ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి ఆగి ఉన్న కారు కొంచెం దూరం ముందుకు కదిలి ముందు వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టి రెండు వాహనాల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో కారు ముందు, వెనుక భాగాలు ధ్వంసమయ్యాయి. ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వెనుకవైపు కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండి కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
31న ‘మా ఏపీ’ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు
తెనాలిటౌన్: మా–ఏపీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన వివిధ రంగాల్లోని ప్రముఖులు ఎనిమిది మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్రాజా వెల్లడించారు. తెనాలిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్, 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చూన్ కల్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగు తాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కుష్ఠు, ఎయిడ్స్ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్, అనాఽథ శవాల దహనసంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్ డి.శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణి తేజస్వి ప్రఖ్య, షార్ట్ ఫిలిమ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్ సాయిప్రకర్షలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాసయాదవ్, పెదరావూరు ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్బాబు పాల్గొన్నారు. -
సీఐ, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోండి
తన భర్త మృతికి వారే కారణమంటూ ఆరోపిస్తూ మహిళ ఆందోళనగన్నవరం: తన భర్త పడమట నాగరాజు ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన గన్నవరం సీఐ, కానిస్టేబుళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పడమట వీరాకుమారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పడమట నాగరాజు అంతిమయాత్రలో భాగంగా అతని కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరాకుమారి మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ సెటిల్మెంట్ విషయమై ఈ నెల 19న పోలీసులు నాగరాజును ఈ స్టేషన్కు పిలిపించారని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో నాగరాజు బాధ్యుడిని చేసి రూ. 5 లక్షలు కట్టమన్నారని, లేకపోతే పాత కేసులు తిరగదోడి ఇబ్బందులకు గురిచేస్తామని సీఐ, కానిస్టేబుళ్లు బెదిరించినట్లుగా తెలిపారు. ఆయన సెల్ఫోన్ను కూడా పోలీసులు లాక్కొన్నారని చెప్పారు. అవమానభారంతో స్టేషన్ నుంచి వెళ్లిన నాగరాజు తిరిగి ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురై తన ఇరువురు కుమారైలతో కలిసి ఈ నెల 20వ తేదీ రాత్రి ఫిర్యాదు చేసేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లినట్లు చెప్పారు. మహిళననే కనీస గౌరవం లేకుండా సీఐ, ఎస్ఐ, సిబ్బంది కించపరుస్తూ మాట్లాడటంతో పాటు నీ భర్త డబ్బులు తీసుకురాకపోతే పిల్లలతో సహా తనను స్టేషన్లో కూర్చోబెడతానని బెదిరింపులకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తన కులాన్ని కూడా అవహేళన చేస్తూ సీఐ మాట్లాడారని చెప్పారు. తన విజ్ఞప్తిపై పోలీసులు స్పందించి తన భర్త ఆచూకీని గుర్తించి ఉంటే బతికి ఉండేవారని తెలిపారు. తన భర్త మృతికి ముమ్మాటికీ సీఐ, కానిస్టేబుళ్లే కారణమని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వంశీ నివాళులు.. తొలుత స్థానిక గాజులపేటలోని నివాసం వద్ద పడమట నాగరాజు భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్, ఎంపీపీ అనగాని రవి, పలువురు గౌడ సంఘ నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఐ ప్రవర్తనే కారణం.. గన్నవరం: పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న పండ్ల వ్యాపారి పడమట నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని గన్నవరం నియోజకవర్గ గౌడ సంఘ నేతలు డిమాండ్ చేశారు. స్థానిక గాజులపేటలోని నాగరాజు నివాసం వద్ద ఆదివారం గౌడ సంఘ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనగాని రవి మాట్లాడుతూ ఎటువంటి ఫిర్యాదు లేకుండానే ఓ ప్రైవేట్ సెటిల్మెంట్ వ్యవహారంలో నాగరాజును స్టేషన్కు పిలిపించి రూ. 5 లక్షలు కట్టమని సీఐ, కానిస్టేబుల్స్ బెదిరించారని చెప్పారు. వీరి వేధింపులు తాళలేక నాగరాజు ఆత్మహత్యయత్నానికి పాల్పడి గుంటూరులోని ఆస్పత్రిలో ఉన్న విషయం తెలుసుకుని హడవుడిగా నాగరాజుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అంతకు ముందు రోజు భర్త ఆచూకీ కోసం పోలీస్స్టేషన్కు వెళ్లిన నాగరాజు భార్య, పిల్లల పట్ల సీఐ, ఎస్ఐలు అమర్యాదగా మాట్లాడడంతో పాటు గౌడ కులస్తులు పొగరుబోతులంటూ సీఐ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం కారణంగా గౌడ సంఘానికి చెందిన పలగాని శివాజీ పెద్ద కుమారుడు ప్రణయ్ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారని తెలిపారు. ఈ వరుస సంఘటనలపై డీఎస్పీ, ఎస్పీ దృష్టి సారించాలని చెప్పారు. గౌడ సంఘ నేతలు మరీదు రాంబాబు, ఎస్ఎస్. గౌడ్, మోదుగుమూడి వెంకటేశ్వరరావు, లుక్కా ప్రసాద్, హరిష్, మోదుగుమూడి రాజేశ్వరి, మృతుడు నాగరాజు భార్య వీరాకుమారి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
కార్తికేయుని ఆలయంలో భక్తుల కోలాహలం
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగ పుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే వివిధ సేవా టికెట్ల ద్వారా స్వామి వారికి రూ. 8,35,885 ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిఽధిలోని బకింగ్హామ్ కెనాల్ ఉండవల్లి సెంటర్ బ్రిడ్జి పైనుంచి ఆదివారం ఓ వృద్ధుడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సాయికుమార్ సంఘటనా స్థలానికి వచ్చి నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీయించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కొట్టు సెంటర్ ప్రాంతంలో నివాసముండే ధనేకుల అర్జునరావు (68)గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అర్జునరావు ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. జరిగిన సంఘటనపై భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకే సమయంలో ప్రాణం పోయి ఉంటుందని అందువల్లే మృతదేహం నీటిపై తేలియాడిందని ఎస్ఐ తెలిపారు. ఇరువురికి స్వల్ప గాయాలు నందిగామ రూరల్: ట్రాక్టర్ను కారు ఢీకొన్న ఘటనలో ట్రాక్టర్ ఇంజిన్ రెండు ముక్కలైన ఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు మండలంలోని ఐతవరం గ్రామ సమీపంలో 65వ నంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న ట్రాక్టర్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన షేక్ కిరాయిబాబుకు చెందిన ట్రాక్టర్ ఇంజిన్ రెండు భాగాలుగా విడిపోయింది. కాగా కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాద వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వైవీఎల్ నాయుడు తెలిపారు. -
నిగ్గుతేలుస్తారా? నీళ్లొదిలేస్తారా?
స్వామి సొమ్ము స్వాహా ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యంపెనమలూరు: పవిత్ర పుణ్య క్షేత్రం యనమలకుదురు రామలింగేశ్వరుని ఆలయంలో స్వామివారి ఆభరణాలు, సొమ్ము స్వాహా వ్యవహారంలో ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో జరిగిన ఘటనలపై ప్రభుత్వ స్పందన సక్రమంగా లేదని భక్తులు విమర్శిస్తున్నారు. అదే శాఖకు చెందిన అధికారులతో విచారణ చేయిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. అసలు సూత్రధారి ఆలయ ఈవో ఎన్.భవానీని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవటంతో శివుడికి న్యాయం ఎలా జరుగుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యనమలకుదురు శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో గత కొద్దికాలంగా స్వామివారి ఆభరణాలు, హుండీలో సొమ్ము ఈవో భవానీ నాయకత్వంలో స్వాహా చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమెదు చేశారు. ఆలయ అభివృద్ధికి దాత సంగా నరసింహారావు తన ఆస్తినంతా స్వామివారి ఆలయ అభివృద్ధికి ఖర్చు చేసి శ్రమించారు. భక్తులు కూడా స్వామివారికి తమ వంతు సాయం అందించారు. ఆలయం దినదినాభివృద్ధి చెందటంతో రాష్ట్రంలోనే శ్రీరామలింగేశ్వరస్వామివారికి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించింది. దీంతో భక్తుల సంఖ్య పెరగటంతో స్వామివారికి హుండీ ఆదాయం పెరిగింది. దీంతో స్వామివారి ఆదాయంపై స్వార్థ పరుల కన్ను పడింది. సూత్రధారి ఎక్కడ? ఆలయంలో స్వామివారి సంపదపై కన్నేసిన అసలు సూత్రధారి ఈవో ఎన్.భవాని ఎక్కడన్న ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. పోలీసులు ఆలయంలో నిధుల స్వాహాపై కేసు నమోదు చేసి ఇద్దరు అర్చకులు సాగర్, పూర్ణ, ఉద్యోగి రోశయ్యలను అరెస్టు చేసినా నేటికి ఈవో ఎన్.భవానీని అరెస్టు చేయలేక పోయారు. ఈవోను అరెస్టు చేయక పోవటంతో వెనుక పెద్దల పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మీడియాలో కథనాలు రావటంతో ఇక తప్పక భవానీని సస్పెన్షన్ చేశారని చెబుతున్నారు. భవానీని అరెస్టు చేయటంతో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండి పడుతున్నారు. ఆమె చిక్కితేనే స్వాహా చేసిన స్వామివారి కానుకల వ్యవహారం బహిర్గతం అవుతుందని భక్తులు అంటున్నారు. పైగా ఆమె వెనుక ఉన్న పెద్దల వ్యవహారం కూడా వెలుగు చూస్తుందని భక్తులు చెబుతున్నారు. అలాగే జైలుకు వెళ్లిన నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారణ చేయలేదు. ఇదేం కమిటీ? ఆలయంలో స్వామివారి కానుకలు స్వాహా చేసిన ఘటనపై రీజనల్ జాయింట్ కమిషనర్ విచారణకు ఎండోమెంట్ శాఖలో ఐదుగురు అధికారులను నియ మించారు. ఈ కమిటీ ఈ నెల 15వ తేదీన వేసినట్లు ఉత్తర్వుల్లో ఉంది. అయితే కమిటీ చాలా ఆలస్యంగా ఆలయానికి సోమవారం విచారణకు వస్తోంది. కమిటీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇంటి దొంగలను కమిటీ ఏమి చేయగలదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సిట్’ వేసి వివిధ శాఖల అధికారులతో విచారణ చేయిస్తే అసలు గుట్టురట్టవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. కమిటీ వ్యవహారం పరిశీలిస్తే తూతూ మంత్రంగా విచారణ చేసి కథ కంచికి పంపే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ప్రక్షాళన జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని భక్తులు తెలుపుతున్నారు. ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి భక్తులు సమర్పించిన ఆభరణాలు మాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అసలు భక్తులు స్వామివారికి ఏమి కానుకలు ఇచ్చింది నిగ్గు తేలాలంటే భక్తులు సైతం విచారణ కమిటీ ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు చేపట్టిన విచారణ భక్తులకు కాని, గ్రామస్తులకు కాని సమాచారం లేదు. వాస్తవాలు వెలుగు చూడాలంటే నాలుగు గోడల మధ్యకాకుండా ఉన్నతాధికారులు సమక్షంలో బహిరంగ విచారణ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎండోమెంట్ అధికారులతో కాకుండా సిట్ వేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
నిత్యాన్నదానానికి విరాళం
మచిలీపట్నంఅర్బన్: డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నిర్వహిస్తున్న శాప్ లీగ్స్లో భాగంగా జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఈ నెల 24వ తేదీ మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార అధికారి కె. ఝాన్సీలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో 35+, 45+ వయో విభాగాల్లో పురుషులు, మహిళలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మార్చి 30, 31 తేదీల్లో గుంటూరులోని ఏఎన్యూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 100, 400, 800, 1500 మీటర్ల పరుగులు, 4 100 రిలే, లాంగ్ జంప్, హై జంప్, షాట్పుట్, డిస్కస్, జావెలిన్ త్రో వంటి క్రీడాంశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనదలచిన క్రీడాకారులు శాప్ అధికారిక వెబ్సైట్ htt pr://SportS.ap.gov.in/#/home/SaapLeaGue లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో నాల్గో రోజైన ఆదివారం జగన్మాతకు మందార పుష్పాలు, ఎర్రకలువలు, చామంతులతో అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారి అర్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఆలయ ఈవో శీనానాయక్, స్థానాచార్య శివప్రసాద్శర్మ, ఆలయ అర్చకులు, సిబ్బంది ప్రధాన ఆలయంలో మూలవిరాట్ను దర్శించుకున్నారు. అనంతరం నూతన పూజా మండపంలోని ఉత్సవ మూర్తి వద్ద ఆలయ అర్చకులకు ఆయా పుష్పాలను అందించారు. వేద మంత్రోచ్ఛారణ మధ్య ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. పుష్పార్చనలో అమ్మవారికి సమర్పించిన పుష్పాలను అర్చకులు భక్తులకు పంపిణీ చేశారు. -
వ్యాపారం హోడల్
విజయవాడ సిటీఎన్టీఆర్ జిల్లాసోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026● గ్యాస్ సరఫరా లేక మూతపడుతున్న హోటల్స్ ● కార్మికులకు అవస్థలు ● ప్రభుత్వాలు స్పందించాలంటున్న సంఘాలు ●7విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 535.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్కి 18,541 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో వంట గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్లు నిలిపేయాలనే ఆదేశాలతో హోటళ్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ‘గ్యాస్ లేదు.. వ్యాపారం లేదు’ అంటూ వాపోతున్నారు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు మూత పడుతున్నాయి. వ్యాపారులే కాకుండా హోటళ్లలో పని చేసే కార్మికులు, సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వన్టౌన్(విజయవాడపశ్చిమ): గ్యాస్ కొరత తీవ్రంగా మారడంతో ఎన్టీఆర్ జిల్లాలో హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని చోట్ల పదార్థాలను అధిక ధరకు విక్రయిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో 15 రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో హోటల్స్ రంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డొమెస్టిక్ సిలిండర్లను కొందరు బ్లాక్లో విక్రయిస్తుండటంతో మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. హోటల్స్ యజమానులు కొనుగోలు చేయలేక దుకాణాలను మూస్తున్నారు. జిల్లాలో వెయ్యికి పైగా హోటల్స్ జిల్లాలో సుమారు వెయ్యికి పైగా చిన్నా పెద్దా హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు ఉన్నాయి. వీటన్నింటికీ గ్యాస్ చాలా ప్రధాన అవసరం. ఇవి కాక రోడ్డుపక్కన చిన్నపాటి టిఫిన్ సెంటర్లు వందలాదిగా ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా కమర్షియల్ గ్యాస్ను మాత్రమే వినియోగించాలి. అవి సరఫరా కాక కొంతమంది డొమెస్టిక్ బండలను బ్లాక్లో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. వీటిని కొనలేక నగరంలో చాలా హోటల్స్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బోర్డులు దర్శనమిస్తున్నాయి. 20 వేల మంది కార్మికులపై ప్రభావం జిల్లాలో హోటల్ రంగ కార్మికులు సుమారుగా 20 వేల వరకూ ఉంటారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. గ్యాస్ లేక వీరి ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. హోటల్స్ మూసి వేస్తుండటంతో రోడ్డున పడుతున్నారు. జొమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ పుడ్ సరఫరా చేసే వారిపై దీని ప్రభావం పడుతుందని కార్మిక సంఘాల నేతలు వివరిస్తున్నారు. తగ్గిన వంటకాల సంఖ్య చిన్న హోటల్స్ తాత్కాలికంగా మూసివేస్తుంటే పెద్ద హోటల్స్ పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నాయి. సరఫరా చేసే వంటకాల సంఖ్యను తగ్గిస్తున్నాయి. కట్టెలు, కరెంట్ పొయ్యిలతో.. గ్యాస్ కొరతతో చాలా హోటల్స్ కట్టెల పొయ్యిలపై దృష్టి సారించాయి. అవకాశం ఉన్న హోటల్స్ వారి ప్రాంగణాల్లో కట్టెలను తెప్పించి పొయ్యిలను పెడుతున్నాయి. కొన్ని ఇతర ప్రాంతాల్లో తయారు చేసి హోటల్స్కు తెప్పించుకుంటున్నాయి. భారీ వినియోగం ఉన్న వారు స్టీమ్ లేదా బాయిలర్లను వినియోగిస్తుండటం, కొన్ని క్యాంటిన్లు కరెంట్తో నడిచే పొయ్యిలతో టీ వంటి వాటిని అందిస్తున్నాయి. గ్యాస్ బుకింగ్ గడువు పెంపు ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ను 21 నుంచి 25 రోజులకు పెంచింది. జిల్లాలో 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. అవి నెలకు లక్షన్నర వరకూ గృహావసర సిలిండర్లను సరఫరా చేస్తుండగా సుమారు 50 వేల వరకూ కమర్షియల్ సిలిండర్లను ఇస్తున్నాయి. ప్రస్తుతం డొమెస్టిక్ సింగిల్ సిలిండర్ ఉన్న వారు 25 రోజుల తర్వాత, డబుల్ సిలిండర్ ఉన్న కుటుంబాలు 30 రోజుల తర్వాతే బుకింగ్ చేసుకోవచ్చు. పొత్తుకుదరని మద్దతుఆంధ్ర నాట్య సంగమంలో కళాకారుల నృత్య ప్రదర్శనప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ సరఫరా నిలిపివేయడంతో గృహావసరాలు, విద్యాసంస్థలు, ఆలయాలు వంటి ప్రాధాన్య రంగాలకు మాత్రమే సరఫరాను కొనసాగిస్తున్నారు. దీంతో బయట మార్కెట్లో గృహావసరానికి వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.3,500 నుంచి నాలుగు వేల మధ్య ఉందని హోటల్స్ యజమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండటం లేదు. ఒక్కసారిగా అందరూ గ్యాస్ బుకింగ్ చేస్తుండటంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా పిర్యాదుల పరిష్కారవేదిక( పీజీఆర్ఎస్) జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. మోపిదేవి: స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో సందడిగా మారింది. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. హోటల్స్, రెస్టారెంట్, బేకరీలపై ఆధారపడిన కార్మికులు వేలాది మంది రోడ్డున పడుతున్నారు. చాలా సంస్థలు గ్యాస్ కొరత కారణంగా మూత పడుతున్నాయి. కేవలం కార్మికులే కాకుండా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అంశంపై ప్రత్యామ్నాయం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. –సోమేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు, విజయవాడ హోటల్ అండ్ బేకరీ వర్కర్స్ యూనియన్ ‘గ్యాస్’ ఇబ్బందులు ఎదుర్కొంటున్న హోటల్స్ను ప్రభుత్వం ఆదుకోవాలి. 15 రోజులుగా పలు దఫాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హోటల్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులును వివరిస్తున్నాం. కమర్షియల్ గ్యాస్ కోటాను పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శనివారం కేంద్రం నుంచి కమర్షియల్ కోటాను కొంత మేర పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అది సరిపోయే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా హోటల్స్ తాత్కాలికంగా మూసివేశారు. అన్ని వర్గాల గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. రామిశెట్టి వీరస్వామి, అధ్యక్షుడు, ఏపీ హోటల్స్ అసోసియేషన్ -
వేంకట రమణ.. సంకట హరణ
గుడ్లవల్లేరు: డోకిపర్రు వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం అన్నదానం జరిగింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు వెంకటకృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల సాయంతో జరిగింది. ఘనంగా ఊంజల్ సేవ భూ సమేత శ్రీ వేంకటేశ్వరాలయంలో స్వామివార్ల ఉత్సవమూర్తులకు వెంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయభాస్కరమ్మ దంపతులు పాల్గొన్నారు. -
ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదు: సీపీఐ నారాయణ
సాక్షి, విజయవాడ: టీటీడీ ఛైర్మన్ వ్యవహరంపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. పవిత్ర ఆలయాన్ని చంద్రబాబు శుద్ధి చేస్తాడని ఆశించామని.. ఛైర్మన్ను రాజీనామా చేయమని బాబు ఎందుకు చెప్పడం లేదంటూ నారాయణ ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు టీటీడీ ఛైర్మన్గా ఉండకూడదంటూ మండిపడ్డారు.పశ్చిమాసియా ఉద్రిక్తతలపై నారాయణ స్పందిస్తూ.. ‘‘యుద్ధం ప్రపంచ మానవాళి మీద పడిందన్నారు. అమెరికాలోని కార్పోరేట్ కంపెనీల కోసం యుద్ధం జరుగుతున్నారు. ఆయిల్ కంపెనీను కార్పోరేట్లకు అప్పగించడానికే ఈ యుద్ధం.. వెనెజులను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో రూ. 50వేల కోట్లు భారం మనపై పడింది. ఇరాక్లో అణుబాంబుల పేర్లతో ఆయిల్ కోసం దాడులు చేస్తున్నారు...కోటి మంది భారతీయులు గల్ప్ దేశాల్లో చిక్కున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఐక్యత లేకుండా పోయింది. యుద్ధం కారణంగా టూరిజం దెబ్బతింది. డాలర్ 100 రూపాయల దగ్గరకు చేరింది. ఆయిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆయిల్ రేట్లు పెరిగితే అన్ని రేట్లు పెరుగుతాయి. యుద్ధం వల్ల దేశం ప్రత్యక్షంగా అతలాకుతలం అవుతుంది. మోదీ ట్రంప్కి సలహా ఇచ్చి యుద్ధం ఆపమని చెప్పాలి’’ అని నారాయణ సూచించారు -
ఇంజినీరింగ్ విద్యార్థికి కన్నీటి వీడ్కోలు
ఉయ్యూరు: తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన ఏటిపాక మండలం పురుషోత్తపట్నం సమీపంలో కూనవరం వద్ద గోదావరి పాయలో స్నానానికి దిగి మృత్యువాత పడిన ఐదుగురిలో ఉయ్యూరుకు చెందిన తేజజ్ఞసాయి (20) మృతదేహం శనివారం లభించింది. భద్రాచలం రాముడి దర్శనానికి వెళ్లొస్తూ శుక్రవారం గోదావరి నదిలో విద్యార్థులు గల్లంతైన విషయం విదితమే.. నలుగురి మృతదేహాలు శుక్రవారమే లభించాయి. తేజజ్ఞసాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తాడిగడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తేజజ్ఞసాయి తండ్రి సౌతాఫ్రికా నుంచి వచ్చేందుకు సమయం పట్టే అవ కాశం ఉండటంతో భౌతికకాయాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తా నని చెప్పి విగతజీవిగా కళ్లముందున్న తమ బిడ్డను చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మరో ఇంజినీరింగ్ విద్యార్థి దగ్గుబాటి నవదీప్ (19) మృతదేహానికి స్వగ్రామమైన కనుమూరులో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి నవదీప్ మృతదేహం కుక్కనూరు వద్ద లభ్యంకాగా అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కనుమూరుకు తరలించారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు నవదీప్ భౌతికకాయాన్ని సందర్శించి కన్నీటి పర్యంతం అయ్యారు. కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సహచర విద్యార్థులు గ్రామానికి చేరుకుని నవదీప్ భౌతికకాయానికి నివాళులర్పించారు. తమ స్నేహితుడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక బోరున విలపించారు. అశ్రునయనాల నడుమ నవదీప్ భౌతికకాయాన్ని ఊరేగించి అంత్యక్రియలు జరిపించారు. ఇరువురి బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. -
కడుపుబ్బా నవ్వించే రాకాస
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాకాస ఒక అద్భుతమైన కామెడీ ఫాంటసీ చిత్రమని, ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని హీరో సంగీత్ శోభన్ పేర్కొన్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు శనివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందన్నారు. నిహారిక ప్రొడక్షన్లో ఇది తన రెండో సినిమా అని, కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ థ్రిల్లర్ ఎంటర్ట్రైనర్గా ఉంటుందని వివరించారు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ.. తన పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చుతుందన్నారు. చిత్ర నిర్మాత నిహారిక మాట్లాడుతూ.. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడి నుంచే తమ సినిమా ప్రమోషన్ మొదలుపెట్టామని అన్నారు. రాకాస చిత్రంలోని ప్రతి పాత్రా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వి స్తుందన్నారు. ఈ సమావేశంలో కమెడియణ్ గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో పండ్ల వ్యాపారి ఆత్మహత్య
గన్నవరం: ఆర్థిక ఇబ్బందులు, క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసుల వేధింపులను తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గన్నవరంలోని గాజులపేటలో నివసించే పడమట నాగరాజు దావాజిగూడెం రోడ్డులో పండ్ల దుకాణం నడుపుతున్నాడు. ఐదేళ్ల క్రితం సమీప బంధువు ఓ ఫైనాన్స్ సంస్థలో తీసుకున్న రుణానికి నాగరాజు ష్యూరిటీ సంతాకం చేశాడు. ఆ బంధువు రుణం తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు అప్పు చెల్లించాలని నాగరాజును వేధిస్తున్నారు. అంతే కాకుండా తాడేపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి నాగరాజు ద్వారా ఓ బుకి వద్ద క్రికెట్ బెట్టింగ్లు వేసి రూ.5 లక్షలు నష్టపోయారు. ఈ వ్యవహారం పోలీస్స్టేషన్కు చేరడంతో ఆ రూ.5 లక్షలకు నాగరాజును బాధ్యుడిని చేసి తిరిగి చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఈ విషయమై నాగరాజును స్టేషన్కు పిలిపించి గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన నాగరాజు గుంటూరు సమీపంలోని పొలాల్లో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు అతనిని గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. ఫైనాన్స్ సంస్థతో పాటు పోలీసులు వేధింపుల కారణంగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. నాగరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
పెళ్లికి వచ్చి బంగారం పోగొట్టుకున్న మహిళ
తోట్లవల్లూరు: పెళ్లి వేడుకకు వచ్చిన ఓ మహిళ తన బంగారం పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. తోట్లవల్లూరు మండలంలోని గరికపర్రు గ్రామంలో తమ బంధువుల ఇంటిలో జరిగిన వివాహ వేడు కకు పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన దావు సుకన్య తన కుటుంబంతో హాజరయ్యారు. పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా తన 40 గ్రాముల బంగారు ఆభరణాలు మాయమైనట్లు సుకన్య గుర్తించింది. ఎంత ప్రయత్నించినా బంగారు ఆభరణాల ఆచూకీ లభ్యం కాకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిషోర్ తెలిపారు. హాస్టల్ వాచ్మన్ మృతి గంపలగూడెం: స్థానిక ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వాచ్మన్ కొమ్మరవల్లి గంగరాజు(58) శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. హాస్టల్ ప్రాంగణంలో ఉన్న ఓ బల్లపై అనారోగ్యంగా కనిపించడంతో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడు రావూరి స్వామి గంగరాజును గమనించాడు. తొలుత గంగరాజు నోటి నుంచి రక్తం వచ్చిందని, అనంతరం అతను మృతిచెందా డని స్వామి తెలిపాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గంగరాజు స్వగ్రామం విజయవాడ సమీపంలోని గూడ వల్లి. మృతుని కుమారుడు గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శశిధర్ తెలిపారు. -
ఘనంగా వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం చామంతులు, గులాబీలు, గన్నేరు పుష్పాలతో దుర్గమ్మకు విశేష పుష్పార్చన జరిగింది. తొలుత ఆలయ ఈఓ శీనా నాయక్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది అర్చన కోసం సేకరించిన పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అలయానికి చేరుకుని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అనంతరం నూతన పూజా మండపానికి చేరుకుని పుష్పాలను అర్చకులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. పుష్పార్చనలో పాల్గొనడం వల్ల భక్తులకు మనశ్వాంతి, ఐశ్వర్యం, అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. పూజలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు అమ్మవారి ప్రసాదంగా పంపిణీ చేశారు. -
ప్రకృతి వ్యవసాయ పంటల పరిశీలన
గంపలగూడెం: మండలంలోని మేడూరు గ్రామానికి చెందిన కోటేశ్వరి తనకున్న 50 సెంట్లలో వరి, మరో 1.7 ఎకరాలు కౌలుకు తీసుకుని పలు రకాల కూరగాయలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగుగచేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ శనివారం ఆ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి రైతూ రసాయన రహి తంగా పంటలు పండించాలని సూచించారు. అనంతరం తునికిపాడులో ఇటీవల వర్షాలకు నేలవాలిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనాలు తయారు చేస్తారని తెలిపారు. మొక్కజొన్న, పెసర తదితర పంటలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అథారిటీ చైర్మన్ సీహెచ్.దేవదత్తు, తిరువూరు ఆర్డీఓ ఎ.కుమార్, తహసీల్దార్ వి.రాజకుమారి, ఎంపీడీఓ టి.సరస్వతి, ఏఓ హారీష్రావు పాల్గొన్నారు. నలుగురు సీఐలు బదిలీ లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు శనివారం ఆదేశాలు జారీ చేశారు. అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సీఐ బి.హెచ్.వెంకటేశ్వర్లును సీసీఎస్కు, ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ సీఐగా పనిచేస్తున్న డి.చంద్ర శేఖర్ను అజిత్సింగ్నగర్కు బదిలీ చేశారు. గుణదల సీఐ వి.శ్రీనును సైబర్ క్రైమ్కు, టూ ట్రాఫిక్ సీఐ వై.సత్యరమేష్ను గుణదల పీఎస్కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంకన్న దర్శనానికి బారులు తీరిన భక్తులు గుడ్లవల్లేరు: మండలంలోని డోకిపర్రు భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు క్యూల్లో బారులు తీరారు. స్వామిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. తొలుత ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు కె.బాపిరెడ్డి, విజయ భాస్కరమ్మ దంపతులు ప్రారంభించారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(మెయిల్) అధినేత, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తలు పురిటిపాటి వేంకట కృష్ణారెడ్డి, సుధారెడ్డి ఆర్థిక సాయంతో ఈ అన్న సమారాధన జరిగింది. -
భక్తుల కోసం సైన్ బోర్డులు ఏర్పాటు చేయండి
దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్స్వయం ఉపాధిపై మహిళలకు అవగాహన మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం శ్రీదాసాంజనేయస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి కల్యాణ మహోత్సవానికి రామవరప్పాడుకు చెందిన దాత ప్రయాగ సీతారామశాస్త్రి అరకిలో వెండి రజత కిరీటాన్ని ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కృష్ణప్రసాద్కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత ప్రయాగ సీతారామశాస్త్రి మాట్లాడుతూ కల్యాణోత్సంలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ధర్మ కర్తల మండలి చైర్మన్ కృష్ణప్రసాద్ ఆలయ అభి వృద్ధికి దాతల సహకారం మరువలేనిదన్నారు. అనంతరం అర్చకుడు సుబ్బయ్య ప్రత్యేక పూజలు చేసి దాతను స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో సత్కరించారు. కార్యక్రమంలో ఈఓ పాతూరి లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన సమాచారం తెలియజేయడానికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారు. దుర్గగుడి అభివృద్ధి పనులను కమిషనర్ శనివారం పరిశీలించారు. కనకదుర్గనగర్ నుంచి ప్రారంభమయ్యే ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, లడ్డూ పోటు, అన్నదాన భవనం పనులను పరిశీలించారు. లోటుపాట్లను గుర్తించిన కమిషనర్ ఇంజినీరింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన సూచనలు పాటించకపోవడం సరికాదని, మళ్లీ తనిఖీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దసరాకు పనులు ఓ కొలిక్కి రావాలని ఆదేశించారు. పనులపై ఆలయ ఈఈ–2 ఎల్.రమ కమిషనర్కు వివరించారు. ఆలయ అధికారులతో సమీక్ష అనంతరం కమిషనర్.. దుర్గగుడి అధికారులతో మూడు గంటలకు పైగా సమీక్షించారు. ఆలయ నిర్వహణ, భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. తిరుమల తరహాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని ఆదేశించారు. వాట్సాప్ ద్వారా టికెట్ల బుకింగ్ను 50 శాతం పైగా జరిగేలా చూడాలన్నారు. ఇటీవల ఆలయంలో జరిగిన కొన్ని సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. భవిష్యత్తులో వీఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలాన్ని పూర్తిగా పార్కింగ్కు ఉపయోగించి అక్కడి నుంచి ఏసీ బస్సుల్లో భక్తులను కొండపైకి తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించిన అంశాలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, చైర్మన్, బోర్డు సభ్యులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సభ్యులు పాల్గొన్నారు.భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ రూరల్ గొల్లపూడి మండలంలోని డీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ రైజ్ కేంద్రం ఆధ్వర్యాన శనివారం నేటివ్ అరకు కాఫీపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సుమారు 102 మంది స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేటివ్ అరకు కాఫీ సంస్థ సీఈఓ కుమార్ వర్మ మాట్లాడుతూ.. ప్రస్తుత కాఫీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. విలువ ఆధారిత కాఫీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్పై సూచనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక సాధికారతకు ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. రైజ్ సంస్థ ద్వారా మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎ.ఎన్.వి.నాంచారరావు తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 20267ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ గుడిలో వసంత నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చామంతులు, గులాబీలు, గన్నేరు పుష్పాలతో శనివారం దుర్గమ్మకు విశేష పుష్పార్చన చేశారు. ద్వారకాతిరుమల: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఆయన ప్రత్యేక పూజలు చేశారు.మోపిదేవి: స్థానిక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిత్యాన్నదానికి శనివారం ఏలూరు వాస్తవ్యులు జె.రామకృష్ణ లక్ష రూపాయలను విరాళంగా సమర్పించారు.ఎ.కొండూరు: తిరువూరు నియోజక వర్గం పరిధిలోని నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎ.కొండూరు మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ యార్డును సందర్శించారు. చైతన్యనగర్ సమీపంలో ఉన్న యార్డు గోడౌన్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకుని త్వరలోనే భారీ స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం ప్రారంభించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికెట్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, ఎ.కొండూరు తహసీల్దార్ అరవింద్, మార్కెట్ యార్డ్ సిబ్బంది, గిరిజన రాష్ట్ర నేత గోపిరాజు, అధికారులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహం, రక్తపోటు, హెచ్ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో క్షయ ముప్పు పొంచి ఉందని పలువురు శ్వాసకోశ వ్యాధుల నిపుణులు పేర్కొన్నారు. అందు బాటులోకి వచ్చిన అడ్వాన్స్డ్ చికిత్సలతో క్షయను పూర్తిగా నయం చేయొచ్చని సూచించారు. ట్యూబర్ క్యూలోసిస్(క్షయ) అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్ర స్థాయి సదస్సు శనివారం ప్రారంభమైంది. ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య భవన్లో నిర్వహిస్తున్న సదస్సులో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, పల్మనాలజీలో పోస్టు గాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు 300 మందికిపైగా పాల్గొన్నారు. సదస్సును ఆర్గనైజింగ్ అధ్యక్షుడు డాక్టర్ రఘు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పలువురు నిపుణులు క్షయ వ్యాధికి అడ్వాన్స్డ్ వైద్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉంటే క్షయ నిర్ధారణ పరీక్ష చేయించుకోవడంపై అవగాహన కలిగించాలని సూచించారు. సెషన్ల వారీగా జరిగిన సదస్సులో తొలిరోజు క్షయ వ్యాధిపై విశ్లేషణాత్మక ప్రసంగాలు, చర్చ జరిగింది. సదస్సులో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవీంద్రరెడ్డి, ఎస్టీఓ డాక్టర్ రమేష్, వైస్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ పరిశీలకులు డాక్టర్ సుజాత, డాక్టర్ తిప్పర్తి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పవిత్ర రంజాన్ను పురస్కరించుకుని ఈద్గాహ్ కమిటీ ఆధ్వర్యాన శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామూహిక ఈదుల్ ఫితర్ నమాజు జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 15 వేల మంది ముస్లింలు నమాజు చేశారు. ఈ సందర్భంగా మౌలానా హఫీజ్ రియాజ్ సాహెబ్ ఉర్దూలో సందేశాన్ని అందిస్తూ, అరబ్బీలో ఖుత్బా, నమాజ్ చేయించారు. ఆయన మాట్లాడుతూ ఇస్లాం ధర్మం పరస్పర ప్రేమానురాగాలను, సోదర భావాన్ని, ఐక్యతను చాటుతుందని కులమతాలకు అతీతంగా మానవ సేవకే ప్రథమ ప్రాధాన్యమివ్వాలన్నారు. రంజాన్ ఉపవాసాలు మనసులో మాలిన్యాన్ని దూరం చేసి శాంతి, కరుణను నింపుతాయని తెలిపారు. పవిత్ర మాసం అందించే స్ఫూర్తిని ఏడాది పొడవునా కొనసాగించాలని ప్రజలు అందరూ సుఖ శాంతులతో జీవించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక దువా చేశారు. ఇస్లామిక్ పండితుడు అబ్దుల్ ముస్తాన్ నద్వీ ధార్మిక ప్రవచనం చేస్తూ, రంజాన్ పర్వదినం మనకు తక్వా (అల్లాహ్ భయం), సహనం, దానగుణాన్ని నేర్పుతుందని ఉద్ఘాటించారు. ఇస్లాం బోధనలు మానవ జీవితాల్లో వెలుగులు నింపుతాయని ఆయన పేర్కొన్నారు. మత సామరస్యాన్ని పెంపొందిద్దాం ఈద్గా కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ అహ్మద్ మాట్లాడుతూ సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించుదామని పిలుపునిచ్చారు. నిరుపేదల అవసరాలను గుర్తించి సేవలు అందిద్దామని పేర్కొన్నారు. ఒకరి పండుగల్లో మరొకరు భాగస్వాములు కావడంతో రాజకీయంగా ఏర్పడుతున్న విభేదాలను తగ్గించి, మానవత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలని కోరారు. ప్రార్థనల ఏర్పాట్లకు సహకరించిన మున్సిపల్, పోలీసు శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈద్ నమాజులో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ కాలేషా వలి, సభ్యులు అన్వర్ పాషా, ఎండీ ఇర్ఫాన్, షఫీ అహ్మద్ పాషా, సయ్యద్ ఇంతియాజ్, ముక్తార్ అలీ, ఎండీ మొహిద్దీన్, సయ్యద్ అలీం ఎండీ నాహీద్ పాల్గొన్నారు. ముస్లింలకు అండగా నిలిచిన జగన్: అవినాష్ రాష్ట్రంలో ముస్లిం కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని విధాలుగా అండగా నిలిచారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. రాష్ట్ర చరిత్రలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. కుటుంబ సభ్యుల్లాంటి ముస్లింలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ముస్లింలు గత ఐదేళ్లలో ఎంతో సుఖసంతోషాలతో ఉన్నారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల అభివృద్ధికి నిరంతరం పని చేసిన వైఎస్ జగన్కు అల్లాహ్ ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన ముస్లింలకు ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా నమాజులో పాల్గొన్న వారందరినీ ఆత్మీయంగా పలకరించారు. -
నవాబుపేట సొసైటీ అధ్యక్షుడి ఆత్మహత్య
పెనుగంచిప్రోలు: మండలంలోని నవాబుపేట గ్రామ సొసైటీ అధ్యక్షుడు, టీడీపీ నాయకుడు చింతా వెంకటేశ్వరరావు (బుల్లియ్య) (53) ఆత్మ హత్య చేసుకున్న ఘటన శనివారం తెల్లవారు జామున జరిగింది. తన ఇంటి ముందు రేకుల షెడ్డులో ఉరికి వేలాడుతున్న వెంకటేశ్వర రావును కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు చూసే సరికి మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా తన తండ్రి మానసిక వేదనకు గురవుతున్నారని, ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున మృతి చెంది ఉండటాన్ని గమనించామని వెంకటేశ్వరరావు కుమారుడు రవి ఫిర్యాదు చేశారని ఎస్ఐ అర్జున్ తెలిపారు. వెంకటేశ్వరరావు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గింజుపల్లి వీరయ్య హత్య కేసులో, ఆయన కుమారుడు శ్రీనివాసరావుపై జరిగిన దాడి ఘటనలో ప్రధాన నిందితుడు. -
టెన్నిస్ టోర్నీలో సత్తాచాటిన రైల్వే ఉద్యోగులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): భీమవరంలో ఈ నెల 20న జరిగిన ఆల్ ఇండియా ఒపెన్ టెన్నిస్ టోర్నీలో రైల్వే ఉద్యోగులు సత్తాచాటారు. 45 ప్లస్ విభాగంలో రైల్వే ఉద్యోగులు కె.రాజేంద్ర ప్రసాద్, సంపత్కుమార్ డబుల్స్లో విజేతలుగా నిలిచారు. కె.రాజేంద్రప్రసాద్ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యూనల్లో అదనపు రిజిస్ట్రార్గా, సంపత్కుమార్ ఎలక్ట్రికల్ విభాగంలో టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. టోర్నీ అంతటా అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ ఫైనల్లో తెలంగాణ రాష్ట్రం, ఖమ్మంనకు చెందిన గంజి వెంకటేశ్వర్లు, భాస్కర్పై గెలుపొంది టైటిల్ సాధించారు. -
‘రైజ్’కు నీతి ఆయోగ్ పట్టం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలోని రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్, స్కిల్లింగ్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సెంటర్( రైజ్)కు నీతి ఆయోగ్ పట్టంకట్టిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు రూ. 1.55 కోట్ల ఆర్థిక మద్దతుకు ఆమోదం తెలుపుతూ తాజాగా ఉత్తర్వులిచ్చినట్లు వెల్లడించారు. దీనిపై కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో శనివారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త స్ఫూర్తికి అనుగుణంగా అడుగులు వేసి వినూత్నంగా రైజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణ లక్ష్యంగా రూపొందించిన ఈ వినూత్న కార్యాచరణ ప్రణాళికకు నీతి ఆయోగ్ నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. దీనిపై సవివర నివేదిక పంపగా పరిశీలించి ఆర్థిక మద్దతుకు ప్రత్యేక కమిటీ ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ నిధులు ఇబ్రహీం పట్నం బ్లాక్లో ఏఐ ఆధారిత నైపుణ్య సర్వే, నైపుణ్యాభివృద్ధి , శిక్షణ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితరాలకు ఉపయోగపడతాయని తెలిపారు. ఏఐ సహా విభిన్న అంశాల్లో శిక్షణ నిత్య నూతనం– వినూత్నం నినాదానికి అనుగుణంగా మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. రైజ్ కేంద్రంలో హెల్ప్ డెస్క్, ఐడియా డెస్క్, స్కిల్లింగ్ డెస్క్, ప్లేస్మెంట్ డెస్క్, బ్యాంకింగ్ డెస్క్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీన్ని వినియోగించుకోవాలనుకునే ఔత్సాహికులు 70753 85588 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ శకుంతల, ఏబీపీ బ్లాక్ కో ఆర్డినేటర్ పి. శ్రీనివాస్, రైజ్ మేనేజర్ బి.తేజస్విని పాల్గొన్నారు. -
పోలీసులకు సవాల్గా మారిన చోరీ కేసు
పెనమలూరు: మండలంలోని తాడిగడప గ్రామంలో శుక్రవారం జరిగిన దొంగతనం మిస్టరీగా మారింది. గతంలో ఎరన్నడూ లేని విధంగా భారీ దొంగతనం జరగటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రూ.10 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లిన ఈ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. విజయవాడ నగర శివారులో ఉన్న తాడిగడప మునిసిపాలిటీలో పరిధిలో గతంలో చెదురుమదురుగా దొంగతనాలు జరిగాయి. ఇంటికి తాళం వేసి ఉంటే దొంగలు నేరాలకు పాల్పడిన ఘటనలు ఉన్నా పెద్దగా సొత్తు చోరీ జరగలేదు. చైన్ స్నాచింగ్, సెల్ఫోన్ చోరీలు, ఇంటి తాళాలు పగులకొట్టి చోరీలు వంటి ఘటనలు నమోదయ్యాయి. అయితే తాడిగడపలో జరిగిన దొంగతనం అందుకు భిన్నంగా ఉంది. ఇంటి యజమాని తాతేశ్వరరావు కుటుంబ సభ్యులు బెంగళూరుకు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంటి కిటికీ ఇనుప ఊచల (గ్రిల్)ను చాకచక్యంగా కోసిన దొంగలు లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. నగదు రూ.2.34 లక్షలు, వంద గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, 230 గ్రాముల వెండి వస్తువులను దోచుకున్నారు. ఈ ప్రాంతంలో ఇది పెద్ద దొంగతనంగా స్థానికులు చెబుతున్నారు. దొంగలు ఎవరు..? తాడిగడపలో జరిగిన భారీ చోరీలో దొంగలు ఎవరనేది తేలలేదు. నేర ప్రాంతంలో క్లూస్ టీమ్ బృందం వేలిముద్రలు సేకరించింది. అయితే ఈ ప్రాంతంతో పాటు పక్క జిల్లాలో ఉన్న దొంగల వేలిముద్రలకు అవి సరిపోలేదని సమాచారం. సీసీ పుటేజీ ప్రకారం నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ఉత్తర భారత్కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. బిహార్ లేదా ఉత్తరాధి ప్రాంతాలకు చెందిన వారని అనుమానలు వ్యక్తమవుతున్నాయి. ఈ చోరీ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో తాడిగడపలో జరిగిన దొంగతనం ఇటు కృష్ణా జిల్లా పోలీసులకు, అటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఉలిక్కపడే విధంగా చేసింది. దొంగలు ఇతర ప్రాంతాలకు చెందిన వారిగా భావిస్తుండటంతో ఏదన్న ప్రత్యేక గ్యాంగ్ ఈ ప్రాంతంలో సంచరిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కిటికీ ఇనుప గ్రిల్ను కట్ చేసి చోరీకి పాల్పడటం కలవరపరుస్తోంది. ఇటువంటి దొంగనం ఇక్కడ ఎప్పుడూ జరగలేదు. తాడిగడప మునిసిపాలిటీ, పెనమలూరు మండలంలో పోలీసుల రాత్రి గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలి
కంచికచర్ల: ఇటీవల ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి నందిగామ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతులు సాగుచేసిన మొక్కజొన్న, బొప్పాయి, అరటితోటలు పూర్తిగా నేలవాలి దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. మండలంలోని కీసర నేషనల్ హైవే పక్కన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, బొప్పాయి, అరటి తోటలను రైతులతో కలిసి ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ.. రైతులు మొక్కజొన్న సాగుచేసిన 150 ఎకరాలను పరిశీలించగా కేవలం పదెకరాలు మాత్రమే బాగుందని, 140 ఎకరాల్లో పంట పూర్తిగా నేలవాలిందని వివరించారు. క్వింటా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2400గా ప్రకటించినా ప్రభుత్వం కొనుగోలు చేయటం లేదని విమర్శించారు. దళారులు క్వింటా మొక్క జొన్న రూ.1500లోపు మాత్రమే కొంటున్నారని వివరించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన యాప్ పనిచేయక రైతులు బీమా చేయించుకోలేకపోయారని పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో రైతులు సాగుచేసిన అన్నిరకాల పంటలకు ప్రభుత్వమే నేరుగా ఇన్సూరెన్స్ చేయించిందని గుర్తుచేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పెసరను మార్క్ఫెడ్ ద్వారా విక్రయించాలంటే క్వింటాకు రూ.650 చొప్పున రైతుల నుంచి అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వసూలు పర్వంలో ప్రజాప్రతినిధులకు కూడా వాటా ఉందని రైతులు తమ వద్ద మొరపెట్టుకున్నారని వివరించారు. రైతులను నిర్లక్ష్యం చేసే ఏ ప్రభుత్వమూ సుఖంగా ఉండదని, రైతుల ఉసురు తగులుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు నెలకుదిటి శివనాగేశ్వరరావు, చలమల ప్రభాకర్, మద్దుకూరు సాయిబాబు, వేమవరపు పురుషోత్తం, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు -
రైల్వే వైర్లు చోరీ చేసిన నిందితుల అరెస్ట్
60 కిలోల రాగి తీగలు స్వాధీనం తెనాలిరూరల్: ౖరెల్వేకు సంబంధించిన వైర్లను దొంగిలించి వాటిని కాల్చి రాగి తీగలను అమ్మిన నిందితులను ఆర్పీఎఫ్ అధికారులు అరెస్ట్ చేసి నిందితుల వద్ద వైర్లు, రాగి తీగలను స్వాధీనపర్చుకున్నారు. తెనాలి ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ బి.హీరాసింగ్ వివరాలను శుక్రవారం వెల్లడించారు. తెనాలి రైల్వే స్టేషన్ టెలికాం స్టోరులో ఈ నెల 8వ తేదీన సుమారు రూ. 2.25 లక్షల విలువైన వైర్లు అపహరణకు గురయ్యాయి. నిందితులు స్టోర్ రూమ్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ అధికారులు నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. నిందితులు కావలికి చెందిన దార్ల శ్రీను, దార్ల సింహాద్రి, దార్ల పుట్టయ్య, పర్తపు దుర్గయ్య, పర్తపు వల్లూరయ్య, నెల్లూరుకు చెందిన పర్తపు శ్రీనుగా గుర్తించారు. నిందితులు కొంత కాలంగా తెనాలి వీఎస్ఆర్ కళాశాల ఎదురు కఠెవరం కాల్వ కట్టకు వెళ్లే దారిలో ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట పాకలు వేసుకుని ఉంటున్నారు. అదను చూసి రైల్వే వైర్లను దొంగలించారు. అపహరించిన వైరులో సగ భాగం కాల్చి రాగి తీగలను నందివెలుగులోని ఓ వ్యక్తికి విక్రయించారు. నందివెలుగు అతను విజయవాడలోని మరో వ్యక్తికి విక్రయించాడు. విజయవాడ వ్యక్తి విజయవాడ ఆటోనగర్లోని ఇంకో వ్యక్తికి విక్రయించాడు. చోరీకి పాల్పడిన ఆరుగురు నిందితులతో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో తెనాలి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ శివరామకృష్ణయ్య, విజయవాడ ఆర్పీఎఫ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదనరావు, సిబ్బంది ఉన్నారు. -
నున్నలో గుర్తు తెలియని మృతదేహం
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రామంలో చెప్పుల కంపెనీ ఎదురు పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. నున్న ఎస్ఐ విమల కథనం మేరకు.. నూజివీడు వెళ్లే రోడ్డులో చెప్పుల తయారీ కంపెనీకి ఎదురుగా ఖాళీగా ఉన్న పొలాల్లో గుర్తు 40 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వంటిపై తెలుపు రంగు చొక్కా, కండువా ఉన్నాయి. నార్త్ ఏసీపీ పి.సత్యానందం, నున్న సీఐ పి.కృష్ణమోహన్, ఎస్ఐ విమల, పోలీసు సిబ్బంది ఘటనాస్థలాన్ని పరిశీలించారు. శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కోర్టులో తప్పించుకున్నా.. ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదు
● అధికారంలోకి రాగానే చంద్రబాబుపై కేసులు ఎలా కొట్టివేస్తారు? ● జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తనపై నమోదైన కేసులను కొట్టివేయించు కోవడం లోనూ, రెండెకరాలతో రాజకీయం మొదలు పెట్టి దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా ఎదగడంలోనూ సీఎం చంద్రబాబు చరిత్ర సృష్టించారని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ విమర్శించారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రెండెకరాలతో రాజకీయం ప్రారంభించి దేశంలోనే అత్యంత ధనికుడైనా సీఎంగా చంద్రబాబు ఘనత సాధించారన్నారు. ఆయన అధికారికంగా ప్రకటించిన ఆస్తుల విలువే రూ.981 కోట్లని వివరించారు. భూమి అంతరించే వరకూ రాష్ట్రం మొత్తాన్ని పోషించగల సత్తా ఆయనకు ఉందని, అంతగా ఆస్తులు సంపాదించారని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద నాలుగు కేసులను కొట్టేసిన చరిత్ర ఏపీ సీఐడీకి దక్కుతుందని విమర్శించారు. ఇప్పటి వరకూ పెండింగ్లో ఉన్న కేసుల్లో ఒక్క కేసు అయినా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద క్లోజ్ చేశారా? అని ప్రశ్నించారు. సీఎంగా ఉన్న వ్యక్తి వ్యవస్థలను తన చేతుల్లోకి తీసు కుంటే రాజ్యాంగానికి ఉన్న విలువ ఏమిటని ఆవేదన వ్యక్తంచేశారు. తమపై పెట్టిన కేసులు ఎప్పుడు తీసేస్తారని హోంమంత్రి అనితకు లోకేష్ పబ్లిక్ మీటింగ్లో డైరెక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. లోకేష్ డైరెక్షన్ను హోంమంత్రి అనిత తూ.చ. తప్పక పాటించారన్నారు. చంద్రబాబు న్యాయస్థానాల్లో తప్పించుకో వచ్చు కానీ ప్రజా కోర్టులో శిక్ష తప్పదని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీశ పటమట(విజయవాడతూర్పు): ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రజా సౌకర్యాలను విస్తరించడం తన ప్రధాన లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ ప్రత్యేక అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక సంస్థల గడువు ముగియటంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల బాధ్యతల్లో భాగంగా ఆయన విజయవాడ నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు ‘గేట్ వే టు అమరావతి’గా పేర్కొంటారని, అందుకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయన వీఎంసీ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి, నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని వివిధ శాఖలను సందర్శించారు. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈఓ శీనా నాయక్, అడిషనల్ కమిషనర్లు డాక్టర్ డి.చంద్రశేఖర్, ఎ.రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజినీర్ (ఇన్చార్జ్) పి.సత్యకుమారి, డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి.సృజన తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వైదిక కమిటీకి అదనంగా సహాయకులు, సలహాదారులను నియమిస్తూ ఈఓ శీనానాయక్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దేవస్థాన వైదిక కమిటీలో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. దేవస్థాన స్థానాచార్యతో పాటు వేద పండితులు, ప్రధాన అర్చకులు, అర్చకులు ఈ కమిటీలో సభ్యుగా ఉంటారు. ప్రస్తుతం కమిటీలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు ఆంజనేయ ఘనాపాటి, శ్యావస్య మహర్షి, ప్రధాన అర్చకులు వై.మల్లేశ్వరశాస్త్రి, ఎల్.దుర్గాప్రసాద్తో పాటు ఉప ప్రధాన అర్చకుడు కె.ఎన్.వి.డి.ఎంప్రసాద్ సభ్యులుగా ఉన్నారు. వారికి సమన్వయ సహాయకులు, సలహాదారులుగా వేద పండితుడు షణ్ముఖేశ శాస్త్రి, ఉప ప్రధాన అర్చకుడు బి.శంకరశాండిల్య, ముఖ్య అర్చక రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, అర్చక వి.శ్రీధర్శర్మను నియమించారు. ఈ నియామకం శుక్రవారం నుంచే అమలులోకి వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలు, పూజలు, నివేదనలను పర్యవేక్షించేందుకు ఈ అదనపు బృందం దోహపడుతుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. -
నేరస్తుడిని చేసిన అనుమానం
ఎ.కొండూరు: తన భార్యపై ఉన్న అనుమానం ఒక వ్యక్తిని నేరస్తుడిని చేసింది. ఓ వ్యక్తిపై హత్యాయత్నా నికి కారణమైంది. ఎ.కొండూరు ఎస్ఐ మహాలక్ష్మణడు కథనం మేరకు.. మండలంలోని పెద్ద తండా గ్రామంలో లావూరి సీతారాం నివసిస్తున్నాడు. తన భార్యకు చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ విషయం నలుగురికీ తెలిస్తే తన పరువు పోతుందని సీతారాం భావించాడు. జమలయ్యపై ద్వేషం పెంచుకున్నాడు. అతడిని అంత మొందించాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో జమలయ్య కదలికలపై నిఘా ఉంచాడు. జమలయ్య నిత్యం పొలం వెళ్లొస్తున్నాడని గుర్తించాడు. ఈ నేపథ్యంలో జమలయ్య పెద్దతండా సమీపంలో మొక్క జొన్న చేను నుంచి వస్తుండగా అప్పటికే అతని కోసం పొంచివున్న సీతారాం ఒక్కసారిగా గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన జమలయ్యను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకుని దాడికి ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు సీతారాం తన నేరాన్ని అంగీకరించాడు. కుటుంబ సమస్యలు, భార్య ప్రవర్తనపై కలిగిన అనుమానమే ఈ దాడికి కారణమని పేర్కొన్నారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తిరువూరు కోర్టులోని హాజరుపరిచారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ మహాలక్ష్మణుడు తెలిపారు. నిందితుడిని నూజివీడు సబ్జైలుకు తరలించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీమన్నారాయణ, యు.తిరపతిరావు పాల్గొన్నారు. -
ఈద్ ముబారక్
వన్టౌన్(విజయవాడపశ్చిమ): నెల రోజులుగా కఠిన నియమాలతో ఉపవాసదీక్షలు పాటించిన ముస్లింలు సోమవారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు. గురువారం సౌదీ ఆరేబియాలో నెలవంక కనిపించడంతో ఆయా ప్రాంతాల్లో శుక్రవారం రంజాన్ను జరుపుకొన్నారు. మన దేశంలో శనివారం పండుగను జరుపుకోవాలని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. దాంతో అన్నిచోట్లా ఈద్ సందడి కనిపించింది. ముస్లింలు ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఉదయం ఏడు నుంచి ప్రార్థనలు.. ఒక్కొక్క మసీదు, ఈద్గాలలో ఆయా నిర్వాహకుల నిర్ణయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. గాంధీజీ మునిసిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఉదయం ఏడు గంటలకు నమాజ్ ప్రారంభం కానుంది. అలాగే ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎనిమిది గంటలకు నమాజ్ ప్రారంభం కానుంది. అదేవిధంగా పదకొండు గంటల వరకూ వివిధ సమయాల్లో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. నమాజ్లకు ముందు కొద్దిసేపుమత పెద్దల ప్రసంగాలు ఉంటాయి. కళకళలాడుతున్న మసీదులు.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని అన్ని మసీదు ప్రాంగణాలు విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధానంగా ఆదివారం ఉపవాసాలకు చివరి రోజు కావటంతో ముస్లింలు రాత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాతబస్తీ, వించిపేట, చిట్టినగర్, భవానీపురం, అరండల్పేట, లబ్బీపేట తదితర ప్రాంతాల్లోని మసీదులన్నీ పండుగ సందర్భంగా ప్రత్యేక అలంకరణలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. మసీదు కమిటీల ఆధ్వర్యంలో శనివారం పండుగ ప్రత్యేక ప్రార్థనల నిర్వహణ కోసం తగిన ఏర్పాట్లు చేశారు. మసీదుల వద్ద కంటే ఈద్గాలలో ప్రార్థనలు నిర్వహించేందుకే ఎక్కువ మంది భక్తులు రానున్నారు. విజయవాడలో ప్రధానంగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం, పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, చిట్టినగర్ ఈద్గాతో పాటుగా అన్ని మసీదుల్లోనూ పండుగ ప్రార్థనలు నిర్వహిస్తారు. దీనికోసం నగర పాలకసంస్థ ఆయా మైదానాలు, ఈద్గాల్లో ఏర్పాట్లు చేసింది -
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మత సామరస్యాన్ని పెంపొందించి, ఐక్యతను చాటే పర్వ దినం పవిత్ర రంజాన్ అని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు అందరూ సుఖసంతోషాలతో జీవించేలా అల్లా అనుగ్రహించాలని అవినాష్ ఆకాంక్షించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అకాల వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, వ్యవసాయ, ఉద్యాన తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉన్నారని, వివిధ పంటలకు సంబంధించి పారదర్శకంగా పంట నష్టాలను అంచనా వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. తుది నివేదికల ఆధారంగా పరిహారం అందుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అకాల వర్షాలు వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిగించిన నష్టంపై శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. అకాల వర్షాలు, గాలులు, వడగళ్లు వల్ల వివిధ పంటలకు జరిగిన నష్టాల వివరాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. జిల్లాలో అకాల వర్షాలు, గాలుల వల్ల వరి, మొక్కజొన్నతో పాటు స్వల్పంగా జొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లిందని, అరటి, బొప్పాయి పంటలు కూడా కొన్నిచోట్ల దెబ్బతిన్నాయని వివరించారు. తుది నివేదికల ఆధారంగా నష్ట పోయిన ప్రతిరైతుకు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. వివిధ పంటలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చేసే సూచనలను అన్నదాతలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గాంధీనగర్(విజయవాడసెంట్రల్): పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలకు కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాస ఉపవాస దీక్షలు మనస్సును పరిశుభ్రం చేయడమే కాకుండా, అవసరంలో ఉన్నవారిపై సానుభూతి కలిగించే గొప్ప సాధనమని పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రతి హృదయంలో శాంతి నిండాలని, సమాజంలో సౌభ్రాతృత్వం చిరస్థాయిగా నెలకొనా లని కలెక్టర్ లక్ష్మీశ ఆకాంక్షించారు. రెడ్డిగూడెం: ఆస్తి వివాదం నేపథ్యంలో మండలంలోని కొత్తనాగులూరులో గత నెల 25న రెండు వర్గాల వారు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్న ఘటనకు సంబంధించి పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరు వర్గాల ఫిర్యా దుల మేరకు పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇరువర్గాల పరస్పర కేసుల్లో మొత్తం పది మందిని శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు మట్టకొయ్య డేవిడ్రాజు, మట్టకొయ్య రుషారావు, కట్ట అబ్రహాం, మట్టకొయ్య పద్మ, కట్ట ఎస్తేరు, కట్ట సౌజన్య, కట్ట జమలయ్య, కట్ట శ్రీను, కట్ట దేవసహాయం, కట్ట హర్షవర్ధన్ను జేఎఫ్సీఎం మైలవరం కోర్టులో హాజరు పర్చినట్లు రెడ్డిగూడెం ఎస్ఐ ఎస్.శ్రీను తెలిపారు. పెదకాకాని: బాజీబాబా దర్గా రెండు రోజుల ఉరుసు మహోత్సవం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలతో ముగిసింది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్బోర్డు అధికారులు మహ్మద్ హుస్సేన్, దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా ఉరుసు మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో భాగంగా పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందినీ అలంకరణలో గంధం బిందెలతో గురువారం రాత్రి ప్రారంభమైంది. బాజీబాబా వారి గుర్రం శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకూ వెనిగండ్ల, పెదకాకాని వీధుల్లో గ్రామోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు బాజీబాబా వారి గుర్రానికి మిఠాయిలు, పండ్లు తినిపించారు. కొబ్బరికాయలు, పూలు, గంధం సమ ర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. -
ప్రక్షాళన కథ.. అంతులేని వ్యథ!
సగం సగం పనులతో ఆపరేషన్ బుడమేరు మమ! జి.కొండూరు: బుడమేరు తన ఉగ్ర రూప ప్రదర్శనతో జనజీవనాన్ని అతలాకుతలం చేసి ఏడాదిన్నర కావస్తున్నా ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అంతులేని నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లి రాష్ట్ర ప్రభుత్వం తన మానస పుత్రికగా చెప్పుకునే అమరావతి ప్రతిష్టకు భంగం వాటిల్లినా మొద్దు నిద్ర వీడడం లేదు. వరదలొచ్చి పోయిన నాటి నుంచి బుడమేరు పరీవాహక ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చినుకుపడితే కంటి మీద కునుకులేక విజయవాడ నగర ప్రజలు అల్లాడుతుంటే ప్రక్షాళన చేస్తామంటూ, సమాంతరంగా మరో కాల్వ తవ్వుతామంటూ ఉత్తర ప్రగల్భాలు పలకడం తప్ప క్షేత్రస్థాయిలో ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరలా వానా కాలం వచ్చేలోపు అయినా ప్రభుత్వం ప్రక్షాళనపై దృష్టి సారిస్తే బుడమేరు మరోసారి జల ప్రళయాన్ని సృష్టించకుండా అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అసంపూర్తిగా రిటైనింగ్ వాల్ బుడమేరుకు 2024, ఆగస్టు 31వ తేదీన వచ్చిన వరదలకు వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణానది వరకు ఉన్న బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున మూడు చోట్ల, కుడి వైపున ఏడు చోట్ల గండ్లు పడ్డాయి. అయితే ఎడమ వైపున శాంతినగర్ వద్ద పడిన మూడు గండ్ల నుంచి వరద ప్రవాహం విజయవాడ వైపు మళ్లీ విజయవాడ ప్రజలు రోజుల తరబడి నీటి ముంపులో గడపాల్సి వచ్చింది. దీని వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే ఆ వెంటనే బుడమేరు ప్రక్షాళన చేస్తా మంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు ఊదరగొట్టారు. ఆ తర్వాత డైవర్షన్ కెనాల్కు ఎడమ వైపున పడిన గండ్ల వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ మరమ్మతుల కోసం అంటూ వరద లొచ్చిపోయిన ఏడు నెలల తర్వాత 2025, మార్చి 21వ తేదీన రూ.39.77కోట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీఓని విడుదల చేసింది. ఈ పనులకు జీఓ ఇచ్చిన యాభై రోజుల తర్వాత మే 15వ తేదీన శంకుస్థాపన చేసి రూ.28కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.1.80కోట్లతో రెగ్యులేటర్ మరమ్మతులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పనులలో భాగంగా శాంతినగర్ వద్ద డైవర్షన్ కెనాల్ గండ్లు పడిన ప్రదేశంలో ఎడమవైపు నిర్మించే రిటైనింగ్ వాల్ 8.65మీటర్ల ఎత్తు, 1.4మీటర్ల వెడల్పు 500మీటర్ల పొడవునా, అదేవిధంగా కుడి వైపు అంటే శాంతినగర్ వైపున ఇదే కొలతలతో యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ను నిర్మించాల్సి ఉండగా పనులు జరుగుతున్న సమయంలో పట్టిసీమ నీటిని విడుదల చేయడంతో ఎడమవైపు 360మీటర్లు పొడవున మాత్రమే రిటైనింగ్ వాల్ని నిర్మించి జూన్ 9వ తేదీతో పనులను ఆపేశారు. రెగ్యులేటర్ గేట్లకు సైతం హడావుడిగా మరమ్మతులు చేసి, రంగులు వేసి వదిలేశారు. ఇంకా ఎడమ వైపున 140మీటర్లు పొడవు, కుడి వైపున యాభై మీటర్ల పొడవునా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉంది. అయినప్పటికీ వాల్ నిర్మాణం పూర్తయ్యిందంటూ, ఇక గండ్లు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ సాక్షాత్తూ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు కూటమి ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ బ్యాలెన్స్ పనులు మరలా తిరిగి ప్రారంభించకపోవడంతో గోడ నిర్మాణాన్ని ఆపేసినట్లేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుడమేరు ప్రక్షాళనకు రూ.500కోట్ల ఖర్చవుతుందని అంచనాలు వేసి ఒక్కరూపాయి కూడా విడుదల చేయకుండా వదిలేయడంతో బుడమేరు హెడ్ రెగ్యులేటర్కి దిగువన విజయవాడ నగరంలో ఆక్రమణలను తొలగించలేదు. కాల్వ సామర్థ్యం పెంచలేదు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా నది వరకు 11.90కిలోమీటర్లు మేర ఉన్న డైవర్షన్ కెనాల్కు కాంక్రీటు లైనింగ్ వేయలేదు. అంతే కాకుండా బుడమేరు హెడ్రెగ్యులేటర్కు ఎగువన ఏ.కొండూరు వరకు ఉన్న 42కిలోమీటర్ల బుడమేరు కాల్వలో ఉన్న కంప చెట్లు, మట్టి దిబ్బలను తొలగించలేదు. హెడ్రెగ్యులేటర్ నుంచి ఎగువన బుడమేరులో పోలవరం కుడి కాల్వ కలిసే ప్రదేశం వరకు వరద ప్రవాహానికి భారీగా మట్టి దిబ్బలు పేరుకపోవడం, వాటిని తొలగించకపోవడంతో మరింత ప్రమాదకరంగా మారింది. వానా కాలంలో భారీగా వరదొస్తే ఈ మట్టిదిబ్బల పోటు వల్ల బుడమేరు కట్టకు ఇరువైపులా గండ్లు పడి వెలగలేరు, హెచ్.ముత్యాలంపాడు, కవులూరు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో పాటు విజయవాడ నగర ప్రజలకు మరో వరద ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. -
పన్నుల చెల్లింపుపై 50శాతం వడ్డీ రాయితీ
మచిలీపట్నంటౌన్: బందరు నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి తదితర పన్నులపై ఉన్న వడ్డీ 50శాతం రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్, మచిలీ పట్నం నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి డీకే బాలాజీ కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆస్తి, ఖాళీస్థలాలు, తాగునీటి పన్నులు చెల్లించే వారికి వడ్డీపై 50 శాతం రాయితీ లభిస్తుందన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను చెల్లిస్తే నగరపాలక సంస్థ ఆర్థికంగా బలోపేతమవుతుందని తద్వారా పౌర సేవలు అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ సదుపాయాన్ని పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. -
దుర్గమ్మకు పలువురు భక్తుల విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయ వాడ చలసాని నగర్కు చెందిన వై.శ్రీరామ్, మేఘన దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్కు చెందిన సూర్యకుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. ఆలయ అభివృద్ధి నిమిత్తం తమిళనాడు మధురైలోని సౌత్ మాశీ వీధికి చెందిన విశ్వనాథన్ రూ.లక్ష విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
జగన్మాతకు గులాబీలు, కనకాంబరాలతో అర్చన
రెండో రోజు కొనసాగిన వసంత నవరాత్రోత్సవాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలతో అర్చన జరిగింది. తొలుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, దుర్గగుడి ఈవో శీనానాయక్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది అమ్మవారి పూజ కోసం సేకరించిన పుష్పాలతో ప్రధాన ఆలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజా మండపానికి చేరుకుని పూలగంపలను అర్చకులకు అందజేశారు. రెండో రోజు పుష్పార్చనలో 10 మంది ఉభయదాతలు పూజలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక క్యూలైన్ మార్గంలో ఉభయదాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. పుష్పార్చన అనంతరం భక్తులకు ఆ పుష్పాలను పంపిణీ చేశారు. దుర్గమ్మకు కలెక్టర్ ప్రత్యేక పూజలు.. విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరణకు ముందు కలెక్టర్ లక్ష్మీశ కుటుంబ సమేతంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదాలను అందించారు. -
దుర్గమ్మకు బంగారు మంగళసూత్రాల సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు కర్నూలు జిల్లా మునగాలపాడుకు చెందిన బోయే వెంకటేష్ కుటుంబం రూ.4లక్షల విలువైన 30 గ్రాముల బంగారంతో చేసిన మంగళ సూత్రాలను శుక్రవారం కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మచిలీపట్నంఅర్బన్: రంజాన్ సందర్భంగా మార్చి 21న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్మీడియెట్ విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వ్యాల్యుయేషన్) మార్చి 22 ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్. సరళ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో ఫస్ట్ స్పెల్ వ్యాల్యుయేషన్ నిర్వహణకు 10 మంది అసిస్టెంట్ క్యాంప్ అధికారులు, 40 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 225 మంది ఎగ్జామినర్లు పాల్గొననున్నట్లు తెలిపారు. మిగతా స్పాట్ వ్యాల్యుయేషన్ షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. ఏప్రిల్ మొదటి వారాంతంలో మూల్యాంకనం పూర్తి చేయా లని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటికే సుమారు రెండు లక్షల అయిదు వేల జవాబు పత్రాలు చేరుకున్నా యని తెలిపారు. ఇదిలా ఉండగా, మార్చి 24న ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం జియోగ్రఫీ పరీక్ష నిర్వహణతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయని చెప్పారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యతో పాటుగా క్రీడలకు యువత సమప్రాధాన్యం ఇవ్వాలని పీబీ సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు చెప్పారు. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో అంతర్ కళాశాలల ఖో–ఖో (పురుషుల) పోటీలు ఫైనల్స్ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆవరణలోని మైదానంలో శుక్రవారం జరిగాయి. ఫైనల్స్లో సిద్ధార్థ కళాశాల జట్టు మొదటి బహుమతిని, ఆంధ్రా లయోలా కళాశాల జట్టు రెండో, విజయ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు మూడో, వికాస్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టు నాలుగో బహుమతిని సొంతం చేసుకున్నాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వేమూరి బాబూరావు అతిథిగా హాజరై విజేతలకు బహుతులను అందజేశారు. సిద్ధార్థ కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ టీవీబీ కృష్ణారెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఖో–ఖో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఎస్ఎస్ ప్రసాద్ అభినందించారు. చిట్టేల(వత్సవాయి): స్థానిక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం కేజీ వెండితో వక్షస్థల లక్ష్మీదేవి విగ్రహాన్ని అందజేశారు. మండలంలోని లింగాల గ్రామానికి చెందిన పసుపుల నర సింహారావు ఈ విగ్రహాన్ని తయారుచేయించి అందించారు. ఆలయ అర్చకులు సిరికొండ సాయికృష్ణమాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా దాతను పూలమాల, శాలువాతో సత్కరించారు. -
తాడిగడపలో దొంగల హల్చల్
పెనమలూరు: మండలంలోని తాడిగడప గ్రామంలో గురువారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామంలో ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. తాడిగడప గ్రామంలో తాళం వేసివున్న టి.తాపేశ్వరరావు ఇంటిలో అర్ధరాత్రి దొంగల చొరబడ్డారు. ఇంటి కిటికీలు ధ్వసం చేసి, లోపలికి ప్రవేశించిన వారు బీరువాలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, సొమ్ము చోరీ చేశారు. ఇంటి యజమాని బెంగళూరుకు వెళ్లిన సమయం చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. దొంగ తనం జరిగిన విషయాన్ని సీసీ కెమెరాలో ఇంటి యజమాని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మరో ఇంట్లో కూడా దొంగతనానికి ఆగంతకులు విఫల యత్నం చేశారు. దొంగల అలికిడి విని ఇంట్లో వారు బిగ్గరగా అరవటంతో వారు పారిపోయారు. పోలీసులు వచ్చి సీసీ కెమెరా పుటేజీ పరిశీలించారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీమ్ను రంగంలోకి దించారు. చోరీ జరిగిన ఇంటి యజమాని అందుబాటులో లేకపోవటంతో ఎంత మేరకు సొత్తు చోరీ జరిగిందో తేలాల్సి ఉంది. అయితే దొంగలు పెద్ద ఎత్తున ఆభరణాలు చోరీ చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో దొంగలు హల్చల్ చేయటంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. నాగాయలంక: మండలంలోని దిండి గ్రామానికి చెందిన జన్ను బసవదేవుడు (40) ఎలుకల మందు తిని మృతి చెందాడు. నాగాయలంక ఎస్ఐ కలిదిండి రాజేష్ కథనం మేరకు.. ఆయన కథనం మేరకు బసవదేవుడు భార్య నాగమణి, పిల్లలతో కొంత కాలంగా విజయవాడలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం అతని కుమారుడు దిండిలో నాయనమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. కుమారుడిని తీసుకెళ్లడానికి బసవదేవుడు దిండి గ్రామానికి వచ్చాడు. ఎలుకల మందు బిళ్లలు తిని గ్రామంలోని చెరువు గట్టు మీద పడి ఉండటాన్ని బంధువులు గురువారం మధ్యాహ్నం గమనించి అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందాడు. భార్యాభర్తల నడుమ తగవులే అతని మృతికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు ప్రకారం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
కన్నీటి సుడులు
గోదారమ్మ ఒడిలో.. విషాదం మిగిల్చిన ఇంజినీరింగ్ విద్యార్థుల విహారయాత్ర ఉయ్యూరు: సరదా.. సంతోషాలు.. ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తమ బిడ్డలు భద్రాది రామయ్య దర్శనానికి వెళ్లి సంతోషంగా గడిపి ఇంటికి వస్తున్నారనుకున్న తరుణంలో గోదారమ్మ తనలో కలిపేసుకుందన్న హృదయ విదారక ఘటన ఆ కుటుంబాల్లో శోకాన్ని నింపింది. ఉన్నత విద్య పూర్తయితే తమకు చేదోడుగా ఉంటారని ఆశిస్తే విధి వక్రించి తమ బిడ్డలను అనంతలోకాలకు తీసుకెళ్లిపోవటంతో ఆ కుటుంబాల రోదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతం, భద్రాచలం సమీపంలోని ఏటిపాక మండలం పురుషోత్తమపట్నం పక్కన కొల్లిగూడెం వద్ద గోదావరి పాయలో స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఉయ్యూరుకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒక్కగానొక్కడూ.. పామర్రు మండలం కనుమూరుకు చెందిన దగ్గుబాటి ఫణీంద్రనాథ్, ఉష దంపతులు ఉయ్యూరు పట్టణంలోని శ్రీనివాసా కాలేజ్ రోడ్డులో అవంతి అపార్టుమెంట్స్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. నెలల వయస్సులోనే ఒకబిడ్డను కోల్పోయారు. ఉన్న ఒక్కగానొక్క బిడ్డ దగ్గుబాటి నవదీప్ (19)ను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం నవదీప్ కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవులు రావటంతో తమ స్నేహితులతో చదువుతున్న విద్యార్థి భద్రాచలంలో ఉండటంతో స్నేహితులు అంతా కలిసి భద్రాచలం వెళ్లారు. విషయం తెలుసుకున్న నవదీప్ ఈనెల 19న భద్రాచలం వెళ్లాడు. శుక్రవారం స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో కొల్లిగూడెంలో గోదావరి పాయలో స్నానాలకు దిగారు. స్నానం చేసే సమయంలో గల్లంతవ్వటంతో గజ ఈతగాళ్లు ఏటిపాయలో వెతగ్గా నవదీప్ మృతదేహం లభ్యమైంది. వద్దని వారించినా.. విషయం తెలుసుకున్న ఫణీంద్రనాథ్ కుటుంబం తల్లడిల్లింది. భద్రాచలం వెళ్లొద్దని తండ్రి వారించినా తల్లిదండ్రులను ఒప్పించి స్నేహితులతో సరదగా గడిపి వస్తానని చెప్పి వెళ్లి విగత జీవుడ య్యా డు. ఉన్న ఒక్కబిడ్డను పై చదువులకు ఇతర దేశాలకు పంపకుండా కళ్లముందే చదివించుకుంటుంటే బిడ్డను దూరం చేసి విధి తమను దిక్కులేని వాళ్లను చేసిందంటూ బాధిత కుటుంబం రోధించింది. తల్లి ఉష సొమ్మసిల్లిపడిపోయింది. యుద్ధ భయం.. మరో వైపు పుత్రశోకం తేజజ్ఞసాయి తండ్రి శ్రీనివాస్ సౌతాఫ్రికాలో ఉంటున్నాడు. పుత్రుడి విషయం తెలిసి విమానటికెట్లు బుక్ చేసుకున్నారు. హుటాహుటిన బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. యుద్ధ వాతావరణ నేపథ్యంలో విమానం బయలుదేరు వరకూ ఏం జరుగుతుందో చెప్పలేమని అధికారులు చెబుతుండటంతో ఆ తండ్రి వేదన వర్ణనాతీతంగా ఉంది. మరో ఏడాదిలో ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తాడనుకున్న కొడుకు గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతవ్వటంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. అదే అవంతి అపార్టుమెంటులో నివాసం ఉంటున్న గోక శ్రీనివాస్, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు ఇంటర్ పరీక్షలు రాశాడు. పెద్ద కొడుకు తేజజ్ఞసాయి (20) ఎస్ఎఆర్ఎంలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. తేజజ్ఞసాయి తండ్రి శ్రీనివాస్ సౌతాఫ్రికాలోని మడ్గాస్కర్లో ఉద్యోగం చేస్తున్నారు. శ్రీనివాస్ సతీమణి అరుణ ఉయ్యూరులో పిల్లలతో ఉంటోంది. తేజజ్ఞ స్నేహితులతో కలిసి ఈ నెల 18న భద్రాచలం వెళ్లాడు. ఈ క్రమంలోనే తన అపార్టుమెంటులో ఉంటున్న నవదీప్ను కూడా రమ్మని పిలవటంతో అతను కూడా వెళ్లా డు. కొల్లిగూడెం చేరుకున్న స్నేహితులు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా ఏటిపాయలో స్నానానికి దిగారు. అయితే తేజజ్ఞసాయి, నవదీప్లకు ఈత రాకున్నా, స్నేహితులతో కలిసి స్నానానికి దిగారు. ఇంతలో ఊబిలో చిక్కుకుని గల్లంతయ్యారు. -
విజయకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై గురువారం ఉగాది పర్వదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పరాభవ నామ సంవత్సర ఉగాది వసంత నవరాత్రోత్స వాలు ఈనెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామచంద్రస్వామి వారికి అభిషేక మహోత్సవం నిర్వహించామని, చిన్న జీయరుస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఉగాది పంచాగ శ్రవణం, సంపూర్ణ రామాయణ పారాయణ ప్రారంభం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం శ్రీరామనామ లేఖనం, శ్రీరామపూజ, నివేదన, మంగళా శాసనం, తీర్థప్రసాద గోష్ఠితో కార్యక్రమాలు వైభవంగా ముగిశాయపేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. -
గొడ్డలితో నరికి హత్యాయత్నం!
ఎ.కొండూరు: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి పథకం ప్రకారం దారికాచి మరో వ్యక్తిని గొడ్డలితో నరికి హత్య చేసేందుకు యత్నించిన ఘటన మండ లంలోని పెద్ద తండా సమీపాన మైలవరం బ్రాంచి నాగార్జున సాగర్ కాలువ కట్టపై గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. చీమలపాడు గ్రామానికి చెందిన పటాపంచల జమలయ్య, అదే గ్రామానికి చెందిన లావూరి సీతారాం మధ్య పాత కక్షలు ఉన్నాయి. జమలయ్య గురువారం పెద్ద తండా సమీపంలోని మొక్కజొన్న చేను వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరాడు. అప్పటికే అతని రాకకోసం ఎన్ఎస్పీ కాలువ కట్టపై లావూరి సీతారాం మాటు వేసి ఉన్నాడు. జమలయ్య బైక్పై తన సమీపంలోకి రాగానే సీతారాం గొడ్డలితో అతడిపై దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జమలయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అతడిని చీమలపాడులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ పరిశీలించి, గొడ్డలితో దాడిచేయడం వల్ల జమలయ్య తలకు తీవ్రగాయమైందని, వెంటనే విజయవాడ తరలించాలని సూచించారు. దీంతో జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై ఎ.కొండూరు ఎస్ఐ జి.మహాలక్ష్మణుడును వివరణ కోరగా.. గొడ్డలితో దాడి జరిగిన మాట వాస్తవమేనని, ఘటనా స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. గాయపడిన జమలయ్యను కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారని, బాధితుడి వాంగ్మూలం తీసుకోవడానికి సిబ్బందిని పంపించానని పేర్కొన్నారు. -
మచిలీపట్నంలో కీచక అర్చకుడు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర ఆర్పేట పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఎ.రఘునాథశర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక ఉంది. ఆమైపె అర్చకుడు రఘునాథశర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్యకు దగ్గర చేశాడు. అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి కుటుంబం ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలతో పాటు ఆ బాలికనూ తీసుకెళ్లేవాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు ఆమైపె లైంగికదాడి చేశాడు. బాలిక బుధవారం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భంధరించిందని నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆగ్రహంతో అందుకు కారణం ఎవరంటూ బాలికను ప్రశ్నించారు. తాను గర్భం దాల్చటానికి కారణం రఘునాథశర్మ అని ఆమె చెప్పటంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథశర్మను అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎస్ఐ యోహాను, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాలికపై యువకుడి లైంగికదాడి చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ పాతరాజరాజేశ్వరికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే దేవరపాటి రాజేష్ అలియాస్ నాని కళ్లు ఆ బాలికపై పడ్డాయి. బాలికతో మాట్లాడుతూ చనువుగా ఉండటమే కాకుండా ప్రేమిస్తున్నాని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో జరిగిన విషయం బాలిక తల్లికి చెప్పింది. బాలిక తల్లి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
అకాల కష్టం
వత్సవాయి మండలం మక్కపేటలో నేలవాలిన మొక్కజొన్న పంట పెడన మండలం ఉరివి వద్ద మినుము కుప్పలు లంకలకలువగుంట వద్ద మినుము పంటపై పరదాలు కప్పుతున్న రైతులు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బుధ, గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గాలులు, వర్షం ధాటికి పలు పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న పైరు పూర్తిగా నేలవాలింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, నూర్పిడికి సిద్ధంగా ఉన్న మినుము పైర్లు వర్షానికి తడిశాయి. అరటి, మామిడి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. పెనుగంచిప్రోలు మండలంలోని గుమ్మడిదుర్రు, వెల్దుర్తిపాడు, అనిగండ్లపాడు గ్రామాల్లో గింజ అంతా రాలిపోయి కేవలం వరి కంకులు మిగిలాయి. – సాక్షి నెట్వర్క్ పెనుగంచిప్రోలులో కాపుదశలో విరిగిపడిన బొప్పాయి చెట్లు ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో నేలవాలిన మొక్కజొన్న చేను ఘంటసాలలో వర్షానికి తడిసిన మినుము పంట -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
చల్లపలి: ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయి చీకట్లో రోడ్డు కనిపించక ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఓ వృద్ధుడు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం పెదకళ్లేపల్లి రోడ్డులో గురువారం జరిగింది. మండలంలోని మంగళాపురం గ్రామానికి చెందిన రైతు పరుచూరి ప్రభాకరరావు (66) అదే గ్రామానికి చెందిన చండ్ర సుబ్బారావు పొలం పనులు ముగించుకుని, పురుగు మందుల కోసం ద్విచక్రవాహనంపై చల్లపల్లి సెంటర్కు వచ్చారు. తిరిగి మంగళాపురం వెళ్లేందుకు పెదకళ్లే పల్లి రోడ్డులో బయలుదేరారు. ఇంకొంత దూరంలో హైవే ఎక్కుతామనే లోపు ఎదురుగా వచ్చే వాహ నాన్ని తప్పించబోయి అప్పటికే చీకటి పడటంతో రోడ్డు కనిపించక వారి వాహనం అదుపుతప్పింది. వాహనం నడుపుతున్న ప్రభాకరరావు, వెనుక కూర్చున్న సుబ్బారావు ఇద్దరూ కింద పడిపోయారు. సుబ్బారావు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడగా, ప్రభాకరరావు ఎడమచేతి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే అటుగా వస్తున్న ఆటోలో ప్రభాకరరావును చల్లపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రభాకరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభాకరరావుకు భార్య, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను బాగానే ఉన్నానని కంగారు పడవద్దని ప్రభాకరరావు తనతో చెప్పాడని, ఆస్పత్రికి వచ్చేలోపే ప్రాణాలు వదిలాడని చెబుతూ సుబ్బారావు కన్నీరుమున్నీరయ్యారు. -
ఘనంగా ఉగాది వేడుకలు
మచిలీపట్నంటౌన్: నగరంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురు వారం జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, డీఆర్వో చంద్రశేఖరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మాట్లాడుతూ.. బందరు ఓడరేవు నిర్మాణ పను లను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఉగాది నాటికి ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. ఉగాది పచ్చడిలో తీపి, చేదు కలయికలను సమానంగా అంగీకరించాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. తొలుత విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం నవగ్రహాలలో ఆరు గ్రహాలు శుభగ్రహాలుగా ఉన్నాయన్నారు. సకా లంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉంటారన్నారు. దేవదాయ శాఖలో విశిష్టంగా సేవలు అందించిన పది మంది వేద పండితులు, అర్చక స్వాములను రూ.10,116 చొప్పున నగదు పురస్కారాలు, శాలువా, నూతన వస్త్రాలతో మంత్రి, కలెక్టర్ సత్కరించారు. అలరించిన కవి సమ్మేళనం రచయిత ముదిగొండ శాస్త్రి నేతృత్వంలో కవులు రచయితలు చింతలపాటి మురళీకృష్ణ, మేరీకృపాబాయి, డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి, వక్కలంక రామకృష్ణ, సింహాద్రి పద్మ, బత్తిన అగస్తీశ్వరరావుతో కలిసి నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బందరు ఆర్డీఓ సాంబశివరావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి.ఫణికుమార్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్, బందరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.26 వేల కోట్లు తక్షణం విడుదల చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): రిటైర్మెంట్ బెనిఫిట్లతోపాటు పెన్షనర్లకు రావల్సిన రూ.26 వేల కోట్లను తక్షణమే విడుదల చేసి వారిని ఆదుకోవా లని ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.దాలినాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో గురువారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పెన్షర్లకు గతంలో ఇచ్చిన విధంగానే అడిషనల్ క్వాంటమ్ చెల్లించాలన్నారు. పెన్షనర్ల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారంపై సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. తొలుత విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు ఆవంచ వేణుగోపాల రాధాకృష్ణమూర్తి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆల్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యేమినేని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా విశిష్ట అతిథులుగా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కె.వీరబాబు, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మదేవర విష్ణువర్ధన్, ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జి.నారాయణరావు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సూరిశెట్టి రామయ్య, వరలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యారమ్స్, చెస్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. క్యారమ్స, చెస్ పోటీల్లో మూడేళ్లపాటు వరుసగా ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతాప శ్రీనివాసరావుకు రోలింగ్ షీల్డ్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యేమినేని వెంకటేశ్వర్లు, యెనిగళ్ల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు పమిడిపాటి పట్టాభి రామారావు, గౌరవ సలహాదారు సాలి ఆంజనేయరావు, కొత్తపల్లి సంజీవరెడ్డి, సంయుక్త కార్యదర్శి బర్రె శశాంక బాబు, సహాయ కార్యదర్శి పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాలినాయుడు -
దుర్గగుడిలో పలువురికి అంతర్గత బదిలీలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్, ఆడిట్ జనరల్ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్, జనరల్, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ ఎం.రమేష్ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్స్పెక్టర్ బాధ్యతలు అప్పగించారు. కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మచిలీపట్నంటౌన్: స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై ఏప్రిల్ రెండో తేదీతో ముగుస్తుందని విద్యాలయ ప్రిన్సిపాల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు https:// machilipatnam. kvs.ac.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి ప్రవేశం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి https:// admission.kvs.gov.in లింక్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు ఆరు ఏళ్లు ఉండాలని అన్ని తరగతులకు సంబం ధించి వయస్సు నిర్ధారణను 31.03.2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటామని తెలి పారు. సీట్ల రిజర్వేషన్ అనేది కేవీఎస్ ప్రవేశ మార్గదర్శకాలు 2026–27 ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నాగిరెడ్డికి మాతృవియోగం నందివాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మాతృ మూర్తి మలిరెడ్డి నాగసుందర మణిమ్మ (89) గురువారం మరణించారు. మణిమ్మకు ఇద్దరు కుమారులు. వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ నాయకులు పలువురు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నందివాడ మండలం జనార్దనపురంలో నాగసుందర మణిమ్మ అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
అకాల వర్షంతో రైతులకు అపార నష్టం
రెండకరాల్లో మునగ, నాలుగెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఈదురు గాలులు, అకాల వర్షాలతో ఎకరన్నర మునగ, మూడెకరాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. మునగకు రూ.80వేలు వరకు, మొక్కజొన్న రూ.2.50 లక్షలు మొత్తం రూ.3.30లక్షలు వరకు పెట్టుబడి పెట్టా. ఈసారి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. కౌలు మరో రూ.1.50లక్షలు అయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – నాగేశ్వరరావు, రైతు, కొటికలపూడి గతేడాది రబీ సీజన్లో రెంకరాల్లో మినుము పైరు సాగుచేశా. మోంథా తుపాను ప్రభావంతో పూర్తిగా నష్టపోయా. ఈసారి ఖరీఫ్లో మొక్క జొన్న సాగు చేశా. అకాల వర్షం, ఈదురు గాలులతో నేలమట్టం అయ్యింది. మరో 20 రోజుల్లో పంట చేతికొస్తుందనే తరుణంలో అకాల వర్షం నిండా ముంచింది. ఇప్పటికే రూ.2లక్షల వరకు పెట్టుబడి పెట్టా. చేతికి చిల్లిగవ్వ వచ్చేలా కనిపించడంలేదు. – గోలుల సాంబశివరావు, రైతు, కొటికలపూడి కొటికలపూడి(ఇబ్రహీంపట్నం): అకాల వర్షంతో రైతులకు అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి నేలవాలిన పంట పొలాలను కొటికలపూడిలో గురువారం రైతులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలకు జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు అర్జా బాబూరావు మాట్లాడుతూ మరో 20, 30 రోజుల్లో పంట చేతికొచ్చేదని, ఈ దశలో పంట నేలపాలు అయ్యిందని వాపోయారు. ఇప్పటికే పంటకు పెట్టుబడిగా రూ.50వేలు నుంచి రూ.60వేలు వరకు అయిందన్నారు. కౌలు మరో రూ.30వేలు కలుపుకొంటే ఎకరానికి ఇప్పటికే రూ.90వేలు నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు జోగి రమేష్కు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. మరో రైతు బోళ్ల మునియ్య మాట్లాడుతూ ప్రస్తుతం యూరియా కట్ట రూ.2,500 వరకు పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయంలో అన్ని ధరలు పెరిగాయని, రైతులకు గిట్టుబాటు ధర మాత్రం పెరగటం లేదని వాపోయారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పంటలు నష్టపోతే పరిహారం అందించారని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో రైతులకు అన్నీ కష్టాలే.. జోగి రమేష్ మాట్లాడుతూ అకాల వర్షం రైతుల నడ్డి విరిచిన పరిస్థితి చూశామన్నారు. క్వింటా సుమారు రూ.2వేలు చొప్పున ఎకరాకు 50 క్వింటాలు అయితే ఎకరాకు రూ.లక్ష వరకు వచ్చేవన్నారు. గతంలో మోంథా తుపాను ప్రభుత్వంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. అంచనాలు వేసినా పరిహారం అందించలేని దిక్కుమాలిన ప్రభుత్వం అన్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులను పలకరించే దిక్కు లేదని విమర్శించారు. ఎరువులు లేవు, విత్తనాలు లేవన్నారు. కృష్ణానది అవతల సీఎం చంద్రబాబు ఉన్నారని, ఇవతల రైతులు ఉన్నారన్నారు. అకాల వర్షాలతో మొక్కజొన్న, మునగ, రైతులు నష్టపోతే ఇప్పటి వరకు అధికారులు రైతులు, పంట పొలాల వైపు తిరిగి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటలకు తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. గతంలో వరదకు పసుపు పంట కోల్పోతే వైఎస్ జగన్ ఎకరాకు రూ.లక్ష ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు, ౖ వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పరాభవ.. విజయీభవ
భక్తితో కొత్త సంవత్సరాదికి ఆహ్వానం పలికిన ప్రజానీకంఅమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ఉత్సవ మూర్తితో ఊరేగింపుగా వస్తున్న ఆలయ ఈవో, చైర్మన్ తదితరులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఆదిదంపతులైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. దుర్గమ్మకు తెల్లవారుజామున స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8 గంటలకు దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారి ఆలయంతో పాటు మల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాల వద్ద విశేష పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ద్వారాలు, ప్రవేశ మార్గాల వద్ద అరటి చెట్టు, మామిడి ఆకులతో ముస్తాబు చేశారు. వసంత నవరాత్రులు ప్రారంభం.. తొలుత ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధా కృష్ణ, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై నూతన పూజా మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తితో ఆలయ ఈవో, చైర్మన్ ముందుకు సాగారు. నూతన పూజా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మల్లెలు, మరువంతో పుష్పార్చన చేసి వసంత నవరాత్రులకు అంకురార్పణ చేశారు. తొలి రోజున 13 మంది ఉభయదాతలు సేవలో పాల్గొన్నారు. రూ. 2,500 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు పుష్పార్చనలో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు పేర్కొన్నారు. పుష్పార్చన అనంతరం అమ్మవారికి సమర్పించిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. ఇక సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణం నూతన పూజా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. అంతకు ముందు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వేదపఠనంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ అర్చకులు అమ్మవారికి, పంచాంగాలకు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాసశర్మ పంచాంగ పఠనం చేశారు. చల్లా శ్రీనివాసశర్మకు ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పుష్పమాలను సమర్పించారు. పంచాంగ పఠనంలో 12 రాశుల స్థితిగతులు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానాలు, గ్రహ స్థితుల గురించి చక్కటి వ్యాఖ్యానంతో వివరించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం, నూతన యాగశాల దాత సంగా నరసింహరావు దంపతులను ఘనంగా సత్కరించారు. చైర్మన్, ఈవోలు వారికి నూతన వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. -
కనికుట్టు స్కీమ్!
జి.కొండూరు: ప్రభుత్వం మాటలు కోటలు దాటడం తప్ప చేతలు గడప కూడా దాటడం లేదనేది ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమైంది. స్కిల్ డెవలెప్ మెంట్లో భాగంగా బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లను పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. శిక్షణ అయితే ఇచ్చారు కానీ ఏడు నెలలు గడిచినా మిషన్లను పంపిణీ చేయకపోవడంతో మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మిషన్లు ఇచ్చే లోపు నేర్చుకున్నది కూడా మరచిపోయేలా ఉన్నామని వాపోతున్నారు. శిక్షణ ఇలా.. ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ ట్రైనింగ్ పార్టనర్గా కర్డ్ అనే సంస్థకి బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వం సూచించిన మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 29సెంటర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క సెంటర్కి రెండు బ్యాచ్లలో 144మంది చొప్పున 4,176మందిని శిక్షణకు ఎంపిక చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం 2025, ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 90రోజులపాటు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు నైపుణ్య పరీక్షను నిర్వహించి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయాల్సి ఉంది. శిక్షణ పూర్తయ్యి ఏడు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో స్పందన లేకపోవడంతో సదరు సంస్థ పరీక్షను నిర్వహించలేదు. మిషన్లను పంపిణీ చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొనడంతో లక్షల మంది మహిళల మిషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో.. ఏడు నెలలుగా ఎదురు చూపులు.. కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ప్రభుత్వం మిషన్లు ఎప్పుడు పంపిణీ చేస్తుందో తెలియక నరకయాతన పడుతున్నారు. శిక్షణ కాలంలో వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రాల్లో ఉన్న సెంటర్లకు వచ్చేందుకు 90రోజుల పాటు ప్రతి రోజూ రవాణా చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ.10వేల వరకు సొంత డబ్బులు ఖర్చు చేశారు. అంతే కాకుండా ఇతర ఆదాయ మార్గాలను సైతం వదులుకొని శిక్షణ పొందామని. మిషన్లు పంపిణీ చేయకపోతే తామెలా బతకాలను వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి కుట్టు మిషన్లను పంపిణీ చేయకపోతే నేర్చుకున్నది కూడా మరిచిపోయాలా ఉన్నామని ఆవేదన చెందుతున్నారు. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాశుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 34.6755 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కవి, శతావధాని మాడుగుల నాగఫణిశర్మ గురువారం దర్శించుకున్నారు. 7ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, మొండితోక అరుణకుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి, ఇతర నాయకులు పాల్గొని, కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. – లబ్బీపేట(విజయవాడతూర్పు) -
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉందాం: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మునిసిపల్, పంచాయతీ శాఖలు డ్రెయినేజీ వ్యవస్థల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని, పంటలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మిర్చి రైతులను అప్రమత్తం చేయాలని కల్లాల్లోని మిర్చిని జాగ్రత్తగా భద్రపరచుకునేలా చేయూతనివ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్బీ శాఖలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని చెప్పారు. సమాచారం ఇవ్వండి.. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా స్థానిక అధికారులను వెంటనే సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454 )అందుబాటులో ఉందని.. ఈ నంబర్కి కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండి ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పంటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందుతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. -
ఈద్ నమాజ్కు ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బహిరంగ ఈదుల్ ఫితర్ నమాజు నిర్వహించనున్నట్లు ముస్లిం ఈద్గా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కాలేషావలీ, మునీర్ అహ్మద్ షేక్ తెలిపారు. ఈ సందర్భంగా ఈద్నమాజు నిర్వహించే ప్రాంగణంలో గురువారం నమాజు పోస్టర్ను వారు ఆవిష్కరించారు. డాక్టర్ కాలేషావలి, మునీర్ అహ్మద్ షేక్ మాట్లాడుతూ రంజాన్ రోజు ఉదయం 7. 30 గంటలకు ఈద్ సందేశం ప్రారంభమవుతుందని తెలిపారు. నమాజు ఉదయం 8 గంటలకు జరుగుతుందన్నారు. వజూ కోసం శుభ్రమైన నీరు అందుబాటులో ఉంటుందని, నమాజు నిర్వహించుకునేందుకు అనువుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రతినిధులు ఎండీ అన్వర్ పాష, ఎండీ ఇర్ఫాన్, ముఖ్తార్ అలీ, ఎండీ మొహిద్దీన్ పాల్గొన్నారు. తిరువూరు ఆర్డీవోగా కుమార్ తిరువూరు: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో పౌరసరఫరాల విజిలెన్స్లో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన బదిలీపై తిరువూరుకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న కె. మాధురి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో కుమార్ను ఆర్డీవోగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. హెచ్సీ శ్రీమన్నారాయణకు ఉత్కృష్ట సేవ పతకం ఎ.కొండూరు: స్థానిక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న బి.శ్రీమన్నారాయణ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ట సేవ పతకానికి ఎంపికయ్యారు. విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, ప్రజలతో సత్సంబంధాలు వంటి లక్షణాలకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది. పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా నిబద్ధతతో సేవలందిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుండే అధికారిగా శ్రీమన్నారాయణ స్థానికంగా మంచిపేరు ఉంది. శ్రీమన్నారాయణకు అవార్డు లభించడం పట్ల ఎ.కొండూ రు పోలీస్ సిబ్బంది, పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. -
లారీ ఢీకొని ముగ్గురు చిన్నారులకు గాయాలు
కోనేరుసెంటర్: లారీ ఢీకొనటంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న మచిలీపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పరాసుపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూలు వదలగా ఓ మహిళ తన పిల్లలను మోపెడ్పై ఎక్కించుకుని ఇంటికి వెళుతోంది. సరిగ్గా పరాసుపేట సెంటర్ సర్కిల్ వద్దకు చేరుకున్న సమయంలో కరగ్రహారం నుంచి పరాసుపేటకు చేరుకున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ చిన్నారులు వెళుతున్న మోపెడ్ను ఢీకొన్నాడు. తల్లి పిల్లలు రోడ్డుపై పడిపోగా రెండు అడుగుల దూరం వరకు మోపెడ్ను లారీ దూసుకుంటూ ఈడ్చుకు వెళ్లింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి వాహనదారులు లారీడ్రైవర్ నిర్లక్ష్యాన్ని మందలిస్తూ గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీని రివర్స్ చేయటంతో ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు లారీ చక్రాల కింద పడి నలిగిపోయే పరిస్థితి ఏర్పడేది. చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పరారీలో డ్రైవర్! గాయాలపాలైన పిల్లలను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన లారీడ్రైవర్ వాహనాన్ని పక్కకు పెడుతున్నట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు, బందరు ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి లారీ ఘంటశాలకు చెందినదిగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్తో పాటు వాహన యజమానిని స్టేషన్కు పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం. పెడన: పెడన– బంటుమిల్లి 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కట్లపల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పెడన పట్టణంలోని శ్రీకృష్ణతులసీ థియేటర్ సమీపంలో నివాసం ఉండే పెయింటర్ యాళ్ల సాయి(24) తమ సమీప బంధువుల పిల్లలు గూట్ల మేఘశ్రీ(5), పుట్టి వైష్ణవి(12)లతో కలిసి సాయి తల్లిదండ్రులుంటున్న శింగరాయపాలెంకు సుమారు రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయల్దేరాడు. ఈక్రమంలో నరసాపురం నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి వీరి బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, మేఘశ్రీ, వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టండి
పామర్రు: రైతులు యూరియా వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించి, అధిక ఆదాయం పొందాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపు నిచ్చారు. మండల పరిధిలోని పలు గ్రామాలలో కలెక్టర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. తొలుత పామర్రు మండలంలోని కురుమద్దాలి గ్రామం సందర్శించి రైతన్నా.. మీ కోసం కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. గతేడాది బుడమేరు వరదల కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించామని, ఒక వైపు రసాయనిక ఎరువులు వేసిన వరి పొలం, దాని పక్కనే ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన వరి పొలం గమనించామని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంట నిటారుగా నిలిచిందని, మంచి దిగుబడి వచ్చిందని చెప్పారు. రసాయన ఎరువులతో సాగు చేసిన వరి పంట దిగుబడి లేక రైతు నష్ట పోయారని అన్నారు. గ్రామంలో కూలీల సమస్య ఉందని రైతులు కలెక్టర్కు చెప్పగా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అవసరమైన వారికి డ్రోన్లు పంపిస్తామని వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం సందర్శన.. అనంతరం కలెక్టర్ ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ సమకూర్చిన నిధులతో పునరుద్ధరించిన అంగన్వాడీ సక్షం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి చిన్నారులతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పామర్రులోకి చాట్లవానిపురంలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, ప్రణాళిక చిత్రపటాన్ని పరిశీలించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం.. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పామ ర్రు సచివాలయం–1లో రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ప్రారంభించిన దివ్యాంగ శక్తి పథకాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఉయ్యూరు ఆర్డీవో శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఏపీఈడబ్ల్యూఎస్ ఐడీసీ ఈ రాజన్న, తహసీల్దార్ రవికాంత్, డెప్యూటీ ఎంపీడీవో గంగాధర్రావు, మండల వ్యవసాయ అధికారి శివ నాగరాణి, ఏఈ రాజేష్, వసతి గృహం సంక్షేమ అధికారి వీణకుమారి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ -
రైతులతో వాతావరణం
సాక్షి నెట్వర్క్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుధవారం మధ్యాహ్నం గాలి వాన బీభత్సం సృష్టించింది. అప్పటి వరకు ఎండ మండిపోగా ఒక్క సారిగా వాతావరణం మారిపోయింది. గాలి దుమారం మొదలైన కొద్ది సేపటికే ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి రహదారుల పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు, పలు ప్రచార బోర్డులు నేలకూలాయి. జొన్న, మొక్కజొన్న, మునగ వంటి పంటలు నేల వాలాయి. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాలతో పాటు, కృష్ణాజిల్లా పరిధిలో పెనమలూరు నియోజకవర్గంలో పంట నష్టం అధికంగా ఉంది. ఇబ్రహీంపట్నంలోని కొటికలపూడి, మూలపాడు, లంక గ్రామాల్లో నష్ట తీవ్రత అధికంగా ఉంది. వర్షంతో పొలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల నేలవాలిన చేలల్లో మొక్కజొన్న గింజలు మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు. విస్సన్నపేట: స్థానిక విస్సన్నపేట–నూజివీడు రోడ్డులో రాణి కల్యాణమండపం సమీపంలో ఓ ట్రావెల్స్ బస్, మినీలారీ ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో.. బస్సు రోడ్డు సైడ్కు దూసుకెళ్లి ఆగిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో నాలుగు గ్రామాల నుంచి డ్రైవర్తో పాటు 42 మంది కలసి నిర్మలగిరి (గౌరీపట్నం )వెళ్లి.. తిరిగి వచ్చే క్రమంలో ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్ డ్రైవర్ లక్ష్మణ్రెడ్డికి కాలు విరిగింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఎస్ఐ అర్జున్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108లో వైద్యానికి తరలించారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. -
పూల ధరలకు రెక్కలు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కృష్ణా మెయిన్ కెనాల్ సమీపంలోని రాజీవ్గాంధీ హోల్సేల్ పూల మార్కెట్ వినియోగదారులతో బుధవారం కిటకిటలాడింది. గురువారం పండుగను పురస్కరించుకొని పూజలకు, ఇతర అలంకరణ నిమిత్తం పూలను తీసుకెళ్లేందుకు నగర వాసులు భారీగా మార్కెట్కు తరలివచ్చారు. అందుకనుగుణంగా రైతులు కూడా భారీగా పూలను మార్కెట్కు తరలించారు. బంతి, చామంతి, మల్లి, లిల్లీ, గులాబీ పువ్వులు భారీగా వచ్చాయి. నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయం రోడ్డు మొత్తం వినియోగదారులు, వాహన చోదకులతో కిక్కిరిసిపోయింది. మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేయటానికి వచ్చిన వినియోగదారులు ముందుకు సాగటానికి దారి లేక తోపులాటలు చోటు చేసుకున్నాయి. ధరలు.. భారీగా పెంచేశారు.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. రెండు రోజుల క్రితం ఉన్న ధరలు రెట్టింపయ్యాయి. ఆ ధరలను విని వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మొన్నటి వరకూ కనకాంబరాలు కిలో రూ.200 నుంచి రూ.400 పలుకగా బుధవారం ఉదయం రూ.800, సాయంత్రం రూ.1000 మేర ధర పలికింది. అదేవిధంగా మల్లెపూలు మొన్నటి వరకూ కిలో రూ.200 మాత్రమే ఉండగా బుధవారం రూ.600 దాటింది. వాటితో పాటుగా చామంతి, గులాబీ ధరలు సైతం నాలుగు రెట్లు పెరిగి మూడు వందల నుంచి నాలుగు వందల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే లిల్లీ మొన్నటి వరకూ వంద నుంచి మూడు వందల రూపాయలు పలుకగా, బుధవారం రెండు రెట్లు పెరిగాయి. ఈ ధరలు గత ఏడాది రెట్టింపుగా ఉన్నాయని వ్యాపారులు వివరించారు. పూల ధరలు హోల్సేల్ మార్కెట్లో ఈ విధంగా పలుకుతుంటే రిటైల్గా ఇళ్ల వద్ద ఆ ధరలు మరింత పెరిగి వినియోగదారులకు మరింత భారమయ్యాయి. మార్కెట్లో పూలదండలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆలయాలు, ఇళ్లలో దేవుని విగ్రహాలతో పాటుగా అలంకరణకు దండలు వినియోగిస్తారు. అదే విధంగా దస్త్రాలు ఉన్న దుకాణాదారులు సైతం భారీగా పూలదండలను తీసుకెళ్లారు. అదేవిధంగా పండుగ సందర్భంగా వివిధ సభా కార్యక్రమాలను నిర్వహించే సంస్థలు సైతం దండలకు ఆర్డర్లు ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. వీటి ధరలు రూ.200 నుంచి రూ.1000 వరకూ పలుకుతున్నాయి. -
రూ.30లక్షల డ్వాక్రా సభ్యుల సొమ్ము స్వాహా
రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో తొమ్మిది డ్వాక్రా గ్రూపుల్లో దాదాపు రూ. 30లక్షలు స్వాహా అయిన సంఘటనపై బుధవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రెడ్డిగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చనపల్లి గ్రామంలో 9 గ్రూపులకు సంబంధించిన నగదును విస్సన్నపేటలోని ఇండియన్ బ్యాంకులో జమ చేస్తుంటారు. అయితే బుక్ కీపర్ అయిన బత్తుల మౌనిక మహిళ మండలి ప్రిసిడెంట్, సెక్రటరీ, గ్రూపు సభ్యులకు తెలియకుండా పలు దఫాలుగా సుమారు రూ. 30లక్షల వరకూ డ్రా చేసింది. దీనిని గుర్తించిన గ్రూపు సభ్యులు రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇండియన్బ్యాంకు మేనేజర్, సిబ్బంది, ఏపీఎం, సీసీల పేర్లు కూడా ఫిర్యాదులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలా ఎలా? గ్రూపు సభ్యుల సంతకం తేడా వస్తేనే డబ్బులు ఇవ్వని బ్యాంకు సిబ్బంది.. బుక్ కీపర్కు అంత మొత్తం ఎలా ఇచ్చారంటూ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కాయకష్టం చేసి మహిళా మండలి సభ్యులు పొదుపు చేస్తుంటే ఇండియన్ బ్యాంకు మేనేజర్, సిబ్బంది, బుక్ కీపర్, ఏపీఎంలు కుమ్మకై డబ్బులు స్వాహా చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. నగదు మాయం నిజమే.. కాగా ఈ విషయమై ఏపీఎం రామకృష్ణను అడుగగా గ్రూపు సభ్యుల నగదు స్వాహా అయిన మాట నిజమేనని, దీనిపై విస్సన్నపేట ఇండియన్ బ్యాంకులో అడిట్ జరుగుతున్నట్లు తెలిపారు. కాగా దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తొమ్మిది డ్వాక్రా గ్రూపు సభ్యులు -
సజావుగా ‘పది’ పరీక్షలు
98.91 శాతం హాజరు నమోదు మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎస్ఎస్సీ హిందీ, ఏపీఓఎస్ఎస్ ఇంగ్లిష్ పబ్లిక్ పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా జరిగినట్లు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. పామర్రులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఎస్ఎస్సీ పరీక్షలకు 21,312 మంది విద్యార్థులకు గాను 21,079 మంది హాజరవగా, 98.91 శాతం, ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరవడంతో 73.08 శాతం హాజరు నమోదైందన్నారు. రెగ్యులర్, వన్స్ ఫెయిల్ విద్యార్థులు.. రెగ్యులర్ ఎస్ఎస్సీ పరీక్షలకు 21,257 మందికి గాను 21,063 మంది హాజరై 99.09 శాతం హాజరు నమోదైందని డీఈఓ తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన ప్రైవేట్ అభ్యర్థుల్లో 55 మందికి గాను 16 మంది హాజరై 29.09 శాతం హాజరు నమోదవగా, 39 మంది గైర్హాజరయ్యారు. ఏపీఓఎస్ఎస్లో 598 మందికి గాను 437 మంది హాజరై 73.08 శాతం హాజరు నమోదవగా, 161 మంది గైర్హాజరయ్యారు. పలు కేంద్రాలను పరిశీలించి, సిబ్బంది తగు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరికీ ఇఫ్తార్ విందు అందివ్వడం ద్వారా మత సామరస్యాన్ని చాటి చెప్పినట్లు అవుతుందని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ముస్లిం సోదరులకు బుధవారం సీపీ ఎస్వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత వున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ’రోజా’(ఉపవాస దీక్షలు), దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుందన్నారు. ముస్లిం సోదరులు పోలీస్ శాఖలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, అలాగే ఇతర శాఖల్లో కూడా వారి సేవలు ప్రశంసనీయమన్నారు. డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, షరీన్బేగం, కేజీవీ సరిత, కె. కృష్ణ ప్రసన్న, ఏబీటీఎస్ ఉదయరాణి, బి. లక్ష్మీనారాయణ, ఎస్వీడీ ప్రసాద్, ముస్లిం మత పెద్దలు పాల్గొనారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శ్రీ పరాభవ నామ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త విజయాలు, వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజల సంస్కృతిలో ఉగాది పండుగకు విశిష్ట స్థానం ఉందని, ఇది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా ఆలోచనలు, ఆశయాలను పునర్నించుకునే ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ నెల 24వ తేదీన మాస్టర్స్ (వెటరన్స్) జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రన్నింగ్, జావెలిన్త్రో, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్త్రో, హైజంప్ల్లో మహిళ లు, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు స్పోర్ట్స్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆధార్ నంబర్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటలకు బందరురోడ్డులోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ఆవరణలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 30, 31వ తేదీల్లో గుంటూ రు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారని, వివరాలకు 98661 34016లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు. ఎ.కొండూరు: మండలం పరిధిలోని చీమలపాడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన 33వ జిల్లా మహాసభలు బుధవారం ముగిశాయి. రెండు రోజులపాటు సాగిన ఈ సమావేశాల్లో గత మూడేళ్లుగా చేసిన పోరాటాలు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై సమీక్ష చేశారు. పలు కీలక నిర్ణయాలు, డిమాండ్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీల్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని విన్నవించారు. అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని తీర్మానించారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణ కోసం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పానెం ఆనందరావు, రైతులు పాల్గొన్నారు. పెనమలూరు: కానూరులో ఇంటర్ చదువుతున్న బాలిక బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు నాగార్జున ఆస్పత్రి సమీపంలో యశ్విని(16) కుటుంబ సభ్యులతో ఉంటుంది. ఆమె విజయవాడ మోగల్రాజపురంలో ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతూ మొదటి ఏడాది ఎంఈసీ పరీక్ష రాసింది. అయితే ఆమె ఇంట్లో ఉదయం చున్నీతో ఉరేసుకొని మృతి చెందింది. చదువుల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
నేటి నుంచి వసంత నవరాత్రులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గురువారం నుంచి వసంత నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి విశేష సుగంధ పుష్పాలతో అర్చన జరగనుంది. నూతన పూజా మండపంలో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి గురువారం తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం ఎనిమిది గంటలకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. కళావేదికపై పంచాంగ పఠనం జరుగుతుంది. తెలుగు సంవత్సరాది నేపధ్యంలో అమ్మ వారి ఆలయాన్ని పూలతో విశేషంగా అలకరించారు. మల్లెలు, మరువంతో అర్చన వసంత నవరాత్రోత్సవాలలో తొలి రోజైన గురువారం అమ్మవారికి మల్లెపూలు, మరువంతో విశేషంగా అర్చన జరుగుతుంది. తొలుత అర్చన నిర్వహించే పుష్పాలతో ఆలయ అర్చకులు, వేద పండితులు ఊరేగింపుగా పూజామండపానికి చేరుకుంటారు. పుష్పార్చన అనంతరం ఆయా పుష్పాలను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ సేవలో పాల్గొనే భక్తులు రూ.2500 టికెట్ కొనుగోలు చేయాలి. ఉగాదిని పురస్కరించుకుని శ్రీ గంగ, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్లకు వెండి రథంపై నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మహామండపం నుంచి ఊరేగింపు ప్రారంభమై కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, జమ్మిదొడ్డి, కోమల విలాస్, రమణయ్య కూల్డ్రింక్స్ షాపు, బోడెమ్మ హోటల్, వన్టౌన్ పోలీస్ స్టేషన్, సామారంగం చౌక్, శ్రీను హోటల్, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లాఇబ్రహీంపట్నం: మండలంలోని గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకల్లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ బుధవారం పాల్గొన్నారు. వర్క్షాపు చీఫ్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఇతర అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్క్ షాపులోని పలు విభాగాలను జీఎం శ్రీవాత్సవ పరిశీలించారు. ముఖ్యంగా మెషీన్ షాప్, ఎంఎండబ్ల్యూ సెక్షన్, పెయింట్ షాప్, సాబ్ సెక్షన్, స్క్రాప్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్, వీల్షాప్ యార్డ్ ఆఫీస్ కాంప్లెక్స్లను సందర్శించారు. సంస్థ నిర్వహణపై అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యాగన్ వర్క్షాపు ఉద్యోగులు, కార్మికుల కృషితో సంస్థ దేశంలోనే రెండో స్థానంలో నిలవడంపై వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో సైతం మరింత పురోభివృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వీల్ మిషన్, పెయింట్ షాపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూ ఎం.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ/లబ్బీపేట(విజయవాడతూర్పు): అభిమాన తరంగం ఉప్పొంగింది. వర్షపు జల్లులతో పోటీపడుతూ జననేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని చూసేందుకు వెల్లువలా తరలి వచ్చింది. వాన చినుకులను లెక్కచేయక తమ అభిమాన నేత కోసం వేచి చూసింది. జననేత కనిపించిన ఆనం దంతో జై జగన్.. జైజై జగన్ అన్న నినాదాలు మారుమోగాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో ముస్లింలకు బుధ వారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఎస్ఎస్ కన్వెన్ష న్లో నిర్వహించిన విందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్ ముబారక్ అంటూ వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పొంగిన అభిమాన తరంగం ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు విజయవాడ చేరుకున్నారు. ఈదురు గాలులు, వర్షపు జల్లు లను లెక్కచేయక వివిధ ప్రాంతాల నుంచి ఇఫ్తార్ విందు జరిగే ఎస్ఎస్ కన్వెన్షన్ వద్దకు వేలాదిగా తరలి వచ్చారు. తమ అభిమాన నేత కనిపించగానే జై జగన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇఫ్తార్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులతో పాటు, అభిమానులతో నమాజు చేసే ప్రాంగణం వైఎస్ జగన్ రాకకు ముందే నిండిపోయింది. వర్షపు జల్లులు పడుతున్నప్పటికీ అభిమాన నేత కోసం తడుస్తూనే అభిమానులు వేచి చూశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. ఇఫ్తార్ విందు ముగిశాక బయటకు వచ్చిన వైఎస్ జగన్ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. వైఎస్ జగన్ కారు నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చిన తర్వాత సైతం అపార్ట్మెంట్లపై నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు ఎదురు చూస్తుండటాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి కారు నుంచి బయటకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు అంజాద్బాషా, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మొండి తోక అరుణకుమార్, ఇషాక్, రమేష్ యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, స్వామిదాసు, ముస్లిం నేతలు, మగ్బూల్, ఖాదర్ బాషా, నదీమ్, అహ్మద్ అలీఖాన్, నియోజకవర్గ ఇన్చార్జులు తన్నీరు నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, ఉప్పాల రాము, వైఎస్సార్ సీపీ నేతలు గౌతంరెడ్డి, పోతిన మహేష్, అంజి రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు బుధవారం నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున జరిగిన సుప్రభాత సేవలో భక్తులు భారీగా పాల్గొన్నారు. నాలుగు గంటలకు నిర్వహించిన ఖడ్గ మాలార్చనకు 24 టికెట్లను విక్రయించారు. దీంతో రెండు షిఫ్టుల్లో ఈ సేవను నిర్వహించాల్సి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో జరిగిన చండీహోమంలో 150 మంది ఉభయ దాతలు ప్రత్యక్షంగా, మరో 50 మంది పరోక్షంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమంలో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు. నమాజులో పాల్గొన్న ముస్లింలు (ఇన్సెట్) వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి -
పీజీ ఫలితాలు విడుదల
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణావిశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన పీజీ (రెగ్యులర్, సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను రెక్టార్ ఆచార్య బసవేశ్వరరావు బుధవారం విఽడుదల చేశారు. విద్యార్థులు ఈ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పి.వీరబ్రహ్మచారి తెలిపారు. పునఃమూల్యాంకనానికి ఏప్రిల్ ఒకటో తేదీలోగా వెబ్సైట్లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): పాత ప్రభుత్వాస్పత్రిలోని మానసిక వైద్య విభాగంలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్ను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ బుధవారం సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్ నియంత్రణలో ప్రతి తల్లీ ఈగల్ బ్రాండ్ అంబాసిడరేనని, ఏ చిన్న సమాచారం ఉన్నా ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ ‘సేఫ్ క్యాంపస్ జోన్’లో భాగంగా విద్యార్థుల్లో గంజాయి, డ్రగ్స్ వాడకం పై అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్ బాబు, డాక్టర్ సామ్రాజ్యం, విజయవాడ ఈగల్ సెల్ సీఐ రవీంద్ర, స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఆర్ఐ నాగార్జున, ఎస్ఐ వీరాంజనేయులు పాల్గొన్నారు. చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డి.కె.బాలాజీ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలిసి వారు ప్రార్థనలు చేశారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, పలువురు ముస్లింలు పాల్గొన్నారు. -
విజయవాడలో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
సాక్షి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది. వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.ముస్లిం సోదరులకు వైఎస్ జగన్.. ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షలు విరమింపచేశారు. ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. -
బీఆర్ నాయుడిని తప్పించండి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ‘‘అశ్లీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తప్పించండి..మీకు చేతకాకపోతే సీఎం పదవి నుంచి మీరు తప్పుకోండి’’ అని వైఎస్సార్ సీపీ నేతలు దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాస్ డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను మంటగలిపిన బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్సార్ సీపీకి చెందిన మహిళలపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటమే కాకుండా తిరిగి బాధితులపైనే అక్రమ కేసులు బనాయించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వానికి, మహిళలపై లాఠీచార్జ్ చేసిన పోలీసులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబుకు శ్రీవారిపై నిజమైన భక్తి ఉంటే బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తన కులదైవం శ్రీవేంకటేశ్వరస్వామి అని చెప్పుకునే చంద్రబాబు, టీటీడీలో జరుగుతున్న ఘటనలకు కారణభూతుడైన బీఆర్ నాయుడిని ఎందుకు తప్పించటం లేదని ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ కండువా కప్పుకుని పని చేస్తున్నారని విమర్శించారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై చర్యలు తీసుకోకపోగా వెనకేసుకురావడం చంద్రబాబు నైజానికి తార్కాణమన్నారు. జనజీవన స్రవంతిలో కలవకుండా చేయాలి టీటీడీ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా మచ్చ తీసుకువచ్చిన బీఆర్ నాయుడిని జనజీవన స్రవంతిలో కలవకుండా చేయాలని వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా వెంటనే బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చిన మరునాడే పార్లమెంట్కు వెళ్లటం పార్లమెంట్ వ్యవస్థను అపహాస్యం చేసినట్టేనని అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానిపక్షంలో మీరు తప్పుకోండి చంద్రబాబును డిమాండ్ చేసిన అవినాష్, మల్లాది, స్వామిదాస్ తిరుపతిలో మహిళలపై దాడిని ఖండిస్తూ నిరసన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత హైందవ ధర్మాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి అశ్లీల వీడియోలు ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంటే అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు ఇకనైనా వారి తీరు మార్చుకోకపోతే భవిష్యత్లో తీవ్రపరిణామాలను ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. -
తెలుగు తమ్ముళ్లలో
● పార్లమెంటు, నియోజకవర్గ ప్రజాప్రతినిధుల మధ్య పొరపొచ్చాలు ● బీజేపీ నేతలకూ పొసగని వైనం ● పార్లమెంటు ముఖ్యనేత కార్యాలయం లో పనిచేసే వ్యక్తి పలువురి కాల్లిస్టులు తెప్పిస్తున్నట్లు అనుమానం ● తిరువూరులో రగులుతూనే ఉన్న రావణకాష్ఠం ● మైలవరంలో భగ్గుమంటూనే ఉన్న వివాదం సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటు న్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ముఖ్యనేతకు, నియోజక వర్గ ప్రజాప్రతినిధులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఇటీవల మైలవరంలో జరిగిన సీఐల బదిలీల విషయంలో నియో జకవర్గ ప్రజాప్రతినిధి సిఫారసులు చెల్లుబాటు కాలేదు. ఈ బదిలీల విషయంలో పార్లమెంటు ప్రజా ప్రతినిధి హస్తం ఉందని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో ఏకంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధి, పార్లమెంటు ప్రజాప్రతినిధి కార్యాలయానికి వెళ్లి నిలదీయటం, తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం చర్చనీయాంశఽంగా మారింది, ఈ బదిలీల విషయంలో పార్లమెంటు ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి హస్తం ఉన్నట్లు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మట్టితో పాటు పలు విషయాల్లో వీరి ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ● తిరువూరులో పార్లమెంటు ముఖ్యనేత, నియోజకవర్గ ప్రజాప్రతినిధి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే ఉంది. అధిష్టానం జోక్యం చేసుకున్న తర్వాత కూడా వారి మధ్య మాటల మంటలు ఏమాత్రం ఆరటం లేదు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య బహిరంగంగానే వార్ నడుస్తోంది. ఇటీవల నెమలి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కల్యాణంలో నియో జకవర్గ ప్రజాప్రతినిధికి ఘోర అవమానం చేశారు. అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం నియోజకవర్గ ప్రజాప్రతినిధిది అయినప్పటికీ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వీరి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి బహిరంగంగానే ప్రెస్మీట్లు పెట్టుకుని తీవ్ర విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రెస్మీట్ పెట్టి షాకింగ్ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. నన్ను చంపేస్తారేమో అనే అనుమానం సైతం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ లపై వేధింపులు అధికమయ్యామని, రౌడీయిజం, పేకాట క్లబులు, రేషన్ మాఫియా పెచ్చరిల్లుతున్నాయని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ్ముళ్ల అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేశాయి. పార్లమెంటు ముఖ్యనేతకు, కూటమి నేతలకు మధ్య సఖ్యత కొరవడింది. ఈ విషయం ఇటీవల వన్ టౌన్లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా బట్టబయ లైంది. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పార్లమెంటు ముఖ్యనేత ఉన్నప్పటికీ, నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఓ సామాజిక వర్గం సమావేశానికి రాకపోవడం వీరి మధ్య అంతరాన్ని తేటతెల్లం చేసింది. దీనికితోడు బీజేపీ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి కాల్డేటాను పార్లమెంటు ముఖ్యనేత కార్యాలయంలో పనిచేసే వ్యక్తి తెప్పిస్తు న్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు నియో జకవర్గ ప్రజాప్రతినిధులు, వారి పీఏల కాల్ లిస్టు డేటాలు కూడా తెప్పిస్తున్నట్లు చర్చ సాగుతోంది. దీనికి కృష్ణాజిల్లాలో పనిచేసే ఓ పోలీసు అధికారి సహకరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.పార్లమెంటు ముఖ్యనేతకు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ నేతలతో సఖ్యత పూర్తిగా కొరవడింది. పైకి కౌగిలించుకున్నట్లు కనిపిస్తున్నా... లోలోన మాత్రం కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు, పార్లమెంటు ముఖ్యనేతకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే బహిరంగంగా చర్చ సాగుతోంది. పార్లమెంటు ముఖ్యనేత ఒంటెద్దు పోకడలతో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులంతా దూరం జరిగినట్లు పార్టీ వర్గాలే పేర్కొనడం గమనార్హం. -
సేంద్రియ సాగుకు చేయూతనివ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను సేంద్రియ వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దే క్రమంలో ఆర్గానిక్ ఫార్మింగ్ను ప్రోత్సహించేలా బ్యాంకులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. ఔత్సాహిక రైతులకు సులభంగా రుణాలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ బ్యాంకులకు సంబంధించి 555 బ్రాంచ్ల ద్వారా అందుతున్న సేవలు, వివిధ బ్యాంకింగ్ సూచికల్లో ప్రగతి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధన తదితరాలపై చర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.83,500 కోట్లు లక్ష్యం కాగా డిసెంబర్ 31 నాటికి 88,269 కోట్లు పంపిణీతో 106 శాతం మేర లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రకృతి సాగు ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువైందని, భవిష్యత్ అంతా ఆర్గానిక్ ఉత్పత్తులదేనని అన్నారు. జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగు తోందన్నారు. మరో రెండేళ్లలో లక్ష ఎకరాలకు పైగా ఈ విధానం అమలు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులకు రుణ మద్దతు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులు భాగస్వాములుగా వ్యవహరించి అర్హులైన వారికి సమయానికి రుణాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ యూబీఐ రీజినల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్బీఐ మేనేజర్ రాజేష్కుమార్ కుంద్, నాబార్డు డీడీఎం పృథ్వి, ఎల్డీఎం ప్రియాంక, అమరేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -
ప్రభుత్వ పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ
మైలవరం(జి.కొండూరు): ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి నారా లోకేశ్ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ ఈ నెల 10న విద్యార్థులు తమ ప్లేట్లలోని భోజనాన్ని బకెట్లో పడేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యాశాఖ అధికారులు 11వ తేదీన పాఠశాలను తనిఖీ చేసి భోజనంలో లోపాలను గుర్తించి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలిని తొలగించడంతోపాటు హెచ్ఎం జాన్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేశ్... మధ్యాహ్న భోజనం విషయంలో తలెత్తిన వివాదంపై ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా లోపం తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులను హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. లోకేశ్ వస్తున్న విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. -
50 వసంతాల వేడుకకు సిద్ధం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): దేశంలోని రైల్వే వ్యాగన్ వర్క్షాపుల్లో ఒకటైన గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపు 50 వసంతాల వేడుకకు సిద్ధమైంది. వర్క్షాపులో బుధవారం గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిపేందుకు ముస్తాబు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు వేడుకలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చీఫ్ వర్క్షాపు మేనేజర్ ఎస్.శ్రీనివాస్ మంగళవారం వర్క్షాపులో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. 2,400 మంది ఉద్యోగులకు ఆసరా రైల్వే వ్యాగన్ వర్క్షాపు ప్రతి ఏడాది భారీగా ఆదాయం గడిస్తోంది. సంస్థలో 2 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు, 400మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి వేతనాలు, ఇతర ఖర్చులు మొత్తం ఏడాదికి రూ.450 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. కార్మికులు ప్రమాదంలో మరణిస్తే ఆ వ్యక్తికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రయోజనాలతో పాటు ప్రతి ఉద్యోగి, కార్మికుడు తమకు తోచిన సహాయం అందించడం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో కాలుష్య నివారణకు సుమారు 10 వేల మొక్కలు నాటారు. నూతన పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా పనిభారం తగ్గి ఉత్పత్తి సామర్థ్యం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రైల్వే వ్యాగన్ వర్క్షాపు గతంలో కంటే ఇప్పుడు పురోభివృద్ధి సాధించింది. ఉద్యోగులు, కార్మికుల భాగస్వామ్యంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 8,200 రైలు వ్యాగన్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. రూ.200 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. పూర్తిగా వినియోగించుకుంటే ఏడాదికి 10వేల వ్యాగన్లు మరమ్మతులు జరిగే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా వర్క్షాపు రెండో స్థానంలో నిలవడం గర్వకారణం. వచ్చే వేసవి నాటికి రూ.కోటి వ్యయంతో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తిచేస్తాం. –ఎస్.శ్రీనివాస్, చీఫ్ వర్క్షాపు మేనేజర్ నేడు గుంటుపల్లి వ్యాగన్ వర్క్షాపు గోల్డెన్ జూబ్లీ -
రేపు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో రేపు(మార్చి 18, బుధవారం) వైఎస్సార్సీపీ నిర్వహించే ఇఫ్తార్ విందు విందులో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్ జగన్ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.రంజాన్ మాసం సోదరభావం, సామరస్యం, సేవా భావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ ఈ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగే ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ విజయవాడ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరుతారు. -
టీడీపీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన విద్యార్థులు.. ఏం జరిగిందంటే..!
సాక్షి, విజయవాడ: టీడీపీకి ఎమ్మెల్యేకు పాఠశాల విద్యార్థులు షాకిచ్చారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ ఎమ్మెల్యేకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం గురించి డబ్బా కొట్టడానికి వెళ్లిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడ్డంగా బుక్కయ్యారు. గొల్లపూడిలో ఎంపీపీ పాఠశాల తనిఖీకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. మీ కోసమే మధ్యాహ్నభోజనంలో మంచి ఆహారాన్ని అందిస్తున్నామంటూ ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు.ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం నాసికరంగా ఉందన్న విద్యార్థులు.. చిక్కీల్లో పురుగులు కూడా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే మైలవరంలోని తారకరామా నగర్ ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజనంపై తీవ్ర విమర్శలు రాగా, స్కూల్ హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టర్ను మార్చింది. తాజాగా మరో స్కూల్లో చిక్కీలపై ఫిర్యాదు రావడంతో టీడీపీ ఎమ్మెల్యే కంగుతిన్నారు.


