breaking news
Jagtial
-
పట్టాలొచ్చినా.. పైసలివ్వరా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వారంతా పట్టాలు పొందిన పోస్టు గ్రాడ్యుయేట్లు. కూలీనాలీ చేసుకుని బతికే ఎస్సీ, ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో సీటు సాధించారు. రాత్రీ పగలు చదివి మరో చోట బీఈడీలో సీటు పొందారు. తీరా సీటు వచ్చినా చేరలేని దయనీయ స్థితిలో ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోయేసరికి ఇప్పుడు వీరికొచ్చిన బీఈడీ సీట్లు ప్రమాదంలో పడ్డాయి. మరో వారం రోజుల్లో సొంతంగా ఫీజు చెల్లించి టీసీలు తీసుకుని, కొత్త కళాశాలల్లో అప్పగిస్తేనే సీట్లు దక్కుతాయి. పేద, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వీరి ఆర్థిక నేపథ్యం అంతంతే. ఒక్కో విద్యార్థి కనీసం రూ.50వేల చొప్పున చెల్లించాలని కళాశాలనుంచి ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ. 200 కోట్ల బకాయిలు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం (సుప్మా) ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25వేల మంది విద్యార్థులు ఆయా కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.200కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, త్వరగా విడుదల చేయాలని కళాశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా విద్యార్థులకు ఎంటీఎఫ్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి గత 18 నెలలుగా రకరకాల మార్గాల ద్వారా ఆవేదనను, ఆర్థిక పరిస్థితిని తెలియజేసినా ఎలాంటి స్పందన లేని కారణంగా డిగ్రీ కళాశాలల రాష్ట్ర అసోసియేషన్ పిలుపుమేరకు నిరవధిక బంద్ చేస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ 66 పీజీ 35 ఇంజినీరింగ్ 16 బీఈడీ 23 ఎంఈడీ 01 ఎంబీఏ 8 ఎంసీఏ 1 ఫార్మసీ 2 లా 2 బీపీఈడీ 1 -
కోటేశ్వరస్వామి సేవలో జిల్లా అడిషనల్ జడ్జి
వెల్గటూర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా అడిషనల్ జడ్జి నారాయణ కోటిలింగాల కోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు న్యాయమూర్తితో పూజలు, అభిషేకాలు చేయించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శేషవస్త్రంతో సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, ఈవో కాంతారెడ్డి, ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు. పామర్రుకు ఆర్టీసీ బస్సు పునరుద్ధరణమెట్పల్లి: మెట్పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పామర్రుకు ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించినట్లు డిపో మేనేజర్ దేవరాజ్ బుధవారం తెలిపారు. ఈ మార్గంలో నడిచే బస్సు సర్వీసును కొన్ని కారణాలతో నిలిపివేశామని, ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు తిరిగి ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1.20 గంటలకు మెట్పల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు అక్కడికి చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంత్రం 5.45 గంటలకు అక్కడినుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9గంటలకు మెట్పల్లికి వస్తుందన్నారు. సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఆలయ భూముల రక్షణ అందరి బాధ్యతజగిత్యాలటౌన్: ఆలయ భూములు, ఆస్తుల పరిరక్షణ ప్రతిపౌరుని బాధ్యత అని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం ధరూర్ క్యాంపులోని శ్రీకోదండ రామాలయాన్ని దర్శించుకున్నారు. భక్తులు సేకరించిన విరాళాలతో తయారు చేయించిన వెండి కిరీటం, ధనస్సు, ఖడ్గం, సీతమ్మవారికి హారం సమర్పించారు. గతంలో కొందరు కోదండ రామాలయ భూముల ఆక్రమణకు యత్నించగా కులమతాలు, రాజకీయాలకు అతీతంగా స్పందించి కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. తాజామాజీ కౌన్సిలర్ ఒద్ది శ్రీలత, ఆలయ కమిటీ ప్రతినిధులు మాధవరెడ్డి, గౌరిశెట్టి హరీశ్, గండ మధుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
జగిత్యాల
32.0/21.07గరిష్టం/కనిష్టంవైభవంగా వెంకన్న తెప్పోత్సవంకోరుట్ల రూరల్: వెంకటాపూర్ శివారు గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవా ల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవాన్ని బుదవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువ.కొండగట్టు గిరి ప్రదక్షిణమల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం వందలాది మంది భక్తులు జై శ్రీరాం, జైహనుమాన్ నామస్మరణ చేస్తూ, గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
ఆలయాలకు ‘కార్తీక’శోభ
జగిత్యాలరూరల్/ధర్మపురి/వెల్గటూర్/పెగడపల్లి: కార్తీకమాసాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని శ్రీపౌలస్తేశ్వరస్వామి దేవాలయం, సహస్ర వెయ్యి లింగాల దేవాలయం, లక్ష్మీపూర్లోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ధర్మపురిలోని బ్రహ్మపుష్కరిణి దీపాల కాంతుల్లో మెరిసింది. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు పాల్గొన్నారు. కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో గంగాహారతి కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించారు. పెగడపల్లిలోని రాజన్న ఆలయంలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పగడపల్లి: ఆలయంలో దీపాలకాంతులు జగిత్యాలరూరల్: పొలాస పౌలస్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు ధర్మపురి :దీపాల కాంతుల్లో నృసింహుని కోనేరు -
లక్ష దీపోత్సవంలో భక్తులు
మల్లాపూర్: కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్లాపూర్లోని సోమేశ్వరస్వామి, వాల్గొండలోని రామలింగేశ్వర స్వామి ఆలయాలు బుధవారం కిక్కిరిసిపోయాయి. సోమేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకులు బల్యపల్లి ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో భక్తులు లక్ష దీపోత్సవంలో పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, వీడీసీ చైర్మన్ సంగ గంగరాజం, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మీ అర్చకులు రాజశేఖర్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బకాయిలు వచ్చే వరకు
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు డిగ్రీ, పీజి కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తున్నాం. వి ద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్ చేస్తున్నాం. మా అవసరాన్ని, ఆవేదనను ప్రభుత్వం దృష్టి సారించి మాకు, మా వి ద్యార్ధులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలి. – ఎం వెంకటేశ్వర్ రావు, సుప్మా అధ్యక్షులు పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కళాశాలలు బంద్ పాటిస్తున్నా.. ప్రభుత్వ మౌనం సరికాదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. – కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
వరి కోతలు ఎలా..?
జగిత్యాలఅగ్రికల్చర్: వరి పంట బాగా పండిందని సంబరపడుతున్న రైతన్నకు పంటను కోయించడంలో తిప్పలు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాలు దిగబడుతున్నాయి. తేమ కారణంగా హార్వెస్టర్లతో కోయించలేకపోతున్నారు. చైన్మిషన్లతో కోయిస్తే ఖర్చు అధికమవుతోంది. జిల్లాలో 3.15లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ప్రస్తుతం ఆ పంట కోతకు వచ్చింది. అధిక వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలిచి హార్వెస్టర్లు దిగబడుతున్నాయి. వరోమైపు వరి పంట ఈదురుగాలులకు నేలవాలడంతో కోయించడం రైతులకు తలకు మించిన భారమవుతోంది. పెరుగుతున్న ఖర్చులు పొలం ఆరితే హార్వెస్టర్లు సులభంగా పంటను కో స్తాయి. ఇందుకు గంటకు రూ.రెండువేల వరకు తీసుకుంటారు. తేమ ఉన్న పొలంలో ఫోర్వైడ్ వీలర్ హార్వెస్టర్ కోస్తే గంటకు రూ.3వేల వరకు తీసుకుంటారు. ప్రస్తుతం హార్వెస్టర్లు దిగబడుతుండటంతో చైన్మిషన్లను ఆశ్రయించాల్సి దుస్థితి ఏర్పడింది. ఆ యంత్రాలు స్థానికంగా లేకపోవడంతో తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి దళారులు తీసుకొస్తున్నారు. డిమాండ్ను బట్టి గంటకు రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. కేంద్రాలకు తరలించడం కష్టమే ఏదోలా పంటను కోయించినప్పటికీ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించడం రైతులకు కష్టంగా మారింది. హార్వెస్టర్తో కోయిస్తే ట్రాక్టర్ అక్కడివరకు వెళ్లి ధాన్యాన్ని ట్రాలీలో లోడ్ చేసుకుంటుంది. తేమ ఉన్న పొలంలో ట్రాక్టర్ కూడా దిగబడే పరి స్థితి ఉంది. చైన్మిషన్తో కోయించడం ద్వారా ధా న్యాన్ని ఒడ్డుకు చేర్చడం మరో ఎత్తుగా మారింది. -
పగబట్టిన పాము!
గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కొన్నిరోజులుగా పాముకాటుకు గురవుతున్నాడు. పాము పగబట్టి కాటేస్తోందా..లేక ప్రమాదవశాత్తు పాముకాటుకు గురవుతున్నాడా..అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రైవేటు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దసరా నవరాత్రుల ఉత్సవాలకు ముందు ఉదయం 11 గంటల సమయంలో ఓ పాము పడగను తొక్కడంతో దాని కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. తర్వాత నాలుగైదు రోజులకు రాత్రి 11 గంటలకు బాత్రూంకు వెళ్తున్న సమయంలో పాము కాటువేసింది. వెంటనే తన సోదరులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అతడిని మరో ఐదు రోజులకు మధ్యాహ్నం మరోసారి పాముకాటు వేసింది. మళ్లీ వెంటనే తేరుకుని ఆస్పత్రికి వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుధవారం, శనివారం, ఆదివారం రోజుల్లోనే శ్రీకాంత్ పాముకాటుకు గురవుతున్నాడు. ఇలా 33 రోజుల్లోనే ఏడుసార్లు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వినడానికి వింతగా అనిపించినా ఆయనను వదలకుండా పాము వెంటాడుతూ కాటేస్తుండటం సంచలనంగా మారింది. ఏదైనా సర్పదోషం ఉందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. బుధ, శని, ఆదివారం వచ్చిందంటే చాలు తనకేదో కీడు జరుగుతుందనే ఉద్దేశంతో ఫోన్లను ఎప్పుడూ అంటిపెట్టుకుంటున్నాడు. పాముకాటు వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక బాధితుడు ఇబ్బంది పడుతుండటంతో ఆయన పరిస్థితి చూసి ఆస్పత్రి సిబ్బంది కూడా దయతో వైద్యం అందిస్తున్నారు. అయితే శ్రీకాంత్ను లక్ష్యంగా చేసుకుని పాము ఎందుకు కాటు వేస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. -
జగిత్యాల జిల్లాలో కిడ్నాప్ కలకలం
జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి వద్ద కిడ్నాప్ కలకలం రేపుతుంది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. ఈ ఘటనపై కూతురు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక.. వెల్గటూర్ మండలం రాజక్క పల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇక, పెద్దలను ఎదిరించి ఈ ఏడాది జూలై 27న ప్రియాంకా, రాకేష్ వివాహం చేసుకున్నారు.అయితే, రాకేష్ దళితుడైన కారణంగా ప్రియాంకా తల్లిదండ్రులు ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు.. అలాగే, ప్రియాంక కడుపుతో ఉండగా హాస్పిటల్లో చూపిస్తామని నమ్మించిన తల్లిదండ్రులు.. హాస్పిటల్కి చూపించి తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో స్థానికుల సహాయంతో ప్రియాంక తప్పించుకుంది. ఈ విషయంపై తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులతో తనకు తన భర్త రాకేష్కు ప్రాణహాని ఉందని కంప్లైంట్లో తెలిపింది. ఈ ఘటనపై ప్రియాంకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: చాడ
గోదావరిఖని: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక భాస్కర్రావుభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బిహార్ ఎన్నికలు దేశరాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయని అభిప్రాయపడ్డారు. పేదల కోసం, స్వాతంత్య్ర సాధన కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) డిసెంబర్ 26న శతవసంతాల్లోకి వస్తున్న సందర్భంగా ఖమ్మంలో ఐదు లక్షల మందితో బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్లోని జోడేఘాట్లో జీపుజాతా ప్రారంభించి రాష్ట్రమంతా నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల16న గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతాల్లో సాగుతుందని తెలిపారు. నాయకులు తాండ్ర సదానందం, గౌతమ్ గోవర్ధన్, గోషిక మోహన్, కడారి సునీల్, తాళ్లపల్లి మల్లయ్య, మడ్డి ఎల్లయ్య, మార్కపురి సూర్య, తాళ్లపల్లి లక్ష్మణ్, వైవీరావు, మాటేటి శంకర్, రామచందర్, జిగురు రవీందర్, ఆరేపల్లి మానస్కుమార్, బాలసాని లెనిన్, రేణికుంట్ల ప్రీతం, కల్లెపల్లి నవీన్, చంద్రశేఖర్, రంగు శ్రీనివాస్, తొడుపునూరి రమేశ్కుమార్ పాల్గొన్నారు. -
ముందుకు సాగని ‘సూరమ్మ’ కాలువలు
కథలాపూర్: కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సూరమ్మ ప్రాజెక్టు కుడికాలువ పనుల్లో కదలిక లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం ఫేజ్–2 స్టేజీ–1 పనుల్లో భాగంగా ప్రాజెక్టు నిర్మించి కుడి, ఎడమ కాలువల ద్వారా మెట్టప్రాంతమైన కథలాపూర్, మేడిపల్లి, భీమారం, రుద్రంగి మండలాల్లో 50వేల ఎకరాలకు సాగు నీరందించాలనేది లక్ష్యం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. తాము అధికారంలోకొస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకొచ్చి సుమారు రెండేళ్లు అవుతున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేవలం మత్తడి పనులు పూర్తికాగా.. కాలువల తూముల నిర్మాణం చేపడుతున్నారు. కాలువ పనుల్లో కదలిక లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులకు 2018లో భూమిపూజ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులకు 2018 జూన్ 22న అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు రూ.204 కోట్లు మంజూరు చేస్తూ భూమిపూజ చేశారు. కానీ పనులు మాత్రం ముందుకుకదలలేదు. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్, నాలుగు మండలాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చినా కాలువ పనులు ప్రారంభించకపోవడంతో పాలకుల తీరుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణకు రూ.45.50 కోట్లు మంజూరు ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాలువ పనుల భూసేకరణకు ఇటీవల ప్రభుత్వం రెండు దఫాలుగా రూ.45.50 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులను కలెక్టర్ ఖా తాలో జమ చేసింది. 10 నెలల క్రితం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామసభలు ని ర్వహించి అభిప్రాయాలు సేకరించారు. కేటాయించిన రూ.45.50 కోట్లు సరిపోవని, ఈ క్రమంలో పనులు ప్రారంభానికి ఇంకెన్నాళ్లు వేచి చూడాల్సి వస్తుందోనని రైతులు అంటున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందించి కాలువ పనులను త్వరగా ప్రారంభించాలని ఈ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మంచాల పెట్రోల్బంక్ను తొలగించండి
జగిత్యాల: అధికారుల పట్టింపులేనితనంతో రూ.100 కోట్ల విలువ చేసే మున్సిపల్ భూమి అన్యాక్రాంతమైందని, మంచాల పెట్రోల్బంక్ను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్ చౌరస్తా నుంచి బల్దియా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 1964లో వివాదం ఏర్పడినప్పటి నుంచి బల్దియా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. యావర్రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఏసీఎస్ రాజు, సీపెల్లి రవీందర్, లింగంపల్లి శ్రీనివాస్, అర్వ లక్ష్మీ, సుధాకర్, కిశోర్సింగ్, ప్రభాకర్, మల్లేశం, సురేశ్, ప్రమోద్, నాగరాజు పాల్గొన్నారు. -
నిజామాబాద్ జిల్లాలో జగిత్యాల వాసి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేటకు చెందిన రౌతు గంగాధర్ అలియాస్ ఆలూరు రెడ్డి (35) నిజామాబాద్ జిల్లా వేల్పుల మండలం పడకల గ్రామంలో సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆలూరురెడ్డి పడకలలో ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు. ఆయన మృతిచెందినట్లు ఇక్కడి కుటుంబసభ్యులకు సమాచారం అందగా.. వారు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేస్తూ అతని సోదరుడు రౌతు శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలూరురెడ్డి ఫిట్స్తో మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నా.. అతని శరీరంపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేసినట్లు కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. మృతదేహానికి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం హన్మంతునిపేట గ్రామ శివారులో రెండు బైక్లో ఎదురెదురుగా ఢీకొనడంతో విజయవాడకు చెందిన చిట్టిమేను సాయిలోకేశ్ (20) మృతి చెందాడు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పెద్దపల్లిరూరల్ ఎస్సై మల్లేశ్ వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం రాయపేటలో మిత్రుడి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి సాయిలోకేశ్, షణ్ముఖ్ వచ్చారు. తిరిగి వెళ్లే క్రమంలో వారిని రైలు ఎక్కించేందుకు పెద్దంపేటకు చెందిన పోలుదాసరి రాజు బైక్పై తీసుకొస్తున్నారు. మార్గమధ్యంలో హన్మంతునిపేట శివారులో ఎదురుగా బైక్పై వస్తున్న యువకుడు ఆటోట్రాలీని ఓవర్టేక్ చేయబోయి బైక్ను బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ రాజు, సాయిలోకేశ్, షణ్ముఖ్ను పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక అనంతరం కరీంనగర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిలోకేశ్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. నరేశ్ అంత్యక్రియలు అక్కడే చేయండి..మెట్పల్లి: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లి.. ఐదేళ్ల క్రితం అక్కడే మరణించిన పట్టణానికి చెందిన శ్రీపాద నరేశ్ మృతదేహానికి ఆ దేశంలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి అతని కుటుంబ సభ్యులు అంగీకరించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించడం సాధ్యంకాదని అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు స్పష్టంచేయడంతోపాటు అక్కడే అంత్యక్రియలు చేసేలా అతని కుటుంబ సభ్యుల సమ్మతి కోరారు. దీంతో వారు తమ సమ్మతిని తెలుపుతూ నోటరీ అఫిడవిట్ను మృతుడి సోదరుడు ఆనంద్ మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్తో కలిసి హైదరాబాద్లో ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డికి అందించారు. కుటుంబసభ్యుల అంగీకారంతో వచ్చే శుక్రవారం అక్కడ అంత్యక్రియలు జరగనుండగా.. పాల్గొనడానికి మృతుడి సోదరుడు ఆనంద్ అక్కడకు బయలుదేరి వెళ్లాడు. రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపెల్లి సతీశ్గౌడ్ ఈనెల 1న గల్ఫ్లో గుండెపోటుతో చనిపోగా మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. సతీశ్గౌడ్ ఇంటికి వస్తాడని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు పెట్టెలో విగతజీవిగా రావడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. అశ్రునయనాల మధ్య బంధువులు, గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. -
రారండోయ్.. వేడుక చూద్దాం
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నెల 7న వేడుకలు యూనివర్సిటీలోని క్రీడా ప్రాంగణంలో జరుగనున్నాయి. ఇప్పటికే ప్రాంగణాన్ని ముస్తాబు చేసే పనిలో పడ్డారు వర్సిటీ అధికారులు. ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హాజరుకానున్నారు. ఆయనతో పాటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బీజే రావు రానున్నారు. ● మమ్మురంగా ఏర్పాట్లు. 2వ స్నాతకోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాజరయ్యే వారు ఆన్లైన్లో పేరు నమోదు చేసుకునేలా, వారితో పాటు మరొకరికి ఎంట్రీ పాసులు అందజేయనున్నారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు అభ్యర్థులు తమ ఐడీ కార్డును సమర్పించి పాస్లు తీసుకోవాలని వర్సిటీ అధికారులు తెలిపారు. 7న ఉదయం 9.30 గంటలలోపు స్నాతకోత్సవ ప్రాంగణంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలని పేర్కొన్నారు. ● 161 బంగారు పతకాలు.. 25 పీహెచ్డీ పట్టాలు శాతవాహన 2వ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 129 మంది విద్యార్థులు 161 బంగారు పతకాలు (పలువురు విద్యార్థులు రెండు పతకాలు సాధించారు) గవర్నర్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే వివిధ అంశాల్లో పరిశోధనలు చేసిన 25 మంది పీహెచ్డీ పట్టాలు స్వీకరిస్తారు. శాతవాహన యూనివర్సిటీ ఆరంభం నాటి నుంచి పీహెచ్డీ చేసిన వారికి పట్టాలు అందించనున్నారు. యూనివర్సిటీ తొలిసారిగా డాక్టరేట్ను కామర్స్ విభాగంలో అంకం శ్రీనివాస్కు అందజేసింది. ● 3వ స్నాతకోత్సవానికి ఇప్పటినుంచే.... ఆగస్టులో వీసీ ఉమేశ్కుమార్ అమెరికా పర్యటన సందర్భంగా భవిష్యత్లో జరిగే 3వ స్నాతకోత్సవ వేడుకలకు నిధులు సేకరించడం విశేషం. అమెరికాలో తెలంగాణ మేధావులను కలిసి విశ్వవిద్యాలయాన్ని బలోపేతం చేయడానికి నిధులు, మౌలిక సదుపాయాలను సమకూర్చారు. శాతవాహన ట్రస్ట్ ఏర్పాటుతో పాటు 8 నుంచి 10 బంగారు పతకాలను కొత్తగా 3వ స్నాతకోత్సవానికి సిద్ధం చేసినట్లు వీసీ వివరించారు. సోషల్ సైన్స్ విభాగంలో కె.రాజేంద్రం, ఫాతిమాసుల్తానాబేగం, వి.జమున, ఎం.తిరుపతి, (ఎకనామిక్స్), బి.ఆదినారాయణ, ఎం.శ్రీనివాస్, బి.వాసవి (సోషియాలజీ) ఆర్ట్స్ విభాగంలో సైద ఫాతిమున్నీస్సా అస్మా, ఎండీ అబ్దుస్ సలాంకౌసర్, నాజీయా ఫాతిమా, అస్రా తస్నీమ్ (ఉర్దూ). బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో కె.వైష్ణవి, ఇ.రమేశ్, వి.సృజన దేవి, కె.జైపాల్. కామర్స్ విభాగంలో ఎ.శ్రీనివాస్, కె.స్వాతి, బి.శ్రీనివాస్. సైన్స్ విభాగంలో ఎన్.మల్లారెడ్డి, జి.శ్రీనివాస్, డి.రఘు, ఎం.ప్రవీణ్కుమార్, కె.సదానందం, ఎస్.మానస, టి.మంజుల (కెమిస్ట్రీ). 7న శాతవాహన స్నాతకోత్సవ సంబురం ముస్తాబవుతున్న యూనివర్సిటీ వేడుకలకు హాజరుకానున్న గవర్నర్ శాతవాహన 2వ స్నాతకోత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఏర్పాట్లు చివరిదశకు చేరుకున్నాయి. న్యాక్ సాధించే దిశగా యూనివర్సిటీ అడుగులు వేస్తుంది. అందుకు మేం కృషి చేస్తున్నాం. – ఉమేశ్కుమార్, వైస్ చాన్స్లర్ -
ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శన
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్స్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది, దేశంలో ప్రసిధ్ది చెందిన కళాకారులు తయారు చేసిన సిల్క్, చేనేత వస్త్రాలతోపాటు, గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలాంకారి, ఉప్పడ, అస్సాంలోని మూగా, ఎరిశిల్బ్, బీహార్లోని బాగల్పుర సిల్క్స్, చత్తీస్గఢ్లోని ట్రిబిల్ వర్క్స్, కోసా సిల్క్, గుజరాత్లోని బందని, కచ్చ ఎంబ్రయిడరీ డ్రెస్స్లు, చీరలు అకట్టుకుంటున్నాయి. డ్రెస్ మెటిరియల్, హ్యాండ్ క్రాఫ్ట్స్, న్యూట్రీషన్ ఫుడ్స్, అతివల అలంకరణ వస్తువులు, హోమ్ ఫుడ్స్, బ్యాంగిల్స్తోపాటు వివిధ రకాల కళాఖండాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. -
ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
జగిత్యాలక్రైం: ఫిట్నెస్ లేని వాహనాలను రో డ్డుపై తిప్పితే సీజ్ చేస్తామని ఏఎంవీఐ షేక్ రి యాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో వాహనాలను తని ఖీ చేశారు. ట్యాక్స్ చెల్లించని 6 వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, ట్యాక్స్, లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. రవాణా శాఖ ఆదేశాలు పాటించ ని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీమల్యాల: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించిన సైకిళ్లను మల్యాల, రామన్నపేట, పోతారం జెడ్పీ పాఠశాలల్లో పంపిణీ చేశారు. ఎంఈవో జయసింహారావు, బీజే పీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, నాయకులు గాజుల మల్లేశం, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, బొట్ల ప్రసాద్, గడ్డం నడిపిమల్లేశం, కెల్లేటి రమేశ్, బొమ్మెన పరమేశ్, నక్క అనందం, బండారి రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ‘ఆదర్శ’ విద్యార్థిధర్మపురి: మండలంలోని మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థిని ఐశ్వర్య రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ంది. మంగళవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–19 షాట్పుట్ పోటీల్లో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. హైదరాబాద్లో గురువారం నిర్వహించే రా ష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. విద్యార్థినిని ప్రిన్సిపాల్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ మహేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ అభినందించారు. జువైనల్ జస్టిస్ బోర్డు చైర్పర్సన్గా శ్రీనిజజగిత్యాలజోన్: జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన జువైనల్ జస్టిస్ బోర్డు చైర్పర్సన్గా శ్రీనిజ కోహిర్కర్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శ్రీనిజ జిల్లా మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్గా కొనసాగుతున్నారు. బాలనేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను ప్రతి గురువారం జువైనల్ జస్టిస్ బోర్డులో నిర్వహించనున్నారు. చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించండిజగిత్యాల: జిల్లాలోని చెరువులు, కుంటలకు హద్దులు, బఫర్జోన్లు నిర్ణయించి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితాలు ఇస్తోందని, జిల్లాల్లోని చెరువుల పరిరక్షణకు కృషి చేయాల ని కోరారు. అంతకుముందు వీఆర్ఏ వ్యవస్థ ను పునరుద్ధరించేలా కృషి చేయాలని జీవన్రెడ్డికి వీఆర్ఏలు వినతిపత్రం సమర్పించారు. రైల్వేలైన్ పనుల్లో వేగం పెంచాలిజగిత్యాలక్రైం: రైల్వేలైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ గోపాలకృష్ణ అన్నారు. లింగంపేట రైల్వేస్టేషన్లో నిర్మిస్తున్న రైల్వే గూడ్స్ లోడింగ్ పాయింట్ పనులు, మరమ్మతు పనులను పరిశీలించారు. గూడ్స్ లోడింగ్ షెడ్డు పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్లో ప్రయాణికులకు ఇబ్బంది కలగనీయొద్దన్నారు. సీనియర్ డీసీఎం సిపాలి కుమారి, సీనియర్ డీవోఎం సురేశ్రెడ్డి, డీఎం శశాంక్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్, రైల్వే మేనేజర్ వామనేశ్వర్రావు పాల్గొన్నారు. -
జగిత్యాల
31.0/24.07గరిష్టం/కనిష్టంఆయిల్ పాం సాగు చేయండికొడిమ్యాల: ఆయిల్ పాం సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో రైతులతో మాట్లాడారు. ఆయిల్ పాంతో ఆదాయం వస్తుందన్నారు. ఉద్యాన శాఖాధికారి శ్యాంప్రసాద్, రాంరెడ్డి పాల్గొన్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. ఘనంగా తులసీ కల్యాణంధర్మపురి: వైకుంఠ చతుర్దశి సందర్భంగా తులసికల్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు. బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
‘సాక్షి’ స్పెల్బీ, మ్యాథ్స్బీకి విశేష స్పందన
● పరీక్షకు ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు సప్తగిరికాలనీ(కరీంనగర్): సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన స్పెల్బీ, మ్యాథ్స్ ప్రిలిమినరీ మొదటి రౌండ్ పరీక్షకు విశేష స్పందన లభించింది. కరీంనగర్, పెద్దపల్లిలో సుమారు 15 కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 1నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు పరీక్షకుఽ అధిక సంఖ్యలో హాజరయ్యారు. కేటగరీ–1లో భాగంగా 1, 2 తరగతి విద్యార్థులకు 2వ కేటగిరీలో 3, 4 తరగతుల విద్యార్థులకు, 3వ కేటగిరీలో 5, 6,7వ తరగతుల విద్యార్థులకు, 4వ కేటగిరిలో 8, 9, 10 విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. పరీక్షకు ప్రజెంటింగ్ స్పాన్సర్ డ్యూక్స్ వాపీ, అసోసియేట్ స్పాన్సర్గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) వ్యవహరిస్తున్నారు. వివిధ పాఠశాలల చైర్మన్లు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రమాదాలు పొంచి..
సామర్థ్యం మించి..నిబంధనలు పాటించని వాహనదారులుజగిత్యాల: రహదారుల వద్ద నిబంధనలు పాటించకపోవడంతో జిల్లాలో ప్రమాదాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు, టిప్ప ర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రధానంగా మొరం, కంకర, ఇసుక రవాణా చేసే టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు వేగంగా వెళ్లడంతో ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా ఢీ కొడుతున్నాయి. ఫలి తంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా యి. అతివేగం, అతిజాగ్రత్తగా నడపడంతో కుటుంబాలలో కన్పించని క్షోభ మిగులుతోంది. జిల్లాకేంద్రంలో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతోంది. జగిత్యాల డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సులు ఆరునెలల్లో 11సార్లు ప్రమాదాల బారిన పడ్డాయి. అంటే ప్రమాదాల తీవ్రత ఎంత ఉందో అద్దం పడుతోంది. ఆర్టీసీ ప్రయాణమే ఎక్కువ ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. నిత్యం బస్సుల కండీషన్ సరిచేసి డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసిన తర్వాతే నడిపేందుకు అనుమతిస్తుంటారు. అయినప్పటికీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. ఎక్కువగా డ్రైవర్ల తప్పిదాలతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. జిల్లాలో జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల డిపోలున్నాయి. జగిత్యాలలో 110, కోరుట్లలో 70, మెట్పల్లిలో బస్సులున్నాయి. వీటికి తగినంతా మంది డ్రైవర్లు లేకపోవడంతోనే అధికంగా డ్యూటీలు వేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాగా కొన్ని డిపోల్లో డ్రైవర్లకు నిత్యం డ్యూటీలు వేసినప్పటికీ డిపోలో సెక్రటరీ విభాగం ఉంటుంది. వీరు ఆ డ్రైవర్ ఎప్పటి నుంచి డ్యూటీకి వస్తున్నాడని గమనించి.. ఒకవేళ డ్యూటీ చేసుకుంటే మరునాడు ఆపేయాల్సి ఉంటుంది. కానీ వారు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జగిత్యాల డిపోలో ఓ డ్రైవర్కు వరుసగా 9 రోజుల పాటు డ్యూటీలు వేసినట్లు తెలిసింది. జిల్లాలోని కొన్ని డిపోల పరిధిలో డ్రైవర్లకు ఒకరోజు డ్యూటీచేస్తే మరో రోజు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా వరుసగా డ్యూటీలు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో నిద్రలేక, ప్రశాంతత లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యపు ప్రమాదాలతో చాలా మంది అమాయకులు చనిపోవడంతో పాటు, వారి కుటుంబాల్లో తెలియని క్షోభ నెలకొంటోంది. గుంతలతో అత్యధిక ప్రమాదాలు జిల్లాలో కరీంనగర్ రూట్లో, పెద్దపల్లి, ధర్మారం, నిజామాబాద్ రూట్లలో డబుల్రోడ్లు, హైవేలు ఉన్నప్పటికీ డ్రైవర్లు అత్యధిక స్పీడ్తో వస్తున్నారు. మధ్యమధ్య రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఉండటంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు వాటిని తప్పించే ప్రయత్నం చేయడంతో ఆకస్మికంగా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు గాలిలో పోతున్నాయి. ఈ రోడ్లలో గుంతలకు మరమ్మతు చేయకపోవడం, ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకుని చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. నిర్లక్ష్యం అధికమే సురక్షిత ప్రయాణమే లక్ష్యం రోడ్లు సాఫీగా ఉండటం, కొందరు ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండటం, అతివేగంగా నడపడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పోలీసులు డ్రంకెన్డ్రైవ్ చేపడుతున్నప్పటికీ చాలా మంది మద్యం సేవించి వాహనాల ను అతివేగంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి డ్రైవర్లకు ఓవర్ డ్యూటీలు వేయకపోవడంతో పాటు రహదారుల్లో ఉన్న గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.ఓవర్ డ్యూటీలు వేయం. 8 గంటలు, 12 గంటలు సమయాన్ని బట్టి వేస్తాం. డ్రైవర్ల కొరత లేదు. అవుట్సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్లను నియమించుకుంటున్నాం. ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లడమే మా ధ్యేయం. డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వం. – కల్పన, జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ -
ఫీజు బకాయిలు చెల్లించండి
జగిత్యాల: ఫీజు బకాయిలు చెల్లించాలని జిల్లాకేంద్రంలో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు మంగళవారం ఆందోళనకు దిగాయి. అధ్యాపకులు తహసీల్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లుగా నయాపైసా రాలేదని, యాజమాన్యాలు అధ్యాపకులకు వేతనాలు చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారని తెలిపారు. ఫీజు బకాయిలు ఇవ్వాలని కోరారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. వీరికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నాయకులు ప్రవీణ్, గంగాధర్, వేణు, పెండెం గంగాధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన
మెట్పల్లి: ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధురి వేధిస్తున్నారని, ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం జూనియర్ కళాశాల విద్యార్థినులు మంగళవారం రోడ్డెక్కారు. కళాశాల ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు. తమను అకారణంగా తిట్టడమే కాకుండా కొడుతోందన్నారు. ఆమె వైఖరితో జూనియర్ లెక్చరర్లు వెళ్లిపోతున్నారని, తరగతులు సక్రమంగా జరగడం లేదన్నారు. వేధింపులతో మానసికంగా ఇబ్బంది పడుతున్నామని, తక్షణమే ఆమెను తొలగించి రెగ్యులర్ ప్రిన్సిపాల్ను నియమించాలని డిమాండ్ చేశారు. ఎంఈవో చంద్రశేఖర్, సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, తహసీల్దార్ నీతా చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ను కళాశాల నుంచి పంపిస్తేనే తాము ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థినుల తేల్చిచెప్పారు. చివరకు ఆ శాఖ జిల్లా అధికారి పూరచందర్ వచ్చి మాధురిని కళాశాల నుంచి పంపించేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఆమైపె చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. -
బ్రహ్మపుష్కరిణికి కార్తీకశోభ
ధర్మపురి: ధర్మపురి నృసింహస్వామివారి బ్రహ్మపుష్కరిణి కార్తీకశోభను సంతరించుకుంది. కార్తీకమాసంలో పౌర్ణమి వేడుకలను బుధవారం మహావైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోనేరులోని నలుదిక్కులను శుభ్రం చేశారు. నలువైపులా ఐదు వేల దీపాలు వెలిగించనున్నారు. వేలాది మంది భక్తులు పంచ సహస్ర దీపోత్సవ వేడుకలను తిలకించనున్నారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఉత్సవమూర్తులకు కోనేరులోని భోగ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్యక్రమానికి సుమారు 50వేల మంది భక్తులు వస్తారని అంచనా మేరకు లడ్డూ, ప్రసాదం, పులిహోరా అందుబాటులో ఉంచామని ఆలయ అధికారులు తెలిపారు. నేడు కోనేరులో పంచ సహస్ర దీపోత్సవం -
‘మధ్యాహ్న భోజనం’ నిలిపివేతపై విచారణ
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిపివేసిన ఘటనపై మంగళవారం తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈవో మధు, ఎంపీడీవో గణేశ్ విచారణ చేపట్టారు. నిర్వాహకురాలు నారే చిన్ను, హెచ్ఎం రాజేందర్, విద్యార్థులను వేర్వేరుగా వివరాలు అడి గి తెలసుకున్నారు. తాను 18ఏళ్లుగా వంట చేస్తున్నానని, హెచ్ఎం రాజేందర్ వచ్చాక ఇబ్బంది పెడుతున్నాడని చిన్ను తెలిపింది. మెనూ ప్రకారం వండడం లేదని, గతనెల 30న నీళ్లచారు, పప్పు పెట్టిందని హెచ్ఎం వివరించారు. చిన్ను రుచికరంగానే వంటలు చేస్తున్నారని, ఆర్థిక పరిస్థితి సరిగా లేక.. బిల్లులు రాక కొంత ఇబ్బంది పడుతోందని ఉపాధ్యాయులు తెలిపారు. రుచికరంగానే వంట చేస్తోందని కొందరు విద్యార్థులు.. మెనూ ప్రకారం పెట్టడం లేదని మరికొందరు వివరించారు. వివరాలను డీఈవోకు నివేదిస్తామని అధికారులు తెలిపారు. -
ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం
మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవల విషయంలో వైద్యులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారు. గదుల కొరతతో వై ద్యులంతా ఒక్కచోటనే కూర్చోని రోగులను పరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోసం అక్కడే నూతన భవన నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ.. ఆ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. దీనివల్ల వైద్య సేవలు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు గదుల్లో ఎనిమిది మంది వైద్యుల సేవలు ఈ చిత్రం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలోనిది. ఒకటే గది.. అది కూడా ఇరుకుగా ఉంది. అందులోనే ముగ్గురు వైద్యులు పక్కపక్కనే కూర్చోని రోగులను పరీక్షిస్తున్నారు. వీరితోపాటు కొంతమందికి రక్త పరీక్షలను కూడా ఈ గదిలోనే నిర్వ హిస్తుండడం గమనార్హం.ఆసుపత్రిలోని మరో గది ఇది. ఇందులో కూడా ఐదుగురు వైద్యులు పక్కపక్కనే కూర్చోని ఇదిగో ఇలా.. రోగులను పరీక్షిస్తున్నారు. అంతమంది వైద్యులు ఉన్నా.. గదిలో రోగులు కూర్చునేందుకు మాత్రం కనీసం కుర్చో.. లేకుంటే స్టూల్ వేసే అవకాశమే లేదు. ఫలితంగా రోగులను నిలబెట్టే పరీక్షించి పంపుతున్నారు. -
అదృశ్యమైన వృద్ధుడు శవమై...
కోనరావుపేట(వేములవాడ): నాలుగురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధుడు శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన బద్దెపూరి నారాయణ (80) కొంతకాలంగా మానసికస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాడు. అక్టోబర్ 31న ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ నెల 3న కోనరావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నారాయణ గతంలో కూడా ఇంటినుంచి వెళ్లిపోగా నిజామాబాద్ గ్రామ శివారులో దొరికాడు. కాగా మంగళవారం ఉదయం మల్కపేట రిజర్వాయర్లో నారాయణ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జగిత్యాల
31.0/22.09గరిష్టం/కనిష్టందుబ్బరాజన్నకు కార్తీక సందడిసారంగాపూర్: దుబ్బరాజన్న ఆలయానికి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. మహిళలు ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిమిగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. గోదావరిలో పుణ్యస్నానాలుధర్మపురి: కార్తీకమాసం సోమవారం సందర్భంగా గోదావరిలో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరించారు. పుష్కరఘాట్లు కిక్కిరిసిపోయాయి. స్వామివారికి మొక్కులు చెల్లించారు.మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
అవినీతిపై చర్యలు తీసుకోండి
ధర్మపురి గ్రామపంచాయితీలో 2014లో జరిగిన గోదావరి పుష్కరాల నిధుల్లో రూ.పది లక్షల అవినీతి జరిగింది. 2015 నుంచి సాక్ష్యాలతో ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకసారి ఫైల్ దొరకడం లేదని, ఫైల్ కోసం మున్సిపాలిటీకి రాశామని, వచ్చాక చర్యలు తీసుకుంటామని దాటవేస్తున్నారు. ప్రత్యేక దృష్టి సారించి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి. – అజ్మత్ అలీ ధర్మపురి జీవనభృతి ఇవ్వాలి మాది జగిత్యాల. బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా మాకు జీవనభృతి మంజూరు చేయాలి. – సాలెహాబేగం, జబీన్ సుల్తానా, జగిత్యాల భూమార్పిడి రద్దు చేయండి మాది జగిత్యాల పట్టణం. గొల్లపల్లి మండలం దట్నూర్ శివారు సర్వే నంబర్ 53/అ/ 8,53ఆ/8రక్బా నాలుగెకరాలు ఉంది. ఈ భూమిపై జగిత్యాల సివిల్ కోర్టులో వివాదం నడుస్తోంది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సదరు సర్వేనంబర్, విస్తీర్ణాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాలని గొల్లపల్లి తహసీల్దార్కు అర్జీ ఇచ్చాను. ఇవేమీ పట్టించుకోని ఆయన కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న సదరు భూమిని వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా వ్యవహరించిన తహసీల్దార్పై చట్టపరంగా చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయండి. – కొప్పు సత్యనారాయణ, జగిత్యాల -
ఐఎంఏకు రాష్ట్రస్థాయి అవార్డు
జగిత్యాల: కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన ఐఎంఏ రాష్ట్రస్థాయి సదస్సులో జిల్లాశాఖకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. జిల్లా శాఖ నిర్వహిస్తున్న సామాజిక, ప్రజారోగ్యం, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, వ్యాక్సిన్, హైపర్టెన్షన్ డే వంటి కార్యక్రమాలు నిర్వహించింది. వీటిని గుర్తించిన రాష్ట్రశాఖ జగిత్యాల ఐఎంఏ శాఖను ఉత్తమ శాఖగా ప్రకటించింది. సభ్యులను సమన్వయ పరుస్తూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్రెడ్డి ఉత్తమ ప్రధాన కార్యదర్శి అవార్డు అందుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గురువారెడ్డి, సభ్యులు ఐఎంఏ శాఖకు అభినందనలు తెలిపారు. బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాంజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నా రు. తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 18మంది బాధితులు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. వారితో ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ముగిసిన గంగామాత విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలుమెట్పల్లి: పట్టణంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న గంగామాత విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు సోమవారం ముగిశాయి. గంగపుత్రులు బోనాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీ సర్పంచ్ కొమిరెడ్డి లింగారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పర్రె శంకర్, సంఘ నాయకులు ఉన్నారు. విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీకొడిమ్యాల: మండలంలోని తిప్పయ్యపల్లి ప్ర భుత్వ పాఠశాల విద్యార్థినులకు బీజేపీ నాయకులు సైకిళ్లు పంపిణీ చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అందించిన సైకిళ్లను పార్టీ మండల అధ్యక్షుడు బండ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినులకు అందించారు. విద్యార్థినులు బాగా చదువుకుని దేశ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేలిముద్ర పద్ధతిని సడలించాలిరాయికల్: వేలిముద్ర పద్ధతిని సడలించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. రాయికల్ మార్కెట్ యార్డును పరిశీలించారు. కొందరు రైతులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారని, ధాన్యం అమ్ముకునేందుకు కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు చొరవ చూపి ధాన్యం కొనాలని సూచించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్రెడ్డి, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, మండల అధ్యక్షుడు జలేందర్రెడ్డి, నాయకులు మండ రమేశ్, నాగరాజు పాల్గొన్నారు. -
మానవత్వం అక్కున చేర్చుకుంది
● రోగిని తన కారులో తరలించి మానవత్వం చాటిన ఎమ్మెల్యే సంజయ్ తల్లిని భుజాలపై మోసుకెళ్తున్న దీపక్ దీపక్ తల్లిని తన కారులో తరలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్జగిత్యాలటౌన్: పేదరికం వెక్కిరిస్తే మానవత్వం అక్కున చేర్చుకున్న ఘఽటన సోమవారం జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాలకు చెందిన దీపక్ తల్లితో కలిసి నిజామాబాద్లో ఉంటున్నాడు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను జగిత్యాల ప్రధాన ఆస్పత్రిలో చూపెట్టేందుకు బయల్దేరాడు. తల్లికి ఉచిత బస్సు ప్రయాణం కావడంతో చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులతోనే ఇద్దరూ కలిసి జగిత్యాల బస్టాండ్లో దిగారు. ఆస్పత్రి వరకు ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ రూ.50 అవుతుందని తెలిపాడు. తిరుగు ప్రయాణానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో తల్లిని భుజంపై ఎత్తుకుని ఆస్పత్రి వైపు బయల్దేరాడు దీపక్. అదే సమయంలో అటువైపు వెళ్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ వారిని చూసి తన వాహనాన్ని ఆపాడు. దీపక్తోపాటు ఆయన తల్లిని కారులో ఆస్పత్రికి తీసుకెళ్లి.. అక్కడ చికిత్స చేయించి తిరిగి తన కారులో బస్టాండ్ వరకు తీసుకెళ్లి మానవత్వం చాటుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్మెల్యేపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
జగిత్యాలజోన్: లోక్అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి అన్నారు. ఈనెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్పై బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ప్రతి చిన్న విషయానికి కోర్టులకు రావడంతో భారం పడుతోందని, ఫలితంగా పెండింగ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి కోర్టుల్లో దాదాపు 17,150 వరకు క్రిమినల్, సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్లో రాజీకి అనుకూలమైన కేసులను పరిష్కరిస్తామన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. రాజీమార్గమే రాజమార్గంధర్మపురి: రాజీమార్గమే.. రాజమార్గమని ధర్మపురి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి యోగి జానకి అన్నారు. స్థానిక కోర్టులో ఈనెల 15న నిర్వహించనున్న స్పెషల్ లోక్ అదాలత్పై సోమవారం నియోజకవర్గంలోని పోలీసులతో సమావేశం అయ్యారు. స్పెషల్ లోక్అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా పోలీసులు కృషి చేయాలని కోరారు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సైలు ఉదయ్కుమార్, రవీందర్, ఉమాసాగర్, సతీశ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి -
రైతులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలి
సారంగాపూర్: రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న వరి, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు దాటినా ఇప్పటికి కొనుగోళ్లు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎలాంటి కోత లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఫసల్బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.50వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, నాయకులు ఎండబెట్ల ప్రసాద్, చుక్క అంజి, మాజీ సర్పంచ్లు భైరి మల్లేశం, గుర్రం స్వామి, భూక్య సంతోష్ ఉన్నారు. -
సిల్ట్ తీయరు..
మల్యాల: ముత్యంపేటలోని శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి వారిని ఆదివారం వేలాది మంది దర్శించుకున్నారు. సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఓంకారం ఆకారంలో దీపాలు వెలిగించి, దీపారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు ఉమామహేశ్వర రావు, అర్చకులు పాల్గొన్నారు. కమనీయం.. వెంకన్న కల్యాణంకోరుట్లరూరల్: కోరుట్ల మండలం వెంకటాపూర్ గుట్ట వద్ద శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకన్నస్వామి కల్యాణాన్ని ఆదివారం కనులపర్వంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ● ఇది జిల్లాకేంద్రంలోనే ప్రధానమైన రోడ్డు. ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి. సమీపంలో కనీసం డ్రైనేజీ కూడా లేదు. దీంతో మురికినీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. చెత్తాచెదారం రోడ్డుపైకి వస్తోంది. అధికారులు డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. -
కూటమిదే ‘అర్బన్’ పీఠం
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ విజయదుందుబి మోగించింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఓట్ల లెక్కింపులో అధిక్యం మారుతూ, చివరికి కూటమినే భారీ విజయం వరించింది. రెండు డైరెక్టర్ పోస్టులు మాత్రమే కాంగ్రెస్ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు వర్గం నిర్మల భరోసా ప్యానెల్ గెలుచుకుంది. పారదర్శక పాలన పేరుతో బరిలో నిలిచిన గడ్డం విలాస్రెడ్డి ప్యానెల్లో ఒక్కరూ గెలవకపోగా విలాస్రెడ్డి కూడా ఓటమిపాలయ్యారు. 12గంటల పాటు కౌంటింగ్ ఏడు గంటల పాటు పోలింగ్ జరగగా ఓట్ల లెక్కింపు 12గంటల పాటు సాగింది. శనివారం సాయంత్రం 4గంటలకే కౌంటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా 4గంటలకు పైగా ఆలస్యమైంది. అర్ధరాత్రి వరకు ఫలితాలు వెల్లడవుతాయని అధికార యంత్రాంగం భావించినప్పటికి ఆదివారం ఉదయం 8గంటల వరకు కౌంటింగ్ సాగింది. తొలుత రెండు మహిళా డైరెక్టర్ స్థానాలకు, తదుపరి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఓట్లు, అనంతరం జనరల్ కేటగిరీ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు. పోలైన ఓట్లలో 37.53శాతం చెల్లని ఓట్లు అర్బన్ బ్యాంకులో మొత్తం ఓటర్లు 9,287 మంది కాగా పోలైంది 4,114 ఓట్లు మాత్రమే. నమోదైన పోలింగ్శాతం 44.29 కాగా వివిధ కేటగిరీలు కలిపి చెల్లని ఓట్లు 37.53శాతం నమోదయ్యాయి. వెలిచాల డీలా.. విలాస్కు జీరో ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగగా కూటమి ప్యానెల్ కర్ర రాజశేఖర్ వర్గమే పైచేయి సాధించింది. వెలిచాల వర్గం నిర్మల భరోసా ప్యానెల్లో జనరల్ కేటగిరిలో అనురాసు కుమార్, ఉయ్యాల ఆనందం విజయం సాధించారు. మహిళా కేటగిరిలో మునిపల్లి ఫణీత కాస్త పోటీ ఇచ్చినా వరాల జ్యోతి, ముద్దసాని శ్వేత గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. మూల వెంకటరవీందర్రెడ్డి ఓటమి పాలయ్యారు. గడ్డం విలాస్రెడ్డివర్గంలో ఒక్కరూ గెలువలేదు. విలాస్రెడ్డికి 583 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వరాల జ్యోతికి అఽత్యధిక ఓట్లు మొత్తంగా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిగా వరాల జ్యోతి నిలిచారు. 2,119 ఓట్లు సాధించగా, 55.47శాతం ఓటర్ల మద్దతు లభించింది. తరువాత స్థానంలో కర్ర రాజశేఖర్ 19,59 ఓట్లతో 52.12శాతం మద్దతు లభించగా మూడో స్థానంలో ముద్దసాని శ్వేత 1,710 ఓట్లు సాధించారు. అర్బన్ బ్యాంక్ను అగ్రగామిగా నిలుపుతాం: కర్ర రాజశేఖర్ కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో తమ ప్యానెల్ను ఆదరించిన ప్రతి ఓటరుకు రుణపడి ఉంటామని కర్ర రాజశేఖర్ స్పష్టం చేశారు. పార్టీలకతీతంగా ప్యానెల్ బరిలో నిలిచిందని, చివరికి తాము చేసిన అభివృద్ధే గెలిపించిందని అన్నారు. ప్యానెల్కు మద్దతు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గెలుపుకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. తుది ఫలితాలు ఇలా మొత్తం ఓటర్లు: 9,287పోలైన ఓట్లు: 4,114చెల్లని ఓట్లు: 1,544జనరల్ కేటగిరీలో చెల్లిన ఓట్లు: 3,758చెల్లని ఓట్లు: 356ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో చెల్లిన ఓట్లు: 3,220చెల్లని ఓట్లు: 894మహిళా విభాగంలో చెల్లిన ఓట్లు: 3,820చెల్లని ఓట్లు: 294విజేతలు వీరే జనరల్ కేటగిరీ అభ్యర్థి సాధించిన ఓట్లు కర్ర రాజశేఖర్ 1,959బొమ్మరాతి సాయికృష్ణ 1,292దేశ వేదాద్రి 1,245కన్న సాయి 1,220బాశెట్టి కిషన్ 1,119బండి ప్రశాంత్దీపక్ 1,035అనురాస్ కుమార్ 1,015తాడ వీరారెడ్డి 987ఉయ్యాల ఆనందం 919ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సరిళ్ల రతన్రాజు: 856 -
ధాన్యం కొనేదెప్పుడో..!
ధాన్యం సేకరణ కోసం జిల్లాలో 408 కొనుగోలు కేంద్రాలకు అనుమతులు మంజూరయ్యాయి. కొన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. – జితేంద్రప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జగిత్యాలరూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభంకాలేదు. కేవలం కేంద్రాలను ప్రారంభిస్తున్న అధికారులు అనంతరం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఓ వైపు మబ్బులు కమ్ముకుని.. ఎప్పుడు వర్షం పడుతుందో..? ధాన్యం ఎక్కడ తడిసిపోతుందో..? అని రైతులు భయాందోళన చెందుతున్నా.. అధికారుల్లో మాత్రం అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా.. జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వ్యవసాయాధికారుల అంచనా ప్రకారం వానాకాలం 6.60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అధికారులు మాత్రం 4 నుంచి 5లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. దీనికి తగినట్లు జిల్లాలో 436 కొనుగోలు కేంద్రాలకు దరఖాస్తులు రాగా అధికారులు స్థల పరిశీలన.. ఏర్పాట్లు చూసి ఇప్పటివరకు 408 సెంటర్లకు అనుమతి ఇచ్చారు. ఐకేపీ ఆధ్వర్యంలో 130, సహకార సంఘాల ఆధ్వర్యంలో 277, మెప్మా ద్వారా ఒక కేంద్రానికి అనుమతి లభించింది. ప్రారంభానికే పరిమితం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను 15 రోజులుగా ప్రారంభిస్తున్నా ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఒక్క క్వింటాల్ ధాన్యం కూడా తూకం వేయలేదు. దీంతో 20 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి పడిగాపులు కాస్తున్నారు. టీవల కురిసిన భారీ వర్షాలకు దాదాపు 60 శాతం ధాన్యం తడిసిపోయింది. శుక్రవారం నుంచి వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో రైతులు ధాన్యం ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు. అందుబాటులో 60 లక్షల గన్నీ సంచులు జిల్లాలో 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కోసం 1.50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం. ఇప్పటికే 60 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలకు బ్యాగులు ఇప్పటికే సరఫరా చేశారు. మిగతా బ్యాగులు వెంటనే తెప్పించి కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 40 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు వానాకాలంలో సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లులకు అప్పగించాల్సి ఉండగా.. ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే ధాన్యం కేటాయిస్తామని ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటివరకు జిల్లాలోని 25 రైస్మిల్లర్లు మాత్రమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు. మరో 15 మంది మిల్లర్లు రెన్యువల్ చేసుకున్నారు. ఇలా మొత్తం 40 మిల్లర్లకు అధికారులు ధాన్యం కేటాయింపు చేశారు. -
మురుగు కదలదు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలోని డ్రైనేజీ. పూర్తిగా నిండిపోయింది. సిల్ట్ తీయకపోవడం, కాలువను కొంతమంది ఆక్రమించుకోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురికినీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. ఆలయం సమీపం కావడం.. అక్కడ ఎక్కువగా రద్దీ ఉండటంతో ఆ దుర్వాసన భరించలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాని పక్కనే హోటల్ ఉంది. డ్రైనేజీపై కప్పులు వేయడం, సిల్ట్ తీయరాకపోవడం ఇబ్బందిగా మారింది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం -
పోలీసుల విస్తృత తనిఖీలు
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలో శనివారం అర్ధరాత్రి పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ప్రధాన చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేశారు. హోటళ్లు, లాడ్జీల్లో రికార్డులు పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిపై డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదు చేశారు. లాడ్జీల యజమానులు తప్పనిసరిగ్గా సీసీ కెమెరాలు పెట్టాలని, ఆధార్కార్డు వంటి ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని సీఐ సూచించారు. ఎస్సైలు సుప్రియ, రవికిరణ్, కుమార స్వామి, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 16 గేట్లను ఎత్తి 47,059 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 56,513 క్యూసెక్కుల నీరు వస్తుండగా వివిధ మార్గాల ద్వారా బయటకు విడుదల చేస్తున్నారు. అక్రమంగా మట్టి తరలింపుజగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం నర్సింగాపూర్ శివారు రెవెన్యూ భూముల నుంచి రాత్రివేళల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. సెలవుదినాలు చూసి పెద్దఎత్తున టిప్పర్లు, పొక్లెయిన్ల సహాయంతో మట్టిని జగిత్యాల, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్రమ రవాణాపై స్థానికులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కొండగట్టు ఆలయానికి నిరంతర విద్యుత్మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి వారి ఆలయానికి విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ రూ.10లక్షలతో కొత్త లైన్ ఏర్పాటు చేసింది. మెట్లదారి వెంట, చెట్ల మధ్య నుంచి ఇనుప స్తంభాల ద్వారా ఆలయానికి దశాబ్దాలుగా విద్యుత్ సరఫరా అవుతోంది. వర్షాకాలంలో తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతోంది. మరమ్మతు చేపట్టేందుకు కష్టతరంగా మారడంతో ఘాట్ రోడ్డు వెంట 38విద్యుత్ స్తంభాలు వేశామని రామన్నపేట సెక్షన్ ఏఈ ఆకునూరి శ్రీనివాస్ తెలిపారు. కనకదుర్గ ఆలయంలో కార్తీకదీపోత్సవంమల్లాపూర్: మండలకేంద్రంలోని శ్రీకనకదుర్గాదేవి ఆలయంలో ఆదివారం రాత్రి లక్ష కార్తీకదీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ క్యాతం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు తోట రవీందర్, నాంపల్లి మారుతి, కై ర రామాగౌడ్, పోలాస రాజయ్యచారిలు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు బల్యపెల్లి కృష్ణప్రసాద్శర్మ అమ్మవారికి పూజలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
జగిత్యాల
30.0/21.07గరిష్టం/కనిష్టంగోదావరిలో దీపోత్సవంధర్మపురి: ధర్మపురి గోదావరిలో కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీకమాసంలో భాగంగా 12వ రోజు మహా హారతి కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, మహిళలు తదితరులున్నారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి అధికంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. గోదావరిలో కార్తీక స్నానాలుధర్మపురి: కార్తీకమాసం.. ఆదివారం సెలవు దినం సందర్భంగా గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించారు. సంతోషిమాత, మంగలిగడ్డ ఘాట్లు భక్తులతో పులకించిపోయాయి. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించారు. సోమవారం శ్రీ 3 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
రివిజన్ సమర్థవంతంగా చేపట్టాలి
జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సి వ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రా ష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శని వారం జిల్లా కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2002 ఎలక్టోరోల్ జాబితాలో 2025 ఎలక్టోరోల్ మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించామ ని, కేట గిరి–ఏలో 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరోల్ జాబితాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ బిలో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటరు జాబితాలో లేకుండా 2025 జాబి తాలో నమోదు కాబడిన వారు, కేటగిరీ–సీలో 198 8 నుంచి 2002 మధ్య జన్మించి 2025 ఓటరు జాబి తాలో నమోదు కాబడిన వారు, కేటగిరి–డీలో 2002–2007 మధ్య జన్మించిన వారి గా కేటాయించినట్లు తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బీఎల్వోలు, సూపర్వైజర్ల ద్వారా కేటగి రి–ఏ ఓట రు జాబితాను బీఎల్వో యాప్ ద్వారా నిర్ధారించి కేటగిరి–సీ, డీలను కేటగిరిఏకు అనుసంధానం చేశామన్నారు. పొరపాట్లు లేకుండా చర్యలు తీసకుంటున్నామన్నారు. అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు పాల్గొన్నారు. -
పిల్లర్లు దాటని తహసీల్దార్ భవనం
కోరుట్ల: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా పాతికేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కోరుట్లలోని వివిధ ప్రాంతాలకు కనీసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఆదర్శనగర్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లలేక సతమతం అవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కసారి వెళ్తే పని అవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రతీసారి రూ.200 ఖర్చు వస్తోందని జనం వాపోతున్నారు. ప్రజల అవస్థలను తొలగించడానికి రెండేళ్ల క్రితం నేతలు ముందుకొచ్చినా నిబంధనలు విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం సమస్యాత్మకంగా మారింది. పట్టణం నడిబొడ్డున.. తహసీల్దార్ కార్యాలయం దూరంగా ఉండటంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి గత ప్రభుత్వ హయాంలో పట్టణం నడి బొడ్డున ఎస్సారెస్పీ స్థలంలో తహసీల్దార్ కార్యాలయం నిర్మాణానికి అప్పటి నేతలు సంకల్పించారు. కల్లూర్ రోడ్ ఎస్సారెస్పీ స్థలంలో సుమారు 450 గజాల మేర స్థలం కేటాయించి భవనం నిర్మాణానికి రూ.54లక్షలతో టెండర్లు పిలిచారు. ఆ వెంటనే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. ఆర్నెళ్ల వ్యవధిలో పనులు నత్తనడకన సాగాయి. కేవలం పిల్లర్ల వరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి. అనంతరం ఎస్సారెస్పీ నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ లేదన్న సాకుతో తహసీల్దార్ కార్యాలయం పనులకు ఆటంకాలు వచ్చాయి. ఫలితంగా కాంట్రాక్టర్ పనులు నిలిపేశారు. సుమారు ఏడాదిన్న కాలం గడుస్తున్నా తహసీల్దార్ కార్యాలయం పనులు పిల్లర్ల వరకే మాత్రమే పూర్తి కావడంతో జనం ఇప్పటికీ దూరంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ఎప్పటిలాగే తిప్పలు పడుతున్నారు. ఈ ఒక్కదానికే ఎన్వోసీ ఎస్సారెస్పీ స్థలంలో ఇదివరకు మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు క్వార్టర్, సబ్ రిజిస్టార్ కార్యాలయం, పింఛనర్ల సంఘం షెడ్లు, ఇతరత్రా ప్రైవేటు వ్యాపారులకు చెందిన షెడ్లు, మున్సిపల్ కూరగాయల మార్కెట్, పెట్టి వెండర్స్ షెడ్లు, కేడీసీసీ భవనం, పీఏసీఎస్ భవనం.. ఇలా చెప్పుకుంటే పోతే లెక్కలేని నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో చాలామటుకు ఎన్వోసీ లేకుండా జరిపిన నిర్మాణాలే కావడం గమనార్హం. సాధారణంగా ఎస్సారెస్పీ స్థలాన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బదలాయించాలంటే కెబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇలా ఆమోద ముద్ర పొంది ఎన్వోసీ తీసుకున్న నిర్మాణాలు ఇక్కడ ఏవీ లేకపోగా కేవలం తహసీల్దార్ కార్యాలయానికి మాత్రం ఇవ్వడం విడ్డూరంగా తోస్తోంది. ఈ ఎన్వోసీ పేరిట తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం ఆపేయడం ఎంత వరకు సమంజసమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులకు అవసరం లేని ఎస్వోసీ కేవలం తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి మాత్రమే వర్తిస్తుందా..? అన్న విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్వోసీ చిక్కుముడి తొలగించి తహసీల్దార్ కార్యాలయం నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. -
ఊరూ.. పల్లెటూరు!
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్కు చెందిన శ్రీనివాస్ ఉపాధిరీత్యా 30 ఏళ్లుగా హైదరాబాద్లో స్థిరపడ్డాడు. ఇటీవల దసరా పండక్కి సొంతూరికి వచ్చాడు. ఊళ్లో బస్సు దిగి ఇంటికి వెళ్తున్న ఆయన్ను దారి పొడవునా పలకరించారు. ‘ఎప్పుడొచ్చావురా అల్లుడూ’ అని ఓ పెద్దాయన అంటే.. ‘ఇదే రాకటనా పిల్లల్ని తీసుక రాలేదా’ అని మరో పెద్దమ్మ.. ‘బావ ఎప్పుడొచ్చావు’ అంటూ ఓ స్నేహితుడు.. ‘అన్నా ఇప్పుడే వస్తున్నావా’ అంటూ ఓ యువకుడు పలకరించాడు. మామా, కాకా, బిడ్డా అంటూ వరుసలు పెట్టి పిలిచే సంస్కృతి ఇప్పటికీ చాలా పల్లెల్లో కనిపిస్తోంది. ఆత్మీయతను పంచుతోంది.ఊరూ పల్లెటూరు.. దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి.. కొడుకుకిచ్చె ప్రేమ వేరు కండ్ల ముందే ఎదుగుతున్న.. సంబరాల పంటపైరు అంటూ..ఓ సినీకవి రాసిన విధంగా ఆధునిక ప్రపంచం ఆవహిస్తున్నా.. ఉపాధి కోసం బయట బతుకున్నా ఎందరికో కన్న ఊరు అంటే ఎంతో ఇష్టం.. ఎక్కడ ఉన్నా.. పుట్టిన గ్రామం అంటే.. తల్లి ప్రేమను చూపినట్లవుతోంది. అంతేకాదు.. పుట్టిన ఊరిని వదిలి పొట్టకూటికోసం పట్టణాలు.. దేశ, విదేశాల్లో బతుకుతున్న యువత స్వగ్రామం ముచ్చట్లు అంటే ఎంతో ఇష్టపడుతున్నారు. ఊరిపై ప్రేమనూ ఒలకబోస్తున్నారు. జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. గ్రామాల్లో ఉన్నవారు సైతం బంధాలను కలుపుకుంటున్నారు. కష్టసుఖాల్లో తోడునీడగా నిలుస్తూ పల్లెల్లో ఐక్యత భావాన్ని ఇప్పటికీ చాటుతున్నారు. సాగు పనుల్లో సాయంగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎదురైనా వరుసపెట్టి పిలుస్తూ.. తోబుట్టువులుగా మెదులుతున్నారు. తరాలు మారుతున్నా.. తరగని ప్రేమను పంచుతున్న పల్లె అనురాగాలపై సండేస్పెషల్..!! – వివరాలు 8లోu– హుజూరాబాద్ -
కుటుంబాల్లో వెలుగు
మహిళా సంఘంలో సభ్యురా లిగా ఉన్న. నా భర్త దివ్యాంగుడు. బ్యాంకు ద్వారా రూ. లక్ష, సీ్త్రనిధి ద్వారా రూ.50వేలు, సాయిరాం సంఘం నుంచి రూ.50 వేలు, గ్రామైక్య సంఘం నుంచి రూ.50 వేలు అప్పు తీసుకొని కిరాణం పెట్టిన. నా భర్తతో కలిసి అల్లం, ఉల్లిపాయలు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నం. – కత్తెరవ్వ, తిమ్మాపూర్ ఆర్టీసీతో ఆదాయం మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సును కేటాయించింది. మేం కొంత వాటాధనం చెల్లించాం. నాలుగు నెలల నుంచి బస్సు నడిపిస్తున్నాం. నెలకు రూ.70 వేల ఆదా యం సమకూరుతోంది. మండలంలో 9,550 మంది సభ్యులున్నారు. వచ్చిన ఆదాయాన్ని సంఘాలకు సమంగా పంచుతున్నం – రజిత, ధర్మపురి మండల సమాఖ్య అధ్యక్షురాలు -
లోక్ అదాలత్ను వినియోగించుకోండి
ధర్మపురి: ఈనెల 15న నిర్వహించనున్న స్పెషల్ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్విని యోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి యోగి జానకీ తెలిపారు. స్థానిక కోర్టు కార్యాలయంలో శనివారం లోక్ అదాలత్పై న్యాయవాదులు, పోలీసులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కక్షిదారులకు ఇదొక సువర్ణ అవకాశమని కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సివిల్ కేసులు, వివాహ సంబంధమైన కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్లు, చెక్బౌన్స్ కేసులు ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు దమ్మెర శ్రీనివాస్, రౌతు రాజేశ్, జాజాల రమేశ్, కలమడుగు కీర్తి, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు. అంజన్న సన్నిధిలో జిల్లా న్యాయమూర్తి పూజలుమల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో జిల్లా మొదటి అడిషన్ సెషన్స్ జడ్జి ఎస్.నారాయణ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి పూజల అనంతరం తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్రావు, ఆలయ ఉప ప్ర ధాన అర్చకులు చిరంజీవ స్వామి, స్థా నాచా ర్యులు కపీందర్, ఆలయ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, ఏఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. గాలికుంటు నివారణ టీకాలు వేయించాలిగొల్లపల్లి/రాయికల్: పశువుల గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరేశ్, జిల్లా పశువైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. గొల్లపల్లి మండలం వెంగలాపూర్లో నరేశ్ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. గ్రామంలో 300కు పైగా పశువులకు టీకాలు వేశారు. రాయికల్ మండలం అల్లీపూర్లో ప్రకాశ్ టీకాల పంపిణీని పరిశీలించారు. టీకాల ద్వారా పాడి పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమాల్లో రాయికల్ మండల అదనపు పశువైద్యాధికారి నరేశ్రెడ్డి, లైవ్స్టాక్ అసిస్టెంట్లు ఎలిగేటి రవీందర్, నాగేందర్రెడ్డి, శివకుమార్, కార్యాలయ సహాయకులు షేక్ అహ్మద్, పోచయ్య, గొల్లపల్లి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవీందర్, సిబ్బంది రవీందర్, రాజశ్రీ, రవి, శ్రీకాంత్, నిశాంత్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మ దహనం మెట్పల్లి: భారత రక్షణ దళాలపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శనివారం బీజేపీ నాయకులు ఆయన దిష్టిబొమ్మను దహ నం చేశారు. పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ మాట్లాడుతూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. నాయకులు కుడుకల రఘు, సుంకే ట విజయ్, తోకల సత్యనారాయణ, జుంగుల అనిల్, దొ నికెల నవీన్, లోలపు అనిల్ తదితరులున్నారు. ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలకు కేంద్రం యూఐడీఎఫ్ కింద రూ.37.40కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ.. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రధాని మోదీ, ఎంపీ అర్వింద్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిధులను తాము మంజూరు చేయించినట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. -
జగిత్యాల
29.0/20.07గరిష్టం/కనిష్టంనృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురిస్తుంది. కొన్నిచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. నేత్రపర్వంగా కార్తీక దీపోత్సవం ధర్మపురి: ధర్మపురిలో గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయం నుంచి మేళతాళాలతో గోదావరి వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025 -
నిలిచిన మధ్యాహ్న భోజనం
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. హెచ్ఎం రాజేందర్ ఒత్తిడి తేవడంతోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు నారే చిన్ను తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. పాఠశాలలో 19 ఏళ్లుగా మధ్యాహ్న భోజన వర్కర్గా చిన్ను పనిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం హెచ్ఎంగా ఇక్కడకి వచ్చిన రాజేందర్ చిన్నును వంట విషయంలో తప్పుపడుతూ వస్తున్నాడు. మధ్యాహ్న భోజనం వండొద్దంటూ ఒత్తిడి తెస్తున్నాడు. అనారోగ్యంతో ఉండడంతో భోజనం వండటం వీలు కాదని, రాజీనామా చేస్తున్నానంటూ ఆయనే లేఖ రాసి ఉన్నతాధికారులకు పంపించాడు. దీంతో ఆమె శనివారం వంట చేసేందుకు రాలేదు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వరప్రసాద్ ఏపీఎం శంకర్తో కలిసి పాఠశాలకు వచ్చి చిన్నును విచారించారు. తాను వండిపెట్టడం హెచ్ఎంకు ఇష్టం లేక తరచూ వేధిస్తున్నాడని వివరించింది. విద్యార్థులను విచారించగా వంట రుచికరంగానే చేస్తోందని తెలిపారు. అనంతరం అక్కడే ఉన్న వర్కర్ మేఘనతో భోజనం వండిపెట్టారు. ఎంఈవో సెలవులో ఉన్నందున సోమవారం పాఠశాలకు వచ్చి విచారణ చేపడతామని తహసీల్దార్ తెలిపారు. -
మహిళా సంఘాలకు మంచి రోజులు
ధర్మపురి: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళాసంఘాలకు మంచి రోజులు వస్తున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలు కాకుండా కొత్తగా మరిన్ని సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మహిళలను ఆర్థి కంగా బలోపేతం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఇందులోభాగంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న సంఘాల్లో 16 నుంచి 60 ఏళ్ల వారిని సభ్యులుగా చేర్చుకోనున్నారు. 60 ఏళ్లు దాటినవారి కి వృద్ధ మహిళా సంఘం.. 16 నుంచి 18 ఏళ్లవారికి కిశోర బాలికల సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. అధికారుల భాగస్వామ్యంతో.. కిశోర్ బాలికల సంఘాలను గ్రామీణాభివృద్ధి, సంక్షేమశాఖ అధికారుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో వృద్ధులు, కిశోర బాలికల వివరాలను సేకరిస్తున్నారు. కొత్త సంఘాలను ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో కిశోర బాలికల అభ్యున్నతికి తోడ్పాటునివ్వనున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో చదివే బాలికలతోపాటు చదువు మధ్యలో మానేసిన వారి వివరాలను వీవోలు, అంగన్వాడీలు సేకరిస్తున్నారు. జీవనోపాధి కోసం రుణాలు ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఐదు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో క్యాంటీన్కు ప్రభుత్వం రూ.10 లక్షల రుణసాయం అందించింది. అలాగే మండల సమాఖ్య పేరుతో జిల్లాలోని 18 మండలాలకు మండలానికో ఆర్టీసీ బస్సును ప్రభుత్వం మంజూరు చేసింది. ధర్మపురిలో శ్రీచైతన్య మండల సమాఖ్యకు బస్సు మంజూరైంది. దీంతో పాటు పెట్రోల్బంక్లు, సౌర ఉత్పత్రి కేంద్రాలు తదితర యూనిట్లు ఇవ్వనున్నారు. లక్ష్యం రూ.770 కోట్లు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం 2025–26 సంవత్సరానికి రూ.770 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 15,080 సంఘాలుండగా సెప్టెంబర్ వరకు రూ.402 కోట్ల రుణాలు అందించారు. జిల్లా సమాచారంపాత సంఘాలు : 15,080సభ్యులు : 1,77,323కొత్తగా ఏర్పాటైనవి : 617సభ్యులు : 3,630 -
‘గ్యారంటీ’ ఇస్తేనే ధాన్యం కేటాయింపు
జగిత్యాలరూరల్: జిల్లాలో రైస్మిల్లర్లకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కేటాయించేవారు. ప్రస్తుత ప్రభుత్వం మిల్లర్లు తీసుకునే ధాన్యానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తేనే కేటాయిస్తున్నారు. ఇలా కేటాయించిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక మిల్లర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 95 పారాబాయిల్డ్ రైస్మిల్లులు జిల్లాలో మొత్తం 95 పారాబాయిల్డ్ రైస్మిల్లులు, 39 రా రైస్మిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి సీజన్లో సేకరించిన ధాన్యాన్ని రైస్మిల్లులకు అప్పగించి వారి నుంచి బియ్యాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆరునెలలుగా బియ్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో మిల్లర్ల వద్ద భారీగా ధాన్యం పేరుకుపోయింది. అలాగే బియ్యం నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించే ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయడం అనేది మిల్లర్లకు ఆందోళనకరంగా మారింది. బ్యాంక్ గ్యారంటీతో కష్టాలు గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా సేకరించిన ధాన్యాన్ని మిల్లర్ల సామర్థ్యాన్ని బట్టి కేటాయించేవారు. ప్రస్తుతం బ్యాంక్ గ్యారంటీ పెట్టడంతో చాలామంది మిల్లర్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 40 మంది రైస్మిల్లర్లకే ప్రభుత్వం ధాన్యం కేటాయించింది. మిగతా రైస్మిల్లర్లకు బ్యాంక్ గ్యారెంటీ ఇస్తేగానీ అధికారులు ధాన్యం కేటాయించే పరిస్థితి లేదు. -
త్వరలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్లో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. లక్ష్మిపూర్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నిధుల సమస్యతో కొంత జాప్యమైందని, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు ప్రీప్రైమరీ విద్య జగిత్యాల: పిల్లలు ప్రీప్రైమరీ విద్యకు దూరం కాకూడదనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ హౌసింగ్ కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంక్షేమాధికారి నరేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్, చెట్పల్లి సుధాకర్, రాజ్కుమార్, గంగమల్లు, నవీన్ పాల్గొన్నారు. ఐఎంఏ యాక్టివిటి రిపోర్ట్ పుస్తకావిష్కరణ ఐఎంఏ 2024–25 ఆల్రౌండ్ బెస్ట్ బ్రాంచ్ అవార్డు సాధించిందని ఎమ్మెల్యే అన్నారు. శనివారం యాక్టివిటి రిపోర్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకనాథ్రెడ్డి, సెంట్రల్ కమిటీ మెంబర్ అశోక్, గురువారెడ్డి పాల్గొన్నారు. -
కార్తీక పౌర్ణమికి ముస్తాబు
గర్భగుడిలోని శివలింగం ఆలయ గర్భగుడిలోని సీతారాముల విగ్రహాలు వాల్గొండలోని శ్రీరామలింగేశ్వర ఆలయం మల్లాపూర్: హరిహరక్షేత్రంగా గుర్తింపు పొంది.. వాల్గొండ గ్రామం గోదావరి తీరాన కొలువుదీరిన శ్రీరామలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమికి సిద్ధమయ్యారు. పౌర్ణమి రోజున లక్ష దీపాలతో అలంకరించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి ప్రభాకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మీ తెలిపారు. లక్ష దీపాలంకరణకు వివిధ ప్రాంతాల నుంచి సాధువులు హాజరవుతున్నారని వివరించారు. -
వాళ్లకు వీళ్లు.. వీళ్లకు వాళ్లు
వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊళ్లలో ఇంటి పక్కోళ్ల పొలానికి వీళ్లు వెళ్లి కోతల్లో పాల్గొంటారు.. వాళ్ల పొలం కోతకు వస్తే వీళ్లు వెళ్తారు. ఇలా ఇంటి చు ట్టూ ఉన్నవారితో ప్రేమానురాగాలు కొనసాగిస్తారు. ఏ చిన్న పండుగ చేసుకున్నా.. ఇంట్ల ఏది వండినా పంచుకొని తింటారు. ఈ పద్ధతి వల్ల డబ్బులు లేకుండా చేను పని, ఇంటి పనులు పూర్తవుతాయి. ఇలా ఒకరి పనుల్లో ఒకరు భాగస్వామ్యం అవ్వడాన్ని గ్రామాల్లో ‘బదిలీ’ అంటారు. వరికోతలు పూర్తయ్యాక.. కొత్తబియ్యం వండి ఒకరినొకరు బంతి భోజనాలకు పిలుచుకుంటారు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. కొన్ని పల్లెలు మూలవాసం మర్చిపోతున్నాయి. ఆత్మీతకు దూరమవుతున్నాయి. -
ఊరూ.. పల్లెటూరు..!
‘కరీంనగర్ సిటీకి చెందిన ఓ ఉద్యోగ దంపతులు 25 ఏళ్లక్రితం హుజూరాబాద్ సమీపంలోని చెల్పూర్ గ్రామంలో అద్దెకు ఉండేవారు. అక్కడ వీరికి జన్మించిన చంటిబాబుకు స్నానం చేయించడం.. ఏడిస్తే ఆడిపించడం వంటివి ఇంటి యజమానురాలు చేసేవారు. ఆ చిన్నోడు ఆమెను అమ్మమ్మ అనేవాడు. తర్వాత ఆ దంపతులు బదిలీపై వెళ్లిపోయారు. ఈక్రమంలో తల్లిదండ్రులు ఊళ్లో కిరాయికి ఉన్న ఇంటి యజమాని.. వారి పిల్లల గురించి తరచూ మాట్లాడుకోవడం వినేవాడు. ఆ పసిపిల్లోడు ఎదిగి ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లాడు. ఇటీవల అద్దె ఇంటి అమ్మమ్మను కలిసేందుకు వచ్చాడు. చిన్నప్పుడు తనను లాలించారని గుర్తుకు తెచ్చుకుని ఆ కుటుంబ సభ్యులను హత్తుకున్నాడు. ఇంటి యజమాని అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు’. ● ఒకప్పటి పల్లెల్లో కలివిడితనం ● ఒకరికొకరు సాయంగా మేమున్నామంటూ భరోసా ● సోషల్ మీడియా రాకతో ఊళ్లలో దూరమవుతున్న పల్లె సంస్కృతి -
కాశీలో రాజన్న కల్యాణం
వేములవాడ: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఈవో రమాదేవి, అర్చకులు, అధికారులు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ఉత్తర్వుల మేరకు వారణాసి క్షేత్రంలో శ్రీపార్వతీరాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం శనివారం నిర్వహించారు. ఈవో రమాదేవి, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ఒన్నారం భాస్కర్, స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్శర్మ, ఉపప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్శర్మ, నమిలకొండ రాజేశ్వరశర్మ, అర్చకులు మామిడిపల్లి శరత్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కార్తీక దీపోత్సవం
వేములవాడ: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న అనుబంధ భీమన్న ఆలయంలో శనివారం సామూహిక కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీలలితా సేవా ట్రస్టు సభ్యులు ఆలయ ఆవరణలో వివిధ ఆకృతుల్లో పూలను పేర్చి అందులో జ్యోతులను పెట్టి వెలిగించారు. ఏఈవోలు శ్రావణ్కుమార్, అశోక్కుమార్లు సుహాసినీలకు వాయనం, పసుపు కుంకుమ, అక్షింతలు, గాజులు, స్వామివారి ఫొటోలను అందజే శారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, జూనియర్ అసిస్టెంట్ కూరగాయల శ్రీనివాస్, సింహాచారి తదితరులు ఉన్నారు. -
కడెంలో ప్రమాదం.. జూలపల్లిలో విషాదం
జూలపల్లి(పెద్దపల్లి): నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కనుకుంట్ల రాజశేఖర్రెడ్డి(40) దుర్మరణం చెందడం ఆయన స్వగ్రామం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. జూలపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజశేఖర్రెడ్డి కరీంనగర్లోని ప్రభుత్వ బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్రవంతి ఉన్నారు. ఆమె సిద్దిపేట జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నార. వీరికి ఒక కుమారుడు, ఒక కూతరు ఉన్నారు. కరీంనగర్లో కుటుంబంతో నివాసం ఉండే రాజశేఖర్రెడ్డి శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యారు. కడెం ప్రాజెక్టు చూసేందుకు కారులో వెళ్లారు. ప్రాజెక్టు పక్కనే నిల్చొని సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయినట్లు సమాచారం. రాజశేఖర్రెడ్డి ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడిపోయాడా, లేక కుటుంబ కలహాలతో కావాలనే ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం కోసం అక్కడి పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. గ్రామస్తులతో కలివిడిగా ఉండే రాజశేఖర్రెడ్డి మృతితో స్వగ్రామం జూలపల్లిలో విషాదం అలముకుంది. ప్రాజెక్టులో పడి ఉపాధ్యాయుడి మృతి -
సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
చొప్పదండి: మండంలోని రుక్మాపూర్ శివారు సాంఘీక సంక్షేమ సైనిక శిక్షణ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన అండర్– 19 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో కె.హోమ్రాజ్ 400 మీటర్ల విభాగంలో గోల్డ్ మెడల్, జె.అచల్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. లాంగ్జంప్లో జి.గణేశ్ గోల్డ్, 100 మీటర్ల రన్నింగ్లో సిల్వర్ మెడల్ సాధించాడు. జె.రోషన్ 300 మీటర్ల రన్నింగ్లో సిల్వర్ మెడల్ గెలిచాడు. వీరు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈసందర్భంగా విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ కల్నల్ రాజాదత్త, ప్రిన్సిపాల్ లింగయ్య, శ్రీనివాస్, ప్రమోద్ రాజు అభినందించారు. -
ఖాకీల కోట.. రహీంఖాన్పేట
ఇల్లంతకుంట(మానకొండూర్): రహీంఖాన్పేట చిన్న గ్రామం. 1,321 వరకు జనాభా. నాడు వంకాయల పంటకు ప్రసిద్ధి. వంకాయల ఊరు అని కూడా పిలిచేవారు. గ్రామం నుంచి మహిళలు కాలినడకన పాలు, కూరగాయల గంపలతో ఇల్లంతకుంటకు వచ్చి అమ్ముకునేవారు. 1990 నుంచి పీపుల్స్వార్, జనశక్తి నక్సలైట్లు తయారయ్యారు. కమటం శ్రీనివాస్ పీపుల్స్వార్ దళ నాయకుడిగా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసిన కొద్ది నెలలకే జనశక్తి తీవ్రవాదులు 1997లో అతడి ఇంటిలోనే కాల్చి చంపారు. అదే గ్రామానికి చెందిన జనశక్తి నక్సలైట్ బత్తిని లచ్చయ్య 1999లో చిన్నలింగాపురం పరిధిలో పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. నాడు పోలీస్ ఉద్యోగంలో చేరాలంటే కుటుంబంలో భయం ఉండేది. దాన్ని అధిగమిస్తూ 1993లో మెరుగు వీరయ్య మొదటిసారిగా పోలీస్ ఉద్యోగం సాధించాడు. తర్వాత బత్తిని వెంకటేశం, పవన్, బిళ్ళవేని శ్రీనివాస్, సురేశ్, గడ్డమీది శ్రీకాంత్, రాజశేఖర్.. ఇలా మూడు కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున పోలీస్ ఉద్యోగాలు పొందారు. ఆయా సామాజికవర్గాల నుంచి మొత్తం 21 మంది ఖాకీ కొలువులు నిర్వర్తిస్తున్నారు. -
సాగుకు సాయంగా వచ్చేవారు
నా యుక్త వయస్సులో ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సాగు పనులు చేసేవాళ్లం. సరదా మాట లు మాట్లాడుకుంటూ పనులు చేస్తుంటే పని చేసినట్టు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు డబ్బుకు ప్రాఽ దాన్యం పెరిగింది. బంధుత్వాల మధ్య వైరంగా మారి బంధాలను దూరం చేసుకుంటున్నారు. డ బ్బు ప్రాధాన్యతను పక్కన బెట్టి స్నేహంగా ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సంతోషంగా జీవించవచ్చు. – మూగల సంజీవరెడ్డి,రైతు, ధర్మరాజుపల్లి ఒకప్పుడు పండుగ వచ్చిదంటే పల్లెలకు కొత్త రూపం వచ్చేది. దూ ర బంధువులు ఊరికి వచ్చారంటే కలివిడిగి తిరుగుతుండేవారు. పండుగకు వచ్చిన వారు యోగక్షేమాలను అడిగి తెలుసుకొని సా యం చేసేవారు. ఇప్పుడు బట్టలు, బంగారంపై మోజు తప్ప పండుగలకు ప్రాధాన్యం ఇవ్వడం లే దు. ప్రస్తుత యువతకు మంచి విషయాలు చెప్పాలంటే వారు ఎలా తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉంది. – కనకం విజయ, రాంపూర్ మా ఇంట్లో పెద్దలు పండుగలు, పెళ్లిల్ల తంతుపై వారు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆచరించిన పద్ధతి, వ్యవహారాల గురించి చెబుతుంటే ముచ్చటగా ఉంటది. అప్పట్లో ప్రతీ విషయాన్ని పక్కవారితో వారు పంచుకునే తీరు ఆశ్చర్యం వేస్తోంది. నాటి ఆచార వ్యవహారాలను నేటి యువత పాటిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి. – బండారి మహేశ్, తుమ్మన్నపల్లి -
టెక్ హఫీజ్
గోదావరిఖని(రామగుండం): రోజూ రూ.వందతో మొదలైన యూట్యూబర్ జీవితం నేడు నెలకు రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు సంపాధిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. సింగరేణి కార్మికుని బిడ్డగా ఈప్రాంత వాసులను టెక్నాలజీలో అనేక అంశాల్లో చైతన్యవంతం చేస్తున్నాడు. సెల్ఫోన్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ముందుగా యైటింక్లయిన్కాలనీలో కంప్యూటర్ సెంటర్ నడిపించిన హఫీజ్ను యూట్యూబ్ ఉన్నత శిఖరాలకు చేర్చింది. ప్రస్తుతం ఎన్టీపీసీలో ఉంటూ TELUGU TECH TUTS యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించి యూఏఈ గోల్డెన్వీసా అందుకున్నాడు. చిన్ననాటి నుంచి ఆసక్తి చిన్నప్పటి నుంచి కంప్యూటర్పై పట్టున్న హఫీజ్ మొబైల్, కంప్యూటర్ గాడ్జెట్ల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చేవాడు. మొదట ఇంగ్లిష్ టెక్ యూట్యూబర్ల వీడియోలు చూస్తూ పట్టు సాధించాడు. 2011లో శ్రీతెలుగు టెక్ ట్యూట్శ్రీ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. మొదట్లో స్మార్ట్ఫోన్ కెమెరాతోనే వీడియోలు తీయడం ప్రారంభించాడు. హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు లేకపోయినా, స్నేహితులు కొందరు ఇదెవరు చూస్తారని ఎగతాలి చేశారు. పట్టుదల, క్రమశిక్షణ హఫీజ్ క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూ వచ్చారు. మొబైల్ రివ్యూలు, కొత్త యాప్స్ పరిచయం, ఆన్లైన్ సంపాదన మార్గాలు, సెక్యూరిటీ ట్రిక్స్ తదితర విషయాలను వీక్షకులకు వివరించాడు. తెలుగులో లక్ష మంది సబ్స్క్రైబర్స్, వన్ మిలియన్ వ్యూస్ సాధించిన టెక్ చానల్గా రికార్డుకెక్కింది. 2018లో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు, 2019లో టాప్ తెలుగు క్రియేటర్స్ జాబితాలో చోటు దక్కింది. 2022లో ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ లిస్ట్లో చోటు సాధించగా, బెస్ట్ తెలుగు టెక్క్రియేటర్ అవార్డు వరించింది. యూట్యూబ్ కాకుండా బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, యాప్ ప్రమోషన్స్ ద్వారా ప్రతినెలా రూ.2 లక్షల నుంచి 3లక్షల ఆదాయం వస్తోంది. హఫీజ్ కృషిని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందించింది. పదేళ్ల పాటు యూఏఈలో కుటుంబ సభ్యులతో సహా జీవించే అవకాశం ఉంటుంది. టెక్, యూట్యూబ్, ఆన్లైన్ క్రియేటివ్ ఫీల్డ్లో ముందుకు రావాలనుకునే యువతకు గైడెన్స్ ఇవ్వాలని ఉంది. యువతకు ఉచిత వర్క్షాప్లు, ఆన్లైన్ గైడెన్స్ ప్రోగ్రామ్లు, స్మార్ట్ డిజిటల్ కెరీర్ మార్గాలు చూపించాలనుకుంటున్న. – సయ్యద్ హఫీజ్, తెలుగు టెక్ట్యూట్ క్రియేటర్ -
తల్లి మందలించిందని బాలిక ఆత్మహత్య
సారంగాపూర్: తల్లి మందలించిందని బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాడ మధుమిత (15) స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఉంచిన రూ.వెయ్యి తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకుంది. దీంతో తల్లి జమున మందలించడంతో మనస్తాపంతో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి ఆమెను కిందికి దింపి ప్రాథమిక చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. బాలిక తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతికి గాయాలు మల్యాల: మండలంకేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు, ఎలక్ట్రిక్ స్కూటీ ఎదురెరుదుగా ఢీకొన్న సంఘటనలో స్కూటీపై ఉన్న యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల డిపో బస్సు పెగడపల్లి వైపు వెళ్తూ.. సాయిబాబా గుడి సమీపంలోకి చేరుకుంది. అదే సమయంలో తాటిపల్లికి చెందిన పంబాల శృతి ఎలక్ట్రిక్ స్కూటీపై వస్తోంది. మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో స్కూటీ బస్సు ముందు టైరుకిందకు దూసుకుపోయి శృతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు 108లో జగిత్యాల అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
రాయికల్(జగిత్యాల): అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని ధర్మాజీపేట గ్రామంలో లబ్ధిదారు మ్యాకల సరస్వతి ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో శుక్రవారం గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై ఆడబిడ్డ కట్నంగా చీర అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకం అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. నాయకులు రవీందర్రావు, కోల శ్రీనివాస్, సురేందర్నాయక్, వెంకటేశ్గౌడ్, అనుపురం శ్రీనివాస్, రాజిరెడ్డి, ప్రకాశ్, నవీన్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండిజగిత్యాల: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం ఈజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నూతనంగా నిర్మిస్తున్న అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. పీఆర్ ఈఈ లక్ష్మణ్రావు, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. -
దేశ ఐక్యతకు మార్గదర్శి వల్లభాయ్ పటేల్
జగిత్యాలక్రైం: దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్ల భాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందామని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం పటేల్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పటేల్ దూరదృష్టి, చర్యల ద్వారా దేశ ఐక్యత సాధ్యమైందన్నారు. అనంతరం రన్ ఫర్ యూనిటీని జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన 3కే రన్ న్యూ బస్ స్టాండ్, ఆర్డీవో చౌరస్తా, ఓల్డ్ బస్ స్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు కొనసాగింది. డీఎస్పీలు వెంకటరమణ, వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 3కే రన్ను ప్రారంభిస్తున్న ఎస్పీపటేల్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఎస్పీ అశోక్కుమార్, పోలీసులు -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
మేడిపల్లి(వేములవాడ): మోంథా తుపాను కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం భీమారం మండలంలోని దేశాయిపేట గ్రామంలో మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం నేలవాలిన పంటపొలాలను సందర్శించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మొలకలు వచ్చిన, రంగుమారిన ధాన్యాన్ని కొంటామని ర్తెతులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, డీఎస్వో జితేందర్రెడ్డి, తహసీల్దార్ రవికిరణ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎప్పుడు?
కుక్కలకు కు.ని. జగిత్యాల: జిల్లాలో ఎక్కడ చూసినా కుక్కలు, కోతుల బెడద విపరీతంగా ఉంది. వాటిని నియంత్రించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస చర్యలు చేపట్టడం లేదు. కుక్కలను నియంత్రించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపైకి రావాలంటేనే చిన్నారులు, విద్యార్థులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామాలతో పాటు జగిత్యా ల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి ము న్సిపాల్టీటిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. సెంటర్ ఉన్నా లేనట్లే.. జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్లో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. గతంలో కుక్కలకు కు.ని. కోసం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి హైదరాబాద్కు చెందిన ఒక ఏజెన్సీకి అప్పగించారు. వారు 2024 ఆగస్టు 9న కుక్కలను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు కార్యక్రమం చేపట్టగా బిల్లులు సకాలంలో అందకపోవడంతో వారు సుమారు 2 వేల కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు చేసినట్లు తెలిసింది. ఒక్కో కుక్కకు రూ.1,450 చొప్పున కేటాయించారు. ఇంకా దాదాపు రూ.9 లక్షలు వారికి ఇవ్వాల్సిందిగా తెలిసింది. వెంటనే బిల్లులు చెల్లించి మళ్లీ కు.ని. ఆపరేషన్లు చేయించి కుక్కల బెడద తొలగించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కోరుట్ల, మెట్పల్లిలోనూ ఈప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ సైతం కొన్ని కుక్కలకు మాత్రమే చేసి ఆపరేషన్లు చేసి వదిలేశారు. ఆపరేషన్లు చేసినట్లు గుర్తుగా వాటి చెవిని కత్తించారు. పెరుగుతున్న కుక్క దాడులు ఈ జనవరిలో నిలిచిపోయిన కుక్కల నియంత్రణ ఆపరేషన్లు మళ్లీ ఇప్పటి వరకు చేపట్టలేదు. దాదాపు 10 నెలలు కావస్తున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదు. జిల్లా కేంద్రంలోనే 5–10 వేల వరకు కుక్కలు ఉంటాయని అంచనా. ఏ వార్డులో చూసినా గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు జంకుతున్నారు. ఉదయం, రాత్రివేళ వెళ్లాలంటే వణుకే.. ఉద్యోగస్తులు, విద్యార్థులు, మహిళలు ఉదయం వారి పనుల నిమిత్తం వెళ్తుంటారు. ముఖ్యంగా బస్టాండ్లు, కళాశాలతో పాటు ప్రతి గల్లీలో కుక్కలు సంచరిస్తున్నాయి. వేకువజామున 4 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్కు వెళ్లాలంటే వణికిపోతున్నారు. బస్టాండ్తో పాటు పార్క్ సందిలో వందల సంఖ్యలో కుక్కలు ఉంటున్నాయి. అవి అరుస్తూ జనం పైకి దాడులకు తెగబడుతున్నాయి. భయాందోళనతో పరుగెత్తాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని కొన్ని వార్డుల్లో ఎమర్జెన్సీ సైతం ఏర్పాటు చేశారు. కరిస్తే ఇబ్బందులే.. కుక్కలను చూస్తేనే భయంకరంగా ఉంటున్నాయి. సొల్లు కారుస్తూ ఒకరకమైన చర్మవ్యాధులతో కన్పిస్తున్నాయి. అలాంటివి కరి స్తే రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాటు వేసిన కొద్ది రోజులకే తలనొప్పి, కండరాలు బిగుసుకు పోయి అలసటకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందకపోతే మనుషులు చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల నియంత్రణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మళ్లీ ప్రారంభిస్తాం ప్రస్తుతం కుక్కలకు కు.ని.నిలిచిపోయినప్పటికీ వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. టవర్సర్కిల్, కొత్తబస్టాండ్తో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ఉన్నట్లు తెలిసింది. ఏజెన్సీ వారితో మాట్లాడి ఆపరేషన్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – చరణ్, ఏఈ, జగిత్యాల -
ఇంటర్ లింకింగ్తో సమస్యకు చెక్
జగిత్యాలఅగ్రికల్చర్: వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్ స్టేషన్లలో యుద్ధప్రతిపాదికన ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో జిల్లా ముందంజలో ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 33/11 కేవీ సబ్స్టేషన్లలో 46.. 33 కేవీ లైన్లలో 23.. అలాగే 11 కేవీ లైన్లలో 117 ఇంటర్ లింకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇంటర్ లింకింగ్ వ్యవస్థ అంటే.. ఇంటర్ లింకింగ్ వ్యవస్థలో ఒక సబ్స్టేషన్ నుంచి మరో సబ్స్టేషన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏదైనా కారణంతో ఇప్పటి వరకు ఉన్న లైను పనిచేయకుంటే ప్రత్యామ్నాయంగా కొత్తగా వేసిన లైను ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. ఇంటర్ లింకింగ్ వ్యవస్థ లేనప్పుడు విద్యుత్ లైన్లలో ఏదైనా సమస్య వస్తే అది పరిష్కరించే వరకు ఆ లైన్లో ఉన్న ప్రాంతాలకు సరఫరా నిలిచిపోయేది. ఇప్పుడు ఇంటర్ లింకింగ్తో ఒకట్రెండు నిమిషాల్లోనే అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తారు. దీంతో దెబ్బతిన్న లైన్ల పనులు సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంది. ఇంటర్ లింకింగ్ వ్యవస్థ ప్రకారం..ఒక 33/11 కేవీ సబ్స్టేషన్ నుంచి మరో 33/11 కేవీ సబ్స్టేషన్కు, 33/11 కేవీ సబ్స్టేషన్ నుంచి మరో 132/33 కేవీ స్టేషన్, 33కేవీ లైన్ నుంచి మరో 33 కేవీ లైన్కు ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుంది. 19,004.66 కి.మీ విద్యుత్ లైన్లు జిల్లాలో 19,004.66 కి.మీ మేర విద్యుత్ లైన్లు ఉన్నాయి. ఇందులో, 33 కేవీ లైన్లు 672.08 ఉండగా, 11 కేవీ 5,115.51, ఎల్టీ లైన్లు 13,217.07 కి.మీ మేర ఉన్నాయి. అలాగే 220/132 కేవీ సబ్స్టేషన్ ఒక్కటి, 132/33 కేవీ సబ్స్టేషన్లు 8 ఉండగా, 33/11 కేవీ సబ్స్టేషన్లు 110, నిర్మాణ దశలో మరో 6 ఉన్నాయి. ఈ సబ్స్టేషన్ల పరిధిలో 21,979 ట్రా న్స్ఫార్మర్లు ఉన్నాయి. ఇందులో 11 కేవీ ఫీడర్లు 503 ఉండగా, 24 గంటల విద్యుత్ సరఫరా ఉండే వ్యవసాయ ఫీడర్లు 362 ఉన్నాయి. ఈ వ్యవస్థలో ఎక్కడ సమస్య వచ్చినా సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఇంటర్ లింకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు ఇ బ్బందులు రావద్దనే ఉద్దేశంతో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మ రమ్మతు పనులు చేసేటప్పుడు విద్యుత్ నిలిపివేసేవాళ్లం. ఇప్పుడు ఇంటర్ లింకింగ్ వ్యవస్థతో సరఫరా నిలిచిపోవడం ఉండదు. ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీని విద్యుత్ వ్యవస్థకు అనుసంధానిస్తున్నాం. – బి.సుదర్శనం, ఎస్ఈ ఇబ్బందులు రావద్దని.. -
ఇందిరాగాంధీ జీవితం ఆదర్శం
జగిత్యాలటౌన్: దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ ఆదర్శనీయమని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు ఇందిరాభవన్లో ఇందిర చిత్రపటానికి నివాళి అర్పించారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ, దేశ సర్వతోముఖాభివృద్ధికి బ్యాంకులను జాతీయం చేసి పేదరిక నిర్మూలనకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పేదల కోసం గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇళ్లు కట్టించి గూడు కల్పించారని కొనియాడారు. మున్సిపల్ మాజీ చైర్మన్ తాటిపర్తి విజయలక్ష్మి, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు కళ్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, కోండ్ర జగన్, రఘువీర్గౌడ్, గుండ మధు తదితరులు పాల్గొన్నారు. -
పశువైద్య శిబిరాలతో రైతులకు మేలు
మెట్పల్లిరూరల్(కోరుట్ల): పశువైద్య శిబిరాలు పాడిరైతులకు ఎంతో ఉపయోగపడుతాయని పశు వైద్య, సంవర్ధకశాఖ జిల్లా అధికారి ప్రకాశ్ అన్నా రు. శుక్రవారం మెట్పల్లి మండలం వేంపేటలో పశువైద్య సంవర్ధకశాఖ, కోరుట్ల పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరంతో పాటు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవులు, గేదెలు, దూడలకు టీకాలు వేశారు. అనారోగ్యంతో ఉన్న పశువులను పరిశీలించి నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ ఐక్యత దినో త్సవంలో భాగంగా వెటర్నరీ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు ర్యాలీగా వెళ్లారు. కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్, మెట్పల్లి మండల పశువైద్యాధికారి మనీషాపటేల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ స్రవంతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు గోపాలకృష్ణ, విశాల్, సురేశ్, మల్లేశ్, రవికాంత్, నాయకులు అల్లూరి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
మల్యాల/కొడిమ్యాల: మల్యాల మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో, పాక్స్ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్ బీఎస్ లత సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. తేమశాతం రాగానే ధాన్యం తూకం వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే కొడిమ్యాల మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. ఎంతమంది రైతులు ధాన్యం తీసుకువచ్చారు తదితర వివరాలు తెలుసుకున్నారు. తహసీల్దార్ వసంత, ఫుడ్ ఇన్స్పెక్టర్ నరసింహస్వామి, ఆర్ఐలు తిరుపతి, రాజారాం తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి 80,042 క్యూసెక్కుల ఇన్ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 70,588 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 80,042 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, ఆ మేరకు ప్రాజెక్టు నుంచి వివిధ మార్గాల ద్వారా బయటకు విడుదల చే స్తున్నారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్కు 650, భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలిజగిత్యాలటౌన్: ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం, పని భద్రత కల్పించాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధ) జిల్లా ఇన్చార్జి వెన్న మహేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోజూ రెండుకూరలు వండి పెట్టాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదన్నారు. మెస్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన భోజనం ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం డీఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. సంఘం ప్రతినిధులు మునుగూరి హన్మంతు, వెల్మలపల్లి వెంకటాచారి, పద్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. -
నాడు తల్లి.. నేడు కూతురు
జగిత్యాలక్రైం: నాడు భర్త, అత్త, కుటుంబ సభ్యుల వేధింపులతో తల్లి ఇంట్లో దూలానికి ఉరేసుకోగా, నేడు కూతురు సైతం అదే దూలానికి ఉరేసుకుని ప్రాణాలు వదిలిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిని 16 ఏళ్ల క్రితం ఎండపల్లి మండలం కొండాపూర్కు చెందిన వెనంక రవికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి సహస్ర (16), మణికార్తీక్ సంతానం. ఈనేపథ్యంలో భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు జ్యోతిని వేధింపులకు గురిచేయడంతో 2017లో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రవి, సవిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈక్రమంలో సహస్త్ర ఎండపల్లి మండలం కుమ్మరిపల్లి కసూ్తరిబాగాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నెల క్రితం ఆమెకు ముక్కు ఆపరేషన్ జరిగింది. వసతి గృహంలో ముక్కు నొప్పి ఎక్కువ కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గతంలో తల్లి ఆత్మహత్య చేసుకున్న దూలానికే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మృతురాలి అమ్మమ్మ పొరండ్ల సుగుణ తన మనుమరాలి మృతిపై అనుమానాలున్నాయని, తండ్రి రవి, సవతి తల్లి సవిత, వెన్నంకి లక్ష్మి, వెన్నంకి శ్రీనివాస్లు కారణమని ఫిర్యాదు చేసింది. వేధింపులు భరించలేకనే కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతుందని, కుటుంబసభ్యులు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, తల్లీకూతుళ్లు ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహస్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రి మార్చురీ గదిలో ఉంచగా, స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు
● స్థానిక ఇందిరాప్రియదర్శినీ కాలనీలో ఎక్కువగా కూలీ పని చేసుకునే కుటుంబాలు ఉంటాయి. ● వాటిని దృష్టిలో పెట్టుకుని రెండు దశాబ్దాల క్రితం పాఠశాలను ఏర్పాటు చేశారు. ● ప్రారంభంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 175కి పైగా ఉండేది. ● తర్వాత సంఖ్య తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కేవలం 32 మంది మాత్రమే ఉండడం గమనార్హం. ● సమీపంలో ఏళ్ల క్రితమే మరో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కావడంతోపాటు.. ఈ పాఠశాలలో నెలకొన్న సమస్యలు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ● ప్రహరీ లేక పొంచి ఉన్న ప్రమాదం ● పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడంతోనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ● ముఖ్యంగా పాఠశాల పక్కనే చెరువు, పంట పొలాలు ఉండడంతో అందులోనుంచి విష సర్పాలు పరిసరాల్లోకి వస్తున్నాయి. దీనివల్ల పాఠశాలకు పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ● ఈ కారణంగా కొందరు తమ పిల్లలను పాఠశాల నుంచి తీసి మరో పాఠశాలలో చేర్పించినట్లు తెలిసింది. ● రాత్రిపూట మందుబాబులు పాఠశాలకు వచ్చి అక్కడి వరండాల్లో కూర్చుని మద్యం సేవిస్తున్నారు. అక్కడే సీసాలను పగులగొట్టడం, మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తుండడం ఇబ్బందిగా మారింది. ● మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకులంలో కొన్ని నెలల క్రితం ఒక విద్యార్థి మృతి చెందడంతోపాటు పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీటికి పాము కాట్లు కారణమనే ప్రచారం జరిగింది. ● ప్రస్తుతం ఇందిరా ప్రియదర్శినీ కాలనీ పాఠశాలలో పాముల భయం నెలకొంది. అయినా ఉన్నతాధికారులు పాఠశాలను సందర్శించి తగు చర్యలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. ● ఏదైనా ప్రమాదం జరిగితేనే అధికార యంత్రాంగంలో చలనం వస్తోందే తప్ప.. అప్పటి వరకు సమస్యలు తమ దృష్టికి వచ్చినప్పటికీ పట్టించుకోరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● ప్రహరీ నిర్మాణం కోసం అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఇప్పటికే స్థానిక విద్యా శాఖ సిబ్బంది పలుమార్లు ప్రతిపాదనలు పంపారు. అవి బుట్టదాఖలవుతున్నాయనే కానీ..సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. ఆవరణలో సంచరిస్తున్న పాము -
దివ్యాంగులకు దిక్కేది?
● ఈమె ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన యువతి ఉమలత. ఈమె తల్లి లక్ష్మి(54) ఐదేళ్ల క్రితం పత్తిచేనులో పనిచేస్తూ కిందపడిపోవడంతో నడుం విరిగింది. ఆర్థిక పరిస్థితులతో ఖరీదైన వైద్యం చేయించకపోవడంతో మంచానికే పరిమితమైంది. దివ్యాంగుల కోటాలో ఆసరా పింఛన్ కోసం ఐదేళ్ల క్రితం సిరిసిల్లకు రాగా.. 31శాతమే అంగవైకల్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పెన్షన్కు అర్హత సాధించలేదు. కూలీ పనులు చేసుకునే లక్ష్మి మంచానికే పరిమితమవడంతో ఆమె భర్త మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో లక్ష్మి భారాన్ని ఆమె కూతురు ఉమలతపై పడింది. కూలీ పనులకు వెళ్తూ పీజీ పూర్తి చేసిన ఉమలత.. తల్లికి పెన్షన్ వస్తే ఆసరాగా ఉంటుందని భావించి దరం శిబిరం కోసం స్లాట్ బుక్చేసినా నాలుగేళ్లుగా రిజెక్టు అవుతూ వస్తోంది. మరోసారి సదరంలో అవకాశం కల్పించి, తన తల్లికి దివ్యాంగుల సర్టిఫికెట్ ఇవ్వాలని వేడుకుంటుంది.ముస్తాబాద్(సిరిసిల్ల): దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. ఇందుకు సదరం సర్టిఫికెట్ అవసరం. అయితే జిల్లాలోని చాలా మందికి సదరం సర్టిఫికెట్ రావడం లేదు. ఏళ్ల క్రితం సదరం శిబిరానికి హాజరై కొన్ని కారణాలతో దరఖాస్తు రిజెక్టు అయిన వారు జిల్లాలో వందలాది మంది ఉన్నారు. వీరు తర్వాత ఎన్నిసార్లు సదరం శిబిరానికి దరఖాస్తు చేసుకున్నా రిజెక్టు అవుతోంది. ఫలితంగా దివ్యాంగ సర్టిఫికెట్ లేక ప్రభుత్వం అందించే పెన్షన్ డబ్బులకు దూరమవుతున్నారు. ఇలాంటి బాధితులు జిల్లాలో వందలాది మంది ఉన్నారు. అంగవైకల్యం నిర్ధారణ ఇలా.. జిల్లాలో చెవిటి, మూగ, అంధత్వం, కాళ్లు, చేతులు, మానసిక దివ్యాంగులు ఉన్నారు. సదరం శిబిరంలో అర్హత సాధించి సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ప్రతీ నెల రూ.4వేల పెన్షన్ అందిస్తోంది. ఆర్టీసీ, రైల్వే వంటి వాటిలో రాయితీ లభిస్తోంది. ప్రభుత్వ విద్య, ఉపాధి, ఉద్యోగాలలో రిజర్వేషన్ కోటా అములులో ఉంది. సదరం సర్టిఫికెట్కు చాలా మంది స్లాట్ బుక్చేసుకోగానే వారికి ఒక తేదీ నిర్ధారించి జిల్లా ఆస్పత్రిలో సంబంధిత వైద్యులతో పరీక్షలు చేసి, వైకల్యాన్ని నిర్ధారిస్తారు. వైకల్యం తక్కువ ఉన్న వారివి తిరస్కరణకు గురవుతాయి. కొన్ని సాంకేతిక కారణాలతో రిజెక్టు అయిన వారు తిరిగి అర్హత సాధించేందుకు సదరం శిబిరానికి స్లాట్ బుక్ చేసుకోవాలి. కానీ ఇలా స్లాట్ బుకింగ్కు వీరు అనర్హులు అవుతున్నారు. వీరి దరఖాస్తులు ఆన్లైన్లో రిజెక్టు అవుతున్నాయి. ప్రభుత్వం ఒకసారి రిజెక్టు చేసిన వారికి ఐదేళ్లు లేదా మూడేళ్ల తర్వాత మరోసారి సదరం శిబిరానికి అవకాశం కల్పించాలని దివ్యాంగులు కోరుతున్నారు. అప్పీల్ అవకాశం కల్పించేనా.. తిరస్కరణకు గురైన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ సాధించేందుకు అప్పీల్కు వెళ్లవచ్చు. ఆయా విభాగాలలో వైద్యులు తిరస్కరించిన పక్షంలో దివ్యాంగులు సదరం కమిషనర్కు అప్పీల్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉండే అధికారుల వద్ద లేదా జిల్లా కేంద్రంలోని డీఆర్డీవో కార్యాలయంలో మరోసారి అప్పీలు చేయవచ్చు. కానీ చాలా మంది దివ్యాంగులు డీఆర్డీవో చుట్టూ తిరిగి అర్హత సాధించలేకపోతున్నారు. ఇక హైదరాబాద్ వరకు వెళ్లి అప్పీల్ చేసుకునే ఆర్థిక పరిస్థిలు లేక పోవడం లేదు. జిల్లా ఆస్పత్రిలోనే అవకాశం కల్పించాలని దివ్యాంగులు కోరుతున్నారు.● దీనంగా కూర్చున్న యువకుడు ఎక్కల్దేవి రవి. కోనరావుపేట మండలం బావుసాయిపేట. పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. ఐదేళ్ల క్రితం సిరిసిల్లలో సదరం శిబిరానికి హాజరయ్యాడు. పరీక్షల్లో రవి మానసిక వికలాంగుడిగా విఫలం కావడంతో దరఖాస్తును అధికారులు రిజెక్టు చేశారు. దీంతో కూలీ పనులు చేసే తల్లిదండ్రులు దేవవ్వ, పుట్టయ్యలు రవికి పెన్షన్ ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రవి పేరుతో సదరం శిబిరానికి స్లాట్ బుక్ చేస్తే తిరస్కరణకు గురవుతోంది. -
రాజన్న సేవలో బాంబే హైకోర్టు జడ్జి
వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి వారిని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందేశ్ ఎస్.దేశ్పాండే కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి వస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. బహ్రెయిన్లోనే శ్రీపాద నరేశ్ అంత్యక్రియలు..?మెట్పల్లి: ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ దేశానికి వెళ్లిన పట్టణంలోని రాంనగర్కు చెందిన శ్రీపాద నరేశ్(39) మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించడానికి అతని కుటుంబ సభ్యుల సమ్మతిని భారత ఎంబసీ కోరింది. 2020 మే 28న అక్కడి ఆసుపత్రిలో నరేష్ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించాడు. అప్పటి నుంచి అక్కడి మార్చురీలోనే అతని మృతదేహాన్ని భద్రపర్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు మృతదేహాన్ని అక్కడి నుంచి రప్పించి తమకు అప్పగించాలని 21న హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. రాష్ట్ర అధికారులు అక్కడ భారత ఎంబసీని ఆరా తీయగా.. చనిపోయి చాలాకాలం అయినందున మృతదేహం తరలించడానికి అనుకూలంగా లేదని, ఈ క్రమంలో ఇక్కడే అంత్యక్రియలు జరిపేలా కుటుంబ సభ్యులు తమ సమ్మతిని తెలియజేయాలని కోరారు. దీనికి సానుకూలంగా ఉన్న వారు అంత్యక్రియలకు నరేశ్ సోదరుడు ఆనంద్ను పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ప్రభుత్వం, ప్రవాసీ సంఘాల సాయం కోరుతున్నాడు. ఏఎల్పీలో కార్మికుడికి అస్వస్థత రామగిరి(మంథని): ఏపీఏ గనిలో గురువారం పీ షిప్ట్లో సింగరేణి కార్మికుడు తోట రవి అస్వస్థతకు గురయ్యాడు. విధుల్లో భాగంగా 86 లెవల్ వద్ద అస్వస్థతకు గురి కాగా గమనించిన తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. అనంతరం సెంటినరికాలనీ డీస్పెన్సరీకి తీసుకెళ్లగా, మెరుగైన చికిత్స కోసం గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గనిలో రక్షణ చర్యలు మెరుగుపరచాలని కార్మికులు కోరుతున్నారు. మానేరు వాగులో వ్యక్తి అదృశ్యం తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన చల్లంగుల కృష్ణయ్య(60) అనే వ్యక్తి గురువారం మానేరువాగులో దూకి అదృశ్యమయ్యాడు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు. కృష్ణ కూలి పనులు చేసుకునేవాడు. ఇటీవల కంటికి ఆపరేషన్ జరిగింది. ఆరోగ్యం సరిగా లేకపోగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈక్రమంలోనే గురువారం ఉదయం ఆస్పత్రికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చిన కృష్ణయ్య సాయంత్రం మానేరువాగులో దూకాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గాలింపు చేపట్టగా ఆచూకీ లభించలేదు. కృష్ణయ్య కొడుకు లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపడతాం కృష్ణయ్య అదృశ్యంపై గాలింపు చర్యలు చేపట్టగా చీకటి పడినా ఆచూకీ లభించలేదని తహసీల్దార్ జయంత్ ప్రకటనలో తెలిపారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశామని, శుక్రవారం తెల్లవారుజాము నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు. -
డీసీసీ.. ఢీ అంటే ఢీ!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరీంనగర్తోపాటు, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. డీసీసీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులు ఈనెల 13 నుంచి 18 వరకు ఆరు రోజులపాటు 33 జిల్లాల్లో పర్యటించిన మాట తెలిసిందే. వివిధ కులాలు, పార్టీ కార్యకర్తలు, డీసీసీ ఆశావహులు మీడియా తదితరులతో చర్చించిన ఏఐసీసీ పరిశీలకులు తుది జాబితాను కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు రూపొందించిన జిల్లా, మండల కమిటీలను డీసీసీలు ఇప్పటికే టీపీసీసీ ఆమోదానికి పంపాయి. వాటిని కూడా త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం. తెరపైకి కరీంనగర్ అర్బన్ డీసీసీ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డీసీసీలకు అభ్యర్థులను రూపొందించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జిల్లాలకు ఒక డీసీసీ అధ్యక్షులుంటారు. జనాభాఅధికంగా ఉన్న వరంగల్తోపాటు, కరీంనగర్లో కాంగ్రెస్ అధిష్టానం అర్బన్ డీసీసీలను తెరపైకి తీసుకురానుంది. కరీంనగర్లోనూ డీసీసీని అర్బన్, రూరల్ రెండు డీసీసీలుగా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని తెలిసింది. కరీంనగర్ నియోజకవర్గానికి ప్రత్యేక డీసీసీ ఏర్పాటు కానుందని సమాచారం. దీనికి ఐదు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ కార్పొరేషన్, కొత్తపల్లి, కరీంనగర్రూరల్మండలాలు కలిపి అర్బన్ డీసీసీగా అవతరించనుంది. అర్బన్ డీసీసీ అధ్యక్షుడిగా రేసులో వెలిచాల రాజేందర్రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఉన్నారు. వీరితోపాటు అంజన్కుమార్, పద్మాకర్రెడ్డి కూడా గట్టిపోటీ ఇస్తున్నారు. ఇందులో రాజేందర్రావు వైపు అధిష్టానం మొగ్గుచూపుతోందని సమాచారం. ఇక రూరల్ డీసీసీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని జగిత్యాలలోనూ డీసీసీ కోసం గట్టి కసరత్తే నడుస్తోంది. గాజంగి నందయ్య, బండా శంకరయ్య, జువ్వాడి నర్సింగరావు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్, సుజిత్రావు మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. సిరిసిల్ల జిల్లాలో కేకే మహేందర్రెడ్డితోపాటు సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్యలు, చక్రధర్రెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిలో కేకే మహేందర్రెడ్డి పేరు దాదాపుగా ఖరారు అయినట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా డీసీసీకి ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కరీంనగర్లో తెరపైకి అర్బన్ డీసీసీ ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఢిల్లీకి నివేదిక అందజేసిన ఏఐసీసీ పరిశీలకులు త్వరలో ఖరారు కానున్న జిల్లా అధ్యక్షులు -
వైద్య ఖర్చులకు రూ.1.61లక్షలు సాయం
ధర్మపురి: ఒక వైపు పేదరికం.. మరోవైపు వైద్య ఖర్చులకు ఇబ్బంది. ఇలాంటి తరుణంలో ఆ కుటుంబానికి తామున్నామని ముందుకొచ్చారు ఫేస్బుక్ మిత్రులు. బాధిత కుటుంబానికి రూ.1.61 లక్షలు సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన అల్లాడి ప్రభాకర్, అనురాధ దంపతుల కుమారుడు (3) కొద్ది నెలలుగా బోన్మ్యారో వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యులకు చూపించగా సర్జరీ కోసం సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ప్రభాకర్ చిరుద్యోగి. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని భారంగా నెట్టుకొస్తున్నాడు. తనకున్న స్థలాన్ని అమ్మితే రూ.10లక్షలు సమకూరుతాయి. మరో రూ.10 లక్షల కోసం దాతలను సాయం కోరుతున్నాడు. బాలుడి సమస్యను తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ స్పందించి ఈనెల 4న ఫేస్బుక్లో పోస్టు చేసి సాయం కోరాడు. ఎన్నారైలు, వివిధ ప్రాంతాల దాతలు ఆ పోస్టుకు స్పందించి బాలుడి తల్లి అనురాధ బ్యాంకు ఖాతాకు రూ.1.61 లక్షలు విరాళాలుగా పంపించారు. వాటిలో వైద్య పరీక్షల కోసం రూ.40వేలను జగిత్యాల సీఐ కరుణాకర్, ఎస్సై రవికిరణ్ చేతులమీదుగా పంపిణీ చేయించారు. మిగిలిన విరాళాలను తదుపరి వైద్యం కోసం బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచారు. సర్జరీకి లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుండగా.. ప్రభుత్వం సాయం అందించాలని రమేశ్తోపాటు బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఫేస్బుక్ మిత్రుల ఔదార్యం -
ప్రమాదం మధ్య.. ప్రభుత్వ పాఠశాల
మెట్పల్లి: ‘ఓ పక్కన చెరువు, మరో పక్కన పంట పొలాలు.. మధ్యలో పాఠశాల.. దాని చుట్టూ ప్రహరీ లేకపోవడంతో పాములు తరుచూగా పరిసరాల్లోకి వస్తున్నాయి. రాత్రిపూట మందుబాబులు వరండాల్లో కూర్చోని దర్జాగా మద్యం సేవిస్తున్నారు. ఇది.. మెట్పల్లి పట్టణంలోని ఇందిరాప్రియదర్శినీ కాలనీ శివారులో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల దుస్థితి. కొన్నేళ్లుగా పాఠశాలను ఈ సమస్యలు వెంటాడుతున్నప్పటికీ వాటిని పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులు గానీ, ఉన్నతాధికారులు గానీ చొరవ తీసుకోవడం లేదు. తద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● పక్కనే పెద్ద చెరువు.. పంట పొలాలు ● ప్రహరీ లేకపోవడంతో ఆవరణలోకి పాములు ● భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు -
‘అమృత్’ మరింత ఆలస్యం
రాయికల్: రాయికల్ పట్టణానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ 2.0 పథకం రాయికల్ బల్దియా ప్రజలకు కలగానే మిగలిపోయే అవకాశం కనిపిస్తోంది. పట్టణంలోని 12 వార్డుల్లో 20 వేల జనాభా ఉంది. వీరికి స్వచ్ఛమైన నీరు అందించేందుకు నిధులు మంజూరై రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ స్థలం లేకపోవడంతో అడుగుముందుకు కదలడం లేదు. పథకానికి 20 గుంటల స్థలం అవసరం ఉండగా.. ఇచ్చేందుకు రైతులెవరూ ముందుకు రావడంలేదు. దీంతో పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రూ.15 కోట్లు విడుదల పట్టణానికి రూ.15 కోట్లు మంజూరైనా.. ప్రభుత్వం టెండర్ పూర్తి చేసినా.. 20 గుంటల భూ మి దొరకడం లేదు. ఇటీవల రెవెన్యూ, మున్సి పల్ అధికారులు స్పందించి కుర్మ మల్లారెడ్డి, నారాయణరెడ్డి, ప్రేమ్రెడ్డికి చెందిన 20 గుంట లు గుర్తించి కొనుగోలు చేసేందుకు ల్యాండ్ ఆ క్వేషన్ అధికారులకు నివేదిక అందించారు. రెండు రోజుల క్రితం జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ సంబంధిత రైతుల భూములను పరిశీ లించేందుకు వెళ్లగా.. తమకు భూమి ఇవ్వడం ఇష్టం లేదని అనడంతో పథకం మళ్లీ మొదటికి వచ్చింది. భూమి ఇస్తే పట్టణ ప్రజలకు అమృత్ 2.0 పథకం ద్వారా తాగునీరు అందించే అవకాశం ఉందని, రైతులకు న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చినా ఎవరూ సుముఖత చూ పడం లేదు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎంపీ ధర్మపురి అర్వింద్లు స్పందించి పట్టణానికి స్వచ్ఛమైన నీరు అందించే దిశగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం రాయికల్ పట్టణంలో అమృత్ 2.0 పథకానికి 20 గుంటల స్థలాన్ని గు ర్తించాం. రైతులు ఇవ్వడానికి ప్రస్తుతం విముఖత చూపడంతో ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
జగిత్యాల
28.0/19.07గరిష్టం/కనిష్టంగోదావరికి మహాహారతిధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా గురువారం సాయంత్రం గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోదావరికి మేళతాళాలతో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. కొండగట్టులో దీపారాధనమల్యాల: కార్తీక మాసం సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయంలో దీపారాధన నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఓం ఆకారంలో దీపాలు వెలిగించారు.శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
‘పది’ ఫలితాల్లో ఫస్ట్ రావాలి
మల్లాపూర్ : పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటిస్థానం నిలిపేలా విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈవో రాము అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూరిబా విద్యాలయాలను గురువారం సందర్శించారు. విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సులభంగా ఆకళింపు చేసుకునేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. కిచెన్గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎంఈవో కేతిరి దామోదర్రెడ్డి, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ చంద్రమోహన్రెడ్డి, భూమేశ్, రాజేందర్, శ్రీలత, ఆధ్యాపకులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు. -
‘మోంథా’తో 19,128 ఎకరాల్లో పంట నష్టం
జగిత్యాలఅగ్రికల్చర్: మోంథా తుపాన్ ప్రభా వంతో జిల్లాలో 17,748 రైతులకు చెందిన 19,128 ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు డీఏవో భాస్కర్ తెలిపారు. జిల్లాలోని 230 గ్రామాల్లో 17,982 ఎకరాల్లో వరి, 1146 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లిందని, కథలాపూర్లో 2,934 ఎకరాలు, కోరుట్లలో 2201, ఇబ్రహీంపట్నంలో 1326, ఎండపల్లిలో 1619, మెట్పల్లిలో 1570, మల్లాపూర్లో 1046, రాయికల్లో 1122, పెగడపల్లిలో 1960 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండిజగిత్యాలరూరల్: అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకోవాలని, వర్షాలు ముగియగానే తేమశాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆరబెట్టని ధాన్యం కేంద్రాలకు తెస్తే ఇతర రైతులకు ఇబ్బంది అవుతుందన్నారు. తహసీల్దార్ వరందన్, ఆర్ఐ భూమయ్య పాల్గొన్నారు. రాయికల్లో.. రాయికల్: మండలంలోని అల్లీపూర్, సింగారావుపేటలోని కొనుగోలు కేంద్రాలను లత పరిశీలించారు. రైతులకు ఇబ్బంది రానీయొద్దని అధికారులకు సూచించారు. ఎస్సారెస్పీ 26 గేట్లు ఓపెన్జగిత్యాలఅగ్రికల్చర్: ఎస్సారెస్పీకి భారీగా వరద నీరు వస్తుండటంతో 26 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.09 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. అలాగే ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్కు 650, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలంజగిత్యాలరూరల్: రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. రూరల్ మండలంలోని హైదర్పల్లిలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలు, తడిసిన ధాన్యాన్ని రై తులతో కలిసి గురువారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్ర భుత్వం విఫలమైందన్నారు. కలెక్టర్, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించాలని డిమాండ్ చేశారు. భూమన్న, చిన్న రాజన్న, గంగారెడ్డి పాల్గొన్నారు. -
గోదావరి మహాహారతి పోస్టర్ ఆవిష్కరణ
ధర్మపురి: ధర్మపురి వద్దగల గోదావరికి నవంబర్ 9న నిర్వహించే మహాహారతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. మహాహారతి రాష్ట్ర కో–కన్వీ నర్ రాంసుధాకర్ ఆధ్వర్యంలో గోదావరి వద్ద నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించా రు. 2012లో మహాహారతి వ్య వస్థాపక అధ్యక్షులు మురళీధర్రావు ఆధ్వర్యంలో ప్రారంభించిన కార్యక్రమాన్ని ఏటా వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తులు పె ద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. నాయకులు బద్రీనాథ్, క్యాతం వెంకటరమణ, లవన్కుమార్, బండారి లక్ష్మణ్, మంచె రాజేశ్ ఉన్నారు. -
మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్కు అనుమతి తప్పనిసరి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలటౌన్: మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్, కొత్తగా మంజూరుకు రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ(సియూ) అనుమతి తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. పర్యావరణం, ఆటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లా సర్వే నివేదికను రూపొందించామని, ప్రజాభిప్రాయం కోసం https: //jagityal .telangana.gov.inనందు పొందుపరిచామని పేర్కొన్నారు. డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికపై అభిప్రాయాలను మైనింగ్ కార్యాలయానికి 21రోజుల లోపు పంపాలని సూచించారు. పెగడపల్లిలో అత్యధిక వర్షపాతంజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల వరకు పెగడపల్లిలో 113.3 మి.మీ వర్షం కురిసింది. కోరుట్లలో 103, మెట్పల్లిలో 101, కథలాపూర్లో 99.5, మల్యాలలో 99.3, భీమారంలో 94.5, ధర్మపురిలో 55.5, బీర్పూర్లో 36, సారంగాపూర్లో 84, కోరుట్లలో 76, వెల్గటూర్లో 56, మల్లాపూర్లో 65.3, బుగ్గారంలో 66.3, జగిత్యాల రూరల్లో 63.3, రాయికల్లో 73.5, జగిత్యాల అర్బన్లో 81.8, మేడిపల్లిలో 77.3, ఎండపల్లిలో 65, ఇబ్రహీంపట్నంలో 77.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. శ్రీవేంకటేశ్వరాలయంలో తిరునక్షత్ర వేడుకలుకోరుట్ల: పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస తిరునక్షత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారికి పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకుడు బీర్నంది నర్సింహాచారి, ఆలయ చైర్మన్ యతిరాజం నర్సయ్య, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. -
హాస్టల్ పరిశీలన
జగిత్యాలటౌన్: హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ధరూర్ క్యాంపులోని ఎస్సీ బాలుర హాస్టల్ను సందర్శించారు. ఇటీవల పిడుగుపడి గాయపడిన హిమేశ్చంద్ర యశోద ఆస్పత్రిలో చికి త్స అందిస్తున్నామని, మంత్రి అడ్లూరి చొరవతో రూ.5లక్షల ఎల్ఓ సీ మంజూరు చేశామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పిడుగు పాటుకు గురైన హాస్టల్ గది, డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకును పరిశీలించారు. మరమ్మతు కోసం నిధులు మంజూరు చేస్తామన్నారు. -
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోండి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రం నడిబొడ్డున ఆక్రమణకు గురైన రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. ఇందిరాభవన్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. పెట్రోల్బంక్ యజమానిగా భావిస్తున్న మంచాల కృష్ణ హైకోర్టుకు వెళ్తే కిబాల జిరాక్స్ కాపీ వాస్తవికతను నిర్ధారించడం వీలుకాదని, నిజనిర్ధారణ జరిగి, ఆక్రమిత భూమిపై చర్యలు చేపట్టే వరకు మున్సిపల్ తీర్మానం 140ని పక్కన పెట్టాలని మాత్రమే తీర్పు చెప్పిందని, అంతమాత్రాన కోర్టు యాజమాన్య హక్కులు కల్పించినట్టు కాదని పేర్కొన్నారు. ఆ స్థలానికి కృష్ణ యజమాని కాదని, మున్సిపాలిటీనే యజమాని అని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు తాత్కాలిక కేటాయింపులు చేస్తుంటాయని, అలాంటి వాటిని ప్రజావసరాల దృష్ట్యా ఎప్పుడైనా తిరిగి తీసుకునే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు కేటాయించే అధికారం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత అని, దారం వీరమల్లయ్యకు కిబాల ఆధారంగా భూమి కేటాయించినందున ఆ డాక్యుమెంట్ వాస్తవికతను నిర్ధారించేందుకు విజిలెన్స్ కమిషనర్, ఇతర సంస్థలతో విచారణ జరిపి నిజాలు వెలికితీయాలన్నారు. కిరోసిన్, డీజిల్ అవుట్లెట్ కోసం 20గుంటల భూమిని బల్దియా కేటాయించగా కేవలం 4గుంటల స్థలంలో మాత్రమే విక్రయాలు జరుపుతున్నారని, మిగతా 16గుంటల స్థలంలో ఇతర వ్యాపారాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కిబాలాను రద్దు చేసి నగరం నడిబొడ్డున ఆక్రమణకు గురైన భూమిని రక్షించాలని కోరారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, మన్సూర్, కల్లెపెల్లి దుర్గయ్య, రాంచంద్రారెడ్డి, అనిత, రఘువీర్గౌడ్ తదితరులు ఉన్నారు. -
పాడిపశువులకు టీకాలు వేయించాలి
కొడిమ్యాల: పాడి పశువులకు రైతులు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. మండలంలోని కోనాపూర్లో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని బుధవారం సందర్శించారు. పాడి రైతులతో మాట్లాడుతూ గాలికుంటు నివారణ టీకాల ద్వారా పశువులకు వ్యాధుల నుంచి రక్షణ లభించడమే కాకుండా పాల ఉత్పత్తి మెరుగవుతుందని తెలిపారు. మండల పశువైద్యాధికారి రాకేశ్, గోపతి కమలాకర్, సహాయక సిబ్బంది రాజేశం, రవీందర్ బాబు, రాజు, ఉదయ్, పాడి రైతులు పాల్గొన్నారు. -
మాస్టర్ప్లాన్కు ముందడుగు
జగిత్యాల: జగిత్యాల మాస్టర్ప్లాన్కు ఇటీవల ఆ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్లాన్ రూపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగిత్యాలకు 1983లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ తప్ప ఇప్పటివరకు మరోసారి నోచుకోలేదు. గత ప్రభుత్వంలో రూపొందించినా వివిధ కారణాలతో రద్దయ్యింది. అప్పటినుంచి అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈసారైనా ముందుకెళ్లేనా... మున్సిపాలిటీలో మాస్టర్ప్లాన్ అమలు కాకపోవడంతో రోడ్లంతా ఇరుకుగా మారాయి. జోన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికీ 1983 నాటి మాస్టర్ ప్లానే కొనసాగుతోంది. జిల్లాకేంద్రమై తొమ్మిదేళ్లు అవుతున్నా మాస్టర్ ప్లాన్కు మాత్రం ముందడుగు పడటం లేదు. గత ప్రభుత్వ హయాంలో యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కొన్ని గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం కొత్త ప్లాన్ అమలుకు గ్రీన్సిగ్నల్ కూడా ఇచ్చింది. పబ్లిక్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. రహదారుల విస్తరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, ఇండస్ట్రియల్ కారిడార్, జోన్ల గుర్తింపు, అభివృద్ధి చేయాల్సిన పనులన్నీ గుర్తించారు. అయితే రైతుల ఆందోళనతో రద్దయిపోయింది. భూములు పోతున్నాయని రైతుల ఆందోళన గతంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్లో రైతులకు చెందిన భూములను రిక్రియేషన్ జోన్లో చేర్చడంతో అప్పట్లో అది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన తీవ్రతరం చేయడంతో కౌన్సిల్ ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. దీంతో మాస్టర్ ప్లాన్ నిలిచిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు రావడం.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్లాన్ కాస్త మరుగున పడింది. తాజాగా ఎమ్మెల్యే సంజయ్కుమార్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాజాగౌడ్, డీటీసీపీ జాయింట్ డైరెక్టర్ అశ్విని, రీజినల్ ఆఫీసర్ ఏడీ జ్యోతితో మాస్టర్ ప్లాన్ను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో రిక్రియేషన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి చర్చించి చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మాస్టర్ప్లాన్ అనేది పట్టణ భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ కొనసాగుతున్న నేపథ్యంలో నూతనంగా మాస్టర్ ప్లాన్ అమలు కాకపోవడంతో ఇరుకై న రోడ్లు, వాహనాల పార్కింగ్ లేకపోవడంతో ఇండస్ట్రీయల్ కారిడార్, ఎడ్యుకేషన్ ఏరియాలు, లేఅవుట్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అభివృద్ధి చేయాల్సిన స్థలాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. జగిత్యాల.. 1985లోనే సెకండ్ గ్రేడ్మున్సిపాలిటీ హోదా పొందింది. 2009లో గ్రేడ్–1 మున్సిపల్గా అవతరించింది. జిల్లాకేంద్రమైన జగిత్యాలలో దాదాపు 50 వేల నివాసాలు ఉన్నాయి. 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. నివాసాలు రెట్టింపు కావడంతో తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద గతంలోనే మాస్టర్ప్లాన్కు ఎంపికై ంది. మారనున్న రూపురేఖలు జిల్లాకేంద్రంలో లక్షకు పైగా జనాభా ఉంది. ఇక్కడ 48 వార్డులున్నాయి. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం పట్టణంలో ప్రతి రోడ్డు చిన్నగా, ఇరుకుగా ఉన్నాయి. ప్లాన్ అమలైతే రోడ్లు వెడల్పు కావడంతో పాటు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీలు, మురికికాలువలు కొత్తరూపు సంతరించుకుంటాయి. 20 ఏళ్లకు సరిపడా ప్రణాళిక రూపొందిస్తారు. రోడ్లు ఎంత వెడల్పుగా ఉండాలి..? ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుంది..? ఎడ్యుకేషన్ జోన్, ఇండస్ట్రీయల్ జోన్, రిక్రియేషన్ జోన్ (లంగ్స్ స్పేస్) నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణాల అనుమతులు సులభంగా లభిస్తాయి. రోడ్లు పెద్దవిగా ఉంటాయి. పట్టణం చుట్టూ ఉన్న చెరువులకు హద్దులు నిర్ణయించి అక్కడ అనుమతి ఇవ్వొచ్చా..? లేదా..? అన్నది నిర్ణయిస్తారు. మాస్టర్ ప్లాన్ ఆర్డీ రూపొందించిన తర్వాత రోడ్లు వెడల్పు చేయడానికై నా.. ఇతరత్రా నిర్మాణాలు చేయడానికై నా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయవచ్చు. ప్రస్తుతం ఇష్టానుసారంగా ఇళ్ల నిర్మాణం, లేఅవుట్లు లేకుండానే పనులు కొనసాగుతున్నాయి. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి ● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: తుపాన్ నేపథ్యంలో జిల్లాలో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మోంథా తుపాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయని, అధికారులు అందుబాటులో ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలెవరూ కల్వర్టులు దాటవద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంటి నుంచి వెళ్లవద్దన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. రైతుల కోసం 18004258187 టోల్ఫ్రీ నంబరుధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికి కాల్సెంటర్ ఏర్పాటు చేశామని, రైతులు 18004258187 నంబర్కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో కాల్సెంటర్ ప్రా రంభించారు. సెంటర్ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరణ్, డీఎస్వో జితేందర్రెడ్డి, డీఎం జితేంద్రప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన నూతన ఎంపీడీవోలు జగిత్యాలరూరల్: జిల్లాకు కొత్తగా కేటాయించిన ఎంపీడీవోలు బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని అభినందించారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డిప్యూటీ సీఈవో నరేశ్, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. -
నిండా ముంచిన ‘మోంథా’
జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలరూరల్/పెగడపల్లి/సారంగాపూర్/మల్లాపూర్/రాయికల్/కథలాపూర్/ఇబ్రహీంపట్నం: అన్నదాతలను మోంథా తుపా న్ అతలాకుతలం చేసింది. బుధవారం ఉదయం చిరుజల్లులు కురిసి.. సాయంత్రం ఉన్నట్టుండి పెను బీభత్సంగా మారింది. వర్షంధాటికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తిప్పలుపడ్డారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లో పొలాలు నేలకొరిగాయి. పెగడపల్లిలోని పలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో లేక రైతులు అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చింది. సారంగాపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రాల్లోకి వరదనీరు భారీగా చేరి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. మల్లాపూర్ మండలకేంద్రంతో అన్ని గ్రామాలలో వరి, మొక్కజొన్న, చెరుకు, పసుపు పంటలు నేలవారాయి. అకాలవర్షంతో రాయికల్ మండలం కిష్టంపేట కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అల్లీపూర్ కేంద్రంలో వరదనీరు భారీగా నిలిచిపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కథలాపూర్ మండలంలో చేతికొచ్చిన పంట పొలాల్లో నీరు చేరింది. కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ఇబ్రహీంపట్నంలో కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న రైతులు నానా ఇబ్బంది పడ్డారు. ఇబ్రహీంపట్నం: మక్కలపై పరదాలు కప్పుతున్న రైతు రాయికల్: అల్లీపూర్లో ధాన్యం కుప్పల మధ్య నీరు -
ఎస్సారెస్పీ 16 గేట్లు ఓపెన్
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 59,654 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కెనాల్కు 650, లక్ష్మి కెనాల్కు 200, మిషన్ భరీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. పసుపు పంట పరిశీలనజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ శాస్త్రవేత్తలు బుధవారం రాయికల్ మండలం అల్లీపూర్, సింగరావుపేట గ్రామాల్లో పర్యటించారు. పరిశోధన స్థానం నుంచి నల్లారి లక్ష్మీజగదీశ్వర్ రైతుకు జేజీఎల్–24423 విత్తనం ఇవ్వగా.. ఆ పొలంలో రైతు దినోత్సవం నిర్వహించారు. చిన్నారెడ్డి సాగు చేస్తున్న పసుపు తోటను సందర్శించి, పలు సూచనలు చేశారు. జేజీఎల్–24423 విత్తనాన్ని ఇతర రైతులకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు స్పందన, స్వాతి, ఏఈవో సతీశ్, రైతులు పాల్గొన్నారు. డీపీవోగా రేవంత్జగిత్యాలరూరల్: జిల్లా పంచాయతీ అధికారిగా వై.రేవంత్ను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల గ్రూప్–1 లో రేవంత్ డీపీవోగా ఎంపికయ్యారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ సత్యప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్ల మూసివేత వాయిదాజగిత్యాలఅగ్రికల్చర్: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను మూసివేసేందుకు అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ అధికారులు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఏటా జూలై ఒకటిన ఎత్తి.. అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ఈ మేరకు కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం గేట్లను మూసివేసేందుకు నిర్ణయించారు. కేంద్ర జల సంఘం ప్రతినిధులు ఎంఎల్.ప్రాంక్లిన్, ఎ.సతీశ్, ఎస్సారెస్పీ అధికారులు వి.జగదీష్, కొత్త రవి, బాబ్లీ ప్రాజెక్టు ప్రతినిధి సిఆర్.బన్సద్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. అయితే బాబ్లీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఉండడంతో గేట్లను తెరిచే ఉంచారు. ప్రవాహం తగ్గిన తర్వాత గేట్లను మూసివేసేందుకు రెండు రాష్ట్రాల అధికారులు నిర్ణయించి అక్కడి నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. బకాయిలు విడుదల చేయాలిజగిత్యాల: బకాయిల భారం నుంచి విద్యార్థులను ఆదుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం భిక్షాటన చేశారు. నాలుగేళ్లుగా విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అందక ఇబ్బంది పడుతున్నారని, పేద విద్యార్థులను కళాశాల యాజమాన్యాలు ఇబ్బందికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. చదువు పూర్తయి సర్టిఫికెట్ల కోసం కళాశాలకు వెళ్తే ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయని, ప్రభుత్వం ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి అక్రమాలిక్, పట్టణ, రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు గణేశ్, రేవంత్, షాకీబ్, సోహెల్, చరణ్, మణిదీప్, ముజీబ్ పాల్గొన్నారు. -
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం వివరాలు(సెం.మీలో)
7మోంథా తుపాన్ ప్రభావంతో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. తుపాన్ ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో అత్యధికం, అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రాంతాలు.. జిల్లా అత్యధికం అత్యల్పం కరీంనగర్ హుజూరాబాద్ 24.02 చొప్పదండి 5.01 జగిత్యాల పెగడపల్లి 7.05 ఎండపల్లి 0.2 పెద్దపల్లి ఓదెల 9.08 అంతర్గాం 2.0 సిరిసిల్ల ఇల్లంతకుంట 19.09 ముస్తాబాద్ 1.0 -
ప్రాజెక్టులకు మళ్లీ జలకళ
కేతేపల్లి/నాగార్జునసాగర్/బాల్కొండ/జగిత్యాల అగ్రికల్చర్: విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులు మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రాగా, బుధవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 4.46 టీఎంసీల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్లో ప్రస్తుతం 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 1,94,845 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 20 క్రస్ట్గేట్లు, విద్యుదుత్పాదన ద్వారా 1,94,845 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కుడి, ఎడమ కాల్వ, వరద కాల్వకు, ఏఎమ్మార్పికి నీటి విడుదలను నిలిపివేశారు. సాగర్ జలాశయ గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగుల మేర నీరు ఉంది. మోంథా తుపాను ప్రభావంతో సాగర్ పరిసర ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాగర్ శివారులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని ఎత్తిపోతల వద్ద జలపాతం ఉధృతంగా పారుతోంది. ఎగువ నుంచి భారీ వరద నీరు వస్తుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. బాబ్లీ గేట్ల మూసివేత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం త్రి సభ్య కమిటీ సభ్యుల సమక్షంలో మూసివేశారు. ప్రాజెక్టు గేట్లను జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి ఏటా అక్టోబర్ 29న మూసివేస్తారు. అయితే ప్రాజెక్టుకు 14 గేట్లు ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండటంతో పది గేట్లను మాత్రమే మూసి వేసి మిగతా నాలుగు గేట్లను తెరిచి ఉంచి ఎస్సారెస్పీలోకి నీటి విడుదల చేస్తున్నారు. వరద నీటి ఆధారంగా నాలుగు గేట్ల మూసి వేత, ఓపెన్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ప్రాంక్లిన్, ఎస్సారెస్పీ ఎస్ఈ జగదీశ్, నాందేడ్ ఈఈ సీఆర్ బన్సద్, ఏఈఈ రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆయుధం వీడిన అన్నల అడుగులు ఎటువైపు?
బడిలో తండ్రి బోధించిన పాఠాల కన్నా కళాశాలలో స్నేహితుడి దగ్గర నేర్చుకున్న విప్లవ మాటలే అతడిని అడవిబాట పట్టించాయి. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని, పీడీత, బాధిత పక్షాల కోసం పోరాడాలని అనుకున్నాడు. అందుకు తుపాకీనే మార్గమని భావించారు. పోరాట పంథాతోనే సమసమాజం సాధ్యమనుకుని 45 ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. మారిన కాలమాన పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆయుధం వీడి జనంలో వచ్చారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, శంకరన్న, సోమన్న. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించుకుని చంద్రన్న అస్త్రసన్యాసం చేయడం అటు మావోయిస్టు పార్టీలో, ఇటు ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది.సాక్షి, పెద్దపల్లి: సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసిన మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా, తాజాగా తెలంగాణ డీజీపీ వద్ద కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయాడు. ప్రాణభయంతో లొంగిపోయారా? అనారోగ్య సమస్యలతోనా.. పార్టీకి నమ్మకద్రోహం చేశారా? సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతో జనజీవన స్రవంతిలో కలిశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మావోయిస్టులు తదుపరి జీవితాన్ని ఎలా గడపబోతున్నారు?పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తారా? సొంత ఊళ్లకు, తమకు నచ్చిన ప్రదేశానికో వెళ్లి సాధారణ జీవనం గడుపుతారా? పాలక పార్టీలో చేరుతారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారా అనేక ప్రశ్నలు ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నాయి.రణమా...శరణమా ?జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, పుల్లూరి ప్రసాద్రావు లొంగిపోగా అడవిలో ఉన్న మిగితా నేతలు ఆయుధం వీడి లొంగిపోతారా? లేక పోరాట పంథాలోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. జిల్లా నుంచి మల్లా రాజిరెడ్డి, అప్పాసి నారాయణ, గంగిడి సత్యనారాయణరెడ్డి, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, దీకొండ శంకరయ్య, కంకణాల రాజిరెడ్డి, జూవ్వడి వెంకటేశ్వర్రావు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 1 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. దీంతో విప్లవ పంథా కొనసాగుతుందా లేక ప్రజాపంథాలోకి మిగిలిన నేతలు వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.కలిసి చదువుకున్నాంపుల్లూరి ప్రసాదరావు నేను వడ్కాపూర్లోనే 5 వ తరగతి వరకు, 10వ తరగతి వరకు ధూళికట్టలో కలిసి చదువుకున్నం. అప్పట్లోనే గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని పోరాడేవాడు. చాలా సౌమ్యుడు. ఎక్కువగా మాట్లాడక పోయేది. ఇంటర్ చదివేందుకు పెద్దపల్లికి వెళ్లి ఆప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదు. – చెన్నమనేని సాగర్రావు, ప్రసాదరావు మిత్రుడు, వడ్కాపూర్ -
అభివృద్ధిని చూసి ఓటేయండి
జగిత్యాల: అభివృద్ధిని చూసి ఓటేయాలని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో ప్రచారం చేశారు. బ్యాంక్ అభివృద్ధికి తన తండ్రి జగపతిరావు కృషి చేశారని, జగిత్యాల ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ మద్దతుతో కార్తీక్, కూసరి అనిల్కు తమ ప్యానల్లో అవకాశం కల్పించామని, తమ ప్యానల్కు గెలిపించాలని కోరారు. -
జగిత్యాల
31.0/20.07గరిష్టం/కనిష్టంపశువులకు టీకాలు వేయించాలిజగిత్యాల: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారి ప్రకాశ్ సూచించారు. వంజరిపల్లిలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్రమాలు నిర్మూలించాలిజగిత్యాల: అక్రమాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. ఈనెల 31న వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది. బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
చేజేతులా.. పోగొట్టుకుంటున్నారు
జగిత్యాలక్రైం: సాంకేతిక రంగంలో మార్పులు వస్తున్నా.. ప్రజలు, వ్యాపారులు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం ఎత్తుకుపైఎత్తు వేస్తూ వారిని బురిడీకొట్టిస్తూ అందినకాడికి దోపిడీ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సైబర్ నేరాలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించినా.. పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా నేరగాళ్లు తమపని తాము చేసుకుంటూ వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు 658 సైబర్ నేరాలు టోల్ఫ్రీ నంబర్లు 1930, డయల్ 100 బాధితులు సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్తోపాటు 100కు డయల్ చేస్తే తక్షణమే పోలీసులు సైబర్ నేరస్తుల ఖాతాలను గుర్తించి రిజర్వ్ బ్యాంక్ సహాయంతో వారి ఖాతాలను స్తంభింపజేస్తారు. నేరగాళ్ల ఖాతాలో జమ అయిన డబ్బును రికవరీ చేసి బాధితులకు అందించే అవకాశం ఉంటుంది. సైబర్ నేరస్తులు క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు ఓటీపీ నంబర్లతోనే ఫ్రాడింగ్ చేస్తున్నారు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, లక్కీ లాటరీ గెలుచుకున్నారని, సెల్ఫోన్ నంబరుకు ఓటీపీ వచ్చిందని, ఆ నంబర్ చెప్పాలని తప్పుదారి పట్టింది ఖాతాల్లోని డబ్బును వారి ఖాతాలోకి మళ్లించుకుంటున్నారు. ఫేస్బుక్లో ప్రొఫైల్ ఫొటోను మార్చి స్నేహితులు, కస్టమర్ల నుంచి అత్యవసరంగా డబ్బు అవసరముందని రిక్వెస్ట్లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్, లింక్లు, పీఎం కిసాన్, కుటుంబ సమగ్ర సర్వే, తెలంగాణ రవాణా శాఖ న్యూ చాలన్స్ పేరుతో లింక్లు పంపిస్తున్నారు. కొంతమంది వినియోగదారులకు క్యాష్బ్యాక్ లేదా రుణాలు అందజేస్తామని యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలని మోసం చేస్తున్నారు. యాప్లతోనూ మోసం ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరిలో సెల్ఫోన్ వాడకం పెరిగిపోయింది. బ్యాంక్ ఖాతాలు, వ్యక్తిగత సమాచారం సెల్ఫోన్లోనే భద్రపర్చుకుంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ మోసగాళ్లు చాలామంది సెల్ఫోన్లకు యాప్లు పంపించి డౌన్లోడ్ చేసుకుంటే క్యాష్బ్యాక్ వస్తుందని నమ్మిస్తున్నారు. యాప్ డౌన్లోడ్ కాగానే వారి వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తున్నాయి. వెంటనే వారు మోసాలకు పాల్పడుతున్నారు. నేరాలపై విస్తృత అవగాహన సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ విస్తృత ప్రచారం చేస్తోంది. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో, పట్టణాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరిస్తున్నారు. మోసపోయిన వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1930తోపాటు డయల్ 100కు ఫిర్యాదు చేస్తే సత్వరమే డబ్బును రికవరీ చేస్తున్నారు. -
ఓ వైపు తెగుళ్లు..
మరోవైపు వర్షాలువెల్గటూర్: ఈ వానాకాలం సీజన్ రైతులకు కడగండ్లను మిగిల్చింది. యూరియా కొరత తీవ్రంగా వేధించినా ఎలాగోలా కష్టపడి పంట పండిద్దామనుకున్న రైతుల ఆశలపై అకాల వర్షాలు నీళ్లు చల్లినట్లయ్యింది. అంతుచిక్కని తెగుళ్లు సోకి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అన్ని కష్టాలను తట్టుకుని తీరా పంటపండిస్తే.. కోతలు మొదలయ్యే సమయంలో మరోసారి వర్షాలు రైతన్న పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో అన్నదాతలు మరింత ఆందోళన చెందుతున్నారు. వరికి తప్పని తెగుళ్లు బెడద వానాకాలంలో జిల్లాలో 3.15లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 8.15లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా కూడా వేశారు. అయితే అకాలవర్షాలు, వాతావరణ మార్పులతో వరిని సుడిదోమ, ఎండాకు, పాముపొడ, కంకినల్లి వంటి తెగుళ్లు ఆశించాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసలే యూరియా కొరతతో తీవ్ర ఇబ్బంది పడిన అన్నదాత.. అష్టకష్టాలు పడి పంట పండిస్తే తెగుళ్లు సోకి పెట్టుబడి రెండింతలయ్యింది. తీరా కోతలు మొదలయ్యే సమయంలో మరోసారి అకాల వర్షాలు కురుస్తుండడం.. రెండుమూడు రోజుల పాటు కోతలు వద్దని అధికారులు హెచ్చరిస్తుండడంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ‘ఫసల్ బీమా’ మార్చితేనే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గ్రామం, మండలం యూనిట్గా మాత్రమే నష్టపోయిన పంటలకు పరిహారం అందించే అవకాశం ఉంటుంది. ఈ కారణంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయలేదు. దీంతో అకాల వర్షాలు, చీడపీడలు, తెగుళ్లు ఆశించి పంట నష్టం జరిగినప్పుడు రైతులకు బీమా అందడం లేదు. ఫసల్ బీమా పథకంలో మార్పులు చేసి బీమా చేసిన వ్యక్తి యూనిట్గా పరిహారం అందించినప్పుడే లాభం చేకూరుతుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికై తే నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎలాంటి బీమా లేకపోవడంతో ఆగమవుతున్నారు. జాగ్రత్తలు అవసరం వానాకాలం పంటల్లో హఠాత్తుగా వచ్చే తెగుళ్లను తట్టుకోవాలంటే మొదటి రోజునుండే సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఫసల్ బీమా పథకంలో గ్రామం యూనిట్గా పరిహారం అందుతుంది. వ్యక్తిగతంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందదు. – భాస్కర్, డీఏవో -
● రాగివైరును ఎత్తుకెళ్తున్న దొంగలు ● ఆందోళనకు గురవుతున్న రైతులు
మల్యాల: విద్యుత్ మోటార్ల దొంగతనాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా మల్యాలలోని వివిధ గ్రామాల్లో వరుస దొంగతనాలు రైతులను కలవరపెడుతున్నాయి. రైతులు వరదకాలువ, వ్యవసాయ బావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తుండగా.. మోటార్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్తున్నారు. వరదకాలువకు రైతులు పెట్టుకున్న మోటార్లను దొంగలు ఉదయం పూట రెక్కీ నిర్వహించి.. రాత్రివేళ ఎత్తుకెళ్తున్నారు. రైతుల బెంబేలు వ్యవసాయ మోటార్లలోని కాపర్వైర్ కోసం దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో మోటార్లు చోరీకి గురవుతుండడంతో పొలానికి సకాలంలో నీరందడం లేదని, పైగా కొత్త మోటార్లు తెచ్చుకోవాలంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన రైతు పోతరాజు బక్కయ్య విద్యుత్ మోటార్లను రెండుసార్లు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ రైతు పొలం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు. సుమారు నెల క్రితం రాత్రివేళ ఇద్దరు వ్యక్తులు మోటారు ఎత్తుకెళ్తున్నట్లు రికార్డయ్యింది. దాని ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు రైతు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రికార్డులు పరిశీలిస్తున్నామని చెబుతున్నారే తప్ప నిందితులను గుర్తించడం లేదని అంటున్నారు పరిసర ప్రాంత రైతులు. గతంలో ట్రాన్స్ఫార్మర్లోని కాపర్వైరు చోరీ.. గతంలో దొంగలు ఏకంగా ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్వైర్ను చోరీ చేసేవారు. ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి, అందులోని కాపర్ వైరు ఎత్తుకెళ్లేవారు. కానీ.. కొద్దిరోజులుగా రైతుల మోటార్లు ఎత్తుకెళ్తున్నారు. పొలానికి నీరు పెట్టేందుకు ఉదయమే పొలాలకు వెళ్లిన రైతులకు మోటార్లు లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. రెండేళ్ల క్రితం నూకపల్లి రైతులు నిఘా పెట్టి.. వ్యవసాయ మోటార్లను చోరీ చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.వ్యవసాయ మోటార్లే టార్గెట్మోటారు ఎత్తుకెళ్లడంతో ఖాళీ పైపుసీసీ పుటేజీలో రికార్డయిన మోటారు దొంగతనం దొంగతనాలపై దృష్టి -
మున్నూరుకాపును డీసీసీ అధ్యక్షుడిని చేయండి
కథలాపూర్(వేములవాడ): జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిని మండలంలోని మున్నూరుకాపు కులానికి చెందిన చెదలు సత్యనారాయణకు ఇవ్వాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య మంగళవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. డీసీసీ అధ్యక్ష పదవులు బీసీలకు 42 శాతం ఇవ్వాలని, మున్నూరుకాపు కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. చెదలు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేస్తూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, ఉమ్మడి కరీంనగర్ డీసీసీ కార్యదర్శిగా, మండలాధ్యక్షుడిగా సేవలందించారన్నారని పేర్కొన్నారు. -
రైతులూ జాగ్రత్తగా ఉండండి
జగిత్యాల: జిల్లాపై మోంథా ముప్పు కొంత మేర ఉంటుందని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ప్రస్తుతం ఆంధ్రాలో తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉందని, జిల్లాపైనా కొంత ప్రభావం చూపనున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. మోంథా తుపాన్ నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మోంథా ముప్పు జిల్లాలో ఏమైనా ప్రభావం చూపుతుందా. రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మోంథా ముప్పు మన జిల్లాలో పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. అయినప్పటికీ రైతులు జాగ్రత్తగా ఉండాలి. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా చూసుకోవాలి. సెంటర్ల వద్ద ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? రైతులు ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా జిల్లావ్యాప్తంగా 408 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయి. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనేలా చూస్తున్నాం. రైతులు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలి. ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రానికి 40 టార్పాలిన్ల చొప్పున సమకూర్చాం. ఇప్పటివరకు ఎన్ని కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు..?సుమారు 200కు పైగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎప్పటికప్పుడు తేమశాతాన్ని పరిశీలిస్తున్నారు. నిబంధనల మేరకు తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. రైతులు రెండురోజులపాటు కోతలు వాయిదా వేసుకోవడం మంచిది. గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ ర కానికి రూ.2,369 మద్దతుగా ధరగా నిర్ణయించాం. ఎంత ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు..? సుమారు 5 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఎంత దిగుబడి వచ్చినా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే వర్షప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు జాగ్రత్త పడాలి. స్టేట్ లెవల్లో టోల్ఫ్రీ నంబరు కూడా ఉంది. మార్కెట్కు చేరిన పంట తడవకుండా అవసరమైన మేర టార్పాలిన్ కవర్లు సిద్ధం చేశాం. -
ఎస్సారెస్పీ 8 గేట్లు ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎనిమిది గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 34,654 క్యూసెక్కులు వస్తోంది. ఎస్కేప్ గేట్ల ద్వారా ఆరువేలు, సరస్వతి కెనాల్కు 650, లక్ష్మి కెనాల్కు 200, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. కాకతీయకాలువకు సాయంత్రం నీటి విడుదల నిలిపివేశారు. ఆయిల్ పాం సాగుపై అవగాహన జగిత్యాలఅగ్రికల్చర్: ఆయిల్ పాం సాగుపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పొలాస రైతువేదిక ఆవరణలో మంగళవారం అవగాహన కల్పించారు. వ్యవసాయ, ఉద్యానవన, సహకార సంఘాల సీఈవోలు హాజరయ్యారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు కొనసాగుతుందని, 90శాతం సబ్సిడీ ఉందని, వివరాలన్నీ రైతులకు వివరించాలని సూచించారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ జిల్లాకు నిర్దేశించిన 3,750 ఎకరాల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఆయిల్ పాం సాగు విధానం, దిగుబడిపై శాస్త్రవేత్త ఎండీ.ప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి స్వాతి వివరించారు. జిల్లాకు వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీలక్ష్మీ తెలిపారు. ఈనెల 29 నుంచి వచ్చేనెల రెండో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. 30, 31 తేదీల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. -
పారితోషికం ఇప్పించండి
ప్రజాపాలన దరఖాస్తులను ఎంట్రీ చేసిన పారితోషికం ఇప్పటికీ రాలేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత అధికారులను ఆదేశించి మా పారితోషికం ఇప్పించగలరు. – డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆస్తి లాక్కుని రోడ్డునపడేసిండు నా భర్త మాదారపు గంగారాం 2009లో చనిపోయాడు. నాకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. చిన్న కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు గంగాధర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నా పేరున ఉన్న ఇల్లు, ఇంటిస్థలాన్ని గంగాధర్ తన పేరున రాయించుకున్నడు. నా వద్ద ఉన్న రూ.10లక్షలను నెలకు రూ.20వేల వడ్డీ ఇస్తానని చెప్పి తీసుకున్నడు. 15తులాల బంగారం కూడా లాక్కున్నడు. ఇంకా చిన్నకూతురు శాంతకు పెళ్లి చేయాల్సి ఉంది. గంగాధర్ నుంచి ఆస్తి, డబ్బులు, బంగారం ఇప్పించి కూతురు వివాహం జరిపించేందుకు సహకరించండి. వయోవృద్ధుల పోషణ చట్టం కింద నా సంరక్షణ బాధ్యతలు నా కొడుకే చూసుకునేలా ఆదేశించండి – మాదారపు కనకమ్మ, జగిత్యాల -
మత్తుకు దూరంగా ఉండాలి
జగిత్యాల: మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, భవిష్యత్ నాశనం అవుతుందని డీఈవో రాము అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలతో ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు చదువు, వ్యక్తిత్వం నాశనం అవుతుందన్నారు. అనంతరం విద్యార్థులతో మత్తు నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఐసీడీఎస్, అంగన్వాడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మద్యంషాపుల కేటాయింపు
జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న వారిని పారదర్శకంగా లక్కీడ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో నిర్వాహకులను ఎంపిక చేశారు. డ్రా సందర్బంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. 71 మద్యం దుకాణాలకు 1966 దరఖాస్తులు వచ్చాయని, ఎస్సీ సామాజిక వర్గానికి 8, గౌడ వర్గానికి 14, ఓపెన్ కేటగిరీలో 49 దుకాణాలు కేటాయించామని పేర్కొన్నారు. షాపులు దక్కించుకున్నవారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి నిర్వహించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రైతులు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల: రానున్న రెండురోజులు తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి, పత్తి, మొక్కజొన్న కేంద్రాల వద్ద వర్షాలతో నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజులపాటు పంట కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ లత, డీఆర్డీవో రఘువరణ్ పాల్గొన్నారు. సహస్ర లింగాలయంలో కార్తీక పూజలుజగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్ర లింగాలయంలో మహాదేవునికి అభిషేకాలు, అన్నపూజ నిర్వహించారు. మహిళలు మంగళహారతులు ఇచ్చారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీవో సస్పెన్షన్ఇబ్రహీంపట్నం: ఎంపీవో రామకృష్ణరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18న కలెక్టర్ మండలంలోని డబ్బా, వర్షకొండ, ఇబ్రహీంపట్నంలో పర్యటించారు. డబ్బా, వర్షకొండ గ్రామాల ఇందిరమ్మ ఇళ్లకు క్లస్టర్ అధికారి అయిన ఎంపీవో ఆ రోజు విధులకు గైర్హాజరయ్యారు. సమాచారం లేకుండా విధులకు హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్.. ఆయనను సస్పెండ్ చేశారు. బీర్పూర్ మండలంలో ఎంపీవోగా పనిచేసిన సమయంలోనూ రామకృష్ణరాజు ఇలాగే సస్పెండ్ అయినట్లు సమాచారం. -
జగిత్యాల
31.0/20.07గరిష్టం/కనిష్టంరైతులు ధాన్యం ఆరబెట్టి తేవాలిసారంగాపూర్:రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తెస్తేనే కాంటా చేయడం సులువవుతుందని డీఆర్డీవో రఘువరన్ అన్నారు. మండలంలోని అర్పపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది. కార్తీకమాసం సందర్భంగా సోమవారం సాయంత్రం గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
అమృత్ 2.0 .. అంతులేని జాప్యం
మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలో తాగునీటి అవసరాలను మెరుగుపర్చడానికి అమృత్ 2.0 కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం కింద పైపులైన్లు, వాటర్ ట్యాంకులను నిర్మించినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఇళ్లకు నీరు అందడం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టిన పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పనుల్లో జాప్యం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.19.40కోట్లు మంజూరు ఏడాది క్రితం ప్రారంభం.. అమృత్ పనులను పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో జాప్యంపై సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీకి వారు నోటీసులు ఇచ్చారు. గడువులోపు పనులను పూర్తి చేయాలని సూచించారు. – నాగేశ్వర్రావు, మున్సిపల్ డీఈఈ నోటీసులు ఇచ్చాం -
స్థలం సరిపోవడం లేదు
కొనుగోలు కేంద్రాలకు స్థలం సరిపోవడం లేదు. ఐదారుగురు రైతులు ధాన్యం పోయగానే నిండిపోతున్నాయి. స్థలం లేక రెండెకరాల పొలం కోయించడం ఆపిన. పొలంలో ధాన్యాన్ని ఆరబెట్టే పరిస్థితి లేదు. పొలం కోయగానే కొనుగోలు కేంద్రానికే తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. – క్యాతం సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్ ఆరబెట్టిన తర్వాతే తేవాలి హర్వేస్టర్తో వరి కోయించి నేరుగా కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడే ఆరబెడుతున్నారు. దీనివల్ల తోటి రైతులకు ఇబ్బంది కలుగుతోంది. రైతులు ఎవరిపొలంలో వారు ఆరబెట్టి తేమశాతం వచ్చాక కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే త్వరగా కాంటా అవుతుంది. – వడ్డెపల్లి భాస్కర్, డీఏవో -
చేతికొస్తున్న పంట
ఆరబెట్టేందుకు తంటాజగిత్యాలఅగ్రికల్చర్: పొలాలు కోతకొచ్చినప్పటికీ.. కొయిస్తే ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకూ సరిపడా స్థలం లేదు. పది నుంచి 20 రాశులు రాగానే స్థలం కొరత ఏర్పడుతోంది. ధాన్యం సేకరణకు జిల్లాలో 421 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం 50లోపు కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకు సరైన స్థలాలే లేవు. కొన్నిచోట్ల గుట్ట బోర్లు, ఎస్సారెస్పీ కాలువ మట్టిని చదును చేసుకుని ధాన్యం ఆరబెడుతున్నారు. మరి కొన్ని చోట్ల ప్రైవేట్ స్థలాలను లీజుకు తీసుకుంటున్నారు. స్థల యజమానులు ప్రతి సీజన్లో లీజు ధ ర పెంచుతున్నారు. నిర్వాహకులకు రూ.లక్షల్లో క మీషన్ వస్తున్నా.. కేంద్రాల్లో రైతులు ధాన్యం పో సేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. కేంద్రాల్లోనే ఆరబోత పొలం కోయించిన తర్వాత ఆరబెట్టి, తేమ వచ్చిన తర్వాతే కేంద్రాలకు ధాన్యం తేవాలి. అయితే పొలంలో ఆరబెట్టి తిరిగి కేంద్రాలకు తీసుకురావడానికి రైతుకు రెట్టింపు ఖర్చవుతుంది. పైగా కూలీలు దొరకని పరిస్థితి. ఈ క్రమంలో కోయించిన ధాన్యాన్ని ట్రాక్టర్లో నేరుగా కేంద్రాలకు తెస్తున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో తేమ 17శాతం లోపు రావడానికి కనీసం వారం రోజులు ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తోంది. పొలాలు దాదాపు 90 శాతం కోతకు వచ్చాయి. ఇప్పటికే కేంద్రాలన్నీ నిండిపోవడం.. ఇంకా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడం.. ధాన్యం తరలించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండడంతో వరిని కోయాలా..? వద్దా..? అని రైతులు తల పట్టుకుంటున్నారు. కవర్లకే తడిసిమోపెడు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు పెద్దగా పట్టించుకోకపోవడంతో రైతులే ధాన్యం పోసేందుకు భూమిని చదును చేసుకుంటున్నారు. కవర్లను అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఒక్కో కవర్కు రోజుకు రూ.50 నుంచి రూ.80వరకు వెచ్చిస్తున్నారు. ధాన్యం కాంటా అయ్యే వరకు 15 నుంచి 20రోజులు పడుతోంది. అప్పటివరకు కవర్ల ఖర్చే రైతులకు తడిసి మోపెడవుతోంది. కేంద్రాల్లో కనీసం టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో రైతులే సొంతంగా కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. -
బిల్లు రాక ఇల్లు ఆగింది
మాది గోపాల్రావుపేట. అధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. బేస్మెంట్ వరకు పూర్తయ్యింది. పనులు పరిశీలించిన అధికారులు గతనెల 6న ఫొటో కూడా తీసుకున్నారు. 40రోజులైనా డబ్బులు ఖాతాలో జమకాలేదు. అధికారులను అడిగితే ఇల్లు ఎల్–3లో ఉందని అంటున్నారు. బిల్లు రాక పనులు నిలిచిపోయాయి. బిల్లు ఇప్పించి ఆదుకోండి. – పడకంటి సిరిచందన, గోపాల్రావుపేట అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి మాకు రాయికల్ పట్టణంలో 6–43 నంబర్ గల ఇంటికి సంబంధించి 3.50 గుంటల స్థలం ఉంది. మా నాన్న గోపయ్య ద్వారా సంక్రమించిన ఆ స్థలానికి మేం ముగ్గురం వారసులం. రెండో సోదరుడు పోచయ్య ఆ స్థలం మొత్తాన్ని మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నడు. అందులో ఇంటి నిర్మాణానికి ప్రయత్నిస్తున్నడు. ఎలాంటి పంపకాలు జరగని ఉమ్మడి ఆస్తికి రిజిస్ట్రేషన్ రద్దు చేసి మాకు న్యాయం చేయండి. – పాలెపు బాబయ్య, రాయికల్ -
అమ్మవారికి ఒడిబియ్యం సమర్పణ
ధర్మపురి: కార్తీక సోమవారం సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో మన సారె – మనసారా కార్యక్రమంలో భాగంగా ఒడిబియ్యం, చీరసారె సమర్పించారు. శైవక్షేత్ర వనిత శక్తి ధర్మపురి మండల శాఖ ఆధ్వర్యంలో మహిళలు ఒడిబియ్యంతో అమ్మవారి నామ సంకీర్తనలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. కోటిలింగాలలో గంగాహారతివెల్గటూర్: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా కోటిలింగాలలోని కోటేశ్వరస్వామి సన్నిధిలో గోదావరికి గంగాహారతిని శోభాయమానంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించారు. నదిలో దీపాలు వదిలారు. ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గోపిక, కాంగ్రెస్ మండల అధ్యక్షులు శైలేందర్రెడ్డి, ఆలయ ఈవో కాంతారెడ్డి, కమిటీ సభ్యులు గుమ్ముల వెంకటేశ్, రాపాక రాయకోటి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. విజిబుల్ పోలీసింగ్పై దృష్టికోరుట్ల: ప్రజలకు సత్వర న్యాయం, విజిబుల్ పోలీసింగ్పై దృష్టి సారించాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కోరుట్ల పోలీస్స్టేషన్ను సోమవారం తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు, ఆయుధాలు పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. డీఎస్పీ రాములు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల, మెట్పల్లి సీఐలు సురేష్ బాబు, అనిల్ కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు. కొండగట్టులో దీపోత్సవంమల్యాల: కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం రాత్రి దీపోత్సవం నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఓంకారం ఆకారంలో దీపాలు వెలిగించారు. ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన కిటికీ వివాదం
కరీంనగర్ కార్పొరేషన్: చిన్న కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్లో సంచలనం సృష్టించింది. పక్కింటి వాళ్లతో పాటు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. కరీంనగర్ సిటీలోని రాఘవేంద్రనగర్లో వడ్లకొండ లక్ష్మీరాజం శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల పేరిట తమ ఇంటి కిటికీలను నగరపాలక సంస్థ అధికారులు పదేపదే తొలగించడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. తన ఇంటి కిటికీ విషయంపై పక్కింటి వాళ్లతో పాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్ వేధించడంతోనే చనిపోతున్నట్లు లక్ష్మిరాజం సూసైడ్ నోట్ రాశాడు. దాదాపు మూడేళ్లుగా పక్కింటివాళ్లతో కిటికీల విషయంపై లక్ష్మిరాజంకు వివాదం నడుస్తోంది. సెట్బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ టౌన్ప్లానింగ్ అధికారులు కిటికీని 2023లో మొదటిసారి తొలగించారు. మళ్లీ ఏర్పాటు చేశారంటూ ఈ సంవత్సరం ఆగస్టులో మరోసారి తొలగించారు. తన కిటికీలు తొలగించడం, పక్కింటి వాళ్లపై తాను ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మానసిక వేదనతో లక్ష్మిరాజం ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పక్కింటి వాళ్లతోపాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్పై చర్య తీసుకోవాలని లక్ష్మిరాజం భార్య శారద వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పక్కింటి వ్యక్తి ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కిటికీలు తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ తెలిపారు. -
కూర ఎందుకు వండలేదు? భర్త మందలింపుతో..
రాయికల్(జగిత్యాల): కూర ఎందుకు వండలేదని భర్త మందలించినందుకు రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెల్లి మనోజ(27) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన మనోజను తొమ్మిదేళ్ల క్రితం రామాజిపేటకు చెందిన సుధాకర్తో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి సుధాకర్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చేసరికి మనోజ కూర వండలేదు. ఎందుకు వండలేదని మందలించాడు. పిల్లలు కారంతో అన్నం తింటుండడంతో వంట చేసేందుకని సుధాకర్ వంటింట్లోకి వెళ్లాడు. మనోజ వెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. సుధాకర్ వచ్చి చూసేసరికే మృతిచెందింది. మనోజ తల్లి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గోదావరికి హారతి
ధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం తరఫున గోదావరికి మేళతాళాలతో వెళ్లి గోదావరిలో దీపాలు వదిలారు. ఆలయ ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, అర్చకులు, మహిళలు తదితరులున్నారు. డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెడతాంజగిత్యాలటౌన్: కరీంనగర్ అర్బన్ బ్యాంకును ఇతర బ్యాంకులకు దీటుగా తీర్చిదిద్ది డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెడతామని కరీంనగర్ కాంగ్రెస్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముందుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసే ప్యానల్ అభ్యర్థులను పరిచయం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, విప్ ఆది శ్రీనివాస్ ఆశీస్సులతో, జగిత్యాల ఎమ్మెల్యే మద్దతుతో 80శాతం ఓట్లు సాధించి తమ ప్యానల్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అర్బన్ బ్యాంక్ ప్యానల్ అభ్యర్థులు పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంజగిత్యాలటౌన్: కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల చట్టాలను బలహీనపరుస్తూ హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్.రావు అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన యూనియన్ జిల్లా నాలుగో మహాసభను కో–కన్వీనర్ ఇందూరి సులోచన జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను మార్చి శాశ్వత ఉద్యోగులు లేని వ్యవస్థ తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. విలువైన ఖనిజాలు, దేశ సంపదను అంబానీ, ఆదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, జిల్లా నాయకులు వెంకటాచారి, ఎంఏ చౌదరి, జి స్వప్న, జంగిలి ఎల్లయ్య పాల్గొన్నారు. భూపతిపూర్లో వినాయక విగ్రహం ప్రతిష్ఠరాయికల్: మండలంలోని భూపతిపూర్ హనుమాన్ ఆలయంలో వినాయక ప్రతిష్ఠ ఆదివా రం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తికి అర్చకులు మహేశ్వర శర్మ, మహేష్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కాయితి మురళి, గ్రామ నాయకులు జక్కుల చంద్రశేఖర్ ,అన్నవేణి వేణు, బొడ్డుపల్లి విజయ్, హరీష్, మామిడాల నాగరాజు, దిలీప్ గంగారాజం, గోపి అరవింద్, శంకర్ పాల్గొన్నారు. పోచమ్మ తల్లికి వెండి ఆభరణాలు సమర్పణమల్యాల: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చెట్పల్లి మొండయ్య పోచమ్మ తల్లికి రెండున్నర కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు. ఆదివారం స్థానిక పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి కిరీటం, కత్తి, డమరుకం, చేతులు, వడ్డాణం ఆభరణాలు సమర్పించారు. చెట్పల్లి రవి, మహేశ్, ఆనంద్ పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్కు కలిసి పోరాడుదాం
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సారంగాపూర్: బీసీలకు 42 రిజర్వేషన్ సాధనకు పార్టీలకతీతంగా కలిసి పోరాడుదామని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన చిర్నేని రాజశేఖర్ గ్రూప్–2 ఫలితాల్లో ఎంపీవోగా ఉద్యోగం సాధించడంతో ఆయనను మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. పేదరికం సమసిపోవాలంటే చదువు ఒక్కటే ఆయుధమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మ్యాడ శ్రీనివాస్, ఎర్ర నర్సన్న, చీర్నేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పల్లి విత్తనం.. సబ్సిడీకి మంగళం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా రైతులు యాసంగిలో వేరుశనగ (పల్లి) పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. విత్తనాలపై గతంలో 33 నుంచి 50 శాతం వరకు సబ్సిడీ ఇవ్వగా.. ఈ ఏడాది ఎత్తివేయడంతోపాటు చివరకు నాణ్యమైన విత్తనాలను కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ఓపెన్ మార్కెట్లో కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు పెట్టి విత్తనాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రైతులపై చిన్న చూపు నూనెగింజల ఉత్పత్తి పెంచే లక్ష్యంతో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై పల్లి విత్తనాలను సరఫరా చేసేది. ఈ ఏడాది మాత్రం ఈ పథకాన్ని కేవలం మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబగద్వాల, నారాయణపేట, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలకు మాత్రమే వర్తింపజేశారు. ఈ పథకం కింద ఎకరాకు సరిపడా 60 కిలోల విత్తనాన్ని ఆయా జిల్లాల్లో ఇస్తున్నారు. జిల్లా వానాకాలంలో మొక్కజొన్న పంట వేసిన తర్వాత.. యాసంగి పంటగా పల్లి సాగు చేస్తారు. ప్రస్తుతం రైతులకు పల్లి విత్తనం దొరకని పరిస్థితి ఏర్పడింది. గతంలో కొంతలో కొంత వేరుశెనగ విత్తనాన్ని జిల్లా రైతులకు ఇస్తుండేవారు. ఈ ఏడాది విత్తనాలకు పూర్తిగా మంగళం పాడారు. కొన్ని సీజన్లలో పంటను తక్కువ విస్తీర్ణంలో వేయడంతోనే జిల్లాను జాతీయ నూనెగింజల మిషన్ కింద చేర్చలేదని జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జిల్లాలో 10 వేల ఎకరాల్లో పల్లి సాగు జిల్లాలో పల్లిని దాదాపు 10వేల ఎకరాల్లో సాగు చేస్తారు. జగిత్యాల, గొల్లపల్లి, మెట్పల్లి, మల్లాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా సాగవుతుంది. చాలాగ్రామాల్లో వానాకాలం సీజన్లో మొక్కజొన్న పండించిన తర్వాత పల్లిని ఎంచుకుంటారు. జగిత్యాల మండలంలోనే దాదాపు 70 నుంచి 100 ఎకరాల వరకు సాగు చేస్తారు. పచ్చి పల్లికాయకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో పాటు ఇటీవల చాలామంది వినియోగదారులు ఆయిల్ ప్యాకెట్లు కొనకుండా రైతుల వద్ద నేరుగా పల్లికాయ కొని గానుగ పట్టించి తీసిన నూనెను వాడుతున్నారు. ఫలితంగా క్వింటాల్కు రూ.7 వేల వరకు పలకాల్సిన ధర ఓపెన్ మార్కెట్లో రూ.13వేల నుంచి రూ.15వేల పైనే పలుకుతుంది. పచ్చిపల్లికాయను తెంపి ట్రాక్టర్లలో నేరుగా వినియోగదారుల వద్దకే వెళ్తుండడంతో చూస్తుండగానే అమ్ముడుపోతోంది. ఎర్ర నేలల్లో దిగుబడి ఎక్కువ జిల్లాలో ఎర్రనేలలు ఎక్కువ. ఈ నేలల్లో పల్లికాయ బాగా పండుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం.. రెండుమూడు నీటి తడులు ఇస్తే సరిపోతుంది. ఫలితంగా కోతులు, అడవి పందుల బెడద ఉన్నా పల్లి పంటను రైతులు ఎంచుకుంటున్నారు. కానీ.. విత్తనం దొరకడమే గగనంగా మారుతోంది. యాసంగిలో నూనెగింజల పంట వైపు రైతన్నల చూపు పచ్చి పల్లికాయకు మార్కెట్లో మంచి డిమాండ్ -
సబ్సిడీ లేక ఇబ్బంది
ఏటా రెండెకరాల్లో పల్లి పండిస్తా. గతంలో సబ్సిడీపై విత్తనం ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదంటున్నారు. విత్తనాలు ఓపెన్ మార్కెట్లో దొరకడం లేదు. ఇప్పటికిప్పుడు ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు. – బందెల మల్లయ్య, చల్గల్ ఈ ఏడాది రాయితీ లేదు జాతీయ నూనెగింజల మిషన్ పథకం కింద జిల్లా లేదు. కాబట్టి సబ్సిడీపై విత్తనం ఇవ్వడం లేదు. గతంలో తక్కువ విస్తీర్ణలోనే పల్లి పంట సాగు చేశారు. ఇప్పటికిప్పుడు వేరుశనగ విత్తనాలను ఇచ్చే పరిస్థితి లేదు. – వడ్డేపల్లి భాస్కర్, డీఏవో -
వైద్య కళాశాలకు మహర్దశ
జగిత్యాల: జగిత్యాల.. జిల్లాకేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ కళాశాల మంజూరు చేసింది. ధరూర్ క్యాంప్లో గల ఆగ్రోస్ భవన్లో సుమారు 27 ఎకరాల్లో మెడికల్ కళాశాల నిర్మాణానికి సర్కారు సంకల్పించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భవనాలకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. మెడికల్ కళాశాల నిర్వహణకు తాత్కాలికంగా ఆగ్రోస్కు సంబంధించిన గోదాముల్లో రెనోవేషన్ కోసం రూ.14 కోట్లు కేటాయించారు. అప్పటినుంచి వైద్య తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడో సంవత్సరం బ్యాచ్ కొనసాగుతోంది. మెడికల్ కళాశాల భవనం, హాస్టళ్ల నిర్మాణానికి మొదటి విడతగా.. రూ.115 కోట్లు మంజూరు చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ సుమారు రూ.65 కోట్ల వరకు పనులు చేపట్టారు. బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలను నిలిపివేశారు. కళాశాల భవనం స్లాబ్తోపాటు గోడలు పూర్తయ్యాయి. బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. నిర్మాణాలకు రూ.500 కోట్లు 70 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయిన వైద్య కళాశాలలను తొలుత అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భవనాల్లో జగిత్యాల కూడా ఉంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.500 కోట్లు విడుదలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని నిర్మాణాల కోసం నవంబర్ నుంచి 2026 వరకు ప్రతినెలా రూ.340కోట్లు కేటాయించనున్నారు. తొలి దశలో నిర్మించిన వైద్య కళాశాలలకు నిర్మాణాలకు సంబంధించి బకాయిల చెల్లింపుతో పాటు, మిగిలిపోయిన పనులను ఈ నిధులతో పూర్తిచేయనున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు మెడ్కో విద్యార్థులకు గోదాముల్లో తరగతి గదులు ఏర్పాటు చేసినా అవి ఆశించిన స్థాయిలో లేవు. విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. బాయ్స్ హాస్టల్ ఓ ప్రైవేటు బిల్డింగ్లో కొనసాగుతుండగా.. గర్ల్స్ హాస్టల్ను నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. మెడ్కో విద్యార్థులు నర్సింగ్ కళాశాలలో ఉండటంతో ఆ విద్యార్థులకూ ఇబ్బందికరంగా మారింది. భవన నిర్మాణానికి మంత్రి హామీ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని అప్పట్లో జిల్లాలో పర్యటించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రస్తుత మంత్రి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ వినతిపత్రం అందించారు. ప్రస్తుతం ప్రభుత్వం తొలి దశలో కొన్ని కళాశాలలకు నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. నిధులు ఈ నెలలోనే మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో మెడికోల్లో ఆనందం వ్యక్తమవుతోంది. నిధుల లేమితో నిలిచిన పనులు నత్తనడకన సాగుతున్న నిర్మాణం తాజాగా కళాశాలకు రూ.500 కోట్లు నిధుల విడుదలతో వేగవంతమయ్యే అవకాశం -
ఆగని వాన.. కష్టాల్లో రైతన్న
మల్లాపూర్: ఆరుగాలం పండించిన రైతులకు వానగండం తప్పడం లేదు. నైరుతిరుతుపవనాలు ముగి సినప్పటికీ ఎన్నడూలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మార్క్ఫెడ్ కేంద్రాల్లో మక్కలు తడిసిపోతున్నాయి. కోతదశలో పొలాలు నేలవా రుతున్నాయి. హార్వెస్టర్లు అందుబాటులో ఉన్నా.. పొలంలోకి చేరేలోపే వర్షాలు పడుతున్నాయి. ఇలా వారంవరకు కోతలు ముందుకు సాగడం లేదు. నైరుతి ముగిసినా.. ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు.. అక్టోబర్ మొదటి వారం వరకు నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. తర్వాత ఈశాన్య రుతుపవనాలు వచ్చినా అంతగా వర్షాలు కురిసే పరిస్థితి ఉండదు. అయితే ఈ ఏడాది మాత్రం జూన్ చివరలో బాగానే కురిసిన వర్షాలు.. జూలైలో మందగించాయి. అనంతరం ఆగస్టులో కాస్త ఎక్కువగా.. సెప్టెంబర్లో సాధారణానికి మించి వర్షాలు కురిశాయి. ఇప్పటికీ కురుస్తూనే ఉన్నాయి. కోతలకు ఆటంకం జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొక్కజొన్న 32,463 ఎకరాల్లో సాగైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరికోతలు ప్రారంభమై ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తోంది. మరికొన్ని మండలాల్లో కోతదశలో ఉంది. వరుణుడు ఆటంకం కలిగించకుండా ఉంటే ఇప్పటికే కోతలు ముమ్మరంగా సాగేవి. దీపావళి ముగిసినా వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో కోతలకు ఆటంకం కలుగుతోంది. పొలాలు ఆరడం లేదు. పైగా వర్షం కారణంగా నేలవాలుతున్నాయి. ‘నైరుతి’ ముగిసినా వీడని వర్షం ముందుకు సాగని వరికోతలు తడిసి మొలకెత్తుతున్న మొక్కజొన్నలు -
‘రోళ్లవాగు’ జాప్యానికి గత ప్రభుత్వానిదే బాధ్యత
సారంగాపూర్: రోళ్లవాగు ప్రాజెక్టు పనుల జాప్యానికి గత పాలకుల వైఖరే కారణమని మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. రోళ్లవాగు ఆధునీకరణను పదేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.60 కోట్లతో పనులు చేపట్టిందని, ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.153 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక అటవీశాఖకు చెందిన 900 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో రెవెన్యూ భూములు కేటాయించిందని, పనుల పురోగతికి రూ.30 కోట్లు విడుదల చేసిందని, నవంబర్ నాటికి మూడు షట్టర్లు బిగించి యాసంగికి నీరు అందిస్తామన్నారు. బీర్పూర్ ఘాట్ రోడ్డు మూలమలుపులతో ప్రమాదాలకు నెలవుగా మారిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన వెంట విండో చైర్మన్ పొల్సా ని నవీన్రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి -
సంకల్ప బలముంటే సాధ్యమే
సంకల్పబలం.. సాధించాలనే తపన..లక్ష్యం స్పష్టత ఉంటే విజయం సాధిస్తామంటున్నారు మహిళా జడ్జీలు. లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలు స్పీడ్బ్రేకర్లలాంటివేనని.. పట్టుదలతో చదివితే విజయం సాధిస్తామంటున్నారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆయా కోర్టుల్లోనూ ఇతర జడ్జీలు, లాయర్లు సైతం మహిళలు ఉన్నారు. జిల్లాకు చెందిన మహిళలు లాయర్లుగా, జడ్జీలుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవిద్య.. అడ్వకేట్గా.. జడ్జీగా ఎదురైన సవాళ్లు.. ఎదుర్కొన్న తీరుపై ప్రత్యేక కథనం. -
క్రీడలతో స్నేహభావం
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: క్రీడలతో స్నేహభావం అలవడుతుందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీసు, ప్రెస్క్లబ్ మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. గెలుపోటములు సమానంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విజేత పోలీసు టీం, రన్నర్ టీం ప్రెస్క్లబ్ సభ్యులకు బహుమతులు అందించారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, వెంకటరమణ, సీఐలు కరుణాకర్, నీలం రవి, రాంనర్సింహారెడ్డి, ఆరీఫ్అలీఖాన్, ఎస్సైలు కిరణ్, సదాకర్, నరేశ్, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు చీటి శ్రీనివాస్రావు, మహేశ్, మల్లారెడ్డి, సంపూర్ణాచారి, గోపాలాచారి, మదన్, రాజేశ్, హరి, శ్రీనివాస్, నరేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
లక్కెవరిదో..!
జగిత్యాలక్రైం: జిల్లాలో మూడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధి లోని 71 మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించగా.. 1966 దరఖాస్తులు వచ్చిన విషయం తెల్సిందే. టెండర్దారులను ఎంపిక చేసేందుకు అధికారులు జిల్లాకేంద్రంలోని విరుపాక్షి గార్డెన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. లక్కీడ్రా ద్వారా అదృష్టవంతులు ఎంపికకానున్నారు. ఎవరికి లక్కు తగులుతుందోనని టెండర్దారులు టెన్షన్ పడుతున్నారు. మద్యం టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.58.98 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో 2,636 దరఖాస్తులు రాగా.. ఈసారి 1966 దరఖాస్తులు మాత్ర మే వచ్చాయి. అయితే ఫీజును రూ.3లక్షలకు పెంచడంతో గతంతోపోల్చితే ఈ సారి అదనంగా రూ. 6.26 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది. అత్యధికంగా వెల్గటూర్ మండలకేంద్రంలోని షాపు నంబరు 45కు 61 దరఖాస్తులు వచ్చాయి. అతి తక్కువగా కోరుట్ల పట్టణంలోని షాపు నంబరు 58, మొగిలిపేట షాపు నంబరు 65, వేములకుర్తి షాపునంబరు 71కు 16 దరఖాస్తుల చొప్పున దాఖలయ్యాయి. జగిత్యాల సర్కిల్ పరిధిలో 32 షాపులకు 948 దరఖాస్తులు వచ్చాయి. ధర్మపురి సర్కిల్ పరి ధిలో 14 షాపులకు 451, మెట్పల్లి సర్కిల్ పరిధిలో 25 షాపులకు 567 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని 71 షాపులకు 1966 దరఖాస్తులు రూ.58.98 కోట్ల ఆదాయం టెండర్లు తగ్గినా.. పెరిగిన ఆదాయం గతంలో 2,636 దరఖాస్తులు ఈ సారి పెరిగిన రూ.6.26 కోట్లు -
నిబంధనల ప్రకారం తూకం వేయాలి
మల్లాపూర్: ధాన్యం కొనుగోలు పక్కాగా నిర్వహించాలని జిల్లా సహకార ఆడిట్ అధికారి మాదాసు సత్యనారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ప్యాక్స్ కార్యాలయంలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జిలు, ట్యాబ్ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. రైతులకు సీరియ ల్ నంబర్లు కేటాయించాలని, నిబంధనల ప్రకారం తూకం వేయాలని సూచించారు. సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ ఎండీ.నిజాముద్దీన్, ప్యాక్స్ సీఈవోలు పాదం భూమేశ్, బొజ్జ రమేశ్, మామిడి రాజేశ్వర్రెడ్డి, కొత్తపల్లి రవితేజ, పండుగ సంపత్ పాల్గొన్నారు. -
బల్దియాలకు నిధులు
జగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. పాలకవర్గం లేకపోవడం.. నిధులు లేకపోవడం.. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో పట్టణాల అభివృద్ధి కుంటుపడుతోంది. మున్సిపాలిటీల్లో చిన్నచిన్న పనులు చేయాలన్నా నిధులు లేక చాలా చోట్ల నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఒకేసారి అన్ని బల్దియాలకు నిధులు విడుదల చేసింది. ఆ నిధులతో వచ్చే మార్చిలోపు పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లాలో ఐదు (జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్) మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలకు రూ.15కోట్ల చొప్పున.. జిల్లాకేంద్రమైన జగిత్యాలకు మాత్రం రూ.62.5 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వచ్చే మార్చిలోపు పనులు పూర్తిచేసేలా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. వసతుల కల్పనే ధ్యేయం మున్సిపాలిటీల్లో రహదారులు, డ్రైనేజీలు అధ్వానంగా మారాయి. శివారు ప్రాంతాల్లో సీసీరోడ్లు లేవు. కొన్నిచోట్ల శ్మశాన వాటికలు పూర్తిగా దెబ్బతి న్నాయి. కరెంట్ స్తంభాలు, ఓపెన్ జిమ్లు లేవు. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం నిధులు మంజూరు కావడంతో ప్రతి చోట పనులు చేపట్టాలని ఆదేశాలు రావడం, నిధులు విడుదల కావడంతో మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది. పట్టణాల్లో ప్రధానమైన సమస్య డ్రైనేజీ లేకపోవడం. సీసీరోడ్లు లేక వర్షకాలం వస్తే కాలనీల్లో నడవడం కూడా కష్టతరంగా మారింది. విడుదలైన నిధులతో పూర్తిస్థాయిలో రోడ్లు చేపడితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. విలీన ప్రాంతాలకు పెద్దపీట మున్సిపాలిటీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. అక్కడ ఆశించిన మేరకు సేవలు అందడం లేదు. రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, డబుల్బెడ్రూంలు లేకపోవడంతో తాజాగా వీటిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాలలో టీఆర్నగర్, మోతె, తిప్పన్నపేట, హస్నాబాద్, ధరూర్ గ్రామాలు విలీనమయ్యాయి. కోరుట్లలో యెకిన్పూర్ పూర్తిగా విలీనమైంది. కొన్ని గ్రామాల సర్వేనంబర్లతోపాటు కొన్ని గ్రామాలు మెట్పల్లిలో కలిపేశారు. రాయికల్, ధర్మపురి బల్దియాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో విలీన గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. సీసీరోడ్లు, అంతర్గత రహదారులు, మురికికాలువలు పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. చెరువులు, కుంటల్లో కాలుష్య నివారణ పనులు చేపట్టాలని సూచించారు. జగిత్యాలలో టీఆర్నగర్ సమీపంలో అర్బన్ హౌసింగ్ కాలనీ పేరిట 4,825 డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అక్కడ వసతులు లేవు. విడుదలైన నిధులతో ఆయా కాలనీల్లో పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే టెండర్లు వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చిలోపు పనులను పూర్తి చేసేలా చేపట్టాలని ఆదేశాలు రావడంతో త్వరలోనే టెండర్లు వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పనులు పూర్తయితే మున్సిపాలిటీల రూపురేఖలు మారనున్నాయి. వీటికి ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పనులను వారే పర్యవేక్షించనున్నారు. జగిత్యాలకు ప్రాముఖ్యత అంతర్గత రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉద్యానవనా లు, ఓపెన్జిమ్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. విలీన ప్రాంతాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. జగిత్యాల, రాయికల్ మున్సిపల్ కమిషనర్లు స్పందన, మనోహర్, డీఈ ఆనంద్, మెప్మా ఏవో శ్రీనివాస్, ఏఈలు చరణ్, అనిల్, టీపీబీవో శ్రీకర్ పాల్గొన్నారు. ప్లాస్టిక్ బ్యాగులను నివారించాలి ప్లాస్టిక్ బ్యాగులను నివారించాలని ఎమ్మెల్యే అన్నారు. రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు జ్యూట్బ్యాగులు అందించారు. ప్లాస్టిక్ రహితం కోసం కృషి చేస్తున్న ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, ఆపి సంస్థలను అభినందించారు. స్పెషల్ ఆఫీసర్ రాజాగౌడ్, రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు మంచాల కృష్ణ, శ్రీనివాస్, చారి, టీవీ.సూర్యం, జగదీశ్, రాజ్కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. బల్దియా కు రూ.62.5 కోట్లు మంజూరయ్యాయి. విలీన ప్రాంతాలతోపాటు, పట్టణంలో రోడ్లు, డ్రైనేజీలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. మార్చిలోపు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – సంజయ్కుమార్, ఎమ్మెల్యే -
జగిత్యాల
30.0/21.07గరిష్టం/కనిష్టంగోదావరిలో దీపోత్సవంధర్మపురి: కార్తీకమాసంలో భాగంగా శనివారం సాయంత్రం గోదావరిలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో మహాహారతి చేపట్టారు.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది. పొగమంచు కురుస్తుంది. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించి.. స్వామివారలను దర్శించుకున్నారు. ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
విద్యార్థికి మంత్రి పరామర్శ
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో గాయపడిన విద్యార్థి హిమేశ్చంద్రను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని మంత్రి లక్ష్మణ్కుమార్ శనివారం పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అత్యవసర చికిత్స నిమిత్తం రూ.5 లక్షలు మంజూరు చేశారు. అండగా ఉంటామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట ఎన్సీడీడీ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, ఆస్పత్రి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గోపి కృష్ణ, డీడీ ప్రవీణ్రెడ్డి, ఏడీ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. కాగా.. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. ఎస్సీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. తక్షణమే హైటెన్షన్ వైర్లు తొలగించాలని, లేకుంటే హాస్టల్ను మార్చాలని జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం, సురుగు శ్రీనివాస్, సతీశ్ అన్నారు. -
నిందితులకు శిక్ష తప్పదు
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: నేరానికి పాల్పడిన వారికి న్యాయస్థానంలో శిక్ష తప్పదని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. నేర నియంత్రణ, న్యాయ నిరూపణలో పోలీసులు ఫలితాలు సాధిస్తున్నారని, ఈ ఏడాది జనవరి నుంచి 83 కేసుల్లో కోర్టు తీర్పులు వెలువడగా.. 92 మందికి జైలుశిక్ష, జరిమానా పడిందని గుర్తు చేశారు. ఐదుగురిపై 20 ఏళ్ల జైలు, ఐదుగురికి పదేళ్ల జైలు, 9 మందికి ఏడేళ్లు, ముగ్గురికి ఐదేళ్లు, ఒకరికి నాలుగేళ్లు, 8మందికి మూడేళ్లు, 9మందికి రెండేళ్లు, ఆరుగురికి ఏడాది, 26మందికి ఏడాదిలోపు చొప్పున జైలు శిక్ష పడిందన్నారు. మహిళలపై నేరాలు, మద్యం, గంజాయి, దొంగతనాలు, మోసపూరిత ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి కోర్టు ముందు ఉంచుతున్నామని పేర్కొన్నారు. -
రెండేళ్లయినా రోళ్లవాగు పూర్తికాదా..?
సారంగాపూర్: కాంగ్రెస్ అధికారంలోకొచ్చి రెండేళ్లవుతున్నా.. రోళ్లవాగు ప్రాజెక్టుకు కనీసం షటర్స్ బిగించలేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానని అంటున్న ఎమ్మెల్యే సంజయ్ రెండేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రోళ్లవాగుకు షటర్స్ బిగించలేని ప్రభుత్వంలో బీర్పూర్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే బీర్పూర్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసిన విషయం ఎమ్మెల్యేకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి నిధులు తెస్తున్నామని చెబుతున్న ఎమ్మెల్యే షాడో కాంట్రాక్టర్గా అవతారం ఎత్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, మాజీ సర్పంచ్ భైరి మల్లేశం, నాయకులు వొడ్నాల జగన్, సాంబరి గంగాధర్ ఉన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కొడిమ్యాల: మండలకేంద్రంతోపాటు రామకృష్ణాపూర్, నాచుపల్లి, కొండాపూర్, చెప్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ప్రారంభించారు. సత్యం మాట్లాడుతూ.. రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డీఆర్డీవో రఘువరన్, సివిల్ సప్లై అధికారులు, మండల ప్రత్యేక అధికారి శ్యాంప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి, డైరెక్టర్లు, ప్యాక్స్ చైర్మన్లు రాజా నర్సింగరావు, రవీందర్ రెడ్డి, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో స్వరూప, జ్యోతి, ఏపీఎం ద్యావ మల్లేశం, మండల సమాఖ్య అధ్యక్షురాలు పద్మ, సీసీలు శ్రీనివాస్, వీరకుమార్ పాల్గొన్నారు. -
రాజకీయాలు ఎన్నికల వరకే..
రాయికల్: రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఇప్పుడు తన దృష్టి అంతా అభివృద్ధిపైనే అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. కొత్తపేట రాజరాజేశ్వర నాగాలయం కమిటీ సభ్యులు శనివారం ప్రమాణస్వీకారం చేయగా.. కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.17లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ నాగాలయంలో కల్యాణ మండపానికి రూ.10 లక్షలు, ధ్యాన మందిరానికి రూ.10 లక్షలు మంజూరు చేశామన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో విద్యబోధన అందుతోందని, రూ.5లక్షలతో సారంగాపూర్, రూ.7లక్షలతో బీర్పూర్ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేస్తామన్నారు. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, బల్దియా కమిషనర్ మనోహర్గౌడ్, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఆలయ కమిటీ చైర్మన్ దానవేని రాములు, సభ్యులు సత్యనారాయణరావు, పల్లపు వెంకట్, లచ్చన్న, ముక్కెర లక్ష్మీ, పోతవేని సత్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గన్నె రాజిరెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్, రవీందర్రావు, అచ్యుత్రావు, సామల్ల వేణు, రాంమూర్తి పాల్గొన్నారు. -
‘ఎస్ఐఆర్’ జాబితా పకడ్బందీగా తయారుచేయాలి
జగిత్యాల: ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జాబితాను పకడ్బందీగా తయారుచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్తో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. 2002లో చేసిన ఎస్ఐఆర్తో 2025 స్పెషల్ సమ్మరి రివిజన్ ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్స్థాయి అధికారుల సహకారంతో పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లో కేటగిరి ‘ఏ’ ని బీఎల్వో యాప్ ద్వారా ధ్రువీకరిస్తామని, కేటగిరి సీ, డీ లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఈఆర్వో కార్యాలయాల్లో ఇద్దరు బూత్స్థాయి అధికారులను కేటాయించి మ్యాపింగ్ పూర్తి చేస్తామన్నారు. మెట్పల్లి, కోరుట్ల ఆర్డీవోలు శ్రీనివాస్, జివాకర్రెడ్డి, ఏవో హకీం పాల్గొన్నారు. -
‘యూనిటీ మార్చ్’ను విజయవంతం చేయాలి
జగిత్యాల: యువజన క్రీడల మంత్రిత్వశాఖ మై భారత్ జిల్లా పరిపాలన శాఖ ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ 150 యూనిటీ మార్చ్ను విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో మార్చ్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా ఈనెల 31న జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యూత్ ఆఫీసర్ వెంకట రాంబాబు, డీఎస్పీ వెంకటరమణ, రవికుమార్, ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ పాల్గొన్నారు. తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకేజగిత్యాల: తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. తన కార్యాలయంలో వయోవృద్ధుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. చాలామంది తమను సంతానం పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్నారని, వృద్ధులను విస్మరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొడిమ్యాల మండలం హిమ్మత్రావుపేటకు చెందిన మల్లయ్య, రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన లక్ష్మీబాయి, అంతర్గాంకు చెందిన వెంకవ్వ తమ కుమారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు. ఏవో రవికాంత్, సీనియర్ సిటిజన్స్ హరి అశోక్కుమార్ పాల్గొన్నారు. గాలికుంటు నివారణ టీకాలు వేయించాలిగొల్లపల్లి: రైతులందరూ గాలికుంటువ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ప్రకాశ్ అన్నారు. మండలంలోని చిల్వకోడూరులో శనివారం గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. పశువుల్లో వచ్చే సీసనల్ వ్యాధులపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 250కి పైగా పశువులకు టీకాలు వేశారు. మండల పశువైద్యాధికారి రవీందర్, సిబ్బంది రవీందర్, రాజశ్రీ, రవి, నిశాంత్, రమేశ్ పాల్గొన్నారు. పెగడపల్లిలో..పెగడపల్లి: మండలంలోని రాజారాంపల్లెలో గాలికుంటు నివారణ టీకాల శిబిరాన్ని ప్రకాశ్ సందర్శించారు. వ్యాధి సోకిన పశువులకు టీకాలు వేయించకుంటే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. మండల పశువైద్యాధికారి హేమలత, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయం మెట్పల్లి: విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయమని డీఎస్పీ రాములు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని పోలీస్స్టేషన్లో శనివారం రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ ప్రారంభించారు. సుమారు 50మంది రక్తదానం చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారని, విధి నిర్వహణలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాజానికి సేవలు అందిస్తున్నారని తెలిపారు. సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, అనిల్, రాజునాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘మా ఇంటికి దారి చూపండి’
జగిత్యాలటౌన్: తమకు కేటాయించిన ఇంటికి వెళ్లేందుకు ప్రభుత్వం నిర్మించిన దారినే కొందరు ఆక్రమిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తమ ఇంటికి దారి చూపాలని వెల్గటూర్ మండలం జగదేవుపేటకు చెందిన నూకల నర్సవ్వ, మల్లయ్య వృద్ధ దంపతులు కలెక్టరేట్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. అక్కడే వంటావార్పు చేసేందుకు సిద్ధమయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. జగదేవుపేటకు చెందిన మల్లయ్య, నర్సవ్వ దంపతులకు 1981లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది. ఆ ఇంటికి రోడ్డు కూడా నిర్మించింది. అయితే కాలనీకి చెందిన కొందరు దారికి అడ్డంగా మట్టి, బండలు పోశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆ దంపతులు గ్రామ కార్యదర్శి మొదలు.. ఎంపీడీవో, తహసీల్దార్ను కలిసి మొరపెట్టుకున్నారు. రెండేళ్లుగా తొమ్మిదిసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశా రు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా.. కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదు. మంత్రి అడ్లూరి, చివరకు హైదరాబాద్లోని ప్రజాభవన్లోనూ ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ఆక్రమణను తొలగించినా.. వారు వెళ్లిపోగానే కబ్జాదారులు మళ్లీ రోడ్డును ఆక్రమించుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ తాజాగా కలెక్టరేట్కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రాజాగౌడ్ కలెక్టర్ ఆదేశాల మేరకు బాధితులను పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు వెనుదిరిగారు. -
ఆదాయం
సేద్యం..ఆరోగ్యం..● మూస ధోరణికి స్వస్తి.. సేంద్రియంపై ఆసక్తి ● కాలానుగుణంగా ‘సాగు’తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న పలువురు అన్నదాతలుకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సంప్రదాయ వరిసాగుకు కేరాఫ్గా నిలుస్తున్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు ఆదర్శ రైతు కొప్పుల సత్యనారాయణ– స్రవంతి దంపతులు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ పాలనలో ఆదర్శ రైతుగా ఎంపికై కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సత్యనారాయణ శిక్షణ తీసుకున్నాడు. సుమారు 25 రకాల దేశీ వరి ధాన్యాన్ని సంప్రదాయ పద్ధతిలో పండిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. వీటిలో తెగుళ్లను తట్టుకునే దొడ్డు, సన్నరకాలు ఉన్నాయి. సుమారు 850 రకాల వరి విత్తనాలు తనవద్ద అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం డయాబెటిస్ విజృంభిస్తున్న తరుణంలో ఆర్గానిక్ ఉత్పత్తులైన బ్లాక్రైస్, రెడ్ రైస్, నవారు వరిపంటను పండిస్తున్నాడు. తోటి రైతులకు సాగులో సూచనలు అందిస్తున్నారు.సత్యనారాయణ స్రవంతి దంపతులునీరుంటే వరి.. లేకుంటే పత్తి పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు ఉమ్మడి జిల్లాలోని రైతులు. ‘పండితే పండుగ.. ఎండితే దండగ..’ అతివృష్టి.. అనావృష్టి ఏదైనా అన్నదాతకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. ఒకే విధమైన పంటల సాగుతో భూసారం దెబ్బతింటోంది. పంటలకు వాడే రసాయనాలతో మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు రైతులు కాస్త భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. వివిధ రకాల పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పోషక విలువలున్న పండ్ల తోటలు.. పాతకాలపు వరి విత్తనాలు.. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే కూరగాయలు, ఆకుకూరలను మందులు పిచికారీ చేయకుండా, సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. మూసధోరణిలో కాకుండా కాలానికనుగుణంగా సేద్యం చేస్తూ.. తినేవారికి ఆరోగ్యాన్ని పంచుతూ.. పంటల విక్రయాలతో ఆదాయం గడిస్తున్న రైతులపై సండే స్పెషల్..!! – వివరాలు 8లోu -
హార్వెస్టర్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలి
జగిత్యాల: హార్వెస్టర్ యంత్రాలను సక్రమంగా వినియోగించాలని, యంత్రాల అద్దె రేట్లు పారదర్శకంగా ఉండాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. గురువారం సమావేశ మందిరంలో హార్వెస్టర్ల యజమానులు, డ్రైవర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరికోత సమయంలో నాణ్యమైన ధాన్యం సేకరణకు జాగ్రత్తలు తీసుకోవాలని, హార్వెస్టర్ యంత్రాలను సక్రమంగా నిర్వహించాలన్నారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ, హార్వెస్టర్ యజమానులు పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోత ప్రారంభించాలని, మిషన్లలో బ్లోయర్ సక్రమంగా ఆన్లో ఉంచాలని, ఆర్పీఎం 19–20 తక్కువగా ఉండకూడదన్నారు. ధాన్యం నాణ్యత దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తేమశాతం 17లోపు ఉంచితే మద్దతు లభిస్తుందన్నారు. డీటీవో శ్రీనివాస్ మాట్లాడుతూ, హార్వెస్టర్ యంత్రాల రవాణా సమయంలో రోడ్డు రవాణా నిబంధనలు తప్పక పాటించాలని, వాహన పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
మల్యాల(చొప్పదండి): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి కె.రాము హెచ్చరించారు. గురువారం మండలంలోని నూకపల్లి ప్రాథమిక పాఠశాల, మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. కస్తూరిబా విద్యాలయంలో భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. సీ గ్రేడ్ విద్యార్థుల వివరాలు సేకరించి, ప్రణాళిక ప్రకారం అభ్యసనా సామర్థ్యాలు పెంపొందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలన్నారు. ఎంఈవో జయసింహారావు, స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అజాగ్రత్త..
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025అతివేగం.. మేడిపల్లి శివారులోని ఇబ్రహీంపట్నం క్రాసింగ్ వద్ద ఆటోను ఢీకొన్న కారు (ఫైల్)ఆలయ అభివృద్ధికి కృషి చేయాలిమెట్పల్లి రూరల్: మెట్పల్లి మీదుగా విస్తరించిన 63వ జాతీయ రహదారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ.. కొందరు చనిపోతున్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడుతున్నారు. ఎదురెదురుగా కొన్ని.. వెనక నుంచి వచ్చి మరికొన్ని వాహనాలు ఢీకొంటుండడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది. ఇంకొన్నిచోట్ల రాంగ్రూట్లో ప్రయాణం, మూలమలుపులు క్రాస్ చేస్తుండగా, అతివేగం, అజాగ్రత్తగా నడపడం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ప్రమాదాలు ఇలా చేస్తే ప్రమాదాల నివారణ -
రైతులకు సరిపడా టార్పాలిన్లు కొనాలి
కథలాపూర్(వేములవాడ): సహకార సంఘాల్లో నిల్వ ఉన్న నిధులతో రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేయాలని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం కథలాపూర్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మొక్కజొన్నకు క్వింటాలుకు మద్దతు ధర రూ.2,400 ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఉచితంగా అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామాలవారీగా సమస్యలపై స్థానిక నాయకులతో చర్చించారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, డైరెక్టర్లు ఎండీ హఫీజ్, వాకిటి రాజారెడ్డి, కారపు గంగాధర్, చౌదరి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు చెదలు సత్యనారాయణ, తొట్ల అంజయ్య, మహేశ్, చిన్నారెడ్డి, మోహన్, రేహన్, అశోక్ పాల్గొన్నారు. -
జాగ్రత్తలు పాటించాలి
వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజుల్లులు కురిసే అవకాశం ఉంది. చలిగాలులు కొనసాగుతాయి. మధ్యాహ్నం ఎండవేడిగా ఉంటుంది. ● వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి ● ఆస్తమా, అలర్జి పేషెంట్లు అవసరమైతేనే బయటకు వెళ్లాలి ● వెచ్చని దుస్తులు ధరించాలి ● డీఎంహెచ్వో ప్రమోద్కుమార్జగిత్యాల: చలికాలంలో జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, ఆస్తమా, అలర్జి ఉన్నవారు చలిలో బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. బయటకు వెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు ధరించి వెళ్లాలన్నారు. ఈసందర్భంగా చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’కి వెల్లడించారు.చలికాలం ప్రారంభమైంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డీఎంహెచ్వో: ఈ సీజన్లో ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. చలిగాలులు శరీరంలోకి వెళ్తే వైరస్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తమా, అలర్జి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు, పిల్లలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? డీఎంహెచ్వో: అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. మాస్క్లు ధరించాలి. శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. బయటకు వెళ్లకపోవడమే మంచిది.అత్యవసర పనులపై వెళ్లే వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? డీఎంహెచ్వో: అత్యవసర పనుల కోసం మోటార్సైకిల్పై వెళ్లేవారు గ్లౌస్లు, మంకీక్యాప్, స్వెటర్స్ ధరించాలి. చలితీవ్రత ఎక్కువైతే చర్మంలో కణజాలాలు గడ్డకట్టి గాయాలు కావడం, వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? డీఎంహెచ్వో: పౌష్టికాహారం తీసుకోవడం మంచిది. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. జాగ్రత్తలు తీసుకోకుంటే చలితీవ్రతకు అవయవాల్లో గాయాలు ఏర్పడి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముంటుంది.గ్రామీణ ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటే చలిమంటలు వేసుకుంటారు. వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? డీఎంహెచ్వో: చలితీవ్రత ఎక్కువగా ఉంటే మంటలు వేసుకునే సమయంలో వాటికి దూరంగా ఉండాలి. ఎక్కువ సమయం మంట కాగడం మంచిది కాదు. గది వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. రూమ్ హీటర్స్ వాడుకోవచ్చు.శీతాకాలంలో ముక్కుదిబ్బడ, ఆయాసం సమస్యలు ఉంటాయి. వీటి నియంత్రణకు చర్యలు?డీఎంహెచ్వో: ముక్కుదిబ్బడ వేసినప్పుడు నాసల్ డ్రాప్స్ వేసుకోవాలి. ఆయాసం, దమ్ము ఉన్న వారు గోరువెచ్చని నీరు తాగాలి. దీని ద్వారా ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంటాయి. చన్నీటి స్నానంతో ఇబ్బందులుంటాయా?డీఎంహెచ్వో: వింటర్లో చర్మం పొడిబారడం, పెదాలు కూడా పగులుతాయి. కొందరు చలి తట్టుకునేందుకు చాలా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. అది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. స్కిన్ పొడిబారకుండా మాయిశ్చరైజర్స్ రాయాలి. బాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. పొగతాగడం మానేయాలి. ఎప్పుడూ చలిని తట్టుకునే దుస్తులు ధరించాలి. ఈ కాలంలో చర్మవ్యాధులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? డీఎంహెచ్వో: చర్మం ఎక్కువగా పొడిబారి, పగుళ్లు ఏర్పడుతాయి. చలినుంచి రక్షణకు వ్యాజిలెన్, కొబ్బరినూనె వాడాలి. సరైన నియమాలు పాటిస్తే ఆరోగ్యకరంగా ఉంటాం. ఉదయం వాకింగ్కు వెళ్లవచ్చా?డీఎంహెచ్వో: ఉదయం వాకింగ్ చేసేవారు అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి. శ్వాసకోశ వ్యాధులున్న వారు ఇంట్లోనే వాకింగ్, యోగా లాంటివి చేసుకుంటే మంచిది. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -
‘సాండ్’ బేజార్
● ప్రభుత్వ ఇసుకకు ధర ఎక్కువ ● అక్రమంగా వచ్చే ఇసుక ధర తక్కువ ● సాండ్ బజార్ ఆదాయం అంతంతేజగిత్యాల: జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వరస్వామి ఆలయ ఎండోమెంట్ స్థలంలో సాండ్ బజార్ ఏర్పాటు చేశారు. ఇందులో టన్ను ఇసుక ధర సాధారణ వినియోగదారులకు రూ.1,400, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు రూ.1,200 నిర్ణయించారు. కాగా, బయట ఇసుక ఇంతకన్నా తక్కువ ధరకు దొరకడంతో సాండ్ బజార్ ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది. ఏడాదికి రూ.3 లక్షల లీజు.. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర ఎండోమెంట్ స్థలాన్ని ఏడాదికి రూ.3 లక్షలకు లీజుకు తీసుకుని రూ.15 లక్షల విలువ గల వేయింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. మరో రూ.20 లక్షలతో మౌలిక వసతులు కల్పించి సిబ్బందిని కూడా నియమించారు. సెప్టెంబర్ 9న సాండ్ బజార్ను ప్రారంభించగా, ఇప్పటి వరకు రూ.8 లక్షల రెవెన్యూ మాత్రమే వచ్చింది. సాండ్బజార్లో టన్ను ఇసుక ధర తగ్గిస్తేనే ఇక్కడ ఇసుక విక్రయాలు జరిగే అవకాశం ఉంది. ఆగని ఇసుక అక్రమ రవాణా జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా వారి కళ్లుగప్పి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ధర్మపురి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ఎక్కువగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల కోరుట్లలో ఇసుక మాఫియా రెవెన్యూ అధికారులపై దాడిచేసిన ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ ఇసుక లోడ్ తక్కువ ధరకు వస్తుండడంతో ఎక్కువగా వీరి వద్దే కొనుగోలు చేస్తున్నారు. రాత్రిపూట లేదా వేకువజామునే ఎక్కువగా అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్కుమార్కు ఇసుక ధర తగ్గించాలని ఇటీవల మాజీమంత్రి జీవన్రెడ్డి లేఖ సైతం రాశారు. సాండ్ బజార్ నిర్వహణ సమస్యాత్మకంగా మారుతుందని, కొనసాగింపు కష్టతరంగా ఉంటుందని, వినియోగదారులకు ప్రస్తుతం నిర్ణయించిన టన్ను ధర రూ.1,400 నుంచి రూ.1,200 తగ్గించాలని, అలాగే ఇందిరమ్మ వినియోగదారులకు రూ.వెయ్యికి అందించాలని లేఖలో కోరారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సాండ్ బజార్లో ఇసుక రేట్లు తగ్గిస్తే సామాన్య ప్రజలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇసుక అక్రమ రవాణా కూడా తగ్గే అవకాశాలుంటాయి. -
యమ ద్వితీయ వేడుకలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహాస్వామి అనుబంధ యమధర్మరాజు ఆలయంలో గురువారం యమ ద్వితీయ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితుడు బొజ్జ రమేశ్శర్మ మంత్రోచ్చరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయుష్య హోమం, హారతి, మంత్రపుష్పము తదితర పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా వేద పండితుడు బొజ్జ సంపత్శర్మ మాట్లాడుతూ, యమ ద్వితీయ రోజు యమధర్మరాజు యమలోక ద్వారాలను మూసి తన సోదరి అయిన యమి ఇంటికి వెళ్లి సోదరి ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని, ఈ రోజు మరణించిన వారికి యమలోక ప్రాప్తి ఉండదని భక్తుల నమ్మకమని, యమ ద్వితీయ రోజున స్వామివారిని దర్శించుకున్న వారికి గండాలు తొలగుతాయని పేర్కొన్నారు. వివిధ పాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు. హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయవాదులుజగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి, జిల్లా ఫోర్ట్ఫోలియో జడ్జి రేణుక యారాను గురువారం జగిత్యాల బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఫ్యామిలీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టు, క్యాంటిన్ ఏర్పాటు తదితర సమస్యల గురించి హైకోర్టు జడ్జికి వివరించారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్కుమార్, జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్, రమేశ్ పాల్గొన్నారు. మద్యం షాపులకు 1,966 దరఖాస్తులు జగిత్యాలక్రైం: జిల్లాలో 71 మద్యంషాపుల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానించగా గురువారం రాత్రి వరకు 1,966 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు ఫీజు పెంచడంతో వ్యాపారులు కొంత వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. గతంలో 2,636 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.52.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి 1,966 దరఖాస్తులకు రూ.58.98 కోట్ల ఆదాయం లభించింది. కాగా ఈనెల 27న జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్స్లో డ్రా పద్ధతిన మద్యంషాపుల నిర్వాహకులను ఎంపిక చేయనున్నారు. అందుకోసం ఎకై ్సజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారు డ్రా కేంద్రానికి వచ్చేందుకు పాస్లు అందజేస్తున్నారు. పాస్లు ఉన్నవారినే డ్రా తీసే వద్దకు అనుమతించనున్నారు. సీనియర్ సిటిజన్స్ హక్కుల రక్షణకు కృషిజగిత్యాల: సీనియర్ సిటిజన్స్ హక్కుల రక్షణకు కృషి చేస్తామని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం సీనియర్ సిటిజన్స్ కమిషన్ వేయాలన్నారు. వృద్ధ తల్లిదండ్రులను నిరాదరించే ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతి నెలా 10 శాతం మినహాయించేలా తల్లిదండ్రులకు చట్టం తెస్తామని సీఎం ప్రకటించడం అభినందనీయమన్నారు. గౌరిశెట్టి విశ్వనాథం, విజయ్, ప్రకాశ్, యాకూ బ్, అశోక్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆంక్షలు లేకుండా మక్కలు కొనాలి
జగిత్యాలటౌన్/జగిత్యాలరూరల్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో ఎకరాకు 18 క్వింటాళ్ల నిబంధన సడలించి 30 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి కోరారు. ఈ విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు రాసిన లేఖను గురువారం మార్కెట్ కార్యదర్శికి అందజేశారు. మార్క్ఫెడ్ కేంద్రంలో కొనుగోళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళారులను నిలువరించేందుకు రైతులు నేరుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసిన అనంతరం దినుసును కేంద్రానికి తీసుకువచ్చేలా ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మొక్కజొన్నపై అవగాహన పెరిగి కొయ్య మొక్క సాగు చేస్తుండటంతో పెట్టుబడి వ్యయం తగ్గి దిగుబడి పెరిగిందన్నారు. ఎకరాకు 30– 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంటే 18క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసేలా పరిమితి విధించడంతో రైతులు దళారుల బారిన పడి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నాఫెడ్ సహకారంతో పరిమితులు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట జున్ను రాజేందర్, ధర రమేశ్బాబు, అల్లాల రమేశ్రావు, ముంజాల రఘువీర్, రాజిరెడ్డి, సాయి, రవి తదితరులున్నారు. -
మక్కల కొనుగోలులో దళారులకు చెక్
జగిత్యాలఅగ్రికల్చర్: మక్కల కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట వేసేందుకు మార్క్ఫెడ్ సంస్థ చర్యలు తీసుకుంటోంది. రైతులకే లబ్ధి చేకూరేలా పలు నిబంధనలను తీసుకొచ్చి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కొందరు దళారులు గ్రామాల్లో తక్కువ ధరకు రైతుల నుంచి మక్కలు కొని అదే రైతుల పేరిట మార్క్ఫెడ్కు విక్రయిస్తున్నారు. అయితే ఈ సారి అలా జరగకుండా ఏర్పాట్లు చేశారు. రైతే ఈసారి కొనుగోలు కేంద్రానికి వచ్చేలా నిబంధనలు మార్చారు. గత సీజన్లో ఆధార్కార్డు అనుసంధానంగా మక్కల కొనుగోళ్లు చేపట్టగా.. ఈసారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీని ప్రకారం రైతు కేంద్రానికి వస్తే ఆధార్కార్డు నంబర్తో బయోమెట్రిక్ యంత్రంలో వేలిముద్ర తీసుకుని మక్కలు కొంటారు. దీనివల్ల దళారులకు చెక్ పెట్టినట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కొనుగోలు తర్వాత డబ్బుల చెల్లింపు కూడా ఆధార్కార్డును ప్రమాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. పైగా వ్యవసాయ శాఖ చేపట్టిన పంట సర్వేలో కూడా రైతు మక్క వేసినట్లు నిర్ధారణ జరగాల్సి ఉంటుంది. మొత్తంగా రైతు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా, సెల్నంబర్, ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉండాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలో 13 మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఇప్పటి వరకు కేవలం నాలుగు కేంద్రాలనే ప్రారంభించారు. మెట్పల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ప్రారంభించినా.. తేమశాతం ఎక్కువగా ఉండటంతో కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకాలేదు. మక్కల్లో తేమ 14శాతం కంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేసే పరిస్థితి లేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో.. గింజలు ఆరడం లేదు. కేంద్రాలకు వచ్చిన గింజల్లో తేమ శాతం 24 నుంచి 28 వరకు వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యమైన మక్కలు తీసుకొచ్చి మద్దతు ధర క్వింటాల్కు రూ.2400 పొందాలని మార్క్ఫెడ్ అధికారులు సూచిస్తున్నారు. గతంలో కొన్ని చోట్ల తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ కొనుగోలు చేయడం.. వాటిని గోదాముల్లో నిల్వచేయడంతో పురుగులు పట్టి తీవ్ర నష్టం వచ్చిందని, ఈ సారి అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ప్రారంభించింది నాలుగు కేంద్రాలే.. -
‘ఇందిరమ్మ ఇళ్లు’ పూర్తికావాలి
రాయికల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని సింగరావుపేట, శ్రీరాంనగర్, ఇటిక్యాలలో ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ భవనం, హెల్త్ సెంటర్లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు మొదలుపెట్టని వారికి సమస్యలు ఉంటే పరిష్కరించాలని, ఆర్థికంగా ఇబ్బంది పడితే సెర్ప్ ద్వారా రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఈఈ పీఆర్ లక్ష్మణ్రావు, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాంధర్మపురి: గోదావరి పుష్కరాలను నభూతో న భవిష్యత్ తరహాలో నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని దర్శించుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. 2027లో వచ్చే పుష్కరాలకు నిధుల మంజూరుకు సీఎం దృష్టికి తీ సుకెళ్లానని తెలిపారు. ధర్మపురిలో డిగ్రీ కళా శా ల రావడంతో నిజమైన దీపావళి వచ్చినట్లయ్యిందన్నారు. అలాగే బస్డిపో, రూ.200 కో ట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించబోతున్నామ ని తెలిపారు. అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నార ని తెలిపారు. కార్యక్రమంలో ఈవో శ్రీని వాస్, ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, నా యకులు దినేష్, వేముల రాజు, సుముఖ్ ఉన్నారు. జగన్నాథ్పూర్ బ్రిడ్జి మంజూరుకు కృషిరాయికల్: గిరిజనుల రాకపోకలు మెరుగుపర్చేందుకు జగన్నాథ్పూర్ వద్ద బ్రిడ్జి మంజూ రుకు కృషి చేసినట్లు మాజీమంత్రి జీవన్రెడ్డి తెలిపారు. తన ప్రోద్బలంతోనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తొలి సంతకం బ్రిడ్జి మంజూరు పత్రంపై పెట్టారని గుర్తుచేశారు. మండలంలో ని జగన్నాథ్పూర్లో గిరిజనులతో కలిసి దండారీ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. తాను ఎమ్మెల్యేగా బోర్నపల్లి బ్రిడ్జిని మంజూరు చేయించానని పేర్కొన్నారు. వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు భూమి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్రెడ్డి, ఆంజనేయులు, శంకర్, బీర్సాబ్, సిడెం భీం, మారుతి, సచిన్, తలారి రాజేశ్, బాపురపు రాజు, గుమ్మడి సంతోష్, లక్ష్మణ్, రాజిరెడ్డి పాల్గొన్నారు. మద్యం షాపులకు 1840 దరఖాస్తులుజగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకు ఇప్పటివరకు 1840 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. వాస్తవానికి టెండర్లకు ఈనెల 18న గడువు ముగిసినా.. బీసీ సంఘాల బంద్, బ్యాంక్లకు సెలవులు ఉండటంతో ప్రభుత్వం ఈనెల 23 వరకు గడువు పెంచింది. దీంతో మంగళవారం మరో ఆరు దరఖాస్తులు రాగా.. మొత్తం 1840కు చేరాయి. -
శాంతియుత సమాజమే లక్ష్యం
జగిత్యాలక్రైం: శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యమని, శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమ ని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నా రు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా మంగళవారం పోలీస్ అమరులను స్మరించుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అధి కారులు, అమరుల కుటుంబసభ్యులతో కలిసి నివా ళి అర్పించారు. అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ఈనెల 31వరకు వివిధ కార్యక్రమాలు చేపడతా మని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు సహకారం అందిస్తామన్నారు. శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ కార్యదీక్ష, సేవాతత్పరతతో పనిచేస్తుందన్నారు. ఆన్లైన్లో ఓపెన్హౌస్ నిర్వహించి పోలీసు విధులు, సాంకేతి క వినియోగం, ప్రజారక్షణలో సేవలు, ఫ్రెండ్లీ పోలీ స్ వ్యవస్థపై స్కూల్ పిల్లలకు తెలియజేస్తామన్నా రు. విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు, షార్ట్ ఫిలిమ్స్, ఫొటోగ్రఫీ, రక్తదాన శిబిరాలు, సైకి ల్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, వెంకటరమణ, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, సైదులు, సీఐలు వేణుగోపాల్, సుధాకర్, రవి, రాంనర్సింహారెడ్డి, ప్రవీణ్, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో అందని రిపోర్ట్లు
జగిత్యాల: ఆపదలో ఆస్పత్రికి వచ్చినవారిని పరిశీలించి రోగ నిర్ధారణ కోసం వివిధ పరీక్షలు రాస్తుంటారు. ఆ రిపోర్ట్లు వచ్చిన అనంతరం వైద్యులు పరిశీలించి.. రిపోర్ట్లను బట్టి చికిత్సకు సంబంధించిన మందులు రాస్తారు. అయితే జిల్లా కేంద్రంలోని ప్రధానాస్పత్రికి వస్తున్న రోగులు మాత్రం ఈ నిర్ధారణ పరీక్షల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులను వైద్యులు నిర్ధారణ పరీక్షలకు పంపించడం.. వారు రక్తనమూనాలు సేకరించడమే తప్ప రిపోర్ట్లు మాత్రం ఇవ్వడం లేదు. 15 రోజులుగా రిపోర్ట్లు రేపుమాపు అంటూ ల్యాబ్ సిబ్బంది కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా రోగులు ఆందోళన చెందుతున్నారు. రిపోర్టులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. స్టేషనరీ లేకనేనా..? రోగుల వద్ద శాంపిల్స్ తీసుకున్న అనంతరం వాటిని పరీక్షించి రిపోర్ట్లను పేపర్లపై ఇస్తుంటారు. కానీ ప్రధాన ఆస్పత్రిలో నిధులు లేకనో.. ఏమోగానీ రిపోర్టులు మాత్రం ఇవ్వడం లేదు. పేపర్ స్టేషనరీకి సంబంధించిన సుమారు రూ.5లక్షలు బిల్లు పెండింగ్లో ఉందని, అందుకే పేపర్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది. విషయాన్ని రోగులకు ఎలా చెప్పాలో తెలియక ల్యాబ్ నిర్వాహకులు కాలం గడుపుతూ వస్తున్నారు. పేపర్పై రాసి ఇస్తూ.. రోగులు డిమాండ్గా అడిగితే ల్యాబ్కు సంబంధించిన నిర్వాహకులు చిన్న పేపర్పై రాసిస్తున్నారు. అసలు అవి ఏం రిపోర్ట్లో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేపర్ లేకపోవడంతో కంప్యూటర్ ద్వారా వచ్చే ప్రింట్ ఇవ్వకపోవడంతో రాసి ఇస్తున్నారు. ఫలితంగా సరైన చికిత్స అందే అవకాశం ఉండదు. రోగ నిర్ధారణ చేసేదెలా? ప్రధానాస్పత్రిలోని ల్యాబ్లో అన్ని సౌకర్యాలు ఉండాల్సి ఉంటుంది. కానీ.. పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్లు ఇవ్వడానికి స్టేషనరీ లేకపోవడం శోచనీయం. రోగులు 15 రోజులుగా ఆస్పత్రిలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులకు సంబంధించిన శాంపిల్స్ను సేకరించి కంప్యూటర్లో రిపోర్ట్ తయారుచేస్తున్నారే గానీ ప్రింట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఎవరైనా గట్టిగా అడిగితే పేపర్పై రాసి ఇస్తున్నారు. ఫలితంగా రోగ నిర్ధారణ ఇబ్బందిగా మారుతోంది. రక్త, మూత్ర పరీక్షల శాంపిళ్లను రెండు వారాల క్రితం ఇచ్చామని, ఇప్పటి వరకు రిపోర్ట్టలు ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిపోర్ట్లు రాకపోవడంతో వైద్యులు మందులు రాయలేకపోతున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తాం స్టేషనరీ రాకపోవడంతో చిన్నపాటి ఇబ్బంది ఏర్పడింది. రోగులకు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. ల్యాబ్ పరీక్షలు చేసి అర్థమయ్యేలానే పేపర్పై రాసి ఇస్తున్నాం. స్టేషనరీ రాగానే రిపోర్ట్లు వెనువెంటనే ఇచ్చి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – సుమన్రావు, ఆర్ఎంవో అధికారులు స్పందించాలి ఇంత పెద్ద ఆస్పత్రిలో మెడికల్ రిపోర్ట్స్కు సంబంధించిన స్టేషనరీ లేకపోవడంతో ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
రైతులకు ఇబ్బందులే..
మార్క్ఫెడ్ సంస్థ నిబంధనలు రైతులకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. ఆ నిబంధనలు పాటించలేక రైతులు తక్కువ ధరకు దళారులకు విక్రయించే అవకాశం ఉంది. ఇలాగైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు పెద్దగా ఉపయోగం ఉండదు. – మారు మురళీధర్ రెడ్డి, మెట్పల్లి నిబంధనలు తప్పనిసరి కొనుగోలు కేంద్రాలకు మక్కలు తెచ్చే రైతులు తప్పనిసరిగ్గా నిబంధనలు పాటించాలి. గింజల్లో 14 తేమశాతం కంటే ఎక్కువ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయం. ఈ సారి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. రైతులందరూ తప్పకుండా సహకరించాలి. – ఎండీ.హబీబ్, మార్క్ఫెడ్ అధికారి -
పార్టీలో నా స్థానం ఏంటి?.. మంత్రి ముందు జీవన్రెడ్డి ఆవేదన
సాక్షి, జగిత్యాల జిల్లా: తనను హలాల్ చేసి రోజుకింత ఎందుకు చంపేస్తున్నారంటూ మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకేసారి చంపండంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముందు జీవన్రెడ్డి వాపోయారు. బీఆర్పూర్ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీపై జీవన్రెడ్డి అసంతృప్తి చేశారు. కమిటీలు, కాంట్రాక్టులు బీఆర్ఎస్ నుంచి వచ్చినవారికే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తమ స్థానమేంటని ప్రశ్నించారు.తాము వలసదారులం కాదంటూ తాజాగా పార్టీలోకి చేరి పదవులనుభవిస్తున్న వారిపై చురకలు అంటించారు. మంత్రి శ్రీధర్బాబు, అడ్లూరి అడుకోకపోతే ఆ రోజే కథ వేరుండేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కౌలుదారులం కాదు.. పట్టాదారులమంటూ జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. జీవన్రెడ్డి ఆవేదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. -
దళితకాలనీల్లో కనిపించని అభివృద్ధి
రాయికల్: పట్టణంలోని దళితకాలనీలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని మూడో వార్డును బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదివారం సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22నెలలు పూర్తయినా దళితవార్డుల్లో నయాపైసా అభివృద్ధి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో దళితవాడలకు ప్రత్యేక నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఆమె వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ మారంపల్లి రాణి, రాయికల్ కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, మాజీ కౌన్సిలర్లు మారంపెల్లి సాయికుమార్, శ్రీరాముల సత్యనారాయణ, నాయకులు వినోద్, రాంప్రసాద్ పాల్గొన్నారు. -
మద్యం దుకాణాల టెండర్ల గడువు పెంపు
జగిత్యాలక్రైం: జిల్లాలో 71 మద్యం దుకాణాలకు ప్రభుత్వం గడువు పెంచింది. ముందుగా ఈనెల 18న చివరి రోజుగా ప్రకటించడంతో శనివారం పొద్దుపోయేదాకా దరఖాస్తులు స్వీకరించారు. మొత్తంగా 1,834 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున ప్రభుత్వానికి రూ.55.02కోట్ల ఆదాయం సమకూరింది. అయితే దీపావళి సెలవులతోపాటు శనివారం బీసీ సంఘాలు రాష్ట్ర బంద్ నిర్వహించడం.. బ్యాంకులకు సెలవు ప్రకటించడంతో సర్కారు దరఖాస్తులకు గడువు పెంచింది. దీని ప్రకారం.. ఈనెల 23వరకు టెండర్లు వేసేందుకు అవకాశం ఉంది. 2023–25కి గాను 2,636 దరఖాస్తులు రాగా.. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు చొప్పున ప్రభుత్వానికి రూ.52.72 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి 1,834 దరఖాస్తులు రాగా ఒక్కో దరఖాస్తుకు రూ.3లక్షల చొప్పున రూ.55.02కోట్లు ఆదాయం వచ్చింది. గడువు పెంచడంతో మరిన్ని దరఖాస్తులు రానున్నాయి. ఈనెల 27న జిల్లా కేంద్రంలోని విరూపాక్షి గార్డెన్లో కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వాహకులను డ్రాపద్ధతిలో ఎంపిక చేయనున్నారు. -
మళ్లీ..అదే తీరు
● పదిహేను రోజుల క్రితం.. కోరుట్ల పట్టణ శివారులో ఇసుక అక్రమ రవాణాదారు ఓ ఆర్ఐ, ముగ్గురు వీఆర్ఏలపై దాడికి దిగి మామూళ్ల ప్రస్తావన తెస్తూ దూషించాడు. ఈ ఘటన జరిగిన ఐదు రోజుల వరకూ రెవెన్యూ అధికారులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అతికష్టంపై మోహమాటానికి ఫిర్యాదు చేసినా.. అంతలోనే రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యక్తి ఎడారి దేశానికి వెళ్లిపోయాడు. ● రెండు రోజుల క్రితం కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి సమీపంలో ఓ ఇసుక డంప్ నుంచి లారీలు, టిప్పర్లతో ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. తమనే అడ్డుకుంటారా..? అని సదరు అక్రమ రవాణాదారులు గొడవ చేసి.. సిబ్బందిపై దాడి చేసి.. వారిని తోసేసి ఇసుకతో లారీలు, టిప్పర్లను దర్జాగా తీసుకెళ్లారు. ఈ విషయమై దాడికి గురైన సిబ్బంది రెవెన్యూ అధికారులకు తెలిపితే ‘పోనీలే’..అంటూ రాజీ పడటం విశేషం. కోరుట్ల: ఈ రెండు సంఘటనల్లోనూ రెవెన్యూ ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కలవరం రేపుతోంది. రాత్రి..పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవడానికి కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది అధికారుల తీరుతో అభద్రత భావంతో ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమ రవాణాదారులు దాడులకు పాల్పడుతున్నా.. ఫిర్యాదు చేయడంలో చూపుతున్న ఉదాసీనతకు ‘మామూళ్ల మత్తు’ కారణమా.. లేక రాజకీయ ఒత్తిళ్ల ఫలితమా..? అనే విషయం తేలడం లేదు. ఈ రెండు సంఘటనలు జరిగిన వెంటనే కోరుట్ల, కథలాపూర్ సరిహద్దుల్లోని సిరికొండ, బొమ్మెన, నాగులపేట, సంగెం ఏరియాల్లోని వాగుల్లో కనీసం గట్టి ఏర్పాట్లు చేసి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారా.. అంటే అదీ లేదు. ఓ వైపు రెవెన్యూ సిబ్బందిపై వరుస దాడులకు తెగబడుతూనే.. మరోవైపు యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా లారీలు, టిప్పర్లతో కోరుట్ల నుంచి జగిత్యాల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వైపు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు..? ఇసుక అక్రమ రవాణాను క్షేత్రస్థాయిలో అడ్డుకోవాల్సిన కింది స్థాయి సిబ్బంది దాడుల భయంతో విధుల నిర్వహణపై అనాసక్తితో ఉండగా.. పైస్థాయి అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో నలిగిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోరుట్ల, కథలాపూర్ మండలాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది కీలక నేతలు ఈ ఇసుక అక్రమ రవాణాకు వెన్నుదన్నుగా ఉంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఇసుక అక్రమ రవాణాకు అడ్డుపడిన వెంటనే కీలకనేతల ఫోన్లు రావడంతో తప్పనిసరై వదిలేయాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే తమ సిబ్బందిపై దాడులు జరుగుతున్నప్పటికీ.. పట్టింపులేని ధోరణితో రాజీబాటను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. చివరికి కొంతమంది అధికారులు ‘నలుగురితో నారాయణ’ అన్న చందంగా అమ్యామ్యాలకు ఆశపడి నిర్లిప్తంగా ఉండక తప్పనిసరి పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో ఓ వైపు భూగర్భజలమట్టం పడిపోయే ప్రమాదం పొంచి ఉండటంతోపాటు..ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాకు పెద్ద ఎత్తున గండిపడుతోందన్న మాట వాస్తవం. -
ధర్మపురిలో లక్ష్మీపూజలు
అద్దాల మండపంలో పూజలు ధర్మపురి: దీపావళి సందర్భంగా శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం మొదటి రోజు అద్దాల మండపంలో ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ మంత్రోచ్ఛరణలతో లక్ష్మీపూజలు చేశారు. సోమవారం సాయంత్రం స్వామివార్ల ఊరేగింపు సేవ, మంగళవారం సాయంత్రం సహస్రదీపాలంకరణ చేస్తారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, సభ్యులు, అర్చకులు తదితరులున్నారు. దీపావళికి కొత్త కాంతులు తేవాలిజగిత్యాలటౌన్: దీపావళి జిల్లా ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, సంతోషాలు నింపాలని సూచించారు. ఆలయాల్లో భక్తుల రద్దీధర్మపురిలోని ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు ఆచరించారు. ఆలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాంమల్యాల: ఆలయ ఉద్యోగుల ప్రమోషన్లు, బదిలీ కోసం కృషి చేయాలని కొండగట్టు దేవస్థానం ఆలయ ఉద్యోగులు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ను కోరారు. ఆదివారం కరీంనగర్లో ఆయనను కొండగట్టు ఆలయ ఉద్యోగులు మర్యాద పూర్వకంగా కలిసి అంజన్న ప్రసాదం అందించారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్ది, రాష్ట్ర టీఎన్జీవో ఉపాధ్యక్షుడు రాగి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాజన్నను దర్శించుకున్న శృంగేరి పీఠాధిపతి
● ఘనస్వాగతం పలికిన మంత్రి పొన్నం, విప్ ఆది శ్రీనివాస్ ● పూర్ణకుంభ కలశంతో ఆలయ అర్చకుల స్వాగతంవేములవాడ: ధర్మ విజయ యాత్రలో భాగంగా వేములవాడకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి ఆదివారం రాత్రి చేరుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్, కలెక్టర్ హరిత, ఎస్పీ మహేశ్ బీ గీతే, ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు ఉమేశ్శర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం పూర్ణకుంభ కలశంతో స్వామి వారికి స్వాగతం పలికారు. స్థానిక తెలంగాణచౌక్కు చేరుకున్న స్వామీజీ ప్రత్యేక రథంపై ఆసీనులయ్యారు. జేసీబీ సహాయంతో గజమాల వేశారు. ఒగ్గుడోలు, భజన మండలి కళాకారులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్వామీజీని చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. పెద్దమ్మ స్టేజీ వద్ద జిల్లాలోకి.. గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి చేపట్టిన విజయ ధర్మ యాత్ర గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. బాసర నుంచి వస్తున్న స్వామీ యాత్రకు పెద్దమ్మస్టేజీ, ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో భక్తులు ఘనంగా స్వాగతం పలికారు.


