breaking news
Jagtial
-
శ్రీరాంనగర్లో మహిళా పాలకవర్గమే..
రాయికల్: మండలంలోని శ్రీరాంనగర్ పంచాయతీలోని నాలుగు వార్డుల్లో నలుగురూ మహిళలే విజ యం సాధించారు. సర్పంచ్గా రాధికగౌడ్, ఒకటో వార్డు సభ్యురాలిగా కూస దేవమ్మ తన ప్రత్యర్థి జోగుల సరితపై విజయం సాధించారు. రెండో వార్డు సభ్యురాలుగా శేర్ కిష్టమ్మ ఏకగ్రీవమయ్యా రు. మూడో వార్డు సభ్యురాలిగా కొంపల్లి సుమలత తన ప్రత్యర్థి జానయ్యపై గెలిచారు. అలాగే నాలుగో వార్డు సభ్యురాలిగా కొంపల్లి ప్రియాంక తన ప్రత్యర్థి లక్ష్మీపై గెలుపొందారు. వీరిలో ఉపసర్పంచ్గా కొంపల్లి ప్రియాంకను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరిక సర్పంచ్, వార్డు సభ్యులు బీజేపీని వీడి ఎమ్మెల్యే సంజయ్కుమార్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
నృసింహుడిని దర్శించుకున్న జిల్లా జడ్జి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని ఆదివారం జిల్లా జడ్జి రత్నపద్మావతి, ప్రిన్సిపల్ జిల్లా మేజిస్ట్రేట్ లావణ్య దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన మేళతాళాలు, సాంప్రదాయ రీతుల్లో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, అర్చకులు తదితరులున్నారు. గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలుధర్మపురి: షష్టి మాసం, ఆదివారం సెలవు దినం సందర్భంగా గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మంగలిగడ్డ, సంతోషిమాత ఘాట్లు కిటకిటలాడాయి. మల్ల న్న పట్నాల సందర్భంగా తమ తమ దేవుళ్లను భక్తులు గోదావరి నీటితో శుభ్రం చేశారు. దత్తాత్రేయ ఆలయానికి రూ.5లక్షల విరాళంకోరుట్ల: కోరుట్ల సాయిబాబా ఆలయంలో నిర్మిస్తున్న దత్తాత్రేయ ఆలయం, రమాసత్యనారాయణ స్వామి, లలితాంబిక ఆలయాల నిర్మాణం కోసం వ్యాపారవేత్త, సామాజిక వేత్త సంకు సుధాకర్ రూ.5 లక్షల విరాళం అందించారు. ఆలయ నిర్మాణానికి సుమారు రూ.3 కోట్ల వ్యయం అవుతుందని సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ బాలె నర్సయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు రాచకొండ దేవయ్య, నేమూరి భూమయ్య తెలిపారు. సుధాకర్ను కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండిబుగ్గారం: బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం బుగ్గారం మండలకేంద్రంలో పాటు గోపులాపూర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సర్పంచులకు సన్మానంమల్లాపూర్: నూతనంగా ఎన్నికై న సర్పంచులు తోట శ్రీనివాస్, చిట్యాల లక్ష్మణ్ను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సన్మానించారు. గ్రామాల్లో నిధుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు కమిటీ జిల్లా మాజీ స భ్యుడు దేవ మల్లయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ ముద్దం శరత్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఉప సర్పంచ్ @ రూ.25 లక్షలు
కాంగ్రెస్ మద్దతుదారులకు అండగా నిలవండిపెగడపల్లి/వెల్గటూర్/బుగ్గారం: గ్రామాల అభివృద్ధికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించుకుని తద్వారా మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పెగడపల్లి, వెల్గటూర్, బుగ్గారం మండలాల్లోని పలు గ్రామాలోల కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్మదర్శి శోభారాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, వెల్గటూర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, నాయకులు రాంమోహన్రావు, ఉదయ్, మురళి, సందీప్, శ్రీకాంత్రావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కోరుట్ల: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్కు జాయింట్ చెక్ పవర్ ఉండటంతో ఈసారి ఆ పదవికి ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి రిజర్వేషన్ అనుకూలంగా రాని చోట్ల చాలామంది కీలక నేతలు వార్డు మెంబర్లుగా పోటీచేశారు. ఉప సర్పంచ్ పదవి దక్కించుకుని తమ ప్రాధాన్యతను చాటుకోవాలన్న ఉద్దేశంతో ఎంత ఖర్చుకై నా వెనుకాడటం లేదు. కోరుట్ల నియోజకవర్గ పరిధిలో మొదటి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. చాలాచోట్ల ఉప సర్పంచ్ పదవికి వేలం వేసి దక్కించుకున్నారు. రూ.5లక్షల నుంచి.. మొదటి విడత ఎన్నికల్లో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్కు రూ.5లక్షల నుంచి రూ.20 లక్షలు వెచ్చించడం విస్మయం కలిగించింది. కోరుట్ల మండలంలో ఓ మేజర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ పదవికి ఒక్కోవార్డు మెంబర్కు రూ.2 లక్షల చొప్పున రూ.25 లక్షలు వెచ్చించాడు. కథలాపూర్ మండలంలోని ఓ గ్రామంలో ఉప సర్పంచ్ పదవికి రూ.20 లక్షలు చెల్లించారు. మరో గ్రామంలో రూ.8 లక్షలు వార్డు మెంబర్లకు చెల్లించారు. మల్లాపూర్ మండలంలో రూ.5 లక్షలు వెచ్చించారు. మెట్పల్లి మండలంలోని ఓ గ్రామంలో రూ.12 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇలా నియోజకవర్గంలో 23 గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవి పొందడానికి డబ్బులు వెచ్చించడం గమనార్హం. అవిశ్వాసం వస్తే.. ఉప సర్పంచ్ పదవికి రెండున్నరేళ్ల తరువాత మళ్లీ అవిశ్వాసం పెట్టవచ్చు. ఇపుడు డబ్బులు చెల్లించి ఉప సర్పంచ్ పదవిని దక్కించుకున్న వాళ్లు రెండున్నర ఏళ్ల తరువాత అవిశ్వాస గండం ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం వార్డు మెంబర్లకు డబ్బులు ఇచ్చి ఉప సర్పంచి పదవిని దక్కించుకున్న వారు మళ్లీ రెండున్నర ఏళ్లకు అవిశ్వాసం పెట్టరాదన్న ఒప్పందంతో డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. కానీ రెండున్నర ఏళ్ల వరకు గ్రామంలో పరిస్థితులు ఏలా ఉంటాయో..? అప్పటికి అవిశ్వాసం ప్రస్తావన వస్తే ఇప్పుడు ఇచ్చిన డబ్బులు.. చేసుకున్న ఒప్పందాలు ఉత్తవే అవుతాయన్న సంశయం ఉప సర్పంచి పదవిని దక్కించుకున్న వారిని వెంటాడుతోంది. -
వలస ఓటర్లపై ప్రత్యేక దృష్టి
బుగ్గారం: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. ఎన్నికలలో ప్రతి ఓటు కీలకం కానుండడంతో పోటీ చేస్తున్న అభ్యర్థులు గ్రామాల నుంచి వలసవెళ్లిన వారి సమాచారం సేకరిస్తూ ఓటింగ్ రోజు రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క ఓటుతోనే విజయాలు తారుమారవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు వలసవెళ్లిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. స్థానిక నాయకులకు బాధ్యతలు వలస ఓటర్ల వివరాలు సేకరించడానికి గ్రామాల్లో అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారికి బాధ్యతలు అప్పగించారు. వారు రంగంలోకి దిగి తమ ఊరి నుంచి ఎవరెవరు ఏయే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు..? వారిని ఎలా రప్పించాలి..? అనే విషయాలపై ప్రణాళిక వేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ఖర్చులన్నీ తామే భరిస్తామని హామీ ఇస్తూ పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది ఒక చోటు నుండి వచ్చే అవకాశం ఉన్నవారి కోసం వాహనాలు సమకూర్చడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ముఖ్యంగా ముంబాయి, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో అనేక మంది ఉద్యోగ, ఉపాధి రీత్యా నివాసం ఉంటున్నారు. అటువంటి వారిని రప్పిస్తే తమకు ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
జగిత్యాల
29.0/13.07గరిష్టం/కనిష్టంప్రభుత్వ జూనియర్ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. అయ్యప్ప పడిపూజమెట్పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ 18వ దీక్ష చేపట్టిన సందర్భంగా మహా పడిపూజ నిర్వహించారు. సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
పంపకాలపైనే దృష్టి
మా పైసలు మాకివ్వండి!సాక్షిప్రతినిధి, కరీంనగర్: నోటుకు రాలవు ఓట్లు.. అనేది మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో తేలిపోయింది. తొలి విడత ఫలితాలు మూడో విడత అభ్యర్థులకు గుణపాఠమైంది. గ్రానైట్, రెవెన్యూ గ్రామాల్లో తొలివిడత ఎన్నికల్లో పోటాపోటీగా పంపకాలు చేసిన అభ్యర్థులు అప్పుల పాలయ్యారు. ఒక్కో గ్రామంలో రూ.30 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు పంపకాలు జరగడం గమనార్హం. రూ.లక్షలు ఖర్చుచేసినా ఓటమి తప్పకపోవడంతో తొలివిడత గ్రామాల్లోని పరాజితులు ఎక్కడ మిస్సయ్యిందని లెక్కలేసుకుంటున్నారు. కాగా.. ఎన్నికల్లో విజయం సాధించిన.. పరాజయం పొందిన ఇద్దరి జేబులు ఖాళీ అయ్యాయి. పైగా అప్పులపాలయ్యారు. విజయం సాధించిన అభ్యర్థి సంపాదించుకుంటాననే నమ్మకంతో ఉండగా పరాజయం పొందిన అభ్యర్థులు, వారి అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఖర్చు చేశారో, ఏ ప్రాంతంలో ఓట్లు రాలేదో తెలుసుకుని ‘మా డబ్బులు వెనక్కియ్యండంటూ’ ఆయా ప్రాంతాల ఓటర్ల వద్దకు వెళ్లి జబర్దస్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఇంతని ఇచ్చినా కూడా ఓటర్లు ముఖం చూడకపోవడంతో అభ్యర్థుల ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ‘ఒక్కో ఇంటికి పెద్దమొత్తమే ఇచ్చినం.. అయినా అక్కడ నాలుగు ఓట్లు కూడా పడలేదంటూ’ తిట్లపురాణం మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది. మూడో విడతకు గుణపాఠం తొలివిడత ఎన్నికల్లో ఓటర్లు నేర్పిన పాఠం మూడో విడత అభ్యర్థులకు గుణపాఠం కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండోవిడతకు సంబంధించిన పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగానే సాగింది. చాలామంది ఓటర్లూ.. ఓటుకు నోటును ఆశిస్తుండటమూ కనిపించింది. ఓట్లు వేస్తారా.. లేదా.. తెలియదు కానీ.. పైసలైతే పంచాల్సిందే అని అభ్యర్థులే చెబుతుండటం గమనార్హం.గ్రామాలకు చేరిన యువ ఓటర్లు జగిత్యాలరూరల్: కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువత ఓటు వేసేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఉన్నత చదువులు చదువుతూ ఎంతో దూ రంలో ఉన్నవారు కూడా గ్రామాలకు చేరుకున్నా రు. గ్రామాల్లో రెండో విడత జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగ రిత్యా ఉన్నత విద్య కోసం హైదరాబాద్, బెంగుళూరు, పూణె, ఢిల్లీ, ముంబాయ్ ప్రాంతాల్లో ఉన్న యువ ఓటర్లను అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ఫోన్ల ద్వారా సంప్రదించి గ్రామాలకు రప్పించుకున్నారు. జగిత్యాల: రెండోవిడత పోలింగ్ ఆదివారం జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు పంపకాలపైనే దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు నిఘా పెట్టినప్పటికీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతోంది. ప్రచారం ముగియడంతో పోల్మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారు. డబ్బుల పంపిణీపై దృష్టి పెట్టారు. అధికారులు నిఘా ఉన్నా పంపకాలు మాత్రం ఆగడం లేదు. చావో రేవో... రెండో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫలి తాలు నేటితో తేలనున్నాయి. బరిలోకి దిగినవారు ఎలాగైనా గెలవాలన్న నేపథ్యంలో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేశారు. చిన్న గ్రామపంచాయతీలోనే రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చు చేయగా మేజర్ గ్రామపంచాయతీల్లో ఖర్చులకు చెప్పనక్కరలేదు. మహిళ సంఘాలు, కుల పెద్దల మద్దతు కూడగడుతున్నారు. ఇదిలా ఉండగా, దూర ప్రాంతాల్లో ఉన్నవారి కోసం డబ్బులు ఖర్చు పెట్టి వాహనాలు ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే కావడంతో ప్రతీ ఓటర్ను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బరిలోకి దిగిన అభ్యర్థులు ఖర్చు ఎంతైనా సరే గెలవాలన్న ఒక స్టేటస్తోనే వెళ్తున్నారు. ‘మొదటి విడత రిజర్వేషన్లు వచ్చిన పలు గ్రామాల్లో కొందరు పెట్టుబడిదారులు సర్పంచ్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారు. సదరు అభ్యర్థులు ఓడిపోవడంతో తిరిగి డబ్బు వసూలు చేసే పనిలో పడ్డారు.’‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో దాదాపు రూ.35 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ సర్పంచ్ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు. తమ నాయకుడు పంచిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓటర్లను అతని అనుచరులు వేధిస్తున్నారు.’‘కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని ఓ రెవెన్యూ గ్రామ పంచాయతీలో రూ.80 లక్షల వరకు ఖర్చు చేసిన ఓ అభ్యర్థి దారుణంగా ఓడిపోవడంతో ఆస్తులు అమ్ముకునేందుకు సిద్ధం అయ్యాడు’. -
ఎన్నికల విధులకు డుమ్మా.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్
జగిత్యాల: పంచాయతీ ఎన్నికల్లో విధులకు హాజరుకానందున ముగ్గురిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో 89 మంది అధికారులు విధులకు హాజరు కాకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ముగ్గురు ప్రిసైడింగ్ అధికారులు హేమ, రాధ, రఘుపతిరావును సస్పెండ్ చేశారు. ప్రశాంతంగా నవోదయ పరీక్షజగిత్యాల/ధర్మ పురి: జిల్లాలో శని వారం జవహర్లా ల్ నవోదయ ప్రవే శ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని శ్రీనిధి, గౌతమి, చైతన్య, పురాతన పాఠశాల, ధర్మపురిలోని బాలికల ఉన్నత పాఠశాలలో సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో సెంటర్లను అదనపు కలెక్టర్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట డీఈవో రాము, అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్ ఉన్నా రు. ధర్మపురిలో చీఫ్ సూపరింటెండెంట్ శంకర య్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో సీతామహాలక్ష్మి తదితరులు కేంద్రాన్ని పర్యవేక్షించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టిరాయికల్(జగిత్యాల): గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని మెట్పల్లి డీఎస్పీ రాములు అన్నారు. శనివారం రాయికల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి సారించామని, ఎవరైనా ఎన్నికల్లో గొడవలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై సుధీర్రావు ఉన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం సందర్శనజగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ డెప్యూటీ సీఈవో నరేశ్ అన్నారు. శనివారం జగిత్యాల అర్బన్ మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రతి గ్రామంలో ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు. రూరల్ సీఐ సుధాకర్, తహసీల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో వాసవి పాల్గొన్నారు. వయోవృద్ధులకు ఆసరా టాస్కా జగిత్యాల: వయోవృద్ధులకు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆసరాగా ఉంటుందని జిల్లా అధ్యక్షుడు హరి అశోక్కుమార్ అన్నారు. 9వ టాస్కా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం భవనంలో వేడుకలు నిర్వహించారు. వయోవృద్ధులను నిరాదరిస్తే మూడు నెలల జైలుశిక్ష, జరిమానా ఉంటుందన్నారు. అనంతరం సీనియర్ సిటిజన్స్ను సత్కరించారు. విశ్వనాథం, ప్రకాశ్రావు, హన్మంతరెడ్డి, దేశాయి, బొల్లం విజయ్ పాల్గొన్నారు. 15న జాబ్మేళాజగిత్యాల: రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 15న జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. మేళాకు సంబంధించిన పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. జాబ్మేళాలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టెక్ మహేంద్రతో పాటు, ఇతర బహుళజాతి కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మిగతా వివరాలకు 84998 07141 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
‘కోరుట్ల ఎమ్మెల్యే.. నీ నియోజకవర్గాన్ని చూసుకో..’
జగిత్యాల: కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్.. మొదట మీ నియోజకవర్గ అభివృద్ధిని చూసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్సంజయ్కుమార్ అన్నారు. కోరుట్ల ఆస్పత్రిలో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతూ జగిత్యాలకు వస్తున్నారని, ఒకవేళ చేతకాకపోతే తన వద్దకు వస్తే సీఎం, మంత్రితో మాట్లాడి నిధులు ఇప్పిస్తానని పేర్కొన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. మెడికల్ కళాశాలను సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే 20 శాతం పనులు చేయలేకపోతున్నారని ఆరోపించడం సమంజసం కాదన్నారు. రాష్ట్రంలో ఆరు మెడికల్ కళాశాలలు ఇస్తే అందులో జగిత్యాలకు వచ్చేలా కృషి చేశానని, సీఎం రేవంత్రెడ్డిని కలిసి మెడికల్ కళాశాలకు రూ.40 కోట్లు మంజూరు చేయించడం జరిగిందన్నారు. దమ్ముంటే కోరుట్లలో 100 పడకల ఆస్పత్రిని తీసుకురావాలని, మెట్పల్లి ఆస్పత్రికి మరమ్మతులు చేయించాలన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఎన్ని అభివృద్ధి పనులు చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అధిక నిధులు మంజూరైంది జగిత్యాలకేనని, ఆ అభివృద్ధి ప్రజల కళ్లకు కట్టినట్లు కన్పిస్తుందన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్, క్యాదాసు నాగయ్య, చెట్పల్లి సుధాకర్, జగన్, కూసరి అనిల్, పంబాల రాము పాల్గొన్నారు. -
జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ విభాగం కీలకమని, ఇందులో యువతను చేర్పించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి కోరారు. టీపీసీసీ సేవాదళ్ సెక్రెటరీ బాగోజి ముఖేశ్ఖన్నా ఆధ్వర్యంలో చేపట్టిన ఆన్లైన్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని పట్టణంలోని ఇందిరాభవన్లో శనివారం డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్యతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీని నమ్ముకుని పని చేసే కార్యకర్తలు, నాయకులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, సలీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మహాభారత ప్రవచనంలో మాజీమంత్రి జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులోని రెడ్డి కల్యాణ మండపంలో శృంగేరి పీఠ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్కుమార్శాసీ్త్ర నిర్వహిస్తున్న మహాభారత ప్రవచన మహాయజ్ఞంలో మాజీమంత్రి జీవన్రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
జగిత్యాల
28.0/13.07గరిష్టం/కనిష్టంఅయ్యప్ప గిరి ప్రదక్షిణ కోరుట్ల: పట్టణంలోని అయ్యప్ప గుట్టపై గల జ్ఞాన సరస్వతి శనేశ్వర సహిత అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ చేశారు. నృసింహుని సన్నిధిలో రద్దీ ధర్మపురి: మార్గశిరమాసం శనివారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారలను దర్శించుకున్నారు. వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
హామీలను మరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కనీస అభివృద్ధి జరగడం లేదని, హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, విజయోత్సవాలు ఎవరి కోసం చేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. కోరుట్ల, మెట్పల్లి ఆస్పత్రుల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, ప్రజలు అసిహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో జగిత్యాల అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. ధర్మపురిలో వ్యవసాయ కళాశాల మంజూరుతో పా టు, 40 ఎకరాల భూమి కేటాయిస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయని దానిని జగిత్యాలకు తరలించారన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పిన కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందన్నారు. విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో చె ప్పాలని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మీ, తులం బంగా రం ఇచ్చినందుకా అని హేళన చేశారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా ఇంటిగ్రేటెడ్ మా ర్కెట్, యావర్రోడ్ కనీస అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మాజీమంత్రి గొడిశెల రాజేశంగౌడ్, ఎ ల్లాల శ్రీకాంత్రెడ్డి, లోక బాపురెడ్డి, దేవేందర్నా యక్, శీలం ప్రవీణ్, వొల్లం మల్లేశం పాల్గొన్నారు. -
మలి దశకు వేళాయె..
జగిత్యాల/జగిత్యాలరూరల్/రాయికల్: జిల్లాలో రెండో విడత పోలింగ్ నిర్వహణకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు, ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి గ్రామాలకు తరలివెళ్లారు. ప్రతీ మండల కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని ఆయా బూత్లకు తరలించారు. రెండో విడత జిల్లాలో మొత్తం 144 పంచాయతీలకు 10 ఏకగ్రీవం కాగా 134 సర్పంచ్ స్థానాలకు, 1,276 వార్డులకు 330 ఏకగ్రీవం కాగా, 946 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ సిబ్బందిని సైతం అదనంగా 10 శాతం రిజర్వ్లో ఉంచారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కెమెరాలు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరుగగా, రెండో విడత సజావుగా నిర్వహించేందుక భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో పోలింగ్ సరళి నెమ్మదిగా సాగడంతో ఒంటి గంటకు ముగియాల్సిన పోలింగ్ కొన్ని గ్రామాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగడంతో చాలా గ్రామాల్లో కౌంటింగ్ లేట్గా జరిగింది. ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. అయితే అధికారులు ఈసారి తొందరగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెండో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల సిబ్బంది నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సిబ్బందికి పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలి: ఆర్డీవో ఎన్నికల అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. శనివారం ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జగిత్యాల రూరల్ మండలం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని, ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. డీపీవో రఘువరణ్, ఎంపీడీవో రమాదేవి, రూరల్ తహసీల్దార్ వరందన్, ఎంపీవో రవిబాబు, సూపరింటెండెంట్ గంగాధర్, డెప్యూటీ తహసీల్దార్ అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాయికల్ మండలంలోని 30 గ్రామాల్లో ఆదివారం జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద నుంచి సామగ్రిని పంపిణీ చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ పరిశీలించారు. ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్, ఎంఈవో రాఘవులు, కమిషనర్ మనోహర్గౌడ్ పాల్గొన్నారు. రెండో విడత పోలింగ్ వివరాలు.. మండలాలు 7 గ్రామపంచాయతీలు 144 వార్డులు 1,276 ఏకగ్రీవమైన జీపీలు 10 ఏకగ్రీవమైన వార్డులు 330 పోలింగ్ కేంద్రాలు 1,276 ఓటర్లు 2,12,092 పీవోలు 1,531 వోపీవోలు 2,041 -
రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశామని, 853 మంది సిబ్బందిని కేటాయించినట్లు వివరించారు. 57 రూట్స్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, స్ట్రైకింగ్ ఫోర్స్, ఎస్సైలతో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఓటరు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందని, గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, సభలు, బైక్ ర్యాలీలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన జగిత్యాలరూరల్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రమేశ్ తెలిపారు. శనివారం జగిత్యాల అర్బన్ మండలంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల విధుల్లో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. బ్యాలెట్ పత్రాలు జాగ్రత్తగా చెక్చేసుకుని ప్యాక్ చేయాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లా నోడల్ అధికారులు నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి
ధర్మపురి: కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రాయపట్నం, కమలాపూర్, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి గ్రామాలను మరింత అభివృద్ధి దిశలో తీసుకుపోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ కుటుంబానికి అందుతున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నాయకులు, ఆయా గ్రామాల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రామగుండం: శీతాకాలంతోపాటు సంక్రాంతి పండుగ కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది. హైదారాబాద్–గోరఖ్పూర్(07075) మధ్య ఈనెల 16, జనవరి 23వ తేదీల్లో నడుస్తుంది. గోరఖ్పూర్–హైదరాబాద్(07076) మధ్య ఈనెల 18, జనవరి 25వ తేదీ నడుస్తుంది. మచిలీపట్నం–అజ్మీర్(07274) ఈనెల 21న ఉదయం పదిగంటలకు బయలు దేరుతుంది. అదేరైలు తిరుగు ప్రయాణం(07275)లో అజ్మీర్–మచిలీపట్నం ఈనెల 28న ఉదయం 8.25 గంటలకు అజ్మీర్లో ప్రారంభమవుతుంది. రోడ్డుపై పడి వ్యక్తి మృతిసిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడుకు చెందిన ఏస పర్శరాములు(55) గురువారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. పర్శరాములు గత ఆరు నెలలుగా సిరిసిల్లలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. రాత్రి 10 గంటలకు పని ముగించుకొని నడుచుకుంటూ రగుడు వెళ్తుండగా చంద్రంపేట చౌరస్తా వద్ద రోడ్డు పక్కన ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మృతునికి భార్య వనజ, కుమారులు సాయిదీప్, శ్రీనివాస్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పొలంలో పడి రైతు..రామడుగు: రామడుగు మండలంలోని వెదిర గ్రామానికి చెందిన శనిగరపు అంతయ్య(65) గుండెపోటుతో వ్యవసాయ పొలంలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం అంతయ్య శుక్రవారం ఉదయం పొలంలో పనులు చేస్తుండగా గుండెపోటుకు గురై పొలంలో పడిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్కు తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. గీత కార్మికుడు..రామడుగు: రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన మల్లారపు శంకరయ్య(70) అనే గీతకార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు వెళ్లి ఇంటి వచ్చాడు. కాసేపటికి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. పత్తిమిల్లులో అగ్ని ప్రమాదం కోనరావుపేట(వేములవాడ): మండలంలోని సుద్దాల గ్రామంలోని పత్తిమిల్లులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని మిల్లులో అగ్ని ప్రమాదం ఏర్పడింది. మిల్లులో పనిచేస్తున్న కార్మికులు, హమాలీలు సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. వేములవాడలోని ఫైర్స్టేషన్కు సమాచారం అందించడంతో వాహనం వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చింది. మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసిన పత్తి నిల్వలు ఉన్నాయి. ఎలాంటి నష్టం జరగకపోవడంతో యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఓట్ల లెక్కింపుపై ఫిర్యాదులు
మంథని: సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగలేదని పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మెండె రాజయ్య ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఓట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఓట్ల లెక్కింపు క్రమంలో తనకు ప్రత్యర్థి కన్నా అదనంగా ఒకఓటు వచ్చిందని, దీంతో గెలుపు తనదేనని ప్రకటించిన కొద్దిసేపటికే ఓటు చెల్లదని అధికారులు ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందన్నారు. అంతేకాకుండా ఆగమేఘాలపై అధికారులు తనను అయోమయానికి గురిచేసి డ్రా పద్ధతిన ప్రత్యర్థిని గెలిచినట్లు ప్రకటించారని అన్నారు. ఓట్ల లెక్కింపుల్లో అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన ఫిర్యాదులో కోరారు. పెగడపల్లి సర్పంచ్ ఎన్నికపై.. పెద్దపల్లి: కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి పంచాయతీ ఎన్నికల్లో అనుమానాలు ఉన్నాయని సర్పంచ్ అభ్యర్థి అల్లం సదయ్య పెద్దపల్లి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. బ్యాలెట్ బండిళ్లపై గుర్తు కనిపించలేదని, లెక్కింపు సమయంలో తమ ఏజెంట్లను ఓట్ల ధ్రువీకరణకు అనుమతివ్వలేదని, కౌంటింగ్ విధానం సరిగా చేయకుండానే ఫలితాలు ప్రకటించారని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని, రీకౌంటింగ్ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నూనేటి సదయ్య యాదవ్, మాజీ జెడ్పీటీసీలు వంగళ తిరుపతిరెడ్డి, గంట రాములు యాదవ్ తదితరులు ఉన్నారు. -
‘కిసాన్’ సంబురం
పెద్దపల్లి: ఈ ఏడాది రెండో విడతను కిసాన్ సమ్మాన్ నిధులను కేంద్రప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున చెల్లించింది. పథకం ఏడాదికి మూడు విడతల్లో రూ.2వేల చొప్పున సాయం అందిస్తోంది. తగ్గిన రైతుల సంఖ్య జిల్లాలోని 65,757 మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కేంద్రప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. అంతకుముందు 73,400 మంది రైతులకు సాయం అందించగా.. అనేక కారణాలు, అనర్హులను తొలగిస్తూ 65,757మందిని అర్హులుగా తేల్చింది. వీరికే రెండోవిడత నిధులు జమచేసింది. పొరపాట్లు సరిచేయండి జిల్లాలో కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 65,757 మంది రైతులకు రూ.2వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నారు. మిగిలిన వారు బ్యాంకు ఖాతాలు, ఆధార్ నంబరులో పొరపాట్లు సవరించి తమ వివరాలను సమర్పిస్తే.. వారికి కూడా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంది. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి -
యాచకుల రహిత రామగుండం లక్ష్యం
కోల్సిటీ(రామగుండం): యాచకుల రహిత రామగుండం నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతీఒక్కరు సహకరించాలని బల్దియా కమిషనర్ అరుణశ్రీ కోరారు. స్మైల్ ప్రాజెక్ట్ (సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ ప్రైజెస్) నిర్వాహక సంస్థ శ్రీవినాయక విమెన్(అర్బన్) త్రిఫ్ట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రూపొందించిన పోస్టర్ను శుక్రవారం బల్దియాలో ఆవిష్కరించారు. కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్న ఈ ప్రాజెక్ట్లో యాచకులను గుర్తించి పునరావాసం కల్పిస్తుందన్నారు. గోదావరిఖని తిలక్నగర్ డౌన్లో స్మైల్ ప్రాజెక్ట్ పునారావాస కేంద్రాన్ని మెప్మా నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో ఉచిత వసతి, మూడు పూటలా భోజనం, ఆసక్తి గలవారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తుందని వివరించారు. యాచకులు కనిపిస్తే 70135 84588, 86397 17597 నంబర్లకు ఫోన్చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు. ఈ అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్రావు, మెప్మాటౌన్ మిషన్ కో ఆర్డినేటర్ మౌనిక, సీవో ఊర్మిళ, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు నూనెలతా మోహన్, నిర్వాహకులు శరత్ మోహన్, మమత తదితరులు పాల్గొన్నారు. -
డ్రా పద్ధతిలో వార్డుమెంబర్ గెలుపు
కథలాపూర్(వేములవాడ): పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కథలాపూర్ మండలం ఇప్పపెల్లిలో ఒకటో వార్డు బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో డ్రా పద్ధతిలో గెలుపును నిర్ధారించారు. ఒకటో వార్డులో పూదరి గంగు, పానుగంటి లక్ష్మి బరిలో ఉన్నారు. ఇద్దరికీ 51 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీయగా పూదరి గంగు విజయం సాధించారు. మృతశిశువుతో ఆందోళనహుజూరాబాద్: హుజూరాబాద్ ఆస్పత్రి ఎదుట మృత శిశువుతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన దాట్ల లత ఎనిమిది నెలల గర్భిణీ. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గురువారం పరీక్షలు చేయించుకుని ఇంటికి వెళ్లింది. సాయంత్రం కడుపునొప్పి వచ్చింది. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా గర్భస్రావమైంది. వైద్యులు పరీక్షించి శిశువు చనిపోయి రెండురోజులు అవుతుందని చెప్పారు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు హుజూరాబాద్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులో పాప చనిపోయిందని ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరుగుతోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరెడ్డి తెలిపారు. హత్యాయత్నం కేసులో ఒకరి రిమాండ్ వేములవాడ: మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నలుగురిపై కేసు నమోదు చేసి, ఒకరిని రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. నాగయ్యపల్లి సర్పంచ్ స్థానానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చింతపంటి మల్లేశం సర్పంచ్గా గెలుపొందగా సమీప అభ్యర్థి గోపు మధు ఓడిపోయారు. అతని భార్య గోపు మాలతి సైతం వార్డ్మెంబర్గా ఓడిపోయారు. తమ ఓటమికి అదే గ్రామానికి చెందిన ఏఎంసీ చైర్మన్ రొండి రాజు కారణమని కక్ష పెంచుకుని గుంటి శివ, గుంటి నగేశ్, మరో ఇద్దరితో కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడు రాజు ఫిర్యాదుతో వేములవాడరూరల్ పోలీస్స్టేషన్లో గోపు మధు, గోపు మాలతి, గుంటి శివ, గుంటి నగేశ్పై హత్యాయత్నంతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గోపు మధును శుక్రవారం రాత్రి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. డీఎస్పీ ఆధ్వర్యంలో రెండు స్పెషల్ టీమ్లను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. -
సైబర్ మోసం.. రూ.3.3లక్షలు మాయం
ధర్మపురి: సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి ఓక వేద పండితుడు మోసపోయిన ఘటన ధర్మపురిలో జరిగింది. ధర్మపురికి చెందిన కొరిడె చంద్రశేఖర్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారు. శుక్రవారం తన సెల్ఫోన్లో వచ్చిన వ్యోమ్ యాప్ను డౌన్లోడ్ చేయగా బ్యాంకు అధికారుల పేరుతో సైబర్ మోసగాడు లైన్లోకి వచ్చి బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డు నంబర్ తెలుపాలని సూచించాడు. బాధితుడు డెబిట్కార్డు నంబర్ తెలుపగా 2 గంటల్లో నీ పని పూర్తి అవుతుందని సైబర్ మోసగాడు పేర్కొన్నాడు. ఈక్రమంలో చంద్రశేఖర్ బ్యాంకు ఖాతాలోని రూ.3,03,300 లక్షలు మాయం కాగా, బాధితుడు జగిత్యాల సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని.. జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ కథనం మేరకు వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గోపాల్పల్లికి చెందిన బోదాసు దేవరాజు(37) ఏడాదిగా సోదరి గ్రామం గూడెంలో ఉంటున్నాడు. కూలీ పనులకు వెళ్తున్నానని గురువారం ఇంట్లో నుంచి వెళ్లిన దేవరాజు ఇంటికి తిరిగిరాలేదు. శుక్రవారం కుటుంబ సభ్యులు వెతకగా గూడెం శివారులో చెట్టుకు ఉరివేసుకుని దేవరాజు విగతజీవిగా కనిపించాడు. ఏడాది క్రితం దేవరాజు భార్యతో గొడవపడుతున్నాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో దేవరాజు మద్యానికి బానిసయ్యాడు. మృతునికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి బోదాసు నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం పట్టివేతరాయికల్(జగిత్యాల): మండలంలోని కట్కాపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి రంజిత్కుమార్ అనే యువకుడు మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎఫ్ఎస్టీ సభ్యులు పట్టుకున్నారు. రూ.4,500 విలువ గల 12 బీర్లు, 12 క్వార్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఎఫ్ఎస్టీ సభ్యులు పద్మయ్య, రంజిత్కుమార్, తిరుపతి పాల్గొన్నారు. -
దీపావళికి గుర్తింపుపై సంబరాలు
దీపావళికి సాంస్కృతిక వారసత్వ జాబితాలో యునెస్కో చోటునివ్వడాన్ని హర్షిస్తూ అల్ఫోర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండగను చేర్చుతూ నిర్ణయించడం పట్ల దీపాలు వెలిగించి..టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి , రిటైర్డ్ ప్రిన్సిపల్ డా.మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. – కొత్తపల్లి(కరీంనగర్) -
ఆ రెండు పంచాయతీలు పవర్ఫుల్
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి, టీటీఎస్ అంతర్గాం పవర్ఫుల్ పంచాయతీలు. కుందనపల్లి ఓటర్లు 1,850 మంది ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. ఎన్టీపీసీ నిర్వాసిత గ్రామం. వసతుల కల్పనకు ఎన్టీపీసీ సీఎస్ఆర్ ద్వారా నిధులు కేటాయిస్తుంది. ఎన్టీపీసీ బూడిద చెరువు కూడా ఉంది. బూడిదకు డిమాండ్ ఏర్పడింది. ఐవోసీఎల్, హెచ్పీసీఎల్ డిపోలతో పాటు ఐవోసీ, హెచ్పీ, ఐబీపీ పెట్రోల్ బంకుల స్థిరాస్థుల నుంచి అత్యధికంగా పన్నుల రూపేణా నిధులు సమకూరుతాయి. ఏటా సుమారు రూ.కోటి వరకు పంచాయతీ ఖజానాకు జమవుతుంది. దీంతో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు హోరాహోరీగా పోటీపడుతున్నారు. టీటీఎస్ అంతర్గాంలో 600 ఎకరాలు.. టీటీఎస్ అంతర్గాం పరిధిలో సుమారు 600 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అన్ని గ్రామాలకు జంక్షన్. విమానశ్రయం, పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు ఉండడంతో సర్పంచ్ పదవిపై ప్రతీఒక్కరి దృష్టి పడింది. దీంతో ఎలాగైనా సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రామంలో 1,302 మంది ఓటర్లు ఉండగా, ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు. -
హామీల బాండ్ పేపర్ విడుదల
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్లో సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి ఆకుల మణక్క తాను గెలిస్తే సమస్యలు పరిష్కరిస్తామని బాండ్ పేపర్ విడుదల చేశారు. సర్పంచ్గా పోటీచేస్తున్న ఆమె.. అభివృద్ధి పనులు చేపడతామని శుక్రవారం బాండ్ పేపర్పై రాసి మేనిఫెస్టో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ 40 ఏళ్లుగా గ్రామంలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, తనను గెలిపిస్తే ఐదేళ్లలోనే 14 సమస్యలు పరిష్కరిస్తానని బాండ్ పేపర్ రాశారు. ఆ పేపర్ను అభిమానులు, ఓటర్ల మధ్య విడుదల చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. -
సాధారణ ప్రసవాలు పెంచాలి
రాయికల్/మల్లాపూర్: ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని డెప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం రాయికల్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్త్కవరేజ్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, డయాలసిస్ వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గైనాలజిస్ట్ డాక్టర్ ఒడ్నాల రజిత, డాక్టర్ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి ప్రజారోగ్యమే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మల్లాపూర్ పీహెచ్సీని సందర్శించారు. బీపీ, షుగర్ రోగులకు సకాలంలో మందులు అందించాలన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏఎన్ఎం లచ్చమ్మపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. వైద్యాధికారి డాక్టర్ వాహిని, సీహెచ్వో రామ్మోహన్, హెల్త్ సూపర్వైజర్లు శకుంతల, విజయ తదితరులు పాల్గొన్నారు. -
ఆధిపత్య ఆరాటం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో తొలిఘట్టం ముగిసింది. తొలివిడతలో 397 గ్రామాలకు ఎన్నికలకు జరగ్గా 51శాతానికి పైగా (205) స్థానాలు కై వసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక 29శాతం (116) సీట్లు దక్కించుకుని బీఆర్ఎస్ రెండోస్థానంలో నిలవగా, బీజేపీ 9శాతం (35) సీట్లతో మూడో స్థానం దక్కించుకుంది. ఉమ్మడి జిల్లాలో తొలివిడతలో 398 గ్రామాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. పెద్దపల్లి జిల్లా పెద్దంపేట గ్రామం ఎన్నిక కోర్టు కేసు నేపథ్యంలో వాయిదా పడింది. మొత్తంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది. బీఆర్ఎస్, బీజేపీలు చెప్పుకోదగ్గ సీట్లు సాధించాయి. నాలుగు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో ఏయే గ్రామాల్లో ఎవరు ఎన్ని ఓట్లు సాధించారు? ఎంత వ్యత్యాసంతో ఓటమి చెందారు? ఏ కారణాలు విజయావకాశాలను ప్రభావితం చేశాయన్న విషయాలపై పార్టీలపరంగా ఆలోచనలు చేస్తున్నారు. బీజేపీ అనూహ్య ఫలితాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీజేపీ బలపరచిన దాదాపు 35 మంది సర్పంచులు గెలిచారు. మరో 35మంది వరకు స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. పెద్దపల్లి జిల్లాలో బీజేపీ ప్రభావం కనిపించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కరీంనగర్లో 14, సిరిసిల్లలో 07 స్థానాలు గెలచుకుని సత్తా చాటింది. జగిత్యాలలోనూ 14 స్థానాలు కై వసం చేసుకుని మొత్తంగా 35 సర్పంచులను గెలిపించుకుంది. ఈ విజయానికి రెండో, మూడో విడతలను వేదికగా చేసుకోవాలని పథకాలు రచిస్తోంది. వాస్తవానికి ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లోనే తాము బలపరిచిన 50 మంది సర్పంచ్గా గెలిచారంటూ ప్రకటించడం విశేషం. మొత్తానిక బీజేపీ అనూహ్య ఫలితాలు ఆ పార్టీలో సరికొత్త జోష్ నింపింది. 10శాతం ఇతరులపై అధికార పార్టీ కన్ను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తొలివిడతలో 44 మంది అభ్యర్థులు ఇతరులు/ స్వతంత్రులు ఉన్నారు. వీరందరినీ ఇప్పటికే అధికార పార్టీ తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమైంది. దాదాపుగా వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మిగిలిన బీఆర్ఎస్ నుంచి గెలిచిన 116 మంది సర్పంచుల్లో పలువురితో అధికార పార్టీ మంతనాలు మొదలుపెట్టింది. గెలిచిన వారంతా మనోళ్లే అన్న సిద్ధాంతంతో అధికార పార్టీ ముందుకు వెళ్తుండగా.. అప్పులు చేసి గెలిచిన వాళ్లు, అధికార పార్టీతో మనకెందుకు అన్న ఆందోళనలో ఉన్న వారంతా హస్తం తీర్థం పుచ్చుకునే ఆలోచిస్తున్నారు. వీరంతా తోడైతే అధికార పార్టీ మద్దతు ఉన్న సర్పంచుల సంఖ్య అమాంతం పెరగనుంది. తొలివిడతలో పెద్దపల్లిలో కాంగ్రెస్ 90 గ్రామాల సర్పంచ్ స్థానాలకుగాను 70 స్థానాలు గెలిచి పూర్తిస్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్లో 92 స్థానాలకు కాంగ్రెస్ 44 గెలవగా, 24 చోట్ల కారు పార్టీ విజయం సాఽధించింది. జగిత్యాలలో 122కి 52 సర్పంచులను కాంగ్రెస్ గెలవగా.. 42 సర్పంచు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుని గట్టిపోటీ ఇచ్చింది. సిరిసిల్ల్లలోనూ 85 సర్పంచి స్థానాలలో 39 కాంగ్రెస్ దక్కించుకోగా.. 28 బీఆర్ఎస్ వశపరచుకుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా.. సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్లలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా సర్పంచి స్థానాల కోసం పోటీ పడ్డాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కరీంనగర్, కోరుట్లలో బీఆర్ఎస్ చక్కటి ఫలితాలు సాధించింది. 14వ తేదీన జరగనున్న రెండో విడత, 17వ తేదీన జరిగే మూడో విడతలో మరిన్ని సీట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. -
మూడో ర్యాండమైజేషన్ పూర్తి
జగిత్యాల: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మూడో ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. పోలింగ్ అధికారులు 1,531, ఇతర అధికారులు 2,031 మంది రెండో విడత కోసం కేటాయించినట్లు వివరించారు. 7 మండలాల్లో బ్యాలెట్ బాక్స్లు, పోస్టల్ బ్యాలెట్స్ తరలింపు, ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అబ్జర్వర్ రమేశ్ పాల్గొన్నారు. గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలి ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ధరూర్ క్యాంప్లోనీ ఈవీఎం గోదాములను పరిశీలించారు. ప్రతినెలా తనిఖీల్లో భాగంగా గోదాములను పరిశీలించడం జరిగిందని, ఈవీఎంల భద్రత, సీసీకెమెరాల పనితీరు, గోదాముల వద్ద ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, తహసీల్దార్ రామ్మోహన్ పాల్గొన్నారు. -
హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ప్రజలకు వివరించాలి
జగిత్యాల: హెచ్పీవీ వ్యాక్సినేషన్ గురించి ప్రజలకు వివరించాలని, ఇది అత్యంత కీలకమైందని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం ఫార్మసీ అధికారులు, వైద్యాధికారులకు శిక్షణ కల్పించారు. దేశంలో సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణాలను ఈ వ్యాక్సిన్ ద్వారా తగ్గించవచ్చని పేర్కొన్నారు. సమాజంలో అవగాహన, ఎర్లీ వ్యాక్సినేషన్, తల్లిదండ్రుల పాత్ర అత్యవసరమన్నారు. ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, హ్యూమన్ పాపిలోమ వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ జననేంద్రియాలపై పులిపిర్లు వస్తుంటాయని, ఈ వ్యాక్సిన్ వల్ల రక్షణ ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరోగ్య సిబ్బంది కలిసి పనిచేస్తే విజయవంతం చేయవచ్చన్నారు. డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ మాట్లాడుతూ, కుష్టువ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ఆశా కార్యకర్తలు సర్వే చేయాలని, ఎర్రని రాయిరంగు, గోధుమరంగు మచ్చలు ఉంటే రెఫర్ చేయాలని సూచించారు. ప్రజలకు సేవలందించాలి ప్రజలు ఆర్థిక, ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి సేవలు అందించాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శుక్రవారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో విశ్వ జనని ఆరోగ్య పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లా లీగల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని, వైద్యం వారి హక్కు అని, వారికి కావాల్సిన వైద్యసే వలు అందించాలన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, లీగల్ అడ్వైజర్ చంద్రమోహ న్, డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధి కారి శ్రీనివాస్, ఆర్ఎంవోలు శ్రీపతి పాల్గొన్నారు. -
కాపర్వైరు దొంగలను గుర్తించాలి
ధర్మపురి: లిఫ్ట్ సబ్స్టేషన్లో చోరీకి పాల్పడిన కాపర్వైరు దొంగలను పోలీసులు గుర్తించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని రాయపట్నం గ్రామంలో గోదావరి తీరాన ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి సబ్స్టేషన్ శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట పొలాల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ సబ్స్టేషన్లోని కాపర్ వైరును దొంగలు ఎత్తుకెళ్లడం బాధాకరమని, వారిని తక్షణం గుర్తించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కాపర్వైరు చోరీతో విద్యుత్ సబ్స్టేషన్ నడవని పరిస్థితి నెలకొందన్నారు. సంబంధిత ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాతో ఫోన్లో సంప్రదించి కొత్త సామగ్రి ఏర్పాటుకు అవసరమైన నిధులు వారంలోగా విడుదల చేయాలని సూచించారు. సబ్స్టేషన్ లేదని రైతులు అధైర్యపడవద్దని, అన్నదాతల సంక్షేమం కోసం నేనున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. -
గ్రామాల అభివృద్ధికి సహకారమందిస్తా
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి/ఇబ్రహీంపట్నం: గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికై న సర్పంచ్లకు అన్ని విధాలుగా సహకారమందిస్తానని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లు పలువురు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారిని ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నా రు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీలకతీతంగా ప్రతీ సర్పంచ్కు గ్రామాల అభివృద్ధిలో తన వంతు సహకారమందిస్తానన్నారు. సర్పంచులుగా సింగిల్ విండో చైర్మన్లుఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నం సింగిల్విండో చైర్మన్ బద్దం గోపి, తిమ్మాపూర్ విండో చైర్మన్ బాస శ్రావణ్ సర్పంచులుగా గెలుపొందారు. సర్పంచ్ పదవులకు జనరల్గా రిజర్వేషన్ కేటాయించడంతో బరిలో నిలిచి గెలిచారు. సింగిల్విండో పదవికి 15 రోజుల్లో రాజీనామా చేయనున్నారు. -
రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించాలి
మెట్పల్లి(కోరుట్ల): ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది నాణ్యమైన సేవలందించాలని సీనియర్ సివిల్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్రావు సూచించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఇందులో పాల్గొని ఆయన మాట్లాడారు. రోగులకు సేవలే కాకుండా వైద్య విజ్ఞాన్ని కూడా అందించాల్సిన అవసరముందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని పలు గదులను పరిశీలించారు. నిధులు మంజూరు కాక నూతన భవన నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఆయనకు తెలుపగా, రాతపూర్వకంగా కలెక్టర్ దృష్టికి తీసుకపోతానని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికవెల్గటూర్(ధర్మపురి): ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. నవంబర్ 16న హ్యాండ్బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లాల్బహదూర్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సీనియర్ విభాగంలో ప్రతిభ కనబరిచిన ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన జైనపురం సాయికుమార్, హుజూరాబాద్ పెంచికల్పేటకు చెందిన చిలుముల సుమన్లు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 15 నుంచి 20 వరకు వెస్ట్బెంగాల్లో జరిగే 54వ జాతీయస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, ట్రెజరర్ శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ అశోక్, అసోసియేషన్ బాధ్యులు శ్రీనివాస్, అనూప్రెడ్డి, వీర్పాల్, రాజ్కుమార్, మహేశ్ తదితరులు అభినందించారు. షెడ్ల కేటాయింపుపై సర్వేజగిత్యాల: జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా పాతబస్టాండ్ నుంచి గొల్ల్లపల్లి రోడ్లో, సివిల్ ఆస్పత్రి వద్ద షాపులు కోల్పోయిన వీధి వ్యాపారులకు గొల్లపల్లి రోడ్లో 37 షెడ్లను నిర్మించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ స్పందన తెలిపారు. సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి వివరాలు సిద్ధం చేసినా ఆర్డర్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో నష్టపోయిన అర్హులైన వీధివ్యాపారులకు షెడ్ల కేటాయింపు పారదర్శకంగా జరిగేందుకు తుది జాబితా కోసం అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12 నుంచి 19 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తామని వివరించారు. అలాగే కొందరికి ఇప్పటికే కేటాయించినప్పటికీ వారు వేరే వ్యక్తులకు ఇవ్వడం లేదా, తాళం వేసి ఉపయోగించకుండా ఉండటాన్ని గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే వాటిని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. పశువైద్య కేంద్రం తనిఖీజగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం పొలాస పశువైద్య ఉప కేంద్రాన్ని జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి బొల్లం ప్రకాశ్ శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలో సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించి పలు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి శుభ్రంగా, అన్ని వసతులు ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. వెటర్నరి లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్ ఉన్నారు. -
ఇక ఓటర్లకు ఎర
జగిత్యాల: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. ఇప్పటికే ప్రచారానికి తెరపడగా, ఇక ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలో అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో డబ్బు, మందు, మాంసంతో ప్రలోభాలకు గురిచేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతీ అభ్యర్థి వెంట నిత్యం ఓ వందమంది మద్దతుదారులు ఉంటూ ఇంటింటా వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వీరికి ఉదయం టిఫిన్ నుంచి మొదలు మధ్యాహ్నం, రాత్రి వరకు భోజనాలు పెడుతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపైడెంది. కాగా, మొదటి విడత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు పెద్దగా ఖర్చు లేనప్పటికీ 2,3 విడతల్లో అభ్యర్థులకు సమయం ఎక్కువగా ఉండటంతో వారు ఖర్చుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపంచాయతీల్లో సైతం రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలు పెడుతుండగా, మేజర్ పంచాయతీల్లో ఖర్చుకు లెక్కలేకుండా పోతోంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే. చాలా పంచాయతీల్లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తుంటాయి. ఈనేపథ్యంలో లక్కీ డ్రాలో ఎవరి అదృష్టం బాగుంటే వారిని వరిస్తుంది. దీంతో ప్రతీ ఓటును రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రానుపోను వాహనాలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తున్నారు. గెలుపు కోసం తంటాలు ఆదివారం జరుగనున్న రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడినప్పటికీ గెలుపు కోసం అభ్యర్థులు ప్రతీ ఇంటి తలుపు తడుతూ శ్రీఅవ్వ ఓటు వేయాలి, అన్న ఓటు వేయాలిశ్రీ అంటూ బతిమిలాడుతున్నారు. కాగా ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ, చాలా గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లో రెబల్స్ గొడవ అత్యధికంగా ఉంది. దీంతో గెలుపు ఓటములపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులు మద్దతుదారులను కలుస్తూ ఓటు వేయాలంటూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల మహిళ సంఘాలకు, కుల సంఘాలకు అనేక హామీలు ఇచ్చారు. గంపగుత్తగా పడే ఓట్లైన మహిళ సంఘాలు, రైతు సంఘాలు, యువత, కుల సంఘాలు వీటిపై దృష్టి సారిస్తున్నారు. ఇక పంపకాలే.. ఇన్నిరోజులు ప్రచారం చేసి ఓట్లు వేయాలని అభ్యర్థించినా పంపకాలు మాత్రం ఆగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రచారంలో పాల్గొన్న వారితో పాటు, ఇంటింటికీ హామీ ఇవ్వడంతో పాటు, అటు డబ్బులు సైతం పంపకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మొదటి విడతలో ఓ వ్యక్తి డబ్బులు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. అభ్యర్థుల ఆందోళన రెండో విడతకు ఒకరోజే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పోటీలో నిలవడంతో చాలా మంది అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడకుండా అప్పులు తెచ్చి మరీ బరిలో నిలిచారు. గెలుపోటములు సహజం అయినా ఎవరో ఒకరికి ఓటమి తప్పదు. కానీ, ఖర్చు మాత్రం ప్రతీ అభ్యర్థికి ఉంటోంది. కొందరు అభ్యర్థులైతే ఏకంగా భూములు కుదవపెట్టుకుని, వాహనాలను అమ్ముకుని, బంధువుల వద్ద అప్పు తెచ్చుకుని మరీ పోటీ చేస్తున్నారు. ఓడిపోతే ఎలా అంటూ ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. -
గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులివే..
రాయికల్: గ్రామ పంచాయతీల్లో మరో వారం రోజుల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉండే ఆర్థిక వనరులు ఏమిటో తెలుసుకునేందుకు కొత్త పాలకవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులే ప్రధాన ఆదాయం. సాధారణ నిధులు గ్రామాభివృద్ధికి తోడ్పడనున్నాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు గ్రామపంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తుంది. నెలకు ఒక్కో వ్యక్తికి రూ.80 నుంచి రూ.90 చొప్పున కేటాయిస్తుంది. ఈ నిధులు ప్రతి మూడునెలలకోసారి ఏడాదిలో నాలుగు విడతలుగా అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు క్రమం తప్పకుండా మంజూరు చేయాల్సి ఉంటుంది. గ్రామంలోని జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తా రు. ఈ నిధులను మల్టీపర్పస్ వర్కర్లకు వేతనా లు, విద్యుత్ బిల్లులకు చెల్లించే అవకాశం ఉంది. సాధారణ నిధులు పంచాయతీలు సొంతంగా నిధులు సమకూర్చుకునే వాటిని సాధారణ నిధుల కింద గుర్తిస్తారు. ఈ నిధులు పెంచుకోవడానికి పంచాయతీల్లో ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాల్సి ఉంటుంది. ఉపాధి హామీ నిధులు గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధిహామీ పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. కూలీలు చేసే పనులకు 60 శాతం, మరో 40 శాతం నిధులు మెటిరియల్, కంపోనెంట్ కింద మంజూరు చేస్తారు. ఈ నిధులతోనే గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడతారు. పన్నుల ద్వారా ఆదాయం గ్రామపంచాయతీల పరిధిలో గృహ, ఇంటి నిర్మాణ అనుమతుల ద్వారా, ఆస్తిమార్పిడి, గ్రంథాలయ పన్ను ద్వారా గ్రామాలకు నిధులు సమకూరుతాయి. -
హస్తం హవా
కరీంనగర్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 398స్థానాలకు గానూ 203 స్థానాలు కై వసం చేసుకొని అధికార పార్టీ సత్తా చాటింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ 121స్థానాలతో పరిమితమై రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 37 స్థానాలతో మూడో స్థానం దక్కించుకుంది. గత ఎన్నికలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ మొదటి స్థానంలోకి దూసుకురాగా, బీజేపీ తన స్థానాలను మెరుగుపరుచుకొని మూడో స్థానంలో నిలిచింది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 99 స్థానాలకు గానూ కోర్టు వ్యవహారంతో పెద్దంపేట ఎన్నికల నిలిచిపోయింది. జూలపల్లి, కమాన్పూర్ ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. నాలుగు గ్రామాలను కాంగ్రెస్ ఏకగ్రీవంతో ఎగరేసుకుపోయింది.ఉమ్మడి జిల్లాలో పార్టీల పరంగా గెలిచిన మద్దతుదారులు జిల్లా గ్రామాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇతరులు కరీంనగర్ 92 44 24 14 10 పెద్దపల్లి 99 69 21 00 06 జగిత్యాల 122 51 48 16 07 సిరిసిల్ల 85 39 28 07 11 మొత్తం 398 203 121 37 34 -
చలిలోనూ తగ్గని ప్రచార వేడి
జగిత్యాల: పంచాయతీల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాలో 385 పంచాయతీలు, 3,536 వార్డులున్నాయి. మొదటి విడత ఎన్నికలు గురువారంతో ముగిశాయి. రెండోవిడత ఈనెల 14న, మూడో విడత ఈనెల 17న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఓటరు నాడీ దొరకాలంటే అభ్యర్థులు ఆలోచించి ముందుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో అభ్యర్థులంతా తెలిసిన వారే కావడంతో ప్రతి ఒక్కరికి ఓటు వేస్తామని హామీ ఇస్తుంటారు. అందరికీ ఒకే రకమైన భరోసా ఇస్తూ.. ఎక్కడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థులు కుల సంఘాలు, యూత్ సభ్యులను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అయినప్పటికీ గెలుపోటముల్లో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొదలైన టెన్షన్ పోలింగ్ దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. సర్పంచ్, వార్డు మెంబర్లలో కలవరం మొదలైంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 14న ఉండటంతో ప్రచారానికి కేవలం ఒకరోజు సమయం మాత్రమే ఉంది. మూడో విడత వారికి కొంత సమయం ఉంది. ఇన్ని రోజులు ఉపసంహరణలు, రెబల్స్ను బతిమిలాడుకోవడంతోనే సమయం పోగా, ఇక మిగిలిన సమయంతో ఓటర్లను గాలం వేసేలా చూస్తున్నారు. ఒక వైపు తాయిలాలు అందజేస్తూ సాయంత్రం పూట విందులు ఇస్తూ ముందుకెళ్తున్నారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామాల్లో ఎటు చూసినా ఎన్నికలపైనే చర్చ కొనసాగుతోంది. ఓటర్లు ప్రధాన కూడళ్లు, వీధుల్లో ఎవరినీ అడిగినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. కొందరికై తే కార్లు, వెహికిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గ్రామపంచాయతీలో ఒక్క ఓటు సైతం కీలకం కావడంతో ఆరోజు ఎన్ని పనులు ఉన్నా వచ్చి ఓటు వేసి వెళ్లాలని అభ్యర్థులు మొర పెట్టుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో అభ్యర్థుల ప్రచారం మిన్నంటింది. ఎన్నికలపై గ్రామాల్లో వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తున్నారు. మరికొంత మంది యువత మాత్రం ప్రత్యేకమైన గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎలాంటి వారికి ఓటు వేయాలి, మంచి వారిని ఎన్నుకోవాలంటూ సందేశాలు ఇస్తున్నారు. ఎన్నికల వేళ ఈ పరిస్థితి నెలకొంది. ఖర్చుకు ఆందోళన రెండు, మూడో విడతకు మరికొంత సమయం ఉండటంతో అభ్యర్థులకు ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నిత్యం వందమందిని వెంటేసుకుని ప్రచారానికి తిరిగితే చాయ్లు, టిఫిన్లు, భోజనాలకు విపరీతంగా ఖర్చు పెరిగిపోతోంది. సాయంత్రం అయిందంటే కచ్చితంగా మందు ఏర్పాటు చేయాల్సి వస్తోందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గుర్తులతో కష్టమే... సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు ఇబ్బందికరంగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల లాగా అభ్యర్థి ఫొటోలు ఉండవు. సర్పంచ్కు సంబంధించిన ఎన్నికల్లో గుర్తులు తికమకగానే ఉన్నాయి. టూత్పేస్ట్లు, ఉంగరాలు, గ్యాస్స్టౌవ్లు ఇలాంటి ఉండటంతో ఓటు వేసేవారు గుర్తు పెట్టుకుంటేనే ఓ టు వేయవచ్చు. పెద్దమనుషులు, మహిళలు వారికి ప్రత్యేకంగా వివరించాల్సి న అవసరం ఉంటుంది. రెండు, మూడో విడతలకు అభ్యర్థుల ప్రచారం ఓటర్లకు గాలం వేసేందుకు శతవిధాలా ప్రయత్నం గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్న వైనం -
ఆద్యంతం.. ఉత్కంఠ భరితం
● జగ్గాసాగర్, వెల్లుల్ల మేజర్ పంచాయతీల్లో అర్ధరాత్రి వరకు ఓట్ల లెక్కింపు ● ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన జనం మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్, వెల్లుల మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచే లెక్కింపు ప్రారంభమైనప్పటికీ ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. జగ్గాసాగర్ సర్పంచ్గా పుల్ల సాయగౌడ్(జగన్గౌడ్) గెలుపొందారు. తన సమీప అభ్యర్థి ముదాం నర్సయ్యపై 85 ఓట్ల మెజార్టీ సాధించారు. వెల్లుల సర్పంచ్గా గూడురు తిరుపతి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి గోపిగౌడ్పై 296 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆద్యంతం..ఉత్కంఠభరితం అన్నట్లుగా ఈ రెండు గ్రామాల్లోని ఎన్నికలు, ఫలితాల విషయంలో అదే తరహా జరగడం విశేషం. మెరుగైన వైద్య సేవలు అందించాలివెల్గటూర్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్ అన్నారు. గురువారం వెల్గటూర్, అంబరిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఇమ్యునైజేషన్ అధికారి శ్రీనివాస్తో కలిసి తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. హాస్పిటల్ పరిశుభ్రతను పరిశీలించారు. వెల్గటూర్, అంబరిపేట వైద్యాధికారులు తేజశ్రీ, లవకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ఆమోదించాలిజగిత్యాలటౌన్: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు సుముఖంగా ఉన్నందున ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఉభయసభల్లో చర్చకు తెచ్చి ఆమోదం పొందేలా కృషి చేయాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో గురువారం విలేకరులతో మాట్లాడారు. బీసీ బిల్లుపై చర్చించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఆర్.కృష్ణయ్యకు లేఖ రాశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు పాల్గొన్నారు. 7.5 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు గురువారం 7.5 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఎండపల్లి మండలం గుల్లకోటలో 7.5, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 8, ధర్మపురి మండలం నేరెళ్లలో 8.1, భీమారం మండలం మన్నెగూడెం, గోవిందారంలో 8.2, కథలాపూర్లో 8.2, కోరుట్ల మండలం అయిలాపూర్లో 8.5, రాయికల్లో 8.7, మల్లాపూర్లో 8.8, మల్యాలలో 8.8, మేడిపల్లిలో 8.9, జగిత్యాలలో 9 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ఎన్హెచ్ 563 అంబారిపేట, అంతర్గాం గ్రామాల వద్దౖ ఫ్లెవర్, అండర్ పాస్, ఎన్హెచ్–63 రోడ్లో అనంతారం వద్ద హైలెవల్ వంతెన, ఎన్హెచ్–61 రోడ్లో చల్గల్, సింగరావుపేట, ఇటిక్యాల వద్ద హైలెవల్ బ్రిడ్జి, బోర్నపల్లి, జగన్నాథపూర్ హైలెవల్ వంతెనకు నిధులు మంజూరు చేయాలని ఎంపీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఎంపీ స్పందించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమఫలాలు అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన రోల్లవాగు ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని అన్నారు. గోదావరి పుష్కరాలు విజయవంతం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీపీ సౌల్ల భీమయ్య, జైనా సహకార సంఘం చైర్మన్ సౌల్ల నరేష్, మొగిలి శేఖర్, గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
తొలివిడత ప్రశాంతం
జగిత్యాల: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చలి తీవ్రత అధికంగా ఉన్నా.. వృద్ధులు, మహిళలు, యువత ఓటు హక్కు వినియోగించుకున్నారు. మల్లాపూర్లో 80.07శాతం పోలింగ్ నమోదుకా గా.. అత్యల్పంగా కథలాపూర్లో 74.75 శాతంగా నమోదైంది. మిగిలిన మండలాల్లో 77శాతానికి పై గానే నమోదైంది. జిల్లాలోని 122 పంచాయతీలకు నాలుగు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 118 పంచాయతీలు, 1,172 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం మొత్తం 1172 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2005 మంది అధికారులను నియమించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధులు కేటాయించిన 81 మంది హాజరుకాకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మెట్పల్లిలో 77.30 శాతం ఓటింగ్ మెట్పల్లిరూరల్: మండలంలోని 23 గ్రామాల్లో 77.30 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. బండలింగాపూర్, వేంపేట, వెల్లుల, జగ్గాసాగర్ మేజర్ గ్రామాల్లో ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరారు. వేంపేటలో 101 ఏళ్ల వృద్ధురాలితో ఓటు వేయించారు. బండలింగాపూర్ పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ లత సందర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. వేంపేటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. జగ్గాసాగర్ పోలింగ్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్ మల్లాపూర్: మల్లాపూర్లోని జెడ్పీ హైస్కూల్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు రమేశ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ బి.రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాస్, జివాకర్రెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీష్ ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు కథలాపూర్: కథలాపూర్ మండలంలో 18 సర్పంచ్ స్థానాలు, 157 వార్డుస్థానాలకు ఎన్నికలు జరిగా యి. ఇక్కడ పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం. ఇబ్రహీంపట్నంలో..ఇబ్రహీంపట్నం: మండలంలో 17 గ్రామ పంచాయతీలకుగాను మూలరాంపూర్, యామపూర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 15 గ్రామాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 62.9 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు తెలిపారు. కోరుట్లలో.. కోరుట్లరూరల్: కోరుట్ల మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 78.79 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎంపీడీఓ రామకృష్ణ తెలిపారు. 77.68 శాతం పోలింగ్ మొత్తం ఓటర్లు 2,18,194 మంది పోలైన ఓట్లు 1,60,759 మల్లాపూర్లో అత్యధికంగా 80.07శాతం అత్యల్పంగా కథలాపూర్లో 74.75 శాతం పోలింగ్ 89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు -
మెడికల్ రిప్ ఆత్మహత్య
● వెంటాడిన బట్టల షాపు అప్పులు ● వడ్డీలు కట్టలేక మనస్తాపం చొప్పదండి: పట్టణంలోని మసీద్ రోడ్డుకు చెందిన కటుకం శరత్చంద్ర(39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పదండికి చెందిన సత్యనారాయణ కుమారుడు శరత్చంద్రకు దివ్యతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాలుగేళ్లుగా కుటుంబంతో కరీంనగర్లో కిరాయికుంటున్న శరత్ మెడికల్ రిప్గా పని చేస్తున్నాడు. శరత్ తల్లిదండ్రులు కూడా కరీంనగర్లోనే నివాసముంటున్నారు. గతంలో కరీంనగర్లోని విద్యానగర్లో బట్టల షాపు పెట్టి శరత్ నష్టపోయాడు. అప్పుల బారిన పడ్డాడు. లోన్ యాప్స్, ముత్తూట్ ఫైనాన్స్ ద్వారా బంగారం కుదువబెట్టి అప్పులు చేశాడు. మెడికల్ రిప్గా పని చేస్తూ మిత్తీలు కూడా కట్టకపోవడంతో ప్రస్తుత సంపాదనతో అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకపోతున్నానని చెప్పేవాడు. ఈనెల 9న డ్యూటీ మీద హుజూరాబాద్ వెళ్తున్నానని చెప్పి శరత్ వెళ్లిపోయాడు. ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేసినా కలవకపోవడంతో బుధవారం చొప్పదండిలోని మృతుడి స్నేహితులకు శరత్ భార్య దివ్య ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడాలని చెప్పింది. అప్పుల బాధకు మనస్తాపం చెందిన శరత్ మంగళవారం రాత్రి చొప్పదండికి చేరుకొని ఉరేసుకున్నాడు. చొప్పదండిలోని ఇంటికి వచ్చి స్నేహితులు చూసేసరికి మృతిచెంది కనిపించాడు. మృతుడి భార్యకు సమాచారమందించారు. శరత్ సూసైడ్ నోట్ రాసి చనిపోగా.. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేశ్రెడ్డి తెలిపారు. కోరుట్లరూరల్: సంగెం గ్రామానికి చెందిన గోపిడి హన్మక్క(81) చీర కొంగుకు నిప్పంటుకొని సజీవ దహనమైంది. స్థానికుల వివరాల ప్రకారం.. హన్మక్క ఆదివారం ఉదయం కట్టెల పొయ్యిపై వంట చేస్తుండగా చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో చీర పూర్తిగా కాలి శరీరానికి నిప్పంటింది. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్లో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొదుతూ బుధవారం మృతిచెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేటీఆర్ కాన్వాయ్ తనిఖీ
తంగళ్లపల్లి: సిరిసిల్లలో పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు కాన్వాయ్ను బుధవారం జిల్లా శివారులోని జిల్లెల్ల చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో నిబంధనల ప్రకారం కేటీఆర్ కాన్వాయ్ వాహనాలను తనిఖీ చేసి తర్వాత అనుమతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ కారు దిగి అధికారులకు సహకరించారు. 14న తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని తేజస్ ఐఐటీ/నీట్ అకాడమీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఈనెల 14న ఉదయం 11 నుంచి 12 గంటల వరకు తేజస్ స్కాలర్షిప్ టాలెంట్ టెస్ట్–2025ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ సీహెచ్ సతీశ్రావు తెలిపారు. కొత్తపల్లిలోని తేజస్ జూనియర్ కళాశాలలో బుధవారం పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 10 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వివరాలకు 81063 10960, 81063 66661, 98494 66661లో సంప్రదించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ జి.కిషన్రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో అభ్యర్థి మృతి
మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల పంచాయతీ ఎనిమిదో వార్డు సభ్యుడిగా పోటీలో నిలిచిన ముత్యాల చంద్రారెడ్డి(46) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. చంద్రారెడ్డికి వార్డు సభ్యుడిగా పోటీచేసే అవకాశం రావడంతో గ్రామంలోని 8వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అప్పటినుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నిలిచారు. బుదవారం ఉదయం కూడా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా గుండెపోటుకు గురై చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పిచ్చి కుక్క దాడిలో ఐదుగురికి గాయాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ఈదునూరి బానేశ్, భాగ్య, దుర్గమ్మ, రుద్ర, నర్మదపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మధ్యాహ్నం ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి రుద్ర, మరో నలుగురిని కొరికింది. ఇందులో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. గాయపడినవారు వెంటనే ఆస్పత్రికి వెళ్లగా సిబ్బంది వైద్యం అందిస్తున్నారు. పిచ్చి కుక్కల బారినుంచి తమను రక్షించాలని కాలనీవాసులతోపాటు సీపీఎం నాయకులు రామాచారి, భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, మల్లేశ్, నాగలక్ష్మి డిమాండ్ చేశారు. -
అందుబాటులోకి సర్వైకల్ వ్యాక్సిన్
● డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ జగిత్యాల: సర్వైకల్ క్యాన్సర్కు సంబంధించిన వ్యాక్సిన్ ప్రభుత్వం ద్వారా త్వరలోనే పంపిణీ చేస్తామని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఐఎంఏ హాల్లో సూపర్వైజర్లకు వ్యాక్సిన్కు సంబంధించి శిక్షణ కల్పించారు. 14 ఏళ్లలోపు అమ్మాయిలకు ఈ సర్వైకల్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని, ప్రస్తుతం ఇది ప్రైవేటులోనే అందుబాటులోనే ఉందని, తాజాగా ప్రభుత్వం కూడా పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి మహిళ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. సూపర్వైజర్లకు ఈ వ్యాక్సిన్ ఎలా వేయాలన్న అంశంపై పూర్తిస్తాయిలో అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు. పీవో, ఏపీవోల పాత్ర కీలకం● అడిషనల్ కలెక్టర్ లతమెట్పల్లిరూరల్: ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పీవో, ఏపీవోతోపాటు ఇతర అధికారులకు పలు విషయాలపై వివరించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా చూడాలని సూచించా రు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఎన్నికల అబ్జర్వర్ రమేశ్, డీపీవో రఘువరన్ డిస్ట్రిబ్యూషన్ తీరు ను పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీ ల్దార్ నీత, ఎంపీడీవో సురేశ్, ఎంపీవో మహేశ్వర్రెడ్డి, ఆర్ఐ కాంతయ్య పాల్గొన్నారు. కూర లేక ఇబ్బందులు పడ్డ ఎన్నికల సిబ్బందిఇబ్రహీంపట్నం : మండలకేంద్రంలోని మోడల్స్కూల్ వద్ద ఎన్నికల డిస్టిబ్యూటర్ కేంద్రంలో బుధవారం పోలింగ్ కేంద్రాల సామగ్రిని తీసుకుని భోజనం చేసేందుకు సిబ్బంది వెళ్లగా కూర లేక ఇబ్బంది పడ్డారు. ముందుగా భోజనం చేసిన సిబ్బందికి మాత్రమే కూరలు సరిపోవడంతో చివరిలో భోజనం చేసేందుకు వచ్చిన సిబ్బందికి కూరలు లేకపొవడంతో అన్నం పెట్టుకుని, కొందరు పెరుగుతో, మరికొందరు తెల్ల అన్నంనే తిని కడుపునింపుకున్నారు. కొందరు ఉపాధ్యాయులు అయితే సరిపడా ఎందుకు వంటలు వండలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమ్యూనరేషన్ ఒకేలా ఇవ్వాలని వినతికోరుట్లటౌన్: ఎన్నికల సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా ఒకేలా రెమ్యూనరేషన్ ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్కు ఆర్టీపీపీ రాష్ట్ర సహాధ్యక్షుడు వేల్పుల స్వామి యాదవ్ విన్నవించారు. కోరుట్ల ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వినతి పత్రం అందించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట ఓ టింగ్, కౌంటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఎన్నికల మరుసటి రోజు ఓడి కల్పించాలని అదనపు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కార్మికులకు వేతనంతో కూడిన సెలవుజగిత్యాలటౌన్: పంచాయితీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులకు కార్మిక సహాయ కమిషనర్ సురేందర్ సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేలా కార్మికులకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై 1988 సెక్షన్(13) కార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రశాంత వాతావరణంలో ఓటేయండి
మొదటి విడత పోలింగ్లో ఎంతమంది సిబ్బందిని నియమించారు..? ఎన్నికల సామగ్రి పంపిణీ..? పోలింగ్ కేంద్రాల వద్ద..? ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి చర్యలు చేపట్టారు..? పోలింగ్ సిబ్బందికి శిక్షణ..? సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో చర్యలు? ఎన్నికల నియామవళి అమలుకు చర్యలు..? పోలింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకుంటున్నారా? జగిత్యాల: జిల్లాలో మొదటి విడత పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కను వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. అవసరమైన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని నియమించామని వివరించారు. పోలింగ్ బాక్స్లు, బ్యాలెట్పత్రాలు సిద్ధం చేశామన్నారు. మొదటి విడత పోలింగ్ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. మొదటి విడత ఎన్ని మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు..? ప్రలోభాలకు లొంగకూడదు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభం ‘సాక్షి’తో కలెక్టర్ సత్యప్రసాద్ -
పోలింగ్ బూత్లోకి పోలీసులకు అనుమతి లేదు
టెండర్డ్ ఓటు విధానంజగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒక వ్యక్తి నిర్దిష్టమైన ఓటరుగా ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు.. అతని ఓటు ఇంతకుముందే ఎవరైనా వేసినట్లు మార్క్కాపీలో రికార్డు అయి ఉంటే ప్రిసైడింగ్ అధికారి అతని గుర్తింపుపై సంతృప్తి చెందితే.. ఇతర ఓటర్లకు ఇచ్చిన విధంగానే తన ఓటు మార్క్ చేయడానికి బ్యాలెట్ పేపరు ఇవ్వాల్సి ఉంటుంది. రాయికల్: సర్పంచ్.. గ్రామానికి ప్రథమ పౌరుడు. గ్రామంలో ఎలాంటి అధికార కార్యక్రమాలు చేపట్టినా ప్రొటోకాల్ ప్రకారం సర్పంచ్ను ఆహ్వానిస్తారు. వీరికి గౌరవ వేతనం కింద రూ.6,500 ప్రభుత్వం చెల్లిస్తుంది. సర్పంచ్ పదవిలో ఉన్న వారికి కొన్ని అధికారాలు, బాధ్యతలు ఉంటాయి. నెలకోసారి పంచాయతీ పాలకవర్గంతో కలిసి సమావేశం ఏర్పాటు చేయించాలి. రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాలి. పంచాయతీల్లో ఆదాయ, వ్యయాల ఖాతాలు తనిఖీ చేయాలి. గ్రామాభివృద్ధికి సక్రమంగా నిధులు వినియోగించేలా చూడాలి. మొక్కలు నాటించి.. వాటిలో 85 శాతం మొక్కలు బతికేలా చూడాలి. ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకునేలా.. వాటిని వినియోగంలోకి తెచ్చుకునేలా చూడాలి. చెత్తాచెదారం రోడ్లపై వేస్తే రూ.500 జరిమానా విధించే అధికారం కూడా సర్పంచ్కు ఉంది. ఉపసర్పంచ్కు గౌరవ వేతనం లేదు ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు పారితోషికం, గౌరవ వేతనం ఉండదు. ప్రజల మనసుల్లో స్థానం సాధించుకునేందుకు ఈ పదవులు దోహదపడతాయి. సమావేశాలకు హాజరుకాకపోతే అనర్హులు సర్పంచ్ తన విధులను సక్రమంగా నిర్వహించకపోయినా.. రెండు నెలలకోసారి చొప్పున మూడుసార్లు గ్రామసభ చేపట్టకపోయినా చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం తన పదవిని కోల్పోతారు. అవినీతి ఆరోపణలు నిరూపణ అయితే ప్రజాప్రతినిథ్య చట్టం 1951 సెక్షన్ 8 కింద పదవి నుంచి తొలగిస్తారు. గ్రామపంచాయతీ ఆడిట్ లెక్కలు పూర్తి చేయకపోతే సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. వార్డు సభ్యులు మూడు సమావేశాలకు.. మహిళాసభ్యులు ఆరు సమావేశాలకు వరుసగా హాజరు కాకపోతే కలెక్టర్ వారిని పదవి నుంచి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది. అంధత్వం, ఆశక్తి ఓట్లను రికార్డు చేయడం ఇలా..జగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో అంధత్వం, ఏదైనా ఇతర శారీరక ఆశక్తత కారణంగా ఓటరు బ్యాలెట్ పేపర్పై ఉన్న గుర్తులను గుర్తించలేకపోయినప్పుడు.. ఇతరుల సహాయం లేకుండా బ్యాలెట్ పేపర్పై ముద్ర వేయలేరని ప్రిసైడింగ్ అధికారి సంతృప్తి చెందినప్పుడు.. ఆ ఓటరు తరఫున బ్యాలెట్ పేపర్పై అతని అభీష్టం మేరకు ఓటు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. అవసరమైతే బ్యాలెట్ పేపర్ను మడతపెట్టి దానిని బ్యాలెట్ బాక్స్లో వేయడానికి.. ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి 18 ఏళ్ల పైబడిన ఓ సహాయకుడిని తనతో తీసుకెళ్లడానికి ఓటరుకు అనుమతిస్తారు. జగిత్యాలజోన్: ఎన్నికల నిబంధన ప్రకారం పోలింగ్ బూత్లోకి వెళ్లేందుకు పోలీసులకు కూడా అనుమతి లేదు. శాంతిభద్రతలు, ఇతర కారణాలతో సంబంధిత పోలింగ్ అఽధికారి పిలిస్తే తప్ప.. యూనిఫాం వేసుకున్న, సాధారణ దుస్తులు వేసుకున్న పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది పోలింగ్ బూత్లోకి వెళ్లరాదు. అలాగే ఓటు వేయడానికి వచ్చే అభ్యర్థికి లేదా ఓటరుకు భద్రతగా వచ్చే పోలీస్ సిబ్బందికి కూడా పోలింగ్ స్టేషన్లోకి అనుమతి లేదు. గన్మెన్ ఉన్న వ్యక్తిని పోలింగ్ ఏజెంట్గా నియమించరాదు. పోలింగ్ స్టేషన్లోకి కేవలం పోలింగ్ అధికారులు, పోటీ చేస్తున్న అభ్యర్థి, అతని ఏజెంట్, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు, ఎన్నికల సంఘం నియమించిన పర్యవేక్షకులు, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఓటరుతోపాటు ఆమె ఎత్తుకున్న చిన్నపిల్లలు, ఇతరుల సహాయం లేకుండా ఓటు వేయలేని వారు, ఓటర్లను గుర్తించే నిమిత్తం ప్రిసైడింగ్ ఆఫీసర్ నియమించుకున్న వ్యక్తులు మాత్రమే పోలింగ్ స్టేషన్లోకి అనుమతించబడతారు. వేసిన ఓటు ఫొటో తీయడం నిషేధంజగిత్యాలజోన్: పోలింగ్ బూత్లో ఎవరైనా వేసిన ఓటును ఫొటో తీయడం నిషేదం. ఓటరు, అభ్యర్థి, ఏజెంట్ మొబైల్ ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లడం కూడా నిషేధం. పోలింగ్ కేంద్రంలో పొగతాగరాదు. ఓటు వేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం బయట, లైన్లో నిలబడిన ఓటర్లతో మాట్లాడటానికి, ఫొటోలు తీసుకోవడానికి మీడియా ప్రతినిధులకు ఆంక్షలు లేవు. మీడియా ప్రతినిధులు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఫొటోలు తీసుకోరాదు. ఓటర్ కాని వ్యక్తిని పోలీంగ్ స్టేషన్ లోపలికి అనుమతించడానికి జిల్లా ఎన్నికల అధికారికి కూడా అధికారం లేదు. గిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఒక్కోవార్డుకు ఒక్కో పోలింగ్ కేంద్రం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారికి పోలింగ్ బ్యాలెట్ బాక్స్లను అప్పగించాలి. అలాగే వారు పోలింగ్ కేంద్రాల్లో వినియోగించిన పేపర్లు, సామగ్రిని అధికారికి అప్పగించాలి. మొదట లెక్కించాల్సింది పోస్టల్ బ్యాలెట్ పేపర్లుజగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటింగ్ లెక్కింపు సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లనే లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ల్లో ఉన్న ఓట్లను లెక్కించి రిటర్నింగ్ అధికారి సమక్షంలో లెక్కింపు పూర్తి చేస్తారు. సర్పంచ్ గౌరవ వేతనం రూ.6,500రిటర్నింగ్ అధికారికే బ్యాలెట్ బాక్స్ల అప్పగింత -
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు
మెట్పల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. పట్టణంలోని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి గ్రామాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య తరలించామని, ఇందుకోసం ప్రత్యేకంగా రూట్ మొబైల్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్కార్ట్ సహాయంతో పోలింగ్ సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్బాటిళ్లు తీసుకెళ్లరాదని, సెల్ఫీలు దిగడం నిషేధమని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్, ఎస్సై కిరణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అశోక్కుమార్ -
అందుబాటులోకి ‘మ్యాంగోమాస్టర్’
జగిత్యాలఅగ్రికల్చర్: తెగుళ్ల బారి నుంచి మామిడి తోటలను కాపాడుకునేందుకు రైతులు నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తుంటారు. చెట్లు ఎత్తుగా ఉంటే పిచికారీ చేయడం చాలా ఇబ్బంది. ఈ క్రమంలో రైతుల ఇబ్బందులు తప్పించేందుకు మ్యాంగో మాస్టర్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం 42 హెచ్పీ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్కు బిగించుకోవచ్చు. యంత్రం ద్వారా పొగమంచులాగా నీటి బిందువులు మామిడి ఆకులపై పడతాయి. చెట్టు ఎంత ఎత్తు ఉన్నా మందును సమంగా పిచికారీ చేస్తుంది. 25 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల అడ్డంతో మందును సమర్థవంతంగా పిచికారీ చేస్తుంది. యంత్రం బరువు 220 కిలోలు. గంటకు 3 వేల లీటర్ల మందును చెట్లపై పిచికారీ చేస్తుంది. యంత్రానికి కంప్యూటరైజ్డ్ బ్యాలెన్స్డ్ ఫ్యాన్ సిస్టం రివర్స్గా ఉంటుంది. తద్వారా యంత్రం నడిచేటప్పుడు చెట్ల ఆకులు, భూమి మీది గడ్డిని ఫ్యాన్లలోకి లాక్కోకుండా ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వద్ద కంప్యూటరైజ్డ్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. కూలీల అవసరం లేకుండానే మందు పిచికారీ చేసుకోవచ్చు. దీని ధర రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు ఉంటుంది. మామిడి తోటల్లో పిచికారీ యంత్రం కూలీల సమస్యకు చెక్ -
ఊరు రమ్మంటోంది..
తొలి విడత పోలింగ్: ఈనెల 11(నేడే) పోలింగ్ జరిగే సమయం: ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం: అదే రోజు ● సమగ్ర కుటుంబ సర్వేను మరిపించమంటోంది.. ● ఒక్క ఓటూ కీలకమే.. ● శత శాతం ఓటింగ్తోనే ప్రజాస్వామ్యం ● నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..కరీంనగర్ అర్బన్: దసరా వచ్చిందంటే.. రెక్కలు కట్టుకొని సొంతూళ్లో వాలిపోతాం. సంక్రాంతి ఇంకా నెల ఉందనగానే పుట్టిన పల్లెకు పోవడానికి ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం. ఏడాదిలో వచ్చే అనేక వేడుకలు, శుభకార్యాలకు గ్రామానికి వస్తాం. బంధువులను పలకరించి.. అయినవాళ్లతో హాయిగా గడిపి మళ్లీ వెళ్లిపోతాం. మరి ఈనెల 11, 14, 17 తేదీల్లో మీమీ జన్మస్థలాల్లో గొప్ప కార్యం జరగబోతోంది. దానికి అందరూ తప్పకుండా రావాలని ఊరు పిలుస్తోంది. ఓటు తలస్తోంది. అదే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వజ్రాయుధం. మిగతా సంబురాల్లాగానే దీనికి తప్పకుండా వచ్చి ఓటేసి సొంత గడ్డపై ఒకరోజు హాయిగా సేదదీరి వెళ్లాలని కోరుతోంది. ఓటేసి పొమ్మంటోంది. ● ఒక్క ఓటూ కీలకమే.. దేశ, రాష్ట్రంలోనే కాదు.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఒక్క ఓటు కీలకమైంది. అందుకు గత ఎన్నికలే నిదర్శనం. గంగాధర మండలం మల్లాపూర్లో కిషన్, అంజయ్య పోటీ పడగా.. ఇద్దరికి 471 ఓట్లు సమానంగా వచ్చాయి. అధికారులు డ్రా తీసి అంజయ్యను సర్పంచ్గా ప్రకటించారు. సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో కల్పన, మాధవి పోటీ పడగా.. ఇద్దరికి 1,250 ఓట్లు వచ్చాయి. అధికారులు మూడుసార్లు ఓట్లను లెక్కించినా.. అదే ఫలితం రావడంతో టాస్ వేసి కల్పనను విజేతగా ప్రకటించారు. జిల్లాలో 318 గ్రామాలకు గానూ 316 గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో పావువంతు గ్రామాల్లో నువ్వానేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఈక్రమంలో ఒక్క ఓటూ ఫలితాన్ని మార్చనుంది. ● పలు రాష్ట్రాల్లో ఓటర్లు జిల్లాలోని చాలామంది విద్య, వ్యాపారం, ఉపాధిరీత్యా దేశం నలుమూలలా ఉంటున్నారు. ఉద్యోగులు బదిలీపై పొరుగు జిల్లాలకు వెళ్లి నివసిస్తున్నారు. చేనేత కార్మికులు వేల సంఖ్యలో పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఇలా అనేక వర్గాల ప్రజలు మరోచోట ఉన్నా.. ఓటు మాత్రం సొంతూళ్లోనే ఉంది. ఇతర రాష్ట్రాల్లోని వారు ఒకరోజు సెలవు పెట్టుకొని వస్తే ఓటేయొచ్చు. స్నేహితులు, కుటుంబ సభ్యులను చూడొచ్చు. పలకరించొచ్చు. ఉత్సవాలను ఆత్మీయుల మధ్య చేసుకొని ఓ ప్రజాస్వామ్య పండగ్గా భావించి పోలింగ్ రోజును ఘనంగా నిర్వహించుకోండి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకరా్యాలు కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా.. ఒకరోజు ముందే వస్తే మంచిది. ● యాది చేసుకోండి.. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. అప్పుడు బయట ఉండేవారంతా రెక్కలు కట్టుకొని వచ్చి వాలారు. అలాగే ఓటు వేడుకకూ తరలొచ్చి నచ్చిన వారికి ఓటేసి వెళ్తే ప్రజా స్వామ్య యజ్ఞంలో పాలుపంచుకున్న తృప్తి ఉంటుంది. నాకెందుకులే అనుకోవద్దు. నీ ఒక్క ఓటే గెలుపోటములను నిర్ణయించొచ్చు. కీలకంగా మా రొచ్చు. మీరు ఎన్నుకున్న వ్యక్తి వల్ల ఊరు బాగు ప డిందంటే అభివద్ధిలో మీ భాగస్వామ్యం ఉన్నట్టేగా. ● ప్రలోభాలకు లొంగొద్దు ఇప్పుడు పలు రాజకీయ పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై దృష్టి పెట్టాయి. ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి బూత్ కమిటీలతో ఆరా తీసి ఇప్పటికే ఫోన్లు చేశారు. దారి ఖర్చులతోపాటు ఇతర ఖర్చులను భరిస్తామని ప్రలోభపెడుతున్నారని సమాచారం. పోలింగ్ తేదీన రప్పించడానికి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరి మాటలూ నమ్మకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి. విద్యార్థులు: ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, కర్నాటక, పంజాబ్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు: బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, తిరువనంతపురం, ముంబయి, ఢిల్లీ చేనేతలు: సూరత్, భీవండి, అహ్మదాబాద్, ముంబయి ఉద్యోగులు: కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి వ్యాపారులు: హైదరాబాద్తోపాటు అనేక జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కార్మికులు: ముంబయి, హైదరాబాద్ -
తొలివిడత పోలింగ్కు సిద్ధం
జగిత్యాల: జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని 122 గ్రామపంచాయతీల్లో ఓటింగ్ జరగనుంది. మేడిపల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేశారు. సామగ్రితో సిబ్బంది ఆయా గ్రామాలకు తరలివెళ్లారు. ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ పకడ్బందీ నిఘా పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ చేపట్టి తర్వాత ఫలితాలు ప్రకటించనున్నారు. భారీ బందోబస్తు మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఇప్పటికే ఎస్పీ అశోక్కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు విధులు కేటాయించారు. ఎలాంటి గొడవలు చోటుచేసుకోకుండా అదనపు బలగాలను నియమించారు. గ్రామాల్లో సందడి.. మొదలైన పంపకాలు తొలిదశ ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో అధికారికంగా ప్రచారం ముగిసినప్పటికీ కీలకమైన పోల్ మేనేజ్మెంట్పై రాత్రి నుంచే గ్రామాల్లో జోరందుకుంది. మొదటి విడత ఏడు మండలాల్లోని 122 గ్రామ పంచాయతీల్లో తాయిలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకున్నారు. పోలీసు నిఘా ఏర్పాటు చేసినప్పటికీ రంగంలో ఉన్న అభ్యర్థులు మాత్రం ప్రతి ఓటరును కలుస్తున్నారు. పొరపాట్లు జరగనీయొద్దు: కలెక్టర్ సత్యప్రసాద్ మల్లాపూర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షప్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికలను సజావుగా జరిపించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను మరోసారి నిర్ధారించుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా 24 గంటలు సరఫరా ఉండేలా చూడాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు సామగ్రితో గ్రామాలకు తరలిన సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ రెండు గంటల నుంచి కౌంటింగ్.. ఫలితాల ప్రకటనమండలాలు : మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్న మల్లాపూర్ పంచాయతీలు : 122 వార్డులు : 1172 పోలింగ్ కేంద్రాలు : 1172 ఓటర్లు : 2,20,147 వోపీవోలు : 2005 బ్యాలెట్ బాక్స్లు : 1406 -
అప్పుడు నో.. ఇప్పుడు సై..
● 2019లో ఎన్నికలను బహిష్కరించిన గొల్లపల్లి గ్రామస్తులు ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామ ఓట్లు తమ గ్రామం నుంచి విడిపోయి నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలో కలవడాన్ని నిరసిస్తూ.. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను గొల్లపల్లి గ్రామస్తులు బహిష్కరించారు. అదే సంవత్సరం మూడు నెలల తర్వాత మళ్లీ గొల్లపల్లి గ్రామానికి రీనోటిఫికేషన్ వేశారు. సర్పంచ్, వార్డులకు నామినేషన్లు అభ్యర్థులు వేశారు. తీరా ఓటర్ లిస్టు పరిశీలించగా.. తమ గ్రామం నుంచి విడిపోయిన 148 ఓట్లు కలవకపోవడంతో మళ్లీ బహిష్కరించారు. గ్రామ పరిపాలన అప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్చార్జి అధికారులే నిర్వహిస్తూ వచ్చారు. సంవత్సర క్రితం జరిగిన రీసర్వేలో తమ గ్రామ ఓట్లు 150, సరిహద్దులు తమ గ్రామంలో మళ్లీ కలవడంతో.. ఆరేళ్ల అనంతరం తిరిగి ఈసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పాల్గొంటున్నారు. గ్రామంలో 620 ఓటర్లున్నారు. 8 వార్డులుండగా.. మూడు, నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళ రిజర్వేషన్ కాగా.. రడం లక్ష్మి, కడగండ్ల శిరీష పోటీ చేస్తున్నారు. శిరీష అంగన్వాడీ ఆయా పోస్టుకు రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలబడ్డారు. -
ఎన్నికల సిబ్బందికి వసతులు కల్పించాలి
ఇబ్రహీంపట్నం: పోలింగ్ సిబ్బందికి ఇబ్బంది కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలకేంద్రంలోని మోడల్స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని కలెక్టర్, అడిషినల్ కలెక్టర్ లత, అబ్జర్వర్ రమేశ్ వేర్వేరుగా పరిశీలించారు. ఆర్వోలు, పీవోలు గైర్హాజరు అయితే సమాచారం అందించాలని తెలిపారు. సిబ్బంది ప్రత్యేక బస్సుల్లో వెళ్లగానే పోలింగ్ స్టేషన్ల వద్ద వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిప్ప గణేశ్, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈవో మధు, తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మల్లన్నస్వామి జాతర ఉత్సవాలు
కథలాపూర్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఎన్నికల సామగ్రిని సరిచూసుకుంటున్న సిబ్బందిగొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం దండివారం సందర్భంగా సుమారు 18 వేల మంది భక్తులు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ ఎన్.సుప్రియ, జగిత్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ రాజమౌళి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.65,270 ఆదా యం సమకూరింది. ఫౌండర్ ట్రస్టీ కొండూరి శంతయ్య, ఈవో ముద్దం విక్రం, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి, ధర్మపురి ఎస్సై మహేశ్, అర్చకులు రాజేందర్, పోలీస్ సిబ్బంది, సిబ్బంది పెడివెల్లి నర్సయ్య, రాజేందర్, శివకేశవ్, గంగాధర్ పాల్గొన్నారు. -
మీ పల్లెను మాట్లాడుతున్నా..
సిరిసిల్ల: అప్పుడే తెల్లారుతోంది. మంచుతెరలు కమ్ముకున్నాయి. సూర్యుడి లేలేత కిరణాలు పల్లెముంగిలికి చేరుతున్నాయి. ఈరోజు ఓట్ల పండగ. ఈ ఒక్క రోజు నువ్వే రారాజువి. పోటీ చేసిన అభ్యర్థులంతా నీ చుట్టూ చేరి చేతులు జోడించి ఓట్లు అడుగుతున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే అరుదైన అవకాశం ఇది. బయలుదేరు.. ఓటు అస్త్రాన్ని సంధించు. ఊరికి ఉపకారం చేసే అభ్యర్థిని సర్పంచిగా గెలిపించు. వంగి వంగి దండాలు పెట్టిన అభ్యర్థులంతా మట్టి కరువాలి. మన తలరాతలను మార్చే మంచోడికి ఓటేయ్యి. ఎన్నికల రోజు కాబట్టి నా మనసు ఊరుకో లేక.. మీకో లేఖ రాస్తున్నా..! ఊరుకు సర్పంచే సుప్రీం ఒక్కసారి ఆలోచించండి. ఊరికి సర్పంచే సుప్రీం. పల్లె మారాలి.. ప్రగతి పల్లవించాలంటే మీ ఓటుతోనే సాధ్యం. సర్పంచిగా పోటీచేసిన అభ్యర్థులు చెప్పే మాయమాటలు నమ్మకండి. అరచేతిలో వైకుంఠం.. చూపించే మాటల గారడి అభ్యర్థుల సంగతి చూడండి. ఐదు వందలకో, వెయ్యికో, రెండు వేలకో.. మద్యం సీసాకో, ఓ చీరకో ఓటును అమ్మకండి. ఆ నవ్వు వెనక నయవంచనను గుర్తించండి గతంలో ఏం జరిగిందో ఆలోచించండి. ‘నమ్మి నానబోస్తే.. పుచ్చి బుర్రలు అయినట్లు.’ మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు.. వాళ్లు అబద్ధపు హామీలు ఇస్తూనే ఉన్నారు. ఏవేవో ఇస్తామని ఆశలు పెడుతుండ్రు. కులం, మతం, వాడకట్టు పాటలు పాడి మీ ముందుకొచ్చిన నేతల అసలు రూపం ఏంటో నా కంటే మీకే ఎక్కువ తెలుసు. ఆ నవ్వు వెనక ఉన్న నయవంచనను గుర్తించండి. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. ఎన్నెన్నో చెప్పి గెలిచాక ఊరి అభివృద్ధిని మరిచి గ్రామసభలు పెట్టకుండా.. సమస్యల ప్రాధాన్యతను గుర్తించకుండా.. ప్రజల బాధలను పట్టించుకోకుండా కాంట్రాక్టులు చేసి సంపాదించుకునే వారిని, కమీషన్లు దండుకునే వారిని ఎన్నుకోవాలా? ఏదైనా పని పడి వెళ్తే ఇంటి గేటవుతల నిలబెట్టే వారిని గెలిపించాలా? ఇకనైన కళ్లు తెరవండి. దండం పెట్టాడని ఓటేస్తే... మళ్లీ ఓట్ల సీజన్ దాకా కనిపించడు. ఆత్మసాక్షిగా ఓటేయండి మీకు అందుబాటులో ఉండి సేవ చేసే నిస్వార్థ నాయకున్ని ఎన్నుకోండి. ఆత్మసాక్షిగా ఓటేయండి. గతంలో ఊరి సర్పంచులుగా ఎన్నికై న వారు ఏం చేశారో ఆలోచించండి. అందుకే ఎన్నికల వేళ మీ అందరికీ ఓ విన్నపం. మీకు మంచి పనులు చేసే సర్పంచిని, వార్డు సభ్యులనే ఎన్నుకోండి. మీకు మేలు చేసే వారిని మరవద్దు. తెలంగాణలో ఓ సామెత ఉంది. కళ్ల ముందు కనిపించే కూట్లో రాయి తీయనోడు.. ‘ఎక్కడో ఉండే ఏట్లో రాయి తీస్తడా..’ అని. ఇవన్నీ మీకు తెలియనివి కావు. కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ‘తిన్న రేవును తలవాలంటారు’ అందుకే చెబుతున్నా. మీకు మంచి చేసిన వారిని విస్మరించొద్దు. కులమనో.. ప్రాంతమనో... ఓటు వేస్తే ఫలితం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఊరందరి సమస్యలను తనవిగా భావించే వారినే ఎన్నుకోండి. గతంలో సర్పంచులుగా పనిచేసిన వారు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దిగమించిన సంగతి మీకు తెలుసు. పింఛన్ కోసం వెళ్తే పైసలు గుంజిన సంగతి ఎరుకే. అన్నింటికి మించి తాగేందుకు నీరు ఇవ్వని వారు.. ఒక్క వీధిదీపమైనా పెట్టని వారు.. ఎందరో ఉన్నారు. సహజ సంపదను దోచెటోళ్లు వాగు ఇసుకను, గుట్టల రాళ్లను, మొరం, అడవులను దోచి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి సంపాదించినోళ్లూ ఉన్నారు. మీ క్షేమం.. నా సంక్షేమాన్ని చూసుకునే మంచి వారు అందలమెక్కాలి. ఇక లెవ్వు.. చలి కాలమని.. పనికాలమని ఓటు వేయకుండా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఉండొద్దు. మీ ఓటే వజ్రాయుధం. నీతివంతులకు పట్టం కడితే... మీ ఊరూ, వాడ బాగవుతుంది. అవినీతిపరులను, డబ్బులిచ్చినోడికి ఓటేస్తే ఇక ఐదేండ్లు అతడి అవినీతికి లైసెన్సిచ్చినట్లవుతుంది. ఇంకో మాట ఈ రోజు పోలింగ్ పగలు ఒంటిగంట వరకు ఉంటది. ఈలోగా నువ్వు పోలింగ్ కేంద్రానికి వెళ్తేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆలస్యమైతే అంతే.. సంగతి.. ఇంకో మాట ఈ సారి రెండు ఓట్లు ఉంటయి. బ్యాలెట్ పత్రాలు రెండు ఇస్తారు. ఒక్క గులాబి రంగు సర్పంచి ఓటు.. ఇంకోటి తెల్లరంగు పత్రం వార్డు సభ్యుడి ఓటు సరిగ్గా గుర్తును చూసి ఓటేయండి.. మీ బాగోగులు చూసుకునే ఆత్మీయుడికి పట్టం కట్టండి. మీ అంతరాత్మ ‘సాక్షి’గా ఓటు వేయండి. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా మొర ఆలకించినందుకు మీ అందరికీ నా దండాలు.. ఇక ఉంటాను. ఇట్లు మీ అందరి సంక్షేమాన్ని కోరే మీ పల్లె తల్లి -
మెడికల్ కళాశాల పూర్తయ్యేదెప్పుడు..?
జగిత్యాల: జిల్లాకో మెడికల్ కళాశాల ఉండాలనే విజన్తో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, ఇందులో భాగంగా జగిత్యాలకు వైద్య కళాశాల మంజూరు చేసి 80శాతం పనులు పూర్తి చేసినా.. మిగిలిన 20శాతం పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలను బుధవారం సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కడికో వెళ్లి చదువుకోకుండా ఇక్కడే కళాశాలను ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మెడికల్ కళాశాలలో హాస్టల్, కళాశాల, ల్యాబ్లు పూర్తి కాలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ 80శాతం కేసీఆర్ పూర్తి చేశారని, మిగతా 20 శాతం రెండేళ్లయినా పూర్తి చేయడంలేదని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీకి తాము మద్దతు ఇస్తామని, అదే సమయంలో మెడికల్ కళాశాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. కేసీఆర్ హయాంలోనే 80 శాతం పూర్తి 20 శాతం పనులు కూడా చేపట్టలేకపోతున్నారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
రాములపల్లి సర్పంచ్గా లక్ష్మీనారాయణ
పెగడపల్లి: మండలంలోని రాములపల్లి సర్పంచ్గా అమిరిశెట్టి లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వ్ కావడంతో నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం ఉపసంహరించుకోవడంతో లక్ష్మీనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. పెగడపల్లి: మండలంలోని రాజరాంపల్లి సర్పంచ్గా ఇస్లావత్ రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. సర్పంచ్ స్థా నం ఎస్టీ జనరల్కు రిజర్వ్ అ యింది. ఇద్దరు నామినేషన్ వేయగా.. తిరుపతినాయక్ తన నామినేషన్ ఉప సంహరించకున్నారు. దీంతో రమేశ్నాయక్ ఏకగ్రీవమయ్యారు. -
పల్లెలను శాసిస్తున్న ‘పంచభూతాలు’
పంచాయతీ ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ఇంటింటి ప్రచారంతో అలసి, సొలసిన మద్దతుదారులకు, పార్టీ కార్యకర్తలకు మందుతోనే స్వాంతన లభిస్తుందని భావిస్తున్నారు. ఎన్నికల వేళ చీప్ లిక్కర్, బాంద్రి, విస్కీ, కల్లు పంపిణీ చేసి ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఇప్పటికే మందు విక్రయాలు బాగా పెరిగి పల్లెలు మత్తులో జోగుతున్నాయి. పోలీసు యంత్రాంగం దాడులతో ‘బెల్టు’ షాపులకు తాళాలు పడగా, గతంలో ఎన్నడూ లేనంతగా బెల్టుషాపులను నియంత్రించారు. కానీ, దొంగచాటుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఓటర్లను మత్తులో ముంచేందుకు అభ్యర్థులు సిద్ధం చేసుకుంటున్నారు.సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పార్టీలతో, పార్టీ గుర్తులతో, బీ–ఫామ్లతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సత్తా చాటుకోవాలని చూస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలను సవాల్గా తీసుకున్నాయి. పార్టీల రంగులు, జెండాలు పల్లె పొలిమెరల్లోనే రెపరెపలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. పల్లెలను ‘పంచభూతాలు’ ఆవహించాయి. ఎన్నికలను అవి శాసిస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే శక్తిని ప్రదర్శిస్తున్నాయి. హామీలను ఎరగా వేసి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు అభ్యర్థులు ఆఖరు ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయాలంటేనే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయి లాభసాటి వ్యాపారంలా పరిణమించాయి. ఎంత వెచ్చించాం, ఎంత సంపాదించామనే వ్యాపార లక్షణం కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తుంది. ఓటర్లకు నేరుగా డబ్బు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలువాలనేది అభ్యర్థుల లక్ష్యంగా మారింది. నిన్న మొన్నటి వరకు ప్రచారం చేసిన అభ్యర్థులు అసలు కార్యానికి తెరలేపారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 పంపిణీ చేసేందుకు డబ్బు సంచులను సిద్ధం చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు, కులసంఘాల పెద్దలు, యువజన సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా అనేక మంది ఎన్నికల్లో ఉండడంతో డబ్బుకు వెనకాడకుండా వెదజల్లుతున్నారు. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు.పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎజెండాలు ఏమీ లేకుండా సొంత ఎజెండాలతో అభ్యర్థులు రంగంలోకి దిగారు. ఊరిలో సొంత ఖర్చులతో ఫ్యూరీఫైడ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని, ఉచితంగా మంచినీరు అందిస్తామని, ఊరిలో ఆడపిల్ల పుడితే.. రూ.10వేలు ఫిక్స్డ్ డిపాజిట్, ఊరందరికీ డిష్ బిల్లు లేకుండా ఫ్రీగా టీవీ కనెక్షన్లు, పల్లె దవాఖానా నిర్మిస్తామని, ఇంటింటికీ సీసీ రోడ్డు వేస్తామని సొంత ఎజెండాలతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే ‘మీ సామాజిక వర్గానికి భవనాలను కట్టిస్తాం’ అని రకరకాల హామీలిస్తూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు నేతలు యథాశక్తిగా ప్రయత్నిస్తున్నారు.అనుకూలంగా, అందుబాటులో ఉండే అనుయాయులకు సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టు ఇప్పించి కాసులు దోచిపెడుతామంటూ నేతలు హామీలిస్తున్నారు. ఊరిలో ఏం చేయాలన్నా పంచాయతీ తీర్మానాలు ఇస్తామని చెబుతున్నారు. ‘గెలిస్తే చాటుగా మీ అందరికి నేనున్నా’ అంటూ అనుచరులకు నమ్మబలుకుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికప్పుడు సెల్ఫోన్లు కొనిస్తూ, ద్విచక్ర వాహనాలు సమకూర్చుతూ ఎన్నికల ప్రచారానికి యువతరాన్ని వినియోగించుకుంటున్నారు. ‘నేను గెలిస్తే భవిష్యత్ ఉంటుందంటూ ఆశలురేపుతూ బరిలో నిలిచిన అభ్యర్థులు హామీలతో ఎన్నికల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ పంచభూతాలు ఎన్నికల్ని ఆవహించి ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వివిధ రకాల కుల సంఘాలు, వృత్తిసంఘాలు, యువజన సంఘాలకు గాలమేస్తూ హామీలు గుప్పిస్తున్నారు. యువకులకు క్రికెట్ కిట్లు ఇస్తూ, యువజన సంఘాలు కట్టిస్తామని, ఓపెన్జిమ్లు నిర్మిస్తామని, కోతులను తరిమేస్తామని, సామాజిక భద్రత కల్పిస్తామని హామీలిస్తున్నారు. యువకులను గోవా లాంటి ప్రాంతాలకు విహార యాత్రలకు తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇలా పల్లెల్లో సెల్ఫోన్ మెస్సేజ్లు చేస్తున్నారు. ‘చెప్పిన పనులు చేయకుంటే చెప్పులు మెడలో వేసుకుంటాం, గాడిదమీద ఊరేగించండి’ అని బాండు పేపర్లు రాసిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఆవహించిన ప్రలోభాలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు.. పైఎత్తులు సొంత ఎజెండా.. అభివృద్ధికి హామీలు.. బాండు పేపర్లు గ్రామాల్లో పట్టు కోసం నేతల ప్రయత్నాలు -
స్తంభంపల్లిలో మహిళ దారుణ హత్య
వెల్గటూర్: వెల్గటూర్ మండలం స్తంభంపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్ మంచిర్యాలలో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో నర్స్గా పనిచేస్తున్న అలివేలు అనే మహిళతో నరేశ్ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. నరేశ్ మంగళవారం సాయంత్రం గ్రామానికి రాగా.. కొద్దిసేపటికి సదరు మహిళ కూడా చేరుకుంది. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆవేశంలో నరేశ్ ఆ మహిళను రోకలిబండతో తలపై మోదాడు. అనంతరం కత్తితో మెడకోసి పారిపోయాడు. నరేశ్ గతంలో మంచిర్యాల ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి బంగారం దోచుకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. నరేశ్ నేర ప్రవృత్తి తెలిసి భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారని సమాచారం. ఆ హత్యలో సహకరించిన అలివేలుతో అప్పటినుంచే నరేశ్ సహజీవనం చేస్తున్నాడని సమాచారం. హత్య విషయం తెలుసుకున్న సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కరీంనగర్క్రైం: కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో బిక్షాటన చేసుకుంటూ ఉండేవాడని వివరాలు తెలిస్తే టూటౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సూచించారు. రాయికల్: రాయికల్కు చెందిన తాటిపాముల దేవక్క (82) మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. దేవక్క కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పైగా మానసిక స్థితి సరిగా లేదు. మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు దేవక్కకోసం గాలిస్తుండగా.. ఇంటి సమీపంలోని బావిలో శవమై తేలింది. దేవక్క కుమారుడు లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ధర్మపురి: మానసికంగా బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మేడిశెట్టి తిరుపతి (35)కి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. వైద్యులను సంప్రదించి మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఊరుచివర డంపింగ్యార్డులో ఉరేసుకున్నాడు. తిరుపతికి భార్య మహేశ్వరి, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి లక్ష్మి (45) అనారోగ్యం బాధ భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు.. లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, భర్త ముత్యం సెస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మి గతంలో అనారోగ్యానికి గురికాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా నయం కాలేదు. మంగళవారం ముత్యం అనారోగ్యంతో ఆపరేషన్ కోసం హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లగా, ఇంట్లో లక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
రెండోసారి..
సైదాపూర్(హూజూరాబాద్): ఆరెపల్లి పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. గ్రామస్తులు పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి పంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి తీర్మానించుకున్నారు. ఆరెపల్లి సర్పంచ్ స్థానం జనరల్ మహిళ కాగా.. లొల్లేటి కల్యాణి, వర్నె లావణ్య, వెంగళ కోమల పోటీ పడ్డారు. ఏకగ్రీవానికి గ్రామంలో తీర్మానించుకున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా వర్నె లావణ్య ఒక్కరే నామినేషన్ వేశారు. 5వ వార్డు సభ్యుడు వెంగళ రవిని ఉప సర్పంచ్గా గ్రామంలో తీర్మానించుకున్నారు. 1వ వార్డుకు ఆవునూరి సుజాత, 2వ వార్డుకు లొల్లేటి కల్యాణి, 3వ వార్డుకు వెంగళ కుమార్, 4వ వార్డుకు గుంటి అయిలయ్య, 6వ వార్డుకు మొగిలి లచ్చమ్మ, 7వ వార్డుకు గోంగూల మల్లేశ్వరి, 8వ వార్డుకు వర్నె సతీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
అండర్– 19 వైస్ కెప్టెన్గా శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్: హైదరాబాద్ మహిళల అండర్– 19 క్రికెట్ జట్టుకు కరీంనగర్కు చెందిన కట్ట శ్రీ వల్లీ వైస్ కెప్టెన్గా ఎంపికై ంది. ఫాస్ట్ బౌలర్గా రాణిస్తున్న శ్రీవల్లీ గతంలో అండర్–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. తాజాగా హెచ్సీఏ అండర్ 19 జట్టును ప్రకటించగా శ్రీవల్లీని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. ఈనెల 13 నుంచి నుంచి లక్నో వేదికగా బీసీసీఐ అండర్–19 ఉమెన్ వన్డే ట్రోపీ జరుగనుంది. శ్రీవల్లి ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమా లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బాగోగులు చూసుకోవడం లేదని ఫిర్యాదుచొప్పదండి: పట్టణానికి చెందిన వృద్ధురాలి బాగోగులు పెద్ద కుమారుడు చూసుకోవడం లేదని ఆర్డీవో కార్యాలయంలో, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. తల్లితండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను అనుభవిస్తూ, రెండు నెలలుగా నడవలేని స్థితిలో ఉన్న తల్లిని పెద్ద కుమారుడు పట్టించుకోవడం లేదని, తల్లితండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని తిరిగి తల్లికి స్వాధీనం చేయాలని బాధితురాలి తరుఫున ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తామానకొండూర్ రూరల్: మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్–వరంగల్ రహదారిపై కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నర్సంపేట జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందినవారు వేములవాడ దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మానకొండూర్ శివారు తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఎదురుగా కుక్క అడ్డు రాగా.. తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముత్యాల కవిత, పెండ్లి యాదమ్మ, పెండ్లి నీల, పెండ్లి లక్ష్మి, పెండ్లి సుధాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్లో దేహదాతకు నివాళి అర్పించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టు గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి(92) ఈనెల 6న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు శ్యాంసుందర్రెడ్డి తనతండ్రి పార్ధివదేహాన్ని సిమ్స్కు దానంచేశారు. ఆయన మనుమరాలు వర్ష, మనుమడు వర్షిత్కు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.అనాటమీ విభాగం హెచ్వోడీ డాక్టర్ శశికాంత్ కిరాగి,డాక్టర్ కల్పన ఉన్నారు. -
చింతలూరు.. ఆరుసార్లు ఏకగ్రీవం
రాయికల్: మండలంలోని చింతలూరు గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి ఏడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆరుసార్లు సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1981లో పంచాయతీగా ఏర్పడగా.. తొలిసారిగా భద్రీనాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన 1988 వరకు పదవిలో ఉన్నారు. 1988–95 ఎన్నికల్లో అనుపురం లింబాగౌడ్, 2001లో ఓరుగంటి మోహన్రావు, 2006లో లక్ష్మణ్నాయక్, 2014లో కదుర్ల లక్ష్మీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019లో తొలిసారి గ్రామస్తులంతా సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో అనుపురం శ్రీనివాస్గౌడ్ను గెలిపించారు. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్ బరిలో నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
సోనియాతోనే ప్రత్యేక రాష్ట్రం
ధర్మపురి: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రాష్ట్రం ఏర్పడిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఇచ్చిన మాటను సోనియా నిలబెట్టుకున్నారని తెలిపారు. నాయకులు వేముల రాజు, చీపిరిశెట్టి రాజేశ్, కుంట సుధాకర్, చిలుముల లక్ష్మణ్, రాందేని మొగిలి తదితరులున్నారు. రాష్ట్ర ఏర్పాటు ఘనత సోనియాగాంధీదే జగిత్యాలటౌన్: ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సోనియా సాహసోపేత నిర్ణయం తెలంగాణ చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దు ర్గయ్య, గాజుల రాజేందర్, హనుమండ్ల జయ శ్రీ, రాంచంద్రారెడ్డి, రఘువీర్గౌడ్ ఉన్నారు. ఎన్నికల సిబ్బందికి ర్యాండమైజేషన్ పూర్తిజగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికలకు ర్యాండమైజేషన్ విధానంలో సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్యప్రసాద్ తెలిపారు. మొదటి విడత ఎన్నికకు పోలింగ్ అధికారులు 1406, ఇతర అధికారులు 2005 మందిని నియమించినట్లు పేర్కొన్నారు. సిబ్బంది ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్స్లు, పోస్టల్ బ్యాలెట్ తరలింపు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఎస్పీ అశోక్కుమార్, అబ్జర్వర్లు రమేశ్, డీపీవో రఘువరణ్ పాల్గొన్నారు. పెరుగుతున్న చలిజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత పెరిగింది. మంగళవారం నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. భీమారం మండలం మన్నెగూడెంలో 9.1, కథలాపూర్లో 9.1, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 9.3, కోరుట్ల మండలం అయిలాపూర్లో 9.4, ఎండపల్లి మండలం గుల్లకోటలో 9.5, మల్లాపూర్లో 9.5, పెగడపల్లిలో 9.6, మేడిపల్లిలో 9.6, ధర్మపురి మండలం నేరేళ్లలో 9.6, భీమారం మండలం గోవిందారంలో 9.7, మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో 9.8, రాయికల్లో 9.8, కొడిమ్యాల మండలం పూడూరులో 9.9, ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 9.9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఆలయ అభివృద్ధికి సహకరించండిధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ విస్తరణకు పట్టణ ప్రజలు సహకరించాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంగళవారం పట్టణానికి చెందిన ఇళ్ల యజమానులతో సమావేశమయ్యారు. ఆల య అభివృద్ధికి 2.07 ఎకరాలు భూ సేకరణ చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇళ్లు కోల్పో యే వారికి పునరావాసం కల్పిస్తామని, ఆలయ పరిసరప్రాంత ప్రజలు అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు. -
ఇంటర్నల్స్ వాయిదా
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు రెండు రోజులుగా చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు సద్దుమణిగింది. వర్సిటీ ఉన్నతాధికారుల తీరుతో తాము నష్టపోతున్నామంటున్న విద్యార్థుల డిమాండ్లపై వీసీ సానుకూలంగా స్పందించడంతో శాంతించారు. ఐదు డిమాండ్లతో మొదలైన ఆందోళనలో రెండు ప్రధానమైనవి ఆమోదించడం, మిగిలినవాటిపై హామీ దక్కకపోవడంతో విద్యార్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తమను ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా....ఇంటర్నల్స్, 3వ సెమిస్టర్ పరీక్షల తేదీలను మార్చాలని కోరుతూ చేస్తూ చేపట్టిన ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ శాతవాహన యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో తొలుత సైన్స్ కాలేజీ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడ కాసేపు రిజిస్ట్రార్తో మాట్లాడారు. రిజిస్ట్రర్ నుంచి స్పందన లేకపోయే సరికి డప్పులు కొడుతూ అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట మరోసారి ధర్నాకు పూనుకున్నారు. వీసీ, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ విద్యార్థులను కళాశాలల ప్రిన్సిపాల్స్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. వీసీ వచ్చి సమస్యను పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటూ బైఠాయించడంతో వీసీ ఉమేశ్ కుమార్ విద్యార్థులను చర్చలకు ఆహ్వానించారు. సంక్రాంతి ముందు కొన్ని... తరువాత కొన్ని విద్యార్థుల ఆందోళనతో చర్చల దిగొచ్చిన వీసీ సుమారు గంటన్నర సేపు వారితో చర్చలు జరిపారు. వీసీతోపాటు రిజిస్ట్రార్ రవికుమార్, ఓఎస్డీ హరికాంత్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుజాత చర్చల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్నల్ పరీక్షలు వాయిదా వేసేందుకు అంగీకారం తెలిపారు. 3వ సెమిస్టర్ పరీక్షలను సంక్రాంతి పండుగకు ముందు కొన్ని, తరువాత కొన్ని నిర్వహించేలా షెడ్యూల్లో మార్పులు జరిపేందుకు సరే అన్నారు. నెట్, సెట్కు సన్నద్ధమవుతున్న వారికి సెమిస్టర్ పరీక్షలు అవే తేదీల్లో వస్తుండటాన్ని విద్యార్థులు వీసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నెట్, సెట్ రాసే విద్యార్థులకు వీలుగా షెడ్యుల్లో మార్పులు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. లైబ్రరీపై పట్టు యూనివర్సిటీలో 24 గంటల లైబ్రరీ సదుపాయంపై వీసీ పట్టు వీడలేదు. మధ్యాహ్నం తరువాతే లైబ్రరీలోకి అనుమతిస్తామని, కావాల్సిన వారు ఎన్ని పుస్తకాలైనా తీసుకెళ్లి చదువుకోవచ్చని స్పష్టంచేశారు. అంతకుముందు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో 24 గంటలు లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని అలాంటి వెసులుబాటును శాతవాహన కల్పించాలని కోరారు. యూనివర్సిటీలోని మెస్ విషయంలో కేర్ టేకర్స్ పట్టించుకోవడం లేదని, మెస్లో సరిపడా సిబ్బంది లేరన్న విద్యార్థుల వాదనను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఎల్ఎల్బీ విద్యార్థులకు వెంటనే హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేసినా దానిని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో విద్యార్థులు లైబ్రరీ, లా విద్యార్థులకు హాస్టల్ విషయంలో తీవ్ర నిరాశకు గురయ్యారు.యుజీసీ నెట్, సెట్ పరీక్షలకు శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. అందుకే పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నాం. – వీసీ ఉమేశ్ కుమార్ -
సోషల్ మీడియాలో ప్రచారం
రాయికల్:పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఎలాంటి ఖర్చు లేకుండా వాట్సాప్ గ్రూపుల్లో తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాము గెలిస్తే చేసే అభివృద్ధి పనులపై ప్రజలకు వివరించే ప్రయత్నిస్తున్నారు. ప్రతి గ్రామంలో యువకులు, మహిళలు గ్రామాభివృద్ధి కమిటీ, స్పోర్ట్స్ కమిటీ, ఎన్ఆర్ఐ, ఆలయాల అభివృద్ధి కమిటీ అంటూ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గ్రూపు సభ్యులుగా ఉంటూ తాము పోటీ చేస్తున్న సమయంలో రోజువారి కార్యక్రమాలను పోస్ట్ చేయడంతోపాటు, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తన గుర్తు ఇది అని, తన గుర్తుకే ఓటు వేయాలంటూ కోరుతున్నారు. వీడియోలు, ఫొటోస్తో సందేశాలు అభ్యర్థులు గతంలో చేసిన అభివృద్ధి పనులను వీడియోలు, ఫొటోలను సోషల్మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. రోజువారి కార్యక్రమాలను కూడా మెసేజ్ చేస్తూ తమకు అవకాశం కల్పిస్తే చేపట్టబోయే పనులు కూడా వివరిస్తున్నారు. గ్రామంలో నిరక్షరాస్యులకు వాయిస్ రికార్డులు పంపిస్తున్నారు. -
జగిత్యాల
28.0/9.07గరిష్టం/కనిష్టంకుజదోష నివారణ పూజలుధర్మపురి: నృసింహస్వామి యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలు నిర్వహించారు. కుటుంబకలహాలు, వాస్తుదోషాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కుజదోష నివారణ పూజలు చేశారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి ఉంటుంది. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణజగిత్యాల: కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
పంచింగ్ స్టార్ట్
జిల్లా మొదటి ఏకగ్రీవం ఎన్నికలు కరీంనగర్ 92 03 89 పెద్దపల్లి 99 04 95 సిరిసిల్ల 76 09 67 జగిత్యాల 122 04 118 మొత్తం 389 20 369సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పంచాయతీ ఎన్నికలు రసవత్తరస్థాయికి చేరుకున్నాయి. తొలి విడత పోలింగ్ ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాలు ఊపందుకున్నాయి. మైకులు బంద్ కావడంతో నిన్న మొన్నటి వరకు హోరెత్తిన ప్రచారం మూగబోయింది. మందు.. విందుతో ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 389 గ్రామాల్లో తొలివిడత ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడతలో 369గ్రామాల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల మధ్య పోటీ కనిపిస్తుండగా కొన్ని గ్రామాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎంత ఖర్చయినా సరే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేకున్నా మిత్రులు, బంధువుల వద్ద తీసుకోవడమో.. లేదా అప్పు చేసేందుకు వెనకాడటం లేదు. ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా ప్రతి అభ్యర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే బరిలోకి దిగుతున్నారు. తొలి విడతలో 369 జీపీలకు ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో 389 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... వీటిలో 20 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 369 పంచాయితీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం మందు, విందుతో దావతుల్లో ముంచెత్తారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విందులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దావత్లకు వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మద్దతుదారులు చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ఓటుకు ఇంతని లెక్కలేసి డబ్బు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు నేరుగా మద్యాన్ని చేరవేస్తున్నట్లు సమాచారం. కొరవడిన నిఘా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను నిఘా విభాగం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిండం లేదు. ఇదే అదనుగా భావించిన అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశీలకులను నియమించినా పోటీదారులు ఖాతరు చేయడంలేదు. బహిరంగంగానే మద్యం, మందు పంపిణీ చేస్తూ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల నిఘా కనిపించడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరీంనగర్, రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తెరవెనక పంపిణీని పూర్తిస్థాయిలో ఆపలేకపోతున్నారన్న విమర్శలున్నాయి.మూడుదశల ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వారం పది రోజుల నుంచే మందు, విందుతో ముంచెత్తుతున్నారు. మహిళా సంఘాల వారీగా డబ్బులు, చీరలు పంచుతున్నారు. మొదటి విడత పోలింగ్కు ఒక రోజే గడువు ఉండడంతో ప్రలోభాల పర్వం కీలక దశకు చేరుకుంది. ఇంటింటికీ డబ్బులు పంచుతూ... మద్యం ఏరులై పారించేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్లో అందుబాటులో లేని వారికి యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. -
కేసీఆర్ కృషితోనే తెలంగాణ రాష్ట్రం
మెట్పల్లి: కేసీఆర్ కృషితోనే రాష్ట్రం ఏర్పాటైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం విజయ్ దివస్ వేడుకలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమా ల వేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగా ణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. కా ర్యక్రమంలోపలువురు నాయకులు పాల్గొన్నారు. కోరుట్లలో విజయ్ దివస్ కోరుట్ల: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో మంగళవారం విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పూలమాల వేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అవినీతిని నిర్మూలిద్దాం.. జగిత్యాల: అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, 1064 టోల్ఫ్రీ నంబర్తో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో అవినీతి నిరోధక వారోత్సవాల పోస్టర్ను ఎస్పీ అశోక్కుమార్తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ఉద్యోగులు నిబద్ధతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం ఇవ్వాలని వేధిస్తే 1064 టోల్ఫ్రీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. -
పోలింగ్ ఏజెంట్లే కీలకం
జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ రోజు ఏజెంట్లు కీలకం కానున్నారు. వీరు అప్రమత్తంగా ఉంటేనే అభ్యర్థుల గెలుపునకు దోహదపడుతుంది. సర్పంచ్, వార్డుసభ్యుడిగా పోటీచేస్తున్న ప్రతి వ్యక్తి.. ప్రతి పోలింగ్ కేంద్రానికో ఏజెంట్ను నియమించుకోవాలి. ఓటేసేందుకు వచ్చే ప్రతి ఓటరును గుర్తించేది ఏజెంట్లే కావడంతో కీలకమైన వ్యక్తిని ఏజెంట్గా నియమించుకోవాల్సిన అవసరముంది. సర్పంచ్ అభ్యర్థి ప్రతివార్డు నుంచి అదే వార్డుకు సంబంధించిన ఓటరును పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవాలనే నిబంధన ఉంది. వార్డుసభ్యుడు కూడా అదే వార్డుకు సంబంధించిన ఓటరును ఏజెంట్గా నియమించుకోవాలి. ఏదైనా కారణాలతో ఇతరులను నియమించుకోవాల్సి వస్తే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా ముందే ఫిర్యాదు చేసుకోవాలి. దానిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారి అనుమతి ఇస్తే తప్ప ఇతరులను నియమించుకునేందుకు వీలు లేదు. దొంగ ఓట్లు గుర్తించేది ఏజెంట్లే ప్రతి వార్డులో ఆ వార్డుకు సంబంధించిన ఓటరు వచ్చినప్పుడు ఎన్నికల సిబ్బంది ముందుగా వారి ఓటరు క్రమ సంఖ్యతోపాటు అతని పేరు, తండ్రి పేరును ఏజెంట్లకు వివరిస్తారు. ఏజెంట్లు అంగీకరించినప్పుడే ఓటరుకు వేలుపై ఇంక్ పెట్టి బ్యాలెట్ పేపర్లు అందిస్తారు. ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిన తర్వాత ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఎన్నికల అధికారి దానిని పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ప్రతి ఓటరును నిజమైన ఓటరుగా ఏజెంట్లు గుర్తించినప్పుడే ఎన్నికల సిబ్బంది ఓటరుకు బ్యాలెట్ పేపర్ అందిస్తారు. ఎవరైనా ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తే ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో నిగ్గు తేల్చిన తర్వాతే ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఏజెంట్ల వివరాలు రిటర్నింగ్ అధికారికి పంపాలి సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీచేసే అభ్యర్థి స్క్రూటినీ పూర్తి కాగానే ఓ వ్యక్తిని ఏజెంట్గా నియమించుకునే అవకాశం ఉంటుంది. ఏజెంట్గా నియమించుకునే వ్యక్తి తన అంగీకార పత్రాన్ని రాతపూర్వకంగా డూప్లికేట్ కాపీతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పంపించాలి. పరిశీలన అనంతరం రిటర్నింగ్ అధికారి నియామక పత్రంపై ఆమోదం తెలుపుతూ సంతకం చేసి ఒక కాపీని ఏజెంట్కు అందజేస్తారు. కౌంటింగ్కు ఏజెంట్ల నియామకం ప్రతి పోలింగ్స్టేషన్లో మొదట వార్డుల వారీగా కౌంటింగ్ ఏజెంట్లను తీసుకుని కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ ఏజెంట్గా వచ్చేవారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండరాదు. అలాగే కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ ఏదైనా నామినేటెడ్ పదవి నిర్వహించి ఉండరాదు. పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పదవిలో ఉన్న కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఏదైనా జాతీ య, రాష్ట్ర జిల్లా కో–ఆపరేటీవ్ చైర్మన్లు, కో–ఆప్షన్ సభ్యులు ఏజెంట్లకు అనర్హులు. వీరిని తప్ప ఎవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. -
బ్యాలెట్ బాక్స్ సీజ్ చేసేటప్పుడు ఏజెంట్ల సంతకం తప్పనిసరి
జగిత్యాలరూరల్: సర్పంచ్, వార్డు సభ్యుల పోలింగ్ రోజు బ్యాలెట్ బాక్స్లను ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల ఏజెంట్లకు ఓపెన్ చేసి చూపించి దానిని శుభ్రం చేసి ఏజెంట్ల సంతకంతో కూడిన పత్రాన్ని అంటించి సీజ్ చేస్తారు. కౌంటింగ్ సమయంలో కూడా ఏజెంట్ల ముందే బ్యాలెట్ బాక్స్ సీజ్ తొలగించి ఏజెంట్లు సంతకం చేసిన పత్రాన్ని పోలింగ్ ఏజెంట్లకు చూపించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతారు. కౌంటింగ్కు ముందు కూడా ఏజెంట్ల సంతకాలు పత్రంపై తీసుకుని వారికి ఎన్నికల కౌంటింగ్ మొదలు పెడుతున్నట్లు ప్రిసైడింగ్ అధికారి తెలుపుతారు. 50 బ్యాలెట్ పేపర్లను కట్టకట్టి పూర్తయిన తర్వాత అభ్యర్థులకు గుర్తులు ఇచ్చిన బాక్స్లను టేబుళ్లపై పెట్టి ఓట్లను ఆయా గుర్తులు ఉన్న బాక్స్ల్లో వేస్తారు. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించి ఎన్నికల ఫలితాన్ని తేలుస్తారు. -
‘పరీక్ష’ వాయిదా వేయాలె
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కదం తొక్కారు. ఈనెల 24 నుంచి నిర్వహించ తలపెట్టిన పీజీ 3వ సెమిస్టర్ను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేష న్ ఆఫీస్ ఎదుట సుమారు ఆరుగంటలపాటు బైఠాయించారు. సోమవారం వర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు సుమారు 600 మంది వర్సిటీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ర్యాలీగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. త్వరలో జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. యూనివర్సిటీ పరిధిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువుతున్నారని, ఎన్నికలకు ఓటు వేసి రావాలంటే ఇబ్బంది అవుతుందని, ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ఈనెల 23 నుంచి జవరి 7వ తేదీ వరకు సెట్, నెట్ పరీక్షలు ఉన్నాయని, ఏళ్లకాలం నుంచి ఎదురుచూస్తే ఇప్పుడు షెడ్యూల్ విడుదల అయ్యిందని, ఇదే సమయంలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే.. సెట్, నెట్కు సన్నద్ధం అవడం ఇబ్బందికరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15,16న నిర్వహించే ఫస్టియర్ విద్యార్థుల ఇంటర్నల్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీలోని లైబ్రరీని ఉదయం 9 గంటల వరకే మూసేస్తున్నారని, సాయంత్రం తక్కువ సమయం ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని ఏ వర్సిటీలోనూ లైబ్రరీలు మూసివేసిన దాఖలాలు లేవని కేవలం శాతవాహనలోనే మూసివేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉదయం 11నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే బైటాయించిన విద్యార్థులు మధ్యాహ్న సమయంలో అక్కడికే భోజనం తెప్పించుకుని తిన్నారు. వీసీ, రిజిస్ట్రార్ అందుబాటులో లేకపోగా... విషయం తెలుసుకున్న సీఐ బిల్లా కోటేశ్వర్ అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. మంగళవారం మాట్లాడుదామని వర్సిటీ రిజిస్ట్రార్ ఓఎస్డీ ద్వారా ఫోన్లో చెప్పడంతో ఆందోళన వాయిదా వేశామని శాతవాహన స్టూడెంట్ జేఏసీ నాయకులు తెలిపారు. -
ఎన్నికల శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో అవలంబించాల్సిన విధివిధానాలుపై దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో సీటింగ్ అరెంజ్మెంట్, సీక్రెట్ ఓటింగ్, కంపార్ట్మెంట్ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ స్వరూప, ఎమ్మార్వో కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరిస్తాంజగిత్యాలక్రైం: బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. ఆరుగురు బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ‘పది’లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిరాయికల్: పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో రాము సూచించారు. సోమవారం రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాతంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహించాలని, గైర్హాజరైతే ఎందుకు రాలేదో ఇంటికి వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఫ్లాగ్మార్చ్జగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా ఫ్లాగ్మార్చ్ నిర్వహిస్తున్నట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్, జాబితాపూర్ గ్రామాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించడానికి ఫ్లాగ్మా ర్చ్ నిర్వహించామన్నారు. స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా.. గొడవలు సృష్టించాలని చూసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు ఉమాసాగర్, గీత, సుధీర్రావు, రాజు పాల్గొన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి జగిత్యాల: వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్ మీడియెట్ నోడల్ అధికారి నారాయణ అన్నారు. సోమవారం ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలన్నారు. అధ్యాపకులు సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్స్ సకాలంలో పూర్తి చేయాలని, ఒకేషనల్ విద్యార్థులకు సంబంధించి ఓజేటీకి పంపిస్తూ వారికి సంబంధించిన రికార్డులను నిర్వహించాలన్నారు. అధ్యాపకులు శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ కంకనాల శ్రీనివాస్, అధ్యాపక బృందం పాల్గొన్నారు. -
ఆత్మజ్ఞాన మార్గంలో నడవండి
కోరుట్లటౌన్: అహంకారభారాన్ని వదిలి ఆత్మజ్ఞాన మార్గంలో నడవాలని గర్రెపల్లి మహేశ్వర శర్మ అన్నా రు. పట్టణంలోని శ్రీ వాసవి కల్యాణ భవనంలో శ్రీవిష్ణు మహాపురాణం ప్రవచనాల కార్యక్రమం జరిగింది. జడభరుతుని వృత్తాంతం, భక్త ప్రహ్లాద చరిత్ర, శ్రీనారసింహస్వామి ఆవిర్భావం తెలిపారు. ప్రహ్లాదుడు చెప్పే సత్యం, భక్తి, ధర్మం ఎప్పుడూ ఓడవవని, భగవంతుడు భక్తుని పిలుపు వినడానికి సిద్ధంగా ఉంటాడని అన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి నిర్వాహకులు మంచాల జగన్, హరికృష్ణ, రాజారాం, శ్రీనివాస్, రాజు, సుందర వరదరాజన్, భృగు మహర్షి, నారాయణ, చిన్నరాజన్న, ప్రవీణ్, సుధాకర్, శివకుమార్, రవీందర్, శైలజ, పద్మావతి, భక్తులు హాజరయ్యారు. -
వైభవంగా అయ్యప్ప ఆరట్టు
మెట్పల్లి: అయ్యప్పస్వామికి ఆరట్టు ఉత్సవాన్ని మెట్పల్లి పట్టణంలో సోమవారం వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయం నుంచి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కేరళ వాయిద్యాల మధ్య స్వాముల భజనలు, నృత్యాలతో చెన్నకేశవనాథ ఆలయం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి కోనేరులో పుణ్యస్నానం చేయించి పంచామృతాలతో అభిషేకం చేశారు. తిరిగి అయ్యప్ప ఆలయానికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి ప్రవీణ్, ఉపాధ్యక్షుడు అంకతి భరత్ పాల్గొన్నారు. -
శిథిలావస్థలో కోరుట్ల కోట బురుజులు
మహాదేవస్వామి ఆలయ దారిలో దెబ్బతిన్న కోట బురుజులుకోరుట్ల పట్టణంలోని ఆరు కోట బురుజులు శిథిలావస్థకు చేరాయి. జైనులు, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, రాష్ట్ర కూటులు ఇక్కడ కోట నిర్మించుకుని ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు కోట చుట్టూ ఆరు బురుజులు నిర్మించారు. ఆరు బురుజులను కలుపుతూ పెద్ద గోడ ఉండగా.. కాలక్రమేణ పూర్తిగా దెబ్బతిని కనుమరుగైంది. ఆరు బురుజులు కూడా శిథిలావస్థకు చేరుతున్నాయి. కోరుట్ల చరిత్రకు సజీవంగా నిలిచే కోటప్రదేశం, బురుజుల సంరక్షణపై మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పురావస్తు అధికారులు కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందనా లేదనే విమర్శలున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమృత్ ఉత్సవాల్లో భాగంగా పట్టణ యువకులు కోట బురుజులకు రంగులు వేసి.. అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కళావిహీనంగా తయారయ్యాయి. బురుజుల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొందరు కబ్జా చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపి బురుజులను కాపాడాలని, వాటికి పూర్వ వైభవం తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. – కోరుట్లటౌన్ -
బంధుగణం.. శత్రువర్గం
పోటీలో ఎక్కువగా అన్నదమ్ములు జగిత్యాల: పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో బంధువులే చాలాచోట్ల బరిలో నిలుస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో తల్లీకొడుకులు, అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు, తోడికోడళ్లు, అన్నదమ్ములు పోటీకి సై అంటున్నారు. ‘అన్న ఈసారి తప్పుకోరాదే.. నేను నిలబడుతున్న. నాకు మద్దతివ్వు..’ అంటూ ఓ తమ్ముడు అన్నను బతిమిలాడినా.. ‘లేదు తమ్మీ ఈసారి నువ్వే తప్పుకో.. నాకు మద్దతు ఇవ్వు..’ అంటూ అన్న బుజ్జగించినా.. ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో గ్రామాల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది. బంధువులే శత్రువర్గంలా మారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కొన్నిచోట్ల తోటికోడళ్లు బరిలో నిలబడగా.. బంధువుల సమక్షంలో పంచాయితీలు జరుగుతున్నాయి. అయినప్పటికీ రిజర్వేషన్లు మళ్లీ అనుకూలిస్తాయో..? లేదో..? అన్న ఉద్దేశంతో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. బంధువుల మధ్య లొల్లి ఇతరులకు అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. ఇద్దరు ఓటర్లను చీల్చుకుంటే మధ్యలో నిలబడిన వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ చూసినా బంధువుల మధ్య జరుగుతున్న పోరుపై చర్చ కొనసాగుతోంది. అన్నదమ్ములు, తోటికోడళ్లు చాలాచోట్ల పోటీలో నిలబడడంతో శత్రువులుగా మారుతున్నారు. ఒకే ఇంటినుంచి ఇద్దరు నిలబడటంతో బంధువులకే తలనొప్పిగా మారింది. ఎవరికి ఓటు వేయాలి..? ఓటు వేయకపోతే ఏమనుకుంటారో అని చర్చించుకుంటున్నారు. గెలిచిన వారు సంతోషంగా ఉన్నా.. ఓడిన వారు బంధువులపై శత్రుత్వం పెంచుకునే అవకాశాలు ఉంటాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓట్లు ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే చెరి రెండు ఓట్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోరందుకున్న ప్రచారం పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం హోరందుకుంది. జిల్లాలో మొత్తం 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికలు 11న జరగనుండగా రెండో విడత 14న, మూడో విడత 17న నిర్వహించనున్నారు. మొదటి, రెండో విడత అభ్యర్థుల జాబితా ఖరారైంది. మూడో విడత ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనుంది. ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉండనున్నారో తెలియనుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం పూర్తయిన అనంతరం కచ్చితంగా పోటీలో ఉంటామన్న అభ్యర్థులు మాత్రం ప్రచారం జోరుగా చేస్తుండగా కొందరు నామినేషన్లు ఉపసంహరించుకునే వారు ఆచీతూచి అడుగు వేస్తున్నారు. రెబల్స్తోనే బెడద పంచాయతీ ఎన్నికలకు పార్టీలతో సంబంధం లేకున్నా.. ఆయా పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు ఒకే గ్రామంలో ఇద్దరుముగ్గురు బరిలో ఉండడం ఇబ్బందికరంగా మారింది. అలాగే స్థానికంగా పేరున్న వారు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. పార్టీకంటే వ్యక్తిని చూసే ఓటు వేసే అవకాశం ఉండడంతో ఎవరికివారు ప్రచార వేగం పెంచారు. తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు, డ్రైనేజీల నిర్మాణం వంటి ప్రజాసమస్యల పరిష్కారానికి చొరవ చూపే నాయకుల వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. సాయంత్రం విందులు ఓటర్లను ఆకర్షించేందుకు కొంతమంది విందు రాజకీయాలకు తెరలేపుతున్నారు. రెండు విడతల్లో అభ్యర్థుల జాబితా పూర్తి కావడంతో ప్రచారంతోపాటు విందులు మొదలయ్యాయి. నిత్యం ఉదయం అభ్యర్థి వెంట 10 మంది వరకు ఉంటున్నారు. వీరందరికీ అభ్యర్థులే చాయ్లు, టిఫిన్లు పెట్టించాల్సి వస్తోంది. ఇక సాయంత్రం విందులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకం కావడంతో ఎవరూ వెనక్కి తగ్గకుండా ప్రచారంలో మునిగిపోతున్నారు. ఒక వైపు చలి.. మరో వైపు ప్రచారం రెండు రోజులుగా విపరీతంగా చలి పెడుతున్నప్పటికీ అభ్యర్థులు ప్రచారాన్ని మాత్రం ఆపడం లేదు. ఉదయం 6 గంటలలోపే ఇంటింటికీ చేరుతూ ఓటు తమకే వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. -
తెలంగాణకు బలమైన పునాది వేసింది కేసీఆరే..
మెట్పల్లిరూరల్/ఇబ్రహీంపట్నం: తెలంగాణకు బలమైన పునాది వేసింది కేసీఆరేనని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండలం బర్థీపూ ర్, మెట్పల్లి మండలం పెద్దాపూర్, కొండ్రికర్ల గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. రైతులు, కార్మికులు, పేదలు, విద్యార్థులు, మహిళలకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు. ముందుగా వర్షకొండలో మల్లన్న జాతర పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు ఎలాల దశరథ్రెడ్డి, మెట్పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు సంగం సాగర్, మామిడి సురేష్రెడ్డి, శ్రీనివాస్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే, మాజీమంత్రిని కలిసిన వీరాపూర్ పాలకవర్గంరాయికల్: రాయికల్ మండలం వీరాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. సర్పంచ్ దిండిగాల గంగు రామస్వామి, ఉపసర్పంచ్ దుంపల నర్సారెడ్డి, వార్డు సభ్యులు ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీమంత్రి జీవన్రెడ్డిని సోమవారం కలిశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సీనియర్ నేత జీవన్రెడ్డిని, సంజయ్కుమార్ను కలుసుకున్నారు. ఒక నేతను కలిసి మరో నేతను కలవకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఇలా జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, సారంగాపూర్, జగిత్యాల మండలాల్లో నూతనంగా ఎన్నికై న సర్పంచులు ఈ ఇద్దరు నేతలను కలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్, మాజీమంత్రి జీవన్రెడ్డితో ఏకగ్రీమైన సర్పంచ్, వార్డు సభ్యులు -
పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు
అన్నా.. ఓటేయడానికి తప్పక రావాల్నె..పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలిజాబితాపూర్లో తల్లీకొడుకులు పోటీరాయికల్: పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో చలికాలంలోనూ వేడి పుట్టిస్తున్నాయి. ప్రతి ఓటూ కీలకంగా మారనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఉదయం నుంచే ఇంటింటికీ వెళ్తున్నారు. ఓటర్లు కూడా వచ్చిన ప్రతి అభ్యర్థిని ఆదరిస్తున్నారు. ఎవరొచ్చినా ఓటు వేస్తామంటూ హామీ ఇస్తున్నారు. గ్రామాల్లో సైలెంట్ ఓటింగ్ పల్లెపోరులో సైలెంట్ ఓటింగ్ ఎక్కువ కానుంది. సర్పంచ్ బరిలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకున్నా.. ఎక్కడ మాట జారినా గొడవలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో ఓటర్లు ప్రచారానికి ఎవరు వచ్చినా వారి మనసు నొప్పించకుండా తమకే ఓటు వేస్తామంటున్నారు. ఇది సైలెంట్ ఓటింగ్కు దారితీసే పరిస్థితి ఉందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామాల్లోకి పంచాయతీ ఎన్నికల పోలింగ్ సమీపించిన నేపథ్యంలో ఉపాధి నిమిత్తం హైదరాబాద్, భీవండి వంటి ప్రాంతాలకు వసల వెళ్లినవారిని ఎలాగైనా ఇక్కడకు రప్పించేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల ఫోన్ నంబర్లు తెలుసుకుని ఫోన్లు చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఓటు వేసేందుకు వచ్చేటప్పుడు బస్, ట్రైన్ చా ర్జీలు భరిస్తామంటున్నారు. వీలునుబట్టి ఫోన్పే, గూగుల్పే ద్వారా అమౌంట్ పంపిస్తున్నారు. గ్రామాల్లో విందులు గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా విందు రాజకీయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా వార్డు సభ్యులు ఆయా వార్డుల్లోని కుల సంఘాల నాయకులకు డబ్బులు అప్పగిస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు. యువత, వృద్ధులు, కుల సంఘాల సభ్యులకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రెండుమూడు రోజులుగా విందులు ప్రారంభమయ్యాయి. ప్రచారానికి పట్టణం నుంచి పల్లెకు..కోరుట్ల: పల్లెల్లో ఎన్నికలు ఉన్నాయంటే పట్టణాల్లో ఉన్నవారు నీరసపడే రోజులు పోయాయి. పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఊళ్లల్లో ప్రచారం కోసం మహిళలు ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో సమీప పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలను సంప్రదిస్తున్నారు. రోజుకు రూ.500 ఇచ్చి ప్రచారం కోసం తీసుకెళ్తున్నారు. కోరుట్ల పట్టణంలోని కొన్ని మహిళా సంఘాల సభ్యులు రెండురోజులుగా పక్కనే ఉన్న అయిలాపూర్, మోహన్రావుపేట వంటి మేజర్ గ్రామ పంచాయతీలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. మల్లాపూర్: పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆర్వోలకు శిక్షణ ఇచ్చారు. అధికారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నియమావళికి లోబడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని పేర్కొన్నారు. జెడ్పీ డిప్యూ టీ సీఈవో నరేశ్, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీశ్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రా ణి, సీనియర్ అసిస్టెంట్ మహేశ్, రిటర్నింగ్ అధి కారులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి విడతలో మేడిపల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈనెల 10, 11తేదీల్లో సెలవు ఇచ్చినట్లు తెలిపారు. రెండో విడత ఎన్నికలు జరిగే జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్పూర్, మల్యాల, కొడిమ్యాలలో ఈనెల 13, 14న, మూడో విడత ఎన్నిక జరిగే ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూర్, పెగడపల్లి, గొల్లపల్లిలో ఈనెల 16, 17న పాఠశాలలకు సెలవులు ఉంటాయని తెలిపారు. జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం జాబితాపూ ర్ సర్పంచ్గా తల్లీకొడుకులు బరిలో నిలిచారు. ఇప్పటికే జాబితాపూర్ సర్పంచ్గా పనిచేసిన అంకం మమత ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఆమె భర్త అంకం సతీశ్ ప్రస్తుతం సర్పంచ్ బరిలో నిలబడ్డారు. సతీశ్ తల్లి మల్లవ్వ కూడా సర్పంచ్ బరిలో నిలిచారు. తల్లీకొడుకుల్లో ఓటర్లు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే. -
నిలిచిన రక్త నమూనాల రవాణా
జగిత్యాల: జిల్లాకేంద్రంలో తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్కు నిత్యం గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అద్దె వాహనాల్లో రోగుల రక్త పరీక్షల శాంపిల్స్ తీసుకొస్తుంటారు. వీరు ల్యాబ్లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి రిపోర్ట్ను మెసేజ్ రూపంలో తిరిగి పంపుతుంటారు. అయితే తమకు బకాయిలు చెల్లించడం లేదంటూ అద్దె వాహనదారులు వారం రోజులుగా రవాణా నిలిపివేశారు. ఫలితంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్కు రక్త శాంపిల్స్ రావడం లేదు. రోగులకు సంబంధించిన పరీక్షలు నిర్దారణ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రోజుకు 300 శాంపిళ్లు రాక జిల్లాలోని 27 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతిరోజు సుమారు 300 శాంపిల్స్ వస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పీహెచ్సీలకు వెళ్తే అక్కడ వైద్యులు పరీక్షలు రాసి నిర్ధారణ కోసం శాంపిళ్లను తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్కు పంపిస్తుంటారు. వీరు పంపించిన నిర్ధారణ ఆధారంగానే అక్కడి వైద్యులు మందులు రాస్తుంటారు. అయితే వారం రోజులుగా శాంపిల్స్ నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. చలితీవ్రతతో వృద్ధులు, మహిళలు, పెద్దలు, వివిధ రోగాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం పీహెచ్సీకి వస్తే ఈ పరిస్థితి నెలకొంది. బకాయిలు చెల్లించి వాహనాలను వెంటనే పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు. రూ.13.40 లక్షల బకాయిలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన శాంపిళ్లను ఐదు అద్దె వాహనాల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్కు తరలిస్తుంటారు. ఒక వాహనానికి నెలకు రూ.33.5 వేల చొప్పున చెల్లిస్తుంటారు. అయితే అద్దె వాహనాలకు 8 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని, సుమారు రూ.13.40 లక్షల బకాయిలు నిలిచిపోయాయని తెలిసింది. శాంపిళ్లను తరలించే అద్దె వాహనాల సేవలను వారం నుంచి నిలిపివేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు వాహనాలను నడపబోమని తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇబ్బంది పడుతున్న రోగులు బకాయిలు చెల్లించడం లేదని.. అద్దెవాహనదారుల ఆందోళన -
కొనుగోళ్లు ముగుస్తున్నా అందని పైకం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నప్పటికీ రైతుల ఖాతాల్లో రూపాయి జమ చేయలేదు. మొక్కజొన్న కొనుగోలుకు జిల్లాలో 14 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పటికే 10కేంద్రాలు మూసివేశారు. కథలాపూర్, మేడిపల్లి, గొల్లపల్లి, మల్లాపూర్ కేంద్రాలకు అంతంతమాత్రంగా మక్కలు వస్తున్నాయి. ఈ కేంద్రాలు కూడా నేడో, రేపో మూసివేస్తున్నారు. మొక్కజొన్న పంట అమ్మి, దాదాపు రెండు నెలలు కావస్తున్నా.. డబ్బులు ఇప్పటికీ వేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్, ప్రజాప్రతినిధుల ఎదుట రైతులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. 2.43 లక్షల క్వింటాళ్ల కొనుగోలు దీపావళి నుంచి ఇప్పటివరకు 7,577 మంది రైతుల నుంచి 2.43 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్నలను ప్రభుత్వ సంస్థ మార్క్ఫెడ్ కొనుగోలు చేసింది. క్వింటాల్కు ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 చెల్లిస్తున్నారు. దీని ప్రకారం రైతులకు దాదాపు రూ.58.49 కోట్లు రావాల్సి ఉంది. పంట అమ్మి నెలలు గడుస్తున్నప్పటికీ డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. ప్రభుత్వం మార్క్ఫెడ్కు నిధులు మంజూరు చేయలేదని, రాగానే రైతులకు చెల్లిస్తామని అధికారులు చెపుతున్నారు. దిక్కులు చూస్తున్న రైతులు ఎక్కువగా మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కథలాపూర్ మండల రైతులు మార్క్ఫెడ్కు మక్కలు అమ్మారు. ప్రభుత్వ ధరకు విక్రయించామని సంబరపడాలో..? లేక డబ్బులు ఇంకా రాలేవని బాధపడాలో రైతులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న పంట డబ్బులు వస్తే యాసంగి పంటల సాగుకు ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే డబ్బులు రాకపోయే ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. మక్కలు అమ్మిన పైసల కోసం రైతుల ఎదురుచూపులు జిల్లా రైతులకు రూ.58.49 కోట్లు బకాయి 14 కేంద్రాల ద్వారా 2.43 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకేంద్రం కొన్నది రావాల్సినడబ్బులు (క్వింటాళ్లలో) (రూ.లలో)మెట్పల్లి 59,272 రూ.14.22కోట్లు ఇబ్రహీంపట్నం 52,604 రూ.12.62కోట్లు మల్లాపూర్ 38,346 రూ.9.20కోట్లు రాయికల్ 19,008 రూ.4.56కోట్లు కోరుట్ల 16,027 రూ.3.8కోట్లు కథలాపూర్ 11,990 రూ.2.87కోట్లు జగిత్యాల 11,532 రూ.2.76కోట్లు భీమారం 9,974 రూ.2.39కోట్లు లక్ష్మీపూర్ 7,331 రూ.1.75కోట్లు మేడిపల్లి 6,184 రూ.1.48కోట్లు డబ్బా 4,257 రూ.1.02కోట్లు గొల్లపల్లి 3,446 రూ.82.71 లక్షలు ధర్మపురి 1,910 రూ.45.84 లక్షలు గంభీర్పూర్ 1,826 రూ 43.82 లక్షలు -
చలి.. గుండె అలజడి
కరీంనగర్: జిల్లాను చలి వణికిస్తోంది. గజగజ వణికే చలితో శ్వాసకోశ, చర్మవ్యాధులతో పాటు హార్ట్ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్లు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అధిక చలితో రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణలో ఇబ్బందులు ఏర్పడడంతో హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మారిన జీవనశైలిలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కేన్సర్, టీబీ తదితర వ్యాధులతో బాధపడే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలంటున్నారు. గుండెపోటుకు చలి ఒక కారణమైనప్పటికీ ఇతర కారణాలు ఉన్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్, హైబీపీ, అదుపులో లేని షుగర్, చిన్నప్పటి నుంచే గుండె సంబంధ సమస్యలు ఉండే వారు హార్ట్ఎటాక్కు గురవుతారు. మామూలు రోజుల్లో కన్నా చలికాలంలో హార్ట్ ఎటాక్లు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో గుండె సమస్యలు చలి ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నాళాలు కుచించుకుంటాయి. దీంతో బీపీ పెరుగుతుంది. గుండె మరింత శక్తిగా పనిచేయాల్సి వస్తుంది. ఇది గుండె వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. చలిలో రక్తం కొంచెం మందంగా మారి రక్త గడ్డలు (క్లాట్స్) ఏర్పడే అవకాశం పెరుగుతుంది. దీంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. చలితో శరీరం వేడిగా ఉంచేందుకు ఎక్కువ కేలరీలు, ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంది. దీంతో గుండైపె భారం పెరుగుతుంది. జలుబు, ఫ్లూ, శ్వాస సమస్యలు పెరిగి గుండె సంబంధిత సమస్యల్ని మరింత తీవ్రతరం చేస్తాయి. చలికాలంలో వ్యాయామం తగ్గిపోవడం, బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చలికాలంలో రక్తపోటు సాధారణంగా పెరుగుతుంది. హై బీపీతో హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉంటుంది. గుండెపోటు ఇలా గుండెకు ప్రధానంగా మూడు దమనుల ద్వారా రక్తసరఫరా జరుగుతుంది. వీటిలో ఏ రక్తనాళం మూసుకుపోయినా గుండె కండరాలకు అందాల్సిన రక్తం అందక గుండె పోటు వస్తుంది. ఇలాంటప్పుడు సమయానికి హాస్పిటల్కు తీసుకెళ్తే బాధితులను బతికించేందుకు అవకాశముంటుంది. కార్డియాక్ అరెస్ట్ జరిగిన తర్వాత హాస్పిటల్కు తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో... సీపీఆర్ ప్రక్రియపై అవగాహన ఉన్నవారు సీపీఆర్ చేయడం కూడా అంతే ముఖ్యం. ‘చొప్పదండి ప్రాంతానికి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి ఈనెల 3న వేకువజామున హఠాత్తుగా గుండెల్లో నొప్పి వచ్చింది. కు టుంబసభ్యులు హుటాహుటిన కరీంనగర్లో ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలు నిలిచాయి.’ ‘నగరంలోని కిసాన్నగర్కు చెందిన 42 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి అర్ధరాత్రి ఎడమచేయి లాగ డం, చాతిలో నుంచి వీపులోకి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు మొదటి ప్రభుత్వాసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో కోలుకున్నాడు.’ -
నెలన్నరైనా డబ్బులు రాలే..
నేను 10 క్వింటాళ్ల మొక్కజొన్నలను అమ్మి నెలన్నర అవుతోంది. రూ.24వేలు రావాల్సి ఉంది. డబ్బులు రాకపోతే.. యాసంగికి పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి. డబ్బులు ఖాతాలో పడ్డాయని ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి చూడాల్సి వస్తోంది. – పాతూరి శ్రీనివాస్ రెడ్డి, రాయికల్ త్వరలో డబ్బులు మరో నాలుగైదు రోజుల్లో మొక్కజొన్న రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ప్రభుత్వం నుంచి మార్క్ఫెడ్ సంస్థకు డబ్బులు రావాల్సి ఉంది. రాగానే ఆలస్యం చేయకుండా వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం. రైతులు సహకరించాలి. – ఎండీ.హబీబ్, మార్క్ఫెడ్ జిల్లా అధికారి -
గెలుపు వ్యూహాలు..
జగిత్యాల: గ్రామాల్లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థులు వ్యూహ రచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కుల సంఘాలు, మహిళాసంఘాలు, యువతను ప్రసన్నం చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు కోసం అవకాశం ఉన్న ప్రతి అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఎలా ఆకట్టుకోవాలో సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ గుర్తులు లేకున్నా.. ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల రెబల్స్ బెడద కూడా తీవ్రంగా ఉంది. ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వీరి ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు కన్నా ప్రజాబలం మిన్న కావడంతో ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ప్రతి గ్రామాల్లో కుల సంఘాల నాయకుల పెద్దలను కలుస్తూ గంపగుత్తగా కులం ఓట్లు పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులను కలుస్తూ ఒకే వైపు మహిళలంతా ఓట్లు వేయాలని కోరుతున్నారు. కుల సంఘాల నాయకులు ఆచీతూచి సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కొన్నిచోట్ల ఎలాగైనా ఓట్లు రాబట్టుకోవాలని డబ్బులు కూడా అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే మహిళ సంఘాలు, యువతకు కానుకల రూపంలో ముట్టజెప్పుతున్నారు. యువతకు క్రీడలకు సంబంధించిన కిట్లు, ఆట వస్తువులను అందజేస్తున్నారు. సందడేసందడే.. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. రెండో విడత 14న, మూడో విడత 17న జరగనున్నాయి. మొదటి విడత ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో విడత, మూడో విడతకు ఇంకా సమ యం ఉన్నప్పటికీ సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడంతోపాటు, కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తికావడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం, కత్తెర, ఫుట్బాల్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బ్యాట్, టీవీ తదితర గుర్తులు కేటాయిస్తున్నారు. కొన్ని గుర్తులు తెలియకుండా ఉన్నాయి. వాటి గురించి అభ్యర్థులు చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. క్రికెట్ స్టంప్స్, గాలిబుడగ, బ్యాటరీలైట్, బిస్కట్, మంచం ఇలాంటి గుర్తులతో కొంత పరేషాన్ నెలకొంది. ఉంగరం, కత్తెర గతంలోనూ ఉండటంతో ఇవి ఫేమస్గా మారాయి. ఇవి వచ్చిన వారికి పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ కొత్త గుర్తులు మాత్రం అభ్యర్థులకు తలనొప్పిగానే మారాయి. అయినప్పటికీ గుర్తులపైనే ఫోకస్ చేసి ప్రచారం చేస్తున్నారు. కొన్ని గుర్తులు దగ్గరదగ్గర పోలి ఉండటంతో అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. గ్రామాలపై పట్టుకు అభ్యర్థుల యత్నం కుల సంఘాలతో మంతనాలు ఓటర్ల ప్రసన్నం కోసం సమావేశాలు -
అభివృద్ధి పనులే గెలిపిస్తాయి
మెట్పల్లిరూరల్: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం వేంపేటలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తరఫున ఆదివారం ప్రచారం చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, చంద్రశేఖర్గౌడ్, రమేశ్ పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ -
ప్రభుత్వ అరాచకానికి బీసీ బిడ్డ బలి
రాయికల్: కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకానికి బీసీ బిడ్డ ఈశ్వరాచారి బలయ్యాడని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఈశ్వరాచారి చిత్రపటానికి ఆదివారం నివాళులర్పించారు. కేంద్రంతో ఒప్పించి చట్టబద్ధంగా రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా సీఎం ఒత్తిడి తేవాలని, అవసరమైతే అఖిలపక్షం నాయకులతో కలిసి జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని కోరారు. యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో వేణు రచించిన ఎత్తురా జెండా సీడీని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్లు ఎనుగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణిసాయికుమార్, తురగ శ్రీధర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సాయికుమార్, మహేశ్ గౌడ్, మహేందర్ పాల్గొన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత -
మహాశివునికి పంచామృతాభిషేకం
జగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్ర వెయ్యి లింగాల దేవాలయంలో మహాశివునికి అన్నపూజ, మహాగణపతికి పంచామృతాభిషేకాలు చేశారు. ఆరుద్ర నక్షత్రం సంకటహర చతుర్థి పురస్కరించుకుని మహాదేవునికి అభిషేకాలు చేశారు. వేలాది మంది భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహా గణపతికి పూజలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం మహాగణపతికి సంకటహర చతుర్థి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. జగ్గాసాగర్లో పోలీసుల కవాతుమెట్పల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించడానికి పోలీస్శాఖ ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామని మెట్పల్లి సీఐ అనిల్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో ఆదివారం ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయన్నారు. మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ ఎస్సైలు కిరణ్కుమార్, రాజు నాయక్, అనిల్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి అభ్యర్థి లెక్కలు చూపించాల్సిందేజగిత్యాలరూరల్: ప్రతి అభ్యర్థి లెక్కలు చూపించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు మనోహర్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలంలో పోటీచేసే సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల నియమావళి, ఖర్చులపై ఆదివా రం అవగాహన కల్పించారు. అభ్యర్థులు ఎన్ని కల నియమావళి పాటించాల్సిందేనన్నా రు. రూరల్ సీఐ సుధాకర్ మాట్లాడుతూ అభ్యర్థులు గ్రామాల్లో అనుమతి తీసుకున్నాకే.. సమావేశాలు, మైకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇబ్బందులు తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎంపీడీవో రమాదేవి, రూరల్ ఎస్సై ఉమాసాగర్ పాల్గొన్నారు. నేడు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికమల్లాపూర్: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్–డివిజన్ కార్యలయంలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక(లోకల్ కోర్టు) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎరుకల నారాయణ, ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ ఏడీఈ అమరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్శాఖ సబ్ డివిజన్ పరిధిల్లోని మల్లాపూర్, రాఘవపేట, ఇబ్రహింపట్నం, మేడిపల్లి(పడమర) సెక్షన్ల సంబంధిత గ్రామాల రైతులు, గృహ, వాణిజ్య, వ్యాపార వినియోగదారులు హాజరుకావాలని సూచించారు. -
తల్లిని ఆర్డీవో ఆఫీసులో వదిలి వెళ్లిన కొడుకులు
జగిత్యాల: కని, పెంచిన తల్లి వారికి భారమైంది.. కుమారులు ఆమెను వదిలించుకోవాలనుకున్నారు. దీంతో ఏకంగా ఆర్డీవో కార్యాలయంలోనే తల్లిని వదిలి వెళ్లిపోయారు. జగిత్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మల్యాల మండలానికి చెందిన కుర్రె లక్ష్మికి ఇద్దరు కుమారులు కృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు. ఒకరు జగిత్యాలలో.. మరొకరు మల్యాలలో ఉంటున్నారు. లక్ష్మి భర్త నారాయణదాస్ గతంలోనే మృతిచెందాడు. ఆస్తిపంపకాల్లో గొడవ రావడంతో సమస్య పరిష్కారానికి శనివారం ఉదయం తల్లితోపాటు కుమారులు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. అనంతరం తల్లిని అక్కడే వదిలి వెళ్లిపోయారు. సాయంత్రమైనా కొడుకులు రాకపోవడంతో ఆ వృద్ధురాలు చలిలోనే కార్యాలయం ఆవరణలో ఉండిపోయింది. ఇది గమనించిన ఆర్డీవో వెంటనే ఆమె కొడుకులకు ఫోన్ చేసి తల్లిని వెంటనే తీసుకెళ్లాలని, సోమవారం ఇద్దరూ కలిసి తన కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. వెంటనే పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తల్లిని తీసుకెళ్లాడు. -
జగిత్యాల
30.0/14.07గరిష్టం/కనిష్టంకొండగట్టులో భక్తుల రద్దీ కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. రాత్రి చలి తీవ్రత అధికం అవుతుంది. ధర్మపురిలో భక్తుల రద్దీధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
హోంగార్డుల సేవలు వెలకట్టలేనవి
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు వెలకట్టలేనివని, పోలీసు సిబ్బందికి దీటుగా విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావం సందర్భంగా శనివారం ఎస్సీ కార్యాలయంలో ఆఫీసర్స్ పరేడ్ నిర్వహించారు. గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ హోంగార్డ్ ఆఫీసర్స్ పరేడ్ను తిలకించారు. ట్రాఫిక్ నిర్వహణ, ఉత్సవాలు, ఎన్నికల బందోబస్తు, నైట్ పెట్రోలింగ్, నేరాల నిరోధం వంటి పనిల్లో సేవలు అందిస్తున్నారని అభినందించారు. వారి సంక్షేమం, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి సహకరిస్తామన్నారు. అనంతరం ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. కళాబృందం సభ్యులను సన్మానించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, రిజర్వ్ సీఐలు కిరణ్కుమార్, సైదులు, వేణు, ఆర్ఎస్సైలు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ముగిసిన పీఎంశ్రీ స్కూల్ స్పోర్ట్స్ మీట్జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో నిర్వహించిన పీఎంశ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని సూచించారు. డీఈవో రాము, సెక్టోరియల్ అధికారి కొక్కు రాజేశ్ ఎస్జీఎఫ్ సెక్రెటరీ చక్రధర్, పెటా అధ్యక్షుడు పడాల విశ్వప్రసాద్, పీఈటీలు పిడుగు భాస్కర్రెడ్డి, కృష్ణప్రసాద్, అంజయ్య క్రీడాకారులు పాల్గొన్నారు. గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలిమల్యాల: గర్భిణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. మందుల నిల్వలు, రికార్డులు, వ్యాక్సిన్లు పరిశీలించారు. ల్యాబ్ తనిఖీ చేశారు. డయాగ్నొస్టిక్ పరికరాలపై ఆరా తీశారు. ఆరోగ్య సంబంధిత చికిత్సలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని గర్భిణులకు సూచించారు. ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలని, ఐరన్, ఫోలిక్యాసిడ్ మాత్రలు వేసుకోవాలన్నారు. మండల వైద్యురాలు మౌనిక, పీహెచ్ఎన్ నాగలక్ష్మీ, రమేశ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. టీకాలు వినియోగించుకోవాలిగొల్లపల్లి: చిన్నారులు, గర్భిణులు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా అందించే టీకాలను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని బీబీరాజ్పల్లి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. టీకాల పంపిణీ తీరును పరిశీలించారు. ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీకాల విషయంలో ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎంలు దేవేందరమ్మ, పుష్పలత పాల్గొన్నారు. -
‘రోళ్లవాగు’కు అనుమతి ఇవ్వండి
● నగర్వన్ యోజన కింద పెండింగ్ నిధులివ్వండి ● మంత్రి భూపేంద్రయాదవ్కు ఎంపీ అర్వింద్ వినతి జగిత్యాల: రోళ్లవాగు ప్రాజెక్ట్కు అనుమతులు వేగవంతం చేయాలని, నగర్వన్ యోజన కింద పెండింగ్ నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్కు ఎంపీ అర్వింద్ వినతిపత్రం సమర్పించారు. బీర్పూర్ మండలంలోని రోల్లవాగు ప్రాజెక్ట్కు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు కావాలని కోరారు. జగిత్యాల అర్బన్ మండలంలో అర్బన్ ఫారెస్ట్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నగర్వన్ యోజన కింద రూ.2 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో ఇదివరకే రూ.1.4 కోట్లు విడుదల కాగా.. రూ.60 లక్షలు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి సారించాలి రాయికల్: సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలని అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి సూచించారు. శనివారం రాయికల్ మండలం అల్లీపూర్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఠాణాను తనిఖీ చేసి రికార్డులపై ఆరా తీవారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులపై దృష్టి సారించాలని సూచించారు. ఏయే గ్రామాల్లో సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారో.. ఆ గ్రామాల్లో బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. విధులపై ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట డీఎస్పీ రఘుచందర్, రూరల్ సీఐ సుదాకర్, ఎస్సై సుధీర్రావు ఉన్నారు. -
ఎకరాకు రూ.50 లక్షలు ఇవ్వండి
కథలాపూర్: మండలం కలిగోట శివారులో నిర్మించనున్న సూరమ్మ ప్రాజెక్ట్ కాలువ పనుల్లో భూములు కోల్పోతున్న తమకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డికి విన్నవించారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఇప్పపల్లి రైతులతో ఆర్డీవో సమావేశమయ్యారు. గ్రామం పరిధిలో 39.11 ఎకరాలు కాలువ పనుల్లో కోల్పోతున్నారని, ఇందుకు ప్రభుత్వం పరిహారం కింద ఎకరాకు రూ.8.64 లక్షలుగా నిర్ణయించిందన్నారు. రైతులు మాట్లాడుతూ రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని స్పష్టం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో తెలిపారు. తహసీల్దార్ వినోద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాగండ్ల రమేశ్గౌడ్, ఆర్ఐలు నగేశ్, రవీందర్ పాల్గొన్నారు. -
కనుల పండువగా ఆరట్టు
రాయికల్:రాయికల్ పట్టణంలో ఆరట్టు ఉత్సవాన్ని శనివారం కనులపండువగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు సత్యనారాయణశర్మ, సాయి సుధీర్శర్మ ప్రత్యేక పూజలు చేశారు. గాంధీచౌక్, పాతబస్టాండ్, చెరువు వరకు శోభాయాత్ర చేపట్టారు. అయ్యప్ప మాలధారుల భజనలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. అయ్యప్ప నామస్మరణతో పట్టణం మార్మోగింది. అనంతరం మూలవిరాట్కు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గురుస్వాములు మచ్చ శ్రీధర్, సింగని రమేశ్, సాంబారి శ్రీను, ఎనగందుల రాజు, పారిపల్లి శ్రావణ్, అజయ్, భార్గవ్, కై రం సత్యంగౌడ్ పాల్గొన్నారు. -
స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంబేడ్కర్ చలవే
అంబేడ్కర్కు నివాళి అర్పిస్తున్న జీవన్రెడ్డి నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే సంజయ్జగిత్యాలటౌన్: దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంబేడ్కర్ చలవేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీమంత్రి జీవన్రెడ్డి, బీజేపీ నాయకులు అన్నారు. అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ భవన్ను త్వరలో అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, కమిషనర్ స్పందన, నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, ఎలిగేటి నర్సయ్య, మద్దెల నారాయణ, దేవయ్య తదితరులు ఉన్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బీజేపీ నాయకులుఅంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ -
యాసంగిలో అనువైన వరి రకాలివే..
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో జిల్లాలో వరి ప్రధాన పంటగా మారనుంది. కనీసం 3.10 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు అవసరమైన, వరి నారుమడులు పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకునేందుకు రైతులు ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలపైనే ఆధారపడుతున్నారు. ఆయా ప్రాంతాల సాగునీటి వసతిని బట్టి దీర్ఘకాలిక (140–150 రోజులు), మధ్యకాలిక(140–130 రోజులు), స్వల్పకాలిక(130–120 రోజులు) రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. యాసంగిలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఎక్కువగా దొడ్డు రకాలనే సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అక్కడక్కడ సన్న రకాలు సాగు చేయాలని చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనిలతో ఒప్పందాలు చేసుకుని వరిలో ఆడ, మగ విత్తనాలను సాగు చేసుచేస్తున్నారు. దొడ్డు రకాల్లో ప్రధానమైనవి కేఎన్ఎం–118 (కూనారం సన్నాలు), జేజీఎల్–18047 (బతుకమ్మ), జేజీఎల్–24423(జగిత్యాల రైస్–1), ఆర్ఎన్ఆర్–29325, ఎంటీయూ–1010 రకాలు సాగు చేస్తున్నారు. ఈ రకాలు దిగుబడి ఎకరాకు 28–32 క్వింటాళ్ల వరకు వస్తుంది. చలి, సుడిదోమను తట్టుకుంటాయి. జిల్లాలో పంటకాలం తక్కువగా ఉండే రకాలను సాగు చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సన్న రకాల్లో ఆర్ఎన్ఆర్–15048, కేఎన్ఎం–1638, డబ్ల్యూజిఎల్–962 రకాలు ప్రధానమైనవి. రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. కొన్ని రకాలు ఒక్క ప్రాంతంలో అధిక దిగుబడినిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో దిగుబడి ఇవ్వవు. రైతులు వరి విత్తనాలను ఎంపిక చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నారుమడిలోనే పంటకు అవసరమైన అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్ల, పురుగుల బెడద ఉండదు. చలికాలంలో నారు పెంపకం సమయంలో భాస్వరం ఎక్కువగా ఇస్తూ... ఉదయం వేళల్లో నీటిని అందిస్తూ ఉండాలి. నారు పోసిన 25 రోజుల లోపల నాటేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. -
సేవాలాల్తండా..
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని సేవాలాల్తండా పంచాయతీ పాలకవర్గానికి చివరి రోజు శుక్రవారం సర్పంచ్తోపాటు ఎనిమిది వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిగా భూక్య సరిత, వార్డు సభ్యులుగా లకావత్ శ్రీనివాస్, నిమ్మల అనిత, రమావత్ సునీత, ధరంసోత్ రేఖ, కట్ట వేణు, లకావత్ స్వరూప, రాగం దేవయ్య, ముడావత్ మౌనిక సింగిల్ నామినేషన్లు వేశారు. వీరిని సిద్దిపేట మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భూక్య చందర్నాయక్, నాయకులు కల్వకుంట్ల గోపాల్రావు, సురేందర్రావు, గౌతంరావు, కట్ట బాపురావు, కిషన్రావు అభినందించారు. -
వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి
జగిత్యాలరూరల్: భారతీయ వలస కార్మికుల భద్రతపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో ఓవర్సిస్ మొబిలిటి బిల్ ప్రవాసీల హక్కులు కాపాడాలని తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ సభ్యులు చెల్లమనేని శ్రీనివాస్తో కలిసి రాష్ట్ర ఎంపీలకు వినతిపత్రం సమర్పించారు. 42 ఏళ్లుగా అమలులో ఉన్న ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎంపీ డీకే.అరుణ, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్.సురేశ్, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, సురేశ్ శెట్కర్, కడియం కావ్య, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్కుమార్రెడ్డి, ఎంపీ మధుయాష్కిలతో చర్చించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతివేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతాల్ఠాణాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి చెర్ల మురళి(50) గుండెపోటుతో గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మురళి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి. గురువారం రాత్రి 7 గంటల వరకు కత్తెరగుర్తుకు ఓటేయాలని కోరుతూ గ్రామంలో ప్రచారం చేశారు. రాత్రి 11 గంటల సమయంలో గుండెలో నొప్పిగా ఉందని, వేములవాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి బైక్పై వెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరీంనగర్ వెళ్లాలని సూచించారు. అంబులెన్స్లో వెళ్తూ పరిస్థితి విషమించడంతో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మురళికి కుమారుడు ఆదిత్య, కూతురు ఐశ్వర్య ఉన్నారు. కుమారుడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తండ్రి చివరి చూపు కోసం వస్తుండటంతో అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. సర్పంచ్ అభ్యర్థి మురళి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యథావిధిగా ఎన్నికలు సర్పంచ్ అభ్యర్థి మృతిచెండంతో ఎన్నికలు నిర్వహిస్తారా.. లేదా.. అనే అనుమానంతో శుక్రవారం గ్రామంలో ఎవరూ ప్రచారం చేయలేదు. ఎన్నికలు యథావిధిగా నిర్వహిస్తామని ఎంపీడీవో కీర్తన ప్రకటించారు. దొంగ పట్టివేతసిరిసిల్ల క్రైం: వేములవాడ–సిరిసిల్ల రూట్ బస్సులో ఈనెల 3న జరిగిన బ్యాగ్ దొంగతనం కేసును సిరిసిల్ల పోలీసులు ఛేదించారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాలు. వేములవాడకు చెందిన నార్ల శ్రీనివాస్ హోల్సేల్ వ్యాపారాలకు చెల్లించాల్సిన రూ.3,97,500 నగదు, ఇతర పత్రాలు ఉన్న బ్యాగ్ను చివరి సీటు కింద పెట్టి ప్రయాణిస్తున్నారు. తంగళ్లపల్లి వద్ద బ్యాగ్ కనిపించకపోవడంతో సిరిసిల్ల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు బృందాలుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుడు రుద్రారం గ్రామానికి చెందిన బండారి బాలరాజు(50)గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. సీటు కింద ఉంచిన బ్యాగ్ను తీసుకుని చంద్రంపేట వద్ద దిగినట్లు అంగీకరించాడు. బాలరాజు నుంచి రూ.3,92,500 నగదును పోలీసులు రికవరీ చేశారు. నిందితుడిని శుక్రవారం రిమాండ్కు తరలించారు. -
గంభీరావుపేటలో..
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీతో పాటు వివిధ గ్రామాల్లో ప లువురు విద్యాధికులు సర్పంచ్ స్థానానికి పోటీ పడుతున్నారు. గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తు న్న చేరాల లహరిక ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ డిప్లామా కోసం ఉద్యోగానికి సెలవు పెట్టింది. ఈ క్రమంలోనే సర్పంచ్ స్థానా నికి నామినేషన్ దాఖలు చేసింది. గంభీరావుపేటలో కోడె స్వప్న సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. -
కాల్వశ్రీరాంపూర్లో 12లో 8 మంది..
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో 12 మహిళలకు కేటాయించారు. ఎనిమిది స్థానాల్లో గ్రాడ్యుయేట్లు పోటీలో నిలిచారు. కాల్వశ్రీరాంపూర్కు చెందిన జూకంటి శిరీష ఎంకాం చేశారు. గతంలో ఎంపీటీసీ, వైస్ ఎంపీపీగా సేవలందించారు. ప్రస్తుతం సర్పంచ్ బరిలో నిలిచారు. మీర్జంపేట నుంచి పుప్పాల రాజశ్యామల హృదయ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఎంకాం పూర్తి చేశారు. ఆరెపల్లి నుంచి సాకర్మాన్ విశాల పోటీలో నిలవగా.. బీఎస్సీ కంప్యూటర్ చదివారు. మడిపల్లి నుంచి అడిగొప్పుల రాణి పోటీ చేస్తున్నారు. బీకాం కంప్యూటర్ పూర్తి చేశారు. జాఫర్ఖాన్పేట నుంచి యాదగిరి జ్యోత్స్న పోటీ చేస్తుండగా ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేశారు. వెన్నంపల్లి నుంచి ఎంబాడి యశోద బరిలో ఉన్నారు. ఎంబీఏ, బీఎస్సీ చదివారు. పెద్దంపేట నుంచి పోటీ చేస్తున్న దాసరి సునీత బీకాం, సీఏ చదివారు. సర్పంచ్ పోటీకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు. -
22 ఏళ్లు సర్పంచ్.. శంకరయ్య
కథలాపూర్(వేములవాడ): ప్రజాప్రతినిధిగా హోదా రా వాలని ఎన్నికల వేళల్లో నేతలు పడరాని పాట్లు పడుతుంటారు. పదవి వచ్చాక ప్రజ లకు సేవలందించి రెండోసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే వారు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కానీ కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన ఆమందు శంకరయ్య 22 ఏళ ్లపాటు సర్పంచ్గా ఎన్నికయ్యారు. అంబారిపేటలో 1959లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామస్తులందరూ సమావేశమై శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి సర్పంచ్గా శంకరయ్యనే. ఇలా 1981 వరకు శంకరయ్య సర్పంచ్గా సేవలందించారు. ఇలా ఏకధాటిగా 22 ఏళ్లు సర్పంచ్గా పనిచేసి అదీ ఏకగ్రీవంగానే ఎన్నిక కావడం విశేషమని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయనను అంబారిపేట శంకరయ్యగా పిలిచే వారని అతని మిత్రులు, నాయకులు తెలుపుతున్నారు. 2014లో శంకరయ్య అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
రూ.1.56 లక్షలు సీజ్
రామగిరి(మంథని): ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. శుక్రవారం లద్నాపూర్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మంథనికి చెందిన ఊడిమాడుగుల సురేందర్ వద్ద రూ.1,56,910 నగదు లభించింది. ఆధారాలు చూపించకపోవడంతో సీజ్చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి అరవింద్కు అప్పగించారు. మానేరులో దూకి వ్యక్తి ఆత్మహత్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో నివసిస్తున్న యెల్లె రమేశ్(42) శుక్రవారం మానేరువాగులో దూకి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్కు చెందిన రమేశ్ పవర్లూమ్ కార్మికుడిగా పనిచేసేవాడు. ఏడాదిగా పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మద్యం మానేయలని భార్య లత మందలించడంతో మనస్థాపానికి గురై ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం తంగళ్లపల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాగులో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. -
అప్పు చెల్లించాలని బైఠాయింపు
సిరిసిల్లటౌన్: అవసరం ఉందని వస్తే ఏడేళ్ల క్రితం రూ.5లక్షలు అప్పు ఇచ్చానని.. తిరిగి చెల్లించడం లేదంటూ సిరి సిల్లలో ఓ బాధితుడు నిరసన తెలిపా డు. బాధితుడు గణేశ్నగర్కు చెందిన యెనగంటి రాజయ్య తెలిపిన వివరాలు. ఏడేళ్ల క్రితం ఇల్లును విక్రయిస్తే వచ్చిన డబ్బుల్లో నుంచి రూ.5లక్షలు పట్ట ణానికి చెందిన వస్త్ర వ్యాపారికి ఇచ్చినట్లు తెలిపారు. ప్రతీ నెల వడ్డీ ఇస్తానని నమ్మించి మొండికేసాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా తీసుకున్న అ ప్పు డబ్బులు ఇవ్వడం లేదని, పైగా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా సదరు వ్య క్తి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. న్యాయం కోసమే తాము ఇలా బైఠాయించా మని వివరించారు. బాధితుడు ఠాణా మెట్టెక్కారు. అప్పు తీసుకున్న వ్యక్తి మాజీ ప్రజాప్రతినిధి తండ్రి కావడంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయమైంది. -
ఉద్యోగంలో సంతృప్తి లేక
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం నాగులమల్యాల మాది. కాకతీయ విశ్వవిద్యాలయంలో బీటెక్ (ఈఈఈ) చేశా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మన్ లాంగ్వేజీ పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలని భావించా. ఇక్కడే కార్పోరేట్ ఉద్యోగం దొరికింది. నాగులమల్యాల సర్పంచ్ అభ్యర్థి జనరల్ మహిళలకు కేటాయించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో నిలిచాను. ఉద్యోగంలో అనుకున్న సంతృప్తి లేకపోవడం..ఇదివరకే వర్సిటీ స్థాయిలో విద్యార్థి నాయకురాలిగా చేసిన అనుభవం ఉండటంతో పోటీలో నిలిచాను. తండ్రి రాజాగౌడ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా చేసి ఓడిపోయారు. – మల్యాల జాహ్నవి, బీటెక్ (ఈఈఈ) -
గ్రామాలు నిర్లక్ష్యానికి గురైనందుకే
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం కమాన్పూర్ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. బీటెక్ (ఈసీఈ) పూర్తి చేసారు. ఉన్నత విద్య అనంతరం గృహిణిగా కొనసాగుతున్నా. కమాన్పూర్ సర్పంచ్స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో పోటీలో నిలిచాను. భర్త వ్యవసాయం, వ్యాపారం చేస్తుండడం, గ్రామస్తులతో మంచి పరిచయాలు ఉండటం కలిసి వస్తుందని భావిస్తున్నా. గ్రామస్థాయిలో ప్రజలు అనేక అన్యాయాలకు గురవుతున్నారు. ఆదర్శ గ్రామంగా చేయాలన్న కోరిక మేరకే పోటీలో నిలిచాను. – నునుగొండ మానస, బీటెక్ (ఈసీఈ) -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు
జగిత్యాల: పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జోనల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఫారం–14 అందించిన ప్రతిఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్సౌకర్యం కల్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన పోలింగ్ అధికారులందరూ విధులకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం ముందు అవరసమైన అన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో మొదటి విడతలో నాలుగు సర్పంచ్ స్థానాలు, 349 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికమయ్యాయని, 118 గ్రామపంచాయతీలు, 823 వార్డులకు ఈనెల 11న పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజే ఉప సర్పంచ్ ప్రక్రియ ముగిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీపీవో రఘువరణ్, నోడల్ అధికారులు రేవంత్, రవికుమార్ పాల్గొన్నారు. ఒకరి ఓటు మరొకరు వేయకుండా చూడాలి ఇబ్రహీంపట్నం: పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ రోజున ఒకరి ఓటు మరొకరు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్వో, పీవో శిక్షణను సందర్శించి అరగంట సేపు కూర్చొని విన్నారు. పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు జాగ్రత్తగా చేపట్టాలని తెలిపారు. వార్డు సభ్యులు గెలుపొందిన వారిని ఉప సర్పంచ్ను ఎన్నుకునే వరకు ఎటూ వెళ్లనియొద్దని అన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, తహాసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో చిప్ప గణేశ్, ఎంఈవో మధు, ఆర్ఐ రెవంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.12.5 కోట్లు
జగిత్యాల: జగిత్యాలలోని అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.12.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం జి ల్లా కేంద్రంలోని పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఇటీవల అర్బన్ హౌసింగ్ కాలనీలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు కావడంతో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పార్క్లు, రహదారులు, డివైడర్లు ఏర్పాటు చేయడ ం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్రెడ్డి జగిత్యాలకు అత్యధికంగా నిధులు మంజూరు చేయడం అ భినందనీయమని తెలిపారు. ఎమ్మెల్యే వెంట నా యకులు గిరి నాగభూషణం, జ్యోతి పాల్గొన్నారు. కేంద్ర నిధులతోనే గ్రామాలాభివృద్ధి రాయికల్: కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అన్నారు. శుక్రవారం రాయికల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర నిధులతో పాటు గ్రామాల అభివృద్ధికి ఎంపీ ధర్మపురి అర్వింద్ సహకారంతో మరిన్ని నిధులకు కృషి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, పట్టణ అధ్యక్షుడు మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ మధు, ప్రధాన కార్యదర్శి రవీందర్రెడ్డి, నాయకులు భూమేశ్, సంజీవ్, మహేశ్, శ్రీని వాస్, నర్సయ్య, సత్తయ్య, మచ్చ నారాయణ, సామల్ల సతీశ్, శ్రీకాంత్రెడ్డి, సుమన్ పాల్గొన్నారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంవర్థక రంగం కీలకం
కోరుట్ల రూరల్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశు సంవర్థక రంగం కీలక భాగమని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణ శివారులోని పీవీ సరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. పశు వైద్యసేవలు, ల్యాబ్ సదుపాయాలు, చికిత్సా విధానం, ఆధునిక పరికరాల వినియోగాన్ని పరిశీలించారు. ప్రాక్టికల్స్, ఫీల్డ్ అనుభవం, , భవిష్యత్ లక్ష్యాలను పశువైద్య విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు, పశు పోషకులకు ఉపయోగపడేలా వెటర్నరీ సేవలు మరింత విస్తృతం చేయాలన్నారు. కళాశాల అసోసియేట్ డీన్, ప్రొఫెసర్లు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి సందర్శన కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను రోగులతో అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఎంఎస్ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్తో ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రి వైద్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
● సర్పంచ్, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూపులు ● తమను గెలిపించాలంటూ పోస్టులు, వీడియోలు
జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. గతంలో ఎక్కువగా మొబైల్ ఫోన్లు లేకపోవడంతో వాల్పోస్టర్లు, విసిటింగ్ కార్డులు, కరపత్రాలు, బ్యానర్లులతో ప్రచారం చేపట్టేవారు. ఇప్పుడు అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎక్కువగా మొబైళ్లలోనే ప్రచారం చేసుకుంటున్నారు. చిన్నా, పెద్దా, మహిళ అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రతీఒక్కరి వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. దాంతో పాటు, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ తదితర యాప్లు ఉండటంతో ఒక ఫొటో పెట్టుకుని ఫలానా అభ్యర్థిగా, ఈవార్డు, ఈ గ్రామానికి పోటీ చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా గ్రామానికి ఇలాంటి సేవ చేస్తానని, మాకే ఓటు వేయాలంటూ విరివిగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏదైనా ఫ్లెక్సీలు కట్టాలన్నా, మైకుల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నా వాటికి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వీటికి పెద్దగా అనుమతులు లేకపోవడంతో అభ్యర్థులే కాకుండా వారికి అనుకూలంగా ఉన్న వారు సైతం ప్రతీ గ్రూపుల్లో పోస్టులు చేస్తున్నారు. రోజువారి కార్యక్రమాలు పోస్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. అలా పోటీచేసే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలోనే అత్యధికంగా కనిపిస్తున్నారు. 8 నుంచి 10 గ్రూపులు ఒక ఊరులో దాదాపు 8 నుంచి10 వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటూ సుమారు వెయ్యి మంది ఓటర్లు ఉండేలా చూసుకుంటూ ఆయా గ్రూపుల్లో అభ్యర్థుల ఫొటోలు, ఇప్పటికీ ఇంకా గుర్తులు రాకపోవడంతో ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని సైతం ఆ గ్రూపుల్లో చేర్చి వారికి సైతం మెసేజ్లు పంపుతున్నారు. సోషల్ మీడియాపై నిఘా ఒకవైపు సర్పంచ్, వార్డు మెంబర్లుగా నిలబడిన అభ్యర్థులు విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ప్రత్యేక నిఘా పెట్టారు. ముఖ్యంగా ప్రచారానికి సంబంధించినవి పెడితే ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ రెచ్చగొట్టే మెసేజ్లు గానీ, ఇతరులను నిందిస్తూ ఉన్న మెసేజ్లు గానీ, అసభ్యకరంగా ఉన్నా గానీ వారు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియాపై ఫోకస్ చేస్తున్నారు. -
అప్పుడే సర్పంచ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇల్లు అలకగానే పండగ కాదు.. నామినేషన్ వేయగానే సర్పంచ్ అయిపోరు.. రాజకీయ రణరంగంలోకి దిగగానే సరిపోదు.. తెరవెనక ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అనేది సత్యం. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో పరిస్థితులు ఒకప్పటిలా లేవు. ఊరికి ఏదో చేయాలని పోటీ చేసేందుకు వస్తున్న వారంతా రూ.లక్షల కొద్దీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. మార్కెట్లో నగదు చలామణి తగ్గిపోయింది. సర్పంచ్ పదవి కోసం బరిలోకి దిగుతున్న వారికి ఇదో సవాల్గా మారింది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకు వారం రోజుల సమయం ఉంది. నిత్యం ప్రచారానికి రూ.వేలల్లో ఖర్చవుతుంది. ఫ్లెక్సీలు, టీవీలు, పేపర్లలో ప్రచారానికి రూ.లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇదికాక నిత్యం అనుచరులకు మందు, విందు సరేసరి. వీటన్నింటికీ నగదు కావాలి. అందుకోసం అభ్యర్థులు అప్పుల వేటలో పడ్డారు. ‘అప్పు’డే సర్పంచ్ కాగలరు అన్న ఆశయంతో ఖర్చు కోసం వెనకాడకపోవడం గమనార్హం. గెలవకపోతే అప్పుల ఊబిలో.. వాస్తవానికి అప్పులు చేసి పోటీచేస్తున్న అభ్యర్థులలో నూటికి 90 శాతం మంది సాహసం చేస్తున్నారు. రూ.లక్షల్లో ఖర్చు పెడుతూ.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. బరిలో ఉన్న వారు గెలుస్తారన్న గ్యారెంటీ లేకపోయినా నామినేషన్ వేశాక ఇవేమీ ఆలోచించే పరిస్థితిలో లేరు. గెలుస్తారన్న నమ్మకంతో ఖర్చు చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు ఏకగ్రీవం కోసం ఇప్పటికే రూ.లక్షలు పెట్టినవారు, పెట్టబోతున్న వారికి అప్పుల ముప్పు పొంచి ఉంది. గెలిచినా, గెలవకపోయినా.. ఖర్చు మాత్రం పెట్టక తప్పని పరిస్థితి. అందుకే, ఈ యువ నాయకులు తమ డాబు, దర్పం ప్రదర్శించుకోవడానికి భూములు, నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారు. గెలిచినా, గెలవకపోయినా రుణం తీర్చడం మాత్రం అనివార్యం. ఈ నేపథ్యంలో వీరంతా ఈ అప్పులను ఎలా తీరుస్తారో చూడాలి మరి!కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇంకా రెండో, మూడో విడతల్లో పలు గ్రామాలు ఏకగ్రీవానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఏకగ్రీవాలు అనుకున్నంత సులువుగా కొలిక్కి రావడం లేదు. దాని వెనక చాలా తతంగం నడుస్తోంది. చిన్నగ్రామాలు, వెయ్యి లోపు ఓట్లు ఉన్న గ్రామాల్లోనే పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారు. ఇక 3వేలు.. ఆపై ఓట్లు ఉన్న గ్రామాల్లో పరిస్థితి హోరాహోరీగా సాగుతోంది. ఏకగ్రీవమవుతున్న గ్రామాల్లో ముందు నామినేషన్లు వేసే వారిని, వేసిన వారిని నయానో, భయానో దారికి తెచ్చుకుంటున్నారు. దీనికి నామినేషన్ వేసిన అభ్యర్థులకు చాలా ఖర్చు చేస్తున్నారు. ఇక ఊరికి ఏం చేస్తారో? ఆ పనికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఎంతలేదన్నా.. ఓ మోస్తరు గ్రామ పంచాయతీల్లో రూ.30లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భరించాల్సిన పరిస్థితి. ఇంత నగదు కోసం అభ్యర్థులు అప్పులబాట పడుతున్నారు. తాము సంపాదించుకున్న ఆస్తులు, ఇంట్లో ఆడవాళ్ల నగలు తీసుకుని తాకట్టుపెట్టి మరీ నగదు తెస్తున్నారు. వీటిని తమను నమ్మేలా నామినేషన్ వేసిన వారికి, ఊర్లో పెద్ద మనుషులకు సమర్పిస్తేనే విత్డ్రాయల్స్ సజావుగా సాగుతున్నాయి.జిల్లా పంచాయతీలు అభ్యర్థులు కరీంనగర్ 89 388 జగిత్యాల 118 461 పెద్దపల్లి 95 376 రాజన్నసిరిసిల్ల 76 295 -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
జగిత్యాలరూరల్: జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు పర్యటిస్తూ గ్రామాల్లో నిఘా పటిష్టం చేశారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా చర్యలు పడుతున్నారు. జిల్లాలోని 3,536 పోలింగ్ కేంద్రాల్లో 1/3వంతు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద అదనపు భద్రత ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
జగిత్యాల
27.0/14.07వేంకటేశ్వరునికి క్షీరాభిషేకంధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. పూలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి లక్ష్మీహవనం నిర్వహించారు.గరిష్టం/కనిష్టంగోదావరిలో భక్తుల రద్దీ ధర్మపురి: ధర్మపురి పవిత్ర గోదావరిలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ, గౌరమ్మలకు నైవేద్యాలు సమర్పించారు.వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. చలి గాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
ఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి
మల్లాపూర్: గ్రామపంచాయతీ ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ (లోకల్బాడీ) రాజాగౌడ్ అన్నారు. శుక్రవారం మల్లాపూర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పోలింగ్ అధికారుల శిక్షణ తరగతులను పరిశీలించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటర్లు శాంతియుత, స్వేచ్ఛాపూరిత వాతవరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, ఎంపీవో జగదీశ్, మండల పరిషత్ సూపరింటెండెంట్ రాణి, పంచాయతీ ఈవో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ మనోహర్రెడ్డి, ఆర్వో, ఏఆర్వో, పీవోలు, మండల పరిషత్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు గొల్లపల్లి: ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గొల్లపల్లి, శ్రీరాములపల్లి, గుంజపడుగు, చిల్వకొడూరు కేంద్రాలను శుక్రవారం సందర్శించారు. భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. అదనపు ఎస్పీ వెంట గొల్లపల్లి ఎస్సై ఎం.కృష్ణసాగర్రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంజగిత్యాలటౌన్: క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని జగిత్యాల అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో నిర్వహించిన పీఎంశ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించారు. జగిత్యాల జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తెస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి ఆటల్లో ప్రావీణ్యం కనబర్చేలా చూడాలని సూచించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ పోటీల్లో సుమారు 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాము, జిల్లా సెక్టోరియల్ అధికారి కొక్కు రాజేశ్, ఎస్జీఎఫ్ సెక్రటరీ చక్రధర్, పెటా అధ్యక్షుడు పడాల విశ్వప్రసాద్, పీఈటీలు పిడుగు భాస్కర్రెడ్డి, కృష్ణప్రసాద్, అంజయ్యతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. భూసారాన్ని కాపాడితేనే పంటల్లో దిగుబడిజగిత్యాలఅగ్రికల్చర్: భూసారాన్ని కాపాడితే పంటల్లో దిగుబడులు సాధ్యమని వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్. సంధ్య అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన రాయికల్ మండలం అల్లీపూర్లో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ నేల దినోత్సవంలో మాట్లాడారు. భూమిని సారవంతం చేసేందుకు సేంద్రియ, జీవన ఎరువులు వేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా రసాయన ఎరువులు వాడాలని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మాట్లాడుతూ భూతల్లిని సంరక్షిస్తేనే పంటలు పండే అవకాశం ఉందన్నారు. మృత్తిక శాస్త్రవేత్తలు పి.రవి, సాయినాథ్, వేణురెడ్డి, వ్యవసాయాధికారి ముక్తేశ్వర్, ఏఈవో సతీశ్, కోరమండల్ ప్రతినిధులు వినోద్, సురేశ్ పాల్గొన్నారు. -
● ఇక ఉపసంహరణలే..
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఇక ఉపసంహరణలే మిగిలాయి. ఇప్పటికే మొదటి విడత ఉపసంహరణలు పూర్తయి, రెండో విడత నేటితో పూర్తి కానుంది. ఇక మూడో విడత ఈనెల 9న ఉంది. ఇప్పటికే ప్రతీ గ్రామంలో ఒక్కో సర్పంచ్ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక స్థానం నుంచి దాదాపు 5–6 మంది పోటీ చేస్తున్నారు. మూడో విడతకు సంబంధించి ఉపసంహరణలకు సమయం ఉండటంతో ఇక బుజ్జగింపులకు తెరలేపుతున్నారు. బేరసారాలు ఆడుతున్నారు. సంప్రదింపులు, రాయబారాలు మూడో విడతకు చెందిన అభ్యర్థులు రెబల్స్ను సంప్రదింపులు, రాయబారాలు జరుపుతున్నారు. ఎలాగైనా తప్పుకోవాలని ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ప్రతీ పార్టీలో ఒకటి నుంచి ఇద్దరు రెబల్స్ ఉండటంతో పార్టీ నేతలతో ఒత్తిడి తెస్తూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకగ్రీవానికి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో రెబల్స్నైనా తప్పిస్తే గెలుపుపై ఆశలు ఉంటాయని ఆశావహులు అంచనాలు వేస్తున్నారు. కొందరు గ్రామ పెద్దలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వినని వారు ఉపసంహరణ అయ్యేంత వరకు ఎవరికీ దొరక్కకుండా వెళ్తున్నారు. రసవత్తరంగా ఎన్నికలు గ్రామపంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. జిల్లాలో 385 గ్రామపంచాయతీలకు, 3,536 వార్డు సభ్యుల పదవుల కోసం భారీగా నామినేషన్లు రాగా, గ్రామాల్లో వాతావరణం వేడెక్కింది. ఈసారి వార్డు సభ్యులకు సైతం అత్యధికంగా పోటీ నెలకొందని చెప్పవచ్చు. రెబల్స్ను బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రిజర్వేషన్లు అనుకూలించక ఈసారి మాకే కావాలంటూ మొండికేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా పంచాయతీ ఎన్నికలను తీసుకున్నందున గ్రామాల్లో వ్యూహాలు, ప్రతివ్యూహాలు చేస్తున్నారు. గ్రామాల్లో బలమైన నాయకునికి మద్దతు ఇవ్వాలని, రెబల్స్ను తప్పించాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ చాలా గ్రామాల్లో నువ్వా? నేనా? అన్నట్లు పోటీ జరుగుతోంది. వ్యూహాలు పోటీ అనివార్యం అయిన చోట ఎలా గెలవాలన్న దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. మూడు విడతల్లో జరుగుతున్నా మొదటి, రెండు విడతలకు పెద్దగా సమయం లేనప్పటికీ మూడో విడతకు మాత్రం వారంకు పైగా సమయం ఉండటంతో ఎలాగైనా గెలవాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో మూడో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చులకు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కొందరు పలు చోట్ల విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తూ ఓట్లు ఆకట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. -
మద్యం షాపునకు అనుమతి ఇవ్వొద్దని ధర్నా
కోరుట్లరూరల్: మండలంలోని అయిలాపూర్లో గతంలో ఎస్సీ కాలనీలో ఉన్న మద్యం షాపును కోరుట్ల–అయిలాపూర్ రోడ్డుకు మార్చడాన్ని నిరసిస్తూ వార్డు మహిళలు గురువారం ధర్నాకు దిగారు. ఊరు చివరన ఉన్న మద్యం షాపును కోరుట్ల–అయిలాపూర్ రోడ్డుకు మార్చేందుకు షెడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. షాపును మార్చడానికి ఎందుకు అనుమతి ఇచ్చారంటూ పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. విషయాన్ని ఎకై ్సజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కార్యదర్శి తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మహిళల్ని సముదాయించారు. -
ఆ ఎన్నిక రద్దు చేయండి..
జగిత్యాలటౌన్: ఏకగ్రీవం చేసిన సర్పంచ్ స్థానాన్ని రద్దు చేయాలని కోరుతూ యామాపూర్ గ్రామస్తులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. యామాపూర్ సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా.. ఏకగ్రీవం చేయాలని భావించిన గ్రామ పెద్దలు ఒకరిని బరి నుంచి తప్పించారని ఆరోపించారు. నిరసనలో నామినేషన్ ఉపసంహరించుకున్న ఎల్లాల గోపాల్రెడ్డి కూడా పాల్గొన్నారు. వీడీసీ సభ్యులు తనను బెదిరించి రూ.4లక్షలు ఇచ్చిన వ్యక్తిని ఏకగ్రీవం చేశారని, దానిని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు. పోలీసులు చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపచేశారు. -
కంట్రోల్రూం వినియోగించుకోవాలి
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సహాయ కేంద్రం కంట్రోల్ రూంను వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏవైనా సమస్యలుంటే 96662 34383 నంబర్లో సంప్రదించాలని కోరారు. మూడో ర్యాండమైజేషన్ పూర్తి మూడో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో జనరల్ అబ్జర్వర్ రమేశ్తో కలిసి ర్యాండమైజేషన్ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, నోడల్ అధికారి మధుసూదన్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
పరిశీలించి.. ఆరా తీసి
● అంతర్గాం ఎయిర్పోర్టు ఏర్పాటుపై ఏఏఐ బృందం పరిశీలన ● వివిధశాఖల ఉన్నతాధికారులతో సూక్ష్మ సమాచార సేకరణ ● సాంకేతికపరమైన అంశాలపై అధికారుల క్షేత్రస్థాయి పర్యటన ● రోడ్డు, రైల్వే కనెక్టివిటీపై ఆరా ● ప్రాజెక్టు, పంపుహౌజ్, రైల్వేస్టేషన్, గోదావరితీరం సందర్శనఉత్తర తెలంగాణకు ఎయిర్ కనెక్టివిటీ చేసే అంతార్గం ఎయిర్పోర్టు ఏర్పాటుకు గురువారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారుల బృందం క్షేత్ర పరిశీలన చేపట్టింది. ఎయిర్పోర్టుకు ఉన్న అనుకూలతలు, అడ్డంకులను పరిశీలిస్తూ.. వివిధ అంశాలపై అధికారులను ఆరాతీస్తూ ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో ఎవియేషన్ బృందం పర్యటన కొనసాగింది. పాలకుర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణం ఏర్పాటుకు పలుసాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్గాం మండలంలో ఎయిర్పోర్టు నిర్మించాలని తలంచింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రీఫిజిబిలిటీ సర్వే కోసం రూ.50 లక్షలు నిధులు విడుదల చేసింది. దీంతో విమానాశ్రయ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై సర్వే నిర్వహించేందుకు ఏఏఐ అధికారుల బృందం రాగా.. వారికి వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారుల బృందం సాంకేతికపరమైన అంశాలను నివేదించేలా ప్రతిపాదనలు అందించారు. ఎయిర్పోర్టు ప్రతిపాదిత ప్రభుత్వ స్థలం, గోలివాడ గోదావరినది తీరం, పెద్దంపేట రైల్వేస్టేషన్, గోలివాడ పంపుహౌజ్, ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో ఏఏఐ బృందం క్షేత్ర పరిశీలన చేసింది. – సాక్షిప్రతినిధి,కరీంనగర్, – వివరాలు 8లో.. -
వైభవంగా దత్తజయంతి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని శ్రీమార్కండేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోగ గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, భోగ రాజు, భక్తులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలిసారంగాపూర్: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. బీర్పూర్ మండలం తుంగూరు, కొల్వాయి, తాళ్లధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. తహసీల్దార్ బి.సుజాత, సివిల్ సప్లయ్ అధికారులు ఉన్నారు. అరటితో అధిక ఆదాయంజగిత్యాలఅగ్రికల్చర్: వరితో పోలిస్తే అరటితో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంలో రైతులు సాగుచేసిన అరటి తోటలను గురువారం ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. అరటి మొక్కలు నాటేందుకు శీతాకాలం అనువైన సమయమన్నారు. నాటిన 9 నెలల తర్వాత దిగుబడి ప్రారంభమై.. రెండేళ్ల వరకు కొనసాగుతుందన్నారు. టిష్యూ కల్చర్ మొక్కలతో అరటిలో అధిక దిగుబడి వస్తుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారి కె.స్వాతి, హెచ్ఈవో అన్వేష్, రైతులు పాల్గొన్నారు. మొబైల్ ఎక్స్రేతో క్షయ నివారణ సులభం● డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ జగిత్యాల: మొబైల్ ఎక్స్రేతో క్షయనివారణ మరింత సులభతరం అవుతుందని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. జిల్లాకు చేరిన మొబైల్ ఎక్స్రేను గురువారం ప్రారంభించారు. గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో ఈ మిషన్ల ద్వారా ఎక్స్రే తీసి టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించవచ్చన్నారు. వైద్యులు శ్రీనివాస్, ఇమ్యూనైజేషన్ అధికారి శ్రీనివాస్, రవీందర్ పాల్గొన్నారు. లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం● డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి జగిత్యాల: లింగనిర్ధారణ చట్టరీత్యా నేరమని, ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రులను గురువారం తనిఖీ చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో నిబంధనల ప్రకారం వసతులు, వెంటిలేషన్ సౌకర్యం, వెయిటింగ్హాల్ ఉండాలన్నారు. స్కానింగ్ మిషన్స్, డాక్టర్ అర్హత, ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి అని తెలిపారు. ఆయన వెంట కట్కం భూమేశ్వర్, పడాల శంకర్ ఉన్నారు. -
జగిత్యాల
31.0/15.0శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 20257గరిష్టం/కనిష్టంనృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి:శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. -
ప్రజాభద్రతలో హోంగార్డుల సేవలు అమూల్యం
జగిత్యాలక్రైం: ప్రజాభద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ విభాగాల్లో హోంగార్డుల సేవలు అభినందనీయమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు హోంగార్డ్ రైజింగ్ డే వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డులు చూపే అంకితభావం ప్రశంసనీయం అన్నారు. హోంగార్డు సిబ్బంది డ్యూటీని బాధ్యతగా నిర్వహించే క్రమశిక్షణ, సేవాస్ఫూర్తి పోలీస్శాఖకు గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, రిజర్వ్ సీఐలు కిరణ్కుమార్, సైదులు, వేణు, రిజర్వ్ ఎస్సైలు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ -
ఏకగ్రీవం.. వివాదం
● ఆర్డీవో కార్యాలయం ఎదుట యామాపూర్ గ్రామస్తుల ఆందోళన ● వీడీసీ బలవంతంగా అభ్యర్థిని తప్పించిందని ఆగ్రహం ● ఎన్నిక జరపాలంటూ అధికారులకు విజ్ఞప్తి మెట్పల్లి: పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల గ్రామాభివృద్ధి కమిటీలు (వీడీసీ) సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న తీరు వివాదాస్పదమవుతోంది. గ్రామస్తుల అభిప్రాయాలను పట్టించుకోకుండా.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో సర్పంచ్ పదవికి బహిరంగ వేలం వేసిన వీడీసీపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో ఓ అభ్యర్థితో బలవంతంగా నామినేషన్ను విత్ డ్రా చేయించి.. ఎన్నిక లేకుండా చేసిన వీడీసీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గురువారం మెట్పల్లిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కలెక్టర్కు నివేదిక అందించాం యామాపూర్లో గోపాల్రెడ్డి నామినేషన్ విత్ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్కు అందించాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, ఆర్డీవో -
సర్పంచ్ బరిలో భార్యాభర్తలు, కుమారుడు
సర్పంచ్ బరిలో రిటైర్డ్ ఐపీఎస్ భార్య సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే ఉద్దేశంతో మాజీ ఐపీఎస్(ఎస్పీ) భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ వేసింది. సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన ఉప్పు తిరుపతి(రిటైర్డ్ ఐపీఎస్) భార్య లక్ష్మి గురువారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఉద్యోగ రిత్యా ఎక్కడ ఉన్నా సొంత గ్రామంలో అభివృద్ధి, సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో బరిలో నిలిచింది. ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే సర్పంచ్ పదవికి పోటి చేస్తున్నట్లు లక్ష్మి, తిరుపతి పేర్కొన్నారు. రాత్రివరకూ నామినేషన్లుబుగ్గారం: మూడో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా రెండోరోజు నామినేషన్ల ప్రక్రియ మండలంలోని వెల్గొండ గ్రామంలో అర్ధరాత్రి వరకూ కొనసాగింది. మండలంలో మొత్తం నాలుగు నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వెల్గొండలో రాత్రి పదిన్నర వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలంలోని 10 గ్రామాలకు సర్పంచ్ అభ్యర్థులుగా రెండో రోజు 23 మంది, 96 వార్డులకు 113 మంది నామినేషన్ వేశారు. గురువారం శుభదినం కావడం.. పైగా పౌర్ణమి కావడంతో నామినేషన్లు వేయడానికి అధిక మంది అభ్యర్థులు ఆసక్తి చూపారు. ఆశావహులు జ్యోతిష్య పండితులను సంప్రదించి తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి మూడు గంటల వరకు రాహుకాలం కావడంతో ఎక్కువ మంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కేంద్రానికి వచ్చారు. రాత్రి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఎంపీడీవో సుమంత్, ఎంపీవో అఫ్జల్మియా నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సర్పంచ్ బరిలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నామినేషన్లు తిరస్కరణకు గురైన పక్షంలో ఎవరోఒకరు బరిలో ఉండేందుకు ముందుచూపుగా వ్యవహరించిన ఆ కుటుంబానికి వింత పరిస్థితి ఎదురైంది. గ్రామానికి చెందిన పుల్ల సాయగౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. ముందు జాగ్రత్తగా తన భార్య పుష్పలత, కుమారుడు వెంకటేశ్తో కూడా నామినేషన్ వేయించాడు. అయితే సర్పంచ్ స్థానానికి వీడీసీ వేలం వేయడం.. అది వివాదానికి దారితీయడం.. వేలం వేసిన వీడీసీ సభ్యులు పలువురిని బైండోవర్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు గ్రామంలో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహిస్తామని, నామినేషన్లు ఎవరూ విత్డ్రా చేసుకోవద్దని సూచించారు. వీడీసీ ఆంక్షలకు భయపడొద్దని చెబుతూనే.. నామినేషన్ వేసిన ప్రతిఒక్కరూ బరిలో ఉండాల్సిదేనని తేల్చిచెప్పారు. ఫలితంగా ముందు జాగ్రత్తతో మూడు నామినేషన్లు వేసిన సాయగౌడ్ కుటుంబం కూడా బరిలో నిలవాల్సి వచ్చింది. ప్రచారంలో భాగంగా ముగ్గురు కలిసే ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భర్తను గెలిపించాలని భార్య.. తండ్రిని గెలిపించాలని కుమారుడు ఓట్లు అభ్యర్థిస్తున్న తీరును చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. సర్పంచ్ బరిలో 75 ఏళ్ల వృద్ధురాలుమంథనిరూరల్: అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ 75 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ బరిలో నిలబడి సమరానికి సై అంటోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట వెంకటమ్మ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉప్పట్ల పంచాయతీకి జనరల్ మహిళ రిజర్వేషన్ రాగా ఆ సామాజికవర్గం నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడం వెంకటమ్మతో పాటు మరో ఇద్దరు పోటీలో ఉన్నారు. అయితే బరిలో నిలిచిన ముగ్గురిలో వెంకటమ్మ వృద్ధురాలు కావడం, గ్రామాభివృద్ధిలో ముందుంటానంటూ భరోసా కల్పిస్తూ తనకు సర్పంచ్గా అవకాశం కల్పించాలని ప్రచారం చేయడం హాట్ టాపిక్గా మారింది. -
పరిశీలించి.. ఆరా తీసి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా అంతర్గాం గోలివాడ శివారులోకి వచ్చే ప్రభుత్వ భూముల వద్దకు ఏఏఐ బృందం అధికారులు చేరుకునే సరికి ఇరిగేషన్, రెవెన్యూ, గ్రౌండ్వాటర్, హైడ్రాలజిస్ట్, సింగరేణి, ఎన్టీపీసీ, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, ఆర్అండ్బీ, మైనింగ్ తదితరశాఖలకు చెందిన జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు. పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య భూమికి సంబంధించి నక్ష (చిత్రపటం) ఆధారంగా వివిధ సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమి లభ్యత, సత్వరమే అందుబాటులోకి తీసుకునే అవకాశాలు, భూ విస్తీర్ణం, సదరు భూములలో సాగయ్యే పంటలు, భూముల యధార్థ స్థితిగతులతో పాటు ప్రభుత్వేతర భూలభ్యత, విస్తీర్ణం తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వ భూముల్లో హైటెన్షన్ టవర్లు ప్రతిపాదిత స్థలంలో 400 కేవీ హైటెన్షన్ టవర్లు, విద్యుత్ తీగలను పరిశీలించిన ఏఏఐ అఽధికారులు తొలగించాల్సి ఉంటుందని, లేదంటే భూగర్భం నుంచి విద్యుత్లైన్ వేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రతిపాదిత స్థలం నుంచి నాలుగు కిలోమీటర్ల రేడియస్లో 45 మీటర్లలోపు, ఆరు కిలోమీటర్ల రేడియస్ తర్వాత 90 మీటర్ల ఎత్తులో నిర్మాణాలున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేయగా, ప్రతిపాదిత స్థలంలో సుమారు 60కి పైగా టవర్లు ఉండే అవకాశం ఉంటుందని ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాస్ తెలిపారు. తొలుత టవర్లను ఎత్తివేసేందుకు అంచనా వ్యయం సుమారు రెండువేల కోట్లుగా భావించినా, ప్రస్తుతం ఏఏఐ వారి చ్చిన నివేదికలలో పేర్కొన్న మేరకు మరోసారి అంచనా వ్యయ నివేదిక సిద్ధం చేయాల్సి ఉండనుంది. స్థల లభ్యతపై ఎయిర్పోర్టు నిర్మాణానికి సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరం ఉన్నట్లు ఏఏఐ అధికారులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం 600 ఎకరాల ప్రభుత్వ భూ లభ్యత ఉండగా, మరో 400 ఎకరాలు ప్రభుత్వేతర భూములు అందుబాటులో ఉన్న నివేదికను అందజేసినట్లు సమాచారం. ల్యాండింగ్ అయ్యే స్థలం నుంచి 1.5 కిలో మీటర్ రేడియస్లో ఎలాంటి నిర్మాణాలు ఉండరాదని, సదరు స్థలాన్ని నిషేధిత స్థలంగా పరిగణించడం జరుగుతుందని ఏఏఐ ప్రతినిధులు తెలిపారు. గోదావరినది తీరం సందర్శన ఏఏఐ బృందం గోలివాడ గోదావరినది తీరాన్ని సందర్శించడంతో పాటు నీటి లభ్యత అంశాలను నీటిపారుదలశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరిలో నీటి లభ్యత 130 మీటర్లు, వరదల సమయంలో గరిష్టంగా 280 మీటర్ల ఎత్తులోకి వరద చేరుతుందని, భూగర్భ జలాలు పది మీటర్లస్థాయిలో ఉంటాయని వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఏటా గరిష్టంగా ఇన్ఫ్లో, కనిష్ట ఇన్ఫ్లో, నీటి లభ్యత, సాగు, తాగునీటి కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టు గేట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ వివరాలు, పునరావాసం తదితర అంశాలను తెలుసుకున్నారు. అండర్గ్రౌండ్ వంతెన పరిశీలన, రోడ్డు భూగర్భంలో ఏమైనా రైల్వే కమ్యూనికేషన్కు కేబుల్స్, రైల్వే ట్రాక్షన్ మీద విద్యుత్ తీగల ఎత్తు, ప్రతిపాదిత విమానాశ్రయం స్థల దూరం, సమీపంలో ఉన్న విద్యుత్ టవర్స్ ఎత్తు, ప్రతీ రోజు రైళ్ల రాకపోకల సంఖ్య తదితర అంశాలను నేరుగా పెద్దంపేట రైల్వేస్టేషన్కు వచ్చి తెలుసుకున్నారు. మొత్తంగా ఏఏఐ అధికారుల బృందం పర్యటనతో ఇప్పటికై నా విమానం ఎగిరేనా.. ఎప్పటిలాగే పర్యటనలు, నివేదికలకే పరిమితమవుతుందా అనే చర్చ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజల్లో నెలకొంది. -
యువకుడి ఆత్మహత్య
పెగడపల్లి: కుటుంబసభ్యులు మందలించడంతో బీటెక్ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాములపల్లిలో చోటుచేసుకుంది. స్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీలం రమేశ్, జమున దంపతులకు కూతురు వర్షిత, కుమారుడు అరవింద్ ఉన్నారు. అరవింద్ హైదరాబాద్లో బీటెక్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. మంచి ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు అరవింద్ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్ బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో మహిళ.. చందుర్తి(వేములవాడ): ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్నసిరిసిల్ల చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. ఎస్సై రమేశ్ తెలిపిన వివరాలు. బండపల్లికి చెందిన నేదూరి అంజవ్వ(55)కు భర్త పోశయ్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొనుగోలు చేసి హార్వెస్టర్ను కొనుగోలు చేయగా ఆర్థికంగా నష్టపోయారు. హర్వెస్టర్ విక్రయించిన అప్పులు తీరలేదు. దీనికితోడు వ్యవసాయంలో వచ్చిన నష్టంతో పూర్తిగా దివాళ తీశారు. దీంతో అప్పులిచ్చిన వారు అప్పులు చెల్లించాలని కోరితే ముగ్గురు కుమారులు పట్టించుకోకుండా పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై అంజవ్వ ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకుంది. మృతురాలు అంజవ్వ తల్లి రాజవ్వ వృద్ధాప్యంలో అనా రోగ్యంతో బాధపడుతోంది. ఏకై క కుమార్తె అంజవ్వ ఆత్మహత్య చేసుకోవడంతో నాకు దిక్కెవరూ అంటూ తల్లి రాజవ్వ రోదిస్తుండడంతో అక్కడున్న వారందరూ కన్నీరుపెట్టారు. కాగా అంజవ్వ భర్త పోశయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రైలు కిందపడి యువకుడు.. జమ్మికుంట: అనారోగ్య కారణాలతో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామంగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన జక్కె రజనీకాంత్(31) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బిజిగిరి షరీఫ్, పొత్కపల్లి రైల్వేస్టేషన్ మధ్య తనుగుల సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తల్లి జక్కె రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. జీవితంపై విరక్తి చెంది డ్రైవర్.. ముస్తాబాద్(సిరిసిల్ల): జీవితంపై విరక్తి చెంది ఓ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సద్ది రాజిరెడ్డి(40) తల్లితో కలిసి డబుల్బెడ్రూమ్ ఇంటిలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం రాజిరెడ్డి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తన గదిలో నిద్రించాడు. వరండాలో తల్లి సత్తవ్వ పడుకుంది. మరుసటి రోజు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు రాజిరెడ్డి ఇంటికెళ్లారు. సత్తవ్వతో మాట్లాడగా, రాజిరెడ్డి కోసం ఆరా తీశారు. ఇంకా లేవలేదని తల్లి తెలపగా.. సదరు నాయకులు తలుపులు తట్టిన స్పందన రాలేదు. దీంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కువైట్లో వలసజీవి మృతిముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన వలసజీవి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండీ వేదుల్(36) కువైట్లో పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫుడ్పాయిజన్కు గురైన వేదుల్ను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస వదిలాడు. మృతునికి భార్య షబానా, కుమారుడు, కూతురు ఉన్నారు. వేదుల్ మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించి, గల్ఫ్ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేడు ప్రశాంతం
నాడు సమస్యాత్మకం.. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మూడు దశాబ్దాల క్రితం సిరిసిల్ల మానేరు ప్రాంతంలో ఎన్నికలు అంటేనే గ్రామీణుల్లో భయాందోళన ఉండేది. ఒక వైపు పోలీసుల ప్రచారం.. మరో వైపు నక్సలైట్ల అల్టిమేటంతో పల్లెల్లో భయానక వాతావరణం ఉండేది. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. పోలీసుల అవగాహన కార్యక్రమాలతో ఓటుహక్కును వినియోగించుకునేందుకు పల్లెజనం ముందుకొస్తున్నారు. బహిష్కరణ పిలుపుతో భయాందోళన మూడు దశాబ్దాల క్రితం ఎన్నికలు వచ్చిందంటే సిరిసిల్ల ప్రాంతంలో ఒక రకమైన భయానక పరిస్థితులు ఉండేవి. ఒక వైపు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని నక్సలైట్లు దర్బార్లు పెట్టి పిలుపునిచ్చేవారు. గోడలపై రాతలతో హెచ్చరించేవారు. దీన్ని సవాల్గా తీసుకున్న పోలీసులు పోలింగ్శాతాన్ని పెంచేందుకు జనాన్ని పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకునేవారు. అయినా చాలా మంది గ్రామీణులు ఓటు వేసేందుకు వెనుకంజ వేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండేది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో నక్సలైట్లు మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువగా నిలుచుండేవారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణులు సైతం ఓటుహక్కు వినియోగించుకునేవారు. అసెంబ్లీ ఎలక్షన్స్కు వస్తే ఓటు వేసేందుకు జంకేవారు. ఆ కాలంలో పంచాయతీ ఎన్నికల్లో 65 నుంచి 68 శాతం పోలింగ్ నమోదయ్యేది. అదే ఇప్పుడు 73 నుంచి 78 శాతం వరకు నమోదవుతుంది. బ్యాలెట్లు మాయం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1995 ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్లు బ్యాలెట్బాక్స్లను అపహరించుకు వెళ్లారు. అయితే తర్వాత పోలీసుల విచారణలో గ్రామంలోని ఓ మిలిటెంట్ వద్ద ఉంచినట్లు తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు. అదే క్రమంలో అప్పటి ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర గ్రామంలో పోలింగ్అధికారులను బెదిరించడమే కాకుండా బ్యాలెట్బాక్స్ల్లో సిరాను పోసి ఎన్నికలను డిస్టర్బ్ చేశారు. అదే ప్రాంతంలోని కంచర్ల గ్రామంలో కొందరు రిగ్గింగ్ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు కల్లోలిత ప్రాంతంగా ముద్రపడ్డ సిరిసిల్ల ఏరియాలో ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పోలీసులు తీసుకున్న అవగాహన చర్యలు, నక్సలైట్ల ప్రాబల్యం తగ్గిపోవడం.. గ్రామీణుల్లో ఆర్థిక అక్షరాస్యత.. ఉన్నత విద్యావంతులు పెరిగిపోవడంతో రాజ్యాంగహక్కులపై అవగాహన పొందారు. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలనే ఆలోచనలో పల్లె ప్రజలు ఉన్నారు. దీంతో ఒకప్పుడు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా పేరొందిన దుమాల, అడవిపదిర, కంచర్ల, వీర్నపల్లి, మద్దిమల్ల, తిమ్మాపూర్, గుంటపల్లిచెరువుతండా, బుగ్గరాజేశ్వరతండా, వట్టిమల్లతండా, బండమీదితండా, కేలోత్తండా, కోనరావుపేట మండలం నిమ్మపల్లి, వట్టిమల్ల, బావుసాయిపేట, ఎగ్లాస్పూర్, చందుర్తి, రుద్రంగి మండలాల్లోని చాలా గ్రామాల్లో నక్సలైట్ల ప్రాబల్యం ఉండేది. కానీ నేడు ఆ గ్రామాలే ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ నమోదు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మూడు దశాబ్దాల క్రితం నక్సల్స్ మాటే వేదం నేడు ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి మారిన గ్రామీణ పరిస్థితులు ఎన్నికల్లో పోటాపోటీగా బరిలోకి.. -
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పొలంలో దున్నుతుండగా కేజ్వీల్ ఊడిపోయి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో విషాదం నింపింది. ఎస్సై రాహుల్రెడ్డి, గ్రామస్తులు తెలిపిన వివరాలు. వెంకటాపూర్కు చెందిన గడ్డం జితేందర్(30) గురువారం పోతిరెడ్డిపల్లికి వెళ్లే దారిలో పొలం దున్నుతుండగా కేజ్వీల్ ఊడిపోయింది. ఏం జరిగిందోనని తెలుసుకునేందుకు వెనక్కి తిరిగి చూడగా ట్రాక్టర్ అదుపుతప్పి పల్టీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి బాల్రాజ్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన జితేందర్ మరణంతో వారి కుటుంబం రోడ్డున పడింది. మృతునికి భార్య దివ్య, కుమారుడు విశాల్, తల్లి లక్ష్మి ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి వెల్గటూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం కొత్తపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన గౌరెల్లి లక్ష్మణరావు(37) గత నెల 29న వెల్గ టూర్ నుంచి బైక్పై కొత్తపేట వస్తుండగా రోడ్డుపై గుంతలను తప్పించే క్రమంలో ముత్తునూర్కు చెందిన కల్యాణ్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు. కల్యాణ్ను జగిత్యాల, లక్ష్మణరావును కరీంనగర్ తరలించారు. చికిత్సపొందుతూ లక్ష్మణరావు గురువారం మృతి చెందాడు. లక్ష్మణరావుకు 8 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య సహజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. భార్య వెంటే భర్త.. మానకొండూర్ (శంకరపట్నం): భార్య మృతి చెందిన 24 గంటలకే భర్త ప్రాణాలొదిలిన ఘటన శంకరపట్నం మండలం ముత్తారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కనకం రాజమల్లు, రాజవ్వ దంపతులు అన్యోనంగా ఉండేవారు. కొంతకాలంగా వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రాజవ్వ బుధవారం మృతి చెందగా, భర్త రాజమల్లు గురువారం మృతి చెందాడు. భూ విస్తీర్ణం అధిక నమోదుపై జీపీవోపై కేసుమల్యాల: భూవిస్తీర్ణం పహణీలో అధికంగా నమోదు చేసిన జీపీవోతోపాటు, భూయజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. మండలంలోని తాటిపల్లికి చెందిన జలజ కొన్నేళ్ల క్రితం పహణీల సర్టిఫైడ్ కోసం తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకుంది. బల్వంతాపూర్ జీపీవో ప్రవీణ్ను కలిసి భూవిస్తీర్ణం అధికంగా నమోదు చేయాలని సంప్రదించింది. దీనికి ప్రవీణ్ తాటిపల్లికి చెందిన కొన్ని సర్వే నంబర్లలోని 2.20 ఎకరాలను జలజ పేరిట రాయించాడు. ప్రభుత్వ రికార్డులు, పహణీలను ట్యాంపరింగ్ చేశాడంటూ తహసీల్దార్ వసంత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రవీణ్, జలజపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
స్వరశంఖాలు
సంగ్రామంలో● అభ్యర్థులకు వ్యాఖ్యాతలుగా సిరిసిల్ల గొంతులు ● ఆ గొంతులు వింటేనే ఓటర్లు ఫిదా ● ఎన్నికల నేపథ్యంలో వేలాది మందికి ప్రచారబాణీలుసిరిసిల్లటౌన్: ఊరుపోరులో సిరిసిల్ల స్వరాలు మార్మోగుతున్నాయి. ఏ ఎన్నిక అయినా వారి గొంతులే వినిపిస్తాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేలా వినిపించే మృదుమధుర గొంతులు సిరిసిల్ల వాసులవే. పట్టణానికి చెందిన ఎండీ సలీం, సాంబారి రాజు గొంతులు అభ్యర్థుల తరఫున ఓట్లను అడుగుతున్నాయి. అభ్యర్థి ఎవరైనా గొంతు వీరిదే. వీరి స్వర విన్యాసాలపై ప్రత్యేక కథనం.సిరిసిల్లకు చెందిన ఎండీ సలీం ఎన్నికల ప్రచార స్వరకర్తగా పేరుంది. సలీం స్వర ప్రస్థానం 1974లో ప్రారంభమైంది. పదోతరగతి చదివే రోజుల్లో అప్పుడే ప్రారంభమైన పట్టణంలోని శ్రీలక్ష్మి థియేటర్లో ఆడే సినిమాలకు సంబంధించిన ప్రచారంతో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు. ‘రోజూ నాలుగు ఆటలు నేడే చూడండి..’ అంటూ మొదలైన స్వరప్రస్థానం ఎన్నికలు వచ్చాయంటే మరింత మారుమోగుతుంది. ఇందిరాగాంధీ నుంచి కేసీఆర్, ఎమ్మెస్సార్, కేటీఆర్, భాగారెడ్డి, నర్సింగరావు, గొట్టె భూపతితోపాటు ఇప్పటి వార్డు, కౌన్సిలర్ల వరకు ఎన్నికలు ఎక్కడ జరిగినా సలీం స్వరం ప్రచారాస్త్రమైంది. తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాలకు సలీం గళం పరిచయమైంది. 1988లో ఆకాశవాణిలో 25 నిమిషాల ప్రత్యక్ష వ్యాఖ్యానం, 1989లో ఘంటసాల ఆలపించిన పాటలకు తన గొంతుతో వ్యాఖ్యానం చేశారు. అనంతర కాలంలో చాలా ఏళ్లు న్యూస్ చానల్లో న్యూస్రీడర్గా రెండో ప్రస్థానం ప్రారంభించారు. సలీం ప్రతిభకు ఎన్నో పురస్కారాలు వచ్చాయి.సిరిసిల్లకు చెందిన మరో వ్యాఖ్యాత సాంబారి రాజు. గురువు సలీం వ్యాఖ్యానికి తీసిపోకుండానే ప్రకటనలకు స్వరం అందిస్తున్నారు. 1982, జూన్ 16న సిరిసిల్లకు చేనేత కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటేశం, బాలలక్ష్మి. ఆరో తరగతి వరకు చదువుకున్న రాజు, తన బాబాయ్ సాంబారి ప్రదీప్ నడిపే ఆర్కెస్ట్రాలో ప్రవేశించాడు. పదిహేనేళ్ల క్రితం డబ్బింగ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టిన ప్రస్థానం నేడు ఎన్నికల ప్రచారం, ప్రకటనలకు స్వరం అందించే స్థాయికి ఎదిగారు. ఇరవై ఏళ్లుగా 20వేలకు పైగా వ్యాపార, ఎన్నికల ప్రకటనలకు తన స్వరాన్ని అందించారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ ప్రస్తుతం ఆన్లైన్ సేవలనూ అందిస్తున్నారు. సమాచారం పంపితే చాలు వాయిస్ ఓవర్ సిద్ధం చేసి, మెయిల్ చేసేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్, సుంకె రవిశంకర్, గంపగోవర్ధన్, షబ్బీర్ అలీ ఎన్నికల్లో నిల్చోగా వారి ప్రచారంలో తన గొంతు అందించారు. సలీం గొంతుకు సలాంస్వర‘రాజ’సంప్రాంతీయ యాసల్లో వ్యాఖ్యానం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ యాసల్లో వారు కోరిన విధంగా వ్యాఖ్యానం చేస్తున్నాను. గురువు గారు సలీం స్ఫూర్తితో 20 ఏళ్లుగా వ్యాఖ్యానంలో కొనసాగుతున్నాను. నాతో పాటుగా ఫిమేల్ వాయిస్కు స్థానిక మహిళ స్వాతి గొంతు అందిస్తున్నారు. ఇతర భాషల్లోనూ ప్రకటనలు చేస్తున్నాం. పంచాయతీ ఎన్నికల ప్రకటనలు విరివిగా చేస్తున్నాం – సాంబారి రాజు, సిరిసిల్ల -
జగిత్యాల
29.0/15.07గరిష్టం/కనిష్టంఐయిలేని మల్లన్నకు బోనాలుజగిత్యాలరూరల్: వంజరిపల్లిలో అయిలేని మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొని పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ చేగుంట రజిత, నాయకులు తిరుపతి, రవి, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతం అవుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో చలి గాలులు కొనసాగుతాయి. గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం మెట్పల్లి మండలం జగ్గాసాగర్ సర్పంచ్ ఎన్నిక విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) వ్యూహం బెడిసికొట్టింది. -
దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి
మెట్పల్లి: దివ్యాంగుల రక్షణకు ప్రత్యేక చట్టా లున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు సూ చించారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం న్యా య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, న్యాయపరంగా వారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటాంమల్యాల: కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామని డీఆర్డీఓ ఏపీడీ సునీత అన్నారు. కొండగట్టు అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు జిల్లా సమైఖ్య సభ్యులు ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున రూ.1.50లక్షల ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు సరోజన, ప్రాజెక్టు మేనేజర్ రమేశ్, నారాయణ, ఏపీఓ గంగాధర్, దేవయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యం చేరేందుకు శ్రమించాలిమల్లాపూర్: విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చేందుకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్యాధికారి నారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం తనిఖీ చేశా రు. కళాశాలలో వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్లోనే విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా శ్రమించాలన్నారు. కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్లో ప్రా వీణ్యం పొందాలన్నారు. కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ బండిసత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు. సీఎం దిష్టిబొమ్మల దహనంజగిత్యాలటౌన్/రాయికల్/ధర్మపురి: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొంటూ సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లాకేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. రాయికల్లో గాంధీచౌక్ వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, ప్రధాన కార్యదర్శి భూమేశ్, నాయకులు సామల్ల సతీశ్, గాజంగి అశోక్, వట్టిమల్ల శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గాజు భాస్కర్, బెజ్జారపు లవన్కుమార్, బండారి లక్ష్మణ్, స్తంభంకాడి శ్యామ్, ఆకుల శ్రీనివాస్ ఉన్నారు. యావర్రోడ్డు ఆక్రమణలపై కలెక్టర్ దృష్టిజగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని యావర్రోడ్డులో ఆక్రమణపై చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్కు లేఖ రాశారు. 1989 నాటి మాస్టర్ ప్లాన్ ప్రకారం యావర్రోడ్డును 80ఫీట్లకు ఆమోదం తెలిపినప్పటికీ సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి గతనెల 24న కలెక్టర్కు లేఖ రాసిన విషయం తెల్సిందే. దీంతో రాజాగౌడ్ అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్కు లేఖ రాశారు. -
నామినేషన్ సెంటర్ల తనిఖీ
గొల్లపల్లి/పెగడపల్లి: నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా గొల్లపల్లి మండలకేంద్రంతోపాటు, చిల్వాకోడూర్, తిరుమలాపూర్, పెగడపల్లి మండలం నంచర్లలోని నామినేషన్ కేంద్రాలను బుధవారం సందర్శించారు. ఈనెల 5 వరకు నామినేషన్లు స్వీకరించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హారిణి, తహసీల్దార్లు మాజీద్, ఆనందర్కుమార్, ఎంపీడీవోలు రవీందర్, ప్రేమ్సాగర్ ఉన్నారు. రెండో విడత ప్రశాంతం జగిత్యాల: జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఏడు మండలాల్లో 144 గ్రామపంచాయతీలకు 941 నామినేషన్లు, 1276 వార్డు స్థానాలకు 2,927 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుజగిత్యాలక్రైం: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సోషల్మీడియాపై నిఘా పెంచామన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. మూడు విడుతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అధికారులు సిబ్బందికి మార్గదర్శనం చేస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్యం, నగదు, ఉచితాల పంపిణీపై నిఘా పెంచాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సర్ర్పైజ్ వెహికల్ చెకింగ్ చేపట్టాలన్నారు. నేరాలకు పాల్పడేవారు, రౌడీషీటర్స్పై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచాలన్నారు. విద్వేషాలు రేచ్చగొట్టేలా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు పోస్ట్ చేసినా.. షేర్ చేసిన వారితోపాటు గ్రూప్ అడ్మిన్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
అయ్యప్పా.. ఒకటే ట్రిప్పా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లా అయ్యప్ప భక్తులకు ప్రత్యేక రైలు విషయంలో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలు ఒక ట్రిప్ అది కూడా దిగువమార్గంలో వయా కరీంనగర్– పెద్దపల్లి మార్గంలో ఏటా నడిపిస్తున్నారు. ఈ రైలు ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప స్వాములకు, భక్తులకు సరిపోవడం లేదు. ముఖ్యంగా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట నుంచి శబరిమలకి వెళ్లే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. ప్రస్తుతం ఈ నెల మొత్తం, వచ్చే నెల 15 (సంక్రాంతి ) మకరజ్యోతి వరకు శబరిమల సన్నిధానం తెరచి ఉంటుంది. ఈ మాసంలో ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో భక్తులు, అయ్యప్ప మాలధారులు శబరిమల దర్శనానికి వెళ్తుంటారు. వీరికి అందుబాటులో ఉండేది రైలుమార్గమే. ఇందుకు తగినన్ని రైళ్లు మన ఉమ్మడి జిల్లా నుంచి లేవు. రామగుండంలో ప్రతి రోజు నిలిచే 12626 కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకున్న కూడా కన్ఫర్మ్ కానీ పరిస్థితి ఉంటుంది. ఇది దేశంలో అత్యంత దూరం నడిచే రైళ్లలో ఒకటి. 16318 హిమసాగర్ వీక్లీ ఎక్స్ ప్రెస్, 22647 కోర్బా బై వీక్లీ సూపర్ ఫాస్ట్ రైళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాల నుంచి కొల్లాం లేక కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలోని కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం, విశాఖపట్నం, చర్లపల్లి, కాజీపేట, వికారాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ మార్గాల్లో 10 ట్రిప్పులు ఎగువ, దిగువ మార్గాల్లో నడిపిస్తుంటే, కరీంనగర్ నుంచి ప్రతి ఏటా తూతూ మంత్రంగా ఒకట్రిప్ వేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ఒక ట్రిప్ కూడా వెళ్లడం లేదు. ఈ నిర్లక్ష్య వైఖరిపై శబరిమల వెళ్లే ఉమ్మడి జిల్లాలోని అయ్యప్ప భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు ఎంపీలు చొరవ తీసుకోవాలి ఏటా వేలాదిమంది భక్తులు ఉమ్మడి జిల్లా నుంచి శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో నాందేడ్ నుండి కొల్లాం శబరిమల ప్రత్యేక రైలులో దిగువ మార్గంలోనే అవకాశం కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. తక్షణమే కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చొరవ తీసుకొని నాందేడ్ నుంచి కొల్లాం శబరిమల ప్రత్యేక రైళ్ల సర్వీసులను కనీసం ఎగువతోపాటు దిగువ మార్గాల్లో మొత్తంగా 8 ట్రిప్పులు నడపాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు. -
బల్దియాలో అవినీతిని అరికట్టండి
మెట్పల్లి: మెట్పల్లి బల్దియాలో అవినీతిని ఉన్నతాధికారులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల్లో అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రజల నుంచి లంచాలు వసూలు చేయిస్తున్నారని, వార్డుల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీని అవినీతికి అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు సుంకేట విజయ్, మద్దెల లావణ్య, బొడ్ల నగేష్, కొయ్యల లక్ష్మణ్, తోకల సత్యనారాయణ తదితరులున్నారు. -
మల్లన్నస్వామికి బోనం మొక్కులు
గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం దండివారం సందర్భంగా సుమారు 17వేల మంది భక్తులు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.79,510 ఆదాయం సమకూరింది. డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్ కన్నం హారిణి స్వామివారిని దర్శించుకున్నారు. ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఈవో ముద్దం విక్రం, అర్చకులు రాజేందర్, సీఐ నర్సింహా రెడ్డి, శ్రీనివాస్, ఎస్సైలు కృష్ణసాగర్రెడ్డి, గీత, కుమారస్వామి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫ్యూచర్ సిటీ కాదు..
పెండింగ్ పనులు పూర్తి చేయండిమెట్పల్లి: కొత్తగా ఫ్యూచర్ సిటీని నిర్మించే ముందు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో శిథిలావస్థలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వాసుపత్రి, సమీకృత మార్కెట్ భవనాలను బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హాయాంలో చేపట్టిన ప్రభుత్వాసుపత్రి, సమీకృత మార్కెట్ భవనాల పనులు 90శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన చిన్నచిన్న పనులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా నిర్లక్ష్యం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజాఅవసరాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం కొత్తగా ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీలు నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్రావు, అంగడి పురుషోత్తం, గజం రవి, మోరెపు తేజ తదితరులున్నారు. -
మహిళలదే తీర్పు..
జగిత్యాల: జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారనున్నారు. ప్రతి మండలంలో వారి ఓట్లే అధికంగా ఉన్నాయి. పొదుపు మహిళా సంఘాలు లక్షకు పైగా ఉండటంతో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి ఓట్లను రాబట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. వారు మద్దతిస్తే విజయం ఖాయమనే భావనతో మహిళాసంఘాల చుట్టూ తిరుగుతున్నారు. గెలిస్తే ఏం చేస్తామన్న హామీలు కూడా ఇప్పటినుంచే ఇస్తున్నారు. మహిళాసంఘాలకు ఆఫర్లు జిల్లాలో ఓటర్లు 6,07,263 మంది ఉండగా.. పురుషులు 2,89,702 మంది, మహిళలు 3,17,552 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన మహిళా ఓటర్లు 27,850 మంది అధికంగా ఉన్నారు. పొదుపు సంఘాల్లో ఉన్నవారు ఎటువైపు మొగ్గుచూపితే వారు విజయం సాధించే అవకాశం ఉంది. ఈ ఉద్దేశంతో అభ్యర్థులు మహిళా సంఘాలకు ఆఫర్లు ఇస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామని, వ్యాపారాలకు కృషి చేస్తామని ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రాయికల్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి, రెండోదశ పోరుకు నామినేషన్ల ఘట్టం పూర్తయ్యింది. ఉపసంహరణ కూడా ముగిసిపోయింది. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా పీఠం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలకతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో డబ్బులు సమకూర్చుకునే పనిలో అభ్యర్థులు తలమునకలవుతున్నారు. పార్టీల నుంచి బీఫాం ఇచ్చే అవకాశం ఉంటే కొంతవరకై నా ఫండ్ వచ్చేదని, పార్టీలకు సంబంధం లేకపోవడంతో ఖర్చులన్ని ఎలా భరించాలోనని అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆస్తుల తాకట్టు.. చిట్టీల లిఫ్టింగ్ జిల్లాలో మొదటి విడత ఈనెల 11న, రెండో విడత 14న, మూడో విడత 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు డబ్బులు సమకూర్చుకునేందుకు ఉన్న ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్నారు. మరికొందరు నెలనెలా వేసుకుంటున్న చిట్టీలను లిఫ్ట్ చేస్తున్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మద్యం, మాంసం వంటివి సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు ఖర్చులు తడిసిమోపెడవుతాయి. తమ ప్యానల్ వార్డుసభ్యులు గెలిచేందుకూ తమవంతుగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది అభ్యర్థులకు మరింత భారంకానుంది. ఇప్పటికే వాడవాడలా కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళలకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ లెక్కన ఎన్నికలు పూర్తయ్యే వరకు చిన్న పంచాయతీలో కూడా ఖర్చు తడిసిమోపెడు కానుంది. బిల్లులు రాక ఇబ్బందుల్లో ‘మాజీ’లు మాజీ సర్పంచులకు గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాకపోవడంతో అప్పులపాలయ్యారు. అయినప్పటికీ ఈసారి కూడా సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు ఆశావహులు రూ.లక్షల్లో అప్పు చేసేందుకు వెనుకాడడం లేదు. ఖర్చులతో కూడుకున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతే అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటారో.. లేక గెలిస్తే పెట్టిన ఖర్చును మర్చిపోయి సంబరపడతారో వేచి చూడాల్సిందే.. జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులకు ఆర్వో, ఏఆర్వో విధులు కేటాయించారు. చాలామంది విధులకు హాజరుకాకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ 15 మందికి మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. రాయికల్: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాల్సిందే. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, సీఆర్పీలు, రిసోర్స్ పర్సన్లు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారందరికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. వీరంతా సాధారణ పౌరుల్లాగా మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలిగానీ.. ఏ సర్పంచ్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసినా.. ఎన్నికల కమిషన్కు సాక్ష్యాలతో నిరూపిస్తే వారి ఉద్యోగాలపై వేటు పడుతుంది. జగిత్యాల: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎన్నికల అబ్జర్వర్ జి.రమేశ్ అన్నారు. బుధవారం ఎంసీసీ కంట్రోల్రూమ్ను పరిశీలించారు. ఫిర్యాదుల రిజిస్టర్లు, డాక్యుమెంటేషన్, రియల్టైం మానిటరింగ్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తున్నాయా..? లేదా..? చూశారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడాలన్నారు. డీపీవో రఘువరణ్, నోడల్ అధికారి నరేశ్ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలిఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నా రు. కలెక్టర్, ఎస్పీలతో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్స్లు, పత్రాలన్నీ అందుబాటులో ఉంచుకున్నామని తెలిపారు. ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై దృష్టి పెట్టామని, చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా సమాచారం మండలాలు : 20 గ్రామపంచాయతీలు : 385 వార్డులు : 3,536 ఓటర్లు : 6,07,263 పురుషులు : 2,89,702 మహిళలు : 3,17,552 ఇతరులు : 9 అభ్యర్థుల్లో ఖర్చుల భయం..15 మంది ఆర్వో, ఏఆర్వోలకు మెమోలు?ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే వేటే..‘కంట్రోల్రూమ్’ ఫిర్యాదులు పరిష్కరించాలి -
కాంగ్రెస్లో జోష్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: హుస్నాబాద్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ బలపరుస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల్లో ఉత్సాహం నింపింది. పల్లెల్లో పట్టు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని సీఎం రేవంత్రెడ్డి అభ్యర్థుల్లో నింపే ప్రయత్నం చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చామంటూ సీఎం సభలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో పాటు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్త్రెడ్డి మొదట హుస్నాబాద్కు మంజూరైన ఇంజినీర్ కళాశాలకు రూ.45 కోట్లు మంజూరు చేస్తూ పనులకు శంకుస్థాపన చేశారు. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్ కుమార్ ఇటీవల అమెరికాలో పర్యటించగా, అక్కడ ఓ ఎన్నారై అందించిన 70 సైకిళ్లను సీఎం చేతిలో మీదుగా ఇంజినీరింగ్ విద్యార్థినులకు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. గత పదేళ్లు పాలించిన పార్టీ లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మాణం చేసిన ఎస్సారెస్పీతోనే కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగునీరందుతుందని తెలిపారు. సిద్దిపేట, మెదక్, గజ్వేల్లను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వం హుస్నాబాద్ను నిర్లక్ష్యం చేసిందన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన గౌరవెళ్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ఎలాంటి వరాలు ఇవ్వకుండా సీఎం నిరాశపరిచారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్కుమార్, గడ్డం వివేక్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పాల్గొన్నారు. -
కమనీయం.. రమణీయం
7ఇబ్రహీంపట్నం: మండలకేంద్రం శివారులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు చక్రపాణి, మాధవచారి అధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అర్చకులు సత్యనారాయణ, రవీందర్ శర్మ, నవీన్చారి, సంతోష్, దివాకరచారి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధికారులూ.. అప్రమత్తంఅక్షరక్రమంలో గుర్తులు కేటాయించాలినామినేషన్ల ప్రక్రియ సజావుగా ఉందా.. -
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
జగిత్యాల: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, వారి కోసం ప్రత్యేకమైన క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో మినీస్టేడియంలో క్రీడాపోటీలు నిర్వహించారు. దివ్యాంగులు ప్రతి రంగంలో ప్రతిభ చాటాలన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు రన్నింగ్, షాట్పుట్, జువెలెన్త్రో, ఫీల్డ్ ఈవెంట్స్లో ప్రతిభ కనబర్చారు. వారికి బహుమతులు అందజేశారు. యువజన క్రీడా అధికారి రవికుమార్, డీఈవో రాము, సీడీపీవో మమత, ఈవో పవిత్ర పాల్గొన్నారు. -
‘మల్చర్’ యంత్రంతో కొయ్యకాలు ముక్కలు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు అవగాహనతో వరి కొయ్యకాళ్లను కాల్చడం లేదు. అలాగే కొయ్యకాళ్లను కలియదున్నేందుకు ముందుగా ట్రాక్టర్కు బిగించిన మల్చర్ యంత్రం వినియోగిస్తున్నారు. ఈ ఆధునాతన పరికరం ట్రాక్టర్తో నడుస్తుంది. 5 నుంచి 7 అడుగుల వెడల్పుతో రోటోవేటర్ను పోలి ఉంటుంది. యంత్రంలోని బ్లేడ్లు కొయ్యకాళ్లను చిన్న ముక్కలుగా కట్ చేస్తాయి. ఎకరం పొలంలో గడ్డిని కట్ చేసేందుకు గంట సమయం పడుతుంది. దీని ధర రూ.లక్ష వరకు ఉంటుంది. ఎకరం పొలంలోని కొయ్యకాళ్లు రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువుతో సమానం. పొలంలోనే కలియదున్నడం వల్ల 15 కిలోల భాస్వరం, 15 కిలోల యూరియా, 8 కిలోల పొటాష్ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ఎన్నికల్లో బందోబస్తు ఎలా చేపడుతున్నారు..? ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదయ్యాయా..? మండలస్థాయిలో బృందాలు ఏర్పాటు చేశారా..? జిల్లాలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి..? సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..? ఇప్పటివరకు ఎంతమందిని బైండోవర్ చేశారు..? ప్రచారానికి, సమావేశాలకు అనుమతి తీసుకోవాలా..? జగిత్యాలజోన్: జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తి అనుబంధం బా వోజిపల్లె. ఇక్కడ బావోజోల్లు, బుడిగెజంగాల వారు ఉంటారు. చిలుక జ్యోతిష్యం చెబుతుంటారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరంతా ఒకేమాటకు కట్టుబడి ఉంటున్నారు. వెల్దుర్తి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి బావోజిపల్లెకు సర్పంచ్ పదవి లభించలేదు. 20 ఏళ్ల క్రితం ఇక్కడ 180 ఓట్లు ఉండగా.. ప్రస్తుతం 300కు చేరాయి. ఈ సారి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వెల్దుర్తిలో 1450 ఓట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి సుమారు ఇద్దరుముగ్గురు బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓట్లు చీలితే.. రెండువార్డులు.. ఎస్సీ సామాజికవర్గమే ఉన్న బావోజిపల్లెకు ఈసారి సర్పంచ్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్కు ఆసక్తి చూపని ఉద్యోగులురాయికల్: స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్కు ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగులు, సైనికులు ఎలక్షన్ విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఖైదీలు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యా లెట్లో ఓటు వేయడం ద్వారా ఎన్నికల ఫలితాల రోజు అభ్యర్థులకు చూపించుకుంటూ ఓట్లు లెక్కిస్తారు. స్థానికంగా సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉండటంతో తాము వేసి న ఓటు ఎవరికి వేసిందో తెలుస్తుందనే ఉద్దేశంతో ఓటు వేసి తలనొప్పి తెచ్చుకునే బదులు వేయకుండా ఉండాలని ఉద్యోగులు భావిస్తున్నారు.ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం లేదు రాయికల్: ఏకగ్రీవ గ్రామాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ప్రోత్సాహకం వస్తుందని చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం కింద ఎలాంటి ప్రకటనా రాలేదని డీపీవో రఘువరణ్ తెలిపా రు. తమ సెగ్మెంట్ పరిధి లో ఏకగ్రీవమైతే ఎంపీలు, మంత్రులు బీజేపీ తరుఫున కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారుగానీ.. ప్రభుత్వం నుంచి మాత్రం ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. సర్పంచ్కు గులాబీ.. వార్డు సభ్యులకు తెలుపు రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రక్రియలో భాగంగా ఓటరుకు ఇచ్చే బ్యాలెట్ పత్రాల్లో రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్కు వేసే బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో ఉంటుంది. వార్డు సభ్యులకు వేసే బ్యాలెట్ పత్రం తెలుపురంగులో ఉంటుంది. ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల్లో గులాబీ, తెలుపు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేయాల్సి ఉంటుంది.జగిత్యాలక్రైం: జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై ఆయన ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడారు. ఒకేమాటపై బావోజిపల్లెఅభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు రాయికల్: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో నామినేషన్లపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలు సమర్పిస్తే ఆర్వోలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అన్ని పత్రాలు సరిగా ఉంటే ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. ఒకవేళ తిరస్కరణకు గురైతే సదరు అభ్యర్థి ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చు. రెండు రోజుల నిర్ణీత గడువులోపు పరిష్కరించుకోవాలి. -
ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్, కొత్తపేట, అల్లీపూర్ గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీ లించారు. జిల్లాలో రెండో విడతలో ఏడు మండలాల్లో 144 గ్రామాలు, 1276 వార్డులకు నా మినేషన్ల స్వీకరణ గడువు పూర్తయిందన్నారు. పొరపాట్లు జరగకుండా నామినేషన్లు తీసుకున్న వారి దరఖాస్తు ఫారాలను వివరాలతో రిజిస్ట్రేషన్ నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లను ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపించాలని ఆదేశించారు. హెల్ప్డెస్క్, పోలీసు బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. ఈనెల 3న పరిశీలన ఉంటుందని, 6 వరకు ఉ పసంహరణ గడువు ఉంటుందన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ‘రెడ్కో’ మేనేజర్జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇందిరా వనరుల సంస్థ రెడ్కో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్గా రిటైర్డ్ ఏడీఈ దుర్శెట్టి మనోహర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ను కలిసి అభినందనలు తెలిపారు. జిల్లాలో పోలీస్యాక్ట్ అమలుజగిత్యాలక్రైం: శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజ లు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. బెట్ట పరిస్థితి ఏర్పడితేనే మామిడిలో పూతజగిత్యాలఅగ్రికల్చర్: బెట్ట పరిస్థితులు ఏర్పడితేనే మామిడిలో పూత వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారి కె. స్వాతి తెలిపారు. జగిత్యాలరూరల్, రాయికల్ మండలంలోని మామిడి తోటలను మంగళవారం పరిశీలించారు. ఈ ఏడు అధిక వర్షాలతో భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఫలితంగా పూత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, 10 గ్రాముల పోటాషియం నైట్రేట్, రెండు గ్రాముల బోరాన్, రెండు గ్రాముల జింక్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలని, తద్వారా పూత వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడికి నియామకపత్రంజగిత్యాలటౌన్: హైదరాబాద్లోని గాంధీభవన్లో మంగళవారం నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య హాజరయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నందయ్యకు డీసీసీ అధ్యక్ష నియామకపత్రం అందించారు. నందయ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
జోష్ పెరిగేనా?
హస్తంలోసాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘పల్లెల్లో’ పాగా వేసేందుకు ‘పట్టణం’లో పెట్టిన సీఎం సభపై కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మూడు దశల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీస్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేందుకు, తద్వారా రాష్ట్రంలో పార్టీకి ఢోకా లేదని చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్లో జరిగే సీఎంసభను ప్రచార అస్త్రంగా భావిస్తున్నారు. పల్లెలను ప్రభావితం చేసేలా పెడుతున్న పట్టణ సభద్వారా మరింత జోష్ వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా మంత్రుల నడుమ ఆధిపత్యపోరు, కరీంనగర్ కేంద్రంగా పార్టీ అనాథలా మారడం, నేతల మధ్య సమన్వయ లోపం, గ్రూప్పోరు.. శ్రేణులను కలవరపరుస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి సభతో ముగ్గురు మంత్రులు, విప్లు, అంతా ఏకమై సభ విజయవంతానికి తమ వంతుగా పనిచేసుకుంటూ పోతుండటం పార్టీలో పెరిగిన సహకారానికి నిదర్శనమని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం ప్రసంగంలో ఉమ్మడి జిల్లాకు ప్రకటించే వరాల జల్లుతో స్థానికసంస్థల్లో మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడుతున్నారు. మూడు ముక్కలాటకు సీఎం సభతో చెక్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల నడుమ అంతర్గత ఆధిపత్యపోరు తారాస్థాయిలో ఉంది. ముఖ్యంగా హుస్నాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్కు మరో ఇద్దరు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్ నడుమ ఏ విషయంలోనూ పొసగదనేది బహిరంగరహస్యమే. నామినేటెడ్ పదవుల్లో శ్రీధర్బాబుది పైచేయి కావడం, కరీంనగర్కు సంబంధించిన నియామకాల్లోనూ ఆయనే కీలకం కావడంపై అప్పట్లో పొన్నం కినుక వహించారు. ఒక దశలో సుడా చైర్మన్ నియామకాన్ని అంగీకరించేది లేదని భీష్మించుకొని ఉన్నా, ఇటీవల కాస్త మెత్తపడి, చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డిని చేరువ చేసుకున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్కుమార్పై చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు పెనుదుమారం లేపడం తెలిసిందే. పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల విషయంలో ముగ్గురి నడుమ అధికారులు నలిగిపోతూనే ఉన్నారు. సీఎంసభ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కనబెట్టి అంతా కలిసి పనిచేస్తుండటం శుభసూచకం. ఈ మైత్రి మునుముందు కూడా కొనసాగి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని క్యాడర్ ఆశాజనకంగా ఉంది.అడ్లూరి లక్ష్మణ్కుమార్పొన్నం ప్రభాకర్ఉమ్మడి జిల్లా ‘హెడ్’ క్వార్టర్ అయిన కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అనాథలా మారింది. ఇటీవల డీసీసీ, కార్పొరేషన్ అధ్యక్షుల నియామకంతో కాసింత గాడినపడినట్టుగా కనిపిస్తున్నా, ఇప్పటికీ కరీంనగర్ ఎవరిదనే సమస్య కొనసాగుతోంది. కరీంనగర్కు చెందిన పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందడం, శ్రీధర్బాబు పెద్దపల్లి, లక్ష్మణ్కుమార్ జగిత్యాల జిల్లాలకు ప్రాతినిథ్యం వహించడంతో కరీంనగర్లో పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయింది. పైగా కరీంనగర్ ప్రతిపక్ష పార్టీ చేతిలో ఉండడంతో, ఆ స్థాయిలో కాంగ్రెస్కు నాయకుడు కనిపించడం లేదు. తాను కరీంనగర్ వాసినని పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు జోక్యం చేసుకొంటున్నా, పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో పార్టీ నాయకులు ఎవరికి వారే అన్న తీరుగా మారారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్కుమార్ను నియమించిన తరువాత పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటికీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఖాళీగానే ఉంది. దీంతో నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు ఎవరికీ లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో పార్టీ అసంపూర్తి సంస్థాగత నిర్మాణం సమస్యగా మారుతోంది. పూర్తిస్థాయిలో డీసీసీ, సిటీ, మండల కమిటీలను నియమిస్తే పార్టీలో కొత్త జోష్కు అవకాశముంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలతో పాటు, పార్టీ గుర్తులపై త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే పార్టీలో సమన్వయం ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్లో అదే కరువైంది. -
అనుమతి ఉంటేనే ప్రచారం
పోలింగ్ కేంద్రాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలిజగిత్యాల: జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రెండోవిడత నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారపర్వంలోకి దూకుతున్నారు. ప్రచారానికి అతితక్కువ వ్యవధి మాత్రమే ఉండడం అభ్యర్థులకు కొంత ఇబ్బందిగా మారింది. పైగా ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే అభ్యర్థులు ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలకు తహసీల్దార్, పోలీస్స్టేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలింగ్కు ఒకరోజు ముందుగానే ప్రచారం నిషేధం. ప్రచారానికి ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సర్పంచ్ అభ్యర్థికై ఒక వాహనానికి అనుమతి ఉంటుంది. వార్డు అభ్యర్థికి వాహనాలకు అనుమతి ఉండదు. ఊపందుకున్న ప్రచారం మొదట విడత నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రతిచోట 8 నుంచి 9 మంది పోటీలో ఉన్నారు. కొందరు దగ్గరివారిని ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ గుర్తులు లేకున్నా.. ఒక పార్టీ నుంచే ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వారిని ఎలాగోలా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి అవకాశం వస్తుందో.. లేదోనన్న భావనలో చాలామంది సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. దీంతో బుజ్జగింపులపర్వం ప్రారంభమైంది. పకడ్బందీగా నిఘా ఎన్నికల సమయంలో నగదు, మద్యం పంపిణీకి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు రూ.50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆపై తీసుకెళ్తే సీజ్ చేస్తారు. అవి ఎక్కడివో ఆధారాలు ఉంటే అనుమతి ఇస్తారు. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల నియమవళి ప్రచారం చర్యలు తీసుకుంటామని, అనుమతులు తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల: పోలింగ్ కేంద్రాల్లో మైక్రోఅబ్జర్వర్లు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కాన్ఫరెన్స్ హాల్లో సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ ఇచ్చారు. కేంద్రాల్లో అన్ని సక్రమంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలన్నారు. 3,536 పోలింగ్ కేంద్రాలకు 110 మంది మైక్రోఅబ్జర్వర్లను నియమించామన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, ఓటు వేసేందుకు 13 రకాల గుర్తింపు కార్డులను అనుమతించాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ చేపట్టాలన్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్ ఉపయోగించే విధానంపై డెమో నిర్వహించారు. అనంతరం ర్యాండమైజేషన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, డీపీవో రఘువరణ్, నోడల్ అధికారులు నరేశ్, రాము, రవికుమార్ పాల్గొన్నారు. అటు నామినేషన్లు.. ఇటు పన్నుల వసూలుజగిత్యాలరూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పన్నులు వసూలవుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థులతోపాటు వారిని బలపర్చే వారు కూడా ఇంటి, నీటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసేందుకు వస్తున్న వారు పన్నులు చెల్లిస్తుండడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల వరకు పన్నులు వసూలయ్యాయని అధికారులు అంచనా వే స్తున్నారు. జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు, బలపర్చేవారు పన్నులు చెల్లించి రసీ దులను నామినేషన్ పత్రానికి జతచేసి ఎన్నికల అధికారులకు అప్పగిస్తున్నారు. పన్నుల చెల్లింపు కోసం నామినేషన్ సెంటర్ల వద్ద పంచాయతీ అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సీఎం, మంత్రులకు కోడ్ వర్తించదా..?జగిత్యాల: సీఎం, మంత్రులకు ఎన్నికల కోడ్ వర్తించదా అని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కోడ్ అమలులో ఉండగా సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి పేరుతో జిల్లాలో పర్యటించడం కోడ్ ఉల్లంఘనే అన్నారు. ఆమె వెంట మాజీ కౌన్సిలర్ శీలం ప్రవీణ్, నాయక్ ఉన్నారు. రాత్రి దాకా నామినేషన్ల స్వీకరణ రాయికల్: రాయికల్ మండలంలో నామినేషన్ల స్వీకరణ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 67, వార్డు సభ్యులకు 212 నామినేషన్లు వచ్చాయి. మైతాపూర్లో రాత్రి 8 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. -
తమ్ముడూ.. తప్పుకో!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తొలిదశ నామినేషన్లకు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. అదేంటంటే.. ప్రతీ పార్టీ నుంచి నలుగురైదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామ స్థాయి కార్యకర్తలు ఏళ్లుగా స్థానిక సంస్థల్లో పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. తీరా ఆ అవకాశం రాగానే ఎగిరి గంతేసి బరిలోకి దూకారు. స్వతంత్ర అభ్యర్థులతో ఎలాంటి ఇబ్బందులు లేవుగానీ, తీరా పార్టీ అభ్యర్థులతోనే చిక్కులన్నీ. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో పోటీ ఉండడం మంచిది కాదని తలచి.. మధ్యవర్తిత్వానికి జిల్లా నాయకులను పార్టీలు రంగంలోకి దించుతున్నాయి. ఈ మేరకు రెబల్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రిజర్వ్డ్ స్థానాల కంటే జనరల్ స్థానాల్లో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో బరిలో ఉన్నారు. ఈనెల 3వ తేదీతో తొలిదశ నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో సీనియర్లు బుజ్జగింపుల పర్వాన్ని ముమ్మరం చేశారు. కులం ఓట్లే ప్రామాణికం ప్రతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరికి వారు పోటీలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బుజ్జగింపుల పర్వరంలోకి దిగిన సీనియర్లు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తున్నారు. అయితే, అభ్యర్థుల సామాజిక స్థితిగతులు, అతని సామాజికవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి తగిన హామీలు ఇచ్చి, పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతివ్వాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో సామాజికవర్గం ఓట్లు దండిగా ఉన్న అభ్యర్థులు మెట్టుదిగేది లేదని, పోటీ చేసి తీరుతామని భీష్మించుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో పార్టీ సీనియర్లు కూడా ఏమీ చేయలేని అయోమయంలో ఉన్నారు. అందుకే, గెలిచిన వాడే మనవాడు అవుతాడని, అప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించేందుకు మొగ్గుచూపుతున్నారు.దాదాపు రెండేళ్లుగా జాప్యమైన స్థానిక ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ.. ఆశావహులంతా నామినేషన్లు వేసి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇదే అన్ని పార్టీలకు మింగుడు పడని అంశంగా మారింది. అందుకే, సీనియర్లను రంగంలోకి దింపారు. దీంతో వారంతా నామినేషన్ వేసిన వారితో భేటీ అవుతున్నారు. పార్టీలో పదవుల పరంగా ప్రాధాన్యం కల్పిస్తామంటూ, భవిష్యత్తులో మంచి అవకాశాలు దక్కుతాయని హామీలిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ కల్పించేందుక సిద్ధంగా ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం పార్టీలో పదవులు, స్థానిక సంస్థల్లో టికెట్ల అవకాశంతో పాటు అధికార పార్టీ మరో అడుగు ముందుకు వేస్తోంది. స్థానికంగా జరిగే వర్క్స్, టెండర్లలోనూ ప్రాధాన్యం కల్పిస్తామంటూ వారిలో నమ్మకం కలిగించే ప్రయత్నాలు ప్రారంభించారు. -
భరోసా లేని వలస బతుకులు
వెల్గటూర్: పొట్టకూటి కోసం ఉన్న ఊరిని.. కన్నవారిని వదిలి మన రాష్ట్రం వచ్చిన వలస కూలీల బతుకులకు భరోసా లేకుండా పోయింది. కూలీల చెమటను సొమ్ము చేసుకుంటూ కోట్లకు పడగలెత్తుతున్న యాజమాన్యాలు.. వారు ఉండేందుకు కనీస వసతులు కూడా కల్పించడం లేదు. కష్టానికి తగిన వేతనం ఇవ్వడం పక్కనపెడితే.. పనిచేసే ప్రదేశంలో ప్రమాదవశాత్తు గాయపడినా.. మృత్యువాత పడినా పరిహారం కూడా ఇవ్వడం లేదు. చదువు రాకనో.. భాషరాకనో.. చట్టాలపై అవగాహన లేకనో ఎంతోమంది కూలీలు వెట్టిచాకిరీ లోనే మగ్గిపోతున్నారు. కనీస సౌకర్యాలు కరువు ఉమ్మడి వెల్గటూర్ మండల పరిధిలో చాలా వరకు క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 300 మంది వరకు బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కూలీలు వలస వచ్చి పనిచేస్తున్నారు. వీరిని ఓ కాంట్రాక్టర్ తీసుకొచ్చి క్వారీలు, క్రషర్లలో పనికి కుదుర్చుతాడు. యాజమాన్యాల నుంచి ఎక్కువ మొత్తం తీసుకుని కూలీలకు మాత్రం అరకొర జీతాలు ఇచ్చి వెట్టిచాకిరీ చేయిస్తాడు. పని చేసే ప్రదేశంలో వారి భద్రతకు సంబంధించిన పరికరాలు ఉండవు, నివాసానికి సరైన వసతులు కూడా కల్పించడం లేదనే విమర్శలు ఉన్నాయి. . ప్రమాదాలు జరిగితే పరిహారం లేదు వాస్తవానికి క్వారీలు, క్రషర్ల వంటి ప్రమాదకర ప్రాంతాల్లో 14 నుంచి 18 ఏళ్ల వయస్సున్న పిల్లల ను రానీయొద్దు. కానీ వెల్గటూర్ మండలంలో ఈ నిబంధన అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదకర ప్రదేశాల్లో పనిచేసే కూలీలకు ఏదైనా ప్రమాదం జరిగితే మైనింగ్, లేబర్ చట్టాల ప్రకారం యాజమాన్యాలు కార్మికుడి వయసు, నెల వేతనం ఆధారంగా రూ.పది లక్షలకు పైగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ కూడా బాధితులు కేసు నమోదు చేస్తే పరిహారం ఇస్తుంది. కానీ చట్టాలపై అవగాహన లేని కూలీలకు అవగాహనారాహిత్యంతో పరిహారం పూర్తిగా పరిహాసంగా మారింది. బాల కార్మికులతో బలవంతంగా పని.. మైనింగ్, లేబర్ చట్టాల ప్రకారం బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధం. అయినా ఈ నిబంధన అమలు కావడం లేదు. గతంలో ఎండపల్లి మండలం మారేడ్పల్లిలో ఓ క్వారీలో బాల కార్మికుడితో జేసీబీతో గుట్టపై పని చేయించగా.. ప్రమాదవశాత్తు జేసీబీ కింద పడి మృతి చెందాడు. యాజమాన్యాల ఒత్తిడి మేరకు పోలీసులు సదరు బాలుడిని మేజర్ అని తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్వారీ యజమానిపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా వత్తాసు పలికారు. బాలుడు మృతి చెందిన సందర్భంలో నిబంధనల ప్రకారం క్వారీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి క్వారీ లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు, మైనింగ్, లేబర్ శాఖల అధికారులు మామూలుగా చూసీచూడనట్లు వదిలేశారు. ఈ ఘటన జరిగి ఏడాది గడిచినా బాలుడి కుటుంబానికి యాజమాన్యం ఎటువంటి పరిహారమూ ఇవ్వక పోగా.. కనీసం లేబర్ ఆఫీస్లో కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో బాధిత కుటుంబానికి సుమారు రూ.15లక్షల వరకు పరిహారం అందకుండా పోయింది. చట్టం ఉల్లంఘిస్తే చర్యలు 2014 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రకారం లేబర్ డిపార్ట్మెంట్లో నమోదైన వాటిని మాత్రమే తనిఖీ చేసే అవకాశం ఉంది. ఫ్యాక్టరీలు, రైస్మిల్లులు మొదలైనవి లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోకి రావు. ప్రత్యేకంగా ఏదైనా పిర్యాదులు వచ్చిన సందర్భంలో మాత్రమే వాటిని తనిఖీ చేసి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – సురేంద్రకుమార్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్, జగిత్యాల -
మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు
● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన లక్ష్మిపూర్ రైతులుజగిత్యాలఅగ్రికల్చర్: కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదంటూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ రైతులు సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్కు ఫిర్యాదు చేశారు. లక్ష్మీపూర్ ఎఫ్పీవో ఆధ్వర్యంలో లక్ష్మీపూర్, తిమ్మాపూర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా కొన్న ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించినా తీసుకోవడం లేదని, ఒకవేళ బలవంతంగా దించుకుంటే బస్తాకు కిలో చొప్పున కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. లక్ష్మీపూర్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించిన రైతులకు రూ 1.50కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. లక్ష్మీపూర్ ఎఫ్పీవో అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, సంఘ సభ్యులు లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డి, బుచ్చిరెడ్డి, శివ, రాజేశ్వర్ రెడ్డి, పోచయ్య, కుమార్ ఉన్నారు -
పుట్టినరోజు కానుక
మా నాన్న నాకు పుట్టినరోజు కానుకగా ఫోన్ కొనిచ్చాడు. కంప్యూటర్ క్లాస్కు వెళ్లే క్రమంలో ఫోన్ పోయింది. రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఈఐఆర్ యాప్లో నమోదు చేశారు. పోలీసుల కృషితో నా సెంటిమెంట్ ఫోన్ నాకు వచ్చింది. – రమ్య, తిప్పన్నపేట, జగిత్యాలరూరల్ మండలం పొలం వద్ద దొంగిలించారు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సమయంలో ద్విచక్రవాహనం నుంచి నా ఫోన్ దొంగిలించారు. బుగ్గారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మొబైల్ ఐఎంఈఐ నంబర్తో సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసి ట్రాకింగ్ చేసి నాకు అప్పగించారు. – తిరుపతి, బుగ్గారం చార్జింగ్ పెడితే ఎత్తుకెళ్లారు నా చెల్లి జ్యోతి అత్తగారింటికి వెళ్తున్న సమయంలో బస్టాండ్లో ఫోన్కు చార్జింగ్ పెట్టింది. ఎవరో ఆ ఫోన్ను దొంగిలించారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ చేసి నా ఫోన్ను అప్పగించారు. ఆనందంగా ఉంది. – లక్ష్మణ్, జగిత్యాల -
ప్రమాద బాధితులను ఆదుకోండి
● ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం ఇవ్వండి ● సీఎం రేవంత్రెడ్డిని కలిసిన మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే సత్యం మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే, కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం సోమవారం సీఎం రేవంత్రెడ్డిని కలిసి విన్నవించారు. షార్ట్ సర్క్యూట్తో 30 దుకాణాలు దగ్ధమయ్యాయని, సర్వం కోల్పోయి రోడ్డు పడ్డారని, మంటల్లో సామగ్రితోపాటు విలువైన పత్రాలు కాలిపోయాయని వివరించారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందించాలని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి, ఎమ్మెల్యే తెలిపారు. మద్యం దుకాణాలు ప్రారంభంజగిత్యాలక్రైం: మద్యం షాపుల లైసెన్స్ పొందిన 72 మంది వ్యాపారులు సోమవారం దుకాణాలను ప్రారంభించారని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. వీరంతా గతనెల 29, 30 తేదీల్లో సుమారు రూ.6 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త మద్యం షాపుల నిర్వాహకులు మరో రెండుమూడు రోజుల్లో భారీగా మద్యం కొనుగోలు చేయనున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్ని కల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఇప్పటికే కొన్ని చోట్ల భారీగా మద్యం నిల్వ చేసుకోగా.. మరికొంత మంది పెద్ద ఎత్తున మ ద్యం కొనుగోలు చేసేందుకు మంతనాలు జరుపుతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రా మాల్లో భారీగా మద్యానికి డిమాండ్ పెరిగింది. చీరల పంపిణీపై ఈసీ పునఃసమీక్షించాలిజగిత్యాలటౌన్: ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రారంభమైన చీరల పంపిణీని యథా విధిగా కొనసాగించేలా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని యావర్రోడ్డులో మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ట్రాఫిక్ సమస్య నివారించాలని హైదరాబాద్లో డీటీసీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో ఇళ్లు పొందిన లబ్ధిదారులు వెంటనే తమకు కేటాయించిన ఇళ్లలో చేరాలని కోరారు. నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, మన్సూర్, రఘువీర్గౌడ్, గుండ మధు, రమేష్రావు, నేహాల్ ఉన్నారు. మక్కల తరలింపురాయికల్: పట్టణంలోని మార్కెట్యార్డులో మార్క్ఫెడ్ ద్వారా తూకం వేసిన బస్తాలను చల్గల్ ఏఎంసీకి తరలించినట్లు సెంటర్ ఇన్చార్జి మల్లికార్జున్ తెలిపారు. గతనెల 30న ‘మక్కలు కొంటలేరు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఆయన కేంద్రంలో ఉన్న మొక్కజొన్న బస్తాలను ఏడు లారీల్లో చల్గల్ ఏఎంసీకి తరలించారు. మంగళవారం నుంచి మక్కలు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇతర మండలాల నుంచి రైతులు రావడంతో ఆలస్యమైందని వివరించారు. -
జగిత్యాల
32.0/14.07గరిష్టం/కనిష్టంరాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థినులుమల్యాల: తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థినులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ మానస తెలిపారు. హారిక, యశ స్విని, తేజస్విని, నిత్యశ్రీ, చందన ఎంపికయ్యారు. వీరిని తోటి విద్యార్థినులు అభినందించారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి. కేంద్రాల వద్ద బందోబస్తు రాయికల్/సారంగాపూర్: నామినేషన్ కేంద్రాల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. రాయికల్ మండలం ఆలూరు, సారంగాపూర్ మండలంలోని లచ్చక్కపేటలోని నామినేషన్ కేంద్రాలను సోమవారం సందర్శించారు.మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
పోగొట్టుకున్న 136 ఫోన్లు అప్పగింత
జగిత్యాలక్రైం: పోగొట్టుకున్న.. చోరీకి గురైన ఫోన్లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. వివిధ ఘటనలో చోరీకి గురైన రూ.28 లక్షల విలువైన 136 సెల్ఫోన్లను ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.3.5 కోట్ల విలువైన 1548 ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. సెల్ఫోన్లు పోగొట్టుకుంటే ఆందోళన చెందకుండా.. సీఈఐఆర్ అప్లికేషన్లో నమోదు చేసుకుంటే గుర్తించి ఇస్తామని తెలిపారు. సెల్ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్ఎస్సై హెడ్కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ఖాన్, సీఈఆర్ఐ టీం ఆర్ఎస్సై కృష్ణ, హెడ్కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుళ్లు అజర్ పాల్గొన్నారు. -
మహమ్మారి నివారిద్దాం
● యువత జాగ్రత్తగా ఉండాలి ● అదనపు కలెక్టర్ రాజాగౌడ్జగిత్యాల: ఎయిడ్స్ మహమ్మారికి చికిత్స కంటే నివారణే మేలు అని, యువత జాగ్రత్తగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. మహమ్మారికి చికిత్స లేదన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 2,573 బాధితులు ఉన్నారని తెలిపారు. ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు శ్రీనివాస్, ఐఎంఏ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి, సుధీర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. -
విద్యావంతులు.. ఉన్నత ఉద్యోగాలు వదిలి..
డిగ్రీ, పీజీలు పూర్తి చేసినవారు..సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈసారి పంచాయతీ బరిలో నిల్చున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వస్తున్నట్టు వారు చెబుతున్నారు. కథలాపూర్/రామగుండం/పుల్కల్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన బాసారపు నాగరాణి 2021లో బీటెక్ పూర్తిచేశారు. సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ⇒ ఇదే మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన గడ్డం అనూష 2020లో బీటెక్ పూర్తి చేశారు. సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ఆమె బరిలో ఉన్నారు. ⇒ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామానికి చెందిన అంగోతు రవికుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ స్థానం కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ఎన్ఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తన స్వగ్రామాన్ని డిజిటల్ గ్రామంగా, వందశాతం అక్షరాస్యులుగా, మౌలిక సదుపాయాల కల్పనలో ఆధునికంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ⇒ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముద్దాయిపేట పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎంబీఏ చదివిన కొల్లూరు జ్యోష్న సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జగ్గాసాగర్ సర్పంచ్ పదవికి వేలంరూ.28.60 లక్షలకు పాడిన ఓ వ్యక్తి మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో సోమవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించినట్టు తెలిసింది. ఈ గ్రామంలో మొదటివిడత ఎన్నిక జరగాల్సి ఉండగా.. సర్పంచ్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఓ వ్యక్తి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని వీడీసీ సభ్యులకు తెలిపారు. దీంతో బహిరంగ వేలం వేస్తే మరింత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశముందని భావించి వారు వేలం నిర్వహించారు. ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.28.60 లక్షలు చెల్లించడానికి ముందుకొచ్చాడు. అతడినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వీడీసీ సభ్యులు నిర్ణయించి.. మిగతా వారంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని చెప్పినట్టు సమాచారం. ఉద్యోగికి ఓటు భయం ! సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వందల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో ఎవరు ఏ అభ్యర్థికి లేదా ఏ పారీ్టకి ఓటు వేశారో తెలిసే అవకాశాలు ఉండవు. అయితే ఆయా పంచాయతీల పరిధిలో తక్కువ సంఖ్యలో పోస్టల్ ఓట్లు ఉంటాయి. కొన్నిచోట్ల ఒక్కరో, ఇద్దరో ప్రభుత్వ ఉపాధ్యాయులు/ఉద్యోగులు ఉంటారు. వారు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు.. దరఖాస్తు చేసుకొని బ్యాలెట్ పత్రంలో తమకు నచి్చన వ్యక్తికి పెన్నుతో టిక్ చేస్తారు. అయితే కౌంటింగ్ సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.ఆ ఊళ్లో ఒకే ఉద్యోగి/ఉపాధ్యాయుడు ఉండి, ఆయన ఎవరో ఒకరికి ఓటు వేసినప్పుడు తన ఓటు ఎవరికి వేశారో బహిర్గతమవుతుంది. తద్వారా తమకు ఓటు వేయలేదని ఇతరులు ఆ ఉద్యోగిపై కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది. గతంలో పలుచోట్ల ఓటు రహస్యం బహిర్గతమై వివాదాలు ఎదురయ్యాయని ఓ ఉపాధ్యాయుడు ‘సాక్షి’తో తన ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్లను సాధారణ బ్యాలెట్ పత్రాల్లో కలిపితే ఏ సమస్యా ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని పోస్టల్ బ్యాలెట్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. నామినేషన్లు తీసుకున్నాక.. రిజర్వేషన్ మారిందన్నారు ! ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు పంచాయతీలోని 11వ వార్డును జనరల్ (అన్రిజర్వ్డ్)కు కేటాయిస్తూ కలెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆది, సోమవారాల్లో ఈ వార్డుకు జనరల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారుడు మైతాబ్కు ఫోన్ చేసిన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది.. ‘మీ వార్డును జనరల్ మహిళకు కేటాయించారు, మీ భార్యను తీసుకొచ్చి మళ్లీ నామినేషన్ వేయమని చెప్పడంతో కంగుతిన్నారు. అయితే, తమకు ఇచి్చన రిజర్వేషన్ ప్రకారమే నామినేషన్లు వేశామని, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ నర్సింలును వివరణ కోరగా తాను జారీచేసిన రిజర్వేషన్ జాబితానే నామినేషన్ అధికారికి ఇచ్చామని తెలిపారు.రూపాయి నాణేలతో నామినేషన్ డిపాజిట్ మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మొగుళ్ల లావణ్య సర్పంచ్ పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ డిపాజిట్ కింద తాను దాచుకున్న రూపాయి నాణేలను అందజేశారు.మా తండాకు అవకాశం ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాంధర్పల్లి(నిజామాబాద్ రూరల్): తమ తండా వారికి సర్పంచ్గా అవకాశం ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం చెరువు తండావాసులు పేర్కొన్నారు. సోమవారం ఎంపీడీఓ లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోబిన్సాబ్ తండా, చెరువు తండాలను కలిసి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారని, ఒకసారి మోబిన్సాబ్ తండాకు మరోసారి చెరువు తండాకు సర్పంచ్ అవకాశం ఇవ్వాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.ఒప్పందం ప్రకారం మొదటిసారి మోబిన్సాబ్ తండాకు చెందిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఈసారి తమ తండాకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా, మోబిన్సాబ్ తండావాసులు ఒప్పందాన్ని ఉల్లంఘించి సర్పంచ్ అభ్యర్థిని పోటీలో నిలబెడుతున్నారన్నారు. ఒప్పందం ప్రకారం తమ తండాకు చెందిన వ్యక్తికే సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.ఏం చేయాలో చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో సర్పంచ్గా పోటీచేసే అభ్యర్థులు చేయాల్సిన పనుల జాబితాతో ఆ గ్రామ యువత ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. గ్రామానికి అవసరమైన రోడ్లు, ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్లు పెంపు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఫ్లెక్సీ ద్వారా స్పష్టం చేశారు. గెలిపిస్తే శుభకార్యాలకు టెంట్హౌస్ సామగ్రి ఉచితంఇల్లంతకుంట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామానికి చెందిన భారతమ్మ కుటుంబానికి టెంట్హౌస్ ఉంది. సర్పంచ్గా పోటీ చేస్తున్న ఆమె.. తనను గెలిపిస్తే ఐదేళ్లపాటు గ్రామస్తులు చేసుకునే అన్ని శుభకార్యాలకు టెంట్హౌస్ సామగ్రిని ఉచితంగా సరఫరా చేస్తానని ప్రచారం చేస్తున్నారు. -
‘అజ్ఞాత’ హత్యలు.. జనజీవనానికి సవాళ్లు
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడున్నర దశాబ్దాల కాలంపాటు విప్లవోద్యమాలు సాగాయి. సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు, జనశక్తి పార్టీలు ప్రధానంగా సాయుధ విప్లవ పోరాటాన్ని సాగించాయి. ఈ క్రమంలో వర్గశత్రు నిర్మూలన పేరుతో నక్సలైట్లను అనేక మందిని వివిధ సందర్భాల్లో హత్య చేశారు. సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో అనేక మందిని పోలీస్ ఇన్ఫార్మర్లంటూ నక్సలైట్లు చంపారు. భూస్వాములు, వ్యాపారులు, పోలీసులు, ఆఖరికి మహిళలను కూడా నక్సలైట్లు హతమార్చిన సంఘటనలు అనేకం. అజ్ఞాతంలో ఉండగా.. అప్పటి నక్సలైట్ గ్రూపులకు నాయకత్వం వహించిన దళ నాయకులు, డిప్యూటీ దళ నాయకులు ఆనాటి సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. తాజాగా సిరిసిల్ల–వేములవాడ పట్టణాల మధ్య అగ్రహారం గుట్టల్లో హత్యకు గురైన బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న అలియాస్ బాపురెడ్డి(58) ఉదంతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశమైంది. విప్లవోద్యమాల్లో పని చేసి పోలీసులకు లొంగిపోయి.. అరెస్టయి ఇప్పుడు జనజీవనంలో ఉంటున్న మాజీ నక్సలైట్లలో ఈ ఘటన వణుకు పుట్టిస్తోంది. సిద్ధన్న హత్యోదంతం కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ప్రతీకారాన్ని శంకించి.. ఊరికి దూరంగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సిద్ధన్న పదేళ్లపాటు అప్పటి పీపుల్స్వార్ పార్టీలో పని చేశారు. ఉద్యమ కాలంలో అనేక మందిపై దాడులు, పార్టీ ఆదేశాల మేరకు హత్యలు చేశారు. పీపుల్స్వార్ పార్టీలోనే ఉంటూ.. పోలీసులకు కోవర్టుగా పని చేస్తున్నారని ఆరుగురిని వట్టిమల్ల–మరిమడ్ల మధ్య, మరో నలుగురిని మానాలతండా వద్ద కట్టేసి కాల్చి చంపిన ఘటనల్లో సిద్ధన్న ఉన్నారు. ఇలా సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో అప్పటి పీపుల్స్వార్ నక్సలైట్లు చేసిన అనేక హత్య కేసుల్లో సిద్ధన్న నిందితుడు. ఆయన 2004లోనే పోలీసులకు లొంగిపోయారు. ప్రతీకార దాడులుంటాయని భయపడిన సిద్ధన్న.. మూడేళ్లపాటు సొంత ఊరు గండిలచ్చపేట, సిరిసిల్ల ప్రాంతానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్లో చాలాకాలం ఉన్నారు. సిద్దిపేటలో భార్యతో కలిసి హోటల్ నిర్వహించాడు. ఇక ఏమీ కాదని నిర్ధారణకు వచ్చి సొంత ఊరిలో వ్యవసాయ చేస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 1999 ఏప్రిల్ 9న వీర్నపల్లిలో జక్కుల అంజయ్య అనే వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్ పేరిట సిద్ధన్న దళం హత్య చేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా అంజయ్య కొడుకు జక్కుల సంతోష్ 26 ఏళ్ల తరువాత సిద్ధన్నను ఇంటర్వ్యూ కోసం పిలిచి అగ్రహారం గుట్టల్లో దారుణంగా హత్య చేశాడు. అంతకుముందు ఓ చానల్ ఇంటర్వ్యూలో సిద్ధన్న అంజయ్య హత్యోదంతాన్ని ఉటంకిస్తూ మాట్లాడడంతో సంతోష్ అతన్ని గుర్తించి ఈ హత్యకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంతోష్ ఒక్కడే సిద్దన్నను హత్య చేయడం గమనార్హం. మాజీ నక్సలైట్లలో వణుకు.. సిద్ధన్న హత్యోదంతంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా స్థిరపడిన మాజీ నక్సలైట్లలో వణుకు మొదలైంది. అజ్ఞాతంలో అనేక మందిని పార్టీ ఆదేశాల మేరకు హత్య చేసిన వారు ఇప్పుడు సాధారణ జనజీవనం సాగిస్తున్నారు. ఆయుధం చేతిలో ఉండగా.. వ్యక్తిగత కక్షలు ఏమీ లేకపోయినా.. పార్టీ ఆదేశాలను అమలు చేసిన వారు కొందరైతే.. వ్యక్తిగత నిర్ణయాలతో హత్యలు చేసిన సంఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది మాజీలను అజ్ఞాత హత్యలు.. ఇప్పుడు జనజీవనంలో సవాళ్లు విసురుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వందలాది మంది మాజీ నక్సలైట్లు జనజీవనంలో ఉన్నారు. వ్యాపారాలు చేస్తూ.. వ్యవసాయం చేస్తూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారు. సిద్ధన్న హత్య ఘటన వారిని ఆలోచనలో పడేసింది. అజ్ఞాతంలో ఉండగా.. దాడులు చేసి కాళ్లు, చేతులు విరిచిన ఘటనలు, హత్య చేసిన సంఘటనల్లో బాధితులు, వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రతీకార దాడులు జరిగే ప్రమాదముంటుందని ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది సొంత ఊర్లకు దూరంగా ఉంటుండగా.. కొందరు గత్యంతరం లేక సొంత ఊర్లలోనే సాధారణ జీవనాన్ని సాగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మావోయిస్టు, జనశక్తి పార్టీలో పని చేసి లొంగిపోయిన వారు అనేక మంది ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. అజ్ఞాతంలో ఉండగా నమోదైన పోలీసు కేసులు కోర్టు విచారణలో సాక్ష్యాలు లేక కొట్టుడుపోయాయి. లొంగిపోయిన వారిపై కేసులను పోలీసు అధికారులు ఎత్తేశారు. కొందరిపై వారెంట్లున్నా.. అరెస్ట్ చేయకుండా వదిలేశారు. తాజాగా సిద్ధన్న హత్యోదంతంతో మాజీలు ఎవరు కూడా మీడియాకు ఇంటర్వ్యూలివ్వడం కానీ, అజ్ఞాతంలో చేసిన ఘటనల గతాన్ని మళ్లీ తవ్వే ప్రయత్నం కానీ చేయొద్దని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. సిద్ధన్న హత్యోదంతం నేపథ్యంలో జిల్లాలోని మాజీ నక్సలైట్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ఎవరి నుంచయినా ప్రమాదం పొంచి ఉంటే పోలీసులను ఆశ్రయించాలి. పంచాయతీ ఎన్నికల తరువాత జిల్లాలో పోలీస్ స్టేషన్ వారీగా మాజీ నక్సలైట్లను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తాం. చట్టవ్యతిరేక చర్యలను సహించం. అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. – మహేశ్ బి గితే, జిల్లా ఎస్పీ ప్రతీకార హత్యతో ‘మాజీ’ల్లో వణుకు కొత్త కోణాన్ని ఆవిష్కరించిన సిద్ధన్న హత్యోదంతం మాజీ నక్సలైట్లు అప్రమత్తంగా ఉండాలి పోలీస్ స్టేషన్ వారీగా మాజీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తాం జిల్లా ఎస్పీ మహేశ్ బి గితే -
అనుకోని ప్రమాదం.. అపార నష్టం..
మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం ముత్యంపేటలోని దిగువ కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన షార్ట్ సర్క్యూట్తో 30 దుకాణాలు బుగ్గిపాలు కాగా.. 36 కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారి సమీపంలోని హనుమాన్ విగ్రహం వద్దకు వెళ్లే దారిలో ఇరువైపులా బొమ్మల దుకాణాలుండగా.. శనివారం రాత్రి ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు.. 30 దుకాణాల్లోని సుమారు రూ.కోటికి పైగా విలువైన సామగ్రి, బంగారం, నగదు, సర్టిఫికెట్లను బుగ్గిపాలు చేశాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దుకాణాల్లో నిద్రిస్తున్న వారు హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. కట్టుబట్టలే మిగిలాయి.. అప్రమత్తమైన స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నం చేసినా.. గాలి వీయడంతో మంటలు పక్క దుకాణాలకూ వ్యాపించాయి. దుకాణాల్లో నిద్రిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. రూ.2లక్షల నుంచి రూ.7లక్షల సామగ్రి సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం కానుండడంతో దుకాణాదారులు ఒక్కొక్కరు సుమారు రూ.2లక్షల నుంచి రూ.7లక్షల వరకు సామగ్రి సిద్ధం చేసుకున్నారు. సమీపంలోని మరో మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించి.. పైపులు, విద్యుత్ తీగలు కాలడంతోపాటు ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది. మంటల్లో కాలుతున్న దుకాణాల ఎదుట ఉన్న రెండు దుకాణాల బొమ్మలు కాలిపోయాయి. చికెన్ సెంటర్ ఎదుట జాలీలో ఉన్న సుమారు 18 కోళ్లు మృతిచెందాయి. ఫైరింజన్ సకాలంలో రాక భారీ నష్టం వాటిల్లింది. దిగువ కొండగట్టులో షార్ట్ సర్క్యూట్ 30 బొమ్మల దుకాణాలు బుగ్గి 36 కుటుంబాలు రోడ్డుపాలు కాలి బూడిదైన బంగారం, నగదు, సర్టిఫికెట్లు, విలువైన సామగ్రి సుమారు రూ.కోటికి పైగా నష్టం సంఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న ఫైరింజన్షార్ట్ సర్క్యూట్.. సకాలంలో ఫైరింజన్ రాకపోవడం.. గాలి వీయడం.. వెరసి నిరుపేదల జీవితాల్లో శనివారం కాళరాత్రిగా మిగిలిపోయింది. సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం కొనుగోలు చేసిన రూ.లక్షలాది సామగ్రి, కుటుంబం కోసం దాచుకున్న బంగారం, నగదు, సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. కష్టార్జితం మంటల్లో కాలిపోయి కట్టు బట్టలతో రోడ్డున పడ్డారు. నీడ కరువై.. ఉపాధి కోల్పోయి.. మంటల్లో బూడిదైన తమ దుకాణాలను చూస్తూ.. చేసిన అప్పులు తీర్చేదెలా దేవుడా అంటూ హృదయ విదారకంగా రోదించారు. -
పెత్తనం వాళ్లది.. ఇగ పోటీ ఎందుకు..?
జగిత్యాలజోన్: జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థకు సమాంతరంగా గ్రామాభివృద్ధి సంఘాలు పెత్తనం చెలాయిస్తున్నాయి. దీంతో సంబంధిత గ్రామాల్లో సర్పంచ్లుగా పోటీి చేసేవారు వెనకాముందు ఆలోచిస్తున్నారు. గ్రామానికి సంబంధించిన ప్రతీ పనిలో గ్రామాభివృద్ధి సంఘాలు జోక్యం చేసుకోవడం గ్రామ సర్పంచ్లకు ఈసడింపుగా మారింది. గతంలో పలు విషయాల్లో గ్రామ సర్పంచ్లు, గ్రామాభివృద్ధి సంఘాల మధ్య విభేదాలు రావడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గ్రామాభివృద్ధి సంఘంలో కులానికి ఒకరిద్దరు ప్రతినిధులుండడం.. వారు చెప్పిందే గ్రామంలో వేదంగా మారడంతో గ్రామ సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఒకానొక దశలో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి సవాల్ విసిరేవరకు గ్రామాభివృద్ధి సంఘాలు చేరాయంటే.. పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. దీంతో గ్రామంలో రూ.లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి.. ఇల్లిల్లూ తిరిగి సర్పంచ్గా గెలిచినా ఏం లాభం అన్న రీతిలో సర్పంచ్గా పోటీ చేసేవారు వెనకాముందు ఆలోచిస్తున్నారు. సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి గ్రామ పెత్తనమంతా గ్రామాభివృద్ధి సంఘాలే చేస్తుండడం పోటీ చేసే యువతకు అసలు రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే గ్రామాభివృద్ధి సంఘాలను ఎదిరించే దీటైన నాయకుడు సర్పంచ్గా రావాలని చాలా గ్రామాల్లో ప్రజలు కోరుకుంటుండడం విశేషం.


