Jagtial
-
500 మార్కులు సాధిస్తే రూ.ఐదువేల ప్రోత్సాహకం
ధర్మపురి: మండలంలోని దోనూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని పదో తరగతిలో 500 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు రూ.ఐదువేల ప్రో త్సాహకం అందించనున్నట్లు సర్పంచ్ దాసరి పురుషోత్తం ప్రకటించారు. స్థానిక పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రోగ్రెస్ కార్డులు అందించారు. అలాగే పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు రూ.516 అందిస్తానని వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన ఎంఈవో సీతామహాలక్ష్మి మాట్లాడుతూ.. సర్పంచ్ పురుషోత్తం మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. ప్రతి తరగతి నుంచి గరిష్ట హాజరు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రోజుకు రూ.2, ద్వితీయ బహుమతిగా రూపాయి చొప్పున అందిస్తానని ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ సుమతి, పంచాయతీ కార్యదర్శి ముత్యం పాల్గొన్నారు. -
పొరండ్లలో శ్రీఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
● వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గురువారం శ్రీఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్, శోభమ్మ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వెల్దుర్తి గ్రామంలోని గట్టు మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆమె వెంట నాయకులు ఆనందరావు, సదాశివరావు, మహిపాల్రెడ్డి, ప్రవీణ్, ప్రకాశ్, తిరుపతి పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏఎస్పీ చేతన్నితిన్జగిత్యాలక్రైం: ఇటీవల ఏఎస్పీగా బదిలీ అయిన చేతన్నితిన్ గురువారం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ అశోక్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్ను కలిశారు. 2022 బ్యాచ్కు చెందిన చేతన్ నితిన్ జనగామ ఏఎస్పీగా పనిచేశారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
జగిత్యాల: భోజనం నాణ్యతలో నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాకేంద్రంలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి సందర్శించారు. ఉదయం అల్పాహారం అందించాలని, భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. మెనూ కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అల్పాహారం, పోషకాహారం ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, సంక్షేమాధికారి రాజ్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేశ్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి పాల్గొన్నారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతెలో ఉడుత లక్ష్మీనర్సు నిర్మించుకున్న ఇందిరమ్మ గృహ ప్రవేశం చేశారు. సర్పంచ్ మహేశ్, మాజీ ఎంపీటీసీ రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం గొల్లపల్లి: గొల్లపల్లి మండలం చందోలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతోపాటు, ధాన్యం తూకంలో కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. -
బురుజు స్థలాలను కాపాడుకుందాం
కోరుట్ల: పట్టణంలోని చారిత్రక కట్టడాలైన గడి బురుజుల స్థలాలను కాపాడుకుందామని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. బురుజు స్థలాల పరిరక్షణకు మూడు రోజులుగా చేస్తున్న అఖిలపక్షం, ప్రజాసంఘాల నిరసన దీక్షలకు ఎమ్మెల్యే గురువారం మద్దతు తెలిపారు. స్థలాలపై విధించిన వీఎల్టీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు చెన్నా విశ్వనాథం, పేట భాస్కర్, ఎండీ.ముజాహిద్, చింతా భూమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ విలీన గెజిట్ బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జీవో గెజిట్ నోటిపికేషన్ విడుదల చేశామని, ఇప్పుడున్న ప్రభుత్వం కేవలం అపాయింట్మెంట్ ఇస్తే ప్రక్రియ పూర్తవుతుందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. డిమాండ్లు నెరవేర్చాలని రెండురోజులుగా సమ్మె చేస్తున్న కోరుట్ల, మెట్పల్లి ఆర్టీసీ కార్మికులకు గురువారం సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలు న్యాయమైనవని, ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సీఎం మాటలు కోటలు దాటుతాయని, చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఎండనుంచి కార్మికులు ఉపశమనం పొందేందుకు వారికి గొడుగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు ఇబ్బంది పడకుండా జగిత్యాల నియోజకవర్గంలో 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. చల్గల్ మార్కెట్ యార్డులో గురువారం కేంద్రాన్ని ప్రారంభించారు. రానున్న సీజన్ నుంచి సాగు సమాచారం అందించేందుకు గ్రామాల్లో రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. వరి స్థానంలో ఆదాయం వచే పంటల వైపు దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఏవో భాస్కర్, డీసీవో మనోజ్కుమార్, డీసీఎస్వో జితేందర్ రెడ్డి, డీఎంవో ప్రకాష్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, పీఏసీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. సన్నాల సాగు పెంచాలిజగిత్యాలఅగ్రికల్చర్: వచ్చే వానాకాలం సీజన్లో సన్నాల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. సన్న వరి రకాలసాగు, యూరియా బుకింగ్ యాప్పై గురువారం ఫర్టిలైజర్, విత్తన డీలర్లకు జిల్లాకేంద్రంలో అవగాహన కల్పించారు. సన్నరకాలను సాగు చేస్తే మార్కెటింగ్లో ఇబ్బంది ఉండవన్నారు. సన్నాలకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్న క్రమంలో సాగును ప్రోత్సహించాలని పేర్కొన్నారు. బీపీటీ–5204, జై శ్రీరాం, జేజీఎల్–1798, కేఎన్ఎం– 1638, హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్– 15048 వంటి రకాలు పండించి ఆదాయం పొందాలని రైతులకు సూచించారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రైతులు ఇంటి నుంచే ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖాధికారి లత, ఏడీ టెక్నికల్ రాజులునాయుడు, ఏడీ తిరుపతినాయక్ పాల్గొన్నారు. కొండగట్టులో ఎమ్మెల్సీ వెంకట్ పూజలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. వారికి అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఈవో అంజనారెడ్డి, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, సూపరింటెండెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్, తూము శ్రీనివాస్, ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మానాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొత్తగా వివాహమైన వెంకట్ దంపతులకు సత్యంతోపాటు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. రేపు విజిలెన్స్ విచారణకోరుట్ల: కోరుట్ల మద్దుల చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులను టెండర్లకు ముందే చేసిన వైనంపై శనివారం వరంగల్లో విజిలెన్స్ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ పనులపై మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం నెల క్రితం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. స్పందించిన డీఎంఏ శ్రీదేవి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. వరంగల్ ఆర్జేడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. విచారణకు మున్సిపల్ కమిషనర్, డీఈ హాజరుకావాలని వరంగల్ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. పనులు ముగిసిన తరువాత టెండర్లు ఖరారు చేసిన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. -
కాళేశ్వరం విచారణ పేరిట కాలయాపన
జగిత్యాల/జగిత్యాలటౌన్: ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరిట కాలయాపన తప్ప రెండున్నరేళ్లలో రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. కాళేశ్వరం కట్టకముందు యాసంగిలో నీరులేక పొలాలు బీళ్లుగా మారేవని, ప్రాజెక్టుతో రెండు పంటలకు సరిపడా నీరందుతోందని గుర్తుచేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. నాయకులు అయిల్నేని వెంకటేశ్వర్రావు, ఆనందరావు, ఆవారి శివకేసరిబాబు, శీలం ప్రియాంక, మహిపాల్రెడ్డి, ఒద్ది రాంమోహన్రావు, కచ్చు హరీష్, గుండ మధు, ఎల్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
నేడు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక
మెట్పల్లి/జగిత్యాల: మెట్పల్లి మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు మధ్యాహ్నం 3.30గంటలకు మున్సిపల్ సమావేశ మందిరంలో కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నలుగురు కో–ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. మరోవైపు ఎన్నిక ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపట్టడం లేదని 11వార్డుకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. ఈ పిటిషన్పై 24న మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నిక జరుగుతుందా..? లేక వాయిదా పడుతుందా..? అన్నది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ తప్పుదోవ పట్టించడం తగదు – బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్వరూప కో–ఆప్షన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం తగదని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ధర్మపురి స్వరూప తెలిపారు. పార్టీ కౌన్సిలర్లతో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. కో–ఆప్షన్ ఎన్నిక చట్టబద్ధంగా నిర్వహిస్తున్నామని వైస్చైర్మన్ నవీన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కౌన్సిలర్లకు ఇచ్చిన ఎజెండా చట్టబద్ధంగా ఉంటే ఎందుకు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ నుంచి అధికారిక ఉత్తర్వును కమిషనర్ సంతకంతోనే జారీ చేయాల్సి ఉంటుందని, మెట్పల్లిలో కమిషనర్తో నిమిత్తం లేకుండా చైర్మన్ సంతకంతో నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. బొడ్ల రమేశ్, బొడ్ల ఆనంద్, దొనికెల శిరీష, అరిగెల అనూష, కోయల్కర్ స్రవంతి తదితరులున్నారు. జగిత్యాలలో అవకాశం ఎవరికో.. జగిత్యాల మున్సిపాలిటీలో కో–ఆప్షన్ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు కొద్దిరోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ సూచించిన వ్యక్తులకే పదవులు దక్కే అవకాశాలు న్నాయి. మున్సిపాలిటీలోని రెండు మైనార్టీ, రెండు జనరల్ పదవులున్నాయి. మొత్తం 11 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి పదవి దక్కేనోనని చర్చ నడుస్తోంది. గట్టు సతీశ్, వీరబత్తిని పద్మజ, అబ్దుల్ ఖాదర్ (ముజ్జు), సుల్తానాకు పదవి దక్కే అవకాశాలున్నాయి. వీరిలో గట్టు సతీశ్ను ఎమ్మెల్యే ప్రతిపాదించగా.. పద్మజను మంత్రి అడ్లూరి సూచించినట్లు తెలిసింది. శుక్రవారం మున్సిపల్ సమావేశంలో సభ్యులను ఎన్నుకోనున్నారు. నేడు సమావేశం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో సభ్యులు సమావేశం కానున్నారు. సభ్యులను ఎన్నుకున్న అనంతరం జనరల్బాడీ సమావేశం జరగనుంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలి
మెట్పల్లిరూరల్: హిందూ సనాతనధర్మం, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని విశోఖ తీర్థ స్వామిజీ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం హిందూ సమ్మేళనంలో మాట్లాడారు. హిందూధర్మం విశిష్టత ను తెలుసుకోవాలని సూచించారు. హిందువులంతా సంఘటితం కావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ పుల్ల జగన్గౌడ్, ఉపసర్పంచ్ లక్మ చిన్నయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు రాజ్పాల్రెడ్డి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. శవంపై బంగారం మాయం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. చనిపోయిన వృద్ధురాలికి ఉన్న బంగారు కమ్మలు మాయమయ్యాయి. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను బంధువులు.. ఐసీయూలో చేర్చారు.చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం వృద్ధురాలు ఉదయం మృతి చెందింది. వృద్ధురాలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత కమ్మలు కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిపై వృద్ధురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందే తీసేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. -
నూతన నియామకం
రాయికల్: అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి జిల్లా అధ్యక్షుడిగా రాయికల్కు చెందిన ఆడెపు రాజమౌళి నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ చైర్మన్ శిరీన్, జాతీయ అధ్యక్షుడు ఎస్కె.మజీద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన జర్నలిస్టుగా, విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా, రాయికల్ మున్సిపల్ ఉద్యోగిగా అందించిన సేవలకుగాను జాతీయ నాయకత్వం ఈ నియామకం చేపట్టింది. రాజమౌళి మాట్లాడుతూ జిల్లాలో మానవ హక్కులను రక్షించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఒబులాపూర్లో డీఎల్పీవో విచారణ మల్లాపూర్: మండలంలోని మొగిలిపేటకు చెందిన మంగళారపు గంగారాంకు సంబంధించిన ఎకరం భూమిని ఇతరులకు విరాసత్ చేయడంతో బాధితుడు మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టాడు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. బుధవారం ఒబులాపూర్కు వెళ్లిన డీఎల్పీవో సుదర్శన్, ఎంపీడీవో జగదీశ్ గ్రామపంచాయతీలో విరాసత్ పట్టాకు కారణమైన ధ్రువీకరణ పత్రం జారీపై విచారణ చేపట్టారు. మంగళారపు (గాండ్ల) రాజేశ్వరి తాత గంగరాం పేరిట బ్యాంక్ పనికోసమని 30ఏళ్ల క్రితం చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం రాసివ్వాలని పంచాయతీ కార్యదర్శి శ్రీని వాస్కు దరఖాస్తు పెట్టుకోగా ఆయన జారీ చేశాడు. ఆ పత్రంతోనే రాజేశ్వరి విరాసత్ పట్టా చేయించుకున్నట్లు విచారణలో తేలిందని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. -
చెన్నకేశవునికి పూజలు
రాయికల్: పట్టణంలోని శ్రీచెన్నకేశవనాథ ఆలయ విశిష్టతను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని హైదరాబాద్కు చెందిన మహిళలు బుధవారం ఆలయాన్ని సందర్శించారు. దేశంలోనే రెండో పంచముఖ లింగం విశిష్ఠతపై ఆలయ అర్చకులు సతీశ్శర్మ వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అల్వాల్ ఎస్ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ తోట వినీత, కాకర ప్రేమలత, మహిళ బృందం సభ్యులు పాల్గొన్నారు. బడిబాటలో 40 అడ్మిషన్లుకథలాపూర్: మండలంలోని తక్కళ్లపెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు బుధవారం బడిబాట నిర్వహించారు. బుధవారం ఒకేరోజు కొత్తగా 40మంది విద్యార్థుల అడ్మిషన్లు వచ్చాయి. పాఠశాలల్లో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజగంగారాం, హెచ్ఎం లక్ష్మీనర్సయ్య, కార్యదర్శి పూజిత, వార్డుసభ్యులు పాల్గొన్నారు. సర్పంచ్ కుమారుడికి అడ్మిషన్ ఇప్పపెల్లి సర్పంచ్ సంబ నవీన్ తన కుమారుడు నియాన్స్ను స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కిషన్రావుకు అడ్మిషన్ ఫామ్ను అందించారు. టీబీ రహిత సమాజమే లక్ష్యంజగిత్యాలరూరల్: టీబీరహిత సమాజమే లక్ష్యమని, వ్యాధి నిర్ధారణతోనే నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చల్గల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ, అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళ జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీబీ బాధితులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జున్ను రాజేందర్, మెడికల్ ఆఫీసర్ సౌజన్య, ఎంఎల్హెచ్పీ షామిని, ఉప సర్పంచ్ రుమాన్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్ వికాస్, ఎస్టీఎస్ శ్రీనివాస్, సూపర్వైజర్ సుజాత, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అంజన్న సింహద్వారానికి మరమ్మతుమల్యాల: మండలంలోని ముత్యంపేటలోగల కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ సింహద్వారానికి అధికారులు మరమ్మతు చేస్తున్నారు. వాటిని బుధవారం ఆలయ ఈవో అంజనారెడ్డి పరిశీలించారు. పీఆర్సీ అమలు చేయాలిజగిత్యాల: 51శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీయూ భవన్లో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 90రోజుల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏ విడుదల చేస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. హెల్త్కార్డులు, సీపీఎస్ రద్దు అంశాలను పరిష్కరించలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 5న ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షనర్లు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ, మేకల ప్రవీణ్, శ్రీనివాస్, నంద్యానాయక్, నరేశ్, తిరుపతి, చారి, మురళీ పాల్గొన్నారు. -
కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా
సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఖాళీగా కుర్చీలు రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. సభ్యుల ఎన్నిక బుధవారం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో సాధారణ సమావేశం అనంతరం సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఎవరూ సకాలంలో హాజరు కాకపోవడంతో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికను వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 11.35 గంటల వరకు కమిషనర్, అధికారులు చైర్మన్, వైస్చైర్మన్, కౌన్సిలర్ల రాక కోసం ఎదురుచూశారు. సమయం మించిపోయినప్పటికీ చైర్మన్ కట్కం రవి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, మిగతా సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె.. బస్సులు సగమే
కరీంనగర్ రీజియన్ పరిధిలో.. సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్టౌన్: డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగడం ఉమ్మడి జిల్లా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్–1, కరీంనగర్–2, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని మొత్తం 11 డిపోల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3,057 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 99 శాతం మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం విధులకు హాజరు కాగా, మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసనలకు దిగగా.. ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాముకు ముందే పోలీసు బలగాలు మోహరించారు. కరీంనగర్ రీజియన్లో దాదాపు 1,000 బస్సులు అందుబాటులో ఉండగా.. బుధవారం 401 బస్సులను హైదరాబాద్, వరంగల్, వేములవాడ, గోదావరిఖని, మెట్పల్లి, తదితర అన్ని రూట్లలో నడిపారు. 330 అద్దెబస్సులు, వాటి డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నారు.జగిత్యాల బస్టాండ్లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ప్రయాణికుల ఇక్కట్లు జిల్లాలో రైల్వే మార్గాలు అంతగా అభివృద్ధి చెందకపోవడంతో సింహభాగం ప్రజారవాణాకు ఆర్టీసీ మీదే ఆధారపడాలి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజారవాణా దాదాపుగా స్తంభించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం డిగ్రీ, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, ట్యాక్సీలు ఽచార్జీలు అమాంతంగా పెంచారు. హైదరాబాద్, వరంగల్ రూట్లలోనూ ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలు రూ.500 నుంచి రూ.800 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మరోవైపు కార్పూలింగ్, కార్ షేరింగ్ యాప్లకు డిమాండ్ పెరిగింది. వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కరీంనగర్ బైపాస్ వద్ద ప్రమాదం జరగడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్కు బస్సులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగింది ఆర్టీసీ ఐకాస నాయకులు ఆరోపించారు.డిపోలు 11ఆర్టీసీ బస్సులు 550అద్దె బస్సులు 330ఎలక్ట్రికల్ బస్సులు 100ఆర్టీసీ డ్రైవర్లు 984ఆర్టీసీ కండక్టర్లు 1,354ఇతర సిబ్బంది 719 (ఆఫీసు, డిపో,వర్క్షాపులు కలిపి) -
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ హర్షం
జగిత్యాలటౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు బుధవారం జిల్లాకేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. తహసీల్ చౌరస్తాలో స్వీట్లు పంచిపెట్టారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. కాళేశ్వరంపై రాష్ట్రప్రభుత్వం నియమించిన పీసీ.ఘోష్ కమిషన్ నివేదికను నిలుపుదల చేస్తూ.. హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. తెలంగాణకు కల్పతరువు వంటి కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినాన్యాయస్థానాలు చూస్తూ ఊరుకోబోవని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టిన కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతు చేసి రైతులకు సాగు, తాగునీటిని అందించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గురుకులాల్లో కార్పొరేట్స్థాయి విద్య
వెల్గటూర్: విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందని, రోజురోజుకూ ప్రవేశాల సంఖ్య పెరుగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని స్తంభంపల్లి జ్యోతిబాపూలే గురుకులాన్ని కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి బుధవారం సందర్శించారు. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు తెస్తోందని, ప్రతినియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వంటగదుల్లో పరిశుభ్రత పాటించాలని సూచించా రు. డీఈవో రాము, సంక్షేమ అధికారులు కె.రాజ్కుమార్, సునీత, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో నరేశ్ కుమార్, ఎంఈవో ప్రభాకర్, ప్రిన్సిపాల్ హరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల: పంచాయతీరాజ్, ఉపాధిహామీ కింద చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్, అంగన్వాడీ భవనాలు, కిచెన్షెడ్స్, టాయిలెట్స్ వెంటనే చేపట్టాలన్నారు. నాణ్యతలో రాజీపడొద్దని, పిల్లలకు అన్ని వసతులూ ఉండాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా కార్మికులకు వసతులు కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రతి పని ప్రణాళికబద్ధంగా అమలు కావాలన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. గురుకులాల పోస్టర్ ఆవిష్కరించారు. 2026–27కు గాను డిగ్రీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్నెట్ సౌకర్యం, ల్యాబ్లు ఉన్నాయన్నారు. ప్రిన్సిపల్ శ్రీలత పాల్గొన్నారు. -
కోరుట్ల మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యులు వీరే..
డొద్దూరి సతీష్సంగా మాలతిగుండోజి శ్రీనివాస్అస్మా శాఇస్తాకోరుట్ల: బల్దియాలో నలుగురు కో–ఆప్షన్ సభ్యుల ను ఎన్నుకున్నారు. మంగళవారం ప్రత్యేక సమావేశంలో గుండోజి శ్రీనివాస్, సంగ మాలతి, బొద్దూరి సతీష్, అస్మా శాఇస్తాను ఎన్నుకుని వారికి నియామక పత్రాలను చైర్పర్సన్ తిరుమల వసంత, కమిషనర్ రవీందర్ అందించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. వైస్చైర్మన్, అధికారులు పాల్గొన్నారు. -
ఈత సరదా విషాదం కావొద్దు
జగిత్యాలక్రైం: వేసవిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు ,కాలువల వద్దకు వెళ్తారని, నీటిలో మునిగి ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఈత నేర్చుకోవాలన్నారు. పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనం ఇవ్వొద్దని చెప్పారు. మైనర్లకు వాహనం ఇస్తే ప్రమాదం జరిగినా.. వాహనంతో పట్టుబడినా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు చిన్న నిర్లక్ష్యంతో ప్రాణనష్టం ఎస్పీ అశోక్ కుమార్ -
చివరిగింజ వరకు కొంటాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కథలాపూర్: కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గంభీర్పూర్లో సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రైతులు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఏ గ్రేడ్కు రూ.2,389 ఉందన్నారు. సన్నరకానికి బోనస్ రూ.500 ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏపీఎం చిన్నరాజయ్య, కారపు గంగాధర్, హరిప్రసాద్, ప్రకాశ్నాయక్, శేఖర్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి● అడిషనల్ కలెక్టర్ లత జగిత్యాల: ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. కలెక్టరెట్లో బాయిల్డ్ రైస్మిల్లర్లతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్కు సంబంధించి దిగుమతిలో జాప్యం లేకుండా చూడాలని, లారీల అన్లోడింగ్ వేగవంతం చేయాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం పేరుకుపోకుండా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ సకాలంలో పూర్తి చేయాలన్నారు. అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్రెడ్డి, మేనేజర్ జితేంద్రప్రసాద్, తహసీల్దార్లు పాల్గొన్నారు. శంకరాచార్యుల జయంతి ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోని జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్యావల్ల సాయి మంత్రోచ్ఛరణలతో శంకరాశారదాంబ అమ్మవారికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, అష్ఠోత్తర పూజ, మన్యసూక్తం, పంచోపనిషత్లతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆల య అర్చకులు, భక్తులు తదితరులున్నారు. అంజన్న ఉద్యోగుల అంతర్గత బదిలీలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఉద్యోగులకు అంతర్గత బదిలీలు జరి గాయి. సీనియర్ అసిస్టెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్కు సూపరింటెండెంట్గా పదోన్న తి, ఆలయ పర్యవేక్షకులుగా.. సునీల్కుమార్ ను పీఆర్వోగా.. పవన్కుమార్ను పరిపాలన, అకౌంట్స్, తూము శ్రీనివాస్ను ఆలయ ఇన్స్పెక్టర్గా బదిలీ చేశారు. చంద్రశేఖర్ను ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించారు. భక్తుల సందడి.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. -
న్యాయం కోసం వృద్ధుని పోరాటం
మల్లాపూర్: తనకు తెలియకుండానే తన భూమిని విరాసత్ చేశారని, అధికారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. 72 ఏళ్ల వృద్ధుడు కుటుంబంతో సహా తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆమరణ దీక్షకు దిగాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుని కథనం ప్రకారం మల్లాపూర్లోని మొగిలిపేటకు చెందిన మంగాళరపు గంగారాంకు భార్య గంగు, కుమారుడు ధర్మరాజు, కూతురు బీమ రాజు ఉన్నారు. ఇద్దరికీ వివాహమైంది. గంగారాంకు సంగెంశ్రీరాంపూర్ శివారులో 82/1 సర్వేనంబర్లో 1.27 ఎకరాల భూమి ఉంది. కుమారుడితో కలిసి సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమిపై బ్యాంక్లో పంట రుణం తీసుకుని ఏటా రెన్యూవల్ చేస్తున్నాడు. 2025 జనవరిలో లోన్ రెన్యూవల్ కోసం వెళ్లగా.. తన భూమి ఇతరులకు విరాసత్ పట్టా అయిందని బ్యాంక్ అధికారులు తెలపడంతో కంగుతిన్నాడు. రెవెన్యూ అధికారులను నిలదీశాడు. ఒబులాపూర్కు చెందిన గాండ్ల రాజేశ్వరి పేరిట విరాసత్ అయినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాను బతికి ఉండగానే తన భూమిని ఇతరులకు విరాసత్ చేశారని తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఆ భూమిని తామే సాగు చేసుకుంటున్నామని చెబుతున్నా అధికారులు కనికరించడం లేదు. గత్యంతరం లేక కుటుంబంతోపాటు ఆమరణ దీక్షకు దిగినట్లు బాధితుడు పేర్కొన్నారు. తాను బతికి ఉండగానే మరణించినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి.. ఎలాంటి విచారణ చేయకుండానే వారసత్వ పట్టా చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. ఆందోళన విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాంచందర్, ఎస్సై అనిల్ రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి వచ్చి వృద్ధుడితో మాట్లాడారు. పట్టా రద్దు కోసం ఆర్డీవోకు దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించుకున్నారు. బతికుండగానే ఎకరం భూమి ఇతరులకు విరాసత్ తన భూమి తనకు పట్టా చేయాలని ఆమరణ దీక్ష -
రేవంత్ సర్కార్ ఎందుకు పోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పోవాలో బీఆర్ఎస్ చెప్పాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చూడాలన్నారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం పోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన చావు కోరుకున్నారంటూ జగిత్యాల సభలో కేసీఆర్ అనడాన్ని ఖండించారు. ప్రతిపక్షనాయకుడిగా ఆయన్ను గౌరవించామన్నారు. సీఎం రేవంత్ను బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. తమ ప్రతి పక్షనాయకులు అప్పటి సీఎం కేసీఆర్ను ఏనాడూ ఏకవచనంతో సంబోధించలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రులతో కూడా మాట్లాడలేదని, రేవంత్ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. 2023లో చివరి రైతుబంధు వేసేందుకు కేసీఆర్ ఔటర్రింగ్రోడ్డును అగ్గువకు కుదవపెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. ఎఫ్సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి సీబీఐ విచారణ జరిపించేలా బండి సంజయ్ చూడాలన్నారు. జీవన్రెడ్డి పార్టీ మారడం వల్ల లాభమా, నష్టమా ప్రజలు నిర్ణయిస్తారన్నారు. త్వరలో జగిత్యాలలో సీఎం సభ నిర్వహిస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిగేలా బండి సంజయ్ చూడాలి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
కోఆప్షన్లపై గందరగోళం
మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఈ ఎన్నికకు సంబంధించిన పలు విషయాల్లో అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిలర్లతోపాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ముందుగా ఈనెల 23న ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ఎజెండాలో పొందుపరుస్తూ ఆ ప్రతులను కౌన్సిలర్లకు ఆదివారం పంపిణీ చేశా రు. మొత్తం నాలుగు పదవులకు 24మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఎవరినీ అనర్హులు గా గుర్తించకుండానే ఎజెండాలో అందరి పేర్లు చే ర్చారు. కౌన్సిలర్లకు ఇచ్చిన ఎజెండా ప్రతులను మరుసటిరోజు వెనక్కి తీసుకున్న అధికారులు.. మార్పులు చేసి మళ్లీ మంగళవారం తిరిగి కౌన్సిలర్లకు అందించారు. అయితే అందులో ఎన్నిక తేదీని 24కు మార్చడంతోపాటు కొందరు అభ్యర్థులు అనర్హులని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను అధికా రులు పరిశీలించి అందులో అనర్హులుంటే వారిని పోటీ నుంచి తప్పించాలి. కానీ అలా చేయకుండానే తొలుత అందరి పేర్లతో కూడిన ఎజెండా ప్రతులను పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనర్హుల్లో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడి సతీమణి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న పలువురు అనర్హులను గుర్తించకుండానే కౌన్సిలర్లకు ఎజెండా ప్రతులు తర్వాత వెనక్కి తీసుకుని మరో ఎజెండా అందజేత అందులో నలుగురిని అనర్హులుగా ప్రకటించిన వైనం వివాదాస్పదమైన మెట్పల్లి మున్సిపల్ అధికారుల తీరు -
ఓటరు జాబితా పారదర్శకంగా నిర్వహించాలి
జగిత్యాల: ఓటరు జాబితాను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. కొత్తవారిని ఓటరు జాబితాలో చేర్చడంపై దృష్టి పెట్టాలన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్ ఆవిష్కరించారు. డీఈవో రాము, సైన్స్ అధికారి రాజశేఖర్, సెక్టోరియల్ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
వడదెబ్బ మృతుల కుటుంబాలకు భరోసా
మల్లాపూర్: రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.4లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. పరిహారం పొందేందుకు కావాల్సిన పత్రాలు.. దరఖాస్తు విధానం అర్హులు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కలెక్టర్ తుది ఆమోదం తెలుపుతారు. కలెక్టర్ ఆమోదం పొందిన వెంటనే పరిహారం మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. వడదెబ్బ మరణాల విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన సహాయం అందేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. -
హోటళ్లు అపరిశుభ్రం!
జగిత్యాల: అటు ఆహార భద్రత శాఖ అధికారుల పర్యవేక్షణ, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో పరిశుభ్రతతోపాటు, నాణ్యత లోపిస్తోంది. కనీసం అధికారులు తనిఖీలు చేయకపోవడంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హోటళ్లలో, రోడ్డుపక్కన ఉండే చిన్నచిన్న హోటళ్లలో అపరిశుభ్రత లోపిస్తోంది. హోటళ్ల పక్కనే మురికికాలువలు ఉండటం, ఆ సమీపంలోనే వంటపాత్రలు కడగడం, రోడ్లపై వచ్చే దుమ్ముతో పేరుకుపోతోంది. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. రెస్టారెంట్లలో అపరిశుభ్రత వంటగదులు, మురికినీటితో వంటపాత్రలు శుభ్రం చేయడం, దుర్వాసన వచ్చే గ్లాసులు, ఇలా ప్రతి హోటల్లో దర్శనం ఇస్తున్నాయి. జిల్లాలో ప్రతి హోటల్లో మాస్టర్లు, సర్వర్లు, పనిచేసే వారు ఆఫ్రాన్లు, గ్లౌసులు మచ్చుకు కూడా కన్పించవు. ఆహారంలో వెంట్రుకలు రావడం, ఇతరత్రా పదార్థాలు రావడంతో పాటు చట్నీ దుర్వాసన రావడం మామూలుగా మారింది. రోజులకు తరబడిన వినియోగించిన నూనెలను మళ్లీమళ్లీ వాడినా పరిపాటిగా మారింది. కోళ్ల వ్యర్థాలు, కళేబరాలు, ఎముకలతో తయారుచేసిన నూనె విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకనే.. జిల్లా కేంద్రంలో హోటళ్లు, రెస్టారెంట్లలో టిఫిన్ సెంటర్లలో అధికారులు నిత్యం తనిఖీ చేయకపోవడంతో వారు ఆడిందే ఆటగా మారింది. గతంలో తనిఖీ చేసే సమయంలో కుళ్లిన చికెన్, మటన్ ఇతరత్రా పదార్థాలు లభ్యమైతే అప్పటివరకు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే కొత్తబస్టాండ్లోని ఓ హోటల్లో చట్నీలో గడ్డిపురుగు రాగా, గతంలో మూడు మాసాల క్రితం తహసీల్ చౌరస్తాలో ఉన్న ఓ హోటల్లో ఇడ్లీలో బొద్దింక, చపాతిలో ఫంగస్, ఇడ్లీలో జెర్రీ వచ్చిన సంఘటనలు చోటుచేసుకోగా బాధితుల ఫిర్యాదు మేరకు వచ్చి నామమాత్రంగా సీజ్ చేశారు. మరుసటి రోజు నుంచే ఆ హోటల్ ప్రారంభమైంది. నిబంధనలు గాలికే... నిబంధనల ప్రకారం ఏ రోజు పదార్థాలను ఆ రోజే విక్రయించాలి. ఒకసారి వినియోగించిన నూనెను మరోసారి వాడరాదు. అయినప్పటికీ రోజుల తరబడి అదే నూనెను వాడుతున్నారు. ముఖ్యంగా భోజనాలు, టిఫిన్లు తయారుచేసే ప్రాంతాల్లో వంటగదులు శుభ్రంగా ఉండాలి. కానీ హోటళ్లలో ఒక వైపు ఎలుకలు, మరో వైపు బల్లులు, జెర్రీలు, బొద్దింకలు, పందికొక్కులు సంచరిస్తున్నా పక్కనే పెద్దపెద్ద మురికికాలువల దుర్గందం వెదజల్లుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒకవేళ హోటళ్లలో మిగిలిన ఆహారం, చట్నీలను ఫ్రిజ్లో నిల్వ ఉంచి మళ్లీ తెల్లవారు దానినే వడ్డిస్తున్నారు. దీంతో అవి తిన్న బాధితులకు ఫుడ్ పాయిజన్ సైతం జరుగుతుంది. ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీలు చేయకపోవడం పరిపాటిగా మారింది. ఫోన్లు ఎత్తని అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లలో ఏదైనా సమస్య ఎదురైతే ఫుడ్సేఫ్టీ అధికారులకు ఫోన్ చేసి తెలపాలన్నా అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. జగిత్యాలలో సంబంధిత అధికారి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అది జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలోగల ఓ పూరీ సెంటర్. అందులో టిఫిన్ చేసేందుకు ఓ వినియోగదారుడు వచ్చాడు. టిఫిన్ చేస్తుండగా.. చట్నీలో పెద్ద గడ్డిపురుగు వచ్చింది. సదరు వ్యక్తి గమనించడంతో ప్రమాదం తప్పింది. ఆ చట్నీ తింటే అనారోగ్యం పాలయ్యేవాడు. విషయాన్ని అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ సమస్య ఆ వినియోగదారుడిదే కాదు.. చాలామందిది. అటు ఆహారభద్రత అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రతి హోటల్లో నాణ్యత, శుభ్రత కొరతవడుతోంది. నామమాత్రంగా అధికారులు తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్లతో సరే..జిల్లా కేంద్రంలో అధికారులు తనిఖీలు చేపట్టగా శుభ్రత లేకపోవడం, ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించడం లేదని తనిఖీల్లో వెల్లడి అవుతున్నా ఏదో నామమాత్రపు కేసులు పెడుతూ జరిమానా విధిస్తూ మామూళ్లతో సరిపెట్టుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆహార కల్తీని నిరోధించేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వడం లేదు. -
రేపు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక
రాయికల్:రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశంతోపాటు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కీర్తి నాగరాజు సోమవారం తెలిపారు. మొత్తం నాలుగు కోఆప్షన్ స్థానాలు భర్తీ చేయనున్నారు. కౌన్సిలర్లు సకాలంలో హాజరుకావాలని కమిషనర్ పేర్కొన్నారు. హిందువుల్లో ఐక్యత పెరగాలిరాయికల్ హిందువుల్లో ఐక్యత పెరిగితేనే ధర్మం నిలబడుతుందని ప్రముఖ సామాజిక సమరవేత్త కల్యాణి అన్నారు. సోమవారం రాత్రి రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు తమ పిల్లలను తప్పనిసరిగా హిందూ ఆచార, సంప్రదాయాలను అలవాటు చేయాలని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. గోవులను ప్రతిఒక్కరూ పూజించాలని, సకల దేవతలు గోవులో ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం ఇప్పించండి
డీఎస్సీ 2004లో 3 ఉర్దూ మీడియం పీఈటీ పోస్టులు నోటిఫై చేశారు. వీటిలో రెండు పోస్టులు అన్రిజర్వ్డ్ ఓపె న్ కేటగిరీ కింద నియామకం చేశారు. ఆ కోటాలో స్థానిక అభ్యర్థులు ఉన్నా ఆంధ్రప్రదేశ్కు చెందిన అభ్యర్థిని మూడో పోస్టుకు ఎంపిక చేశారు. వాస్తవానికి 95శాతం లోకల్ అభ్యర్థులను నియమించాకే నాన్ లోకల్ అభ్యర్థులను ఎంపిక చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఒక పోస్టును నాన్ లోకల్ వ్యక్తికి కేటాయించడంతో నాకు అన్యాయం జరిగింది. ఆ నియామక ప్రక్రియపై విచారణ జరిపి నాకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోండి. – మహ్మద్ జమీల్, జగిత్యాల -
బీఆర్ఎస్ పార్టీలో జీవన్రెడ్డి ముసలం
జగిత్యాల: బీఆర్ఎస్ పార్టీలో అప్పుడే ముసలం పుట్టిందని, జీవన్రెడ్డి చేరికను మాజీమంత్రి హరీశ్రావు వ్యతిరేకిస్తున్నారని, అందుకే జగిత్యాల సభకు రాకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సభకు హరీశ్రావు గైర్హాజరు వెనుక మతలబేంటో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలన్నారు. ఇటీవల కేటీఆర్ బుజ్జగించి హరీశ్రావును జీవన్రెడ్డి ఇంటికి తీసుకొచ్చారని, జీవన్రెడ్డిని బీఆర్ఎస్ శ్రేణులు ఐరెన్లెగ్గా పరిగణిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులంతా నారజ్లో ఉన్నారని, అందుకే జీవన్రెడ్డి ఫొటోలు తొలగించారని పేర్కొన్నారు. గతంలో రేవంత్ కావాలి.. కేసీఆర్ పోవాలన్న జీవన్రెడ్డి.. ఇప్పుడు రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనడం ప్యాకేజీ మాటలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, టీపీసీసీ సెక్రెటరీ బండ శంకర్, కొత్త మోహన్, మన్సూర్, గడ్డం నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మే 11 నుంచి 13 వరకు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఆలయ ఈఓ అంజనా రెడ్డి సోమవారం పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో పర్యటించి, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు తాగునీటి వసతి, క్యూలైన్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కపీందర్, లక్ష్మణప్రసాద్, సూపరింటెండెంట్ సునీల్కుమార్ పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణంమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గోవిందమాంబ సమేత శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం జరిపించారు. ప్రత్యేక పూజలు, యాగాలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలిరాయికల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి సూచించారు. మండలంలోని అల్లీపూర్ జ్యోతిబాపూలే పాఠశాలను సోమవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ స్వప్నకుమారి, ఎంపీడీవో చిరంజీవి, ఇన్చార్జి సెక్రెటరీ శ్రీహరి, 8వ వార్డు మెంబర్ అనుమల్ల రాజ్కుమార్ పాల్గొన్నారు. -
ప్రాజెక్టు మిగులు పనులు పూర్తి చేస్తాం
ధర్మపురి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణ శివారులో ఉన్న అక్కపల్లి చెరువును అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. అక్కపల్లి చెరువు, రోళ్లవాగు ఎత్తిపోతల, ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని తెలిపారు. సాగునీటి విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతామని అన్నారు. రోళ్లవాగు విషయంలో ధర్మపురి ఎమ్మెల్యే, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.60కోట్లతో 2016లో పనులు ప్రారంభించి రూ.140 కోట్లకు పెంచారని, అయినప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, కౌన్సిలర్లు చిపిరిశెట్టి రాజేశ్ సంబందిత శాఖ అధికారులు తదితరులున్నారు. -
స్వామీ.. కాలినడకన మొక్కులెలా..?
మల్యాల: అంజన్న స్వామి ఆలయానికి మెట్లమీదుగా వెళ్లే దారి అస్తవ్యస్తంగా మారింది. బండరాళ్లు.. పైపుల లీకేజీతో బురదను తలపిస్తోంది. కాలినడకన మెట్లదారి వెంట వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం భక్తులకు గగనంగా మారుతోంది. దీనికితోడు మలమూత్రాలతో దుర్గంధం వెదజల్లుతోంది. దారి వెంట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, హనుమాన్ పెద్ద జయంతి నాటికి శుద్ధి చేసి, మధ్యమధ్య ఉన్న బండరాళ్లు తొలగించాలని భక్తులు కోరుతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. మంగళవారం, శనివారాల్లో రద్దీ అధికం. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యల్లో తరలివస్తుంటారు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డంతా అస్తవ్యస్తం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి కాలినడకన చేరుకునే దారి అస్తవ్యస్తంగా మారడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలో బండరాళ్లు ఉండడంతోపాటు పైపులైను లీకేజీతో దారిమొత్తం బురదమయం అవుతోంది. పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడంతో నడిచివెళ్లేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు మెట్లదారి వెంట నడిచి వెళ్లే భక్తులు బండరాళ్లు, బురదనీటితో ఇబ్బంది పడుతున్నారు. జయంతి ఉత్సవాల్లో వేలాదిమంది ఈ దారిమీదుగానే స్వామి సన్నిధికి చేరుకుంటారు. అధికారులు మెట్లదారిని అభివృద్ధి చేయాలి. – సంకూర్తి తిరుపతి, మద్దుట్ల సర్పంచ్ మెట్లదారి వెంట ఆంజనేయస్వామి వారి సన్నిధికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతాం. భక్తుల మొక్కులు సజావుగా చెల్లించుకునేలా అభివృద్ధి చేసేందుకు దృష్టి సారిస్తాం. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తాం. – అంజనా రెడ్డి, ఆలయ ఈవో -
యజ్ఞం ప్రారంభిస్తున్నా
జగిత్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలా రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ చావాలా..? నువ్వు వేయి జన్మలెత్తినా చావను.. పిల్లి శాపాలకు ఉట్టి తెగుతదా..? ఈ వెధవలు చావాలని అనుకుంటే చస్తానా? మీ ఆశీర్వాదాలు ఉంటే అన్ని వర్గాల ప్రజలు గర్వంగా, సంతోషంగా ఉండేలా, అన్ని వర్గాల ప్రజలు బాగుపడేదాకా సేవ చేస్తా. చివరి శ్వాస దాకా 50 ఏండ్ల వారిలా నేనూ, జీవన్రెడ్డి ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతాం. రాష్ట్రం ఎందుకు బాగుపడదో చూస్తాం‘ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. జగిత్యాలలో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ వేదికగా ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సుమారు ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన కేసీఆర్ గంట పాటు ప్రసంగించారు. ‘తెచ్చిన తెలంగాణలో మంచి, చెడు చూసే బాధ్యత నాకు అప్పగిస్తే కొత్త కుండలో ఈగ చొచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక స్థితిపై అవగాహన లేకున్నా నిపుణుల సహాయంతో ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేశాం. కానీ కేసీఆర్కు పాలన చేతకావడం లేదు... మాకు పాలనలో అనుభవం ఉంది. ఆరు చందమామలు, ఏడు సూర్యులను పెడతామని అధికారంలోకి వచ్చి ఆర్థిక పరిస్థితిని దిగజార్చారు. అందువల్ల ప్రజలు సంఘటితమై తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మొదలు పెట్టాలి. గ్రహచారం బాగాలేదని కూర్చుంటే దెబ్బతింటాం. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. జగిత్యాల జైత్రయాత్రతో రాజకీయ శక్తులను పునరేకీకరణ చేస్తూ పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభిస్తున్నా.. ముందుకెళ్లి విజయం సాధిద్దాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మూడో కిస్తీ కోసం మరో సభ పెట్టాలా... ‘ఉత్తి మాటలు.. గప్పాలు కొట్టుడు కాదు.. మిషన్ భగీరథ ఐదేండ్లలో పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగం అని నిండు అసెంబ్లీలో చెప్పిన సీఎంను ఎవరైనా చూశారా? మరిప్పడు ఏం రోగం వచ్చింది. పని చేయని వారిని లాగులు పగిలేదాకా సంపాలి. పొదరిల్లు లాంటి తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తిని ఏడు వేల మెగావాట్ల నుంచి 20వేల మెగావాట్లకు పెంచి క్షణం కూడా కరెంటు పోకుండా చేశాం. మరిప్పుడు ఏం బీమారి వచ్చింది. రైతుబంధు కోసం కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి. జగిత్యాలలో సభ పెడితే రైతుబంధు రెండో కిస్తీ ఇస్తున్నారు. మూడో కిస్తీ కోసం కేసీఆర్ మరో సభ పెట్టాలా. రైతుబంధు వేసేందుకు కాటారంలో సభ పెట్టారు. రెండు నెలలకోమారు ఎకరానికి ఆరు వేలు వేసి సిపాయిల్లా డప్పు కొట్టుకుంటున్నరు’ అని కేసీఆర్ అన్నారు. ..అందుకే బయటకు రాలేదు ‘బీఆర్ఎస్ పాలనలో తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తే ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు చేస్తారో లేదో కూడా చెప్పడం లేదు. ఉద్యోగులకు 72శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇస్తే ఈ ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగుల బకాయిలతోపాటు కనీసం ఏడు శాతం జీతం కూడా పెంచలేదు. ఉచిత బస్సుతో ఆటో కార్మీకులు ఇబ్బందులు పడుతున్నారు. పేపర్ తిరగేస్తే సింగరేణి, పౌరసరఫరాలు సహా అనేక కుంభకోణాలు, భూ కబ్జాలు జరుగుతున్న తీరు చూస్తే బాధ కలుగుతోంది. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, అరెస్టుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలోకి రాకున్నా నేను ఒకటి రెండుమార్లు తప్ప బయటకు రాలేదు. ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చారు. మంచి జరగాలని కోరుకున్నా.. కానీ ఎక్కడ చూసినా చిల్లర మాటలు తప్ప ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం, గొప్ప స్కీమ్ లేదు. అందుకే జీవన్రెడ్డి లాంటి నాయకుడు ‘‘కాంగ్రెస్ పోవాలే.. బీఆర్ఎస్ రావాలే అంటున్నడు’’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మొదటి సంతకంతోనే హైడ్రా రద్దు ‘మేము మూడున్నర లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే హైడ్రాతో పిల్లలు పుస్తకాలు కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా ఇండ్ల కూల్చివేతలు చేస్తున్నరు. హైడ్రాను జిల్లాల్లో కూడా తెస్తామని పీసీసీ అధ్యక్షుడు చెప్తున్నాడు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం’ అని కేసీఆర్ మండిపడ్డారు. జీవన్రెడ్డి.. నేను దగ్గరి మిత్రులం‘జీవన్రెడ్డి గురించి ఎక్కువ చెప్తే మాది మేము డబ్బా కొట్టుకున్నట్లు అయితది. 45 ఏండ్ల నుంచి దగ్గరి మిత్రులం అయినా భిన్న రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడివిడిగా పనిచేశాం. కానీ మంచి చెడ్డలు, కష్టసుఖాలు, అభిప్రాయాలు కలిసి పంచుకునే వాళ్లం. జగిత్యాల ప్రాంతం గురించి ప్రాణం పెట్టి పనిచేసిన నాయకుడు జీవన్రెడ్డి. నేను సీఎం అయిన తరువాత కరీంనగర్లో సభ పెడితే అక్కడికి వచ్చి బోర్నపల్లి బ్రిడ్జి అవసరం అని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడిగారు. వెంటనే రూ. 80 కోట్లు మంజూరు చేసి బ్రిడ్జి కట్టించిన. ఇటీవల కొన్ని సర్వేలు జరిగితే బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరిక ఆటంబాంబుగా పేలడంతోపాటు జగిత్యాలతోపాటు పొరుగు నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఉంటుందని తేలింది. నేనూ, జీవన్రెడ్డి అన్నదమ్ముల్లా, పారీ్టకి పిల్లర్లుగా పనిచేస్తాం. ఆయన జగిత్యాల, పాత కరీంనగర్ జిల్లాలకే పరిమితం కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల బాధ్యతలన్నీ చూసుకోవాలి. అందుకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచే అపాయింట్ చేస్తున్నా. ఆరు నూరైనా.. వచ్చేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఇది నామాట. జగిత్యాల యుద్ధం కార్యకర్తల వంతు. తెలంగాణ యుద్ధం మా వంతు’ అని కేసీఆర్ ప్రకటించారు. అలిశెట్టి కవితతో ప్రారంభం జగిత్యాలకు చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ కవితతో కేసీఆర్ తన ప్రసంగం ప్రారంభించారు. ’చీకట్లో దడుసుకుంటే.. ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై బయపెడుతది.. గుండెంటూ ఉంటే ... అదే నీకు సైన్యం అయి నిలుస్తది’ అన్నారు. ఈ సభకు వచ్చిన మీరు, రోడ్ల మీద అశేషంగా నిలిచిన జీవన్రెడ్డి అభిమానుల ఆశీర్వాదంతో నాకు గుండె ధైర్యం వచ్చింది. జీవన్రెడ్డి అన్నకు, ఆయన వెంట వచ్చిన వారికి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా స్వాగతం’ అంటూ కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. ⇒ ’బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకంతోనే హైడ్రాను రద్దు చేసి ఎత్తి చెరువులో పడేస్తం. మూసీ ప్రాజెక్టుతో వెనుక రియల్ ఎస్టేట్ దందా ఉంది. పాలమూరు ఎత్తిపోతల పథకం సహా ప్రాజెక్టులను పండబెట్టి అబద్దాలు ఆడుతున్నారు’ ⇒ ‘కాంగ్రెస్ మాటలు కోటలు దాటాయి. కాకికి పెడదామంటే కుష్కడు లేవు... పిట్టకు పెడదామంటే పిడికెడు లేవు అన్నట్లుగా ఉంది. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దోపిడీతో ఎవరూ సంతృప్తిగా లేరు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు’ ⇒ ‘దరిద్రులకు రాజ్యం అప్పజెప్తే రైతుల పొలాలు ఎండుతున్నాయి. తెలంగాణ రైతాంగానికి ఇది జీవన్మరణ సమస్య. రైతు బంధుకు రాం..రాం.. దళితబంధుకు జై భీమ్ అంటరని, మోసపోతే గోస పడతామని ఎన్నికకు ముందు చెప్తే నా మాటను కొందరు వినలేదు’ -
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’
సాక్షి,జగిత్యాల: ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగం జీవన్ రెడ్డి గుండె ధైర్యమున్నోడు40ఏళ్ల నుంచి జీవన్రెడ్డి,నేను స్నేహితులం భిన్న రాజకీయ సిద్ధాంతాలతో వేర్వేరు పార్టీలో పనిచేశాంతెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం బీఆర్ఎస్లో చేశారుజగిత్యాల ప్రాంతం కోసం ప్రాణం పెట్టి పనిచేశారుఎమ్మెల్యేగా,మంత్రిగా చిత్తశుద్ధితో పనిచేశారుతన ప్రాంత అభివృద్ధి కోసం జీవన్ రెడ్డి ఏదైనా చేస్తారుజీవన్ రెడ్డి ప్రజా జీవితం ఎంతో మందికి ఆదర్శంపదవులు జీవన్రెడ్డికి కొత్తకాదుబీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్రెడ్డి నియామకంసభలో ప్రకటించిన కేసీఆర్ఒకే కుటుంబంలో అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని జీవన్రెడ్డికి చెప్పామేం అధికారంలోకి రాగానే జీవన్రెడ్డికి మంచి పదవి కల్పిస్తాకరీంనగర్ జిల్లాకే కాదు.. పక్క జిల్లాల్లో కూడా జీవన్రెడ్డి పని చేయాలితెలంగాణ రాకముందు ఎంత కష్టం ఉండేదిఆనాడు చంద్రబాబు భయంకరంగా కరెంట్ ఛార్జీలు పెంచారుఛార్జీలు తగ్గించాలని నిరసన చేస్తే పట్టపగలు కాల్చి చంపారుపక్షిలాగా రాష్ట్రం మొత్తం తిరిగితే..ఉద్యమం బలపడిందితెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అని ముందుకు సాగాంఐదేళ్లలో మిషన్ బగీరథ పూర్తి చేసి ఓట్లు అడిగాంపదేళ్లలో ఎంత అభివృద్ధి చేశామో ప్రజలకు తెలుసుమా హాయంలో మిషన్ భగీరథలో వచ్చిన నీళ్లు ఇప్పుడు ఎందుకు రావడం లేదునూటి నూరుశాతం మళ్లీ బీఆర్ఎస్సే వస్తుందిజీవన్ రెడ్డిని మంచి పదవిలో చూస్తారుజీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించిన కేసీఆర్ఇవాళ తెలంగాణా అగమ్యగోచరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందివినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడితే తెలంగాణా అనొద్దని నాడు దాడి చేసిన్రుచంద్రబాబు నాడు కరెంట్ ఛార్జీలు పెంచితే నేను ఉత్తరం రాశాతెలంగాణా ఉద్యమం చేస్తానని హెచ్చరించాబషీర్ బాగ్లో రైతులపై కాల్పులు జరిపిన బాబు పాలనపై ధ్వజమెత్తి ఉద్యమాన్ని ఆరంభించానురోశయ్య 14 ఎఫ్ అని ఓ జీవో తెచ్చి తెలంగాణా వారికి ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాడుఆనాడే ఆమరణ దీక్షకు బయల్దేరాచిదంబరం ప్రకటన తర్వాత హైడ్రామా క్రియేట్ చేశారువచ్చిన తెలంగాణాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు క్లిష్టమైన విషయంబిహార్లో పని చేస్తున్న జీఆర్ రెడ్డి అనే చొప్పదండి ఇంజనీర్ను పిలిపించుకుని ప్రణాళిక రూపొందించుకున్నాంమిషన్ కాకతీయ వంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చాంమిషన్ భగీరథ పూర్తి చేయకుంటే ఓట్లడగనని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా.. నేను తప్ప.. ?మాజీ మంత్రి జీవన్రెడ్డి.. బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. దీనిలో భాగంగా జీవన్రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన భారీ సభకు ఇరువురు విచ్చేసిన అనంతరం జీవన్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. జీవన్రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు కేసీఆర్. 40 మంది అనుచరులతో పాటు బీఆర్ఎస్లో చేరారు జీవన్రెడ్డి. ఇటీవల తన 40 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానానికి జీవన్రెడ్డి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్పై అసంతృప్తిలో బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు జీవన్రెడ్డి. జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్లో చేరికతో అధికార కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. జగిత్యాల సభతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఊపందుకుంది. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు.ముందుగా జీవన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధికి రాజకీయాలు లేవంటూ మండిపడ్డారు. 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా చేసిన ఘనత కేసీఆర్ది అంటూ కొనియాడారు. కేసీఆర్ ఆలోచన, దూరదృష్టితోనే తెలంగాణలో జిల్లాలు పెరిగాయన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతోనే జగిత్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చిందన్నారు. రైతాంగానికి 24 గంటల విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. -
కేసీఆర్ నన్ను అక్కున చేర్చుకున్నారు: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగిత్యాల జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కూడా ఉండబోతోందన్నారు. రాజకీయంగా తాను విభేదించినా కేసీఆర్ మాత్రం తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ ప్రాజెక్టుతో మాత్రమే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుంది. తుమ్మిడిహట్టి కట్టాలని నేను డిమాండ్ చేసిన మాట వాస్తవమే. కానీ, కాళేశ్వరంతో పెద్ద సంఖ్యలో రైతాంగానికి మేలవుతుంది. మళ్లీ తుమ్మిడిహట్టి నిర్మాణం కావాలన్నా కేసీఆర్ రావాల్సిందే. మేడిగడ్డ మీద ఎన్డీఎస్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చి ఏడాదైతే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు. పునరుద్ధరణ ఎప్పుడు పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు.అలాగే, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం నా రాజకీయ భవిష్యత్తుపై మనస్థాపం చెందాను. రాజకీయంగా నేను విభేదించినా కేసీఆర్ పెద్ద మనసులో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన తెలంగాణా పరిస్థితులపై ఈరోజు సభ ఉండబోతోంది. జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జగిత్యాల బీఆర్ఎస్ సభపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనను బీఆర్ఎస్ నేతలు క్రాస్ బ్రీడ్ అని సంబోధించడంపై మండిపడ్డారు. తాజాగా సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ..‘జగిత్యాల సభతో ఒరిగేదేమీ లేదు. కేసీఆర్, కేటీఆర్ను వందల సార్లు తిట్టిన జీవన్ రెడ్డి చేరికపై ప్రజలందరికీ స్పష్టత ఉంది. బీఆర్ఎస్ సభకు నాకు ఆహ్వానం లేదు. నేను మేడిగడ్డకు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నాను. నా చివరి అంకం వరకు ఇక కాంగ్రెస్తోనే నా ప్రయాణం’ అని వ్యాఖ్యలు చేశారు. -
నిప్పుల కొలిమి.. జాగ్రత్త సుమీ
కరీంనగర్ అర్బన్: ప్రచండ భానుడి ప్రతాపానికి సకల వర్గాలు సతమతమవుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూతో మానవులతో పాటు జంతువులు, పంటలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో ఇప్పటికే పలువురు వడదెబ్బతో మరణించారు. గతకొన్ని రోజులుగా 40–43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అరెంజ్ అలర్ట్ జోన్లో ఉండగా రానున్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన పదార్థాలేంటీ వంటి వివరాలను వివరించారు. ఉష్ణోగ్రతలు హెచ్చరిక స్థాయికి చేరినందున రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కూరగాయల తోటలకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీరు కట్టాలి. టమాట తోటకు నీడ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. షెడ్నెట్ వేసుకుంటే మరీ మంచిది. పండ్ల తోటలకు పెద్దగా ఇబ్బంది లేదు. మామిడికి కోతకు ఒక నెల ముందు నుంచే నీటి సరఫరా నిలిపివేయాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కాయ నాణ్యతగా పెరుగుతుంది. రుచికరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయలు, ఆకు కూరలకు ఉదయం, సాయంత్రం వేళలో నీటిని అందించాలి. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిని ఇవ్వకూడదు. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా పట్టుపరిశ్రమ, ఉద్యాన శాఖ అధికారి ఎండల వేళ పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మూడు పూటలు నీరు అందించాలి. మధ్యాహ్నం వేళలో పశువులపై నీటిని జలకరించాలి. నీడ ఉండే ప్రాంతాల్లోనే పశువులను ఉంచాలి. గ్రామాల్లో ఉండే నీటి తొట్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో నింపాలి. మూడు భాగాలు ఎండు గడ్డితో పాటు ఒక భాగం పచ్చిగడ్డి వేయాలి. పెంపుడు కుక్కలు అధిక ఉష్ణోగ్రతలకు చిరాకు పడుతుంటాయి. ఆయాసం, ఆకలి ఉంటుంది. ఫుడ్, వాటర్ సకాలంలో ఇవ్వాలి. వాటికి నీడ చల్లగా ఉండేలా చూడాలి. కోళ్ల ఫారాల్లో గన్నీసంచులను చుట్టూ కట్టడంతో పాటు పైన గడ్డి లేదా తుంగను కప్పాలి. రెండు గంటలకోసారి నీటితో తడపాలి. – తుమ్మల కిరణ్కుమార్రెడ్డి, పశు వైద్యులు మండుటెండలో స్వీయ జాగ్రత్తలే రక్ష -
హార్వెస్టర్ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం
పెగడపల్లి: పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్తోపాటు వ్యవసాయ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని నందగిరిలో ఆదివారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాలకాల లింగయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు వివాహమైంది. లింగయ్య జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. నర్సవ్వ బీడీకార్మికురాలు. పెద్ద కుమారుడైన మధు (35) డైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. గ్రామానికి చెందిన దనాల పర్శరాం అనే యజమానికి హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ రైతు వరిపంటను కోసేందుకు వెళ్లిన మధు ప్రమాదవశాత్తు హార్వెస్టర్తో పాటు వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో మధు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్కుమార్ ప్రమాదస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో హార్వెస్టర్ను బయటకు తీయించి, గజ ఈతగాళ్ల సహాయంతో మధు మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మధుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అడ్లూరి డ్రైవర్ మధు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న ఆయన మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇందిరమ్మ ఇంటితోపాటు కావ్యకు విద్యార్థత ఆధారంగా అంగన్వాడికేంద్రంలో హెల్పర్, లేదా మధ్యాహ్న భోజనం కేర్టేకర్, ఔట్సోర్స్ ఉద్యోగావకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచ్ రజిత ఉన్నారు. నందగిరిలో విషాదం -
చట్నీలో గడ్డిపురుగు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ ఇడ్లీ సెంటర్లో చట్నీలో గడ్డిపురుగు వచ్చింది. అజయ్ అనే వ్యక్తి పూరి తినేందుకు ఆ హోటల్కు వెళ్లాడు. పూరితోపాటు చట్నీ వేసుకున్న అతడికి గడ్డిపురుగు రావడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే యాజమాన్యానికి చూపించినా.. నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని బాధితుడు పేర్కొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆయన స్పందించలేదని ఆరోపించాడు. గంజాయి విక్రేతల అరెస్ట్మెట్పల్లి: మెట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మెట్పల్లికి చెందిన మల్యాల చందు, కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన బాణాల రాజుల కొంతకాలంగా మెదక్ జిల్లా నుంచి గంజాయిని ఇక్కడకు తీసుకొచ్చి అర్బన్ హౌజింగ్ కాలనీలోని ఓ ఇంట్లో చిన్న ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఇంటిపై దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి 140గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పీఎంఐకి దరఖాస్తులు ఆహ్వానం రామగుండం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. శిక్షణ(ఇంటర్న్షిప్) సమయంలో ప్రతీ అభ్యర్థికి నెలకు రూ.9,000 అందిస్తారు. శిక్షణకాలం కంపెనీలను బట్టి 6, 9, 12 నెలలు ఉంటుంది. ఆసక్తిగలవారు ((httpr://pmintern ship.mca.gov.in)) లేదా ((myrcheme.gov.in/ rchemer/pmir) పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలి. -
బోగస్ క్రీడా సంఘాలను నమ్మొద్దు
● తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలో కిక్ బాక్సింగ్ పేరిట పలువురు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అవి అన్ని బోగస్ క్రీడాసంఘాలని తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ ఏదైనా క్రీడా సంఘం ఏర్పాటైతే అది తెలంగాణ ఒలంపిక్ సంఘం, జాతీయ ఫెడరేషన్, భారత ప్రభుత్వం గుర్తింపు పొంది ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గుర్తింపు ఉందని ఈ సంఘం ఆధ్వర్యంలోనే ఏటా రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి, జాతీయ పోటీలకు తెలంగాణ జట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. కొందరు మోసపూరితంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను, పాఠశాలల యాజమాన్యాలను తప్పుదోవపట్టిస్తున్నారని వాటన్నింటని నమ్మవద్దని హితవు పలికారు. తెలంగాణ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో జారీ చేసిన క్రీడా సర్టిఫికెట్లలకు ట్రిపుల్ఐటీ, ఎంసెట్ తదితర ఉన్నత విద్యకు స్పోర్ట్స్ కోటా వర్తిస్తుందన్నారు. తెలంగాణలో 25 జిల్లాల్లో కిక్ బాక్సింగ్ సంఘాలున్నాయని, ఇవన్ని ఒలంపిక్ సంఘంలో గుర్తింపుపొందాయని తెలిపారు. అనధికార సంస్థలు లేదా టోర్నమెంట్లు నిర్వహిస్తున్న వారు మానుకోవాలని హెచ్చరించారు. బోగస్ లేదా అనధికార సంస్థలు నిర్వహించే ఈవెంట్స్లో పాల్గొంటే అందులో పొందిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కిక్ బాక్సింగ్ సంఘాల కార్యదర్శులు, కోచ్లు సురభి అన్వేష్, వి.శ్రీనివాస్, సురభి ఇంద్ర, ఎ.సంజీవ్, ఎస్.వినీశ్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేతచందుర్తి(వేములవాడ): అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను ఆదివారం చందుర్తి పోలీసులు పట్టుకున్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ శివారులో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా అక్రమంగా తరలిస్తునట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిసింది. పట్టుకున్న టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ప్రచారంతో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. -
నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు
● ఈనెల 22 నుంచి 30 వరకు.. ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 22 నుంచి 30 వరకు చేపట్టే ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు, లడ్డూప్రసాదాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 6 గంటలకు బిందే తీర్థం, 8 గంటలకు పుణ్యవచనం, కలశస్థాపన, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 25న అన్నకూటోత్సవం, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవోత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న స్వామివారల జయంతి ఉత్సవం నిర్వహిస్తారు. -
హెల్మెట్ ధరించి.. సైకిల్ సవారీ
వేములవాడరూరల్: వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొంత మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. కానీ, 70 ఏళ్ల వృద్ధ రైతు హెల్మెట్ ధరించి సైకిల్పై రోజూ మార్కెట్కు వెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వేములవాడ మున్సిపల్ పరిధి కోనాయపల్లికి చెందిన సాయిని నారాయణ 50 ఏళ్ల నుంచి సైకిల్ వాడుతున్నాడు. సైకిల్పై ఇంటి నుంచి బయటకు వచ్చాడంటే హెల్మెట్ ధరిస్తాడు. ఆయన సైకిల్కు చార్జింగ్ బ్యాటరీ ఏర్పాటు చేసుకున్నాడు. తాను పండించిన పంటలను కోనాయపల్లి నుంచి వేములవాడ మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తాడు. 70 ఏళ్ల వయస్సులో కూడా నారాయణ హెల్మెట్ ధరించి సైకిల్పై రావడంతో పలువురు అభినందిస్తున్నారు. -
ఉద్యాన సాగుకు ఊపిరి
కరీంనగర్ అర్బన్: మూస ధోరణిలో పంటల సాగు కాకుండా ప్రజారోగ్యం, అవసరాల క్రమంలో సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు పత్తి, వరి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, జొన్నలు, అవిసెలు, ఉలవలు, పెసర, కంది, మినుములు, శనగ వంటి పంటలకు ప్రాధాన్యతనిచ్చేవారు. కాలక్రమేణా పత్తి, వరి సాగే సింహభాగం కాగా ఇతర పంటలు కనుమరుగయ్యాయి. ఇక కూరగాయల సాగు అంతంతమాత్రమే. ఇతర రాష్ట్రాలు, జిల్లాలపై ఆధారపడాల్సిన దుస్థితి. దీంతో రవాణా ఖర్చులు, ఏజెంట్ కమీషన్ తదితర కారణాలతో వాటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సదరు సమస్యకు పరిష్కారంగా కూరగాయలను పెద్దఎత్తున పండించాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో పలువురు రైతులను గుర్తించి వలంటీర్లుగా శిక్షణనిస్తోంది. 30 ప్యాక్స్లు.. 30మంది వలంటీర్లు పీఏసీఎస్కు ఒకరి చొప్పున వలంటీర్లను ఎంపిక చేయగా ఇప్పటికే రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఽఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. ఈ నెల 18న జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో మలిదశ శిక్షణనిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని 30 ప్యాక్స్లకు 30 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వారంతా తాము నేర్చుకున్న మెలకువలను రైతులకు వివరించి కూరగాయల రైతులను చైతన్యవంతులను చేయనుండగా బాసటగా నిలువనున్నారు. ఒక్కో వలంటీరు.. వంద ఎకరాలు ఒక్కో వలంటీరు వంద ఎకరాల చొప్పున కూరగాయల పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సదరు లెక్కన 300 ఎకరాలలో కూరగాయలు పండించేలా కృషి చేయనున్నారు. విస్తీర్ణం పెరుగనుంది. తద్వారా విస్తీర్ణం మరింత పెరగనుందన్నది ప్రభుత్వ భావన. ఉచితంగా నారు ఇవ్వనుండగా టమాట, వంకాయ, మిర్చి వంటి వాటిని గరిష్టంగా 5ఎకరాల వరకు ఇవ్వనున్నారు. 50శాతం రాయితీతో ప్లాస్టిక్ మల్చింగ్ ఎకరానికి రూ.8వేల చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇవ్వనుండగా 50శాతం రాయితీతో యూనిట్(అర్ధ ఎకరం)కు రూ.50వేల చొప్పున ఇవ్వనున్నారు. శాశ్వత పందిళ్లు వేసుకోలేని వారికి కట్టెలతో స్టేకింగ్ కోసం 50శాతం రాయితీతో ఎకరానికి రూ.4వేలు, నీరుపారుదలకు డ్రిప్ లేదా స్ప్రింక్లర్ రాయితీపై ఇస్తారు. ఇక సాగుకు కావాల్సిన స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర వాటిని 40–50శాతం రాయితీతో ఇవ్వనున్నారు. వర్మీకంపోస్ట్ తయారీకి 50శాతం రాయితీ, పండిన పంటను ప్యాక్ చేయడం, మిగిలిన వాటిని ఉంచడం కోసం ప్యాక్ హౌస్ 50శాతం రాయితీ, అంతేకాకుండా సోలార్ డ్రయర్, పాలీహౌస్, షెడ్నెట్, ఫామ్పాండ్స్ వంటి వాటిని రాయితీపై ఇవ్వనున్నారు. మూడు చోట్ల విత్తనోత్పత్తి వ్యవసాయశాఖ, నాబార్డు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో జిల్లాలోని మూడు సహకార సంఘాల పరిధిలో విత్తనోత్పత్తి చేయనున్నారు. వరితో పాటు పెసర, కంది పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట ప్రాంతాల్లో ఒక్కో సంఘం పరిధిలో 10ఎకరాలు సాగు చేయాలని నిర్ణయించారు. ఆదర్శ రైతులను ఎంపిక చేసి వారి ద్వారా సాగు చేయించనున్నారు.ప్రభుత్వమిచ్చే రాయితీని వినియోగించుకుని రైతులు కూరగాయల సాగు చేసుకోవాలి. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులే విక్రయించుకునేలా గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ సౌకర్యం ఉంటుంది. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సహకార సంఘాల పరిధిలో వలంటీర్ల నియామకం 30 ప్యాక్స్లలో 300 ఎకరాల్లో సాగుకు రైతుల ఎంపిక సాగుకు ప్రభుత్వ రాయితీ, ప్రోత్సాహం -
వృద్ధులు, చిన్నారులు పైలం
వేసవిలో గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇంట్లోనూ మంచి నీటిలో ఉప్పుచక్కెర వేసుకుని తాగాలి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడొద్దు. వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పొట్లాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగాలి. చలువైన వస్తువులు వాడాలి. నీటిని తాగుతూ ఉండాలి. ఏ సమయంలోనూ అజాగ్రత్త వహించకుండా బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు నీటిని తాగుతూ ఉండాలి. – సాయిని నరేందర్, ఎండీ పల్మనాలజిస్ట్ వేసవిలో వాహనాల్లో గాలిని తరచూ చెక్ చేసుకోవాలి. నేరుగా ఎండ పడే చోట వాహనాన్ని నిలుపరాదు. నీడ ఉంటే చోటే నిలుపాలి. ఇంజిన్ అత్యధికంగా వేడెక్కితే డ్యాష్బోర్డులోని చెక్ ఇంజిన్, ఓవర్ హీట్ గుర్తులు బ్లింక్ అవుతుంటాయి. అప్రమత్తమై కూలంట్, రెడియేటర్ క్యాప్ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, ఏసీ కంప్రెసర్, వాటర్ లెవల్స్ తరచూ చెక్ చేస్తుండాలి. ఎండ అత్యధికంగా ఉండే మధ్యాహ్నం సమయంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. వీలైతే అసలు ప్రయాణం చేయకుండా ఉంటేనే మేలు. లాంగ్ టూర్ వెళ్లేవారు 50కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. కారు, బైక్ వేటిలో ప్రయాణించినా అత్యవసరంలో ఉపయోగపడేలా రకరకాల సైజుల స్క్రూడ్రైవర్లు, రెంచ్లు, జాకీ, టైరు ఐరన్, చేతికి గ్లౌజులు, చీకట్లో ఉపయోగపడే ఫ్లాష్లైట్ వెంట ఉంచుకోవాలి. – రమణ, మెకానిక్ -
ప్రజా ఆశీర్వాద సభ
ముస్తాబైన వేదిక నేడు జగిత్యాలలో కేసీఆర్ మీటింగ్జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హాజరుకానున్న ప్రజాఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. సభావేదికపై కేసీఆర్ సమక్షంలో మాజీమంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. మాజీమంత్రులు హరీశ్రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సభ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, దావ వసంత తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీవన్రెడ్డి ఫ్లెక్సీ చించివేత.. అనుచరుల నిరసన మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్, జీవన్రెడ్డి కలిసి ఉన్న ఫ్లెక్సీలో జీవన్రెడ్డి ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం స్థానికంగా కలకలం రేపింది. సభ విజయవంతం కోసం బీఆర్ఎస్ నాయకులు, జీవన్రెడ్డి అనుచరులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాత బస్టాండ్ చౌరస్తాలో కేసీఆర్, జీవన్రెడ్డి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జీవన్రెడ్డి ఫొటోను మాత్రమే చించివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజాఆశీర్వాద సభ కోసం పలుచోట్ల మినీస్టేడియం గోడలు కూల్చివేయడం చర్చనీయాంశమైంది. -
సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కథలాపూర్: మండలంలోని కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులను ఆదివారం పరిశీలించి అక్కడే నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. త్వరలోనే ప్రాజెక్టు కుడికాలువ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం వరకు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండేలా చూడాలన్నారు. నీటిపారుదలశాఖ ఈఈ ప్రకాశ్రావు, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు కల్లెడ గంగాధర్, రవి, హరిప్రసాద్, రాజారెడ్డి, అంజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో సమాచార కమిషనర్ పూజలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని ప్రధాన సమాచార కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్థానాచార్యులు శేషవస్త్రం కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ పర్యవేక్షకులు అశోక్, ఎస్సై నరేశ్కుమార్ పాల్గొన్నారు. నృసింహుడి సన్నిధిలో.. ధర్మపురి: అనంతరం చంద్రశేఖర్రెడ్డి ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయం తరఫున స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. 23న కో–ఆప్షన్ల ఎన్నికమెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. మొత్తం నలుగురు సభ్యుల ఎన్నికకు ఈ నెల 23న పాలకవర్గ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పదవుల కోసం 24మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రెండు మైనార్టీల పదవులకు 18మంది, మిగతా రెండు పదవులకు 8మంది దరఖాస్తు అందించారు. వీటిలో ఏవీ తిరస్కరణకు గురికాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా కో–ఆప్షన్ పదవులకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే కొందరు కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విందులు ఏర్పాటు చేయడంతో పాటు డబ్బులు ఆశ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. -
అహంకారంతో మాట్లాడుతున్న బీఆర్ఎస్
జగిత్యాల: పదేళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. జీవన్రెడ్డి భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్, హరీశ్రావు విమర్శిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి మేడిగడ్డ పరిశీలన 15రోజుల క్రితమే నిర్ణయించారని, కేసీఆర్ జగిత్యాలకు వస్తే సభ పెడుతున్నారని అనడం అవివేకమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ మంత్రిగా కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని ప్రశ్నించారు. సొంత డబ్బా కోసమే జగిత్యాలలో బహిరంగ సభ పెడుతున్నారని తెలిపారు. కొండగట్టులో 60 మంది బస్సు ప్రమాదంలో మరణిస్తే రాని కేసీఆర్ ఇప్పుడెందుకు వస్తున్నారో చెప్పాలన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ హరీశ్రావు, కేటీఆర్ కోడిగుడ్డుపై ఈకలు పీకే రకమన్నారు. సంక్షేమ పథకాల అమలు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2011, 2023లో మహిళాబిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. వరదకాలువను ఎల్లంపల్లి ద్వారా నింపితే కాళేశ్వరం నీరు అని అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ను అత్యధికంగా విమర్శించిన జీవన్రెడ్డి నేడు ఆప్తుడు కావడం శోచనీయమన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ తండ్రిపై రౌడీషీటర్ ఓపెన్ చేస్తే తాను తొలగించేలా చేశానని పేర్కొన్నారు. 2014లో గెలిచే అభ్యర్థి లేకుంటేనే తనను పిలిచి టికెట్ ఇచ్చారని, తాను రాజకీయాల్లోకి వచ్చాక కుటుంబ ఆస్తులు తగ్గాయని, దీనికి ఎలాంటి విచారణకై నా సిద్ధమన్నారు. ఎవరు క్రాస్ బ్రీడో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, గిరి నాగభూషణం, సమిండ్ల శ్రీను, కొత్త మోహన్, బండ శంకర్ పాల్గొన్నారు. -
ఆదా ఏదయా..!
కోరుట్ల: తొమ్మిది నెలల క్రితం పట్టణంలోని దెబ్బతిన్న రోడ్లకు టెండర్ పిలవకుండా అర్ధరాత్రి..అపరాత్రి తేడా లేకుండా పారిశుధ్య కార్మికులతో రిపేర్ చేయించి మున్సిపల్ డబ్బులు ఆదా చేస్తున్నామని చెప్పిన అఽధికారులు.. వీధి దీపాలకు విద్యుత్ సరాఫరాలో ఆ అంశాన్ని ఎందుకు విస్మరిస్తున్నారో అంతుచిక్కడం లేదు. వేసవిలో చిన్నపాటి ఆదా అంశం నెలకు రూ.లక్ష ఖర్చు తగ్గిస్తుందనడంలో సందేహం లేదు. అసలే జనరల్ ఫండ్ అరకొరగా ఉన్న సమయంలో మున్సిపల్ అధికారులు విద్యుత్ ఆదా విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విమర్శలు వస్తున్నాయి. 3 గంటలు ఆదా చేయచ్చు మున్సిపల్ అధికారులు చేస్తున్న పనిపై కాస్త నిబద్ధత చూపితే వేసవిలో ప్రతిరోజూ మూడు గంటల పాటు విద్యుత్ను ఆదా చేయొచ్చు. సాధారణంగా వేసవిలో సాయంత్రం 7.30 గంటల వరకు పొద్దుగూకడం లేదు. అదేవిధంగా ఉదయం 5 గంటలకే తెల్లవారుతుంది. మున్సిపల్ అధికారులు మాత్రం సాయంత్రం 5.30 గంటలకే వీధి దీపాలు ఆన్ చేస్తున్నారు. ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగిస్తున్నారు. ఈ లెక్కన ప్రతిరోజూ ఎంత లేదన్నా సుమారు మూడు గంటలపాటు అవసరం లేకున్నా విద్యుత్ను వృథా చేస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు కింది స్థాయి సిబ్బందికి సరైన సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. అధికారులే ముందు జాగ్రత్తతో ఆదాపై దృష్టి సారించాల్సి ఉండగా.. వేసవిలో సాయంత్రం తొందరగా విద్యుత్ దీపాలు వేసి కరెంటు చార్జీలు వృథా చేస్తున్నారని జనం విమర్శించే వరకు ఎలాంటి పట్టింపు లేని ధోరణితో వ్యవహరించడం గమనార్హం. నెలకు రూ.లక్ష ఆదా.. కోరుట్ల మున్సిపాలిటీలోని 33 వార్డుల్లో సుమారు 6,200 విద్యుత్ దీపాలు ఉన్నాయి. వీటికి తోడు 42 కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఉన్నాయి. వీటన్నింటికి కలిపి ప్రతినెలా సగటున రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కరెంటు బిల్లు వస్తోంది. మున్సిపాలిటీలో సిబ్బంది జీతాలు మినహాయిస్తే అధిక మొత్తంలో ఖర్చు చేసేది విద్యుత్చార్జీలకే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వేసవి కాలం సుమారు నాలుగు నెలలు గడిచేదాకా విద్యుత్ దీపాలు ఆన్ ఆఫ్ చేయడంలో కొద్దిపాటి ఏమరుపాటుతో వ్యవహరిస్తే ప్రతినెలా రూ.లక్ష వరకు విద్యుత్ బిల్లులు తగ్గే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా దుబారాగా విద్యుత్ వినియోగం చేస్తే మున్సిపల్ ఖజానాకు అనవసరంగా గండి పడుతుంది. మున్సిపల్ అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటే విద్యుత్ చార్జీలను ఆదా చేయచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
కేసీఆర్ సభకు రండి
జగిత్యాలరూరల్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో తన అనుబంధం ఈనాటిదికాదని, ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా నిర్వహించే సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో ఆదివారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమ సారథిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అని, గతంలో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయనపైనా పోటీ చేశానని, కాంగ్రెస్లో నాయకత్వలోపంతో పార్టీని వీడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతుబిడ్డగా, రైతు సంక్షేమం కోసం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని, మేడిగడ్డ వద్ద 300 టీఎంసీల నీటి లభ్యత ఇప్పటికీ ఉందని, బ్యారేజీని పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దావ సురేష్, జున్ను రాజేందర్, పెద్దన్న, ఎల్ల రాజన్న, ధర రమేష్బాబు, నరేష్ గౌడ్, శ్రీరాముల గంగాధర్ పాల్గొన్నారు. -
హామీలు అమలు చేయకుంటే సమ్మెనే..
జగిత్యాలటౌన్: ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించి కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడతానంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలని, లేకుంటే సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ శంకర్రెడ్డి హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం ఉదయం జగిత్యాల డిపో ఎదుట గేట్ ధర్నా నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పెండింగులో ఉన్న పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని, సిబ్బందిపై పనిభారం తగ్గించి, పనివేళలు క్రమబద్ధీకరించాలని, ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈనెల 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. నాయకులు రామయ్య, రజిత, రమేశ్రావు, ఫ్రాన్సిస్, కార్మికులు పాల్గొన్నారు. -
ఎండ 44.4 డిగ్రీలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండపల్లి మండలం గుల్లకోటలో 44.4 డిగ్రీలు, భీమారం మండలం గోవిందారంలో 41.4, కోరుట్ల, సారంగాపూర్, మల్లాపూర్, కొడిమ్యాల మండలం పూడూరులో 44.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్లో 44.1, కోరుట్ల మండలం అయిలాపూర్లో 44, రాయికల్ మండలం అల్లీపూర్లో 43.9, ధర్మపురి మండలం జైనా, మేడిపల్లిలో 43.7, పెగడపల్లిలో 43.6, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 43.5, నేరేళ్లలో 43.3, వెల్గటూర్, బీర్పూర్, కోల్వాయి, మెట్పల్లిలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు జగిత్యాలలో గులాబీ గర్జన
సాక్షి, హైదరాబాద్ /జగిత్యాల: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి టి.జీవన్రెడ్డి సోమవారం జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ సభను పార్టీ శ్రేణులు జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తున్నాయి. 2023లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి జగిత్యాల సభతో పూర్వ వైభవం సాధిస్తుందనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత... 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కేసీఆర్ అడపాదడపా మాత్రమే ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి ఎముక శస్త్ర చికిత్సతో కొద్దినెలలు ఎర్రవల్లి నివాసానికి పరిమితమయ్యారు. కొద్దిగా కోలుకున్న కేసీఆర్ 2024 ఫిబ్రవరి 13న ‘చలో నల్గొండ’పేరిట సభ నిర్వహించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఈ సభలో మండిపడ్డారు. 2024 ఏప్రిల్, మేలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రోడ్షోలు, బస్సుయాత్రలో కేసీఆర్ పాల్గొన్నారు. గత ఏడాది వరంగల్లో ‘రజతోత్సవం’ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద ‘రజతోత్సవ సభ’నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ భేటీలో కేసీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటంతో జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్రెడ్డి చేరికతో కొత్త ఉత్సాహం నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో అగ్రశ్రేణి నాయకుడిగా పేరొందిన మాజీమంత్రి జీవన్రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతుండటంతో పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి పార్టీకి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. జీవన్రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణలో పార్టీకి కొత్త ఊపునిస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. జగిత్యాల సభ వేదికగా బీఆర్ఎస్ ప్రస్థానం, పదేళ్ల పాలన, కాంగ్రెస్ పాలనావైఫల్యం వంటి అంశాలపై కేసీఆర్ ప్రసంగించే అవకాశముంది. పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. జగిత్యాల సభ బీఆర్ఎస్ ప్రస్థానంలో మైలు రాయిగా నిలవడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో ‘గేమ్ ఛేంజర్’గా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. లక్ష మందికి పైగా సభకు వచ్చేలా... జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు లక్షకు పైగానే జనాన్ని తరలించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేలా చర్యలు తీసుకున్నారు. జగిత్యాల సభలో పాల్గొనేందుకు కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.45కు ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరి వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్లో కేసీఆర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరంసాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి బహిరంగ సభ ప్రాంగణానికి కేసీఆర్ చేరుకుంటారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మినీస్టేడియం పట్టణం నడి»ొడ్డున ఉండటంతో అత్యధికంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ రెండుసార్లు పర్యటించి ప్రజల కోసం 3 లక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. -
క్షయను నివారించాలి
● డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ జగిత్యాలరూరల్: క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పొలాసలో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు రావడం, సాయంత్రం జ్వరం, అకారణంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే తెమడ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 46 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కల్లెడ పీహెచ్సీ వైద్యాధికారి సౌజన్య, ఎంఎల్హెచ్పీ సౌమ్య, సూపర్వైజర్ మంకిడి శ్రీనివాస్, ఎస్టీఎస్ శ్రీనివాస్, ఏఎన్ఎం స్వరూప, ఆశా కార్యకర్తలు మల్లీశ్వరి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి చేరాలి జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు కూరగాయలు పండించడంతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి కట్ట లత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ ల ఆధ్వర్యంలో శనివారం వెజిటేబుల్ వలంటీర్లకు కూరగాయల సాగుపై శిక్షణ కల్పించారు. కూరగాయలు, పండ్లు, పూలతోటలు సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నా రు. కూరగాయ నారును ములుగు ఉద్యాన నర్సరీ నుంచి ఉచితంగా సరఫరా చేయనున్న ట్లు తెలిపారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ.. రాబోయే వానకాలంలో దొడ్డురకాలకు బదులు సన్నరకాలు సాగు చేయాలన్నారు. యూరి యా వాడకం తగ్గించి, నానో వాడాలని కోరా రు. సహకార శాఖ సూపరింటెండెంట్ అసద్, ఉద్యాన శాఖ అధికారులు శ్యాంప్రసాద్, స్వాతి, అర్చన, శ్రీనివాస్, అధికారులు, డ్రిప్ కంపెనీల సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల ఏఎస్పీగా చేతన్ నితిన్జగిత్యాలక్రైం: జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పాండేరి చేతన్ నితిన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చేతన్ ప్రస్తుతం జనగామ ఏఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డల ఆరోగ్యంజగిత్యాలరూరల్: పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్వైజర్ లత అన్నారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం రేచపల్లిలో పోషణపక్వాడా నిర్వహించారు. ఆహారం తినిపించే సమయంలో పిల్లలతో మాట్లాడటం ద్వారా.. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో ఆడిపించడం ద్వారా పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నా రు. సర్పంచ్ బాస మహేశ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోడ రెడ్డి, ఏఎన్ఎం శారద, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రజాచైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణజగిత్యాలక్రైం: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం రావాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సైదులు అన్నారు. జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణ చర్యలపై దృష్టి సారించాలన్నారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
కేసీఆర్ సభను అడ్డుకునేందుకు కుట్ర
జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణాన్ని పార్టీ సీనియర్ నేతలతో కలిసి కేటీఆర్, హరీశ్రావు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కేసీఆర్ సభ ఏర్పాటుతో జగిత్యాలలో పండుగ వాతావరణం ఏర్పడిందని, జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని, జాతీయ రహదారులు కూడా తవ్వారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ముందుకెళ్తామన్నారు. సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మూడు లక్షల వాటర్బాటిళ్లు తెప్పిస్తున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి ఒకరికి బాధ్యతలు ఇచ్చామని, ఎండల తీవ్రను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. సాయంత్రం 5.30 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ సభ ప్రాంగణానికి చేరుకుంటారని, ఎండ చల్లబడిన తర్వాత సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు. కేసీఆర్ మాటల కోసం ఎదురుచూపు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారని రైతులు, మహిళలు, విద్యార్థులు, పెద్దలందరూ ఎదురుచూస్తున్నారని హరీశ్రావు, కేటీఆర్ అన్నారు. ఇది ప్రజల సభ అని, తమకు ఆతిథ్యం ఇస్తున్నారని, చాలాకాలం తర్వాత కేసీఆర్ వస్తుండడంతో పండుగ వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, కౌశిక్రెడ్డి, సంజయ్, లక్ష్మీనారాయణ, ఆర్కే.ప్రవీణ్, దావ వసంత, బాపురెడ్డి, రమణారావు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
జగిత్యాలటౌన్: రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీమంత్రి జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ సన్నాహక సమావేశం పట్టణంలోని దేవిశ్రీగార్డెన్లో శనివారం నిర్వహించారు. సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నాలుగు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన తాను 20నెలలుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఉద్వేగానికి గురయ్యారు. రేవంత్రెడ్డి పాలనలో కేబినెట్ సహచరులు తప్ప అన్నివర్గాలు దోపిడీకి గురవుతున్నాయని, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు సొంత పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. ఈనెల 20న జగిత్యాలలో బహిరంగ సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నానని అన్నారు. రైతులు, రైతు కూలీలు, కార్మిక, కర్షకులతో ఆనాడు జగిత్యాలలో నిర్వహించిన జగిత్యాల జైత్రయాత్ర యావత్ సమాజాన్ని మేల్కొలిపినట్లుగానే కేసీఆర్ బహిరంగ సభ యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేస్తుందన్నారు. రాబోయే రెండేళ్లు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ దిక్సూచి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు ఊరువాడ తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్మెన్లు విజయలక్ష్మి, జీఆర్.దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సభనా.. జీవన్రెడ్డి చేరిక సభనా..?
జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఈనెల 20న నిర్వహించేది బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభనా..? జీవన్రెడ్డి చేరిక సభనా.. బీఆర్ఎస్ నాయకులు తెలపాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శనివారం మోతె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, జగిత్యాల సభపై కేటీఆర్, హరీశ్రావు క్లారిటీ ఇవ్వాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో జన సమీకరణ చేస్తున్నారని ఆరోపించారు. కేవలం 12 నుంచి 15వేల మంది పట్టే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని పెట్టి జన సమీకరణ చేస్తున్నారని తెలిపారు. సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి పార్టీని వీడటం బాధాకరంగా ఉందని, ఆయన ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ గొప్పగా పనిచేస్తుందని జీవన్రెడ్డి చెబుతున్నారని, 2023లో ప్రజలు ఎందుకు తిరస్కరించారో చెప్పాలన్నారు. జీవన్రెడ్డి తరచూ సీఎంను విమర్శించడం తగదన్నారు. పేదలకు రేషన్కార్డులు ఇచ్చినందుకా.. ఇందిరమ్మ ఇళ్లు కట్టించిందుకా.. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందుకా..? రేవంత్ ఎందుకు దిగిపోవాలో చెప్పాలన్నారు. జీవన్రెడ్డికి రాజ్యసభ, సలహదారు పదవి ఇవ్వనందుకే పార్టీ మారారని ఆరోపించారు. జీవన్రెడ్డి చెల్లని రూపాయి అని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని, నేడు ఎలా చెల్లుబాటు అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని, జీవన్రెడ్డి పార్టీ మారినా నష్టమేమీ లేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 60మంది చనిపోతే రాని కేసీఆర్ జైత్రయాత్ర పేరుతో జగిత్యాలకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, బండ శంకర్ పాల్గొన్నారు. -
‘ఉపాధి’ లక్ష్యాలు చేరుకోవాలి
● పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి ● కలెక్టర్ బి.సత్యప్రసాద్మల్లాపూర్: ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి పనుల పురోగతిపై అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. కూలీల సంఖ్య పెంపుపై చర్చించారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికీ పని కల్పించాలని పేర్కొన్నారు. సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పనిని ఫొటో క్యాప్చరింగ్ ద్వారా ఎన్ఎంఎంఎస్ యాప్లో నమోదు చేయాలన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నీడ, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. మెట్పల్లి ఆర్డీవో నరసింహరావు, డీఆర్డీవో రఘువరణ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో జగదీష్, ఏపీవో సతీష్, సీనియర్ అసిస్టెంట్ మహేశ్ పాల్గొన్నారు. జనగణన చేపట్టాలి జగిత్యాల: జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. ఎన్యుమరేట్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఇంటి వివరాల సేకరణ, డిజిటల్ పద్ధతిలో డేటా నమోదు, ప్రజలతో వ్యవహరించే తీరు, గోప్యత, పరిరక్షణ వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన, రూరల్ తహసీల్దార్ హకీం, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.రాయికల్ ఠాణా పరిశీలించిన ఎస్పీరాయికల్: పట్టణంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ అశోక్కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిష్టర్లు పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సుధీర్రావు ఉన్నారు. నేడు ‘మోడల్’ ప్రవేశ పరీక్షజగిత్యాల: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2026–27 సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు.. 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్లకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. 14 కేంద్రాల్లో 2,972 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. -
సత్వర న్యాయ సేవల విస్తరణే లక్ష్యం
కోరుట్ల: సత్వర న్యాయ సేవల విస్తరణే లక్ష్యంగా కోరుట్లలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభించామని హైకోర్టు జడ్జి రేణుకా యార అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కోర్టును శనివారం ప్రారంభించారు. కక్షిదారులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కోరుట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట ఆంజనేయులు మాట్లాడుతూ అదనపు కోర్టు ప్రారంభంతో పెండింగ్ కేసుల భారం తగ్గి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందుతుందని అన్నారు. కొత్త కోర్టుకు శాశ్వత న్యాయమూర్తిని నియమించాలని కోరారు. నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాలను ఆగస్టు వరకు పూర్తి చేసి ప్రారంభించుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా జడ్జి రేణుక నిర్మాణంలో ఉన్న నూతన కోర్టు భవనాలను పరిశీలించారు. ఆమె రాకతో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లా సెషన్స్ జడ్జి సి.రత్న పద్మావతి, మొదటి అదనపు సెషన్స్ జడ్జి సునీతా రవీంద్రారెడ్డి, ఎస్పీ అశోక్ కుమార్, కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుతారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అంబల్ల నాగనిర్మల తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు జడ్జిని కలిసిన జగిత్యాల న్యాయవాదులు జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జిని జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో అదనంగా ఎస్సీ, ఎస్టీ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, వినియోగదారుల ఫోరం ఏర్పాటుతోపాటు ప్రస్తుతం ఉన్న కోర్టుపై అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
వామ్మో ఎండ..
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఉష్ణోగ్రతలు శనివారం 44.2 డిగ్రీలకు చేరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్లో అత్యధికంగా 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా భీమారం మండలం గోవిందారంలో 41 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయికల్ మండలం అల్లీపూర్లో 44.1, బీర్పూర్ మండలం కొల్వాయి, మేడిపల్లి మండలంలో 44, సారంగాపూర్, కోరుట్ల మండలం అయిలాపూర్, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 43.8, మెట్పల్లిలో 43.7, కోరుట్లలో 43.6, రాయికల్లో 43.5, మల్లాపూర్, ఎండపల్లి మండలం గుల్లకోటలో 43.4, బుగ్గారం మండలం సిరికొండలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి
జగిత్యాల: పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చి నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం ఎంపీ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. ఈ నెల 20న కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్న సందర్భంగా జగిత్యాలలో నిర్వహిస్తున్న సభాస్థలి ఏర్పాట్లను కేటీఆర్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు క్షమాపణ చెప్పాల్సిందిపోయి వెనుకేసుకొస్తున్నారని, కేసీఆర్ నాయకత్వంలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఒక్కటై తెలంగాణను సాధించుకున్నారన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఘాటైన జవాబు ఇచ్చేవారని, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉంటే కేంద్రమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్పై మాట్లాడితే దీటైన జవాబు ఇచ్చారని పేర్కొన్నారు. లోక్సభలో కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది ఎంపీలు ఉంటే కనీసం పల్లెత్తు మాట మాట్లాడలేదని, దిష్టి»ొమ్మల్లా ఉన్నారని చెప్పారు. తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే సీఎం రేవంత్రెడ్డి కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉంటేనే బిల్ పాస్ అవుతుందని, మెజారిటీ లేకున్నా ప్రవేశపెట్టి దేశంలోని మహిళలకు అన్యాయం చేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని, ఒకవైపు మహిళాబిల్లుపై కాంగ్రెస్ మద్దతివ్వలేదని, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ముట్టడించాలని బీజేపీ నాయకులు పిలుపునిస్తే.. సీఎం రేవంత్రెడ్డి మాత్రం కేంద్రమంత్రి శ్రీనివాస్వర్మ ఇంటికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్లో మహిళాబిల్లు, లోక్సభ సీట్ల పెంపు విషయంలో హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చారు...కానీ మహిళాబిల్లు విషయంలో సైతం మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలో జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఆయన చేరిక ఉత్తర తెలంగాణలో బలం ఇస్తుందని, విలువలతో రాజకీయం చేసే నాయకుడు జీవన్రెడ్డి అని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల నుంచి వస్తున్న మాట రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అన్నదే వినిపిస్తోందన్నారు. దానికి సంకేతమే బీఆర్ఎస్లో జీవన్రెడ్డి చేరిక అన్నారు. సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతున్నాయిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్సింహం బయటకు వస్తే గుంటనక్కలు భయపడుతు న్నాయని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ జగిత్యాలలో సభ నిర్వహిస్తుంటే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డలో నిర్వహిస్తారట...రెండేళ్ల తర్వాత మేడిగడ్డ గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాలలో హైబ్రిడ్ ఎమ్మెల్యే అని, ఏ పార్టీలో ఉన్నాడో ఆ ఎమ్మెల్యేకే తెలియదని సంజయ్కుమార్నుద్దేశించి అన్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, కాంగ్రెస్ నాయకుల్లో భయం పట్టుకుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటి సైతం అమలు చేయలేదని, కేసీఆర్ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా పార్టీ సమష్టిగా పనిచేసి ముందుకెళ్తామన్నారు. చాలాకాలం క్రితం జగిత్యాలలో సభ నిర్వహించామని, జీవన్రెడ్డి చేరికను అందరూ ఆహ్వానిస్తున్నారని తెలిపారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని, జగిత్యాల నుంచే మళ్లీ పునర్వైభవం సాధించేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కోసం జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతూ ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు రాజేశ్వర్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సంజయ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు. -
ఎన్ని కుట్రలు చేసిన సభ విజయవంతం చేస్తాం.. కేటీఆర్
జగిత్యాల : మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరికతో జగిత్యాలలో పండగ వాతావరణం నెలకొందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జగిత్యాలలో పార్టీనేతలతో కలిసి ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు. జగిత్యాల సభను ఎలాగైనా అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఎన్ని కుట్రలు చేసిన ఎట్టిపరిస్థితుల్లో సభను విజయవంతం చేసి తీరుతామన్నారు. రెండేళ్ల నుంచి మేడిగడ్డకు వెళ్లేందుకు సీఎంకు సమయం లేదా అని ప్రశ్నించారు. ఈ నెల 20న జరిగే సభకు సాయంత్రం 5.30 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల చేరుకుంటారని ఆయన రాకకోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన బిల్లు రాజకీయ కుట్రలో భాగమేనని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాయని ఆరోపించారు. కాగా ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ నెల 20 న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు కేసీఆర్ హాజరవుతారు. -
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్య
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ విద్య అందించడం జరుగుతుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్మండలం లక్ష్మీపూర్లో రాంకీ గ్రూప్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహం, బాస్కెట్బాల్ కోర్టును శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రత్యేక నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో చల్గల్ వద్ద 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మక్కల కొనుగోలుకు మద్దతు ధర ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు రూ.700–800 నష్టాన్ని భరిస్తుందన్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటనకే పరిమితమైందన్నారు. అనంతరం గ్రామంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోళ్లు వేగవంతం చేశామని, రైతులు మార్క్ఫెడ్ కేంద్రాల్లో పంట విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, గ్రంథాలయ చైర్మన్ దినేశ్, డీఈవో రాములు, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీం, సర్పంచ్ నల్ల కవిత, ఎంఈవో గంగాధర్, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ సత్తిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలిజగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సా రించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక వసతులపై సంబంధిత ఎంఈవోలు నివేదిక ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, బీర్పూర్లో కేజీబీవీకి శాశ్వత భవనం ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఎంఈవోలు పిల్లల సంఖ్యకు అనుగుణంగా అత్యవసరమైన వాటిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డీఈవో రాము, డీఈ ఇంజనీర్ సత్యనారాయణరావు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
బుగ్గారం(ధర్మపురి): ఇందిరమ్మ ఇళ్ల పనుల నా ణ్యతలో రాజీపడొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు.మండల కేంద్రంలో నిర్మిస్తున్న భవనాలను త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆకస్మిక పర్యటనలో భాగంగా మండలంలోని యశ్వంతరావుపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మండలకేంద్రంలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, గ్రామశివారులోని పీహెచ్సీ, ఎంపీడీవో, త హసీల్దార్, గ్రామైక్య సంఘాల భవనాల నిర్మాణ తీ రుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి ప్రగతి గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, నిర్మాణాలను పూర్తి నాణ్యతతో త్వరగా పూ ర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట బుగ్గారం సర్పంచ్ నక్క రాజవ్వ, డీఆర్డీఏ పీడీ రఘువరన్, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ భూమేశ్వర్, ఇన్చార్జి ఎంపీడీవో వాసవి, కార్యదర్శి అక్బర్, వీడీసీ నాయకులు గంగారెడ్డి తదితరులున్నారు. -
భూ సంబంధిత అంశాలపై క్షేత్రస్థాయి విచారణ
జగిత్యాలరూరల్: భూ సంబంధిత అంశాలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టడం జరుగుతుందని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం పొరండ్ల గ్రామంలో నేషనల్ హైవే 63 వద్ద భూ సంబంధిత అంశాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రత్యక్షంగా స్థలాన్ని సందర్శించడం ద్వారా భూ సమస్యలు, సరిహద్దులు రికార్డులను సమగ్రంగా పరిశీలించవచ్చన్నారు. స్థానిక రైతులు, భూ యజమానుల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదులు స్వీకరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భూ రికార్డులను సరిదిద్దడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం, చట్టబద్ధమైన ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ హకీం, ఆర్ఐ భూమయ్య, శంషోద్దీన్ పాల్గొన్నారు. -
‘కొత్త మండలి’ పై దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీని వివాదాలు ఇప్పట్లో వీడేలా లేవు. తాజాగా వెలువడిన కొత్త పాలకమండలి సభ్యుల విషయం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. అర్హతలు లేని వారికి పాలకమండలిలో చోటు కల్పించారని, అర్హత ఉన్నవారిని పక్కన బెట్టారన్న వాదనలు వర్సిటీలోని ప్రతీ విభాగంలో మార్మోగుతున్నాయి. తాజాగా వెలువడిన పాలకమండలిలో సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్కు చోటు కల్పించారు. యూనివర్సిటీలో ప్రస్తుతం ఇద్దరే ప్రొఫెసర్లు ఉన్నారు. అందులో ఒకరు వరప్రసాద్, మరొకరు సూరేపల్లి సుజాత. ఇటీవల సుజాతకు ఇప్పటికే నాలుగు పదవుల్లో కోతపెట్టిన వీసీ ఉమేశ్ కుమార్ ఈసారి పాలకమండలిలో చోటు ఇవ్వకపోగా వారి కన్నా జూనియర్, అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జాఫర్ జారీకి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయనకు ఇంకా ప్రొఫెసర్ హోదా రాలేదు. అయినా ఉన్నత విద్యామండలికి ఆయన్ను సీనియర్ ప్రొఫెసర్గా చూపించడం విడ్డూరంగా ఉందని వర్సిటీ సిబ్బందే వాపోతున్నారు. ఇప్పటికీ శాతవాహన యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మహమ్మద్ జాఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ అనే పేర్కొనడం గమనార్హం. ఎస్ఆర్ఆర్ కాలేజీకి దక్కని ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోనే శ్రీ రాజరాజేశ్వర కాలేజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం హాస్టల్ సదుపాయంతో అటామనస్ హోదా కలిగి ఉంది. అలాంటి ఈ కళాశాలకు ఈసారి పాలకమండలిలో సభ్యత్వం దక్కకపోవడం హాట్ టాపిక్గామారింది. గత వీసీ మల్లేశం ఉన్న సమయంలో 2024 మార్చిలో పాలకమండలిని ప్రతిపాదించినా అది అమలులోకి రాలేదు. ఆ జాబితాలో ఎస్ఆర్ఆర్ కాలేజీతోపాటు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతకు చోటు దక్కడం విశేషం. అదే జాబితాలో తాజా ఈసీ జాబితాలో ప్రొఫెసర్గా చూపించిన మహమ్మద్ జాఫర్ని అసోసియేట్ ప్రొఫెసర్గా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి తాజా జాబితాలో సభ్యుల ఎంపిక, చూపించిన సమాచారంలో లోపాలపై ఇటు విద్యార్థులు, అటు వర్సిటీ సిబ్బంది మండిపడుతున్నారు. బెయిల్ రద్దుకు న్యాయపోరాటం ఇటీవల తమ వర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ ప్రచారం చేస్తున్న ఓ పార్ట్టైం ఫ్యాకల్టీ బెయిల్ రద్దుకు న్యాయపోరాటానికి దిగుతున్నామని శాతవాహన విద్యార్థి సంఘాల జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో శాతవాహన వైస్ చాన్స్లర్గా పనిచేసిన ప్రొఫెసర్ మల్లేశంను కూడా ఇదే తరహాలో సోషల్ మీడియాలో కించపరిచిన కేసులో ఆ ఫాకల్టీపై అట్రాసిటీ కేసు నమోదైందని గుర్తుచేశారు. ఇదేకాకుండ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపి.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడని పేర్కొన్నారు. వర్సిటీలో అశాంతి.. ఆందోళనలకు కారణం అవుతున్న సదరు ఫాకల్టీ బెయిల్ రద్దుకు తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసిన వ్యక్తికి మా వర్సిటీలో స్థానం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు కరికె మహేశ్, శివాజీ, లక్ష్మణ్, సాయి, ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వీసీతో ఎమ్మార్పీఎస్ నేతల సమావేశం జిల్లా ఎమ్మార్పీఎస్ నేతలు వీసీ ఉమేశ్కుమార్ను ఆయన ఛాంబర్లో శుక్రవారం కలిశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజా తను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరించడం, ఆమెకు ఉన్న పదవులను వరుసగా తొలగించడంపై వీసీతో ఆరా తీశారు. సుజాత విషయంలో ఎ లాంటి కక్షసాధింపు చర్యలు లేవని, వీసీ వారికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు ప్రొఫెసర్ సుజాతను కలిసి సంఘీభావం తెలిపారు. దళితులపై అకారణంగా దు ష్ప్రచారానికి దిగితే.. ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధ్యక్షులు అనిల్, రేణుకుంట్ల సాగర్, తునికి వసంత్, చెంచాల నవీన్ పాల్గొన్నారు. -
నేడు జిల్లాకు హైకోర్టు జడ్జి రాక
జగిత్యాలజోన్: హైకోర్టు జడ్జి రేణుక యార శనివారం జిల్లాకు రానున్నారు. జిల్లాలోని కోరుట్ల పట్టణానికి మంజూరు చేసిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి కం అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు జడ్జి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో 8 కోర్టులు, మెట్పల్లిలో 2 , ధర్మపురిలో ఒకటి, కోరుట్లలో ఇప్పటికే ఒక్క కోర్టు ఉండగా, మరో కోర్టు ఏర్పాటుతో జిల్లాలో కోర్టుల సంఖ్య 13కు చేరనుంది. హైకోర్టు జడ్జి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి, ఇతర జడ్జిలు కోరుట్లకు వెళ్లారు. నృసింహుని సేవలో అడిషనల్ జడ్జిధర్మపురి: జిల్లా అడిషనల్ జడ్జి సునీత రవీంద్రరెడ్డి దంపతులు శుక్రవారం ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన సంప్రదాయ రీతిలో మేళతాళాలతో స్వాగతం పలికారు. ప్రధాన, అనుబంధ ఆలయాల్లో స్వామివారలను దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ఈవో శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు. జగిత్యాల నుంచే కాంగ్రెస్ పతనంరాయికల్(జగిత్యాల): జగిత్యాల నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శుక్రవారం రాయికల్ పట్టణంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని ప్రగల్భాలు పలికి విస్మరించారని అన్నారు. ఈనెల 20న నిర్వహించే భారీ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారని, పట్టణంతో పాటు, బీఆర్ఎస్, జీవన్రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే పల్లపు రాజేశ్వర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్కుమార్, సమన్వయ కమిటీ చైర్మన్ తురగ శ్రీధర్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఉదయశ్రీ పాల్గొన్నారు. నేడు ఏర్పాట్లు పరిశీలించనున్న కేటీఆర్, హరీశ్రావుజగిత్యాల: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈనెల 20న జిల్లాకు రానున్న సందర్భంగా సభ ఏర్పాట్ల కోసం బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శనివారం జగిత్యాలకు రానున్నట్లు ఎమ్మెల్సీ ఎల్.రమణ పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 గంటకు జగిత్యాలకు చేరుకుని ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలిస్తారని తెలిపారు. నువ్వుల సాగుతో మంచి ఆదాయంజగిత్యాలఅగ్రికల్చర్: వేసవి సీజన్లో నువ్వుల పంట ద్వారా మంచి ఆదాయం వస్తుందని వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ హారీశ్కుమార్శర్మ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వెల్దురి గ్రామ రైతులకు శుక్రవారం వ్యవసాయ ఉత్పాదకాలను పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నూనెగింజ పంటల విస్తీర్ణం తగ్గుతుందని, నువ్వులు, వేరుశనగ పంటలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందన్నారు. ప్రతీ రైతు కొంత విస్తీర్ణంలోనైనా నూనె గింజల పంటలు సాగు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షా కార్డులు అందజేశారు. అంతకుముందు, రైతులు సాగు చేసిన నువ్వుల పంటను పరిశీలించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ సంధ్యాకిషోర్, సుమలత, రైతులు పాల్గొన్నారు. -
ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడుదాం
జగిత్యాలక్రైం: ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో సీపీఆర్ కీలకమని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఫస్ట్ రెస్పాండర్స్కు సీపీఆర్, ఫస్ట్ ఎయిడ్పై ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న దుకాణాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, పెట్రోల్ బంకుల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను గోల్డెన్ అవర్గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన చికిత్స అందిస్తే చాలా మంది క్షతగాత్రుల ప్రాణాలను రక్షించవచ్చని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చూసి సరైన అవగాహన లేకుండా సీపీఆర్, ప్రథమ చికిత్స చేయడం వల్ల మరింత ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వివరించారు. అందుకే శాసీ్త్రయ పద్ధతుల్లో శిక్షణ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలు కాపాడే బాధ్యతగల పౌరులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రహ్ వీర్’ పథకం ద్వారా రూ.25,000 నగదు పారితోషికం, ప్రశంసాపత్రం అందజేయబడుతుందన్నారు. పోలీస్ కేసుల భయం కారణంగా కొందరు సాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని తెలిపారు. గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం సహాయం చేసినవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో సుజాత, వైద్యులు శ్రీనివాస్, రాజేందర్, సుధీర్, లవకుమార్, శ్రీకాంత్, డీసీఆర్బీ ఎస్సై ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
బాహుబలులు
బహుజనులే...సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనాభాపరంగా బీసీలు, ఎస్సీలే అధికంగా ఉన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన (ఎస్ఈఈఈ పీసీ–2024) సర్వేలో వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కులాల గణన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం గతేడాది కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో చేసిన ఎస్ఈఈఈపీసీ సర్వే ఉమ్మడి జిల్లా గణాంకాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. జనాభాపరంగా బీసీలు, ఎస్సీలు అగ్రభాగాన నిలిచారు. ఎస్టీ, బీసీ జనాభాలో అగ్రభాగంలో జగిత్యాల ఉంది. ఎస్సీ, ఓసీ పాపులేషన్లో అగ్రభాగాన కరీంనగర్ నిలిచింది. -
ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
● హిందూ సమ్మేళనంలో వక్తలు జగిత్యాలటౌన్: హిందువులందరూ ఏకమై ధర్మపరిరక్షణ, దేశాభివృద్ధికి కృషి చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ధరూర్ క్యాంపు వాకర్స్ మైదానంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా సా మూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టా రు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ప్రపంచమంతా హిందూ మతం వైపు చూస్తోందని, హైందవ మతం పూర్వవైభవం సంతరించుకుంటోందన్నారు. కుల వివక్ష తొలగిస్తూ.. స్వదేశీ భాష, స్వదేశీ సంస్కృతిని కాపాడుకోవడమే హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని అన్నారు. హిందూ సమ్మేళనం గౌరవ అధ్యక్షుడు తిగుళ్ల విశ్వనాథశర్మ, విశోకతీర్థ స్వామీజీ, సామాజిక సమరస రాష్ట్ర కన్వీనర్ అప్పా ల ప్రసాద్, కౌన్సిలర్ బోయినిపల్లి ప్రశాంత్రావు, హిందూ సమ్మేళన్ నిర్వహణ కమిటీ ప్రతినిధులు రాజమనో హర్రెడ్డి, శీలం ప్రవీణ్, బండ స్వామి, గడ్డల లక్ష్మీహరికృష్ణ, నరేష్, తేటకాల్ భారతి పాల్గొన్నారు. -
రేషన్ కార్డులకు ఎసరు..?
కోరుట్ల: కొత్త కార్డుల జారీకి ఇటీవల దరఖాస్తులు తీసుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న తెల్ల రేషన్కార్డుల్లో అనర్హుల లెక్క తేల్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో కొత్తకార్డుల కోసం జిల్లావ్యాప్తంగా 35 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. వాటి జారీకి సంబంధించిన పరిశీలన కొనసాగుతోంది. ఈ కార్డులు మంజూరయ్యేలోపు గతంలో అనర్హులు కార్డులపొంది ఉంటే వాటిని తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా కార్డులు రద్దయ్యే అవకాశాలు ఉన్నవారి జాబితా కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. సుమారు 10వేలు జిల్లాలోని 22 మండలాల్లో ప్రస్తుతం సుమారు 3.40 లక్షల రేషన్కార్డులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం రద్దయ్యే కార్డుల సంఖ్య 10వేల వరకు ఉన్నట్లు సమాచారం. ఇందులో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి వంటి పెద్ద పట్టణాల్లోనే రెండు వేల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన అన్ని మండలాల్లో 150 నుంచి 250వరకు రేషన్కార్డులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. రద్దు కావడానికి అవకాశమున్న రేషన్ లబ్దిదారుల వివరాలను అన్ని తహసీల్దార్ కార్యాలయాలకు పంపించారు. మరోసారి తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు సదరు జాబితాను తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది మరోసారి తుది పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ డేటా.. జిల్లాలో రేషన్కార్డులు కలిగి ఉన్న వారి జాబితాలో ఎవరైతే ఇన్కం టాక్స్ చెల్లించే వారు ఉన్నారో.. వారి జాబితాను ఆన్లైన్ ద్వారా సేకరించి వారి రేషన్ కట్ చేయడం కోసం జాబితా తయారు చేశారు. దీంతోపాటు రూ.10 లక్షల మించి విలువ ఉన్న విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న వారి రేషన్కార్డులు, మూడున్నర ఎకరాలకు మించి భూమి ఉన్న వారిని ఆన్లైన్ ద్వారా గుర్తించినట్లు సమాచారం. ఆన్లైన్లో రేషన్ లబ్ధిదారుల పూర్తి సమాచారం సేకరించిన తరువాత రద్దుకు అవకాశమున్న వారి జాబితాను రూపొందించారు. ఈ లిస్టు ప్రకారం త్వరలో అనర్హుల వద్ద ఉన్న తెల్ల రేషన్కార్డులు దాదాపుగా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
కొబ్బరినీరు తాగడమే మేలు
ఎండవేడిమికి ఉపశమనం కోసం కొబ్బరినీరు తాగడమే మేలు. ఐస్ ఉన్న పళ్ల రసాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ తీసుకుంటే ఐస్ వాడొద్దు. వీటివల్ల అతిసారం, పేగు సంబంధిత వ్యాధులు, గొంతునొప్పి వంటివ్యాధులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. – ఒడ్నాల రజిత, గైనకాలజిస్ట్ ఎండకాలంలో దాహం వేస్తే జ్యూస్ తాగాలని అనిపించినా.. ఐస్ మాత్రం వేసుకోవద్దు. ఏ వాటర్తో చేస్తున్నారో తెలియదు. ఊక పెట్టడంతో అవి శుభ్రత ఉండదు. ప్రజలు గ్రహించాలి. దీంతో వివిధ రకాల వ్యాధులు సైతం వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. – వాసాల శ్రీధర్, ఫిజిషియన్ -
సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి
జగిత్యాలక్రైం: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల బాధ్యత అని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఊహించలేమని, నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. రాత్రివేళల్లో వాహనాలు నడిపేవారు. దూర ప్రయాణాలు చేసేవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించారు. మందులు కూడా పంపిణీ చేశారు. -
అంజన్న సన్నిధిలో జడ్జి బాధ్యతల స్వీకరణ
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారి సన్నిధిలో గురువారం జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి సి.సునీతరవీందర్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వేదమంత్రాలతో జడ్జి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కపిందర్ జడ్జి దంపతులకు శేషవస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కోర్టు అధికారులు, ఎస్సై నరేశ్కుమార్, ఏఎస్సై రమణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్ పాల్గొన్నారు. బురుజుల స్థలాన్ని రక్షించండి కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని పురాతన చిహ్నాలైన గడి బురుజులు, వాటిని ఆనుకుని ఉన్న స్థలాన్ని రక్షించాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కొక్కెర వెంకటేశ్, పొట్ట సురేందర్, మోసిన్ అదనపు కలెక్టర్ రాజాగౌడ్కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గడి బురుజుల స్థలానికి కొత్త వీఎల్టీ నంబర్లు సృష్టించి స్థలం అమ్మకానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కోరుట్లలో అనధికారిక రియల్ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలు, కొనుగోలు సాగుతున్నా మున్సిపల్ అఽధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కోరుట్లలో ఎక్కడ చూసినా అవినీతిమయంగా మారిపోయిందని, ఈ పరిస్థితిని తొలగించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలిరాయికల్: ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్రణాళికపై గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కమిషనర్ కీర్తి నాగరాజు, కౌన్సిలర్లు పుర్రె శ్రీధర్, తహసీల్దార్ నాగార్జున, ట్రాన్స్కో ఏఈ నవీన్, మెడికల్ ఆఫీసర్ సతీశ్ పాల్గొన్నారు. అర్హులందరికీ పథకాలు అందిస్తాంమెట్పల్లి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలో మున్సిపల్ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఆదుకోవడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వాటిని అర్హులందరికి అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కౌన్సిలర్లు నరేష్, పురుషోత్తం, ఎంఈవో కనకతార, మేనేజర్ వెంకటలక్ష్మీ, డీఈఈ నాగేశ్వర్రావు, టీపీవో రాజేంద్రప్రసాద్ తదితరులున్నారు. -
కాంగ్రెస్ పతనానికి జగిత్యాల సభ నాంది
జగిత్యాలటౌన్: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి.. బీఆర్ఎస్ జైత్రయాత్రకు జగిత్యాల సభ వేదిక కానుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని మినీస్టేడియంలో ఈనెల 20న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగర్జన సభ ఏర్పాట్లను జీవన్రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సభకు ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. జనాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పనులను ఇప్పటికిప్పుడు ప్రారంభించారని, కోరుట్ల నుంచి జగిత్యాలకు వచ్చే రోడ్డును తవ్వి ట్రాఫిక్ను డైవర్ట్ చేయిస్తున్నారని తెలిపారు. సభ ఏర్పాటుతో బెంబేలెత్తిపోతున్న రేవంత్రెడ్డి.. ప్రజల దృష్టి మరల్చేందుకు మేడిగడ్డలో సభ పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు. ఆయన వెంట మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, తక్కళ్లపల్లి రవీందర్రావు, లోక బాపురెడ్డి, పుప్పాల అశోక్ పాల్గొన్నారు. -
టీబీపై ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన
మల్లాపూర్: టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ అన్నారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ వైద్యశిబిరం నిర్వహించారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చెమటలు పట్టడం, గొంతుభాగంలో గడ్డలు టీబీ లక్షణాలని పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. 92మందికి ఎక్స్రే తీసి సూచనలు అందించారు. మండల వైద్యాధికారి, మెడికల్ ఆఫీసర్ వాహిని, జిల్లా కో–ఆర్డినేటర్ కట్ట హరీశ్, సీహెచ్వో లింగ రామ్మోహన్, సూపర్వైజర్ ఆంజనేయులు, ల్యాబ్టెక్నిషన్ ఉమాదేవి, స్టాఫ్నర్స్ సుమలత, ఫార్మసిస్టు మహేశ్వరి పాల్గొన్నారు. -
చల్లని ప్రమాదం
జగిత్యాల: జిల్లా కేంద్రం.. నిత్యం వేలాది మంది వివిధ పనుల నిమిత్తం ఇక్కడకు వస్తుంటారు. ఎండలు ముదరడంతో చల్లని పానీయాల వైపు మళ్లుతున్నారు. మరికొందరు జ్యూస్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో ఎక్కడబడితే అక్కడ జ్యూస్ సెంటర్లు వెలిశాయి. ఇంత వరకు బాగానే ఉన్నా.. అందులో వినియోగిస్తున్న ఐస్ మాత్రం ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఐస్ను జ్యూస్లో కలిపి ఇవ్వడంతో ప్రజలు చల్లగా తాగేస్తున్నారు. అయితే వాటితో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. తాగితే అనర్థమే.. మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అత్యవసర పనులు నిమిత్తం జిల్లాకేంద్రానికి వస్తున్న ప్రజలు శీతల పానీయాలు తాగుతున్నారు. రోడ్డుపైనే చెరుకురసాలు, పండ్ల రసాలు, జ్యూస్లు, కూల్డ్రింక్స్ విక్రయిస్తుండడంతో దాహార్తి తీర్చుకునేందుకు ప్రజలు వాటి వైపు మళ్లుతున్నారు. ఐస్ముక్కలతో పరేషాన్ చల్లదనం కోసం చెరుకురసం, జ్యూస్లో ఐస్ ముక్కలు కలిపి ఇస్తుంటారు. కానీ ఆ ఐస్ తాగితే గొంతునొప్పి వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. సాధారణంగా ఐస్ను రెండు విధాలుగా తయారుచేస్తుంటారు. ఒకటి పారిశ్రామిక అవసరాలకు.. మరొకటి మాంసం, చేపలు, పండ్లు, ఔషధాల నిల్వ కోసం వినియోగిస్తుంటారు. ఐస్ను ఏ నీటితోనైనా తయారుచేయొచ్చు. పండ్ల రసాలకు వినియోగించే ఐస్ తయారీకి మాత్రం శుభ్రమైన నీటిని వాడాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేయాలి. ఈ ఐస్ తయారీకి కాస్త రిస్క్ ఎక్కువ. ఈ క్రమంలో కొందరు నాణ్యతలేని ఐస్ముక్కలను తయారీ చేస్తున్నారు. వీటితో గొంతునొప్పి, జ్వరం, అస్తమా వంటి వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా శీతల పానియాలు తాగువారు ఐస్ముక్కలు వేసుకోకుంటేనే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. నాణ్యతలేని ఐస్ను గుర్తించడం కష్టమే అయినప్పటికీ ఏ ఐస్ వేస్తారో తెలియదు. -
నిందితులకు శిక్ష పడేలా చూడాలి
జగిత్యాలక్రైం: కోర్టు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసిన పీపీలు రామకృష్ణరావు, ప్రణయ్, రాజేశ్ను అభినందించారు. జీవిత ఖైదు వంటి శిక్షలు పెరిగేలా పని చేయడం అభినందనీయమన్నారు. రెండు నెలల్లో 20 కేసుల్లో 36 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఉత్సవాలకు ఏర్పాట్లు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోక్సో, గ్రేవ్, నాన్గ్రేవ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. బక్రీద్, హనుమాన్ పెద్ద జయంతిని ప్రణాళికప్రకారం శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తనీయొద్దని పేర్కొన్నారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, వెంకటరమణ, వెంకటరమణ పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదాలపై అవగాహన అవసరం
జగిత్యాలక్రైం: అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన అవసరమని, విపత్తు సంభవించినప్పుడు ప్రాణనష్టాన్ని నివారించేందుకు అగ్నిమాపక శాఖ కృషి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానంపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని, ప్రతిఒక్కరూ మూడు నెలలకోసారి రక్తం దానం చేయాలని సూచించారు. విపత్తులు సంభవించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకుని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందేనన్నారు. జిల్లా అధికారి సైదులుతోపాటు 23మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణకాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ రాణి, సిబ్బంది పాల్గొన్నారు. -
బహిరంగ సభపై సమీక్ష సమావేశం
జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్రావు జగిత్యాలకు రాగా వారిని ఆహ్వానించారు. జన సమీకరణే లక్ష్యమని, ప్రతి కార్యకర్త ప్రజలను తరలించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీరమణ, జెడ్పీచైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. రాజమ్మ నేత్రాలు సజీవంబోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చేపూరి రాజమ్మ అనారోగ్యంతో ఈనెల 15న మృతిచెందగా ఆమె కుటుంబసభ్యులు లయన్స్క్లబ్ ఆఫ్ కమాన్పూర్ ఆధ్వర్యంలోని సదాశయ ఫౌండేషన్కు ఆమె నేత్రాలు దానం చేశారు. కమాన్పూర్ లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ సభ్యుడైన రాజమ్మ పెద్ద కుమారుడు చేపూరి దేవేందర్ నేత్రదానంపై తన సోదరుడు చేపూరి రవీందర్తోపాటు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో వారు నేత్రదానానికి ఒప్పుకోవడంతో టెక్నీషియన్ గాజుల సతీశ్ సహకారంతో కార్నియాలు సేకరించి హైదరాబాద్లోని ఐ బ్యాంక్ పంపించారు. కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అభినందించారు. మాజీ సర్పంచ్ చిందం రమేశ్, మున్నూరుకాపు సంఘం నాయకులు సింగరి రమేశ్, బుర్ర రాజు, రేండ్ల కనకయ్య, ముదాం శ్రీనివాస్, చిందం శ్రీనివాస్ ఉన్నారు. -
బిల్లులు రాలేవని పాఠశాల గదులకు తాళం
ఇల్లంతకుంట(మానకొండూర్): పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని మండలంలోని వల్లంపట్ల మాజీ సర్పంచ్ ప్రభుత్వ పాఠశాల గదులకు గురువారం తాళాలు వేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.22.30లక్షతో మూడు గదులు, రూ.21.80లక్షలతో హైస్కూల్లో డైనింగ్హాల్, ఇతర పనులను మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ చేశారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా బిల్లులు మంజూరుకాలేదు. దీంతో గురువారం ఉదయం ప్రాథమిక పాఠశాలలోని మూడు గదులకు, హైస్కూల్లోని డైనింగ్హాల్కు తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్ వచ్చి తాళాలు వేసిన గదులను పరిశీలించారు. రెండు గదులలో విద్యార్థుల సర్దుబాటు పాఠశాల గదులకు తాళాలు వేయడంతో ఒక గదిలో 1, 2, 3 తరగతి విద్యార్థులను, మరో గదిలో 4, 5వ తరగతి విద్యార్థులను కూర్చోపెట్టినట్టు హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు. ఎంఈవో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ వల్లంపట్లలోని ప్రభుత్వ పాఠశాలల గదులకు తాళం వేసిన విషయాన్ని జిల్లా విద్యాధికారికి తెలియజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం అధికారులు మెడపై కత్తి పెట్టి పనులు చేయించడంతో రూ.44లక్షల పనులు చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని, తన బంగారం అమ్మి పనులు చేపించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయబోమన్నారు. మాజీ సర్పంచ్ దంపతులపై కేసు పాఠశాల గదులకు, భోజనశాలకు, తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించిన మాజీ సర్పంచ్ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలలోని మూడు తరగతి గదులకు, హైస్కూల్ డైనింగ్ హాలుకు తాళం వేసినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగజేసినందుకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. వల్లంపట్ల మాజీ సర్పంచ్పై కేసు -
భర్తతో ఘర్షణ పడి వివాహిత ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం పంచాయతీ పరిధిలోని పోచమ్మతండాకు చెందిన అజ్మీర అనిత(38) భర్తతో ఘర్షణపడి మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. అనిత భర్త భాస్కర్ పదేళ్లుగా దుబాయ్కి వెళ్లి వస్తున్నాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చిన భాస్కర్ తిరిగి దుబాయ్కి వెళ్లాడు. ఇంటి వద్దనే ఉంటున్న అనితకు భర్త భాస్కర్ మధ్య ఇటీవల కొన్ని విభేదాలు వచ్చాయి. కొంతకాలంగా భర్త తనతో ఫోన్లో మాట్లాడడం లేదని అనిత తండాలో పలువురితో చెప్పుకొని బాధపడుతుండేది. ఈక్రమంలోనే బుధవారం రాత్రి భర్తతో వీడియోకాల్ మాట్లాడింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటలు పెరిగి తీవ్ర స్థాయికి చేరాయి. మనస్థాపానికి గురైన అనిత మొదట వంటింట్లో ఉరివేసుకోవడానికి ప్రయత్నించింది. అనంతరం హాల్లోకి వచ్చి దులానికి ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయింది. దుబాయ్ నుంచి వస్తున్న భర్త భాస్కర్ చివరి చూపు కోసం అనిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రీజర్లో భద్రపరిచారు. భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ కోసం పోలీసులు అనిత ఫోన్ను పరిశీలించారు. బుధవారం రాత్రి అనితకు వచ్చిన కాల్డేటాను పోలీసులు సేకరించారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన వివాహిత మానుక భానుశ్రీ(22) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. మామిడిపల్లికి చెందిన గెంటె శివయ్య–దేవలక్ష్మి దంపతుల కూతురు భానుశ్రీకి అదే మండలం మల్కపేటకు చెందిన మానుక కరుణాకర్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భర్త కరుణాకర్ సౌదీలో ఉండడంతో ఇటీవల భానుశ్రీ కూడా సౌదీకి వెళ్లి కొద్ది రోజులు ఉండి వచ్చింది. గురువారం సాయంత్రం భర్తతో మాట్లాడిన వీడియోకాల్లో గొడవ జరిగింది. వీడియోకాల్ మాట్లాడిన వెంటనే కుమారుని ముందరే ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి చూసేసరికి మృతి చెందింది. విషయం తెలుసుకుని మృతురాలి సోదరులు వేణు, రవి, బంధువులు ఆందోళనకు దిగారు. అత్తింటివారి వేధింపులతోనే భానుశ్రీ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్రెడ్డి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి గెంటె దేవలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ
సిరిసిల్లక్రైం: జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న నిందితుడు దొంగతనం కోసం హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలోని రాజీవ్నగర్లో కోన లక్ష్మి(75) ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఇదే అవకాశంగా చూసుకున్న గడీల రాజు(55) అనే వ్యక్తి.. కొంతకాలంగా ఆమె ఇంటిని గమనిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిస కావడంతో రాజు డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో కత్తెరతో లక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె నిద్రిస్తుండగా ఇంట్లో డబ్బుల కోసం వెతికాడు. నగదు, పత్రాలు, చీరలు సేకరించాడు. ఆ సమయంలో శబ్దం రావడంతో లేచిన వృద్ధురాలు అరవడంతో వెంటనే తన వద్ద ఉన్న కత్తెరతో ఆమె గొంతు, మెడపై పలుమార్లు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. తన దుస్తులపై పడిన రక్తపు మరకలు చూస్తే స్థానికులకు అనుమానం వస్తుందని వెంటనే ఇంటికి వెళ్లి వాటిని మార్చుకున్నాడు. వృద్ధురాలి ఇంటిలో ఇంకా ఏమైన డబ్బులు, బంగారం దొరుకుతుందన్న అత్యాశతో మళ్లీ వచ్చి అన్ని వెతికాడు. కానీ ఏమి దొరక్కపోవడంతో వృద్ధురాలి చెవికి ఉన్న బంగారు పోగుల కోసం చెవులు కోసేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. రక్తం పట్టిన బట్టలను ఆనవాళ్లు లేకుండా కాల్చివేశాడు. మూడు రోజులుగా గాలిస్తున్న పోలీసులకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకుడిని పట్టుకున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. హంతకుడు వృద్ధురాలి ఇంటి నుంచి తీసుకున్న రూ.2 వేల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తెర, రెండు చీరలు, బ్యాంక్ పాస్బుక్కులు, ఆరోగ్యశ్రీ కార్డు, వికలాంగ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే చెవి పోగులకు అంటుకున్న రక్తాన్ని కడిగే క్రమంలో అవి చేజారిపోయినట్లు హంతకుడు పోలీసులకు వెల్లడించడం గమనార్హం. చేధించిన పోలీసులు -
అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో నందెల్లి మహిపాల్
కరీంనగర్స్పోర్ట్స్: నాగాలాండ్ రాజధాని కోహిమాలో ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహించిన అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా ఒలింపిక్, అథ్లెటిక్ సంఘం అద్యక్షుడు నందెల్లి మహిపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాగాలాండ్ గవర్నర్ నందకిషోర్ యాదవ్, ముఖ్యమంత్రి నిప్పయు రియో, ఉప ముఖ్యమంత్రి పాటిల్, సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ అధ్యక్షుడు లలిత్ కె.భాను పాల్గొనగా తెలంగాణ నుంచి ప్రతినిధిగా మహిపాల్ హాజరయ్యారు. మహిపాల్ వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి దేశంలో అథ్లెటిక్స్ క్రీడల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణస్థాయి క్రీడాకారులను వెలికితీసి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓసీపీ–3లో తప్పిన పెను ప్రమాదం గోదావరిఖని: సింగరేణి రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3లో పెద్దప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఓసీపీ–3 కృషిభవన్ సమీపంలోని బేస్వర్క్షాప్ వద్ద నిలిపిఉన్న బొలేరోను గమనించకుండా ఆపరేటర్ డంపర్తో ఢీకొట్టాడు. అక్కడున్నవారు అరవడంతో డంపర్ నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే బొలెరోపై డంపర్ ఎక్కి ఉంటే అందులో ఉన్న నలుగురు చనిపోయేవారని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన ఘటనపై ఆరా తీశారు. ఆరబోసిన ధాన్యం చోరీపెద్దపల్లిరూరల్: కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్టు.. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని రోడ్డు పక్కన ఆరబోస్తే దొంగలు ఐదారు బస్తాల వరకు అపహరించుకుపోయారని పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన కౌలు రైతు మాటూరి రమేశ్ వాపోయాడు. తేమశాతం తగ్గితే కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకోవచ్చనే ఆశతో ప్రధాన రోడ్డుకు సమీపంలో ఆరబోయగా.. దొంగలు ధాన్యం ఎత్తుకు పోయారని పేర్కొన్నాడు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. -
చేపలవేట.. సుందర దృశ్యం
సూర్యోదయం వేళ ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న భానుడు.. సూర్యుని లేలేత కిరణాలతో ఆకాశం నారింజ, ఎరుపు రంగులో మెరిసిపోతోంది. మత్స్యకారులు విసిరిన వలను చూసి మురిసిపోయింది. ఆకాశం ప్రతిబింబంతో నీళ్లు ఎర్రగా మెరుస్తుంటే.. మత్స్యకారులు గంటల తరబడి వేచిచూస్తూ చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణంలో చేపలవేట కొనసాగించారు. ఇది చూపరులకు ఒకగొప్ప అనుభూతి ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల మానేరులో మత్య్సకారుల చేపలవేట దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు ఇలా అందంగా కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
రైలులో గర్భిణికి పురిటినొప్పులు
రామగుండం: ప్రసవం కోసం తమ స్వస్థలం ఒడిశాలోని రూర్కెలాకు బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తున్న గర్భిణికి హఠాత్తుగా నొప్పులు రావడంతో రామగుండం రైల్వేస్టేషన్లో దింపి పురుడు పోశారు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేశ్ మీనా కథనం ప్రకారం.. గర్భిణి జిథానీదేవి తన భర్తతో కలిసి బిలాస్పూర్ రైలులో బుధవారం ఉదయం తమిళనాడులోని తిరుప్పూర్లో ఎక్కింది. రైలు పెద్దపల్లి స్టేషన్ దాటిన తర్వాత పురిటినొప్పులు అధికం అయ్యాయి. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించి రామగుండంలో రైలును అత్యవసరంగా నిలిపివేయించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది.. వెంటనే ఆటోలో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు ప్రసవం చేయడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గత జనవరి 14న బిహార్కు వెళ్లే క్రమంలో రామగుండంలోనే పురిటి నొప్పులతో రైల్వే శానిటరీ సిబ్బంది ఓ గర్భిణికి ప్లాట్ఫారంపైనే సుఖప్రసవం చేసినవిషయం తెలిసిందే. అత్యవసరంగా రామగుండంలో దింపిన సిబ్బంది -
ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లోగల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. బీర్పూర్ మండలం కందెనకుంట గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా కృష్ణానగర్లోని ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా.. వైద్యులు గర్భసంచి ఆపరేషన్ చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం ఆపరేషన్ చేశారు. గురువారం ఉదయం అకస్మాత్తుగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యజమాన్యం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇవ్వడంతో శాంతించారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన -
అడుగంటిన మిడ్మానేరు
బోయినపల్లి(చొప్పదండి): మొన్నటిదాకా జలసిరితో కళకళలాడిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరులో నీటిమట్టం ఇప్పుడు రోజురోజుకు అడుగంటుతోంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడం.. ప్రాజెక్టులో ఉన్న నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకే తరలిపోవడం.. నీటిమట్టం తగ్గడానికి కారణమైంది. ప్రాజెక్టులో ఈ ఏడాది జనవరి 1న 26.74 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండగా గురువారం 8.435 టీఎంసీల మేర నీరు మాత్రమే నిల్వ ఉంది. సుమారు 18 టీఎంసీల మేర నీరు బయటకు తరలిపోయింది. మండే ఎండలకు రోజుకు 145 క్యూసెక్కుల మేర నీరు ఆవిరి అవుతోంది. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా ఎల్ఎండీకి 500 క్యూసెక్కులు, కుడికాల్వకు 450 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మరో మూడు రోజులు ఆయకట్టుకు నీరు మిడ్మానేరు ప్రాజెక్టు మూడు డివిజన్ల కింద సుమారు 50వేల ఎకరాల మేర ఆయకట్టుకు కుడికాల్వ ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేస్తున్నట్లు మిడ్మానేరు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. కుడికాల్వ ద్వారా ఆయకట్టుకు ఇప్పటి వరకు 3.146 టీఎంసీల మేర నీరు వదిలారు. కుడికాల్వ ద్వారా ఇల్లంతకుంట, గన్నేరువరం, మానకొండూర్, హుస్నాబాద్, కోహెడ తదితర మండలాల్లోని పంట పొలాలకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్ఎండీకి 16 టీఎంసీల నీటి తరలింపు మిడ్మానేరు ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రతీ ఏడు ఎల్ఎండీ ఆయకట్టుకు, కరీంనగర్ పట్టణ తాగునీటి అవసరాలకు మెజార్టీగా మిడ్మానేరు ప్రాజెక్టు నీరే పెద్ద దిక్కు అవుతోంది. గత జనవరి 11 నుంచి ఏప్రిల్ 16 వరకు మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి 16.848 టీఎంసీల మేర నీరు విడుదల చేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా ఎల్ఎండీకి రోజుకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గత మూడేళ్లుగా మిడ్మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి సుమారు 80 టీఎంసీల మేర భారీగా నీరు వది లారు. ఎల్ఎండీకి మరో అర టీఎంసీ మేర మాత్ర మే నీరు వదులుతామని అధికారులు తెలిపారు. మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు బంద్ జనవరి 2023 నుంచి మార్చి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరదకాల్వ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టులోకి 26.70 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. అప్పుడు కాళేశ్వరం జలాలు భారీగా రావడంతో మిడ్మానేరు ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇప్పుడు ప్రాజెక్టుకు గత రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు నిలిచిపోవడంతో పై ప్రాంతం నుంచి భారీ ఇన్ఫ్లో లేదు. ఔట్ఫ్లో మాత్రమే ఉండడంతో మిడ్మానేరు ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల మేర నీటి నిల్వకే పరిమతమైంది. ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఇప్పుడు 9 కిలోమీటర్ల మేరకే పరిమతమైంది. మరో రెండు నెలలు నిండు వేసవి ఉన్న తరుణంలో మిడ్మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం ఎలా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. మిషన్ భగీరథకు రోజుకు 45 క్యూసెక్కులు ప్రాజెక్టులో 8 టీఎంసీలు ఉన్నా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి పథకానికి రోజుకు సుమారు 45 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్మానేరులో చివరికి 4 టీఎంసీల వరకు నీరు ఉన్నా మిషన్ భగీరథకు నీరు విడుదల చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జూలై 31 వరకు 7 టీఎంసీలు ఉండేలా చర్యలు మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేసినప్పటికీ జూలై చివరి వరకు 7 టీఎంసీల మేర నీరు ఉండేలా చూసుకుంటామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఈమేరకు ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకున్నారు. భారీగా తగ్గుతున్న నీటి నిల్వలు 8 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం ఎల్ఎండీలోకి తరలిన నీరు మండే ఎండలకు భారీగా నీరు ఆవిరి మిడ్మానేరు ప్రాజెక్టు స్వరూపం పూర్తి నీటి సామర్థ్యం : 27.55 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం : 8.435 టీఎంసీలు కుడి, ఎడమ కాలువలకు నీటివిడుదల : 3.146 టీఎంసీలు మిషన్భగీరథ నీటి పథకానికి : 0.454 టీఎంసీ ఎల్ఎండీకి తరలిన నీరు : 16.848 టీఎంసీలు ఎండలకు ఆవిరి అయిన నీరు : 1.521 టీఎంసీలు -
గాయపడిన వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన దండవేని సుధాకర్ (57) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సుధాకర్ అతని కుమారుడు శ్రీపాల్ ఈనెల 11న ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వస్తుండగా రాజీవ్గాంధీ చౌరస్తా వద్ద కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. సుధాకర్, శ్రీపాల్కు గాయాలయ్యాయి. సుధాకర్ను కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. శ్రీపాల్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్ తెలిపారు. సౌదీలో దాచారం వాసి..ఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన పొన్నం దశరథంగౌడ్(56) సౌదీలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. దశరథం గత ఇరువై ఏళ్లుగా సౌదీ అరేబియాలోని జుబెల్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సుమలత అక్కడే కొన్ని నెలలు ఉండి తిరిగి బుధవారం తెల్లవారుజామున ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమెను ఫ్లైట్ ఎక్కించి డ్యూటీకి వెళ్లారు. కంపెనీలో పనిచేస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దశరథంగౌడ్కు ఇద్దరు కుమారులు, భార్య సుమలత ఉన్నారు. కట్టెల లారీ బోల్తాజగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం తక్కళ్లపల్లి శివారులో గురువారం ఉదయం కట్టెల లారీ బోల్తాపడింది. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ జగిత్యాల–ధర్మపురి ప్రదాన రహదారిపై తక్కళ్లపల్లి శివారులో అదుపుతప్పి బోల్తాపడింది. ఉదయం వేళ కావడం.. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్తోపాటు, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. కుక్కల దాడిలో గొర్రెలు మృతి ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని గుజ్జుల కనకయ్య చెందిన గొర్రెలు మందపై గురువారం తెల్లవారుజామున కుక్కలు దాడిచేశాయి. ఇందులో 7 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు తెలిపాడు. వాటివిలువ దాదాపు రూ.80 వేలు ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కనకయ్య విన్నవించాడు. -
పన్ను వసూళ్లలో నంబర్–2
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులతోపాటు ఇంటి పన్ను వసూళ్లు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో 100 శాతం పన్నుల వసూలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఇంటి పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో చేయగలిగారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు రూ.13,63,30,997 లక్ష్యం ఉండగా.. మార్చి 31 వరకు రూ.13,42,45,321 వసూలు చేశారు. మొత్తంగా 98.47 శాతం వసూలు చేసి రాష్ట్రంలోనే జిల్లా రెండోస్థానంలో నిలిచింది. నిధులు సమకూర్చుకునేందుకు... గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తున్నా ఆ నిధులు వీధిలైట్ల ఏర్పాటు, బ్లీచింగ్పౌడర్, అత్యవసర పనులకు చెల్లించేందుకే ఉపయోగపడుతున్నాయి. మిగతా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇంటి పన్నుల ద్వారా వచ్చిన నిధులపై దృష్టి సారించారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాది ఇంటి పన్నుల వసూళ్లలో లక్ష్యం చేరుకునేలా చర్యలు చేపట్టాం. మార్చి 31 వరకు రూ.13.42 కోట్లు వసూళ్లు చేపట్టి రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచాం. అన్ని గ్రామాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. – మదన్మోహన్, డీపీవో -
బడిబాట పట్టేలా..
మల్లాపూర్: వేసవి సెలవులు వచ్చాయంటే ఏ గల్లీకి వెళ్లినా ప్రైవేట్ పాఠశాలల సిబ్బందే కనిపిస్తారు. పిల్లలను తమ స్కూళ్లల్లో చేర్చాలని తల్లిదండ్రలను కోరుతుంటారు. ఆ పరిస్థితులకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో చేర్పించండంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు బడిబాట నిర్వహించాలని ఆదేశించింది. గతేడాది హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీల సహకారంతో స్వచ్ఛందంగా బడిబాట నిర్వహించి విద్యార్థుల పెంపే లక్ష్యంగా పనిచేశారు. విద్యార్థుల గుర్తింపు సాధారణంగా ప్రభుత్వం బడిబట కార్యక్రమాన్ని జూన్ రెండో తేదీ నుంచి నిర్వహిస్తుంది. ఈ ఏడాది మాత్రం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ముందస్తుగా కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఒంటిపూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బడిబాట చేపడుతున్నారు. బడిబయట ఉన్న పిల్లలు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేవారిని గుర్తిస్తున్నారు. పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ తరగతులు గురించి పిల్లలు, తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫాం అందిస్తున్నామని చెబుతన్నారు. నాణ్యమైన విద్య అందిస్తామని, ఏఐ ద్వారా బోధిస్తామని హామీ ఇస్తున్నారు. ఆంగ్లంలో బోధన, ప్రతినెలా తల్లిదండ్రుల సమావేశం.. ఇలా పలు అంశాలను అజెండాగా ఎంచుకుని ప్రచారం చేస్తున్నారు. సౌకర్యాలపై కరపత్రాలు, చిన్నపాటి పోస్టర్లను ముద్రించారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తున్నాం
● సీజీఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ రాయికల్: విద్యుత్ సమస్యల నివారణకు పరిష్కార వేదికలు దోహదపడతాయని ఎన్పీడీసీఎల్ సీజీఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ అన్నారు. మండలంలోని ఒడ్డెలింగాపూర్ సబ్స్టేషన్లో బుధవారం వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. కార్యక్రమంలో పరిష్కార వేదిక సభ్యులు రామకృష్ణ, శేర్ల సత్యనారాయణ, మర్రిపల్లి రాజాగౌడ్, ఎస్సీ సుదర్శనం, డీఈ గంగారాం, ఎస్ఏవో శ్రీనివాస్, ఏడీఈ సింధూశర్మ, ఏఏవో శంకర్, ఏఈ రాజేశం, తుమ్మల నవీన్, సబ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు. నిత్యాన్నదానసత్రానికి రూ.80లక్షల విరాళంమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని నిత్యాన్నదాన సత్రానికి వేములవాడకు చెందిన భక్తులు అమరగొండ కిషన్ దంపతులు రూ.80వేలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఆలయ అధికారులు దాతకు రశీదు అందించి అభినందించారు. ఏఈవో హరిహరనాథ్, ఆలయ పర్యవేక్షకులు అశోక్, భక్తులు పాల్గొన్నారు. రోడ్డు నిబంధనలు పాటించాలిరాయికల్: విద్యార్థులు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. బుధవారం రాయికల్ మండలం అల్లీపూర్లో అరైవ్ ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై సుధీర్రావు, సర్పంచ్ ఎంబారి గౌతమి, ఎంఈవో రాఘవులు, హెచ్ఎం కిరణ్, ఉపసర్పంచ్ వినయ్ పాల్గొన్నారు. 17న కొండగట్టు ఆలయ హుండీ లెక్కింపుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలోని హుండీలను ఈనెల 17న లెక్కించనున్నట్లు ఈవో అంజనా రెడ్డి తెలిపారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. -
భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి
రాయికల్: భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. భూభారతి పెండింగ్ అంశాలు, ఓటరు జాబితా సవరణ, సాదాబైనామా అంశాలపై చర్చించారు. మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. జనగణన విధులు అప్పగించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జనగణనకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమిస్తామని తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్ నాగార్జున ఉన్నారు. -
మక్కల కొనుగోళ్లలో జాప్యమెందుకు..?
కథలాపూర్: మక్కల కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం సరికాదని బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి అన్నారు. కథలాపూర్లో మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. మక్కలు కుప్పలుగా పేరుకుపోతుంటే ఇప్పటివరకు కేవలం రెండు లారీల ధాన్యాన్ని మాత్రమే కొనడం సరికాదన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలన్నారు. తూకంలో కోతలు విధించొద్దన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు గాంధారి శ్రీనివాస్, ప్రసాద్, ప్రతాప్, మహేశ్, జీవన్రెడ్డి పాల్గొన్నారు. -
కేసుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం
జగిత్యాలజోన్: కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ నిజామాబాద్కు బదిలీకాగా.. బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. జిల్లా జడ్జి నారాయణ మూడేళ్లలో 770 కేసులు పరిష్కరించారని, జిల్లా కోర్టుకు మంచి పేరు తెచ్చారని పేర్కొన్నారు. జడ్జిలు వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, లావణ్య, శ్రీనిజ, నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
వడగాలులు.. ఉక్కపోత
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/గోదావరిఖని: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ ఈనెల 16 నుంచి 22వరకు హీట్వేవ్స్ (వడగాలులు) కొనసాగుతాయని వాతా వరణశాఖ (ఐఎండీ) తెలిపింది. మొన్నటిదాకా 30 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలు 12వ తేదీ నుంచి 35 డిగ్రీలపైగా నమోదవడం మొదలైంది. వేసవి మొదలయ్యాక ఈ స్థాయిలో ఎండలు ముదరడం ఇదే తొలిసారి. 40 డిగ్రీలకుపైగా ఎండలు దంచుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. 16 నుంచి 22 తేదీ వరకు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తరువాత అసలు బయటికి రాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయం చేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, సింగరేణి ఓపెన్కాస్టు ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలి.మండుతున్న కోల్బెల్ట్ రామగుండంలో సింగరేణి ఓసీపీలు భగ్గుమంటున్నాయి. ఎండల తీవ్రతకు కార్మికులు ఆగమాగమవుతున్నారు. రెండోషిఫ్టు కార్మికులు విధులకు గైర్హాజర్ క్రమంగా పెరుగుతోంది. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండోరోజు జంకుతున్నారు. గతంలో మే నెలలో ఎండవేడి అధికంగా ఉండేది. ఈసారి ఏప్రి ల్ రెండోవారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే క్వారీల్లో కనీసం 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం క్వారీల్లో సుమారు 45డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మేలో ఓసీపీల్లో డ్యూటీలు చేయడం, భూగర్భగనుల్లోకి వెళ్లడం, మండుటెండలో ఇళ్లకు రావడం కష్టంగా ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్ ఓసీపీ కార్మికుల నుంచి వస్తోంది. ఎండవేడిలో పనిచేసే కార్మికులకు చలవపందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెస్ట్హాళ్లు, క్యాంటీన్లు, ఆఫీస్ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంజన్ల ద్వారా చల్లటినీటిని అందిస్తున్నారు. షిఫ్టు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను యాజమాన్యం అందిస్తోంది. -
పారమిత విద్యార్థుల ప్రభంజనం
కరీంనగర్ టౌన్: సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 500కు 492 మార్కులతో చెన్న శ్రీశాంత్ జిల్లాలో మొదటిస్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.గోపికృష్ణ తెలిపారు. మొత్తం 347 మంది 100శాతం ఉత్తీర్ణతతో అద్భుత ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఎం. శ్రీవర్షిణి 487, కె.అగస్త్య 486, ఎం.పంజ్వాని 485, గంప సహస్త్ర 485, ఎం.రాహుల్ 485, సీహెచ్. వెంకట మోక్షిత్ 485, దియా బుల్డాక్ 483, ఎం.సాయిఅక్షర 481, ఎండీ. అబ్దుల్ అరహాన్ లతీఫ్ 481, పి.రిధి 480 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత డా. ఇ. ప్రసాద రావు ప్రత్యేకంగా అభినందించారు. డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, వినోదరావు, రశ్మిత, రాకేష్, వి.యూ.ఎం.ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు పి.గోపికృష్ణ, సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, నాగరాజు, రాము పాల్గొన్నారు. -
ఇన్సెంటివ్ ఇచ్చి రికవరీ అంటారా!
కరీంనగర్ అర్బన్: కేడీసీసీ బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. లాభాలు వచ్చినప్పుడు ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా ఇచ్చి తీరా వెనక్కి ఇవ్వాలనడం చరిత్రలో తొలిసారని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం కరీంనగర్లోని ప్రధాన కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కేడీసీసీబీ పరిధిలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 71 బ్యాంకులు సేవలందిస్తున్నాయి. మొత్తం 509 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా ఇచ్చిన ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా రికవరీ చేసే నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా రికవరీ ఏంటంటే పాలకవర్గాలు ఉన్న 2023–24, 2024–25 కాలంలో బ్యాంకులు ఊహించని లాభాలు గడించాయి. ఒక్కో ఆర్థిక సంవత్సరానికి 80 రోజులు ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటెండర్ నుంచి డీజీఎం వరకు ఉద్యోగ హోదాను బట్టి రూ.2లక్షల నుంచి రూ.8లక్షల వరకు నజరానా అందుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పాలకవర్గాలు రద్దవడంతో ఐఎండీ, ఆర్బీఐ, నాబార్డు, టెస్కాబ్ వంటి వాటితో భాగస్వామ్యమైన హైలెవల్ కమిటీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒక్కో ఆర్థిక సంవత్సరానికి 30 రోజులే తీసుకోవచ్చని, రెండు దఫాలకు గానూ 60రోజులకు అర్హత మాత్రమేనని పేర్కొంది. అంటే ఈ లెక్కన మిగతా వంద రోజుల ఇన్సెంటివ్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఉద్యోగులు ఏమంటున్నారంటే బ్యాంకులు ఇన్సెంటివ్లు ఇవ్వడం సహజం కానీ ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ఐటీ చెల్లించి ఏడాది దాటుతోందని వాపోతున్నారు. చెల్లించిన ఐటీని ఎవరు ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన వాళ్లు, వేరే ఉద్యోగాలకు వెళ్లినవారు ఎలా కడుతారన్నది ప్రశ్న. నిబంధనల పేరిట తమను మానసికంగా హింసిస్తున్నారని అందుకే ఆందోళన బాట పట్టామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలు, వినతులు, సామూహిక సెలవు హైలెవల్ కమిటీ నోటీసులపై తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తునే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బుధవారం నుంచి ఈ నెల 24వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో ఆందోళన, ఈ నెల 23, 24 తేదీల్లో అధికారులకు మెమోరండం సమర్పించడం, ఈ నెల 27న డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమాలు, 29న ధర్నాతో పాటు సామూహిక సెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా, మే 2న ఒక రోజు సమ్మె, నిరసన కార్యక్రమాలు తదుపరి హైలెవల్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు బ్యాంకు ఉద్యోగులు వెల్లడించారు. ఇన్సెంటివ్ ఇచ్చి రికవరీ అనడం హైలెవల్ కమిటీకి తగదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఇచ్చిన ఏడాదికి తిరిగి ఇవ్వమనడం భావ్యమా..? ఉద్యోగుల కృషి లేకుండా లాభాలు వచ్చాయా..? మానవతా ధృక్పతంతో వ్యవహరించాలే తప్పా మానసికంగా వేధించడం తగదు. – గోనె హన్మంతరావు, తెలంగాణ కోఅపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బ్యాంకు ఉద్యోగుల ఆందోళన బాట ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు ఈ నెల 24 వరకు భోజన విరామంలో ఆందోళన మే 2నుంచి సమ్మె.. నిరసన -
మైలురాయిని ఢీకొని వ్యక్తి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుని పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వస్తుండగా రోడ్డుపక్కన ఉన్న మైలురాయిని ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన వర్కోలు రామకృష్ణ(కోటి) (28) తన స్నేహితుని పెండ్లి వేడుకలకు బైక్పై రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి బుధవారం వచ్చాడు. రిసెప్షన్ వేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం తన బైక్పై ఇంటికి తిరిగి వస్తుండగా గాలిపెల్లి సమీపంలోని రోడ్డు పక్కగ గల మైలురాయిని ఢీకొని ఎగిరిపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకొని యువకుడు మరణించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, భార్య లాస్య సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణకు ఐదేళ్ల క్రితమే వివాహమైంది. హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికేవాడని స్థానికులు తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తన సిబ్బందితో వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మృతుని స్వగ్రామం పారువెల్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ధర్మపురి అభివృద్ధికి సహకరించండి
ధర్మపురి: ధర్మపురి అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి మంత్రి అడ్లూరితో కలిసి ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. బల్దియాలోని 15వార్డులనూ కాంగ్రెస్ గెలుచుకుందని పేర్కొన్నారు. నృసింహుని ఆలయానికి నిత్యం వేలాది మంది వస్తారని, గోదావరిలో స్నానాలు ఆచరిస్తారని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మీ, వైస్ చైర్మన్ రామన్న, నాయకులు వేముల రాజు ఉన్నారు. సీఎంకు ధర్మపురి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి -
పదవులు కాదు.. ఆత్మాభిమానం ముఖ్యం
జగిత్యాలరూరల్: తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మాభిమానం చాలని, గౌరవం దక్కని చోట పదవి ఎందుకని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్, బీర్పూర్ మండలకేంద్రాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ఉద్యమ నేత అని, వారి ఆలోచన, కార్యదక్షతతో రాష్ట్రం కార్యరూపం దాల్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సంక్షేమ ఫలాలు పార్టీ కార్యకర్తలకు అందలేదన్నారు. కార్యకర్తల హక్కులు కాపాడలేకపోయానని, ఆ పార్టీ నాయకత్వం తనను మానసిక క్షోభ అనుభవించేలా చేసిందని పేర్కొన్నారు. 20 నెలలు ఓపిక పట్టినా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆత్మాభిమానం కోల్పోయినప్పుడు.. గౌరవం దక్కనప్పుడు పార్టీని వదులుకున్నానని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన ఉండాలనే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని వివరించారు. కేసీఆర్ ఊరూరా వైకుంఠదామాలు కట్టించారని, డంపింగ్యార్డులు, పల్లెప్రకృతి వనాలు, క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేశారన్నారు. రేవంత్ 90 రోజుల ప్రణాళిక అని, ఏం చేశారు..? ఏం చేస్తారు..? సరైన సూచనలు కూడా లేవని, లెక్కలు రాసుకోవాలి.. బిల్లులు ఎత్తుకోవాలి.. అనే రీతిలో ఉందన్నారు. రోల్లవాగు కట్ట పునర్నిర్మాణం చేసేలా ఉద్యమం చేశానన్నారు. ప్రాణహిత నది జలాలు తుమ్మడిహెట్టి వద్ద కట్టాలని తాను కూడా అన్నానన్నారు. రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, జనంలో కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఆలోచన మొదలైందన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, జితేందర్, శంకర్, భూక్య సరళ, రమేశ్, ప్రసాద్, రాంచందర్రావు పాల్గొన్నారు. గౌరవం దక్కని చోట పదవి ఎందుకు మాజీమంత్రి జీవన్రెడ్డి -
ఇంటిపైనుంచి పడి యువకుడు మృతి
రాయికల్: మండలంలోని కట్కాపూర్కు చెందిన కని కుట్ల నాగరాజు (27) మద్యం మత్తులో ఇంటిపైనుంచి పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటి పైనుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. నాగరాజు తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ బాలుడు మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్క వెంటబడడంతో కిందపడి తలకు గాయాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన సంగీత, మహేశ్ దంపతులకు కొడుకు ఇటికాల ఆదిత్య(8). గత 18 రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్క వెంటపడింది. భయంతో పరుగెత్తిన బాలుడు కిందపడడంతో తలకు గాయమై రక్తం గడ్డకట్టింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. చెరువులో పడి వృద్ధుడి..కరీంనగర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన అంకతి పెద్ద కోటయ్య (65) ఎప్పటిలాగే ఇంటినుంచి పశువులు మేపడానికి వెళ్లాడు. పశువులు చెరువులోకి వెళ్లగా.. వాటిని బయటకు రప్పించేందుకు పెద్ద కోటయ్య నీటిలో దిగాడు. ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఉదయ్కుమార్ శవాన్ని చెరువులోంచి బయటకు తీయించారు. కోటయ్య కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో యువకుడి రిమాండ్రాయికల్: మండలంలోని ధర్మాజీపేటకు చెందిన మధును పోక్సో కేసులో బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. తాట్లవాయి గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం విషయంలో మధును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
నాణ్యమైన విత్తనాలే ప్రభుత్వ లక్ష్యం
కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్లో రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన విత్తనాలను సంస్థ ద్వారా అందిస్తామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈవోలు, ఎఫ్పీఓలు, ఏఆర్ఎస్కే ప్రతినిధులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేశ్రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సీడ్స్ కార్పొరేషన్ కరీంనగర్ యూనిట్ రంగపేట నుంచి నాణ్యమైన విత్తనాలను ఉమ్మడి జిల్లా రైతులకు సరఫరా చేస్తామని తెలిపారు. రైతులు పండించిన విత్తనాలనే సేకరించి, వాటిని అధునాతన ల్యాబ్ల్లో పరీక్షించి, నాణ్యత నిర్ధారణ అయిన తర్వాతే తిరిగి రైతులకు సాగు కోసం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరి విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకాల్లో ప్రధానంగా బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, జేజీఎల్ 27356 రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దొడ్డు రకాల విషయానికి వస్తే కేఎన్ఎం 118, ఎంటీయూ 1010 రకాలు నిల్వ ఉంచినట్లు తెలిపారు. డీలర్లు ఎట్టి పరిస్థితులో సంస్థ విత్తనాలు అమ్మాల్సిందేనని సూచించారు. కేవలం రాయితీపై ఇచ్చే విత్తనాల విక్రయానికే పరిమితం కాకుండా, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల విత్తనాలను విక్రయించాలని ఆదేశించారు. లైసెన్స్ ఉన్న ప్రతి డీలర్ తప్పనిసరిగా ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను తమ దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ గ్రామాన ప్రభుత్వ విత్తనాలను రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి రామాంజనేయులు, సీడ్ కార్పొరేషన్ మేనేజర్ రాజీవ్ కుమార్, కరీంనగర్ ప్రాంతీయ మేనేజర్ విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సబిత, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, విత్తన అధికారులు శ్రీకాంత్, మౌనిక, డీలర్లు, ఎఫ్పీఓ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన విత్తన విక్రయానికి ప్రణాళిక సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే రైతులు వాడాలి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి ప్రభుత్వ విత్తనాల విక్రయానికి ప్రత్యేక కృషి కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా -
సీబీఎస్ఈలో అల్ఫోర్స్ విద్యార్థుల సంచలనం
కొత్తపల్లి(కరీంనగర్): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలన మార్కులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించారు. 103 మంది విద్యార్థులు 500 మార్కులకు 450 సాధించి జిల్లా స్థాయిలో చరిత్ర సృష్టించారని తెలిపారు. సానీక 494 మార్కులు, ఆదిత్య 492, ఎం.శ్రీహిత, ఏ.హర్ష, ఏ.శ్రీనిత 490, కే.ఓంకార్తికేయ, కె.అస్మిత, కే.అభిజ్ఞ 488, ఏ.స్వరవిస్తృతి 487, ఎం.శ్రీగౌరీ 486, కె.వర్దిని 485, ఉదయశ్రీ, వి.అభిరామ్ 484, కే.మోక్స్, జి.సాయి సుశేన్, ఈ.ప్రమేష్ రెడ్డి 483 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. పలువురు విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో వందశాతం మార్కులు సాధించడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు చక్కటి ప్రణాళిక, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తూ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జగిత్యాల: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. ఈనెల 20న కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి బుధవారం పార్టీ కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. యువత పెద్ద ఎత్తున సభకు తీసుకువచ్చేలా చూడాలన్నారు. మాజీమంత్రి జీవన్రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా ఐక్యతతో కృషి చేసి ఘనవిజయం చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, నాయకులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు -
24 గ్యాస్ సిలిండర్లు సీజ్
● 19 మందిపై 6ఏ కేసు నమోదు జగిత్యాలక్రైం: జగిత్యాల సివిల్ సప్లై అధికారులు జిల్లాకేంద్రంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టి 24 సిలిండర్లను పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి 19 మందిపై 6ఏ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను వ్యాపారాలకు వాడితే చర్యలు చేపడతామన్నారు. డీటీలు శ్రీనివాస్, ఉమాపతి, రాజేందర్రావు, ఎఫ్ఐ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. లేగదూడపై చిరుత దాడిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో లేగదూడపై మంగళవారం రాత్రి చిరుత దాడిచేసి హతమార్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. పోతిరెడ్డిపల్లెకు చెందిన సదుల పూర్ణ గ్రామ శివారు ప్రాంతంలో నివసిస్తుంది. రాత్రి వారి గుడిసెల వద్ద గేదె, దూడను కట్టేయగా, తెల్లవారుజామున లేచి చూసేసరికి చిరుతదాడిలో చనిపోయి ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత సంచారంతో రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. రైతులు రాత్రిపూట పోలాల వద్దకు కర్రలతో గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్లాల్ కోరారు. గడ్డిమందు తాగి వ్యక్తి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని విద్యానగర్కు చెందిన పడిగెపాటి వెంకటేశ్వర్రెడ్డి (52) ్చపురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వర్రెడ్డి గొల్లపల్లిరోడ్లో ఆటోస్టోర్ నిర్వహిస్తాడు. ఇటీవల అప్పులు ఎక్కువ కావడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురయ్యాడు. వారం క్రితం గడ్డిమందు తాగగా కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్ తెలిపారు. -
జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ
జగిత్యాలక్రైం: చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా అగ్నిమాపక అధికారి సైదులు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఓల్డ్ బస్టాండ్, టవర్ సర్కిల్ ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది మాక్డ్రిల్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురికావద్దన్నారు. జగిత్యాల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్, సిబ్బంది రవీందర్, మధు, మల్లేశం, వెంకటేశ్వర్లు, ప్రణయ్, కార్తీక్, రాజేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉత్తమ పనితీరుకు పట్టంకరీంనగర్: ఉత్తమ పనితీరు కనబరిచినందుకు ఎండపల్లి మండలంలోని గుల్లకోట ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చందూరి రాజిరెడ్డిని బుధవారం విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ శాలువాతో సన్మానించారు. దాతల సహకారంతో లక్షలాది రూపాయలు విరాళాలు సేకరించి ప్రైవేటుకు ఽధీటుగా అభివృద్ది చేసినందుకు ప్రశంసపత్రం అందించారు. విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేసినందుకు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని రాజిరెడ్డి తెలిపారు. డీఈవో రాము, ఎండపల్లి ఎంఈవో హరికృష్ణ, సర్పంచ్ గొల్లపెల్లి మల్లేశం రాజిరెడ్డిని అభినందించారు. -
కేసీఆర్కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను
సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సీనియర్ నేత జీవన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు. ‘‘కేసీఆర్ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. ..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్రెడ్డి చెప్పారు. -
జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర
రాయికల్: జగిత్యాల నుంచే కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో అభిమానులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం, మరికొంత మంది అనుచరులు తనను పార్టీ నుంచి పొమ్మనలేక పొగపెట్టారని, ఇందులో ఎమ్మెల్యే సంజయ్ ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. అధిష్టానానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. పట్టించుకోకపోవడంతోనే నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసేందుకే ఈనెల 20న బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు మాజీ సీఎం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చేందుకు రేవంత్రెడ్డి అనేక మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకొచ్చాక విస్మరించారన్నారు. తులం బంగారం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. అదే కేసీఆర్ అయితే మొదటగా కల్యాణలక్ష్మీకి రూ.50 వేల నుంచి రూ.లక్ష ఇచ్చారని గుర్తుచేశారు. రైతుల కోసం ప్రాజెక్ట్లు నిర్మించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, నాయకులు మ్యాకల రమేశ్, బత్తిని భూమయ్య, రాకేశ్నాయక్, మచ్చ శేఖర్, అంజయ్య, స్వామిరెడ్డి, గుమ్మడి సంతోష్, సిరిపురం గంగాధర్, అత్తినేని గంగారెడ్డి పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలి
మెట్పల్లిరూరల్: బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు అన్నారు. మెట్పల్లి మండలం వెల్లులలో మంగళవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్ధేశం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ ఈనెల 20న జగిత్యాలలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు బండలింగాపూర్లో అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
బల్దియాలో ‘ఎర్లీబర్డ్’
రాయికల్: రాయికల్ వంటి చిన్న మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లలో ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో బల్దియాకు ఆదా యం రావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా ఎర్లీబర్డ్ స్కీం ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఐదు శాతం రాయితీ వర్తింపజేస్తోంది. ఈ క్రమంలో ముందస్తుగా ఆస్తిపన్ను రాబట్టే దిశగా మున్సిపల్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. బల్దియాలో సాధారణ నిధి కింద వచ్చే నల్లా, వర్తక పన్ను, వాణిజ్య ప్రకటనలపై వచ్చే ఆదాయంతో పోలిస్తే ఈ ఆస్తిపన్ను ఎంతో కీలకం. ముందస్తుగా వసూలు చేయడం ద్వారా బల్దియాకు ఆ దాయం సమకూరడంతోపాటు చెల్లింపుదారుల ను ప్రోత్సహించినట్లవుతుంది. ఈనెల 30 వరకు ఈ పథకం కింద చెల్లించే అవకాశం ఉంది. అర్హులెవరంటే... 2026–27 ఆర్థిక సంవత్సరంలో నివాస, నివాసేతర ఆస్తులపై ఎలాంటి బకాయిలు లేకుండా పన్ను పూర్తిగా చెల్లించిన వారు ఈ ఎర్లీబర్డ్ పథకానికి అర్హులు అవుతారు. వీరికి మాత్రమే ఈ 5 శాతం రాయితీ వర్తించనుంది. రాయికల్ బల్దియా సమాచారం నివాస గృహాలు 4,658 వసూలు అంచనా రూ.కోటి ప్రస్తుతం వసూలు రూ.5.50 లక్షలు -
సీఎం వద్దకు కాంగ్రెస్ నాయకులు
జగిత్యాల: జిల్లాకేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీని యర్ నాయకులు ముఖ్యమంత్రిని కలిసేందుకు మంగళవారం హైదరాబాద్ వెళ్లారు. ఇటీవల నామి నేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో సీనియర్లకు అవకాశం దక్కలేదనే అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ మధ్య పొసగడం లేదని సోషల్మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపైనే సీఎంను కలుస్తున్నట్లు పైకి చెబు తున్నా.. అలాంటిదేమీ లేదని మంత్రి పేర్కొన్నారు. సీఎంను సోమవారం కలవాల్సి ఉండగా.. అనివా ర్య కారణాలతో రద్దయ్యిందని పేర్కొన్నారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో సీనియర్ నాయకులంతా హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. ఏదేమైనా మంత్రి, ఎమ్మెల్యే మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కో–ఆప్షన్ల విషయంలో సీనియర్లకు అవకాశం దక్కలేదని, గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారికే ఇస్తారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లంతా జీవన్రెడ్డి వైపు వెళ్లకుండా ఉండేందుకే సీఎం పిలిచినట్లు సమాచారం. -
సాదా సీదా
జగిత్యాల: గతంలో భూములు కొనాలన్నా.. అమ్మాలన్నా.. సాదాబైనామాపై రాయించుకునేవారు. కాలక్రమేణా రిజిస్ట్రేషన్ వ్యవస్థ రావడంతో ఈ కాగితాలకు విలువ తగ్గిపోయింది. తర్వాత కాలంలో ధరణి పోర్టల్ రావడంతో పట్టా ఉన్నవారికే అన్ని పథకాలకు లబ్ధి పొందే అవకాశం కల్పించారు. అప్పటినుంచి సాదాబైనామాపై భూములు కొనుగోలు చేసిన వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. భూమి సాగులో ఉన్నప్పటికీ వారికి పట్టా హక్కు లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పో యింది. ఈ క్రమంలో ప్ర భుత్వం ఇటీవల సాదాబైనామాల పరిష్కారం కో సం జీవో నంబరు 76ను విడుదల చేసింది. ఈ లెక్కన జిల్లాలో పెండింగ్లో 35, 267 దరఖాస్తులకు పరి ష్కా రం కానున్న నేపథ్యంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూభారతిలోనూ సమస్యలే.. భూముల విషయంలో పట్టాతోపాటు అన్ని వివరాలు పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ధరణి స్థానంలో భూభారతిని అమలు చేస్తోంది. సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి ధరణి పోర్టల్ సెక్షన్ 6, రూల్ నంబరు 6లో నిబంధనలు పొందుపర్చింది. దీని ప్రకారం ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో మాట్లాడిన అనంతరం కొనుగోలుదారుడు, అమ్మకందారుడు అఫిడవిట్లు ఇవ్వాలని నిబంధన ఉండటంతో ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలేదు. ఎవరిని అడిగినా అమ్మకందారుడు ముందుకు రాలేదు. ఇటీవల వచ్చిన భూభారతి చట్టంతోనూ సాదాబైనామా దరఖాస్తులు పరిష్కా రం కాలేదు. ఫలితంగా రైతుల్లో ఆశలు నిరా శలయ్యాయి. తాజగా ప్రభుత్వం జీవో నంబరు 76 విడుదల చేయడంతో కొంత మేర వెసులుబాటు కలిగింది. అఫిడవిట్ ఇస్తే చాలు.. 2014 జూన్ 2లోపు భూముల క్రమబద్ధీకరణకు గతంలో తెల్లకాగితంపై భూములు కొనుగోలు చేసిన వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. ఆ పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినప్పటికీ అందులోనూ కొనుగోలుదారుడు, అమ్మకందారుడు మధ్య ఒప్పందం ఉండాలనే నిబంధన ఉండటంతో సమస్య పరిష్కారానికి నోచలేదు. తాజాగా జీవో విడుదల చేయడంతో కొనుగోలుదారుడు అఫిడవిట్ ఇస్తే సాదాబైనామా పరిష్కరించనున్నారు. జీవో 76 ప్రకారం భూమి కొనుగోలు చేసి సాదాబైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్తో పాటు, భూమి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీవో పరిశీలిస్తారు. అఫిడవిట్ అందించిన తర్వాత 30 రోజులు దరఖాస్తును పెండింగ్లో పెడతారు. ఆ లోపు దరఖాస్తుకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే రైతుకు సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఒకవేళ సాదాబైనామాకు సంబంధించిన తప్పుడు దరఖాస్తు చేసినా మళ్లీ సర్టిఫికెట్ను రద్దు కూడా చేసే అవకాశం ఉంది. రైతుల ఎదురుచూపు గతంలో భూములకు డిమాండ్ లేకపోవడంతోపాటు నమ్మకంగా మనుషుల మధ్య ఒప్పందాలే అధికంగా ఉండేవి. దీంతో తెల్లకాగితాలపైనే ఎక్కువగా క్రయవిక్రయాలు జరిగేవి. ఇప్పుడు ప్రస్తుతం భూముల ధరలు పెరగడం, భూములపై చట్టబద్ధత హక్కులు రావడంతో సాదాబైనామా ద్వారా కొన్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2020 అక్టోబర్లో 212 జీవో ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ అవి కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు వెసులుబాటు కలగడంతో కొంత మేరకు దరఖాస్తులు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ఆర్డీవో ఆధ్వర్యంలోనే..సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన అంతా ఆర్డీవో ఆధ్వర్యంలోనే జరుగుతుంది. 2014 జూన్ కన్నా ముందు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసి మోఖాలో ఉన్నట్లు చూపాల్సి ఉంటుంది. ఆర్డీవో పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం సర్టిఫికెట్ జారీ చేసి పట్టాదారు పాస్బుక్ అందజేస్తారు. -
కో–ఆప్షన్ కోసం అడ్డదారులు
‘మెట్పల్లి పట్టణానికి చెందిన ఓ నాయకుడు మున్సిపల్ కో–ఆప్షన్ పదవిపై ఆశలు పెట్టుకున్నాడు. నిబంధనల ప్రకారం ఆయన ఉన్న నాలుగు పదవుల్లో దేనికీ అర్హుడు కాదు. అయినప్పటికీ ఎలాగైనా పదవి పొందాలనుకున్న సదరు నాయకుడు మైనార్టీ వర్గానికి కేటాయించిన పదవులపై కన్నేశాడు. వెంటనే కరీంనగర్కు వెళ్లి రూ.40వేలు చెల్లించి ఓ మతానికి చెందిన వ్యక్తిగా సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఆ సర్టిఫికెట్తో కో–ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు.’మెట్పల్లి: మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ పదవుల కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. మైనార్టీలు కాకపోయినప్పటికీ ఆ వర్గానికి కేటాయించిన పదవులను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మైనార్టీలకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించడం కోసం ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఎంపిక చేసే కోఆప్షన్ పదవుల్లో కొన్నింటిని ప్రత్యేకంగా ఆ వర్గాలకే కేటాయించింది. అయితే మైనార్టీలు కాకుండా ఆ పదవుల్లో కొన్నింటిని మైనార్టేతరులు పొందుతుండడం వివాదాస్పదమవుతోంది. జిల్లాలో మైనార్టీలకు పది పదవులు.. అమ్మకానికి మతం సర్టిఫికెట్లు దోహదపడుతున్నాయి. -
అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం
జగిత్యాలరూరల్: అగ్నిప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అవసరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఈనెల 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ముద్రించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు గ్రామగ్రామాన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలుజగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన, ప్రతిజ్ఞ చేయించామన్నారు. బ్లాక్స్పాట్ల ప్రాంతాలను పరిశీలించారు. జీబ్రాలైన్స మరమ్మతు, రోడ్డులైన్ మార్కింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయించారు. రోడ్డు భద్రత కేవలం పోలీసులది మాత్రమే కాదని, పౌరులందరిదీ అని తెలిపారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్నారు. కేసీఆర్ సభపై సన్నాహక సమావేశంమల్యాల: జిల్లాకేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు గ్రామా ల నుంచి వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. కేసీఆర్ బహిరంగ సభకు జన సమీకరణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, మాజీ ఎంపీపీ తైదల శ్రీలత, మాజీ సర్పంచ్ రౌతు రవి వర్మ, బద్దం తిరుపతి రెడ్డి, ప్యాక్స్ మాజీ చైర్మన్ బోయినపల్లి మధుసూదన్రావు, భూపతిరెడ్డి, పాల్గొన్నారు. మలయశ్రీ సాహిత్యం భావి తరాలకు మార్గదర్శకంకరీంనగర్కల్చరల్: మలయశ్రీ సాహిత్య సేవలు అపారమని, ఆయన రచనలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని కసప శ్యామ్ సుందర్ అన్నారు. మంగళవారం నగరంలోని ఐఏంఏ హాల్లో వివిధ సాహితీసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ కవి మలయశ్రీ సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించి మాట్లాడారు. తాను నమ్మిన ఆశయం కోసం చివరి శ్వాస వరకు నిలపడిన ఆచరణ వాది అన్నారు. ఆయన జీవిత చరిత్రను తీసుకురావాల్సిన అవసరం ఉందని, విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సభలో పాల్గొన్న వక్తలు తెలియజేశారు. కవులు గండ్ర లక్ష్మణరావు, నలిమెల భాస్కర్, బీఎన్.రావు, గాజోజు నాగభూషణం, సేనాధిపతి, సూరేపల్లి సుజాత, సబ్బని లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మ, మాడిశెట్టి గోపాల్ పాల్గొన్నారు. నర్సింగ్ ఆఫీసర్గా ఎంపికై న యువకుడికి సన్మానంకథలాపూర్: మండల కేంద్రానికి చెందిన మిట్టపెల్లి జాన్ అనే యువకుడు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించగా, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం సన్మానించారు. నేటి యువత జాన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కాశవత్తుల లక్ష్మిరాజం, మండల నాయకులు వినోద్, కిషన్ బ్రదర్, అంజయ్య, గంగారెడ్డి, గంగాధర్, రవి, గణేశ్, రాజు, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి కోసం బతకాలె కొడుకా
కరీంనగర్ జిల్లా: అనారోగ్యంతో భర్త దూరమైనా ఒక్కగానొక్క కొడుకే సర్వస్వంగా భావిస్తూ ఆ తల్లి కూలీనాలీ చేసుకుంటూ పోషించుకుంది. భర్త దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే కొడుకు వెన్నెముక వ్యాధి బారిన పడ్డాడు. ఆపరేషన్కు రూ.లక్షలు అవసరం కాగా.. ఎలాగోలా సొమ్ము పోగు చేసుకుంది. ఇక కొడుక్కు ఏ బాధ లేదనుకున్న సమయంలో విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. సైకిల్పై వెళ్తున్న బాలుడు కింద పడడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆపరేషన్ చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శంషాబాద్లో తీవ్ర విషాదం నెలకొనగా.. ఆ తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు.. స్థాని కుల కథనం ప్రకారం.. శంశాబాద్ గ్రామానికి చెందిన బాకారపు రాజేశ్వరి– కుమార్ దంపతుల కొడుకు అక్షిత్(11) ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా రాజేశ్వరీ కూలీ పనులు చేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది. అక్షిత్ కొద్ది నెలల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ఆపరేషన్కు రూ.16 లక్షలు అవసరం కాగా.. రూ.9లక్షలు పోగు చేశారు. ఇటీవల అక్షిత్ సైకిల్ నుంచి పడగా మెదడులో రక్తం గడ్డకట్టింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజులు అక్కడ చికిత్స పొందగా.. రక్తకణాలు పెరుగుతూ, తగ్గుతున్నాయని కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం బాలుడు చనిపోయాడు. ‘నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ అంత్యక్రియల్లో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. సర్పంచ్ మెరుగు కళావతి సంపత్ రూ.3,016 ఆర్థికసాయం అందించారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’ వేగం పెంచాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 10,860 ఇళ్లు పెండింగ్లో ఉన్నాయని, ఈనెల 30 నాటికి పనులు ప్రారంభించాలని సూచించారు. 100 శాతం గ్రౌండింగ్ చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. జూన్ రెండు నాటికి గృహ ప్రవేశాలు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారులకు బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. జగిత్యాల, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్రెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, కమిషనర్లు పాల్గొన్నారు. -
పెన్షన్ వస్తలేదు
మాది కోరుట్ల మండలం వాల్గొండ గ్రామం. బీడీలు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం. పీఎఫ్ ఉన్నా మాకు జీవనభృతి రావడం లేదు. బీడీలు చేయని వారు భృతి పొందుతున్నారు. పీఎఫ్ ఉన్న మాకు భృతి ఇప్పించండి. – వాల్గొండ బీడీ కార్మికులు ప్లాస్టిక్ నిషేధించండి గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని కాపాడండి. 12ఏళ్లకోసారి జరిగే పుష్కరాలకు ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. హోటళ్లు, దుకాణదారులు ప్లాస్టిక్ వినియోగించకుండా ఆంక్షలు విధించండి. – నాగిరెడ్డి మధుసూదన్రెడ్డి, న్యాయవాది ఫొటో క్యాప్చర్ చేయడం లేదు మాది పెగడపల్లి మండలం ల్యాగలమర్రి. ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. పిల్లర్ల దశకు చేరినా ఫొటో క్యాప్చర్ చేయడం లేదు. రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించగా ఆ ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా తహసీల్దార్, సర్పంచు కుమ్మకై ్క వాస్తవాలను తొక్కి పెడుతూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – కల్లెపెల్లి భాగ్యమ్మ -
యూనిక్ టోకరా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మొన్న సహారా, నిన్న మెటా ఫండ్, నేడు యూనిక్.. సంస్థల పేరు ఏదైనా అందరి లక్ష్యం ఒకటే.. ఏదో ఒకరకంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడం ఆపై మొహం చాటేయడం. తాజాగా యూనిక్ అనే ఉత్తారాదికి చెందిన సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ స్కాంకు పాల్పడిందని ఖాతాదారులు, ఏజెంట్లు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించి ఇప్పుడు వారిని రేపు..మాపు.. అంటూ తిప్పుకుంటుందని బాధితులు వాపోతున్నారు. ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ తీయని మాటలు చెప్పిన సంస్థ తీరా గడువు ముగిసి నాలుగేళ్లు గడుస్తున్నా ఎలాంటి డబ్బు చెల్లించకపోవడంతో బాధితులంతా ఏజెంట్ల ఇళ్ల మీదకు వస్తున్నారు. దీంతో ఏజెంట్లంతా కంగారుపడి యూనిక్ సంస్థపై న్యాయపోరాటం చేయాలని తీర్మానించుకున్నారు. వీరంతా కలిసి ఇటీవల కరీంనగర్లో సమావేశం పెట్టుకుని డిపాజిటర్ల డబ్బులు వెనక్కి తీసుకురావాలని నిర్ణయించారు. అసలేం జరిగింది? వాస్తవానికి ఇది ఫైనాన్స్ సంస్థ కాదు. దీని వ్యవహారం చూస్తుంటే మల్టీలెవల్ మార్కెటింగ్ను తలపిస్తోంది. పదకొండేళ్ల క్రితం అంటే 2015 నుంచి ఇది తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించింది. కేవలం ఆరేళ్లలో మీ డబ్బులు రెట్టింపు చేస్తామంటూ కస్టమర్లకు ఎరవేసింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, కరీంనగర్తోపాటు, నల్లగొండ జిల్లాలో భారీగా డిపాజిట్లు సేకరించింది. సంస్థ కార్యకలాపాలు, హామీలకు ఆకర్షితులైన పలువురు ఈ సంస్థలో ఏజెంట్లుగా చేరారు. సంస్థ లక్ష్యాలు సామాన్యులకు వివరించి.. కేవలం ఆరేళ్లలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించారు. 24 గంటలు అదే పనిలో ఉండి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బులు కట్టించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్ల వరకు సేకరించినట్లు సమాచారం. కరోనా నాటికి డిపాజిటర్ల మెచ్యూరిటీ గడువు పూర్తయింది. అయినా యూనిక్ సంస్థ డబ్బులు చెల్లించకుండా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తోంది. దీంతో బాధితులు, ఏజెంట్లు అంతా కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు. మెటాను మించిన యూనిక్.. ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన సంస్థ ఇటీవలి కాలంలో మరోటి లేదంటే అతిశయోక్తి కాదు.. గతంలో కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన జీబీఆర్ క్రిప్టో కరెన్సీ రూ.100 కోట్ల వరకు కరీంనగర్ నుంచి వసూలు చేసింది. అనంతరం ఇదే కరీంనగర్ కేంద్రంగా ఓ మాజీ కార్పొరేటర్ ఏకంగా మెటాఫండ్ పేరుతో రూ.300 కోట్ల వరకు ప్రజల నుంచి సేకరించారు. ఈ డబ్బులు ఏకంగా దేశం దాటి పోయాయి. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పోలీసులు అరెస్టు చేసినా.. డబ్బుల రికవరీలో మాత్రం ఎలాంటి పురోగతి లేదు. తాజాగా ‘యూనిక్’ కేసులో రూ.500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటం ఆసక్తి రేపుతోంది. ఈ విషయమై జిల్లాలో పలు స్టేషన్లలో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కేసులు పెడితే.. డబ్బులు వెనక్కి రావంటూ నేటికీ యూనిక్ సంస్థ ప్రతినిధులు డిపాజిటర్లను మభ్యపెడుతున్నారు. -
పంట పండించాలి.. మంచి ధరకు విక్రయించాలి
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు కష్టపడి పంటను పండించడంతోపాటు ఆ పంటను సరైన ధరకు అమ్ముకునేలా మార్కెటింగ్ వ్యూహరచన తెలుసుకోవాలని వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి డైరెక్టర్ ఎన్.సంధ్యాకిశోర్ తెలిపారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో సద్గురు ఫౌండేషన్ ఫర్ డెవలపర్, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సోమవారం యువ రైతులకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. పప్పు ధాన్యాలకు డిమాండ్ ఉన్నందున సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. వరిలో వివిధ రకాలపై వరి శాస్త్రవేత్త శ్రీనివాస్, భూపరీక్షలు, పరీక్ష విధానం, పరికరాలపై శాస్త్రవేత్త సాయినాథ్, సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై శాస్త్రవేత్త రవి, హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిపై మధుకర్ వివరించారు. సద్గురు ఫౌండేషన్ ప్రతినిధులు ఉపేందర్, లిఖితలు పాల్గొన్నారు. -
కో ఆప్షన్ ఎవరికి దక్కేనో..?
కోఆప్షన్ పదవి కోసం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ కొందరి పేర్లను అధిష్టానానికి పంపించారు. మరికొందరు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ వద్దకు వెళ్లారు. ఇంకొందరి పేర్లను డీసీసీ అధ్యక్షుడు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎవరికివారుగా తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఈనెల 16లోపు ఎన్నిక జగిత్యాల బల్దియాలో 11 దరఖాస్తులు రాగా.. స్క్రూటిని చేసి నోటిఫికేషన్ జారీ చేస్తారు. 16, 17 తేదీల్లో వీరిని ఎంపిక చేసే అవకాశం ఉంది. జనరల్లో ఇంతకుపూర్వం కౌన్సిలర్గా చేసి ఉండాలి. స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్కై నా అవకాశం ఉంటుంది. మైనార్టీల్లో 21 ఏళ్లు ఉండి, ఓటరు రిజిస్టర్ అయితే సరిపోతుంది. ఆశావహుల్లో ఆందోళన గతంలో కౌన్సిలర్ టికెట్కు పోటీపడగా ఓడిపోయినవారు.. టికెట్ రాక పక్కకు తప్పుకొన్నవారికి కో–ఆప్షన్ పదవి ఇస్తామని ఆ సమయంలో అధిష్ఠానం బుజ్జగించింది. ప్రస్తుతం వారి పేర్లు కాకుండా ఇతరుల పేర్లు తెరపైకి వస్తుండడంతో కంగుతింటున్నారు. ఇందులో మొదటి నుంచి కాంగ్రెస్లో లేనివారికే అవకాశాలు ఇస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జీవన్రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో ఎమ్మెల్యేకే పూర్తి నిర్ణయాధికారం లభించినట్లయ్యింది. ఈ క్రమంలో ఏళ్ల తరబడి జెండా మోసిన తమకు అవకాశం వస్తుందో.. రాదోనని ఆందోళన చెందుతున్నారు. మెట్పల్లిలో నాలుగు పదవులు.. ఇరవై నాలుగు దరఖాస్తులు మెట్పల్లిలో మొత్తం నాలుగు పదవులు ఉండగా.. ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద సంఖ్యలో ఆశావహులు బరిలో నిలిచారు. బల్దియాలో ఏ పార్టీకీ మెజార్టీ లేకపోవడం కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోటీకి దూరంగా బీఆర్ఎస్ రెండువర్గాలుగా బీజేపీ కౌన్సిలర్లు జగిత్యాల/మెట్పల్లి: కో–ఆప్షన్ పదవుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జగిత్యాల బల్దియాలో నాలుగు పదవులకు 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా ఎమ్మెల్యే, మంత్రి చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఇటీవల కౌన్సిలర్గా పోటీచేసి ఓడిపోయిన వారు, టికెట్ ఇవ్వకపోవడంతో తప్పుకొన్నవారు ఉన్నారు. జగిత్యాలలో నాలుగింట్లో రెండు జనరల్, రెండు మైనార్టీలకు అవకాశం దక్కనుంది. రెండు పదవులు మహిళలకు కేటాయించనున్నారు. జనరల్ నుంచి గట్టు సతీశ్, మహిళ కోటాలో జుంబర్తి లక్ష్మీ పోటీపడుతున్నారు. మైనార్టీ కోటాలో అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మహిళ కోటలో తస్లీమా సుల్తానా పదవి కోరుతున్నారు. -
దోస్త్ పిలుస్తోంది
కరీంనగర్ సిటీ: డిగ్రీలో ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి సోమవారం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ ఒకటవ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. దీంతో శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల వేటలో పడ్డాయి. ఇంటర్ పూర్తయిన విద్యార్థుల సమాచారం సేకరించి, మా కాలేజీలో చేరండంటూ పీఆర్వోల ద్వారా ఫోన్లు చేస్తున్నారు. ప్రత్యేక రాయితీలు ఇస్తామంటూ ఆకర్షిస్తున్నారు. ఆయా కళాశాలల లెక్చరర్లకు టార్గెట్లు విధించి, ప్రత్యేక వాహనాలు కేటాయిస్తూ ఆడ్మిషన్ల కోసం క్యాంపెయినింగ్ చేయిస్తున్నారు. రంగంలోకి పీఆర్వోలు, లెక్చరర్లు ప్రతీ కళాశాల యాజమాన్యం విద్యార్థులను చేర్పించుకునేందుకు పీఆర్వోలను నియమించుకున్నాయి. వీరితో పాటు అధ్యాపకులు సైతం గ్రామాలు, మండలాలు, పట్టణాల వారీగా ఇంటర్ పూర్తిచేసిన వారి వివరాలు సేకరించి, అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులతో టచ్లోకి వెళ్తున్నారు. విద్యార్థులను చేర్పించినందుకు పీఆర్వోలకు, లెక్చరర్లకు ఒక్కో అడ్మిషన్కు రూ.6వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తున్నారని సమాచారం. డిగ్రీ ప్రవేశాలు ఎంతో పారదర్శకంగా నిర్వహించాలనే లక్ష్యంతో దోస్త్ను తీసుకురాగా ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ అడ్డదారిలో ప్రవేశాలు పొందడానికి పలు ప్రైవేట్ కళాశాలలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. విద్యా ప్రమాణాలే ముఖ్యం శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మొత్తం 93 కాలేజీలున్నాయి. వీటితో ఉన్నత విద్యాప్రమాణాలు పాటించే కాలేజీలను ఎంచుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఆఫర్లకు ఆశపడి నాణ్యత పాటించని, వ్యాపార దృక్పథంతో నడిచే కాలేజీల్లో చేరి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు. కళాశాల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకుని, ఒకసారి సందర్శించి, అక్కడున్న సౌకర్యాలు పరిశీలించిన తర్వాతనే చేరాలని చెబుతున్నారు. అందులో చదువుతున్న సీనియర్లను సంప్రందించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారో తెలుసుకోవాలని చెబుతున్నారు.నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 13 మొదటి దశ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు (రిజిస్టేషన్ రుసుం రూ.200) వెబ్ ఆప్షన్ నమోదు ఏప్రిల్ 30 నుంచి మే 08 వరకు మే 14న సీట్ల కేటాయింపు విద్యార్థులు చేరు సమయం మే 15వ తేదీ నుంచి మే 25 వరకు మే 15 నుంచి మే 25 వరకు (రిజిస్ట్రేషన్ రుసుం రూ. 400) వెబ్ ఆప్షన్ నమోదు మే 15 నుంచి మే 26 వరకు మే 30న రెండో దశ సీట్ల కేటాయింపు విద్యార్థులు చేరు సమయం మే 31వ తేదీ నుంచి జూన్ 5 లోపు మే 31 నుంచి జూన్ 15 వరకు (రిజిస్ట్రేషన్ రుసుం రూ. 400) వెబ్ ఆప్షన్ నమోదు మే 31 నుంచి జూన్ 16 వరకు జూన్ 20న సీట్ల కేటాయింపు విద్యార్థులు చేరు సమయం జూన్ 20 నుంచి జూన్ 25లోపు మొదటి సెమిస్టర్ తరగతులు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం విద్యార్థుల వేటలో ప్రైవేటు పీఆర్వోలు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో కళాశాలలు ప్రభుత్వ 15 ఎయిడెడ్ 02 ప్రైవేట్ 76 మొత్తం 93 -
ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడి మృతి
జ్యోతినగర్: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుడు తాళ్లపల్లి యాదగిరి(52) తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. వివరాలు.. గోదావరిఖని ఐబీకాలనీకి చెందిన తాళ్లపల్లి యాదగిరి ఎన్టీపీసీ ప్రాజెక్టులోని గోరఖ్పూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం షిప్టుకు హాజరయ్యాడు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఆర్ఎం డిపార్ట్మెంట్ సర్వీస్ బిల్డింగ్లో అకస్మాత్తుగా పడిపోయాడు. కార్మికులు స్థానిక ధన్వంతరి ఆస్పత్రిలో చేర్పించగా ప్రాథమిక పరీక్షల అనంతరం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య యాకమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు హెచ్ఆర్ విభాగానికి డిమాండ్ నోటీసు అందించారు. ఆన్ డ్యూటీలో మృతి చెందడంతో రూ.30 లక్షల ఎక్స్గ్రేసియా, కుటుంబంలో ఇద్దరికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, దహన సంస్కారాలకు రూ.50 వేలు, రవాణా ఖర్చు చెల్లించాలని డిమాండ్ చేశారు. విషపురుగు కాటుకు కార్మికుడి మృతి కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్ల గ్రామానికి చెందిన పట్నం లెనిన్(32)అనే భవన నిర్మాణ రంగ కార్మికుడు విషపురుగు కాటు వేయడంతో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేసీ్త్ర వద్దకు ఆదివారం కూలీపనికి వెళ్లిన లెనిన్.. పనులు ముగించుకుని ఇంటికి చేరాడు. నీళ్లు వేడిచేసుకునేందుకు వంటచెరుకు తీస్తుండగా విషపురుగు కాటు వేసింది. కాల్వశ్రీరాంపూర్లోని ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పెద్దపల్లికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. మృతుడికి భార్య వనిత, తల్లిదండ్రులు ఉన్నారు. చందాలతో అంత్యక్రియలు లేనిన్ కుటుంబం అత్యంత పేదరికంలో ఉంది. కనీసం అంత్యక్రియలు నిర్వహించే స్థితిలో కూడాలేదు. దీంతో గ్రామస్తులు తలాకొంత పోగుచేసి అంత్యక్రియలు నిర్వహించారు. లెనిన్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కూర్మాచలం ఆంజనేయులు (70) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు భార్య మూడేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి నిద్రించాడు. ఉదయం లేచి చూసే సరికి ఇంటి పక్కనున్న చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఆంజనేయులు కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. -
గుదిబండగా విద్యుత్ బకాయిలు
పెగడపల్లి: జిల్లాలో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిలు ఆ శాఖకు గుదిబండగా మారాయి. జిల్లావ్యాప్తంగా వివిధ శాఖల నుంచి 2026 ఫిబ్రవరి వరకు రూ.25.425 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. సామాన్య ప్రజలకు సంబంధించి గృహ, వాణిజ్య, పరిశ్రమలు.. ఇలా ఏదైనా విద్యుత్ బిల్లు బకాయి ఒక నెల చెల్లించకుంటే సరఫరా నిలిపి వేస్తామని అధికారులు నోటీసులు ఇస్తుంటారు. ఇంకా ఆలస్యమైతే తక్షణమే కనెక్షన్ తొలగిస్తారు. బిల్లు చెల్లించి రశీదు చూపితేగానీ తిరిగి కనెక్షన్ ఇవ్వరు. ఆలస్యమైన దానికి తదుపరి బిల్లులో ప్రత్యేక చార్జి వసూలు చేస్తారు. పంచాయతీల్లోనే ఎక్కువ.. జిల్లాలో 385 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడక ముందు విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. పంచాయతీల్లో సాధారణంగా వీధి దీపాలు, మంచినీటి సరఫరా చేసే మోటార్లు, పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ వినియోగిస్తారు. ఆయా పంచాయతీల్లో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. కొన్ని పంచాయతీలు సుమారు మూడేళ్లుగా బిల్లు చెల్లించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికై న పాలకవర్గాలకు వచ్చే నిధులను గతంలో చేసిన పనులకు చెల్లిస్తున్నారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మెట్పల్లి, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ సర్వీసుల బకాయిలు చెల్లించకున్నా విద్యుత్ సరఫరా నిలిపివేయొద్దని ఆదేశాలున్నాయని, దీంతో చేసేదేమీ లేక తాము మిన్నకుండిపోవాల్సి వస్తోందని ట్రాన్స్కోకు చెందిన ఓ అధికారి తెలిపారు. నెలనెలా బకాయిల భారం పెరిగి విద్యుత్ సంస్థకు భారంగా మారుతోంది. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక నిధులు విడుదల చేసి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ట్రాన్స్కో అధికారులు కోరుతున్నారు. -
‘ఇస్రో’ యువికకు ఎంపిక
కరీంనగర్: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థిని చిలువేరి శ్రీ నిత్య జాతీయ పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహించిన క్విజ్ పోటీల్లో పాల్గొని యువిక కార్యక్రమానికి ఎంపికై ంది. దేశవ్యాప్తంగా 456 మందిలో తెలంగాణ నుంచి 15 మంది సెలెక్ట్ అయ్యారని, వారిలో శ్రీనిత్యం ఉండటం పాఠశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, డీఈవో రాము శ్రీనిత్యను అభినందించి, శాలువాతో సన్మానించారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్కు ఎంపికై నట్లు ఇస్రో నుంచి సమాచారం అందడం చాలా సంతోషంగా ఉందని, మే 10న ఇస్రో టూర్ ఉంటుందని కాల్ లెటర్ అందుకున్న శ్రీనిత్య ఆనందం వ్యక్తం చేసింది. శ్రీనిత్యను అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, గ్రామస్తులు, జిల్లా అధికారులు అభినందించారు. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రాగినేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న శ్రీనిత్య భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) నిర్వహిస్తున్న యువిక– 2026కు ఎంపికై ంది. రాష్ట్రవ్యాప్తంగా 10 మంది విద్యార్థులను ఎంపిక చేయగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్దపల్లి మండలం రాగినేడుకు చెందిన శ్రీనిత్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. కాగా.. పెద్దపల్లి మండలం రాగినేడు జిల్లా పరిషత ఉన్నత పాఠశాల నుంచి మూడేళ్లుగా వరుసగా ఇస్రో యువికకు విద్యార్థులు ఎంపిక అవుతున్నారని హెచ్ఎం ఆగయ్య తెలిపారు. యువిక –2026కు ఎంపికై న శ్రీనిత్య హైదరాబాద్లో 15రోజుల పాటు జరిగే ఈ యంగ్ సైంటిస్టు వర్క్షాప్లో పాల్గొంటుందన్నారు. శ్రీనిత్య ఎంపికయ్యేందుకు కృషి చేసిన గైడ్ టీచర్ జగదీశ్వర్రెడ్డి, హెచ్ఎం ఆగయ్య, ఉపాధ్యాయులను సర్పంచ్ సోమకుమార్ అభినందించారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు తక్కువేమీకాదని రాగినేడు విద్యార్థులు నిరూపించారని ప్రశంసించారు. -
రెండు ఆలయాల్లో దొంగతనం
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేటలోగల రామాల యం, మల్లికార్జునస్వామి ఆలయాల్లో గుర్తు తెలియ ని దుండగులు చొరబడ్డారు. హుండీలను ధ్వంసం చేసి అందులో ని డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. హుండీల్లో సుమారు రూ.25 వేలు ఉంటాయని చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆలయాలను పరిశీలించి వివరాలు సేకరించారు. మత పరిమితులు సరికాదు కొడిమ్యాల: ఎస్సీ రిజర్వేషన్ను మతంతో అనుసంధానం చేయడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని మానవ హక్కుల నేర నిరోధక సంఘం జిల్లా అధ్యక్షుడు పర్లపల్లి ఏలియా అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడారు. సామాజిక వెనుకబాటుతనాన్ని ఆధారంగా తీసుకుని అందరికీ సమానంగా అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
అందరి కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ
జగిత్యాలక్రైం: అందరి కృషి ఉంటే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ ఆవరణలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కోసం ఈనెల 13 నుంచి 18 వరకు అరైవ్ ఎ లైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. వాహనదారులు నియమ నిబంధనలు పాటించాలన్నారు. వేగం ప్రాణం తీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటి నివారణకే అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడమే ప్రధానకారణాలుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, ఆర్టీవో శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, సీఐలు కరుణాకర్, ఎస్సైలు సుప్రియ, సదాకర్, కుమారస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని కలెక్టర్, ఎస్పీ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా జిల్లాకేంద్రంలో 150 సీసీ కెమెరాలను ప్రారంభించారు. కెమెరాలు ఉన్నాయన్న భయం నిందితుల్లో ఉంటుందని, ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, అపార్ట్మెంట్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రధాన రహదారులు, క్రాస్రోడ్లు, బిజీ సెంటర్లు, మార్కెట్ ప్రాంతాల్లో తప్పనిసరని పేర్కొన్నారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన కళాశాల, పాఠశాల యాజమాన్యాలు, వ్యాపారవేత్తలు, ఇతర సంస్థల ప్రతినిధులను అభినందించారు. -
ఆలకించి.. ఆదేశించి..
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 63అర్జీలు రాగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, ఆర్డీవోలు పాల్గొన్నారు. భూమిని ఆక్రమించారు గ్రామ శివారులోని సర్వేనంబర్ 678లోని 2.5 ఎకరాల భూమి ఉంది. 60ఏళ్ల క్రితం కొనుక్కుని సాగుచేసుకుంటున్నాం. ప్రస్తుతం ఆ భూమిని పోరంబోకు భూమి అంటూ మాజీ సర్పంచ్, అధికారులు కుమ్మకై ్క రైతువేదిక నిర్మించారు. నా భూమి నుంచే దుర్గాదేవి గుడికి దారి వేస్తున్నారు. ఆ భూమి తప్ప మా కుటుంబానికి వేరే ఆధారం లేదు. గత వారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన. న్యాయం చేసి ఆదుకోండి. – వంగ ముత్తవ్వ, మైతాపూర్, రాయికల్ కరెంట్ మీటర్ ఇప్పించండి ‘మా ఇంటి కరెంట్ మీటర్ను ఏఈ తీసుకెళ్లాడు. చీకట్లో ఉంటూ ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్ అదికారులను కలిసినా పట్టించుకోవడం లేదు’ అంటూ పెట్రోల్ బాటిల్తో రాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ను కలిసి తన సమస్యపై వినతిపత్రం అందించింది. – గుగులోతు లక్ష్మీ, వేములకుర్తి -
శ్రీపాదరావు సేవలు మరవలేనివి
ధర్మపురి: స్వర్గీయ శ్రీపాదరావు సేవలు మరువలేనివని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీపాదరావు 27వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అజాత శత్రువుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గొప్ప మహానీయుడని కొనియాడారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు చీపిశెట్టి రాజేశ్ తదితరులున్నారు. కోరుట్లలో మళ్లీ వసూళ్ల పర్వం కోరుట్ల: చిన్నాచితకా పంచాయితీలను అడ్డుపెట్టుకుని కోరుట్లకు చెందిన ఓ నేరస్తుల ముఠా మళ్లీ వ్యాపారుల నుంచి వసూళ్లకు దిగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. గతంలో కోరుట్ల పట్టణంలో పలు నేరాలకు పాల్పడిన ముఠా ఈ పనికి పాల్పడుతోందన్న అనుమానంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెల్సింది. వ్యాపారుల నుంచి.. పట్టణంలోని ఇద్దరు వ్యాపారులను ముఠాలోని కీలక వ్యక్తి వారం క్రితం బెదిరించినట్లు సమాచారం. సదరు వ్యాపారులిద్దరూ ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. డబ్బుల వసూళ్లు, భూతగాదాలు, ఆస్తి పంపకాల పంచాయితీలు వంటి అంశాలను ఆసరాగా చేసుకుని ఆ ముఠా కొందరి వద్ద రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా ముఠాకు డబ్బు ఇచ్చి ఇబ్బంది లేకుండా చూసుకున్నట్లు సమాచారం. ముఠా తమ కార్యకలాపాలను పెంచడంతో ఇద్దరు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ముఠాపై గతంలోనే క్రిమినల్ కేసులు నమోదు కావడం.. మళ్లీ వసూళ్లకు పాల్పడుతుండడంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు ముఠా కోసం తీవ్రంగా వెతుకుతున్నట్లు తెలిసింది. సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 22 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్పై అవగాహన కల్పించాలి
జగిత్యాల: హెచ్పీవీ వ్యాక్సినేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వైద్యాధికారులతో సోమవారం సమీక్షించారు. బాలి కల ఆరోగ్య పరిరక్షణకు హెచ్పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 15ఏళ్లు చేరిన బాలికలకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలన్నారు. 2170 వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా.. ఇప్పటివరకు 769 వ్యాక్సిన్లు వేశామని తెలిపారు. డీఎంహెచ్వో సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి, ఆర్ఎంవో రాజ్కుమార్ పాల్గొన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించాలి గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ అన్నారు. మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణపక్షం పోస్టర్ను ఆవిష్కరించారు. చిన్నారుల అభివృద్ధిపై తల్లి దండ్రుల బాధ్యత అంశంపై అవగాహన కల్పించా లన్నారు. డీడబ్ల్యూవో రాజ్కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందన ఇంటర్లో ఉత్తమ మార్కులు సాధించిన వారిని కలెక్టర్ అభినందించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో అత్యధిక మార్కలు సాధించగా నోడల్ అధికారి నారాయణతో కలిసి అభినందించారు. ముగిసిన ‘పది’ పరీక్షలు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పలు కేంద్రాలను పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వసతులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, శాఖాధికారులు, సిట్టింగ్ స్క్వాడ్, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించారని తెలిపారు. ఆయన వెంట డీఈవో రాము ఉన్నారు. మొత్తం 68 సెంటర్లలో 12,694 విద్యార్థులకు 12,685 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. -
ఎవరి కోసం బతకాలె కొడుకా
మానకొండూర్: అనారోగ్యంతో భర్త దూరమైనా ఒక్కగానొక్క కొడుకే సర్వస్వంగా భావిస్తూ ఆ తల్లి కూలీనాలీ చేసుకుంటూ పోషించుకుంది. భర్త దూరమైన దుఃఖం నుంచి తేరుకోకముందే కొడుకు వెన్నెముక వ్యాధి బారిన పడ్డాడు. ఆపరేషన్కు రూ.లక్షలు అవసరం కాగా.. ఎలాగోలా సొమ్ము పోగు చేసుకుంది. ఇక కొడుక్కు ఏ బాధ లేదనుకున్న సమయంలో విధి మరోసారి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. సైకిల్పై వెళ్తున్న బాలుడు కింద పడడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆపరేషన్ చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం శంషాబాద్లో తీవ్ర విషాదం నెలకొనగా.. ఆ తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు.. స్థాని కుల కథనం ప్రకారం.. శంశాబాద్ గ్రామానికి చెందిన బాకారపు రాజేశ్వరి– కుమార్ దంపతుల కొ డుకు అక్షిత్(11) ఐదో తరగతి చదువుతున్నాడు. కుమార్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా రాజేశ్వరీ కూలీ పనులు చేసుకుంటూ కొడుకును పోషించుకుంటోంది. అక్షిత్ కొద్ది నెలల నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతున్నాడు. ఆపరేషన్కు రూ.16 లక్షలు అవసరం కాగా.. రూ.9లక్షలు పోగు చేశారు. ఇటీవల అక్షిత్ సైకిల్ నుంచి పడగా మెదడులో రక్తం గడ్డకట్టింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు హైదరాబాద్ తరలించారు. కొద్దిరోజులు అక్కడ చికిత్స పొందగా.. రక్తకణాలు పెరుగుతూ, తగ్గుతున్నాయని కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి సోమవారం బాలుడు చనిపోయాడు. ‘నన్ను ఒంటరి చేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ అంత్యక్రియల్లో తల్లి రోదించిన తీరు గ్రామస్తులను కలచివేసింది. సర్పంచ్ మెరుగు కళావతి సంపత్ రూ.3,016 ఆర్థికసాయం అందించారు. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతి సైకిల్ నుంచి పడి చికిత్స పొందుతూ నేడు కొడుకు ఎవరి కోసం బతకాలె కొడుకా అంటూ తల్లడిల్లిన తల్లి హృదయం కరీంనగర్ జిల్లా శంషాబాద్లో విషాదం -
ఫైల్కు రూ.10 వేలు..!
కోరుట్ల: ఇల్లు.. పెళ్లి.. ఈ రెండు ప్రతిఒక్కరి జీవితంలో కీలకఘట్టాలు. బంధుమిత్రుల సహకారం.. చేతిలో కాసిన్ని డబ్బులు ఉంటే పెళ్లితంతును ఎలాగోలా ముగించవచ్చు.. కానీ ఇక్కడ ఇల్లు కట్టడం కష్టతరంగా మారిపోయింది. పర్మిషన్ తీసుకోవడం మొదలు.. ఇల్లు పూర్తయినా చిన్నపాటి నిబంధనల పేరిట అధికార యంత్రాంగం ‘కాసులవసూళ్ల’కు తెగబడటం కోరుట్లలో ‘కామన్’గా మారిపోయింది. అటు ఉన్నతాధికారులు.. ఇటు మున్సిపల్ పాలకవర్గం కలిసి అధికారుల వసూళ్లపర్వానికి అడ్డుకట్ట వేయాలన్న పట్టింపు లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. రూ.10 వేలు ముట్టాల్సిందే.. ఇల్లు నిర్మాణ అనుమతితోపాటు ఇంటి ప్లాన్ కోసం సాధారణంగా అర్కిటెక్చర్లను కలవడం ఆనవాయితీ. ఇక్కడే మొదలవుతోంది అధికారుల వసూళ్ల పర్వం. కోరుట్ల మున్సిపల్ అధికారుల సూచనల మేరకు అర్కిటెక్చర్లు తమ ఫీజుతోపాటు తమకు ఇవ్వాల్సిన అమ్యామ్యాలు కలిపి రూ.10వేలు వసూలు చేయాల్సిందే. వాస్తవానికి ఇందులో అర్కిటెక్చర్లకు అందేది కేవలం రూ.2వేల నుంచి రూ.3వేలు మాత్రమే. మిగిలిన సొమ్మంతా మున్సిపల్ అధికారుల ఖాతాలోకే చేరుతోంది. ఇలా అయితేనే సదరు అర్కిటెక్చర్ ఇచ్చే ఇంటి నిర్మాణ పనులకు ఎలాంటి కొర్రీలు లేకుండా అనుమతులు దక్కుతాయి. కాదంటే సెట్బ్యాక్, లింకు డాక్యుమెంట్ల దగ్గర నుంచి పహాణి కాపీలు కావాలని అధికారులు అడ్డగోలు కాగితాలు అడుగుతారు. ఈ ధ్రువీకరణ పత్రాలు తీసుకురాలేక.. నానా తిప్పలు పడలేక ఇంటి నిర్మాణం చేపట్టేవారు అర్కిటెక్చర్లు చెప్పిన రీతిలో అనుమతి కోసం అడిగినంతా ఇస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగినట్లే.. ఇంటి నిర్మాణ అనుమతి పైళ్లకు అధికారులకు ఇచ్చే షరా ‘మామూళ్లు’ ఎప్పుడు ఒకేలా ఉండవు. నిత్యావసర సరుకుల ధరలు ఎప్పటికప్పుడు ఎలా పెరుగుతాయో.. అదే రీతిలో పెరిగిపోతున్నాయి. ఆరేళ్ల క్రితం ఇంటి నిర్మాణ ఫైలుకు మున్సిపల్ ‘మామూళ్లు’ కేవలం రూ.4 వేలు ఉండేది. అప్పుడు అర్కిటెక్చర్లు రూ.6వేలు తీసుకుని అనుమతి కోసం దరఖాస్తు చేసేవారు. ఏడాది క్రితం కోరుట్ల మున్సిపాలిటీలో ఓ పైస్థాయి అధికారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ‘మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.. మరి మనకూ ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకే ఇంటి నిర్మాణ ఫైల్ పర్మిషన్ ధరలు పెంచాలి..’ అని సిఫార్సు చేసినట్లు సమాచారం. వెంటనే ఇంటి నిర్మాణ అనుమతి ధర ఫైలుకు రూ.8వేలకు చేరింది. ఈమధ్య మళ్లీ సరుకుల ధరలు పెరిగినట్టున్నాయి.. అందుకే అదనంగా మరో రూ.2వేలు చెల్లించాల్సిందేనని అధికారులు పట్టుబట్టుతుండడంతో అర్కిటెక్చర్లు తూచ తప్పకుండా సదరు అనధికార నిబంధనలు అమలు చేస్తూ ఫైలుకు రూ.10వేల వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఈవిషయంపై మున్సిపల్ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. అర్కిటెక్చర్లు తీసుకునే డబ్బులకు.. తమకు ఎలాంటి సంబంధమూ లేదని.. ఇంటి నిర్మాణానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి అనుమతులు ఇస్తామని, ఎలాంటి అదనపు వసూళ్లు ఉండవని తెలిపారు. -
జగిత్యాల కాంగ్రెస్లో ట్విస్ట్.. మంత్రి అడ్లూరికి కొత్త టెన్షన్!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో జగిత్యాల జిల్లా రాజకీయం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెళ్లిపోయినప్పటికీ హస్తం పార్టీలో వర్గ విభేదాలు ఆగలేదు. మంత్రి అడ్లూరి వర్గం వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ వర్గం అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చక్రం తిప్పుతున్నట్టు మంత్రి అనుచరులు బహిరంగంగానే కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.వివరాల మేరకు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ ఎంపిక వ్యవహారం తెరపైకి వచ్చింది. మున్సిపల్ కో-ఆప్షన్ మెంబర్స్ మూడు పదవులనూ ఎమ్మెల్యే వర్గీయులకే అప్పగించడంతో మంత్రి అడ్లూరి వర్గం ఖంగుతిన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్నారని ఆరోపిస్తూ అడ్లూరి వర్గం మంత్రిని నిలదీశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తే మీరేం చేస్తున్నారంటూ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తమ పదవుల మాటేంటని ప్రశ్నించినట్టు తెలిసింది.జీవన్ రెడ్డిని కాదని మంత్రితో ఉంటే ఎమ్మెల్యే అనుచరులు, మాజీ బీఆర్ఎస్ నేతలకే ప్రాధాన్యం ఇవ్వడంతో వారంతా మండిపడుతున్నారు. దీంతో, దిద్దుబాటు చర్యలకు దిగిన మంత్రి అడ్లూరి.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని సీనియర్లతో చర్చించడానికి సిద్దమైనట్టు తెలిసింది. అయితే, పార్టీ అంతర్గత విభేదాలు బట్టబయలు కావడంతో మంత్రి అడ్లూరికి కొత్త తిప్పలు మొదలైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పైచేయి సాధించినట్టు పలువురు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా సంజయ్ వర్గీయులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన జగిత్యాల బీఆర్ఎస్ మాజీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీష్, మైనార్టీశాఖ అధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, మాజీ కౌన్సిలర్ జంబర్తి లక్ష్మికి అవకాశం కల్పించడంతో విభేదాలు బయటకు వచ్చాయి. -
ఇంటర్లో బాలికల హవా
జగిత్యాల: ఇంటర్ బోర్డు మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఈ సంవత్సరం కూడా జిల్లాలో బాలికలు సత్తాచాటారు. ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలవగా, సెకండియర్లో 10వ స్థానం సాధించింది. జిల్లాలో మొత్తం 75 జూనియర్ కళాశాలలుండగా 16 ప్రభుత్వ, 13 మోడల్ స్కూల్స్, 12 కేజీబీవీ, 5 సోషల్ వెల్ఫేర్, 5 మైనార్టీ, 5 బీసీ రెసిడెన్షియల్, 2 టీఎస్డబ్ల్యూఆర్సీజేసీ, ప్రైవేటు కాలేజీలు 17 ఉన్నాయి. ● ప్రథమ సంవత్సరంలో.. జిల్లాలో మొదటి సంవత్సరంలో బాలురు మొత్తం 2,861 మంది పరీక్షలు రాయగా 1,375 మంది పాసయ్యారు. 48 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 3,784 మంది బాలికలు పరీక్షలు రాయగా 2,799 మంది పాసయ్యారు. 73.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. ● ద్వితీయ సంవత్సరంలో.. ద్వితీయ సంవత్సరంలో బాలురు 2,414 మంది పరీక్షలు రాయగా 1,562 మంది పాసయ్యారు. 64.71 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,378 బాలికలు పరీక్షలు రాయగా 2,776 మంది పాసయ్యారు. 82.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. ● ఇంటర్ సప్లిమెంటరీలో.. ఇంటర్ జనరల్, సప్లిమెంటరీలో 435 మంది బాలురు పరీక్షలు రాయగా 131 మంది పాసయ్యారు. 30.11 ఉత్తీర్ణత శాతం సాధించారు. 305 బాలికలు పరీక్షలు రాయగా, 111 మంది పాసయ్యారు. 36.39 శాతం ఉత్తీర్ణత సాధించారు. ● ఫస్టియర్ ఒకేషనల్లో.. ఫస్టియర్ ఒకేషనల్లో 564 మంది బాలురు పరీక్షలు రాయగా 259 మంది పాసయ్యారు. 45.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. 491 బాలికలు పరీక్షలు రాయగా, 372 మంది పాసయ్యారు. 75.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. ● సెకండియర్ ఒకేషనల్లో.. సెకండియర్ ఒకేషనల్లో 474 మంది బాలురు పరీక్షలు రాయగా 283 మంది పాసయ్యారు. 59.07 శాతం ఉత్తీర్ణత సాధించారు. 359 బాలికలు పరీక్షలు రాయగా, 319 మంది పాసయ్యారు. 88.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ● సెకండియర్ సప్లిమెంటరీలో.. సెకండియర్ ఒకేషనల్ సప్లిమెంటరీలో 53 మంది బాలురు పరీక్షలు రాయగా 36 మంది పాసయ్యారు. 67.92 శాతం ఉత్తీర్ణత సాధించారు. 9 మంది బాలికలు పరీక్షలు రాయగా, 5 మంది పాసయ్యారు. 55.56 శాతం ఉత్తీర్ణత సాధించారు.జగిత్యాల: గతేడాది కంటే ఈసారి ఇంటర్లో ఉత్తీర్ణత శాతం పెరిగినట్లు జిల్లా నోడల్ అధికారి నారాయణ తెలిపారు. గత విద్యా సంవత్సరం కంటే ఈసారి ఫస్టియర్లో 6.47 శాతం, సెకండియర్లో 6.17 శాతం ఉత్తీర్ణత పెరిగిందన్నారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే విద్యార్థులు ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేయించుకునే వారు ఈనెల 20 వరకు ఫీజు చెల్లించి ఫలితాలు తెలుసుకోవచ్చన్నారు. జవాబు ప్రతిని సైతం పొందవచ్చని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
మల్లాపూర్(కోరుట్ల): ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఽఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంతో పాటు రేగుంట గ్రామంలో పర్యటించారు. రేగుంటలో శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేసిందన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పాలనవైఫల్యంతో రాష్ట్రం అన్నిరంగాల్లో తిరోగమనంలోకి వెళ్లిందని విమర్శించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు చిట్యాల లక్ష్మణ్, తీట్ల లహరిరాజేశ్, నాయకులు శరత్గౌడ్, రామాగౌడ్, భూమారెడ్డి, గంగరాజం, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
సర్వే పేరిట వచ్చేవారితో అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలక్రైం: జనాభా లెక్కలు, ప్రభుత్వ సర్వేల పేరిట ఇళ్లకు వచ్చేవారితో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా భోదన్ పట్టణంలో కొంతమంది ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ, జనాభా లెక్కలు నిర్వహిస్తున్నామని చెప్పి ఇళ్లకు వెళ్లి చోరీలకు పాల్పడడం జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిజమైన ప్రభుత్వ సిబ్బంది అధికార గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు కలిగి ఉంటారని పేర్కొన్నారు. ఎవరైనా వారి ధ్రువీకరణ పత్రాలు చూపించకుంటే ఇళ్లలోకి అనుమతించవద్దని, అవసరమైతే పోలీస్స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒంటరిగా నివసించే వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘అడ్లూరి’పై ఆరోపణలు సరికాదుధర్మపురి: ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై ఆరోపణలు చేయడం సరికాదని, బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని గ్రంథాలయ చైర్మన్ దినేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ధర్మపురిలో గోదావరి తలాపున ఉన్నా పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడ్డారని అందుకే, బీఆర్ఎస్ను చీ కొడుతున్నారని విమర్శించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, రెండేళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై ఎలాంటి చర్చలకై నా సిద్ధమని సవాల్ విసిరారు. గొల్లపెల్లి, వెల్గటూర్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు నిశాంత్రెడ్డి, శైలేందర్రెడ్డి, నాయకులు వేముల రాజు, సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేశ్ తదితరులున్నారు. -
అయ్యో పోలీస్!
కోరుట్ల: సాధారణంగా పోలీసులు వస్తున్నారంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎక్కడికక్కడే తప్పుకునే పరిస్థితులు ఉండటం సహజం. దీనికి విరుద్ధంగా ఏకంగా పోలీసులపైనే దాడులకు దిగడంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అనుసరిస్తున్న పోలీసులు చాలా సందర్భాల్లో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కింది స్థాయిలో కొంత మంది పోలీసులు కొన్ని విషయాల్లో అసాంఘిక శక్తులు, ఇతరత్రా అక్రమ దందాలు కొనసాగించే వారితో సాన్నిహిత్యం, సత్సంబంధాలు కొనసాగించడంతో కొంత మేర చులకన భావన ఏర్పడుతుందన్న వాదనలు ఉన్నాయి. దీనికి తోడు పోలీసులపై దాడులు జరుగుతున్న చాలా ఘటనల్లో నిందితులు ప్రతీసారి మద్యం సేవించి మత్తులో ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలో ఉండటం గమనార్హం. యూత్ గ్యాంగ్ల ఆగడాలు పోలీసులపై దాడులు జరుగుతున్న సంఘటనల్లో ఎక్కువ మంది యువకులు ఉంటున్నారు. వీరు గంజాయి, మద్యం సేవించడానికి అలవాటు పడి సినిమా ఫక్కీలో గ్యాంగ్లు ఏర్పాటు చేసుకుని ఆగడాలకు పాల్పడుతున్నారు. కోరుట్ల పట్టణంలో ఈ రీతిలో లెక్కలేని యూత్ గ్యాంగ్లు రాత్రి వేళల్లో అడ్డాలు వేయడం..అక్కడే మద్యం సేవించి విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారన్న అపవాదు ఉంది. ఇలాంటి యూత్ గ్యాంగ్లపై పోలీసులు సరైన రీతిలో దృష్టి సారించకపోవడం, ఫలితంగా చిన్నచితకా అనైతిక చర్యలకు పాల్పడుతున్న యూత్ గ్యాంగ్లు తమకు అడ్డులేదన్న రీతిలో రెచ్చిపోయి ముదిరిపోతున్నాయి. కోరుట్లలో ఇలా ముదిరిన యూత్ గ్యాంగ్లు ఏకంగా పెద్ద పెద్ద నేరాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఇలా నేరాలకు పాల్పడుతున్న యూత్ గ్యాంగ్లకు రాజకీయ అండదండలు ఉండడంతో నేరాలకు పాల్పడిన సందర్భాల్లో పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించలేకపోతోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ముదిరిపోతున్న యూత్ గ్యాంగ్లు పోలీసులపైనే దాడులకు తెగబడటం గమనార్హం. యూత్ గ్యాంగ్ల అడ్డాలపై తరచూ తనిఖీలు చేసి నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలితంగా అవాంచనీయ ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని పలు చోట్ల గ్యాంగ్లుగా ఏర్పడి అడ్డాలు వేస్తున్న యువకుల సమాచారం మా వద్ద ఉంది. వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే కొంత మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. ఎలాంటి అనైతిక సంఘటనలను ఉపేక్షించేది లేదు. – సురేశ్బాబు, సీఐ, కోరుట్ల ‘శుక్రవారం రాత్రి గంజాయి తీసుకెళుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా అతను కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డాడు’. ‘పదిహేను రోజుల క్రితం పట్టణంలోని సాయి జీనియస్ స్కూల్ సమీపంలో ఓ ఫ్లెక్సీ వివాదంలో కత్తిపోట్ల ఘటన చోటుచేసుకోగా ఆపే యత్నంలో నిందితుడు, కానిస్టేబుల్ను గాయపరిచాడు’. ‘ఇరవైరోజుల క్రితం కోరుట్ల పట్టణం భీమునిదుబ్బలో డీజే వద్ద గొడవ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులను తోసేసిన ఘటన చోటు చేసుకుంది’.. ఇలా నెల రోజుల వ్యవధిలో కోరుట్ల పట్టణంలో వరుసగా మూడు ఘటనల్లో పోలీసులపైనే దాడులు జరిగిన తీరు కలవరపెడుతోంది. ఈ సంఘటనల్లో నిందితులపై పోలీసులు కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేశారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయన్న విషయంలో సరైన స్పష్టత రావడం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్న అభిప్రాయాలు కొంత మేర వ్యక్తమవుతుండగా, రాజకీయ ఒత్తిళ్లు ఓ కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్దే
రాయికల్(జగిత్యాల): గిరిజనులకు 6 శాతం నుంచి 10శాతం వరకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. ఆదివారం రాయికల్ మండలం రాజానగర్ గ్రామంలోని గిరిజన తండాలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, నిరుపేద బీసీ విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడం లేదని, దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కేసీఆర్ రైతుబంధు ఎకరాకు రూ.5వేలు ఇస్తే రేవంత్రెడ్డి రైతులకు ఎలాంటి ఆర్థికసాయం అందించడం లేదని పేర్కొన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం అయ్యారన్నారు. సర్పంచ్లు భారతపు రాజశేఖర్, నల్లాల స్వామి, మాజీ సర్పంచ్లు మొక్కొండ రాంరెడ్డి, సబావత్ సరోజ, కొమ్ముల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
రాయికల్/జగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇళ్లతోనే నిరుపేదల కలలు సాకారం అవుతాయని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం రాయికల్ మండలం ఆలూరు, సారంగాపూర్ మండలం పోచంపేట, లచ్చక్కపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహా ప్రవేశం కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సంక్షేమమే సీఎం ధ్యేయమని, ప్రతీ గ్రామంలో పేదలను గుర్తించి రూ.5లక్షలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకారం చేస్తున్నామన్నారు. సర్పంచ్ నల్లాల స్వామి, నాయకులు రవీందర్రావు, రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లా విద్యుత్శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆర్టిజన్ కార్మికుల సమ్మె శనివారం కూడా కొనసాగింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించినా స్పందించకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న విషయం తెల్సిందే. రెండున్నరేళ్లు గడిచినా ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులను పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఏపీఎస్ఈబీ రూల్స్ వర్తింపజేయాలని, కమిటీ జిల్లా చైర్మన్ సిహెచ్.బాబయ్య, కన్వీనర్ డి.రవీందర్ రెడ్డి, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పదో తరగతి విద్యార్థులు
మార్కులు..ర్యాంకులే చదువుకు కొలమానం అనుకుంటున్న నేటితరం విద్యార్థులు ఒక్కక్షణం ఆగండి.. వీరి విజయగాథలు చదవండి. పదో తరగతిలో ఫెయిలైన వారు.. ఇంటర్లో అత్తెసరు మార్కులతో పాసైన వారు.. డిగ్రీ కూడా చదవని వారు.. అద్భుతాలు సృష్టించారు. వారు వేసిన మార్గంలోనే నేడు డిగ్రీ.. బీటెక్.. ఎంటెక్ విద్యార్థులు ముందుకెళ్తున్నారు. డిగ్రీ పూర్తి చేయని బిల్గేట్స్.. బోర్డు ఎగ్జామ్ రాయని సచిన్ టెండూల్కర్.. ఆటోడ్రైవర్గా జీవితాన్ని ఆరంభించిన సత్యశంకర్ విజయాలే మనకు మార్గంకావాలి. అంతెందుకు మన జిల్లా వాసి.. కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి ఇంటర్ ఫెయిలయ్యానని కుంగిపోయి ఉంటే ఈరోజు ఐఏఎస్ అయ్యేవారే కాదు.. అందుకే ఒక్క క్షణం ఆలోచించండి.. పదో తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని.. ఇంటర్ ఫెయిల్ అయ్యామని కుంగిపోకండి. దీని తర్వాత జీవితం చాలా ఉంది. ధైర్యంతో ముందుకెళ్తే మీలో నుంచే ఓ బిల్గేట్స్.. సత్యశంకర్.. మనోజ్కుమార్శర్మ.. కోరెం అశోక్రెడ్డి వారసులు రావచ్చు. ఇంటర్ ఫలితాలు ఎలా ఉన్నా.. ధైర్యంగా ముందుకెళ్దాం.. – సప్తగిరికాలనీ(కరీంనగర్) – వివరాలు 8లో...36,4268,10618,2514,06018,175కరీంనగర్రాజన్నసిరిసిల్ల‘సత్యశంకర్.. ఓ పానీయం ఉత్పత్తి చేసే బిందు కంపెనీ యజమాని. ఆయన ఇంటర్ వరకు చదువుకుని ఆటో డ్రైవర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఇప్పుడు రూ.800 కోట్ల వ్యాపారానికి యజమాని అయ్యారు. ఆయనే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.’‘మనోజ్కుమార్శర్మ.. మధ్యప్రదేశ్లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. 12వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. కానీ నిరాశ చెందలేదు. ఐపీఎస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర పోలీస్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో పనిచేస్తున్నారు.’ -
ఇంటర్లో ఫెయిలైనా.. ఐఏఎస్
శంకరపట్నం: సక్సెస్కు మార్కులే కొలమానం కాదని నిరూపించారు ప్రస్తుత హైదరాబాద్ మెట్రోవాటర్బోర్డు ఎండీ కోరెం అశోక్రెడ్డి. ఇంటర్ ఫెయిలైన అశోక్రెడ్డి.. తర్వాత పట్టవదలని విక్రమార్కుడిలా పుస్తకాలతో కుస్తీ పట్టి గ్రూప్–1 సాధించారు. ప్రస్తుత కన్ఫార్మ్డ్ ఐఏఎస్ అధికారి హోదాలో సేవలందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన కోరెం అశోక్రెడ్డి మొలంగూర్ జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. హుజూరాబాద్ జూనియర్ కాలేజీ ఇంటర్ చదివారు. సెకండియర్లో ఫెయిల్ అయినా సప్లిమెంటరీలో ఉత్తీర్ణులయ్యారు. జమ్మికుంటలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసి గ్రూప్–1 ఉద్యోగానికి ఎంపికయ్యారు. సీ్త్రశిశుసంక్షేమశాఖ పీడీగా ఉద్యోగంలో చేరి, కన్ఫార్మ్డ్ ఐఏఎస్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. మార్కులు, ర్యాంకులు కొలమానం కాదని పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని అశోక్రెడ్డి అంటున్నారు. -
జగిత్యాల
38.0/22.07గరిష్టం/కనిష్టంధర్మపురిలో పోటెత్తిన భక్తులుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహాలయం భక్తులతో కళకళలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉక్కపోత అధికమవుతుంది. అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 -
పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం
జగిత్యాలటౌన్: పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేశ్ ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి హాజరయ్యారు. జిల్లా గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు. పేదల అభ్యున్నతికి పూలే కృషి ధర్మపురి: అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహానీయుడు పూలే అని మంత్రి లక్ష్మణ్కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూలే జయంతిని నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన్ చిలుముల లావణ్య, కౌన్సిలర్లు తదితరులున్నారు. హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలిమల్లాపూర్: హిందూ ధర్మపరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని భద్రాచలం పీఠం వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు విశ్వాత్మనందగిరి స్వామి అన్నారు. మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో శనివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ జిల్లా సహా కార్యావహ్ గుండు సాయిమధుకర్తో కలిసి గోపూజతోపాటు జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మేళనం ప్రారంభించారు. ప్రపంచంలో అత్యంత గొప్ప నాగరికత దేశానిదన్నారు. సనాతన హిందూ ధర్మం గొప్పదనం ప్రపంచానికే తెలిసిందన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎగ్యారపు లింబాద్రి, ఉపసర్పంచ్ బద్దం హరీష్రెడ్డి, వార్డుసభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల దాహం తీర్చేలా..!
జగిత్యాలక్రైం: అడవుల్లో ఉండే వన్యప్రాణులు వేసవిలో బయటకు వస్తుండటంతో కుక్కలు, వేటగాళ్ల బారిన పడుతున్నాయి. మరికొన్ని ప్రమాదవశాత్తు బావుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వాటికి నిత్యం నీటిని అందుబాటులో ఉంచి వాటి దాహం తీర్చుతున్నారు. జిల్లాలోని ఐదురేంజ్ల పరిధిలో 53 వేల హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది. 144 సాసర్పిట్స్ నిర్మాణం గతంలో ఉన్న వాటితోపాటు అడవుల్లో నీటి నిల్వలు ఉంచేందుకు మొత్తం 144 సాసర్పిట్స్, పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. సాసర్పిట్స్లో ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. అడవిని విడిచి నీటి కోసం బయటకు వస్తే ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చెక్డ్యామ్ల ద్వారా.. అడవుల్లో భూగర్భజలాలు పెంచేందుకు ఇప్పటికే 47 చెక్డ్యామ్లను నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు 112 నీటి కుంటలున్నాయి. ఇందులో వర్షపు నీటిని వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసి చె క్డ్యామ్లు, నీటి కుంటల్లో నీటి నిలువలు చేశా రు. వన్యప్రాణులు ఆ నీటిని తాగడంతోపాటు భూగర్భజలాలు పైకి రావడంతో చెట్లు కూడా విస్తారంగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి. మూడు సోలార్బోర్ల ఏర్పాటు అడవుల్లో మూడు సోలార్బోర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి పనితీరు ఆధారంగా మరికొన్ని బో ర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సోలార్ బోర్లు ఏర్పాటుచేశారు. సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుండడంతో పెద్దగా సమస్య లేకుండా ఉంది. అలాగే అడవుల మీదుగా వెళ్లే వాగుల్లోనూ నీటి నిల్వ ఉండటంతో వన్యప్రాణులు దాహం తీర్చుకుంటున్నాయి. ప్రత్యేక చర్యలు అటవీ ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణులకు వేసవి దృష్ట్యా నీటి వసతి కల్పించాం. వన్యప్రాణులు బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నా యి. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా నీటి వసతులు కల్పించి వాటి దాహార్తి తీర్చేలా చర్యలు చేపట్టాం. – రవిప్రసాద్, అటవీశాఖ అధికారి జిల్లాలో అడవుల విస్తీర్ణం ఇలా.. విస్తీర్ణం 53 వేల హెక్టార్లు సాసర్పిట్స్ 144చెక్డ్యామ్లు 47నీటికుంటలు 112వాగులు 10సోలార్ బోర్లు 3 -
కేసీఆర్ సభకు ఏర్పాట్లు
జగిత్యాల: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అదేరోజు మాజీమంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో లాంఛనంగా చేరనున్నారు. ఈ మేరకు సభకు సంబంధించి ఏర్పాట్లను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాల, మినీస్టేడియం, మోతె సమీపంలో, ధరూర్ క్యాంప్ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించారు. ఇంకా సభా ప్రాంగణం ఫైనల్ కాలేదు. మొత్తానికి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తున్నారు. లక్షమంది జనసమీకరణే లక్ష్యం కేసీఆర్ సభ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లోని ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్రెడ్డి బీఆర్ఎస్లో చేరడం.. సభకు కేసీఆర్ వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, విద్యాసాగర్ రావు, దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జన సమీకరణకు కృషి చేస్తున్నారు. కేసీఆర్ను సీఎం చేయడమే లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒక్క హామీ అమలు కావడం లేదని, 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్రెడ్డి బీఆర్ఎస్లోకి రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. సభకు కేసీఆర్ను ఆహ్వానించామని, సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. జీవన్రెడ్డి రావడం శుభపరిణామం ప్రజల కోసం పాటుపడే జీవన్రెడ్డి ప్రతిపక్షపార్టీలోకి రావడం శుభపరిణామమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాసేవకే అంకితమైన కేసీఆర్తో కలిసి పనిచేయడానికి జీవన్రెడ్డి రావడం ఎంతో గొప్ప విషయమని, కౌన్సిలర్లుగా గెలిచిన వారే హుందాగా ఉండే ఈ కాలంలో జీవన్రెడ్డి ఇంకా చెక్క కుర్చీలతోనే ఉంటూ ఆయన హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. బహిరంగ సభకు తరలిరావాలి జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఈ మేరకు స్థల పరిశీలన చేశామని, జీవన్రెడ్డి వంటి నాయకులు బీఆర్ఎస్లో చేరడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలిస్తామన్నారు. లక్ష మంది ప్రజలు వచ్చేలా చూస్తామన్నారు. అస్తవ్యస్తంగా పాలన రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనంగా ఉన్నారని, ప్రజలు వారికి ఓట్లు వేశారని, పాలన చూద్దామని ఓపికగా ఉంటున్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురికావడంతో పాటు, బ్లాక్మెయిల్ ప్రభుత్వంగా మారిందన్నారు. జీవన్రెడ్డి వంటి నేత బీఆర్ఎస్లోకి రావడం శుభపరిణామమని, కేసీఆర్ సమక్షంలో ఈనెల 20న చేరుతున్నారని వివరించారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోసిన నాయకులు జీవన్రెడ్డి అని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి అని, కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని బీఆర్ఎస్లో చేరేందుకు నిర్ణయించుకోవడం శుభ పరిణామమని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జీవన్రెడ్డి రాకతో మరింత బలం చేకూరుతుందన్నారు. -
పూలే ఆశయాలు కొనసాగించాలి
పూలే విగ్రహానికి నివాళి అర్పిస్తున్న బీఆర్ఎస్ నాయకులుమాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్కుమార్జగిత్యాలటౌన్: మహాత్మ జ్యోతిరావుపూలే ఆశయాలను కొనసాగించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి నివాళి అర్పించారు. కళాజాత బృందం ఆలపించిన గీతాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. సంక్షేమ పథకాలతో పేదలు, దళితులు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే కృషి చేశారని కొనియాడారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం పూలే సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, బీసీ అభివృద్ధి అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో.. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మాజీమంత్రులు జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, తుల ఉమ, లోక బాపురెడ్డి, ముసిపట్ల లక్ష్మీనారాయణ, మానాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణలో రేవంత్ పని అయిపోయింది’
జగిత్యాల: సీఎం రేవంత్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలపై కాంగ్రెస్ మాజీ నేత జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇక రేవంత్ పని అయిపోయిందంటూ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో తదుపరి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేని జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇక తాను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డినే అంటూ మండిపడ్డారు. ఈరోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) జగిత్యాల నుంచి మీడియా మాట్లాడిన జీవన్రెడ్డి.. ‘ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి విఫలమైంది. ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు.. తెలంగాణ రాష్ట్రానికి షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ షాడో సీఎం చంద్రబాబు..కాంగ్రెస్లో చేరేటప్పుడు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న రేవంత్ శానసమండలి చైర్మన్కు రాజీనామా లేఖ పంపకుండా చంద్రబాబుకు పంపినప్పుడే ఆయన విధేయత అర్థమైంది. ఇప్పుడున్నది ఒర్జినల్ కాంగ్రెస్ కాదు. దానికి ప్రధాన కారకుడు సీఎం రేవంత్. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు ఏడు శాసనసభ స్థానాల్లో ఎక్కడా గెలిపించుకోలేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి అయినాక కూడా మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు రేవంత్. నేను పార్టీ నుంచి వెళ్లిపోవడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని ఓ టూల్గా వాడారు. నేను పీసీసీ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకున్నది జానారెడ్డి. ఉప ఎన్నిక నేపథ్యాన్ని ముందుపెట్టి జానారెడ్డి నన్ను అడ్డుకున్న కుట్రదారులు. కేసీఆర్ దగ్గరకు వెళ్లితే ఏమవుతుందో తెలుసానని చాలామంది మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరిని డిప్యూటీ సీఎం చేశాడు, తుమ్మలను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశాడు, కేకేను సెక్రటరీ జనరల్ చేశాడు, ఆయన కూతురికి మేయర్ ఇచ్చాడు. ఇంకేం కావాలి..?, ప్రజల్లో బీఆర్ఎస్ రావాలనే చర్చ ఉధృతంగా జరుగుతోందికాంగ్రెస్పై సమరశంఖం పూరిస్తా..రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై సమరశంఖం పూరిస్తానని జీవన్రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి ఎవరో సంధించే అస్త్రం కాదు.. జీవన్ రెడ్డే అస్త్రాలు సంధించే నాయకుడన్నారు. ఈనెల ఏప్రిల్ 20వ తేదీన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుంటా. భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతారు’ అని పేర్కొన్నారు. చిన్నారెడ్డికి టిక్కెట్ ఇస్తానని మొండిచేయి చూపించారని. రాజ్యసభ ఇస్తానని చెప్పి రేవంత్ అనుచరుడికి కట్టబెట్టారన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లానని, లేఖలు రాశానన్నారు. కాంగ్రెస్ వైఖరితో తీవ్రంగా కలత చెందే రాజీనామా చేశాననన్నారు. -
విజిలెన్స్ విచారణ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి సుమారు 280 మంది నర్సింగ్ ఆఫీసర్లు రాగా, ప్రొబేషనరీ కాలం పూర్తి చేసుకున్న వారు రెగ్యులరైజేషన్ ఫైల్ను డీపీహెచ్కు పంపాలంటే ఇక్కడి అధికారులు ఆమ్యామ్యాలు అడిగినంత ఇస్తేనే ఫైల్ పంపిస్తామని నర్సింగ్ అధికారులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, డబ్బులు అడిగారని ప్రజావాణిలోనే పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మార్చి 26న ‘పైసా కొట్టు.. సర్టిఫికెట్ పట్టు’ అని ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో విజిలెన్స్ అధికారులు శుక్రవారం కలెక్టరేట్లో విచారణ చేపట్టినట్లు తెలిసింది. త్వరలోనే పలువురిపై వేటు పడే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. లక్ష్యాలను సాధించాలి జగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను శుక్రవారం సందర్శించి మాట్లాడారు. బాగా చదువుకుని సమాజం గౌరవించే స్థాయికి చేరుకోవాలన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు రావాలని విద్యార్థినులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, న్యాయవాదులు శివాణి, సింధు, రాజ్కుమార్ పాల్గొన్నారు. 13 నుంచి ‘అరైవ్.. ఎలైవ్’జగిత్యాలక్రైం: జిల్లాలో అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గ్రామ స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై వివరించడం, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కీలకమైన గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలందరూ పాల్గొని రోడ్డు భద్రత నియమాలను పాటించి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఉపాధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఉపాధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని డీఆర్డీవో రాఘువరన్ అన్నారు. శుక్రవారం మండలంలోని వేములకుర్తి, బర్థీపూర్, మూలరాంపూర్, ఇబ్రహీంపట్నంలలో ఉపాధి పనులు, నర్సరీలను పరిశీలించారు. వేములకుర్తి ఫారెస్ట్లో తవ్వుతున్న కంటూరు కందకాలను పరిశీలించారు. కూలీల సంఖ్య పెంచాలని అధి కారులకు సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో వీవో భవనాలను పరిశీలించారు. అదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, సర్పంచులతో కలిసికట్టుగా వార్డు సభ్యులు గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని డీఆర్డీవో రఘువరన్ సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో 2వ విడత వార్డుసభ్యుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇన్చార్జి ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో కొమురయ్య, ఈసీ వినోద్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, శిక్షకులు రాకేశ్, రాజశేఖర్, రవీందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి
రాయికల్(జగిత్యాల): సీఎం రేవంత్రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులే తన జవాబుదారితనమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని ఉప్పుమడుగులో రూ.4 కోట్లతో చేపడుతున్న కేజీబీవీ పాఠశాల నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. రామాజీపేట, జగన్నాథపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని, తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు అభివృద్ధితోనే జవాబుదారిగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులందరితో కలిసి పనిచేస్తానని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. జగన్నాథపూర్, బోర్నపల్లి గ్రామాల వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రి వద్దకు వెళ్లానని గుర్తుచేశారు. అలాగే బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ నిధులు మంజూరు చేశారన్నారు. సర్పంచులు రోజా, బెజ్జంకి మోహన్, పరంచ శంకర్, ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, ఎస్సై సుధీర్రావు, నాయకులు కోల శ్రీని వాస్, ఏనుగు మల్లారెడ్డి, సుధీర్రెడ్డి, మాజీ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదాల నియంత్రణకు చర్యలు
జగిత్యాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేసేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈనెల 13 నుంచి 18 వరకు ‘సురక్షితంగా.. సజీవంగా గమ్యం చేరాలి’ అనే నినాదంతో రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరమ్మతు, బస్టాండ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలన్నారు. కొండగట్టు పరిధిలో బీటీరోడ్డు కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలన్నారు. ఎస్పీ అశోక్కుమార్ మాట్లాడుతూ, మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వాహన తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన కేసులు ఆర్టీవోకు పంపిస్తూ లైసెన్స్లు రద్దు చేసేలా చూస్తున్నామన్నారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి జిల్లాలో పంచాయతీరాజ్, ఉపాధి పథకాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చే యాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవా రం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, కిచెన్ షెడ్లు, పాఠశాలల మ రుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నా రు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల ని, అధికారులు తరచూ తనిఖీలు చేస్తూ పర్యవేక్షించాలన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్ర గతి కార్యాచరణలో భాగంగా ప్రజలకు ఉపయోగపడేలా స్థాని క అవసరాలకు అనుగుణంగా పనులు ప్రణాళికాబద్ధంగా జరగాలన్నారు. అదనపు కలెక్టర్లు లత, రా జాగౌడ్, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు. -
● మంత్రి అడ్లూరికి శాతవాహన విద్యార్థుల ఫిర్యాదు ● విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణాకు ఫోన్ ● మొత్తం వివాదంపై విచారణ చేపట్టాలని కోరిన మంత్రి ● ఘటనపై పోలీసులకు ప్రొఫెసర్ సుజాత ఫిర్యాదు ● అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కంప్లైంట్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ వివాదం రోజురోజుకు ముదిరి పతాకస్థాయికి చేరుకుంది. ఇంతకాలం కరీంనగర్కే పరిమితమైన ఈ వ్యవహారం తాజాగా రాజధానికి చేరుకుంది. తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారంటూ ఎస్సీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కి శాతవాహన విద్యార్థులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం శాతవాహన యూనివర్సిటీ జాక్ విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను ధర్మారంలో కలిశారు. అక్కడ వీసీ ఉమేశ్ కుమార్, బాటనీ పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తమను అర్బన్ నక్సలైట్లంటూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ అక్కడ నుంచే విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణాకు ఫోన్ చేశారు. అసలు యూనివర్సిటీలో ఏం జరగుతుందో? తెలుసుకోవాలని కోరారు. వెంటనే ఈ వ్యవహారంలో నిజనిజాలు నిర్ధారించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. దీనికి యోగితా రాణా సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.‘శాతవాహన యూనివర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో ప్రొఫెసర్ సుజాత, ఇతర దళిత విద్యార్థులకు ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుంది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు త్వరలోనే ఎమ్మార్పీఎస్ పక్షాన ఉద్యమిస్తాం’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ, ఉపాధ్యక్షుడు కనకం అంజిబాబు, సీనియర్ నాయకుడు పొత్తూరి రాజన్న, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చెంచాల నవీన్ మాదిగ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కరీంనగర్ పోలీసులు నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. వీసీ ఉమేశ్కుమార్ తనను వ్యక్తిగతంగా వేధిస్తుండగా.. బాటనీ విభాగం పార్ట్టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంచాల శ్రీనివాస్ తనను అర్బన్ నక్సలైటంటూ ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూరేపల్లి సుజాత కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో వారిపై వేసిన విచారణ కమిటీ రిపోర్టు కాపీలను కూడా పోలీసులను అందజేశారు. దీంతోపాటు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా వివిధ వాట్సప్ గ్రూపుల్లో శాతవాహన వర్సిటీలో తనను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరిస్తూ.. చేసిన పోస్టుల స్క్రీన్షాట్లు, వారి ఫోన్ నంబర్లు ఫిర్యాదుకు జతచేశారు. కొన్నిరోజులుగా దళిత మహిళా ప్రొఫెసర్నైన తనను అసభ్యపదజాలంతో సోషల్ మీడియాలో వేధిస్తోన్న వారిపైన కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె ఫిర్యాదులో కోరారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను పోలీసులు గోప్యంగా ఉంచడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారం జరుగుతున్న తీరు, సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధంపై ఇంటెలిజెన్స్ పోలీసులు వివరాలు సేకరించి నివేదిక ఇచ్చారు. -
దళారులకు విక్రయించొద్దు
కోరుట్లరూరల్/మెట్పల్లి/ధర్మపురి/కరీంనగర్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమర్ అన్నారు. శుక్రవారం కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లోని వ్యవసాయ మార్కెట్యార్డు, ధర్మపురి, గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్లలో కలెక్టర్ బి.సత్యప్రసాద్, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్తో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు మక్కలను దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. దళారులు క్వింటాల్కు రూ.1,600 మాత్రమే చెల్లిస్తున్నారని, ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించి క్వింటాల్కు రూ.2,400 మద్దతు ధర పొందాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలేదని, ధాన్యం కొనుగోళ్లలో క్వింటాల్కు నాలుగు కిలోల కోత విధించారని అన్నారు. రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కోత లేకుండా రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, కోరుట్ల సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, ఏఎంసీ చైర్మన్లు పన్నాల అంజిరెడ్డి, చిలుముల లావణ్య, వైస్ చైర్మన్ వెంకటేశ్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేశ్, మార్క్ఫెడ్ డీఎం ఎండీ అబీబ్ తదితరులు పాల్గొన్నారు.


