breaking news
Jagtial
-
న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేయండి
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని పోర్ట్పోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రేణుకాయారాను న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే హైకోర్టు రిజిస్ట్రార్ గోవర్ధన్ రెడ్డికి కూడా వినతిపత్రం అందించారు. డీఎల్ఎస్ఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకట మల్లిక్ సుబ్రమణ్యం శర్మను కలిసి అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, రాచకొండ శ్రీరాములు, న్యాయవాదులు పాల్గొన్నారు. చెరువుల డిమార్కింగ్ పూర్తి చేయాలిజగిత్యాల: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని 276 చెరువుల డిమార్కింగ్ ప్రక్రియను సంబంధిత అధికారులు ఈనెల 30లోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. గురువారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి చెరువుకు హద్దులు, విస్తీర్ణం, భౌగోళిక స్థితి పక్కాగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు.ఇరిగేషన్, ఫిషరీస్, రెవెన్యూ, ఫారెస్ట్, అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డిమార్కింగ్ అనంతరం నివేదిక సమర్పించాలన్నారు. ఆత్మహత్యలు నివారించాలిజగిత్యాల: మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలను ముందుగా గుర్తిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చని డీఎంహెచ్వో సుజాత అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వైద్యశాఖ, మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మనశ్శాంతి లేమితో బాధపడుతున్న వారిని ఒంటరిగా వదిలేయొద్దని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆరోగ్య నిపుణుల సహాయం పొందేలా ప్రోత్సహించాలని సూచించారు. సహాయం కోసం టెలిమానస్ 14416 టోల్ఫ్రీ నంబర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్యాధికారులు రాజేందర్రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుభాష్, తదితరులు ఉన్నారు. అమృత్ పనులు వేగవంతం చేయాలిరాయికల్: పట్టణంలో అమృత్ పనులను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ సూచించారు. గురువారం సంబంధిత పనులను పరిశీలించారు. పథకం ద్వారా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందుతుందన్నారు. అనంతరం పురాతన చెన్నకేశవనాథ ఆలయాన్ని సందర్శించారు. ఆయన వెంట బల్దియా కమిషనర్ మనోహర్గౌడ్ ఉన్నారు. సామూహిక సెలవుల్లో ఈ–కంప్యూటర్ ఆపరేటర్లు -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు అల్లీపూర్ విద్యార్థులు
రాయికల్: మండలంలోని అల్లీపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న వేదశ్రీ, సీహెచ్ అశ్రిత రాష్ట్రస్థాయి యోగా పో టీలకు ఎంపికై నట్లు పీడీ కృష్ణ ప్రసాద్ తెలి పారు. ఈనెల 11, 12 తేదీల్లో కరీంనగర్లోని అల్ఫోర్ జూనియర్ కళాశాలలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థినుల ను సర్పంచ్ ఎంబారీ గౌతమి, హెచ్ఎం పోరండ్ల కిరణ్, ఉపాధ్యాయులు అభినందించారు. వేదశ్రీఅశ్రిత -
21 నుంచి ఎస్జీఎఫ్ సంబురం
కరీంనగర్స్పోర్ట్స్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 షెడ్యూల్ విడుదలైంది. గురువారం కరీంనగర్ డీఐఈవో సత్యనారాంజనేయ, అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ క్రీడా తేదీలను ప్రకటించారు. ఈ నెల 21 నుంచి అక్టోబర్ చివరి వరకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఎంపికల పోటీలు జరగనున్నాయి. అక్టోబర్ 31 వరకు 29 క్రీడాంశాల్లో ఈ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి క్రీడల తేదీల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఉమ్మడి జిల్లా ఎంపిక తేదీల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉందని ఎ్స్జీఎఫ్ కార్యదర్శి బన్సీలాల్ తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికై నవారు తల్లిదండ్రులు లేదా ప్రిన్సిపాల్ సమక్షంలో హామీపత్రాన్ని సమర్పించాలన్నారు. వివరాలకు 9652637637 నంబర్ను సంప్రదించాలని సూచించారు. క్రీడా పోటీలు.. తేదీలు ఇవే.. సెప్టెంబర్ 21,22 తేదీల్లో కరీంనగర్ రేకుర్తిలోని సాన్వీ కళాశాలలో బాలబాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. 23,24న రేకుర్తి ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో బాలబాలికలకు వాలీబాల్ పోటీలు ఉంటాయన్నారు. 25,26న నగరంలోని అంబేడ్కర్ స్టేడియంలో ఖోఖో పోటీలు నిర్వహిస్తారు. 27న ఢిల్లీ డిఫెన్స్ కాలేజీలో హ్యాండ్బాల్ పోటీలు, 28న జీనియర్ అకాడమీ కరీంనగర్లో చెస్ పోటీలు ఉంటాయన్నారు. 29న స్పోర్ట్స్ స్కూల్లో వుషు, రెజ్లింగ్, జిమ్నాస్టిక్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో బాలురకు క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బాస్కెట్బాల్, రగ్బీ, కరాటే, బాక్సింగ్, తైక్వాండో, తాంగ్తా పోటీలు నిర్వహిస్తారు. 2న జగిత్యాలలోని పొన్నాల గార్డెన్లో బాలబాలికలకు కురాషా, గట్కా, మల్లాకంబ్, ఫెన్సింగ్ పోటీలు, 3న ఇదే వేదికపై కలరిపయట్టు, వెయిట్లిఫ్టింగ్, స్కేటింగ్, సాఫ్ట్బాల్ పోటీలు నిర్వహించనున్నారు. 5న గోదావరిఖనిలోని జేఎన్ స్టేడియంలో బాలబాలికలకు బేస్బాల్, ఫుట్బాల్ పోటీలు ఉంటాయి. 6న తిమ్మాపూర్లోని శ్రీచైతన్య కాలేజీలో ఆర్చరీ పోటీలు, 7న అంబేడ్కర్ స్టేడియంలో బాలికలకు క్రికెట్ పోటీలు, బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహిస్తారు. 8న స్టోర్ట్స్ స్కూల్ కరీంనగర్లో బాలికలకు అథ్లెటిక్ పోటీలు, బాలబాలికలకు స్విమ్మింగ్ పోటీలు ఉంటాయి. ఇక్కడే 9న బాలురకు అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తారు. 26న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు హాకీ పోటీలు, 28న కరీంనగర్ రేకుర్తిలోని ఎస్వీజేసీ మైదానంలో నెట్బాల్ పోటీలు, 30న అంబేడ్కర్ స్టేడియంలో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తారు. ఇదే రోజు నగరంలోని కేహెచ్ఆర్ అకాడమీలో బాలబాలికలకు టేబుల్ టెన్నీస్ పోటీలు ఉంటాయి. 31న అంబేడ్కర్ స్టేడియంలో బాలబాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారు. టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్, స్క్వాష్, షూటింగ్, జూడో, సెపక్ తక్రా క్రీడల తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. షెడ్యూల్ విడుదల చేసిన డీఐఈవో -
రచయిత కేవీ నరేందర్కు పురస్కారం
జగిత్యాల: జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత కేవీ.నరేందర్ను 2015 సంవత్సరం ఉత్తమ నవలా రచయితగా తెలుగు విశ్వవిద్యాలయం నిపుణుల కమిటీ ఎంపిక చేసినట్లు వైస్ చాన్స్లర్ వెలుదండా నిత్యానందరావు ప్రకటించారు. బర్రె నవలకుగాను పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుండి 12 మంది రచయితలకు ఒక విభాగం కింద పురస్కారం ఇస్తుండగా.. నవలా విభా గంలో నరేందర్కు అవార్డు ప్రకటించారు. ఈ నెల 26న నాంపల్లి ప్రాంగణంలోని ఎన్టీరామారావు కళామందిర్లో రూ.30,116 తోపాటు పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరుకు చెందిన నరేందర్ ఇప్పటికే 35 అవార్డులు అందుకున్నారు. నవలా రచయితగా ఇది మొదటి పురస్కారం అందుకుంటున్నారు. బండరాళ్లు అడ్డువేసి.. నీటిని మళ్లించి ఇబ్రహీంపట్నం: వేసిన పంటలను కాపాడుకునేందుకు.. గుక్కెడు తాగునీటి కోసం రైతులు, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది నామమాత్రంగా కురిసిన వర్షాలకు మండలంలోని గంగనాల ప్రాజెక్టు కింద సుమారు నాలుగు వేల ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేస్తున్నారు. ఆ పంటలను కూడా కాపాడుకునేందుకు సదర్మట్ ప్రాజెక్టు నుంచి గేట్ల లీకేజీ ద్వారా వస్తున్న కొద్దిపాటి నీటిని గంగనాల మాటుకాలువకు మళ్లించేందుకు గోదావరిలో బండరాళ్లను అడ్డుగావేస్తున్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందేందుకు పూడిక, పిచ్చి మొక్కలను జేసీబీ తో రైతులు తొలగించుకుంటున్నారు. గంగనాల ప్రాజెక్ట్ ఎగువభాగంలో గోదావరిపై సదర్మట్ నిర్మించడంతో గంగానాలకు నీరు రావడం కష్టమవుతోంది. దీంతో వేములకుర్తి, యామాపూర్, ఫకీర్కొండపూర్ గ్రామాల రైతులు పంటలను కాపాడుకునేందుకు ఇలా అష్టకష్టాలు పడుతున్నారు. -
పోరాట యోధురాలు ఐలమ్మ
● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ త్యాగాలు మరువలేనివని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆమె త్యాగాలను గుర్తిస్తూ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మట్టి విగ్రహాలనే పూజించాలి.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనే పూజించాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లోని కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పీవోపీ విగ్రహాలతో జలాశయాలు, చెరువులు, కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండువేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్విరాన్మెంట్ అసిస్టెంట్ సైంటిస్ట్ మహేశ్, తదితరులు ఉన్నారు. రీ సర్వే పారదర్శంగా నిర్వహించాలి గ్రామాల్లో భూ రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. భూ రీసర్వేలో అధికారులకు ఎదురవుతున్న సమస్యలు తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో నక్షా పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. -
తొలిదశలో గుర్తిస్తే చికిత్స అందించొచ్చు
కరీంనగర్: క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని హైదరాబాద్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అంకాలజిస్టు డాక్టర్ అన్వేశ్, డాక్టర్ నీలేశ్, డాక్టర్ స్నేహ తెలిపారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి 126 మంది హాజరై పరీక్షలు చేయించుకోగా, 16 మందికి పాజిటివ్గా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. క్యాన్సర్ కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతీ నెల రెండో కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ కరీంనగర్లో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వైద్యులు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం -
ఒకరి అనుమానాస్పద మృతి
కరీంనగర్క్రైౖం: నగరంలోని కోతిరాంపూర్కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వన్టౌన్ పోలీసుల వివరాల ప్రకారం కోతిరాంపూర్కు చెందిన బండ మల్లేశం (45) గతంలో మేసీ్త్రగా పనిచేసేవాడు. ఐదేళ్లుగా మద్యానికి బానిసయ్యడు. బుధవారం రాత్రి మల్లేశం చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్లో ఒకరికి జైలు గోదావరిఖని: డ్రంకెన్ డ్రైవ్లో కేసులో ఆటో డ్రైవర్కు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్రావు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో దొరికిన 8మందిని కోర్టులో హాజరుపర్చగా ఏడుగురికి రూ.21,000లు నగదు జరిమానా విధించగా, ఒకరికి జైలు శిక్ష విధించారన్నారు. అలాగే కమిటీ సర్వీస్లో భాగంగా రూ.3వేల నోట్బుక్స్ను విద్యార్థులకు వారి ద్వారా అందించారు. షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధంకోనరావుపేట(వేములవాడ): మండలంలోని బావుసాయిపేటలో షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధమైంది. గ్రామానికి చెందిన షేక్ హోలీగౌసీబీకి చెందిన గుడిసెలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గుడిసెతోపాటు సామగ్రి కాలిపోయింది. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ షేక్ యాస్మిన్పాషా, ఉపసర్పంచ్ తిక్కల నవీన్ పరామర్శించారు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సంతోష్ సందర్శించి పంచనామా చేశారు. కాపర్ వైర్ చోరీమంథనిరూరల్: పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లకు కరెంటు సరఫరా అయ్యే వైర్ల నుంచి కాపర్ వైర్ను చోరీ చేసిన సంఘటన మంథని మండలం ఖానాపూర్లో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామశివారులోని గోదావరినది, బొక్కలవాగుల నుంచి సుమారు 30మంది రైతులు విద్యుత్ మోటార్లు అమర్చుకుని పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఆ విద్యుత్ మోటార్లకు సరఫరా అయ్యే వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కట్ చేసి అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గురువారం అటువైపు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు. 30మంది రైతులకు సుమారు రూ.2నుంచి 3లక్షల వరకు నష్టం జరిగిందన్నారు. కాపర్ వైర్ దొంగిలించిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భర్త వద్దకు యువతిజగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండుకార్లలో వచ్చి తీసుకెళ్లిన ఘటన జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంలో బుధవారం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం సీతారాంపల్లికి వెళ్లారు. సదరు యువతి బంధువుల ఇంట్లో ఉండగా పోలీసులు గుర్తించి జగిత్యాలకు తీసుకొచ్చి భర్త ప్రశాంత్కు అప్పగించారు. ● కాంగ్రెస్ పాలనపై మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ పెద్దపల్లి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దివాళా తీస్తోందని మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గుతోందని మండిపడ్డారు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల మోటార్లు అందుబాటులో ఉన్నా.. కావాలని ఆన్చేయడం లేదని ఆరోపించారు. కాళేశ్వరంలో చిన్నపాటి మరమ్మతులతో సమస్య పరిష్కరించగలిగే అవకాశం ఉన్నా.. కేసీఆర్పై కక్షతో ఉత్తర తెలంగాణను ఎండబెడుతున్నారని విమర్శించారు. శ్రీశైలంలో తాగునీటి అవసరాల పేరుతో తెలంగాణకు నీటిని నిరాకరిస్తూ.. మరోవైపు పోతిరెడ్డిపాడు, వెలిగొండ మార్గాల ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతున్నా.. ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలను పక్కనపెట్టారని, బీసీ సబ్ప్లాన్, 42 శాతం రిజర్వేషన్లు, గొర్రెల పంపిణీ వంటి హామీలను విస్మరించారని తెలి పారు. 22ఏ భూముల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, నాయకులు, అ ధికారులు పర్సంటేజీ తీసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 22ఏ నిబంధన, హైడ్రా రద్దు చేస్తామన్నారు. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి యోగా పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో పాఠశాలలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్న 13వ రాష్ట్రస్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్షిప్ ఏర్పాట్లను అసోసియేషన్ చైర్మన్ రవీందర్సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డిలు పరిశీలించారు. 25జిల్లాల నుంచి 900 మంది బాల బాలికలు పాల్గొననున్నట్లు తెలిపారు. పోటీలను ఉదయం 11గంటలకు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మేడిపల్లి సత్యం, ఆల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి, రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి, ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు జాల మనోహర్ ప్రారంభిస్తారని తెలిపారు. -
కరెంట్ కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
మేడిపల్లి: విద్యుత్ కోతలతో అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంటూ గురువారం కిసాన్మోర్చా ఆధ్వర్యంలో మండలకేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు. పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, ప్రధాన కార్యదర్శి కారండ్ల మధుకర్ హాజరయ్యారు. అధికారంలోకి రాకముందు రైతుల కోసం అనే హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు అరిగోసపెడుతోందని విమర్శించారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. 24 గంటలు కరెంటు ఇవ్వాలని, లేకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు కలుగజేసుకుని ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల సురేష్, రాష్ట్ర నాయకులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, అన్నాడి జలపతిరెడ్డి, ఎస్ఎన్.రెడ్డి, క్యాతం దశరథరెడ్డి, నాయకులు రెబ్బస్ మల్లయ్య, తొగరి లక్ష్మిపతి, చంద రమేశ్, గోస్కి మధు తదితరులు పాల్గొన్నారు. రాయికల్లో..రాయికల్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ పట్టణంలోని సబ్స్టేషన్ వద్ద జగిత్యాల వెళ్లే రహదారిపై రైతులు గురువారం ధర్నాకు దిగారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పొలాలకు నీరు అందడం లేదని, వర్షాలు లేక.. సకాలంలో విద్యు త్ రాక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై సుధీర్రావు, సబ్ ఇంజినీర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. -
కలలోనూ వెంటాడుతోంది
నా పేరు గోల్కొండ విజయ(58). మాది డబ్బు తిమ్మాయపల్లి గ్రామం. నా కూతురు సుమలత గర్భవతి కావడంతో ఆ రోజు హాస్పిటల్లో చూయించుకునేందుకు పయనమయ్యాం. క్షణాల్లో బస్సు బోల్తాపడడంతో జనాలు నాపై పడడంతో చేతులు, పక్కటెముకలు విరిగిగాయి. వెన్నుపూసకు గాయమై కదలలేని పరిస్థితుల్లో ఉన్న. నాపై నుంచి శవాలను తీసుకువెళ్తున్న దృశ్యం ఇంకా కళ్లలో మెదులుతోంది. ప్రమాదంలో నా బిడ్డను కోల్పోయా. నేను హాస్పిటల్లో ఆరు నెలలు ఉన్నా. ఇంటికి వచ్చేవరకు నా బిడ్డ చనిపోయిన విషయం నాకు చెప్పలేదు. ఇప్పటికీ ఆ ప్రమాదం కలలోనూ వెంటాడుతోంది. శరీరంలో పలుచోట్ల రాడ్లు వేసి ఆపరేషన్ చేయడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నిలబడ్డానికి కూడా చేతనైత లేదు. పెద్ద సార్లు దయ తలచి నాకు పింఛన్ ఇప్పించాలని విన్నపం. – విజయ, తిమ్మాయపల్లి -
కోరుట్లలో త్వరలో ఈఎస్ఐ సేవలు
కోరుట్ల: పట్టణంలో త్వరలో ఈఎస్ఐ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. తనతండ్రి, మాజీమంత్రి జువ్వాడి నర్సిగరావు హయాంలోనే కోరుట్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, వెటర్నరీ విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, ఫిల్టర్బెడ్, మున్సిపల్ కార్యాలయ భవనం, 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటవుతోందని తెలిపారు. ఈఎస్ఐ కార్డు ఉన్న వారికి ఉచితంగా సేవలు అందుతాయన్నారు. సాధారణ వైద్య పరీక్షలు, కంటి, దంత, ఈఎన్టీ, చర్మవ్యాధులకు చికిత్స అందించి ఉచితంగా మందులు ఇస్తారని తెలిపారు. కోరుట్ల నియోజకవర్గానికి ఇప్పటివరకూ రూ.7.51 కోట్లు సీఎం సహాయనిధి డబ్బులు అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తేవాలన్నారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బి రోడ్ల అభివృద్ధికి రూ.80కోట్లు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కోరామన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, కలెక్టర్ సత్యప్రసాద్, మంత్రి వివేక్కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, వైస్ చైర్మన్ మిద్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు తిరుమల గంగాధర్, పన్నాల అంజిరెడ్డి, నాయకులు కొంతం రాజం, సర్పంచులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
రామగుండం గ్రిడ్ ఫెయిల్యూర్.. చీకట్లో దక్షిణ భారతం
ఎన్టీపీసీ పవర్ప్లాంట్కొండగట్టు ప్రమాద దృశ్యం (ఫైల్)2001, సెప్టెంబరు 11న అమెరికాలో ని ట్విన్ టవర్స్పై ఉగ్రదాడులు జరిగాయి. సరిగ్గా అదే రోజు ప్రస్తుత పెద్దపల్ల్లి జిల్లా ఎన్టీపీసీ రామగుండంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సదరన్ గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిమ్మచీకట్లోకి జారిపోయింది. దీని ప్రభావం తమిళనాడు, కర్ణాటక, కేరళపైనా పడింది. ఫలితంగా రాష్ట్రమంతా కరెంటు లేదు. రైల్వే, కమ్యూనికేషన్స్, ఆపరేషన్లు కష్టంగా మారాయి. సాధారణ శస్త్రచికిత్సలు వాయిదాపడ్డాయి. అత్యవసరమైనచోట జనరేటర్లతో సర్దుకున్నారు. పత్రిక కార్యాలయాలు, టీవీ మీడియా ఆఫీసులు కరెంటు కష్టాలు చవిచూశాయి. బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్ ప్రజలు లిఫ్టులు పనిచేయక ఇబ్బందులు పడ్డారు. మరునాడు రాత్రికి గ్రిడ్ పునరుద్ధరించారు. అప్పటి వరకూ అమెరికాపై దాడులు జరిగిన సంగతి దక్షిణ భారతవాసులకు తెలియకపోవడం గమనార్హం. ప్రపంచానికి నిరంతరం వెలుగులు పంచే రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్లో దాదాపు రెండు రోజులపాటు విద్యుత్తు ఉత్పత్తి ఆగిపోవడం అదే తొలిసారి, చివరిసారి. సెప్టెంబరు 11న అమెరికాలో ఉగ్రదాడులు.. మనవద్ద కరెంటు పోవడంతో ప్రజల ఆందోళనతో అనేక పుకార్లు షికార్లు చేశాయి.25 ఏళ్ల క్రితం జరిగిన ఘటన మాకు ఇప్పటికీ షాకింగే. కరెంటు ఎందుకుపోయిందో తెలియదు. ఎప్పుడు వస్తుందంటే అధికారులు చెప్పలేమన్నారు. ఏదో పెద్ద సమస్య అని అర్థమైంది. షెడ్యూల్ ప్రకారం.. ఎమర్జెన్సీ ఆపరేషన్లను అవాయిడ్ చేయలేదు. కొన్ని జనరేటర్లు పెట్టి చేసేశాం, మరికొందరు వైద్యులు చీకటి ఉన్నా.. టార్చ్లైట్లు పెట్టి ఆపరేషన్లు పూర్తి చేశారు. కొన్నింటిని వాయిదా వేశాం. నా సర్వీసులో గోదావరిఖనిలో రెండు రోజులపాటు కరెంటు పోయిన సందర్భం అదే. అమెరికాపై ఉగ్రదాడి జరిగి వందలాదిమంది మరణించిన రోజు కావడంతో సెప్టెంబరు 11ను అంత తేలిగ్గా మర్చిపోలేం. – డాక్టర్ నిరంజన్, గోదావరిఖని 2018 సెప్టెంబరు 11.. అప్పటి అధికార టీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ఎలక్షన్ వేడి మొదలైంది. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (జగిత్యాల– శనివారంపేట సర్వీసు) కొండగట్టు వద్ద సామర్థ్యానికి మించి దాదాపు 100 మందికిపైగా ప్రయాణికులతో గుట్ట ఘాట్ రోడ్డు దిగుతోంది. ఆఖరు మలుపు వద్ద అదుపుతప్పి మట్టి కోసం తీసిన 12 అడుగుల గొయ్యిలో పడింది. చాలామంది ఒకరిపై ఒకరు పడిపోయారు. ఊపిరాడక, అంతర్గత గాయాలు, రక్తస్రావంతో 60మందికిపైగా మరణించారు. దేశంలోని ఏ రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలోనూ ఇంతటి ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్ప్రదేశ్, డార్జిలింగ్ వంటి ఎత్తయిన పర్వతాలు, లోయలున్న ప్రాంతాల్లో బస్సు పడిన ఘటనల్లోనూ ఈ స్థాయిలో ప్రాణనష్టం సంభవించకపోవడం గమనార్హం. బాధిత కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం అందినా.. వారి కుటుంబాలు రోడ్డు ప్రమాదం రూపంలో తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. -
నేనేం పాపం చేశానమ్మా?
మల్యాల: ముక్కుపచ్చలారని పసివాడు.. రాత్రి హాయిగా తల్లి ఒడిలోనే నిద్రపోయాడు. వేకువజామునే అమ్మ నిద్ర లేపింది. ఎందుకు లేపిందో తెలియని ఆ పసివాడు అమ్మ చేయిపట్టుకుని ఆమె వెంటే నడిచాడు. ఎటు తీసుకెళ్తుందో తెలియని ఆ చిన్నారి అడుగులు చివరకు కాటివరకు తీసుకెళ్తాయని ఊహించలేకపోయాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. కొడుకును బావిలో తోయడం.. తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. తాను చనిపోతే తన కొడుకును ఎవరు చూస్తారనుకుందో..? కొడుకు ప్రాణం తీసేందుకు ఆ తల్లి మనసుకు ఎన్ని గాయాలయ్యాయో..? తెలియదుగానీ.. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని బావిలో తోసిందనే వార్తతో ప్రజల కళ్లు వరదలై పారాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన గుండేటి కవిత, దశరథం భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు నిఖిలేష్ (12), శశాంక్(7) కుమారులు సంతానం. కవిత బీడీలు చుడుతూ.. బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. దశరథం ఉపాధి కోసం ముంబాయి వెళ్లాడు. అప్పటినుంచి కవిత మామ పండిత్, ఇద్దరు కుమారులతో కలిసి గుడిపేట వెళ్లే దారిలో ఉన్న సొంతింట్లో ఉంటోంది. ● అన్నా.. నేను చనిపోతున్నా కవిత కుటుంబ పోషణకు కొందరి వద్ద అప్పు చేసినట్లు తెల్సింది. ఆ అప్పులకు వడ్డీ చెల్లించే క్రమంలో మరింత అప్పు చేయాల్సి వచ్చింది. అలా అప్పు రూ.20లక్షల వరకు చేరినట్లు సమాచారం. అప్పు ఇచ్చిన వారు చెల్లించాలని కోరుతుండడం.. భర్త డబ్బులు పంపించకపోవడంతో కొన్నాళ్లుగా మనస్తాపం చెందుతోంది. గురువారం వేకువజామున 3.40 గంటలకు కవిత తన సోదరుడు కొమురయ్యకు ఫోన్ చేసి ‘అన్నా నేను చనిపోతున్నా..’ అని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. అనంతరం చిన్న కుమారుడు శశాంక్ను వెంటబెట్టుకుని వెళ్లింది. (ఈ చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.) నేరుగా గుడిపేట వెళ్లే మార్గంలో ఉన్న వ్యవసాయ బావిలో శశాంక్ను తోసి.. తానూ దూకినట్లు తెలుస్తోంది. కవిత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో కంగారుపడిన కొమురయ్య సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బావుల్లో వెదికాడు. ముత్యంపేట మీదుగా గుడిపేట వెళ్లే మార్గంలో వెదుకుతుండగా.. ఓ వ్యవసాయ బావి వద్ద తల్లీకొడుకుల చెప్పులు, సెల్ఫోన్ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఫైరింజన్, గజ ఈతగాళ్లతో బావిలో గాలిస్తుండగా.. ఉదయమే కవిత మృతదేహం నీటిలో తేలింది. శశాంక్ కోసం రాత్రి వరకూ గాలిస్తూనే ఉన్నా.. ఆచూకీ దొరకలేదు. ● కన్నీమున్నీరైన కుటుంబ సభ్యులు..స్థానికులు కొడుకును బావిలో వేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుందన్న వార్త తెలియడంతో గుడిపేట, ముత్యంపేట, మల్యాలకు చెందిన వందలాదిమంది బావి వద్దకు చేరుకున్నారు. కవిత మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కొడుకును బావి లో ఎందుకు తోసిందో.. అంటూ కన్నీరు పెట్టుకున్నారు. శశాంక్ తరచూ అనారోగ్యం బారిన పడు తుండడంతో తాను చనిపోతే అతడిని ఎవరూ చూ సుకోరని భావించి బావిలో తోసినట్లు తెలుస్తోంది. రోదిస్తున్న బంధువులుశశాంక్ కోసం గాలిస్తున్న గ్రామస్తులు కొడుకును నిద్రలేపి తీసుకెళ్లిన తల్లి ముందుగా బావిలో తోసి తానూ దూకి.. తల్లి మృతదేహం లభ్యం.. చిన్నారి కోసం గజఈతగాళ్ల గాలింపు మిస్టరీగా తల్లీకొడుకుల ఘటన -
కొడుకు, అమ్మ చనిపోయారు
ఆ దుర్ఘటన జరిగిన రోజు మా బాబు అరుణ్ సాయి(5)కి జ్వరం రావడంతో మా అమ్మ భాగ్యమ్మ(45)తో కలిసి హాస్పిటల్కు బస్సులో బయల్దేరాం. కిక్కిరిసిన బస్సు అదుపుతప్పడంతో అందరూ అరవడం మాత్రమే గుర్తుంది. లేచేసరికి హాస్పిటల్లో బెడ్పై ఉన్నాను. ఈ ప్రమాదంలో నా కొడుకు అరుణ్సాయి, మా అమ్మ భాగ్యమ్మను కోల్పోయాను. ఆ విషయం రెండు రోజుల వరకు నాకు చెప్పలేదు. నా కొడుకు వయసు ఉన్న స్కూల్కి వెళ్లే పిల్లలను చూస్తే ప్రాణం విలవిల్లాడుతోంది. చేతికి పలుచోట్ల రాడ్లు పడడంతో ఏ పని చేయలేకపోతున్నాను. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ప్రభుత్వం దయ తలసి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాను. – కొండ శైలజ, హిమ్మత్రావుపేట -
నవరాత్రి ఉత్సవాలకు బందోబస్తు
● జాతీయ లోక్ అదాలత్పై అవగాహన కల్పించాలి ● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ అశోక్కుమార్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో గురువారం నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే న్యాయమూర్తులను కలిసి పరిష్కరించాలన్నారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్, నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని సూచించారు. ఈనెల 12న జరిగే జాతీయ మెగా లోక్అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈనెల 14న జరిగే గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. డయల్ 112కు వచ్చే కాల్స్ను స్వీకరించాలని పేర్కొన్నారు. వినాయక మండపాల వద్ద సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గణేశ్ శోభాయాత్రలో ఆటంకాలు తలెత్తకుండా చూడాలన్నారు. డీజేలకు అనుమతి లేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తే యజమానులు, మండపాల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. తరచూ గొడవ పాల్పడేవారిని తహసీల్దార్ల ముందు బైండోవర్ చేయాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. వివిధ కేసుల్లో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చేతన్నితిన్, డీఎస్పీ రాములు, సీఐలు సుధాకర్, కరుణాకర్, సురేష్బాబు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రాజ్కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సైదులు, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. అడవులను సంరక్షించాలి అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణకు పోలీస్, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్, అటవీశాఖల అధికారులతో మాట్లాడారు. భూముల ఆక్రమణ, కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేటగాళ్లను ఉపేక్షించొద్దన్నారు. -
కొండగట్టు అభివృద్ధి పనులకు మోక్షం
● రూ.35.19 కోట్లతో దీక్షా విరమణ మండపం, సత్రం ● 2వేల మంది ఒకేసారి దీక్షవిరమించేలా నిర్మాణం కరీంనగర కార్పొరేషన్: కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించిన అభివృద్ధి పనులకుమోక్షం లభించింది. అంజన్న భక్తుల చిరకాల కోరికై న మాల విరమణ మండపం,సత్రం గదుల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని గురువారం డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండిఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు. రూ.35.19 కోట్లతో మండపం, సత్రం నిర్మాణం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి దేవస్థానంలో రూ.35.19కోట్ల నిధులతో చేపట్టనున్న మండపం, సత్రం నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో దీక్షా విరమణ మండపం, భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మాణాలకు రూ. 35.19 కోట్ల నిధులు మంజూరై శంకుస్థాపన జరిగినప్పటికీ.. సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి పనులు ప్రారంభించేలా చూడాలని అభ్యర్థించారు. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే పెండిగ్ పనులకు ఆమోదం తెలిపారు. కాగా రూ.35.19 కోట్లతో మాలదారులు రెండు వేల మంది ఒకే సారి దీక్ష విరమణ చేసుకొనేందుకు వీలుగా మండపం నిర్మాణం చేపట్టనున్నారు. భక్తుల సౌకర్యార్థం 96గదుల సత్రం, అతిథిగృహం నిర్మించనున్నారు. ఈ నిర్మాణాలతో ఏటా లక్షలాదిగా వచ్చే హనుమాన్ మాలాధారులకు, అంజన్న భక్తులకు ఎంతో సౌకర్యం కలుగుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. -
చిన్నారిపై ప్రైవేటు పాఠశాల హెచ్ఎం అత్యాచార యత్నం
ధర్మపురి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు గాడితప్పి ఓ బాలిక (4)పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చల్లా శ్రీనివాస్ సదరు చిన్నారిని బుధవారం స్టాఫ్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలపగా.. గురువారం తల్లిదండ్రులు, మరికొంతమంది కాలనీవాసులు పాఠశాలకు చేరుకుని హెచ్ఎంను నిలదీశారు. పాఠశాలలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహరెడ్డి పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
కరీంనగర్: మెట్పల్లి పట్టణంలోని బస్డిపో చౌరస్తాలో బుధవారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. పట్టణంలోని సాయిరాంనగర్కు చెందిన సదరు వ్యక్తి మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చాడు. అతడిని తీసుకెళ్లడానికి వెనుక భార్య రాగా.. చౌరస్తాలో ఆమెను కొట్టాడు. అదే సమయంలో ఆటు వైపు వచ్చిన అర్టీసీ బస్సును ఆపి డ్రైవర్ను దూషించాడు. దీంతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. తర్వాత కుటుంబ సభ్యులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి బస్ డిపో వద్ద మందుబాబు వీరంగంRTC రాజదాని బస్సును అడ్డుకుని.. డ్రైవర్ పై దాడికి యత్నంఅడ్డుకోబోయిన భార్యపై కూడా దాడి చేసిన మందుబాబువారించే ప్రయత్నం చేసిన వారిపై సైతం దాడికి యత్నం pic.twitter.com/LwMq9FOfSE— PulseNewsBreaking (@pulsenewsbreak) September 9, 2026చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్ -
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి కిడ్నాప్
జగిత్యాలక్రైం: ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని కుటుంబసభ్యులు, బంధువులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. అంతర్గాం గ్రామానికి చెందిన బందెల ప్రశాంత్ 15రోజుల క్రితం కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం సీతారాంపలి్లకి చెందిన కావ్యను ప్రేమవివాహం చేసుకున్నాడు. యువతి కుటుంబసభ్యులు అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. యువతి మేజర్ కావడంతో ప్రశాంత్తోనే పంపించారు. అప్పటినుంచి ప్రశాంత్, కావ్య అంతర్గాంలో కాపురం పెట్టారు. ఈ క్రమంలో యువతి కుటుంబసభ్యులు, బంధువులు బుధవారం ఉదయం రెండు కార్లలో అంతర్గాం వచ్చి ప్రశాంత్ తల్లి భారతమ్మపై దాడిచేసి కావ్యను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. జరిగిన ఘటనను భారతమ్మ జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
యోగా సంబరం
● కరీంనగర్లో 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ పోటీలు ● ఈనెల 11, 12వ తేదీన నిర్వహణ ● 890 మంది క్రీడాకారుల రాకకరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి యోగా క్రీడలకు కరీంనగర్ వేదిక కానుంది. 13వ రాష్ట్రస్థాయి సబ్జూనియర్, జూనియర్ స్పోర్ట్స్ చాంపియన్షిప్ పోటీలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ ఆదేశాల మేరకు, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ల సహకారంతో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపల్లి అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో ఈ నెల 11,12న పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 400 మంది బాలురు, 400 మంది బాలికలు, 50 మంది కోచ్లు, మేనేజర్లు, 40మంది రిఫరీలు, కలిపి మొత్తం 890 మంది ఈ పోటీల్లో పాల్గొననున్నారు. 8–10, 10–12, 12–14 సంవత్సరాల సబ్జూనియర్ విభాగాలతో పాటు 14–16, 16–18 సంవత్సరాల జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30మందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో అక్టోబర్ 3 నుంచి 10 వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
సిరుల పంట.. ప్రకృతి బాట
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న డీఏవో భాస్కర్, నోడల్ అధికారివర్మికంపోస్ట్ తయారీ విధానం గొల్లపల్లి: రసాయనాల్లేని సాగుతో నేలకు బలం.. ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ స్పష్టం చేస్తోంది. రైతులు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించేందుకు స్థానిక వనరుల ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతగానో దోహదపడతాయి. విచక్షణారహితంగా వాడుతున్న రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలతో భూమి నిర్జీవంగా మారుతున్న తరుణంలో శ్రీప్రకృతి వ్యవసాయంశ్రీ అన్నదాతకు కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. ఘన జీవామృతం, పంచగవ్య, వేప గింజలు, సీతాఫల ఆకుల కషాయాల వంటి సహజ పదార్థాలతో నాణ్యమైన ఉత్పత్తులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్’ ద్వారా స్థానికంగా లభించే పశువుల వ్యర్థాలు, జీవ పదార్థాలు, వ్యవసాయ అవశేషాలతో భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచేందుకు చర్యలు ముమ్మరమయ్యాయి. క్షేత్రస్థాయిలో శిక్షణలు.. మట్టి నమూనాల సేకరణ ● రైతులు తమ ప్రాంత వాతావరణం, నేల స్వభావానికి సరిపడే పంటలను ఎంచుకునేలా వ్యవసాయ అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. ● ప్రతి క్లస్టర్లో దాదాపు 125 మంది రైతులతో బృందాన్ని ఏర్పాటు చేసి, శాసీ్త్రయ పద్ధతిలో మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. ● జిల్లా వ్యాప్తంగా 23 క్లస్టర్లులో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ● ల్యాబ్ పరీక్షల ద్వారా నేలలోని పోషక లోపాలను గుర్తించి, వాటికి తగినట్లు సహజ ఎరువుల వాడకంపై సాంకేతిక సలహాలు అందిస్తున్నారు. ● ఘన జీవామృతం (నేలలో సూక్ష్మజీవుల వృద్ధికి), పంచగవ్య (పైరు ఎదుగుదలకు), వేప, సీతాఫల కషాయాలు (చీడపీడల నివారణకు) పొలాల్లోనే స్వయంగా తయారు చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. సీఆర్పీలదే కీలక పాత్ర మహిళా సంఘాల పరిధిలోని క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు (సీఆర్పీ) ప్రత్యేక తర్ఫీదునిచ్చి రంగంలోకి దించారు. రైతులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ మట్టి సేకరణ, సహజ ఎరువుల తయారీ, అవగాహన సదస్సుల నిర్వహణలో వీరు వారధిగా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడి తగ్గింది.. లాభం పెరిగింది నేను 12 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న. పదెకరాల్లో మామిడి, రెండెకరాల్లో వరి నాటేసిన. అంతర పంటగా కూరగాయలు పండిస్తున్న. ప్రకృతి సేద్యం కోసం ప్రత్యేకంగా నాలుగు గిరిజాతి ఆవులను కొనుగోలు చేసి జీవామృతం తయారుచేసి వాడుతున్న. రసాయనాల పెట్టుబడి భారం తగ్గింది. చెట్టుచుట్టూ బ్యాక్టీరియా లేకుండా ఉంటుంది. 15ఏళ్లుగా తోట దున్నలేదు. అదనంగా ఎరువు అవసరం లేదు. మామిడి తోటలకు మట్టి ద్రావణం స్ప్రే చేయడం ద్వారా పురుగు ఆకును తినకుండా ఉంటుంది. ఇంగువా, పుల్లటి మజ్జగా స్ప్రేచేయడం ద్వారా చెడు బ్యాక్టీరియా ఉండదు. తేనెటీగల ఉధృతి పెరిగి లాభం చేకూరుస్తాయి. అలాగే నీము అస్త్రం స్ప్రే చేయడం ద్వారా పంట ఎదుగుతుంది. – మిట్టపల్లి రాములు, రైతు, తుంగూర్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, క్షేత్ర ప్రదర్శనలను రైతులు అందిపుచ్చుకోవాలి. దశలవారీగా రసాయనాలను తగ్గించి, సహజ పద్ధతులను అలవర్చుకోవడం వల్ల భూసారం పెరగడంతో పాటు సమాజానికి విషరహిత ఆహారం అందుతుంది. రైతులు వ్యవసాయ అధికారుల సలహాలతో ముందుకెళ్లాలి. – భాస్కర్, డీఏవో -
ఖతార్లో ఉద్యోగావకాశాలు
● ఈనెల 17 నుంచి ఫ్రీ ఇంటర్వ్యూలువేములవాడ: ఖతార్లో వివిధ ఉద్యోగాల భర్తీకి జీటీఎం ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న ఆ సంస్థ ప్రతినిధి చీటి సతీష్రావు తెలిపారు. బాగేజ్ హ్యాండ్లర్లు, క్లీనర్లు, వెయిట్రెస్లు, సౌస్చెఫ్లు, కుక్లు, క్యాటరింగ్ సూపర్వైజర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. బాగేజ్ హ్యాండ్లర్, క్లీనర్ పోస్టులకు ఖతార్ రూ.1,000 రియాల్స్ బేసిక్ వేతనం ఉండగా, సౌస్ చెఫ్కు రూ.5వేల రియాల్స్, సీనియర్ సీడీపీకి రూ.4వేల రియాల్స్, చీఫ్ స్టీవర్డ్కు రూ.3,500 రియాల్స్ వరకు వేతనం ఉంటుందని వివరించారు. ఇతర పోస్టులకూ పోస్టును బట్టి రూ.1,600 నుంచి రూ.3,200 రియాల్స్ వరకు గ్రాస్ వేతనం ఉంటుందని పేర్కొన్నారు. ఉచిత భోజనం, వసతి, రవాణాతోపాటు వీసా, టికెట్, వైద్య సదుపాయాలను సంస్థ కల్పిస్తుందని వెల్లడించారు. వివరాలకు సికింద్రాబాద్ 83320 52299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999, జగిత్యాల 83320 42299, సిరిసిల్ల 93476 61522, ఆఫీస్ 040–42029999 నంబర్లపై సంప్రదించవచ్చని తెలిపారు.సెప్టెంబర్ 17 : సికింద్రాబాద్ – జీటీఎం ఇంటర్నేషనల్ కార్యాలయం సెప్టెంబర్ 18: సిరిసిల్ల, జగిత్యాల– క్లీనర్ (బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) సెప్టెంబర్ 19: నిజామాబాద్, ఆర్మూర్ (క్లీనర్, బాగేజ్ హ్యాండ్లర్ పోస్టులు) -
డిజిటల్ క్రాప్ సర్వే షురూ
జగిత్యాలరూరల్: పంటల సాగు వివరాలు పక్కాగా లెక్కగట్టేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈనెల చివరి వరకు సర్వే చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. జిల్లా పరిధిలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక వలంటీర్ చొప్పున జిల్లావ్యాప్తంగా 289 మందిని నియమించారు. వీరు క్షేత్రస్థాయిలో పంటల వివరాలను సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన సెల్ ఫోన్ యాప్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 3,76,629 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. వలంటీర్లు వివరాల నమోదులో బిజీగా మారారు. జిల్లాలో 2,92,860 ఎకరాల్లో వరిసాగు జిల్లాలోని 20 మండలాలు 385 గ్రామాల్లో రైతులు మొత్తం 3,76,629 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 2,92,860 ఎకరాల్లో వరి, ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నరకాలు 2,06,074 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇతర సన్నరకాలు 21,486 ఎకరాలు, అలాగే దొడ్డురకం 65,300 ఎకరాల్లో రైతులు సాగుచేశారు. 289 మంది వలంటీర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక్కరు చొప్పున 289 మంది వలంటీర్లను నియమించారు. వారు తమకు కేటాయించిన గ్రామాల్లో 10 రోజులుగా సర్వే చేస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ప్రతి రైతు తనకున్న భూమిలో ఏయే పంటలు సాగు చేశారన్నది పూర్తిస్తాయి వివరాలు యాప్లో నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో శిక్షణ యాప్ వినియోగం, పంటల సాగు నమోదు విషయాలపై వలంటీర్లకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చారు. వలంటీర్లు గ్రామాల్లో సర్వే చేసి ప్రభుత్వం నిర్దేశించిన 45 రోజుల్లో తమకు కేటాయించిన గ్రామాల్లో శాటిలైట్ ఆధారంగా డిజిటల్ సర్వే పూర్తి చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రతీరోజు యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. -
మున్సిపల్ క్వార్టర్స్ ఆక్రమణ
కరీంనగర్: జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన విలువైన స్థలాలు కొన్ని ఆక్రమణకు గురవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ, మున్సిపల్ ఆస్తులకు సంబంధించి 3ఎంఐజీ, 1ఎల్ఐజీ క్వార్టర్లపై ఆక్రమణలు, అనధికారిక కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలు జరిగినట్లు జిల్లాకేంద్రంలోని విజయపురికి చెందిన కుమార్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖకు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరాడు. దీనికి విజిలెన్స్ శాఖ స్పందించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు లేఖ పంపించారు. ఈ క్రమంలో క్వార్టర్స్ విషయంలో వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ క్వార్టర్స్కు సంబంధించి గతంలోనే వారికి అలాట్ చేశారని తెలిసింది. అయితే అలాట్ ఎలా చేశారు..? ఉత్తర్వులు ఎలా జారీ చేశారు..? అనేది తెలియాల్సి ఉంది. పూర్తిస్థాయిలో విచారణ చేయాలని మున్సిపల్ శాఖకు లేఖ పంపించారు. జగిత్యాల రైతుబజార్ సమీపంలో క్వార్టర్స్, భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక భవనంలో ల్యాండ్ అక్వేషన్కు సంబంధించిన కార్యాలయం కొనసాగుతోంది. ఇది మున్సిపల్దే అయినప్పటికీ ఈ కార్యాలయం కొనసాగడంపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. విలువైన స్థలాల్లో ఆక్రమణలు జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన స్థలాలు అనేకం ఆక్రమణలకు గురవుతున్నాయి. కొత్తబస్టాండ్ సమీపంలో ఉద్యానవనం ఆనుకుని ఉన్న మున్సిపల్ స్థలంలో అనేక షెడ్లు వెలిశాయి. ఆ సమీపంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే అత్యధికంగా ఆదాయం లభిస్తుంది. ఆక్రమించుకున్న వారు చిన్నపాటి ఫీజు మున్సిపల్కు చెల్లిస్తూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటు స్పోర్ట్స్ అథారిటీకి చెందిన విలువైన భూమిలో అనేక దుకాణ సముదాయాలు, రేకులషెడ్లు వెలిశాయి. ఈ స్పోర్ట్స్ అథారిటీలో నిధులు లేకపోవడంతో అక్కడ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనట్లు తెలిసింది. దీంతో కొందరు రేకులషెడ్లు నిర్మించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో బినామీలు అత్యధికంగా ఉన్నారు. కొందరు షెడ్లు వేసి ఏకంగా ఇతరులకు అద్దెకు కూడా ఇస్తున్నారు. పాతబస్టాండ్ సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్లలో చిన్న గది అద్దెకు తీసుకుని అందులో వరండాలో రేకులషెడ్డు వేసుకుంటూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నా రు. విలువైన స్థలాల్లో ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. టౌన్ విభాగం అధికారులు నిత్యం పర్యవేక్షించాలని, ఆక్రమణలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఆదాయానికి గండి... ఆస్తుల గుర్తింపేది విలువైన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తే మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయం లభిస్తుంది. మున్సిపల్ ఆస్తులు గుర్తించాలని ఇటీవల ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. బల్దియాలకు స్థిరాస్తులు సర్వసాధారణం. అలాంటి ఆస్తులను గుర్తించి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఎల్ఐఎస్), డబుల్ఎంట్రీ అక్రూవల్ బెస్ట్ అకౌంటెంటింగ్ సిస్టమ్ (డీఈఏడీఏఎస్)లో తప్పనిసరిగా నమోదు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ చౌరస్తాలో బల్దియాకు క్వార్టర్ల్స్, బిల్డింగ్స్, రైతుబజార్ ఉన్నాయి. కొత్తబస్టాండ్లో ఖాళీ స్థలాలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వీటిని గుర్తించాలన్నప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోనట్లు తెలిసింది. రోడ్లపై ఆక్రమణలు మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతం కావడంతోపాటు, జిల్లా కేంద్రంలో రోడ్లపై షెడ్లు వేసుకుని అక్రమంగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన యావర్రోడ్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, టవర్సర్కిల్, పాతబస్టాండ్, గొల్లపల్లిరోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైనే పండ్ల విక్రయాలు చేపడుతున్నారు. గాజులు అమ్మేవారు, ఫుట్పాత్తోపాటు రోడ్లపైకి వచ్చి విక్రయిస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మున్సిపల్ స్థలాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, కాంప్లెక్స్లు నిర్మిస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. విచారణ చేస్తున్నాం జగిత్యాల మున్సిపాలిటీలోని 3ఎంఐజీ, 1 ఎల్ఐజీ క్వార్టర్లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నాం. రెవెన్యూ విభాగం వారిని ఆదేశించాం. పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం చర్యలు తీసుకుంటాం. గతంలోనే అలాట్ చేసినట్లు తెలిసింది. – సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్ -
దొంగల ముఠా అరెస్ట్
● పట్టించిన సీసీకెమెరాలు ● తులంన్నర బంగారం.. ● ద్విచక్ర వాహనం స్వాధీనంరాయికల్: పట్టణంలోని ఇటిక్యాల క్రాస్ రోడ్ వద్దనున్న కల్లెడ నర్సు అనే వృద్ధురాలి మెడలోంచి బంగారం చోరీ చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి.. వారి నుంచి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నామని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. రాయికల్ ఠాణాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటిక్యాల క్రాసింగ్ వద్ద ఒంటరిగా నివసిస్తున్న నర్సు ఇంట్లోకి ఈనెల 5న గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి తులంన్నర బంగారం దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై సుధీర్రావు, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు పట్టణంలోని సీసీకెమెరాల పుటేజీలను పరిశీలించారు. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై పల్లికొండ నరేశ్, తోపారపు నవనీత్, కల్లెడ మనోజ్ తిరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. నిందితులు కుమ్మరిపల్లి బస్టాండ్ నుంచి రాయికల్కు వెళ్తుండగా పట్టుకున్నారు. వారి నుంచి తులంన్నర బంగారం, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్రావు, క్రైంపార్టీ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, విజయ్, తిరుమల్ను డీఎస్పీ అభినందించారు. -
కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి ఇంటి రిజిస్ట్రేషన్
గొల్లపల్లి: పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా.. నకిలీ ధ్రువపత్రాలు, స్టాంపులు సృష్టించి ఏకంగా ఇంటినే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘరానా మోసం గొల్లపల్లి మండలంలోని తిరుమలాపూర్ (పీడీ) గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చిన గొలుసుల రాములు కొన్నేళ్లుగా ప్రభుత్వ స్థలంలో ఇంటి నంబర్ 3–122/2 పేరిట ఇల్లు నిర్మించుకుని నివాసముంటున్నాడు. ఇటీవల ఆ ఇంటిని గ్రామానికే చెందిన గండికోట లక్ష్మణ్కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం పంచాయతీ కార్యదర్శి సంతకం, స్టాంపులతో నకిలీ ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను రశీదును అక్రమంగా సృష్టించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. తీగ లాగితే డొంక కదిలింది.. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, కొనుగోలుదారుడు లక్ష్మణ్ ఆ పత్రాలను పంచాయతీ రికార్డుల్లో నమోదు చేసుకునేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి వద్దకు తీసుకొచ్చాడు. ఆ పత్రాలను నిశితంగా పరిశీలించిన కార్యదర్శి వాటిపై ఉన్నది తన సంతకం కాదని, నకిలీ స్టాంపులు వేసి ఫోర్జరీకి పాల్పడ్డారని గుర్తించి షాక్కు గురయ్యాడు. అందులో పొందుపరిచిన ఇంటి పన్ను రశీదు నంబర్ను రికార్డుల్లో పరిశీలించగా.. అది గతేడాది ఆగస్టులో జారీ చేసిన నీటి పన్ను రశీదు నంబర్గా తేలింది. నీటి పన్ను రశీదును ఇంటి పన్ను రశీదుగా మార్చి మోసానికి తెరలేపినట్లు నిర్ధారణ అయ్యింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీకి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్కు పాల్పడిన గొలుసుల రాములు, గండికోట లక్ష్మణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శి తిరుపతి గొల్లపల్లి పోలీస్స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేసీఆర్కు కీడు కోరుకోవడం నేరం
● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి ● షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్పై పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుజగిత్యాలక్రైం: రాష్ట్ర సాధకుడు కేసీఆర్కు కీడు జరగాలని కోరుకోవడం నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ చావు కోరుతూ డప్పు కొట్టిన షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్పై చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ కరుణాకర్కు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ చావు కోరుతూ డప్పు కొట్టిన ఎమ్మెల్యే శంకర్తోపాటు, ఆ నేరాన్ని ప్రోత్సహించిన సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలన్నారు. పార్టీలపరంగా భిన్నాభిప్రాయాలున్నా నేరాన్ని ప్రోత్సహించేలా ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ చావు కోరడం క్షమించరాని నేరమన్నారు. అసెంబ్లీలో జవాబు చెప్పలేక బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారన్నారు. శాసనసభ, పార్లమెంట్కు డ్రెస్కోడ్ ఉండదని, నల్ల దుస్తులతో నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకోవడం, అవమానించడం బాధాకరమన్నారు. అదే అసెంబ్లీలో బీజేపీ నాయకులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తే ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. కేసీఆర్ హయాంలో 24గంటలు సరఫరా అయిన విద్యుత్.. రేవంత్ పాలనలో ఎప్పుడు పోతుందో తెలియడం లేన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ.. కేసీఆర్ చావు డప్పు కొడతానన్న ఎమ్మెల్యే శంకర్ వ్యాఖ్యలు ఖండించారు. ఎమ్మెల్యే శంకర్పై పోలీసులు సుమోటాగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు విజయలక్ష్మీ, దేశాయ్, బీఆర్ఎస్ నాయకులు వొల్లం మల్లేశం, శివకేసరిబాబు, దుర్గన్న, దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. -
రయ్.. రయ్యంటూ..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జాతీయ రహదారి 563పై రాకపోకలు ప్రారంభం అయ్యాయి. 68 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి కరీంనగర్– వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. కేవలం 40 నిమిషాల్లో రెండు నగరాల మధ్య వాహనాలు రాకపోకలు సాగించేలా ఈ రహదారిని నిర్మించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రహదారి మానకొండూరు సమీపంలోని ఖాదర్గూడం వరకు అందుబాటులో ఉండేది. దుర్శేడ్ వద్ద ర్యాంపు నిర్మించకపోవడంతో పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బందిగా మారిందన్న ‘సాక్షి’ కథనంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వారు కరీంనగర్– వరంగల్ సెక్షన్ దుర్శేడ్ వద్ద రోడ్డు చివర తాత్కాలిక ర్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్కు రాకపోకలు సాగించేందుకు వీలు చిక్కింది. జగిత్యాల– కరీంనగర్ సెక్షన్ పనులు మొదలయ్యే వరకు ఈ తాత్కాలిక ర్యాంప్ మీదుగా రాకపోకలు సాగనున్నాయి. ఈ రహదారిని అత్యంత వేగంగా పూర్తి చేసినందుకు హన్మకొండ కలెక్టర్ చేతుల మీదుగా ఎన్హెచ్–563 ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ అవార్డు అందుకోవడం విశేషం. ఇక అక్టోబరు మొదటి వారం నుంచి కొత్తగట్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్గేట్ ద్వారా టోల్ చార్జీలు వసూలు చేయనున్నారు. దుర్శేడ్ వద్ద రోడ్డు చివర ఏర్పాటు చేసిన ర్యాంపుతో కరీంనగర్–వరంగల్– పెద్దపల్లి వెళ్లే వాహనాలకు కాస్త ఊరట లభించింది. రోడ్డు దిగాక.. కరీంనగర్ లేదా పెద్దపల్లి వైపు ఎలా వెళ్లాలి? అన్న విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. పెద్దపల్లి నుంచి వచ్చేవారు దుర్శేడ్ పద్మనాయక భవనం వద్ద యూటర్న్ తీసుకుని ర్యాంపుమీదుగా హైవే ఎక్కాల్సి వస్తుంది. ఇక్కడ వాహనదారులు తికమకపడితే పరస్పరం ఢీకొనే ప్రమాదముంది. పెద్దపల్లి నుంచి వచ్చే వారికి జగిత్యాల వైపు నిర్మించినట్లుగా శాశ్వత ర్యాంపులు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ రహదారికి శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి వద్ద అండర్ పాస్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందిస్తూ.. తమ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేస్తే తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.దాదాపు రూ.రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో 59 కిలోమీటర్ల ఎన్హెచ్– 563 జగిత్యాల– కరీంనగర్ సెక్షన్కు ఇటీవల టెండర్లు పిలిచారు. ఇవి త్వరలోనే ఖరారవనున్నాయి. ఇరుకుగా ఉన్న జగిత్యాల– కరీంనగర్ రోడ్డుపై రాకపోకలు అంటే ప్రతీరోజూ ఆర్టీసీ, ప్రైవేటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంగాధర వద్ద రైల్వేగేట్తో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఏఐ అధికారులు టెండరు ఖరారయ్యేలోగా వాహనదారులకు వీలుగా ఉండేలా ట్రాఫిక్ను చక్కదిద్దేందుకు సిద్ధపడ్డారు. ఇందుకోసం దాదాపు రూ.9 కోట్లు విడుదల చేశారు. పలుచోట్ల రోడ్ల వెడల్పు, చెట్ల తొలగింపు, స్పీడ్ బ్రేకర్లు, ప్రమాదాలు జరిగే చోట సైన్ బోర్డులు ఏర్పాటు చేసే పని చేపడుతున్నారు. వరంగల్– కరీంనగర్ సెక్షన్లో పాత రహదారిని ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో 39కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
జేఎన్టీయూలో ప్లేస్మెంట్ డ్రైవ్
● వివిధ ఉద్యోగాలకు 82 మంది ఎంపిక కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ(నాచుపల్లి )లో వర్టికల్ సొల్యూషన్స్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రాంగణ నియామకాలు చేపట్టారు. ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ విభాగాలకు చెందిన 82 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు సంస్థ హెచ్ఆర్ సబర్ తెలిపారు. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసెంబ్లింగ్ విభాగానికి 68 మంది, బీవైడీ సంస్థకు 14 మంది ఎంపికయ్యారు. అమ్మాయిలకు నెలకు రూ.20వేల వేతనం, ఉచిత భోజన వసతి, రవాణా, అబ్బాయిలకు నెలకు రూ.32,500 చెల్లిస్తారని పేర్కొన్నారు. హన్సన్ టెక్నాలజీస్ సంస్థలు ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా మేనేజ్మెంట్ రోల్కు సంబంధించి సీఎస్సీ విభాగంలో ఒకరు, ఐటీ విభాగంలో ముగ్గురు విద్యార్థినులు టెక్నికల్ రౌండ్కు ఎంపికయ్యారని, ఆఖరి రౌండ్లో ఎంపికై న వారికి ఏడాదికి రూ.6.7 లక్షల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపల్ నరసింహ అభినందించారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ సతీష్కుమా ర్ కృషిని ప్రశంసించారు. వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, బోధన, బోధేనతర సిబ్బంది పాల్గొన్నారు. ఉపకరణల నిర్ధారణ శిబిరంకరీంనగర్: సమగ్ర శిక్ష అభియాన్ అలింకో ఆధ్వర్యంలో ఈనెల 10న కోరుట్ల, 11న జగిత్యాల డివి జన్లో దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలి పారు. కోరుట్ల భవిత కేంద్రం, జిల్లాకేంద్రంలో పురాతన హైస్కూల్లో శిబిరం నిర్వహిస్తామన్నా రు. ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు. ఆశావర్కర్లు చొరవ చూపాలన్నారు. -
ఊరేగింపు.. పొంచిన ఉన్న ముప్పు
జగిత్యాలక్రైం: పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా గణేశ్ నవరాత్రోత్సవాల సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను మండపాలకు ఆహ్వానించేందుకు యువత, ఉత్సవ కమిటీలు పోటీపడుతూ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. అయితే భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా సాగాల్సిన గణేశుడి ఆగమనం.. కొన్నిసార్లు ప్రమాదాలకు వేదికవుతోంది. గతంలో వినాయకుడి విగ్రహాన్ని మేళతాళాలు, భజనలతో మంగళకరమైన వాతావరణంలో మండపానికి తీసుకొచ్చేవారు. కొన్నేళ్లుగా మహారాష్ట్ర తరహాలో ఆగమనం పేరిట ఇటీవల విపరీత పోకడలు పెరిగిపోయాయి. ట్రాలీలు, లారీలపై వేలాడే భారీ డీజే సౌండ్ బాక్సులు, ఊపిరాడకుండా కాల్చే బాణసంచా పొగ, యువకుల చిందులు.. వెరసీ కొన్నిచోట్ల ప్రమాదకర విన్యాసంగా మారుతోంది. ఆర్భాటం, సోషల్ మీడియాలో రీల్స్ మోజు, విచ్చలవిడి పోటీతత్వం కారణంగా ఏర్పాటు చేస్తున్న డీజేలు, కళ్లు బైర్లు కమ్మేలా లేజర్ లైట్లు, ట్రాఫిక్ను స్తంభింపజేస్తూ చేస్తున్న విన్యాసాలు పండుగ ఆనందాన్ని మిగల్చకపోగా.. పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికార యంత్రాంగం సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఆదేశాలు పాటించాల్సిందే.. నిబంధనలు కఠినతరం నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆగమనం పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజేలపై నిషేధం ఉంది. రహదారులపై ట్రాఫిక్కు ఆటంకం కలిగించొద్దు. విగ్రహాల తరలింపు వేళ ప్రమాదకర స్టంట్లు చేయొద్దు. – అశోక్కుమార్, ఎస్పీ -
ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ
● కలెక్టర్ సత్యప్రసాద్ కరీంనగర్: పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ అని కలెక్టర్ సత్యప్రసా ద్ అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన తన రచనల ద్వారా ప్రజాసమస్యలు, సామాజిక రుగ్మతలు, అన్యాయాలను ఎత్తిచూపుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. సామాజిక మార్పు కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలుగు భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలపై కాళోజీకి అపారమైన అభిమానం ఉండేదన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలిపెగడపల్లి: భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలంలోని ల్యాగలమర్రిలో జరుగుతున్న రీ సర్వేను బుధవారం పరిశీలించారు. సర్వేలో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి సర్వే నంబర్ను వరుస క్రమంలో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఇది రైతులకు ఎంతో మేలని, ఇందుకు సహకరించాలని రైతులకు సూచించారు. సర్పంచ్ ఎల్గటూరి రవి, తహసీల్దార్ సయ్యద్ నిజామొద్దీన్, ఆర్ఐ శ్రీనివాస్, సర్వేయర్ తనూజ, రైతులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో సీసీకెమెరాలు దోహదంజగిత్యాలక్రైం: నేరాల నియంత్రణలో సీసీకెమెరాలు దోహదం చేస్తాయని జగిత్యాల డీఎస్పీ పురుషోత్తంరెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో సర్పంచ్ కుకునూరి వంశీ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను ఆయన బుధవారం ప్రారంభించారు. ప్రజలు తమ వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను నియంత్రించవచ్చన్నారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్, ఉపసర్పంచ్, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మాస శివరాత్రి పూజలుజగిత్యాలరూరల్: మాస శివరాత్రి సందర్భంగా జగిత్యాలరూరల్ మండలం పొలాస శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, లక్ష్మణ్ దంపతులు పూజలు చేశారు. ఆలయ వ్యవస్థాపకులు నలమాసు గంగాధర్, భక్తులు పాల్గొన్నారు. విద్యార్థి దశ విలువైందికరీంనగర్: విద్యార్థి దశ విలువైందని ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాల ప్రిన్సిపాల్ ఇందిరాదేవి అన్నారు. కళాశాలలో యుపోరియా–2026 పేరుతో బుధవారం వార్షికోత్సవం నిర్వహించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలన్నారు. రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ మాట్లాడు తూ.. చదువుతోపాటు, మానసిక ప్రశాంతత, మానవీయ విలువలు అలవర్చుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి రమేశ్బాబు మాట్లాడుతూ ప్రస్తుతం అర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ నైపుణ్యాలను విద్యార్థులు సాధించాలన్నారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ ప్రి న్సిపల్ శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలి
కరీంనగర్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించాలని, బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేసి కలర్ కోడెడ్ బిన్లలో నిల్వ చేసి ఏజెన్సీ ద్వారా తరలించాలని డీఎంహెచ్వో సుజాత అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో టారిఫ్ బోర్డులు ఏర్పాటు చేసి వైద్యసేవలు, పరీక్షలు, సంబంధించిన చార్జీల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఆస్పత్రుల్లో క్లీనికల్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్, రికార్డులు ఉండాలని పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ల్యాబ్లు నిబంధనల ప్రకారం ఉండాలన్నారు. ఆమె వెంట వైద్య సిబ్బంది ఉన్నారు. -
మా సంగతేంటి..?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణి మారుపేర్లపై తొలిసారిగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడం కార్మిక కుటుంబాల్లో ఆనందం నింపింది. సంస్థలో రెండుపేర్లతో పనిచేస్తున్న కార్మికులను ఇప్పటికే తాము గుర్తించామని, దీనిపై కమిటీ వేశామని, త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించడాన్ని సింగరేణి వ్యాప్తంగా కార్మికలోకం స్వాగతిస్తోంది. అదే సమయంలో తమ సమస్యలను కూడా పరి ష్కరించాలని విశ్రాంత కార్మికులు వేడుకుంటున్నా రు. అదే రెండుపేర్ల సమస్య తమనూ నేటికీ వెంటా డుతోందని, కనీసం తాము మరణించేలోగానైనా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వంతో విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో అనేక ఇబ్బందులు పడుతున్నతా ము.. ఆస్తుల మార్పిడి, ఆధార్కార్డులు, ఇతర గు ర్తింపు కార్డుల విషయంలో చెప్పలేని పాట్లు, మానసిక వ్యధ అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఆస్తులు, పింఛన్ల విషయంలో.. ఇప్పటివరకూ రిటైర్డ్ అయిన వారిలో 35వేల మందికిపైగా విశ్రాంత కార్మికులు రెండుపేర్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా 70 నుంచి 80ఏళ్లు పైబడిన వారే. వీరిలో సగానికిపైగా రెండు ఆధార్కార్డులు తీసుకున్నారు. ఇదే వీరికి శాపంగా పరిణమించింది. ప్రస్తుతం బ్యాంకులు కేవైసీలు అడుగుతున్న క్రమంలో ఆధార్కార్డులు మ్యాచ్ కాక సగానికిపైగా కార్మికుల పింఛన్లు నిలిచిపోయాయి. ఇప్పటికీ వీరి ఆస్తులు వారి సంతానం పేరిట మారకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కాస్తోకూస్తో వస్తున్న పింఛన్లు కూడా నిలిచిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. తమకు కూడా ఆలియాస్ పేరుతో అవకాశం కల్పించాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతున్నారు. -
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027
కరీంనగర్స్పోర్ట్స్: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ పరిధిలోని మై భారత్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతోందని ఉమ్మడి జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం మై భారత్ కార్యాలయంలో మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జరిగే జాతీయ యువజనోత్సవంలో 15 నుంచి 29ఏళ్ల మధ్య వయసు కలిగిన యువతీ యువకుల నుంచి కరీంనగర్ జిల్లా మై భారత్ కార్యాలయం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ డిజిటల్ క్విజ్, వ్యాస రచన, జిల్లా స్థాయి ప్రజెంటేషన్, రాష్ట్ర స్థాయి డైలాగ్, న్యూఢిల్లీలో జరిగే నేషనల్ గ్రాండ్ ఫినాలే వరకు బహుళ దశల్లో పారదర్శకంగా సాగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన ప్రతినిధులు 2027 జనవరి 10 నుంచి 12 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ముగింపు వేడుకల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలిగిన కరీంనగర్ జిల్లా యువతీ యువకులు మై భారత్ అధికారిక పోర్టల్ ద్వారా తమ పేరు, పుట్టిన తేదీ, జిల్లా వివరాలతో సైన్అప్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని, అనంతరం లభించే ఐడీ ద్వారా క్విజ్, పోటీల్లో పాల్గొనవచ్చునని అన్నారు. జిల్లా కార్యక్రమ అధికారి జి.కిరణ్ కుమార్ పాల్గొన్నారు. యువత ఆలోచనలకు జాతీయ వేదిక ఉమ్మడి జిల్లా యువజన అధికారి గోలి తిరుపతి రెడ్డి -
సీజనల్ వ్యాధులు నివారించాలి
పెగడపల్లి: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం, తిరుమలాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. సిబ్బంది పనితీరు, వైద్య సేవలు, మందుల నిల్వలు, హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. వైద్య సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావాలని సూచించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్వో సందీప్, హెచ్వీలు జయశీల, జ్యోతి, సిబ్బంది మౌనిక, లక్ష్మీ, భాస్కర్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ఉద్యోగాల పేరిట రూ.44 లక్షలు వసూలు
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్గా పరిచయం చేసుకుని ప్రభుత్వశాఖలు, యూని వర్సిటీ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన దుడపాక తిరుపతి అలియాస్ తిరుపతిరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 21మంది నుంచి రూ.44 లక్షలు వసూలు చేసినట్లు నిర్ధారించారు. కేసు వివరాలను టూ టౌన్ పోలీస్స్టేషన్లో మంగళవారం టౌన్ ఏసీపీ వెంకటస్వామి వెల్లడించారు. నగరంలోని విద్యానగర్లో అద్దెకుంటున్న దుడపాక తిరుపతిరావు శాతవాహన యూనివర్సిటీలో బోట నీ ప్రొఫెసర్గా చెప్పుకుంటూ తిరిగేవాడు. తనకు ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించేవాడు. విద్యానగర్కు చెందిన పురుషోత్తం మమత కూతురు కీర్తనకు శాతవాహన యూనివర్సిటీలో డేటాఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు రూ.1.50 లక్షలు డిమాండ్ చేశాడు. మమత రూ.65వేలు నగదుగా ఇచ్చింది. మరో రూ.85వేలు తిరుపతి భార్య లావణ్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసింది. కొద్దిరోజులకు కీర్తనకు రికార్డు అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చిందని నకిలీ నియామక ఉత్తర్వులు సృష్టించాడు. విషయం తెలిసి మమత బంధువులు సైతం తిరుపతిని సంప్రదించడంతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించి సుమారు రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. వారికి నియామక పరీక్షలు నిర్వహించి, ఓఎంఆర్ షీట్లు కూడా తయారు చేశాడు. ఇందుకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్లో ఓ టీంను ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తంగా 21మంది నుంచి రూ.44లక్షలు తీసుకున్నాడు. తరువాత తిరుపతి ఇచ్చినవి నకిలీ నియామక పత్రాలుగా రుజువు కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం శాతవాహన యూనివర్సిటీ సమీపంలో దుడపాక తిరుపతిరావును టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. తిరుపతికి ఈట్ల సత్యం, రాజశేఖర్తో పాటు మరికొందరు సహకరించారని, వారిని త్వరలో పట్టుకుంటామని ఏసీపీ వెల్లడించారు. ప్రధాన నిందితుడు దుడపాక తిరుపతి అరెస్ట్ వివరాలు వెల్లడించిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి -
బయోమందుల దందా
కరీంనగర్ అర్బన్: జీవ ఎరువుల దందా కరీంనగర్ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎరువుల బస్తాలతో అంటగడుతూ మాటల గారడీతో జేబులు నింపుకుంటున్నారు. బయోఎరువులు, మందుల పేరుతో రూ.కోట్లలో దందా సాగుతుండగా నియంత్రించేవారే కరవవడం అనుమానాలకు తావిస్తోంది. మార్కెట్లో వాటి పేరిట నకిలీవి అంటగడుతుండగా వాస్తవానికి బయోఎరువులు అమ్మడం నిషేధమని అధికారులు చెబుతున్నారు. కానీ డీలర్లకు, కంపెనీలకు కాసుల వర్షం కురుస్తునే ఉంది. విక్రయాల పరిమితిని బట్టి ఏజెంట్లు, డీలర్లకు ప్రోత్సాహకాలు, టూర్లు వంటి ఆఫర్లు ఇస్తున్నారు. డీలర్లే వ్యాపారం చేస్తుండగా ఏఈవోలు, ఏవోలకు కంటపడలేదంటే ఆశ్చర్యమే. రూ.లక్ష దాటితే టూర్లు, ప్యాకేజీలు కరీంనగర్ అర్బన్, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూరు, గంగాధర, చొప్పదండి, కొత్తపల్లి, శంకరపట్నం, తిమ్మాపూర్ తదితర మండలాల్లోని ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కరీంనగర్లో హోల్సేల్ డీలర్లు ఉన్నారు. బడా కంపనీలకు హోల్సేల్ డీలర్గా వ్యవహరించే వ్యక్తే ఈ దందాలో కీలకమని స్పష్టమవుతోంది. విక్రయాలను బట్టి దుకాణ డీలర్లకు కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి. సదరు ఎరువులు, మందులు అతి చౌక ధర కాగా వీరు మాత్రం పదింతలు అధిక ధరకు విక్రయిస్తున్నారు. దానిపై ఉండే ఎంఆర్పీ ధరలో సగానికి పైగా డబ్బులు కమీషన్ రూపంలో ఇస్తుండటంతో దుకాణాల డీలర్లు వీటి విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. సదరు మందుల విలువ రూ.లక్ష దాటితే విహార యాత్రలు, విలువ గల బహుమతులను అందిస్తున్నారు. పలువురు డీలర్లను ఇటీవల గోవా టూర్కు తరలించి సకల మర్యాదలు చేశారన్న ఆరోపణలున్నాయి. సందర్శనలు.. సమావేశాలు రోడ్డును ఆనుకుని ఉన్న రైతుల పొలాలను ఎంపిక చేసి తమ కంపెనీల మందుల ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు. గ్రామంలోని రైతులను మభ్య పెడుతూ పంటచేలలో క్షేత్రసందర్శనలు పెడుతూ తమ ఉత్పత్తుల వాడకంతో పంట ఏపుగా పెరిగిందంటూ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. రైతులను పిలిచి రచ్చబండ వద్ద కుర్చీలు వేసి టీ, టిఫిన్లు పెట్టి పెద్దపెద్ద స్క్రీన్లపై రైతులతో మాట్లాడిస్తూ బయో ఉత్పత్తులు వాడేలా చూస్తున్నారు. వివిధ గ్రామాల రైతులను పిలిచి వారితోనే మాట్లాడించి బయో మందులు వాడమని చెప్పిస్తున్నారు. ఇక ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఏఐ రూపొందిత రీల్స్, వీడియోలతో ఆకర్షణీయ ప్రకటనలూ చూపి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దుకాణదారులు అరువుపై మందులను ఇవ్వడం కూడా రైతులు బయోమందుల వైపు మొగ్గు చూపేలా సఫలీకృతులవుతున్నారు. అయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్ తెలిపారు. బయో మందుల విక్రయానికి ప్రభుత్వ అనుమతి లేదని, వాటిని రైతులు వినియోగించి నష్టపోవద్దని సూచించారు. టార్గెట్ దాటితే టూర్లు, ప్యాకేజీలు బోగస్ కంపెనీల రూ.కోట్ల వ్యాపారం అన్నదాతల అమాయకత్వమే పెట్టుబడి -
రద్దీ ప్రకారం బస్సులు నడపాలి
విద్యానగర్(కరీంనగర్): వినాయక చవితి రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ జోన్ పరిధిలోని రీజినల్ మేనేజర్లకు సూచించారు. మంగళవారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలోని తన కార్యాలయంలో రీజియన్ల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించారు. వినాయక చవితి సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా తగిన బస్సులు నడపాలని సూచించారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ రీజినల్ మేనేజర్లు డి.విజయభాను, బి,రాజు, ఎ.శారీరం, ఎస్, భవానీప్రసాద్, కరీంనగర్ జోన్లోని పర్సనల్ ఆఫీసర్స్ ఎం.సంపత్ కుమార్, వీరన్న, శ్యామలదేవి పాల్గొన్నారు. -
యువ ఇంజినీర్ను బలితీసుకున్న వాహనం
మంగళగిరి రూరల్: ఉపాధి కోసం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పని చేసేందుకు వచ్చిన ఓ యువ ఇంజినీర్ చివరకు అదే కంపెనీ వాహనం కింద పడి మృతిచెందాడు. రాజన్నసిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకటశ్యామ్(22) రాజధానిలో ఈ–14 రోడ్డు నిర్మాణం చేస్తున్న మెయిల్ అనే కంపెనీలో జూనియర్ సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి విధులకు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరు గ్రామంలో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14లో డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో డివైడర్ ఏర్పాటుకు సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ నింపే క్రమంలో ఓ వాహనం వచ్చింది. ఆ వాహనం వెనక్కి వచ్చే క్రమంలో శ్యామ్ను ఢీకొనడంతో టైర్ కింద పడిపోయాడు. తోటి ఉద్యోగులు శ్యామ్ను హుటాహుటిన ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఏపీ రాజధాని ప్రాంతంలో ఈ–14 రోడ్డు నిర్మాణ పనుల్లో ఘోరం కాంక్రీట్ మిక్సర్ వాహనం కిందపడి దుర్మరణం రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన వ్యక్తి గా గుర్తింపు -
అమ్మతనానికి ఆపద..!
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లే జరుగుతున్నాయి. సిజేరియన్తో మహిళల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటోంది. ప్రతి ఆస్పత్రిలో సిజేరియన్లే ఎక్కువగా అవుతుండడంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. బరువు తక్కువగా ఉన్నా... గర్భిణులు బరువు తక్కువగా ఉన్నా హైరిస్క్గా గుర్తిస్తారు. 18 ఏళ్లలోపు, 35ఏళ్లపైబడి గర్భం దాల్చిన మహిళలు హైరిస్క్లోకి వెళ్తారు. చిన్న వయస్సులో అయితే శారీరక ఎదుగుదల లేకపోవడం, పెద్ద వయస్సులో అయితే గర్భధారణ సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో 18 ఏళ్లలోపు, 35 ఏళ్ల పైబడిన వారిని 159మందిని గుర్తించారు. అలాగే ఊబకాయం, అధిక బరువు ఉన్న వారు కూడా ఈ జాబితాలో చేరుతున్నారు. పోషకాహారం లేకనే.. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పోషకాహా రం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. గ్రామీ ణప్రాంతాల్లో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం, ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా హైరిస్క్లోకి వెళ్తున్నారు. గ్రామీణులకు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం అందిస్తుంటారు. కానీ.. దానిని కొందరు తీసుకోకపోవడంతో సమస్యలు ఎదుర్కోవా ల్సి వస్తుంది. గర్భం దాల్చినప్పటి నుంచి ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, పండ్లు, గుడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి భోజనం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సమయపాలన పాటించకపోతే పోషకాహార లోపంతో బిడ్డ 9 నెలలు నిండకముందే తక్కువ బరువుతో జన్మించే అవకాశం ఉంటుంది. వీరికి గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పు రాకపోవడంతో హైరిస్క్ కేసులు పెరుగుతున్నాయి. జగిత్యాల: హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గర్భధారణ సమయంలో వివిధ అనారోగ్య సమస్యలు రావడంతో ప్రసవం సమయంలో ప్రాణాలకే ముప్పు వస్తోంది. ఒకానొక దశలో తల్లితోపాటు, శిశువులూ మృత్యువాత పడిన ఘటనలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలో 5,884 మంది హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి గర్భం దాల్చినప్పటి నుంచే మహిళలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతినెలా చెకప్ చేయించుకోవడంతోపాటు డాక్టర్ సలహాలు తప్పనిసరిగా పాటించాలి. సాధారణంగా 6, 8వ నెల వచ్చేసరికి బీపీ, షుగర్ రావడం.. హైపర్ టెన్షన్.. డయాబెటిస్.. థైరాయిడ్ వంటి సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో డాక్టర్లు ఎకై ్సర్సైజ్లు చేయిస్తుంటారు. వీటిని గర్భిణులు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడాల్సిందే. అయితే గ్రామీణప్రాంతాల మహిళల్లో ఎక్కువగా అవగాహన లేకపోవడంతో గర్భధారణ తర్వాత పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. అలాగే సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో బలహీనతగా మారి ప్రసవ సమయంలో ఇబ్బందిపడటంతోపాటు కొన్నిసార్లు మృత్యువాత పడిన సంఘటనలూ చోటుచేసుకుంటున్నాయి. మొదటి కాన్పులో సిజేరియన్ అయితే రెండో కాన్పులో అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్లీ సిజేరియన్ చేయాల్సి వస్తే అది హైరిస్క్గా మారుతుంది. ప్రసవం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పర్యవేక్షణ అవసరం పరీక్షలు చేయించుకోవాలి గర్భం దాల్చిన మహిళా ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సరైన పౌషకాహారం తీసుకోవాలి. పరీక్షలు చేయించుకుంటే తల్లీబిడ్డ ఎలా ఉన్నారన్నది తెలుస్తుంది. దానిని బట్టి వైద్యులు మందులు రాస్తారు. 9 నెలలు నిండే వరకు ప్రతినెల స్కానింగ్ చేయించుకోవాలి. – జైపాల్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో -
కోరుట్లలో బీఆర్ఎస్ ఆందోళన
కోరుట్ల: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ గేటు వద్ద దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వ కుంట్ల విద్యాసాగర్రావు డిమాండ్ చేశారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అ నంతరం జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ మాజీ మంత్రులైన సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు దురుసుగా ప్రవర్తించటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చే స్తోందని ఆరోపించారు. మార్క్ఫెడ్ మాజీ అధ్యక్షు డు లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచులు,కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ఇటిక్యాల పెద్దవాగులో తోడేళ్లు
ఇటిక్యాల వాగులోంచి ఇసుక అక్రమ రవాణా రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాలలోని పెద్ద వాగు నుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. గ్రామంలోని హనుమాన్ ఆలయ అభివృద్ధి పేరిట కొంత మంది ఆర్నెళ్ల కాల వ్యవధికి రూ.10 లక్షల టెండర్ను దక్కించుకున్నారు. అప్పటినుంచి ఎవరికీ అనుమానం రాకుండా హనుమాన్ ఆలయ అభివృద్ధి అంటూ దేవుని పేరిట రశీదులు తయారుచేయించి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇందుకోసం వాగు శివారులో.. పరిసర ప్రాంతాల్లో ట్రాక్టర్ డ్రైవర్లకు చిట్టీ అందిస్తున్నారు. ఒక్కో చిట్టీకి అదే గ్రామానికి ఇసుక అయితే రూ.300, ఇతర గ్రామాలకు తరలిస్తే రూ.500 వసూలు చేస్తున్నారు. ప్రకృతి సంపద అయిన ఇసుకను హనుమాన్ ఆలయ అభివృద్ధి పేరిట రశీదులు తయారు చేసి ఒక్కో ట్రాక్టర్కు రూ.300 నుంచి రూ.500 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇదంతా తెలిసినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాయికల్ నుంచి మెట్పల్లి వరకు తరలింపు ఇసుకకు డిమాండ్ ఉండటంతో మల్లాపూర్ మండలం సాతారం, కోరుట్ల మండలం పైడిమడుగు, మెట్పల్లి పట్టణంతోపాటు, పరిసర గ్రామాల నుంచి ట్రాక్టర్లు ఇటిక్యాలలోని పెద్దవాగు నుంచి ఇసుకను తీసుకెళ్తున్నాయి. ఒక్కో ట్రిప్పుకు సుమారు రూ.2500 నుంచి ప్రాంతాలను బట్టి రూ.3500 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతిరోజు సుమారు 50 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. చూసీచూడనట్లుగా మైనింగ్ అధికారులు పెద్దవాగు నుంచి భారీ ఎత్తున ఇసుక రవాణా అవుతున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక ట్రాక్టర్లను ఎవరైనా అడ్డుకుని ప్రశ్నిస్తే.. సంబంధిత అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పినట్లు బహిరంగంగానే చెబుతుండడం గమనార్హం. అనుమతి లేకుండా.. కేవలం ఆలయ అభివృద్ధి కోసమంటూ ఇసుకను తరలిస్తున్న వారితోపాటు ఇందుకు సహకరిస్తున్న సంబంధిత శాఖల అధికారులపై గ్రామస్తులు, పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.అక్రమంగా రవాణా చేస్తే చర్యలు అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను ఇళ్ల నిర్మాణాలకు తరలించాలి. వీఆర్ఏలు, జీపీవోలు ఎప్పటికప్పుడు ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటున్నారు. – నాగార్జున, తహసీల్దార్, రాయికల్ -
‘చేయూత’కు 15వేల దరఖాస్తులు
జగిత్యాల: ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన చేయూత పెన్షన్లకు ఇప్పటివరకు జిల్లాలో 15 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా దరఖాస్తు చేసుకున్నవారు వితంతువులే ఉన్నారు. దరఖాస్తులకు ఆగస్టు 31 వరకే చివరి తేదీ ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఈనెల 15 వరకు పెంచారు. ఈ క్రమంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. గడువులోపు అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ సూచించారు. కేటగిరీల వారీగా వచ్చిన మొత్తం దరఖాస్తులు 15,032వితంతువులు 6,071ఒంటరి మహిళలు 1,317దివ్యాంగులు 2,424చేనేత 2,435కల్లుగీత కార్మికులు 2,165పైలేరియా 560డయాలసిస్ 60 -
రేవంత్రెడ్డి పాలనకు నూకలు చెల్లాయి
జగిత్యాల: సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రంలో నూకలు చెల్లాయని, అది జగిత్యాల నుంచే ప్రారంభమైందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లాకేంద్రంలో చేసిన ధర్నాలో మాట్లాడారు. జగిత్యాల ఉద్యమాల గడ్డ అని, రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం నిజమవుతోందన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చుతున్నారని, కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీరు తరలించే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. ఎల్నినో ప్రభావంతో యాసంగి చేసుకునే పరిస్థితి లేదన్నారు. యూరియా సరఫరాపై అనేక ఆంక్షలు పెట్టి రైతులను గోస పెడుతున్నారని, వెంటనే యాప్ తొలగించి రైతులకు యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతుల కోసం రైతుబీమా, రైతుభరోసా ప్రవేశపెట్టారని, ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేశారని, వైఎస్సార్ ప్రారంభించిన పథకాలు కేసీఆర్ పటిష్ఠంగా అమలు చేశారని, కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందోనని రేవంత్రెడ్డి పథకాలను అణగదొక్కుతున్నారని తెలిపారు. జగిత్యాల ప్రజలు కేసీఆర్ను చూసి ఇక్కడ సంజయ్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే రేవంత్రెడ్డి పక్కన చేరి గుట్టలు, భూములు దోచుకుంటున్నాడని విమర్శించారు. మహిళలను అవమానించిన రేవంత్రెడ్డి పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్ పెంపు, మహిళలకు రూ.2500, తులం బంగారం, విద్యార్థులకు స్కూటీల హామీ నెరవేర్చలేదన్నారు. -
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
జగిత్యాలజోన్: రోడ్డు ప్రమాదాల పరిహారం కేసులు అత్యధికంగా పరిష్కారం అయ్యేలా ఇన్సూరెన్సు సంస్థలు చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో మంగళవారం ఇన్సూరెన్సు కంపెనీల న్యాయవాదులు, ప్రతినిధులతో సమీక్షించారు. కేసులు వేసినవారు, ఇన్సూరెన్స్ సంస్థలు సయోధ్య కుదుర్చుకోవాలన్నారు. మానవత దృక్పథంతో కేసులు పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, కటుకం చంద్రమోహన్, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులు పాల్గొన్నారు. కల్తీ ఎరువులు అమ్మితే కేసులురాయికల్: ఫర్టిలైజర్ దుకాణాల్లో కల్తీ ఎరువులు అమ్మితే సదరు దుకాణాలపై కేసులు నమో దు చేసి సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. మంగవారం రా యికల్ పట్టణంతోపాటు మండలంలోని వివిధ ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. రిజి ష్ట్రర్లు, బిల్బుక్లు పరిశీలించారు. తప్పనిసరి గా రిజిస్టర్లు వివరాలు పొందుపర్చాలని సూ చించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి ముక్తేశ్వర్, ఏఈవో నరేశ్ పాల్గొన్నారు. 12న లోక్ అదాలత్జగిత్యాలజోన్: జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈనెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా సంస్థ కార్యదర్శి మట్ట సరిత తెలిపారు. జిల్లా కోర్టులో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాజీ చేసుకోదగ్గ కేసులన్నింటినీ లోక్అదాలత్ ద్వారా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇరువర్గాల రాజీతో కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నారు. సివిల్, క్రిమినల్, మోటార్వాహనాలు, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరిస్తామని వివరించారు. సమాచారం కోసం న్యాయ సేవా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ గృహ నిర్బంధంజగిత్యాలక్రైం: ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి బయల్దేరిన జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతను మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేవంత్రెడ్డికి పాలన చేతకాక రౌడీరాజ్యాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ సాధించినందుకు చావుడప్పు కొట్టారా..? తెలంగాణను ప్రపంచచిత్రపటంలో మొదటి స్థానంలో నిలిపినందుకా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్రెడ్డి పాలనకు చరమగీతం పాడుతారన్నారు. కేసీఆర్ ఇంటి గేట్ తాకినా ప్రజలంతా అగ్గిలా మండుతారని తెలిపారు. బీర్పూర్ నృసింహస్వామి ఆలయ ఈవోగా కిరణ్జగిత్యాలరూరల్: బీర్పూర్లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవోగా కొడిమ్యాల మండలం నల్లగొండలోగల శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవోగా పనిచేస్తున్న బి.కిరణ్కుమార్ను నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఈవో శ్రీనివాస్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
కొండగట్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూజలు
మల్యాల: జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ, ప్రసాదాలు అందించారు. కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, డీఎస్పీ పురుషోత్తం, సీఐ రాజ్కుమార్ ఎస్సై ఎస్.సందీప్, ఎన్.నరేశ్, ఆలయ అధికారులు సునీల్, అశోక్ పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ కార్మికుడు మృతి
ఎల్లారెడ్డిపేట( సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి గ్రామానికి చెందిన జనగామ సతీశ్ (35) ఆర్థిక ఇబ్బందులతో 15 రోజుల క్రితం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకోగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. పేద కుటుంబానికి చెందిన సతీశ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులకు స్తోమత లేకపోవడంతో సర్పంచ్ కొండ రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం రూ. 10వేల సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు.. సతీశ్ తనకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ నివాసంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్నాడు. వెంటనే అక్కడున్న వారు సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య మమత, కుమారుడు విగ్నేష్, కూతురు భవానిశ్రీ ఉన్నారు. సతీశ్ మృతితో కుటుంబం వీధిన పడింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదుపుతప్పి కిందపడి వ్యక్తి..వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన చింతకుంట నర్సయ్య (60) ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. బంధువుల కథనం ప్రకారం.. నర్సయ్య మంగళవారం కట్టెల కోసం ద్విచక్ర వాహనంపై అగ్రహారం శివారులోని గుట్టకు వెళ్లాడు. కట్టెలను ద్విచక్ర వాహనంపై పెట్టి గుట్ట దిగుతున్న క్రమంలో అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. టిప్పర్ ఢీకొని ఒకరికి గాయాలుమల్యాల: మండలంలోని రాజారం గ్రామ శివారులో బైక్ను టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కరీంనగర్ జిల్లా దేశాయిపేట గ్రామానికి చెందిన సందీప్ లింగంపేట రైల్వేస్టేషన్లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం బైక్పై విధులకు వస్తున్నాడు. రాజారం సమీపంలోకి రాగానే మూలమలుపు వద్ద టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సందీప్ తొడభాగం నుజ్జునుజ్జుయ్యింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రాయికల్: రాయికల్ మండలం ఇటిక్యాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ నాగార్జున తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
జగిత్యాల: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నా రు. కలెక్టరేట్లో ఎస్పీ అశోక్కుమార్, అధికారులతో కలిసి మంగళవారం సమీక్షించారు. గణేశ్ మండపాలకు విద్యుత్ సరఫరా చేస్తామని, నిమజ్జన పాయింట్ల వద్ద ప్రత్యేక నిఘా వేస్తామని తెలిపారు. ఉత్సవ కమిటి సభ్యులు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య, అగ్నిమాపక, శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బారికేడ్లు, క్రేన్లు, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద మెడికల్ క్యాంప్ ఉండాలని, 108 వాహనం, పాముకాటు నివారణ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. గజ ఈతగా ళ్లను షిఫ్ట్ల వారీగా నియమించాలన్నారు. ఎస్పీ మా ట్లాడుతూ ఈనెల 23, 24తేదీల్లో గణేశ్ నిమజ్జనా నికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టాలి ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు. అనామలిస్, నోమ్యాపింగ్ ఓటర్లపై సమీ క్షించారు. హియరింగ్ సమయంలో ఓటర్లు సమర్పించే ఆధారాలు, వివరాలు సమగ్రంగా పరిశీలించాలని, అర్హుల పేరు తొలగించొద్దని సూచించారు. ఈవీఎం గోదాముల తనిఖీఈవీఎం గోదాముల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ధరూర్ క్యాంప్లోని ఈవీఎం గోదాంలను రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. సిబ్బంది ఈవీఎంలు వీవీప్యాట్ల భద్రతకు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్, జ్యోతి ఉన్నారు. -
అంగట్లో ఎస్యూ కొలువులు?
కరీంనగర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో తాజాగా చేపట్టిన ఔట్ సోర్సింగ్ నియామకాలపై వివాదం ముదురుతోంది. ఎస్యూలో కొలువుల పేరిట డబ్బులు దండుకున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేయగా.. ఇటీవల జరిగిన ఔట్సోర్సింగ్ ఎంపిక ప్రక్రియలోనూ అక్రమాలు జరిగా యని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 36 మంది ఎంపిక ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఇటీవల ఎస్యూలో నియామకాలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం బయటకు పొక్కకుండా వ్యవహరించారు. వివిధ విభాగాలకు 36మందిని ఎంపిక చేసి, నియామక పత్రాలు అందించారు. వీరి నియామకంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పలువురి విజ్ఞప్తులను ఎస్యూ అధికారులు చెత్తబుట్టలో వేసినట్లు తెలుస్తోంది. గతంలో ఎంపికై న గ్రూప్–4 ఉద్యోగులకు శాతవాహన యూనివర్సిటీలో పోస్టింగ్ ఇచ్చారు. అయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవానే సాగుతోందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. నియామకాలపై ఆరోపణలు వర్సిటీలో 36 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు అక్రమంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వీరికి రాజకీయ పలుకుబడితో చేరిన ఓ ఉద్యోగి సాయం చేశాడని వినికిడి. షాడో వీసీగా పేరున్న సదరు వ్యక్తి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. వీరికి వర్సిటీలోని వివిధ విభాగాల్లో కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. వర్సిటీలో చేపట్టిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామాకాలపై విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై శాతవాహన వీసీ, రిజిస్ట్రార్ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.విచారణ జరిపించాలి వర్సిటీలో సరైన నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టిన నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలి. నియామకాల్లో ఎలాంటి పారదర్శకత పాటించలేదు. రోస్టర్ విధానం, ప్రభుత్వ నిబంధనలను విస్మరించారు. విధులకు హాజరుకాకపోయినా కొందరు వేతనాలు పొందుతున్నారు. కనీస విద్యార్హతలు లేనివారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. – కరికె మహేశ్, శాతవాహన యూనివర్సిటీ జేఏసీ చైర్మన్ మరోసారి తెరపైకి యూనివర్సిటీ నియామకాలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు పెద్దమొత్తంలో వసూలు? ఇటీవల జరిగిన 36మంది ఎంపిక ప్రక్రియపై అనుమానాలు పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటున్న విద్యార్థులు -
నాలుగు ఆటోలు.. రెండు ట్రాక్టర్లు డీజిల్కు రూ.1.80లక్షలు
రాయికల్ పట్టణ వ్యూ రాయికల్: రాయికల్ చిన్న మున్సిపాలిటీ. మేజర్ పంచాయతీగా ఉన్న రాయికల్ను 12 వార్డులతో మున్సిపాలిటీగా చేశారు. ఆదాయం తక్కువగా ఉన్న ఈ బల్దియాలో చెత్త సేకరణ కోసం ఆటోలు, ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వీటికి వినియోగించే డీజిల్ ఖర్చు ఏకంగా నెలకు అక్షరాల రూ.1.80లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఈ ఖర్చులపై పట్టణంలో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. బల్దియాలోని 12 వార్డుల్లో చెత్త సేకరణకు ప్రతిరోజు నాలుగు మినీ ఆటోలు, ఒక ట్రాక్టర్ మాత్రమే వినియోగిస్తుండగా.. నెలకు అంత పెట్రోల్, డీజిల్ ఖర్చు ఏంటని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే.. మున్సిపాలిటీలో 12 వార్డులు, 4500 గృహాలు ఉన్నాయి. చెత్త సేకరణకు మున్సిపల్ ఆధ్వర్యంలో ఆరు మినీఆటోలను గతంలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం నాలుగు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. రెండు ట్రాక్టర్లను కొనుగోలు చేయగా.. ఒకటి చెత్త సేకరణకు, మరొకదానిని ఫ్రంట్బ్లేడ్గా వినియోగిస్తున్నారు. 12వార్డుల్లో వారానికి ఒకటి లేదా రెండుసార్లు చెత్త సేకరిస్తున్నారు. అంచనాలు మించి ఖర్చు నాలుగు ఆటోలు, ఒక ట్రాక్టర్ ద్వారానే చెత్తను సేకరిస్తుండగా.. నెలకు పెట్రోల్, డీజిల్ కోసం రూ.1.80 నుంచి రూ.రెండు లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆటోలు డీజిల్తో నడుస్తుండగా.. ఇక్కడ మాత్రం పెట్రోల్ ఆటోలు వినియోగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం రూ.లక్షల్లో వ్యయం చేస్తుండడంతో సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి. గతంలో చెత్త సేకరణకు 57 మంది పారిశుధ్య సిబ్బంది ఉంటే ప్రస్తుతం 26 మందే ఉన్నారు. మహిళా సిబ్బంది ఊడ్వడం, బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు పరిమితం అవుతున్నారు. పురుషులు ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ఆటోలు అందుబాటులోకి తెచ్చి ఇంధన ఖర్చు పారదర్శకంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రాయికల్ మున్సిపాలిటీ స్వరూపం వార్డులు 12 గృహలు 4500 పారిశుధ్య కార్మికులు 26 ఆటోలు 6 వినియోగంలో ఉన్నవి 4 ట్రాక్టర్లు రెండు వెలువడే చెత్త 9 టన్నులు డ్రైవర్, కార్మికుడు ఒక్కడే ఈ ఫొటోలో కనిపిస్తున్నది రాయికల్ బల్దియాలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు. ఉదయం మినీ ఆటో డ్రైవర్గా పనిచేయడంతోపాటు అదే ఆటోలో చెత్తసేకరణ చేపడుతున్నాడు. వార్డుల్లోని ఇళ్లముందు వాహనం ఆపుతూ.. చెత్త సేకరిస్తూ మళ్లీ అతడే డ్రైవింగ్ చేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా చేయడం ద్వారా ఆటోకు డీజిల్ వినియోగం పెరుగుతోంది. మరోవైపు రాయికల్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వేధిస్తోందని చెప్పకనే చెబుతోంది. మినీ ఆటోలను ఎక్కువసార్లు తిప్పుతున్నాం బల్దియాలో 12 వార్డుల్లో చెత్త సేకరణ కోసం ఉన్న ఆటోలనే ఎక్కువ సార్లు తిప్పడంతో పెట్రోల్, డీజిల్ వ్యయం అవుతోంది. రిపేరులో ఉన్న ఆటోలను వినియోగంలోకి తీసుకువస్తాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
కాంగ్రెస్ పాలనలో పల్లెలు విధ్వంసం
కోరుట్లరూరల్: కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెలు విధ్వంసం అయ్యాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ మండలంలోని అయిలాపూర్లో ఆదివారం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్త ఊడ్చి ట్రాక్టర్లో వేశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు చేసి ఇచ్చారని, దాని ద్వారా ప్రతిరోజూ చెత్త సేకరణ జరిగేదని, ఈ ప్రభుత్వంలో డీజిల్కు డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్నారు. పల్లెప్రకృతి వనాల ద్వారా మొక్కలు పెంచితే ఈ ప్రభుత్వంలో ఉన్న మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చదరంగంతో మేధాశక్తిజగిత్యాలజోన్:విద్యార్థుల్లో ఏకాగ్రతకు చదరంగం దోహదం చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో జీనియస్ చెస్ అకాడమీని ప్రారంభించారు. ఆటలతో విద్యార్థుల్లో పోటీతత్వం అలవడుతుందన్నారు. ఎమ్మెల్సీ రమణ, మాజీమంత్రి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, కోచ్ కంకిటి అనూప్కుమార్, నిర్వాహకులు సంగీత, నవీన్, కంకటి కనకయ్య, కో–ఆర్డినేటర్ సుజన్కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల పచ్చదనంతో నిండాలి జిల్లా కేంద్రం పచ్చదనానికి చిరునామాగా చేయాలని ఎమ్మెల్యే అన్నారు. 14వ వార్డులో ఆదివారం వన మహోత్సవం నిర్వహించారు. ఫిల్టర్ బెడ్ వద్ద రూ.5 లక్షలతో గ్రీన్షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు పనులను పరిశీలించారు. మొక్కలు నాటడంతోపాటు సంరక్షించాలని కోరారు. కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్ స్వప్న, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నాయకులు బండ శంకర్, గిరి నాగభూషణం, బాలే శంకర్, కుసరి అనిల్, రాము, శరత్రావు పాల్గొన్నారు. రైతు కుటుంబానికి అండగా.. జగిత్యాలరూరల్: బీర్పూర్ మండలం కండ్లపల్లికి చెందిన పర్వతం అంజన్న ఇటీవల విద్యుత్షాక్తో మృతి చెందగా.. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.4.50లక్షల బాండ్, రూ.50వేల చెక్కును ఎమ్మెల్యే అందించారు. కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. సర్పంచ్ సురేందర్, ఉప సర్పంచ్ రవి, ఏఈ శ్రీనివాస్, లైన్మెన్ సతీశ్ పాల్గొన్నారు. ఎస్సారెస్పీకి 2,894 క్యూసెక్కుల ఇన్ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు 2,894 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1080.20 అడుగులు, 45.459 టీఎంసీలుగా ఉంది. 933 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. మెట్పల్లి లయన్స్ క్లబ్కు మెంబర్షిప్ రోలింగ్ ట్రోఫీమెట్పల్లి: మెట్పల్లి లయన్స్ క్లబ్కు ఇంటర్నేషనల్ మెంబర్షిప్ రోలింగ్ ట్రోఫీ అందించారు. రామగుండంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2025–26 సంవత్సరానికి ఎక్కువ సంఖ్యలో మెంబర్షిప్ చేయించి ముందంజలో నిలిచిన క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాస్రావుకు ట్రోఫీ అందించి అభినందించారు. కార్యదర్శి బొమ్మెల శివ, జోగ జగదీశ్వర్ తదితరులున్నారు. -
గ్రామాభివృద్ధికి బాటలు
కథలాపూర్/పెగడపల్లి: గ్రామ పంచాయతీల సమగ్ర భాగస్వామ్యమే ధ్యేయంగా ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీజీరాంజీ) పథకంలో పనుల గుర్తింపు మొదలైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలు’ (వీజీపీపీ) రూపొందించడానికి జిల్లాలో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ పాలకవర్గాలతోపాటు ప్రజలను భాగస్వామ్యం చేసి తమ గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి తీర్మానాలు చేస్తున్నారు. పనులకు అయ్యే ఖర్చును అంచనా వేసి కూలీలకు అనుగుణంగా కల్పించాల్సిన పనిదినాలను లెక్కించనున్నారు. 2026–2027 ఏడాదికి సంబంధించిన ప్రణాళికలో 318 రకాలు పనులను ప్రతిపాదిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతోపాటు మండల పరిషత్ అధికారులు పనుల వివరాలను నమోదు చేస్తున్నారు. గ్రామస్థాయిలో తీసుకున్న ప్రణాళికలను మండలస్థాయిలో ఆమోదించి జిల్లాస్థాయికి పంపాల్సి ఉంటుంది. 385 గ్రామాలు.. 2.80లక్షల మంది కూలీలు జిల్లాలో 20 మండలాలు.. 385 గ్రామ పంచాయతీలున్నాయి. మొత్తంగా 1.70 లక్షల జాబ్కార్డులున్నాయి. ఇందులో 2.80లక్షల మంది కూలీలుగా ఉన్నారు. వీబీజీ రామ్జీ పథకం పనులకు వెళ్లే కూలీలు 1.37లక్షలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనుల్లో స్వేచ్ఛ పంచాయతీలకే వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా గ్రామాభివృద్ధికి ఏది అత్యంత అవసరమో నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛను పంచాయతీలకు ఇచ్చారు. గ్రామపంచాయతీ పాలకవర్గాలతోపాటు మహిళాసంఘాలు, రైతులు, ప్రజలు గ్రామసభల్లో పాల్గొని పనులపై చర్చించి ప్రతిపాదించే అవకాశం కల్పించారు. నీటి భద్రత, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో వసతులు, పశువుల పాకలు, విపత్తు నిర్వహణ పనులు ప్రణాళికలో చేర్చుతున్నారు. దీంతో గ్రామాభివృద్ధి జరగడంతోపాటు స్థానిక కూలీలకు ఉపాధి లభించనుంది. ప్రజలు భాగస్వామ్యం కావాలి గ్రామాల అభివృద్ధి ప్రణాళిక తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా గ్రామసభల ద్వారా వికసిత్ గ్రామపంచాయతీల ప్రణాళికలు రూపొందించాలి. గ్రామాల అభివృద్ధికి స్వయంగా బాటలు వేసుకునేందుకు ఇది మంచి అవకాశం. – శంకర్, ఎంపీడీవో, కథలాపూర్ -
నెల రోజుల నుండి కాపలా
నేను రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేసిన. నెల రోజుల నుంచి కోతులు రాకుండా కాపలా వెళ్తున్నాను. ఇప్పుడే పంట గింజ దశకు చేరుకుంది. మరో నెలరోజులు కాపలా ఉండాల్సిందే. – వామన్, అంతర్గాం కోతులతో పంట ధ్వంసం కోతులతో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. రోజంతా కాపలా ఉండాల్సి వస్తోంది. మా ఊర్లో కొందరు కోతుల కోసం కుక్కలను పెంచుతున్నారు. పంట చేతికొచ్చే వరకు కష్టంగానే ఉంది. – కోల నారాయణ, చల్గల్ -
యోగానంద స్వామి ఆలయం నిర్మిస్తాం
ధర్మపురి:పురావస్తుశాఖ అనుమతి రాగానే ధర్మపురిలో యోగానంద స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శ్రీఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేయనున్న స్థలాన్ని మంత్రి పరిశీలించారు. వందేళ్ల వరకు భక్తుల అవసరాలకు తగినట్లు ఆలయ నిర్మాణం చేపడతామన్నారు. కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. వెయ్యి రోజుల విజయోత్సవ ర్యాలీ ముందుగా మంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వ వెయ్యిరోజుల పాలన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పటేల్, గాంధీ, నందీ చౌక్ల మీదుగా నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలు అందుకున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, నాయకులు వేముల రాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు. ఆదివారం ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారం చేయగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం మండల, పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికై న సాయిని శ్రీనివాస్, పెన్న శ్రీనివాస్ ప్రమాణం చేశారు. వారిని మంత్రి సన్మానించారు. ఆర్యవైశ్య సంఘం రాష్ట నాయకులు, వివిధ జిల్లాల నాయకులు ఉన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి వెల్గటూర్: మండలంలోని పాషిగాంలో ఏర్పాటు చేసిన గమ్యం హోటల్ను మంత్రి ప్రారంభించారు. ధర్మపురి, కోటిలింగాల, గూడెంగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలన్నారు. -
ఏమైంది..?
జగిత్యాల బల్దియాకు జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో అవినీతి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇద్దరు పారిశుధ్య కార్మికులు డీజిల్ చోరీ చేస్తూ.. రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో బల్దియాలో ఎంత అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తరచూ ఏదో ఒక ఘటన వెలుగు చూస్తుండడంతో మున్సిపల్కు ఏమైందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలకవర్గం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదా..? అనే చర్చ మొదలైంది. కొంతకాలంగా బల్దియాలో అవినీతి ఆరోపణలు రావడంతో విజిలెన్స్, ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. వారి దాడుల్లోనూ అనేక అక్రమాలు బయటపడిన విషయం తెలిసిందే. అక్రమాల్లో బల్దియా అధికారుల పాత్ర ఉందని గుర్తించిన విజిలెన్స్, ఏసీబీ అధికారులు నివేదికను సీడీఎంఏకు పంపించారు. ● అవినీతికి కేరాఫ్ గతంలో టౌన్ప్లానింగ్ విభాగంలో లంచాలు తీసుకుంటూ టీపీవో రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. ఇటీవల ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 గంటలు దాడులు చేసి అనేక అక్రమాలు, నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రజావాణిలో ఫిర్యాదులు వస్తున్నా ప్రజాప్రతినిధుల జోక్యంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో పనుల విషయంలో జాప్యం జరుగుతోందని ఇటీవల అధికారులు గుర్తించారు. నిధులు ఉన్నా కొందరు పనులు చేపట్టకపోవడం, చేపట్టినా నాణ్యత లేకపోవడం, అనతికాలంలోనే డ్రైనేజీలు, సీసీరోడ్లు దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. సుందరీకరణ పేరిట ఏర్పాటు చేసిన జంక్షన్లు కళాహీనంగా మారాయి. ఎక్కడా ఫౌంటేన్లు పనిచేయడం లేదు. డివైడర్లలోని చెట్లపై శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇటీవల డబుల్బెడ్రూంల వద్ద రోడ్లు నిర్మించగా సుమారు రూ.20 లక్షల బిల్లు పెట్టారని, ఆ పనులను మున్సిపల్ కార్మికులే చేసినట్లు తెలిసింది. ఇక రెవెన్యూ సెక్షన్లో సైతం అనేక అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ శాఖలో అక్రమంగా ముటేషన్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఓ భూకబ్జాకు సంబంధించి కమిషనర్, ఆర్వో సైతం జైలుకెళ్లిన విషయం తెలిసిందే. పనుల్లో జాప్యం.. జిల్లా కేంద్రంలో సుమారు రూ.60 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నా.. ఎక్కడా సక్రమంగా జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల 45వ వార్డుకు చెందిన ఓ మహిళ 2020లోనే డ్రైనేజీకి రూ.20 లక్షలు కేటాయించారని, ఇప్పటివరకు పనులు చేపట్టలేదని బహిరంగంగానే ఆరోపించారు. శానిటేషన్కు సంబంధించి డీజిల్ బిల్లులపై ఎక్కువ అవినీతి జరిగిందని ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. అప్పటి కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించి డీజిల్ బిల్లులు రూ.8 లక్షలు వచ్చేలా చేశారు. తాజాగా మళ్లీ రూ.12లక్షలకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల డీజిల్ చోరీ బయటపడటంతో అవకతవకల ఆరోపణలకు బలం చేకూరింది. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
జగిత్యాలరూరల్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పిలుపు మేరకు పల్లెల విధ్వంసం, పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జెడ్పి మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి బీర్పూర్ మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి పారిశుధ్య కార్యక్రమం చేపట్టారు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో డంపింగ్యార్డు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడామైదానాలు ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ మూడేళ్లలో కొత్తవి లేకపోగా.. కేసీఆర్ పథకాలు అమలు కావడం లేదన్నారు. రోళ్లవాగు తెగిపోయి చేపలు కొట్టుకుపోయినా పరిహారం ఇవ్వలేదని, ఊరూరా బెల్ట్ షాపులతో గీతాకార్మికులు ఉపాధి కోల్పోతున్నారని పేర్కొన్నారు. గుట్టలు తవ్వుతూ, ఇసుక అక్రమ రవాణా చేస్తూ పల్లెలను విధ్వంసం చేస్తున్నారని తెలిపారు. హరిచరణ్రావు, మసర్తి రమేశ్, సుభాష్యాదవ్, ముక్క శంకర్, కొల్ముల రమణ, జితేందర్ యాదవ్, లక్ష్మణ్రావు, తేలు రాజు, బర్కం మల్లేషం, బైరి మల్లేశం పాల్గొన్నారు. -
మొక్కజొన్నపై వానరమూకలు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతన్నలు రాత్రింబవళ్లు కష్టపడి పంట పండించడం ఒక ఎత్తైతే.. ఆ పంటను కోతుల నుంచి కాపాడడం మరో ఎత్తుగా మారింది. ప్రస్తుతం మొక్కజొన్న పంట గింజ దశకు చేరుకుంది. ఈ సమయంలో రైతులు తోటల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కోతుల సమూహం (సుమారు రెండుమూడు వందలు)గా వస్తున్న కోతులు పంటను గంట వ్యవధిలోనే సర్వనాశనం చేస్తున్నాయి. కోతులను తోటల నుంచి తరిమేందుకు రైతులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నేపథ్యంలో రైతులు కొంతమంది సోలార్ కంచెలు ఏర్పాటు చేస్తుండగా.. పెద్దపెద్ద శబ్దం చేసే మైక్లు పెడుతున్నారు. మొక్కజొన్న వేయాలంటేనే భయం.. తొలకరి వర్షాలు కురవగానే రైతులు పెసర, మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలు వేస్తారు. కొంతకాలంగా కోతుల బెడద ఎక్కువవడంతో రైతులు వేరుశెనగ, పెసర సాగు తగ్గించారు. మొక్కజొన్న పంటను మాత్రం దాదాపు 50 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గింజ దశకు చేరుకున్న పంటను ఓ వైపు రామచిలుకలు, మరోవైపు అడవిపందులు, ఇంకోవైపు కోతులు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలో ఎక్కువగా గుట్టల ప్రాంతం కావడంతో మొక్కజొన్న పంటను వేయాలంటేనే ఇక్కడి రైతులు భయపడే పరిస్థితి ఉంది. తినేది తక్కువ..ధ్వంసం చేసేది ఎక్కువ కోతులు గుంపులుగుంపులుగా వచ్చి మొక్కజొన్న కంకులను నాశనం చేస్తున్నాయి. కంకిలో గింజలు లేకపోతే అన్ని కంకులను చీరి పారేస్తున్నాయి. అంతరపంటగా పసుపు వేసిన రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మొక్కజొన్న గింజకు వచ్చిన తర్వాత రైతులు ఉదయం, సాయంత్రం కాపలాగా వెళ్లాల్సిన పరిస్థితి. చేతిలో కర్ర లేకపోతే వారిపైనే దాడి చేస్తున్నాయి. కోతులను ఎదుర్కొనేందుకు తంటాలు తోటల నుంచి కోతులను తరిమేందుకు రైతులు రూ.50వేల వరకు ఖర్చు పెట్టి సోలార్ కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని కోతులు ఈ సోలార్ కంచెలను కూడా లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో కొందరు రైతులు కుక్కలను పెంచుతున్నారు. మరికొందరు సెల్ఫోన్లలో కుక్కల అరుపులను రికార్డు చేసి చెట్లకు మైక్లు కడుతున్నారు. ఇంకొందరు పంట చుట్టూ వల పెడుతున్నారు. పెద్ద సంఖ్యలో కోతులు వచ్చిన ప్పుడు టపాసులు పేల్చుతున్నారు. పంటలను కోతుల బారి నుంచి కాపాడేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని, ప్రభుత్వం ఆలోచనలు చేయాలని రైతులు కోరుతున్నారు. -
విద్యార్థుల సమస్యల పరిష్కారంలో విఫలం
జగిత్యాల: విద్యార్థుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన వైఫల్యం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లో ఉందని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని, 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కటీ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మీ, మహిళలకు మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డకు రూ.13 వేలతో పాటు, కేసీఆర్ కిట్ ఇస్తే రేవంత్రెడ్డి వచ్చాక అన్ని మూలన పడేశారన్నారు. రేవంత్రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎమ్మెల్యే బీఆర్ఎస్ తరఫున గెలిచి అభివృద్ధి పేరిట రేవంత్రెడ్డి సంకలో చేరాడన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ వందరోజుల్లో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయకపోవడమేంటన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు మాట్లాడుతూ హామీలు నెరవేర్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని రేవంత్రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మీ పాల్గొన్నారు. -
నేడు ధర్మపురికి డిప్యూటీ సీఎం
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 7న చేపట్టనున్న శ్రీఉగ్ర నృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు ధర్మపురికి చేరుకుంటారని, సోమవారం వేకువజామున 2.30 గంటలకు ఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం పర్యటను విజయవంతం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారు. MýS*Æý‡-V>Ķæ$ÌS ç³…rÌSOò³ §ýl–íÙt ÝëÇ…^éÍే జగిత్యాలరూరల్: కూరగాయల పంటలపై దృష్టి సారించాలని పొలాస శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ఆత్మ’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారులు, ఆర్ఏఆర్ఎస్ పొలాస శాస్త్రవేత్తలు సారంగాపూర్ మండలం పెంబట్లలో సాగవుతున్న సన్నరకాల పంటలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల పరిస్థితి, యాజమాన్య పద్ధతులను పరిశీలించి, సమతుల్య ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడలు, తెగుళ్ల నియంత్రణపై సూచనలు అందించారు. కూరగాయల పంటలు, పూలతోటలను సందర్శించారు. చీడపీడలు, తెగుళ్ల పరిస్థితిపై రైతులతో చర్చించారు. అవసరమైన సాంకేతిక సలహాల కోసం సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో ప్రదీప్రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ విస్తరణ అధికారులు,రైతులు పాల్గొన్నారు. -
జానపద కెరటాలు!
మట్టి పరిమళాలు..వారికి పల్లె పాటలంటే ప్రాణం. జానపదాలకు అందమైన అర్థాలు అల్లి.. బాణీకట్టి తమ గొంతుకతో పాడి పాటకే జీవం పోస్తున్నారు. పల్లెటూరు నుంచి నుంచి సినిమాల్లో పాడేవరకూ ఎదిగిన జానపద స్వరం చుంచు నాగవ్వది. చదువు రాకున్నా.. పాటనే శ్వాసగా మార్చుకుని.. తెలంగాణ మట్టి వాసనను తన గొంతుతో జగమంతా పరిచయం చేస్తున్నారు నాగవ్వ. అమ్మమ్మ, తాతయ్యల ఊరి మట్టి వాసనతో మొదలై.. కోట్లాది వ్యూస్, సినిమా స్వరాలతో దూసుకుపోతున్నారు మల్లిక్ తేజ. పల్లె యాసలో ఉండే తీయదనం, జానపదంలో పలికే జీవధార ఆయన పాటలకు ప్రాణం పోస్తున్నాయి. పల్లెగుండె చప్పుడును తన గొంతుకగా మార్చుకున్నాడు మరో కళాకారుడు గడ్డం రమేశ్. మట్టి వాసనలు.. పల్లె జీవన సౌందర్యం, బతుకమ్మ, బోనాల విశిష్టతను నరనరానా జీర్ణించుకుని జానపదానికి సరికొత్త ఊపిరి పోస్తున్నారు. తండ్రి యక్షగాన వారసత్వాన్ని ఒంటపట్టించుకుని, కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంటూ తెలంగాణ జానపద శిఖరంగా ఎదుగుతున్నారు. – గొల్లపల్లి – వివరాలు 8లోu -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న విజయ్
కథలాపూర్: మండలంలోని తాండ్య్రాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండు విజయ్ రాష్ట్రస్థా యి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును శనివారం అందుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవంలో వి ద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితారాణా విజ య్కి అవార్డును ప్రదానం చేశారు. విజయ్ని మండల అధికారులు, ఉపాధ్యాయులుఅభినందించారు. సీఎం చేతుల మీదుగా..మల్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల ప్రిన్సిపాల్ మోతె శివరామకృష్ణ శనివారం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డును సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు. కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో చొరవ తీసుకోవడం, సబ్జెక్టులవారిగా వెనకబడిన వారిని గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ ఫలితాల సాధనకు చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు అందుకున్నారు. కళాశాల అధ్యాపకులు శివరామకృష్ణకు అభినందనలు తెలిపారు. -
కనిపించని మెుక్కలు
లక్షల్లో ఖర్చు..పర్యావరణ పరిరక్షణతోపాటు పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం మెట్పల్లి ము న్సిపాలిటీలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వ డం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం కింద ఏటా వేల సంఖ్యలో వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. తర్వాత వాటి సంరక్షణపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో నాటిన వాటిల్లో ఎక్కువశాతం మొక్కలు ఎండిపోతున్నాయి. దీనివల్ల పచ్చదనాన్ని పెంపొందించాలనే ప్రభుత్వం ఆశయం నీరుగారిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా రూ.లక్షల ఖర్చు అదనంగా రూ.15.66 లక్షలతో కొనుగోలు మెట్పల్లి: ఈ చిత్రం మెట్పల్లి పట్టణంలోని 8వార్డు శివారులో ఉన్న ప్రకృతి వనం. మున్సిపాలిటీకి చెందిన ఈ స్థలంలో వనమహోత్సవం కింద చుట్టూ కంచె నిర్మించారు. అందులో మొక్కలు నాటారు. వాటికి నీరు అందించేందుకు ప్రత్యేకంగా బోరు, డ్రిప్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.లక్షలు వెచ్చించారు. కొంతకాలంపాటు సంరక్షణ చర్యలు తీసుకోవడంతో మొక్కలు ఎదిగి ప్రకృతి వనంలో పచ్చదనం పెంపొందడానికి దోహాదపడింది. తర్వాత నిర్లక్ష్యం చూపడంతో మొక్కలు ఎండిపోయి.. కంచె తొలగిపోయి అధ్వానంగా తయారైంది. సంరక్షణ చర్యలు అంతంతే -
● కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి కొప్పుల ఆగ్రహం
ధర్మపురి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో శనివారం వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కొప్పుల మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, ఇప్పటికి రూ.14వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు రూ.300 కోట్ల బకాయిలు చెల్లించాలన్నారు. కేసీఆర్ పాలనలో ఏర్పాటుచేసిన గురుకులాలను నిర్వీర్యం చేసి యంగ్ ఇండియా మోడల్ స్కూల్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహం నుంచి నంది, గాంధీ కూడలీ మీదుగా ర్యాలీ నిర్వహించారు. నాయకులు శ్రీకాంత్రెడ్డి, అయ్యోరి రాజేశ్, వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. -
తక్కువ ఖర్చుతో లాభాలు
వెల్గటూర్: ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త విజయ్ భాస్కర్ అన్నారు. ఎండపల్లి మండలం పడకల్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శనివారం అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ ఎరువుల వాడకంపై వివరించారు. పడకల్, కొత్తపేట, రాజారాంపల్లి గ్రామాల్లో వరి, పత్తి, పసుపు పొలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి రైతులకు ఆయా పంటలలో అనుసరించాల్సిన సాగు యాజమాన్య పద్ధతులు వివరించారు. -
● అదనపు కలెక్టర్ లత
జగిత్యాల: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. ప్రచార కార్యక్రమాలను ప్రారంభించామని, ఆదివారం జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతామని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాను ప్రజలు తమ సంబంధిత ఓటును పోలింగ్ కేంద్రాల్లో పరిశీలించుకోవాలన్నారు. అర్హులైన వారు కొత్తగా ఓటరు నమోదుకు ఫారం 6, పేర్ల తొలగింపు అభ్యంతరాల కోసం ఫారం 7, ఓటరు జాబితాలోని వివరాల సవరణ, చిరునామా మార్పు కోసం ఫారం 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఎల్వోలు పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అర్హులందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం
పెగడపల్లి(ధర్మపురి): ఆలయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ పేర్కొన్నారు. ఆలయాలు కేవలం పూజా స్థలాలే కాకుండా మానసిక ప్రశాంతత, సామాజిక ఐక్యతను పెంపొందించే అత్యున్నత కేంద్రాలుగా ఉపయోగ పడుతాయన్నారు. మండలంలోని రామబద్రునిపల్లి గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మన సనాతన సంప్రదాయాలు, సంస్కృతి, పురాతన జీవన విధానాన్ని ఆలయాలు సజీవంగా నిలబెడుతాయని వివరించారు. ఆలయ నిర్మాణానికి పూనుకోవడం హర్షణీయమని, గ్రామస్తులు ఐక్యమత్యమై ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, తోచిన విధంగా సాయం అందించి సకాలంలో పూర్తి చేసుకోవాలన్నారు. ఇందుకు తానుకూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం పూర్తయితే గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం పెంపొంది ప్రజల్లో భక్తిభావం పెరుగుతోందన్నారు. సర్పంచ్ కాశవేని కుమార్, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మాజీ జెడ్పీటీసీ రాజేందర్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి, నా యకులు శ్రీనివాస్, అంజయ్య, లింగారెడ్డి, రవినా యక్,కిషన్, విజయభాస్కర్, మహేశ్ పాల్గొన్నారు. సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం వెల్గటూర్: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి శుక్రవారం హాజరయ్యారు. నూతన ఇంటిలో అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
పాఠ్య పుస్తకాల తయారీలో..
చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రూపొందించే పాఠ్య పుస్తకాల ప్రణాళిక కమిటీలో సభ్యురాలుగా కొనసాగుతున్నారు. విద్యారంగంలో విశిష్ట సేవలతో పాటు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. అవార్డును ఈనెల 5న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదగా అందుకోనున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం మరింత అంకితభావంతో పని చేస్తానని విజయలక్ష్మి వెల్లడించారు. -
విద్యార్థుల ముంగిటకు విజ్ఞానం
జ్యోతినగర్: పాఠ్యపుస్తకాల్లోని అంశాలు బోధించడమే కాకుండా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తున్నారు ఉపాధ్యాయుడు గూళ్ల అంజన్కుమార్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్లోని జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్(బయోసైన్స్)గా పనిచేస్తున్న అంజన్కుమార్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా జీవశాస్త్రాన్ని ప్రయోగాత్మక పద్ధతుల్లో బోధిస్తున్నారు. క్లిష్టమైన అంశాలను ప్రయోగాలు, నమూనాలు, దృశ్య ప్రదర్శనల ద్వారా వివరిస్తున్నారు. విద్యార్థులు స్వయంగా పరిశీలించి, ప్రశ్నించి, తెలుసుకునే విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. మొబైల్ ల్యాబొరేటరీ ద్వారా విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ తదితర సేవలకు గుర్తింపుగా 2024లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. -
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం రంగపేటలో రూ.11 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శుక్రవారం భూమిపూజ చేశారు. రూ.56 లక్షలతో చేపట్టిన రంగపేట–ఆలూరు వయా బతుకమ్మ కుంట ఫార్మేషన్ రోడ్ను ప్రారంభించారు. ఈసందర్భంగా గ్రామంలో పలువురు ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరై కానుకలు అందించారు. నియోజకవర్గంలో దళితులకు 909 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. పెంబట్ల, కోనాపూర్ బ్రిడ్జి విషయంలో నాడు సీనియర్ నాయకులు మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేదని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. రూ.3 కోట్లతో బ్రిడ్జి నిర్మించి కాంట్రాక్టర్కు బకాయిలు కూడా చెల్లించడం జరిగిందన్నారు. అనంతరం బీర్పూర్ గ్రామపంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, మైక్ సెట్ను ప్రారంభించారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సర్పంచ్లు ఏదుల శేఖర్, హరీశ్, ఎంపీడీవో నీరజ, ఎంపీవో సలీం తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు రాయికల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం చింతలూరు గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. సర్పంచ్ రమేశ్నాయక్, ఆ త్మ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. హామీలు అమలు చేసేవరకు నిలదీసుడేఇబ్రహీంపట్నం: కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు నిలదీసుడేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల దగాపై శుక్రవారం మండలకేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద వంటావార్పుతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా కొట్లాడుడేనని పేర్కొన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డిని గద్దె దించే వరకు పోరాడుదామని, కేసీఆర్ అధికారంలోకి వచ్చే దాకా కొట్లాడుదామన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్రెడ్డి 420 హామీలు ఇచ్చి 420 అయ్యారన్నారు. హామీలు అమలు చేసే వరకు గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయాలన్నారు. అనంతరం వంటావార్పులో భాగంగా సహపంక్తి భోజనం చేశారు. మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, చిన్నారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలాల దశరథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసులు ఉపసంహరించుకోవాలిమెట్పల్లి(కోరుట్ల): ఉత్తరాఖండ్లో రాహుల్గాంధీపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు డిమాండ్ చేశారు. కేసులను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాఖండ్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సభ నిర్వహించిన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై ప్రశ్నించిన రాహుల్గాంధీపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను కేసులతో అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదన్నారు. కేసులను ఉపసంహరించుకోవాలని లేకుంటే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
క్రీడల్లో పదును పెట్టి.. జాతీయస్థాయికి చేర్చి
జమ్మికుంట: గ్రామీణ పాఠశాలల్లో చదివే విద్యార్థుల క్రీడా ప్రతిభకు పదును పెడుతూ జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నాడు జమ్మికుంట మండలంలోని కోరపల్లి ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు జిట్టబోయిన శ్రీను. 2012లో ఫిజికల్ డైరెక్టర్గా ఉద్యోగంలో చేరాడు. వివిధ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యార్థులకు క్రీడల్లో కీలకమైన మెలకువలు నేర్పిస్తున్నారు. జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం కోరపల్లి పాఠశాల నుంచి శ్రీను శిక్షణలో వనరసు సుశాంత్, ఇంజం రీతిక, ఎన్.లౌక్యశ్రీ, పింగిళి అక్షర జాతీయస్థాయి హ్యాండ్బాల్పోటీల్లో ప్రతిభ చూపారు. శ్రీను తన కెరియర్లో 80మంది క్రీడాకారులను తయారు చేశాడు. పలువురు ఇండియన్ ఆర్మీ, వివిధ పాఠశాలల్లో వ్యాయమ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. శ్రీను జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యాడు.– మరిన్ని కథనాలు – 8లోu -
చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పాలన
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై శుక్రవారం సారంగాపూర్ మండలం పెంబట్లలో నిరసన ర్యాలీ నిర్వహించి వంటావార్పు కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు రోజులు దగ్గరపడ్డాయని, రేవంత్రెడ్డి రియల్ఎస్టేట్ వ్యాపారి అని, రైతుల భూములను 22ఏ లో పెట్టి వారి గోస పోసుకుంటున్నాడని విమర్శించారు. వెయ్యి రోజుల పాలన సంబురాలు ఎందుకు చేసుకుంటున్నరో చెప్పాలన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వనందుకా, పింఛన్ రూ.2,000 నుంచి రూ.4,000 పెంచుతామని మాట తప్పినందుకా, మహిళలకు రూ.2,500 ఇస్తామన్న హామీ నెరవేర్చనందుకా అని ఎద్దేవా చేశారు. దేవుని కండువా కప్పుకొని అభివృద్ధి చేస్తున్న అని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే ఎందుకు రోడ్లు మరమ్మతు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పెన్షన్ ఇస్తే, కేసీఆర్ పదింతలు చేసి రూ.2,000 ఇచ్చారన్నారు. రేవంత్రెడ్డి రూ.4,000 పెన్షన్ ఇస్తామని వెయ్యి రోజులు గడుస్తున్నా ఒక్కరికి ఇవ్వలేదని ఆరోపించారు. ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తామని చెప్పి మోసం చేశాడని, వారి ఉసురు పోసుకుంటున్న రేవంత్ బాగుపడరన్నారు. అభివృద్ధి అని జగిత్యాల్ ఎమ్మెల్యే, రేవంత్రెడ్డి చంకలో చేరాడన్నారు. గ్రామాలకు ఉపాధి హామీ నిధులు సైతం మంజూరు చేయకుండా సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, కేసీఆర్ నిరుపేద ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ కింద రూ.లక్ష ఇచ్చారని, రేవంత్రెడ్డి కల్యాణలక్ష్మీకి తోడు తులం బంగారం ఇస్తామని చెప్పి గురిజ కూడా ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మీ కూడా ఎగ్గొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్రెడ్డికి మహిళలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, పాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్రెడ్డి, మాజీ చైర్మన్ సత్యంరావు తదితరులు పాల్గొన్నారు. -
అక్షర దీపాలు.. ఆదర్శ మూర్తులు
గురుబ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ.. తస్మై శ్రీ గురవే నమః.. అంటూ ప్రతీ వ్యక్తి నాలుగు గోడల మధ్య నేర్చుకునే అక్షరాలు వారి జీవితంలో వెలుగును నింపుతాయి. తల్లిదండ్రులు జన్మనిస్తే... బడిలో పాఠాలు చెప్పే గురువులు ఆ జన్మకు సాకారాన్ని అందిస్తారు. మొన్నటి వరకు ఉపాధ్యాయులు పుస్తకంలోని పాఠాలను బోధించేవారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతీ అంశాన్ని ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. జీవితంలో ఎలా స్థిరపడొచ్చు అనే అంశాన్ని విద్యార్థులకు పాఠశాలస్థాయిలోనే చెబుతున్నారు. ప్రస్తుత కార్పొరేట్ పోటీ ప్రపంచంలో సర్కారు బడి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. ఆటల్లో జాతీయస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో వినూత్నంగా బోధన అందిస్తూ.. మా మంచి మా‘స్టార్లు’ అనిపించుకుంటున్నారు. నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! -
వినూత్న బోధన విజయ్ ప్రత్యేకత
కథలాపూర్(వేములవాడ): 2026 ఏడాదికి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపికై న జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న గుండు విజయ్ 2008లో ఉద్యోగంలో చేరాడు. మండలంలోని సిరికొండ, అంబారి పేట పాఠశాలల్లో పనిచేశాడు. 2018లో తాండ్య్రాలకు బదిలీపై వచ్చారు. అప్పుడు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 90మంది విద్యార్థులు ఉండగా, గతేడాది సంఖ్య 153కు పెరిగింది. ప్రీ ప్రైమరీకి అనుమతి రావడంతో ఈసారి ప్రవేశాలు పెరిగి 176 మంది చదువుతున్నారు. విజయ్ ప్రీ ప్రైమరీ తరగతికి పుస్తకాలు రూపకల్పన చేసి, ఎఫ్ఎల్ఎన్లో 90శాతం ఫలితాలు సాధించడంతో అధికారుల మెప్పు పొందాడు. కరోనా సమయంలో ఆన్లైన్లో పాఠాలు బోధిస్తూ, విద్యార్థులు సెల్ఫోన్ ద్వారా సమాధానాలు రాసేలా వర్క్షీడ్ తయారు చేశాడు. -
సూరమ్మ ప్రాజెక్ట్ నుంచి నీరిస్తే పోటీ చేయను..!
కథలాపూర్(వేములవాడ): మండలంలోని కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం 43,100 ఎకరాలకు సాగునీరందించినట్లయితే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, నీరందించకపోతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా నామినేషన్ వేయొద్దని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతుల అవస్థలపై మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందరోజుల్లో ఆరుగ్యారంటీలను అమలు చేస్తామని ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్ రాసిచ్చారని, రాజన్న ఆలయంలో పెట్టి పూజలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరదకాలువ నిర్మించింది కాంగ్రెస్ అయినా.. దానిని జీవనదిగా మార్చింది మా త్రం కేసీఆర్ అని, రివర్స్ పంపింగ్ ద్వారా ఈ ప్రాంతానికి నీరు అందించారని పేర్కొన్నారు. రైతులు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మండల నాయకులు గడ్డం భూమారెడ్డి, మామిడిపెల్లి రవి పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆదికి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ సవాల్ -
పాత లావాదేవీలపైనా విచారణ జరగాలి
జేఎన్టీయూకు అనుబంధంగా కొండగట్టులో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఉపకార వేతనాలు రాని విద్యార్థులు నేరుగా హాస్టల్కు చెల్లించే ఫీజులు కాలేజ్ అకౌంట్ కాకుండా యూనివర్సిటీలో పని చేసే ఉద్యోగి అకౌంట్కు వెళ్లడంపై పూర్తి విచారణ జరగాలి. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జేఎన్టీయూలో పెద్దస్థాయి అధికారి అండ ఉంటేనే ఈ విధంగా చేయగలుగుతాడు. కేవలం ఏడాది ఫీజులపై కాకుండా గత మూడు విద్యా సంవత్సరాలు జరిగిన ఫీజుల లావాదేవీలపై విచారణ జరిపించాలి. అసలు దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
కోరుట్ల: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ గురువారం మల్లాపూర్ మండలకేంద్రంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదని, రైతుబంధు, రైతుబీమా ఎగ్గొట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. సాగునీటి రంగంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. పలువురు సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
మీ అవినీతి.. మా అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం
ధర్మపురి: ‘పదేళ్లలో మీ అవినీతి.. వెయ్యి రోజుల్లో మా అభివృద్ధిపై అసెంబ్లీలో తేల్చుకుందాం.. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకురండి..’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్రావు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అప్పులతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అధికారంలోకొచ్చిన తర్వాత 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. ధర్మపురి లక్ష్మినృసింహునికి నిధులు మంజూరు చేస్తామని శఠగోపం పెట్టిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. వెయ్యిరోజుల పాలనపై ఆరోపణలు చేసిన మాజీమంత్రి కొప్పులకు వెయ్యి రోజుల ప్రగతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ధర్మపురిలో డిగ్రీ కళాశాల, రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, బస్డిపో, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేశ్, నాయకులు చీపిరిశెట్టి రాజేష్, చిలుముల లక్ష్మణ్, కుంట సుధాకర్ ఉన్నారు. సంక్షేమ పాఠశాలల్లో కార్పొరేట్ సౌకర్యాలు వెల్గటూర్: సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.67 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్, ఎంపీడీవోలు వారంలో ఒకరోజు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాలను తనిఖీ చేయాలని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించాలని ఆదేశించారు. ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. సర్పంచ్ జక్కుల ఆమని, ఆర్డీవో మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి, తహసీల్దార్ శేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, నాయకులు మురళి, ఉదయ్, శ్రీకాంత్రావు, నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. అసెంబ్లీకి కేసీఆర్ను తీసుకురావాలి కేటీఆర్, హరీశ్రావుకు మంత్రి అడ్లూరి సవాల్ -
మూడంచెల్లో ఎస్జీఎఫ్ పోటీలు
కథలాపూర్: జిల్లాలో ఎస్జీఎఫ్ పోటీల సందడి నెలకొననుంది. డీఈవో, డీవైఎస్వో, పీడీలు, పీఈటీలు, క్రీడా సంఘాల బాధ్యుల సహకారంతో పాఠశాలస్థాయి క్రీడలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ షెడ్యూల్ ప్రకటించారు. అండర్–11, 14, 17, 19 విభాగాల్లో అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల11లోపు మండలస్థాయి పోటీలు పూర్తి మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారిని జిల్లాస్థాయికి ఎంపిక చేస్తారు. మండలస్థాయిలో ఈనెల 11లోపు పోటీలు పూర్తవుతాయి. మండల స్థాయిలో రాణించిన వారు జిల్లాకేంద్రంలో నిర్వహించే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో సత్తాచాటిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి క్రీడలను ఈనెల 30లోపు పూర్తి చేస్తామని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చక్రధర్రావు వివరించారు. -
జ్ఞానదీపికలు మేటిగురువులు
కరీంనగర్ సిటీ/రాయికల్/కథలాపూర్/రామగుండం/చొప్పదండి/తిమ్మాపూర్/సిరిసిల్ల టౌన్/చందుర్తి: ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు అధ్యాపకులు, ఉపాధ్యాయుల పనితీరుకు గుర్తింపు లభించింది. ఈనెల 5న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉన్నతవిద్య, విద్యాశాఖ ఉత్తమ పురస్కారాలు ప్రకటించింది. శాతవాహన వర్సిటీ వృక్షశాస్త్ర ప్రొఫెసర్ పడాల తిరుపతి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం అధ్యాపకుడు డి.హరికాంత్, రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.విజయలక్ష్మి ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. పడాల తిరుపతి జగిత్యాల జిల్లా రాయికల్ వాస్తవ్యుడు. ఆయనను ఉపాధ్యా య సంఘం రాష్ట్ర సేవ విభాగం కన్వీనర్ చెరుకు మహేశ్వరశర్మ, టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ముక్కెర శేఖర్, ఎంఈవో రాఘవులు అభినందించారు. డి.హరికాంత్ 2015 నుంచి శాతవాహన వర్సిటీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నారు. గతంలో కామర్స్ విభాగం అధిపతిగా, బీవోఎస్ చైర్మన్గా, హాస్టల్స్ చీఫ్ వార్డెన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా, స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ, యూసీసీబీఎం ప్రిన్సిపాల్గా పనిచేశారు. వైస్చాన్స్లర్ ఓఎస్డీగా సేవలు అందిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా.. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గుండు విజయ్, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల హైస్కూల్ మ్యాథ్స్ ఉపాధ్యాయుడు గద్దె శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు గూట్ల మధుసూదన్, ఇదే జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల బాలికల హైస్కూల్ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు చేరాల తిరుపతి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరంతా పనితీరులో ప్రత్యేకత.. వృత్తిధర్మాన్ని అంకిత భావంతో నిర్వహించడం తదితరాల కారణంగా ఉత్తములుగా ఎంపికయ్యారు. ఎంపికై న అధ్యాపకులను, ఉపాధ్యాయులను పలువురు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, విద్యాభిమానులు అభినందించారు.చేరాల తిరుపతిగద్దె శ్రీనివాస్గూట్ల మధుసూదన్ షరీఫ్విజయలక్ష్మిపడాల తిరుపతిగుండు విజయ్హరికాంత్జేఎన్టీయూ స్కామ్!రైతు రాజ్యం కేసీఆర్తోనే సాధ్యం -
‘ఇంటిగ్రేటెడ్’ పనుల్లో వేగం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: వచ్చే విద్యాసంవత్సరం వరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను అందుబాటులోకి తీసుకొచ్చేలా పనుల్లో వేగం పెంచుతున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో 25ఎకరాల్లో నిర్మించనున్న యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను గురువారం పరిశీలించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజనం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి వంటి సౌకర్యాలను ఒకే ప్రాంగణంలో అందించడం లక్ష్యమన్నారు. 2500 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచులు గంగారెడ్డి, కట్ట రాజేందర్, నాయకులు నక్కల రవీందర్రెడ్డి, సదానందం, నలువాల సురేశ్, సతీశ్, లింగారెడ్డి, గంగారెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాస్, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగులను మోసం చేస్తున్న సీఎం ● ఈనెల 10న చలో హైదరాబాద్ ● ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్ జగిత్యాలరూరల్: కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాక ఉద్యోగులను మోసం చేస్తోందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బైరం హరికిరణ్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం మోరపల్లి, పొరండ్లతోపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు. వంద రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని, పెండింగ్ డీఏలు మంజూరు చేస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాక విస్మరించారని తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 10న నిర్వహించే నిరసన కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. రాష్ట్ర అదనపు కార్యదర్శి మచ్చ శంకర్, జిల్లా ఆర్థిక కార్యదర్శి మేకల ప్రవీణ్, అసోసియేషన్ అధ్యక్షుడు ఎగ్యారపు వెంకటేశ్, మండల అధ్యక్షుడు విష్ణు పాల్గొన్నారు. శిశుమరణాలు తగ్గించాలి ● డీఎంహెచ్వో సుజాత జగిత్యాల: జిల్లాలో శిశుమరణాలు లేకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో సుజాత అన్నారు. డీఎంహెచ్వో కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. శిశుమరణాలను సింగిల్ డిజిట్కు తీసుకురావాలని, గర్భిణులకు మొదటి నుంచే అవగాహన కల్పించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, వైద్యులు పాల్గొన్నారు. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలిధర్మపురి: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని డీఆర్డీవో రఘువరణ్, పీపీవో మదన్మోహన్ అన్నారు. నవ వసంతోత్సవం కార్యక్రమంలో భాగంగా మండలంలోని రాయపట్నంలో ఎంపీడీవో రవీందర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమ వంతుగా మొక్కను నాటి సంరక్షించాలన్నారు. సర్పంచ్ మొగిలి, ఉప సర్పంచ్ చిలుక రామన్న, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులున్నారు. -
రాహుల్గాంధీపై కేసు ఉపసంహరించుకోవాలి
కోరుట్ల: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు గురువారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ రాహుల్పై ఉత్తరఖాండ్ పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. శ్రీఎస్ఐఆర్శ్రీ కార్యక్రమంలో పాలొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభాస్థలాన్ని బీజేపీ శ్రేణులు గంగాజలంతో శుద్ధి చేసి కించపరిచారని, దీనిపై రాహుల్ మాట్లాడటాన్ని తప్పుపట్టి కేసు నమోదు చేయటం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తిరుమల వసంత, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, పన్నాల అంజిరెడ్డి, నాయకులు కొంతం రాజం, పలువురు సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కోరుట్లలో కాంగ్రెస్ శ్రేణుల ధర్నా -
వెయ్యి రోజుల్లో అభివృద్ధి శూన్యం
● రూ.3.5లక్షల కోట్ల అప్పులతో ఏం చేశారు..? ● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ● గొల్లపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీగొల్లపల్లి: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలకేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ముస్కు శ్యాంసుందర్ గార్డెన్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి అడ్లూరి రిపోర్టులు అడగడం మాని, తన పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానా ల వంటి ఆస్తులు సృష్టించామని, అయినా అప్పు రూ.3.90లక్షల కోట్లు దాటలేదని, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశారని, వాటితో ఏం చేశారని ప్రశ్నించారు. రైతుభరోసా ఎగ్గొట్టారని, పెన్షన్ రూ.నాలుగు వేలు ఇవ్వడం లేదని, మహిళలకు రూ.2500, తులం బంగారం ఏమైందని ప్రశ్నించారు. రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ 95శాతం పూర్తి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గేట్లు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కపెల్లి చెరువు, దొంతాపూర్ రోడ్డు, యశ్వంతరావుపేట చెరువు, మ్యాదరి గండి పనులను పక్కనపెట్టారని ఆరోపించారు. రాయపట్నం, ముత్తురూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ గాలికి వదిలేశారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
పనిచేస్తేనే వేతనం..
గొల్లపల్లి : వేతనం తీసుకుంటూ.. పాఠశాలలకు డుమ్మాకొట్టే కొందరు ఉపాధ్యాయుల తీరుకు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)తో బ్రేక్ పడింది. పాఠశాల ప్రాంగణంలోనే నిల్చుని సమయానికి ముఖం చూపిస్తేనే హాజరు నమోదయ్యే సాంకేతికత అమల్లోకి రావడంతో టీచర్లు విధిగా సమయపాలన పాటిస్తున్నారు. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో ఎఫ్ఆర్ఎస్ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో సిబ్బందిలో మరింత గుబులు మొదలైంది. జియో ఫెన్సింగ్ పక్కా జిల్లావ్యాప్తంగా 782 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పనిచేస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు సహా మొత్తం 4,139 మందిని ఎఫ్ఆర్ఎస్ పరిధిలోకి తెచ్చారు. ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది కూడా బడి ప్రారంభంలో ఒకసారి, ముగిశాక మరోసారి తమ లొకేషన్ నుంచి ఫొటో క్యాప్చర్ చేయాల్సిందే. పాఠశాల పరిధి దాటి ఇతర ప్రాంతాల్లో ఉండి హాజరు వేస్తామంటే సాంకేతికత అంగీకరించదు. సెలవు తీసుకున్నా ముందస్తుగా యాప్లోనే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రెండు పూటలా హాజరు నమోదు కాకపోతే ఆ రోజు గైర్హాజరు పడటం ఖాయం. క్షేత్రస్థాయి సిబ్బందిపై తప్పని నిఘా ఎఫ్ఆర్ఎస్ను ప్రధానంగా రెండు పద్ధతుల్లో వర్తింపజేస్తున్నారు. టీచర్లు రోజూ వారివారి పాఠశాల ప్రాంగణం నుంచే మొబైల్ ద్వారా నేరుగా ఫేస్ క్యాప్చర్ చేయాలి. ఫీల్డ్ వర్క్లో ఉండే ఎంఈవోలు, సీఆర్పీలు తనిఖీలకు వెళ్లిన పాఠశాలలు లేదా అధికారిక సమావేశాలు జరిగే ప్రదేశాల నుంచే తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. హాజరుతోనే జీతం కేవలం హాజరు కోసమే కాకుండా.. రాబోయే రోజుల్లో ఎఫ్ఆర్ఎస్ డేటాను నేరుగా ట్రెజరీ వేతన వ్యవస్థకు లింక్ చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. నెలవారీగా ఉపాధ్యాయుడి హాజరు శాతాన్ని లెక్కించి, అనుమతించిన సెలవుల కంటే ఎక్కువ రోజులు విధులకు గైర్హాజరైతే వేతనంలో నేరుగా కోత విధించనున్నారు. బోధనలో నాణ్యత పెరిగేనా..? సాంకేతిక నిఘాతో ఉపాధ్యాయుల హాజరు శాతం మెరుగవుతున్నప్పటికీ సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయనే చర్చ ప్రజల్లో మొదలైంది. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గి, ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్న వేళ.. ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపేలా నిబంధనలు తెస్తేనే బోధనలో నిజమైన జవాబుదారీతనం వస్తుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
ఆగస్టు 27 నుంచి 31 వరకు వచ్చిన ఆదాయం
1.581.71కరీంనగర్–12.24హుజూరాబాద్కరీంనగర్–22.051.06గోదావరిఖని3.162.853.892.19హుస్నాబాద్1.202.553.371.65జగిత్యాలకోరుట్ల0.86మంథనిఆదాయం (రూ.కోట్లలో)0.97మెట్పల్లి1.03సిరిసిల్ల1.08వేములవాడఆర్టీసీకి గి‘రాఖీ’కరీంనగర్: రక్షాబంధన్ టీజీఎస్ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. పండగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో ఆగస్టు 27 నుంచి 31 వరకు 4,940 బస్సులు నడిపారు. ఇవి 21.40 లక్షల కిలోమీటర్లు తిరిగి ఏకంగా 27.39 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. వీరిలో 19.55 లక్షల మంది మహిళలు ఉన్నారు. మొత్తం రవాణా ద్వారా రూ.14.78 కోట్ల ఆదాయం సమకూరింది. మహిళల ప్రయాణానికే రూ.8.50 కోట్ల విలువ మహాలక్ష్మి పథకంతో మహిళల రాకపోకలు భారీగా పెరిగాయి. జీరో టికెట్ల విలువ రూ.8.50 కోట్లుగా నమోదైంది. సాధారణ టికెట్ల ద్వారా వచ్చిన వసూళ్లతో కలిపి సంస్థకు గణనీయమైన ఆదాయం లభించింది. ఐదు రోజుల వ్యవధిలో సగటున రోజుకు రూ.2.95 కోట్ల ఆదాయం సమకూరగా, దాదాపు 5.47 లక్షల మంది రోజువారీగా ప్రయాణించినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. రాఖీ రోజే రూ.3.60 కోట్లు... రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 28న 988 బస్సులు అదనంగా నడపగా, 6.38 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఇందులో 4.73 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఆ రోజు ఆర్టీసికి రూ.3.60 కోట్ల ఆదాయం లభించింది. జీరో టికెట్ల రూపంలోనే రూ.2.20 కోట్ల విలువైన ప్రయాణం నమోదైంది. కరీంనగర్–2 డిపో రూ.2.24 కోట్లతో ఆదాయంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గోదావరిఖని రూ.2.05 కోట్లు, జగిత్యాల రూ.1.65 కోట్లు ఆర్జించి తర్వాతిస్థానాల్లో ఉన్నాయి. కరీంనగర్–1 డిపో రూ.1.58 కోట్లు, హుస్నాబాద్ రూ.1.71 కోట్లు, హుజూరాబాద్ రూ.1.20 కోట్లు, కోరుట్ల రూ.1.06 కోట్లు, మెట్పల్లి రూ.0.97 కోట్లు, సిరిసిల్ల రూ.1.03 కోట్లు, వేములవాడ రూ.1.08 కోట్లు, మంథని రూ.0.86 కోట్ల వసూళ్లు సాధించాయి.పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సాధారణ సర్వీసులతో పాటు అదనపు బస్సులు నడిపించాం. ముందస్తు టికెట్ రిజర్వేషన్ల సంఖ్యను పెంచడంతోపాటు అవసరమైన ప్రాంతాలకు ఇతర డిపోల నుంచి సర్వీసులు నడిపించాం. దీంతో మహిళలు, సాధారణ ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు చేరుకోగలిగారు. రాఖీ పండగ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల రవాణా వ్యవస్థ సజావుగా సాగింది. – రాజు, రీజినల్ మేనేజర్, కరీంనగర్1.892.011.32గోదావరిఖని డిపో 3.89 లక్షలమందిని గమ్యస్థాలకు చేర్చి మొదటిస్థానంలో నిలిచింది. జగిత్యాల 3.37 లక్షలు, కరీంనగర్–1 డిపో బస్సుల్లో 3.16 లక్షల మంది ప్రయాణించారు. కరీంనగర్–2 డిపో బస్సుల్లో 2.85 లక్షలు, హుజూరాబాద్ 2.55 లక్షలు, హుస్నాబాద్ 2.19 లక్షలు, మెట్పల్లి 2.01 లక్షలు, కోరుట్ల 2.01 లక్షలు, వేములవాడ 2.07 లక్షలు, సిరిసిల్ల 1.89 లక్షలు, మంథని డిపో బస్సులు 1.32లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.ప్రయాణికులు (లక్షల్లో)2.07 -
సహకార పదవులు దక్కేనా?
జగిత్యాలరూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నామినేటెడ్ పద్ధతిలో పదవుల ఎంపికకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చైర్మన్ల నియామకం విషయం హైకోర్టులో ఉండటంతో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లు కొనసాగుతోంది. గతంలో మాదిరిగా పీఏసీఎస్లో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం నామినేటెడ్ విధానంలో పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలో 51స్థానాలకు మల్యాల మండలం పోతారం, నూకపల్లి సింగిల్ విండోలకు చైర్మన్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించారు. మిగతా 49 స్థానాల్లో నియామకాలు చేపట్టనున్నారు. కొన్నిచోట్ల పాత పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా నామినేటెడ్ పద్ధతిలో పదవుల ఎంపికకు జాబితా ఇవ్వాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహుల జాబితాను ప్రభుత్వానికి అందించారు. పీఏసీఎస్ చైర్మన్, వైస్చైర్మన్, డైరెక్టర్ల పదవులకు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. గడువు తీరి రెండున్నరేళ్లు జిల్లాలోని పీఏసీఎస్లకు చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. వాటి కాలపరిమితి 14 ఫిబ్రవరి 2025తో ముగిసింది. ప్రభుత్వం ఆరునెలల చొప్పున రెండు దఫాలుగా పొడిగించింది. ప్రస్తుతం పర్సనల్ ఇన్చార్జిలు కొనసాగిస్తున్నారు. పాత పాలకవర్గాలు కొన్ని చోట్ల కోర్టును ఆశ్రయించాయి. ఎన్నికలయ్యే వరకు తమనే పదవిలో ఉంచాలని కోరారు. కోర్టు కూడా పర్సన్ ఇన్చార్జీలను తొలగించి.. పాత పాలక వర్గాలను కొనసాగించాలని సూచించింది. ప్రభుత్వం మాత్రం నామినేటెడ్ పద్ధతిలో పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని ఎమ్మెల్యేల ద్వారా ఆశావహుల జాబితా ను సేకరించింది. పోటీ ఎక్కువగా ఉన్న చోట ఆశావహులను బుజ్జగిస్తూ.. రహస్యంగా ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో గుట్టుగా సంబంధిత సహకార సంఘాల అధికారులను పిలుపించుకొని.. ఎంపిక చేసిన డైరెక్టర్లకు ఆయా సొసైటీ పరిధిలో సభ్యత్వాలు ఉన్నాయా..? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంపిక అభ్యర్థికి తెలి యకుండా గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. సభ్యత్వం తప్పనిసరి జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో 51 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 83,387 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్కో సంఘంలో 13 మంది డైరెక్టర్లుగా ఉంటారు. ఆ డైరెక్టర్లలో ఆరింటికి రిజర్వేషన్లు ఉంటాయి. రెండు బీసీ, ఒక ఎస్టీ, రెండు ఎస్సీల్లో ఒకటి మహిళ, ఎస్సీ జనరల్, మరొకటి జనరల్ మహిళా రిజర్వు సీట్లు ఉన్నాయి. 13 మంది డైరెక్టర్లలోనే ఒకరు చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఎంపిక చేస్తారు. ఈ పదవులకు ఎంపిక కావాల్సిన వారు కచ్చితంగా ఆ పీఏసీఎస్ డైరెక్టర్ పరిధిలో సభ్యత్వం ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వమే నియమిస్తుంది సహకార సంఘాల చైర్మన్లను గతంలో ఎన్నికలు నిర్వహించి ఎంపిక చేసేవారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ల నియామకానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియామక ప్రక్రియ కొనసాగుతుంది. – మనోజ్కుమార్, డీసీవో -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కోరుట్ల: కోరుట్ల మండలం మోహన్రావుపేట – మేడిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మేడిపల్లి మండలకేంద్రానికి చెందిన దుమాల లక్ష్మణ్(24) మృతి చెందాడు. ఎస్సై శ్యాంరాజ్ కథనం ప్రకారం.. లక్ష్మణ్ కోరుట్లకు ఉపాధి కోసం ప్రతిరోజు మేడిపల్లి నుంచి వచ్చిపోతున్నాడు. ఎప్పటిలాగే తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా.. మోహన్రావుపేట బ్రిడ్జి దాటగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేశామని, ద్విచక్రవాహన్ని ఢీకొట్టిన వాహనం కోసం గాలింస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇసుక టిప్పర్ పట్టివేతఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట వద్ద గురువారం ఇసుక టిప్పర్ను పట్టుకున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. కథలాపూర్ మండలం నుంచి అమ్మక్కపేటకు అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తుండగా టిప్పర్ను పట్టుకున్నామని పేర్కొన్నారు. వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించి టిప్పర్ యజమాని, డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని తెప్పించాలని కేంద్రమంత్రికి వినతిజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్గౌడ్ ఇటీవల ఉక్రెయిన్లో జరిగిన రష్యా బాంబు దాడిలో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన మృతదేహాన్ని తెప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను అతని కుటుంబ సభ్యులు వేడుకున్నారు. స్పందించిన ఆయన ఉక్రెయిన్ రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా సమాచారం చేరవేశారు. చికిత్సపొందుతూ వ్యక్తి మృతిమెట్పల్లిరూరల్: ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడిన మెట్పల్లి మండలం మేడిపల్లికి చెందిన బోదాసు చిన్నరాజయ్య(35) చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్కు చెందిన చిన్న రాజయ్య మేడిపల్లిలో అద్దెకు ఉంటున్నాడు. ఈనెల ఒకటిన భార్య రాధతో చిన్నరాజయ్య గొడవ పెట్టుకుని రోడ్డుపైకి రాగా ఆటో ఢీకొట్టింది. చికిత్స నిమిత్తం మెట్పల్లి.. తరావ్త జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. మృతుడి సోదరుడు పెద్ద రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
4.47 మీటర్ల లోతులో జలం
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ముగుస్తున్నా.. భూగర్భజలాలు ఇంకా లోతులోనే ఉన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగా కురవడంతో జూలైతో పోల్చితే ఆగస్టు చివరి నాటికి భూగర్భజలం 1.14 మీటర్ల మేర పెరగడం కొంత ఆశాజనకంగా మారింది. గతేడాది ఆగస్టుతో పోల్చితే 0.86 మీటర్ల లోతులోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కోరుట్ల మున్సిపాలిటీలో 9.21మీటర్ల లోతుల్లో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి వంటి పట్టణ ప్రాంతాల్లో రోజువారి అవసరాలకు నీటి వినియోగం పెరగడంతో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతుండటం ఇబ్బందిగా మారింది. వరదనీటిని నిల్వ చేయాల్సింది పోను.. ఇష్టానుసారంగా బోరు బావులను తవ్వుతుండడంతో నీటిమట్టం లోతుకు పడిపోతోంది. ఆగస్టులో మున్సిపాలిటీల్లో పడిపోయిన నీటిమట్టాలను పరిశీలిస్తే.. జిల్లాకేంద్రంలో 7.27 మీటర్లు, కోరుట్లలో 9.21 మీటర్లు, మెట్పల్లిలో 4.88 మీటర్లు, రాయికల్లో 2.89మీటర్లు, ధర్మపురిలో 3.22 మీటర్ల మేర పడిపోయింది. నాన్ఆయకట్టు ప్రాంతాల్లోనూ అంతంతే.. నాన్ఆయకట్టు ప్రాంతాలైన మల్యాల, మేడిపల్లి, కథలాపూర్, కొడిమ్యాల, భీమారం మండలాల్లో భూగర్భజలాలు మరింతగా పడిపోతున్నాయి. నాన్ఆయకట్టు ప్రాంతాల్లో భూగర్భజలాలు భారీగా తగ్గుతున్నాయి. మల్యాల మండలంలో 7.61మీటర్లు, కొడిమ్యాలలో 13.32మీటర్లు, కథలాపూర్లో 2.60 మీటర్లు, మేడిపల్లిలో 6.69 మీటర్లు, భీమారంలో 2.72 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. ఒక్క నెలలో పెరిగిన భూగర్భజలం అడపదడపా కురిసిన వర్షాలతో నీటిమట్టం ఒక్క నెలలోనే సగటున 1.14 మీటర్లకు పెరిగింది. జూలైలో 5.61 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఆగస్టు చివరి నాటికి 1.14 మీటర్లు పెరిగి 4.47 మీటర్లకు చేరుకుంది. బీర్పూర్ మండలంలో 2.50 మీటర్ల లోతులో నీరు ఉండగా, అత్యధికంగా 13.32 మీటర్ల లోతులో కొడిమ్యాల మండలంలో నీరు ఉండటం గమనార్హం. ఆయకట్టు మండలాల్లోనూ అంతే.. ఆయకట్టు మండలాల్లోనూ నీటిమట్టం పడిపోతూనే ఉంది. బుగ్గారంలో 3.19 మీటర్లు, ఎండపల్లిలో 7.17, గొల్లపల్లిలో 2.57, జగిత్యాలరూరల్లో 2.72, పెగడపల్లిలో 3.62, సారంగాపూర్లో 4.64, వెల్గటూర్లో 3.26, ఇబ్రహీంపట్నంలో 3.25, మల్లాపూర్లో 5.18 మీటర్ల మేర పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తుండటంతో ఈనెలలోనూ భూగర్భజల మట్టం పెద్దగా పెరగకపోవచ్చని చర్చ నడుస్తోంది. జూలైతో పోల్చితే ఆగస్టులో కొంత ఆశాజనకం కొడిమ్యాల మండలంలో 13.32 మీటర్లలోనే నీరు -
అంగన్వాడీ పోస్టులపై దళారుల కన్ను
జగిత్యాల: అంగన్వాడీ కేంద్రాల్లోని 64పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమైంది. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో 1085 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 64 పోస్టులకు 1199 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఈనెల ఐదో తేదీ వరకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే పోస్టుల భర్తీలో దళారుల కన్ను పడింది. అభ్యర్థుల నుంచి డబ్బులు దండుకోవడానికి పోస్టులు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. జగిత్యాల, ధర్మపురి, మల్యాల, మెట్పల్లిలో అత్యధిక మంది పోటీ పడుతుండడం వీరికి కలిసివస్తోంది. దళారులను నమ్మి మోసపోవద్దని, అర్హతను బట్టే పోస్టులు వస్తాయని సీ్త్ర సంక్షేమ శాఖ అధికారులు పేర్కొంటున్నా.. ఎలాగైనా పోస్టు దక్కించుకోవాలని కొందరు పైరవీలు చేస్తున్నారు. తమకు ప్రజాప్రతినిధులు తెలుసునని, ఎమ్మెల్యే, మంత్రితో చెప్పి పోస్ట్ ఇప్పిస్తామని చెబుతుండడంతో వారి వలలో పడుతున్నారు. నేతల చుట్టూ ప్రదక్షిణలు అంగన్వాడీ పోస్టులకు మొదటి నుంచి డిమాండ్ ఉండటంతో చిన్నచిన్న లీడర్లు ఎమ్మెల్యేలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో ఓ ప్రజాప్రతినిధి పీఏ ఏకంగా రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లాకేంద్రంలో అన్రిజర్వ్డ్ పోస్టులు ఉండటంతో పైరవీలు తీవ్రతరంగా మారాయి. అధికారపార్టీకి చెందిన బడా నాయకుల వద్దకు నిత్యం వెళ్తూ పోస్టులు ఇప్పించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో పోస్ట్కు సుమారు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. జోరుగా సాగుతున్న పైరవీలు అంగన్వాడీ కేంద్రం -
న్యాయసేవలను విస్త్రృతం చేయాలి
జగిత్యాలజోన్: న్యాయసేవలను విస్త్రృతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శిగా నియమితులైన ఎం.సరితకు బార్ అసోసియేషన్లో న్యాయవాదులు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యాయ సేవా సంస్థ కార్యకాలాపాలను మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లాలని, ప్రజలకు హక్కులతోపాటు విధులు వివరించాలని సూచించారు. సరిత మాట్లాడుతూ కక్షిదారులకు ఉచిత న్యాయసహాయం అందించడంతోపాటు, ప్రజలు మోసాలకు గురికాకుండా చట్టాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సునీత, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, న్యాయవాదులు పాల్గొన్నారు.నిరంతర విద్యుత్ సరఫరే లక్ష్యంజగిత్యాలరూరల్: వ్యవసాయానికి, గృహ అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్ఈ సుదర్శనం అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో కొత్త 5ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ప్రారంభించారు. లోవోల్టేజీ, సాంకేతిక సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, 24 గంటల సరఫరా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్లు, మోటార్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డీఈ గంగారాం, శ్రీనివాస్, డివిజనల్ ఇంజినీర్ ఎంఆర్టీ సింధూశర్మ, ఏడీఈ ప్రదీప్, శ్రీనివాస్, ఏఈ రహీం, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. 44.937 టీఎంసీలకు ఎస్సారెస్పీ నీటిసామర్థ్యంజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1750 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. మరోవైపు 933 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు 1080, నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 44.937 టీఎంసీలుగా ఉంది. భూ రీసర్వే నిలిపివేయాలంటూ ఆందోళనమెట్పల్లి: మల్లాపూర్ మండలంలోని నడికుడ, రాఘవపేట గ్రామాల మధ్య చేపడుతున్న భూ రీసర్వేను నిలిపివేయాలంటూ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం రెండు గ్రామాల వీడీసీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ రెండు గ్రామాల మధ్య ఉన్న గుడ్డనుగుల గుట్ట ప్రాంతంలోని రెవెన్యూ భూమిని ఏళ్ల నుంచి పశువుల మేతకు వినియోగించుకుంటున్నామని, నడకుడకు చెందిన ఓ వ్యక్తి ఇ టీవల ఆ భూమి తనదని చెబుతూ అందులో పంట సాగు చేస్తున్నాడని తెలిపారు. విషయాన్ని కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకెళ్లి భూమికి ఇచ్చిన అక్రమ పట్టాలను రద్దు చేయాలని కోరామని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకోకుండా ఆర్డీవో, తహసీల్దార్లు ఆ భూమిలో సర్వే చేపట్టడం సరికాదన్నారు. వెంటనే సర్వేను నిలిపివేసి పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. -
పెరోల్పై పీఎఫ్ఐ నాయకుడు
జగిత్యాలక్రైం: దేశద్రోహం కేసులో మూడేళ్ల క్రితం ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ సలీం చిన్నమ్మ 15 రోజుల క్రితం మృతిచెందింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సలీంకు కోర్టులో పెరోల్ మంజూరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు మధ్య సలీంను జగిత్యాలకు తీసుకొచ్చారు. సుమారు మూడున్నర గంటల పాటు కుటుంబసభ్యులతో గడిపిన అనంతరం సలీంను పోలీసులు తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు. సలీం పెరోల్పై వస్తున్నాడని తెలుసుకున్న బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి మూడున్నర గంటల తర్వాత జైలుకు తీసుకెళ్లిన పోలీసులు -
22ఏ నిషేధిత భూముల జాబితాలో జాగ్రత్త
జగిత్యాల: జిల్లాలోని దేవాదాయశాఖకు సంబంధించిన భూములను 22ఏ నిషేధిత జాబితాలో చే ర్చే ప్రక్రియను జాగ్రత్తగా, తప్పిదాలు లేకుండా పూ ర్తి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. 22ఏ నిషేధిత భూములపై సమీక్షించారు. ఆలయ భూ ములు, సర్వే నంబర్లు, ఉప విభాగ సంఖ్యలు, విస్తీర్ణం, భూమి వర్గీకరణ, యాజమాన్య వివరాలు, రెవెన్యూ, దేవాదాయ శాఖ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఖరారు చేయాలన్నారు. దేవా దాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గడువులోపు సమగ్రంగా పరిశీలించి జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. -
లేని నల్లాకు నీటి పన్ను
పట్టణంలో సుమారు 20వేల జనాభా ఉంది. 12 వార్డులు, 4500 వరకు ఇళ్లు ఉన్నాయి. బల్దియాలో ఆరేళ్లుగా మిషన్ భగీరథ, అమృత్ 2.0 పనుల నిమిత్తం గతంలో గ్రామపంచాయతీలో ఉన్న నల్లాలు తొలగించారు. ఉన్న నల్లాలు తొలగించడంతో చాలామంది నిరుపేదలు తాగునీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటినుంచి వారికి కొత్త కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. మరోవైపు నెలకు రూ.75 చొప్పున ఏడాదికి రూ.900 చెల్లించాంటూ మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తుండడం గమనార్హం. మున్సిపల్ నీరు నల్లాద్వారా రాకున్నా ఏడాదికి రూ.900 ఎందుకు చెల్లించాలంటూ బల్దియా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్షేత్రస్థాయిలో నీటి సరఫరా ఉన్న వాటికే బిల్లులు వసూలు చేయడంతో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. ప్రస్తుతం నీటి కనెక్షన్ల వివరాలు ఆన్లైన్ చేయడంతో నల్లా నీరు రాకున్నా బిల్లులు మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కూడా వారికి నల్లా కనెక్షన్లు లేకున్నా నల్లా బిల్లులు మాత్రం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. బల్దియా ప్రజలకు అందని రక్షిత మంచినీరు పట్టణ ప్రజల తాగునీటి కోసం గతంలో మిషన్ భగీరథ పథకం కింద రూ.6 కోట్లు వెచ్చించి నీరు అందించాలని నిర్ణయించారు. అయినప్పటికీ కొన్ని వార్డుల్లో కొన్ని గృహాలకు చుక్క నీరు అందలేదు. అమృత్ 2.0 పథకం కింద రూ.15.20 కోట్లు మంజూరు కాగా.. ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు దరి చేరడం లేదు. మున్సిపల్ అధికారులు స్పందించి వార్డుల్లో పైప్లైన్లను త్వరితగతిన వేయడంతోపాటు, నల్లా కనెక్షన్ బిగించి తాగునీటి సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఆరేళ్లుగా కనెక్షనే లేదు ఆరేళ్లుగా నా ఇంటికి నల్లా కనెక్షనే లేదు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం నల్లా బిల్లు వేస్తున్నారు. ఇటీవల ఆన్లైన్లో చూడటంతో నెలకు రూ.75 చొప్పున బిల్లు కనిపించడంతో అవాక్కయ్యాను. మున్సిపల్ అధికారులు నల్లా కనెక్షన్ లేని వారికి బిల్లు మాఫీ చేయాలి. – పుర్రె రమేశ్ 11వ వార్డు నల్లాలు లేకుంటే బిల్లు బంద్ బల్దియాలో నల్లాలు లే కుంటే ఆన్లైన్లో వచ్చే బిల్లులు వసూలు చేయబోం. అలాంటి వారికి మాఫీ చేస్తాం. దీనిపై పట్టణ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నల్లా కనెక్షన్ లేనివారికి బిల్లు నుంచి మినహా యింపు ఇస్తాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ రాయికల్: రాయికల్ బల్దియాలో నల్లాలు లేకున్నా ఏడాదికి రూ.900 పట్టణ ప్రజలు చెల్లించాల్సి న పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీలో 3400 నల్లా కనెక్షన్లు ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కనీసం వెయ్యి కూడా లేవు. అయినప్పటికీ ఇల్లు ఉన్న ప్రతిఒక్కరూ నల్లాపన్ను మాత్రం చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది.రాయికల్ మున్సిపాలిటీ స్వరూపం వార్డులు 12గృహాలు 4500ఉన్న నల్లాలు 1000అధికారికంగా మాత్రం 3400నీటి పన్ను నెలకు రూ.75 ఏడాదికి రూ.900 -
ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యాధికారుల తనిఖీలు
మెట్పల్లి: పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రుల అనుమతులు, వైద్యుల అర్హత ప్రతాలను పరిశీలించారు. సూర్య ఆసుపత్రిలో అర్హత లేని వైద్యుడితో ఈఎన్టీ పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదు మేరకు తనిఖీలు జరిపి ప్రాథమికంగా గుర్తించిన అంశాల ఆధారంగా నిర్వాహకులకు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఆస్పత్రి నిర్వహణ విషయంలో ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట మండల వైద్యాధికారి జైపాల్రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలుకోరుట్ల: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నామని జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి తెలిపారు. సెల్ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఎక్కువగా చూడడం ద్వారా చూపుపై ప్రభావం పడుతుందన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. హెచ్ఎం గంగాధర్, హెల్త్ ఎడ్యూకేటర్ జక్కని ధనుంజయ, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన బూట్ల చప్పుళ్లు మోగని తుపాకులు
మంథని: ఒకప్పుడు పీపుల్స్వార్ నక్సలైట్ల సంచారం.. ఆ తర్వాత మావోయిస్టుల కదలికలు.. మరోవైపు పోలీసుల కూంబింగ్ ఆపరేషన్లు.. ఎదురుకాల్పులు.. తుపాకుల మోతలతో దద్దరిల్లిన కరీంనగర్ తూర్పు ప్రాంతంలోని అడవులు ప్రస్తుతం ప్రశాంత వాతావరణం సంతరించుకున్నాయి. దశాబ్దాల పాటు హింస, రక్తపాతం, భయాందోళనలకు వేదికగా నిలిచిన అడవుల్లో మారిన పరిస్థితులు కొత్తఆశలకు బాటలు వేస్తున్నాయి. తెలంగాణలోనే విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న మంథని నియోజకవర్గంలో 120 కిలోమీట్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. మావోయిస్టు పార్టీల్లోని కేంద్ర కమిటీ సభ్యులు, దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మహిళల ఎన్కౌంటర్లు, నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఓ పెద్దస్థాయి పోలీస్ అధికారి.. ఇలా అనేక ఘటనలకు తూర్పు అడవులు సాక్ష్యంగా నిలిచాయి. అలాంటి అడవులు ఇప్పుడు నిశబ్దంగా మారాయి. మౌనంగా భరించిన అడవితల్లి అడవితల్లి అన్నింటినీ మౌనంగా భరరించింది. తుపాకీ గుళ్ల శబ్దాలు విన్నది. రక్తపు మరకలు చూసింది. పరుగులు తీసిన బూట్లను చూసింది. ఎన్కౌంటర్ల తర్వాత నెలకొన్న నిశబ్దాన్నీ అనుభవించింది. పరిస్థితులు మారడంతో సాయుధులు సంచరించిన ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం వెళ్లే అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు కనిపిస్తున్నారు,. జ్ఞాపకాలు మాత్రం చెరిగిపోవు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో జరిగిన అనేక జ్ఞాపకాలు చెరిగిపోలేదు. అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులు, మావోయిస్టులు, సామాన్యులు వారి కుటుంబాల విషాద గాథలు ఇప్పటికీ జ్ఞాపకాల్లో ఉన్నాయి. గతాన్ని గుర్తు చేస్తున్నా.. భవిష్యత్పై ఆశలు కలిగిస్తున్నాయి. ఏదీ ఏమైనా అలజడులతో అట్టుడికిన తూర్పు అడవులు ఇప్పుడు ఆహ్లాదం పంచుతున్నాయి. రక్తసిక్తమైన అడవితల్లి నేడు నిశబ్దం పీపుల్స్వార్ నుంచి మావోయిస్టు పోరాటం వరకు .. దశాబ్దాల హింసకు తెరపడుతున్న వేళ మారిన తూర్పు అడవుల ముఖచిత్రం రక్తపుటేరులైన అడవులు పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన అనేక ఎదురుకాల్పులు ఈ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. తుపాకీ కాల్పులతో దద్దరిల్లిన సందర్భాలు అనేకం. ఇరువైపులా ప్రాణనష్టం సంభవించేది. ఈ ఘర్షణల మధ్య అడవిని నమ్ముకుని జీవించే సామాన్యులే తీవ్రంగా నష్టపోయారు. ఓవైపు తమ వారిని కోల్పోయిన కుటుంబాల కన్నీళ్లు.. మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలతో గడిపిన గిరిజన కుటుంబాలు.. ఇలా అనేక విషాదాలకు అడవులు సాక్ష్యంగా నిలిచాయి. పరిస్థితులు మారాయి. మావోయిస్టు ఉద్యమం క్రమంగా బలహీనపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన నిరంతర భద్రతా చర్యలు, ఆపరేషన్లతో అనేక ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం తగ్గిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోవడం, మరికొందరు ఉద్యమానికి దూరం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పుడు భయం.. ఇప్పుడు పక్షుల కిలకిలరావాలు ఇప్పుడు అక్కడ బూట్ల చప్పుళ్లు వినిపించడం లేదు. తుపాకుల మోత లేదు. కూంబింగ్ బృందాల హడావుడి లేదు. ఎన్కౌంటర్ భయం లేదు. పక్షుల కిలకిలారావాలు వినిపిస్తున్నాయి. చెట్ల ఆకులను తాకుతూ గాలి వెళ్తోంది. అడవిని నమ్ముకుని జీవించే ప్రజలు దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. నేల శాంతి కోసం ఎదురుచూస్తోంది. ఈ నిశబ్దం వెనుక ఒక సుదీర్ఘమైన విషాద చరిత్ర ఉంది. అనేక ప్రాణాలు పోయాయి. చాలా కుటుంబాలు ఆప్తులను కోల్పోయాయి. అనేకమంది తల్లులు కన్నీటితో కాలం గడిపారు. చాలామంది పిల్లలు తండ్రి కోసం ఎదురుచూశారు. అనేక గిరిజన కుటుంబాలు భయంతో బతికాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు కాలగర్భంలో కలిసిపోయినా.. ఆ అడవులకు మాత్రం అన్నీ గుర్తున్నాయి. అందుకే నేడు అడవితల్లి మూగపోలేదు.. మౌనంగా ఉంది. -
లలిత కళా సమితి స్థలం.. వివాదం
మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని 12వార్డులో లలిత కళా సమితికి చెందిన స్థలం కోసం స్థానిక మహిళలు ఆందోళనలు చేస్తుండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాల క్రితం సమితికి కేటాయించిన భూమిలో ఖాళీగా ఉన్న దానిలో కొంతభాగాన్ని మహిళా సంఘం భవనానికి కేటాయించాలంటూ వారు పట్టుబట్టుతున్నారు. వినియోగంలో లేని స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ప్రజా అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేస్తుండడం వివాదానికి దారి తీసింది. 1981లో 19గుంటలు కేటాయింపు.. అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ -
ఆగని అవినీతి
వాహనాల మరమ్మతు పేరిట నిధులు పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పారిశుధ్య వాహనాల కోసం బల్దియా మెకానిక్ను నియమించినా.. చిన్నచిన్న రిపేర్లకు కూడా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రూ.9లక్షలు వెచ్చించి వాహనాలకు జియోట్యాగింగ్ ఏర్పాటు చేసినా.. అది కొన్ని వాహనాలకే పరిమితమైంది. బల్దియాలో 50వార్డులున్నాయి. చెత్త సేకరణకు 64 వాహనాలున్నాయి. ఈ వాహనాలకు వినియోగించే డీజిల్ బిల్లులు ఏకంగా రూ.లక్షలు దాటుతోందని కౌన్సిలర్లు చెబుతున్నారు. కొందరికే బయోమెట్రిక్ మున్సిపల్ కార్మికులు కొందరికే బయోమెట్రిక్ హాజరు ఉందని, అందరికీ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ కార్మికుల నియామకంలో అనేక అవకతవకలు వెలుగుచూసినా అధికారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. జగిత్యాల మున్సిపాలిటీ అంటేనే అవినీతికి కేరాఫ్గా మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కమిషనర్లుగా పనిచేసిన వారు ఒత్తిడి తట్టుకోలేక బదిలీపై వెళ్లిపోయిన ఘటనలున్నాయి. ఇద్దరు ఔట్సోర్సింగ్ డ్రైవర్లపై కేసు నమోదు జగిత్యాలక్రైం: చెత్త సేకరించే వాహనాల నుంచి డీజిల్ దొంగతనం చేసిన ఇద్దరు ఔట్సోర్సింగ్ డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై మహేశ్ తెలిపా రు. చెత్త వాహనాల నుంచి కొద్ది రోజు లుగా ఇంధనం దొంగతనం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసిన వాహనాల నుంచి ఔట్సోర్సింగ్ డ్రైవర్లు బొమ్మెన అనిల్కుమార్, కట్కూరి నాగరాజు డీజిల్ తీస్తుండగా శానిటేషన్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని విచారణ చేపట్టగా.. ఇప్పటివరకు రూ.10 వేల విలువైన 83 లీటర్ల ఇంధనాన్ని చోరీ చేసినట్లు అంగీకరించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ దోనాల కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. 294జగిత్యాల: జగిత్యాల బల్దియాలో మళ్లీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు శాఖల్లో అవినీతి పెచ్చుమీరుతోందని సాక్షాత్తు కౌన్సిలర్లే పేర్కొంటున్నారు. గతంలో మున్సిపల్ పారిశుధ్య వాహనాలకు సంబంధించిన డీజిల్ వ్యవహారంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. వాహనాలు వార్డుల్లో తిరగకున్నా తిరిగినట్లు.. చెత్త సేకరించినట్లు రికార్డుల్లో రాశారు. అధికారులపై విచారణ చేపట్టినప్పటికీ ఎవరిపైనా వేటు వేయలేదు. ఈ క్రమంలోనే డీజిల్ వ్యవహారంలో కుంభకోణం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. జూలైలో డీజిల్ కోసం రూ.11,83,630 ఖర్చు చేసినట్లు బిల్లులు రాశారు. వాస్తవంగా జూలై ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టలేదు. అయినా జూన్తోతో పోల్చితే రూ.2లక్షల బిల్లు పెరిగిందని అంటున్నారు. -
ఆన్లైన్ చేస్తేనే సన్నాలకు బోనస్
గొల్లపల్లి: వరి సాగులో చెమటోడ్చే అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ అందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ ప్రయోజనం దక్కనుంది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన ఏడు రకాల సన్న వడ్లకే ఈ బోనస్ వర్తిస్తుందని, రైతులు ఈనెల 10లోగా తమ వివరాలను పోర్టల్లో నమోదు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డీలర్ల వద్ద తప్పనిసరి నమోదు సన్న రకాల విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు ఆయా డీలర్ల వద్దే ‘సీడ్ సేల్స్ మేనేజ్మెంట్ సిస్టం’ పోర్టల్లో వివరాలు నమోదు చేయించుకోవాలి. ఆధార్కార్డు, పట్టాదార్ పాస్బుక్ నంబర్తోపాటు విత్తనాలు కొనుగోలు చేసిన అధికారిక రశీదులు (బిల్లులు) సమర్పించాల్సి ఉంటుంది. కౌలు రైతులు కూడా విత్తన బిల్లులు, సాగు చేస్తున్న భూమి వివరాలు తెలిపి డీలర్ల వద్ద నమోదు చేయించుకోవచ్చు. సొంత విత్తనాలు వాడితే ఏఈవోల పరిశీలన దుకాణాల్లో కాకుండా సొంత విత్తనాలు వినియోగించినా లేదా ఇతరుల వద్ద నుంచి విత్తనాలు తెచ్చుకుని సాగు చేసినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలాంటి రైతులు వెంటనే సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. సాగు విస్తీర్ణం, రకం వివరాలతో కూడిన స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వివరాలను పోర్టల్లో నమోదు చేస్తారు.బోనస్ లభించే ఏడు సన్న రకాలివే.. తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048) సాంబమసూరి (బీపీటీ 5204) కేఎన్ఎం 1638 డబ్ల్యూజీఎల్ 44 కేఎన్ఎం 7715 హెచ్ఎంటీ సోనా హెచ్ఎంటీ జై శ్రీరామ్ -
లెన్స్తో జీవితాలు బంధించి.. నేత్రాలతో వెలుగులు పంచి..
● సీనియర్ ఫొటోగ్రాఫర్ నేత్రదానం కోల్సిటీ: సు మారు నాలు గు దశాబ్దాల క్రితం కెమెరా పట్టుకుని గోదావరిఖనికి వచ్చిన ఆయన.. లెన్స్తో వేలాది జ్ఞాపకాలు పదిలపర్చారు. మరణానంతరం తనకళ్లతో మరోఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపారు గోదావరిఖనికి చెందిన ఏకశిల ఫొటో స్టూడియో నిర్వాహకుడు చందనాల వీరస్వామి(76). ఆయన అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు అవగాహన కల్పించగా.. వీరస్వామి నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. 1976లో వరంగల్ నుంచి గోదావరిఖనికి వలస వచ్చిన వీరస్వామి.. కల్యాణ్నగర్లో ఏకశిల ఫొటో స్టూడియో, ఫొటో ఫ్రేమ్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్.. వీరస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్యతోపాటు కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు నివాళి అర్పించారు. -
యూఏఈలో ఉద్యోగాలు
వేములవాడ: యూఏఈకి చెందిన ప్రముఖ ఏఎన్డీహెచ్ క్యాటరింగ్ సంస్థలో 300 కంటే ఎక్కువ క్లీనర్ ఉద్యోగాల భర్తీకి ఉచిత రిక్రూట్మెంట్ చేపడుతున్నట్లు జీటీఎం సంస్థ ప్రతినిధి సతీష్రావు బుధవారం తెలిపారు. డైరెక్ట్ క్లయింట్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు fugojbrftm@fmai .com ఇమెయిల్ లేదా www.ftminternationa.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఉద్యోగ వివరాలు–ప్రయోజనాలు క్లీనర్(300+ ఖాళీలు), ఏఈడీ 950 + ఉచిత భోజనం (నెలకు సుమారు రూ.26 వేలు), ఉచిత వీసా, ఉచిత విమాన టికెట్, ఉచిత నియామక ప్రక్రియ. రోజుకు 9 గంటలు పని. 19 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ తప్పనిసరి. ఇంగ్లిష్లో మాట్లాడగలిగే సామర్థ్యం ఉండాలి. ఇంటర్వ్యూ తేదీలు, వేదికలు సెప్టెంబర్ 11 : సిరిసిల్ల, జగిత్యాల, ఉదయం 9 గంటల నుంచి.. సెప్టెంబర్ 12 : నిజామాబాద్, ఆర్మూర్లలో ఉదయం 9 గంటల నుంచి.. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు సిరిసిల్ల: 9347661522, జగిత్యాల: 8332016999, నిజామాబాద్: 8686860999, ఆర్మూర్: 8332013999. ఉచిత నియామకాలు -
జిల్లాస్థాయి పద్యాల పోటీకి మోడల్ స్కూల్ విద్యార్థి
గొల్లపల్లి: తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ఉపాధ్యాయుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన పద్యాల పోటీల్లో మండలకేంద్రంలోని మోడల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న మొకిలి గౌతమ్ జిల్లాస్థాయికి ఎంపికయ్యాడు. పోతన, నన్నయ వంటి గొప్ప కవులు రాసిన పద్యాలను అవలీలగా చదవడమే కాకుండా న్యాయనిర్ణేతలు ఇచ్చిన పది పద్యాలను అనర్గళంగా రాగయుక్తంగా పాడినందుకు జిల్లా స్థాయికి ఎంపికయ్యాడు. ప్రిన్సిపల్ సుంకరి రవి విద్యార్థిని అభినందించారు. పాఠశాలలో విద్యతోపాటు, నోబ్యాగ్ డే స్పెషల్ ఆక్టివిటీస్, సంస్కృతి కార్యక్రమాలు, తెలుగు భాషను పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంతో విద్యార్థులలో సజనాత్మకత, ఆలోచన విధానం పెంపొంది రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
కోర్టుకు 55 మంది హాజరు
ఇల్లంతకుంట(మానకొండూర్): హామీ నెరవేర్చాలని కోరుతూ ప్రతీ నెల నిరసనలు చేపట్టిన బీజేపీ కార్యకర్తలు 55 మంది ఆ కేసులో బుధవారం జిల్లా కోర్టుకు హాజరయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి జిల్లెల్ల నుంచి డబుల్ రోడ్డు, 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని 2018, మే 16న అప్పటి మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 2020 వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో ఆ సమయంలో ఇల్లంతకుంట బీజేపీ మండల అధ్యక్షుడిగా ఉన్న బెంద్రం తిరుపతిరెడ్డి, పార్టీ కార్యకర్తలతో కలిసి 2020, మే 16న మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో నిరసన చేపట్టారు. అప్పటి నుంచి ప్రతీ నెల మే 16న 36 నెలల పాటు నిరసనలు చేపట్టారు. ప్రతీసారి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి బుధవారం జిల్లా కోర్టుకు మండలానికి చెందిన 55 మంది అప్పటి బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన వారిలో బత్తిని సాయిగౌడ్, బత్తిని స్వామి, అమ్ముల అశోక్, కొలనూరి ముత్తవ్వ, ప్రసన్న, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 36 నెలలపాటు ప్రతీ నెల నిరసన బీజేపీ కార్యకర్తలపై పోలీసుల కేసు కోర్టుకు హాజరు -
పత్తాలేని ఆస్పత్రి అభివృద్ధి నిధులు
పెగడపల్లి: గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా పీహెచ్సీ, ఇతర వైద్యశాలలకు అందించే నిధులు మూడేళ్లుగా జాడలేకుండా పోయాయి. ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్ల పదవీకాలం ముగిసిన ఏడాది నుంచి పీహెచ్సీల అభివృద్ధి కమిటీలు లేకుండా పోయాయి. కమిటీలున్న సమయంలో కనీసం ఆస్పత్రుల నిర్వహణ నిధుల గురించి ప్రస్తావించేది. జిల్లాలోని వివిధ మండలాల గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రులకు రోజుకు కనీసం 50 నుంచి 100 మంది ప్రజలు వచ్చి పరీక్షలు చేసుకుంటున్నారు. నిధులు లేక వారికి కావాల్సిన సేవలు అందించడం కష్టంగా మారింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో పని చేస్తున్న పర్మినెంట్ డాక్టర్లు ఎంతోకొంత ఖర్చు చేస్తున్నప్పటికీ ఒప్పంద డాక్టర్లున్న చోట ఖర్చు చేసేందుకు ముందుకు రావడం లేదు. 2024 నుంచి ఆస్పత్రులు నిర్వహణ అస్తవ్యస్తంగా తయారై కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చీపుర్లు, బకెట్లు, ఇంటర్నెట్, కంప్యూటర్ల మరమ్మతుకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిధులు నిలిచిపోవడంతో ఏ చిన్న అవసరమున్న ఏదైనా వస్తువు కొనాలన్నా వైద్యుల జేబు నుంచి ఖర్చు చేయాల్సి వస్తొందని వాపోతున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సివిల్ ఆస్పత్రులకు ఏటా ప్రభుత్వం నిర్వహణ నిధుల కింద రూ.1.50 లక్షల చొప్పున మంజూరు చేసేది. 2024 తరువాత ఈ నిధులు ఆగిపోయాయి. గతంలో ఈ నిధులు ద్వారా ఆస్పత్రి అభివృద్ధి కమిటీల తీర్మానం మేరకు సదుపాయాలు సమకూర్చేవారు. ప్రస్తుతం పెరుగుతున్న వైద్య అవసరాలు, రోగుల తాకిడికి అనుగుణంగా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. – భారంగా మారిన నిర్వహణపీహెచ్సీలు 17అర్బన్ హెల్త్ సెంటర్లు 5వైద్య విధాన పరిషత్ 1కమ్యూనిటి హెల్త్ సెంటర్లు 3ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి 1ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు 115ఎంఎల్హెచ్సీ డాక్టర్లు 110నిర్వహణ భారంగా మారింది ఆస్పత్రి అభివృద్ధి ఫండ్ రాకపోవడంతో నిర్వహణ భారంగా మారింది. నిధుల మంజూరు విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఏదైనా అవసరం పడితే సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. నెలనెలా ఆస్పత్రి అభివృద్ధి నిధులు విడుదల చేస్తే సౌకర్యాలు కల్పించే అవకాశముంటుంది. – నరేశ్ వైద్యాధికారి పెగడపల్లి -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
వేములవాడ: వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని పంపరి దేవయ్య తాళం వేసి కుటుంబ సభ్యులతో కలసి బైఠాయించారు. బుధవారం ఉదయం అధికారులు, సిబ్బంది రాకముందే తాళాలు వేశారు. స్థానిక ఓల్డ్ అర్బన్కాలనీలోని పంపరి దేవయ్య ఇంటిలో పదిహేనేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ కార్యాలయాలు సొంత భవనాలు, ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లాలని ఆదేశించడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ను మార్కెట్యార్డుకు మార్చుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి ఖాళీ చేసే పని చేస్తున్నారు. అద్దె రూ.60 వేలు, కరెంట్ బిల్లు రూ.2 లక్షలు బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లించిన తర్వాతనే సామగ్రి తీసుకెళ్లాలని ఇంటి యజమాని ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అయితే ఓ నాయకుడి ద్వారా ఒప్పందం కుదుర్చుకుని ఎట్టకేలకు అధికారులు కార్యాలయంలోని సామగ్రిని మార్కెట్యార్డులోని నూతన కార్యాలయానికి షిఫ్ట్ చేశారు. అద్దె చెల్లించి ఖాళీ చేయాలని యజమాని బైఠాయింపు -
మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి
వేములవాడ: తమ మాతృసంస్థలకు బదిలీ చేయాలని కోరుతూ పలువురు ఆలయ ఉద్యోగులు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావుకు విన్నవించారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా బుధవారం వేములవాడకు చేరుకున్న కమిషనర్ను గెస్ట్హౌస్లో వేములవాడ, బాసర, కొండగట్టు ఆలయాల ఉద్యోగులు కలిశారు. తమ కష్టాలను ఏకరవు పెట్టుకున్నారు. ఈ విషయమై త్వరలోనే మంత్రితో మాట్టాడి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. జగిత్యాల నుంచి పైరవీల జోరు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు గతంలో జగిత్యాల ఆర్డీవోగా విధులు నిర్వహించారు. దీంతో అక్కడి నాయకులు, ప్రముఖులతో ఏర్పడిన సాన్నిహిత్యంతో పలువురు ఆలయ ఉద్యోగులు పైరవీలు పట్టుకున్నారు. దీంతో కొంత మంది ప్రముఖులు బుధవారం వేములవాడకు చేరుకుని కమిషనర్తో తమకు సంబంధించిన వారిని బదిలీ చేయాలని పైరవీలు చేపట్టారు. దేవాదాయశాఖ కమిషనర్కు విన్నవించిన ఉద్యోగులు -
కొడుకు చేసిన అప్పులకు తండ్రి బలవన్మరణం
వెల్గటూర్: కొడుకు చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెందిన తండ్రి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఎండపల్లి మండలకేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన బొంగాని కిష్టయ్య గౌడ్ (79)కు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. రెండో కొడుకు అయిన బొంగాని సత్తయ్య కొన్నిరోజుల క్రితం గ్రామంలో కొంతమంది దగ్గర అప్పు చేసి ఎటో వెళ్లిపోయాడు. అప్పటినుంచి కొడుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ బాధపడుతున్నాడు. తీవ్ర మనస్తాపంతో బుధవారం తన ఇంటి వద్ద ఉరేసుకున్నాడు. కిష్టయ్య చిన్న కుమారుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. అల్లీపూర్లో మరోసారి చోరీరాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్లోని శివాలయం, శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. శివాలయంలోని హుండీ నుంచి రూ.30 వేలు, వేంకటేశ్వరస్వామి ఆలయంలోని హుండీల నుంచి రూ.30 వేల వరకు ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల క్రితం రాయికల్లోని శివాలయం, హనుమాన్ ఆలయంలో చోరీకి పాల్పడిన వారే తాజాగా ఈ ఆలయాల్లో కూడా చోరీకి పాల్పడినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. పోలీసులు స్పందించి ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆస్పత్రి పై నుంచి దూకిన పేయింటర్ మృతి సిరిసిల్లటౌన్: కడుపునొప్పి భరించలేక జిల్లా ఆస్పత్రి పై నుంచి దూకిన పేయింటర్ రాజు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన తిరుగింటి రాజు(38) కడుపునొప్పితో మంగళవారం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. రాత్రి వేళ నొప్పి భరించలేకనే ఆస్పత్రి భవనం పై నుంచి దూకినట్లు మృతుడి బంధువులు తెలిపారు. ఈక్రమంలో రాజు కాలు విరగడంతోపాటు శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. దీంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. మృతుడి భార్య గర్భిణీ రాజు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతుడు రాజు పేయింటర్తోపాటు దినసరి కూలీగా పనిచేసేవాడు. భార్య కావ్య బీడీలు చుడుతూ ఇల్లు వెల్లదీస్తోంది. వీరికి మన్విత్(7) కొడుకు ఉండగా, ప్రస్తుతం కావ్య ఆరు నెలల గర్భిణీ. రాజు ఆత్మహత్యతో ఆ కుటుంబం రోడ్డున పడింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని చైతన్యకాలనీకి చెందిన సయ్యద్ అబ్దుల్లా (50) అనే ఉల్లిగడ్డల వ్యాపారి బైక్పై వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో మరణించాడు. బుధవారం పనినిమిత్తం బైక్పై మంథని వెళ్లి తిరిగి వస్తుండగా రైల్వే ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని టౌన్ ఎస్సై నరేశ్ తెలిపారు. మృతుడి కుమార్తె సయ్యద్ హీనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. వృద్ధురాలి ఆత్మహత్య కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యం, ఒంటరితనం భరించలేక లేక ఓ వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై బండారి రామ్మోహన్ తెలిపారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వంగపల్లి రాజవ్వ (80) కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఒంటరితనంతో బాధపడుతోంది. మృతురాలి భర్త రాజయ్య ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాజవ్వ కుమారుడు వంగపల్లి వెంకటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. రైస్మిల్లు సీజ్సిరిసిల్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండానే ఓ రైస్మిల్లు నుంచి సామగ్రి తరలిస్తుండగా సివిల్ సప్లయ్ అధికారులు అడ్డుకుని సీజ్ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు శివారులోని మహేశ్వరి రైస్మిల్ రూ.128 కోట్ల బకాయి పడింది. వాటిని చెల్లించాలంటూ అధికారులు ఇటీవల నోటీసీలు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా యజమానులు ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండానే మిల్లులోని యంత్రాలను ఇతరులకు విక్రయించుకున్నారు. ఆ సామగ్రిని బుధవారం తరలిస్తుండగా విషయం తెలుసుకున్న సివిల్ సప్లయ్ అధికారి బుచ్చిబాబు తన సిబ్బందితో చేరుకున్నారు. ప్రభుత్వానికి చెలించాల్సిన బకాయిపై యజమానిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో లారీలతోపాటు రైస్మిల్లును సీజ్ చేసినట్లు తెలిపారు. -
కుల సంఘాల బలోపేతానికి కృషి
కోరుట్ల: కుల సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణ శివారులోని కోనరావుపేట రోడ్డులో నిర్మించిన పద్మశాలీ కులోన్నతి సంఘం భవనాన్ని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పద్మశాలీ సంఘం భవనానికి ప్రభుత్వ స్థలం, నిధులు కేటాయించామని విద్యాసాగర్రావు తెలిపారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, నాయకులు జిల్లా ధనుంజయ్, రుద్ర శ్రీనివాస్, గడ్డం మధు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు పథకాలు అందించండి
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమంపై మంగళవారం అధికారులతో సమీక్షించారు. కులధ్రువీకరణ పత్రాలను జాప్యం లేకుండా జారీచేయాలని ఆదేశించారు. బెస్ట్ అవైలబుల్ స్కీం, ఆదర్శ వివాహ ప్రోత్సాహకాలు త్వరలోనే వస్తాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఎంత పరిహారం అందించారు..? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారని అడిగి తెలుసుకున్నారు. ఎస్డీఎఫ్, సీడీపీ, ఎంపీ ల్యాడ్స్ ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గ్రామాలకు కేటాయించాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2500 కోట్ల సబ్ ప్లాన్ నిధులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు తప్పనిసరి ఔట్సోర్సింగ్ నియామకాల్లో రిజర్వేషన్, రోస్టర్ తప్పనిసరిగా పాటించాలన్నారు. బల్దియా పారిశుధ్య కార్మికులకు రూ.30 లక్షల బీమా కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని, వీబీజీరాంజీ కింద ప్రతిపాదనలు పంపించాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో శిక్షల శాతం పెంచాలని, బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని తెలిపారు. అట్రాసిటీ బాధితుల్లో ఐదుగురికి ఉద్యోగాలు కల్పించినట్లు అదనపు కలెక్టర్ లత తెలిపారు. జిల్లాలో 85 ఆదర్శ వివాహ ప్రోత్సాహక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, బెస్ట్ అవైలబుల్ స్కీం రూ.2.42 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. 185 మంది బాధితులకు రూ.1.06 కోట్లకుపైగా పరిహారం విడుదలైందని తెలిపారు. పీఎం అజయ్ పథకం కింద 144 యూనిట్లు గ్రౌండింగ్ కాగా.. మరో 30 యూనిట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏఎస్పీ చేతన్ నితిన్ మాట్లాడుతూ.. 973 ఎస్సీ, 138 ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 870 కేసుల్లో ట్రూ ఎఫ్ఐఆర్ ఫైనలైజ్ కాగా.. 787 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్, ఆర్డీవోలు, డీఎస్పీలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిశోర్ పాల్గొన్నారు. అంతకుముందుగా బక్కి వెంకటయ్యకు అదనపు కలెక్టర్ లత పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. -
కాంగ్రెస్ పేదల పక్షపాతి
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా డీసీసీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. రైతులకు భరోసా, మహిళలకు సాధికారత, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం, మౌలిక వసతుల నిర్మాణంతో బలమైన పునాదులు పడుతున్నాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, గంగారెడ్డి, గిరి నాగభూషణం, శ్రీనివాస్, జ్యోతి, కూసరి అనిల్ పాల్గొన్నారు. -
‘ఎల్ఆర్ఎస్’ పరిశీలన పూర్తి చేయాలి
జగిత్యాలరూరల్: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీ లన పారదర్శకంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ అన్నారు. జగిత్యాల మండలం మోతె గ్రామంలో ఎల్ఆర్ఎస్కు వచ్చిన దరఖాస్తులు, వాటి స్థలాలను మంగళవారం పరిశీలించారు. లేఅవుట్కు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. పొరపాట్లకు తావులేకుండా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరి శీలించాలన్నారు. వివరాలను టీపీవో శ్రీని వా స్, ఎంపీవో వాసవిని అడిగి తెలుసుకున్నారు. నూకపల్లి పాఠశాలను పరిశీలించిన డీఈవోమల్యాల: మండలంలోని నూకపల్లి ప్రాథమిక పాఠశాలను డీఈవో రాము మంగళవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారిలోని ఎఫ్ఎల్ఎన్ సామర్థ్యం, రెమెడియేషన్ తరగతులపై ఆరా తీశారు. అకడమిక్ మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్, ఎంఈవో జయసింహారావు ఉన్నారు. 9 నుంచి మండలస్థాయి క్రీడా పోటీలు ఈనెల 9 నుంచి 11వరకు మండలస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో తెలిపారు. తాటిపల్లి బాలికల గురుకులంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కంటిచూపుపై శ్రద్ధ చూపాలిజగిత్యాల: విద్యార్థులు కంటిచూపుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్వో సుజాత అన్నా రు. అంధత్వ నివారణ సమితి ఆధ్వర్యంలో ప్ర భుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలల్లో 41,290 మందికి ఉచి త కంటి పరీక్షలు నిర్వహించి మొదటి విడతలో 740 మందికి అద్దాలు అందించామన్నారు. రెండోవిడత 1389 మందికి ఇస్తామన్నారు. మొబైల్స్ ఎక్కువగా చూడొద్దన్నారు. అంధత్వ నివారణ అధికారి రాజేందర్రెడ్డి, డీపీవో రవీందర్, వైద్యులు లక్ష్మీనారాయణ, విద్య, సురేంద్ర పాల్గొన్నారు. జిల్లాకు ముగ్గురు లైవ్స్టాక్ ఆఫీసర్లుజగిత్యాల: పశుసంవర్థక శాఖలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లుగా పనిచేస్తున్న ముగ్గురికి లైవ్స్టాక్ ఆఫీసర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ గోపి ఉత్తర్వులు జారీ చేయగా.. మంగళవారం జిల్లా పశువైద్యాధికారి బొల్లం ప్రకాశ్ వీరికి ప్రొసీడింగ్ కాపీలు అందించారు. మల్యాల మండలం రాంపూర్లో పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్బాబు సారంగాపూర్ మండలం రేచపల్లి ఉపకేంద్రానికి, ఆసిఫాబాద్ నుంచి మాధవరావు ఇబ్రహీంపట్నం మండలం గోధూరుకు, నిజామాబాద్ నుంచి పి.సురేశ్ కోరుట్ల మండలం పైడిమడుగుకు వీఎల్వోలుగా పదోన్నతిపై నియమితులయ్యారు. వీరిని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్, వెటర్నరీ లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్, సూపరింటెండెంట్ అశోక్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శైలజ అభినందించారు. సొంతంగా డ్రైనేజీ నిర్మాణంజగిత్యాల: అది జిల్లాకేంద్రంలోని 45వ వార్డు. అక్కడ డ్రైనేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం డ్రైనేజీ నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరైనా పనులు మాత్రం ప్రారంభించలేదు. చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యేను కోరినా పట్టించుకోకపోవడంతో కాలనీవాసులు కొందరు ముందుకొచ్చి వారివారి ఇళ్ల ముందు డ్రై నేజీ నిర్మించుకుంటున్నారు. పన్నులు కట్టకుంటే మున్సిపల్ అధికారులు ఊరుకుంటారా..? అని ప్రశ్నిస్తూనే ప్రజల సమస్యలను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నిలదీశారు. -
ఎన్హెచ్ 563.. సూపర్ ఫాస్ట్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్●జాతీయరహదారి–563 ఇక అందుబాటులోకి రానుంది. వరంగల్– కరీంనగర్ సెక్షన్లో 68 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ రహదారిపై ఎన్హెచ్ఏఐ అధికారులు శనివారం నుంచి ట్రయల్ రన్కు అనుమతించారు. అత్యంత ఆధునిక ప్రమాణాలతో ప్రమాదాలు నివారించేలా 24గంటల రియల్టైం మానిటరింగ్ ఉండేలా రహదారిని తీర్చిదిద్దారు. ఖమ్మం నుంచి జగిత్యాల వరకు నిర్మించనున్న ఎన్హెచ్–563లో భాగంగా కీలకమైన 68కిలోమీటర్ల వరంగల్–కరీంనగర్ సెక్షన్ పనులను రూ.2,486 కోట్లతో పూర్తిచేశారు. మూడేళ్లలో పనులు దాదాపు 95శాతం మేర పూర్తయ్యాయి. వరంగల్ నుంచి దుర్శేడ్ వరకు రోడ్డు పూర్తయినా.. ప్రస్తుతానికి మానకొండూరు సమీపంలోని ఖాదర్గూడెం వరకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు దాదాపు రూ.2,000 కోట్లకుపైగా అంచనా వ్యయంతో జగిత్యాల–కరీంనగర్ సెక్షన్ పనులకు ఇటీవల టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీ వరంగల్లోని మామునూరు విమానాశ్రయం పనుల ప్రారంభోత్సవంతోపాటు ఎన్హెచ్–563ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం దుర్శేడ్ వరకు ఎన్హెచ్ 563 పనులు పూర్తయ్యాయి. కానీ...పెద్దపల్లి నుంచి వచ్చే వాహనాలకు ఈ రోడ్డు ఎక్కేందుకు ర్యాంప్ నిర్మించలేదు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ఆగస్టు 5వ తేదీన ‘వరంగల్కు దారేది?’ అన్న శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఎన్హెచ్ఏఐ అధికారులు ర్యాంపు నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ఈ వారంలోనే అందుబాటులోకి తీసుకువస్తామని ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా తమకు వెంటనే సంప్రదించాలని సూచించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాత రహదారిని సైతం ఎన్హెచ్ఏఐ అభివృద్ధి చేసింది. దాదాపు 39 కిమీల మేర రోడ్డుకు మరమ్మతులు నిర్వహించింది. సదాశివపల్లి వద్ద తాత్కాలిక ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేశారు. హసన్పర్తి వద్ద ఉన్న ప్రమాదకర మలుపు తీవ్రత తగ్గించారు. చింతగట్టు ఔటర్ రింగ్ రోడ్డు (బీమారం) వద్ద వాటర్ లాగింగ్ ఏరియాను సరిదిద్దుతున్నారు. ● 68 కిలోమీటర్ల పొడవున్న నాలుగులేన్ల రోడ్డును అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. దీనిపై అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వాడుతున్నారు. కొత్తగట్టు వద్ద టోల్ప్లాజా నిర్మించారు. అక్టోబరు ఒకటి నుంచి ఈ మార్గంలో ప్రయాణించేవారికి టోల్ వసూలు చేస్తారు. ● ఈ రోడ్డును 100 కిమీల గరిష్ట వేగంతో వెళ్లేందుకు వీలుగా నిర్మించారు. ప్రతీ కిలోమీటరుకు కుడి, ఎడమవైపులకు సోలార్ సీసీ కెమెరాలు అమర్చారు. కొత్తగట్టులో కమాండ్ కంట్రోల్ రూం నిర్మించారు. అక్కడ నుంచే 24 గంటల రియల్ టైం మానిటరింగ్ చేస్తారు. ● ఈ రోడ్డెక్కిన వాహనం ఏదైనా సరే.. ఎక్కడ ఏ సమయానికి ఎక్కింది? ఎక్కడ దిగింది? ఎక్కడ ప్రమాదం జరిగింది? అనే విషయాలను నిరంతరం గమనిస్తుంటారు. ప్రమాదం జరిగినా, వాహనం నిలిచిపోయినా వెంటనే కొత్తగట్టు కమాండ్ కంట్రోల్ అంబులెన్స్ లేదా టోయింగ్ వాహనాలను పంపి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ● ప్రతీ కిలోమీటరుకు ఒక ఎమర్జెన్సీ ల్యాండ్ లైన్ ఫోన్ (సేవ్ అవర్ సోల్/ ఎస్వోఎస్) ఏర్పాటు చేశారు. దీనిపై ఎలాంటి నంబరు డయల్ చేయనవరసం లేదు. కేవలం ఫోన్ రిసీవర్ ఎత్తగానే నేరుగా కొత్తగట్టు కమాండ్ కంట్రోల్కు కాల్ వెళ్లిపోతుంది. ● మితిమీరిన వేగంతో వెళ్లినా, ప్రమాదానికి కారణమైనా, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల నంబర్లు వెంటనే సీసీ కెమెరాలు వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టం (వీఐడీఎస్) ద్వారా పసిగట్టి పోలీసుశాఖకు పంపుతాయి. ● ఇంతకాలం వరంగల్ – కరీంనగర్ మధ్య పాత రహదారి సుమారు 72 కిలోమీటర్లకుపైగా ఉండే ది. తాజా రహదారి మాత్రం 68 కిమీ కావడం గ మనార్హం. వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భంలోకి ఇంకేలా రహదారి పొడవునా.. రోడ్డుకు దిగువన ప్రత్యేకంగా ఇంకుడు గుంతలు నిర్మించారు. ● ఎలాంటి పశువులు అడ్డురాకుండా నిర్మించిన ఎలివేటెడ్ హైవే. మధ్యలో మీడియన్ ప్లాంటేషన్ పూర్తయింది. దాదాపు ప్రతీ గ్రామం వద్ద అండర్పాస్లు, సర్వీసురోడ్లు నిర్మించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. హన్మకొండలోని హంటర్రోడ్డులో ఉన్న ఎన్హెచ్ఏఐ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని అధికారులు స్పష్టంచేశారు. ● మొత్తం ప్రాజెక్టు సమాచారం తెలిపే స్కానర్లు రోడ్డు పొడవునా ఏర్పాటు చేశారు. ఊరుపేర్లు, తరువాత స్టాప్లు, రోడ్డు భద్రత, వాహనాల వేగంపై అవగాహన కలిగేలా సైన్ బోర్డులు అమర్చారు.శనివారం నుంచి వాహనాలకు అనుమతి -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి
జగిత్యాల: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీజీఈజేఏసీ జిల్లా కన్వీనర్ కందుకూరి రవిబాబు, చైర్మన్ మిర్యాల నాగేందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 2004 సెప్టెంబర్ ఒకటిన అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పెన్షన్ హక్కులను హరించాయని గుర్తు చేశారు. 35 ఏళ్లు ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగికి పెన్షన్ రాకపోవడం దారుణమన్నారు. అమరేందర్రెడ్డి, వకీల్, హరి అశోక్కుమార్, బైరం హరికిరణ్, శ్యామ్సుందర్, శివరామకృష్ణ, రాంచంద్రం, అరుణ, లావణ్య, అశోక్రాజు, రవిచంద్ర పాల్గొన్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన పెన్షన్ విద్రోహదినం సందర్భంగా ఎస్కేఎన్ఆర్ క ళాశాలలో అధ్యాపకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సీపీఎస్ను వెంటనే రద్దు చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్కు ఆర్థిక భద్రత కల్పించాలన్నారు. నాయకులు నరేందర్రెడ్డి, బుదారపు శ్రీహరి, నాగభూషణం, విజేందర్రావు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన జగిత్యాలరూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సూపరింటెండెంట్ గంగాధర్, శ్రీనివాస్రావు, ఉద్యోగులు పాల్గొన్నారు. సామూహిక సెలవు పెట్టాలి ధర్మపురి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 17న సామూహిక సెలవులు పెట్టేందుకు అందరూ ముందుకు రావాలని సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ సూచించారు. మండలంలోని కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటించి నల్లబ్యాడ్జీలు ధరించారు. ఏళ్ల తరబడి పోరాడుతున్నా.. సీపీఎస్ రద్దు చేయకపోవడం దారుణమన్నారు. ఉపాధ్యాయులు మెరుగు రమేశ్, ఎదుల మహేష్, సంద వెంకటేష్ బొమ్మల ప్రీతి, తేజ, సృజన తదితరులున్నారు. -
నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య రాక
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. చైర్మన్తోపాటు సభ్యులు నీలాదేవి, రాంబాబునాయక్, కుంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ పాల్గొననున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాంజగిత్యాలక్రైం: ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ సంధాని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 16 వాహనాలను సీజ్ చేశారు. పరిమితిలోపే వాహనాల్లో తీసుకెళ్లాలని సూచించారు. ఓవర్లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి అన్నారు. ఏఎంవీఐలు రామారావు, సాయిచరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శిగా సరిత
జగిత్యాలజోన్: జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శిగా ఎం.సరితను నియమిస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు ఆమె సోమవారం జిల్లాకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జిల్లా జడ్జి సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. జడ్జి సరిత మాట్లాడుతూ.. జిల్లాలో న్యాయసేవా సంస్థ కార్యకాలపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాదులు కటుకం చంద్రమోహన్, విజయ్కృష్ణ, రమాదేవి పుష్ఫగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఓల్డ్ హైస్కూల్లో విద్యార్థులకు న్యాయ విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశలోనే అన్ని విషయాలపై అవగాహన పెంచుకుంటే ఉన్నత స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలిజగిత్యాలటౌన్: ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఈ నెల 10న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా ధరూర్ క్యాంప్లోని శ్రీకోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గౌరిశెట్టి హరీశ్ శాలువాతో సత్కరించారు. రోడ్లపై గుంతలు పూడ్చాలిమెట్పల్లి: వార్డుల్లో మట్టి రోడ్లపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతు చేపట్టాలని పలువురు కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన సోమవారం పాలకవర్గ సమావేశం జరిగింది. వర్షాలతో పలుచోట్ల మట్టి రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని, వీటివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. చైర్మన్ మాట్లాడుతూ కౌన్సిలర్లు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మొత్తం 13అంశాలను అమోదించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ ఓంకారి నవీన్, కమిషనర్ శ్రీనివాస్గౌడ్, డీఈ నాగేశ్వర్రావు తదితరులున్నారు. ఘనంగా సంకటహర చతుర్థిధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని మహాగణపతికి సోమవారం సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్కుమార్ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పం చేపట్టారు. సెలవులో ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: ఎస్పీ అశోక్కుమార్ వారం రోజులు సెలవుపై వెళ్లారు. శుక్రవారం హైదరాబాద్ వెళ్లిన ఆయన డీజీపీతో జరిగిన సమావేశంలో రెండురోజుల పాటు పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతో వచ్చే ఆదివారం వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. ఇన్చార్జి ఎస్పీగా సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితేకు బాధ్యతలు అప్పగించారు. -
● అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం ● బాధితుల నుంచి అర్జీల స్వీకరణ
జగిత్యాలటౌన్: ప్రజావాణికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆమె వెంటనే పరిష్కరించాలని సూచించారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. తప్పుడు కార్డుదారులను గుర్తించండి చేయూత పథకంలో భాగంగా గీత కార్మికులకు పెన్షన్ మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొందరు అనర్హులు తప్పుడు గుర్తింపు కార్డులు సృష్టించుకుని పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. అలాంటి వారిని తొలగించండి. – గీత పారిశ్రామిక సంఘం ప్రతినిధులు పారితోషికం పెంచండి వ్యవసాయ భూముల డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తున్న మాకు ఫొటోకు ప్రభుత్వం రూ.ఏడు మాత్రమే చెల్లిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫొటోకు రూ.15 పెంచి ఆదుకోవాలి. – డిజిటల్ క్రాప్ సర్వే వాలంటీర్స్ ఆడిటోరియం నిర్మించండి జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో అంబేడ్కర్ మెమోరియల్, ఆడిటోరియం నిర్మించండి. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం సరికాదు. పాత రెవెన్యూ కార్యాలయం స్థలంలో అంబేడ్కర్ మెమోరియల్ ఆడిటోరియం నిర్మించండి. – బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేసి న్యాయం చేయాలి. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి -
జగిత్యాల
35.0/23.07గరిష్టం/కనిష్టంరామలింగేశ్వరస్వామి ఊరేగింపుధర్మపురి: శ్రీరామలింగేశ్వర స్వామి ఊరేగింపు సేవను సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ పురవీధుల మీదుగా శోభాయాత్ర చేపట్టారు. మహిళలు స్వాగతం పలికారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. నృసింహాలయంలో శ్రావణ సందడిధర్మపురి: శ్రావణ సోమవారం సందర్భంగా నృసింహాలయంలో భక్తుల సందడి నెలకొంది. అన్ని ఆలయాల్లో కొలువు దీరిన స్వాముల వారికి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం శ్రీ 1 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
కేసీఆర్, రేవంత్కు ధన్యవాదాలు
రాయికల్: జిల్లాకేంద్రానికి 4,500 డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేసిన మాజీ సీఎం కేసీఆర్కు.. సదుపాయాలకు రూ.36 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి నియోజకవర్గ ప్రజల పక్షాన ధ న్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. మండలంలోని చింతలూరు, ఇటిక్యాల, రామాజీపేటలో ఇందిరమ్మ లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. తాను రేవు దాటాక తెప్పతగిలేసే రకం కాదని, అభివృద్ధి కోసమే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నానని గుర్తుచేశారు. అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 10 వేల ఇళ్లు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి సర్పంచులు బెజ్జంకి మోహన్, నీరటి శ్రీనివాస్, వనిత, రమేశ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బేతి మోహన్రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు తంగెళ్ల రమేశ్ పాల్గొన్నారు. నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సారంగాపూర్ మండలం రంగపేటలో రాచమల్ల లక్ష్మీ, గంగన్న గృహప్రవేశంలో పాల్గొన్నారు. సర్పంచ్ ఏదు ల శేఖర్, ఉపసర్పంచ్ కాసు నరేశ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బాపిరాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
వామ్మో ఫీజులుం
చిన్నచిన్న గదుల్లో ప్రైవేటు పాఠశాలలను నెలకొల్పి.. కార్పొరేట్ తరహాలో హంగులు అద్ది.. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులను తెప్పించి కొనసాగిస్తున్నారు. వాటి నిర్వహణ భారమంతా విద్యార్థులపైనే వేస్తున్నారు. స్కూల్ ఫీజుతోపాటు, వివిధ రకాల ఎగ్జామ్లు, స్పోర్ట్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటూ మధ్యమధ్య వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్పోసప్పో తెచ్చి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండేది కాదు. ఈ క్రమంలో వీటన్నింటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో నోటీసు బోర్డులపై అన్ని వివరాలు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిర్యాదు చేసేందు ఆన్లైన్లో నమోదు చేసుకునేలా వెబ్సైట్ను ఏర్పాటు చేశారు. www. schoole-edu.gov.in ద్వారా ఫిర్యాదు సైతం చేయవచ్చు. ఆన్లైన్లో నమోదైన ఫిర్యాదులను విద్యాశాఖ పరిశీలించి నిబంధనల ప్రకారం లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. పేద, మధ్యతరగతి వారికే ప్రభుత్వ స్కూళ్లపై ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతున్నా.. ఇంకా 50శాతం వరకు ప్రైవేటు స్కూళ్లలోనే చదివిస్తున్నారు. పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో ప్రైవేటు స్కూళ్లలో జాయిన్ చేయిస్తున్నారు. ఫీజుకన్నా నోట్బుక్కులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, ఇతరత్నాకే అత్యధికంగా ఖర్చవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో ప్లేగ్రౌండ్స్ లేకున్నా.. వసతులు, పార్కింగ్ సౌకర్యం లేకున్నా.. ఫీజులు మాత్రం అందినంతా దోచుకుంటున్నారు. జగిత్యాల: జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. ఎల్కేజీకే రూ.30 నుంచి రూ.40 వేలు వసూలు చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ఈటెక్నో, సీబీఎస్ఈ, నీట్ ఫౌండేషన్, ఐబీఎస్ఈ పేరిట అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చదివించాలంటేనే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ ఫీజుకు అదనంగా యూనిఫా మ్స్, టై, బెల్ట్స్, షూస్, ఐడీకార్డ్స్, యాప్స్ తదితర వాటి కోసం మరింత వసూలు చేస్తూనే ఉంటారు. అడ్మిషన్ పొందేవరకూ ఒకలా.. పిల్లలను చేర్చాక మరోలా వసూలు చేస్తారనే ఆరోపణలున్నాయి. అయితే వీటన్నింటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ డైరెక్టర్ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల వివరాలను తప్పకుండా నోటీసుబోర్డులపై ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనుంది. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు ప్రాథమిక : 12 యూపీఎస్ : 153హైస్కూళ్లు : 129 -
సేవలు భారం
ఊరికి దూరం.. వరదకాలువ సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కేటాయించిన స్థలం అద్దె భవనంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయం మల్యాల: మండల కేంద్రంలో ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సొంత భవనం నిర్మించేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయాన్ని ఊరవతలా.. అది కూడా నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు సిద్ధమవుతుండడమే కారణం. మండల కేంద్రంలోనే స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ నాలుగుకిలోమీటర్ల దూరంలో ఉన్న వరదకాలువ సమీపంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మల్యాల పంచాయతీ సమితి కేంద్రంగా ఉన్నప్పుడే మండల పరిషత్ కార్యాలయానికి స్థలం కేటాయించారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం, విద్యావనరుల కేంద్రం, వ్యవసాయాధికారి కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య శాల, పోలీస్స్టేషన్, సర్కిల్ కార్యాలయం, సెర్ప్ కార్యాలయం, మహిళా సమాఖ్య భవనం, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం, గెస్ట్ హౌస్, యునానీ ఆస్పత్రి, సింగిల్ విండో కార్యాలయం ఇలా అన్నీ ఒకేచోట ఉన్నాయి. ఇక్కడ ఉన్న వ్యవసాయ ఏడీఏ కార్యాలయాన్ని గంగాధర మండలానికి తరలించారు. ఐసీడీఎస్ కార్యాలయం కోసం విద్యావనరుల కేంద్రం ఎదుట స్థలం కేటాయించగా.. పిల్లర్ల వరకు పనులు పూర్తయ్యాయి. రెండేళ్ల క్రితం సింగిల్ విండోకు అదనంగా మహిళా సంఘం భవనాన్ని అప్పగించారు. పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న వ్యవసాయ గోదాంలో ఇండోర్ స్టేడియం, క్రీడాప్రాంగణం, రైతు వేదిక నిర్మించారు. అంతదూరంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. అయితే కార్యాలయం నిర్మాణానికి ఎకరం స్థలం కావాలన్న నిబంధనల పేరిట నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడం గమనార్హం. ప్రస్తుతం రెండు గదుల అద్దె భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కొనసాగుతోంది. అందుబాటులో స్థలం ఉన్నా.. మండల పరిషత్ స్థలంలో అన్ని కార్యాలయాలు పోను ఇంకా రెండెకరాలకు పైగా స్థలం అందుబాటులో ఉంది. వ్యవసాయ కార్యాలయం, సెర్ప్ కార్యాలయం ఎదుట స్థలం ఉంది. అయితే వ్యవసాయ కార్యాలయం స్థలంలో ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం నిర్మాణానికి అధికారులు అనుమతి ఇచ్చారు. అధికారుల ఇష్టారాజ్యం.. ప్రజలకు ఇక్కట్లు.. వాస్తవానికి రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రజలందరితో ముడిపడి ఉంటుంది. అదే ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయానికి అధికారులు కలెక్షన్ కోసం.. అసాధారణ బిల్లుల విషయంలో మాత్రమే వినియోగదారులు వెళ్తారు. ఈ కార్యాలయానికి సబ్స్టేషన్ వద్ద స్థలం కూడా అందుబాటులోనే ఉంది. పైగా ఆ స్థలాన్ని ముందుగా ప్రతిపాదన చేశారు కూడా. అంతలోనే ఏమైందో తెలియదుగానీ.. ఇప్పుడు పరిషత్ స్థలంలోనే ఈఆర్ఓ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి రూ.1.40కోట్లు మంజూరుకాగా.. ఎకరం స్థలం లేదంటూ వరదకాలువ వద్ద ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించడం అధికారుల అనాలోచిత విధానానికి అద్దం పడుతోంది. -
చర్యలు తీసుకుంటున్నాం
బయోమెడికల్ వేస్ట్ను వెంకటరమణ ఇన్సూలేటర్ ఏజెన్సీకే ఇవ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటాం. కొందరు బయట ప్రాంతాల్లో వేస్తున్నట్లు దృష్టికి వచ్చాయి. త్వరలోనే మున్సిపల్, ఐఎంఏ వారితో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రై వేటు వారు ఎవరైనా డ్రైనేజీల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – సుజాత, డీఎంహెచ్వో జరిమానా విధిస్తాం బయోమెడికల్ వేస్టేజ్ను బల్దియా వాహనాలకు ఇవ్వొద్దు. చెత్త కుండీల్లో పడేయకూడదు. ఆ చెత్తను తీసే సమయంలో కార్మికులకు ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇది వారి ప్రాణాలకే ఇబ్బందికరంగా ఉంటుంది. డ్రైనేజీల్లో పడేసిన వారికి జరిమానాలు వేయడంతోపాటు, వారి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం. – సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్ -
ఆధునిక టెక్నాలజీ అవసరం
అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు ఉండాలి. విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఫర్నిచర్ కూడా సమకూర్చాలి. ఎల్ఈడీ పరికరాలు ఏర్పాటు చేసి ఆధునిక టెక్నాలజీతో బోధిస్తే చిన్నారులు ఉత్సాహంగా చదువుకుంటారు. ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – దొప్పల జలంధర్, సిరికొండ వసతులు కల్పిస్తాం సొంత భవనాలు, అద్దె చెల్లించాల్సిన అవసరంలేని కేంద్రాలకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. కేంద్రాల్లో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఫ్యాన్లు, బల్బులు, స్విచ్బోర్డుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి. – భాస్కర్, జిల్లా సంక్షేమశాఖ అధికారి -
ప్యాక్స్ కార్యవర్గం ప్రమాణం
మల్యాల: మండలంలోని పోతారం పీఏసీఎస్ కార్యవర్గం ఆదివారం ప్రమాణస్వీకారం చేసింది. చైర్మన్గా కొల్లూరి గంగాధర్, డైరెక్టర్లుగా పరిపెల్లి విజయ, ముత్యాల రమేశ్, గజ్జెల లక్ష్మీ, బోగ శంకర్, దండే మనోహర్, శెట్టి లక్ష్మారెడ్డి, నల్ల వసంత్, క్యాతం మనోహర్ రెడ్డి, బద్దం భూమక్క, బొజ్జ తిరుపతి, గుర్రం చంద్రయ్య నియామకం అయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. కొత్త కార్యవర్గాన్ని సన్మానించారు. సర్పంచులు కొండపల్కల గోదాదేవి, చెవులమద్ది శ్రీనివాస్, గుర్రం విజయ్, గ్యాదం కుమార్, దారం ఆదిరెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, మరాటి సత్తయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, వెల్మ లక్ష్మారెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్, మండలాధ్యక్షుడు శనిగరపు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క అనిల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలిమెట్పల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 2 నుంచి 8తేదీ వరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలపై వారితో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతోందని, ఆ పార్టీ పాలనలో అన్నివర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించాలన్నారు. సమావేశంలో మారు సాయిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, తిరుపతిరెడ్డి, తోట శ్రీనివాస్ తదితరులున్నారు. బల్దియా చైర్మన్ లింబాద్రిని కలిసిన సినీ గేయ రచయితమెట్పల్లి: సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ ఆదివారం మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రిని ఆయన నివాసంలో కలిశారు. అశోక్తేజ రచించిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ అనే పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో లింబగిరి స్వామి తదితరులున్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నంజగిత్యాలరూరల్/జగిత్యాలజోన్/రాయికల్: పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం తిమ్మాపూర్కు చెందిన గాదె అన్నపూర్ణ, సంతోష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం చేశారు. సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ అనిత, నాయకులు సాగర్, మహిపాల్ రెడ్డి, సురేష్, రాజేష్, శంకరయ్య పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వినాయక నవరాత్రోత్సవాల కరపత్రిక ను ఆవిష్కరించారు. పద్మనాయక వెలమ సంక్షేమ మండలి అధ్యక్షుడు సాగర్రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సాగి రామారావు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం అందిస్తున్న శ్రీసత్యసాయి నిత్యాన్న ప్రసాద పథకానికి సంబంధించి పదేళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. రోగులు, సహాయకులకు భోజనం వడ్డించారు. రాయికల్ మండలం అల్లీపూర్, తాట్లావాయిలో ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్నారు. సర్పంచులు ఎంబారి గౌతమి, ఆకుల మల్లేశం, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఉపసర్పంచులు నారాయణ, గణేష్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సంధ్యారాణి, శ్రీనివాస్ గౌడ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
పిక్కలు పీకుతున్నాయ్
గొల్లపల్లి: జిల్లావ్యాప్తంగా వీధికుక్కల బెడద తీవ్రరూపం దాల్చింది. నిత్యం ఎక్కడోచోట ప్రజలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా.. అనిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. జంతు ప్రేమకంటే మానవ ప్రాణమే మిన్న అని, ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల రక్షణకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసినా జిల్లాలో మాత్రం అధికారులు కాగితాలకే పరిమితం చేశారు. ● పట్టించుకోని యంత్రాంగం కుక్కల బెడద 20 మండలాలు, 385 గ్రామ పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల్లో తీవ్రంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 2,950 పైచిలుకు మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. జిల్లాకేంద్రంలో కుక్కలకు శస్త్రచికిత్స చేసే ఏబీసీ కేంద్రం ఉన్నప్పటికీ.. ఒక్కో శునకానికి రూ.1,600 ఖర్చు అవుతుందనే నెపంతో పక్కన పడేయడం గమనార్హం. ● కొరవడిన వ్యాక్సిన్లు, అవగాహన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత స్థాయిలో యాంటీరేబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదని బాధితులు వాపోతున్నారు. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా తిరిగొస్తారో లేదోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ● చర్యలు తీసుకుంటేనే.. కలెక్టర్, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజేషన్ కేంద్రాలకు తరలించాలని, ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ల కొరత తీర్చి, ఆత్మకూర్, కోటిలింగాల వంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కన్నీటి గాథలు.. మారని తీరు గతంలో గొల్లపల్లి మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలిక సంగెపు సాహిత్య పిచ్చికుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన జిల్లా ప్రజలను ఇప్పటికీ భయాందోళనకు గురిచేస్తోంది. కోటిలింగాల (వెల్గటూర్ మండలం)కు చెందిన 8 ఏళ్ల బాలుడు మణితేజపై కుక్క దాడి చేసింది. అతడిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. దాదాపు 15 నెలలపాటు రూ.50లక్షలకుపైగా ఖర్చు చేసి చికిత్స అందించినా రేబీస్ లక్షణాలు తిరగబెట్టి కన్నుమూశాడు. తుంగూర్ (బీర్పూర్) గ్రామానికి చెందిన 4 ఏళ్ల రక్షిత్ కూడా ఆడుకుంటుండగా కుక్కదాడికి గురై సకాలంలో సరైన వైద్యం అందక ఆస్పత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. సారంగాపూర్ మండలంలో ఒక్కరోజే 11 మంది పిచ్చికుక్క దాడులకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ఏడాది బాధితులు 2024 4100 2025 7100 2026(జూలై వరకు) 2,950 సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు సురక్షిత సమాజంలో జీవించే హక్కు ఉంది. జంతు సంక్షేమ చట్టాల కంటే పౌరుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం. రేబీస్ బారిన పడిన, తీవ్రంగా గాయపడిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ప్రశాంత మరణం అందించవచ్చు. పాఠశాలలు, ఆసుపత్రులు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో పట్టుకున్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేశాక మళ్లీ అవే ప్రాంతాల్లో విడిచిపెట్టకూడదు. ప్రతి జిల్లాలో జంతు సంతాన నిరోధక శస్త్రచి కిత్స కేంద్రాలను తప్పనిసరిగా నిర్వహించాలి. -
‘భయో’వేస్టేజ్
భయో వేస్టేజ్● జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రి నిర్వాహకులు మున్సిపల్ చెత్త వాహనం రాగానే బయోమెడికల్ వేస్టేజీ అందిస్తున్నారు. విషయాన్ని స్తానికులు గుర్తించి నిలదీయడంతో వేయడం లేదని మాటమార్చారు. ● నాలుగు రోజుల క్రితం.. జిల్లాకేంద్రంలోని మోతె రోడ్లో ఓ డ్రైనేజీలో ఏకంగా బయోమెడికల్ వేస్టేజీని పడేశారు. దానిని మున్సిపల్ కార్మికులు తీసుకుని చెత్త ట్రాక్టర్లో తరలించారు. విషయం బయటకు రావడంతో మున్సిపల్ అధికారులు వేస్టేజీ పడేసిన వారికి రూ.10వేల జరిమానా విధించి సరిపుచ్చారు. బల్దియా చెత్త ట్రాక్టర్లో వేస్తున్న మెడికల్ వేస్ట్ జగిత్యాల: పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని అధికారులు చెబుతుంటారు. కానీ అమలులో, ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో మాత్రం అది ముందుకు కదలడం లేదు. పర్యావరణానికి హాని కలిగించే బయోమెడికల్ వేస్ట్ ఇష్టానుసారంగా పడేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు సుమారు 200పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో మొత్తం చెత్త రోజుకు సుమారు 80 మెట్రిక్ టన్నుల వరకు వస్తుంది. ఇందులో దాదాపు ఒకటి నుంచి రెండు టన్నుల బయో మెడికల్ వేస్ట్ ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులు మున్సిపాలిటీ చెత్తలోగానీ, ట్రాక్టర్లలోగానీ వేయకూడదు. వాటిని సపరేట్ చేసి పడేయాల్సి ఉంటుంది. ఈ వేస్టేజీని సేకరించేందుకు కరీంనగర్కు చెందిన వెంకటరమణ ఇన్సులేటర్ అనే ఏజెన్సీతో ఒప్పందం ఉంది. వారే వచ్చి ఆస్పత్రుల వేస్ట్ను తీసుకెళ్తుంటారు. ఆ వాహనంలోనే ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల వేస్ట్ను వేయాల్సి ఉంటుంది. కానీ దీనిని ఎవరూ పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీ వారు కూడా ప్రతిరోజు వాహనంలో వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొందరు ఈ ఏజెన్సీ వారికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే దుర్భుద్దితో మున్సిపల్ వాహనాల్లో లేదా బయట డ్రైనేజీల్లో వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీ వారు ఇన్సులేటర్ వాహనంలో బయోమెడికల్ వేస్ట్ను తీసుకెళ్లి కరిగించేస్తారు. జిల్లాలో ఉన్న డంపింగ్యార్డులో కార్మికులు చెత్తను కాలబెడుతున్నారు. అయితే బయోమెడికల్ వేస్ట్ కాలుష్యమై పలు రోగాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కాలబెట్టినప్పుడు దుర్గంధం చుట్టూరా రెండు కిలోమీటర్ల వరకు వస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. బయోమెడికల్ వేస్ట్ డేంజర్ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం సిరంజీలు, కాటన్ దూదులు, సైలెన్లు తదితర సర్జికల్ వస్తువులను వివిధ వ్యాధులతో వచ్చిన వారికి వినియోగిస్తుంటారు. బయట డ్రైనేజీలు, మున్సిపల్ చెత్త వాహనాల్లోనే వేయడంతో మున్సిపల్ కార్మికులు తీసే సమయంలో సిరంజీలు గానీ, ఇతర వస్తువులు వారికి అంటుకున్న రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు సంబంధించిన సిరంజీలు ఉంటే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. డీఎంహెచ్వోతో పాటు పొల్యుషన్ కంట్రోల్బోర్డు అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేసి బయోమెడికల్ వేస్ట్ను కచ్చితంగా ఇన్సులేటర్ వాహనాలకే తరలించాలని, బల్దియాకు సంబంధించిన వేస్ట్లో వేయకూడదని పేర్కొంటున్నారు. -
జీవన్రెడ్డివి ప్యాకేజీ మాటలు
జగిత్యాలజోన్: కేసీఆర్ను చాటుగా కలిసినప్పటి నుంచి జీవన్రెడ్డి ప్యాకేజీ మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు కేసీఆర్ను విమర్శించి.. రేవంత్రెడ్డికి క్షీరాభిషేకం చేశారని, ఇప్పుడు రేవంత్రెడ్డిని, తనను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మాటల్లో ద్వేషమే తప్ప విమర్శ లేదన్నారు. కొత్త బస్టాండ్ వద్దగల పెట్రోల్ బంక్కు జీవన్రెడ్డి హయాంలో ఇచ్చిన అనుమతులేనని గుర్తు చేశారు. జెడ్పీ మాజీ చైర్మన్పై విజిలెన్స్ కేసు పెట్టించారని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని భూకబ్జాదారు అన్నారని పేర్కొన్నారు. పోలీస్ క్వార్టర్స్లో ఉన్న పెట్రోల్ బంక్ విషయంలో తాను ఆలస్యం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. 2008లో ఇందిరమ్మకాలనీకి శంకుస్థాపన చేసి మర్చిపోతే తాను ఇళ్లు కట్టించానని, బీఆర్ఎస్ హయాంలో అన్ని నియోజకవర్గాలకు 1500 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తే.. తాను 4500 తెచ్చానని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వంతో పనిచేస్తేనే అర్బన్ హౌసింగ్కాలనీకి రూ.34కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాలను అంతా అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, సీనియర్ నాయకులు బండ శంకర్, కౌన్సిలర్లు ప్రశాంత్రావు, పిట్టల ధర్మరాజు, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, కప్పల శ్రీకాంత్ పాల్గొన్నారు. -
అంగన్వాడీల్లో విద్యుత్ వెలుగులు
కథలాపూర్(వేములవాడ): అంగన్వాడీకేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేక టీచర్లు, చిన్నారులు ఇబ్బందిపడుతున్నారు. గదుల్లో గాలి, వెలుతురు సరిగా లేక అసౌకర్యానికి గురయ్యారు. వేసవి వచ్చిందంటే పరిస్థితి మరీ అధ్వానంగా ఉండేది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు అందించాలని నిర్ణయించింది. ట్రాన్స్కో అధికారుల సూచనల మేరకు సిబ్బంది మీటర్ల బిగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. 429 కేంద్రాలకు ఉచిత కనెక్షన్లు జిల్లాలో 1,065 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 278 కేంద్రాలు సొంత భవనంలో.. 246 కేంద్రాలు అద్దె చెల్లించాల్సిన అవసరంలేని భవనాల్లో నిర్వహిస్తున్నారు. మిగిలిన 541 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాలు ఉన్న కేంద్రాల్లో మీటర్లు బిగించేందుకు అధికారులు నిర్ణయించారు. వీటిలో కొన్ని శిథిలావస్థలో ఉన్న వాటిని మినహాయించి 429 కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి మీటర్లు బిగించారు. కేవలం కనెక్షన్ ఇస్తే సరిపోదని, ఫ్యాన్లు, బల్బులు, ఇతర అవసరాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే బాగుంటుందని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యుత్ సౌకర్యం అందుబాటులోకొస్తే ఇన్నాళ్లు ఇబ్బంది పడిన టీచర్లు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మేలు జరుగుతుందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రక్షాళన షురూ..!
జగిత్యాల: జిల్లాలో కొనసాగుతున్న భూ రీసర్వే.. ఇందులో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులు, సిబ్బంది ప్రక్షాళన మొదలైంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నాలుగు గంటలపైగా రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. భూ రీసర్వే, 22ఏ కేసులు, భూభారతి దరఖాస్తులపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఒక్కో మండలానికి చెందిన తహసీల్దార్లను అరగంటకుపైగా భూ సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యం వహించిన ఎల్లారెడ్డిపేట తహసీల్దార్పై వేటు వేశారు. అలాగే మరొకరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫలితంగా ఉద్యోగులు, సిబ్బంది భూభారతి పనులు, భూరీసర్వే, 22ఏ పనులు పకడ్బందీగా చేపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రి సమీక్ష అనంతరం భూ సమస్యలపై కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి మండలంలో పర్యటిస్తూ.. ఎక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారో స్వయంగా తెలుసుకుంటున్నారు. భూభారతి, భూ రీసర్వేపై నిర్లక్ష్యం వహిస్తున్నారని గుర్తించి ఇటీవలే మెట్పల్లి తహసీల్దార్ను సస్పెండ్ చేశారు. భూరికార్డుల పరిశీలన, రీసర్వే, ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జాప్యం చేయొద్దని చెబుతన్నారు. అధికారులపైనే వేటు పడుతుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పకడ్బందీగా పనులు చేపడుతున్నారు. ప్రతిరోజు 40 ఎకరాల భూమి రీసర్వే.. భూభారతి చట్టాన్ని పకడ్బందీగా చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి రైతులకు భూదార్ నంబర్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కోమన్పల్లిలో సర్వే చేపట్టి మ్యాప్ రూపొందించి సర్వే నంబర్ల వారీగా సర్వే జరిపి హద్దులు ఖరారు చేసి వాటికి ల్యాండ్ పార్ట్ మ్యాప్ (ఎల్పీఎం) రూపొందించి ఆన్లైన్లో పొందుపర్చారు. మరో 70 గ్రామాలను ఎంపిక చేయగా.. సర్వే కొనసాగుతోంది. భూ వివరాలు, అక్షాంశ, రేఖాంశాలు పొందుపర్చుతారు. ఒక గ్రామంలో ఒక రైతుకు ఉన్న వివిధ సర్వేనంబర్లలో ఉన్న సాగు భూములను పట్టాదారు పాస్బుక్ ఆధారంగా ఒక చోటుకు చేర్చి భూదార్ నంబరు కేటాయించనున్నారు. వివాదాలకు తెర ఎంజాయ్మెంట్ సర్వే ద్వారా భూవివాదాలు లేకుండా ఉంటాయి. హద్దులు, మ్యాప్లు ఏర్పాటు చేస్తారు. దీంతో విక్రయించినా ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా హద్దుల విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి. వాటిని సరి చేయడంతో పాటు, ప్రతి ఒక్క రైతుకు భూదార్ నంబరు ఇవ్వనుండటంతో కొంత వివాదాలకు తెర పడనుంది. -
ప్రజాస్వామ్యంలో ఓటు ఆయుధం
జగిత్యాలరూరల్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధమని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. సారంగాపూర్ రైతువేదికలో ఎస్ఐఆర్పై అవగాహ న కల్పించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం 6, అభ్యంతరాలకు ఫారం 7, ఓటరు లిస్ట్ సవరణకు ఫారం 8 తప్పనిసరి అన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 81 వేల ఓట్లు ఎస్ఐఆర్లో నమోదు కాలేదన్నారు. ఓటు లేనివారు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని బీఎల్వోలకు అందజేయాలన్నారు. అనంతరం 23 మంది లబ్ధిదారులకు రూ.9.28లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ వాహిద్, ఎంపీడీవో నీరజ, సింగిల్ విండో చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచులు అరుణ, సొల్లు సురేందర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మనోహర్రెడ్డి, నాయకులు రాజేందర్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన డీఈ ఆర్డబ్ల్యూఎస్ డీఈగా బాధ్యతలు చేపట్టిన జలేందర్రెడ్డి శనివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏఈలు రాజశేఖర్, తరుణ్, రాహూల్ పాల్గొన్నారు. యువత క్రీడల్లో ముందుండాలి. జగిత్యాలటౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో బాలబాలికలకు వాలీబాల్, కబడ్డీ ఉద్యోగులకు బాడ్మింటన్, క్రికెట్ పోటీలు నిర్వహించినట్లు క్రీడల అధికారి రవికుమార్ తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ధ్యాన్చంద్ను ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, కమిషనర్ సత్యప్రణవ్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చక్రధర్రావు, పీడీలు పాల్గొన్నారు. -
దొంగల రాజ్యంగా కాంగ్రెస్ పాలన
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పాలన దొంగలరాజ్యంగా మారిందని, 16శాతం కమీషన్ ఇచ్చి.. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి వె య్యిరోజులు గడుస్తున్నా ఎందుకు అమలు చేయ డం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలనూ తుంగలో తొక్కడం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ వై ఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీరు ఎత్తి పోసే అవకాశం ఉ న్నా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే రేవంత్ పాలనలో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. రైతుబీమా పథకాన్ని కనుమరుగు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్లాడో తెలియదుగానీ తనకు కేసీఆర్తో కలిసి పనిచేసే అవకాశం కల్పించాడని సంతోషం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ పేరిట ఆక్రమించిన మున్సిపల్ భూమిని కాపాడాలని ఎమ్మెల్యేకు సూచించారు. ప్రభుత్వ ఆస్తులు ధారాదత్తం చేసే అధికారం అధికారులకు ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుస్తుంటే.. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హవా సాగుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిన్న సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 2 నుంచి నిర్వహించే పార్టీ నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు సమష్టిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిలో ఫుడ్ పాయిజన్
కోరుట్ల: కోరుట్ల మండలం నాగులపేటలో శనివారం జరిగిన ఓ పెళ్లి భోజనం తిని సుమారు 20 మంది అస్వస్థతకు గురయ్యారు. నాగులపేటకు చెందిన అబ్బాయి, మేడిపల్లి మండలం కల్వకోటకు చెందిన అమ్మాయి పెళ్లి నాగులపేటలో జరిగింది. ఇందులో మటన్, చికెన్, శాకాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ భోజనం చేసిన కొంతమంది వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. సాయంత్రం వరకు మరికొందరికి ఇదే రీతిలో వాంతులు కావడంతో కలవరపడ్డారు. రాత్రి ఏడు గంటల సమయంలో బాధితులు సుమారు 20మంది కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ధర్మపురి బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా వారి వైఫల్యాలను ఎండగట్టేందుకు కేటీఆర్ ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆరు గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, మహిళలకు నిరుద్యోగ భృతి ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు. -
రాజారాంపల్లె
ఉద్యోగుల ముల్లె..కేవలం ఉద్యోగాలు చేయడమే కాదు.. పుట్టిన ఊరిపై మమకారాన్ని చాటుకుంటున్నారు. గ్రామంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు తమవంతు సహాయం చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడిన వారు గ్రామ అభివృద్ధికి ముందు వరసలో ఉంటున్నారు. గ్రామానికి చెందిన ఏలేటి వంశీయులు 25మంది వరకు సాఫ్ట్వేర్రంగంలో ఉద్యోగాలు చేస్తూ విదేశాల్లో స్థిరపడ్డారు. పుట్టిన ఊరిపై మమకారంతో గ్రామ పంచాయతీ కార్యాలయం మొదలు వివిధ అవసరాలకు సొంత భూమి ఇచ్చారు. నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకూ రూ.కోట్లు విలువ చేసే భూమి ఇవ్వడానికి ముందుకు రావడం గమనార్హం. పల్లెను ప్రపంచానికి పరిచయం చేసి.. గ్రామానికి చెందిన యువ డెవలపర్ సిరుమల్ల మణికంఠ యాపిల్ సంస్థ నిర్వహించే ప్రతిష్టాత్మక వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొని రాజారాంపల్లె గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచానికి పరిచయం చేశారు. యాపిల్ సంస్థ ఏటా నిర్వహించే ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి రెండువేల మంది డెవలపర్స్ను ఎంపిక చేయగా.. అందులో మణికంఠ ఒకరు. ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మణికంఠ 2025 జనవరిలో అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఉన్న యూఎంబీసీ యూనివర్సిటీలో ఎంఎస్ ఇన్ డాటా సైన్స్ కోర్సులో చేరారు. చదువుతోపాటు సాంకేతిక ఆవిష్కరణలపై దృష్టి సారించిన ఆయన.. రెప్ట్రాక్ ప్రో అనే వినూత్న యాప్ను అభివృద్ధి చేశారు. ఏప్రిల్లో యూఎంబీసీ లోని అలెక్స్ బ్రౌన్ సెంటర్ ఫర్ ఎంట్రప్రెనూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక కాంగియాలసీ బిజినెస్ ఇన్నోవేషన్ కాంపిటిషన్లో మణికంఠ రూపొందించిన రెప్ట్రాక్ ప్రో యాప్ ఉత్తమ వినూత్న యాప్గా ఎంపికై ంది. ఈ యాప్ అభివృద్ధికి ఆయనకు 4,000 అమెరికన్ డాలర్ల మొదటి బహుమతి లభించింది.యువతలో పోటీతత్వం యువతలో పోటీతత్వం పెరిగింది. 2003 నుంచి 2020 వరకు సైన్యంలో పనిచేశాను. ఉద్యోగ విరమణ అనంతరం పోటీ పరీక్ష రాసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్ కొలువు కొట్టాను. ఇప్పుడు మెట్పల్లి పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాను. – చిట్టిమల్ల శ్రీనివాస్, కానిస్టేబుల్ వ్యవసాయ కుటుంబం నుంచి మాది వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుండే నాకు ఏదైనా సాధించాలనే తపన ఉండేది. పాఠశాల, కళాశాలలో టీచర్ల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాను. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. చదువు మాత్రమే మన మంచి భవిష్యత్తుకు ఽఆధారం. – హరిశేఖర్, ట్రాఫిక్ ఎస్సై, గోదావరిఖని వెల్గటూర్: పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఊరిలో ఐదారుగురు ఉద్యోగులు ఉండడం మహా గొప్ప. అయితే ఆ గ్రామంలో మాత్రం ఏకంగా 40మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వారంతా వివిధ హోదాల్లో పనిచేస్తూ.. యువతలో పోటీతత్వాన్ని పెంచుతున్నారు. ఎస్సైలు ఇద్దరు, కానిస్టేబుళ్లు 12 మంది, టీచర్లు 16 మంది, పంచాయతీ కార్యదర్శులు ఇద్దరు, లెక్చరర్లు ఒక్కరు కొనసాగుతున్నారు. ప్రైవేటు సాఫ్ట్వేర్ రంగంలో మరో యాభై మంది వరకూ ఉన్నారు. వీరిలో విదేశాల్లో స్థిరపడిన వారు 25 మంది వరకు ఉన్నారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు స్థిరపడిన వారు 15 మంది ఉన్నారు. ఒకరిని చూసి మరొకరు పోటీపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామస్తులు. -
నేడు నీట్పీజీ ప్రవేశ పరీక్ష
● పకడ్బందీ ఏర్పాట్లు ● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నీట్పీజీ ప్రవేశ పరీక్షను ఆదివారం నిర్వహిస్తున్నామని, ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. జేఎన్టీయూ(కొండగట్టు)లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, ఉదయం 7 నుంచి 8.30గంటల వరకు ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్, సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. నేత్రదానం గొప్పదిజగిత్యాలరూరల్: నేత్రదానం గొప్పదని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ జెడ్పీ పాఠశాలలో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు. కంటిజబ్బులపై ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. కంటి సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏ కారణంతో చనిపోయినా నేత్రాలు దానం చేయాలని, తద్వారా మరొకరి కంటి చూపు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ సురేంద్ర, నేత్ర వైద్యులు తిరుపతి, లక్ష్మీనారాయణ, హెచ్ఎం రమేశ్ పాల్గొన్నారు. అంజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వా రిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ ఏఈవో హరిహరనాథ్, ప్రధాన అర్చకులు జితేందర్ స్వామి, స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, రామచంద్రం పాల్గొన్నారు. అటవీశాఖ డీఆర్వో సస్పెన్షన్జగిత్యాలక్రైం: అటవీశాఖ కార్యాలయంలో డీఆర్వోగా పనిచేస్తున్న మహేశ్ను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ కన్జర్వేటర్ అర్పన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్ఆర్వో పద్మారావు తెలిపా రు. మహేశ్పై పలు ఫిర్యాదులు రావడంతో పాటు నాలుగు రోజుల క్రితం మల్లాపూర్ మండలంలోని ఓ దాబాలో అటవీశాఖ అధికారులు కొంతమంది మద్యం సేవిస్తూ విందు చేసుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టి మహేశ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్య హబ్కు రక్తదాతలే కీలకంజగిత్యాల: ఆరోగ్య హబ్కు రక్తదాతలే కీలకమని ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ అన్నారు. ఐఎంఏ హాల్లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. రక్తదానం ఎంతో గొప్పదని, ఇది అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యదర్శి ఆకుతోట శ్రీ నివాస్రెడ్డి మాట్లాడుతూ.. వైద్యరంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించే హబ్గా రూపొందించడంలో ఐఎంఏ కీ లక పాత్ర పోషిస్తుందన్నారు. 22 మంది రక్తదానం చేశారు. మైత్రిరెడ్డి పాల్గొన్నారు. అన్ని కేటగిరీలకు ఉత్తమ అవార్డులు ప్రకటించాలిజగిత్యాల: ఉత్తమ అవార్డుల ఎంపికలో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాలని యూఎస్పీసీ ఆధ్వర్యంలో డీఈవో రాము కు వినతిపత్రం అందజేశారు. 2026–27 వి ద్యా సంవత్సరానికి జిల్లాస్థాయి నుంచి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి దరఖా స్తులు ఆహ్వానించారని, ప్రధానోపాధ్యాయులు, అన్ని కేటగిరీల వారిగా మండలానికొకటి అవార్డు కేటాయించాలన్నారు. గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ప్రభావితం చేయగల వ్యక్తులు కాకుండా తటస్థంగా, పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు తిరుకోవెల శ్యామ్సుందర్, గట్ల సంతోష్, ఎడ్ల గోవర్దన్ పాల్గొన్నారు. -
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం ఉగ్రనృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని ఆగమశాస్త్రం ప్రకారం చేపడతామని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. ఆలయ పునర్నిర్మాణంపై శనివారం వేదపండితులు, అధికారులతో ఆలయ ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ చేపట్టారు. వేదపండితులు తమ అభిప్రాయాలను వివరించారు. మంత్రి మాట్లాడుతూ ఉగ్ర నృసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాకి ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసిందని, భక్తుల మనోభావాల ప్రకారం పనులు చేపడతామని తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ హన్మంతరావు మాట్లాడుతూ రూ.10 కోట్లతో ఆలయ ప్రతిష్టతకు ఎలాంటి భంగమూ కలగకుండా చూస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. అంబేడ్కర్ సంఘం భవనాలు పూర్తి చేస్తాంగొల్లపల్లి: జిల్లాలోని అంబేడ్కర్ సంఘం భవనాలు పూర్తి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని దట్నూర్లో అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ప్రపంచం కొనియాడిన మేధావి అంబేడ్కర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. దట్నూరు బ్రిడ్జి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చా రు. సర్పంచ్ బెక్కం గంగారాం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాపల్లి గంగన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్, గ్రంథాలయ మాజీ చైర్మన్ కటారి చంద్రశేఖర్రావు, అంబేడ్కర్ సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమాడ్లు, వివిధ గ్రామాల సర్పంచులు, అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. రూ.10కోట్లతో పనులు చేపడతాం సమీక్ష సమావేశంలో మంత్రి అడ్లూరి -
● సురభి ఫాం హౌస్ వేదికగా.. ● అసమ్మతివాదుల సమావేశం ● కీలక నేతల హాజరు
కోరుట్ల: ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే జగిత్యాల బీజేపీలో ముసలం మొదలైంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీరుపై ఇన్నాళ్లు అంతర్గతంగా కొనసాగిన అసమ్మతి నాయకులంతా కలిసికట్టుగా కదిలారు. మల్లాపూర్ మండలం సాతారం–రేగుంట సమీపంలోని సురభి ఫాంహౌస్ వీరికి వేదికగా మారింది. శనివారం మధ్యాహ్నం బీజేపీ అసంతృప్తి నేతలంతా కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. అసంతృప్త నేతల కీలక కలయిక.. ఎంపీ అర్వింద్పై కొంతకాలంగా అసమ్మతితో ఉన్న నేతలు మోరపల్లి సత్యనారాయణరావు, సురభి నవీన్, రవీందర్రెడ్డి, ఇందూరి సత్యం, సీపెల్లి రవీందర్, ఏసీఎస్.రాజు, లింగంపేట శ్రీనివాస్, కోరుట్లకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, కొంతమంది సర్పంచులు, రాచమడుగు శ్రీనివాస్రావు, మాజీ కౌన్సిలర్ పెండెం గణేశ్, మరికొంత మంది పాల్గొన్నారు. వీరితో పలు మండలాల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొనడం గమనార్హం. కీలక నేతలంతా అర్వింద్ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమావేశం. కీలక నాయకులతోపాటు సుమారు 400 మంది రెండో శ్రేణికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ముద్దు.. అర్వింద్ వద్దు కొంతకాలంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అర్వింద్ పార్టీకి కొత్త జవసత్వాలు తెస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ సీనియర్ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. మొదటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వారిని కించపరుస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రాణం ఉన్నంతకాలం పార్టీకే పనిచేస్తామని, అదే సమయంలో పార్టీకి నష్టం చేస్తున్న ఎంపీ వెంట ఉండబోమని కీలక నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలను ప్రోత్సాహిస్తూ పార్టీ కీలక నేతల మనోభావాలను గుర్తించకపోవడంపై పలువురు నేతలు ఎంపీ అర్వింద్పై ధ్వజమెత్తినట్లు సమాచారం. మొత్తంగా ఈ సమావేశం బీజేపీలో వర్గపోరుతోపాటు రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఉత్కంఠకు తెరలేపింది. -
బస్సు నడుపుతుండగా డ్రైవర్కు గుండెపోటు
సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మద్దూనూరు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సు డ్రైవర్ లక్ష్మణ్కు గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్పై పడిపోయారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును స్లో చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 108కు ఫోన్ చేసినా స్పందించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆటోలో డ్రైవర్ లక్ష్మణ్ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ లక్ష్మణ్.. సోమవారం రిటైర్ కానున్నారు. ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పినా డ్రైవింగ్ డ్యూటీ వేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్కు గుండెపోటుతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.ఇదీ చదవండి: అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్ -
ఆధారం ఉంటేనే ఓటు
జగిత్యాల: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నారు. మ్యాపింగ్ కాని అనామలిస్ జాబితాలో చేరిన ఓటర్లందరికీ నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నోటీసులపై విచారణ సైతం చేపడుతున్నారు. నోటీసులు అందుకున్న ప్రతిఒక్కరూ వారి వద్దనున్న ఆధారాలు చూపడంతో పాటు, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 20 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత గల ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు దక్కాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే సర్ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల నేతలతో అధికారులు సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఓటర్లకు నోటీసులు ఇవ్వడంతో పాటు, అనంతరం చేపట్టిన చర్యల గురించి ఖచ్చితంగా తెలియజేయాలని తెలిపారు. అర్హత గల ప్రతీ ఓటరుకు ఓటు హక్కు కల్పించడంతో పాటు, పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించేందుకు అందరు సహకరించాలని పేర్కొంటున్నారు. నోటీసులు అందుకున్న వారు ఏఈఆర్వోలుగా ఉన్న తహసీల్దార్ల ఎదుట హాజరై వివరించుకోవాల్సి ఉంటుంది. 2002లో తమతో పాటు, తమ కుటుంబ పెద్దలకు సంబంధించిన ఓటు వివరాలు, ఆధారాలతో అధికారులకు చూపడంతో పాటు, అన్ని సక్రమంగా ఉన్నట్లయితే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ఓటు హక్కు ఉంటుంది. వార్డు సభల నిర్వహణ సర్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా వార్డుసభలు, గ్రామసభలు నిర్వహించారు. అబ్సెంట్, షిఫ్ట్, డెత్ జాబితాను బీఎల్వోలు చదివి వినిపించారు. అలాగే సభలో ఫారం 6, 7, 8 అందుబాటులో ఉంచారు. అభ్యంతరాలుంటే వెంటనే దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మరో ప్రక్రియ అయిన అనాలమసిస్ (ఓటర్ల వివరాలలో లోపం) మ్యాపింగ్ కాని, పాత, ప్రస్తుత రికార్డుల్లో లేని వారి వివరాలను సేకరిస్తున్నారు. అన్ని సక్రమంగా ఉంటేనే ఓటు హక్కు లభిస్తుంది. ఎన్నికల సంఘం చూపమన్న 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపితే వారికి ఓటు హక్కు దక్కుతుంది. లేనిచో ఓటు పోయే అవకాశాలు సైతం ఉంటాయి. అనామలసిస్లో ఉన్న వారికి పుట్టిన తేదీలో తప్పులు, కుటుంబ సభ్యుల మధ్య వయస్సుకు సంబంధించిన అసాదారణ వ్యత్యాసాలు, ఇంగ్లీష్, తెలుగు అనువాదాలలో పేర్లు మారడం వంటి లోపాలను సవరించుకోవచ్చు. ఓట్ల వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలన్న ఉద్దేశంతో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మండలం పీఎస్లు మ్యాపింగ్ కానివి అనామలిస్ జగిత్యాల అర్బన్ 100 9,928 20,057 జగిత్యాలరూరల్ 58 5,681 12,321 బీర్పూర్ 23 827 4,221 రాయికల్ 61 2,115 11,203 సారంగాపూర్ 23 585 3,543 కోరుట్ల 91 3,945 18,717 ఇబ్రహీంపట్నం 37 833 7,523 మల్లాపూర్ 50 832 9,747 మెట్పల్లి 90 6243 21,302 ధర్మపురి 57 4578 9,996 బుగ్గారం 21 92 3,317 ధర్మారం 53 1746 8,136 ఎండపల్లి 28 1258 4,157 గొల్లపల్లి 44 555 7,200 పెగడపల్లి 43 691 5,737 వెల్గటూర్ 27 774 4,532 -
బస్సు ఆపి.. రాఖీ కట్టి..
బస్సులోనే తమ్ముడికి రాఖీ కడుతున్న అక్కబస్సులోనే తమ్ముడికి రాఖీ కడుతున్న అక్కతిమ్మాపూర్/ధర్మారం: రాఖీ అంటేనే ఆప్యాయత, అనుబంధాలకు నిరద్శనం. శుక్రవారం రాఖీ పండుగ నేపథ్యంలో పండుగ గొప్పతనాన్ని చాటిన అపురూప ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మెండ రాజు అక్కడి డిపోలో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. పండక్కి సెలవు దొరకకపోవడంతో శుక్రవారం డ్యూటీలో ఉన్నాడు. తమ్ముడికి రాఖీ కట్టాలనుకున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో ఉంటున్న ఆయన సోదరి తమ్మనవేణి స్వప్న గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును రేణికుంటలో ఆపింది. తమ్ముడికి రాఖీ కట్టి మిఠాయి తినిపించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన గంగాధర మహేందర్ ఆర్టీసీ డ్రైవర్. తన సోదరి సవిత శుక్రవారం రాఖీ కట్టేందుకు వచ్చింది. అప్పటికే మహేందర్ విధులకు వెళ్లాడు. ధర్మారం వద్ద ఉన్నా అని ఫోన్ చేయడంతో బస్టాండ్కు చేరుకుని రాఖీ కట్టింది.కోరుట్ల: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ శుక్రవారం కోరుట్లలో రాఖీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి స్నేహితుని కూతురు బెజ్జారపు జాహ్నవి తిరుపతికి రాఖీ కట్టింది. ఈ సందర్బంగా తిరుపతి మాట్లాడుతూ చిన్నప్పుడెప్పుడో రాఖీ కట్టుకున్నాని చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రాఖీ పండగ వేడుకల్లో పాల్గొనటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
చకచకా సబ్స్టేషన్ల నిర్మాణం
జగిత్యాలరూరల్: జిల్లాలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరగడమే కాకుండా వ్యవసాయ వాడకం సైతం అధికమైంది. వీటికి తోడు చిన్న, పెద్ద పరిశ్రమలు పుట్టుకొస్తుండటంతో విద్యుత్ వాడకం గణనీయంగా పెరిగిపోయి నాణ్యమైన విద్యుత్ అందించడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి సబ్స్టేషన్ల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి విద్యుత్ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఇప్పటికే 33/11 కేవీ సబ్స్టేషన్లు 118 ఉండగా అదనంగా మరో 10 సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోంది. ఇవేకాక 132/33, 220/132 సబ్ స్టేషన్లు నిర్మించాలన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో సబ్స్టేషన్లు జగిత్యాల జిల్లాలో 10 సబ్స్టేషన్లు మంజూరు కాగా ఏడు సబ్స్టేషన్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. మరో మూడు సబ్స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కథలాపూర్ మండలం పోసానిపేట, కోరుట్ల మండలం సిరికొండ, మెట్పల్లి మండలం రేగుంట, మేడిపల్లి మండలం పోరుమల్ల, బీమారం, ధర్మపురి మండలం తిమ్మాపూర్, గొల్లపల్లి మండలం వెన్గుమట్ల, కొడిమ్యాల మండలం గౌరాపూర్, కోనాపూర్ గ్రామాల్లో రూ.20 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయితే లోవోల్టేజీ సమస్య తీరడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగుతుంది. వేగవంతంగా పనులు జిల్లాలో విద్యుత్ వాడకం పెరిగింది. అందుకు అనుగుణంగా భవిష్యత్లో సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక బద్ధంగా సబ్స్టేషన్లు నిర్మిస్తున్నాం. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం పనులు నాణ్యతగా, వేగవంతంగా చేయిస్తున్నాం. –సుదర్శన్, ట్రాన్స్కో ఎస్ఈ -
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
వెల్గటూర్: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వెల్గటూర్ మండలం సంకెనపెల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామ పంచాయతీ భవనాలు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు గ్రామ పాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తిరుపతి, సర్పంచ్ కొదురుపాక పూజ, కాంగ్రెస్ నాయకుడు మద్దుల గోపాల్రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలికథలాపూర్/మేడిపల్లి: రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎంపీడీవోలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రెండో దశ నియోజకవర్గానికి 2 వేలు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు. 16వ ఆర్థిక సంఘం నిధులపై సమీక్షించారు. సమావేశంలో ఎంపీడీవోలు శంకర్, అంజుమ, నీరజ పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలిజగిత్యాలరూరల్: ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ మనిషికి దైవంతో పాటు, భక్తిభావం ఉండాలన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచులు నల్ల కవిత, శీలం సురేందర్, పొనిశెట్టి మహేశ్, నాయకులు నల్ల స్వామిరెడ్డి, రాజశేఖర్, లక్ష్మణ్ పాల్గొన్నారు. గిరిప్రదక్షిణలో మాజీ జెడ్పీచైర్పర్సన్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన గిరి ప్రదక్షిణలో మాజీ జెడ్పీచైర్పర్సన్ దావ వసంత దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
వెంకన్న స్వామికి గరుడ సేవ
ధర్మపురిలో మంత్రి అడ్లూరికి రాఖీ కడుతున్న నాయకురాలు ఎమ్మెల్యే సంజయ్కు రాఖీ కడుతున్న సోదరి సమత ఎంపీ అరవింద్కు రాఖీ కడుతున్న శ్రావణి మాజీ మంత్రి జీవన్ రెడ్డికి రాఖీ కడుతున్న మహిళలు అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. రక్త సంబంధాన్ని మించిన పేగుబంధానికి నిదర్శనంగా సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి, నిండు మనసుతో దీవించారు. ధర్మపురిలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్కు కౌన్సిలర్లు, నాయకురాళ్లు, జగిత్యాలలో ఎంపీ అరవింద్కు భోగ శ్రావణితో పాటు మహిళలు రాఖీలు కట్టారు. కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కు సోదరి సమత, జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్రెడ్డికి మహిళలు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల కాంతులు నింపాలని అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా పట్టణంలోని స్వీట్షాపులు, ఱాకీ దుకాణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. – జగిత్యాలటౌన్/కోరుట్ల/ధర్మపురి ఘనంగా రక్షాబంధన్ -
ధాన్యం నిల్వ చేసేది ఎలా?
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రస్తుత వానాకాలం సీజన్లో పండిన వరి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరిపడా నిల్వల ప్రదేశాలు లేకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధాన్యం నిల్వపై ప్రధాన చర్చ జరిగింది. ఆమేరకు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం నిల్వలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను అదేశించారు. దీంతో ఫంక్షన్ హాళ్లు, ఖాళీ గిడ్డంగులపై దృష్టి సారించారు. జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎల్నినో అంటూ అధికారులు భయపెట్టినప్పటికీ జిల్లాలో రైతులు దాదాపు 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. దాదాపు 5–6 లక్షల మె.ట వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని, ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసి, సీఎంఆర్ బియ్యం కోసం రైస్మిల్లులకు కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాలోని దాదాపు 130 మంది రైస్మిల్లర్ల వద్ద 3–4 లక్షల మె.ట ధాన్యం నిల్వలతో పాటు బియ్యం నిల్వలు పేరుకపోయాయి. దీంతో ఎక్కడా గోదాంలు ఖాళీ లేవు. గడిచిన యాసంగి ధాన్యాన్ని పక్క జిల్లా సిరిసిల్ల అపెరల్ పార్క్ గోదాంలకు పంపించారు. దీనికి తోడు మార్కెట్యార్డు ఖాళీ ప్రదేశాల్లో, మిల్లుల వద్ద టార్పాలిన్లు వేసి నిల్వలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే, మిల్లుల కెపాసిటీ మేరకు ధాన్యం తీసుకుంటామని, అధిక ధాన్యం కేటాయించడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మిల్లర్లు ఆవేదన చెందుతున్నారు. మిల్లర్ల వద్ద నుంచి ఎఫ్సీఐ బియ్యాన్ని తీసుకోవడంలో కూడా జాప్యం చేస్తుండటంతో బియ్యం నిల్వలు సైతం మిల్లుల్లో పేరుకపోతున్నాయి. మరో నెల రోజుల్లో వానాకాలం ధాన్యం రానుండటంతో, ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎక్కడ ఖాళీ షెడ్లు ఉన్నా తీసుకోవాల్సిందే జిల్లాతో పాటు చుట్టు ప్రక్కల ఎక్కడ ఖాళీ షెడ్లు ఉన్న తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన అదేశాలు జారీ చేశారు. కొత్త ధాన్యం వచ్చే సమయానికి ప్రభుత్వ గోదాంలతో పాటు ప్రైవేట్ గోదాంలు, మార్కెట్ యార్డులోని షెడ్లు, ఖాళీగా ఉన్న పారిశ్రామిక షెడ్లు, ఫంక్షక్షన్ హాళ్లు, ఓపెన్ షెడ్లు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే గోదాంల్లో నిల్వ ఉన్న పాత నిల్వలను వెంటనే ఖాళీ చేయించాలని, ఇటివలే మక్కల కొనుగోలుకు టెండర్లు అయినందున గోదాంల్లో నిల్వ చేసిన మక్కలను ఖాళీ చేయించి అత్యధిక నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. ధాన్యం టెండర్లకు రంగం సిద్ధం యాసంగి సీజన్లో ఎఫ్సీఐ కోటాకు మించి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లులు, ఇతర గోదాంల్లో నిల్వ చేసింది. దీంతో రాబోయే సీజన్కు నిల్వ పరిస్థితి ఇబ్బంది కరంగా ఉండటంతో ప్రభుత్వం కోటాను మించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని టెండర్లు పిలిచి విక్రయించాలని నిర్ణయించింది. టెండరుదారులు నెల రోజులలోపు ధాన్యాన్ని తరలించాలని కూడా అదేశాలు ఇవ్వనుంది. దీంతో, కొంత మేర జిల్లాలో నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
జగిత్యాల: భూముల రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, గిర్దవార్లు, జీపీవోలతో రీసర్వేపై నిర్వహించిన సమగ్ర శిక్ష కార్యక్రమంలో మాట్లాడారు. రీసర్వే ద్వారా గ్రామాల్లోని ప్రతీ భూకమతాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖచ్చితంగా కొలిచి భూ రికార్డులను నవీకరించడం జరుగుతుందన్నారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణతో పాటు, భవిష్యత్లో భూ వివాదాలను నివారించడమే రీసర్వే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సర్వే గురించి గ్రామస్థాయిలో భూ యజమానులు, పట్టాదారులు, రైతులు ప్రజాప్రతినిధులు సర్వే కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, అటవీభూములు, చెరువులు, కుంటలు, వాగులు, రహదారులు, శ్మశాన వాటికలు అన్నింటినీ గుర్తించి, సర్వే చేసేటప్పుడు రెవెన్యూ రికార్డులు, పాత గ్రామ పటాలు, సేత్వార్, టీపాన్, ఖస్ర పహానీ, వాస్తవ పరిస్థితులను పరిశీలించాలన్నారు. కొలతలు పూర్తయిన అనంతరం భూ యజమానులకు నోటీసులు జారీ చేసి వారి సమక్షంలో హద్దులు నిర్ధారించాలని సూచించారు. అభ్యంతరాలు, క్లెయిమ్లు వచ్చినప్పుడు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలన్నారు. రీసర్వే అనేది కేవలం భూములను కొలిచే కార్యక్రమమే కాదని, గ్రామంలోని అంగుళం భూమికి సంబంధించిన సమగ్రమైన శాశ్వతమైన రికార్డులను రూపొందించే కీలక కార్యక్రమం అని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సమ్మె ఉద్యోగుల చివరి అస్త్రం
● బీఆర్ఎస్ అండగా ఉంటుంది ● మాజీమంత్రి జీవన్ రెడ్డి జగిత్యాలటౌన్: ఆర్నెళ్లలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మాజీమంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. డీఏలు, పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగులు, యువతతో పెట్టుకున్న వారు కనుమరుగయ్యారని, అదే గతి రేవంత్కు పట్టనుందని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. స్మార్ట్రేషన్కార్డు కాంగ్రెస్ సభ్యత్వ కార్డుగా మారిందన్నారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కారమయ్యేవరకు పార్టీ అండగా ఉంటుందన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, దావ వసంత, జేఏసీ నాయకులు నాగేందర్, రవిబాబు, రామచంద్రం, బైరం హరికిరణ్ పాల్గొన్నారు. -
అనుబంధం
గుండె గూటిఇల్లంతకుంట: మాది ఇల్లంతకుంట. మా నాన్న నర్సయ్య అమ్మ లక్ష్మి. ఇద్దరు సోదరులు అనిల్, మహేశ్. అన్నయ్య బైరి అనిల్ 15ఏళ్లుగా ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. ఇంటి వద్ద ఉంటే ఇక్కడే రాఖీ కడతాను. ప్రస్తుతం అన్నయ్య పశ్చిమ బెంగాల్లో విధులు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితమే రాఖీ పోస్ట్ చేశాను. గురువారం రాఖీ చేరిందని అన్నయ్య తెలిపాడు. – పెద్ది కవిత, ఇల్లంతకుంటమెట్పల్లి: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్మ మధ్య ప్రేమ, అప్యాయత, అనుబంధానికి రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తోంది. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పండుగ దోహాపడుతోంది.ఏటా మా సోదరి సమత నాకు రాఖీ కడుతోంది. వైద్య వృత్తిలో తాను, రాజకీయాల్లో నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆ రోజున తప్పకుండా కలుసుకుంటాం. – కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే -
జోరుగా జీరో మద్యం
మెట్పల్లి: జిల్లాలో జీరోమద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర పాలితప్రాంతమైన దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్లో తక్కువ ధరకు దొరికే మద్యాన్ని కొనుగోలు చేసి.. అత్యంత పకడ్బందీగా జిల్లాకు తరలిస్తున్నారు. ఇక్కడి బెల్ట్ దుకాణాల్లో ఆ మద్యాన్ని విక్రయిస్తూ పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తున్నారు. కథలాపూర్ మండలంలో ఎకై ్సజ్ అధికారులు పదిరోజుల క్రితం నిర్వహించిన తనిఖీల్లో రూ.2.50లక్షల మద్యం పట్టుకున్నారు. తాజాగా గురువారం చేపట్టిన తనిఖీల్లో ఏకంగా రూ.6.38లక్షల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం గమనార్హం. విచ్చలవిడిగా సాగుతున్న ఈ అక్రమ దందాతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఫలితంగా జిల్లా ఎకై ్సజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ రూ.760, అక్కడ రూ.320మాత్రమే మద్యం కనిపించకుండా ఏర్పాట్లు పసిగట్టి పట్టించింది లైసెన్స్డ్ వ్యాపారులే? ఐదుగురిపై కేసు దాబా, బెల్టుషాపుల్లో కల్తీ మద్యం జగిత్యాలక్రైం: కథలాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో దాబాలు, బెల్టుషాపుల్లో విలు వైన మద్యాన్ని బాటిళ్ల నుంచి తీసి తక్కువ రేటు ఉన్న మద్యాన్ని ఆ బాటిళ్లలో నింపి తిరిగి సీల్ చేస్తున్నారు. విలువైన బ్రాండ్లను కూడా తక్కువ రేట్లకు విక్రయిస్తున్నారు. రానున్న దసరా పండగ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం అమ్మకాలు పడిపోకుండా ఎకై ్సజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా కట్టడి చేస్తున్నారు. -
రైస్మిల్లుపై విజిలెన్స్ దాడులు
ఇబ్రహీంపట్నం: మండలంలోని గోదూర్లోగల శ్రీలక్ష్మీవేంకటేశ్వర రైస్మిల్లుపై గురువారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు దాడులు నిర్వహించారు. 2022 – 23కు సంబంధించిన వానాకాలం ధాన్యం 4418.663 టన్నులు, యాసంగికి సంబంధించిన 208.963 టన్నుల ధాన్యం (సుమారు రూ.10కోట్లు) అమ్ముకున్నట్లు తనిఖీల్లో వెలుగుచూసింది. తదుపరి చర్యల నిమిత్తం కలెక్టర్కు నివేదిక పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిల్లును అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో యజమాని రాజేందర్ అందుబాటులో లేకపోవడం గమనార్హం. కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు ఉమాపతి, సుమన్, ఇన్స్పెక్టర్లు రాజేందర్రావు, నర్సింహస్వామి, జీపీవో లక్ష్మణ్ పాల్గొన్నారు. కొండగట్టులో ఎన్నికల స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పూజలుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని ఎన్నికల సంఘం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసూనాంభ గురువారం దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. అర్చకులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందించారు. ఆర్డీవో మధుసూదన్ ఆలయ అధికారులు సునీల్కుమార్, రాజేందర్రెడ్డి, మల్యాల తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ తిరుపతి పాల్గొన్నారు. గ్రామసభల ద్వారా అభ్యంతరాల స్వీకరణజగిత్యాలరూరల్: ఎస్ఐఆర్ ఓటరు జాబితా సవరణపై గ్రామసభల ద్వారా అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. కొత్త ఓటరు నమోదు, తొలగింపు, సవరణలు, బదిలీలపై అభ్యంతరాలపై గ్రామసభల్లో సూచనలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, రూరల్ తహసీల్దార్ హకీం, డిప్యూటీ తహసీల్దార్ భూమయ్య, ఆర్ఐ శంషోద్దీన్, సర్పంచ్ కుక్కునూరి వంశీ పాల్గొన్నారు. ఇప్పపల్లిలో గోదాం ప్రారంభంకథలాపూర్: రైతుల ఆర్థికాభివృద్ధిలో సహకార సంఘాల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని ఇప్పపల్లిలో నిర్మించిన 500 టన్నుల సామర్థ్యం గల గోదాంను ప్రారంభించారు. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి మాజీ సీఎం వైఎస్.రాజశేఖర రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. వేములవాడ – కోరుట్ల మధ్య మూడు లైన్ల రోడ్డు విస్తరణకు రూ.150 కోట్లు మంజూరు చేశామన్నారు. మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, తహసీల్దార్ రాజమహ్మద్, ఎంపీడీవో శంకర్, సీఈవో విజయ్, నాయకులు పాల్గొన్నారు. రైస్మిల్లు యజమానుల అరెస్ట్కొడిమ్యాల: సీఎంఆర్ అప్పగింతలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల మేరకు మండలంలోని శ్రీరాములపల్లిలోగల అమృత ఆగ్రో ఇండస్ట్రీ, హరిహర ఆగ్రో ఇండస్ట్రీ యజమానులను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయ్ అధికారులు అరెస్ట్ చేయించారు. ముక్క గంగాధర్, ముక్క గోదావరి, ముక్క శ్రీనాథ్, ముక్క రవీందర్, సమ వజ్రమ్మ, ముక్క సుజాత, ముక్క లక్ష్మి, సామ మారుతిపై బుధవారమే కేసు నమోదు కాగా గురువారం గంగాధర్, గోదావరి, వజ్రమ్మ, మారుతిని అరెస్ట్ చేసి వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని ఎస్సై నరేష్ తెలిపారు. -
ఓట్లపై అభ్యంతరాలు ఉంటే తెలపండి
● కలెక్టర్ సత్యప్రసాద్ ఇబ్రహీంపట్నం: తొలగించిన ఓట్లపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఎస్ఐర్పై గ్రామసభలో మాట్లాడారు. బీఎల్వోలు తమ పరిధిలోని పోలింగ్ బూత్లలో తొలగించిన ఓటర్ల వివరాలను చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు అందించినట్లు తెలిపారు. కొన్ని పొరబాట్లు ఉన్నవాటిని తొలగించామని, అలాంటి వారికి నోటీసులు అందించామని, 12 రకాల ఆధారాల్లో ఏదోఒకటి తీసుకొస్తే తిరిగి ఓటర్గా నమోదు చేస్తామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. అనంతరం బర్దీపూర్లో భూభారతి భూరీసర్వే పనులను పరిశీలించారు. అసైన్మెంట్ భూమి వివరాలను తెలుసుకున్నారు. పునరావాస గ్రామం కావడంతో ఎస్సారెస్పీ అధికారులు రాకుండా సర్వే చేయొద్దని సూచించారు. ఇప్పటివరకు 960 ఎకరాలు సర్వే చేసినట్లు అధికారులు సమాధానం ఇచ్చారు. గ్రామంలో 376 సర్వేనంబర్లో 5.13ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా నకిలీ డి–1 ద్వారా పట్టా చేసుకున్నారని మాజీ సర్పంచ్ జనార్ధన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన తీసుకోకపోవడంతో తహసీల్దార్ వరప్రసాద్కు ఇవ్వడం గమనార్హం. ఆర్డీవో నర్సింహారావు, ఎంపీడీవో చిప్ప గణేష్, ఎంపీవో రామకృష్ణ రాజు, ఆర్ఐలు రేవంత్రెడ్డి, రమేశ్, సర్పంచ్లు బద్దం గోపి, సంగం సాగర్, సింగిల్విండో చైర్మన్ జిల్లాల పవన్, బీఎల్వోలు, ఉప సర్పంచులు పాల్గొన్నారు. -
దసరాకి రణబాలి ఫిక్స్
విజయ దశమి సందర్భంగా థియేటర్స్లోకి రానున్నాడు రణబాలి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. ఈ చిత్రంలో రణ బాలిగా విజయ్ దేవరకొండ, జయమ్మగా రష్మికా మందన్నా, సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో ఆర్నాల్డ్ వోస్లూ నటిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని చారిత్రక వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను సెప్టెంబరు 11న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తాజాగా ‘రణబాలి’ని విజయదశమి సందర్భంగా అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. -
విద్యుత్ ప్రీపెయిడ్ విధానంపై టీఆర్ఎస్ ధర్నా
కోరుట్ల: విద్యుత్ వినియోగానికి ప్రీపెయిడ్ విధానం తేవాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. పార్టీ కోరుట్ల ఇన్చార్జి రఘు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, విద్యుత్ వినియోగానికి ముందుగానే డబ్బులు చెల్లించే ప్రీపెయిడ్ విధానాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ ముందుగానే రీచార్జ్ చేసుకుంటే సరఫరా జరిగే విధానం ప్రజలను ఇబ్బందుల్లో పడేయటమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
నటుడు–నిర్మాత జీవీ నారాయణ రావు ఇక లేరు
● ‘అంతులేని కథ’ సినిమాలో..ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు(73) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. చిన్నతనం నుంచే నాటకాలు, నటనంటే ఆయనకు మక్కువ.. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. విద్యార్థి దశలోనే ‘మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాప రుద్రీయం, మంచుతెర’ వంటి పలు నాటకాలు వేసి, తనదైన నటనతో మెప్పించారాయన. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి పలువురితో కలిసి రంగస్థల వేదికను పంచుకున్నారాయన. వారి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ‘అంతులేని కథ’తో పరిచయం నటనపై ఆసక్తితో మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు నారాయణరావు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రజనీకాంత్, జయప్రద, శ్రీప్రియ, ఫటాఫట్ జయలక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1976 ఫిబ్రవరి 27న విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ‘వికటకవి గోపాల్’ పాత్రలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారాయణ రావు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ప్రత్యేకించి ఈ సినిమాలో ‘తాళికట్టు శుభవేళ... మెడలో కళ్యాణ మాల...’ పాటలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘ముత్యాల పల్లకి, ఒక ఊరి కథ, చిలకమ్మ చెప్పింది, ఆలు మగలు, గుప్పెడు మనసు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బడాయి బసవయ్య, ఊరుకిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, మంచు పల్లకి, ప్రళయ రుద్రుడు, బహుదూరపు బాటసారి, దేవాంతకుడు, ప్రేమాయణం, యముడికి మొగుడు, ముత్యమంత ముద్దు, రాజా విక్రమార్క, సీతారామయ్యగారి మనవరాలు, గ్యాంగ్ లీడర్, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, హిట్లర్, సాహసం, మహా భక్త సిరియాళ, రాజుగారి గది 2, తోలు బొమ్మలాట’ వంటి సుమారు 100కు పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు నారాయణ రావు. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం ‘స్కైలాబ్’. 2021 డిసెంబరు 4న ఈ మూవీ విడుదలైంది. నిర్మాతగానూ... నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ నారాయణరావుకి మంచి అనుభవం ఉంది. నిర్మాతగా ‘యముడికి మొగుడు, దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, పెళ్ళి నీకు శుభం నాకు’ వంటి సినిమాలను నిర్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నప్పుడు ఆయనకు రజనీకాంత్తో మంచి స్నేహం కుదిరింది. రజనీకాంత్, చిరంజీవితో ఆయనకు సన్నిహిత స్నేహం ఉంది. చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘యముడికి మొగుడు’ సినిమాని తన మిత్రుడు రజనీకాంత్తో తమిళంలోనూ రీమేక్ చేశారు. బుల్లి తెరపైనా... ‘పసుపు కుంకుమ, సుందరకాండ, గిరిజా కళ్యాణం, గీతాంజలి’ వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించారు నారాయణ రావు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగించారాయన. నారాయణరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావుగారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 1976లో ‘అంతులేని కథ’తో పరిచయమైన ఆయన ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణరావుగారితో నాకెంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – చిరంజీవి


