breaking news
Jagtial
-
కోరుట్లలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి హత్య
జగిత్యాల జిల్లా: కళ్ల ఎదుట ఆడుకుంటున్న ఉన్న..అమ్మాయి అకస్మాతుగా కనిపించకుండా పోయింది. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లో విగతజీవిగా కనిపించింది. బాత్రూంలో బాలిక హర్షిత మెడ కోసి దారుణంగా చంపిన వైనం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. కోరుట్లలోని ఆదర్శనగర్లో నివాసముండే ఆకుల రాము–నవీన దంపతుల కూతురు హర్షిత(6) హత్య స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పెద్దపులులు చూసి వచ్చి...శనివారం సాయంత్రం 5 గంటలకు హర్షిత స్కూల్ నుంచి ఇంటికి వచ్చి సమీపంలో పెద్దపులుల ఆటలు సాగుతుండటంతో వాటిని చూసేందుకు చుట్టుపక్కల పిల్లలతో కలిసి వెళ్లింది. కొంత సేపటి తరువాత ఇంటికి వచ్చి నానమ్మతో కాలం గడిపినట్లు సమాచారం. ఆ తరువాత సాయంత్రం 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది. సుమారు గంటన్నర పాటు వెతికిన తల్లిదండ్రులు రాము–నవీనలు తమ కూతురు కనిపించడం లేదని 8.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు చుట్టుపక్కల ఇండ్లలో బాలిక కోసం వెతుకుతున్న క్రమంలో సమీపంలోని ఓ ఇంట్లోని బాత్రూంలో బాలిక మెడకోసి చంపినట్లుగా గుర్తించారు. బాత్రూం మొత్తం బాలిక రక్తంతో నిండిఉండగా మృతదేహాన్ని అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యా..ప్రమాదమా?బాలిక మృతదేహం దొరికిన ఇంటికి చెందిన వ్యక్తిని కొడిపెల్లి విజయ్గా పోలీసులు గుర్తించారు. విజయ్ భార్య దూరంగా ఉంటున్నట్లుగా సమాచారం. ఆ ఇంట్లో విజయ్తో పాటు అతని అన్న, తమ్ముల కుమారులు ఉన్నట్లుగా సమాచారం. అయితే విజయ్ ఎక్కడున్నాడని ఆరా తీసిన పోలీసులు సెల్ఫోన్ ద్వారా అతనితో మాట్లాడితే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లుగా చెపుతున్నట్లుగా సమాచారం. విజయ్ నర్సంపేటలో ఉంటే బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూంలోకి ఎలా వచ్చిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా బాలిక పెద్దపులులకు భయపడి సమీపంలోని ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లగా అక్కడ కాలు జారి నల్లాపై పడితే మెడకు గుచ్చి వదిలించుకునే ప్రయత్నంలో బాలిక మెడ కోసినట్లుగా మారిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద బాలిక మృతికి కారణాలు అంతుచిక్కడం లేదు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎస్పీ అశోక్కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. -
పల్లె ముంగిట వైద్య సేవలు
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ● ఆరవెల్లిలో పల్లె దవాఖానా ప్రారంభంపెగడపల్లి: పల్లె దవాఖానాలతో ప్రజల ముంగిటకు వైద్య సేవలు తీసుకొచ్చామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని ఆరవెల్లి గ్రామంలో కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఆయూష్మాన్ భారత్ పల్లె దవాఖానా నూతన భవనాన్ని శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ వైద్యరంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ చేపడుతున్నామని, మందుల కొరత లేకుడా చూస్తున్నామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం మద్దులపల్లికి చెందిన దివ్యాంగుడు మనోజ్కుమార్కు స్కూటీ అందించారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీడబ్ల్యూఓ నరేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు గౌడ్, శ్రీనివాస్రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాదీ ప్రతిష్టాన్పై ‘విజిలెన్స్’
● సంస్థ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు ● వివాదాల నేపథ్యంలో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ● రెండు రోజులుగా వివరాలు సేకరిస్తున్న అధికారులు మెట్పల్లి: ఎంతో ఘన కీర్తి కలిగిన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సంస్థలో జరుగుతున్న వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై నియోజకవర్గానికి చెందిన ఓ కాంగ్రెస్ ముఖ్య నేత కొంతకాలం క్రితం ప్రభుత్వ పెద్దలను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ జరిపి నివేదికను అందించాలని విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ప్రస్తుతం ఆ విభాగం అధికారులు రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. భూముల అమ్మకం నుంచి మొదలు.. ● మెట్పల్లి ఖాదీ ప్రతిష్టాన్కు పట్టణంలోనే కాకుండా పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయి. ● ఇందులో నుంచి పూడూరు, కిసాన్నగర్లో ఉన్న స్థలాలను విక్రయించారు. ● ఆ భూములను తక్కువ ధరకు విక్రయించి.. భారీగా లబ్ధి పొందారని ఆ సమయంలో పాలకవర్గంలోని ముఖ్యులపై ఆరోపణలు వెల్లువవెత్తాయి. ● పూడూరులో స్థానిక ప్రజలు అమ్మిన భూములను వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనుమతి లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం.. ● పట్టణంలో ఖాదీ ప్రతిష్టాన్కు సుమారు 14ఎకరాల భూమి ఉంది. సంస్థకు ఆదాయం సమకూర్చుకోవడం కోసం కొంత భూమిలో మూడేళ్ల క్రితం సుమారు 200 గదులతో కూడిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. ● దీనికి మున్సిపల్ నుంచి అనుమతులు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్లతో ఆ సమయంలో అధికారులు చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. ● ఆ కాంప్లెక్స్లోని గదులను అద్దెకిచ్చి ప్రయోజనం పొందుతున్న ప్రతిష్టాన్.. మున్సిపల్కు ఏటా ఆస్తి పన్ను కూడా చెల్లించడం లేదు. ● ప్రతిష్టాన్ పాలకవర్గం తీరుపై మున్సిపల్కు రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. సమీకృత మార్కెట్కు గ ‘లీజు’ ఒప్పందం ● సమీకృత మార్కెట్ నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలం స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఖాదీకి చెందిన 20 గుంటల స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ● ఇందుకు ప్రతినెలా రూ.1.50లక్షల అద్దె చెల్లింపు.. తర్వాత రెండేళ్లకోసారి పది శాతం పెంపునకు అంగీకరిస్తూ 2021 మార్చి 21న మున్సిపాలకవర్గం తీర్మానం చేసింది. ● ఆ అద్దె చెల్లింపు 2022 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చేలా ఒప్పందం జరిగింది. ● 2021 జూన్లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో అవి ఇప్పటికీ పూర్తి కాలేదు. ● అయినా అద్దె చెల్లించాలంటూ ఖాదీ సంస్థ మున్సిపాలిటీకి నోటీసులు ఇస్తూ వస్తోంది. ఇప్పటివరకు అద్దె బకాయిలు రూ.అర కోటికి పైగానే ఉన్నట్లు తెలిసింది. ● మున్సిపల్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ నిర్మాణం పూర్తయి అందులో వ్యాపారాలు మొదలైన తర్వాత వచ్చే ఆదాయంతో అద్దె చెల్లింపు జరిగేలా ఒప్పందం చేసుకోవాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా పాలకవర్గం, అధికారులు నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. ● ఆ ఒప్పందంతో ఖాదీకి లాభం కాగా.. మున్సిపాలిటీకి భారీగా నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రంగంలోకి విజిలెన్స్ అధికారులు ● ఖాదీ ప్రతిష్టాన్ వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఓ కాంగ్రెస్ నేత చే సిన ఫిర్యాదుతో ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ● రెండు రోజులుగా విజిలెన్స్ అధికారులు పట్టణానికి వచ్చి ఖాదీ, మున్సిపల్ నుంచి వివిధ కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ● ప్రధానంగా అనుమతి లేకుండా కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం, సమీకృత మార్కెట్ లీజు విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించకపోవడం వంటి వాటిపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. ● మొత్తానికి ఖాదీ ప్రతిష్టాన్కు సంబంధించిన వ్యవహారాలపై సాగుతున్న విజిలెన్స్ విచారణతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్నది ఆసక్తిగా మారింది. -
ఆధునిక హంగులతో పెద్దాపూర్ ‘గురుకులం’
మెట్పల్లిరూరల్: ఏళ్ల నుంచి సమస్యలతో కొట్టుమిట్టాడిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులం పాఠశాల నేడు ఆధునిక హంగులతో కళకళలాడుతోంది. కొంతకాలంగా వివిధ కారణాలతో సమస్యలు ఎదుర్కొన్న పాఠశాల ప్రస్తుతం పూర్తిగా మార్పు చెందింది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వసతులు మెరుగుపర్చారు. భద్రతపై దృష్టి సారించారు. కొత్త భవనంలోని కొన్ని గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలిన గదులను వసతి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. గతంలో ఇక్కడ జరిగిన ఘటనల దృష్ట్యా భద్రతపై దృష్టిసారించిన అధికారులు.. నిధులు వెచ్చించి పనులు చేయించారు. గురుకులం పరిసరాల్లో సీసీ వేయించారు. చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరిసరాలను ఎప్పటికప్పడు శుభ్రం చేయిస్తున్నారు. సుమారు రూ.60 లక్షలు వెచ్చించి గురుకుల పాఠశాలను బాగు చేయించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
కలెక్టర్ సత్యప్రసాద్ ధర్మపురి: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. పైఅంతస్తులో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డెంగీ, మలేరియాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. గోదావరి వరదలతో కలుగుతున్న నష్టాలపై ఆరా తీశారు. ఈ సారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్త భవనం కోసం నివేదికలు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్చార్జి తహసీల్దార్ సుమన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు. లబ్ధిదారులు నిర్ణీత గడువులోపు నిబంధనల మేరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. అధికారులు వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, హౌసింగ్ డీఈ భాస్కర్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులు కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో చేపట్టబోయే ఐఎఫ్సీవో కార్యక్రమాలపై ఆయనకు వివరించారు. ఐఎఫ్సీవో ప్రాజెక్ట్ మేనేజర్ స్వప్నరెడ్డి, మేనేజర్ రమ్యశ్రీ, లహరి, లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లో గల ఈవీఎం గోదాంను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతపై ప్రతినెలా తనిఖీ ఉంటుందన్నారు. -
బైపాస్ పనుల్లో కదలిక!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా ప్రజలంతా ఎప్పుడెప్పుడా అనిఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ విషయంలో శుభవార్త. ఇప్పటికే పూర్తయిన ఈ రైల్వేలైన్ను కాజీపేట– బల్లార్ష ప్రధాన లైన్తో కనెక్ట్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇంటర్లాకింగ్ పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సింది. మే నెలాఖరు నాటికి బైపాస్ రైల్వేలైన్ అందుబాటులోకి రావాల్సింది. ఆ సమయంలో కరీంనగర్–తిరుపతి రైలుకు పెద్దపల్లి స్టాప్ కూడా ఎత్తేశారు. ఇక రైలు పెద్దపల్లికి వెళ్లకుండా నేరుగా.. బైపాస్ మీదుగా జమ్మికుంట వైపు వెళ్లేది. కానీ.. అపుడు ఎదురైన పలు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. కానీ... ప్రధాన లైన్కు 1.78 కి.మీల పొడవైన పెద్దపల్లి బైపాస్ లైన్ను కలపడం అంత సులువేం కాదు. ఢిల్లీ మార్గం కావడంతో అనేక రైళ్లను గంటలపాటు నిలపాల్సి ఉంటుంది. చా లా రైళ్లను దారి మళ్లించాల్సి ఉంటుంది. వేలాది కుటుంబా ల ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అధి కారులు ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైళ్ల రద్దీ తక్కువ ఉన్న రోజున కనీసం 2 నుంచి 3 గంటల్లో ప్రధాన మార్గాన్ని బైపాస్ మార్గంతో కలిపేలా ప్రణాళికలు రూపొందించారు. దీనిని ఆమోదిస్తూ.. సికింద్రాబాద్లోని దక్షిణమధ్య రైల్వే కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈనెల 7వ తేదీ దక్షిణ మధ్య రై ల్వే జీఎం పర్యటన ఉంది. ఆయన పర్యటన అనంతరం బై పాస్ మార్గం అనుసంధానం షెడ్యూల్పై స్పష్టత రానుంది. ఆర్వోబీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పుకున్నా.. ఆ మేరకు పురోగతి పనుల్లో కనిపించడం లేదు. ఈ మధ్య పిల్లర్ల పనుల్లో వేగంపెంచారు. ఇపుడున్న రైల్వే గేటు ప్రాంతంలో పిల్లర్లు నిర్మించాల్సిన నేపథ్యంలో రైల్వేగేటును పక్కకు మార్చారు. ఈ క్రమంలో చొప్పదండికి వెళ్లే క్రమంలో కుడివైపునకు తిరిగే క్రమంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. చొప్పదండి నుంచి కరీంనగర్కు వచ్చే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అపోలో వరకు, అటు తీగలగుట్టపల్లి అమ్మగుడి వరకు వాహనాలు బారులు తీరి, ట్రాఫిక్ జాములతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు గేట్లు పడటం, ఈ కష్టాలకు వానలు తోడవటంతో స్థానికుల కష్టాలు రెట్టింపయ్యాయి. స్కూలు బస్సులు, చిరువ్యాపారులతోపాటు ముఖ్యంగా అంబులెన్స్లో వచ్చే అత్యవసర రోగులు ఈ మార్గంలో రెట్టింపైన ట్రాఫిక్ కష్టాలతో అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే స్టేషన్కు అవతల నుంచి కిసాన్ నగర్ మీదుగా రైల్వే అండర్పాస్ మార్గం ఉంది. దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు, బల్దియా, ఇతర ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు నెలల నుంచి సాగుతున్న పనులు రేపు కాజీపేట–బల్లార్ష మార్గంలో జీఎం పర్యటన? ఇంటర్లాకింగ్ పనులకు ఇంకా విడుదల కాని షెడ్యూల్ కొనసాగుతున్న కరీంనగర్ ఆర్వోబీ పనులు నరకం చూస్తున్నామని ప్రజల ఆవేదన -
ఓటరు నమోదు పారదర్శకంగా చేయాలి
రాయికల్: ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు పారదర్శకంగా చేయాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బూత్స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆగస్టులో నిర్వహించే ఓటరు నమోదు ప్రక్రియలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ వంటి అంశాలపై పూ ర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. బీ ఎల్వోలు పారదర్శకంగా వ్యవహరించాలని, స కా లంలో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీ వి, ట్రైనర్లు రాజశేఖర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గురుకులం విద్యార్థులుమల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. గురుకులానికి చెందిన ఎ.హర్షిత్ అండర్–14 లాంగ్జంప్ విభాగంలో, జి.హారిక అండర్–12 లాంగ్జంప్ విభాగంలో ఈనెల 6న హన్మకొండలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్, పీఈటీ, ఉపాధ్యాయులు అభినందించారు. భగీరథ లీకేజీలకు మరమ్మతులపై నిర్లక్ష్యం మెట్పల్లి: పట్టణంలోని వెంకట్రావ్పేట వద్ద జాతీయ రహదారి పక్కన రెండు రోజుల క్రితం భగీరథ పైపులైన్కు లీకేజీలు ఏర్పడి భారీగా నీరు వృథాగా పోతుంది. దీనివల్ల అటు వైపు వెళ్లే వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరుచుగా పైపులైన్కు లీకేజీలు ఏర్పడుతున్నాయి. అధికారులు మరమ్మతులు చేపడుతున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుందని సింగిల్ విండో చైర్మన్ కొమిరెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు. లీకేజీలు ఏర్పడకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
అను‘బంధం’ దూరమై..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు. కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం.. ప్రెషర్ కుక్కర్లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పెనవేసుకునే ఉమ్మడి బంధం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ సిటిజెన్స్ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు మారిన పరిస్థితుల్లో చిన్నకుటుంబాలుగా జీవనం రక్తసంబంధీకుల మధ్య అడ్డుగోడలు ఉద్యోగం, ఉపాధి వేటలో ఇతర ప్రాంతాలకు.. గతాలను నెమరువేసుకుంటున్న నాటితరం -
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
కరీంనగర్: కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డ వారికి అండగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి పరులు విదేశాల్లో డ్యాన్స్లు చేస్తుంటే మోదీ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని, సమాజం కోసం పోరాడుతున్న వారిని హతమార్చడం అన్యాయమని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాల్సి అవసరముందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని ఈనెల 15లోపు జిల్లాలోని అన్ని నియోజక వ ర్గాల శాసన సభ్యులకు వినతిపత్రాలు అందిస్తామ ని తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్లపెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులు.. సౌకర్యాలు
● సింగరేణిలో డబుల్, ట్రిపుల్ బెడ్రూం క్వార్టర్లు ● అధికారులకు 143, కార్మికులకు 860 క్వార్టర్లు ● 1,003 క్వార్టర్లకు రూ.450 కోట్లు కేటాయింపు గోదావరిఖని(రామగుండం): సంస్థవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఆధునిక హంగులతో క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీప్లస్ వన్ పద్ధతిలో అధికారులకు ట్రిపుల్ బెడ్రూం, కార్మికులకు డబుల్ బెడ్రూం నిర్మించనున్నారు. ఈమేరకు సింగరేణి బోర్డు ఆమోదం పొందింది. అధికారులు, ఉద్యోగుల 1,003 క్వార్టర్ల నిర్మాణానికి రూ.450కోట్లు కేటాయించింది. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూర్ ప్రాంతాల్లో క్వార్టర్లను నిర్మించనుంది. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం 50 ఏళ్ల క్రితం టీవన్టైపు, డీ టైపు పేరుతో పైకప్పు సిమెంట్ రేకులతో క్వార్టర్లను నిర్మించింది. సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురాతన క్వార్టర్లు కార్మికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఐటీ ఇంజినీర్లు, పలు ప్రాంతాల్లో ఉన్నతస్థాయి విద్యను అభ్యసించిన కార్మికుల పిల్లలు ఇక్కడకు వస్తే ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈక్రమంలో క్వార్టర్ పక్కనున్న స్థలంలో షెడ్డు, అదనపు నిర్మాణం చేపట్టినా ఏమూలకూ సరిపోవడం లేదు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు సంస్థలో నూతన క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి వాటిస్థానంలో నూతనంగా క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఆధునిక పద్ధతిలో విశాలంగా.. సింగరేణిలో అధికారులకు మిలీనియం ఏబ్లాక్ పద్ధతిలో 35 క్వార్టర్లు, మిలీనియం బీబ్లాక్ విధానంలో 108 క్వార్టర్లు ఖరారు చేసింది. ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్ కోసం మిలీనియం సీబ్లాక్ పద్ధతిలో 300 క్వార్టర్లు, వర్క్మెన్ల కోసం మిలీనియం డీబ్లాక్ 560 క్వార్టర్లు నిర్మించనున్నారు. గతంలో నిర్మించిన ఎండీటైపు క్వార్టర్ల మాదిరిగా ప్రతీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. క్వార్టర్ల కోసం యాజమాన్యం టెండర్ ప్రక్రియ సిద్ధం చేసింది. త్వరలో టెండర్ల ద్వారా క్వార్టర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు కేటాయించనున్నారు. ఆధునిక హంగులతో.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, హంగులతో కార్మికులకు డబుల్ బెడ్రూం, అధికారులకు ట్రిపుల్ బెడ్రూంలు నిర్మించేందుకు నిర్ణయించాం. జీప్లస్ వన్ విధానంలో నిర్మాణాలు కొనసాగుతాయి. రూ.450కోట్లు వెచ్చించేందుకు బోర్డు అనుమతి లభించింది. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి ప్రాంతం అధికారులు కార్మికులు వ్యయం (రూ.కోట్లలో) గోదావరిఖని 36 282 133 శ్రీరాంపూర్ 39 410 193 భూపాలపల్లి 22 60 45 మణుగూరు 46 108 79 -
తల్లీ, కొడుకుల ఆదర్శ నిర్ణయం
● మరణానంతరం నేత్ర, అవయవాల దానంకు అంగీకారం ● కూతురు పుట్టిన రోజున స్ఫూర్తిదాయకమైన సందేశం కోల్సిటీ(రామగుండం): ‘అమ్మా... నేను చనిపోయాక నేత్ర, అవయదానం చేయ్యాలని నిర్ణయించుకున్న...’ అని కొడుకు తన మనసులోని మాటను తల్లికి చెబితే... ఇదేం పిచ్చి ఆలోచన అంటూ వద్దని వారించలేదు తల్లి. మంచి నిర్ణయం బిడ్డాని భుజం తట్టింది. నేను కూడా నీలెక్కనే నేత్ర, అవయదానం చేస్తానంటూ తల్లి కూడా ముందుకు వచ్చింది. తనకు పాఠాలు చెప్పిన టీచ్చర్ సమక్షంలో ఆ ఆదర్శ కొడుకు, తన తల్లితో కలిసి అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్కు సమర్పించారు. గోదావరిఖని పవర్హౌజ్ కాలనీలో నివాసం ఉంటున్న కాంపెల్లి స్వామి, జయ దంపతుల కుమారుడు శివగణేశ్. డిప్లామోఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్టీ) కోర్సు చేస్తున్నాడు. మరణానంతరం మనిషి నేత్రాలు, అవయవాలను దానం చేస్తే పలువురికి పునఃర్జన్మ ఇవ్వొచ్చని భావించాడు. విషయాన్ని తనకు చదువు చెప్పిన టీచర్ శశికళకు తెలిపాడు. తన సోదరి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా శనివారం శివగణేశ్ తన తల్లితో కలిసి నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు. వారి నివాసంలోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేసి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూరికి శశికళ టీచర్ సమక్షంలో సమర్పించారు. వారికి ఆర్గాన్ డోనర్కార్డులతోపాటు అభినందన పత్రాలను అందజేశారు. తల్లీ, కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శనీయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లప్ప, సారయ్య, కోశాధికారి రాజేందర్ అభినందించారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర
కరీంనగర్: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేవేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని గణేశ్నగర్లో గల బద్దం ఎల్లారెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ బకాయిల విడుదలపై పూటకో మాట మాట్లాడుతూ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామరావు, వెంకటేష్, మచ్చ రమేశ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ కేశబోయిన రాము యాదవ్, కనకం సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ పాత్రికేయుడి హఠాన్మరణం
సిరిసిల్లటౌన్: సీనియర్ పాత్రికేయుడు గర్దాస్ ప్రసాద్(43) శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందారు. వివిధ సంస్థల్లో పదేళ్లుగా పనిచేసిన ఆయన సిరిసిల్ల నియోజకవర్గం టీవీ 9 కంట్రిబ్యూటర్గా నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఉదయం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనలతో కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రసాద్కు భార్య రేవతి, కూతుళ్లు సంజన(19), సిరిచందన(16), కొడుకు శివేంద్ర(11) ఉన్నారు. సంతాపాలు..ఆర్థిక సాయం ప్రసాద్ మృతిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సంతాపం ప్రకటించారు. రూ.50వేల ఆర్థికసాయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ రూ.25వేలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ రూ.10వేలు అందజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు రూ.50వేల ఆర్థికసాయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు చేతుల మీదుగా అందజేశారు. ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు, కార్యదర్శి ఆకుల జయంత్కుమార్, ఆడెపు మహేందర్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, టి.వి.నారాయణ, వూరడి మల్లికార్జున్, ప్రెస్క్లబ్ కార్యవర్గం, పాత్రికేయులు నివాళి అర్పించారు. -
ముఖంపై పౌడర్ చల్లి బంగారం చోరీ
రాయికల్: పట్టణంలోని కేశవనగర్కు చెందిన వెల్మ రాధ ముఖంపై పౌడర్ చల్లి నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కేశవనగర్కు చెందిన రాధ మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి రాధ వద్దకు వచ్చి ముఖంపై పౌడర్ చల్లారు. ఆ మత్తులో రెండు తులాల కడెం, రెండున్నర తులాల చైన్ ఆగంతులకు ఇచ్చేసింది. కాసేపటికి తేరుకున్న బాధితురాలు లబోదిబోమంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సుదీర్రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యరామడుగు: దేశరాజ్పల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం దేశరాజ్పల్లి గ్రామానికి చెందిన బోడిగె నర్సయ్య(60) అనే వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సయ్య కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వెలిచాలలోని అనాథ ఆశ్రమంలో జీవనం సాగించినట్లు చెప్పారు. ఇటీవల గ్రామానికి వచ్చిన నర్సయ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ శనివారం గ్రామ శివారులో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే గూడ్స్ రైలు సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
జమ్మికుంట: మున్సిపల్ పరిధి ఫ్లైఒవర్ బ్రిడ్జిపై 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జోడు కుమార్(27) మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి బైక్పై వస్తున్నాడు. మున్సిపల్ పరిధి కొత్తపల్లి ఫ్లైఒవర్ దిగువకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న రామన్నపల్లి గ్రామానికి చెందిన పురెల్ల మధుకర్ అనే వ్యక్తి అజాగ్రత్తగా అతివేగంగా బైక్తో ఢీకొట్టాడు. డివైడర్పై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ మృతిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన నందయ్య (68) ఒంటరి తనం భరించలేక గతనెల 27న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడని రూరల్ ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. నీటి సంపులో పడి బాలుడు..వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతాల్ఠాణాలోని లింగంపల్లి రవి–స్వప్న దంపతుల కుమారుడు లింగంపల్లి రిషి(6) శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి మృతి చెందాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో రిషి ఇంటి వద్దే ఉన్నాడు. ఈక్రమంలో ఆడుకుంటూ వీరి ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న గుర్రం బాలకిషన్ ఇంటి వద్ద గల నీటి సంపులో పడి మృతిచెందాడు. విద్యుత్షాక్తో రైతు..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన చింతల రమేశ్ (49)అనే రై తు శనివారం పొలంమడికి నీరు పెట్టేందుకు ఉపక్రమిస్తుండగా విద్యుత్షాక్తో అక్కడికక్కడే మరణించాడు. పొలం దున్నేందుకు వీలుగా మడిలో నీరు నింపేందుకు విద్యుత్ మోటారును ఆన్చేసే సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు రూరల్ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సంధ్య, కుమారులు ప్రశాంత్, పవన్కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
అప్పుడే బాగుండేది
మేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి. – నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్ కలిసిమెలిసి ఉండేవాళ్లం మేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి. – లద్దునూరి తిరుపతి, నారాయణపూర్ ఎవరి పనిలో వారు బిజీ ఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. – ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట -
స్నేహితురాళ్లు అవమానించారని ఇంజినీరింగ్ విద్యార్థిని..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన కాటిపల్లి నిత్య(21) తన స్నేహితులు కళాశాలలో, హాస్టల్లో మానసికంగా వేధించారని, క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిత్య హైదరాబాద్లోని రిషి ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదివే వైష్ణవి, సంజన కొద్ది రోజులుగా చదువులో వెనుకబడ్డావని, హేళన చేస్తూ తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. మనస్తాపానికి గురై ఈనెల 1న ఇంటికి వచ్చింది. 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యుల సూచనతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తండ్రి కాటిపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలటౌన్: మొక్కలను నాటడంతో పాటు సంరక్షించడం ప్రధానమని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం–2025 సందర్భంగా జగిత్యాల సహకార సంఘంలో శుక్రవారం వనమహోత్సవం నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట సహకారశాఖ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలోని అన్ని సహకార సంఘాల్లో ఒకేరోజు 2,500 మొక్కలు నాటామని జిల్లా సహకారాధి కారి మనోజ్కుమార్ తెలిపారు. ఆర్డీవో మధుసూధన్, జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, సంఘ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. రోశయ్యకు నివాళి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతిని కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ సత్యప్రసాద్ రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వ్యాధులు ప్రబలకుండా చూడాలి ప్రతి మున్సిపాలిటీలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. అమినీబాద్లో శుక్రవారం పర్యటించా రు. కూలర్లు, వాడి పడేసిన పాత టైర్లు, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ గ్లాసులు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూడాలని ఆదేశించారు. నీరునిల్వ ఉన్న చోట ఆయిల్బాల్స్ వేయాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన పాల్గొన్నారు. సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలి సీఎంఆర్ బకాయిలు వెంటనే చెల్లించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. రా, బాయిల్డ్ రైస్మిల్లర్లతో సమావేశం అయ్యారు. సీఎంఆర్ చెల్లింపులు ఈనెల 27తో ముగుస్తున్నాయని, నిర్ణీత గడువులోగా మిల్లర్లు చెల్లించాలని ఆదేశించారు. లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఎస్వో జితేందర్రెడ్డి పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్చార్జి డీఈవో సత్యనారాయణ, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
రెండు పోస్టులు.. ఒక్క అధికారి
మల్యాల: ఓ వైపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద బందోబస్తు పర్యవేక్షణ.. మరోవైపు మండలంలోని 19 గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన.. ఇంకో వైపు ఆలయానికి, మండలానికి వచ్చే అధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రొటోకాల్ నిర్వహణ.. పెట్రోలింగ్, ఇతర కేసుల దర్యాప్తుతో పని ఒత్తిడి ఉంటుందని మల్యాల పోలీసుస్టేషన్కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. కొన్నాళ్ల పాటు కొనసాగగా.. తరువాత ఒక్క ఎస్సైతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో సత్వర సేవలు అందక మండల ప్రజలు స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. రెండో ఎస్సై పోస్టు ఉన్నా లేనట్టే అన్నచందంగా మారిందని పేర్కొంటున్నారు. బాధితుల పడిగాపులు.. మండలంలో 19 గ్రామాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఉండడంతో మల్యాల మండల పోలీస్స్టేషన్కు గతంలో ఇద్దరు ఎస్సైలను కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులు, ప్రముఖుల భద్రత కోసం రెండో ఎస్సైకి విధులు కేటాయించేవారు. మండలంలోని సగం గ్రామాలతోపాటు ప్రొటోకాల్ విధులు నిర్వర్తించేవారు. కొన్నాళ్లు రెండో ఎస్సై కొనసాగగా.. ఐదేళ్లుగా ఒక్క రే ఎస్సై విధులు నిర్వహిస్తున్నారు. సదరు అధికారి జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుండడంతో ఫిర్యాదుదారులు రోజంతా స్టేషన్ వద్ద ఎస్సై కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాబాస్ దృష్టిసారించాలి మల్యాల పోలీస్స్టేషన్పై జిల్లా పోలీస్బాస్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు కోరుతున్నారు. పోలీస్స్టేషన్ పరిధిలోని కొండగట్టు ఆలయం, ప్రముఖుల పర్యటనలు, తరచూ జరుగుతున్న నేరాల పర్యవేక్షణతో ఉన్న ఒక్క ఎస్సైకి భా రం పడుతోందని అంటున్నారు. రెండో ఎస్సై పోస్టు ను తక్షణమే భర్తీ చేయాలని కోరుతున్నారు. ‘ప్రస్తు తం సిబ్బంది కొరత ఉంది. కొత్త అధికారులు రాగా నే మల్యాల పోలీసుస్టేషన్కు రెండో ఎస్సైని నియమిస్తాం’ అని ఎస్పీ అశోక్ కుమార్ వివరించారు. మల్యాల పోలీస్స్టేషన్లో రెండో ఎస్సై లేక ఇబ్బంది గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ఫిర్యాదుదారులు ప్రొటోకాల్, ఫీల్డ్ ఎంకై ్వరీలతో ప్రస్తుత ఎస్సై బిజీబిజీ -
గోరింట పూసింది
అంజన్నకు వరదపాశం వైభవంగా బోనాలు7జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాల అగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదురోజుల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 29–32 డిగ్రీల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రతలు 25–26 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ ఉదయం 79–84శాతం, మధ్యాహ్నం 56–63శాతం నమోదయ్యే అవకాశముందన్నారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.మల్లాపూర్/మల్యాల: ఆషాఢమాసంలో గోరింటాకు సందడి కనిపిస్తోంది. మహిళకు ఎంతో ఇష్టమైన గోరింటాకును పెట్టుకుంటూ.. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లాపూర్ మోడల్ స్కూల్లో శుక్రవారం గోరింటాకు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీచర్లు, విద్యార్థినులు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. మల్యాలలో ఉషోదయ మండల సమాఖ్య ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహించుకున్నారు. స్థానిక సెర్ప్ కార్యాలయంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు ఆమని ఆధ్వర్యంలో వీవోఏలు రెండు చేతులకు గోరింటాకు పెట్టుకొని సంబురాలు చేసుకున్నారు.మల్యాల: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ మల్యాల మండలం ముత్యంపేటలో రైతులు శుక్రవారం వరదపాశం నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి బిందెలతో జలాభిషేకం చేశారు. దిగువ కొండగట్టు వద్ద విగ్రహం వద్దకు వెళ్లి, బెల్లంతో కూడిన వరదపాశం నైవేద్యంగా సమర్పించారు. మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, పాక్స్ డైరెక్టర్ సంత ప్రకాశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఇబ్బంది లేకుండా చూస్తాం వ్యర్థాలు తొలగించాలి మున్సిపాలిటీల్లో 100 రోజుల కార్యాచరణలో భాగంగా డ్రైనేజీలు, వాగులు, ప్రభుత్వ భూములలో సీల్టు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నాలాలను శుక్రవారం పరిశీలించారు. గోవిందుపల్లి కాలనీ, గంజ్రోడ్, శంకులపల్లిలో ఉన్న నాలాలను వెంటనే శుభ్రపర్చాలని ఆదేశించారు. ప్రైవేటు భూ ముల యజమానులు తమ భూ ముల్లోని ముళ్లపొదలను తొలగించకపోతే జరిమానాలు విధించి ఆ డబ్బుతో శుభ్రం చేయాలన్నారు. కలెక్టర్ వెంట కమిషనర్ స్పందన, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.ప్రధాన మురుగు కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. 100 రోజుల ప్రణాళికలో భాగంగా నాలాలోని చెత్తాచెదారం తొలగించడం జరిగింది. పూర్తిస్థాయిలో తీయించేలా చర్యలు తీసుకుంటున్నాం. వర్షకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం.– స్పందన, మున్సిపల్ కమిషనర్ -
నాలా.. ఇలా ఉంటే ఎలా?
● జిల్లాకేంద్రంలో ప్రమాదకరంగా నాలాలు ● సిల్టు తీయరు.. పిచ్చిమొక్కలు తొలగించరు ● ఏ కాలువ నీరు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి ● ఇళ్లలోకి నీరు చేరుతోందని ఆవేదన ● జగిత్యాల ప్రజలకు ముంపు ముప్పు ● తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకోలుజగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రధాన నాలాలు ప్రమాదకరంగా మారాయి. పిచ్చిమొక్కలు పెరగడం, సీల్టు తీయకపోవడంతో వర్షం కురిస్తే డ్రైనేజీ పొంగి మురుగునీరు ఆయా కాలనీల్లోని ఇళ్లలోకి చేరుతోంది. ఏ కాలువ నీరు ఎటు నుంచి వెళ్తోందో తెలియని పరిస్థితి. వర్షాకాలానికి ముందే చర్యలు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా భారీ వర్షాలు కురిస్తే డ్రైనేజీలు పొంగే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. గంజ్రోడ్ నుంచి వెళ్లే నాలా 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాలా పరిసరాల్లోని ప్రజలు దుర్గంధం, దోమలు, పందులు, ఈగలతో ఇబ్బంది పడుతున్నారు. చింతకుంట నుంచి వచ్చే అతిపెద్ద నాలా శంకులపల్లి కాలనీ వరకు వెళ్తుంది. పిచ్చిమొక్కలు, తుంగ పెరగడంతో కాలువ కన్పించని పరిస్థితి నెలకొంది. జాంబాగ్ ప్రాంతంలో ఉన్న కాలువ ప్రజల కు ఇబ్బందికరంగా మారింది. వెంకటాద్రినగర్లోని కాలువ పొంగినప్పుడు కాలనీవాసులు వరద తగ్గే వరకు జగిత్యాలకు రాలేని పరిస్థితి నెలకొంది. గంజ్రోడ్, గోవిందుపల్లి, మోతె, చింతకుంట చెరువు సమీపంలో నాలాల వెంట రక్షణగోడ లేకపోవడంతో చిన్నపిల్లలు, మహిళలు అటుగా వెళ్తే అందులో పడే పరిస్థితి నెలకొంది. వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక నిధులతో నాలాల్లో సీల్టుతీసి, మరమ్మతు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇది జిల్లా కేంద్రంలోని చింతకుంట నుంచి వచ్చే ప్రధానమైన నాలా. శంకులపల్లి వరకు ఉంటుంది. పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో పాటు వ్యర్థాలు పడేయడంతో కుంటను తలపిస్తోంది. శంకులపల్లి ప్రాంతంలో పొలాలు ఉండటంతో డ్రెయినేజీ నీరంతా పొలాల్లో పారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిచ్చిమొక్కలు తొలగించాలని కాలువ వెంట ఉన్న కాలనీవాసులు కోరుతున్నారు. ఇది గోవిందుపల్లి ప్రాంతంలోని ధరూర్ నుంచి వచ్చే పెద్ద కాలువ. వర్షం వచ్చిందంటే నాలా ఉప్పొంగి పట్టణంలోని వెంకటాద్రినగర్కు రాకపోకలు స్తంభించిపోవాల్సిందే. ఈ కాలువలో పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, చిరిగిన పరుపులు, బీరువాలు, పాతవస్తువులన్నీ ఇందులోనే పడేస్తున్నారు. ఫలితంగా వర్షం కురిస్తే నాలా పొంగి ఇళ్లలోకి మురుగునీరు చేరుతోంది. ఇది కూడా గంజ్ నుంచి వెళ్లే ప్రధానమైన నాలా. సిటీ మధ్యలో ఉంటుంది. కొన్ని చోట్ల కాలువకు రక్షణగోడ లేకపోవడంతో వర్షాకాలంలో నాలా పొంగితే ప్రమాదాలు జరిగే అవకాశముంది. సీల్టు తీయకపోవడం, పిచ్చిమొక్కలు అత్యధికంగా ఉండటంతో కాలువ వెంట ఉండేకాలనీవాసులు దోమలతో సావాసం చేస్తున్నారు. ఇది గంజ్రోడ్లోని నాలా. పూర్తిగా సీల్టుతో నిండిపోవడంతో మురికినీరు ఎటూ వెళ్లలేని పరిస్థితి. కాలువ సిటీమధ్యలో ఉండడంతో వర్షం పడితే డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీల్టు తీసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
● ఎస్పీ అశోక్కుమార్ ఇబ్రహీంపట్నం: విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, పోలీసుస్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్కుమార్ సిబ్బంది కి సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎస్పీ రాములు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం పోలీస్ కీట్లను పరిశీలించారు. స్టేషన్లో రికార్డులు, కేసుల నమోదు వివరాలు, క్రైం వివరాలపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. సీఐ అనిల్కుమార్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల ఎస్సైలు అనిల్, రాజు, శ్రీధర్ పాల్గొన్నారు. రోశయ్యకు నివాళి జగిత్యాలక్రైం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రిగా రోశయ్య ఘనత సాధించారని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రోశయ్య జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, ఐటీకోర్ ఇన్స్పెక్టర్ రఫీక్ఖాన్, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
దొడ్డి కొమురయ్యకు నివాళి
జగిత్యాలటౌన్: తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ బీఎస్.లత కొనియాడారు. దొడ్డి కొమురయ్య వర్ధంతిని శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సునీత, మైనార్టీ అధికారి ఆర్ఎస్.చత్రు పాల్గొన్నారు. జగిత్యాలలోని 1వ వార్డులో ఉన్న దొడ్డికొమురయ్య విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు ముసిపట్ల లక్ష్మీనారాయణ తదితరులు నివాళి అర్పించారు. రైతు సేవల్లో సహకార సంఘాలు కీలకం కథలాపూర్/మల్లాపూర్: రైతులకు సేవలందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్, జిల్లా ఆడిట్ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా సహకార సంఘాలు అందిస్తున్న సేవలపై శుక్రవారం కథలాపూర్, మల్లాపూర్ జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించి పంటల పెట్టుబడికి ప్రోత్సాహం ఇస్తున్నామని వివరించారు. రైతులతోపాటు వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. ఎంఈవోలు శ్రీనివాస్, దామోదర్రెడ్డి, మల్లాపూర్ తహసీల్దార్ రమేశ్గౌడ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి మల్యాల: విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించడంతోపాటు, సబ్జెక్టులవారీగా సామర్థ్యాన్ని పరీక్షిస్తూ, వారి భవిష్యత్ను ఉన్నతంగా తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బొప్పరాతి నారాయణ సూచించారు. మల్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం సందర్శించారు. అధ్యాపకుల హాజరు రిజిస్టర్లు, కార్యాలయ రికార్డులు పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుతూ భవిష్యత్ను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. అధ్యాపకులు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని పేర్కొన్నాఇన్చార్జి ప్రిన్సిపాల్ జి.వాణి, అధ్యాపకులు అత్తినేని శ్రీనివాస్, మహమ్మద్ నవాబ్, వేనపెల్లి సంధ్య, లైబ్రేరియన్ సంపత్కుమార్ పాల్గొన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి జగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభ్యున్నతికి కృషి చేస్తోందని డీఆర్డీ ఏ పీడీ రఘువరణ్ పేర్కొన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో ఇందిర మహిళ శక్తి పెట్రోల్బంక్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలో జిల్లా మహిళా సమైక్యకు పెట్రోల్బంక్ మంజూరైందన్నారు. సెర్ఫ్ సీఈవో, కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. పెట్రో ల్ బంక్ను పూర్తిగా మహిళా సంఘ సభ్యులే నిర్వహిస్తారని, అందుకోసం జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించడం జరిగిందన్నారు. రూరల్ తహసీల్దార్ శ్రీనివా స్, జిల్లా సెర్ఫ్ ఏపీడీ సునీత, పెట్రోల్బంక్ ప్ర తినిధి హర్షవర్దన్, డీపీఎం విజయభారతి, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం పాల్గొన్నారు. -
అప్పుడే ఎరువుల కొరత..!
● జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో దొరకని యూరియా ● మరికొన్ని ప్రాంతాల్లో లభించని డీఏపీ ● ఎరువుల కోసం ఎగబడుతున్న రైతులు జగిత్యాలఅగ్రికల్చర్: పంటల సాగు పూర్తిస్థాయిలో ప్రారంభంకాకుండానే రైతులను ఎరువుల కొరత వేధిస్తోంది. పంటలకు వినియోగించే రసాయన ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం వంటి కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఏర్పడితే.. మేడిపల్లి, సారంగాపూర్ వంటి మరికొన్ని ప్రాంతాల్లో డీఏపీ కొరత రైతాంగాన్ని వేధిస్తోంది. మొక్కజొన్న, వరి సాగు చేస్తున్న రైతులు ఎరువుల కోసం సింగిల్ విండో కేంద్రాలు, ఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాల వద్ద గంటల తరబడి బారులు తీరుతున్నారు. దీనిని అదునుగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక రేట్లకు విక్రయించే పనిలో పడ్డారు. 4.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. వరి 3.10లక్షల ఎకరాలు, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర వంటి ఆరుతడి పంటలను లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సిన అవసరం ఉంది. యూరియా సింగిల్ విండో కేంద్రాల్లో అందుబాటులో లేదు. ప్రస్తుతం వరి నాట్లు వేస్తున్నందున తొలిదశ డీఏపీ అవసరం. ఆ ఎరువు కూడా అందుబాటులో లేదు. ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నా.. రైతులు డీఏపీ వాడేందుకే మొగ్గుచూపుతారు. కొరత అంటూ వదంతులు వానాకాలం సీజన్లో జిల్లాకు 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ అవసరమని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే యూరియా 7వేల టన్నులు, డీఏపీ వెయ్యి టన్నులు మాత్రమే జిల్లాకు వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో ఎరువులు దొరుకుతాయో.. లేదో.. అన్న సంశయంతో రైతులు ఒక్కసారిగా ఎగబడుతున్నారు. గతేడాది జూన్ వరకు 4138.669 టన్నుల యూరియా అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూన్ వరకే 7,641.460 టన్నులు అమ్ముడు పోయిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కొంతమంది రైతులు ప్రస్తుతం అవసరం లేకున్నా.. నిల్వ చేసుకుంటున్నారని, ఫలితంగా అక్కడక్కడ కృత్రిమ కొరత ఏర్పడుతోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గతేడాది గొల్లపల్లి మండలంలో 27.315 టన్నులు అమ్మగా.. ఈ ఏడాది ఇప్పటివరకే 284.050 టన్నులు అమ్ముడుపోయింది. మల్లాపూర్, మెట్పల్లి, మేడిపల్లి, కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, బీర్పూర్, బుగ్గారం, మల్యాల, పెగడపల్లి మండలాల్లో అత్యధికంగా రసాయన ఎరువులు వినియోగిస్తున్నట్లు తేలింది. కోత పెడుతున్న ప్రభుత్వం రైతులు పంటలకు అవసరం లేకున్నా.. రసాయన ఎరువులు వాడుతున్నారని గుర్తించిన కేంద్రం ఆ మేరకు కోత పెడుతోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఎరువుల భారం రైతులపై పడకుండా సబ్సిడీ ఇస్తోంది. 50 కిలోల డీఏపీ బస్తాకు రూ.1350, యూరియా రూ.300 చొప్పున అందిస్తోంది. డీఏపీకి ఉపయోగించే ముడి పదార్థాలను సౌదీఅరేబియా, చైనా, మొరాకో, రష్యా, జోర్డాన్ నుండి దిగుమతి అవుతోంది. మార్క్ఫెడ్ ద్వారా సొసైటీలకు.. మార్క్ఫెడ్ సంస్థ ద్వారా జిల్లాలోని 51 సొసైటీలకు రసాయన ఎరువులు అందుతాయి. ఎరువుల కంపెనీలు 50శాతం మార్క్ఫెడ్కు.. మరో 50 శాతం ప్రైవేట్ డీలర్లకు ఇస్తోంది. అయితే ప్రైవేట్ డీలర్లకు వెళ్లే యూరియా, డీఏపీ ఎక్కడికి పోతుందో అనే దానిపై స్పష్టత లేదు. ప్రైవేట్ వ్యాపారులు రవాణా..హమాలీ ఖర్చులు చూసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే బస్తాపై రూ.50 నుంచి రూ.100 వరకు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. సొసైటీల ద్వారా ప్రభుత్వ ధరకే రసాయన ఎరువులు విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఎగబడుతున్నారు. వచ్చింది 450 బస్తాలు.. ఇచ్చింది 150 మందికి. ఇబ్రహీంపట్నం: మొక్కజొన్న పంటకు మొదటి దశ యూరియా వేయాల్సిన సమయం రావడం.. ఎరువు కొరతగా ఉండడంతో ఇబ్రహీంపట్నంలో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 బస్తాలతో లారీ లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ఉదయమే వచ్చి యూరియా కోసం వచ్చి ఎగబడ్డారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున 150 మంది రైతులకు పంపిణీ చేశారు. సుమారు 70 మంది రైతులు యూరియా దొరక్కపోవడతంఓ వెనుదిరిగి వెళ్లారు. ఈ ఏడాది 50 శాతం యూరియానే కేంద్రం సరఫరా చేస్తుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రెండు రోజుల్లో మరో 40 టన్నుల యూరియా సొసైటీకి వస్తుందని ఏవో రాజ్కుమార్ తెలిపారు. ఎరువులు సరఫరా చేయాలి నాట్లు వేస్తున్నాం. డీఏపీ దొరకడం లేదు. ప్రైవేట్ వ్యాపారులు అధిక రేటుకు విక్రయిస్తున్నారు. డీఏపీ వేయకుంటే వరి సరిగా కుదురుకోదు. మొక్కజొన్నకు మొదటి దశ కింద యూరియా వేయాల్సి ఉంది. అది కూడా సరిగ్గా దొరకడం లేదు. – చీటేటి జీవన్ రెడ్డి, తొంబర్రావుపేట ఎరువుల కొరత లేదు జిల్లాలో ఎరువుల కొరత లేదు. తప్పుడు సమాచారంతో.. అవసరం లేకున్నా రైతులు కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. సీజన్ను బట్టి.. నెలవారీగా జిల్లాకు రసాయన ఎరువులు వస్తాయి. మిర్చి, వరి, మొక్కజొన్నకు యూరియాను మోతాదు మించి వాడుతున్నారు. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
జ్వర బాధితులకు డెంగీ పరీక్షలు నిర్వహించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ రాయికల్: వర్షాకాలంలో జ్వరంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా డెంగీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ వైద్యులను ఆదేశించారు. మండలంలోని బోర్నపల్లి, ఇటిక్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులను పరిశీలించారు. రాయికల్ ఆస్పత్రిని తని ఖీ చేశారు. రోగుల వార్డులోకి వెళ్లి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులంతా సమయపాలన పాటించాలని సూచించారు. పరీక్షల కిట్లు అందుబాటులో లేకపోతే జిల్లాకేంద్రం నుంచి తెప్పించుకోవాలని కోరారు. రాయికల్ ఆస్పత్రిలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూపరిండెంట్కు సూచించారు. ఆయన వెంట వైద్య విధాన పరిషత్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, కమిషనర్ మనోహర్గౌడ్, ఆస్పత్రి సూపరిండెంట్ శశికాంత్రెడ్డి పాల్గొన్నారు. టీబీ చికిత్స అందించాలి జగిత్యాల: టీబీ వ్యాధి ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. టీబీ ముక్త్భారత్ అభియాన్లో భాగంగా సీజనల్ వ్యాధులపై కలెక్టరేట్లో సమీక్షించారు. ప్రతిరోజు డ్రైడే పాటించాలని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉంటే తొలగించాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, వరదలతో బాహ్యా ప్రపంచానికి సంబంధాలు తెగి పోయే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నా రు. గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. డీఎంహెచ్వో ప్రమోద్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 296 ఫాగింగ్ మిషన్లు, 336 హ్యాండ్పంపులు ఉన్నాయని, 31 వేల ఆయిల్బాల్స్ తయారు చేశామని, క్లోరినేషన్ చేయిస్తున్నామని తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
దుబ్బరాజన్న ఆలయానికి రెనోవేషన్ కమిటీ
సారంగాపూర్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దుబ్బరాజన్న ఆలయానికి దేవాదాయశాఖ 11 మంది సభ్యులతో రెనోవేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా కోండ్ర రాంచంద్రారెడ్డి, వాసం శ్రీనివాస్, కొలపాక రవి, పంగ కిష్టయ్య, పిన్నం సత్యనారాయణ, మానుక గంగమ్మ, రంగు శంకర్, మతులాపురం శంకర్, చెట్ల శేఖర్, సూర సత్యనారాయణరెడ్డి, ఉరుమడ్ల పోశాలు నియమితులయ్యారు. ఈ కమిటీ ఏడాది పాటు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమ నియామకానికి కృషిచేసిన దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, మాజీ మంత్రి జీవన్రెడ్డికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఇందిరమ్మపై ధరాభారం!
● ఒక్కసారిగా పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు ● ఇందిరమ్మ పథకం మొదలవగానే పెంచిన వ్యాపారులు ● సగటున ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం ● ప్రభుత్వం విడుదల చేసేది రూ.5 లక్షలు ● ఇంటి నిర్మాణానికి కావాల్సింది కనీసం రూ.10 లక్షలు ● స్థిరంగా కొనసాగుతున్న సిమెంట్, ఇసుక ధరలు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఇందిరమ్మ ఇంటిపై ధరాఘాతం అశనిపాతంలా మారింది. సామాన్యుడికి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ పథకంపై ధరల పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ నిర్మాణ సామగ్రికి అమాంతం డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా నిర్మాణ సామగ్రి ధరలు పెంచేశారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే ఇపుడున్న నిబంధనల ప్రకారం.. 600 నుంచి 800 చదరపు అడుగుల మేర నిర్మించుకునే అవకాశం ఉంది. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసేందుకు సిద్ధపడటాన్ని దళారులు అదనుగా తీసుకున్నారు. ఫలితంగా ప్రతీ ఇంటి నిర్మాణం మీద అదనపు భారం పడనుంది. ప్రతీ ఇంటిపై రూ.55 వేలకుపైగా భారం... ఇందిరమ్మ ఇంటికి నిర్మాణ సామగ్రి కీలకం. కట్రౌతు ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.1200, కంకర ట్రిప్పుకు రూ.1000, రూ.స్టీలు టన్నుకు రూ.2000, ఇసుక ట్రిప్పుకు రూ.1000, మొరం ట్రిప్పుకు రూ.200 చొప్పున ధరలను అమాంతంగా పెంచేశా రు. ఈ నిర్మాణ సామగ్రి లేకుండా ఏ ఇల్లూ పూర్తికా దు. సగటున చూసుకుంటే ప్రతీ ఇంటిపై తక్కువలో తక్కువ రూ.55 వేల నుంచి రూ.60 వేల పైచిలుకు భారం పడుతోంది. సిమెంట్ ధరలు పెరుగుతాయని అని ప్రచారం ఊపందుకుంది. దీన్ని వ్యాపారులు, అటు వినియోగదారులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో సిమెంటు ధరలు పెరిగే సూచనలేమీ కనిపించడం లేదు. అయితే, స్థానికంగా లభించే నిర్మాణ సామగ్రిపైనే వ్యాపారులు, దళారులు, మధ్యవర్తులు ధరలు పెంచి ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతీ లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.5లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితుల కారణంగా ఆ ఖర్చు రూ.10 లక్షల వరకు వెళ్తోంది. జిల్లా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైనవి లబ్దిదారుల బేస్మెంట్ స్లాబ్లెవల్ దరఖాస్తుల సంఖ్య సంఖ్య స్థాయి కరీంనగర్ 2,04,504 8,219 8,219 742 129 జగిత్యాల 1,99,965 7,601 7,601 209 30 పెద్దపల్లి 1,63,000 9,421 6,018 542 42 రాజన్నసిరిసిల్ల 1,26,124 7,826 7,826 317 90 మొత్తం 6,93,593 33,067 29,664 1,810 291సామగ్రి గతం ప్రస్తుతం పెరిగింది కట్రౌతు(ట్రిప్పు) రూ. 2,700 రూ. 3,900 రూ.1,200 కంకర(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 ఐరన్(టన్ను) రూ. 55,000 రూ. 57,000 రూ. 2,000 ఇసుక(ట్రిప్పు) రూ. 2,500 రూ. 3,500 రూ. 1,000 మొరం(ట్రిప్పు) రూ. 1,000 రూ. 1,200 రూ. 200 -
గోరింటా పండింది..
జగిత్యాలటౌన్/కోరుట్ల: జిల్లాకేంద్రంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆాసంలో.. కోరుట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాల్మీకి ఆవాసంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ పొందుతున్న మహిళలు, యువతులు, సేవాభారతి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోందని, మహిళలు ఇన్ఫెక్షన్లకు గురికాకుండా పనిచేస్తుందని తెలిపారు. స్వప్న, రమ, స్రవంతి, స్వరూప, కవోష్ణ, కవిత, వర్షిని, వైష్ణవి, కోరుట్లలో గోరింటాకు ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. -
పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు
మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని చిట్టాపూర్లో ఎంపీ ల్యాడ్స్ రూ.5లక్షలతో బోర్వెల్ నిర్మాణానికి భూమిపూజ చేసి ప్రోసిడింగ్ అందించారు. సీఎం రేవంత్రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, ప్యాక్స్ చైర్మన్ నేరెళ్ల మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక మొహర్రం కోరుట్ల: మత సామరస్యానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అయిలాపూర్ దర్వాజ వద్ద పీరీలను దర్శించుకున్నారు. మత సామరస్యంతో హిదూ, ముస్లింలు ఈ పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు. పులి వేషధారులతో ఫొటోలు దిగారు. కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ, డబ్బా గ్రామాల మధ్య లోలెవల్ వంతెన స్థానంలో కల్వర్టు నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు సురేష్రెడ్డి మంజూరు చేసిన రూ.1.50లక్షల పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎంపీ నిధులతో తాగునీటి వసతి మెట్పల్లి: పట్టణంలోని 24వార్డులో ఉన్న మసీదు, 17వార్డు కటిక సంఘ భవనాల వద్ద బోర్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రాజ్యసభ ఎంపీ నిధులు రూ.3లక్షలు బోర్ల ఏర్పాటుకు కేటాయించారని పేర్కొన్నారు. అంబులెన్స్లో పురుడు పోసిన 108 సిబ్బందిరాయికల్: మండలంలోని అల్లీపూర్కు చెందిన ఆకుల మౌనికకు పురిటి నొప్పులు రావడంతో బంధువులు 108కు సమాచారం అందించారు. రాయికల్ అంబులెన్స్ టెక్నీషియన్ రామ్, పైలట్ మల్లారెడ్డి చేరుకుని ఆమెను జగిత్యాలకు తరలించేందుకు సిద్ధపడ్డారు. మార్గంమధ్యలో పురిటినొప్పులు ఎక్కువై అంబులెన్స్లోనే పండంటి మగబిడ్డకు పురుడుపోశారు. అనంతరం తల్లీబిడ్డను జగిత్యాలలోని మాతా శిశు కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో 108 సిబ్బందిని పలువురు అభినందించారు. ఫీజుల దోపిడీని అరికట్టండిజగిత్యాలటౌన్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎన్జీవో) రాష్ట్ర అధ్యక్షుడు నక్క గంగారాం అన్నారు. ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం డీఈవోకు ఫిర్యాదు చేశారు. ఫీజుల నియంత్రణకు డీఎస్ఆర్సీ సమావేశం ఏర్పాటు చేయాలని, పాఠశాలల అకౌంట్ ఆడిట్, సొసైటీ ట్రస్టుల ఆడిట్లను ఆర్టీవో స్థాయి జుడిషియల్ అధికారుల ద్వారా చేయించాలని డిమాండ్ చేశారు. ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డుతోపాటు విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరారు. టీచర్లు, సిబ్బంది వేతనాలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి సంగెపు ముత్తు, పట్టణ అధ్యక్షుడు దేవుసింగ్రాథోడ్, జిల్లా కార్యదర్శి సాతారపు పద్మ తదితరులు ఉన్నారు. పోచమ్మతల్లికి బోనాలు రాయికల్: పట్టణంలోని కేశవనగర్లో పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు బోనాలతో పురవీధుల మీదుగా శోభాయాత్ర నిర్వహించారు. పోచమ్మతల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. -
పథకాలను ప్రజల వద్దకు చేర్చాలి
జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అలసత్వం వద్దని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలిజగిత్యాలక్రైం: సైబర్ నేరాలు, భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల నుంచి సైబర్ జాగృక్త దివాస్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, యువతకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలను నివారించడమే లక్ష్యంగా విద్యార్థులు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పిల్లలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగాం వాడకుండా తల్లిదండ్రుల జాగ్రత్తలు పాటించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ దిశగా కృషి చేయాలి మల్యాల: టీబీ ముక్త్ భారత్ దిశగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ అన్నారు. మల్యాల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఉప వైద్య,ఆరోగ్య శాఖ అధికారి ఎన్.శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నమోదైన రోగుల ఆన్లైన్ వివరాల నమోదును పరిశీలించారు. ఆన్లైన్ నమోదు త్వరగా పూర్తి చేసి, ఆరోగ్య సిబ్బంది ఇంటింటా తిరుగుతూ, టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించాలన్నారు. దీర్ఘకాలికంగా పొడిదగ్గు, జ్వరం, హఠాత్తుగా బరువు తగ్గినట్లయితే టీబీ పరీక్ష చేయించుకోవాలని, కార్యక్రమంలో వైద్యులు మౌనిక, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి రాయికల్: విద్యార్థులు చదువుతున్న సమయంలో శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని భూ భౌతిక శాస్త్రవేత్త లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం రాయికల్ మండలం ఇటిక్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి మాట్లాడారు. చిన్నతనం నుంచే శాస్త్ర విజ్ఞానాన్ని అలవర్చుకుంటే ప్రతి అంశంపై ఆలోచించే శక్తి పెరుగుతుందన్నారు. సైన్స్ టీచర్లు చెప్పే పాఠశాలను బట్టి పట్టడం కంటే అర్థం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం సదాశివ్, సైన్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఖాళీ ప్లాట్లు.. అనేక పాట్లు
జగిత్యాల/మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు పెద్ద సమస్యగా మారాయి. సంబంధిత యజమానులు వాటిని శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల వాటిలో పిచ్చి మొక్కలు దట్టంగా పెరగడమే కాకుండా చాలాచోట్ల వరద నీటి నిల్వతో మురికి గుంటలుగా తయారయ్యాయి. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా వీటి విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య ఉన్న కాలనీలు ఇవే.. ● బల్దియాలోని హన్మాన్నగర్, బీడీ కాలనీ, సాయిరాంకాలనీ, టీచర్స్ కాలనీ, సిద్ధి వినాయనగర్, బాలకృష్ణనగర్, అర్బన్ హౌజింగ్ కాలనీల్లో వందల సంఖ్యలో ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. ఇవి ఎన్నో సమస్యలకు దారి తీస్తున్నాయి. ● ప్రధానంగా వాటిల్లో పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగి పాములకు ఆవాసంగా మారుతున్నాయి. అవి ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ● అలాగే కొన్ని చోట్ల డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీరు వాటిల్లోకి వచ్చి చేరుతోంది. దీంతోపాటు వరద నీరు కూడా చేరి నిల్వ ఉండడంతో అవి మురికి కుంటలుగా తయారవుతున్నాయి. ● ఇలాంటి వాటితో దుర్వాసనను వెదజల్లడంతో పాటు దోమల బెడద ఎక్కువై ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు.. ● ఖాళీ ప్లాట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అవి మున్సిపల్ అధికారులకు పట్టడం లేదు. ● వాస్తవానికి నిబంధనల ప్రకారం..ఖాళీ ప్లాట్ల యజమానులు వాటిని శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. పిచ్చి మొక్కలు పెరగకుండా.. చెత్తాచెదారం పేరుకుపోకుండా.. మురుగు నీరు నిలిచి ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ● ఈ విషయంలో నిర్లక్ష్యం చూపే వారికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వాలి. దీనికి స్పందించకుంటే జరిమానా విధించే అవకాశముంటుంది. ● కానీ అధికారులు అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ● ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముంది. గతేడాది పెద్ద సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. ● కొన్ని రోజులుగా వార్డుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు.. అపరిశుభ్రతకు కారణమవుతున్న ఖాళీ ప్లాట్లను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాకేంద్రంలో.. ● జగిత్యాల.. గ్రేడ్–1 మున్సిపాలిటీ.. 48వార్డులు.. లక్షకు పైగా జనాభా ఉన్నా పారిశుధ్యం మాత్రం అస్తవ్యస్తంగా మారింది. ప్రతిరోజూ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించాల్సిన ఆటోలు, ట్రాక్టర్లు వెళ్లకపోవడంతో చెత్తను ఖాళీ స్థలా ల్లోనే పడేస్తున్నారు. మున్సిపాలిటిలో నాలుగు జోన్లు ఉన్నాయి. వార్డుకో ఆటో, జోన్కు మూడు ట్రాక్టర్లు నడుస్తుంటాయి. 48 వార్డులకు అవి సరిపోవడం లేనట్లు తెలుస్తోంది. కన్పించని డంపర్బిన్స్ ● ప్రధానమైన చోట్ల డంపర్బిన్స్ ఏర్పాటు చేస్తే చెత్త సమస్య ఉండదు. గతంలో ప్రతిచోట డంపర్బిన్స్ పెట్టారు. ప్రస్తుతం వాటన్నిటినీ ఎత్తివేశారు. దీంతో ఖాళీ స్థలాల్లోనే చెత్త పడేస్తున్నారు. పట్టించుకోని మున్సిపల్ అధికారులు సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ చిత్రం మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని సిద్ధివినాయకనగర్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ ప్లాట్లు. వీటిల్లో ఎక్కడికక్కడ దట్టంగా పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాముల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఖాళీ ప్లాట్లను శుభ్రం చేసే విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్రోడ్లోని గోవిందుపల్లికి వెళ్లే రహదారి. ఖాళీ స్థలం మొత్తం చెత్తతో నిండిపోయింది. బల్దియా ట్రాక్టర్లు, ఆటోలు రాక డ్రైనేజీలు తీయడం లేదు. చెత్త తీసుకెళ్లకపోవడంతో ఖాళీ స్థలంలోనే పడేస్తున్నారు. పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రిపూట ఉండలేకపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం మెట్పల్లి బల్దియా పరిధిలోని హన్మాన్నగర్లోనిది. ఈ కాలనీ నూతన గృహాల నిర్మాణంతో విస్తరిస్తోంది. ఇందులోనూ అక్కడక్కడ ఉన్న ఖాళీ ప్లాట్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. కొన్ని ప్లాట్లల్లో మొక్కలతో పాటు మురుగునీరు వచ్చి చేరింది. ఈ సమస్యతో పరిసరాలు కంపు కొడుతుండడమే కాకుండా దోమల బెడద ఎక్కువైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తబస్టాండ్ సమీపంలోని వాటర్ట్యాంక్ సంది. ఇక్కడ కమిషనర్ క్వార్టర్ కూడా ఉంటుంది. ఈ సమీపంలోనే అత్యధిక చెత్త పడేస్తున్నారు. కాలనీ మొత్తం దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది నర్సింగ్ కళాశాల సమీపంలోని ఖాళీ స్థలం. ఇందులో మట్టి, చెత్తాచెదారం పడేస్తున్నారు. దుర్వాసన వస్తోందని కళాశాల విద్యార్థులు పేర్కొంటున్నారు. ఖాళీ స్థలం కావడంతో ఇష్టానుసారంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తున్నారు. ఇది బైపాస్ ప్రధాన రోడ్. డ్రైనేజీని ఆనుకునే చెత్త వేస్తున్నారు. విరిగిపోయిన కూలర్లు, ఫ్యాన్లు, చెడిపోయిన బెడ్స్, చిని గిన బట్టలు ఇలా అనేక వస్తువులు అక్కడే పడేస్తున్నారు. అటు వైపు వెళ్తేనే దుర్గంధం వెదజల్లుతోంది. మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడ చెత్త వేయకుండా చూడటంతోపాటు, డంపర్బిన్ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
పేకాటపై సీసీఎస్ పోలీసుల నిఘా
● జిల్లాలో జోరుగా మూడుముక్కలాట ● చేతులు మారుతున్న కోట్ల రూపాయలుజగిత్యాలక్రైం: జిల్లాలో మూడుముక్కలాట జోరుగా సాగుతోంది. పోలీసులు నిఘా పటిష్టం చేసి.. రోజు కోచోట పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి నగదు సీజ్ చేస్తున్నారు. నిందితులపై కేసులు నమోదు చేస్తున్నారు. పేకాటతో వారి కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. నిత్యం జూదం కొనసాగుతుండటంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపో యి ఇ బ్బంది పడుతున్నాయి. కొంతమంది ఆస్తులు, బంగారం తాకట్టు పెట్టి పేకా డుతూ తీవ్రంగా నష్టపోతున్నారు. మామిడితోటలు, అడవుల్లో అడ్డా పేకాట రాయుళ్లకు మామిడితోటలు, అడవులు అడ్డాలుగా మారాయి. కొందరు నిర్వాహకులు కొంత మంది పేకాటరాయుళ్లను మచ్చిక చేసుకుని వారికి విందు, వసతులు ఏర్పాటు చేసి అక్కడికే పిలిపిస్తూ పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారు. స్థావరాల వద్ద ఉన్న రహదారులపై రహస్యంగా కాపలా ఏర్పాటు చేసుకుని పోలీసులు వస్తే సమాచారం రాగానే అక్కడి నుంచి పారిపోతున్నా రు. కొంతమంది మహారాష్ట్రలోని అప్పారావుపేట, బోరి, బిరేళీ, గోవా వంటి ప్రాంతాలకు వెళ్లి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న జూదరులు జిల్లాకేంద్రంతో పాటు పలు మండలాలు, గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో.. మామిడి తోటల్లో, ఫామ్ హౌస్లను వేదిక చేసుకుని పోలీసుల కళ్లు గప్పి పెద్ద ఎత్తున జూదం ఆడుతున్నారు. పోలీసులు జూదంపై కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిఘా పెంచిన సీసీఎస్ పోలీసులు జిల్లావ్యాప్తంగా సీసీఎస్ పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు పేకాటపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టుబడిన, నిర్వాహకుల వివరాలు సేకరిస్తూ సాంకేతికతతో సీసీఎస్ పోలీసులు వారిపై దాడులు చేస్తూ పేకాట రాయుళ్లకు అడ్డుకట్ట వేస్తున్నారు. పారిపోతున్న జూదరులు రహస్య ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో, మామిడి తోటల్లో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు దాడులు చేయగా, చాలామంది జూదరులు పోలీసుల కళ్లుగప్పి పారిపోతున్నారు. పోలీసులు దొరికిన వారి నుంచి కూపీ లాగడంతో పాటు అక్కడున్న వాహనాలను స్వాధీనం చేసుకుని అసలు నిందితులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఏడాది కేసులు నిందితులు పట్టుకున్న సొమ్ము(రూ.లలో) 2022 109 536 16,91,045 2023 78 473 18,66,696 2024 89 602 19,40,681 2025 71 447 16,68,520 -
వారాహిమాతకు లక్ష పుష్పార్చన
కోరుట్ల: పట్టణంలోని త్రిశక్తి మాతా దేవాలయంలో వారాహినవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి బుధవారం లక్ష పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు కట్ట నారాయణ, అధ్యక్షుడు గణేశ్, ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘సిగాచి’ మృతుల కుటుంబాలకు రూ.కోటి చెల్లించాలిజగిత్యాలటౌన్: హైదరాబాద్ శివారు పాశమైలారం సిగాచి రసాయన పరిశ్రమలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. బుధవారం లేబర్ కమిషనర్కు లేఖ రాశారు. సిగాజి రసాయన పరిశ్రమలో పేలుడు ఘటన భోపాల్ ఘటనను తలపించిందన్నారు. 46మందికి పైగా మృతి చెందడంతోపాటు పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. ఘటనపై ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కంపెనీ యాజమాన్యంపై హత్యానేరం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ హక్కులపై కేంద్రాన్ని నిలదీస్తాంవెల్గటూర్: తెలంగాణ రావాల్సిన నిధులు, హక్కులపై కేంద్రంపై పోరాటం చేస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మండలకేంద్రంలో పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కమీషన్ల కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోబోమని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలిపారు. సమస్య పరిష్కరించాల్సిన బీజేపీ చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదని, దీనిపై పార్లమెంట్లో నిలదీస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ గోపిక, నాయకులు తిరుపతి, ఉదయ్, శ్రీకాంత్రావు, సందీప్ రెడ్డి, వెంకటేశ్ ఉన్నారు. -
అందని ‘ఉపాధి’ కూలి
వస్తాయని చెబుతున్నారు ఏప్రిల్, మే నెలలో చేసిన పపనులకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు అడిగితే వస్తాయని చెబుతున్నారు. మండుటెండలను లెక్క చేయక ఉపాధిహామీ పనులకు పోయాం. దూరం ఎంతైన నడిచే వెళ్లాం. పనులు చేసి నెలల తరబడి పైసల కోసం ఎదురు చూస్తున్నాం. – మల్యాల విజయ, కూలీ పెగడపల్లి రెండు నెలల బిల్లు రావాలి రెండు నెలల కూలీ డబ్బులు రావాలి. పనులు చేసినా సకాలంలో వేతనాలు సరైన సమయంలో చెల్లించడం లేదు. ఎండకాలంలో ఉపాధి పనులకు వెళ్లాం. కానీ ఇప్పటి వరకు ఆ పనులకు సంబంధించిన వేతనాలు రాలేదు. పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులు చెల్లించాలి. లేకుంటే మాకు పస్తులే. – సాతి మల్లయ్య, పెగడపల్లిపెగడపల్లి: చేసిన పనికి కూలి అందక ఉపాధికూలీలు ఎదురుచూస్తున్నారు. పనులు చేసి రెండు నెలలు దాటినా ఖాతాల్లో నగదు జమ కావడంలేదని వాపోతున్నారు. అధికారులు స్పందించి డబ్బులు జమ చేయాలని కోరుతున్నారు. పేద కూలీలకు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఎండ, వాన లెక్కచేయకుండా ఉపాధిహామీ పథకం పనికి వెళుతున్నారు. వీరికి అందించాల్సిన వేతనాలు రెండు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. కుటుంబ పోషణ కష్టంగా మారుతోందని కూలీలు వాపోతున్నారు. ఉపాధి చట్టం ప్రకారం 14 రోజుల్లో చేసిన పనులకు కూలీ చెల్లించాల్సి ఉంటుంది. నెలల తరబడి కూలీ చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా అవస్థలు పాలవుతు న్నామని అంటున్నారు. నిత్యం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందంటున్నారు. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల పరిధిలో పనులను గుర్తిస్తూ ఉపాధిహామీ ద్వారా కూలీలకు పనులు కల్పిస్తూ ఆర్థిక భరోసానిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కూలీలు 1,38,823 మంది కూలీలు నమో దై ఉన్నారు. మొత్తం 1,67,461 జాబ్ కార్డులుండగా 1,00,723 యాక్టివ్ జాబ్ కార్డులున్నాయి. రెండు నెలలకు సంబంధించి రూ.1,25,26,813 పెండింగ్లో ఉన్నాయి. తమకు రావాల్సిన వేతనాలు చెల్లించి తమను ఆదుకోవాలని ఉపాధిహామి కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిధులు రాగానే ఖాతాల్లో జమ ఉపాధి పనులు చేసిన ప్రతి కూలికి డబ్బులు వస్తాయి. పనుల్లో పాల్గొన్న ప్రతి కూలీ వివరాలు ఆన్లైన్ చేశాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. రాగానే నేరుగా ఖాతాల్లో జమ చేస్తారు. – రఘువరన్ డీఆర్డీవో రెండు నెలలుగా నిలిచిన బిల్లులు జిల్లాలో రూ.1,25,26,813 బకాయిలు మొత్తం జాబ్ కార్డులు 1,67,461 యాక్టివ్ జాబ్కార్డులు 1,00,723 కూలీలు 1,38,823 -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలానికి చెంది న 99మందికి రూ.28.14 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, 86మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపి ణీ చేశారు. కాంగ్రెస్ రైతుపక్షపాతి ప్రభుత్వమన్నారు. సన్నబియ్యం, కరెంట్, ఇందిరమ్మ ఇళ్లు, రుణమాఫీ, మహిళసంఘాలకు ఆర్థిక చేయూత వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, నాయకులు ర వీందర్రెడ్డి, పాలెపు రాజు, ముకుందం, జాన్, మ ల్లారెడ్డి, బోనగిరి నారాయణ, నరేశ్ పాల్గొన్నారు. డేకేర్ ఏర్పాటు చేయండి జగిత్యాల: సీనియర్ సిటిజన్స్ కోసం డేకేర్ ఏర్పాటు చేయాలని సీనియర్ సిటిజన్స్ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన మంత్రి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రం ఏర్పాటు చేసేలా చూస్తానన్నారు. హరి అశోక్కుమార్, విశ్వనాథం, హన్మంతరెడ్డి పాల్గొన్నారు. పట్టణాభివృద్ధికి కృషి జగిత్యాల పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ.140 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రోడ్లు ఛిద్రం.. ప్రయాణం భద్రం
● అడుగడుగునా గుంతలే ● మరమ్మతు చేయించని వైనం ● అను నిత్యం ప్రమాదాలు ● వాహనదారులకు తిప్పలుజగిత్యాల: జిల్లాకేంద్రం.. పైగా గ్రేడ్–1 మున్సిపాలిటీ అయిన జగిత్యాలలో రోడ్లన్నీ ఛిద్రంగా మారాయి. అడుగు తీసి అడుగు వేయాలన్నా.. వాహనదారులు వెళ్లాలన్నా.. బస్సులు వెళ్లాలన్నా రహదారులన్నీ గుంతలమయంగా ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. జిల్లా కేంద్రం కావడంతో నిత్యం వందలాది మంది పనుల నిమిత్తం వస్తుంటారు. ప్రధాన కూడళ్లు అయిన కొత్తబస్టాండ్, పాతబస్టాండ్, తహసీల్ చౌరస్తా, టవర్సర్కిల్, బస్టాండ్ ఇన్గేట్, అవుట్గేట్, మున్సిపల్ చౌరస్తా, మోతె చౌరస్తాలో రోడ్లన్నీ అతిదారుణంగా ఉన్నాయి. ప్రతి చోట పెద్దపెద్ద గోతులు ఉండటంతో వాహనదారులు అందులో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలం అందులో నీరు నిలిచి ఏర్పడకపోవడంతో నేరుగా వాహనదారులు వచ్చి అందులో పడుతున్నారు. వాహనాలు దెబ్బతినడంతోపాటు, వాహనదారులు గాయాలపాలవుతున్నా రు. ఉన్నతాధికారులు స్పందించి గుంతలకు మరమ్మతు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని పార్క్ నుంచి కొత్తబస్టాండ్కు వెళ్లే రహదారి. ఇటీవల అటువైపుగా ఉన్న సీసీరోడ్డును పని నిమి త్తం తవ్వి వదిలేశారు. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది మంది వెళ్తుంటారు. ఇందులో కనీసం రోజుకు 2– 3 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్తబస్టాండ్కు వెళ్లాలంటే ఇదే రహదారి. కనీసం మరమ్మతు చేపట్టడం లేదు. ఇది పాతబస్టాండ్ చౌరస్తా. ఇక్కడ వందలాది వాహనాలు, ప్రయాణికులు వెళ్తుంటారు. సీసీరోడ్డంతా ఛిద్రంగా మారడంతో పాదచారులకు కష్టతరంగా మారింది. పాఠశాలలు విడిచిన సమయంలో ప్రతిఒక్కరూ ఈ రోడ్డుమీదుగానే వెళ్తుంటారు. కనీసం రోడ్డుకు మరమ్మతులు చేయడం లేదు. ఇది జిల్లాకేంద్రంలోని వాణిజ్య ప్రాంతమైన టవర్సర్కిల్. ఇక్కడకు నిత్యం వందలాది మంది వస్తూపోతుంటారు. ఇక్కడ రోడ్డు మిషన్ భగీరథ పనుల నిమిత్తం రోడ్డంతా తవ్వి పైప్లైన్ వేసి వదిలేశారు. సక్రమంగా కూర్చోకపోవడంతో గుంతలమయంగా మారింది. వాహనదారులు వెళ్లాలన్నా, పాదచారులు నడవాలన్నా ఇబ్బందికరంగా మారింది. ఈ చిత్రం బైపాస్రోడ్లోని మోతె వెళ్లే రహదారిలోగల చౌరస్తా. నిత్యం వందలాది వాహనాలు ఇటువైపు వెళ్తుంటాయి. చౌరస్తా మధ్యలోనే పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహన ప్రమాదాలు అనేకంగా జరుగుతున్నాయి. వర్షం పడితే నీరు మొత్తం నిలిచి గుంతలు కనిపించకపోవడంతో అందులో పడి వాహనదారులు గాయాలపాలవుతున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కొత్తబస్టాండ్ చౌరస్తా. ప్రతి వాహనం ఈ రహదారి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. మార్గంమధ్యలోనే పెద్ద గుంత ఉండటం అందరికీ సంకటంగా మారింది. వర్షాకాలం కావడం, గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. చర్యలు చేపడతాం మున్సిపల్ పరిధిలో ఉన్న రోడ్లకు మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్నిచోట్ల మరమ్మతు చేపట్టాం. మరికొన్ని చోట్ల మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – స్పందన, మున్సిపల్ కమిషనర్ ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ ఇన్గేట్. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారు వాహనాలపై వెళ్తుంటారు. ఇది ప్రధాన రహదారి కావడం.. పెద్ద గుంత ఉండడంతో వాహనదారులు అదుపుతప్పి అందులో పడిపోతున్నారు. ఒకానొక సమయంలో బస్సులు కుదుపులకు గురవుతున్నాయి. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అలాంటి వారిపై రౌడీషీట్ ఓపెన్ చే యాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నేరాలపై సమీ క్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరి ష్కరించాలన్నారు. సీసీ కెమెరాల పనితీరును ప్రతిరోజూ చెక్ చేసుకోవాలన్నారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐ లు శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, రఫీక్ఖాన్, శ్రీని వాస్, సుధాకర్, కరుణాకర్, రాంనర్సింహా రెడ్డి, రవి, సురేశ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్కుమార్, వేణు, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో సిటీ పోలీస్యాక్ట్ అమలుశాంతిభద్రతల నేపథ్యంలో ఈ నెల 31 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజ లు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నర్సయ్యజగిత్యాలజోన్: జిల్లా అసిస్టెంట్ సెషన్స్ కోర్టు (సబ్ కోర్టు) అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బిట్ల నర్సయ్యను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సయ్య 25 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లాకు తేలికపాటి వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 31 నుంచి 32 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులు గంటలకు 13 నుంచి 22 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలిజగిత్యాలరూరల్: వర్షాకాలం నేపథ్యంలో సీజ నల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అ న్నారు. మంగళవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించారు. ఇళ్లలో శుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగునీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలని, ఎక్కడైనా నిల్వ ఉంటే ఆయిల్బాల్స్ వేయాలని సూచించారు. నీటిని శుద్ధి చేసుకుని తాగాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. మెడికల్ ఆఫీసర్ సౌజ న్య, లావణ్య, ఏఎన్ఎం సుగుణ పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఓటింగ్లో పాల్గొనాలి జగిత్యాలరూరల్: జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 ఓటింగ్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని ఎస్బీఎం జిల్లా కో–ఆర్డినేటర్ హరిణి అన్నారు. మంగళవారం ఐకేపీ కార్యాలయంలో గ్రామ సమైక్య అధ్యక్షులు, సిబ్బందికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ఓటింగ్పై అవగాహన కల్పించారు. పరిశుభ్రత ర్యాంకింగ్లో కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రత గురించి సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటోందని, ఓటింగ్లో స్వచ్ఛందంగా పాల్గొని జిల్లా ప్రథమస్థానంలో ఉండేలా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో 10 శాతం ప్రజలు ఓటింగ్లో పాల్గొనేలా చూడాలని, యాప్లో అడిగే 13 రకాల ప్రశ్నలకు ఓటింగ్ ద్వారా జవాబు తెలపాలన్నారు. -
స్వశక్తి సంఘాల నిర్వహణ బాధ్యతగా తీసుకోవాలి
జగిత్యాలరూరల్: స్వశక్తి సంఘాల నిర్వహణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పాలమూరు మహా సమైక్య రిసోర్స్ పర్సన్స్ శ్రీలత, సుధారాణి అన్నారు. జిల్లాకేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఇటీవల గ్రామాల్లో ఎంపికై న గ్రామ సంఘం అధ్యక్షులకు మంగళవారం శిక్షణ కల్పించారు. సెర్ప్ ఇందిరాక్రాంతి పథం ముఖ్య ఉద్దేశాలు, లక్ష్యాలు, 25ఏళ్లలో సాధించిన ప్రగతి అంశాలపై వివరించారు. ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమాలతోపాటు సెర్ప్ సిబ్బంది వీవోఏలు విధులు, బాధ్యతలు, గ్రా మ సంఘం బాధ్యతలు, గ్రామ సంఘం ద్వా రా స్వశక్తి సంఘాల పర్యవేక్షణ, పుస్తకాల నిర్వహణ, కట్టుబాట్లు, అమలు, ఉత్తమ గ్రామ సంఘం, మహాసభ అధికారాలపై వివరించారు. ఏపీఎం గంగాధర్, సీసీ విద్యాసాగర్, మండల సమైక్య అధ్యక్షురాలు దేశవేని గంగభవాని, కార్యదర్శి జమున, కోశాధికారి సుమలత, సిబ్బంది పద్మ, సురేందర్, అశోక్ పాల్గొన్నారు. కార్మికుల సమ్మె నోటీసుజగిత్యాల: తమ సమస్యలు పరిష్కరించాలని, తాగ్యాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కా ర్మికులు లేబర్ ఆఫీసర్కు మంగళవారం సమ్మె నోటీస్ అందించారు. నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటిని అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కార్మిక సంఘం నాయకులు అన్నారు. దేశంలోని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈనెల 9న సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. నాయకులు సుతారి రాములు, శ్రీకాంత్, ముక్రం, లక్ష్మీ, భూమేశ్వర్ పాల్గొన్నారు. -
జగిత్యాలలో జగన్నాథ రథయాత్ర
జగిత్యాలటౌన్: జిల్లా కేంద్రంలో ఇస్కాన్ మెట్పల్లి ఆధ్వర్యంలో మంగళవారం జగన్నాథ రథయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్వామివారికి పూజలు చేసి రథాన్ని లాగి భక్తులను ఉత్తేజ పరిచారు. యావర్రోడ్డు, తహసీల్ చౌరస్తా, మోచీబజార్, క్లాక్టవర్, న్యూబస్టాండ్, నటరాజ్ చౌరస్తా మీదుగా రథయాత్ర సాగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంకీర్తన, ప్రవచనం, మహాహారతి నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు కృష్ణప్రాన్జీవన్దాస్, ప్రేమానంద్గోవింద్దాస్, సురనాథ్శ్రీనివాస్దాస్ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’ వేగం పెంచాలి
మెట్పల్లి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గసాగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పనులను మంగళవారం పరిశీలించారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యవేక్షిస్తూ నిర్మాణాలు గడువులోగా పూర్తయ్యేలా లబ్ధిదారులు, మేసీ్త్రలను అప్రమత్తం చేయాలన్నారు. ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, గృహ నిర్మాణశాఖ అధికారి వాసం ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మహేశ్వర్రెడ్డి ఉన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు కోరుట్ల: నవోదయ విద్యాలయానికి కేటాయించిన భవనంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేయనున్న నవోదయ భవనాన్ని పరిశీలించారు. విద్యుత్ సౌకర్యం, తలుపులు, కలర్స్, నీటిసౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఆర్డీవో జివాకర్రెడ్డి, తహసీల్దార్ కృష్ణచైతన్య పాల్గొన్నారు. తాత్కాలిక భవనం ఏర్పాటు చేయాలి మెట్పల్లి:మెట్పల్లిలో శిథిలావస్థలో ఉన్న ఉన్నత పాఠశాల భవనాన్ని రెండు రోజులుగా కూల్చివేస్తున్నారు. ఆ పనులను కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జూనియర్ కళాశాల గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నా.. పక్షం రోజుల్లో తాత్కాలిక భవనాన్ని చూసి అందులోకి తరలించాలన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
చికిత్స పొందుతూ వలసజీవి మృతి
● ఈనెల 3న గల్ఫ్ వెళ్లేందుకు ఏర్పాట్లు ● అంతలోనే కుటుంబంలో విషాదం కథలాపూర్: మండలంలోని దుంపేటకు చెందిన పాట్కురి ప్రతాప్రెడ్డి (58) గతనెల 28న మెట్లపై నుంచి పడి గాయపడగా.. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. ప్రతాప్రెడ్డి ఈనెల 3న మస్కట్ దేశం వెళ్లాల్సి ఉంది. అంతలోనే మృత్యువాతపడటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం దుంపేటకు చెందిన ప్రతాప్రెడ్డి కొన్నాళ్లుగా మస్కట్ వెళ్లి వస్తున్నాడు. నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చారు. తిరిగి ఈనెల 3న మస్కట్ వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో జూన్ 28న ప్రతాప్రెడ్డి తన ఇంటిపై నుంచి మెట్ల ద్వారా దిగుతుండగా.. జారిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రతాప్రెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్కుమార్ వివరించారు. -
విద్య వ్యాపారం కాదని..
సారంగాపూర్: ప్రస్తుతం విద్యను వ్యాపారం చేశారని.. కాదని చెప్పేందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నట్లు గొడుగు మధుసూదన్ తెలిపారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన మధుసూదన్ కండ్లపల్లిలో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమార్తె నిత్య 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంటర్మీడియట్లో చేరింది. చిన్న కూతురు శ్రీనిధి నర్సింహులపల్లిలో ని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కండ్లపల్లిలో విధులు నిర్వహిస్తూనే నర్సింహులపల్లిలోని స్కూల్కు వెళ్లి అదనంగా ఒక పీరియడ్ బోధిస్తున్నారు మధుసూదన్. -
నాన్న వెంటే పిల్లలు
కరీంనగర్స్పోర్ట్స్: తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను తీసుకెళ్తున్నారు ఈ తండ్రులు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను సర్కార్ బడులకు పంపుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం వేములవాడలోని జెడ్పీ హైస్కూల్(బాలికలు)లో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు కరీంనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ పిల్లలనూ అక్కడే చదివిపించేవారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో తాను పనిచేస్తున్న స్కూల్కే తన పిల్లలను తీసుకెళ్తున్నారు. పెద్ద కూతురు అనన్య ప్రభాస 8వ తరగతి, చిన్నకూతురు ప్రవస్థి 5వ తరగతి చదువుతున్నారు. -
బోధనపై నమ్మకంతో..
వేములవాడ: కథలాపూర్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కిష్టయ్య తన కూతురు మధురిమను వేములవాడలోని బాలికల హైస్కూల్లో చేర్పించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే చేర్పించినట్లు కిష్టయ్య పేర్కొన్నారు. జమ్మికుంట: ప్రభుత్వ పాఠశాలలో బోధనపై నమ్మకం కల్పించేందుకు తన కుమారుడిని చేర్పించినట్లు టీచర్ బానోత్ సత్యజోస్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలోని స్కూల్లో సత్యజోస్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం బదిలీపై పర్లపల్లి పాఠశాలకు వచ్చారు. తన కొడుకు బానోతు సుశాంత్ను జమ్మికుంట హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. -
పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి
● ప్రభుత్వ పాఠశాలకు పంతుళ్ల పిల్లలు ● నమ్మకం కల్పిస్తున్న టీచర్లు ● స్ఫూర్తి పొందుతున్న తల్లిదండ్రులు ● సర్కార్ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు తాము పనిచేస్తున్న సర్కార్ స్కూళ్లపై నమ్మకం పెంపొందించడం.. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా టీచర్లు తమ పిల్లలను తమతో పాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొలువు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు పంపడం సరికాదని.. సర్కార్ స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన సాగుతోందంటూ టీచర్లు చాటిచెబుతున్నారు. పిల్లలను తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు. కథలాపూర్(వేములవాడ): మండలంలోని దుంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లింగంపేట సతీశ్ తన కొడుకు వరుణ్తేజ్ అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన తీపిరి సంజీవ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కుమారుడు జయసూర్యని కూడా అదే పాఠశాలలో రెండో తరగతి చదివిస్తున్నారు. ప్రతి రోజూ తండ్రీకొడుకులు బైక్పై స్కూల్కు వెళ్లి వస్తున్నారు. -
‘ఇందిరమ్మ ఇళ్ల’కు రూ.లక్ష రుణం
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేవారికి సెర్ప్ ద్వారా రూ.లక్ష రుణం అందించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. మండలకేంద్రంలో సీఎంఆర్ఎఫ్ రూ.12.48 లక్షలు, కల్యాణలక్ష్మి రూ.31లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణం ఆర్థిక కారణాలతో జాప్యం జరగొద్దన్న ఉద్దేశంతో మహిళా సంఘాల నుంచి రుణం అందిస్తామని, దీనిపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పెంబట్ల బీరయ్య ఆలయ నిర్మాణానికి సీజీఎఫ్ కింద రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తహసీల్దార్ ఎండి.వాహీదొద్దీన్, ఎంపీడీవో గంగాధర్, ఆర్ఐ వెంకటేశ్, ఎంపీవో సలీం పాల్గొన్నారు. జగన్నాథపూర్ బ్రిడ్జి కోసం కృషి రాయికల్: రాయికల్ మండలం బోర్నపల్లి–జగన్నాథపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి కోసం సీఎం రేవంత్రెడ్డి, కేంద్రమంత్రులను కలిశానని ఎమ్మెల్యే అన్నారు. బ్రిడ్జి మంజూరు కావడంపై జగన్నాథపూర్, బోర్నపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిశారు. రూ.4 కోట్లతో జగన్నాథపూర్లో చెక్డ్యాం నిర్మాణంతో వందలాది ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. గిరిజన, ఆదివాసుల నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, నాయకులు కోల శ్రీనివాస్, పాదం రాజు, కవిత, శ్రీనివాస్, గంగారాం, శంకర్, తులసి, అనిల్, నారాయణ, కాటిపల్లి గంగారెడ్డి, మర్రిపల్లి శ్రీనివాస్, గన్నె రాజిరెడ్డి, చంద్రశేఖర్, అనుపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 20 మందికి సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని సూచించారు. 35వ వార్డులో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలన్నారు. గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, లక్ష్మణ్, బాలె శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన పాత డీఎంహెచ్వో డాక్టర్ సమీయోద్దీన్, ధర్మపురి నీటిపారుదల శాఖ ఈఈ నారాయణరెడ్డిని సత్కరించారు. డీఎంహెచ్వో ప్రమోద్, చక్రునాయక్, డాక్టర్ శ్రీనివాస్, జైపాల్, రాంచందర్రావు పాల్గొన్నారు. ● ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ -
బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎస్పీ వారితో నేరుగా మాట్లాడారు. వారి సమస్యల ను తెలుసుకున్నారు. వాటిని తక్షణమే పరి ష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ రేషన్కార్డులు ● అదనపు కలెక్టర్ లత జగిత్యాల: అర్హులందరికీ రేషన్కార్డులు మంజూరు చేస్తామని అదనపు కలెక్టర్ లత అన్నారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 23,400 కొత్త రేషన్కార్డులు, 46,884 మందిని కార్డుల్లో నమోదు చేశామని తెలిపారు. రేషన్కార్డు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. 592 దుకాణాల ద్వారా మూడునెలలకు సంబంధించిన సన్నబియ్యం పంపిణీ చేశామన్నారు. గత వానాకాలం, యాసంగి సీజన్లో 6,437 ఏసీకేలు బకాయిలు ఉండగా.. రైస్మిల్లర్స్తో సమీక్షించి 14,481 ఏసీకేలు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. ధాన్యం దిగుబడి గతంలో కంటే 50వేల టన్నులు అదనంగా వచ్చిందని, రైస్మిల్లులకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసి వారి అకౌంట్లలో జమ చేశామన్నారు. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, అక్రమ నిల్వ చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరగా పరిష్కరించాలిఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సోమవారం సమావేశమైంది. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని సూచించారు. అట్రాసిటీ బాధితులకు నిధులు మంజూరు చేస్తున్నామని, అదేస్థాయిలో కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నా రు. అట్రాసిటీ బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.2కోట్ల కోసం ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మా ట్లాడుతూ.. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారని, మంత్రి సహకారంతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎీస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉద్యమకారులను గుర్తించాలని దీక్షజగిత్యాలటౌన్: తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ జవ్వాజి శంకర్ కోరారు. ఫోరం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట శాంతియుత దీక్ష చేపట్టారు. వీరికి ఉద్యమ జేఏసీ నాయకులు చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్శర్మ మద్దతు తెలిపారు. తెలంగాణ కోసం కవులు, కళాకారులు, ఉద్యమకారులు అహర్నిశలు కృషి చేశారని, వారి అండతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. జవ్వాజి శంకర్ మాట్లాడుతూ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. 250 చదరపు గజాల స్థలం, 25వేల పెన్షన్, హెల్త్కార్డులు అందించాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి గాజుల శ్రీనివాస్గౌడ్, వైస్ చైర్మన్ రాగుల రాజు, ప్రధాన కార్యదర్శి భారతపు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొలాస పరిశోధన స్థానం డైరెక్టర్గా హరీశ్కుమార్జగిత్యాలఅగ్రికల్చర్: పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్గా హరీశ్కుమార్ శర్మ నియమితులయ్యారు. ఇప్పటివరకు పనిచేసిన శ్రీలతను యాదాద్రిభువనగిరి డాట్ సెంటర్కు బదిలీ చేశారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా పనిచేస్తున్న సైదానాయక్ను హైదరాబాద్లోని రాజేంద్రనగర్కు బదిలీ చేశారు. పరిశోధన స్థానంలో పనిచేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు. -
సర్కార్ బడికి జైకొట్టి
పిల్లల చేయిపట్టి.. బడిపై నమ్మకం కల్పించాలని7దుబాయ్లో ఘనంగా బోనాలురాయికల్: దుబాయ్లోని ఎమిరెట్స్ తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ బోనాల పండుగను మైత్రి ఫర్మ్ అజ్మాలో ఘనంగా నిర్వహించారు. మహిళలు గౌరిదేవీకి పూజలు నిర్వహించిన అనంతరం బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. పోతురాజుల వేషధారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వ్యవస్థాపకులు పీచర్ల కిరణ్కుమార్, అధ్యక్షుడు చీటి జగదీశ్రావు, ఉపాధ్యక్షులు ఎలిగేటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోట్ల రాణి, సంయుక్త కార్యదర్శి శేఖర్గౌడ్, కోశాధికారి తిరుమల్గౌడ్, మహిళ సభ్యులు కస్తూరి మమత, పీచర్ల సారిక, అన్నపూర్ణ, సరోజ, జల, రనీష, స్వప్న, ప్రియ, విపుల, చంద్రలేఖ, లక్ష్మీ, శ్వేత, సుమజ, రమ్య, సంగీత పాల్గొన్నారు. ● తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన టీచర్లు ● స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఉద్యోగులుప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం.. గవర్నమెంట్ టీచర్లపై భరోసా పెంచాలనే పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని చెప్పేందుకే తాము పనిచేస్తున్న స్కూళ్లకు పిల్లలను తీసుకెళ్తున్నారు. సార్లే.. తమ పిల్లలను ఊరిలోని బడికి తీసుకొస్తుంటే.. మిగతా తల్లిదండ్రులు తమ పిల్లలనూ చేర్పిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం. తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు.రుద్రంగి(వేములవాడ): తన ముగ్గురు పిల్లలనూ సర్కార్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరునితండాకు చెందిన టీచర్ భూక్య తిరుపతి. రుద్రంగి ప్రైమరీ స్కూల్లో టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న భూక్య తిరుపతికి భూక్య ప్రీతిజ, భూక్య నిహారిక, భూక్య అయాన్ అద్వైత్ పిల్లలు. నిహారికను గతంలో తాను పనిచేసిన రుద్రంగి ప్రైమరీ స్కూల్కు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మానాలలోని స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి తన కొడుకు అయాన్ అద్వైత్ను అదే పాఠశాలకు వెంట తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూతుళ్లు భూక్య ప్రీతిజ 10వ తరగతి, భూక్య నిహారిక 7వ తరగతి.. గురుకులాల్లో చదువుతున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గుండేటి రవికుమార్–పద్మలత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు మండలంలోని పోసానిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల చిన్నకుమారుడు లౌకిక్ నాలుగో తరగతి వారు పనిచేస్తున్న పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. నిత్యం తమ వెంటే స్కూల్కు తీసుకెళ్తున్నారు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలకు పంపడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రుల బడికి కొడుకు -
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్కు చెందిన స్రవంతి కరీంనగర్రూరల్ మండలం చెర్లభూత్కూర్లోని జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట కాగా కరీంనగర్లో నివాసముంటున్నారు. భర్త శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషీయన్. కూతురు అమూల్య 6వ తరగతి, కుమారుడు సాయిమోక్షిత్ 4వ తరగతి చదువుతున్నారు. గతంలో వీరు కరీంనగర్లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువగా.. ప్రస్తుతం తల్లి వెంటే చెర్లభూత్కూర్ ప్రభుత్వ బడికి వెళ్తున్నారు. గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిపై నమ్మకం కల్పించేందుకు తన పిల్లలనూ అక్కడే చదివిపిస్తున్నట్లు టీచర్ స్రవంతి తెలిపారు. -
మసీదుకు స్థలం కేటాయించండి
నూకపెల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించండి. ఇళ్లు పొందిన ముస్లిం కుటుంబాలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా కాలనీ పరిసరాల్లో మసీదుకు స్థలం కేటాయించండి. – మహ్మద్ అబ్దుల్ భారీ, ముస్లిం సదర్ ప్లాట్లు కబ్జా చేస్తున్నారు మాది వెల్గటూర్ మండలం మొక్కట్రావుపేట. 97 ఇళ్లు ఎల్లంపల్లిలో ముంపునకు గురయ్యా యి. ప్రభుత్వం కొంతమందికి ఆర్అండ్ఆర్ కాలనీలో ప్లాట్లు కేటాయించింది. 2015 నాటికి 18ఏళ్లు నిండిన యువతకు ప్లాట్లు, డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు రాలేదు. ఆర్అండ్ఆర్ కాలనీలో మిగిలిన ప్లాట్లను కొందరు కబ్జా చేస్తూ గుడిసెలు వేస్తున్నారు. వాటిని తొలగించి లబ్ధిదారులమైన మాకు అప్పగించండి. – ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులు, ముక్కట్రావుపేట అసంపూర్తి రోడ్డుతో ప్రమాదాలు మల్యాల బ్లాక్ ఆఫీస్ నుంచి పెగడపెల్లి వరకు ప్రారంభించిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కంకర, డస్ట్ పోసి వదిలేశారు. దుమ్ము కొట్టుకొచ్చి ఇళ్లలోకి చేరుతోంది. రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – మల్యాల గ్రామ ప్రజలు -
కనిపించని ‘ఊయల’
● అనాథ శిశువుల కోసం యంత్రాంగం నిర్ణయం ● ఏర్పాట్లలో జిల్లా అధికారులు తీవ్ర జాప్యం ● శిశువు వద్దనుకుంటే ‘ఊయల’లో వదిలి వెళ్లవచ్చుఉమ్మడి జిల్లాలోనే శిశు గృహం జగిత్యాల: అనాథలైనా.. పిల్లలు వద్దనుకునే తల్లులైనా తమ పిల్లలను వేసి వెళ్లడానికి ఆస్పత్రుల వద్ద ఊయల ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ ఊయల కార్యక్రమం కరీంనగర్లో విజయవంతం కావడంతో జగిత్యాలలోనూ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. పేదరికం, ఇతరత్రా కారణాలు, ఆడపిల్ల అనే ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులు శిశువులను చెత్తకుప్పలు, డ్రైనేజీల్లో పడేసి వెళ్లిన ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఊయలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధాన ఆస్పత్రితోపాటు కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ సామాజిక ఆస్పత్రుల వద్ద ఊయలను ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. పుట్టిన శిశువు వద్దనుకుంటే ఆ ఊయలలో వదిలివెళ్లే అవకాశం ఉంది. అక్కడ సీసీ కెమెరాలుగానీ, నిఘా ఏమీ ఉండదు. శిశువును వదిలి వెళ్లిన వారి సమాచారం కూడా సేకరించరు. అందులో వదిలివెళ్లిన శిశువును మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారు స్వీకరించి వారి ఆలనాపాలన చూసుకునేలా వెసులు బాటు కల్పించారు. ఎవరైనా ముందుకొస్తే నిబంధనల ప్రకారం దత్తత ఇస్తారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోనే శిశు గృహం ఉండటంతో జిల్లాలోని ఆస్పత్రుల వద్ద ఊయల ఏర్పాటు జాప్యమవుతోందని తెలుస్తోంది. శిశువులను చేరదీసిన అనంతరం వారు శిశు గృహాలకు పంపించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఊయల ఏర్పాటు చేస్తే ఎవరైనా పిల్లలను వదిలివెళ్తే వారిని చేరదీసి కరీంనగర్కే పంపించాల్సిన పరిస్థితి ఉంది. జిల్లాకేంద్రంలో ఊయల ఏర్పాటు చేసేందుకు మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఓ ఏఎన్ఎంను నియమించనున్నారు. పిల్లలను వదిలి వెళ్లగానే చిన్నారి పూర్తి సంరక్షణ వారే చూసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే టోల్ఫ్రీ నంబరు 1098, 112 నంబర్లకు కాల్చేయవచ్చు. -
హద్దు రాళ్లు తొలగిస్తున్నారు
జిల్లాకేంద్రంలోని ఎల్ఎల్ గార్డెన్ నుంచి ధన్వంతరి ఆలయానికి వెళ్లే దారిలోని సర్వేనంబర్ 1429లోగల 8.05 ఎకరాలకు హద్దురాళ్లను కొందరు తొలగిస్తున్నారు. మా తాత అంగడి భూమయ్య నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి హద్దు రాళ్లు తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయండి. – అంగడి రాజు, మేడిపల్లి బకాయిలు చెల్లించాలంటున్నరు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న మా పిల్లలను యాజమాన్యాలు అనుమతించడం లేదు. ఫీజు బకాయిలు చెల్లించాలంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సమస్యను ప్రభుత్వానికి నివేదించి మా పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడండి. – బీఏఎస్ స్కూల్స్ విద్యార్థుల పేరెంట్స్ ఇంట్లోకి నీరు వస్తోంది యావర్రోడ్డులో డ్రైనేజీ సరిగా లేక చిన్నపాటి వర్షానికే మురుగు నీరు ఇంట్లోకి చేరుతోంది. వర్షం వస్తోందంటేనే భయబ్రాంతులకు గురవుతున్నం. డ్రైనేజీని సరిచేసి ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోండి. – అక్కినపెల్లి కాశీనాథం, యావర్రోడ్డు జగిత్యాల -
నిరుపేద బాలుడి వైద్యానికి రూ.1.13లక్షల సాయం
ధర్మపరి: కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో కొ ట్టుమిట్టాడుతున్న ఓ నిరుపేద బాలుడి వైద్యం కోసం ఫేస్బుక్ మిత్రులు రూ.1.13లక్షలు వి రాళాలుగా అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన మద్దిరాల మనోహర్, సరిత దంపతులకు కుమారుడు, కూతురు సంతానం. మనోహర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఆర్నెళ్ల క్రితం కుమారుడు రిత్విక్ క్యాన్స ర్ బారిన పడడంతో వైద్యం చేయించేందుకు ఆర్థికంగా ఇ బ్బంది పడుతున్నా డు. అక్కడి సామాజిక మిత్రుల ద్వారా తెలుసుకున్న ధర్మపురికి చెంది న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ బాలుడి వైద్య ఖర్చులకు సాయం అందించాలని జూన్ 5న ఫేస్బుక్లో పోస్టు చేశా డు. బాలుడి తల్లి బ్యాంకు ఖాతా ను అందులో పొందుపర్చాడు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల కు చెందిన ఎన్నారైలు, దాతలు స్పందించి సరి త బ్యాంకు ఖాతాకు రూ.1.13 లక్షలు విరా ళాలు పంపించారు. ఆ డబ్బులను బ్యాంకు మే నేజర్ చేతులమీదుగా బాధిత కుంటుబానికి పంపిణీ చేశారు. దాతల విరాళాలతో వైద్య సేవలు కొనసాగుతున్నట్లు రమేశ్ తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలు
యైటింక్లయిన్కాలనీ: రామగుండం మండలం న్యూమారేడుపాకలోని నర్సింహపురం(ఎంపీపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు వి.అనిల్కుమార్ తన ఇద్దరు కుమారులను అదే పాఠశాలలో చదివిపిస్తున్నారు. పెద్దకుమారుడు శ్రీహన్ 5వ తరగతి, చిన్నకుమారుడు 2వ తరగతి చదువుతున్నారు. వారిద్దరిని నిత్యం తనతోపాటు బైక్పై ప్రభుత్వ బడికి తీసుకొస్తున్నాడు. తను పనిచేస్తున్న పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిపిస్తూ.. గ్రామంలోని తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచినట్లు టీచర్ అనిల్కుమార్ తెలిపారు. -
‘పోల్ ట్యాక్స్’ ఆదాయంపై దృష్టి
● జిల్లాలో సర్వే పూర్తి చేసిన విద్యుత్ శాఖ ● లెక్క తేలిన స్తంభాల సంఖ్య ● పూర్తిస్థాయిలో వసూలుపై అధికారుల దృష్టి ● ఆందోళన చెందుతున్న కేబుల్ ఆపరేటర్లు మెట్పల్లి: ‘మల్లాపూర్, మెట్పల్లి సబ్ డివిజన్ల పరిధిలో విద్యుత్ శాఖ ఇటీవల పోల్ ట్యాక్స్ విధింపు కోసం ప్రత్యేకంగా సర్వే జరిపిందన్లీ ప్రాంతంలో గతంలో సుమారు మూడు వేల స్తంభాలకు మాత్రమే ట్యాక్స్ చెల్లించేవారు ఆపరేటర్లు. సర్వే తర్వాత వాటి సంఖ్య 6,147కు పెరిగింది. ఇలా జిల్లా మొత్తంగా సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించింది విద్యుత్శాఖ. దాని ప్రకారం తొందరలోనే పూర్తి స్థాయిలో ట్యాక్స్ వసూలుకు ఏర్పాట్లు చేస్తున్నారు.’ జిల్లాలో కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల నుంచి పోల్ ట్యాక్స్ వసూలు చేయడంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది. ఇప్పటివరకు నామమాత్రంగానే ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్న ఆ శాఖ.. ఇకనుంచి పూర్తి స్థాయిలో వసూలుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పోల్ టూ పోల్ సర్వేను చేపట్టిన అధికారులు.. ఇటీవలే దానిని పూర్తి చేశారు. మరోవైపు విద్యుత్ శాఖ తీరుతో కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. పోల్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల్లో రూ.20..పల్లెల్లో రూ.15 ● కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తమ వ్యాపారం కోసం విద్యుత్ స్తంభాలను వినియోగిస్తున్నందుకు ట్యాక్స్ను వసూలు చేయాలని మొదటగా 2005లో ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ● పట్టణాల్లో ఒక్కో స్తంభానికి రూ.20, పల్లెల్లో రూ.15 చొప్పున వసూలు చేయాలని ఆ సమయంలో ప్రకటించిన జీవోలో స్పష్టం చేసింది. ఈ బాధ్యతను విద్యుత్ శాఖకు అప్పగించింది. ● అప్పటి నుంచి ఆ శాఖ అధికారులు ట్యాక్స్ను వసూలు చేస్తూ వస్తున్నారు. ● కొంతకాలంగా స్తంభాలు వినియోగిస్తున్న ఆపరేటర్లతోపాటు ప్రొవైడర్ల సంఖ్య పెరిగింది. ● దీనికి అనుగుణంగా ట్యాక్స్ రాకపోవడంతో విద్యుత్ శాఖకు ఆర్థికంగా నష్టం జరుగుతోందని భావించిన ఉన్నతాధికారులు.. క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి స్తంభాల లెక్క తేల్చాలని ఆదేశించారు. ● ఇటీవల పట్టణాలతోపాటు ప్రతి గామంలో స్థానిక అధికారులు సర్వే చేపట్టి పూర్తి చేశారు. దీనివల్ల ప్రతి సబ్ డివిజన్లో వినియోగిస్తున్న స్తంభాల సంఖ్య భారీగా పెరిగినట్లు తేలింది. పెరగనున్న ఆదాయం.. ● ఇంతకాలం ఆపరేటర్లు, ప్రొవైడర్లు పెద్ద సంఖ్యలో స్తంభాలు వినియోగిస్తూ నామమాత్రంగా ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ స్థానిక అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ● ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాలతో వినియోగిస్తున్న ప్రతి స్తంభానికి కచ్చితంగా ట్యాక్స్ వసూలు చేసేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ● ఇప్పటికే కొంతమేర ట్యాక్స్ ఆదాయాన్ని పెంచినప్పటికీ రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వసూళ్లు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆందోళన చెందుతున్న ఆపరేటర్లు ● ట్యాక్స్ వసూలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన విద్యుత్ శాఖ తీరుతో ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ● కేబుల్ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశంతో స్థానికంగా తమ వ్యాపారం లాభసాటిగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఇలాంటి పరిస్థితుల్లో ట్యాక్స్ చెల్లించడం తమకు ఎంతో భారమవుతోందని, ప్రభుత్వం దీనిని దృష్టిలో పెట్టుకుని పూర్తిగా రద్దు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. -
డ్రైనేజీలు కబ్జా
● రోడ్లపైనే మురికినీటి ప్రవాహం ● కొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు ● ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని గొల్లపల్లికి వెళ్లే రహదారిలోగల శ్మశాన వాటిక వద్ద గల చౌరస్తా. ఇక్కడ పెద్ద నాలా ఉంది. దీనిపై ఇనుప ఊచలతో కప్పువేశారు. అది చెడిపోవడంతో డ్రైనేజీ ఉప్పొంగినప్పుడల్లా నీరు బయటకు వస్తోంది. కొందరు దానిని ఢీకొని అందులో పడుతున్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వెల్గటూర్: ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎండపల్లి మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి వెల్గటూర్ మండలానికి చెందిన 54 మందికి కల్యాణలక్ష్మి, 92 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ గోపిక, వైస్ చైర్మన్ తిరుపతి, సీనియర్ నాయకులు గోపాల్రెడ్డి, రాంరెడ్డి, తహసీల్దార్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాధితుడికి మంత్రి అడ్లూరి పరామర్శ కోరుట్ల: 15 రోజుల క్రితం కోరుట్లలో గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు షాక్ తగిలి కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్రెడ్డి రాజేశ్ను ఆదివారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పరామర్శించారు. విద్యుత్ షాక్ ప్రమాద బాధితుల వైద్యానికి అవుతున్న ఖర్చులను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామన్నారు. సీఎంరిలీఫ్ ఫండ్ లేదా విద్యుత్ శాఖ నుంచి ఆ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట ముదిరాజ్ సంఘం నాయకులు ఎడ్ల రమేశ్, బహుజన దళిత గాయకులు లింగంపల్లి నరేశ్, మోర్తాడ్ రాజశేఖర్ ఉన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాల రూరల్: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని, వసతి గృహంలో పారిశుధ్య నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలని, దోమలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. సైక్సిక్ మహాసంగ్లో ఉపాధ్యాయుడి ప్రసంగంసారంగాపూర్: గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న హమారా విద్యాలయ్, హమారాతీర్థ్ కార్యశాల కార్యక్రమానికి రాష్ట్ర ప్రతినిధిగా బీర్పూర్ మండలం కొల్వాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వొడ్నాల రాజశేఖర్ పాల్గొన్నారు. పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏబీఆర్ఎస్ఎం (అఖిల భారతీయ సైక్సిక్ మహాసంగ్) జాతీయ అధ్యక్షుడు నారాయణలాల్ గుప్తా, ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కార్యక్రమానికి పాల్గొన్న రాజశేఖర్ ప్రతి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని, విద్యాభివృద్ధికి తల్లిదండ్రులతోపాటు స్థానికుల సహకారం తీసుకోవాలని కోరారు. రాయికల్లో ఐటీడీఏ ఏర్పాటు చేయండిరాయికల్: రాయికల్ మండలంలో ఐటీడీఏగా ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు భూక్య గోవింద్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాజాతి అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఏ సమస్య వచ్చినా ప్రతిఒక్కరూ ఐకమత్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు భూక్యా రాకేశ్, గోవింద్నాయక్, మాలోత్ తిరుపతి, నరేందర్, పల్త్యా ప్రభాకర్, భూమానాయక్, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు శుభపరిణామంజగిత్యాలటౌన్: రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తూ.. నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డు ఏర్పాటు శుభపరిణామమని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. బోర్డు ఏర్పాటుతోనే సరిపెట్టకుండా కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. పచ్చబంగారంగా పేరున్న పసుపు పంటకు రూ.పదివేలకు మించి ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. పెట్టుబడి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని రాయితీలు ఇవ్వాలని కోరారు. అమిత్షాకు స్వాగతంజగిత్యాలటౌన్: పసుపు రైతుల దశాబ్దాల కల సాకారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పసుపుబోర్డు కార్యాలయం, లోగో ఆవిష్కరణకు ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్షా నిజామాబాద్ వచ్చారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి స్వాగతం పలికారు. -
జగన్నాథ్పూర్లో 20 శాఖల అధికారులు
రాయికల్: మండలంలోని జగన్నాథ్పూర్లో ఒకేరోజు 20 శాఖల అధికారులు పర్యటించారు. పీఎం ధర్తి జాతీయ ఉత్కర్ష్ అభియాన్లో భాగంగా జిల్లాస్థాయి అధికారులతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. మీసేవ, ఆధార్సేవలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్కార్డులు, ఆధార్కార్డులు, సర్టిఫికెట్లు, పోస్టల్ ఇన్సూరెన్స్, బ్యాంక్ సేవలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. అర్హులందరికీ కేంద్ర పథకాలు అందించడంతోపాటు వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు. ఆలయ భూముల్లో సాగు చేస్తే చర్యలుకొడిమ్యాల: మండలంలోని నల్లగొండ శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ భూములను ఆక్రమించుకున్న రైతులను పిలిపించి మాట్లాడారు. ఆలయ భూముల్లో సాగుచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆలయ హద్దులు దాటి సాగుచేయొద్దని సూచించారు. అనంతరం గుట్టపై పార్కింగ్ స్థలంలో 200 మొక్కలు నాటారు. కార్యక్రమంలో జగిత్యాల డివిజన్ దేవాదాయ శాఖ ఇన్చార్జి రాజమౌళి, ఎస్సై సందీప్, ఆలయ ఈవో వెంకన్న, మల్లేశం, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు
ధర్మపురి: ధర్మపురి వద్దగల గోదావరి ఒడ్డునున్న శ్రీమహాలక్ష్మీ ఆలయంలో లోక కల్యాణార్థం చేపుడుతున్న పారాయణం శనివారం రెండోరోజుకు చేరింది. ఆలయ వంశీకులు బాల్చందర్, గుండయ్య, నరహరి ఆధ్వర్యంలో మహిళలు శ్రీపాద శ్రీవల్లభ, విష్ణు, లలిత సహస్ర పారాయణాలు కొనసాగించారు. ఈనెల 27 నుంచి జులై 17 వరకు పారాయణాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రచయిత కేవీ.నరేందర్కు సన్మానంజగిత్యాల: ఉద్యోగులకు సేవతోనే గుర్తింపు అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. ఉద్యోగ విరమణ పొందనున్న ప్రముఖ కథా రచయిత, ఉపాధ్యాయుడు కెవి.నరేందర్ను శనివారం సత్కరించారు. కథారచయితగా ఎంతో గుర్తింపు పొందిన నరేందర్ ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన రచనలను మెచ్చుకుని అవార్డు అందించారని తెలిపారు. ఇది జిల్లాకే గర్వకారణమన్నారు. కార్యదర్శి అమర్నాథ్రెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానంజగిత్యాల: సెప్టెంబర్ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి అవార్డు కోసం జిల్లాలోని అన్ని కేటగిరిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. జూలై 13 చివరి తేదీ అని, అర్హత గల ఉపాధ్యాయులు NATIONALAWARDSTOTEACHERS.EDUCATION.GOV.IN లో వివరాలను నిర్ణీత నమూనాలో అప్లై చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన సెట్ను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక డ్రైవ్జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వారం రోజులుగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనాలు నడిపిన 181 మంది మైనర్లకు జరిమానా విధించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్నెళ్లలో మైనర్ల డ్రైవింగ్తో ప్రమాదాలు చోటుచేసుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీస్శాఖ అన్ని చర్యలూ తీసుకుంటోంది. సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపాలికోరుట్ల రూరల్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఉంటుందని, అన్ని రకాల సేవలకు సిబ్బంది అందుబాటులో ఉన్నారని మాతాశిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. సేవలను అడిగి తెలుసుకున్నారు. 102 సేవలు, రూట్మ్యాప్పై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీతరాణి, వైద్యులు విజయలక్ష్మీ, సూపర్వైజర్లు ధనుంజయ, రమణ, ఫార్మసీ ఆఫీసర్ ఉదయ్ ప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. -
● యువత చేతిలోనే దేశ భవిత ● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ● వివిధ కంపెనీలకు 556 మంది ఎంపిక
కోరుట్ల: కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్మేళా విజయవంతమైంది. మేళాకు 1756 మంది హాజరుకాగా.. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు 556 మంది ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఏటా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లోని కంపెనీలకు ఎంపికై తే దూరం ఎక్కువని నిరాశకు గురికావొద్దని, వారికి కావాల్సిన ఏర్పాట్లను కంపెనీలతో మాట్లాడి తానే ఏర్పాటు చేయిస్తామని వెల్లడించారు. యువత చదువుతో పాటు జాబ్ స్కిల్స్ కలిగి ఉండాలన్నారు. మేళాలో 75కంపెనీల ప్రతినిధులు స్టాల్స్ ఏర్పాటు చేసి కేటగిరీల వారీగా ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు కల్పించాయి. బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశం, చీటి వెంకట్రావ్, తోట నారాయణ, కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, సాయిరెడ్డి, అతిక్, వినోద్, సురేందర్, అన్వర్, అంజయ్యలు వివిధ కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు. -
పెంచిన బస్పాస్ చార్జీలు తగ్గించాలి
జగిత్యాలటౌన్: విద్యార్థుల బస్పాస్ చార్జీలను తగ్గించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. పెంచిన చార్జీలు తగ్గించాలంటూ ఆర్టీసీ జగిత్యాల డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఆందోళన చేశారు. మహాలక్ష్మి పేరిట మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు నడపకపోవడంతో పురుషులకు సీట్లు దొరికే పరిస్థితి లేదన్నారు. బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ఉచిత ప్రయాణం వృథాగా మారిందన్నారు. పైగా విద్యార్థుల బస్చార్జీలను పెంచడం శోచనీయమన్నారు. అనంతరం డిపో సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత -
‘విద్యార్థి దత్తత’ అభినందనీయం
● 650 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు ధర్మపురి: నిరుపేద విద్యార్థుల కోసం చేపట్టిన విద్యార్థి దత్తత కార్యక్రమం అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థి దత్తత కార్యక్రమం కన్వీనర్, గొల్లపల్లి గణేశ్ ఆధ్వర్యంలో మిత్రబృందం కలిసి శనివారం 650 మందికి స్కూల్ బ్యాగులు అందించారు. కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. 2014లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంచలంచెలుగా ఎదిగి పేద విద్యార్థులకు సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటివరకు 3,200 మందికి బ్యాగులు అందించారని పేర్కొన్నారు. కన్వీనర్ గణేశ్ను మంత్రి అభినందించారు. డీఈవో రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి, హెచ్ఎం మహేందర్, నాయకులు ఎస్.దినేష్ తదితరులున్నారు. -
కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం
● నేను ఆ స్థాయి నుంచే వచ్చా.. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరుట్ల: పార్టీలో పనిచేసే కార్యకర్తకు ప్రాధాన్యం ఉంటుందని, తాను ఆ స్థాయి నుంచి మంత్రివరకు ఎదిగానని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాంగ్రెస్ కోరుట్ల ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో ఆయనను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి, కోరుట్లను రెండుకళ్లలా చూసుకుంటానన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో 48 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేలా చూడాలన్నారు. నర్సింగరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, అన్నం అనిల్, సత్యంరావు, తిరుమల గంగాధర్, కొంతం రాజం, పుప్పాల ప్రభాకర్, నాగభూషణం పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల విద్యుత్ షాక్తో మృతిచెందిన అలాల వినోద్, వెల్లుట్ల సాయికుమార్ కుటుంబాలకు మంత్రి ఎమ్మెల్యే సంజయ్తో కలిసి రూ.5 లక్షల చొప్పున అందించారు. ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం బుగ్గారం: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన 191 మందికి కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి శనివారం ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. 17 మందికి కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ మాజిద్, ఎంపీడీవో అఫ్జల్మియా, స్థానిక అధికారులు పాల్గొన్నారు. అవినీతిపై విచారణ చేపట్టండి బుగ్గారం పంచాయతీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గత సర్పంచ్ సస్పెన్షన్పై స్టే ఆర్డర్ను అమలు చేశారని, లోకాయుక్త ఆర్డర్ను ఏడు నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్ వ్యక్తిగత విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
వరుణ దేవుడా కరుణించు..
సారంగాపూర్లో బావుల్లో నీరు లేక పొక్లెయిన్తో పూడిక తీయిస్తున్న రైతు వెల్లుల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న రైతులు జలాభిషేకం చేస్తున్న మహిళలు ఎండిపోతున్న వరి నార్లు మెట్పల్లిరూరల్/సారంగాపూర్: వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ సూచనలతో పొలాలను దున్నిన రైతులు.. మృగశిర కార్తెలో మోస్తరు వర్షం కురవడంతో ఆనందించారు. తీరా విత్తనాలు వేసుకున్నప్పటి నుంచి వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు, మహిళలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. వెల్లులలో శనివారం సుమారు 50కి పైగా ఆలయాల్లో జలాభిషేకం చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు మంగళహారతులతో మేళతాళాల మధ్య గంగజలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయాల్లో అభిషేకాలు జరిపారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో పంటలను కాపాడుకునేందుకు పొక్లెయిన్ సహాయంతో బావుల్లోని పూడిక తీయిస్తున్నారు. -
దాడి చేసుకున్న హిజ్రాలు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని పాతబస్టాండ్లో గురువారం రాత్రి హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. జగిత్యాల జిల్లాకు చెందిన హిజ్రాలు పాతబస్టాండ్ ప్రాంతంలో తిరుగుతుండగా సిద్ధిపేట జిల్లాకు చెందిన మరికొంత మంది హిజ్రాలు పాతబస్టాండ్కు చేరుకున్నారు. దీంతో తమ అనుమతి లేకుండా తమ జిల్లాకు ఎందుకు వచ్చారంటూ రెండు వర్గాల వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో రెచ్చిపోయిన హిజ్రాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హిజ్రాలను పోలీస్స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. నడి రోడ్డుపై ట్రాన్స్ జెండర్ల హల్చల్.. ఒకరిపై ఒకరు దాడి జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై ట్రాన్స్ జెండర్ల మధ్య ఘర్షణజగిత్యాల, సిద్దిపేటలకు చెందిన రెండు వర్గాల మధ్య అడుక్కునే విషయంలో ప్రారంభమైన గొడవ చివరకు ఒకరిపై ఒకరు దాడి.. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్… pic.twitter.com/oY1QUOGKFm— Telugu Scribe (@TeluguScribe) June 27, 2025 -
వ్యాధుల భయం
● ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న నీరు ● దోమలకు అడ్డా.. కనిపించని స్ప్రే ● ముసురుతున్న రోగాలు ● ఆందోళనలో పట్టణవాసులు జగిత్యాల: fW™éÅÌS hÌêÏ MóS…{§ýl…, A†ò³§ýlª Ð]l¬°Þ´ë-Ísîæ-ÌZ Ð]lÆ>Û-M>ÌS…ÌZ ´ëÇÔ¶æ$-«§ýlÅ… AçÜ¢-Ð]lÅ-çÜ¢…V> Ð]l*Æý‡$-™ø…¨. _¯]l²-´ësìæ Ð]lÆ>Û-ÌSMóS {yðlƇ$$-¯ól-iË$ ´÷…W, Rêä çܦÌêÌZÏ Ð]l¬ÇMìS-±Æý‡$ °Í_, í³_aÐðl¬-MýSP-Ë$ §ýlrt…-V> ò³Æý‡$-VýS$-™èl$-¯é²Æ‡$$. ÐéÅ«§ýl$ Ë¿¶æÄ¶æ$…™ø AÌêÏyýl$™èl$¯é²Æý‡$.న’ ´ëÏr$Ï Mö¯]l$-VøË$ ^ólíÜ {V>Ð]l*-ÌZÏ °Ð]l-íÜ-çÜ$¢¯]l² Ķæ$fÐ]l*-¯]l$-Ë$ D Rêä çܦÌêÌS¯]l$ ç³sìæt…^èl$-MøMýS-´ù-Ð]l-yýl…-™ø çÜÐ]l$çÜÅ Ð]l$Ç…™èl ¡{Ð]l-Ð]l$-Ð]l#-™ø…¨. ѧéÅ-¯]l-VýS-ÆŠæ, MýS–Úë~-¯]l-VýS-ÆŠæ, O»ñæ´ë-‹Ü ÆøyŠæ, VøÑ…-§ýl-ç³-ÍÏ Ð]l…sìæ ÕÐéÆý‡$ M>ÌS-±ÌZÏ D çÜÐ]l$çÜÅ A«¨MýS…-V> MýS°í³-çÜ$¢…¨. Ð]l¬°Þç³ÌŒæ A«¨ M>Æý‡$-Ë$ ¯øsîæ-çÜ$-Ë$ gêÈ ^ólĶæ$-MýS-´ù-Ð]lyýl…, fÇÐ]l*-¯éË$ Ñ«¨…-^èl-MýS-´ù-Ð]lyýl… Ð]lÌSÏ çÜÐ]l$-çÜÅ-Ë$ ç³ÇÚëP Æý‡… M>Ð]lyýl… Ìôæ§ýl° Ý린MýS$-Ë$ BÆøí³-çÜ$¢-¯é²Æý‡$. ఖాళీ స్థలాలతో ఆరోగ్య ఆందోళనలు స్థలాల్లో దట్టంగా పెరిగిన పిచ్చిమొక్కలు, నిలిచిన మురికినీరు విషపూరి, పాములు, దోమలు, ఈగలకు ఆవాసంగా మారాయి. దీంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు ప్రబలుతున్నాయి. నిబంధనల ప్రకారం, మున్సిపల్ అధికారులు ఈ స్థలాలను శుభ్రం చేసి, యజమానుల నుంచి ఖర్చు వసూలు చేయవచ్చు. అయితే, ఈ విధానం అమలు కావడం లేదు. బ్లీచింగ్ పౌడర్, కెమికల్ స్ప్రే వంటి చర్యలు కూడా బ్లాక్ స్పాట్స్ ఉన్న చోట మాత్రమే చేపడుతున్నారని, డ్రెయినేజీలపై దృష్టి సారించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఫాగింగ్ అందని కాలనీలు వర్షకాలంలో వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమల సంచారం పెరిగింది. అయితే, కొన్ని ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే ఫాగింగ్ చేస్తుండగా, ఇతర కాలనీల్లో ఈ చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల సంఖ్య అధికమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విష సర్పాలు, పురుగుల భయం ఖాళీ స్థలాల్లో నిలిచిన నీరు, దట్టమైన పిచ్చిమొక్కలు విష సర్పాలు, జెర్రీలు, ఇతర విషపురుగులకు ఆవాసంగా మారాయి. సాయంత్రం వేళల్లో ఇవి ఇళ్లలోకి చొరబడుతుండడంతో కాలనీవాసులు భయా ందోళనకు గురవుతున్నారు. తలుపులు మూసుకోకపోతే ఇబ్బందులు తప్పడం లేదని వారు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్రెయినేజీల నిర్మాణంలో లోపాలు మున్సిపాలిటీలో డ్రెయినేజీల నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో చిన్న వర్షానికే పొంగిపొర్లుతున్నా యి. ప్లాస్టిక్ వ్యర్థాలతో డ్రెయినేజీలు నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. 100 రోజుల పారి శుధ్య ప్రణాళిక అమలవుతున్నప్పటికీ, ఖాళీ స్థలా ల్లోని పిచ్చిమొక్కలు, మురికినీరు సమస్యలను పరి ష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. పరిష్కార మార్గాలు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి ఖాళీ స్థలాల్లోని పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రెయినేజీలను సక్రమంగా ఏర్పాటు చేయడం, ఫాగింగ్ను అన్ని కాలనీల్లో నిర్వహించడం, యజమానులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించడం వంటి చర్యలు చేపట్టాలి. ఇలా చేస్తే జగిత్యాలలో పారిశుధ్య సమస్యలు తగ్గి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుంది. జగిత్యాల మున్సిపాలిటీ వార్డులు : 48 జనాభా : 1,20,357 సిబ్బంది : 296 నోటీసులు జారీ చేసేలా చర్యలు ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు తొలగించని యజమానులకు నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటాం. ఖాళీ స్థలాల్లో బోర్డులు సైతం ఏర్పాటు చేసేలా చూస్తాం. ఒకవేళ వారు స్పందించకపోతే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, టీపీవో ఇది విద్యానగర్కాలనీలోని సీతారామాంజనేయస్వామి ఆలయానికి సంబంధించిన భూమి. ఇక్కడ ఇంతకు ముందు డంపర్బిన్ ఏర్పాటు చేసే వారు. ప్రస్తుతం డంపర్బిన్ లేకపోవడంతో అక్కడే చెత్త పోస్తున్నారు. దీంతో పాటు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. వర్షానికి అందులో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. చుట్టు పక్కల గల భవనాల వారికి రోగాలు వచ్చే అవకాశం ఉంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరుతున్నారు. -
ప్రహరీ లేక పరేషాన్
● జిల్లాలో 200కు పైగా ప్రహరీలు లేని పాఠశాలలు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ్డాగా కొన్ని స్కూళ్లు ● ఆవరణలోకి మూగజీవాలు, విష కీటకాల సంచారం ● భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మల్లాపూర్: సర్కారు బడుల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. విద్యార్థులు ఇబ్బందుల మధ్యే చదువులు కొనసాగిస్తున్నారు. ఏటా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రకటనలు గుప్పిస్తున్న సర్కారు ఆ తర్వాత సౌకర్యాలపై పట్టించుకోవడం లేదు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీలు లేక రక్షణ కరువైంది. జిల్లావ్యాప్తంగా 511 ప్రాథమిక, 85 ప్రాథమికొన్నత, 187 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో మొత్తం 783 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మన ఊరు–మన బడి కింద ప్రహరీలు మంజూరయ్యాయి. కొన్ని ప్రగతిదశలో ఉండగా, మరికొన్నింటిలో పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలో 220 ప్రాథమిక, ప్రాథమికొన్నత, జెడ్పీ హైస్కూళ్లకి పూర్తిస్థాయిలో ప్రహరీలు లేవు. మిగిలిన పాఠశాలల్లో పాతగోడలు, మరికొన్ని చోట్ల ఒకవైపు కొంతమేర నిర్మాణాలు చేపట్టి మిగతా వైపు ఆసంపూర్తిగా వదిలేశారు. ప్రహరీలు లేకపోవడంతో ఆవరణలో ఆవులు, గేదెలు, పందులు వస్తున్నాయి. ఇతర మూగ జీవాలు పాఠశాలల్లోకి ప్రవేశించి పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఉదయం పాఠశాలలకు వచ్చే ఉపాద్యాయలు, విద్యార్థులకు పేడ కుప్పలు, చెత్తాచెదారం కనిపిస్తోంది. ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా మారుతుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులే తొలగించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్కూళ్ల ఆవరణలో హరితభారం కింద నాటిన మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. మరికొన్ని పాఠశాలలు రాత్రివేళ మందుబాబులకు, ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డా మారుతున్నాయని ఉపాధ్యాయులు, ప్రజలు అంటున్నారు. విష కీటకాలతో భయాందోళన జిల్లాలోని చాలా పాఠశాలలు ఊరికి చివరన గుట్టలు, అటవీప్రాంతాలను ఆనుకొని ఉండటం, ప్రహరీలు లేకపోవడంతో విషపురుగులు, కీటకాలు వస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు లక్షలాది నిధులు విడుదలవుతున్నాయి. అయినా ప్రహరీలు ఎందుకు నిర్మించడం లేదని అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు విడుదల చేసిన (సీడీపీ) నిధులతో పాఠశాలలకు ప్రహరీలు ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రహరీ నిర్మించాలి హుస్సేన్నగర్ ప్రాథమిక పాఠశాల రహదారికి అనుకొని ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేయించి ప్రహరీని నిర్మించారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు అదనపు నిధులు కేటాయించాలి. – సయ్యద్ హైదర్, మాజీ సర్పంచ్, హుస్సేన్నగర్ ఉన్నతాధికారులకు నివేదించాం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. జిల్లాలోని పలు పాఠశాలల్లో ప్రహరీ, ఇతర వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొన్ని పాఠశాలల్లో పనులు ప్రగతిలో ఉన్నాయి. మరికొన్నింటికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. – రాము, జిల్లా విద్యాఽశాఖాధికారి, జగిత్యాల -
జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో(జూన్ 28 నుంచి జూలై 2 వరకు) అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 31–32 డిగ్రిల సెల్సియస్గా, రాత్రి ఉష్ణోగ్రతలు 24–25 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 64–74 శాతం, మధ్యాహ్నం 37–53 శాతం నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య దిశ నుంచి బలమైన ఈదురుగాలులు గంటకు 13–22 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని, అయితే, జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులు, 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నేడు జిల్లాలో మంత్రి పర్యటనజగిత్యాల: జిల్లాలో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు బుగ్గారంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్లు పంపిణీ చేసి అనంతరం కోరుట్లలోని సాయిబాబాను దర్శించుకుని న్యూబస్టాండ్లో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఇస్కోనిగుట్టలో మొక్కలు పంపిణీ చేసి, కల్లూరు రోడ్లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేసి మెట్పల్లిలోని కాంగ్రెస్ నేత జువ్వాడి నర్సింగరావు ఇంటికి వెళ్లనున్నారు. తిరిగి ధర్మపురికి వెళ్లనున్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈగా సుదర్శనంజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్ఈగా బి.సుదర్శనం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సాలీయానాయక్ నిర్మల్ జిల్లాకు బదిలీ కాగా, నిర్మల్ జిల్లా ఎస్ఈగా పనిచేస్తున్న సుదర్శనం జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు సాలీయానాయక్కు వీడ్కోలు, సుదర్శనంకు స్వాగతం పలికారు. విద్యుత్ శాఖ డీఈగా మధుసూదన్మెట్పల్లి: విద్యుత్ శాఖ మెట్పల్లి డివిజన్ ఇంజినీర్గా మధుసూదన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఈలు మనోహర్, రఘుపతిలతో పాటు డివిజన్ పరిధిలోని ఏఈలు, యూనియన్ నాయకులు రాజవీరు, లక్ష్మణ్, హరిప్రసాద్లు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని వినియోగదారులు, రైతులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. 91శాతం రేషన్ పంపిణీజగిత్యాలక్రైం: జిల్లాలో రేషన్కార్డు లబ్ధిదారులకు ఇప్పటి వరకు 91 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 3,18,731 రేషన్కార్డులు ఉండగా, ఈనెల 27 వరకు 2,90,517 మందికి రేషన్ దుకాణాల ద్వారా 91శాతం సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈనెల 30 వరకు 100 శాతం పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఇంకా రేషన్ బియ్యం తీసుకోని కార్డుదారులు ఆందోళన చెందకుండా రేషన్ దుకాణాలకు వెళ్లి బియ్యం తీసుకోవాలని కోరారు. ఎవరైనా లబ్ధిదారులు సన్నబియ్యం అక్రమంగా అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఈ–పాస్’తోనే ఎరువులు విక్రయించాలిపెగడపల్లి: ఫర్టిలైజర్ దుకాణదారులంతా ఈపాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలోని కిసాన్ ఫర్టిలైజర్స్, సంచర్ల, పెగడపల్లి సహకార సంఘాలను శుక్రవారం సందర్శించి ఎరువుల నిల్వలు, వాటి నాణ్యత, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. ప్రతీ దుకాణం వద్ద స్టాక్ వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం పంటలకు ఎరువుల కొరత లేదని, అవసరం మేరకు సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ఆయన వెంట ఏవో శ్రీకాంత్, సింగిల్విండోల సీఈవోలు గోపాల్రెడ్డి, మధూకర్ ఉన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో ఆర్థికాభివృద్ధి
రాయికల్: ఆయిల్పామ్ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని డీహెచ్ఎస్వో శ్యామ్ప్రసాద్ అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం వీరాపూర్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్న నీలి మహేందర్ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయిల్పామ్ మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి దిగుమతి ప్రారంభమై 30ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి స్వాతి, రైతులు పాల్గొన్నారు. పశువైద్య కేంద్రం తనిఖీ జగిత్యాల: జగిత్యాల మండలం పొలాసలోని పశు ఉప వైద్య కేంద్రాన్ని పశుసంవర్దక శాఖ ఏడీ బోనగిరి నరేశ్ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, బిల్డింగ్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట వెటర్నరి లైవ్స్టాక్ ఆఫీసర్ కందుకూరి పూర్ణచందర్ ఉన్నారు. హాస్టల్ సందర్శన పొలాస గ్రామంలోని బీసీ హాస్టల్ను ప్రత్యేకాధికారి నరేశ్ సందర్శించారు. హాస్టల్లో ఎంత మంది ఉంటున్నారు, పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత
జగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని జిల్లా సెర్ఫ్ ఏపీడీ సునీత అన్నారు. శుక్రవారం స్వశక్తి సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న టీ, టిఫిన్, బిర్యానీ సెంటర్, చల్గల్లో పీఎంఎఫ్ఎంజీ ద్వారా ఏర్పాటు చేసిన పిండిగిర్ని, చల్గల్లో వీవోఏల ద్వారా ఉల్లాస్ టాస్ ఆన్లైన్ సర్వేను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇందిర మహిళ శక్తి పథకం ద్వారా సీ్త్రనిధి రుణాలు, బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతీ మహిళా సభ్యురాలు రుణాలు తీసుకుని స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాన్ఫామ్ డీపీఎం వెంకటేశ్, ఏపీఎం గంగాధర్, సీసీ గంగారాం, వీవోఏలు లౌక్య, విజయ, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
కోరుట్ల: విద్యార్థులకు మోనూ ప్రకారం భోజనం అందించాలని, నిర్లక్ష్యం తగదని అదనపు కలెక్టర్ బి.లత అన్నారు. పట్టణంలోని మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ను శుక్రవారం సందర్శించి వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భోజన సామగ్రిని పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంట ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య ఉన్నారు. భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు రాయికల్: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్ మండలం అల్లీపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు సరఫరా అయ్యే కూరగాయలు, బియ్యం, స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఏ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని అన్నారు. అంతేకాకుండా కేజీబీవీలో ఎంపీడీవో చిరంజీవి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలి జగిత్యాల: విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలలతో పాటు, జగిత్యాలలోని బీసీ కళాశాలలోని హాస్టల్ను సందర్శించి సరుకులను పరిశీలించారు. పరిశుభ్రత ఉండాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడే ఆహారం వండి పెట్టాలని, గడువు ముగిసిన సరుకులను వాడకూడదని ఆదేశించారు. అనంతరం కళాశాలలోని స్టోర్ రూం, సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
వర్షాలు బాగా కురువాలని..
ఇబ్రహీంపట్నం: వర్షాలు బాగా కురువాలని, పంటలు మంచిగా పండాలని కోరుతూ మండలంలోని అమ్మక్కపేట, కోమటికొండాపూర్, వేములకుర్తి గ్రామాల్లో శుక్రవారం కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు పూజలు చేశారు. కోమటికొండాపూర్లో గ్రామశివారులోని 2కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది వద్దకు వెళ్ల్లి గోదావరి జలాలను పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామదేవతలకు జలాభిషేకం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములకుర్తిలో పోతరాజుల విన్యాసాలతో వలకట్టు డప్పు చప్పుళ్లతో తాతమ్మకు, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆయా గ్రామాల కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
అడవికి ఆపద
సిరిసిల్ల: జిల్లాలో అటవీ భూములు కబ్జాకు గురవుతున్నా.. ఆఫీస్ల్లోనే అటవీశాఖ అధికారులు రెస్ట్ తీసుకుంటున్నారు. రికార్డుల్లోనే అడవిని రక్షిస్తున్నారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్–2023 ప్రకారం 251 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 2020లో 22.50 శాతం ఉన్న పచ్చదనం ఏకంగా 20.45 శాతానికి పడిపోయినట్లు అటవీశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం పోడుభూములకు పట్టాలు ఇస్తుందనే నమ్మకంతో అటవీ శివారు పల్లెల్లో పోడు పేరిట ఫారెస్ట్ను పాడుచేసే పనులు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీశాఖ అధికారులు, సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఎకరానికి రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు దండుకుంటూ అక్రమార్కులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించడం, సాగుచేయడం నేరమని తెలిసినా కొందరు గొడ్డళ్లు, ట్రాక్టర్లతో అడవికి ఎసరుపెడుతూనే ఉన్నారు. కొత్తపేట, మల్యాల, సనుగుల, రామారావుపల్లి, గోవిందరావుపల్లి, వట్టిమల్ల, గర్జనపల్లి, రంగంపేట శివా రుల్లో సుమారు 251 ఎకరాల్లోని జంగల్ను నరికేశారు. మార్కెట్లో ఆ భూముల విలువ రూ.37.65 కోట్ల మేరకు ఉంటుంది. కళ్లు తెరవకుంటే.. జిల్లా అధికారులు కళ్లు తెరవకుంటే పచ్చని అడవి ఆక్రమణల పాలై పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చించి హరితహారం చేపడుతున్నా నాటే మొక్కల కంటే నరికేస్తున్న చెట్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్న వారు ఇప్పటికే ఎకరాల కొద్ది భూములను ఆక్రమించి.. పోడు పేరిట అడవులకు కీడు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను గుర్తించి చర్యలు తీసుకుంటే భవిష్యత్లో అటవీ భూములకు రక్షణ కల్పించినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పోడుపట్టాలు అటవీ భూముల ఆక్రమణలు ఎలా ఉన్నా.. కొత్తగా అడవికి ఆపద రాకుండా రక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. స్పందించని అటవీశాఖ అధికారులు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై జిల్లా ఇన్చార్జి డీఎఫ్వోను ఫోన్లో ‘సాక్షి’ సంప్రదించగా స్పందించలేదు. కొత్తగా సాగులోకి వచ్చిన అటవీభూముల వివరాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆమె ఫోన్ ఎత్తలేదు. ఏది ఏమైనా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి.అటవీ స్వరూపం..(అటవీ శాఖ గణాంకాలు) గ్రామాలు: 260అటవీ సమీప గ్రామాలు: 64అటవీ విస్తీర్ణం : 390.85 చదరపు కిలోమీటర్లు మధ్యస్థ దట్టమైన అటవీ ప్రాంతం : 113.26 చదరపు కిలోమీటర్లు బహిరంగ అటవీ ప్రాంతం : 185.07 చదరపు కిలోమీటర్లు పోడు అటవీ ప్రాంతం : 15.32 చదరపు కిలోమీటర్లు అడవి కాని అటవీ ప్రాంతం : 76.06 చదరపు కిలోమీటర్లు అడవుల్లో నీటి వనరులు : 1.14 చదరపు కిలోమీటర్లు పచ్చదనం శాతం : 20.45ఉండాల్సిన పచ్చదనం: 33 శాతం ఇది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం కొత్తపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు 2015లో నిర్మించిన చెక్డ్యాం. ఈ చెక్డ్యామ్లో నీరు నిల్వ ఉండి.. వన్యప్రాణులకు దాహార్తి తీర్చుతుంది. ఈ చెక్డ్యామ్ పక్కనే ఓ పది ఎకరాలు మైదానంగా అటవీభూమి ఉంది. చెక్డ్యామ్లో నీరు ఉంటే.. ఆ భూమి సాగులోకి రాదు. దీంతో స్థానికుడు ఒకరు చెక్డ్యామ్లో ఇసుక నిండిన భాగాన్ని తవ్వేశాడు. తన ట్రాక్టర్తోనే కోర (కయ్య) కొట్టాడు. గతేడాది కురిసిన వర్షాలకు చెక్డ్యామ్ తెగిపోయింది. నీరు నిల్వ లేకుండా పోయింది. ప్రజాధనం వరదపాలైంది. చెట్లు.. చెక్డ్యామ్లను కూల్చివేస్తూ.. అటవీ భూమికబ్జా ఫారెస్ట్ ప్లాంటేషన్నే దున్నేశారు ఆఫీస్లు దాటని ఫా‘రెస్ట్’ అధికారులు ఈ ఏడాది కొత్తగా 251 ఎకరాల్లో ఫారెస్ట్ ఆక్రమణలు పోడు భూములకు పట్టాల ఆశతో చెట్లను కొట్టేస్తున్నారు ఆ భూమి విలువ రూ.37.65 కోట్లపై మాటే ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడిఇది కొత్తపేట శివారులోనే చెక్డ్యామ్ను కూల్చివేసిన ప్రదేశం. చెక్డ్యామ్ లేకుండా పోవడంతో పది ఎకరాల ఫారెస్ట్ భూమి సాగులోకి వచ్చింది. ట్రాక్టర్ ఉండడంతో ఇటీవల అటవీ భూమిని దున్నేసి పత్తివిత్తనాలు పెట్టాడు. అటవీ భూమిలోనే గుట్టుగా బోరు వేశాడు. నీరు బాగానే పడింది. దూరంగా ఉన్న విద్యుత్ స్తంభం నుంచి వైర్లు లాగి మోటారు పెట్టాడు. సదరు చెక్డ్యామ్ కూల్చిన కొత్తపేట వ్యక్తి పది ఎకరాల ఆసామి అయ్యాడు. ఆ భూమి విలువ ఇప్పుడు మార్కెట్లో రూ.కోటిన్నర. ఇది వీర్నపల్లి మండలం గర్జనపల్లి గిరిజనతండా శివారులో ఇటీవల ఇలా చెట్లను తొలగిస్తున్నారు. ఆ తొలగించిన చెట్ల కొమ్మలు అక్కడే ఎండిపోయిన తరువాత వంట చెరుకుగా వాడుతున్నారు. మరో ఏడాది ఆ భూమిని దున్నుకుని పంటను సాగు చేసుకునేందుకు వీలుగా వా డుకుంటున్నారు. సహజసిద్ధంగా అడవి లో ఎదుగుతున్న చెట్లను ఇలా కొట్టేశారు. వీరంతా వీర్నపల్లి మండలం రంగంపేట వాసులు. హరితహారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కులు నాటేందుకు బుధవారం వెళ్లగా ఆ భూములు తమవి అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు చెందిన తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏళ్లుగా ఆ భూముల్లో పంటలు పండిస్తున్నామని, ఇప్పుడు మొక్కలు నాటితే తమకు బతుకుదెరువు లేదని వాదించారు. ప్రస్తుతం 132 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటకుండా రైతులు పంట వేయకుండా అలాగే ఉంది.. ఇవి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన వాస్తవాలు. -
కొడుకును చూసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో చదువుతున్న కుమారుడు సుశాంత్ను చూసేందుకు వచ్చిన తల్లి చందన(32) గుండెపోటుతో మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన చందన–నరేశ్ దంపతుల కుమారుడు సుశాంత్ను వారం క్రితం రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. సుశాంత్ను చూడటానికి గురువారం తల్లిదండ్రులు వచ్చారు. అనంతరం చందన పై అంతస్తులో ఉన్న వాష్రూమ్కు వెళ్లి అక్కడే కుప్ప కూలిపోయింది. గమనించిన సిబ్బంది సమాచారంతో వెంటనే చేరుకున్న ఉపాధ్యాయుడు ఆమెకు సీపీఆర్ చేశారు. అక్కడికొచ్చిన ఆర్బీఎస్కే వైద్యుల సైతం ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అనంతరం 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. వేములవాడ సంస్కృత పాఠశాలలో ఘటన -
రైతులకు ‘ముందస్తు’ సూచనలు
● పొలాసలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం ● ఐదు రోజుల ముందే అన్నదాతకు సలహాలు ● మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్జగిత్యాలఅగ్రికల్చర్: భూమి దున్నేది మొదలు.. పంట పండించి మార్కెట్లో అమ్మేవరకు వాతావరణ పరిస్థితులు రైతులకు అగ్ని పరీక్షగా మారుతున్నా యి. ఓ ఏడాది రుతుపవనాలు ముందుగా వస్తే.. మరో ఏడాది ఆలస్యంగా వస్తాయి. అయితే పొడి వాతావరణం.. లేకుంటే బెట్ట పరిస్థితులు, వరదలు, తుపాన్లు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు వాతావరణ సూచనలు, సలహాలు అందించేందుకు జగిత్యాలలోని పొలాసలో ఆటోమెటిక్ వాతావరణ కేంద్రం ఏర్పాటు చేశారు. భారత వాతావరణ శాస్త్ర విభాగం, వ్యవసాయ పరి శోధన సంస్థ, శాస్త్ర, సాంకేతిక విభాగం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వాతావరణ విభా గాన్ని ప్రారంభించారు. ఈ విభాగం ద్వారా వాతా వరణ పరిస్థితులను ఐదురోజుల ముందుగానే తె లు సుకునే వెసులుబాటు ఉంది. కచ్చితమైన సమాచారం కోసం ఆధునాతన టెక్నాలజీతో రూపొందించిన నాలుగైదు పరికరాలను బిగించారు. ● ప్రతిరోజూ ఉదయం 7.16గంటలకు.. మధ్యాహ్నం 2.16 గంటలకు వాతావరణ కేంద్రం పరిధిలోని సూర్యరశ్మి, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగం, ఏ దిశగా గాలి వీస్తున్నదనే విషయాలను సేకరించి వాతావరణ కేంద్రం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. ● పూర్తిగా కంప్యూటరీకరించిన కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు మరికొంత డాటా ఆటోమెటిక్గా భారత వాతావరణ కేంద్రానికి వెళ్తుంది. ● సెలవు లేకుండా 365 రోజులూ ఈ వాతావరణ కేంద్రం పనిచేస్తుంది. ● వర్షం, గాలి వేగం, ఉష్ణోగ్రతల పరికరాలన్ని ఒకేదాంట్లో ఇమిడి ఉంటాయి. ● రానున్న ఐదురోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయాలు ఈ ఆటోమెటిక్ కేంద్రం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ● ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్ను మీడియా, వ్యవసాయ శాఖ అధికారులకు పంపిస్తారు. ● అప్పటి వాతావరణాన్ని బట్టి రైతులు పంటల సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలు కూడా వివరిస్తారు. ● ఐదు రోజుల్లో వర్షపాతం ఎలా ఉంటుంది.. గాలి వేగం ఎంత.. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి వంటి విషయాలు ఈ బులెటిన్లో ఉంటాయి. ● ముందస్తు వాతావరణ సమాచారం తెలియడం ద్వారా రైతులు అప్రమత్తమై పంట నష్టాన్ని, ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. -
‘హద్దులు’ తేలేదెప్పుడో..!
● ప్రాజెక్ట్ పనుల్లో సర్వేయర్లు ● శిక్షణలో మరికొంత మంది ● భూ సమస్యలతో అన్నదాతలుజగిత్యాల: భూమి హద్దులు తేలక.. సమస్యలు పరిష్కారంకాక రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా భూమి గెట్లకు సంబంధించిన గొడవలు జరుగుతుంటాయి. క్రయవిక్రయాలు జరిగినా భూముల కొలతల కోసం తహసీల్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటారు. సర్వేయర్లు వచ్చి నక్ష ద్వారా భూ కొలతలు చేసి పంచనామా చేసి రైతులకు అందిస్తారు. కానీ.. జిల్లాలో మూడు నెలలుగా సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సర్వేకు దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా పరిష్కారం కాకపోవడంతో దీంతో రైతులకు మధ్య తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేధిస్తున్న సర్వేయర్ల కొరత జిల్లాలోని 20 మండలాల్లో 14 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారు. దీనికితోడు ఇటీవల మూడు ప్రాజెక్ట్లు ప్రారంభమయ్యాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కోమనపల్లిలో మ్యాప్ పటాలు తయారు చేస్తుండగా.. భూ భారతి చట్టంలో స్కెచ్లు, మ్యాప్లు వేసేందుకు పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే మున్సిపాలిటీల్లో నక్ష ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో ఆ దిశగానే అధికారులు పనులు చేస్తున్నారు. ఒక్కో ప్రాజెక్ట్కు నలుగురు సర్వేయర్లను ఎంపిక చేశారు. ఉన్న 14 మందిలో 12 మంది ప్రాజెక్ట్లలో ఉంటుండగా.. మరో ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణలో పాల్గొంటున్నారు. ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్లను కూడా ఈ ప్రాజెక్ట్లకు ఇన్చార్జిలుగా నియమించారు. దీంతో రైతుల సమస్యలు ఇప్పట్లో తీరేలా లేవు. ప్రస్తుతం ఉన్న 14 మంది వివిధ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నం కావడంతో రైతులకు సంబంధించిన కొలతలు చేపట్టకపోవడం ఇబ్బందిగా మారింది. రానున్న లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ కళాశాలలో శిక్షణ ఇస్తోంది. లైసెన్స్డ్ సర్వేయర్ల నియమకాలతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. పెండింగ్లోనే దరఖాస్తులు భూ సర్వే కోసం జిల్లాలో 420కి పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. భూ కొలతల కోసం రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. హద్దులు తేలక.. పంచాయితీలు పెరుగుతున్నాయి. అధికారులు స్పందించి కొలతలు చూపించి సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు. ఎండకాలంలోనే మేలు వాస్తవానికి రైతులకు ఎండకాలంలో పనులు తక్కువగా ఉంటాయి. భూముల్లో కూడా ఎలాంటి పంటలూ వేయరు. భూములు బీడుగా ఉండటంతో కొలతలు సులువుగా చేపట్టే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది రైతులు ఎండకాలంలో సర్వే చేయించేందుకే మొగ్గు చూపుతుంటారు. వర్షకాలం, చలికాలంలో పంటలు వేయడం ద్వారా భూమి కొలతలకు ఎవరూ ముందుకురారు. హద్దులు నిర్ణయించడం కూడా కష్టతరంగా ఉంటుంది. ఎండకాలానికి ముందే దరఖాస్తు చేసుకున్న రైతులు ఇంకా ఎదురుచూసూనే ఉన్నారు. 250 మంది సర్వేయర్లకు శిక్షణ భూ రికార్డుల రూపొందించడంలో భాగంగా జిల్లాలో 250 మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాలలో శిక్షణ పొందుతున్న లైసెన్స్డ్ సర్వేయర్లను కలిసి పలు సూచనలు చేశారు. భూ తదాగాలు లేకుండా కచ్చితమైన భూపటం అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఏడీ వెంకట్రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ అశోక్ పాల్గొన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో సర్వేయర్లు కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేయర్లు ప్రాజెక్ట్ పనుల్లో ఉన్నారు. భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ మ్యాప్లు, మున్సిపాలిటీల్లో నక్షలు రూపొందించే పనుల్లో సర్వేయర్లు ఉన్నారు. ఆ పనులు పూర్తి కాగానే రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. – వెంకట్రెడ్డి, ఏడీ -
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం గొల్లపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.2 లక్షలతో నిర్మించే డ్రైనేజీ, ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో గాయత్రి, ఏఈ రాజమల్లయ్య, మాజీ సర్పంచ్ ప్రకాశ్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, నాయకులు సదాశివరావు, బాలముకుందం, శంకర్ పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేయాలి జగిత్యాల: అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో అమృత్ 2.0 పథకం కింద రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న రూ.15 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ట్యాంక్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నృసింహుడి హుండీ ఆదాయం రూ.71.53 లక్షలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.71,53,190 సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. మార్చి 21 నుంచి ఈనెల 26 వరకు (98 రోజులు) వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా నగదుతోపాటు 68 గ్రాములు మిశ్రమ బంగారం, 7.400 కిలోల మిశ్రమ వెండి, 32 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రజ, ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, అర్చకులు తదితరులున్నారు. ఆల్ ఇండియా సెమ్స్ ఒలింపియాడ్లో ప్రతిభసప్తగిరికాలనీ(కరీంనగర్): సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ నేషనల్ సెమ్స్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభకనబర్చి ఆల్ ఇండియా, స్టేట్ లెవల్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. ఎన్.రక్షిత ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, కె.మహిత ఆల్ ఇండియా 4, స్టేట్ లెవల్లో పి.మహిధర్, ఆత్రేయులు 2, మహిత 3, మహి చౌదరి 7 పరీక్షిత్ సారధి, అభిగ్నలు 10వ ర్యాంకులతో పాటు పలువురు విద్యార్థులు జోనల్ ర్యాంకులు సాధించారని తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కో ఆర్డినేటర్లు, ఇన్చార్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలు ‘బడిబాట’
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. 2024–25 విద్యా సంవత్సరం కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో పురోగతి కనిపించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పెరుగుదల నమోదవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. జగిత్యాల 39శాతం పెరుగుదలతో తొలిస్థానంలో నిలవగా కరీంనగర్ 32శాతంతో రెండోస్థానం దక్కించుకుంది. ఇక పెద్దపల్లి 19శాతంతో మూడోస్థానంలో నిలవగా సిరిసిల్ల 10శాతంతో నాలుగోస్థానం దక్కించుకుంది. ఈ పురోగతిలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది తమ పరిధిలో విద్యార్థులను ప్రభుత్వపాఠశాలలో చేర్చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం కలిసొచ్చింది. చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతఖర్చులు వెచ్చించి మరీ ప్లెక్సీలు, పోస్టర్లు, రీల్స్, వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలే ఈ ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చేశాయి. అగ్రభాగాన జగిత్యాల.. ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల అగ్రభాగన నిలవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో జగిత్యాల పెద్దది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలు కలిసి వచ్చాయి. కలెక్టర్, డీఈవో, ఎంఈవోలు క్రమశిక్షణతో పనిచేయడం ఎన్రోల్మెంట్ పెరుగుదలకు దోహదం చేసింది. ఇక మిగిలిన జిల్లాలు విస్తీర్ణం, జనాభా పరంగా చిన్నవి కావడంతో ఎన్రోల్మెంట్లోనూ జగిత్యాల తరువాత స్థానంలో నిలిచాయి. కరీంనగర్తోపాటు సిరిసిల్లకు ఇన్చార్జిగా ఉండే డీఈవోను ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో ఉన్నతాధికారులు తప్పించారు. అనంతరం కామారెడ్డి డీఈవోకు సిరిసిల్ల అదనపు బాధ్యతలు ఇచ్చినా.. ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జెడ్పీ సీఈవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీచర్ల విషయంలో పర్యవేక్షణ కొరవడి ఎన్రోల్మెంట్లో కాస్త వెనకబడింది. సిరిసిల్ల చిన్న జిల్లా కావడం, విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్నది కావడం కూడా కారణాలే.ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలు జిల్లా గతేడాది ఈ ఏడాది పెరుగుదల (శాతం) జగిత్యాల 3,690 5,147 39కరీంనగర్ 4,831 6,393 32పెద్దపల్లి 3,612 4,295 19సిరిసిల్ల 6,280 6,901 10 ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్రోల్మెంట్ అత్యధిక విద్యార్థుల నమోదుతో జగిత్యాల టాప్ తక్కువ నమోదుతో సిరిసిల్ల లాస్ట్ గతేడాది కన్నా పెరిగిన విద్యార్థుల నమోదుతల్లిదండ్రులను ఒప్పించాంబాలల బలోపేతం కోసం బడిబాటలో ప్రతీ ఇంటి తలుపుతట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశాం. నాణ్యమైన భోజనం, ప్రత్యేక తరగతుల గురించి వివరించాం. ఖర్చుల భారం తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడంప్రారంభించారు. – కె.రాము, డీఈవో, జగిత్యాల -
వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి
వాతావరణానికి సంబంధించిన ముందస్తు సమాచారం ఉపయోగపడుతోంది. వర్షం వస్తుందనే సమాచారం ఉంటే ఎరువులు వేయడం మానేస్తాం. ధాన్యం ఆరబెడితే వెంటనే కవర్లు కప్పుకుంటున్నాం. పంటలకు సాగు నీటిని ఇవ్వడం బంద్ చేస్తాం. సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇస్తే బాగుంటుంది. – కాటిపెల్లి గంగారెడ్డి, రాయికల్ వారంలో రెండు రోజులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో వాతావరణానికి సంబంధించి ప్రత్యేక బులెటిన్ను మీడియాకు విడుదల చేస్తున్నాం. ప్రతిరోజు వాతావరణ కేంద్రంలోని పరిస్థితులను రెండు సార్లు సేకరించి వాతావరణ కేంద్రం వెబ్సైట్లో పొందుపర్చుతాం. ముందస్తు సూచనలు ఇవ్వడం వల్ల రైతులు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస ఆధునాతన టెక్నాలజీతో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆధునాతన టెక్నాలజీతో ముందస్తు వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తున్నాం. కచ్చితమైన డాటాను రికార్డు చేయడంతో వాతావరణానికి సంబంధించి మెరుగైన సమాచారం వస్తుంది. ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసి, వారికి తగిన సలహాలు ఇస్తున్నాం. – శ్రీలత, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస -
లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.7లక్షలకు టోకరా
సిరిసిల్లక్రైం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి ఏకంగా రూ.7లక్షలు దండుకున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు గురువారం కటకటాలకు పంపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్ జిల్లా పిల్లోనా మండలం సీపూర్కు చెందిన కపిల్శర్మ, అదే ప్రాంతంలోని ఇస్మాయిల్పూర్కు చెందిన పంకజీ కౌశిక్ ఇద్దరు కలిసి సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఓ వెబ్ అప్లికేషన్ లింక్ను రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుగులోతు రమేశ్కు 2024, డిసెంబర్ 8న పంపారు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టబడి పెడితే అధి క లాభాలు వస్తాయని నమ్మించి రూ.2500 పెట్టుబడిగా పెట్టించారు. మరుసటి రోజు అదనంగా డబ్బులు వచ్చాయి. దీన్ని నమ్మిన రమేశ్ విడతల వారీగా రూ.7లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. తర్వాత ఆ వెబ్సైట్ కనిపించలేదు. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన రమేశ్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఎస్సై జునైద్, హెడ్ కానిస్టేబుల్ గంగారం, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ మహేశ్ నిందితుల కోసం గాలించారు. ఈక్రమంలో రాజస్థాన్లోని జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. వెబ్లింక్తో మోసానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్ బీ గీతే -
ప్రజల భాగస్వామ్యంతోనే ‘మత్తు’ నిర్మూలన
జగిత్యాలటౌన్: ప్రజల భాగస్వామ్యంతోనే మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎస్పీ అశోక్కుమార్తో కలిసి జిల్లాకేంద్రంలోని మున్సిపల్ పార్క్ నుంచి మినీస్టేడియం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మత్తుపదార్థాలకు యువత, విద్యార్థులు బానిసలై భవిష్యత్ను అంధకారం చేసుకోవద్దన్నారు. చెడు అలవాట్లను దూరం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్తు నివారణకు యువత ముందుకు రావాలన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్కు బానిస కావద్దన్నారు. మత్తుతో కలిగే పరిణామాలపై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో పోలీస్ కళాబృందాలతో ప్రచారం చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, బీసీ సంక్షేమాధికారి నరేశ్, డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ స్పందన తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ హాజరైన ఎస్పీ అశోక్కుమార్ -
మత్తుతో భవిష్యత్ అంధకారం
మెట్పల్లి: మత్తు పదార్థాలకు అలవాటు పడితే యువత భవిష్యత్ అంధకారం అవుతుందని మెట్పల్లి మేజిస్ట్రేట్ నాగేశ్వర్రావు అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మనోహార్ గార్డెన్లో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. పలు పాఠశాలల విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువుపై దృష్టి పెట్టి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. డీఎస్పీ రాములు మాట్లాడుతూ మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, వినియోగించినా.. విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ సీఐ వినోద్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, ఎంఈఓ చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్రెడ్డి తదితరులున్నారు. సమైక్య సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధిమల్లాపూర్: సమైక్య సంఘాలతో మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందుతారని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ భారతి అన్నారు. మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికై న గ్రామసంఘాల పదాధికారులు, అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులకు శిక్షణ ఇచ్చారు. మహిళా సంఘాల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తేవాలన్నారు. శిక్షణలో ఏపీఎం రమ, సమాఖ్య అధ్యక్షురాలు సత్తెమ్మ, ఐకేపీ ఏపీఎం దేవరాజ్, సీసీలు, తదితరులు పాల్గొన్నారు. ఆషాఢమాసంలో విశ్వ బ్రాహ్మణుల తొలి బోనాలు గొల్లపల్లి: ఆషాఢమాసం పురస్కరించుకుని మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణులు పోచమ్మ (పోలేరమ్మ) అమ్మవారికి గురువారం తొలిబోనాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీకోటీ భూమయ్య, దేవరకొండ శ్యామ్సుందర్, మారియో, ఎదులాపురం భాస్కరాచార్య, గణేశ్, కరుణాకర్కుమార్, నిరంజన్, రాజన్న, చారి, మహిళలు పాల్గొన్నారు. టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శిగా చంద్రశేఖర్మల్యాల: టీఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శిగా మండలంలోని ముత్యంపేటలోగల కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పర్యవేక్షకులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబ్ చంద్రశేఖర్ను పూలమాలతో సన్మానించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగెం లక్ష్మణ్రావు, నాగేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, నాయకులు రాగి శ్రీనివాస్, నరసింహస్వామి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వాహనాలు నడుపుతున్న 35మంది మైనర్ల పట్టివేతమెట్పల్లి: పట్టణంలో ఎస్సై కిరణ్కుమార్ తన సిబ్బందితో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా 35మంది మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారి వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రుల పై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. మొదటిసారి పట్టుబడిన మైనర్లతోపాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తామని, రెండోసారి పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
టీబీ బాధితులు జాగ్రత్తలు పాటించాలి
ధర్మపురి: టీబీ లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం టీబీ బాధితులకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని శ్రీనివాస్ సందర్శించారు. టీబీ లక్షణాలున్నవారు ప్రతినెలా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వారు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లపై వివరించారు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మండల వైద్యాధికారులు శివకుమార్, అస్మాతరుణుం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాస్, హెచ్ఈవో సతీష్కుమార్, ఆరోగ్య పర్యవేక్షకులు తదితరులున్నారు. -
గిరిజనుల వికాసానికే పథకాలు
రాయికల్: గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రాజ్కుమార్ తెలిపారు. మండలంలోని దావన్పల్లి గురువారం పీఎంధర్తీఆబాజాన్ జాతీయ ఉత్కర్ష్ అభియాన్పై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో దావన్పల్లి, బోర్నపల్లి గ్రామాలు ఎంపికయ్యాయని, ఒకేరోజు 20 శాఖల అధికారులు వచ్చి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని దరఖాస్తులు స్వీకరిస్తారని, అర్హులందరికీ న్యాయం చేస్తామని వెల్లడించారు. -
తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. శవమైన తనయుడు
చందుర్తి(వేములవాడ): అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిన తనయుడు శవమై ఇంటికి రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంఘని లక్ష్మీరాజం ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. పదిహేను రోజుల క్రితం లక్ష్మీరాజం కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో కొడుకు తిరుపతి కరీంనగర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ కాలు పై భాగానికి పోయిందని తెలపడంతో కొడుకు తిరుపతి మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన తిరుపతి అక్కడే పడిపోవడంతో తలకు తీవ్రంగా గాయమైంది. తలలోని నరాలు చిట్లిపోయాయని, వెంటనే ఆపరేషన్ చేశారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్పై ఉన్న తిరుపతి గురువారం మృతిచెందాడు. తిరుపతికి భార్య రజిత, ఆరేళ్ల కుమారుడు గణేశ్ ఉన్నారు. మమ్మల్ని చూసుకునే దిక్కెవరూ కొడుకా.. పోషించే కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. అయ్యను దవాఖానాకు తీసుకుపోయి నువ్వే ప్రాణాలు పోగొట్టుకుంటివా బిడ్డా.. అంటూ ఆ తల్లి లింగవ్వ రోదనలు స్థానికులను కలచివేశాయి. తండ్రి ఆరేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న కంటికి రెప్పలా చూసుకుంటివి బిడ్డా.. మాకిప్పుడు ఎవరూ దిక్కంటూ గుండెలవిసేలా రోదించింది. మల్యాలలో మిన్నంటిన రోదనలు -
హామీలు నెరవేర్చకుంటే సార్వత్రిక సమ్మె
కోరుట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల హామీలు నెరవేర్చకుంటే జూలై 9 నుంచి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగనున్నట్టు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు సాయీశ్వరి తెలిపారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి బోనగిరి నరేశ్కు సమ్మె నోటీసు అందించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల సూచన మేరకు అంగన్వాడీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఐసీడీఎస్ స్థాపించి 50 ఏళ్లు గడుస్తున్నా ఐసీడీఎస్ను శాశ్వతసంస్థగా అంగీకరించటం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపటం సరికాదన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి సమ్మెకు దిగుతున్నట్టు పేర్కొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు, రూ.10 వేల పింఛన్, గ్రాట్యూటీ, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
నెరవేరిన దశాబ్దాల కల
● జగన్నాథ్పూర్ వంతెన నిర్మాణానికి రూ.17.5కోట్లుజగిత్యాలటౌన్: రాయికల్ మండలం జగన్నాథ్పూర్ – బోర్నపల్లి మధ్య గోదావరిపై నిర్మించే వంతెన నిర్మాణానికి రూ.17.5కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఆదివాసీలు మాజీమంత్రి జీవన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ముందుగా పట్టణ పోలీస్స్టేషన్ నుంచి ఇందిరాభవన్ వరకు డోలు చప్పుళ్లతో చేరుకున్నారు. అక్కడ జీవన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి లక్ష్మణ్కుమార్ సహకారంతో నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వంతెన పూర్తయితే మల్లాపూర్ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ నాయకులు, జగన్నాథ్పూర్, బోర్నపల్లి ఆదివాసీలు ఉన్నారు. -
వైద్య కళాశాలలో వసతులు మెరుగుపర్చాలి
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాలను నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారి శివరాంప్రసాద్ బుధవారం సందర్శించారు. వైద్య కళాశాల వసతి గృహంలో ఇబ్బందులు ఉన్నట్లు వార్తలొస్తున్నాయని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని సూచించారు. కళాశాలలో వసతులు మెరుగుపర్చాలని ఆదేశించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ.. వసతుల కల్పనపై ఇప్పటికే వైద్య శాఖ మంత్రి దామోదర నర్సింహ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని వివరించారు. అనంతరం ఎన్ఎంసీ సభ్యులు కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి సమీక్షించారు. వారివెంట ప్రిన్సిపల్ ఖాద్రి ఉన్నారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి పనులు నాణ్యతతో చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలోని 27వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ చేశారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, డ్రైనేజీలు, సీసీరోడ్లు నిర్మించేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కృష్ణహరి, అడువాల లక్ష్మణ్, శంకర్, సుధాకర్, నాగయ్య, మహేందర్ పాల్గొన్నారు. -
రేషన్.. పరేషాన్
● మూడునెలల బియ్యం ఒకేసారి ● లబ్ధిదారులకు తప్పని తిప్పలు ● రేషన్ షాపుల వద్ద బారులు ● ఈనెల 30 వరకే గడువు ● 89 శాతం పంపిణీ పూర్తి రేషన్కార్డులు: 3,18,731బియ్యం కోటా(3నెలలకు): 17,500 టన్నులు రేషన్ తీసుకున్నది: 2,84,237 మంది పూర్తయింది: 89 శాతం పూర్తి చేయాల్సింది: 11 శాతం జగిత్యాల: రేషన్ లబ్ధిదారులకు మూడునెలల బియ్యాన్ని ఒకేనెలలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల నుంచి సరఫరా చేస్తున్నారు. ఈనెల 30లోపు అర్హులందరికీ బియ్యం పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు 89 శాతం మంది లబ్ధిదారులు మూడునెలలకు సంబంధించిన సరుకులు పొందారు. మిగతా లబ్ధిదారులు కొన్ని దుకాణాల్లో స్టాక్ నిల్వ లేకపోవడం, స్టాక్ రాలేదని మూసివేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని రేషన్షాపుల్లో పంపిణీలో జాప్యంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. మొదట బియ్యం పంపిణీ చేసిన సమయంలో ఒక్కో లబ్ధిదారులు ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడం, సర్వర్లు మొరాయించడంతో అవస్థలు పడ్డారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడటంతోపాటు, షాపుల ముందు చెప్పులు, సంచులు, రేషన్కార్డులు లైన్లో పెట్టుకున్నారు. మొదటి 10 రోజులపాటు నానా ఇక్కట్లకు గురయ్యారు. అయినప్పటికీ 89శాతం పంపిణీ పూర్తి చేశారు. ఇంకా 11 శాతం మందికి పంపిణీ చేయాల్సి ఉంది. చివరి దశకు పంపిణీ రేషన్ షాపుల్లో బుధవారం వరకు 89 శాతం లబ్ధిదారులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో 3,18,731 రేషన్కార్డులు ఉండగా 2,84,237 మందికి బియ్యం అందించారు. కొన్నిచోట్ల స్టాక్ లేకపోవడంతో లబ్ధిదారులు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల వేలిముద్రలు వేసే చోట సర్వర్ మొరాయించడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. స్టాక్ రాగానే పంపిణీ చేస్తున్నామని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం అందజేస్తున్నామని, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 89 శాతం పంపిణీ పూర్తి జిల్లాలో రేషన్కార్డు లబ్ధిదారులకు ఇప్పటివరకు 89 శాతం రేషన్ పంపిణీ పూర్తయింది. కొన్ని చోట్ల ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నాం. స్టాక్ లేని చోట్ల మరోరోజు వెంటనే పంపిస్తున్నాం. ఈనెల 30 వరకు పూర్తిస్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – జితేందర్రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
శాంతిభద్రతలను పరిరక్షించాలి
కోరుట్ల: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు కృషి చేయాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. కోరుట్ల సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. నమోదవుతున్న నేరాలు, విచారణలో ఉన్న కేసులు, సీడీ ఫైల్స్, పెండింగ్ సీసీ ఫైళ్లపై ఆరా తీశారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా విచారణ ఉండాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రజలకు సైబర్ నేరాలు, వివిధ సామాజిక అంశాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించి అన్ని చోట్ల కెమెరాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చడానికి మరింత కృషి చేయాలన్నారు. మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల సీఐ సురేష్బాబు, ఎస్సైలు శ్రీకాంత్, రాంచంద్రంగౌడ్, శ్యామ్రాజ్, నవీన్, సుప్రియ పాల్గొన్నారు. వర్షాల కోసం వరుణ గాయత్రి మహాయజ్ఞంజగిత్యాలటౌన్: వర్షాలు కురవాలంటూ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో బుధవారం వరుణగాయత్రి యజ్ఞం నిర్వహించారు. యజ్ఞం నిర్వాహకులుగా కనపర్తి నాగభూషణం, సహాయకులుగా మంచి గంగారాం వ్యవహరించారు. నాగేశ్వర్రావు, పుట్టబత్తిని శంకర్, కనపర్తి నాగభూషణం, ఇల్లెందుల పురుషోత్తం, చింత శ్రీనివాస్ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ నిర్వాహకులు కొమురవెల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు ప్రోత్సహించాలి జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని డీఎంఏ శివరామకృష్ణ అన్నా రు. జిల్లాకేంద్రంలోని మాతాశిశు సంక్షేమ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. పిల్లలకు మె రుగైన వైద్యం అందించాలని, న్యూబార్న్ కేంద్రంలో అన్ని వసతులున్నాయని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సమయపాలన పాటించాలన్నారు. అనంతరం లేబర్ రూమ్, న్యూబార్న్ కేంద్రం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీఎంహెచ్వో ప్రమోద్ కుమార్, ప్రో గ్రాం ఆఫీసర్లు శ్రీనివాస్, రవీందర్ ఉన్నారు. జిల్లాకేంద్రంలో భారీ వర్షంజగిత్యాల: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. సిగ్నల్ లేకపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. నేటినుంచి పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్సైన్స్ కళాశాలలో ప్రవేశాలకు పాలిసెట్కు స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 26 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో వెరిఫికేషన్ ఉంటుందని, అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్లతో హాజరు కావాలని సూచించారు. జూలై ఒకటోతేదీ వరకు వెబ్ ఆప్షన్లు సమర్పించాలన్నారు. వివరాలకు అడ్మినిస్ట్రేటర్ మధుకర్ 81215 13671 సంప్రదించాలని సూచించారు. -
వర్షం పడితే భయమే..
మా కాలనీలో ఉన్న పెద్ద చెరువులోంచి ఏటా వర్షాలు కురిస్తే సమీప ప్రాంతంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతోపాటు కేశవనగర్ అంతా జలమయం అవుతుంది. పెద్ద చెరువు వద్ద రక్షణ గోడ ఏర్పాటు చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది. – ఎలిగేటి అనిల్కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడుచర్యలు తీసుకుంటాం రాయికల్ బల్దియా పరిధిలోని పెద్ద చెరువు నుంచి వరదనీరు కాలనీలను ముంచెత్తి ఇళ్లలోకి చేరుతుందని తెల్సింది. వర్షాలు కురిసినప్పుడు ఇళ్లలోకి నీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకుంటాం. పెద్ద చెరువు వద్ద ఎమ్మెల్యే సంజయ్కుమార్ సహకారంతో రక్షణ గోడను ఏర్పాటు చేస్తాం. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
డ్రైనేజీల్లో పూడికతీత
జగిత్యాల: చెత్తాచెదారం పేరుకుపోయిన డ్రైనేజీలను బల్దియా సిబ్బంది శుభ్రం చేయించారు. బల్దియా పరిధిలో డ్రైనేజీలు పేరుకుపోవడంతో ‘పారిశుధ్యం అస్తవ్యస్తం’ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించిన విషయం తెల్సిందే. ఈ కథనానికి స్పందించిన మున్సిపల్ అధికారులు జిల్లాకేంద్రంలోని గొల్లపల్లి రోడ్లోగల శ్మశాన వాటిక సమీపంలోని డ్రైనేజీలో పూడికను జేసీబీ సహాయంతో తొలగించారు. నర్సింగాపూర్ కాలనీలోగల డ్రైనేజీల్లోని చెత్తాచెదారాన్ని మున్సిపల్ కార్మికులు తొలగించారు. సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ స్పందన అన్నారు. -
చిన్న మొక్కలు నాటొద్దు
జగిత్యాల: వన మహోత్సవంలో భాగంగా చిన్నమొక్కలు కాకుండా పెద్దవి నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వనమహోత్సవం, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ ఏడాది 48 లక్షలకుపైగా మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈనెల 30 వరకు స్థలాలు ఎంపిక చేయాలన్నారు. మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు, కర్రలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఇచ్చిన కొలతల ప్రకారం ముగ్గు పోయించాలని సూచించారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టాలని, నీటి నిలువ ఉన్న చోట ఆయిల్బాల్స్ వేయాలన్నారు. పారిశుధ్య లోపంపై కలెక్టర్ అసహనం కొడిమ్యాల: మండలకేంద్రంలోని మోడల్ స్కూల్ను కలెక్టర్ సందర్శించారు. పరిసరాల్లో చెత్తాచెదారం ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని, వంటశాలలో శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. ఆయన వెంట జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో స్వరూపరాణి, సిబ్బంది ఉన్నారు. సివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణసివిల్ సర్వీసెస్లో ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ మేరకు నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో జూలై 7వరకు దరఖాస్తు చేసుకోవాలని, 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. -
మహిళలు ఆరోగ్యంగా ఉండాలి
జగిత్యాలక్రైం: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం సవ్యంగా సాగుతుందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో మహిళ పోలీసు సిబ్బందికి హెచ్పీవీ క్యాన్సర్ వ్యాక్సినేషన్పై ఐఎంఏ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తిస్తే ప్రాణాపాయం ముప్ప తగ్గించవచ్చన్నారు. వైద్యులు మహిళల్లో రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లపై వివరించారు. ఐఎంఏ అధ్యక్షుడు గూడూరి హేమంత్, సెక్రటరీ ఆకుతోట శ్రీనివాస్రెడ్డి, వైద్యులు పద్మినికుమార్, శ్రీలత, ఏవో శశికళ, ఎస్సై గీత పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు స్లోగన్రైటింగ్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మత్తుపదార్థాల నిర్మూలనకు విద్యార్థుల్లో చైతన్యం తేవాలన్నారు. అనంతరం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఎంపిక చేసిన విద్యార్థులను జిల్లా కేంద్రంలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేశామన్నారు. రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషిసారంగాపూర్: బీర్పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తికి నిరంతరం కృషిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ తెలిపారు. బీర్పూర్ మండలకేంద్రంలో బుధవారం కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ప్రాజెక్టు నిర్మాణం 90శాతం పూర్తయినా అటవీ, పర్యావరణ అనుమతులకు ఆలస్యం అవుతోందన్నారు. సత్వర అనుమతుల కోసం కేంద్ర, రాష్ట్ర ఉన్నతస్థాయి అటవీ అధికారులను కలిశానని పేర్కొన్నారు. రోల్లవాగు ప్రాజెక్టుపై కొంతమంది రాజకీయం చేయడం సరికాదన్నారు. కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్రావు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో లచ్చాలు, విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏం సాధించారని సంబరాలు..?
● రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా..? ● అన్నివర్గాలను నిండా ముంచినందుకా..? ● గతంలో రెండుసార్లు రైతు భరోసా ఎగవేతకా..? ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాల: రైతు భరోసా ఇచ్చామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా..? అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచినందుకా..? ఎందుకు సంబరాలు అని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. రెండుసార్లు రైతుభరోసా ఎగవేశారని, ఇంకా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని, రైతుకూలీలకు రూ.12వేలు, కౌలు రైతులకూ రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ అరకొరగానే ఇచ్చారని, ఇప్పుడు కూడా అందరికి కాకుండా కొందరికే రైతుభరోసా ఇచ్చి తామేదో సాధించామంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. 519 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎళ్లప్పుడు నీరందించాలనే దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్ట్ నిర్మించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక చెక్డ్యామ్, చెరువు, ఒక ప్రాజెక్ట్ నిర్మించారా అని ప్రశ్నించారు. సీఎంకు బనకచర్ల, దేవాదుల ప్రాజెక్ట్, గోదావరి, కృష్ణ బేసిన్లు ఎక్కడున్నాయో కూడా తెలియదన్నారు. గోదావరి నీటిని చంద్రబాబుకు అప్పగించడంలో భాగంగా ప్రజల దృష్టి మళ్లించడానికే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర మంత్రి సంజయ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను వక్రీకరించి తుమ్మడిహట్టి ద్వారా నీళ్లు వస్తాయని చెబుతున్నారని, కేంద్రం నుంచి 152 మీటర్ల ఎత్తుతో పర్మిషన్ తీసుకొస్తే సన్మానం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి పిచ్చిమాటలు, బూతుమాటలు మానుకుని బనకచర్ల ప్రాజెక్ట్ గురించి పోరాటం చేయాలన్నారు. వెంటనే రైతులకు ఎగ్గొట్టిన రైతు భరోసా, రుణమాఫీ ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, సాయిరెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు. -
వర్షాకాలం.. ముంపు భయం
● బల్దియాలో మునుగుతున్న కాలనీలు ● ముందు జాగ్రత్తలు చేపట్టని అధికారులు రాయికల్: వర్షాకాలం వచ్చిందంటేనే రాయికల్ బల్దియా ప్రజల్లో వణుకు పుడుతుంది. పెద్ద వర్షం కురిసిందంటే చాలు శివారు కాలనీలను వరదనీరు ముంచెత్తుతుంది. ఏటా ఇదే తతంగం కొనసాగుతున్నా.. బల్దియా అధికారులు మాత్రం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. బల్దియా పరిధిలోని పెద్ద చెరువు సుమారు 200 ఎకరాల విస్తీర్ణం ఉంటుంది. రాయికల్, మైతాపూర్, చెర్లకొండాపూర్ గ్రామాలకు సాగునీటికి ఈ చెరువే ఆధారం. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాల పెంపునకూ ఇది ఎంతో దోహదపడుతుంది. అయితే వర్షకాలంలో మాత్రం చెరువు నిండి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తే బల్దియాలోని 5, 6, 7 వార్డుల్లోని ఇళ్లలోకి నీరు చేరుతుంది. ము ఖ్యంగా భీమన్నవాడ, మత్తడివాడ, గొల్లవాడ, కేశవనగర్ కాలనీలు వానకాలం వచ్చిందంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పెద్ద చెరువు నిండినప్పుడు చెర్లకొండాపూర్, రాయికల్, మైతాపూర్ చెరువు కట్ట తీర ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతారు. కానరాని చర్యలు రాయికల్ మత్తడి నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో కేశవనగర్, గొల్లవాడలోని ఇళ్లలోకి నీరు చేరుతుంది. ఈ కాలనీలకు వరద నీరు రాకుండా మత్తడికి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాల్సి ఉండగా.. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో ఏటా ఈ సమస్య ఎదురవుతోందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ కాలనీల్లోకి నీరు చేరకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్
రాయికల్: రాయికల్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా రూ.15 కోట్లు మంజూరు చేయి ంచామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో మంగళవారం పర్యటించారు. సమస్యలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయికల్కు రూ.3 కోట్లు మంజూరు చేశామని, వాటితో వార్డుల్లో వసతులు కల్పిస్తామన్నారు. గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేశామని, పల్లె దవాఖానాలు, పాఠశాలల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. అనంతరం 67 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.19.60 లక్షలు, 71 మందికి కల్యాణలక్ష్మీ కింద రూ.71 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, నాయకులు గన్నె రాజిరెడ్డి, రవీందర్రావు, పడిగెల రవీందర్రెడ్డి, కోల శ్రీనివాస్, అనుపురం శ్రీనివాస్, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు. -
చర్యలు తీసుకుంటున్నాం
డ్రైనేజీలు తీయించడంతోపాటు మురికినీరు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆయిల్ బాల్స్ వేయిస్తున్నాం. ఫాగింగ్ చేయిస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. – స్పందన, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ డ్రైనేజీలను నిర్మించాలి మా కాలనీలో డ్రైనేజీలు లేవు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఖాళీ ప్లాట్లు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. పాముల బెడద తీవ్రంగా ఉంది. రాత్రిళ్లు బయటకు రావాలంటే భయంగా ఉంది. అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. – రమేశ్, బాలకృష్ణనగర్, మెట్పల్లి ప్రతిపాదనలు పంపించాం శివారు కాలనీల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే అవసరమైన చోట వాటిని నిర్మిస్తాం. ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇస్తున్నాం. రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండా తగిన చర్యలు తీసుకుంటాం. – మోహన్, మెట్పల్లి బల్దియా కమిషనర్ -
రైతువేదికలకు డబ్బులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి రైతు భరోసా ప్రారంభం, ముగింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రైతులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖర్చులను భరించడం వంటి పనులు ఏఈవోలే చూసుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రావా?’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈవోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది. -
పేదల కలలను సాకారం చేస్తున్నాం
పెగడపల్లి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి లబ్ధిదారులకు అందించారు. గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేశామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రైతు భరోసా కింద తొమ్మిదిరోజుల్లో రూ.9వేల కోట్లు అందించామన్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు ఇచ్చామన్నారు. కాళేశ్వరం లింక్ ప్రాజెక్టు పైపులైన్ నుంచి సాగునీరు అందించేలా చర్యలు చేపడుతామన్నారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల లబ్ధిదారులకు నాలుగా దఫాలుగా రూ.5 లక్షలను ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, ఆర్డీవో మధుసూదన్, హౌసింగ్ పీడీ ప్రసాద్, డీఏవో భాస్కర్, డీఆర్డీవో రఘువరన్, మండల ప్రత్యేకాధికారి వేణుగోపాల్రావు, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, విండో చైర్మన్ భాస్కర్రెడ్డి రైతులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
పారిశుధ్య పనులకు నేనూ వస్తా: కల్వకుంట్ల సంజయ్
ఇబ్రహీంపట్నం: గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులే రియల్ హీరోలు అని, సర్పంచులు లేకున్నా.. శ్రద్ధతో శ్రమించి పనిచేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. వర్షకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వారం పాటు పారిశుధ్య పనులు చేపట్టాలని, ఇందులో తానూ పాల్గొంటానని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు ఎఫ్డీఆర్ కింద నిధులు మంజురైనా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని అధికారులను ప్రశ్నించారు. చెరువులు, కుంటల మరమ్మతుకు నిధులు మంజూరు చేయించినా.. సంబంధిత మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డితో సంతకం చేయించినా పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. తిమ్మాపూర్, ఎర్రాపూర్ గ్రామాలకు 33 కేవీ సబ్స్టేషన్లు మంజురైనట్లు తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయొద్దని సూచించారు. అమ్మక్కపేట సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలన్నారు. హరితహారం, పల్లె ప్రకృతి వనం పనులు 18 నెలలుగా నిలిచిపోయాయని, అధికారులు ఫెయిలయ్యారని వివరించారు. తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఏడీఈ మనోహర్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఆనంద్, ఇరిగేషన్ డీఈ దేవానందం, ఎంఈవో మధు, ఎంపీవో రామకృష్ణరాజు పాల్గొన్నారు.సమయానికి బస్సులు వెళ్లేలా చూడాలికోరుట్ల రూరల్: విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేలా సమయానికి బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీసి అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో మరిన్ని రిక్వెస్ట్ స్టాప్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్ఎం రాజు, డీవీఎం భూపతిరెడ్డి, కోరుట్ల డీఎం పాల్గొన్నారు. -
బకాయి భారం.. విద్యార్థులకు శాపం
జగిత్యాలటౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూ ళ్లకు విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను ప్రభుత్వం రెండేళ్లుగా విడుదల చేయకపోవడంతో వారిని ఆయా యాజమాన్యాలు అనుమతి ంచడం లేదు. దీంతో జిల్లాలోని ఐదు పాఠశాలల కు చెందిన 550మంది విద్యార్థులు రోడ్డున పడ్డా రు. బెస్ట్ అవైలబుల్ స్కూల్గా ఎంపికై న ప్రైవేటు పాఠశాలల్లో విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, షూస్, టై, బెల్ట్, బ్యాడ్జెస్ అందించాల్సి ఉంటుంది. హాస్ట ల్ విద్యార్థులకు భోజనం, వసతి కల్పిస్తూ మెరుగైన విద్య అందించాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలో ఐదు స్కూళ్లు ఎంపికయ్యాయి. ఇందులో సుమారు 550 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి సంబంధించి 2023– 24, 2024– 25కుగాను ప్రభుత్వం రూ.2కోట్ల ఫీజు బకాయి పడింది. దీంతో ఆయా పాఠశాలలు విద్యార్థులకు బో ధన చేయలేమంటూ చేతులెత్తేశాయి. ఫీజు బకా యిలు చెల్లించాలంటూ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని వారు కలెక్టర్ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తాము పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని భావించి ఈ పాఠశాలల్లో చేర్పించామని, ఇప్పుడు తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పిల్లల చదువుకు ఆటంకం కలగకుండా చూడాలని వేడుకున్నారు. నా కొడుకును చేర్పించా.. మాది మల్యాల మండలం తక్కళ్లపల్లి. మా బాబు సుశాంత్ కొడిమ్యాలలోని నాచుపల్లిలోని వాసవి హైస్కూల్ (బెస్ట్ అవైలబుల్ స్కూల్)లో చదువుతున్నాడు. ప్రభుత్వం నుంచి ఫీజు రాలేదట. రెండేళ్ల నుంచి బకాయి ఉందని, ఆ మొత్తం మమ్మల్ని చెల్లించాలని అంటున్నారు. మా బాబు చదువుకు అటంకం రాకుండా చూడాలి. – గడ్డం శ్రీనివాస్, పేరెంట్, తక్కళ్లపల్లి కూతురు భవిష్యత్ ఆగం చేయొద్దు మాది బీర్పూర్ మండలం రంగసాగర్. భోజన వసతి, మంచి చదువు చెబుతారని నా కూతురు అనన్యను వాసవి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చేర్పించాను. ఇప్పుడు రెండేళ్ల ఫీజు బకాయి ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది స్కూల్కు పంపిస్తే రెండేళ్ల ఫీజు చెల్లించాలని అంటున్నారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా నిధులు విడుదల చేయించండి. – నారపాక లత, పేరెంట్, రంగసాగర్ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధుల నిలిపివేత విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న యాజమాన్యాలు జిల్లాలోని ఐదు స్కూళ్లలో 550 మంది విద్యార్థులు వీరి పేరిట నిలిచిపోయిన సుమారు రూ.2 కోట్లు -
పారిశుధ్యం అస్తవ్యస్తం
● ఈ చిత్రంలో కనిపిస్తున్నది నర్సింగాపూర్ వెళ్లే ఎల్జీగార్డెన్స్ సమీపంలోని డ్రైనేజీ. మురికినీరంతా ఇలా ఖాళీ స్థలాల్లోకి చేరుతోంది. రాత్రి అయ్యిందంటే దోమలతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. పందులు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని నర్సింగాపూర్ వెళ్లే రహదారి. ఇక్కడ అన్నీ అపార్ట్మెంట్లే. బుడిగజంగాల కాలనీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేక మురికినీరంతా రోడ్లపైకి వస్తోంది. కాలువ దుర్గంధం వెదజల్లుతోంది. -
నలిగిపోతున్న నాలుగో సింహం
● పోలీస్శాఖ బదిలీల్లో నాయకుల పాత్ర ● ఇద్దరు అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు ● అయోమయంలో పోలీస్ అధికారులు జగిత్యాలక్రైం: జిల్లాలోని ఇద్దరు అధికార పార్టీ నాయకుల మద్య పోలీసు అధికారులు సతమతమవుతున్నారు. ఇటీవల ఓ డీఎస్పీ బదిలీ కాగా.. అధికార పార్టీ నాయకులతోపాటు, పొరుగు నియోజకవర్గ నేతలు సదరు డీఎస్పీ పోస్టింగ్ను రద్దు చేయించారు. ఇది గిట్టని అధికార పార్టీకే చెందిన మరో నాయకుడు ఏకంగా తన నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు సీఐలను బదిలీ చేయించారు. పైగా తాను సిఫార్సు చేస్తేనే పోస్టింగ్ వచ్చిందని, తన వ్యతిరేక నాయకుడిని కలిస్తే పోస్టింగ్లు ఊడుతాయని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన పోలీసు అధికారులు బాధ్యతలు స్వీకరించి 15 రోజులు గడుస్తున్నా.. ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడిని కలవకపోవడం గమనార్హం. దీంతో సదరు నాయకుడి అనుచరులు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఓ పెద్ద మండలానికి చెందిన తన బంధువును ఇటీవల ఎస్సైగా నియమించడంతో అక్కడ చాలామంది అధికార పార్టీ కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అతడిని బదిలీ చేయించాలని మరో ముఖ్య నాయకునడిపై ఒత్తిడి పెంచుతున్నాడని, దీనికి అతను అక్కడే ఉండాలని మరో నాయకుడు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని సమాచారం. ఇద్దరు అధికార పార్టీ నాయకుల మధ్య సయోద్య కుదరకపోవడంతో పోలీసు నియామకాల్లో వర్గపోరు మొదలైంది. మరో రెండు మూడు రోజుల్లో ఎస్సైల బదిలీలు కానున్న నేపథ్యంలో ఇద్దరు నాయకులు తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని సిఫారసు లేఖలు అందించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పసుపుబోర్డు’తో రైతుల కల సాకారంమల్లాపూర్: నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో రైతుల కల సాకారమైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకుందని, ప్రధాని మోదీ మాట ఇస్తే అమలు చేసి తీరుతారని నిరూపితం అయ్యిందని పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ఎగుమతి గణనీయమైన అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మోహన్కు పదోన్నతిమెట్పల్లి: మున్సిపల్ మేనేజర్ హోదాలో కమిషనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్కు గ్రేడ్–3 కమిషనర్గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మోహన్కు కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ మెట్పల్లిలోనే కొనసాగాలని సూచించింది. కిక్బాక్సింగ్ విజేతలకు అభినందనజగిత్యాలఅగ్రికల్చర్:కిక్ బాక్సింగ్ పోటీల్లో పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమని కళాశాల అసోసియేట్ డీన్ భారతి నారాయణభట్ అన్నారు. ఇటీవల నిర్వహించిన కిక్బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను ఆమె కళాశాలలో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో ముందుండాలన్నారు. ఆటలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ కో–ఆర్డినేటర్ మహేశ్రెడ్డి, కోచ్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
ఎడ్ల నాగలికి భలే గిరాకీ
● పసుపు విత్తనానికి రోజుకు రూ.3500కిరాయి ● ప్రతి గ్రామంలో ఐదారు జతల కాడెద్దులే దిక్కు జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయంలో ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు రావడంతో కాడెద్దులు కనుమరుగయ్యాయి. గ్రామానికి కేవలం ఐదారు జతల కాడెడ్లు మాత్రమే ఉన్నాయి. విత్తనాలు వేసే సమయంలో వాటికి భలే డిమాండ్ పెరిగింది. పసుపు వంటి విత్తనం వేసేందుకు కాడెడ్లతో వచ్చే రైతుకు రూ.3,500 నుంచి రూ.4వేల వరకు చెల్లించాల్సి వస్తోందంటే గ్రామాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోషణ భారమై.. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి రైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. జత కాడెడ్లు లేని రైతులు ఉండేవారు కాదంటే అతిశయోక్తికాదు. సాగులో ట్రాక్టర్ల రాకతో ప్రతి పనికీ యంత్రాలనే వినియోగిస్తున్నారు. చిన్న గ్రామంలోనూ సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్లు వచ్చాయి. దీంతో కాడెడ్లను పోషించే స్థోమత రైతులకున్నా.. వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్ముకుంటున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు కూడా ట్రాక్టర్ కొంటున్నాడు. కాడెడ్లకు గిరాకీ వాస్తవానికి విత్తనం వేసేందుకు కాడెడ్లు తప్పనిసరి. గతంలో ఇరుగుపొరుగు రైతులు అదలుబదలు రూపంలో విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం ఆ విధానం మారింది. కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. దీంతో పసుపు విత్తనం వేసేందుకు రైతులు కాడెడ్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎడ్లనాగలితో వెళ్తే రూ.3,500 ఇస్తున్నారు. కొందరు రైతులు విత్తనం వేశాక అమ్ముకుంటున్నారు. కాడెడ్ల జతకు రూ.80వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. పసుపు వేసేందుకు.. వ్యవసాయంలో ట్రాక్టర్లతోనే అన్ని పనులు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల రాకతో నాకున్న ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3,500 ఇస్తున్నాం. వారంముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. – గడ్డం గంగారెడ్డి, చల్గల్ ఎడ్లు దొరికే పరిస్థితి లేదు ఎడ్ల నాగలితో విత్తనం వేస్తేనే బాగా మొలకెత్తుతుంది. ఇందుకోసం ఎడ్లు కొందామన్నా.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. ఒక్కో జతకు రూ.80వేల పలుకుతోంది. విత్తనం వేసే వారంముందే ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాం. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తాను. – రాంకిషన్, వెల్దుర్తి -
సన్న బియ్యం అక్రమ రవాణా
● దళారులకు సహకరిస్తున్న డీలర్లు ● అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న వ్యాపారం ● తనిఖీలు ముమ్మరం చేస్తున్న పౌర సరఫరాల శాఖ గొల్లపల్లి: జిల్లాలో రేషన్బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుండటం అక్రమార్కులకు అవకాశంగా మారింది. కొందరు డీలర్లు, వ్యాపారులు ముఠాగా ఏర్పడి బియ్యాన్ని అధిక ధరలకు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్కా లబ్ధిదారులు కూడా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేసిన సమయంలో సాగిన అక్రమాలు ఇప్పుడు ఆగకపోవడంతో పౌరసరఫరాల శాఖ అధికారుల కన్నుగప్పి అక్రమార్కులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఏళ్లుగా వేళ్లానుకుని.. రేషన్ బియ్యం అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరించింది. పేదల కడుపు నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యం పక్కదారి పడుతున్నాయి. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులు తినలేక డీలర్లు, ఇతరులకు అమ్మేవారు. ఇక కొందరు వ్యాపారులు రేషన్ షాపుల్లో మిగిలిన, లబ్ధిదారుల వద్ద సేకరించిన బియ్యాన్ని ప్రాసెస్ చేయించి అధిక ధరకు విక్రయించే వారు. కొందరు బడా వ్యాపారులు, మిల్లర్లు, ఇతరులనుంచి భారీ మొత్తంలో రేషన్ బియ్యం సేకరించి పాలిస్ చేయించాక విదేశాలకు ఎగుమతి చేశారు. కొన్ని సందర్భాలలో టాస్క్ఫోర్స్ బృందాలు బియ్యం లారీలను పట్టుకున్నా దందా ఆగలేదు. సన్న బియ్యంతో చెక్పెట్టాలని.. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. వాటిని తినేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మద్య తరగతి ప్రజలు అయితే బియ్యం అసలే తీసుకోలేదు. ఇదే అదునుగా బడా వ్యాపారులు జేబులు నింపుకున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులు కచ్చితంగా తింటారనే భావనతో ఉగాది నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. తొలినెలలో బియ్యాన్ని లబ్ధిదారులు అధిక సంఖ్యలో తీసుకెళ్లి తినడానికి వీలుగా ఉన్నాయని తెలిపారు. తద్వారా అక్రమ రవాణాకు చెక్ పడినట్లేనని పౌరసరఫరాల శాఖ అధికారులు భావించారు. కఠిన చర్యలు తీసుకుంటేనే.. సన్నబియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు తనిఖీలు ముమ్మరం చేయడమే కాక లబ్ధిదారులు బియ్యాన్ని అమ్ముకున్నట్లు తెలిస్తే కేసు నమోదు చేయడమేకాక రేషన్ కార్డు రద్దు చేస్తామని హెచ్చరించారు. అలాగే బియ్యం అమ్మిన, కొనుగోలు చేసిన వారిపై కేసులు పెడుతామని చెబుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వం లక్ష్యం నెరవేరాలంటే తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు రేషన్ షాపులపై నిఘా పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. పక్కాగా పక్కదారి.. ప్రభుత్వం, అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ కొందరు వ్యాపారులు సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నెల పూర్తిగా లబ్ధిదారులు బియ్యం తీసుకోగా.. ఆ తరువాత నెల నుంచి సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కులు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యంతో రూ.లక్షలు కొల్లగొట్టిన వ్యాపారులు.. ఇప్పుడు సన్నబియ్యం కావడంతో ప్రణాళిక ప్రకారం పక్కదారి పట్టించే కుట్రకు తెరలేపారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు తీసుకోకపోగా.. మిగిలిన సన్నబియ్యం ఇంకొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచే నేరుగా సేకరించడం మొదలు పెట్టారు. దొడ్డు బియ్యం కన్న ఎక్కువ డబ్బు ముట్టచెబుతుండటంతో పలుచోట్ల లబ్ధిదారులు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా సేకరించిన సన్న బియ్యాన్ని తరలిస్తుండగా జిల్లాలోని కొన్ని చోట్ల పోలీసులు పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇటీవలే 50 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని తరలిస్తుండగా సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. ఇవే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని తరలించినట్లు తెలుస్తోంది. -
ఎంపిక పోటీలకు వేళాయె!
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వతరగతిలో ప్రవేశాలకు గాను ఎంపిక పోటీల ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి అంకం మండలస్థాయి పోటీలను ముగించుకొని జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులు జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరు కానున్నారు. సికింద్రాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ పాఠశాలలున్నాయి. జిల్లాస్థాయిలో శారీరక, సామర్థ్యానికి సంబంధించిన వాటితోపాటు పలు వాటిల్లో పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయిలో టాప్ 20లో నిలిచిన బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాశాఖల అధికారులు ఎంపిక చేయనున్నారు. జిల్లాస్థాయి పోటీల వివరాలు ఈనెల 25, 26ల్లో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో, 26న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో, 26న జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో, 26న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో జరగనున్నాయి. రేపటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడాపోటీలు టాప్ 20లో నిలిచిన బాలబాలికలు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు అర్హత సన్నాహాలు చేస్తున్న జిల్లా క్రీడాశాఖలు జిల్లాస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలు – ఎత్తు – బరువు – 30 మీటర్ల పైలయింగ్ స్టార్ట్ – స్టాండింగ్ బ్రాడ్ జంప్ – 800 మీటర్ల రన్నింగ్ – 6.10 మీటర్ల షటిల్ రన్ – మెడిసన్ బాల్ త్రో(కిలో బరువు) – వర్టికల్ జంప్ – ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అండ్ మెడికల్ పరీక్షలు సువర్ణావకాశం క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి స్పోర్ట్స్ పాఠశాలలు సువర్ణావకాశం. తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలల్లో చదివి అంతర్జాతీయస్థాయితోపాటు ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో పాల్గొని సత్తా చాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రీడలతోపాటు విద్యపై కూడా శ్రద్ధ చూపుతారు. – వేల్పుల సురేందర్, పెటా సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి -
మహిళల అభివృద్ధికి స్వయం ఉపాధి యూనిట్లు
జగిత్యాలరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందిస్తోందని ఏపీఎం గంగాధర్ అన్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లోని స్వయం ఉపాధి యూనిట్లను పరిశీలించారు. సెర్ప్, ఐకేపీ ద్వారా బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి, గ్రామ సంఘాల ద్వారా మహిళా సంఘాల సభ్యులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఇందిరా మహిళాశక్తి యూనిట్లతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న విధానం, భవిష్యత్ ప్రణాళికలపై సభ్యులకు అవగాహన కల్పించారు. హస్నాబాద్, అంతర్గాం, పొలాస, హైదర్పల్లి, లక్ష్మీపూర్ గ్రామాల్లో లక్పత్దీదీ యాప్ నమోదు, ఉల్లాస్ టాస్ నమోదు, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వే పరిశీలించారు. సీసీలు గంగారాం, రవీందర్, శ్రీనివాస్, మండల సమైక్య అధ్యక్షురాలు సత్తవ్వ, వీవోఏలు పాల్గొన్నారు. -
ఇన్స్పైర్లో పాల్గొనండి
జగిత్యాల: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టడానికి, వారిలోని వినూత్న ఆలోచనలను బహిర్గతం చేసేందుకు ఇన్స్పైర్ అవార్డ్ మానిక్ వేదికగా ఉంటుందని, ఇందులో విద్యార్థులందరూ పాల్గొనాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇన్స్పైర్ అవార్డ్స్ మానక్కు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇన్స్పైర్ అవార్డుల కోసం నామినేషన్ వేయాలన్నారు. డీఈవో రాము మాట్లాడుతూ ప్రతీ పాఠశాల నుంచి 5 ప్రాజెక్ట్లు రూపొందించాలని, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్, కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ పాల్గొన్నారు. ఒలింపిక్ రన్ టార్చ్ ర్యాలీజగిత్యాల/మెట్పల్లి: ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా మెట్పల్లిలో ఒలింపిక్ రన్ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా కొనసాగింది. ముత్తయ్య, అశోక్, కార్తీక్, గంగాధర్, క్రీడాకారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం 2కే రన్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో అదనపు కలెక్టర్ బీఎస్.లత పాల్గొన్నారు. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా క్రీడల శాఖ అధికారి రవికుమార్ పాల్గొన్నారు. సింగరేణి పాలిటెక్నిక్లో ప్రవేశాలు యైటింక్లయిన్కాలనీ: మంచిర్యాల జిల్లా సీసీసీ– నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కళాశాలలో మొత్తం 300 సీట్లు భర్తీచేస్తామన్నారు. సివిల్, కంప్యూటర్స్, ఎలిక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైని ంగ్ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని, పాలిసెట్–2025లో ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల మూడో తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
మహిళలు గర్వపడేలా చీరలుండాలి
సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా సిరిసిల్ల నేతన్నలు నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల ఏఎంసీ గోదాంలో సోమవారం ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణకు శ్రీకారం చుట్టారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నలు, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గతంలో కంటే మెరుగైన ఆర్డర్లను ఇచ్చామని, సకాలంలో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి సిరిసిల్ల పేరు నిలబెట్టాలన్నారు. వేములవాడలో రూ.50కోట్లతో నూలుడిపోను ఏర్పాటు చేసి 90 శాతం అరువుపై అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుల రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. నేతన్నలకు 4.30 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 65 లక్షల మీటర్లు తయారు చేశారని, జూన్ నెలాఖరులోగా 50 శాతం పూర్తి చేయాలని సూచించారు. రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.150కోట్లతో నాలుగు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే రూ.47.98కోట్లు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయని, సిరిసిల్లలో పద్మశాలీ భవన్ను రూ.5కోట్లు, సిరిసిల్ల సంఘాల నుంచి మరో రూ.3కోట్లు సేకరించి రూ.8 కోట్లతో నిర్మిస్తామని, మార్కండేయ ఆలయాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ చీరల ఆర్డర్ను సకాలంలో పూర్తి చేయాలని, జూన్ నెలాఖరు నాటికి సగం ఆర్డర్ పూర్తి చేయాలని సూచించారు. సేకరణ పూర్తికాగానే ఉత్పత్తి చేసిన బట్టకు బిల్లులు అందుతాయని వెల్లడించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, చేనేత, జౌళి శాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, ఏడీ రాఘవరావు, డీడీ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, కల్లూరి చందన, వస్త్రోత్పత్తిదారులు ఆడెపు భాస్కర్, గోవిందు రవి, మంచె శ్రీనివాస్, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, మాజీ కౌన్సిలర్లు, జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆత్మగౌరవంతో వాటిని కట్టుకోవాలి రాష్ట్రమంతటికి సిరిసిల్ల చీరలు సకాలంలో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
పేద విద్యార్థి చదువుకు ఆర్థికసాయం
ధర్మపురి: తల్లిదండ్రులను కోల్పోయిన ఓ నిరుపేద విద్యార్థిని బాసరలో ట్రిపుల్ ఐటీ చదువుకునేందుకు అయ్యే ఖర్చును భరించడానికి పలువురు ముందుకొచ్చారు. బీర్పూర్ మండలకేంద్రానికి చెందిన గుండ నందిని బాసరలోని ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిండ్రులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని బీర్పూర్ పాఠశాల పూర్వ విద్యార్థులు స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం కన్వీనర్ గొల్లపెల్లి గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు విద్యార్థి దత్తత కార్యక్రమం కింద దత్తత తీసుకున్నారు. ధర్మపురికి చెందిన ఎన్నారైలు కొరిడె ఈశ్వర్, కొరిడె సాయి నందిని చదువు కోసం రూ.15వేల చొప్పున ఐదేళ్లపాటు చెల్లించేందుకు ముందుకొచ్చారు. మొదటి ఏడాదికి గాను రూ.15 వేలను ఎంఈవో సీతామహాలక్ష్మి చేతులమీదుగా అందించారు. దాతలకు, కన్వీనర్ గణేష్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్, బీర్పూర్ పీడీ మంజుల ధరణి, ఉపాధ్యాయులు నర్సింహమూర్తి తదితరులున్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ
ఉన్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ స్పోర్ట్స్ స్కూల్లో దొరుకుతుంది. ఎన్ఎస్ఎన్ఐఎస్ చేసిన కోచ్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. అత్యుత్తమ శిక్షణనిస్తారు. క్రీడాకారులు వీటిలో ప్రవేశాలు పొందితే ఉన్నతంగా ఎదగడంతోపాటు దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా ఎదుగుతారు. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి ఏర్పాట్లు పూర్తి జిల్లాస్థాయి క్రీడాపాఠశాలల ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 25, 26ల్లో రెండు రోజులపాటు ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నాం. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, కోచ్ల సహకారంతో విజయవంతంగా మండలస్థాయి ఎంపిక పోటీలు పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో జిల్లాస్థాయి పోటీలను కూడా పూర్తి చేస్తాం. – శ్రీనివాస్గౌడ్, డీవైఎస్వో, కరీంనగర్ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా.. రాష్ట్రంలో మేటి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా స్పోర్ట్స్ పాఠశాలలు ముందుకు సాగుతున్నాయి. క్రీడల్లో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. కేవలం క్రీడలకు అత్యంత ప్రాధాన్యముంటుంది. దేశ భక్తి పెంపొందుతుంది. దేశానికి పతకం సాధించాలన్న తపన, దేశ పతాకం ప్రపంచ వేదికల్లో రెపరెపలాడించాలన్న లక్ష్యాలతో ముందుకెళ్తారు. – అజ్మీరా రాందాస్, డీవైఎస్వో, రాజన్న సిరిసిల్ల -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కరీంనగర్రూరల్: చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన విష్ణువర్థన్(29) బహుదూర్ఖాన్పేట శివారులో ద్విచక్ర అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగునూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ సోమవారం వెదురుగట్ట నుంచి ప్రతిమ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలోని బహుదూర్ఖాన్పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని చెట్టుకు ఢీకొంది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిహుజూరాబాద్: పట్టణానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్టర్ చిర్ర సుదర్శన్గౌడ్ (55) ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పడంతో కందకంలో పడి మృతి చెందాడని. మృతుడి కుటుంబానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రూ.పదివేలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, హుజూరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, జర్నలిస్టులు పరామర్శించారు. ఖైదీల యోగాక్షేమాలు తెలుసుకున్న జడ్జి కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జైలును సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్తో కలిసి సందర్శించారు. ఖైదీల యోగ క్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్, ఆసుపత్రి, ములాఖత్, ఫోన్, లైబ్రరీ, వంటశాల, ఇండస్ట్రీలలో పనితీరు పరిశీలించారు. కొత్త చట్టాలు వివరించారు. మహిళా జైలును కూడా సందర్శించి కేసుల వివరాలు, బాగోగులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వం తరఫున లాయర్లను నియమిస్తామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్ విజయ డేని జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్ తదితరులు ఉన్నారు. -
అన్నదాతా.. రైతు వేదికకు రావా?
● కర్షకులను బతిమాలుకుంటున్న ఏఈవోలు ● సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు ● ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేలకుపైగా రైతుల తరలింపు ● రైతులకు ఇచ్చే టీ, స్నాక్స్ డబ్బులు మాత్రం ఇవ్వరట ● మొన్నటి కార్యక్రమానికి పెట్టిన డబ్బులే రాలేదు కుండీల నుంచి చెత్త తొలగిస్తున్న బల్దియా సిబ్బంది పడిపోయిన ఏఎస్సై తాజొద్దీన్ ప్రజావాణిలో అపశృతి చోటుచేసుకుంది. పట్టణ పోలీస్స్టేషన్ ఏఎస్సై తాజొద్దీన్ తీవ్ర అస్వస్తతకు లోనై వేదికవద్దే సొమ్మసిల్లిపడిపోయాడు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా వివరాలు అడిగేందుకు తాజొద్దీన్ ను అదనపు కలెక్టర్ బీఎస్.లత వేదిక వద్దకు రావాలని సూచించారు. అక్కడ స్వల్ప అస్వస్తతకు గురైన ఆయన అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. వీల్చైర్లో తాజొద్దీన్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంతో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక(ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు ఇప్పుడు అదే పనిలో తలమునకలయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మెజారిటీ రైతులు సుముఖంగా లేరు. ప్రస్తుతం చాలా చోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖిలో తప్పకుండా రైతుభరోసా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది రైతులకు ఏఈవోలు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలుతున్నారు. మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్యమంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోలకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కార్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్ను ఏఈవోలే అందించారు. ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎపుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరోసారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు. ఏఈవోలపై పనిభారం.. వాస్తవానికి ప్రతీ రైతు వేదికలో ఒకే ఒక ఏఈవో ఉంటారు. రైతులకు సంబంధించిన ప్రతీ విషయం వీరే చేసుకోవాలి. పంటలకు సంబంధించి ఎప్పటికపుడు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం. సాగులో సమస్యలు తలెత్తితే పరిష్కరించడం. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కేవైసీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రైతు విశిష్ట సంఖ్య నమోదు చేయడం, పంటల నమోదు చేయడం, రైతుబంధు, రైతు బీమా నమోదు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మట్టి నమూనాల సేకరణ తదితర పనులు ఉంటాయి. ఇవి కాకుండా రైతు వేదిక నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటారు. వీరు తప్ప మరే ఇతర సిబ్బంది లేకపోవడంతో వీరే ఉదయం వచ్చి రైతు వేదికను ఊడ్చుకోవాలి, కార్యక్రమాలు జరిగినపుడు కుర్చీలు వేయడం, వారికి టీ స్నాక్స్.. కూడా వీరే అందించాల్సి వస్తోంది. అధికారిక కార్యక్రమాలు జరిగినపుడు వచ్చిన వారంతా మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. తరువాత డబ్బులు ఇచ్చి వాటిని శుభ్రం చేయించుకోవాల్సి వస్తోంది. మొత్తానికి ఏఈవోలు నిర్వహించే ప్రతీ అధికారిక కార్యక్రమం ఇంట్లో చేసే శుభకార్యంలా ప్రతీది దగ్గరుండి చూసుకోవాల్సిన స్థితి. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డిని వివరణ కోరగా.. ఏఈవోలకు రైతుల తరలింపు విషయంలో ఎలాంటి టార్గెట్ విధించలేదని, వారే స్వచ్ఛందంగా వస్తున్నారని సమర్థించుకున్నారు. జిల్లా రైతు వేదికలు ఏఈవోలు కరీంనగర్ 75 71 జగిత్యాల 52 71 పెద్దపల్లి 54 52 సిరిసిల్ల 57 53రైతు వేదికల్లో ఇబ్బందులివీ! చాలాచోట్ల తాగునీరు సదుపాయం లేదు కుర్చీలు వేసే సిబ్బంది లేరు టీ, స్నాక్స్ ఇచ్చే దిక్కు లేదు మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు రైతు వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు టెక్నికల్ ఎక్విప్మెంట్కు డబ్బులు రావు, నిర్వహణకు సిబ్బంది లేరు.. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. 61 మంది వివిధ సమస్యలతో కలెక్టరేట్కు వచ్చారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్గౌడ్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. డబ్బులు ఇప్పించండి మాది బుగ్గారం మండలం వెల్గొండ. నాకు ఉన్న ఆటోను గతంలో రంగపేటలో ఏఈవో పనిచేసిన ముత్యాల మల్లేశం అద్దెకు తీసుకున్నాడు. దాని అద్దె రూ.32వేలు ఇవ్వలేదు. అడిగితే బెదిరిస్తున్నాడు. నా డబ్బులు నాకు ఇప్పించి ఆదుకోండి. (23జేజిఎల్157) డబుల్ ఇళ్లు ఇప్పించండి మాది కోరుట్లలోని అల్లమయ్యగుట్ట ప్రాంతం. మాకు గత ప్రభుత్వం నివేశన స్థలాలు ఇచ్చి పట్టాలు పంపిణీ చేసింది. స్థలం కేటారులుంచిన ప్రభుత్వం ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభించలేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వండి. -
పనులు నాణ్యతతో చేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను నాణ్యతతో చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని 30వ వార్డులో రూ.13 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు సోమవారం భూమిపూజ చేశారు. పనుల్లో అక్కడక్కడ నాణ్యత లోపిస్తోందని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అనంతరం పట్టణంలోని 126 మందికి రూ.98.11 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మోతె చెరువు అభివృద్ధికి రూ.3.50 కోట్లు, కండ్లపల్లి చెరువుకు రూ.3 కోట్లు, తిప్పన్నపేట బ్లాక్ స్పాట్ రోడ్కు రూ.10 కోట్లు, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 10 లక్షల లీటర్ల వాటర్ట్యాంక్కు రూ.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, అడువాల లక్ష్మణ్, తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలరూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరం కృషిచేద్దామని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మత్తుపదార్థాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడతూ.. మత్తు పదార్థాల నివారణకు విద్యార్థులు, యువత కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్ష్టేషన్ల పరిధిలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యువత, గంజాయి, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ముందుగా ఎస్పీ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు, కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీ రఘుచందర్, సీఐలు కిరణ్కుమార్, వేణు, సైదులు, శ్రీనివాస్, ఆరీఫ్ అలీఖాన్, కరుణాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాధితుల సమస్యలు పరిష్కరిస్తాంజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారితో నేరుగా మాట్లాడిన ఆయన.. సమస్యలను వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను వెంటవెంటనే పరిష్కరించేలా కృషి చేస్తున్నామని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ర్యాంక్ సాధించాలిజగిత్యాల: స్వచ్ఛ సర్వేక్షణ్లో జిల్లా మెరుగైన ర్యాంక్ సాధించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కేంద్ర గ్రామీణ, పారిశుధ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలవారీగా స్వచ్ఛత స్థాయిని అంచనా వేస్తారని, గణాంకాలు, నాణ్యత ఆధారంగా ర్యాంక్లు ఇస్తారని వివరించారు. గ్రామాల్లో శుభ్రత, ఎస్బీఎంజీ ద్వారా సాధించిన విజయాలు, సేవస్థాయి పురోగతి, వ్యర్థ నిర్వహణ కేంద్రాలు, ఓడీఎఫ్ మారుతుంటాయని పేర్కొన్నారు. అధికారులంతా కలిసికట్టుగా మార్కులు సాధించి జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని కోరారు. డీఆర్డీఏ పీడీ రఘువరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు డయల్ యుర్ డీఎంజగిత్యాలటౌన్: మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12గంటల వరకు డయర్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్ కల్పన సోమవారం తెలిపారు. ప్రయాణికులు తమ సందేహాలు, సలహాలు, సూచనలను 99592 25925 నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. పోలీసులపై మాజీమంత్రి వ్యాఖ్యలు సరికాదుజగిత్యాలక్రైం: మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. శ్రీలంచం తీసుకోకుంటే పోలీసులకు నడవదా..? పోలీసులేమీ సుద్దపూసలు కాదు. బల్లకింద చేయి పెట్టకుంటే వారికి నడవదు..శ్రీ అని వ్యాఖ్యానించడం సరికాదని పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులపై దృష్టి పెడితే ఒక్క పోలీసు విధుల్లో ఉండడనే బెదిరింపు ధోరణిలో మాట్లాడటాన్ని ఖండించారు. అక్రమ దందాలు, అవినీతిని అరికట్టడంలో.. శాంతిభద్రతల విషయంలో అంకితభావంతో పనిచేస్తున్నామని, ప్రజలకు అండగా నిలవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయబోరని, అలాంటి పోలీస్లపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. -
చినుకు చిన్నబోయింది..
● చిరుజల్లులకే పరిమితం ● మొలకెత్తని విత్తనాలు ● అష్టకష్టాలు పడుతున్న రైతులు ● భారీ వర్షం కోసం ఎదురుచూపు ● జూలైపైనే అన్నదాతల ఆశలు జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ ప్రారంభమైంది. జూన్ నెల చివరికి వచ్చినా ఇప్పటివరకు పెద్ద వర్షం జాడ లేకుండాపోయింది. కేవలం చిరుజల్లులకే పరిమితం అవుతుండటంతో రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కొద్దిరోజులుగా పొడి వాతావరణంతోపాటు 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది 15 రోజులు ముందుగానే రుతుపవనాలు రావడం.. వర్షాలు ఓ మోస్తరుగా కురవడం, బావుల్లో ఉన్న నీటితో పంట పండించుకోవచ్చనే ఆశతో రైతులు అక్కడక్కడ పసుపు, పెసర, మొక్కజొన్న, కంది, పత్తి విత్తనాలు వేశారు. మరికొన్ని చోట్ల వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం.. పొడి వాతావరణం కారణంగా భూమిలో తేమ ఆవిరై విత్తనాలు మొలకెత్తే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత మొదలైంది. వర్షపాతం అంతంతే.. జిల్లాలో జూన్ 23 వరకు సాధారణ వర్షపాతం 115.2 మిల్లీమీటర్లు. కానీ.. ఇప్పటివరకు 78.1 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోల్చితే ఇది 37.1 మిల్లీమీటర్లు తక్కువ. 15 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అది కూడా చిరుజల్లులకే పరిమితమైంది. రెండు, మూడు రోజులకోసారి 2 నుంచి 4 మిల్లీమీటర్ల మేర తేలికపాటి వర్షాలు కురవగానే రైతులు విత్తనాలు వేశారు. అవి ఇప్పుడు మొలకెత్తడం లేదు. జిల్లాలో సాధారణ వర్షపాతంలో పోల్చితే జగిత్యాలలో 34 శాతం, జగిత్యాల రూరల్లో 16, రాయికల్లో 24, సారంగాపూర్లో 13, మల్యాలలో 25, పెగడపల్లిలో 51, కొడిమ్యాలలో 26, కోరుట్లలో 24, మేడిపల్లిలో 50, మెట్పల్లిలో 47, ఇబ్రహీంపట్నంలో 32, బుగ్గారంలో 50, ధర్మపురిలో 34, బీర్పూర్లో 59, గొల్లపల్లిలో 54, వెల్గటూర్లో 41, ఎండపల్లిలో 51, మల్లాపూర్లో 19, భీమారంలో 21 శాతం చొప్పున తక్కువ వర్షపాతం నమోదైంది. కథలాపూర్లో సాధారణ వర్షపాతం పడింది. వాస్తవానికి నైరుతి రుతుపవనాలతో జూన్ 15 నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది జూన్ ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేశారు. డ్రిప్ ద్వారా పంటలకు నీరు భూమిలో తేమ లేక విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తినని మాడిపోతుండటంతో రైతులు పంటలకు నీరు అందించే పనులు ప్రారంభించారు. పసుపు, మొక్కజొన్న వంటి తోటలకు డ్రిప్, మిగతా అరుతడి పంటలకు వ్యవసాయ బావుల ద్వారా నీరు అందిస్తున్నారు. కొంతమంది రైతులు ఇంకా విత్తనాలు వేయాల్సి ఉంది. వారంతా వర్షాల కోసం వేచి చూస్తున్నారు. నిజానికి జూలైలో ఎక్కువ వర్షాలు కురుస్తుంటాయి. దీంతో రైతులు జూలైలో వర్షాలపైనే నమ్మకం పెట్టుకున్నారు. బావుల్లోని నీటితో వరి నారు పెంచుతున్నారు. వర్షం కోసం చూస్తున్నాం జిల్లాలో పెద్ద వర్షం ఇప్పటికి ఒక్కటీ లేదు. చిరుజల్లులకే పరిమితం అయ్యాయి. అదును దాటిపోతుందని బావిలో నీరు ఉండటంతో రెండు ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న విత్తనాలు వేశాను. ఆ విత్తనాలను కాపాడుకునేందుకు ఆకాశం వైపు చూస్తూనే.. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నాను. – ఏలేటి స్వామిరెడ్డి, శ్రీరాములపల్లె జూలైలో వర్షాలు కురిసే అవకాశం జూన్లో అంతంతమాత్రంగానే వర్షపాతం నమోదైంది. జూలైలో వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నేలల్లో విత్తనాలు వేసిన రైతులు నీటిని అందించడం మంచిది. వాతావరణంలోని మార్పులతో వర్షాలు కురువడంతో కొంత ఆలస్యం అవుతోంది. – శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస -
సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం
కొండగట్టులో భక్తుల రద్దీ మల్యాల:కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కోనేరులో స్నానమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. ● పథకాల అమలులో పారదర్శకత పాటించాలి ● కష్టకాలంలోనూ పథకాలు అమలు చేస్తున్నాం ● విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ● జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● మూడు శాఖలపై నాలుగు గంటలపాటు సమీక్షచెత్తకుండీల్లా హరిత కుండీలువాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాసటగా నిలవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో వ్యవసాయం, విద్య, హౌసింగ్ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి నాలుగు గంటలపాటు సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుభరోసా, ఆయిల్ పాం సాగు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ.. పాలన సాగిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేరకే యూరి యా వాడాలన్నారు. ఆయిల్పాం సాగుపై మరింత శ్రద్ధ చూపి జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని మించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యాశాఖ అధికారులు శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించాలన్నారు. ● రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీలో చర్చించి పార్టీలకతీతంగా మంజూరు చేస్తామన్నారు. కూరగాయ ల సాగు విస్తరించాలని, కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్నందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించాలన్నారు. క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. ● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, రైతుభరోసా ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. వేములవాడలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టుల భూ సేకరణ నిధులు విడుదల చేయాలని కోరారు. ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలన్నారు. తాను 48 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పాం ప్రాసెస్ యూనిట్ను చిగురుమామిడిలో ఏర్పాటు చే యాలని కోరారు. కరీంనగర్లో గతంలో సీఎం స్పెషల్ ఫండ్ కింద రూ.350 కోట్లతో 120రోడ్ల పనులు ప్రారంభించామని, వాటిని పూర్తి చేయి ంచాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ వ్యవస్థ పనితీరు పర్యవేక్షించాలన్నారు. ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు. ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎమ్మెల్యేల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. మెట్పల్లి హైస్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కనే జూనియర్ కళాశాల భవనం 80శాతం పూర్తయిందని, దానిని పూర్తి చేసి స్కూల్ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పనులు పూర్తిచేయాలని కోరారు. ● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ వ్యవసాయంపై గ్రామాల్లో సదస్సులు పెట్టి రైతులకు సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా ఇప్పించామన్నారు. పంట మార్పిడిపై ప్రచారం చేయాల్సిన అవస రం ఉందన్నారు. ఐదేళ్లుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతోందని, వరి, మొక్కజొన్న సాగు పెరుగుతోందని అన్నారు. ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎత్తిపోతలు పూర్తి చేయడంతో అంతర్గాం, పాలకుర్తి మండలాలకు తొలిసారి సాగునీరు వచ్చిందని, గతం కంటే రెండింతల పంట పండుతోందని తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డీఎంఎఫ్టీ నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు. ● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, సామాన్య, గణితం వంటి విద్యా ప్రమాణాలు పెంచేలా చూడాలన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును స్వాగతించారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలోని చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ● సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, రాష్ట్ర మినిమం వేజ్బోర్డు సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, కేడం లింగమూర్తి, నాగుల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పాల్గొన్నారు.న్యూస్రీల్ -
భక్తులకు వసతి కల్పించాలి
కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకునేందుకు వ చ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలి. కొండపై గదుల కొరతతో దిగువ కొండగట్టులో ప్రైవేట్ లాడ్జీల్లో ఉండాల్సి వ స్తోంది. కొండపై మాస్టర్ ప్లాన్ అమలు చేసి, భక్తులు ఇబ్బందులు పడకుండా మరిన్ని గదుల నిర్మా ణం చేపట్టాలి. – జక్కుల రాయమల్లు, మల్యాల మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి కొండగట్టు ఆంజనేయస్వామి భక్తుల పాలిట కొంగుబంగారం. కోరిన కోరికలు తీర్చే దేవుడు. మాస్టర్ ప్లాన్ అమలుతో భక్తులకు సౌకర్యాలు పెరగటంతోపాటు, ఆలయ అభివృద్ధికి బాటలు పడుతాయి. మాస్టర్ ప్లాన్ అమలు కోసం అధికారులు చొరవ తీసుకొని, ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. – ఇట్టిరెడ్డి అంజిరెడ్డి, గుడిపేట సౌకర్యాలకు కృషి చేస్తున్నాం.. ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కలిసి టీటీడీ ద్వారా 100గదుల నిర్మాణానికి కృషి చేస్తాం. భక్తుల కోసం వైజంక్షన్ సమీపంలో షెల్టర్ నిర్మించాం. మరో షెల్టర్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం. – శ్రీకాంత్రావు, కొండగట్టు ఆలయ ఈఓ -
మాస్టర్ ప్లాన్ లేదు.. అభివృద్ధి కానరాదు
● దశాబ్దకాలంగా అడుగు ముందుకు పడని వైనం ● దాతలు సిద్ధంగా ఉన్నా.. నిర్మాణాలు వాయిదా ● వసతులు లేక ఇబ్బంది పడుతున్న భక్తులు మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాటు.. ఆలయ పవిత్రను కాపాడే ఆధ్యాత్మిక వాతావరణం కల్పిస్తూ రూపొందించిన మాస్టర్ ప్లానే అభివృద్ధికి అడ్డంకిగా మారింది. అధికారుల అలసత్వంతో మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోవడం లేదు. భక్తులకు వసతులు కల్పన కోసం నిర్మాణాలు చేపట్టేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ప్లాన్ అమలైతే దాతల నిర్మాణాలు కూల్చివేసే అవకాశం ఉంది. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు ప్రతిరోజూ దర్శనానికి వస్తుంటారు. ముఖ్యంగా స్వామివారికి ప్రీతిపాత్రమైన మంగళ, శనివారాల్లో అధిక రద్దీ ఉంటుంది. అయితే ఆ మేరకు వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంజన్న ఆలయంలో ఏటా నిర్వహించే హనుమాన్ చిన్న, పెద్ద జయంతికి సుమారు ఐదు లక్షలకు పైగా దీక్షాపరులు వస్తుంటారు. ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్ వంటి దూరప్రాంతాల నుంచి పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అభివృద్ధికి 372 ఎకరాలు మల్యాల మండలం పరిధిలో కొండగట్టు ఉంటుంది. ఈ ఆలయ సమీప గుట్టలతోపాటు సుమారు 372 ఎకరాల స్థలం దేవస్థానానికి రెవెన్యూ అధికారులు బదిలీ చేశారు. మెట్లదారి వెంట రోప్వే నిర్మాణం చేపట్టి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు దశాబ్దం క్రితమే ప్రణాళిక రూపొందించినా ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. కొండగట్టు ఆలయ సమీపంలోని అటవీ భూములు కూడా ఆలయానికి బదిలీ చేయడం.. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడంతో మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వసతుల కొరతతో భక్తుల ఇబ్బందులు కొండగట్టు అంజన్న దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అడుగడుగునా అవస్థలు పడుతున్నారు. వాహనాలకు ఆలయం వరకు అనుమతి ఇవ్వకపోవడంతో దూరంగా పార్కింగ్ చేయాల్సి వస్తోంది. వై జంక్షన్ సమీపంలో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి సన్నిధిలో 11 రోజులు, 21 రోజులు నిద్రిస్తే మానసిక, మనోవ్యాధులు నయమవుతాయనే విశ్వాసంతో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అలాంటి వారికి గదుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ 36 గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో సిబ్బంది కొరత ఉంది. మాస్టర్ ప్లాన్ అమలుతో వాహన పార్కింగ్తోపాటు భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని దశాబ్దకాలంగా భక్తులు ఎదురుచూస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. ఏళ్ల నాటి మారుతి నిలయం శిథిలావస్థకు చేరింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టులో వంద గదుల భవన నిర్మాణానికి టీటీడీ సుముఖంగా ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడడం లేదు. మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు అంజన్న ఆలయ పునర్నిర్మాణం, విమాన గోపురం నిర్మాణం, రాతి కట్టడాలు, రాతి శిల్పాలు ఏర్పాటు.. స్వామివారి నూతన 2వ ప్రాకారం, నాలుగు వైపులా రాజగోపురాలు యాగశాల, నిత్య నివేదనశాల నిర్మాణం రామాలయం పునర్నిర్మాణం అభిషేక మంటపం శ్రీ సత్యనారాయణ స్వామి మంటపం ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం భక్తుల వసతి కోసం రెండు చోట్ల 100 గదుల ధర్మశాల నిర్మాణం 50 వీఐపీ గదుల నిర్మాణం రెండతస్తులతో రెండు డార్మెటరీ హాల్స్ నిర్మాణం నిత్యాన్నదాన సత్రం నిర్మాణం లడ్డూ, పులిహోర ప్రసాదాలు తయారు చేయు మండపం దేవస్థానం పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కొండగట్టులో దారి పొడవునా విద్యుత్ దీపాలు దేవస్థానం పరిసరాల సుందరీకరణ ఆలయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ అర్చకులకు రెండు వసతి గృహాలు, పాచక, పరిచారకులతోసహా 40 క్వార్టర్లు నిర్మాణం ఆలయ సిబ్బంది, కార్యనిర్వహణ అధికారికి 100 క్వార్టర్ల నిర్మాణం కొండగట్టుకు వెళ్లే దారిలో 50 గదుల రెండు ధర్మశాలల నిర్మాణం అశోక వనములో స్వామివారిని నిత్య అలంకరణ కోసం పూలతోట ఏర్పాటు వాహనాల పూజ కోసం ప్రత్యేక షెడ్డు నిర్మాణం దీక్షావిరమణ మండప భవన నిర్మాణం దుకాణాల సముదాయాల నిర్మాణం మెట్లదారి అభివృద్ధి దేవస్థానం కోసం నిత్యం నీటి సరఫరా సులభ్ కాంప్లెక్సు నిర్మాణం -
యమధర్మరాజుకు పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం యమధర్మరాజు ఆలయంలో ఆదివారం భక్తులు పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ సంపత్కుమార్ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తం, అభిషేకం నిర్వహించారు. హోమం, హారతి, మంత్రపుష్పం గావించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఽట్రస్టు సభ్యులు, సూపరింటెండెంట్ కిరణ్ తదితరులున్నారు. ఆయిల్ పాం సాగుపై రైతులకు అవగాహనధర్మపురి: ఆయిల్ పాం సాగుపై మండలంలోని నేరెల్ల గ్రామంలో రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఉధ్యానవన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ వారి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఆయిల్ పాం సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలు, మద్దతు అందిస్తోందని తెలిపారు. బుగ్గారం మండలంలో సెప్టెబర్ 4న ఆయిల్ పాం ఫ్యాక్టరీకి భూమిపూజు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సాగు చేసిన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు జాజాల రమేశ్, జిల్లా మానిటరింగ్ అధికారి అన్వేశ్, ఫీల్డు ఆఫీసర్ రమణ, శ్రీయ తదితరులున్నారు. ఇజ్రాయిల్లో భయం భయంగా తెలుగువారుజగిత్యాలక్రైం: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలుగువారు మూడు రోజులుగా భయంభయంగా గడుపుతున్నారు. ఇజ్రాయిల్పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. తెలుగువారిని కూడా క్షేమంగా ఉండే ప్రాంతాలకు తరలించినట్లు అక్కడున్న జిల్లా వాసులు తెలిపారు. నాలుగురోజులుగా భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పనులు నిలిపివేసి బంకర్లలోనే ఉంటున్నట్లు పేర్కొన్నారు. సెల్ఫోన్ నెట్వర్క్ కూడా తీవ్ర అంతరాయం ఉందని తెలిపారు. విమాన సర్వీసులు మొదలైతే స్వదేశం వస్తామని జిల్లా వాసులు తెలిపారు. లోక్ అదాలత్లో రాజీతో వాకర్స్ అసోసియేషన్ ఎన్నికజగిత్యాలజోన్: లోక్ అదాలత్లో రాజీతో జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికపై కొందరు గతంలో కోర్టుకు వెళ్లారు. ఇరువర్గాల మధ్య ఇటీవల నిర్వహించిన లోక్ అదాలత్లో రాజీ కుదిరింది. అధ్యక్ష స్థానానికి నేరేళ్ల వెంకన్న, కాయితి శ్రీనివాస్ పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో 477 ఓట్లకు 401 పోలయ్యాయి. నేరేళ్ల వెంకన్నకు 271 ఓట్లు, శ్రీనివాస్కు 129 ఓట్లు వచ్చాయి. దీంతో వెంకన్న గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు నాగభూషణం, నాగేంద్రం, మల్లికార్జున్, శ్రీనివాస్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా మెరుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా తోడేటి లచ్చయ్య, సహాయ కార్యదర్శిగా మహేందర్రావు, కోశాధికారిగా అనంతుల విటలయ్య ఎన్నికయ్యారు. జానపద కళా పురస్కార్కు రాజేందర్ ధర్మపురి: జానపద కళారంగంలో ప్రతిభ కనపర్చిన పలిగిరి రాజేందర్ రాష్ట్ర జానపద కళాపురస్కార్ అవార్డుకు ఎంపికయ్యాడు. మండలంలోని నేరెల్లకు చెందిన రాజేందర్ 25ఏళ్లుగా జానపదరంగంలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వేలాది ప్రదర్శనలిచ్చారు. ప్రజలను చైతన్యవంతులు చేశారు. ఈ నెల 21న పెద్దపెల్లి జిల్లా బసంతనగర్లో స్థాపించిన ఆలయ ఫౌండేషన్ వారు అందించిన జానపద కళాపురస్కార్ అవార్డును మాజీ ఎంపీ వెంకటేష్ నేత చేతుల మీదుగా అందుకున్నారు. -
రైతులకు సబ్సిడీపై పనిముట్లు
● వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణ ● రూ.104కోట్లు కేటాయించిన ప్రభుత్వంమెట్పల్లి: కొన్నేళ్లుగా నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలు సబ్సిడీపై అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నిధులు కేటాయించింది. పథకాన్ని నిలిపివేయడంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బండి పడుతున్నారు. ఈ క్రమంలో పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఐదేళ్ల క్రితం నిలిపివేత ● వ్యవసాయంలో సాంప్రదాయ పద్ధతులకు బదులు యంత్రాల వినియోగంతో రైతులకు ఎన్నో విధాలుగా మేలు జరుగుతోంది. ● ముఖ్యంగా శ్రమ, కూలీల ఖర్చు తగ్గడంతోపాటు సమయం ఆదా కావడం, దిగుబడి పెరగడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ● వీటిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై వివిధ రకాల యంత్రాలు, పనిముట్లను రైతులకు అందించాయి. ● ఎస్సీ, ఎస్టీలకు 95శాతం.. మిగిలిన వర్గాలకు 50శాతం సబ్సిడీపై కల్టివేటర్, రొటోవేటర్, పవర్ టిల్లర్, వరినాటు, పవర్వీడర్, పురుగుల మందు పిచికారీ యంత్రాలు పంపిణీ చేశాయి. ● తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2017–18 సంవత్సరం వరకు వీటిని అందించి.. తర్వాత పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. ● అప్పటి నుంచి చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు యంత్రాల కొనుగోలుకు అప్పు చేస్తుంటే.. మరి కొందరు గత్యంతరం లేక సాంప్రదాయ పద్ధతుల్లోనే కష్టాలు పడుతూ సాగు చేస్తున్నారు. పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం ● నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ● ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన ఓ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు రూ.104కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ● రైతులకు ఉపయోగకరమైన యంత్రాలు, ఇతర పనిముట్లను గుర్తించాలని అధికారులకు సూచించారు. ● నియోజకవర్గాల వారీగా కేటాయింపులు జరిపి వాటిని రైతులకు సబ్సిడీపై అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ● మొత్తంగా ఐదేళ్లుగా నిలిచిపోయిన సబ్సిడీ యంత్రాలు, పనిముట్ల పంపిణీ.. తిరిగి పునరుద్ధరణకు నోచుకుంటుండడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు రావాల్సి ఉంది వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఆదేశాలు రాలేదు. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రాగానే కార్యాచరణను మొదలుపెడుతాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
పరిష్కారంపైనే ఆశలు
ముగిసిన సదస్సులు..జగిత్యాల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో అనేక తప్పులు దొర్లాయని, దరఖాస్తు చేసుకున్నా.. మార్చే అవకాశం లేకపోవడంతో రైతులు కార్యాలయం చుట్టూ తిరిగారని, సీసీఎల్కు వెళ్తే తప్ప సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్న కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం రైతులు దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. ముందుగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద బుగ్గారం మండలాన్ని ఎంపిక చేశారు. అనంతరం జిల్లాలోని అన్ని మండలాల్లో ఈనెల 3 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 37,931 దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 300 గ్రామాల నుంచి 37,931 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రస్తుతం వీటిని ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత సమస్యల పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. గతంలో చేసిన తప్పిదాలతో రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఒకరి పేరు బదులు మరొకరు, విస్తీర్ణంలో వ్యత్యాసం, మిస్సింగ్ సర్వే నంబర్లు, నిషేధిత జాబితాలో చేర్చడం, పట్టాదారు పాస్బుక్లు రాకపోవడం, కొన్ని నంబర్లు కన్పించకపోవడం వంటి అనేక సమస్యలతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగారు. కొందరికి భూమి ఉండి కూడా రైతుబంధు అందుకోని రైతులు ఉన్నారు. అంతేకాక పండించిన పంటను కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలంటే పట్టాదారు పాస్బుక్లో నంబర్లు లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం నూతన చట్టం తేవడంతో పాటు, కొన్ని సమస్యలను తహసీల్దార్ స్థాయిలో చేపట్టగా, మరికొన్ని సమస్యలు ఆర్డీవో, కఠిన సమస్యలు కలెక్టర్ పరిష్కరించేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. గతంలో ధరణి చట్టంలో కలెక్టర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతులకు ఏదైనా సమస్యలున్నా అప్పీల్ చేసే అవకాశం సైతం కల్పించారు. సాదాబైనామాలే అత్యధికం జిల్లాలో అత్యధిక దరఖాస్తులు సాదాబైనామాలకే వచ్చాయి. 8,667 సాదాబైనామాల కోసం రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. కొందరు గతంలో తెల్ల కాగితంపై భూ క్రయవిక్రయాలు చేసే వారు. అవి రిజిస్ట్రేషన్ కాకపోవడం, భూముల ధరలు పెరిగిపోవడంతో తిరగబడ్డారు. రైతులు కబ్జాలో ఉన్నప్పటికీ పట్టాదారు పాస్బుక్లు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అధికారులు వాటిపై ఫోకస్ పెట్టారు. రెవెన్యూ గ్రామాల వారిగా నోటీసులు జారీ చేసి సమస్యలను పరిష్కరించేలా ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. జిల్లాలో భూభారతికి వచ్చిన దరఖాస్తుల వివరాలుసాదాబైనామాలు 8,667 నోషనల ఖాతా పట్టా 1,080 నాలా హౌస్సైట్ 15 పట్టాదారు పాస్ల కోసం 32 పట్టా ల్యాండ్లో ఇతరుల పేర్లు 278 సేత్వార్ కనెక్షన్ 5 ఆధార్ కరెక్షన్ 52 అసైన్డ్మెంట్ పట్టా 153 ల్యాండ్ డిస్ప్యూట్ 54 పీవోటీ 110 ఖాతా మెర్జింగ్ 19 సర్వేనంబర్ కరెక్షన్ 30 ఎఫ్లైన్ పిటిషన్ 459 రెవెన్యూ సదస్సులకు అర్జీల వెల్లువ జిల్లావ్యాప్తంగా 39,931 దరఖాస్తులు సాదాబైనాలు, మిస్సింగ్ సర్వేనంబర్లే అధికందరఖాస్తుల పరిశీలన రెవెన్యూ అధికారులు దరఖాస్తులను పరిష్కరించి ఫిర్యాదులు సమర్పించిన రైతులతోపాటు, సమీపంలోని రైతులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇరువురి వద్దనున్న రికార్డులతో పాటు, ఆధారాలు సమర్పించిన తర్వాత వారం రోజుల గడువు విధించి ఆ లోపు సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతారు. సమస్యలకు పరిష్కారం భూ భారతి చట్టంతో రైతుల సమస్యలకు మేలు జరుగుతుంది. ఇప్పటికే అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్ద నుంచి సమస్యలను స్వీకరించాం. త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో దరఖాస్తులను నమోదు చేస్తాం. అనంతరం అన్ని విషయాల్లో విచారణ జరిపి పరిష్కరిస్తాం. – సత్యప్రసాద్, కలెక్టర్ -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
జగిత్యాల/జగిత్యాలటౌన్/జగిత్యాలక్రైం:యోగాతో సంపూర్త ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని వివేకానంద మినీస్టేడియంలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ యోగాసనాలు వేశారు. మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారాయణ, ఆర్డీవో పులి మధుసూదన్గౌడ్, డీవైఎస్ఓ రవికుమార్, అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, సీఐలు, ఆర్ఎస్సైలు, ఎస్సైలు పాల్గొన్నారు. ముందుగా కలెక్టర్ యోగా గురూజీ రాంరెడ్డిని సన్మానించారు. -
ఎన్నికల్లో లబ్ధికోసమే రైతుభరోసా
సారంగాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందడానికే ప్రభుత్వం రైతుభరోసాను రైతుల ఖాతాల్లో జమచేస్తోందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి శనివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేస్తోందన్నారు. ఎకరాకు రూ.15వేల రైతుభరోసా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు రూ.12వేలకు పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500, రూ.4వేల పింఛన్, తులం బంగారం ఎక్కడా.. అని ప్రశ్నించారు. ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసినా రైతులు కాంగ్రెస్కు మరోసారి ఓటేయడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, యూత్ అధ్యక్షుడు మదన్, నాయకులు బాదినేని వెంకటేష్, భైరి మల్లేశం, వొడ్నాల జగన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ దేశాలన్నీ యోగాను పాటిస్తున్నాయి
ధర్మపురి: ప్రపంచ దేశాలు యోగాను పాటిస్తున్నాయని జూనియర్ సివిల్ జడ్జి యోగి జానకి అన్నారు. 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మపురిలోని జూనియర్ సివిల్ కోర్టులో శనివారం యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానసిక, శారీరక ప్రశాంతత, ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అలుక వినోద్కుమార్, ట్రెజరరీ జాజాల రమేశ్, ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు గడ్డం సత్యనారాయణరెడ్డి తదితరులున్నారు. ‘సార్’కు నివాళిజగిత్యాలటౌన్: అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని శనివారం నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ విముక్తి కోసం 1969 నుంచి జయశంకర్ పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు చింతల రాజేశ్వర్, ఉపాధ్యక్షులు పడాల నరేష్, పొనగంటి రంజిత్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి విశ్వబ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు సంకోజి వెంకటరమణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అడిషనల్ ఎస్పీ భీంరావు బదిలీజగిత్యాలక్రైం: అడిషనల్ ఎస్పీ భీంరావును కరీంనగర్ కమిషనరేట్కు బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు భేష్జగిత్యాల: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సేవలు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచాయని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. ఆయుష్మా న్ ఆరోగ్య కేంద్రాలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాల్లో అందించే ఓపీ, వెల్నెస్ సేవలు బాగున్నాయని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో స్థిరమైన సేవలు అందిస్తూ ముందున్నాయని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతినెలా ప్రోగ్రాం అధికారులు ఆరో గ్య మిషన్ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో రికార్డులను తనిఖీ చేస్తున్నామని పేర్కొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు సమియోద్దీన్, డాక్టర్ శ్రీనివాస్, అర్చన, జైపాల్రెడ్డి, రవీందర్ పాల్గొన్నారు. జగన్నాథపూర్ బ్రిడ్జికి రూ.17.50 కోట్లు మంజూరు రాయికల్: మండలం బోర్నపల్లి, జగన్నాథపూర్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.17.50 కోట్లు మంజూరు కావడంతో శనివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను మాజీమంత్రి జీవన్రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ బోర్నపల్లి, జగన్నాథపూర్ వంతెన దశాబ్దాల కల అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీఎం దృష్టికి తీసుకెళ్లానని గుర్తుచేశారు. నిధుల మంజూరుకు సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
జగిత్యాల: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ శనివారం కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం నాయకులు అడువాల జ్యోతి, గిరి నాగభూషణం, పలువురు నాయకులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో నాయకులు..రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్ బాధ్యతలు స్వీకరించగా జగిత్యాలకు చెందిన టీఎన్జీవో నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్రెడ్డి, ఎండీ.వకీల్, మహమూద్, రవీందర్ పాల్గొన్నారు. -
రాజీమార్గం ద్వారానే కేసుల పరిష్కారం
● జిల్లా జడ్జి రత్న పద్మావతి జగిత్యాలక్రైం: రాజీమార్గం ద్వారానే కేసుల పరి ష్కారం సులువవుతుందని జిల్లా జడ్జి రత్న పద్మావతి అన్నారు. మెగా లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని శనివారం అభినందించి ప్రశంసపత్రాలు అందించారు. రాజీమార్గాల ద్వారా కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో 2500 కేసులు పరిష్కరించామన్నారు. పోలీసు అధికారులు, బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది కష్టపడి కక్షిదారులను కలిసి విజయవంతం చేశారని తెలిపారు. రానున్న రో జుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్కుమార్, అదనపు జిల్లా జడ్జి నారాయణ, లీగల్సెల్ సెక్రటరీ వెంకట మల్లిక్ సుబ్రమణ్య శర్మ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, న్యాయమూర్తులు, బార్కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రమాద బాధితులకు పరిహారం
● మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు మంజూరు ● కోరుట్ల ఏడీఈ రఽఘుపతికోరుట్ల: విద్యుత్ షాక్ ప్రమాదాల్లో గాయపడిన వారికి పరిహారం అందిస్తామని కోరుట్ల ఏడీఈ రఘుపతి తెలిపారు. విద్యుత్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు మాత్రమే ట్రాన్స్కో పరి హారం ఇవ్వడం.. గాయపడిన వారికి దక్కని వైనంపై శనివారం ‘సాక్షి’లో ‘పరిహారం–పరిహా సం’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన ఏడీఈ మాట్లాడుతూ.. 2017 నుంచి గాయపడిన వారికి సివిల్ సర్జన్ ఇచ్చిన నివేదిక మేరకు పరిహారం అందించాలని సర్క్యులర్ ఉందని, ఇప్పటివరకు అలా పరిహారం అందలేదని, వైద్యాధికారుల సరైన నివేదికలతో తమకు దరఖాస్తులు అందితే పరిశీలించి ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. గాయపడిన వారికి పరిహారం అందించే అంశంపై అవగాహన లేక ఎవరూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. గతంలో గాయపడిన వారు వైద్య నివేదికలు సమర్పిస్తే పరిశీలిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం గణపతి విగ్రహం తరలింపులో కరెంటు షాక్తో మృతి చెందిన అలాల వినోద్, వెల్లుట్ల సాయికుమార్ కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున మంజూరైనట్లు ఏడీఈ తెలిపారు. త్వరలో వారికి పరిహారం డబ్బులు అందిస్తామన్నారు. -
అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 41వ వార్డులో రూ.25లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించారు. నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని పనుల్లో ఇష్టానుసారంగా చేస్తున్నారని, అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఉన్నారు. పాఠశాలల్లో వసతుల కల్పనకు కృషి కథలాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి తెలిపారు. కథలాపూర్లో బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం నిధులతో కథలాపూర్ మోడల్స్కూల్లో కిచెన్షెడ్ నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సిరికొండ, ఇప్పపెల్లి, దుంపేట, చింతకుంట, అంబారిపేట తండాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్ల కోసం రూ.5 లక్షల చొప్పున మంజూరయ్యాయన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ ఈ నిధులను మంజూరు చేశారన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు సత్యనారాయణ, వెంకటేశ్వర్రావు, శ్రీనివాస్, మహేశ్, రవి, సత్యం, రాజేశ్, శివ, శ్రీహరి పాల్గొన్నారు. ఈ పాస్ ద్వారానే అమ్మకాలుకోరుట్ల రూరల్: ఈ పాస్ ద్వారానే యూరియా అమ్మకాలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సూచించారు. కోరుట్ల మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యూరియా లారీ వచ్చిన వెంటనే గోదాముల్లో దింపి రైతు భూమి వివరాల ప్రకారం యూరియా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ దండ రమేశ్, ఏవోలు నాగమణి, లావణ్య, రాజ్కుమార్, దీపిక పాల్గొన్నారు. దరఖాస్తులకు ఆహ్వానంజగిత్యాల: సివిల్ సర్వీసెస్ పరీక్ష (ప్రీలిమ్స్, మెయిన్స్) 2025–26 కోసం ఉచిత లాంగ్టర్మ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. జిల్లాలోని డిగ్రీ పాస్ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జూలై 8 వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, జూలై 25 నుంచి 2026 ఏప్రిల్ 30 వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. 150 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనుండగా, 100 మందిని జూలై 12న నిర్వహించే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారని, మరో 50 మంది అభ్యర్థులను ఇంతకుముందు యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని నేరుగా తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రవేశం పొందిన అభ్యర్థులకు ఉచిత రవాణా, భోజన, లాడ్జింగ్ కోసం నెలకు రూ.5 వేలు, బుక్ఫండ్ కోసం రూ.5 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వివరాలకు 0878–2268686 నంబరులో సంప్రదించాలన్నారు. సమ్మె నోటీసు అందజేతజగిత్యాలరూరల్: గ్రామపంచాయతీ కార్మిక సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోమటి చంద్రశేఖర్ అన్నారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరిగే ఒక రోజు సమ్మెలో పంచాయతీ కార్మికులు పాల్గొంటారని శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్కు సమ్మె నోటీసు అందజేశారు. జిల్లా కార్యదర్శి మల్లేశం, న్యాతరి మల్లవ్వ, మండల అధ్యక్షుడు రాజేందర్, రాజన్న, రాజు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యం సాధించాలి
● ఎస్పీ అశోక్కుమార్ జగిత్యాలక్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలని ఎస్పీ అశోక్కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతరం విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంప్యూటర్, ఫోరెన్సిక్, ఫింగర్ప్రింట్, హ్యాండ్లింగ్, పోలీస్ జాగిలాల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్ప్లోజివ్, ఫొటో, వీడియోగ్రఫీలో పోటీలు ఉంటాయన్నారు. సాంకేతిక పరి జ్ఞానం, కేసుల దర్యాఫ్తులో మెలకువలు నేర్చుకునేందుకు డ్యూటీ మీట్ దోహద పడుతుందన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగే డ్యూటీ మీట్కు ఎంపిక చేస్తామని తెలిపారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు శ్రీనివాస్, రఫీ ఖాన్, శ్రీధర్, సుధాకర్, కరుణాకర్ పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం!
● విద్యుత్ షాక్ బాఽఽధితుల దయనీయ పరిస్థితి ● ప్రాణాలు పోయినా పట్టింపు కరువు ● గాయపడిన వారిని ఆదుకునేదెవరు ● ప్రయివేటులో అడ్డగోలు ఖర్చులుఈమె పేరు పూజిత. పక్కన ఆమె కుమారుడు సాత్విక్(6). ఏడాదిన్నర క్రితం కోరుట్ల కల్లూర్రోడ్డులో హైటెన్షన్ వైర్లు తగిలి సాత్విక్తో పాటు మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యారు. సాత్విక్ ఒళ్లంతా కాలిపోయి అవిటివాడిగా మారాడు. ఒళ్లు కాలి వికారంగా మారడంతో బడికి సైతం వెళ్లడం లేదు. చికిత్స కోసం రూ.2 లక్షలకు మించి సదరు పేద కుటుంబం ఖర్చు చేసింది. విద్యుత్శాఖ నుంచి ఒక్క రూపాయి పరిహారం రాలేదు. ఈమె పేరు శైలజ. ఐదు రోజుల క్రితం గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో ఎల్టీ వైర్లు తగిలి గాయపడ్డ నితిన్ భార్య. నితిన్ కరీంనగర్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మూడు రోజులకే దాదాపు రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యింది. ఇంకా ఎన్ని రోజులు చికిత్స తీసుకోవాలో..ఎంత ఖర్చు వస్తుందో..తెలియడం లేదని ఆసుపత్రిలో ఉన్న శైలజ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యుత్శాఖ ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం దయనీయం. -
భూ సేకరణలో వేగం పెంచాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: జిల్లాలో వివిధస్థాయిలో ఉన్న నీటి పారుదల ప్రాజెక్ట్లకు సంబంధించి భూ సేకరణ, పునరావాస పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఇరిగేషన్, రెవెన్యూశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయ భూసేకరణ, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్లకు సంబంధించిన పెండింగ్ పనులతో పాటు, ఇతర ప్రాజెక్ట్ల కింద మిగిలిన భూసేకరణ పనులను చేపట్టాలన్నారు. భారీ వర్షాలు కురియకముందే అన్ని కాలువలకు మరమతులు చేయించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ భవనాలు, మరుగుదొడ్లు లాంటి పనులు వేగవంతం చేయాలని పంచాయతీరాజ్శాఖ అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, జిల్లా ఇరిగేషన్ అధికారి రమేశ్ పాల్గొన్నారు. మౌలిక వసతులు కల్పించాలి డబుల్బెడ్రూం లబ్ధిదారులకు వసతులు కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. నూకపల్లి అర్బన్ కాలనీలో డబుల్బెడ్రూం ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. త్వరలోనే లబ్ధిదారుల కోసం ఒక అంగన్వాడీ కేంద్రంతో పాటు, పీహెచ్సీ కేంద్రం సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్డీవో మధుసూదన్, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలిసీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం వైద్యశాఖ, మున్సిపల్ అధికారులతో కలిసి లింగంపేటలో పర్యటించారు. రాబోయే మూడు నెలల పాటు పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలన్నారు. జూన్ 25 నాటికి జిల్లాలోని అన్ని మండలాల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాలను నిరోధించాలి
● వ్యతిరేక వారోత్సవాలు విజయ వంతం చేయాలి ● అదనపు కలెక్టర్ లతజగిత్యాల: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని మహిళ సంక్షేమశాఖ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. కలెక్టరేట్లో వివిధశాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 21న క్రీడలపోటీలు, యోగా డే, జిల్లాస్థాయి డ్రగ్ ఫ్రీ క్రీడలు, 22న అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. 23న మొక్కలు నాటే కార్యక్రమం, 24న డిజిటల్ ఎంగేజ్మెంట్ సామాజిక మాద్యమాల ద్వారా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. 25న పోస్టర్లు, కళాప్రదర్శనల పోటీలు నిర్వహించాలని, 26న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వేడుకల ర్యాలీ, స్లోగన్స్, సంతకాల సేకరణ, స్టాల్స్, ఫొటో ప్రదర్శన, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి నరేశ్, డీఎంహెచ్వో ప్రమోద్, సునీల్కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ మంజూల, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కూళ్ల లక్కీడ్రా 2025–26 సంవత్సరానికి గాను జిల్లాలో గల బెస్ట్అవైలేబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. 1వ తరగతిలో 93 మంది దరఖాస్తు చేసుకోగా, 75 మందిని తీసుకోవడం జరిగిందని, 5వ తరగతిలో 120 మంది దరఖాస్తు చేసుకోగా, 76 సీట్లు లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్కులాల అధికారి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
– వివరాలు 8లోu
ఆస్తమా, బీపీ పోయాయి కరీంనగర్స్పోర్ట్స్: సర్వరోగ నివారణి యోగా అనే దానికి నేనే నిదర్శనం. యోగాసనాలు చేయకముందు బీపీ, ఆస్తమాతో బాధపడ్డాను. ఇక్కడ డేకేర్ సెంటర్కు వచ్చినప్పటి నుంచి అన్ని నయమయ్యాయి. ఇప్పుడు చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. – కె.అరుణ యోగాతో నయమైంది కరీంనగర్స్పోర్ట్స్: 2013 నుంచి 2016 వరకు అనారోగ్యంతో బాధపడ్డాను. యోగా చేయాలని పలువురు చెప్పడంతో ప్రతీ రోజు సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నాను. – కె.వందన -
ఓవర్ టు సీడీఎంఏ
● జగిత్యాలలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి ● 33 అభ్యంతరాల స్వీకరణ ● 12 ఆమోదం.. 21 తిరస్కరణ ● 50 వార్డులతో సీడీఎంఏకు రిపోర్టుజగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ అనంతరం చుట్టుపక్కల ఉన్న మోతె, లింగంపేట, తిప్పన్నపేట, ధరూర్, తిమ్మాపూర్తో పాటు మరికొన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. 38వార్డులతో ఉన్న పట్టణం 48 వార్డులకు పెరిగింది. జనాభా పెరగడం, నూకపల్లి అర్బన్ కాలనీని మున్సిపాలిటీలో కలపడంతో మరో రెండు వార్డులు అనివార్యమయ్యాయి. ఈ మేరకు మున్సిపల్ అధికారులు డీలిమిటేషన్ ప్రక్రి య చేపట్టారు. ఈనెల 3న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయగా, 4న అభ్యంతరాలు స్వీకరించారు. 12వ తేదీ నుంచి 16 వరకు వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేపట్టారు. శుక్రవారం ఫైనల్ రిపోర్ట్ను సీడీఎంఏకు పంపించారు. అభ్యంతరాల వెల్లువ డీలిమిటేషన్లో అభ్యంతరాలు వెల్లువలా వచ్చా యి. పొన్నాల గార్డెన్స్ వెనుకాల ఉన్న వారు లింగంపేటలో కలపాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిలిమిటేషన్ చేపట్టగా ఆ నివాసాలు 25వ వార్డులోనే ఉన్నాయి. దీంతో వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోతె గ్రామంలోని కొన్ని ఇళ్లు జగిత్యాల మున్సిపాలిటీలో చూపిస్తున్నాయి. వారు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మోతె గ్రామంలోని కొన్ని ఇళ్లను మున్సిపాలిటీ నుంచి తొలగించగా వారికి లైన్ క్లియర్ అయింది. మొత్తంగా 33 దరఖాస్తులు వచ్చినప్పటికీ అధికారులు మాత్రం 12 దరఖాస్తులకు ఆమోదం చేశారు. వార్డుకు 1,700 ఓట్లు? జగిత్యాల మున్సిపాలిటీలో 94,320 మంది ఓటర్లు ఉన్నారు. వార్డుకు 1700కు పైగా ఓట్లు ఉండేలా డీలిమిటేషన్ చేపట్టారు. 88 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఒక్కో పోలింగ్ కేంద్రంలో 4నుంచి 5వార్డులు వచ్చేలా చూశారు. అయితే చాలా మంది ప్రజలు డీలిమిటేషన్ ప్రక్రియపై అసంతృప్తిగానే ఉన్నారు. రెండు రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్ సైతం సీడీఎంఏ నుంచి వచ్చే అవకాశాలున్నాయి. ఇక 50 వార్డులు జగిత్యాల మున్సిపాలిటీ ఇక 50 వార్డులుగా కొనసాగనుంది. జిల్లా కేంద్రం కాకముందు 38వార్డులు ఉన్నప్పటికీ అప్పుడు మరికొన్ని గ్రామాలను విలీనం చేయడంతో ఆ సంఖ్య 48 వార్డులకు పెరిగింది. తాజాగా నూకపల్లి అర్బన్ కాలనీని మున్సిపాలిటీలో కలపడంతో మరో రెండు వార్డులు పెంచడం జరిగింది. రానున్న ఎన్నికల్లో 50 స్థానాలకు ఆశావహులు పోటీ చేయనున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియను అధికారులు 19 రోజుల్లో పూర్తి చేశారు. మున్సిపాలిటీలో వార్డులకు సీరియల్ నంబరు నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో బౌండరీలను ఏర్పాటు చేసి చేశారు.ప్రక్రియ పూర్తి డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేపట్టడం జరిగింది. అభ్యంతరాలను సైతం స్వీకరించి ప్రజలకు అనుగుణంగానే చేపట్టడం జరిగింది. త్వరలోనే అప్రూవ్ వచ్చే అవకాశాలున్నాయి. 48 వార్డులుండగా మరో రెండు వార్డులు పెరగనున్నాయి. – శ్రీనివాస్, టౌన్ప్లానింగ్ అధికారి, జగిత్యాల -
తిరోగమనంలో తెలంగాణ
మల్లాపూర్: మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పాలనా వైఫల్యంతో రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. మల్లాపూర్ మండలం గొర్రెపల్లిలో శుక్రవారం పర్యటించారు. నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అమలైన పథకాల్లో కోతపెడుతూ ప్రజలను, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ను దూషించడమే పనిగా పెట్టుకున్నాడన్నారు. 18నెలల పాలనతోనే తెలంగాణ పదేళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి నిలబడి కొట్లాడుతానని, విద్య, ఉద్యోగ అవకాశాల కల్పనకు పనిచేస్తానన్నారు. గ్రామాల్లో పథకాలు మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిందని, ఒక్క రూపాయి ఇవ్వొద్దన్నారు. అనంతరం మొగిలిపేటలో రూ.5లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేశ్గౌడ్, ఎంపీడీవో శశికుమార్రెడ్డి, పీఆర్ డీఈ వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంతో కొట్లాడుతా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ -
పశువుల మందుల్లేవ్..
రాయికల్: సహజంగానే వర్షకాలంలో గొర్రెలు, మేకలు వివిధ వ్యాధుల బారిన పడతాయి. వాటిని కాపాడుకునేందుకు పెంపకందారులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఇలాంటి వారికి ప్రభుత్వమే పశువుల మందులను అందించాల్సి ఉంటుంది. అయితే కనీసం నట్టల నివారణ మందును కూడా ప్రభుత్వం నుంచి పంపిణీ కాలేదు. ఏడు నెలలుగా ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నుంచి మందులు లేకపోవడంతో పెంపకందారులు ప్రైవేటు మందుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వర్షకాలంలో పశువుల్లో చిటుకు రోగం, నీలి నాలుక, ఫూట్రాట్ వ్యాధి, గా లికుంటు, కుంటుపట్టడం వంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. ఈ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే మందులు ఏ డు నెలలుగా సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా నట్టల నివారణ మందుల కోసం ప్రై వేటు దుకాణాలను ఆశ్రయించి వేలాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలినా లుక నియంత్రణకు వేసే బ్లూటంగ్, హెచ్ఎఫ్ డీ క్యూ, గొంతువాపు టీకాలు, పీపీఆర్, ఎల్ఎఫ్జీ వంటి వ్యాక్సిన్లు సరైన సమయంలో సరఫరా కా కపోవడం గమనార్హం. సరఫరా అయిన వ్యాక్సి న్లు కూడా సంబంధిత వైద్యాధికారులు బయట విక్రయిస్తూ అందినంతా దోచుకుంటున్నారు. ఏడు నెలలుగా సరఫరా కాని మందులు ప్రతి నాలుగు నెలలకోసారి పాడి రైతులకు ప్రభుత్వం మందులను సరఫరా చేయాల్సి ఉండగా.. ఏడు నెలల నుంచి మందులు రావడం లేదు. గొర్రెలు, మేకల కోసం ప్రభుత్వం నట్టల నివారణ మందు, జ్వరం, నీలినాలుక, యాంటిబయటిక్స్, వ్యాక్సిన్లు సరఫరా చేసే అవకాశం ఉంది. పాడి గేదెలకు లంపిస్కిన్ కోసం ప్రభుత్వం ఉచితంగా టీకాలు పంపిణీ చేయాల్సి ఉండగా గతంలో సరైన సమయంలో పంపిణీ చేయకపోవడంతో చాలా ఆవులు, గేదెల్లో ఈ వ్యాధితో మృత్యువాతపడ్డాయి. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉండగా.. ఇప్పటివరకు బడ్జెట్ కూడా విడుదల కాకపోవడంతో పశువైద్య ఆస్పత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు లేవు. రిజిస్టర్ లేకపోవడంతో పశువైద్యాధికారులు తమ జేబులోంచి ఖర్చు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వర్షకాలం పూర్తయ్యేలోపు పశువులకు సంబంధించిన మందులను సరఫరా చేయాలని, సకాలంలో వ్యాక్సిన్లు వేయాలని కోరారు.జిల్లాలో పశువులు2,74,934 గొర్రెలు, మేకలు 50,753 గేదెలు 19,000 ఆవులు సరఫరా కాని నట్టల నివారణ మందులు ఏడు నెలలుగా నిలిచిపోయిన వైనం ప్రైవేటు దుకాణాల్లోనే కొనుగోలు నష్టపోతున్న పశువుల పెంపకందారులు -
జూనియర్ కళాశాల ప్రారంభం
మేడిపల్లి: మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు. పోరుమల్లలో మడేలేశ్వర స్వామి బోనాల జాతరలో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన విద్యార్థులకు కళాశాల అందుబాటులోకొచ్చిందన్నారు. కళాశాల అభివృద్ధికి మాజీ సర్పంచ్ బొంగోని రాజగౌడ్ రూ.1.01 లక్షలను విరాళంగా అందించారు. మున్ముందు కూడా సహకరిస్తానని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు ముందుగా పూర్తి చేసుకున్నవారికి మొదటి బహుమతిగా రూ.50వేలు, రెండో బహుమతిగా రూ.40 వేలు, మూడో బహూమతిగా రూ.25వేల అందిస్తానని ప్రకటించారు. వైద్యాధికారుల పోస్టులకు ఆహ్వానంజగిత్యాల: జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టు ప్రతిపాదికన నాలుగు వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఎంబీబీఎస్, తెలంగా ణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ తెలి పారు. రూ.500 డీడీని మెడికల్ హెల్త్ ఆఫీస్ పేరిట తీసి దరఖాస్తులను jagtial. telangna.gov.in వెబ్సైట్ నుంచి తీసుకుని విద్యార్హతల పత్రాలతో ఈనెల 26 వరకు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న, గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.190.62 కోట్ల జమజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని 2,10,145 మంది రైతులకు రైతుభరోసా కింద గురువారం వరకు రూ.190.62 కోట్లు జమ అయ్యాయి. జిల్లాలో మొత్తం 2,48,550 మంది రైతులు ఉండగా.. వారికి రూ.251.14 కోట్లు జమ కావాల్సి ఉంది. 18న 1,79,818 మందికి రూ.120.67కోట్లు, 19న 30,327 మందికి రూ.69.95కోట్ల చొప్పున జమ అయ్యాయి. నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్జగిత్యాలక్రైం: జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లేని, నంబరు ప్లేట్ లేని 306 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయన్నారు. కొందరు ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఫ్యాన్సీ నంబర్లు, తప్పుడు నంబర్లను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నంబరు ప్లేట్ ఏర్పాటు చేసినా.. వాహనాలు రోడ్డుపై తిప్పినా చీటింగ్ కేసు నమోదు చేస్తామన్నారు. అర్చకుల సమస్యలపై వినతిజగిత్యాలరూరల్: ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్రెడ్డికి వీర శైవ అర్చక సమైక్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్ వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్, ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఉమా మహేశ్వర్ ఉన్నారు. జగన్నాథ రథయాత్రలో పాల్గొనండిజగిత్యాలటౌన్: జూలై ఒకటిన నిర్వహించే జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలని ఇస్కాన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అంచారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు నరహరిదాస్, ప్రేమనందగోవిందదాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది దృష్టిసారించాలి
కథలాపూర్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది దృష్టిసారించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ అన్నారు. గురువారం కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారులతోపాటు వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం వివరాలు తెలుసుకునేందుకు వైద్యసిబ్బంది ఇంటింటా సర్వే చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పోగ్రామింగ్ ఆఫీసర్లు శ్రీనివాస్, రవీందర్, సత్యనారాయణ, వైద్యాధికారులు సింధూజ, రచన, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
రాహుల్గాంధీ జన్మదిన వేడుకలు
జగిత్యాల/జగిత్యాలటౌన్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ జన్మదిన వేడుకలను జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరుపుకున్నా రు. రాహుల్గాంధీ జైబాపు, జైభీం, జైసంవిధాన్ నినాదంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. పీసీసీ కార్యదర్శి బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే సంజయ్ జగిత్యాల: భవిష్యత్ ఆశాజ్యోతి రాహూల్గాంధీ అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాహుల్గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ ఉన్నారు. -
ఎన్నికలొస్తున్నాయనే రైతుభరోసా
కోరుట్ల: ఎన్నికలొస్తున్నాయనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా విడుదల చేసిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు గాలం వేసేందుకు రైతుభరోసా ఇచ్చారని పేర్కొన్నారు. సీఎంకు రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులపైనా అవగాహన లేదన్నారు. ఎంపీ అర్వింద్ బనకచర్లను జనకచర్ల అనడం ఆయనకున్న పరిజ్ఞానానికి అద్దం పడుతోందన్నారు. ప్రజలకు అన్ని విషయాల్లో మేలు చేసింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని గుర్తు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 28న కోరుట్ల యువతకు ఉపాధి కల్పన కోసం కటుకం సంగయ్య ఫంక్షన్హాల్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం జాబ్మేళా పోస్టర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేశ్, చీటి వెంకట్రావ్, కేతిరెడ్డి భాస్కర్రెడ్డి, అతిక్, వంతడుపుల అంజయ్య, మోహన్రెడ్డి, రాజమురళి, సురేందర్లు పాల్గొన్నారు. -
బల్దియా స్థలాలు కబ్జా
జగిత్యాల: జిల్లా కేంద్రంలో మున్సిపల్ అనుమతి లేకుండా ఎవరైనా ఇల్లు నిర్మించుకున్నా.. సెట్బ్యాక్ లేకున్నా.. ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేస్తున్నారు. కానీ మున్సిపల్ స్థలాలు యథేచ్ఛగా కబ్జా చేసుకుంటే మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నిర్మాణాలను ఎలా కూల్చివేస్తున్నారో స్థలాలను ఆక్రమించుకున్న వారిని కూడా వెళ్లగొట్టి స్వాధీనం చేసుకోవాలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దుకాణాలను అద్దెకు తీసుకుని.. దాని ఎదుట మరో దుకాణం పెట్టి.. రేకుల షెడ్డుతో కబ్జా చేస్తున్నారు. ఇది అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ జిల్లాకేంద్రంలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు భారీగా వెలిశాయి. ఇటీవల వ్యాపారాలు పెరగడంతో ఎలాంటి సదుపాయాలు లేకుండా భవనాలు నిర్మించడం, ఫుట్పాత్లను ఆక్రమించడం.. డ్రైనేజీలపై కప్పులు వేసుకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉద్యానవనాన్ని ఆనుకుని ఉన్న స్థలం కోట్లాది రూపాయల విలువైనది. ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు దాంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా బల్దియాకు అత్యధిక ఆదాయం చేకూరేది. కానీ మున్సిపల్ అధికారులు ఊసే ఎత్తడం లేదు. ఇలా అనేక చోట్ల అక్రమాలు అత్యధికంగా ఉన్నాయి. ఆదాయానికి భారీగండి ప్రభుత్వ స్థలాల్లో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. అధికారులు పాకలవర్గాలు పట్టించుకోకపోవడంతో ఆ ఆదాయానికి గండి పడుతోంది. గతంలో అంగడిబజార్లో ఉన్న ఖాళీ స్థలలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఒక్కో షాపు రూ.4 నుంచి రూ.5 లక్షలతో టెండర్లు దక్కించుకున్నారు. కోట్లాది రూపాయల విలువ గల స్థలాల్లోని అక్రమణలను తొలగిస్తే జిల్లాకు ఆదాయం అధిక సంఖ్యలో లభిస్తుంది. కొన్ని చోట్ల షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించినప్పటికీ ఆశించిన మేర నిర్మాణం చేపట్టలేదు. మున్సిపల్కు కొంత మేరే చెల్లింపులు మున్సిపల్ స్థలాల్లో అక్రమంగా షెడ్లు వేసుకుని అందులో వ్యాపారం నిర్వహించుకోగా.. మున్సిపల్కు ఎంతో కొంత మాత్రమే ఫీజు చెల్లిస్తున్నట్లు తెలిసింది. బల్దియా అధికారులు సైతం ఫీజులు తీసుకుని మిన్నుకుంటున్నారు. వారు మాత్రం మున్సిపల్కు నామమాత్రంగా ఫీజులు తీసుకుని అద్దెలు తీసుకుంటున్నారు. విలువైన స్థలాల్లో అక్రమణలను తొలగించి షాపింగ్కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. షెటర్ల ముందు షెడ్లు.. షెటర్లను అద్దెకు తీసుకున్న వారు వాటిని ఆనుకుని మరో షెటరంతా రేకులషెడ్డు వేసి సామాను ముందు పెట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రజలు నడిచేందుకు ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో టవర్సర్కిల్, తహసీల్ చౌరస్తా, కొత్తబస్టాండ్, పాతబస్టాండ్ తదితర ప్రాంతాల్లో అధికంగా వాణిజ్య సముదాయాలున్నాయి. ఇటీవల నూతనంగా షాపింగ్మాల్స్ వెలువగా వారు సైతం ఎలాంటి ట్రాఫిక్కు సంబంధించినవి ఏర్పాటు చేసుకోకపోవడంతో వాహనాలు పెట్టుకునేందుకు ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లాలోని కోరుట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. విలువైన స్థలాల్లో ఆక్రమణలు కాంప్లెక్స్ నిర్మిస్తే అధిక ఆదాయం చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులుఈ చిత్రంలో కన్పిస్తున్నది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ ఎదురుగా ఉన్న ఉద్యానవనానికి సంబంధించిన అత్యంత విలువైన స్థలం. ఈ స్థలంలో పండ్ల దుకాణాలు, హోటళ్లు, టీస్టాల్స్, దుకాణాలు అక్రమంగా వెలిశాయి. ఇంత విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మున్సిపాలిటీకి ఆదాయం రావడంతోపాటు అభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు. -
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
జగిత్యాల/సారంగాపూర్: విద్యార్థులు టీవీలు, సెల్ఫోన్లు, వీడియోగేమ్లకు దూరంగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, పిల్లలు చదువుతోపాటు క్రీడలకు సమయం కేటాయించాలని డీఈవో రాము అన్నారు. గురువారం బీర్పూర్ మండలంకేంద్రం, కొల్వాయి, తుంగూర్లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కోనాపూర్లో బాస్కెట్బాల్ కోర్టును ప్రారంభించారు. జిల్లా కో–ఆర్డినేటర్ రాజేశ్, ఎంఈవోలు నాగభూషణం, కిశోర్, హెచ్ఎంలు భాస్కర్రెడ్డి, సత్యరాజ్, శంకరయ్య, వేణు, పెటా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఉన్నారు. విద్యార్థుల్లో భవిష్యత్ నైపుణ్యాలు పెంచేందుకు అటల్ టింకరింగ్ మెకథాన్ బూట్ క్యాంప్ శిక్షణ ఉపయోగపడుతుందని డీఈవో అన్నారు. జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాలలో విద్యార్థులకు బూట్ క్యాంప్ శిక్షణ నిర్వహించారు. ఏఐ, ఎంఎల్, కోడింగ్, త్రీడీ ప్రిటింగ్ నేర్చుకోవాలన్నారు. ఉల్లాస్యాప్లో నమోదు చేయాలి నిరక్షరాస్యులను ఉల్లాస్యాప్లో నమోదు చేయాలని డీఈవో అన్నారు. ధరూర్ క్యాంప్లోని టీచర్స్ భవన్లో జాతీయ సాక్షరాభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్యాప్ ఉపయోగపడుతుందన్నారు. 14 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులు, 60ఏళ్ల లోపు వారిని గుర్తించి ఇందులో చేర్చాలన్నారు. వయోజన విద్యాధికారి ప్రతాప్రావు, సార్వత్రిక సమన్వయకర్త నాగేశ్వర్రావు, డీఆర్డీఏ డీపీఎం మల్లేశ్, మెప్మా పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. 21న యోగా దినోత్సవంఈనెల 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఆరోగ్య భారత్ నిర్మాణ్లో భాగంగా హెచ్ఎంలు వేడుకలు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో ఉదయం 6.30 నుంచి 7.45వరకు పిల్లలకు యోగాపై అవగాహన కల్పించాలన్నారు. -
ప్రమాదం జరిగినప్పుడే హడావుడి
కోరుట్ల: ఈ రెండు సందర్భాల్లోనూ ట్రాన్స్కో అధికారులు సంఘటన జరిగిన సమయంలో చూపిన హడావుడి ఆ తరువాత చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాపాయ స్థితి ఉంటేనే ట్రాన్స్కో అధికారులు పరిష్కారంపై దృష్టి పెడతారా..? అన్న అనుమానంతో జనం ఆందోళన చెందుతున్నారు. హడావుడితో సరి.. ఏడాదిన్నర క్రితం కరెంటు షాక్తో ఇద్దరు చిన్నారులు గాయపడిన వెంటనే ట్రాన్స్కో అధికారులు వారంపాటు హడావుడి చేశారు. ముప్పై ఏళ్లుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లను తొలగిస్తామని ప్రకటించారు. సదరు హైటెన్షన్ వైర్ల తొలగింపు కోసం రూ.50 లక్షలు కేటాయించాలని మున్సిపల్ అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ఆ నిధులు రాకపోవడంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. బీమునిదుబ్బ, ప్రకాశం రోడ్ ఏరియాలను కలుపుతూ సుమారు 150 ఇళ్లపై నుంచి హైటెన్షన్ వైర్లు యధాతథంగా ఉన్నాయి. ఇప్పటికీ అ ప్రాంతజనం వర్షాకాలం వస్తే చాలు ఎప్పుడేం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు ఆదివారం కరెంట్ షాక్కు కారణమైన వల్లంపల్లి 33 కేవీ లైన్ వేలాడుతున్న విషయాన్ని ఇదివరకు స్థాని కులు చాలామంది ట్రాన్స్కో అఽధికారుల దృష్టికి తీసుకెళ్నిట్లు సమాచారం. ఆ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ 33 కేవీలైన్ స్తంభాలు మార్చి 11 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభాలు వేయాలని ట్రాన్స్కో అధికారులకు విన్నవించినట్లు తెల్సింది. ఈ వినతులకు స్పందించి ట్రాన్స్కో అధికారులు అప్పుడే టవర్లు వేసి సరిదిద్దే ప్రయత్నం చేయగా.. స్థానికులు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిసింది. అయితే ట్రాన్స్కో అధికారులు టవర్ల ఏర్పాటులో చొరవ చూపకపోవడంతో 33 కేవీ లైన్లు అలాగే ఉండిపోయాయి. ప్రమాదం జరగగానే ట్రాన్స్కో అధికారులు హడావుడిగా మంగళవారం ప్రమాదస్థలంలో కొత్త స్తంభం వేసి లైన్ ఎత్తు పెంచారు. అనంతరం గతంలో ప్రమాదం చోటు చేసుకున్న కల్లూర్ రోడ్ ఏరియాలోని హైటెన్షన్ వైర్లను పరిశీలించి పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపామని స్థానికులకు చెప్ప డం గమనార్హం. ఇటీవల కరెంట్ ప్రమాదం జరిగిన చోట టవర్లు ఏర్పాటు చేస్తామని, పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ వైర్లు వేలాడు తూ, ప్రమాదకరంగా ఉంటే వెంటనే తమ సిబ్బంది దృష్టికి తేవాలని ట్రాన్స్కో ఏడీఈ రఘుపతి తెలిపా రు. కల్లూర్రోడ్లోనూ ప్రమాదకరంగా ఇళ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ వైర్లు సరిచేసేందుకు త్వరలో 11 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభాలు వేయిస్తామన్నారు. ఆ తర్వాత మర్చిపోతున్న విద్యుత్ అధికారులు తాజాగా కోరుట్ల ప్రమాద స్థలంలో కొత్త స్తంభాలు ఏడాదిన్నర క్రితం కోరుట్లలోని భీమునిదుబ్బ కల్లూర్రోడ్లో గాలిపటం ఎగరేస్తున్న ఇద్దరు చిన్నారులు 33 కేవీ లైన్ విద్యుత్షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి అవిటివాడయ్యాడు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఐదు రోజుల క్రితం కోరుట్ల–మెట్పల్లి జాతీయ రహదారి వెంబడి 33 కేవీ లైన్ స్తంభం తక్కువ ఎత్తులో ఉండటంతో తయారీలో ఉన్న గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న పది మందికి షాక్ తగిలింది. వీరిలో ఇద్దరు ప్రాణాలు వదిలారు. ఆరుగురు తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. -
నట్టల మందు ఇవ్వడం లేదు
వర్షకాలం ప్రారంభమైనప్పటికీ నట్టల మందు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జ్వరం, ఇతర మందులు ప్రభుత్వ పశువైద్య కేంద్రాల్లో ఉండటం లేదు. – నవీన్, రాయికల్, రైతు బడ్జెట్ రాగానే పంపిణీ ప్రభుత్వం నుంచి బడ్జెట్ రాగానే సీజనల్ వ్యాధి మందులు పంపిణీ చేస్తాం. ప్రస్తుతం వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దు. ప్రభుత్వ వైద్యులు వ్యాక్సిన్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – వేణుగోపాల్, జిల్లా పశువైద్యాధికారి -
కొండగట్టు అంజన్నకు జ్యేష్టాభిషేకం
మల్యాల:వర్షాలు సకాలంలో.. సమృద్ధిగా కురిసి.. పంటలు పండాలని ఏటా కొండగట్టు ఆంజనేయస్వామి వారి జన్మనక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం జ్యేష్టాభిషేకం నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో ప్రతిష్టించి, వాసుదేవ పుణ్యహవచనం గావించారు. 108 కలశాల్లోని సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పట్టువస్త్రాలతో అలంకరించారు. ఈఓ శ్రీకాంత్రావు, స్థానాచార్యులు కపీంద్ర, ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్రస్వామి, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి, పి.రాంచంద్రస్వామి, ముఖ్య అర్చకులు తిరుకోవెల లక్ష్మణ్, చిన్న జితేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.