Jagtial
-
ఖర్బూజ తోటలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి
జగిత్యాలఅగ్రికల్చర్: ఎప్పుడూ కోర్టులో కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయమూర్తులతో బిజీగా ఉండే జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ ఆదివారం పొలంబాట పట్టారు. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల–కోనాపూర్లో బండారి వెంకటేశ్, విజయ దంపతులు సాగుచేస్తున్న ఖర్బూజ(పుచ్చకాయ) తోటను సందర్శించారు. ఖర్బూజలో పసుపుపచ్చ రకాన్ని చూసి జడ్జి ఆనందం వ్యక్తం చేశారు. రైతు దంపతులతో కలిసి రెండుగంటలపాటు తోటలో తిరుగుతూ.. సాగు విధానాన్ని పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు..? మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడిన శ్రీపాదరావుజగిత్యాలటౌన్: రాజకీయ జీవితంలో శ్రీపాదరావు అపారమైన కీర్తి ప్రతిష్టలు గడించారని, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్గా ప్రజాస్వామ్య విలువలు కాపాడిన గొప్ప నాయకుడని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లత, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, సిరిసిల్ల శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరి పొలాల సందర్శనజగిత్యాలఅగ్రికల్చర్: వరి సాగును సాధారణంగా డిసెంబర్ మొదటివారంలో నార్లు పోసి.. నాటు వేసి, ఏప్రిల్లో పంటను కోస్తుంటారు. అయితే కొడిమ్యాల మండలం గౌరాపూర్ రైతులు మాత్రం అక్టోబర్లో సాగు ప్రారంభించి, మార్చి మొదటి వారంలో వరి సీజన్ను ముగిస్తున్నారు. ఆ మండలంలో నీటి ఎద్దడి ఎక్కువ కావడంతో నీరు అందక పంటలు ఎండుతుంటాయి. ఈ క్రమంలో కొందరు రైతులు ప్రైవేట్ కంపెనీల విత్తనాలను సాగు చేస్తున్నారు. ఆ పంటలను వ్యవసాయ వర్సిటీ మాజీ సలహా మండలి సభ్యుడు పూడూరు రాంరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు సందర్శించారు. పంట తీరును పరిశీలించారు. -
నేటి ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజలు గమనించాలని సూచించారు. మల్లన్నస్వామి దయతోనే పథకాలువెల్గటూర్: మల్లికార్జునస్వామి దయతో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తోందని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పైడిపల్లి గ్రామంలో నిర్వహించిన మల్లికార్జుస్వామి శివ పంచాయతన, నవగ్రహ, శ్రీకూర్మ ధ్వజ, శిఖర యంత్ర శిలావిగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, ధర్మపురి నియోజకవర్గ ప్రజలపై స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ గంగుల నగేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్, శివస్వాములు, యాదవ సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దేశభద్రతకు ముందుండాలిజగిత్యాలటౌన్: దేశభద్రతకు సమతా సైనికులు ముందుండాలని సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు కాయితి శంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సమతా సైనిక్దళ్ శిక్షణతరగతుల కరపత్రాన్ని జిల్లా కమిటీ సభ్యులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. జాతి, మతం, కులాలకు తావు లేకుండా సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం వారిని చైతన్య పరిచేందుకు.. రాజ్యాంగ రక్షణకు సమతా సైనిక్ దళ్ కృషి చేస్తుందన్నారు. యువత మత్తు బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ వారిలో దేశభక్తిని పెంపొందిస్తూ భావిబారత పౌరులుగా తయా రు చేయడమే లక్ష్యమన్నారు. ఈనెల 8, 9 తేదీ ల్లో కోరుట్ల పట్టణంలో నిర్వహించే శిక్షణ శిబి రంలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పా ల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి మెట్టు దాస్, మాలమహానా డు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి, డీఎస్ ఎస్ నాయకులు తక్కల దేవయ్య, మద్దెల నారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాయికల్ బల్దియాలో సమస్యల దరువు
● ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ ● పేరుకుపోతున్న పారిశుధ్యం ● ఎక్కడిక్కడ నిలుస్తున్న మురుగునీరు ● స్వైరవిహారం చేస్తున్న దోమలు ● నూతన కమిషనర్పైనే ఆశలురాయికల్: రాయికల్ పేరుకే మున్సిపాలిటీ. కానీ.. బల్దియా స్థాయిలో వసతులు మాత్రం మచ్చుకై నా కనిపించవు. ఫలితంగా పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చడంతో పట్టణం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని, సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఏడాది వ్యవధిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ అవుతూ వస్తున్నారు. మరోవైపు పాలకవర్గ పదవీకాలం ముగియడంతో పట్టణ సమస్యలు కమిషనర్కు స్వాగతం పలుకుతున్నాయి. సమస్యలివే.. బల్దియాలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ప్రతివార్డులోని కాలనీలు అపరిశుభ్రంగా మారాయి. ఇళ్ల మధ్య నుంచి డ్రైనేజీలు ఉండడంతో మురికి నీరు సక్రమంగా ముందుకు ప్రవహించక దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షానికే బల్దియాలోని శివాలయం వీధి, చెన్నకేశవనాథనగర్కాలనీ జలమయం అవుతున్నాయి. చెత్త సేకరించేందుకు ఉన్న వాహనాలు కూడా మరమ్మతుకు గురయ్యాయి. పారిశుధ్య సిబ్బంది సరిపడా లేకపోవడంతో చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదు. ఇందిరనగర్ కాలనీలో ఏళ్ల తరబడి తాగునీటి ఎద్దడితో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బల్దియాలోని మాదిగకుంట స్థలంలో ఇరువైపులా కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. క్రమంగా మాదిగకుంటను కబ్జా చేస్తున్నారు. బల్దియాలో సమీకృత మార్కెట్ లేకపోవడంతో రోడ్డుపైనే వారసంత నిర్వహిస్తున్నారు. వారసంతలోంచే ద్విచక్ర వాహనాలు, ఇతరత్రా వాహనాలు వెళ్లడంతో వారసంతలోని వర్తక వ్యాపారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాతబస్టాండ్, గాంధీచౌక్, శివాజీచౌక్ వద్ద ప్రయాణీకుల కోసం సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వారు దాహర్తిని తీర్చుకోలేకపోతున్నారు. పాతబస్టాండ్లో మూత్రశాలలు లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారు. బల్దియాలో కేవలం ఒకే ఒక ఓపెన్ జిమ్ ఉండటంతో కొంతమందికే పరిమితమవుతోంది. మరో ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరుతున్నారు. ఏడాదిలో ఐదుగురు కమిషనర్లు బదిలీ: గతేడాది ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ దృష్ట్యా బదిలీల్లో అప్పటి ఇన్చార్జి కమిషనర్ ఎంపీడీవో సంతోష్ కుమార్ భీంగల్కు.. మెట్పల్లిలో విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్గౌడ్ను రాయికల్కు కమిషనర్గా బదిలీ చేశారు. జూలైలో జగదీశ్వర్గౌడ్ సస్పెన్షన్కు గురయ్యారు. ఆ సమయంలో స్థానిక ఎంపీడీవో చిరంజీవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆగస్టులో జగదీశ్వర్గౌడ్పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో తిరిగి విధుల్లో చేరారు. రెండు నెలల క్రితం జగదీశ్వర్ను నిర్మల్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఖమర్ అహ్మద్ని రాయికల్కు బదిలీచేశారు. కానీ ఆయన విధుల్లో చేరలేదు. దాదాపు పది రోజుల అనంతరం రాయికల్ మున్సిపల్లో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న బి.వెంకటికి ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో గతనెల 25న ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ను రాయికల్ కమిషనర్గా బదిలీ చేశారు. ఇలా ఏడాదికాలంలో ఐదు గురు కమిషనర్లు మారడంతో పట్టణంలో పలు ముఖ్యమైన అంశాలపై తగిన పురోగతి లేదని ప్రజలు వాపోతున్నారు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి బల్దియాలో పారిశుధ్యం, వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. వేసవి కాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. పట్టణవాసులకు ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా దృష్టికి తీసుకురావచ్చు. – మనోహర్గౌడ్, మున్సిపల్ కమిషనర్ -
● గతంలో 39.99 లక్షల పని దినాలు ● వచ్చే సంవత్సరం 37.85 లక్షల రోజులే ● 380 గ్రామపంచాయతీల్లో పనులు ● సదుపాయాల కల్పన.. కూలీలకు ఉపాధి
జగిత్యాల: గ్రామీణప్రాంతాల్లో వలసలు నియంత్రించేందుకు 20ఏళ్ల క్రితం అప్పటి కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దీనిద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో సమావేశాలు నిర్వహించి ఏటా ప్రణాళిక ప్రకారం పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది 2025–26కు కూడా ప్రణాళిక రూపొందించారు. జిల్లావ్యాప్తంగా 37.85 లక్షల పనిదినాలు కల్పించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 20 మండలాల్లో రూ.82.3 కోట్ల వ్యయంతో 37.85 లక్షల పనిదినాలు కల్పించనున్నారు. కూలీలకు రోజుకు రూ.300 గిట్టుబాటు అయ్యేలా చూశారు. ప్రతిపాదించిన నిధుల్లో కూలీలు చేసిన పనులకు అధిక వ్యయం అవసరం కాగా మెటిరియల్ కాంపోనెంట్ కింద స్వల్ప నిధుల వ్యయం అయ్యేలా ఖరారు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామసభలు నిర్వహించి పనులు చేపట్టనున్నారు. జలసంరక్షణకే ప్రాధాన్యత.. వేసవికాలం ఉపాధిహామీ పథకంలో ముఖ్యంగా భూగర్బజలాలు పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిచోటా ఇంకుడు గుంతలు, వాటర్షెడ్స్, చెక్డ్యామ్స్, పంట కాలువలు, నీటి కుంటలు, చెరువుల్లో పూడికతీత, అడవుల్లో కాంటూర్ కందకాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పొలాలకు అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. తగ్గిన పనిదినాలు గతేడాది జిల్లాలో 39.99 లక్షల పనిదినాలను కూలీలకు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 35.91 లక్షల రోజులు పని కల్పించారు. ఆర్థిక సంవత్సరానికి మరో నెల గడువు ఉన్నందున ఆ లోపు లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో మాత్రం కేవలం 37.85 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించనున్నారు. ఈ సారి కూలీలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ పనిదినాలు తక్కువ కావడంతో అధికారులు ఏ విధంగా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కూలీలకు ఈసారి ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రకటించడం తెలిసిందే. ఇందులో కనీసం నెల రోజుల పాటు ఉపాధి పనులకు వెళ్లిన కూలీలను అర్హులుగా గుర్తించే అవకాశం ఉంది. దీంతో జాబ్కార్డు కలిగి ఉండి ఇప్పటి వరకు పనులకు వెళ్లని వారు కూడా వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో ఈసారి ఉపాధి పనులకు డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయి. కానీ గత సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనిదినాలు తక్కువ చేశారు. పెంచాల్సిన పనిదినాలను అధికారులు తగ్గించడంతో ఈసారి కూలీలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని పనిదినాలు కల్పించాలని డిమాండ్ వస్తోంది. రైతు భరోసా వస్తుందనే ఉద్దేశంతో చాలామంది జాబ్కార్డులు ఉన్నవారు ఈసారి ప్రతిఒక్కరూ పనులకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఉపాధి కల్పనతోపాటు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రానుంది. ఉపాధిహామీ కూలీలు ఏడాది 2024–25 2025–26 పనిదినాలు 39.99 లక్షలు 37.85లక్షలు పూర్తయినవి 35.92 లక్షలు జాబ్కార్డ్స్ ఉన్నవారు 1,05,713 కూలీలు 1,46,477 మండలాలు : 20 గ్రామపంచాయతీలు : 380 -
గెలుపెవరిదో..
● చెల్లుబాటు ఓట్లలో సగం మెజారిటీ సాధిస్తేనే విజయం ● లేకపోతే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు ● ప్రతిరౌండ్లోనూ ఎగ్జాస్టెడ్, సబ్ పార్సిల్ ఓట్లు కీలకం ● ఎలిమినేటెడ్ అభ్యర్థి తొలి ప్రాధాన్య ఓట్లు తీసివేత ● మిగిలిన సబ్ పార్సిల్ ఓట్లు అభ్యర్థులకు బదిలీ ● విజయంపై స్పష్టత వచ్చేవరకూ కొనసాగనున్న కౌంటింగ్ ● సాయంత్రానికి ‘టీచర్’ ఫలితం.. పట్టభద్రుల ఫలితానికి రెండు రోజులు?సబ్ పార్సిల్ ఓట్లు కీలకంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఫార్ములా ఆధారంగా కోటా నిర్ధారణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్ధారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కగడతారు. 50శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలు కడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల ఒక్కొక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ.. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం ఒక ఫార్ములా వాడతారు. అదేంటంటే.. కోటా = మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు డివైడెడ్బై సీట్ల సంఖ్య ప్లస్ వన్ ఓల్ ప్లస్ వన్ అన్న సూత్రం ఆధారంగా ఓట్ల లెక్కింపు చేపడతారు. (ఉదాహరణకు: మొత్తం రెండు వేల ఓట్లు పోలైతే వాటిలో 1800 ఓట్లు చెల్లుబాటు ఐతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు.) తొలుత తొలి ప్రాధాన్యం ఓట్లను అభ్యర్థుల వారీగా పంచుతారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఆప్పుడు రెండో రౌండ్కు లెక్కింపు ప్రక్రియ వెళ్తుంది. ● రెండో రౌండ్ అంటే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి రౌండ్లో అందరి కంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తిని రెండో రౌండ్లో తప్పిస్తారు. ఇక్కడ ఓటింగ్ సరళిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో రెండు రకాలుగా ఓట్లను విభజిస్తారు. ఓటర్లు రెండు రకాలుగా ఓట్లు వేస్తారు. ఒకటి కేవలం తొలి ప్రాధాన్యం ఓట్లు మాత్రమే వేసేవారు. ఒకటి కంటే ఎక్కువ ప్రాధాన్యాలు ఇచ్చేవారు. తొలిరౌండ్లో తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తికి తొలి ప్రాధాన్యం మాత్రమే వచ్చిన ఓట్లను ఎగ్జాస్టెడ్ ఓట్లుగా పరిగణించి వాటిని తప్పిస్తారు. మిగిలిన రెండో రౌండ్ ప్రాధాన్యం ఓట్లను (సబ్ పార్సిల్ ఓట్లు) అభ్యర్థులకు పంచుతారు. అలా ఫార్ములా ప్రకారం.. ఏ రౌండ్లో అయితే చెల్లుబాటు అయిన ఓట్లలో ఒక అభ్యర్థికి సగం ఓట్లు వచ్చేంత వరకు రౌండ్లు (ఎలిమినేషన్) ప్రక్రియ సాగుతుంది. అప్పుడే విజేతను ప్రకటిస్తారు. లెక్కింపు గణాంకాలువేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పోలైన ఓట్లు : 2,50,106 టీచర్స్లో పోలైన ఓట్లు: 24,895 మొత్తం టేబుళ్లు: 35 పట్టభద్రుల టేబుళ్లు : 21 టీచర్ల టేబుళ్లు : 14 లెక్కింపు సిబ్బంది: 800 రిజర్వ్ స్టాఫ్: 20 శాతంఎలా లెక్కిస్తారంటే? కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం 3,55,159 మంది ఓటర్లుండగా.. గతనెల 27న జరిగిన ఎన్నికల్లో 2,50,106 మంది (70.42 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీచర్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓట్లు ఉండగా.. 24,895 మంది (91.90 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తక్కువ ఓట్లు ఉన్న నేపథ్యంలో టీచర్ స్థానం ఫలితం సాయంత్రానికి వెలువడనుంది. అధిక ఓటర్లున్న గ్రాడ్యుయేట్ స్థానం కనీసం రెండు రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో మూడో రోజుకు చేరినా ఆశ్చర్యం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.400 మంది పోలీసుల బందోబస్తు కరీంనగర్క్రైం: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సోమవారం 400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. అంబేడ్కర్ స్టేడియంలో జరిగే ఈ ప్రక్రియలో ఒక అడిషనల్ డీసీపీ, ఆరుగురు ఏసీపీలు, 18 మంది ఇన్స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌటింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది, మీడియా ప్రతినిధులు అంబేడ్కర్ స్టేడియంలోని గేట్ నంబర్– 1 నుంచి ప్రవేశించి నిర్దేశించబడిన ప్రదేశంలో వారి వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. గేట్ నంబర్– 4 ద్వారా అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాలులోకి అనుమతించబడునని పోలీసులు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లుగా వచ్చే వారికి కరీంనగర్ కలెక్టరేట్ గేట్ నంబర్– 2 ద్వారా అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. -
ధర్మపురి అభివృద్ధి పనులపై సీఎంకు వినతి
ధర్మపురి: ధర్మపురి అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి ప్రభత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ శనివారం వినతిపత్రం సమర్పించారు. శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గోదావరిలో కలుస్తున్న కలుషిత నీటి ఫిల్టర్ కోసం రూ.17 కోట్లు అవసరమని పేర్కొన్నారు. డిగ్రీ, ఐటీఐ కళాశాల ఏర్పాటు, రానున్న పుష్కరాలకు, పట్టణ ప్రజలకు శాశ్వత మంచినీటి సౌకర్యానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నవోదయ గురుకులం ధర్మపురిలోనే ఉండేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. -
ఇంటర్ పరీక్షలకు నిరంతర విద్యుత్ సరఫరా
జగిత్యాలఅగ్రికల్చర్/మల్లాపూర్: ఇంటర్ పరీక్షలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్ అన్నారు. మల్లాపూర్ మండలం చిట్టాపూర్లో నూతనంగా 11 కేవీ బ్రేకర్ను శనివారం ప్రారంభించారు. చాలా సబ్స్టేషన్లలో 11 కేవీ ఫీడర్ బ్రేకర్పై రెండు కంటే ఎక్కువ ఫీడర్లు ఉన్నాయని, ఏదైనా ఫీడర్లో అంతరాయం ఏర్పడితే విద్యుత్ ట్రిప్ అవుతోందని, ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లావ్యాప్తంగా రూ.4.25కోట్లతో 65 వీసీబీల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 15 బ్రేకర్లు పూర్తయ్యాయని, మిగిలినవి వచ్చేనెల 15లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. అనంతరం అధి కారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. విద్యుత్ సరఫరాను పర్యవేక్షించేందుకు సిబ్బంది స్థానికంగా ఉండాలన్నారు. సమస్య తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని ప్రజ లకు సూచించారు. మెట్పలిల డీఈ గంగారాం, ఏడీఈ మనోహార్, డీఈ ఎంఆర్టీ రవీందర్, ఏఈ సంతోష్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియా నాయక్ -
ఉపయోగాలు.. జాగ్రత్తలు
● ఈత కొట్టడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడి ఆకలి వేస్తుంది. రక్తపోటు, షుగర్ నియంత్రణలో ఉంటాయి. గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. ● ఆస్తమా ఉన్నవారు, సర్జరీ అయినవారు, చర్మవ్యాధులతో బాధపడుతున్నవారు, అవయవ మార్పిడి చేసుకున్న వారు ఈతకు దూరంగా ఉండాలి. ● కొత్తగా ఈత నేర్చుకునేవారు లోతైన ప్రదేశాలకు వెళ్లకూడదు. ట్యూబ్, బుర్రకాయ, వాటర్ ప్లాస్టిక్క్యాన్లతో పెద్దవారి పర్యవేక్షణలో ఈత నేర్చుకోవాలి. ● ప్రత్యేక శిక్షణ పొందిన స్విమ్మర్ల వద్ద ఈత నేర్చుకోవాలి. బావులు, చెరువులు, కుంటల వద్దకు పిల్లలను ఒంటరిగా పంపొద్దు. 3ఫీట్లలోతు నీటిలో ఈత నేర్పడం ఉత్తమం. పూర్తిగా నేర్చుకున్నాక 8ఫీట్ల లోతులో ఈదొచ్చు. -
కొలనులో చేపలమవుదాం
● ఈతతో ఆరోగ్యానికి ఊతం ● పలు వ్యాధులకు ఔషధం ● చిన్నారుల్లో పెరుగుతున్న ఆసక్తి ● సమ్మర్కు ముందే కొలనుల్లో సందడి ● ఎండలు ముదిరితే.. మరింత రద్దీకరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్ టౌన్: ఈత.. ఆరోగ్యానికి ఊతం. శరీరానికి చక్కటి వ్యాయామం. ఈత నేర్చుకుంటే ఎన్నో ఉపయోగాలు. దీంతో చాలామంది తల్లిదండ్రులు సమ్మర్ వచ్చిందే చాలు తమ పిల్లలను సమీపంలోని కొలనులు, చెరువులు, బావు ల వద్దకు తీసుకెళ్లి ఈత నేర్పిస్తున్నారు. ఆదరణ పెరుగుతుండడంతో కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో ఈత కొలనులు అందుబాటులో ఉంచి శిక్షణ ఇస్తున్నాయి. పలు ప్రభుత్వ మైదానాల్లోని స్విమ్మింగ్పూల్స్లోనూ ఈత నేర్పిస్తున్నారు. సమ్మర్ సమీపిస్తోంది. ఎండలు ముదురుతుండడంతో ఉపశమనం కోసం ఈతకు వెళ్తున్నారు. పలు స్విమ్మిగ్పూల్స్లో ఇప్పుడే సందడి కనిపిస్తుండగా.. మరో పక్షం రోజుల తరువాత అన్ని ప్రాంతాల్లోని కొలనులు ఈత నేర్చుకునేందుకు వచ్చేవారితో నిండిపోనున్నాయి. ఈ సందర్భంగా ఈత.. రకాలు.. ఉపయోగాలు.. జాగ్రత్తతో ప్రత్యేక కథనం.ఉమ్మడి జిల్లాలో స్విమ్మింగ్ పూల్స్జిల్లా ప్రభుత్వ ప్రైవేటు కరీంనగర్ 02 05 జగిత్యాల 01 01 పెద్దపల్లి 02 06 సిరిసిల్ల 01 05 -
అక్కపల్లి రాజన్న హుండీ ఆదాయం రూ.4.40లక్షలు
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రాజరాజేశ్వర స్వా మి ఆలయంలో హుండీ లెక్కింపు ను శనివారం చేపట్టారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వా మివారికి మొత్తం రూ.4,40,893 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. హుండీ ద్వారా రూ.1,98,319, కల్యాణం టికెట్ల ద్వారా రూ.1,82,000, ఇతర టికెట్ల ద్వారా రూ. 60,574, విదేశీనోట్లు 11 సమకూరినట్లు తెలిపారు. లెక్కింపులో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి, ఆలయ చైర్మన్ సీపతి సత్యనారాయణ, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, అర్చకులు తదితరులున్నారు. -
సమస్య ఎక్కడుంది..?
● నీటి సమస్యకు చెక్ ● తనిఖీ చేస్తున్న సర్వే బృందం ● లీకేజీలు, పైప్లైన్లు, బోర్లను గుర్తిస్తున్న అధికారులు ● బల్దియాల్లో కొనసాగుతున్న ప్రక్రియజగిత్యాల: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీల్లో ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎక్కడ నీటి సమస్యలున్నా వాటిని గుర్తించి పరిష్కరించేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో సర్వే బృందం గుర్తిస్తోంది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ నీటి సమస్యలున్నాయో గుర్తించేలా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించిన అనంతరం సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు. బృందంలో మున్సిపల్ కమిషనర్లతోపాటు ఏఈ, వార్డు సిబ్బంది ఉన్నారు. వీరు పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించాల్సి ఉంటుంది. సమస్యకు చెక్పడేనా..? మున్సిపాలిటీల్లో నీటి సమస్యలు అనేకం ఉన్నాయి. గతంలో మిషన్ భగీరథ పైప్లైన్లు ఇంటింటికీ వేశారు. అయితే ప్రధాన పైప్లైన్కే లీకేజీలు ఉన్నాయి. గల్లీకో లీకేజీ ఏర్పడుతోంది. మిషన్భగీరథ రాకముందు వేసిన పైప్లైన్లకూ లీకేజీలు ఉన్నాయి. ఫలింగా మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. లీకేజీలతో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బంది కలగడంతోపాటు, చాలాచోట్ల బోర్లకు హ్యాండ్లు చెడిపోయాయి. వాటికీ మరమ్మతు చేపట్టడం లేదు. జగిత్యాలలో ప్రధాన ఫిల్టర్బెడ్ నుంచి నాలుగు ట్యాంక్లకు నీటి సరఫరా అవుతుంది. ఫిల్టర్బెడ్ నుంచి వచ్చే పైపులకు అనేకచోట్ల లీకేజీలు ఉన్నాయి. వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. మున్సిపల్ ఏర్పడినప్పటి పైప్లైన్ కావడంతో అరికట్టలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. మిషన్ భగీరథతో అస్తవ్యస్తం ఇంటింటికీ నీరు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. పైప్లైన్ కోసం ప్రతిచోట తవ్వడం, తవ్విన చోట సక్రమంగా పూడ్చకపోవడం, పాత లైన్ పూర్తిగా పగిలిపోవడం జరిగింది. దీంతో నీరంతా వృథాగా పోతోంది. ప్రతి కాలనీలో రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కనీసం మిషన్ భగీరథ పైప్లైన్ కన్నా మంచినీటి సరఫరా ఇస్తే ఇబ్బందులు ఉండవని పట్టణవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరును పాత పైప్లైన్ ద్వారానే అందిస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
లోక్ అదాలత్కు పోలీసుల సహకారం అవసరం
జగిత్యాలజోన్: ఈనెల 8న జరిగే లోక్ అదాలత్కు పోలీసులు సహకరించాలని జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ అన్నారు. జిల్లా కోర్టులో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్అదాలత్పై పోలీసులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్జి నారాయణ మాట్లాడుతూ రాజీకి అనుకూలమైన కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా చూడాలని కోరారు. లోక్అదాలత్లో క్రిమినల్ కేసులతోపాటు సివిల్ కేసులను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి సుబ్రహ్మణ్యశర్మ మాట్లాడుతూ కేసులను రాజీ చేసుకోవడం ద్వారా కక్షిదారులకు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ రఘుంచందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలిఇబ్రహీంపట్నం: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాము అన్నారు. మండలంలోని గోధూర్, ఇ బ్రహీంపట్నం మోడల్ స్కూళ్లలో ఏర్పాటు చేసి న పరీక్షకేంద్రాలను శనివారం పరిశీలించారు. కేంద్రాల్లో వసతులు పరిశీలించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి భయపడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. తిమ్మాపూర్ హైస్కూల్లో వసతులు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈవో మధు, ఉపాధ్యాయులు ఉన్నారు. కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలి కథలాపూర్: పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఈవో సూచించారు. మండలంలోని గంభీర్పూర్, అంబారిపేట, కథలాపూర్ జెడ్పీ హైస్కూల్, మోడల్ స్కూల్ కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరాలను త్వరగా బిగించాలన్నారు. ఆయన వెంట ఎంఈవో శ్రీనివాస్, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ అనిత, ఉపాధ్యాయులు ఉన్నారు. ‘నక్ష’ సన్నాహక సర్వే ప్రారంభంజగిత్యాల: భూమి, భవనాలకు పక్కాగా లెక్క ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం నక్ష కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రంలో సర్వే కూడా చేపట్టారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. కోడ్ ముగియడంతో శనివారం సన్నాహక సర్వేను ల్యాండ్ అండ్ రికార్డ్స్ అధికారులు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని బౌండరీలను గుర్తిస్తున్నారు. మ్యాప్ వచ్చిన అనంతరం పూర్తిస్థాయిలో బౌండరీలు ఏర్పాటు చేసి సర్వే నంబర్లు, భవనాల సమాచారమంతా మున్సిపాలిటీలో అందుబాటులోకి తేనున్నారు. డెప్యూటీ ఇన్స్పెక్టర్ విఠల్ ఆధ్వర్యంలో జగిత్యాల చుట్టుపక్కల బౌండరీలు ఏర్పాటు చేసేందుకు సర్వే చేశారు. ఘనంగా ఎడ్ల బండ్ల పోటీలుధర్మపురి: మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని నేరెల్ల సాంబశివ ఆలయం వద్ద శనివారం ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు. ప్రథమ బహుమతిని దుబ్బటి సాయికుమార్ (సీతారాంపల్లె), రెండో బహుమతి మాదాసు శంకరయ్యకు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు కాసారపు బాలాగౌడ్, విమల దంపతులు, బైరి ఎల్ల య్య ఐదు గ్రాముల బంగారం, ద్వితీయ బహుమతిని షేక్ బాషుమియా (తిరుమలాపూర్)కు 10 గ్రాముల వెండిని తీగళ తిరుపతిగౌడ్ బహూకరించారు. ఆలయ కమిటీ చైర్మ న్ కాసారపు రాజాగౌడ్, వైస్ చైర్మన్ జాజాల రమేశ్, రెడ్డవేని సత్యం, శేర్ల రాజేశం, పలిగిరి సత్యం, ఆలయ కమిటీ సభ్యులున్నారు. -
మాదిగ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
జగిత్యాలటౌన్: ఎస్సీ వర్గీకరణ పోరులో ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాంమాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో అమరుల చిత్రపటాలకు ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు నివాళి అర్పించారు. మాదిగల అస్తిత్వం, ఆత్మగౌరవం, భావి తరాల భవిష్యత్తు కోసం సమానత్వపు పోరులో తమ ప్రాణాలు కోల్పోయినవారి త్యాగాలు, ఉద్యమ స్పూర్తి వెలకట్టలేనివన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జాతి అభ్యున్నతికి శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నురుగు శ్రీనివాస్, ఎంఎస్పీ జిల్లా నాయకులు బెజ్జంకి సతీశ్, మోకినపెల్లి సతీశ్, బోనగిరి కిషన్, దుమాల రాజ్కుమార్, బిరుదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
జనరిక్ ఔషధాలు వినియోగించుకోవాలి
జగిత్యాల: ప్రజలు జనరిక్ ఔషధాలు వినియోగించుకోవాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. శనివారం ప్రధానమంత్రి జన ఔషధి పరియోజనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరలో అందించేందుకు ప్రధానమంత్రి జన ఔషధి ద్వారా జనరిక్ మందులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. డయాబెటిస్, బీపీ, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు ఇందులో తక్కువ ధరలకు లభిస్తాయని తెలిపారు. ఏఎంవో సత్యనారాయణ, శ్రీధర్, హెల్త్ ఎడ్యుకేటర్స్ భూమేశ్వర్, శంకర్ పాల్గొన్నారు. గోదాంను సందర్శించిన డీసీవోధర్మపురి: మండలంలోని నేరెల్లలోగల గోదాంను శనివారం జిల్లా సహకార సంఘం అధికారి మనోజ్కుమార్ సందర్శించారు. గోదాంలో నిల్వ ఉన్న యూరియా బస్తాలను పరిశీలించారు. రైతులకు యూరియా బస్తాల కొరత లేకుండా చూస్తామని అన్నారు. యూరియా పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలుంటాయని హెచ్చరించారు. రైతుల పట్టా పాస్ పుస్తకాల ఆధారంగా పారదర్శకంగా పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు రైతు సంఘం అధ్యక్షుడు జాజాల రమేశ్, సీఈవో రాజేష్, ఏఈవో నవ్య, రైతులు తదితరులున్నారు. -
ఆర్థిక క్రమశిక్షణే భవిష్యత్కు భరోసా
జగిత్యాల: ప్రతి ఒక్కరికి తమ ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పొదుపే భవిష్యత్కు భరోసా అని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థితిని బట్టి ఆదాయ వ్యయాలు చేయాలని పేర్కొన్నారు. ఎదుటి వారిని చూసి ఆడంబరాలకు పోయి తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నారని, దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి సతమతమవుతున్నారని, ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయన్నారు. ప్రతి వ్యక్తి బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి సంపాదన ముఖ్యమే గానీ ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే ప్రధానమన్నారు. పొదుపు చేయడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వరంగ సంస్థలను మాత్రమే ఎంచుకోవాలని, అప్పుడే డబ్బుకు భద్రత, భరోసా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి సత్తవ్వ, బీసీ సంక్షేమాధికారి సునీత, జిల్లా ఎఫ్ఎల్సీ మధుసూదన్, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సైన్స్పై అవగాహన పెంచుకోవాలి
జగిత్యాల: సైన్స్ అంటేనే పరిశీలన, ప్రయోగాలు అని డీఈవో రాము అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని పలు స్కూళ్లలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 1987 నుంచి జాతీయ సైన్స్ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు సైన్స్పై అవగాహన పెంచుకోవాలని, భవిష్యత్లో శాస్త్రవేత్తలు కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరన, క్విజ్, చిత్రలేఖనం, ప్రాజెక్ట్ల ప్రదర్శన తదితర వాటిపై పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అలసత్వం ప్రదర్శించొద్దుజగిత్యాల: కొత్తగా ఉపాధ్యాయులుగా నియమితులైన వారు విధుల పట్ల అలసత్వం ప్రదర్శించొద్దని డీఈవో రాము అన్నారు. డీఎస్సీ– 2024 ద్వారా నియామకమైన ఎస్జీటీలకు వీక్లీబజార్ ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. ఆర్పీలు జయంత్, ఉమేశ్, మహేశ్, కుమార్ పాల్గొన్నారసేవలతోనే ఉద్యోగులకు గుర్తింపుకథలాపూర్(వేములవాడ): ప్రజలకు సేవలందిస్తేనే ఉద్యోగులకు గుర్తింపు ఉంటుందని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ అన్నారు. కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్ఎన్గా పనిచేసిన లూసి ఉద్యోగ విరమణ సభ శుక్రవారం జరిగింది. పీహెచ్ఎన్ సేవలను అధికారులు కొనియాడి జ్ఞాపికలు అందించి శాలువాలతో సన్మానించారు. డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్, పీవో శ్రీనివాస్, వైద్యాధికారులు సింధూజ, రజిత, హెల్త్ సూపర్వైజర్ శ్రీధర్, రాజన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. రాయికల్ మున్సిపల్ కమిషనర్గా మనోహర్గౌడ్రాయికల్(జగిత్యాల): రాయికల్ మున్సిపల్ కమిషనర్గా శుక్రవారం మనోహర్గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూలీల సంఖ్య పెంచండిరాయికల్(జగిత్యాల): ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో రఘువరణ్ సూచించారు. శుక్రవారం రాయికల్ మండలం వీరాపూర్ గ్రామంలోని ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలో 50 మంది కూలీలకు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత కార్యదర్శులు, ఫీల్డ్ అసిసెంట్లపై ఉందన్నారు. వేసవికాలం దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీవో దివ్య, కార్యదర్శి స్వర్ణ, టెక్నికల్ అసిస్టెంట్ వీణరాణి, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్, కారోబార్ ప్రశాంత్ పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల పరిశీలనధర్మపురి/బుగ్గారం: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అధికారి గంగాధర్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను సందర్శించి సౌకర్యాలను పరిశీలించారు. కేంద్రాల్లో వసతుల గురించి ఎస్సెస్సీ బోర్డుకు నివేదిక అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే బుగ్గారం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో సీతాలక్ష్మి, హెచ్ఎం మోహన్రెడ్డి, సీఆర్పీ పురుషోత్తం తదితరులు ఉన్నారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
అదనపు కలెక్టర్ బీఎస్ లత జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలు ఫర్టిలైజర్ షాపులను శుక్రవారం అదనపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని జగిత్యాల సొసైటీ, ధర్మపురి రోడ్లోని రైతు బజార్, బుగ్గారం మండలం శెకల్లలోని ఆర్పీవీ ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. ధర్మపురి రోడ్లోని రైతు బజార్లో ఎఫ్సీవో నిబంధనల మేరకు ఈపాస్ మిషన్ పనిచేయకపోవడంతో సంబంధిత డీలర్ లైసెన్స్ను రద్దు చేశారు. అలాగే, రైతు సేవా కేంద్రంలో 46 బస్తాల తేడా రావడంతో సంబంధిత డీలర్ లైసెన్స్ను, శెకల్ల గ్రామంలో 90 బస్తాల యూరియా అమ్మినా, ఈపాస్ మిషన్లో ఎంటర్ చేయకపోవడంతో డీలర్ లైసెన్స్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఫర్టిలైజర్ డీలర్స్ అవకతవకలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. యూరియాను బ్లాక్ చేయడం, అధిక ధరలకు అమ్మడం, ఈపాస్లో నమోదు చేయకపోవడం వంటి చర్యలకు పాల్పడితే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని పేర్కొన్నారు. కోటాకు మించి యూరియా సరఫరాయాసంగి సీజన్లో జిల్లాకు సరఫరా కావాల్సిన యూరియా కోటా 38 వేల మెట్రిక్ టన్నులు కాగా 38,205 మె.ట యూరియా సరఫరా జరిగిందని జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ అన్నారు. శుక్రవారం డీఏవో ఆధ్వర్యంలో సిబ్బంది జగిత్యాల, ఎండపల్లి మండలాల్లో యూరియా నిల్వలను పరిశీలించారు. జగిత్యాల అర్బన్ ఎఆర్ఎస్కేలో 520 బస్తాలు, ఎండపల్లి మండలం ఉమామహేశ్వర్ ఫర్టిలైజర్ షాపులో 450, రాజరాజేశ్వర్ ఫర్టిలైజర్ షాపులో 450 బస్తాల యూరియా నిల్వ ఉందని, రైతులకు సరపడా అందుబాటులో ఉందని వివరించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి తిరుపతినాయక్ తదితరులు ఉన్నారు. -
నయనానందం
సారంగాపూర్/మల్లాపూర్: సారంగాపూర్ మండలం దుబ్బరాజన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన రథోత్సవానికి భక్తజనం తరలివచ్చారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి రథం ఆసీనులు చేశారు. స్వామివారి నామస్మరణ మధ్య భక్తులు రథాన్ని ముందుకు లాగుతూ కదిలారు. విచిత్ర వేషధారణలు, కోలాటాలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. గంటన్నరపాటు రథోత్సవం వైభవంగా సాగింది. అలాగే మల్లాపూర్ శ్రీకనక సోమేశ్వరస్వామి జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12గంటలకు రథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి ఓం నమఃశివాయా అంటూ రథోత్సవంలో పాల్గొన్నారు. మల్లాపూర్లో రథోత్సవంలో పాల్గొన్న భక్తజనంరథోత్సవం సందర్భంగా జనసంద్రమైన దుబ్బరాజన్న సన్నిధి -
‘సీసీ’ నిఘాలో ఇంటర్ పరీక్షలు
● ఈ నెల 5 నుంచి 22 వరకు నిర్వహణ ● జిల్లాలో 28 కేంద్రాలు ఏర్పాటు చేశాం ● విద్యార్థులు ఆందోళన చెందకుండా సకాలంలో హాజరై, రాయాలి ● డీఐఈవో నారాయణజగిత్యాల: ఈ నెల 5 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని డీఐఈవో నారాయణ అన్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. సాక్షి: ఎంతమంది అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారు? డీఐఈవో: మొత్తం 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 13 మంది అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల విధుల్లో ఉంటారు. అలాగే, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 4 సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను నియమించాం. సాక్షి: సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? డీఐఈవో: పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ఇవి హైదరాబాద్లోని హెడ్ ఆఫీసులో గల కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానంగా ఉంటాయి. సాక్షి: విద్యార్థులు సెంటర్కు ఏ సమయానికి చేరుకోవాలి? డీఐఈవో: ఉదయం 8.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. అరగంట ముందే సెంటర్కు చేరుకోవాల్సి ఉంటుంది. సమయం దాటితే లోపలికి అనుమతించరు. అందుకే విద్యార్థులు సకాలంలో చేరుకోవాలి. సాక్షి: ఎంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు? డీఐఈవో: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్లో 6,104 మంది విద్యార్థులు, ఒకేషనల్లో 969 మొత్తం 7,073, ద్వితీయ సంవత్సరం జనరల్లో 6,395 మంది విద్యారుథలు, ఒకేషనల్లో 982 మొత్తం 7,377 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సాక్షి: నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉంటుందా? డీఐఈవో: నిమిషం ఆలస్యం నిబంధనపై ఇప్పటికై తే ఎలాంటి ఆదేశాలు రాలేదు. కానీ, తప్పకుండా ఉంటుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అన్ని రూట్లలో బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. సాక్షి: ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డీఐఈవో: ఈ నెల 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో మొత్తం 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. బెంచీలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నాం. సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు? డీఐఈవో: విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు. భయపడొద్దు. పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రం ఇవ్వగానే ముందు క్షుణ్ణంగా చదవాలి. సమాధానం రాసేటప్పుడు ప్రశ్న నంబర్ తప్పనిసరిగా వేయాలి. హ్యాండ్రైటింగ్ గజిబిజి లేకుండా నీట్గా ఉంటే అధిక మార్కులు సాధించవచ్చు. -
అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం చర్యలు
మెట్పల్లిరూరల్(కోరుట్ల): అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జిల్లా సంక్షేమశాఖ అధికారి నరేశ్ అన్నారు. మెట్పల్లి మండలం పాటిమీది తండాలో శుక్రవారం జరిగిన అంగన్వాడీ టీచర్ల సెక్టార్ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. పోషన్ అభియాణ్ ట్రాకర్ అమలుపై ఆరా తీశారు. యాప్లో పొందుపర్చాల్సిన అంశాలు, ఈకేవైసీ విషయంలో ఎందుకు తాత్సారం జరుగుతుందని టీచర్లను అడిగి తెలుసుకున్నారు. దీంతో సాంకేతికంగా సమస్యలు తలెత్తుతున్నాయని టీచర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింతా మెరుగ్గా నిర్వహించాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ షెమీమ్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
మందుల కొరతకు చెక్
జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు కోరుట్లలో ఏరియా ఆస్పత్రి, ఆయా మండలాల్లో సీహెచ్సీలు, పీహెచ్సీలు, సబ్సెంటర్లు, యూపీహెచ్సీలు ఉండగా ఇటీవలే పల్లె దవాఖానాలు ఏర్పాటయ్యాయి. అలాగే మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఆస్పత్రుల్లో మందుల కొరత ఉండటంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. వైద్యులు పరీక్షలు చేసి చికిత్స చేస్తున్నప్పటికీ మందుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో బాధితులు బయట కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో మెడికల్ షాపుల నిర్వాహకులు గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. 108 రకాల మందులు ఉండాల్సిందే.. ● ఇటీవల ఏర్పడిన కమిటీ జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించింది. జనరల్తో పాటు అన్ని ఆస్పత్రుల్లో కచ్చితంగా రోగులకు అవసరమయ్యే 108 రకాల మందులు అందుబాటులో ఉండాల్సిందేనని వైద్యులు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు సైతం తీసుకుంటున్నారు. ● ఏటా ప్రభుత్వం మందుల కోసం రూ.కోట్లు కేటాయిస్తున్నా చాలా చోట్ల లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. ఆస్పత్రుల్లో మందులు లేకుంటే వెంటనే జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్స్కు ఇండెంట్ పెట్టాలి. ● కానీ, వైద్యుల నిర్లక్ష్యమో, సిబ్బంది పట్టింపులేనితనమో మందుల సరఫరాలో కొంత జాప్యం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కమిటీ ఏర్పాటు కావడంతో ఇక నుంచి మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ● మందులు సక్రమంగా అందడం లేదని బాధితులు ప్రజావాణిలో సైతం ఫిర్యాదు చేసిన ఘటనలున్నాయి. తనిఖీలతో పాటు మందుల సరఫరా ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను నిత్యం తనిఖీ చేయడంతో పాటు, వాటిలో మందులు ఉన్నాయా లేవా అని గుర్తించనున్నారు. ఒకవేళ అవసరం మేరకు మందులు లేకుంటే సంబంధిత వైద్యులతో వెంటనే ఇండెంట్ పెట్టించి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రైవేటులో దోపిడీ.. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో మందులు ఇవ్వకపోవడంతో ప్రైవేటు మెడికల్ షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు జనరిక్ మందులు అంటగడుతూ అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రూ.2 ధర ఉన్న గోలిని రూ.30కి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ మెడికల్ షాపులపై అధికారులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల గోలీలు ఉండాల్సిందే ఇటీవల సమావేశంలో నిర్ణయం పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ‘గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ గ్రామానికి చెందిన రమేశ్కు ఇటీవల బీపీ పెరగడంతో పాటు జ్వరం వచ్చింది. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి రావడంతో వైద్యులు పరీక్షలు చేసి మందులు రాశారు. కానీ, అక్కడ పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో లేవు. దీంతో బాధితుడు బయట డబ్బులకు కొన్నాడు.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో మందులు లేకపోవడంతో బాధితులు ప్రైవేట్గా కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మందుల సరఫరాపై నిఘా పెట్టింది. అన్ని రకాల మందులు ఆస్పత్రిలో ఉండాలని ఆదేశాలు రావడంతో జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో డీఎంహెచ్వోతో పాటు ఇద్దరు వైద్యులు ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు మందుల కొరత ఉంటే వెంటనే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటారు’.జిల్లాలో.. జనరల్ ఆస్పత్రి 1ఏరియా ఆస్పత్రి 1సీహెచ్సీలు 3పీహెచ్సీలు 17యూపీహెచ్సీలు 5బస్తీ దవాఖానాలు 5సబ్సెంటర్లు 151పల్లె దవాఖానాలు 71ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉండాల్సిందే. ఆయా ఆస్పత్రుల్లో మందులు ఉన్నాయా లేవా వైద్యులు సరిచూసుకుని మా దృష్టికి తీసుకువస్తే సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రతీ రోగికి మందులు అందాలి. ఎలాంటి జాప్యం జరిగినా చర్యలు తీసుకుంటాం. – ప్రమోద్కుమార్, డీఎంహెచ్వో -
యూరియా కోసం రైతుల పాట్లు
కోరుట్లరూరల్: మండలంలోని పైడిమడుగు పీఏసీఎస్లో రైతులు యూరి యా కోసం పాట్లు పడుతున్నారు. గురువారం పీఎసీఎస్ గోదాంకు యూరి యా చేరుకోగా రైతులు పరుగులు తీశారు. కొందరు క్యూలైన్లో ఉండగా.. చాలామంది తమ చెప్పులు, ఇటుకలు, రాళ్లను లైన్లో పెట్టారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని పడిగాపులు కాశారు. ఒక్కో ఆధార్కార్డుపై ఒక్కటే బస్తా ఇవ్వడంతో యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. డిమాండ్కు తగినట్లు యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. కళాశాలకు అఫిలియేషన్ తీసుకొస్తా..● అగ్రికల్చర్ విద్యార్థులకు ఎమ్మెల్యే సంజయ్ భరోసా కోరుట్ల: కోరుట్లలోని బీఎస్సీ అగ్రికల్చర్ మహిళా కళాశాలకు అఫిలియేషన్ తీసుకవచ్చే బాధ్యత తాను తీసుకుంటానని స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద గల రెసిడెన్షియల్ కళాశాలను గురువారం సందర్శించారు. విద్యార్థినుల కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు అవసరమైన ఏర్పాట్లు కల్పించేందుకు ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. కళాశాలలో ఎలాంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తేవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట కళాశాల సిబ్బంది, పలువురు నాయకులు ఉన్నారు. -
‘ఇన్స్పైర్’ చేస్తున్నారు
సైన్స్.. జీవితంలో ఒకభాగం.. పొద్దున నిద్రలేచినప్పటి నుంచి వేసే ప్రతీ అడుగులో.. చేసే ప్రతి పనిలో సైన్స్ దాగి ఉంటుంది. సైన్స్ అంటేనే అద్భుతం.. సంచలనాత్మక ఆవిష్కరణలకు నిలయం. మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో స్కూళ్లలో చదివే పిల్లల నుంచి శాస్త్రవేత్తల వరకు నిత్యం ఏదో ఒక అంశంలో ఆవిష్కరణలపై కసరత్తు చేస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది బాల మేథావులు పుట్టుకొస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైన్స్ఫేర్, ఇన్స్పైర్ మనక్ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి చాలా మంది రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. 28 ఫిబ్రవరి 1928న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సీవీ.రామన్.. రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అతని ఆవిష్కరణకు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నేడు సైన్స్డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు బాలమేథావుల ఆవిష్కరణలపై ప్రత్యేక కథనం. -
ఓటెత్తిన చైతన్యం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్శాతం పెరిగింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారం, అభ్యర్థులు చేపట్టిన ఓటింగ్ నమోదు పోలింగ్శాతం పెరుగుదలకు దోహదం చేసింది. గురువారం నాలుగు పాత జిల్లా(కొత్త 15 జిల్లాలు)లు, 42నియోజకవర్గాల్లోని 773 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 3,55,159 ఓట్లు ఉండగా.. 70.42శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 91.90 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల్లో 11.39శాతం, టీచర్లలో 8.36 శాతం పోలింగ్ మెరుగైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో నిలిచిన 15మంది భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్ బాక్సులు కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్రూముల్లో భద్రపరచగా.. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాలపై ఆన్లైన్ సర్వేలు జోరందుకున్నాయి. ప్రతికూలతతో తగ్గిన ఓటింగ్.. వాస్తవానికి ఈసారి పోలింగ్ ఇంకా పెరగాల్సి ఉన్నా.. పలు ప్రతికూలతల వల్ల అది సాధ్యం కాలేదు. టీచర్లకు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవు పేరిట రోజు మొత్తం సెలవు ఇచ్చింది. కానీ, విద్యాశాఖ, ప్రైవేటు యాజమాన్యాలు కాలడ్డం పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు సగంరోజు, ప్రైవేటు వారికి గంట మాత్రమే అనుమతించారు. వాస్తవానికి టీచర్లు గ్రాడ్యుయేట్, టీచర్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటంది. కానీ, సమయాభావం, సెలవు దొరక్కపోవడంతో వారిలో అధికశాతం ఒక్క ఓటుకే పరిమితమయ్యారు. దీనికితోడు ముందు రోజు రాత్రి శివరాత్రి జాగారం కావడం పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్, తదితర నగరాలకు వలసవెళ్లిన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇక్కడ ఓటు ఉన్నా.. సెలవు దొరక్క, చార్జీల భారం వల్ల రాలేకపోయారు. ఓటేసిన కలెక్టర్.. 3వ తేదీన లెక్కింపు కరీంనగర్లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమె తన గ్రాడ్యుయేట్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపడుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. కొత్త 15 జిల్లాల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఆన్లైన్లో ఎగ్జిట్పోల్ కోసం అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఫోన్లలో ఐవీఆర్ పద్ధతిలో, నేరుగా, సోషల్మీడియా లేదా ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించడం మొదలు పెట్టారు. గ్రాడ్యుయేట్ స్థానంలో పోలింగ్ ఇలా.. ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్శాతం 2019 1,95,581 59.03శాతం 2025 3,55,159 70.42శాతంటీచర్ స్థానంలో ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్శాతం 2019 23,160 83.54 శాతం 2025 27,088 91.90 శాతం రాయికల్లో ఓటేసేందుకు వచ్చిన మహిళలుజగిత్యాల:జిల్లాలో అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సారంగాపూర్ మండలంలో కొన్ని పోలింగ్ బూత్లలో లైటింగ్ లేక ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నంబర్లు లేకపోవడం.. చెప్పేందుకు ఎవరూ లేకపోవడంతో బూత్నంబర్, సీరియల్ నంబర్ల కోసం వెతక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సెల్ఫోన్లో చూసుకుందామన్నా లోనికి అనుమతించకపోవడంతో మహిళ పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు కూడా ఏ బూత్ ఎక్కడో చెప్పలేకపోయారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లాకేంద్రంలోని పురాణిపేటలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండువాలు వేసుకుని వస్తున్నారని ఆరోపణలు చేసుకున్నారు. ఎస్సై కిరణ్ సర్దిచెప్పి వారిని పంపించేశారు. ఓటేసిన ప్రముఖులు జగిత్యాల/జగిత్యాలటౌన్:జిల్లా కేంద్రంలోని పురాణిపేట హైస్కూల్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో మొదటిసారి కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ఓల్డ్ హైస్కూల్ కేంద్రంలో ఓటేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్ పురాణిపేట హైస్కూల్లో ఓటేశారు. మెట్పల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే సంజయ్ మెట్పల్లి: పట్టణంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల పరిషత్లో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ పట్టభద్రుల ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరిగిన చైతన్యం 2019తో పోలిస్తే మెరుగుపడిన పోలింగ్ 11.39 శాతం పెరిగిన పట్టభద్రులు, 8.36శాతం పెరిగిన టీచర్లు మూడో తేదీన లెక్కింపు, ఏర్పాట్లు ముమ్మరం విజయావకాశాలపై మొదలైన ఆన్లైన్ సర్వేలు -
కనులపండువగా శివపార్వతుల రథోత్సవం
రాయికల్: రాయికల్ పట్టణంలోని చెన్నకేశవనాథ ఆలయంలో గురువారం శివపార్వతుల రథోత్సవం కనులపండువగా నిర్వహించారు. అర్చకులు రమేశ్శర్మ, సతీశ్శర్మ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై శోభాయాత్ర చేపట్టారు. వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మచ్చ శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శి మంతెన మహేందర్, సంయుక్త కార్యదర్శి సంకోజి అశోక్, ప్రచార కార్యదర్శి నిరంజన్గౌడ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
పొదుపు అలవర్చుకోవాలి
జగిత్యాలరూరల్: ప్రతిఒక్కరూ పొదుపు అలవాటు చేసుకోవాలని జిల్లా లీడ్బ్యాంక్ మేనేజర్ రామ్కుమార్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా గురువారం జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్లో ఆర్బీఐ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆదాయ వ్యయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నేటి పొదుపు రేపటి భవిష్యత్తుకు పునాది అన్నారు. ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ కోట మధుసూదన్, ఏపీఎం గంగాధర్, సీసీలు, వీవోఏలు, మహిళ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సొసైటీల్లో వ్యవసాయ అధికారి తనిఖీలుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని పలు సొసైటీలు, ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలపై జిల్లా వ్యవసాయ అధికారి రాంచందర్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీలకు వచ్చిన యూరియా, సరఫరా రికార్డులు పరిశీలించారు. డీసీఎంఎస్ వెల్దుర్తిలో 450 బస్తాల యూరియా పంపిణీ సాఫీగా జరిగిందని, పీఏసీఎస్ కల్లెడలో 450 బస్తాల యూరియా నిల్వ ఉందని తెలిపారు. యూరియా అవసరాల దృష్ట్యా జిల్లాకు గురువారం 310 టన్నుల యూరియా వచ్చిందన్నారు. శుక్రవారం కూడా జిల్లాకు 540 టన్నుల యూరియా రానుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కుటీర పరిశ్రమలతో ఉపాధి● ఎంజీఐఆర్ఐ ప్రతినిధుల వెల్లడి ● జగన్నాథపూర్లో పర్యటనరాయికల్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు కుటీర పరిశ్రమలతో ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగవచ్చని ఎంజీఐఆర్ఐ ప్రతినిధులు తెలిపారు. గురువారం రాయికల్ మండలం జగన్నాథపూర్లోని మురళీధర గోదాములో గ్రామీణ రసాయన పరిశ్రమలు, ఖాదీవస్త్ర విభాగం, గ్రామీణ ఊర్జా మౌలిక సదుపాయాలు, గ్రామీణ హస్తకళ ఇంజినీరింగ్ వంటి అంశాలపై నిరుద్యోగులకు అవగాహన కల్పించారు. వీటి ద్వారా ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు చెన్నమనేని పద్మ, ప్రతినిధులు ప్రశాంత్, సందీప్, జోషి, జయకిశోర్, మహేశ్, మధుకర్, మాజీ సర్పంచులు తురగ రాజిరెడ్డి, కోల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
షూతో విత్తన సీడింగ్
సప్తగిరికాలనీ(కరీంనగర్)/గంగాధర(చొప్పదండి): పొలంలో విత్తనాలు విత్తడం అంటే అన్నదాతలకు ఎంతో శ్రమతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విత్తడం ఆర్థికభారంతో కూడుకుంది. దీంతో రైతులకు ఇరువిధాలుగా ఇబ్బందులు ఎదురవుతోందని గ్రహించి, తన మేథస్సుతో సీడ్ విత్తే షూ తయారు చేసింది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి జెడ్పీస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఎం.రితిక సైన్స్ ఉపాధ్యాయుడు జగదీశ్వర్రెడ్డి సహకారంతో రైతుల కోసం సీడ్ విత్తే షూ తయారు చేసింది. 2023–24 సంవత్సరానికి గానూ మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ మనక్లో ప్రదర్శించి, జాతీయస్థాయి ఇన్స్పైర్ మనక్కు ఎంపికై ంది. ‘విత్తన షూ వేసుకుని అడుగు పెట్టినపుడు ఒత్తిడి మెషిన్ లివర్పై పడుతుంది. లివర్ షూ విత్తనాల చాంబర్ నుంచి విత్తన విడుదలకు స్థలాన్ని ఇస్తుంది. ఇది నాజిల్తో జత చేయబడుతుంది. నాజిల్ మట్టిలోకి డ్రిల్ చేస్తుంది. స్ప్రింగ్ల శక్తితో విత్తనాన్ని వదులుతుంది. మరో అటాచ్మెంట్ రబ్బరు మట్టి డిస్టర్బర్ విత్తనాన్ని కప్పడానికి రంధ్రం వైపుల నుంచి మట్టిని వదులుతుంది. మొక్కజొన్న, సోయాబిన్, ఆవాలు, పప్పులు, వేరుశనగ పంటలు విత్తడానికి ఇది అనుకూలం. చిన్న, సన్నకారు రైతులకు ఇది సహాయకారిగా ఉంటుంది’ అని రితిక వివరించింది. ●– వివరాలు 8లోu -
మా సమస్యలు తీర్చాలి
మాకు టాయ్లెట్స్ లేవు. కాలేజీలో దోమలు, పాములు, ఎలుకలు తిరుగుతున్నయ్. ఫ్యాక్టల్టీ లేరు. ఒకటి, రెండుసార్లు సిలిండర్లు లేక మేమే కట్టెలు తెచ్చి, వంటకు సాయం చేశాం. బోరు నీళ్లు రాకుంటే మేమే తెచ్చుకుంటున్నం. మా సమస్యలు తీర్చాలి. – మేఘన, విద్యార్థిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా అగ్రికల్చర్ విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీని సందర్శించి, పూర్తిస్థాయిలో వారి సమస్యలు తెలుసుకొని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. ఈ కళాశాలకు అఫిలియేషన్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా. – డాక్టర్ సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల -
పోలింగ్కు వేళాయె
● పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం ● నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 773 పోలింగ్ కేంద్రాలు ● ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ● 12రకాల గుర్తింపు కార్డులతో ఓటేసేందుకు అనుమతి ● వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు– 8లోu ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆర్వో పమేలాసత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్స్ కోసం 499, టీచర్స్ కోసం 274, ఉమ్మడిగా 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, ఓటరు కార్డుతో సహా 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని తెలిపారు. పట్టభద్రుల బరిలో 56 మంది, ఉపాధ్యాయ పోటీలో 15 మంది ఉన్నారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
గుర్తింపు రాలే.. బాధలు తీరలే
కోరుట్ల: ఏడాది క్రితం జగిత్యాల జిల్లాకు ఉమెన్స్ అగ్రికల్చర్ కళాశాల మంజూరైంది. ఎంసెట్ ద్వారా సుమారు 50 మంది విద్యార్థినులు ప్రవేశం పొందారు. జిల్లా కేంద్రంలో సొంత భవనం లేక ఏడాదిపాటు జగిత్యాల సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలతో చదివారు. అక్కడ వసతులు సరిపోకపోవడంతో వారిని కోరుట్లలోని పురాతన ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో పదేళ్ల క్రితం నిర్మించిన భవనంలోకి తరలించారు. ఇక్కడా వసతులు సరిగా లేవు. ప్రస్తుతం ఈ విద్యార్థిను బీఎస్సీ అగ్రికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఈ కళాశాలకు హైదరాబాద్లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్(అనుంబంధ గుర్తింపు) రాకపోవడం మరో సమస్యగా మారింది. ఫలితంగా విద్యార్థినులు మహాశివరాత్రి పండుగపూట బుధవారం రోడెక్కి, బోరున విలపించాల్సిన దుస్థితి నెలకొంది. దోమలు.. ఎలుకలు.. పాములు ప్రస్తుతం కోరుట్లలో విద్యార్థినుల వసతి కోసం ఏర్పాటు చేసిన భవనం చుట్టూ శిథిలావస్థలో ఉన్న ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనాలున్నాయి. పెద్ద పెద్ద మర్రిచెట్లు, ఎక్కడపడితే అక్కడ పేరుకుపోయిన చెత్త, విరిగిపోయిన చెట్ల కొమ్మలు, దోమలు, పాములు, గదుల్లో ఎలుకల సంచారంతో విద్యార్థినులు భయపడుతున్నారు. గతంలో ఒకటి, రెండుసార్లు ఎలుకలు కరిచాయి. కళాశాల ఆవరణలో పాములు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. డైనింగ్ హాల్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కుళ్లిన ఆహార పదార్ధాల వాసనతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. టాయ్లెట్లలో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. వీటినే అందరూ వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాచ్మెన్ లేకపోవడంతో రక్షణ కరువైంది. ఫ్యాకల్టీ ఐదుగురే.. స్థానికంగానే మార్కులు? 2023–24 సంవత్సరంలో అగ్రికల్చర్ కళాశాల ప్రారంభమైంది. రెండేళ్లు గడుస్తున్నా యూనివర్సిటీ నుంచి అనుబంధ గుర్తింపు రాలేదు. మొదటి సంవత్సరం పూర్తయిన విద్యార్థుల సమాధాన పత్రాలను స్థానికంగానే దిద్ది, మార్కులు వేస్తున్నట్లు సమాచారం. మొత్తం ఏడుగురు ఫ్యాకల్టీ అవసరం ఉండగా ఐదుగురే పని చేస్తున్నారు. ల్యాబ్ సౌకర్యం లేకపోవడంతో పొలాస వ్యవసాయ పరిశోధన క్షేత్రానికి వెళ్లొస్తున్నారు. లైబ్రరీలో బుక్స్ లేవు. అనుబంధ గుర్తింపు సకాలంలో రాకపోతే తమ పరిస్థితి ఏంటని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. వసతులు కల్పించి, గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ లేదు కాలేజీ ఆవరణలోకి పాములు గ్యాస్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యిపై వంట ఆవేదనతో రోడ్డెక్కిన కోరుట్ల అగ్రికల్చర్ కళాశాల విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్న పలువురు -
71 కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు
● పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశాం ● కలెక్టర్ సత్యప్రసాద్జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులను బస్సుల్లో పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎస్పీ అశోక్కుమార్తో కలిసి పరిశీలించారు. పోలింగ్కు జిల్లాలో 71(51 పట్టభద్రులు, 20 టీచర్స్) కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్లు 3,50,280 మంది ఉండగా, 27,088 మంది టీచర్ ఓటర్లు ఉన్నారన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓటర్లు ఓటరు గుర్తింపు కార్డుతోపాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి, ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. 144 సెక్షన్ అమలు.. పోలింగ్ విధులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. బుధవారం జగిత్యాల మినీస్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించి, మాట్లాడారు. అధికారులకు ఎన్నికల ప్రక్రియపై శిక్షణ ఇచ్చామని, పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రశాంతమైన వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతోపాటు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్ ఉన్నారు. ఓటుహక్కు వినియోగించుకోండి రాయికల్: పట్టభద్రులు, టీచర్లు గురువారం జరిగే పోలింగ్లో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. బుధవారం రాయికల్ పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ ఖయ్యూం, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన కోరుట్ల: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పోలింగ్ బూత్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి పాటించాలని సూచించారు. ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ కిషన్, ఎస్సై శ్రీకాంత్ తదితరులున్నారు. -
ఎమ్మెల్సీ పోలింగ్కు పటిష్ట బందోబస్తు
జగిత్యాల క్రైం: జిల్లాలో గురువారం జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపా రు. 233 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది డ్యూటీలో ఉంటారని, విధులు సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు. జగిత్యాలలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఎన్నికల విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సిబ్బంది తమకు కేటా యించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి వెళ్లవద్దన్నారు. ఓటర్లతో మర్యాదపూర్వకంగా ఉండాలని చెప్పారు. పోలింగ్ సమయంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైనా అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఓటర్లను ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిళ్లు పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లనివ్వకూడదని పేర్కొన్నారు. ఓటు వేస్తూ సెల్ఫీలు దిగడం నిషేధమన్నారు. జిల్లాలోని 71 పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్తో ఎన్నికల సామగ్రి తరలించామన్నారు. 12 రూట్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, ఇద్దరు డీఎస్పీలతో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఆరుగురు సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ టీ మ్స్, ఎస్సైలతో 18 పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏఎస్పీ భీంరావు, డీఎస్పీ రఘుచందర్, సీఐలు ఆరిఫ్ అలీఖాన్, వేణుగోపాల్, రవి, రామ్ నరసింహారెడ్డి, సురేశ్, రవి, ఆర్ఐ వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.● ఎస్పీ అశోక్కుమార్ -
‘ఏజెంట్లు, సిబ్బందికి ఫోన్ అనుమతి లేదు’
మల్లాపూర్(కోరుట్ల): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం సజావుగా నిర్వహించాలని మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం మల్లాపూర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. రూట్ అధికారులు, పోలింగ్ సిబ్బందితో మాట్లాడి, సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బందికి అన్ని వసతులు కల్పించాలని స్థానిక అధికారులకు సూచించారు. కేంద్రాల్లో ఏజెంట్లకు, సిబ్బందికి ఫోన్ అనుమతి లేదన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల వివరాలు ఓటర్లకు తెలిసేలా పోస్టర్లు అతికించాలని చెప్పా రు. ఆయన వెంట తహసీల్దార్ వీర్సింగ్, ఇతర అధికారులున్నారు. -
చిదానంద రూపం శివోహం
ధర్మపురి/సారంగాపూర్(జగిత్యాల)/వెల్గ టూర్(ధర్మపురి): దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయానికి బుధవారం మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సూర్యోదయానికి ముందు నుంచే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి–అహల్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జడ్జి ఎస్.నారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సాలియానాయక్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ హాజరయ్యారు. కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ స్వామివారికి అభిషేకం చేశారు. -
మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు
జగిత్యాలరూరల్/సారంగాపూర్/మల్లాపూర్: మహాశివరాత్రికి జిల్లాలోని శివాలయాలు ముస్తాబయ్యాయి. జగిత్యాల మండలం పొలాసలోని పౌలస్తేశ్వరస్వామి, సహస్ర లింగాల, పొరండ్లలోని రామలింగేశ్వరస్వామి, జాబితాపూర్లోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. కోరిన కొర్కెలు తీర్చే కనకసోమేశ్వరుడు మల్లాపూర్ మండలకేంద్రంలోని సోమేశ్వర కొండపై కొలువైన శ్రీకనకసోమేశ్వరుడు కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచారు. ప్రకృతి అందాల మధ్య కొండపై వెలిసిన స్వామివారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం ఉత్సవాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. దుబ్బరాజన్నకు పటిష్ట పోలీస్ బందోబస్తు సారంగాపూర్ మండలంలోని దుబ్బరాజన్న ఆలయంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎ స్పీ అశోక్ కుమార్ తెలిపారు. దుబ్బరాజన్న స్వామి వారిని దర్శించుకున్న ఆయన పోలీసులు, ఆలయ, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్వామివారిని దర్శించుకున్న బీఆర్ఎస్ ప్రముఖులు దుబ్బరాజన్న స్వామివారిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బా పురెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఆశీర్వాదం అందించి, స్వామివారి ప్రసాదాలు బహూకరించారు. శానిటేషన్పై నిర్లక్ష్యం వద్దు దుబ్బరాజన్న జాతరలో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఆర్డీవో, డీపీవో మదన్మోహన్ అన్నారు. దుబ్బరాజన్న జాతర స్థలం, ఆలయ పరిసరాలు, కోనేరును పరిశీలించారు. వివిధ పంచాయతీల నుంచి 100 మంది సిబ్బందిని శానిటేషన్ కోసం నియమించామన్నారు. 14 మంది పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో, ఎంపీవో మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి
జగిత్యాలటౌన్: ఎమ్మెల్సీగా నరేందర్రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడం గొప్ప నిర్ణయమన్నారు. ఐటీఐ కళాశాల అప్గ్రేడ్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. తనను ఆదరించినట్లుగానే నరేందర్రెడ్డికి అండగా నిలవాలని కోరారు. నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, ధర రమేశ్, మన్సూర్, నేహాల్, జున్ను రాజేందర్ పాల్గొన్నారు. -
వాటర్బెల్తో ప్రయోజనం
ఉదయం 9 గంటలకు పాఠశాలకు వెళ్తాం. పీరియడ్ తర్వాత పీరియడ్ జరుగుతుంది. మధ్యలో వాటర్ బెల్ ఉంటే మాకు ప్రయోజనంగా ఉంటుంది. పీరియడ్ తర్వాత మేం మరో పీరియడ్లోకి వెళ్లిపోతాం. వాటర్ బెల్ అవకాశం కల్పించాలి. – సాయిసవర్ణిక, విద్యార్థి నీరు తాగడం ముఖ్యం ఎండకాలంలో విద్యార్థులకు నీరు ఎంతో ముఖ్యం. కోవిడ్ సమయంలో వాటర్బెల్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ దానిని పునరుద్ధరించాలి. మంచినీరు తాగడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. – బైరం హరికిరణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడుఅమలు తప్పనిసరి చేయాలి విద్యార్థులు గంటకోసారి నీరు తాగేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఎండకాలంలో తగినన్ని నీరు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. కేవలం ఇంటర్వెల్ సమయంలోనే తాగుతున్నారు. – మచ్చ శంకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు రెండు లీటర్లు తీసుకోవాలి విద్యార్థులు ప్రతిరోజూ రెండు లీటర్ల నీరు తీసుకోవాలి. అప్పుడే శరీ రంలోని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. నీరు తాగడం.. మూత్ర విసర్జన చేయడం ముఖ్య మని విద్యార్థుల్లో అవగాహన పెంచాలి. రెండు గంటలకోసారి 250 మి.లీ నీరు తాగడం మంచిది. – ఆకుతోట శ్రీనివాస్రెడ్డి, ఫిజీషియన్ -
తాగునీటి ఎద్దడి రానీయొద్దు
కోరుట్లరూరల్: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని పైడిమడుగు గ్రామాన్ని మంగళవారం సందర్శించిన ఆమె గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులపై ఆరా తీశారు. చేతిపంపును పరిశీలించి తాగునీటి సమస్య తెలుసుకున్నారు. పారిశుద్యంపై అలసత్వం తగదని, ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో జివాకర్, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ రామకృష్ణ, కార్యదర్శి శేఖర్ పాల్గొన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలతో నైపుణ్యంరాయికల్: వైజ్ఞానిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యం పెంపొందుతుందని జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలను సందర్శించారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల ఆసక్తి కనబర్చడం ద్వారా శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. హెచ్ఎం అభయ్రాజ్, ఎంపీవో సుష్మ, ఎంఈవో శ్రీపతి రాఘవులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ బొప్పారపు మానస, ఉపాధ్యాయులు బెజ్జంకి హరికృష్ణ, కడకుంట్ల వినోద్కుమార్ పాల్గొన్నారు. -
పొలాలు ఎండిపోతున్నా పట్టదా..?
● 15 నెలలైనా ప్రాజెక్టుకు షట్టర్లు బిగించరా.. ● రైతులు మొత్తుకుంటున్నా కనికరం లేని ప్రభుత్వం ● రోళ్లవాగును పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులుసారంగాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలవుతున్నా రోళ్లవాగు ప్రాజెక్టుకు కనీసం షట్టర్లు బిగించలేదని, ఫలితంగా ప్రాజెక్టు కింద పొలాలు ఎండిపోతున్నాయని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2017లో కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, కేవలం అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందని, గేట్లు బిగిస్తే బీర్పూర్, ధర్మపురి మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 15 నెలలుగా కాలయాపన చేయడం ద్వారా పంటలు ఎండిపోతున్నాయన్నారు. దీనిపై కలెక్టర్ సమీక్షించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరిలోకి టీఎంసీ నీటిని విడుదల చేయడం ద్వారా ఎత్తిపోతల పథకం కింద పొలాలకు నీరు అందుతోందని, రానున్న రోజుల్లో నీరు అందకుంటే 50వేల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. సన్నరకాలకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు కేవలం మూడెకరాలలోపున్న కొంతమందికే రైతుభరోసా జమ అయ్యిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్ధిష్టమైన ఆలోచన లేదని, దోపిడీ కోసమే సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. విద్యాసాగర్రావు మాట్లాడుతు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని, విమానాలు మాత్రం నడపడం తెలుసుని ఎద్దేవా చేసారు. వారి వెంట జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
బడిలో మోగని వాటర్ బెల్
● డీహైడ్రేషన్ బారిన విద్యార్థులు ● నీరు తాగక అనారోగ్యంపాలు ● నీటిగంట తప్పనిసరి అంటున్న తల్లిదండ్రులుజగిత్యాల: అసలే పదో తరగతి పరీక్షలు.. మార్కులే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. కానీ.. విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు సరిపడా నీరు తాగకపోవడంతో తలనొప్పి, కడుపునొప్పి, నీరసం బారినపడుతున్నారు. ఇలాంటి ప్రాథమిక లక్షణాలను గుర్తించిన ప్రభుత్వం 2018లో పాఠశాలల్లో ప్రతి గంటకోసారి వాటర్ బెల్ మోగించాలని నిర్ణయించింది. కానీ.. కోవిడ్ తర్వాత దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా వారికి నీరు బాగా తాగించాలని వైద్యులు చెబుతుంటారు. నీరు సరైన మోతాదులో లేకపోతే విద్యార్థులు అనారోగ్యానికి గురై ఏకాగ్రత దెబ్బతిని చదువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది నిపుణులు, వైద్యులు శరీరానికి సరిపడా నీరు తాగడం ప్రధానమని పేర్కొంటున్నారు. అందని నీరు ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని 2018లో విద్యాశాఖ ప్రారంభించింది. కోవిడ్ తర్వాత మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. విద్యార్థులు బడి సమయంలో సుమారు 1.5 లీటర్ల నీరు తీసుకుంటే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. వయస్సును బట్టి 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులు ఉదయం ఇంటి నుంచి వాటర్బాటిల్ తీసుకెళ్తున్నా.. లంచ్ సమయంలో తప్ప మరెప్పుడూ తాగడం లేదు. దీంతో వారి శరీరానికి కావాల్సిన నీరు అందక ఇబ్బందికి గురవుతున్నారు. గతంలో ఫస్ట్బెల్, సెకెండ్ బెల్, ఇంటర్వెల్ ఇలా ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అది మర్చిపోయారు. ఇప్పటికై నా దీనిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎండకాలం మరింత తీవ్రం ప్రస్తుతం ఎండకాలం నీరు ఎంతో అవసరం. ఒకవేళ నీరు లేకపోతే శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్కు లోనవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కు వెళ్లే సమయంలో వాటర్బాటిల్ తీసుకుని ప్రతి గంటకు ఒకసారి తాగాల్సి ఉంటుంది. లేదా పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరమైన తాగునీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నీరు తగ్గితే వ్యాధుల పాలు ఎండకాలంలో శరీరంలోని అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేయాలంటే మోతాదులో నీ రు తీసుకోవా ల్సిన అవసరం ఉంటుంది. నీరు ఎక్కువగా తీసుకుంటే రక్తం పలచగా మారి రక్తప్రసరన సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ నీటి శాతం తగ్గితే మూత్రపిండాల్లో రాళ్లు, విద్యార్థుల్లో ముఖ్యంగా జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్, అసిడిటి, మలబద్ధకం, మూర్చ, కాలేయ, చర్మవ్యాధుల వంటి సమస్యలు వస్తాయి. జిల్లాలోని చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉంది. అయితే గంటకోసారి నీరు తాగితే మూత్రం వస్తుందన్న కారణంతోనూ విద్యార్థులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొన్ని పాఠశాలల్లో సరిపడా మూత్రశాలలు లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో నీరు సరిపడా తాగకపోవడంతో వివిధ వ్యాధులకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు వారిలో భయాన్ని పోగొట్టి ప్రతి గంటకోసారి నీరు తాగేలా చూడాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. భయంతో తాగని విద్యార్థులు -
ముగిసిన ఎమ్మెల్సీ ప్రచార పర్వం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పర్వం ముగిసింది. నిబంధనల మేరకు పోలింగ్కు 48 గంటల ముందు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి సైలెంట్ మోడ్ అమలులోకి వచ్చింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు, సంఘాలు ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ పక్షాన సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు, బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఎస్పీ తరఫున బీసీ నేతలు నిర్వహించిన సభల సక్సెస్తో ఆయా క్యాడర్ జోష్లో ఉంది. ఉమ్మడి కరీంనగర్ కీలకం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకంగా మారింది. ఉమ్మడి జిల్లా ఓటర్లు ఎటు మొగ్గుతే వాళ్లు విజయం సాధించే అవకాశాలున్నాయి. పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 3 లక్షల 55 వేల 159 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి లక్షా 60 వేల 260 ఓట్లున్నాయి. అంటే ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు సగం ఓట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల తీర్పుపైనే అభ్యర్థుల భవిత ఆధారపడి ఉంది. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 27,088 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8,135 ఓట్లున్నాయి. ఇక్కడ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపోటములను నిర్ణయించనుంది. గెలుపుపై ధీమా పట్టభద్రులకు సంబంధించి మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అంజిరెడ్డి, నరేందర్రెడ్డి పార్టీల బలంపై, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ బీసీ వాదంపై ఆశలు పెట్టుకున్నారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 15 మంది పోటీలో ఉండగా, బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, యూటీఎఫ్, యూఎస్పీసీ మద్దతుతో వై.అశోక్కుమార్, ఎస్టీయూ, సీపీఎస్ల నుంచి పోటీలో ఉన్న కూర రఘోత్తంరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ప్రచారసభలతో జోష్ గతంలో లేని విధంగా ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఏకంగా సీఎం రేవంత్రెడ్డి ప్రచార సభలు నిర్వహించి తమకు ఓటెందుకు వేయాలో వివరించే ప్రయత్నం చేశారు. సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య గెలుపు బాధ్యతలను పూర్తిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భుజానికెత్తుకొన్నారు. కామారెడ్డి, ఆదిలాబా ద్ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్ ప్రచారపర్వంలో పాల్గొన్నారు. బీసీ వాదంతో బరిలోకి దిగిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా బీసీ జేఏసీ రాష్ట్ర నేతలు, బీసీ సంఘాల నేతలు, ఓయూ జేఏసీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రచారం నిర్వహించారు. ఆయా సభల విజయవంతంతో క్యాడర్లో జోష్ నెలకొనడంతో పాటు, గెలుపుపై ధీమా పెరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పోటాపోటీ సభలు పార్టీల క్యాడర్లో జోష్ గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. -
ఎములాడ దారిలో..
● వైభవంగా రాజన్న జాతర షురూ ● తరలివస్తున్న భక్తులు ● నేడు మహాశివరాత్రి వేడుకలు ● రూ.2.39 కోట్లతో ప్రత్యేక ఏర్పాట్లు ● గుడి చెరువులో శివార్చన కార్యక్రమాలు ప్రారంభం ● పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం, విప్ ఆది, టీటీడీ అర్చకులు వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎములాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు తరలివస్తున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు రాజన్నను దర్శించుకుని, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. జాగరణ కోసం అంతా సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసి కేవలం లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.2.39 కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పించారు. గుడి చెరువులో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,500 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో జాగరణ చేసే భక్తులకు గుడి చెరువు వేదిక కానుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి పేయిడ్ పాస్లను అధికారులు జారీ చేశారు. జాతరకు ఈసారి 4 లక్షల మంది వరకు వివిధ ప్రాంతల నుంచి భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు సైతం స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. నేటి ఉత్సవాల్లో.. వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు ఉదయం 4 నుంచి 4.25 వరకు సుప్రభాత సేవ సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు ప్రత్యేక దర్శనం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామివారి కల్యాణ మంటపంలో మహాలింగార్చన రాత్రి 11.35 నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ కాలమందు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం -
పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి
రాయికల్: పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుంగా అన్ని రకాల వసతులు కల్పించాలని డీఈవో రాము తెలిపారు. మంగళవారం రాయికల్ పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాల ఏర్పాటు, విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా బెంచీలు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆయన వెంట ఉపాధ్యాయులు గంగాధర్, రాజశేఖర్, సీఎం శర్మ, పద్మ, తరంగిణి, వేణు, రజిత, ప్రశాంత్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు. పింఛన్ ఇప్పించండి సారుజగిత్యాల: పింఛన్ ఇప్పించాలంటూ ఓ తెలంగాణ ఉద్యమకారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సాధనకు ఉద్యమం చేశానని, ప్రత్యేక రాష్ట్రం ప్రకటించేంతవరకూ గుండుతోనే ఉన్నానని, నిరాహార దీక్షలు చేసినా.. కవితలతో ఉద్యమానికి అండదండలు అందించినా ప్రభుత్వం కనీసం పింఛన్ కూడా మంజూరు చేయడంలేదని అంటున్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన తునికి పెద్ద గంగారాం తెలంగాణ ఉద్యమంలో వినూత్న రీతిలో ఉద్యమం చేపట్టారు. తెలంగాణ వచ్చేవరకూ గుండుతోనే ఉంటానని ప్రతినబూనారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పింఛన్ మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తామని చెప్పిందని, ఇప్పటివరకు స్పందన లేదని, కనీసం పింఛన్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
● ఎస్పీ అశోక్కుమార్ ● కేంద్రాల పరిశీలనజగిత్యాలక్రైం/మల్లాపూర్: ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లావ్యాప్తంగా 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ యాక్ట్ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయన్నారు. ఎవరైనా నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐలు నిరంజన్రెడ్డి, ఎస్సై రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ పరిశీలించారు. -
విద్యార్థి ఆత్మహత్య
కోనరావుపేట: కళాశాల నుంచి వస్తూ అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్లో రైలు కిందపడి మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల బాలమల్లు– మంజుల దంపతుల కుమారుడు రాకేశ్ (18)హైదరాబాద్లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వస్తూ సిరిసిల్ల బస్టాండ్లోని ధర్మారం గ్రామానికి వెళ్తున్న ఆటోలో బ్యాగు పెట్టాడు. తర్వాత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాకేశ్ హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్ నోట్ రాసి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. అమ్మ, నాన్న క్షమించండి. నాకు బతకాలని లేదు. నా చావుకు కారణం ఎవరు కాదు అని సూసైడ్ నోట్లో అంది. పోలీసులు ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
స్వగ్రామానికి చేరిన యువకుడు
జగిత్యాలక్రైం: మోసపూరిత విదేశీ నియామక సంస్థ చేతుల్లో మోసపోయిన కొడిమ్యాల మండలం చెప్యాలకు చెందిన వలస కార్మికుడు కడకుంట్ల శ్రీకాంత్ పలువురి సహాయంతో మంగళవారం స్వగ్రామం చేరాడు. శ్రీకాంత్ను 40 రోజల క్రితం జగిత్యాలకు చెందిన మ్యాన్పవర్ కన్సల్టెన్సీ ఎలక్ట్రిషీయన్ ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చి దుబాయ్ పంపించింది. అక్కడికి చేరిన అనంతరం లేబర్ ఉద్యోగంలో చేర్పించారు. ఆ పని చేయబోనని శ్రీకాంత్ అనడంతో పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకుని 7300 దిరమ్స్ (ఇండియా రూ.2లక్షలు) చెల్లించాలని కంపెనీ యాజమాన్యంతోపాటు, కేరళకు చెందిన ఓ ఏజెంట్ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు టీపీసీసీ ఎన్ఆర్ఐసెల్ కన్వీనర్ షేక్ చాంద్పాషాను ఆశ్రయించారు. ఆయన దుబాయ్లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. స్పందించిన ఎంబసీ వారు కంపెనీ యాజమాన్యాన్ని మందలించడంతో శ్రీకాంత్ను స్వగ్రామానికి పంపించేందుకు నిరాకరించారు. దీంతో ఇండియన్ ఎంబసీ దుబాయ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. లేబర్ కోర్టు విచారణ జరపగా శ్రీకాంత్ కోర్టులో నెగ్గాడు. దీంతో కంపెనీ యాజమాన్యం ఫిర్యాదును కొట్టివేసి అతని పాస్పోర్టును శ్రీకాంత్కు అప్పగించడంతో మంగళవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. -
ఈత చెట్లు దగ్ధం
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ శివారులో ఈత చెట్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన గౌడ కులస్తులు మూడేళ్ల క్రితం ఐదు ఎకరాల్లో సుమారు 6 వేల వరకు ఈత చెట్లు నాటారు. వాటిపై ఆధారపడి కొద్దిరోజుల నుంచి కల్లుగీస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈత చెట్లు దగ్ధమవుతున్నట్లు గౌడ కులస్తులకు సమాచారం రావడంతో వారంతా అక్కడికి వెళ్లారు. అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటన ప్రాంతానికి వెళ్లి మంటలు ఆర్పారు. అప్పటికే దాదాపు 500కుపైగా ఈత చెట్లు దగ్ధమైనట్లు గీత కార్మికులు తెలిపారు. ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా..?, కుట్రనా..? అనేది విచారణ చేపట్టాలని గీత కార్మికులు కోరుతున్నారు. -
ముగిసిన అంతర్రాష్ట్ర క్రీడలు
● క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్, ఉత్తర తెలంగాణ జట్టు ● విజేతలకు బహుమతులు ప్రదానంజగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న అంతర్రాష్ట్ర క్రీడా, సాంస్కృతిక పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీలకు వ్యవసాయ వర్సిటీ డీన్ ఆప్ అగ్రికల్చర్ డాక్టర్ కె. ఝాన్సీరాణి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో మానసికోల్లాసంతోపాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. వ్యవసాయ కళాశాల అ సోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ్ భట్ మా ట్లాడుతూ, రాష్ట్రస్థాయి వర్సిటీ క్రీడలకు పొలాస కళాశాల వేదిక కావడం అభినందనీయమన్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం డైరెక్టర్ శ్రీలత మా ట్లాడుతూ పోటీల్లో పాల్గొడడం వల్ల క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. వ్యవసాయ వర్సిటీ క్రీడా పరిశీలకులు డాక్టర్ సురేశ్, వర్సి టీ నాన్ టీచింగ్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, జయరాం, కళాశాల స్టూడెంట్ ఆఫైర్ కన్వీనర్ మహేశ్ రెడ్డి, క్రీడా ఇన్చార్జి రత్నాకర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నాన్ సిబ్బంది పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ షిప్ రాజేంద్రనగర్ జట్టు రాష్టస్థాయి క్రీడల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ను రాజేంద్రనగర్ జట్టు కై వసం చేసుకోగా, సాంస్కృతిక విభాగంలో ఓవరాల్ చాంపియన్ షి ప్ను ఉత్తర తెలంగాణ జట్టు కై వసం చేసుకుంది. క్రికెట్లో దక్షిణ తెలంగాణ జట్టు, వాలీబాల్లో మధ్య తెలంగాణ జట్టు, బాల్ బ్యాడ్మింటన్లో ఉత్తర తెలంగాణ జట్టు, షటిల్ బ్యాడ్మింటన్లో రాజేంద్రనగర్ జట్టు, టేబుల్ టెన్నీస్లో రాజేంద్రనగర్ జట్టు, చెస్లో మధ్య తెలంగాణ జట్టు, కార్యమ్లో మధ్య తెలంగాణ జట్టు విజయం సాధించాయి. వివిధ జోన్లకు చెందిన క్రీడాకారులు బహుమతులు అందుకున్నారు. -
భక్తులకు సరిపడా ఏర్పాట్లు
వెల్గటూర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రైవేటు కంపెనీ నిర్మించిన శాశ్వత షెడ్, టాయిలెట్స్ను ప్రారంభించారు. బందోబస్తు చేపట్టాలని సీఐ రాంనర్సింహారెడ్డిని ఆదేశించారు. గోదావరిలో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ -
పంటలను ముంచేసిన వరదకాల్వ బ్యాక్ వాటర్
మెట్పల్లిరూరల్: ఎస్సారెస్పీ వరదకాలువ బ్యాక్ వాటర్ మెట్పల్లి మండలం ఆత్మనగర్ పెద్దతండా శివారులోని పొలాలను ముంచేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరదకాల్వకు రెండు రోజుల క్రితం అధికారులు 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటితో కాలువ నిండుగా ప్రవహిస్తోంది. జగ్గాసాగర్ శివారులోని మాన్పూరు వాగు వద్ద వరదకాల్వ.. ఆత్మకూర్ పెద్దవాగు కలుస్తాయి. వరదకాలువ నుంచి వస్తున్న నీరు పెద్దవాగుపైనుంచి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరదకాల్వ బ్యాక్ వాటర్ పెద్దవాగు గుండా నల్ల ఒర్రె ద్వారా ఆత్మనగర్ పెద్దతండా శివారులోని పంట పొలాల్లోకి చేరుతున్నాయి. ఈ కారణంగా సుమారు 20 ఎకరాల వరకు వరి పంట నీట మునిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాన్పూర్ వాగు వద్ద గేట్లు ఎత్తి పెద్దవాగు దిగువ ప్రాంతానికి నీటిని వదిలితే పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రై తులు అంటున్నారు. అధికారులు స్పందించి తమ కు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. అనారోగ్యంతో మాజీ డీఈవో మృతి ధర్మపురి: ఉమ్మడి జిల్లా మాజీ డీఈవో ఇందారపు నర్సింగరావు (95) సోమవారం అర్ధరాత్రి మృతిచెందారు. ధర్మపురికి చెందిన ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాల, ఉన్నత పాఠశాల పురోగతికి, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్దనున్న ఓల్డ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. నర్సింగరావు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. అడవి పందుల దాడిలో తీవ్రగాయాలు చందుర్తి: అడవిపందుల దాడిలో వేటగాళ్లకు తీవ్రగాయాలయిన ఘటన చందుర్తి శివారులోని బోడగుట్ట ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జోగాపూర్ గ్రామానికి చెందిన సంచార జీవనం సాగించేవారితో అడవి పందుల వేటకు వెళ్లారు. అప్పటికే వారికి పంది చిక్కగా, మరో దానికోసం వేటాడుతుండగా దాడిచేసింది. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108లో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం లింగంపేట శివారులోని ఓ గుట్టకు విద్యుత్ షాక్ పెట్టి మూడు పందులను హతమార్చి మాంసాన్ని విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై అటవీశాఖ అధికారి వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
సాంబశివుని సన్నధిలో గీతాహవన యజ్ఞం
బుగ్గారం: మండలకేంద్రంలో కొలువైన శ్రీసాంబశివుని నాగేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గీతాహవన యజ్ఞాన్ని కనులపండువగా నిర్వహించారు. విశ్వశాంతి, పర్యావరణ పరిరక్షణ, లోకకల్యాణార్థం ఆదిలాబాద్ జిల్లా రోటిగూడెంకు చెందిన శ్రీహరిమౌనస్వామిజీ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ మసర్తి రాజిరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సామూహిక కుంకుమపూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఆలయ అర్చకులు సాత్పడి రంగయ్య, వేద పండితులు శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి, రామస్వామి, కంచర్ల శివశంకరాచార్యులు, ఆగస్త్య మహారాజ్, ప్రమోద్శర్మ, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, శ్రీమద్భగద్గీత సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. -
యువత ఉపాధి వైపు అడుగులు వేయాలి
మల్యాల: ప్రభుత్వ పథకాలను సద్వినియో గం చేసుకుంటూ యువత స్వయం ఉపాధివైపు అడుగులు వేయాలని డీఆర్డీవో పీడీ రఘువరన్ అన్నారు. మండలంలోని మద్దుట్లలో ఉపాధి హామీ నిధులు ఏర్పాటు చేసిన పశువుల పాకను మంగళవారం పరిశీలించారు. పోతారంలో ఉపాధి హామీ కింద చేపట్టిన కందకం పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. మండలకేంద్రంలో ఉన్నతి పథ కం కింద పుట్టగొడుగుల పెంపకంపై ఆరురోజులు శిక్షణ పొందిన 70 మంది యువతకు సర్టిఫికెట్లు అందించారు. అడిషనల్ డీఆర్డీవో మదన్మోహన్, ఎంపీడీఓ స్వాతి, ఏపీఓ శ్రీనివాస్, ఈసీ మనోజ్, టెక్నికల్ అసిస్టెంట్ జలపతి రెడ్డి, లావణ్య, శిక్షకులు బాలస్వామి, విజయభారతి పాల్గొన్నారు. -
భక్తులకు సరిపడా ఏర్పాట్లు
వెల్గటూర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కోటిలింగాల కోటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మంగళవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రైవేటు కంపెనీ నిర్మించిన శాశ్వత షెడ్, టాయిలెట్స్ను ప్రారంభించారు. బందోబస్తు చేపట్టాలని సీఐ రాంనర్సింహారెడ్డిని ఆదేశించారు. గోదావరిలో గజ ఈతగాళ్లను నియమించామన్నారు. ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోళ్ల తిరుపతి, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ -
విద్యార్థి ఆత్మహత్య
కోనరావుపేట: కళాశాల నుంచి వస్తూ అదృశ్యమైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్లో రైలు కిందపడి మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల బాలమల్లు– మంజుల దంపతుల కుమారుడు రాకేశ్ (18)హైదరాబాద్లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వస్తూ సిరిసిల్ల బస్టాండ్లోని ధర్మారం గ్రామానికి వెళ్తున్న ఆటోలో బ్యాగు పెట్టాడు. తర్వాత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాకేశ్ హైదరాబాద్లోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో సూసైడ్ నోట్ రాసి రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం అందింది. అమ్మ, నాన్న క్షమించండి. నాకు బతకాలని లేదు. నా చావుకు కారణం ఎవరు కాదు అని సూసైడ్ నోట్లో అంది. పోలీసులు ఫోన్లో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. రాకేశ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
ఉత్సాహంగా వ్యవసాయ వర్సిటీ క్రీడలు
జగిత్యాల అగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాలలో అంతర్రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ నాన్ టీచింగ్ సిబ్బంది క్రీడలు రెండో రోజు సోమవారం ఉత్సాహంగా సాగాయి. షార్ట్పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో పోటీల్లో పలు జట్లు పోటీ పడ్డాయి. షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, చెస్, త్రోబాల్, టెన్నికాయిట్, రన్నింగ్ పోటీల్లో కొన్ని జట్లు సెమీఫైనల్ చేరాయి. వాలీబాల్ విన్నర్గా సెంట్రల్ తెలంగాణ జోన్, బాల్ బ్యాడ్మింటన్ విన్నర్గా రాజేంద్రనగర్ జోన్, టేబుల్ టెన్నిస్ విన్నర్గా రాజేంద్రనగర్ జోన్, చెస్ విన్నర్గా సెంట్రల్ తెలంగాణ జోన్, క్యారమ్స్ విన్నర్గా సెంట్రల్ తెలంగాణ జోన్ జట్లు నిలిచాయి. అలాగే, సాయంత్రం జరిగిన సాంస్కృతిక పోటీల్లో ఆయా జోన్లకు సంబంధించిన వారు తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ భారతీ నారాయణ్ భట్, పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత పర్యవేక్షించారు. సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు.. సిబ్బందిలో ఉత్సాహం నింపడంతోపాటు వారిలో దాగివు న్న నైపుణ్యాన్ని బయటకు తెచ్చేందుకే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. ఒక జోన్కు చెందిన సిబ్బంది మరో జోన్కు వెళ్లడం వల్ల వారిలో స్నేహభావం పెంపొందుతుంది. – డాక్టర్ సురేశ్, వ్యవసాయ వర్సిటీ క్రీడల డైరెక్టర్, హైదరాబాద్ -
ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు
జగిత్యాలక్రైం: గొల్లపల్లి మండలంలోని జగదేవ్పేటకు చెందిన నూకల భూలక్ష్మి వెల్గటూర్ ఎస్సై పై సోమవారం ఎస్పీ అశోక్కుమార్కు ఫిర్యా దు చేసింది. జగదేవ్పేట శివారులోని తన భూమి లో పంట సాగు చేసుకోగా అదే గ్రామానికి చెందిన కొందరు రాత్రివేళలో వెళ్లి, ధ్వంసం చేశారని తెలిపి ంది. ఈ విషయమై తాను ఫిర్యాదు చేసినా ఎస్సై కేసు నమోదు చేయకుండా పంట ధ్వంసం చేసిన వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. వ్యభిచార గృహంపై పోలీసుల దాడిజగిత్యాల క్రైం: వ్యభిచారం నిర్వహిస్తున్న జగిత్యాల భవానీనగర్లోని ఓ ఇంటిపై పట్టణ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. వారి వివరాల ప్రకారం.. జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపి, వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి, వ్యభిచారం చేయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. అక్కడున్న మహిళలు, విటులను అదుపులోకి తీసుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంవేములవాడ అర్బన్: వే ములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ మూ లవాగు బ్రిడ్జి కింద సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, లైట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్ ధరించాడని పేర్కొన్నారు. గుర్తు పట్టినవారు సీఐ వీరప్రసాద్ 87126 56413, ఎస్సై రమేశ్ 87125 80413 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. టీచర్పై పోక్సో కేసు.. అరెస్టుకోనరావుపేట(వేములవాడ): ఓ టీచర్పై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల క్రితం పోలీస్ అక్క కార్యక్రమంలో భాగంగా ఓ మహిళా కానిస్టేబుల్ మహిళా చట్టాలు, షీ టీమ్ విధులపై అవగాహన కల్పించారు. ఆ సమయంలో కొందరు విద్యార్థినులు కనపర్తి బ్రహ్మం అనే టీచర్ కొన్ని రోజులుగా క్లాస్రూమ్లో తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం సోమవారం అరెస్ట చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. యువకుడి దుర్మరణంచొప్పదండి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై అనూష కథనం ప్రకారం.. చొప్పదండి మండలంలోని రాగంపేటకు చెందిన ఒడ్నాల రమేశ్(28) చొప్పదండిలోని ఓ ఉడిపి హోటల్లో పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకొని హోటల్ ఎదుట నిలబడగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని తలకు బలమైన గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బాబాయి ఇరుకుల్ల శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
శివరాత్రికి ఆలయాలు ముస్తాబు
● రేపు మహాశివరాత్రి ధర్మపురి: మహా శివరాత్రికి శివాలయాలను ముస్తాబు చేశారు. ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి, అక్కపెల్లి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంతోపాటు మండలంలోని నేరెల్ల సాంబశివ దేవాలయాలను రంగులు, విద్యుత్దీపాలతో అలంకరించారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి రాత్రివరకు పంచోపనిషత్తులతో అభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహిస్తారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవం ఉంటుంది. అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్ సీపతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతోపాటు సాయంత్రం శివ పార్వతుల కల్యాణ వేడుకలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనాల కోసం ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అక్కపెల్లి రాజరాజేశ్వర ఆలయానికి ఉచిత వాహన సౌకర్యం కల్పించారు. -
గల్ఫ్లో పాస్పోర్ట్ ఫీజు తగ్గించాలి
జగిత్యాలరూరల్: కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో పాస్పోర్ట్ సేవలను ప్రైవేటీకరించి, 4 రెట్ల ఫీజు పెంచడంపై ప్రవాసీ కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉ న్నారని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి అన్నారు. పెంచిన ఫీజు వెంటనే తగ్గించాలని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగ మ ంత్రి ఎస్.జైశంకర్లకు మెయిల్, ఎక్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. విదేశీ మారక ద్ర వ్యాన్ని పొందే దేశాల్లో మన దేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు. మనకంటే చాలా చిన్న దేశం బాంగ్లాదేశ్ తమ ప్రవాసులకు ప్రోత్సాహకాలు ఇస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే తక్కువ వేతనాలు, బలవంతపు శ్రమ, పెరుగుతు న్న జీవన వ్యయంతో ఇబ్బంది పడుతున్న కార్మికులకు పాస్పోర్ట్ సేవల ఫీజు పెంపు మరింత అన్యా యం చేస్తుందని తెలిపారు. సౌదీ అరేబియాలో 200 –300 రియాళ్లు (గతంలో 50–75), యూఏఈలో 200–350 దిర్హామ్లు (గతంలో 50–100), ఒమన్లో 25–35 రియాళ్లు (గతంలో 5–10), బహ్రెయిన్లో 20–30 దినార్లు (గతంలో 5–10), ఖతార్లో 150–200 రియాళ్లు, కువైట్లో 23.750 దినార్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఫీజు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ మంద భీమ్రెడ్డి -
దర్శిద్దాం.. తరిద్దాం
● నేటి నుంచి వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు ● మూడు రోజులు ముక్కోటి పండుగ ● 4 లక్షల మంది వస్తారని అంచనా ● రూ.2.39కోట్లతో ఏర్పాట్లు ● 1500 మందితో బందోబస్తు వేములవాడ: హరహర మహాదేవ.. శంభో శంకర.. జై మహాదేవ్.. నామస్మరణతో వేములవాడ పురవీధులు మారుమోగనున్నాయి. పేదల దేవుడిగా పేరొందిన దక్షిణకాశీ వేములవాడలో నేటి నుంచి మూడు రోజులు మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచన. రూ.2.39కోట్లతో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల కోసం శివార్చన వేదికను సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు స్వాగతం పలికేందుకు తోరణాలు, సీసీ కెమెరాల మధ్య భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులు ప్రత్యేకం భక్తుల కోరిన కోర్కెలు నెరవేరితే రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటారు. పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు ఆలయానికి నిజకోడెలు సమర్పిస్తుంటారు. కల్యాణకట్టలో రూ.10 టికెట్ తీసుకుని తలనీలాలు సమర్పించుకుంటుంటారు. బద్దిపోచమ్మకు బోనం మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ. ప్రసాదం రాజన్నను దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో, భీమేశ్వరాలయం వద్ద ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోరా ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు. జాతర ప్రత్యేక పూజలు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈనెల 25 నుంచి నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మదర్శనంతోపాటు రూ.300 వీఐపీ దర్శనం, రూ.50 స్పెషల్ దర్శనాలు, రూ.100 కోడెమొక్కులు, రూ.200 స్పెషల్ కోడెమొక్కులు, రూ.100 శీఘ్రదర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 25వ దేదీ రాత్రి 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పి స్తారు. రాత్రి 9.30 గంటలకు నిషిపూజ అనంత రం సర్వదర్శనం కొనసాగుతోంది. 26న ఉద యం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వా మి వారికి పట్టువస్త్రాలు అందజేస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు, 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు. ఉచిత భోజనం..టిఫిన్..తాగునీరు మూడురోజులపాటు స్థానిక ట్రస్టుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్సులో ఉచితంగా భోజ నం, పార్వతీపురంలో స్వామి వారి అన్నదాన సత్రంలో ఉచిత భోజనం, టిఫిన్ వసతి ఉంది. భక్తుల దాహార్తిని తీర్చేందుకు 6 లక్షల నీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆరు రాజన్న జలప్రసాదాల సెంటర్లను ఏర్పాటు చేశా రు. ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను అందజేయనున్నారు. వేములవాడలో వంద వసతి గదులను అందుబాటులో ఉంచారు. 3.90 లక్షల చదరపు మీటర్లలో చలువపందిళ్లు వేశారు. స్నానానికి 157 షవర్లు ఏర్పాటు చేశారు. ధర్మగుండంలోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నారు. గత ఈతగాళ్లను అందుబాటులో పెట్టారు. భక్తుల కోసం 4 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు. అతిథుల రాక.. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్లు మహాశివరాత్రి వేడుకలకు రానున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు రానున్నట్లు సమాచారం.ఇలా చేరుకోవాలి రోడ్డు మార్గంలోనే వేములవాడకు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 32 కిలోమీటర్లు దూరం రోడ్డుమార్గంలో చేరుకోవాలి. సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి ప్రతీ ముప్పై నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. స్థానికంగా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడి చెరువు వరకు 14 ఉచిత బస్సులు నడిపిస్తున్నారు.దర్శనీయ స్థలాలు వేములవాడ పరిసరాల్లో అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాలస్వామి, నాంపల్లి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి.అత్యవసర సేవల ఫోన్ నంబర్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి : 87126 56412 ఈవో వినోద్రెడ్డి : 94910 00743 వైద్యాధికారి రజిత : 70975 57119 ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ : 99592 25926 టౌన్ సీఐ వీరప్రసాద్ : 87126 56413అత్యవసర సేవలు ఆలయం ఎదుట పోలీస్ కంట్రోల్రూమ్ను ఏర్పా టు చేశారు. నిరంతరం పోలీసు గస్తీ బృందాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందుబాటులో ఉంచారు. ఆలయం ముందున్న అమ్మవారి కాంప్లెక్స్లో తాత్కాలిక వైద్యశాల, పార్కింగ్ స్థలాలు, వసతి గదుల వద్ద నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్, 13 మంది నోడల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా నియమించారు. వీటితోపాటుగా మొబైల్ అంబులెన్స్, ఫైర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 1600 మంది పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. -
మహాకుంభమేళాకు వెళ్లి.. అస్వస్థతకు గురై
మల్లాపూర్(కోరుట్ల): ఉత్తరప్రదేశ్లోని ప్రయోగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లిన ఓ యువకుడు అస్వస్థతకు గురై, మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాంరాజుపల్లికి చెందిన బద్దం శంకర్–ఇందిర దంపతులకు ఒక కుమారుడు చంద్రశేఖర్రెడ్డి(29), కూతురు ఉన్నారు. చంద్రశేఖర్రెడ్డి, మరో 11 మంది ఈ నెల 17న మహాకుంభమేళాకు వెళ్లారు. అక్కడి నుంచి 20న కాశీ చేరుకున్నాక అతనికి బీపీ ఎక్కువై, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంట ఉన్నవారు అక్కడే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు వెంటనే అక్కడికి వెళ్లి, చంద్రశేఖర్రెడ్డిని మెరుగైన వైద్యం కోసం ఆదివారం హైదరాబాద్కు తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని అర్ధరాత్రి స్వగ్రామం తీసుకువచ్చారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారిని కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు పరామర్శించి, ఓదార్చారు. హైదరాబాద్ తీసుకువస్తుండగా యువకుడి మృతి కొత్తదాంరాజుపల్లిలో విషాదం -
‘ఇందిరమ్మ’ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం వద్దు
మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం కానీయొద్దని జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించిన ఆయన రికార్డులు పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇంటి పనులను పరిశీలించారు. మండలానికో మోడల్ గ్రామాన్ని ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యేవరకూ విడతల వారీగా రూ.5లక్షలు నేరుగా ఖాతాల్లోకి జమవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఎండీపీవో శశికుమార్రెడ్డి, మండల పరిషత్ సూపరింటెండెంట్ రజని, సినియర్ అసిస్టెంట్ మహేశ్, ఈజీఎస్ ఎపీవో సతీష్, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్కు ఉరితాడు
జగిత్యాలటౌన్: ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్కు ఉరి తాడు కాబోతున్నాయని, బీసీల గెలుపును ఎవరూ ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం జగి త్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ నోట్లతో దొంగ ఓట్లు కొనాలనుకునే వారిని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలను గెలిపిస్తే రానున్న ఎన్నికల్లో సీఎం కుర్చీ బీసీలదేనని పేర్కొన్నారు. బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇస్తే కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకయ్యేదన్నారు. ఆ పార్టీ అభ్యర్థి నరేందర్రెడ్డి ఏరోజు కాంగ్రెస్ కోసం పనిచేశారో చెప్పాలన్నారు. బీసీల ఓట్లతో గద్దెనెక్కి మో సం చేసిన సీఎం రేవంత్రెడ్డికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ 19 మాత్రమే ఇచ్చిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు ఇస్తామని చెప్పి, 3కే పరి మితం చేసిందని మండిపడ్డారు. మంత్రి వర్గంలో నూ బీసీలకు ద్రోహం చేశారన్నారు. బీసీ కులగణన అంటూనే ఎమ్మెల్సీ టికెట్లు రెడ్లకు ఇచ్చారని ఆగ్రహ ం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు చిత్తశుద్ధి ఉంటే బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని డి మాండ్ చేశారు. రాష్ట్ర నాయకుడు విక్రం గౌడ్, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండభేరి నరేశ్, నాయకులు రాజేందర్, మల్లేశంగౌడ్, నాగరాజు తదితరులున్నారు. బీసీల గెలుపును ఎవరూ ఆపలేరు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
హుజూరాబాద్/జగిత్యాల క్రైం: అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. రెండిళ్లలో చొరబడి భారీగా నగదు, ఆభరణాలు చోరీ చేశారు. కత్తులతో దాడి చేసి, బాధిత కుటుంబసభ్యులను గాయపరిచిన ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణంలోని ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఇంటికి ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు దొంగలు వచ్చారు. ఇంటి ఆవరణలోని వాటర్ మోటార్ను ఆన్ చేశారు. ఆఫ్ చేసేందుకు రాఘవరెడ్డి భార్య వినోద బయటకు రావడంతో దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులపై దాడికి పాల్పడ్డారు. వారి కూతురు మానస గొంతుపై కత్తి పెట్టి, బెదిరించారు. తప్పించుకునే క్రమంలో రాఘవరెడ్డి, వినోదలకు గాయాలయ్యాయి. దొంగలు చంపుతామని బెదిరించడంతో బీరువా తాళాలు ఇచ్చారు. దీంతో రూ.7 లక్షలు, 80 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. వెళ్తూ గడియ పెట్టారని, మొదటి అంతస్తులో ఉన్న పెద్ద కుమారుడు నాగరాజుకు ఫోన్ చేయడంతో వచ్చి, గడియ తీశాడని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీపీ శ్రీనివాస్జీ, టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. జగిత్యాల పద్మనగర్లో.. జగిత్యాల పట్టణంలోని పద్మనగర్ వీధిలో ఆదివారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. గుండేటి రాజశేఖర్ తన ఇంటికి తాళం వేసి, రెండో అంతస్తులో నిద్రించాడు. దొంగలు తాళం పగులగొట్టి, 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం బీరువా పగులగొట్టి ఉండటంతో రాజశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు. పట్టణ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండిళ్లలో రూ.7.15 లక్షలు, 88 తులాల ఆభరణాలు చోరీ దంపతులకు గాయాలు -
బ్యాటరీల చోరీ కేసులో నలుగురికి జైలు
కథలాపూర్: ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ చేసిన కేసులో నలుగురికి 6 నెలలు జైలుశిక్ష విధిస్తూ కోరుట్ల న్యాయమూర్తి పావని సోమవారం తీర్పునిచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సురేశ్, గంగప్రసాద్, ఎస్కే.ఆసిఫ్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన ఎస్కే.ఖదీర్లు గతేడాది జూలై 9న కథలాపూర్ మండలంలోని ఇప్పపెల్లిలో 3 ట్రాక్టర్ల బ్యాటరీలు దొంగిలించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఆ నలుగురికీ శిక్ష ఖరారు చేశారు. విద్యార్థినిని వేధించినందుకు 20 రోజులు..జగిత్యాలజోన్: పాఠశాల విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వెంటపడి వేధించిన కేసులో నిందితుడికి 20 రోజుల జైలు, రూ.26 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినిని వెంటపడుతూ వేధించిన ధర్మపురికి చెందిన ఒడ్డెటి చంద్రతేజపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రతేజకు 20 రోజుల జైలు శిక్షతోపాటు రూ.26 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అన్న హత్య కేసులో చెల్లెళ్ల అరెస్టుజగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన జంగిలి శ్రీనివాస్(52)ను హత్య చేసిన అతని చెల్లెళ్లను సోమవారం అరెస్టు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపా ల్ తెలిపారు. ఆస్తి తగాదా విషయంలో శ్రీనివా స్పై అతని చెల్లెళ్లు భారతపు వరలక్ష్మి, ఒడ్నాల శారద కర్రలతో దాడి చేయగా మృతిచెందాడన్నారు. ఈ కేసులో మృతుడి చెల్లెళ్లను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయి కేసులో ఇద్దరికి ఐదేళ్లు..సిరిసిల్ల కల్చరల్: గంజాయి రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సోమవారం తీర్పునిచ్చారు. ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వడిచెర్ల జాన్ప్రతాప్ రెడ్డి, నాంపల్లికి చెందిన గుమ్మడిపల్లి చంద్రశేఖర్ ఐదేళ్ల క్రితం వేములవాడ పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వారని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి సీఐ వెంకటేశ్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ కేసు వాదించారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికీ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. నేరస్తులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు. -
సదరెం మరింత సులభతరం
జగిత్యాల: సదరెం సే వలు మరింత సులభతరం కానున్నాయని, కేంద్రం 21 రకాల కేటగిరీలను చేర్చిందని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ తెలిపారు. మీసేవ కేంద్రాల్లో వచ్చేనెల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, స్వయంగా దివ్యాంగులే చేసుకునేలా యూనిక్ డిసబులిటీ ఐడీ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో అప్లై చేసుకోవాలని కోరారు. స్మార్ట్గా సదరెం సర్టిఫికెట్ వస్తుందని, ఇంతకుపూర్వం ఏ4 సైజ్లో జారీ అయ్యేవని, ఇకపై కార్డు సైజులో వస్తాయని పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించే సదరెం శిబిరానికి హాజరు కావాలని సూచించారు. నేటి నుంచి మద్యం షాపుల బంద్జగిత్యాలక్రైం: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 25న సాయంత్రం నాలుగు గంటల నుంచి 27 సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. మార్కెట్యార్డుకు మూడు రోజులు సెలవులుజగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్యార్డుకు మూడు రోజుల సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. శివరాత్రి సందర్భంగా ఈనెల 26 నుంచి 28 వరకు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. మా ర్చి ఒకటో తేదీ నుంచి యార్డులో యథావిధిగా కొనుగోళ్లు సాగుతాయని వివరించారు. రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలుధర్మపురి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని దమ్మన్నపేట, రాజారం గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో రాజారం గ్రామానికి చెందిన జెల్ల సత్తయ్య, దూడ రాజయ్యకు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిజగిత్యాల క్రైం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జగిత్యాల రూరల్ ఎస్సై సదాకర్ వివరాల ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం వంజరిపల్లికి చెందిన అత్తినె గంగాధర్(50) సోమవారం పని నిమిత్తం బైక్పై జగిత్యాల వచ్చాడు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా నర్సింగాపూర్ శివారులో ధరూర్ నుంచి మోతె వైపు వెళ్తున్న బోలెరో అతివేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగాధర్కు బలమైన గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
నేటినుంచి దుబ్బరాజన్న బ్రహ్మోత్సవాలు
సారంగాపూర్: జిల్లాలోని దుబ్బరాజన్న ఆలయం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతోంది. ఆలయంలో సోమవారం నుంచి బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ బ్రహ్మోత్సవాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించిడంతో ఇటీవలే కో–ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేసిన విషయం తెల్సిందే. తాగునీరు, టెంట్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పారిశుధ్యం కోసం 100 మందిని నియమించారు. వైద్యం, నిరంతర విద్యుత్తు సరఫరాతోపాటు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కంట్రోల్ రూం, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీలకు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ జగిత్యాల నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు నడపనుంది. స్వామివారి కల్యాణం, మహాశివరాత్రి, రథోత్సవం రోజున భక్తులు లక్షల సంఖ్యల్లో హాజరవుతారని ఈవో వడ్లూరి అనూష, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకయ్య తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాల్లో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాలు ఇలా 24న సాయంత్రం స్వస్తి పుణ్యాహవచనం, అంకురార్పణ, 25న రాత్రి స్వామివారి కల్యాణం, 26న మహాశివరాత్రి జాగరణ, రాత్రి 12 గంటలకు లింగోద్భవ, రుద్రాభిషేక నిషిపూజ, 27న పారణ, మధ్యాహ్నం అన్నపూజ, 28న ఉదయం స్వామివారి రథోత్సవం ఉంటుంది. ఐదు రోజులపాటు జరగనున్న ఉత్సవాలు సమన్వయంతో ముందుకు సాగుతున్న అధికారులు కలెక్టర్ ఆదేశాలతో భక్తులకు సరిపడా ఏర్పాట్లు 24న స్వస్తి పుణ్యాహవచనంతో అంకురార్పణ 25 స్వామివారి కల్యాణం.. 26న మహాశివరాత్రి.. 28న స్వామివారి రథోత్సవం -
అగ్నిమాపక కేంద్రానికి మోక్షమెప్పుడో..?
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని 32 గ్రామాల్లో అగ్నిప్రమాదాల నివారణ కోసం 2012లో దివంగత మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్రావు హయాంలో అగ్నిమాపకకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 2014లో కాంట్రాక్ట్ ముగియడంతో అగ్నిమాపక యంత్రం రాయికల్ నుంచి తరలిపోయింది. గతంలో అగ్నిమాపక భవనంతోపాటు, సిబ్బంది కోసం గదులను స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో నిర్మించారు. ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం తరలిపోవడంతో వైకుంఠదామం రథాన్ని ఉంచుతున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లినా కలగని మోక్షం అగ్నిమాపక కేంద్రాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లి సుమారు ఏడాది గడుస్తోంది. అయినా ఎలాంటి కదలిక లేదు. అగ్నిమాపక కేంద్రం ఉంటే రాయికల్, మల్లాపూర్, మేడిపల్లి మండలాల్లో అగ్నిప్రమాదాల నివారణకు దోహదపడుతుంది. ఇందుకు రూ.5 కోట్లు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ పలుమార్లు సీఎం, సంబంధిత శాఖ అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు. రాయికల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అగ్నిప్రమదాలు జరిగినా జిల్లా కేంద్రం నుంచి అగ్నిమాపక యంత్రం రావాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ లోపు భారీగా ఆస్తినష్టం వాటిల్లుతోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లినా కదలని ఫైల్ తరచూ అగ్నిప్రమాదాలతో ఆస్తినష్టం -
అక్రమాలపై విచారణ చేపట్టండి
మల్లాపూర్: మండలంలోని చిట్టాపూర్ సహకార సంఘంలో చోటుచేసుకున్న అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ బీసీ, ఎస్సీ, ఎస్టీ సన్నకారు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సంఘం ఎదుట నిరసన తెలిపారు. డీసీవో మనోజ్కుమార్కి ఫిర్యాదు చేశారు. సహకార సంఘంలో 2014 నుంచి 2025 వరకు జరిగిన సర్వసభ్య సమావేశాలు, రైతుల మహాజన సభల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆధారాలతో తేలినా అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆడిట్ అధికారులు రూ.1.26కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు నివేదించినా రికవరీ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్రమాలకు పాల్పడిన సంఘం అధికారులు, చైర్మన్లపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే జిల్లా సహకార కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
యూరియా కోసం ఆందోళన వద్దు
జగిత్యాలఅగ్రికల్చర్: యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయాధికారి రాంచందర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. యాసంగి సీజన్కు 38 వేల టన్నుల యూరియా అవసరం ఉండగా.. ఇప్పటి వరకు 36 వేల టన్నుల యూరియా తెప్పించామన్నారు. రైతుల నుంచి డిమాండ్ దృష్ట్యా రెండు రోజులుగా మంచిర్యాల నుంచి 500 టన్నులు, తిమ్మాపూర్ నుంచి 1000 టన్నులు, జనగామ నుంచి 500టన్నుల యూరియా తెప్పించి సొసైటీలకు సరఫరా చేశామని పేర్కొన్నారు. సోమవారం మరో 1300 టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు. కాంగ్రెస్తోనే తెలంగాణజగిత్యాలరూరల్: నీళ్లు, నిధులు, నియమాకాల నినాదంతో రాజకీయాలకు అతీతంగా ఉద్యమించామని, దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. కేసీఆర్ను ఉద్యమనాయకుడిగా భావించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ప్రజలు అవకాశం కల్పించారని, కానీ కేసీఆర్ మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారని పేర్కొన్నారు. మార్పులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం కల్పించారని, ఈ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 56వేల ఉద్యోగాలు కల్పించదన్నారు. త్వరలోనే గ్రూప్స్, డిపార్ట్మెంట్, అంగన్వాడీ, మెగా డీఎస్పీ నోటిఫికేషన్ రాబోతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు జున్ను రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందన్న, నాయకులు పెద్దన్న, వెంకన్న, యూత్ కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు. శ్రీకనకసోమేశ్వర స్వామికి శోభాయాత్రమల్లాపూర్: మహాశివరాత్రి, శ్రీకనకసోమేశ్వర స్వామి జాతర మహోత్సవాల్లో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలో ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి శోభాయాత్ర చేపట్టారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం మాట్లాడుతూ ఈనెల 28 వరకు స్వామివారి జాతర మహోత్సవాలు ఉంటా యని వివరించారు. -
‘ఎల్ఆర్ఎస్’కు మోక్షం
● 25 శాతం రాయితీ ప్రకటించిన ప్రభుత్వం ● ప్లాట్ల క్రయవిక్రయాలకు మంచి మార్గం ● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు ● వచ్చేనెల 31వరకు గడువుజగిత్యాల: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తులకు మోక్షం కలిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అనుమతిచ్చినప్పటికీ చాలామంది దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నా యి. తాజాగా అక్రమ లేఅవుట్లలో మిగిలిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ప్లాట్ల క్రయవిక్రయాలకు మంచి మార్గం ఏర్పడింది. ఈ మేరకు సర్కారు రాయితీ కూడా ప్రకటించింది. గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్కు చేసుకున్న దరఖాస్తులు మున్సిపాలిటీల్లో పేరుకుపోయాయి. రూ.వెయ్యి చెల్లించిన వందలా ది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో దరఖా స్తులు అలాగే వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకొచ్చాక ఎల్ఆర్ఎస్కు అనుమతి ఇవ్వడంతో కొంతమంది తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నారు. అయినా చాలావరకు దరఖాస్తులు అలాగే మిగిలిపోయాయి. ఈ క్రమంలో స్పందించిన ప్రభుత్వం వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) విధానానికి శ్రీకారం చుట్టింది. 25 శాతం రాయితీ ప్రకటించింది. వచ్చేనెల 31వరకు తగిన రుసుం చెల్లించి ప్లాట్ల ను క్రమబద్ధీకరించుకోవాలని సూచించారు. ఈ మే రకు అధికారులు కూడా ప్రజల్లో అవగాహన కల్పి స్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీ అవకాశాన్ని వినయోగించుకోవాలని కోరుతున్నారు. ఇది మంచి అవకాశం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇవ్వడంతోపా టు రాయితీ ప్రకటించడంతో ప్రజలకు ఇది మంచి అవకాశంగా మారనుంది. అనుమతి లేని ప్లాట్లను కొనుగోలు చేసుకున్నప్పుడు ఇళ్లు కట్టుకుందామంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతేకాక బ్యాంక్లో లోన్ పెట్టుకుందామన్నా ఎల్ఆర్ఎస్ ప్రధానం. ఎల్ఆర్ఎస్ ఉంటేనే రుణం మంజూరవుతుంది. దరఖాస్తు చేసుకున్న వారు ఎల్ఆర్ఎస్ చేసుకోవాలని బల్దియా అధికారులు కోరుతున్నారు. వచ్చిన దరఖాస్తులు 27,369.. పరిష్కారమైనవి 1714 జిల్లాలో ఎల్ఆర్ఎస్ కోసం 27,369 దరఖాస్తులు రాగా 1714 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఇంకా 25,655 దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇందులో 411 రిజెక్ట్ అయ్యాయి. ప్రజలు ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ సరైన పత్రాలు జతచేయనివి 22,519 దరఖాస్తులున్నాయి. వీటికి సంబంధించిన పత్రాలను కార్యాలయానికి వెళ్లి చూపిస్తే వాటిని కూడా అధికారులు అప్రూవ్ చేసే అవకాశం ఉంది. -
త్రిముఖ పోరు
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ ● పార్టీలే బలంగా అంజిరెడ్డి, నరేందర్రెడ్డి ● బీసీ నినాదంతో ప్రసన్న హరికృష్ణ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. పార్టీలే బలంగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్రెడ్డి, బీసీ నినాదంతో ప్రసన్న హరికృష్ణ బరిలో నిలిచారు. పోలింగ్కు మూడు రోజులు మాత్రమే గడువు మిగలడంతో ప్రచారం చివరి అంఖానికి చేరింది. చాలామంది పోటీలో ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యే పోటీ ఉంది. హోరాహోరీగా ప్రచారం గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భిన్నంగా ఈసారి హోరాహోరీగా సాగుతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల్లోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, గ్రాఫ్ పడిపోయిందని విపక్షాల ప్రచారం నేపథ్యంలో అధికార కాంగ్రెస్కు ఈ ఎన్నిక సవాల్గా మారింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ సొంత నియోజకవర్గం కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోనే ఉండడంతో ఆ ఫలితం పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక భవిష్యత్ తమదేనంటున్న బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా తమ బలాన్ని మరింత పెంచుకోవాలనే తలంపుతో ఉంది. బీ ఆర్ఎస్ పోటీలో లేనప్పటికీ.. బీజేపీ, కాంగ్రెస్ను ఓడించే అభ్యర్థికి అండగా నిలవాలని అంతర్గతంగా పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిస్తోంది. రెండు పార్టీలు ఓడిపోతే తమ ఎదుగుదలకు తి రు గు ఉండదనేది గులాబీ పార్టీ వ్యూహంలా ఉంది. పార్టీయే బలం కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నరేందర్రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి వారివారి పార్టీలనే నమ్ముకున్నారు. జాతీయవాదం బలంగా పెరుగుతుండడం.. ఇటీవలి ఢిల్లీ ఫలితాలతో బీజేపీకి వాతావరణం అనుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆలస్యంగా బరిలోకి వచ్చిన అంజిరెడ్డి కేవలం బీజేపీ బలంతో గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇక మెదక్ మినహా నియోజకవర్గవ్యాప్తంగా తన విద్యాసంస్థలు విస్తరించి ఉన్న నరేందర్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ బలంపై ఆధారపడ్డారు. ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగుల్లో ఉన్న సానుకూలత తనకు అనుకూలంగా మారుతుందనే భావనతో ఉన్నారు. బీసీ నినాదంతో ప్రసన్న హరికృష్ణ తన సొంత క్యాడర్ సహకారంతో కొన్ని నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రచారంలో దూసుకుపోతున్న ప్రసన్న హరికృష్ణ బీసీ నినాదాన్ని నమ్ముకున్నారు. తన ప్రత్యర్థులు ఇద్దరి సామాజికవర్గం ఒకటే కావడం.. తాను బీసీ కావడం కలిసొస్తుందనే అంచనాతో ఉన్నారు. పట్టభద్రులు అధికులు బలహీనవర్గాలకు చెందిన వారే కావడం, బీసీ నినాదం గ్రౌండ్ లెవెల్కు బలంగా వెళ్లడంతో విజయంపై ధీమాగా ఉన్నారు. పైగా పోటీలో లేని బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్ కూడా ప్రసన్న హరికృష్ణవైపు మొగ్గుచూపుతుండడం, కాంగ్రెస్, బీజేపీల్లోని అసమ్మతి వర్గాలు అంతర్గతంగా మద్దతునిస్తుండడం కూడా తనకు కలిసొచ్చే అంశంగా ఆయన భావిస్తున్నారు. మొదటి ప్రాధాన్యతకే ఫలితం తేలేనా..? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్న సందర్భంగా మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితంపై వచ్చేనా..? అనే చర్చసాగుతోంది. పోటీ త్రిముఖంగా మారడంతో ఎన్నికల్లో ఒక అభ్యర్థికి సగానికి పైగా ఓట్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా అయితే రెండో ప్రాధాన్యత ఓటు ఎక్కువగా పడే అభ్యర్థికి విజయం వరించే అవకాశం ఉంది. అందుకే ప్రధాన పార్టీలు కేవలం మొదటిప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలంటూ ప్రచారం చేస్తుండడం విశేషం. -
రైల్వే స్టేషన్లకు కొత్త సొబగులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే పనుల్లో భాగంగా ఈ మార్గంలోని రైల్వేస్టేషన్లు కొత్త సొబగులు సంతరించుకుంటున్నాయి. తాజాగా పూడూరు రైల్వేస్టేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఈ మార్గంలో కీలకమైన కొత్తపల్లి రైల్వేస్టేషన్ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. వచ్చేనెలలో ఈ స్టేషన్ను దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి పెద్దపల్లి–నిజామాబాద్ సెక్షన్లో అధికారులు తాజాగా పూడూరు క్రాసింగ్ రైల్వేస్టేషన్ను ఆధునీకరించి, అదనపు సౌకర్యాలు కల్పించి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాజీపేట–సికింద్రాబాద్ మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లను పెద్దపల్లి నుంచి నిజామాబాద్ మార్గంమీదుగా దారి మళ్లిస్తున్నారు. దీంతో క్రాసింగ్ స్టేషన్ల ఆవశ్యకత పెరిగింది. ఆధునిక వసతులతో పూడూరు, కరీంనగర్.. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే మార్గంలో పూడూరు నూతన క్రాసింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్టేషన్లో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ, బ్లాక్ ప్యానెల్, 12 మెయిన్ సిగ్నల్స్, 2 శనటింగ్ సిగ్నల్స్, రెండో లూప్లైన్లకు ఓవర్ హెడ్ విద్యుత్తు అమర్చారు. రెండు లూప్లైన్లకు ఇన్సులేటర్లు బిగించారు. 1.7 ట్రాక్ కిలోమీటర్ల మేర ఓవర్ హెడ్ విద్యుత్ తీగలు అమర్చారు. వాస్తవానికి ఇది పాతస్టేషనే. పెద్దపల్లి– నిజామాబాద్ సెక్షన్లో పెరుగుతున్న రైళ్ల ఫ్రీక్వెన్సీ కారణంగా ఈ స్టేషన్ను క్రాసింగ్ స్టేషన్గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ మార్గంలోని కొత్తపల్లి, గంగాధర, సుల్తానాబాద్ క్రాసింగ్ స్టేషన్లు ఉన్నాయి. మల్యాల రైల్వే స్టేషన్కు కూడా పునరుజ్జీవం కల్పించి క్రాసింగ్ స్టేషన్గా అందుబాటులోకి తీసుకురానున్నారు. లింగంపేట జగిత్యాల నుంచి కోరుట్ల స్టేషన్ల మధ్య ఉన్న మేడిపల్లి రైల్వేస్టేషన్ను కూడా క్రాసింగ్స్టేషన్గా అభివృద్ధి చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో పెద్దపల్లి జంక్షన్కు సమీపంలో బైపాస్ రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే నేరుగా కాజీపేట లేదా వరంగల్ నుంచి నిజామాబాద్కు నేరుగా పెద్దపల్లి టౌన్ మీదుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే రూ.25.93 కోట్లతో అమృత్భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన కరీంనగర్ స్టేషన్ సుందరీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. కొత్త స్వాగత మార్గం, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంప్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునిక మరుగుదొడ్ల సదుపాయాలు కల్పిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎక్స్ వేదికగా ఇటీవలే ప్రకటించారు. రెండేళ్లలో అందుబాటులోకి.. ఉమ్మడి జిల్లావాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వేలైన్ పనుల కోసం కేంద్రం గతేడాది రూ.350 కోట్లు కేటాయించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వే మార్గం పూర్తయి ఉమ్మడి జిల్లావాసులకు భాగ్యనగరానికి రైలు ప్రయాణ యోగం దక్కనుంది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి ప్రభుత్వం 2016లో కేంద్రాన్ని ఒప్పించింది. రూ.1,167 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించింది. ఇప్పటివరకూ మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు లైన్ పూర్తయింది. రైలు సేవలూ అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 151 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం.. ఇప్పటివరకూ 75కిలోమీటర్లు పూర్తయింది. ప్రస్తుతం సిరిసిల్ల– సిద్దిపేట (37 కిలోమీటర్లు) వరకు పనులు నడుస్తున్నాయి. అలాగే రూ.300 కోట్లకుపైగా నిధులతో చీర్లవంచ వద్ద మిడ్మానేరుపై ఐరన్ బ్రిడ్జి కూడా నిర్మించనున్నారు. 39.01 కి.మీ పొడవైన సిరిసిల్ల నుంచి కొత్తపల్లి మార్గంలో ఉన్న పూడూరు, కొత్తపల్లి రైల్వేస్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. 2026 లేదా 2027 నాటికి ఈ మార్గంలో రైల్వేలైన్ పూర్తి చేయాలన్న సంకల్పంతో అధికారులు ఉన్నారు. కొత్తపల్లి –మనోహరాబాద్ మ్యాప్ అందుబాటులోకి పూడూరు.. త్వరలో కొత్తపల్లి స్టేషన్ మల్యాల, మేడిపల్లిలకు సైతం పునరుజ్జీవం సిరిసిల్ల నుంచి కొత్తపల్లికి వేగంగా ట్రాక్ పనులు రూ.25.93 కోట్లతో కరీంనగర్ స్టేషన్ ఆధునీకరణ 2027 నాటికి భాగ్యనగర ప్రయాణ యోగం వడివడిగా కొత్తపల్లి – మనోహరాబాద్ ట్రాక్ పనులు -
‘పది’ పరీక్షలు పకడ్బందీగా పూర్తి చేయాలి
జగిత్యాల: త్వరలో జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ లత అ న్నారు. శనివారం విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. పరీక్షల కోసం జిల్లావ్యాప్తంగా 67 సెంటర్లను ఏర్పాటు చేశామని, 67 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధి కారులు, 20 మంది వెహికిల్ బాధ్యులు, 28 మంది కస్టోడియన్ అధికారులను నియమించామన్నారు. తరగతి గదులను శుభ్రం చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఫలి తాల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని ఆదేశించారు. డీఈవో రాము, కో–ఆర్డినేటర్స్ పాల్గొన్నారు. జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలు అదనపు కలెక్టర్ లత -
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి
ధర్మపురి/బుగ్గారం: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ కోరారు. ధర్మపురి, బుగ్గారంలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. కాంగ్రెస్ చేపడుతున్న పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. నాయకులు ఎస్.దినేష్, వేముల రాజు, కాసారపు బాలాగౌడ్ ఉన్నారు. బుగ్గారంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు వేముల సుభాష్, నాయకులు నర్సాగౌడ్, చిగిరి అంజిత్కుమార్, జంగ శ్రీనివాస్, నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. యూరియా అందుబాటులో ఉంచాలిజగిత్యాలరూరల్: రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రఘునందన్రావుకు సూచించారు. ఈ మేరకు ఆయనతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో వరి పొట్టదశలో ఉందని, యూరియా అందుబాటులో లేక పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. 30 శాతం మంది మొక్కజొన్న సాగు చేయడంతో యూరియా కొరత ఏర్పడిందన్నారు. -
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
గొల్లపల్లి: మండలకేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన ఇళ్లు, షెడ్లు, ప్రహరీలను అధికారులు జేసీబీతో కూల్చివేయించారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించారు. ఈ ఘటనతో అక్రమ నిర్మాణదారుల్లో ఆందోళన నెలకొనగా.. వారిని ప్రోత్సహించి సొమ్ము చేసుకున్న నాయకులు, దళారుల గుండెల్లో గుబులు పుట్టినట్లయ్యింది. మండల కేంద్రంలో అక్రమంగా నిర్మాణాలు చోటుచేసుకోవడంతో గత నెల 30న‘ప్రభుత్వ భూముల కబ్జా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అక్రమ ఇళ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్ వరందన్ ఉన్నతాధికారులకు నివేదించారు. ప్రభుత్వస్థలంలో ఇళ్లు నిర్మించుకున్న వారు ఆధారాలు చూపించకపోవడంతో కలెక్టర్ సత్యప్రసాద్ సదరు స్థలాలను శుక్రవారం సందర్శించారు. 735తోపాటు 544 సర్వే నంబర్లలోగల గుట్ట వెనుకాల నిర్మించిన ఇళ్లను పరిశీలించారు. అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం మధ్యాహ్నం రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేయించారు. కూల్చివేతలు ఆపండి.. అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారు కూల్చివేతలు ఆపాలని వేడుకున్నారు. అయితే ఆధారాలు చూపెట్టాలని అధికారులు కోరగా.. వారి నుంచి సమాధానం లేకపోవడంతో కూల్చివేతలు కొనసాగించారు. ఓ కుటుంబం ఇంట్లో సామగ్రి తీస్తామని, కొంత సమయం ఇవ్వాలని అడిగి ఇంట్లో నుంచి బయటకు రాలేదు. కాసేపు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఇంటిని కూల్చివేయించారు. ‘సాక్షి’ కథనంతో వెలుగులోకి.. నాలుగు నెలలుగా మండలకేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై స్థానికులు పలుసార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమైనా స్థానిక నాయకుల నుంచి ఒత్తిడి రావడంతో వెనుకడుగు వేశారు. ఈ క్రమంలో జనవరి 30న ‘దర్జాగా ప్రభుత్వ భూముల కబ్జా’ శీర్షికన సాక్షిలో కథనం రావడంతో స్పందించిన అధికార యంత్రాంగం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి.. కలెక్టర్ ఆదేశాలతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ బందోబస్త్ మధ్య కదిలిన అధికార యంత్రాంగం బాధితుల్లో ఆందోళన.. దళారుల గుండెల్లో గుబులు ‘సాక్షి’ కథనానికి స్పందనబాధితుల్లో అయోమయం ప్రభుత్వస్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకోగా.. ప్రస్తుతం కూల్చివేయడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారింది. దళారుల మాటలు నమ్మి నట్టేట మునిగి ఇప్పుడు రోడ్డున పడ్డారని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే బాధితులను నమ్మించి మోసం చేసి సొమ్ము చేసుకున్న దళారులపైనా ఇదే రీతిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు నిర్మించుకున్నవారిలో పేదలు, స్థానికేతరులు ఉన్నారని, వీరిని నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు చేపడితే ప్రజలు హర్షిస్తారని చెబుతున్నారు. బాధితులకు దళారుల నుంచి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. -
కార్యకర్తలే ప్రధాని మోదీ బలం
● నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మల్లాపూర్: కార్యకర్తలే ప్రధాని నరేంద్ర మోదీ బలమని, వారి కృషితోనే వరుసగా మూడుసార్లు విజయం సాధించారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం మండలకేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని, పంటలను అమ్ముకోవడానికి, మద్దతు ధర కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్గౌడ్, మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ పాల్గొన్నారు. బీజేపీ అఽభ్యర్థుల గెలుపు ఖాయం కోరుట్ల: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు ఖాయమని అర్వింద్ అన్నారు. శనివారం రాత్రి కోరుట్లలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రచార సభలో మాట్లాడారు. కోరుట్లలో సగానికిపైగా ఓటర్లు బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని తీర్మానించుకున్నారని పేర్కొన్నారు. కులం, మతం పక్కన బెట్టి దేశ భవిష్యత్ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్య మాట్లాడుతూ.. విద్యారంగ పటిష్టత, నిరుద్యోగుల ఇబ్బందులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నాయకులు మోరపెల్లి సత్యనారాయణ, బోగ శ్రావణి, రుద్ర శ్రీనివాస్, మాడవేని నరేశ్ ఉన్నారు. -
ఉమ్మడి జిల్లాలో వృద్ధులు
కరీంనగర్: 1,45,233తరం వెళ్లిపోతోంది. పాలనురగకు తీసిపోని ధవళవర్ణపు(తెలుపు) వస్త్రధారణ, హుందాతనానికి గుర్తుగా నిలిచే తాత మీసం, ఆత్మగౌరవాన్ని కళ్లకు కట్టే బామ్మ బొట్టు, శ్రమైక జీవనం, ప్రేమతో పలకరించి, మన కలలను నిజం చేసిన పెద్దల తరం, కష్టాల సుడిగుండాలు చుట్టిముట్టినా తొణకని గంభీర స్వరం మూగబోతోంది. ధర్మనిష్ఠ పాటిస్తూ కుటుంబాలకు నాగరికత నేర్పిన నాటి తరం.. ఇక తీపి గుర్తుగా మిగిలిపోతోంది. తాత, అమ్మమ్మ, నానమ్మ ఇలా.. కాలక్రమేణా ఒకనాటి పెద్దలందరూ వయోభారంతో కనుమరుగవుతున్నారు.హుజూరాబాద్: పూటగడవని రోజుల్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు న్నా.. పస్తులుంటున్నా ఇంటి గుట్టు బయట పడనిచ్చేవారు కాదు. చిరిగిన దుస్తులు ధరించిన నాటి ఇంటి పెద్ద తన సంతానానికి ఆ లోటు రాకుండా చూసేవారు. పచ్చడి మెతుకులే పరమాన్నంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. తాము పడే బాధలు పక్కింటివారితో కూడా చర్చించేవారు కాదు. రోజువారీ పనికి సమయంతో పనేంటనే భావన వారికి ఉండేది. ఉమ్మడి కుటుంబాలే.. అప్పట్లో అత్యధికంగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. ఒక్కో ఇంట్లో పగలూ రాత్రి కలిసి 20 కిలోల వరకు ఆహార ధాన్యాలు వండివార్చే వారంటే అతిశయోక్తి కాదు. ఒక కుటుంబంలో 10 నుంచి 20 మంది వరకు ఉన్నా భేషజాలు ఉండేవి కావు. నీతి, నియమాలే కట్టుబాట్లుగా కుటుంబ పెద్ద చెప్పించే వేదంగా ఉండేది. పిల్లలకు పెళ్లి చేయాలంటే ఉమ్మడిగానే నిర్ణయం తీసుకునేవారు. ఏ ఒక్క బంధువునీ మర్చిపోకుండా తరచూ ఇంటికి ఆహ్వానించి, వారం రోజుల వరకు వెళ్లనిచ్చేవారు కాదు. ఇప్పుడేం జరుగుతోంది? నేటితరంలో కొంతమంది ఆధునిక పోకడలతో ముందుకెళ్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు, అహం, ఇతరులను తక్కువగా చూసే ధోరణి చాలామందిలో కనిపిస్తున్నాయి. చిన్న కుటుంబాలుగా విడిపోతూ, గొడవ పడుతూ గౌరవించుకోవడం లేదు. కుటుంబసభ్యులందరూ కలవడానికి, మాట్లాడుకోవడానికి ఇష్టపడటం లేదు. కడుపున పుట్టిన బిడ్డలు కొందరు చేరదీయకపోవడంతో పెద్దలు అనాథాశ్రమాల్లో కాలం వెళ్లదీస్తున్న దుస్థితి కనిపిస్తోంది. జీవితాంతం కష్టపడినవారు వృద్ధాప్యంలో పలకరింపుకై నా నోచుకోక మౌనంగా రోదిస్తున్నారు. విడిగా ఉండేందుకే ప్రాధాన్యం ఉమ్మడి కుటుంబంలో ఉండేందుకు కొంతమంది ఇష్టపడటం లేదు. ఫలితంగా వారిపై పెద్దల నియంత్రణ ఉండటం లేదు. ఎక్కడో ఉన్న సినీనటులు ఈరోజు ఏంచేశారో చెప్పగలుగుతున్నారు. ఇంట్లోవారు ఎప్పుడు ఏంచేస్తున్నారో చెప్పలేని పరిస్థితి. మాట్లాడుతున్న తీరుతో రక్త సంబంధీకులకు దూరమవుతున్నారు. ఇతరులతో పోల్చుకుంటూ రాబడికి మించి ఖర్చు చేస్తున్నారు. యువత వ్యసనాలకు బాని సవుతోంది. 30 ఏళ్లొచ్చినా పెళ్లి మాట ఎత్తడం లేదు. వాట్సాప్, ఫేస్బుక్లలో శ్రద్ధాంజలి తీరికలేని జీవితంలో.. ఒక వ్యక్తి మరణిస్తే వాట్సాప్, ఫేస్బుక్లలో మెస్సేజ్ పెట్టి, వదిలేస్తున్నారు. చనిపోయినవారిని చూసేందుకు సైతం వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి. నైతిక విలువలు నేర్పాలి ప్రభుత్వం నూతన విద్యావిధానంలో నైతిక విలువలు, మానవ విలువలను పాఠ్యాంశంగా చేర్చాలి. పాఠశాల స్థాయిలోనే సంస్కృతి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతపై పిల్లలకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతపై ప్రతీ ఇంట్లో కుటుంబసభ్యులందరూ చర్చించుకో వాలి. పర్యావరణ విధ్వంసం వల్ల వచ్చే ఉపద్రవా ల కన్నా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పతనమైతే కలిగే అనర్థాలపై ప్రభుత్వం, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు ప్రచారం చేయాలని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.దమ్మక్కపేటలో ఒకరినొకరు పలకరించుకుంటున్న మహిళలుజగిత్యాల: 1,25,678రాజన్న సిరిసిల్ల: 1,08,543పెద్దపల్లి: 1,20,721కనుకులగిద్దె కూడలి వద్ద మాట్లాడుకుంటున్న వృద్ధులుకట్టు.. బొట్టు.. శ్రమైక జీవనంతరం వెళ్లిపోతోంది ప్రేమతో నాగరికత నేర్పారు.. ఇంటి గుట్టు బయట పడనిచ్చేవారు కాదు కుటుంబాలను ఉమ్మడిగా నిలబెట్టారు వయోభారంతో ‘పెద్దలు’ మూగబోతున్నారు ఆధునిక పోకడలతో ఈతరం కొందరిలోప్రేమ, ఆప్యాయత దూరం విలువలు నేర్పాలంటున్న సామాజికవేత్తలువ్యవసాయం.. గంజి, మెతుకులు వ్యవసాయానికి యంత్రాలు లేని నాటి కాలంలో తెల్లవారకముందే సాగు పనుల్లో నిమగ్నమై, దీపాలు పెట్టే వేళకు ఇల్లు చేరేవారు. పగలంతా పడిన కష్టాన్ని మరిచి, మిణుకుమిణుకుమంటూ వెలిగే నూనె దీపాల వెలుగులో ఇంటిల్లిపాది కూర్చొని, కాచిన గంజిలో మె తుకులు కలిపి తినేవారు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే మట్టి, కలపను ఎడ్లబండ్లపై తీసుకువచ్చేవారు. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా భూమి, ఇల్లు మాత్రం అమ్మకానికి పెట్టేవారు కాదు. తల్లిదండ్రులు, పంటలు, పశుసంపదను ప్రేమగా చూసుకునేవారు. -
గ్రామాల్లో నీటి ఎద్దడి రానీయొద్దు
రాయికల్: వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటిఎద్దడి రానీయొద్దని, డీపీవో మదన్మోహన్ సూచించారు. మండలంలోని భూపతిపూర్ నర్సరీ, జీపీ రికార్డులను శనివారం పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని, మార్చిలోపు వందశాతం పన్నులు వసూలు చేయాలని సూ చించారు. ఆయన వెంట ఎంపీవో సుష్మ ఉన్నారు. రాజగోపురంతో దుబ్బ రాజన్నకు కళసారంగాపూర్: మండలంలోని దుబ్బ రాజన్న ఆలయానికి రాజగోపురం, ప్రాకా రాలు పూర్తి కావస్తుండడంతో ఆలయానికి కొత్త కళ వ స్తోంది. ఆలయానికి చుట్టూ సాధారణ ప్రహరీ తొలగించి.. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం తరహాలో కొత్త ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. జగిత్యాల–సారంగాపూర్ ఆర్ఆండ్బీ ప్రధాన రహదారిని ఆనుకొని చేపట్టిన రాజగోపురం పనులు దాదాపు పూర్తవుతున్నాయి. ఈ నిర్మాణాలకు సీఎంగా కేసీఆర్, నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్న సమయంలో దేవాదాయశాఖ నుంచి రూ.82 లక్షలు విడుదలయ్యాయి. ఆ నిధులతోపాటు ఆలయ అర్చకులు, పెంబట్ల, కోనాపూర్ గ్రామపెద్దలు, జగిత్యాల ప్రాంతానికి చెందిన పెద్దల నుంచి రూ.22లక్షలు వి రాళాలు సేకరించారు. రాజ గోపుర నిర్మాణాని కి కొంతభూమి అవసరంకా గా.. ఆలయ అర్చకుడు శానగొండ కై లాసం సమకూర్చారు. రా జగోపురానికి కేవలం శిల్పుల పనిమాత్రమే మిగిలి ఉంది. దుబ్బరాజన్న జాతర బ్రహ్మోత్సవాలు పూర్తికాగానే మరో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు, నాయకులు చెబుతున్నారు. -
పెద్దాపూర్ గురుకులంలో కలెక్టర్ బస
మెట్పల్లిరూరల్: గురుకులాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులాన్ని శనివారం రాత్రి సందర్శించిన ఆయన అక్కడే బస చేశారు. గురుకులం పరిసరాలు, తరగతి, వసతి గదులు, డైనింగ్, భోజనం, మెనూ, స్టోర్రూంలో నిల్వ ఉంచిన సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో భోజనం చేశారు. కాసేపు క్యారం, చెస్ ఆడారు. లక్ష్యసాధన కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని సూచించారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని, అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మహేశ్వర్రెడ్డి, ఆర్ఐ ఉమేశ్, ప్రిన్సిపాల్ మాధవీలత, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధిహామీ కూలీలను పెంచాలి జగిత్యాల: ఒక్కో గ్రామంలో 50 మందికి తక్కువ కాకుండా ఉపాధి కూలీలతో పనులు చేయించాల ని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో సమావేశమయ్యారు. మార్చి 10వరకు ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది రానీయొద్దన్నారు. బోర్లు, చేతిపంపులు మరమ్మతు చేయించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసిన వాటిని రెన్యువల్ చేయాలని ఆదేశించారు. డీఆర్డీవో రఘువరణ్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి పాల్గొన్నారు. ఇసుక రీచ్ తనిఖీ కథలాపూర్: మండలంలోని సిరికొండ వాగులో ఉన్న ఇసుక రీచ్ను కలెక్టర్ శనివారం రాత్రి తని ఖీ చేశారు. రోజువారీగా ఎంత ఇసుకను తీసుకెళ్తున్నారు..? ఎవరెవరు తీసుకెళ్తున్నారని అడిగి తెలు సుకున్నారు. ఇసుక విషయంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ఆయన వెంట మైనింగ్శాఖ ఏడీ జయసింగ్, తహసీల్దార్ వినోద్, ఆర్ఐ నాగేశ్ ఉన్నారు. ● కలెక్టర్ సత్యప్రసాద్ -
వెలుగులోకొస్తున్న ప్రభుత్వ భూ ఆక్రమణలు
● సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు ● 142 మందికి పాస్బుక్ల జారీ ● సుమారు 100 ఎకరాల వరకు అక్రమ పట్టాలునోటీసులు జారీ చేశాం నర్సింగాపూర్ గ్రామ శివారులోని సర్వేనంబరు 437, సర్వేనంబరు 251లో ధరణి కంటే ముందు అక్కడున్న భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. కానీ 437 సర్వేనంబరులో 142 మంది పాస్బుక్లు పొందారు. వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసేందుకు సర్వే కొనసాగుతోంది. – శ్రీనివాస్, తహసీల్దార్, జగిత్యాల రూరల్ జగిత్యాలరూరల్: ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేస్తున్నారు. మరి కొంతమంది అక్రమంగా పట్టా చేయించుకుని సాగు చేసుకుంటున్నారు. దీనికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను ఆసరాగా చేసుకున్నారు. పోర్టల్లో ఉన్న లోటుపాట్లతోపాటు అధికారులను మచ్చిక చేసుకుని పాస్బుక్లు పొందుతున్నారు. ఇలా జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని సర్వేనంబరు 437లో 378 ఎకరాల భూమి ఉండగా.. సుమారు 100 ఎకరాలకు అక్రమంగా పాస్బుక్లు పొందారు. అలాగే సర్వేనంబరు 251లో 207.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులోనూ కొంతమంది అక్రమంగా పట్టాలు పొందారు. బడా నాయకులు అప్పటి తహసీల్దార్తోపాటు ఉన్నతస్థాయి అధికారుల సహకారంతో పట్టాలు పొందినట్లు వెల్లడైంది. సర్వేనంబరు 437లో 142 మంది పాస్బుక్లు పొందారు. దీంతో ఆ భూమిని చదును చేసి కొంతమంది సాగు చేసుకుంటుండగా.. కొంతమంది ఇటుక బట్టీల వ్యాపారులకు అద్దెకు ఇచ్చుకుని రూ.లక్షలు సంపాదిస్తున్నారు. సుమారు 142 మంది ప్రభుత్వ భూమికి పాస్బుక్లు తీసుకుని ఇప్పటివరకు సుమారు రూ.70 లక్షల మేర రైతుబంధు పొందినట్లు అధికారులు నిర్ధారించారు. నోటీసులు జారీ నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా పట్టాలు పొందిన వారికి జగిత్యాల రూరల్ తహసీల్దార్ 10 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అక్రమ పట్టాలు పొందిన వారు నోటీసులకు జవాబులు ఇవ్వాల్సి ఉన్నా.. వారి నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. 83 మందివి ఫేక్ పట్టాలని నివేదిక అందజేత నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 437లో పట్టాదారు పాస్బుక్లు పొందిన వారిలో 83 మందివి నకిలీ పట్టాలేనని తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో పాటు, ధరణి రాక ముందు పహణిల్లో మాత్రం ప్రభుత్వ భూమి గానే నమోదై ఉందని నివేదికలో పేర్కొన్నారు. కొనసాగుతున్న సర్వే ప్రభుత్వ భూమిలో అక్రమ పట్టాలు పొందారని విషయం వెలుగు చూడటంతో కలెక్టర్ ఆదేశాల మే రకు పదిహేను రోజులుగా నర్సింగాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములకు రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో సర్వే చేస్తూ హద్దులు నిర్ణయిస్తున్నారు. ఇటుక బట్టీలకు అద్దెకు.. నర్సింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో అక్రమ పట్టాలు పొందిన వారిలో చాలామంది ఆ భూములను చదును చేసి ఇటుక బట్టీల వ్యాపారులకు అద్దెకిచ్చి లక్షలాది రూపాయలు పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఇటుక బట్టీల వ్యాపారులు కూడా సమీపంలో ఉన్న ప్రభుత్వ భూ మిని చదును చేస్తూ వినియోగించుకుంటున్నారు.