Jagtial
-
ప్రకృతిని కాపాడుకోవాలి
జగిత్యాలక్రైం: ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించగలమని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. పెరుగుతున్న కాలుష్యం, వాతా వరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత వంటి స మస్యలకు చెట్ల పెంపకం ప్రధాన పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నా టి సంరక్షించాలని కోరారు. ఏఎస్పీ చేతన్ నితిన్, ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, డీఎస్పీలు పురుషో త్తంరెడ్డి, రాములు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పనిచేయాలినేరాలను త్వరగా ఛేదించాలని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, బాధితులకు న్యాయం అందించేలా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గంజాయి సరఫరా మార్గాలను గుర్తించి కీలక వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. భూవివాదాలు, పాత కక్షలతో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి బైండోవర్ చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని సూచించారు. జీవో 38 అమలు చేయాలిజగిత్యాల: వైద్యుల బదిలీల్లో జీవో 38 అమలు చేయాలని ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మాతా శిశు సంక్షేమ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందన్నారు. భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో, సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహించేలా స్పౌజ్కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోశాధికారి నవీన్, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసాచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులందరికీ పథకాలు అందాలిజగిత్యాలరూరల్: జిల్లాలోని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా మండల మహిళా సమాఖ్యలు కృషి చేయాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమాఖ్య సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 141 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 13.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కొనుగోళ్లను విజయవంతం చేసిన ఏపీఎం, సీసీలు, కమిటీ సభ్యులు, వీవోఏలను అభినందించారు. జిల్లా అదనపు ప్రాజెక్ట్ అధికారి సునీత మాట్లాడుతూ, బ్యాంక్ లింకేజీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.793.74 కోట్ల టార్గెట్ నిర్దేశించడం జరిగిందని, టార్గెట్ ప్రకారం ప్రగతి సాధించేలా మండల సమాఖ్య సిబ్బంది కృషి చేయాలన్నారు. డీపీఎంలు నారాయణ, నాగేశ్వర్రావు, సీ్త్రనిధి ఆర్ఎం నారాయణ, జిల్లా ఎస్బీఎం కోఆర్డినేటర్ హరిణి, ఏపీఎంలు గంగాధర్, త్రివేణి, హుస్సేన్, చక్రవర్తి, సమాఖ్య అధ్యక్షురాలు సరోజ, కార్యదర్శి ఆమని పాల్గొన్నారు. ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకతజగిత్యాలరూరల్: రాష్ట్ర ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండల కేంద్రంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు అందక రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో రైతుబంధు ఇచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. ఏ రైతును పలుకరించినా 5–10 కిలోలు ధాన్యం తూకంలో నష్టపోయామని వాపోతున్నారని పేర్కొన్నారు. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కొత్త పథకాలు, ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా అమలు చేస్తారని ప్రజలు ఎంతో ఆశించినా ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడుస్తున్నా కొత్త పెన్షన్ ఎవరికీ రాలేదన్నారు. నాయకులు చంద్ర కృష్ణారెడ్డి, బూసి మల్లేశం పాల్గొన్నారు. యూపీఎస్ పునఃప్రారంభంగొల్లపల్లి: రెండేళ్లుగా మూతపడిన గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల గ్రామస్తులు, ఉపాధ్యాయుల కృషితో పునఃప్రారంభమైంది. పాఠశాల పునఃప్రారంభంపై శుక్రవారం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామస్తుల్లో అవగాహన పెరగడంతో, శుక్రవారం ఒక్కరోజే 30 మంది విద్యార్థులు పాఠశాలలో ప్రవేశం పొందడం విశేషం. రానున్న రోజుల్లో మరింత మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని, అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులు గోస్కుల శ్రీనివాస్ను ఎంఈవో రాజన్న అభినందించారు. ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, స్వశక్తి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి
వెల్గటూర్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పాశిగామ, స్తంభంపెల్లిలో కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం మాయిశ్చర్ వచ్చిన వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణాలో నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు ఉన్నందున కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీసీవో మనోజ్కుమార్, డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ శేఖర్, ఎంపీడీవో వెంకట్ప్రసాధ్, ఎంపీవో కృపాకర్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జగిత్యాలజోన్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని హైకోర్టు జడ్జి పుల్ల కార్తీక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కోర్టులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆధునిక పోకడల కారణంగా మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పులతో గాలి, నీరు వంటి పంచ భూతాలు కలుషితం అవుతున్నాయన్నారు. ప్రకృతిని విచక్షణ రహితంగా కొల్లగొట్టడంతో పాటు అధికంగా ప్లాస్టిక్ వాడడం భూతాపం పెరగడానికి కారణమవుతున్నాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూరి సి.రత్న పద్మావతి మాట్లాడుతూ, మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సునీత రవీందర్రెడ్డి, సబ్ జడ్జి నాగేశ్వర్రావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, రెండో అ దనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ నిఖిషా, డీఎఫ్వో రవిప్రసాద్, ఎఫ్ఆర్వో పద్మారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సత్యం, జ్యూడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు. రండి.. మాట్లాడుకోండి!కోరుట్ల: కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ కొరివితో తలగోక్కున్నట్లే ఉంది. ఇంటి నిర్మాణం అనుమతి నుంచి మొదలుకుని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటి నంబరు వరకు అడుగడుగునా అవస్థలు తప్పడం లేదు. ఇల్లు అనుమతికి ఫైళ్ల లెక్కన ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది.. ఇంటి నంబరు వేయాల్సిన సమయంలో కొలతలు తీసుకుని జాప్యం చేస్తున్నారు. ‘సార్ మా ఇంటి కొలతలు తీసుకున్నారు.. మరి ఆస్తి పన్ను ఎంత కట్టాలో చెబితే కట్టి ఇంటి నంబరు తీసుకుంటా మని అంటే.. అది కుదరదు.. మీరు వచ్చి సార్తో మాట్లాడుకోండి’.. అన్న సమాధానాలు రావ డం మున్సిపల్ ఉద్యోగులు ఆమ్యామ్యాల కో సం దిగజారుతున్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంటి తీరును బట్టి రేటు ఇంటి అనుమతుల సమయంలో టౌన్ప్లానింగ్ అధికారులు ఫైళ్ల లెక్కన కొంత, సెట్బ్యాక్ పేరిట మరికొంత, అనుమతికి విరుద్ధంగా డిజైన్ ఉందని ఇంకొంత అంతస్తులు లెక్కకట్టి డబ్బులు వసూలు చేయడం ఆనవాయితీగా మారినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఇదే తీరును మున్సిపల్ రెవెన్యూ సెక్షన్ ఉద్యోగులు కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటి విస్తీర్ణం కొలతలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే ఇంటికి నంబరు ఇవ్వాల్సిన ఉద్యోగులు సకాలంలో ఆ పని చేయడం లేదు. దీంతో ఇంటి నిర్మాణదారు తనకు ఇంటి నంబరు రావడం లేదని అధికారులను సంప్రదిస్తే ‘మీరు.. సార్తో మాట్లాడుకుంటే వెంటనే ఇంటి నంబరు వస్తుంది.’ అని చెబుతుండడం విడ్డూరం. ఇల్లును బట్టి కనీసం రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు ఇంటి నంబరు వేయడం కోసం సిబ్బందికి చెల్లించాల్సిన దుస్థితి. ఈ పరిస్థితుల్లో సామాన్యులు ఇల్లు కట్టుకోవడానికి నానా అవస్థలు పడాల్సిన వస్తోంది. పర్యవేక్షణ కరువు కోరుట్ల మున్సిపాల్టీలో ఇటీవల మున్సిపల్ కమిషనర్ బదిలీ కావడం, ఇన్చార్జి అధికారి పాలన సాగుతుండటంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. మున్సిపాల్టీలో సుమారు 20 వేల ఇళ్లు ఇదివరకే ఉండగా రోజూ 10 ఇళ్ల వరకు కొత్తగా నిర్మాణం పూర్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రోజూ సదరు ఇళ్ల నిర్మాణదారుల నుంచి ఇంటి నంబరు కోసం రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఉద్యోగులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు మున్సిపల్ ఉద్యోగుల ఆమ్యామ్యాల తంతును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫిర్యాదులు వస్తే చర్యలు ఇంటి నిర్మాణం కొలతలు తీసుకుని ఇంటి నంబర్లు ఉద్యోగులు వేస్తారు. కొత్త ఇంటి నంబర్లు వేయడానికి ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్, కోరుట్ల -
జగిత్యాల
39.0/27.07గరిష్టం/కనిష్టంపర్యావరణాన్ని కాపాడాలిజగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని గన్పార్క్లో కలెక్టర్ సత్యప్రసాద్ మొక్కలు నాటా రు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. అంజన్న సేవలో ఎమ్మెల్యే మల్యాల: పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026 -
రాజన్నకు సేవకులు కావలెను
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన ఎములాడ రాజన్న సేవకు ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొరత పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం ఉద్యోగులకు సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు పదవీ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధుల వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితం కూడా ప్రభావితమవుతోందని వారు పేర్కొంటున్నారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పోస్టుల వివరాలు మొత్తం క్యాడర్ పోస్టులు : 320 ప్రస్తుతం పనిచేస్తున్న వారు: 185ఖాళీగా ఉన్న పోస్టులు : 135ఖాళీల్లో ఉన్న అర్చక పోస్టుల సంఖ్య: 35లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టులు సుమారుగా : 60 జూనియర్ అసిస్టెంట్ , రికార్డ్ అసిస్టెంట్ల పోస్టులు: 10 డ్రైవర్ పోస్టులు : 3మొత్తం ఔట్ సోర్సింగ్ పోస్టులు: 290ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య: 250ఔట్ సోర్సింగ్లో ఖాళీ పోస్టులు: 40 -
ఆలయ అభివృద్ధికి సహకరించాలి
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. రానున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై శుక్రవారం ధర్మపురిలో కలెక్టర్ సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి భూ నిర్వాహితులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎవరినీ ఇబ్బందులు పెట్టకుండా క్షేత్ర అభివృద్ధికి ముందుకు సాగుతామన్నారు. 2017–18 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాహితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు సీఎం రేవంత్రెడ్డి మొదటి విడతగా రూ.117 కోట్లు కేటాయించడం జరిగిందని, వాటితో నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాలలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. పుష్కరాలకు ముందే పనులు ప్రారభించి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, దేవాదాయశాఖ అధికారులు తదితరులున్నారు. -
సౌకర్యాలు కల్పిస్తాం
జగిత్యాల: జిల్లా కేంద్రం జగిత్యాల గ్రేడ్–1 మున్సిపాలిటీ. కానీ, పట్టణవాసులు సేద తీరేందుకు సరైన స్థలాలు లేవు. పట్టణంలో 1,30,863 జనాభాకు అమరవీరుల స్తూపం వద్ద ఎకరం స్థలంలో ఒకటే పార్క్ ఏర్పాటు చేశారు. కానీ, అందులో సరైన సౌకర్యాలు లేవు. పట్టణ నడిబొడ్డున గల పార్క్లో వసతులు లేక పార్క్ కళావిహీనంగా మారింది. ఎప్పుడో ఏర్పాటు చేసిన పరికరాలు, ఫౌంటేన్లు దెబ్బతినగా, సంబంధిత అధికారులు వాటికి నామమాత్రంగా పైన పూతలు పూసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అధికారులు, ప్రజాప్రతినిధులు ఉద్యానవనంలో ఆధుని క వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ౖపైపెనే పూతలు పార్కులో పిల్లలు ఆడుకునేందుకు గతంలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. అవి శిథిలావస్థకు చేరడంతో బల్దియా రూ.10 లక్షల నిధులు పార్క్ కోసం కేటాయించగా, ౖపైపె మరమ్మతులు చేపట్టి మమ అనిపించారు. పార్క్లో మ్యూజికల్ ఫౌంటేన్, మరో సాధారణ ఫౌంటేన్, ఆట పరికరాలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరైనా, కొత్తవి మాత్రం ఏర్పాటు చేయలేదు. పిల్లలు ఆడుకునే పరికరాలకు రంగులు పూసి వదిలేశారు. పట్టణవాసులకు ఆహ్లాదం కరువు జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో వివిధ పనుల నిమిత్తం రోజూ చాలా మంది వస్తూ పోతుంటారు. కాగా, ప్రజలు సేద తీరేందుకు పట్టణంలో స్థలం కరువైంది. పట్టణవాసులకు సైతం ఆహ్లాదం అందడం లేదు. ఉన్న ఒకే ఒక పార్క్లో సరైన వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఉన్న పార్కులో ఆధునిక సౌకర్యాలు కల్పించడంతో పాటు కొత్త పార్క్ ఏర్పాటు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.పార్కులో సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ఇటీవల తాగునీటి వసతి ఏర్పాటు చేశాం. ఫౌంటేన్లకు మరమ్మతు చేయిస్తున్నాం. ప్రజలకు ఆహ్లాదం అందించేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇటీవల బడ్జెట్లో రూ.5 లక్షలు కేటాయించాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తాం.– ఆనంద్కుమార్, డీఈ, జగిత్యాల -
నెల రోజులైంది..
నేను మక్కలు అమ్మి నెల రోజులవుతోంది. అప్పటినుంచి డబ్బులు రాకపోతే వానాకాలం సీజన్కు ఎలా పెట్టుబడి పెట్టాలి..? బ్యాంకులో రుణం ఎలా చెల్లించాలి..? ఒకవేళ రుణం చెల్లించకుంటే వడ్డీమీద పడుతుంది. డబ్బులు ఖాతాలో వేశారేమోనని రోజు బ్యాంకుకు వెళ్లి చూడాల్సి వస్తోంది. – బందెల మల్లయ్య, చల్గల్, జగిత్యాల రూరల్(మం)రూ.10 కోట్లు జమ చేశాం ఇప్పటికే రూ.10 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఆలస్యం చేయకుండా రైతులకు డబ్బులు చెల్లిస్తాం. ప్రభుత్వం నుంచి మార్క్ఫెడ్ సంస్థకు డబ్బులు రాగానే.. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ఏర్పాట్లు చేశాం. అన్నదాతలు అర్థం చేసుకుని సంస్థకు సహకరించాలి. – ఎండీ. హాబీబ్, జిల్లా మార్క్ఫెడ్ అధికారి -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
జగిత్యాల/కథలాపూర్/జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కథలాపూర్ మండలం కలిగోట కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. ధాన్యాన్ని రైస్మిల్లులకు త్వరగా పంపించాలని, 24 గంటల్లోగా అన్లోడ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో జివాకర్రెడ్డి, డీటీవో సంధాని, డీఎస్వో జితేందర్రెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఆర్ఐ రవీందర్ ఉన్నారు. ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించండి వర్షాకాలంలో ఇసుక లభ్యత ఉన్న ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ అన్నారు. ఇసుక రీచ్ల గుర్తింపు, తవ్వకాలపై కలెక్టరేట్లో సమీక్షించారు. భూగర్భజల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ఇసుకకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని, తవ్వకం, రవాణాలో పారదర్శకత పాటించాలని సూచించారు. ధర్మపురి పరిధిలో ప్రస్తుతం అధికారికంగా తవ్వకాలకు అనుమతులు లేవన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి గోదావరి పరిధిలో అనువైన రీచ్లను గుర్తించి గనులశాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ అశోక్కుమార్, అదనపు కలెక్టర్ లత పాల్గొన్నారు. అర్హులందరికీ పథకాలు అందించాలి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. బీర్పూర్ మండలంతోపాటు మోతీనగర్, నరసింహులపల్లి, కందెనకుంటలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ట్రక్ షీట్ నమోదు, ట్యాబ్ఎంట్రీ వెంటవెంటనే పూర్తి చేయాలన్నారు. తుంగూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. 99 రోజుల్లో వచ్చిన వినతులను పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సుజాత ఉన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
చదువు సాగాలి
పిల్లలు చేరాలి..జగిత్యాల: సర్కారు బడులను బలోపేతం చేయాలని, ఇందుకు విద్యార్థుల పెంపే లక్ష్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే దాదాపు 50 శాతం మంది ఉపాధ్యాయులందరూ సెన్సెస్లో ఉండటంతో బడిబాట కార్యక్రమం పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇచ్చేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు ర్యాలీలతోపాటు, పలు చోట్ల గ్రామసభలు నిర్వహించారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్య, ప్రభుత్వం కల్పిస్తున్న ఆధునిక సదుపాయాలపై అవగాహన కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఒకవైపు సెలవులు కావడంతో విద్యార్థులంతా వివిధ ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఉపాధ్యాయులు సెన్సెస్లో ఉండటంతో బడీడు పిల్లలను చేర్చేందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వ కల్పించిన సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, అమ్మ ఆదర్శ కమిటీల భాగస్వామ్యంతో చేపడుతున్న పనులను విద్యార్థులకు వివరిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు వంతులవారీగా వెళ్తూ బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిసింది. జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 189 ఉన్నత, 82 ప్రాథమికోన్నత, 467 ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 35,526 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని చెప్పవచ్చు. పాఠశాలల్లో సుందరీకరణ, నైపుణ్యం గల ఉపాధ్యాయుల బోధన, డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు ఇలా అన్ని పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే నూతనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశారు. చేపట్టాల్సిన కార్యక్రమాలివే... ఈనెల 19 వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలతో కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ఇంటింటికీ పంపిణీ చేస్తారు. అంగన్వాడీ కేంద్రాల్లో అర్హత గల పిల్లలను ప్రీప్రైమరీ తరగతుల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటారు. బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా చూస్తున్నారు. 5 నుంచి 14 ఏళ్ల బడిబయట పిల్లలను గుర్తించి ఉపాధ్యాయులు జాబితా రూపొందించాలి. వారిని పాఠశాలల్లో అడ్మిషన్ చేయించాలి. గ్రామ విద్య రిజిష్టర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు పాఠశాల విద్యపై ఆసక్తి కలిగేలా కార్యక్రమం నిర్వహించాలి. మహిళా సంఘాల సహకారంతో బడీడు పిల్లలను గుర్తించి చేర్పించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే దివ్యాంగ పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించాలి. అమలైతే హ్యాపీ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ ఈసారి సంఖ్య పెరిగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఉపాధ్యాయులందరూ సెన్సెస్లో ఉండటంతో గ్రామగ్రామాన తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేది సాధ్యమవుతుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ విద్యాశాఖ అనుకున్నట్లు విద్యార్థులు భారీగా చేరితో ప్రభుత్వం లక్ష్యం కొంతమేర ఫలించినట్లు లెక్క. ప్రారంభమైన బడిబాట కార్యక్రమం సర్కారు పాఠశాలల బలోపేతమే లక్ష్యం. ఉదయం 7గంటల నుంచి 9 వరకు ప్రచారం ఆచరణలో పెడితేనే అందరికి ఆమోదం సగం మంది ఉపాధ్యాయులు సెన్సెస్లోజిల్లాలో బడిబాట కార్యక్రమాలు ఇలా.. -
గాలి ఓ మా చిరుగాలి
గాలి గాలి ఓ చిరుగాలి పవనాలుగా నీవిక తేలి నీవస్తావులే మా ఇంటికి నచ్చావులే మా కంటికి ! నీ వల్లే మాకు ఊపిరి ఉంది నీవు లేకుంటే కలుగు ఇబ్బంది మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ? నీ సమాధానం ఇక ఏదైనా నీవు లేకుండా పోదు పొద్దైనా ఓ గాలితల్లి మా చిరుగాలి మళ్లీ నీవు లేక ప్రాణం ఉండదులే మళ్లీ చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు అట్లనే చేయకు నీవిక అలుసు బొగ్గు పులుసు గాలి నీలో ఉంది దానితో మాకు కలుగు ఇబ్బంది ! గాలి తల్లి మా చిరుగాలి మల్లి మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి నీవు లేకుండా ఉండదు ఏ గల్లి నీవు వస్తేనే బాగుంటుంది మళ్లీ! గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి హోరుగాలితో చేయకు లొల్లి చల్లగా తగిలితే కలుగు హాయి మెల్లెగ మది ఉప్పొంగు నోయి ! – గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ -
మక్కల పైసలు ఇంకెప్పుడో..!
జగిత్యాలఅగ్రికల్చర్: మక్కలు అమ్మిన రైతులకు డబ్బులు ఇంకా ఖాతాల్లో చేరడం లేదు. విత్తనాల, ఎరువుల కొనుగోలుకు చేతిలో డబ్బులు లేక అన్నదాతలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం వరకు రూ.109 కోట్ల మక్కలు కొనగా.. కేవలం రూ.10 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులు డబ్బుల కోసం ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి ఖాతాలు చెక్ చేయించుకుంటున్నారు. మొన్నటి వరకు మక్కలు కొనాలని పోరాటాలు చేసిన రైతులు.. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 4.55 లక్షల క్వింటాళ్ల కొనుగోలు యాసంగి సీజన్లో మార్క్ఫెడ్ సంస్థ జిల్లాలో 12 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 11,773 మంది రైతుల నుంచి 4.55 లక్షల క్వింటాళ్లను రూ.2400 ధరతో కొనుగోలు చేసింది. ఈ లెక్కన రైతులకు దాదాపు రూ.109.34 కోట్లు చెల్లించాల్సి ఉంది. 8 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మరో 4 కేంద్రాల నుంచి మరో 15 వేల క్వింటాళ్ల మక్కలు రానున్నాయి. ఇటీవల వర్షాలు పడి కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసిపోతే.. నానా తిప్పలు పడి పంటను అమ్మారు. విక్రయించి నెల రోజులు అయినా ఇప్పుడు డబ్బులు చెల్లించడం లేదు. దిక్కులు చూస్తున్న రైతులు జిల్లాలో ఎక్కువగా ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, జగిత్యాల, రాయికల్ మండల రైతులు మార్క్ఫెడ్కు మక్కలు విక్రయించారు. మద్దతు ధరకు విక్రయించామని సంబరపడాలో.. లేక డబ్బులు ఇంకా రాలేవని బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కేంద్రం కొన్నది రావాల్సిన పైసల్ (క్వింటాళ్లలో) (రూ.కోట్లలో)ధర్మపురి 26,663 6.39 గొల్లపల్లి 38,370 9.20 ఇబ్రహీంపట్నం 59,541 14.28 కోరుట్ల 36,819 8.83 మెట్పల్లి 60,819 14.59 జగిత్యాల 51,629 12.39 లక్ష్మీపూర్ 27,493 6.59 రాయికల్ 63,856 15.32 బీర్పూర్ 14,375 3.45 కథలాపూర్ 17,779 4.26 మల్లాపూర్ 32,982 7.91 మేడిపల్లి 25,256 6.06 రైతులకు రావాల్సిన డబ్బులు రూ.100 కోట్ల పైనే.. 12 కేంద్రాల ద్వారా 4.55 లక్షల క్వింటాళ్ల కొనుగోలు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న అన్నదాతలు -
ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. న్యాయం చేయండి
జగిత్యాలటౌన్: కట్టుకున్న భర్త, కనిపెంచిన కొడుకుతోపాటు కోడలు తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, తనకు న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు ఆర్డీవోకు విన్నవించింది. బాధితురాలి కథనం ప్రకారం.. జిల్లాకేంద్రానికి చెందిన బత్తుల భారతి (61) భర్త శంకర్ ఎంపీవో (మండల పంచాయతీ అధికారి)గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు. కొడుకు సంతోష్ ప్రభుత్వ వైద్యుడు. కోడలు అనూష కూడా వైద్యురాలే. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో భర్తతోపాటు కొడుకు, కోడలు కనికరం లేకుండా తనను అనేక రకాలుగా మానసిక, శారీరకంగా చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. అద్దె ఇంట్లో తలదాచుకుంటూ బీడీలు చుడుతూ జీవనం సాగిస్తోంది. అనారోగ్య సమస్యలతోపాటు ఒంటరితనం భరించలేకుండా పోతోంది. భర్త, కొడుకు, కోడలలిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆర్డీవోను వేడుకుంది. -
రైతులపై సీఎంకు చిత్తశుద్ధి లేదు
● బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి రాయికల్: రైతులపై సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. గురువారం రాయికల్లో విలేకరులతో మాట్లాడారు. రైతుభరోసాను కేవలం రెండెకరాలకే పరిమితం చేశారని, వరికి బదులు ప్రత్యామ్నాయంగా పప్పుదినుసులు, నూనె గింజలు పండించాలని సలహా ఇస్తున్నా.. వాటికి ఎలాంటి రాయితీ ఇస్తారో చెప్పలేదని పేర్కొన్నారు. పప్పుదినుసులు పండాలంటే కోతుల బెడద తీవ్రంగా ఉందని, కోతుల పునరుత్పత్తి నిలుపుదల కేంద్రాన్ని జిల్లాకొకటి ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు సోలార్ పెన్సింగ్ కింద 50 శాతం రాయితీ ఇవ్వాలని, విత్తన రాయితీ కనుమరుగై పోయిందని తెలిపారు. పచ్చిరొట్ట విత్తనాలు జనుము, జీలుగ విత్తనాలు ఉచితంగా అందించాలన్నారు. ప్రస్తుతం యూరియా అందుబాటులో లేదని, యూరియాకు సంబంధించిన యాప్ను బ్లాక్ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, నాయకులు గోపి రాజిరెడ్డి, కొయ్యడి మహిపాల్రెడ్డి, ఎనగందుల ఉదయశ్రీ, కౌన్సిలర్లు రాకేశ్నాయక్, సర్పంచ్ గుమ్మడి సంతోష్, బత్తినిభూమన్న, నాగరాజు, మహేశ్, పొన్నం శ్రీకాంత్, హరీశ్రావు, మండ రమేశ్ పాల్గొన్నారు. -
ప్రతీ ఇంటికి యోగా
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ద్వారా మేము ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలని సంకల్పించాం. ప్రతీ ఒక్కరు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి. కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడం మాకు గర్వకారణం. – నాగిరెడ్డి సిద్దారెడ్డి, యోగా సంఘం జిల్లా అధ్యక్షులు యోగా అనేది అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధనం. శరీరానికే కాదు.. మనస్సుకు కూడా వ్యాయామం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. సరైన పద్ధతిలో నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. – మల్లిక, యోగా కోచ్ -
సొంతింటి కల.. నెరవేర్చేలా..
సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించింది. వివిధ కారణాలతో అప్పుడు పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. వాటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రద్దుచేసిన వాటిని మిగతా పేదలకు కేటాయించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికితోడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రతీ నియోజకవర్గానికి మరోరెండు వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సన్నద్ధం అర్హులైన లబ్ధిదారుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటినుంచి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం మొదలైన స్వల్పవ్యవధిలోనే నిధులు మంజూరై, గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం. దీనికితోడు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేసి, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు వంటి వసతులు కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన వాటిల్లో అనర్హులు ఉంటే తొలగించి, అర్హులకు కేటాయించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అనేకఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల ఫలించనుంది. పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రెండోవిడతలో 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు శరవేగంగా సాగుతున్న ‘ఇందిరమ్మ’ నిర్మాణాలు జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల గృహ ప్రవేశాలు -
తెలుగు అంకెల దండ
1=1 ఒకటి 10¹ = 10 పది 10² = 100 వంద 10³ = 1000 వేయి 104 = 10000 పదివేలు 105 = 100000 లక్ష 106 = 1000000 పది లక్షలు 107 = 10000000 కోటి 108 = 100000000 పది కోట్లు 109 = 1000000000 వంద కోట్లు 1010 = 10000000000 అర్భుదం 10¹¹ = 100000000000 న్యర్భుదం 10¹² = 1000000000000 ఖర్వం 10¹³ = 10000000000000 మహా ఖర్వం 1014 = 100000000000000 పద్మం 1015 = 1000000000000000 మహాపద్మం 1016 = 10000000000000000 క్షోని 1017 = 100000000000000000 మహాక్షోనీ 1018 = 1000000000000000000 శంఖం 1019 = 10000000000000000000 మహా శంఖం 1020 = 100000000000000000000 క్షితి 10²¹ = 1000000000000000000000 మహా క్షితి 10²² = 10000000000000000000000 క్షోభం 10²³ = 100000000000000000000000 మహాక్షోభం ఇలా సున్నాలు చేర్చుతూ పోతే 1024 = నిధి 1025 = మహానిధి 1026 = పరకం 1027 = పరార్థం 1028 = అనంతం 1029 = సాగరం 1030 = అవ్యయం 10³¹ = అమృతం 10³² = ఆచింత్యం 10³³ = అమేయం 1034 = భూరి 1035 = మహాభూరి 10366 = పద్మం 1037 = మహాపద్మం 1038 = ఖర్వం 1039 = మహాఖర్వం 1040= శంఖంఇలా పేర్లు ఉన్నాయి.ఒక సారి రాసి గుర్తుంచుకోండి పిల్లలు.గడప రఘుపతిరావు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. గ్రా: మర్రిగడ్డ, మండలం: చందుర్తి, జిల్లా: రాజన్న సిరిసిల్ల, 9963499282 -
బావిలో దూకి యువకుడి ఆత్మహత్య
ధర్మపురి: మనస్తాపానికి గురై ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నేరెళ్లలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులిసె గంగారాం, విమల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు నరేష్ (32) బుధవారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి విమల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో వ్యక్తి..రాయికల్: పట్టణంలోని ధనరేకుల రాజేశ్ (37) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సుధీర్రావు తెలిపారు. రాజేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అప్పు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశ్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. లత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కనిపించని గాయం
మనసులో మిగిలిన మాటలే కనిపించని గాయాలవుతాయి నవ్వుల వెనుక దాగిన బాధ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది ఎవరూ చూడని ఆ వేదన హృదయంలో అలలై ఎగసిపడుతుంది ఒక మాట గుచ్చినప్పుడు గుండె లోతుల్లో ముద్రపడుతుంది కాలం గడిచినా కొన్ని జ్ఞాపకాలు గాయాన్ని మళ్లీ మేల్కొలుపుతాయి బయటకు బలంగా కనిపించినా లోపల మనసు విరిగిపోతుంది ఆత్మీయుల నిర్లక్ష్యం ఆ గాయానికి మరింత నొప్పి ఇస్తుంది ఆశలు చినిగిన ప్రతిసారి మనసు మౌనంగా రోదిస్తుంది కన్నీటి చుక్కలకే తెలుసు ఆ బాధ ఎంత లోతైనదో చెప్పలేని క్షణాలన్నీ గుండెలో గుహలై నిలిచిపోతాయి అయినా జీవితం ముందుకు నడుస్తుంది కొత్త వెలుగులను వెతుకుతూ కనిపించని గాయాలకూ ఒక రోజు మాన్పు అనే ఉదయం వస్తుంది ఆశ అనే చిన్న దీపమే మనసుకు మళ్లీ బలం ఇస్తుంది – నక్క శ్రీకర్ ఊరు: ఊటూరు మానకొండూర్ కరీంనగర్ -
ఆలయాల్లో భార్యాభర్తల దొంగతనం
● అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్లి: ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను గురువారం అరెస్ట్ చేసినట్లు సీఐ సురేష్బాబు తెలిపారు. మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన అరే శంకర్ (50), ఆయన భార్య అనూష(45) కొంతకాలంగా మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ మండలాల్లోని ఎనిమిది ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దంపతులను అరెస్ట్ చేసి వారి నుంచి 20గ్రాముల బంగారం, 1.250 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
మేము గీసిన బొమ్మలు
పేరు: చిందం విహాన్ తరగతి: యూకేజీ గ్రామం: అలుగునూర్, కరీంనగర్ పేరు: బెల్లంకొండ సహస్త్ర రెడ్డి తరగతి: 7వ తరగతి గ్రామం: నాగారం, మంథని జిల్లా: పెద్దపల్లి -
బన్నీ వేసవి యాత్ర–25
‘చిప్స్ వద్దు – నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు ముద్దు’ ఇంటి బయట బండి: బన్నీ, రామ్ చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ. తాతయ్య వాళ్లని దగ్గరకు పిలిచాడు. చుక్క, స్వప్న కూడా వచ్చారు. ‘రోజూ చిప్స్ తింటే పొట్ట నొప్పి, దగ్గు వస్తుంది. బలం ఉండదు’ అన్నాడు తాతయ్య. జేబులో నుంచి నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు. స్వప్న కొరికింది: ‘అబ్బా తాతయ్య , ఇది చాలా తియ్యగా ఉంది.’ తాతయ్య చెప్పాడు: ‘నువ్వులు ఎముకలకు బలం. బెల్లం రక్తానికి మంచిది. జలుబు రాదు.’ చుక్క అడిగింది: ‘మరి చిప్స్లో ఏముంది?’ తాతయ్య నవ్వాడు: ‘ఉప్పు, నూనె, జబ్బు.’ రామ్ అన్నాడు: ‘ఇక చిప్స్ వద్దు. నానమ్మతో లడ్డు చేయించుకుంటాను.’ తాతయ్య: ‘మన పాత తిండే మనకు మెడిసిన్. ప్యాకెట్ ఫుడ్ కాదు.’ బన్నీ అరిచాడు: ‘చిప్స్ బై బై, నువ్వుల ముద్ద హాయ్ హాయ్!’ పిల్లలకి మాట : ప్యాకెట్ తిండి రుచి కొద్దిసేపు. నానమ్మ చేతి లడ్డు జీవితాంతం ఆరోగ్యం. డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
బాలల కథ : అక్షర సేద్యం
రామాపురంలో సోమయ్య అనే మధ్య తరగతి రైతు ఉన్నాడు. అతని కుమారుడు రాజు అదే ఊరిలో ఏడోతరగతి చదువుచున్నాడు. రాజుకు చదువు అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా చదువుకుని, ఏదైనా ఉద్యోగం సాధించాలని ఆశ. సోమయ్య కు మూడు ఎకరాల పొలం ఉంది. రాజుని తనతో పాటు పొలం పనులకు తీసుకెళ్లి, ఇద్దరం పనిచేస్తూ మరో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేసి ఊరిలో మంచి రైతు గా పేరు సంపాదించి, పెద్ద ఇల్లు నిర్మించుకోవాలని సోమయ్య ఆలోచన. చదువుపై ఉన్న మమకారంతో రాజు పొలం పనులు చేయడానికి ఇష్టపడలేదు. అతన్ని ఎలాగైనా చదువు మాన్పించాలని సోమయ్య ప్రయత్నాలు చేసాడు. చదువుకోవాలనే పట్టుదలను రాజు వదిలిపెట్టలేదు.సోమయ్య కూడా పంతం వీడలేదు. తోటి విద్యార్థులు బడికి వెళ్తుంటే రాజు మనసు గాయపడింది.అమ్మానాన్నలను ఒప్పించడానికి అన్నాహారాలు మాని నిరాహారదీక్ష చేసాడు . తల్లి దండ్రుల మనసు కరిగింది కాని ఒక షరతు పెట్టారు. శ్రీప్రతి రోజూ ఉదయం రెండు గంటలు పొలం పనులు చేయాలి. సాయంత్రం ఇంటి పనులు చేయాలి.సెలవు రోజుల్లో సేద్యపు పనులు చేయాలిశ్రీ. ఇదే మంచి అవకాశమనుకుని రాజు పొలం పనులు చేసుకుంటూ, కష్ట పడి చదవడం మొదలెట్టాడు.పరీక్షల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా,చదువు పై ఉన్న మక్కువతో సంతోషంగా స్వీకరించాడు. తన తోటి పిల్లలు సెలవు రోజుల్లో సరదా ఆటలు ఆడుతున్నా,తను బాధపడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించాడు. నీతి: సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే.. – దుర్గమ్ భైతి రామునిపట్ల, సిద్దిపేట జిల్లా -
బ్యాటరీ దొంగల అరెస్ట్
జగిత్యాలక్రైం: గ్రామాల్లో ఇంటర్నెట్ కోసం టీ–ఫైబర్ అనుబంధ సంస్థ శాటిలైట్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన బ్యాటరీలు, యూపీఎస్లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. గురువారం రూరల్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. రూరల్ మండలం ధర్మా రం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి, హన్మాజీపేట, అనంతారం, గుట్రాజ్పల్లి, అంతర్గాంతోపాటు గొల్లపల్లి మండలాల్లో టీ ఫైబర్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బండ అంజయ్య, మండలి రవి, చేవెల్ల నరేశ్ 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లను దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.4.52 లక్షలు ఉంటుంది. దొంగిలించిన బ్యాటరీలను విక్రయించేందుకు గురువారం వెళ్లూ.. రూరల్ ఎస్సై ఉమాసాగర్ ధరూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలో పట్టుబడ్డారు. నిందితుల నుంచి 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఉమాసాగర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మహేందర్ను సీఐ అభినందించారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలింపు 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు స్వాధీనం -
తేలు బుద్ధి
అడవిలో ఒకతేలు ఆకలితో పడుకున్నది కదలలేక మెదలలేక కన్నీరును ఒలుకుతుండే అది చూసిన ఓ కోడి ఆహారం దొరికిందని పరుగు పరుగున అచటి కొచ్చి ముక్కుతోని పొడవ చూసే ప్రాణ భయంతో తేలు కోడి బావ కోడి బావ ఒక్కమాట చెబుతాను ఆలకించుమని కోరే నాకు ఆరోగ్యం బాగులేదు ఆహారం అసలు దొరకలేదు నాతో స్నేహంగా ఉండి చూడు హాని చేయబోను ఎవరికెపుడు తేలు మాట నమ్మి కోడి తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం తెచ్చి ఇచ్చి ఆతిథ్యం మంచి గిచ్చి చెలిమి తోడ వుండమంటూ సలహాలను మెండు గిచ్చే తనకు దోస్తు దొరికాడని సంబరపడి పోయే కోడి పొద్దు పొద్దు గాలనే కొక్కోర కో అంటూ లేచి తన పిల్లలను చూడ మంటూ బయటకు పోయే తల్లి కోడి బలం పుంజుకున్న తేలు కపట బుద్ధి దాచుకుంటూ కత్తెర చేతులు చాచి కస్సు బుస్సుమని లేచే అమ్మదోస్తు ఈ తేలని ప్రేమగ దరి చేరినాయి పిల్ల కోళ్లు తన తోక కొండి లేపి మరీ చిటుకు చిటుకున కుట్టే తేలు లబో దిబోమంటూ బుజ్జి బుజ్జి పిల్ల కోళ్లు తల్లి చెంతకు పరుగు తీసి బోరుమంటూ ఏడ్వసాగే తేలు బుద్ధి తెలుసుకున్న తల్లికోడి కోపంతో రయ్యిన ఉరుకురికి వచ్చి తెలుపైన ఎగిరి దూకే తన ముక్కుతో తేలును ముక్కలు ముక్కలుగ చీల్చి స్నేహ ద్రోహి దేహాన్ని కసితీరా ఆరగించే... ఎప్పుడైనా ఈ జగాన బుద్ధిలేని ప్రబుద్ధులతో జాగ్రత్తగా మెదలమంటూ తల్లికోడి హితము చెప్పే..! డా.కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత ఖమ్మం జిల్లా -
తాగునీటికి తండ్లాట!
కోరుట్ల: మండుతున్న ఎండలకు భూగర్భజలాలు రోజురోజుకూ ఇంకిపోతుడటంతో కోరుట్ల పట్టణంలోని సగం వార్డుల్లో తాగునీటికి జనం తిప్పలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగా సరఫరా కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. మరికొన్ని రోజులు వర్షం కురవకుంటే తాగునీటి ఎద్దడి అన్ని ప్రాంతాలకు విస్తరించి జనం మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు తగ్గితేనే.. 15 రోజులుగా వేసవి తీవ్రత పెరిగిపోతోంది. వారంరోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో బోర్లు, బావులతోపాటు తాగునీటి వనరుల్లో నీరు ఇంకిపోతోంది. కోరుట్ల పట్టణానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న తాళ్ల చెరువులోనూ నీటిమట్టం తగ్గిపోయింది. డబ్బా గ్రామం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరాలోనూ లెక్కలేని ఆటంకాలు చోటు చేసుకుంటున్నాయి. నీటి సరఫరా పైప్లైన్లు చాలా చోట్ల లీక్ కావడం, పగిలిపోవడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కోరుట్ల పట్టణంలోని కొన్ని వార్డుల్లో భగీరథ పైప్లైన్ లేకపోవడం నీటి సమస్యకు కారణమవుతోంది. ప్రస్తుతం పట్టణంలోని భీమునిదుబ్బ, నక్కలగుట్ట, బాగ్యనగర్, ప్రకాశం రోడ్, హాజిపురా ఏరియాల్లో చాలాచోట్ల బోర్లు ఇంకిపోయి నీటికోసం జనం ఇబ్బంది పడుతున్నారు. మూడు ట్యాంకర్లతో సరఫరా పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు మూడు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా.. అవి ఎటూ సరిపోవడం లేదు. 10 వార్డుల్లో నీటి సమస్య తీవ్రం కాగా.. మూడు ట్యాంకర్లతో నీటి సరఫరా వీలు కావడం లేదు. ఫలితంగా రోజుకు కొన్ని వార్డుల చొప్పున నీరు అందించాల్సి వస్తోంది. అదనపు ట్యాంకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముండగా ఈ విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఇబ్బందిగా మారింది. కోరుట్లలో నీటి కటకట సగం వార్డుల్లో తిప్పలే.. ట్యాంకర్లతో సరఫరా -
ఘనంగా సంకటహర చతుర్థి వేడుకలు
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీమహాగణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేదపండితులు పాలెపు ప్రవీణ్కుమార్ మంత్రోచ్ఛరణలతో స్వామి వా రికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్లాస్టిక్ నియంత్రణకు సహకరించాలిజగిత్యాలరూరల్: ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలు సహకరించాలని జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట, హస్నాబాద్ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. పారిశుధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలు ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించేందుకు నడుం బిగించాలని పేర్కొన్నారు. ప్రజలు రక్షిత మంచినీటిని తీసుకోవాలన్నారు. సర్పంచులు గంగాధర్, గంగవ్వ, ఎంపీడీవో విజయలక్ష్మీ, ఎంపీవో వాసవి, మండల వ్యవసాయాధికారి వినీల పాల్గొన్నారు. డీఎఫ్వో కార్యాలయంలో ఏసీబీ తనిఖీలుజగిత్యాలక్రైం: కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ అధికారి గులాం మొయినోద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. ఏసీబీ సీఐ పొన్నం చందర్ జిల్లా అటవీశాఖ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ కేసు విషయమై ఫైల్తోపాటు, డీఎఫ్వో నుంచి పలు వివరాలు సేకరించారు. ఏసీబీకి పట్టుబడిన ఎఫ్ఆర్వో ఈ కేసులో డీఎఫ్వో పేరు కూడా అధికారులకు తెలిపినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతకు సహకరించాలికథలాపూర్: గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని డీపీవో మదన్మోహన్ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని తాండ్య్రాలలో గ్రామసభ నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని, వర్షాకాలంలో ఇళ్ల సమీపంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. దోమలు వృద్ధి చెంది అనారోగ్యం బారిన పడే ప్రమాదముందన్నారు. సర్పంచ్ శివానీ, ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ రమేశ్, ఎంఈవో శ్రీనివాస్, ఏవో యోగితా, ఐసీడీఎస్ సూపర్వైజర్ స్రవంతి, ఏపీఎం చిన్నరాజయ్య పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలిజగిత్యాలక్రైం:రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భా గంగా ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు అ న్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతపై గ్రామస్తులకు వివరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ వినియోగించాలన్నారు. యువత మత్తుపదార్థాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు రూ.50వేల సాయం
రాయికల్: బాసర ట్రిపుల్ ఐటీలో సీ టు సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు న్యాతగిరి సంజన, రాజ్దీపక్కు దుబా య్ లోని ఎమ్రెడ్స్ తెలంగాణ సంఘం ఫౌండర్ పీచర్ల కిరణ్కుమార్ ఆధ్వర్యంలో రూ.50 వేలు సమకూర్చారు. నిరుపేద విద్యార్థులను ఆదుకోవాలని ఈ నెల ఒకటిన సరస్వతి పుత్రులకు లేని లక్ష్మీకటాక్షం శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఈటీసీఏ అధ్యక్షుడు చీటి జగదీశ్వర్రావు, కో–ఆర్డినేటర్ పునుగోటి సురేందర్రావు స్పందించారు. బుధవారం గ్రామస్తుల సమక్షంలో రూ.50 వేలు అందించారు. విద్యార్థులకు ఇప్పటివరకు రూ.1.30 లక్షలు సమకూరాయి. సర్పంచ్ గుర్రం భావన, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, నా యకులు అన్నవేని వేణు, జక్కుల ప్రసాద్, మహేశ్వర్రావు, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, గంగాధర్, ప్రసా ద్, లక్ష్మీనారాయణ, శంకర్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కుల సంఘాల అభివృద్ధికి కృషి
కథలాపూర్: కుల సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బొమ్మెన, గంభీర్పూర్, దూలూర్, తాండ్య్రాలలో బుధవారం పర్యటించారు. కులసంఘాల భవనాలు, అభివృద్ధి పనులకు రూ.1.40కోట్ల ప్రొసీడింగ్ కాపీలు అందించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు చెదలు సత్యనారాయణ, పిడుగు తిరుపతిరెడ్డి, పంజాల సత్యనారాయణ, భూపెల్లి రాజగంగారాం, ఉరుమల్ల కృష్ణాచారి, గోపిడి ధనుంజయ్రెడ్డి, లింగంగౌడ్, పానుగంటి రాజు తదితరులు పాల్గొన్నారు. సైక్లింగ్తో ఆరోగ్యంమల్యాల: సైక్లింగ్తో శారీరక, మానసిక ఆరోగ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి పాలనలో భాగంగా బుధవారం మండలంలోని కొండగట్టు అర్బన్ ఫారెస్టు పార్క్లో అటవీశాఖ అధికారులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడేశారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ సైకిల్ పోటీలతో యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందన్నారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. ఎఫ్ఆర్ఓ గులామోద్దీన్, డీఆర్వో శ్రీనివాస్, బి.దేవదాస్, ఎం.సుబ్బారావు, శ్రీకాంత్, ఫారెస్టు బీట్ ఆఫీసర్స్ ప్రవీణ్కుమార్, అశ్విని, ఎండీ.ఫిరోజ్, జి.రాజేశం పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యమల్యాల: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో రాము అన్నారు. మండలంలోని రాజారం గ్రామంలో విద్యార్థులతో కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం అందిస్తున్నామని, అనుభవం, అర్హత గల ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం విజయ్, ఎంఈవో నీలగిరి జయసింహారావు, ఉప సర్పంచ్ కె.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు అశోక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంజన్న సన్నిధిలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ పూజలుమల్యాల: రాష్ట్ర యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ బుధవారం కొండగ ట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి తీర్థ, ప్రసాదాలు అందించారు. నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణజగిత్యాల: ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయ నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. బుధవారం కొత్తబస్టాండ్లోని కార్మికుల అడ్డా వద్ద క్షయవ్యాధి నిర్ధారణ, రక్త పరీక్షలు నిర్వహించారు. రాత్రి సమయంలో జ్వరం, తదితర లక్షణాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు శ్రీనివాస్, ఎస్టీఎస్ శ్రీనివాస్, కౌన్సిలర్ రవీందర్, ప్రాజెక్ట్ మేనేజర్ శరత్, నర్సింగ్ ఆఫీసర్ అనూష తదితరులు పాల్గొన్నారు. -
ఫౌంటేన్లతో అందం
ఫౌంటేన్లను బాగుచేయాలి. బొమ్మలు, ఇతరత్రా లేకపోవడంతో కళావిహీనంగా మారాయి. వివిధ రకాల బొమ్మలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జంక్షన్లు, డివైడర్ల మధ్య నీరు పోస్తుంటే చల్ల దనంగా ఉంటుంది. – మచ్చ శంకర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిత్యం పనిచేయాలి ఫౌంటేన్లు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. కొత్తబస్టాండ్, పాతబస్టాండ్లో అత్యధికంగా జనసంచారం ఉంటుంది. నిత్యం వందలాది వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. ఆహ్లాదం లేకపోవడం ఇబ్బందిగా మారింది. – వీరబత్తిని అనిల్కుమార్, బీజేపీ నాయకుడు -
ఆహ్లాదం.. అందనంతదూరం
జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంగా ఏర్పడి 9 ఏళ్లు గడుస్తోంది. కానీ అభివృద్ధి మాత్రం నత్తనడకన సాగుతోంది. గతంలో సుందరీకరణ పేరుతో డివైడర్ల మధ్య మొక్కలు నాటారు. జంక్షన్ల వద్ద అత్యంత ఖరీదైన బొమ్మలు, లాన్ నిర్మించారు. కానీ.. అవన్నీ కొద్దిరోజులు మాత్రమే పనిచేశాయి. గత పాలకవర్గంగానీ, అధికారులు గానీ పట్టించుకోకపోవడంతో జంక్షన్లు కళావిహీనంగా మారుతున్నాయి. బొమ్మలు దుమ్ముపట్టాయి. లాన్ ఎండిపోయింది. కొత్త పాలకవర్గంపైనే ఆశలు కొత్త పాలకవర్గం పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెబుతున్నా.. పట్టణ సుందరీకరణపై పట్టింపులేదని ఆరోపణలున్నాయి. జంక్షన్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేయకపోవడంతో పనిచేయడం లేదు. ప్రజాధనం దుర్వినియోగం జిల్లాకేంద్రానికి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్లు, జంక్షన్లు పచ్చగా ఉండాలన్న ఉద్దేశంతో సుందరీకరణ పేరుతో గతంలో రూ.35లక్షలతో బొమ్మలు, లాన్, ఇతరత్రా ఏర్పాట్లు చేశారు. నెమలి, కొంగలు, మనిషి ఆకారం పోలే బొమ్మలు పెట్టించారు. కనీసం రెండు నెలలైనా ఫౌంటేన్ల నిర్వహణ సాగలేదు. రూ.35 లక్షల నిధులు వృథా అయ్యాయి. ఫౌంటేన్లు పనిచేయాలంటే మోటార్లు ఉండాలి. అవి చెడిపోవడంతో బాగు చేసే విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు మరమ్మతు చేపడితే రెండు రోజులు మాత్రమే పనిచేస్తున్నాయి. మొక్కుబడిగా ట్యాంకర్ల ద్వారా నీరు పడుతున్నారుగా తప్ప మోటార్లు బాగుచేసి ఫౌంటేన్ పనిచేసేలా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. జిల్లాకేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి బల్దియాల్లో జంక్షన్ల ఊసే ఎత్తడం లేదు. అక్కడ కూడా జంక్షన్లు ఏర్పాటు చేసేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఖర్జూర చెట్ల స్థానంలో ఈత చెట్లు గత పాలకవర్గం హయాంలో కొత్తబస్టాండ్ నుంచి పార్క్ వరకు డివైడర్ల మధ్య సుందరీకరణ పేరుతో దాదాపు రూ.12 లక్షలు వెచ్చించి ఖర్జూర మొక్కలు నాటారు. వాస్తవానికి అవి ఈత చెట్లు. ఇది పలు విమర్శలకు దారితీసింది. ఖర్జూర మొక్కల స్థానంలో ఈత మొక్కలు తెప్పించారని, వాటి ఖరీదు తక్కువగా ఉంటుందని, ఇందులో అవినీతికి పాల్పడ్డారని అప్పటి పాలకవర్గంపై విమర్శలు చేస్తున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని పాతస్టాండ్ చౌరస్తా. ఇక్కడి జంక్షన్ వద్ద సుందరీకరణ పేరిట అందమైన బొమ్మలు, లాన్, ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. కానీ.. ఇప్పటివరకు పనిచేయడం లేదు. వేసవి కావడంతో పది రోజుల క్రితం మరమ్మతు చేపట్టారు. ఫౌంటేన్ ఒకరోజు మాత్రమే నీరు పోసింది. సుందరీకరణ చేపడతామన్న అధికారులు, ప్రజాప్రతినిధులు వీటిని గాలికొదిలేశారు. లాన్ ఎండిపోయింది. బొమ్మలు శిథిలావస్థకు చేరాయి. -
కళాశాల అందుబాటులో ఉండాలి
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాసంస్థల సంఖ్య పెంచాలి. మండలంలో ఎనిమిది గ్రామాలు.. భీమారం మండలంలోని నాలుగు గ్రామాలకు తాండ్య్రాల చౌరస్తా కూడలిగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు రవాణాపరంగా సౌకర్యంగా ఉంటుంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపాలి. – మామిడిపెల్లి ప్రవీణ్, యువకుడు, తాండ్య్రాల ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలి మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. బాలికలు ఇంటర్, డిగ్రీ చదువును మధ్యలోనే మానేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. గ్రామాల నుంచి విద్యాసంస్థల వరకు ప్రత్యేక వాహనాల సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలి. అప్పుడే గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్య చేరువవుతుంది. – అందె రాణి, వార్డుసభ్యురాలు, చింతకుంట -
పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
జగిత్యాల: గోదావరి పుష్కరాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. పుష్కరఘాట్లను విస్తరించడంతోపాటు, అవసరమైన చోట్ల కొత్తవి నిర్మించాలన్నారు. ధర్మపురి ఆలయం సమీపంలో హెలిప్యాడ్, రహదారులు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కోటిలింగాలు, ధర్మపురిలో పుష్కరాల కోసం ప్రభుత్వం మొదటి విడత రూ.117 కోట్లు విడుదల చేసిందని, ఇరిగేషన్ శాఖ ద్వారా రూ.16.10 కోట్లు, పంచాయతీ శాఖ ద్వారా రూ.8 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు, మొత్తం రూ.34.10 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముందుగా కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రి వీరేంద్ర నాథ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. రాష్ట్రంలో 181 హాస్టళ్లు అద్దె ఇళ్లలో నిర్వహిస్తున్నామని, పక్కా భవనాలకు నిధులు కేటాయించాలని కోరారు. రూ.వంద కోట్లతో పుష్కర పనులు వెల్గటూర్: గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం తొలి విడతగా రూ.100 కోట్లు విడుదల చేసిందని మంత్రి అడ్లూరి తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలిసి కోటిలింగాల వద్ద పుష్కర ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. వెల్గటూర్ నుంచి రాజక్కపల్లె వరకు బైపాస్ నిర్మించాలన్నారు. అయ్యప్ప స్వామి ఆలయం వద్ద బోటింగ్ సౌకర్యం కల్పించాలని, కోటిలింగాల నుంచి పాశిగామ వరకు రోడ్డు నిర్మించాలని సూచించారు. ఏడాది ముందు నుంచే పనులు పూర్తి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్రెడ్డి, నాయకులు ప్రతాప్రావు, మురళి, ఉదయ్, శ్రీకాంత్రావు, మేరుగు నరేష్, పూదరి రమేష్, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్య.. పేదలకు మిథ్య
కథలాపూర్: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు అందుబాటులో లేక.. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలా మారుతోంది. పదోతరగతి పూర్తి చేసిన తర్వాత పైచదువులకు దూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం ఆర్థికంగా భారమవుతోంది. సరిపడా రవాణా సదుపాయం లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. ఫలితంగా చాలామంది ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. కథలాపూర్ మండలంలో ఏటా పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు.. ఇంటర్, డిగ్రీ చదువులకు వెళ్లేవారి సంఖ్యకు చాలా తేడా కనిపిస్తోంది. ఏటా 500కు పైగా టెన్త్ విద్యార్థులు.. మండలంలో 19 గ్రామాలున్నాయి. వీటి పరిధిలో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. ఏటా 500కు పైగా విద్యార్థులు పదోతరగతి పాస్ అవుతున్నారు. గతేడాది 511 మంది విద్యార్థుల్లో బాలురు 240 మంది, బాలికలు 271 మంది ఉన్నారు. అయితే కథలాపూర్లో ఒక్కటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. ఇందులో ఇంటర్లో 150 మందికి మాత్రమే అడ్మిషన్ ఇస్తున్నారు. మోడల్ స్కూల్లో సుమారు 120 మంది విద్యార్థులు ఇంటర్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం, ఆటోలు, జీపులకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి రావడంతో విద్యార్థినులు ఇంటర్లో చేరేందుకు భయపడుతున్నారు. ఫలితంగా ఇంటర్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతోనూ పై చదువులకు దూరంలో ఉన్న కోరుట్ల, మెట్పల్లి పట్టణాలకు వెళాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు దూరభారం మండలకేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో తుర్తి, పోతారం, ఇప్పపెల్లి, అంబారిపేట గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల విద్యార్థులు ఉదయం జూనియర్ కళాశాలకు చేరుకోవడం.. సాయంత్రం ఇంటికి చేరడానికి నరకయాతన పడుతున్నారు. మారుమూల గ్రామాలైన చింతకుంట, రాజారాంతండా, పెగ్గెర్ల, ఊట్పెల్లి, భూషణరావుపేట గ్రామాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతీరోజు ఆటోల్లో ఒకొక్కరు రూ. 60 నుంచి రూ.80 వరకు ఖర్చు చేయాల్సి రావడం విద్యార్థులకు భారంగా మారుతోంది. మండలంలో పలు గ్రామాలకు కూడలిగా ఉన్న తాండ్య్రాల చౌరస్తా, గంభీర్పూర్ గ్రామాల్లో ఏదో ఒకచోట కొత్తగా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కథలాపూర్లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే మండల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువవుతుందని విద్యాభిమానులు అంటున్నారు. అధికారులు చొరవ చూపి కళాశాలల సమయానికి అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులో ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్న విద్యార్థులుఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణిస్తున్న విద్యార్థులు(ఫైల్) -
ఏమో.. తెలియదు సార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు మాస్టర్మైండ్ సుబోధ్ సింగ్ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకి పాల్పడిన సుబోధ్ గ్యాంగ్.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్సింగ్గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్ నుంచి సుబోధ్ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్సింగ్ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. పోలీసులకు సవాల్.. వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్గా మారింది. అయినప్పటికీ కరీంనగర్ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్ కర్మాకర్, రావిశ్కుమార్, మెహతాబ్ఖాన్ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్ సింగ్ను మాస్టర్మైండ్గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్ వెళ్లారు. అక్కడ సుబోధ్ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది. ఆరు కోర్టులు.. అనేక సవాళ్లు.. సుబోధ్సింగ్ నెట్వర్క్లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్ పోలీసులు వేసిన ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ను సవాలు చేస్తూ సుబోద్ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూ పిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సు బోధ్సింగ్ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్ను తరలించడంలో సీపీ గౌస్ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయని పుణులు, బిహార్కు చెందిన పలువురు ఐపీఎస్ ఆఫీ సర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు. బేడీలు తీసి విమానంలోకి.. సుబోధ్ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్క్రా్ట్గా సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్లో దిగాక సీపీ గౌస్ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
జగిత్యాల
40.0/30.07గరిష్టం/కనిష్టంపెద్దమ్మతల్లికి బోనాలుకథలాపూర్: మండలంలోని బొమ్మెనలో పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ద్యావతుల విన్యాసాలు, డప్పుల చప్పుళ్లు ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026 -
మామిడికి మరక
కోరుట్ల: మామిడి రైతుల ఆశలను నల్లమచ్చ మరక ముంచేసింది. ఫలితంగా ఈ సీజన్లో మామిడి రైతులు, స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోయాల్సిన దుస్థితి వచ్చింది. మామిడికి ప్రత్యేకమైన బ్రాండ్గా గుర్తింపు ఉన్న జిల్లాలో ఈయేడు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వేల టన్నులు రావాల్సిన దిగుబడి సగానికి దిగజారింది. తెగుళ్లతో మార్కెట్లోనూ ధర పలకకపోవడం మరో దెబ్బగా మారింది. పూత.. కాత దశలోనే మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, మల్యాల, రాయికల్ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 17వేల ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి. ఈసారి పూత దశలోనే తేనెమంచు తెగులు వ్యాపించడతో చాలామేర పూత రాలిపోయింది. సగం వరకు పూత రాలిపోయి కాయగా మారలేకపోయింది. ఎకరాకు 4 నుంచి 6 టన్నుల కాయ వచ్చే పరిస్థితి నుంచి 2 నుంచి 3 టన్నులకు పడిపోయింది. మళ్లీ పిందె దశలో మసి మంగు మచ్చ తెగులు విస్తరించింది. ఈ తెగులు నుంచి కాయను రక్షించేందుకు కాయలకు తొడుగులు వేయాల్సి ఉండగా.. ఆ దిశలో రైతులను అప్రమత్తం చేసేవారు లేకుండా పోయారు. సబ్సిడీ కింద ప్రభుత్వం అందించే తొడుగులను కాయలకు అమర్చడంలో జరిగిన నిర్లక్ష్యం ఫలితంగా అనేక తోటల్లో నల్లమచ్చ తెగులు విస్తరించింది. కనిపించని ఇతర ప్రాంతాల వ్యాపారులు జగిత్యాల మామిడి బ్రాండ్ ఇమేజ్ ఫలితంగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ టోకు వ్యాపారులు సీజన్ మొదలు కాగానే వ్యాపారం కోసం వచ్చారు. అయితే నల్లమచ్చలతో కూడిన మామిడి కాయలు రావడంతో నాణ్యత సరిగా లేదని చెప్పి సదరు వ్యాపారులు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫలితంగా ఈ ప్రాంతంలో మామిడి తోటలను గుత్తకు తీసుకున్న వ్యాపారులు పండ్లు కొనుగోలు చేసే వారు లేక తీవ్ర నష్టాలకు గురయ్యారు. అదే సమయంలో గుత్తదారులు రైతులకు ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించలేకపోయారు. మొత్తంగా రైతులు అమ్ముడు కాని పండ్లను నిల్వ ఉంచలేక.. కుళ్లిపోయేవాటిని కాపాడలేక తెగనమ్ముకుంటున్నారు. కిలో రూ.5 నుంచి రూ.15లోపే విక్రయిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ సీజన్లో రైతులతో పాటు మామిడి పంటను నమ్ముకున్న స్థానిక వ్యాపారులు తీవ్ర నష్టపాలయ్యారు. కోరుట్లలో మామిడి వ్యాపారుల వద్ద నిల్వ ఉన్న మామిడి కాయలు మామిడిపై నల్లమచ్చలు -
జగిత్యాల
7బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఈ ఏడాది మార్చి 6న ప్రారంభించిన 99రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక జిల్లాలో విజయవంతంగా సాగుతోందని మంత్రి న్నారు. పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డుసేఫ్టీ,సంక్షేమం, పిల్లల భద్ర త, రైతు సంక్షేమం, విద్య వంటి అంశాలు చేపడుతున్నామని వివరించారు. మహిళా ఆర్థిక సాధికారతకు కృషి ఇందిరా మహిళాశక్తి కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.783.70 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, రూ.793.74 కోట్లు మాఫీ చేశామన్నారు. సీ్త్రనిధి ద్వారా మహిళాసంఘాలకు రూ.80 కోట్లు ఇచ్చామన్నారు. ఈ ఏడాది ధాన్యం ఎక్కువగా పండిందని, అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నామని, రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. సమైక్య భవనాల ఏర్పాటు మహిళా సంఘాల అభివృద్ధికి రూ.5 కోట్లతో సమైక్య భవనా లు ఏర్పాటు చేసి, 1,18,448 యూనిఫాం కుట్టించే బాధ్యత ఇచ్చామని తెలిపారు. మహాలక్ష్మీ పథకాన్ని 7.69 లక్షల మంది సద్వినియోగం చేసుకున్నారని, వారికి రూ.318.99 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. రూ.500 సబ్సిడీతో 1,98,417 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశామన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. 2,10,376 విద్యుత్ కనెక్షన్లకు రూ.167.11కోట్లు చెల్లించామని వివరించారు. వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని 13 వేల మందికి రూ.36.23 కోట్లు అందించామన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో 1065 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 11,758 మంది గర్భిణులు, బాలింతలు 30,282తోపాటు 14,102 మంది పిల్లలకు నాణ్యతా ప్రమాణాలతో పోషకాహారం అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు రిట్రో మోటా ర్ వాహనాలు, ల్యాప్ టాప్లు, బ్యాటరీ ఆపరేటెడ్ వీల్చైర్లు, స్మార్ట్ ఫోన్లు, హైబ్రిడ్ వీల్చైర్లు వంద శాతం సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. వృద్ధుల సంక్షేమానికి 50 పడకల సదనాన్ని రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించామన్నారు. అర్హులందరికీ ఇళ్లు జిల్లాలో 10,860 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా.. 7,745 మంది నిర్మాణానికి ముందుకొచ్చారని, ఇందులో 1274 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 45,617 కొత్త రేషన్కార్డులు మంజూరు చేశామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా 3,52,072 కుటుంబాలకు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేశామన్నారు. మైనార్టీల సంక్షేమానికి.. మైనార్టీల సంక్షేమంలో భాగంగా మహిళలకు 598 కుట్టుమిషన్లు, 150 మందికి స్కిల్ డెవలప్మెంట్, ఇందిరమ్మ మైనార్టీ మహిళ యోజన కింద 76 మందికి రూ.38 లక్షలు మంజూరు చేశామన్నారు. షాదీముబారక్ కింద రూ.5.56 కోట్లు ఇచ్చామన్నారు. పకడ్బందీగా భూభారతి భూభారతి చట్టాన్ని పకడ్బందీగా చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే నక్ష లేని 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేపట్టామన్నారు. అనంతరం 735 స్వయం సహాయక సంఘాలకు రూ.73.50 కోట్లు, మెప్మా ఆధ్వర్యంలో 46 స్వయం సహాయక సంఘాలకు రూ.6.09కోట్ల చెక్ అందించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ఎస్పీ అశోక్కుమార్, గ్రంథాలయ సంస్థచైర్మన్ సంగనభట్ల దినేశ్, ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్హులందరికీ పథకాలుజగిత్యాల: రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ముందుకెళ్తున్నారని మైనారిటీ సంక్షేమ శాఖ, పబ్లిక్ ఎంటర్పైజెస్ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని, ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే లక్ష్యమని తెలిపారు. విద్యారంగానికి పెద్దపీట విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రీప్రైమరి నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభిస్తున్నామన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేశామన్నారు. షెడ్యూల్ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతిగృహాలను నిర్వహించడంతోపాటు.. వారికి కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు.రైతును రాజు చేస్తాం.. రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు భరోసా పథకం కింద 2.30లక్షల మందికి 166.16 కోట్లు వారివారి ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు సలహాలు అందించేందుకు శాస్త్రవేత్తలచే అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని, జిల్లాకేంద్ర ఆస్పత్రిలో 5,056 ప్రసవాలు కాగా.. అందులో 1384 సాధారణ, 3,672 సిజేరియన్ ఉన్నట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 1,07,065 మందికి రూ.49.21కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు చేశామన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు
జగిత్యాల క్రైం: తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ మాట్లాడుతూ.. శాంతియుత వాతావరణంలోనే సమాజ అభివృద్ధి సాధ్యమన్నారు. సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉంటూ.. సాధారణ ప్రజలకు భరోసా కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం అమరువీరుల స్తూపానికి నివాళి అర్పించారు. డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు పాల్గొన్నారు. కొండగట్టులో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఆర్టీవోలు శ్రీనివాస్, రవీంద్రకుమార్, రంజిత్, ఎంవీఐలు మార్గం రవీందర్, కోల రవీందర్, కిశోర్ రెడ్డి, అభిలాష్ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. దరఖాస్తులు ఆహ్వానంజగిత్యాల: జిల్లాలో కొత్తగా ప్రారంభించనున్న 69 ప్రీప్రైమరీ పాఠశాలల్లో టీచర్లు, ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. 69 టీచర్లు, 69 ఆయా పోస్టులున్నాయని, టీచర్ పోస్టులకు ఇంటర్ అర్హత అని, నెలకు రూ.8వేల వేతనం, ఆయా పోస్టులకు ఏడో తరగతి అర్హత అని, నెలకు రూ.6వేల వేతనం ఉంటుందని తెలిపారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు మాత్రమే అర్హులని, ఈనెల ఆరో తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ఈనెల 7, 8 తేదీల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆశ నిరాశజగిత్యాల: పీఆర్సీ, పెండింగ్ డీఏలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయకపోవడంతో ఉద్యోగుల ఆశ నిరాశ అయిందని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ అన్నారు. సంఘం కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల త్యాగాల ఫలితమే రాష్ట్రమని, నిరుద్యోగం దూరమవుతుందని, జీవితాలు మెరుగుపడతాయని ఆశపడితే నిరాశే ఎదురైందన్నారు. మూలవేతనంలో 1.5 శాతం కోత విధించడం సరికాదన్నారు. నెల జీతంలో ఉచిత కోత విధిస్తూ ఉచిత ఆరోగ్య కార్డులని ప్రచారం చేయడం సరికాదన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్ మాట్లాడుతూ స్వయాన సీఎం పీఆర్సీ నివేదిక తెప్పించుకుని అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఉద్యోగుల సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో నాయకులు మేకల ప్రవీణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. బహ్రెయిన్లో ఆవిర్భావ వేడుకలురాయికల్: బహ్రెయిన్ ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అండాలస్ గార్డెన్లో మంగళవారం ఘ నంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రమన్నారు. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, జనరల్ సెక్రటరీలు అన్నారం సుమన్, చెన్నమనేని రాజేందర్, కార్యదర్శుల సంగేపు దేవన్న, సంకోజీ రాణాప్రతాప్, ప్రమోద్, వంశీ, రా ము, కస్తూ రి కిరణ్, నర్సింహచారి పాల్గొన్నారు. -
వసూలు చేసిన డబ్బులు వాపస్
● కొండ్రికర్లలో పెన్షన్ల మార్పిడికి వసూళ్లు మెట్పల్లిరూరల్: ‘చేయూత పెన్షన్ల మార్పిడికి డబ్బులు వసూలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి.. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ప్రక్రియ ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చేయాలి. కానీ.. మెట్పల్లి మండలం కొండ్రికర్లలో ఒక్కో పెన్షన్దారు నుంచి పంచాయతీ సిబ్బంది రూ.200 వసూలు చేశారు. ఈ వసూళ్ల వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మెట్పల్లి ఇన్చార్జి ఎంపీడీవో రామకృష్ణ ఆరా తీశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి రాజును ఆదేశించారు. మరోవైపు వసూలు చేసిన డబ్బులను కారోబార్ వినోద్ పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి తిరిగి ఇచ్చినట్లు తెలిసింది. గ్రామంలో 400కు పైగా పెన్షన్లు ఉండగా.. కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు చేయూతరాయికల్: ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన మండలంలోని భూపతిపూర్కు చెందిన న్యాతగిరి సంజన, రాజ్దీపక్కు అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రూ.30 వేలు ఆర్థిక సహాయం పంపించారు. ఈనెల ఒకటిన ‘సరస్వతి పుత్రులకు లేని లక్ష్మీ కటాక్షం’శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అసోసియేషన్ సభ్యులు రూ.30వేలు పంపించగా.. వాటిని గ్రామస్తుల సమక్షంలో విద్యార్థులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం భావన, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు ముత్యంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వర్రావు, మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, నాయకులు జక్కుల ప్రసాద్, అన్నవేని వేణు, రాము, శేఖర్, సాగర్, విష్ణు, మహేశ్, ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణి, ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, కూరగాయల సురేశ్ పాల్గొన్నారు. -
ఇక్కడ వైద్యుల్లేరు.. ప్రైవేటుకు వెళ్లండి..!
జగిత్యాల: ‘సర్కారు ఆస్పత్రిలో కార్పొరేట్కు ధీటుగా సౌకర్యాలున్నాయి.. మెరుగైన వైద్యం పొందండి..’ అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. వైద్య సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు. జగిత్యాల పట్టణానికి చెందిన గంగరాజం ఇటీవల ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి బంధువులు జిల్లాఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో వైద్యులు లేరని, ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. ఆరోగ్యశ్రీ ఉండడంతో జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ప్రైవేటు ఆస్పత్రి వేసిన బిల్లుతో ఆందోళన చెంది.. తిరిగి సర్కారు ఆస్పత్రికే చేరారు. చికిత్స చేయాల్సిన సిబ్బంది మళ్లీ పాత సమాధానమే చెప్పారు. ఇప్పుడు ఏకంగా కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గత్యంతరం లేక సదరు కుటుంబం ఓ ప్రైవేటు అంబులెన్స్ను మాట్లాడుకుని కరీంనగర్ బయల్దేరారు. అయితే జగిత్యాల శివారుకు చేరగానే అంబులెన్స్ను ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో గంగరాజం భార్య మంజుల చేయికి గాయమైంది. వెంటనే భార్యాభర్తలిద్దరినీ మళ్లీ జిల్లా ఆస్పత్రికే తీసుకొచ్చారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. ఈ విషయమై ఆస్పత్రి ఆర్ఎంవో విజయ్రెడ్డిని వివరణ కోరగా.. గాయం పెద్దది కావడంతో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారని, ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలని ఎవరికీ సూచించలేదని, ఎవరు చెప్పారో చెబితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితులను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. -
మతం పేరిట రాజకీయాలు చేస్తే ఫలితాలు శూన్యం
జగిత్యాల: మతాల పేరుతో రాజకీయాలు చేస్తే ఫలితాలు శూన్యమని, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 1969 నుంచి మొదలుకుని అనేక ఉద్యమాలు చేపట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. క్రికెటర్గా కెరీర్ ప్రారంభించి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైజింగ్ తెలంగాణ పేరుతో ముందుకు సాగుతూ మంచి పేరు తీసుకొస్తున్నారని చెప్పారు. జిల్లాలోని మైనార్టీ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ఈద్గా, ఖబ్రస్థాన్ ఏర్పాటుపై కలెక్టర్తో మాట్లాడతానన్నారు. మైనార్టీ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయికి ఎదిగేలా కృషి చేస్తానన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. అజారుద్దీన్ క్రీడాకారుడిగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది రాజకీయాల్లోకి రావడం చాలా సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మంత్రులు, ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. -
మంత్రిని కలిసిన పలువురు
జగిత్యాల/జగిత్యాలక్రైం: రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరైన మంత్రి అజారోద్దీన్ను మంగళవారం ఎస్పీ అశోక్కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. అనంతరం మంత్రి డిప్యూటీ డీఎంహెచ్వో జైపాల్రెడ్డి కుమారుడు ముస్కు సిద్దార్థ్ రెడ్డిని అభినందించారు. సిద్దార్థ్ రెడ్డి ఇటీవల జరిగిన అండర్–11 క్రికెట్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చాడు. క్రీడలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకోవాలని, అప్పుడే అద్భుతమైన ఆట తీరు కనబర్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంత్రిని పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, యాళ్ల అమర్నాథ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మల్లాపూర్ ఏడీఈకి ఉత్తమ ప్రశంసపత్రంమల్లాపూర్: రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా మంగళవారం వరంగర్లో నిర్వహించిన ఉత్సవాల్లో మల్లాపూర్ ఏడీఈ అమరేందర్కు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందించారు. ఇదే స్ఫూర్తితో సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. -
● స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో ఉమ్మడి జిల్లా ● మెరుగైన వైద్యం, విద్య మౌలిక వసతులు ● నీటిపారుదల ప్రాజెక్టులతో పెరిగిన సాగువిస్తీర్ణం ● పుష్కరకాలంలో ఉమ్మడి జిల్లాలో అనేక మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రూ.90,859 తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేది. 2013–14లో ఉమ్మడి రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం రూ.85,797 ఉండగా, నేడు పెద్దపల్లి రూ.2,31,766, కరీంనగర్ రూ.2,22,628, రాజన్న సిరిసిల్ల రూ.1,95,479, జగిత్యాల రూ.1,83,094గా నమోదైంది. పదేళ్లలో ఈ ప్రాంతాల తలసరి ఆదాయం సుమారు 2నుంచి 2.5 రెట్లు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 9లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం కలిగి ఉండేది. ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న, కందులు, పెసలు పండించేవారు. స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ వల్ల సాగునీరు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కరీంనగర్లో 3,31,252 ఎకరాలు, పెద్దపల్లిలో 2,83,876 ఎకరాలు, జగిత్యాలలో 3,74,645 ఎకరాలు, సిరిసిల్లలో 2,43,292 ఎకరాలు సాగవుతున్నాయి. మొత్తంగా 12లక్షల ఎకరాలు సాగవుతుంది. నీటి వసతి పెరగటంతో 20శాతం నుంచి 35శాతం వరకు సాగు విస్తీర్ణం పెరిగింది.స్వరాష్ట్రంలో పరిపాలన విక్రేందీకరణతో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి జిల్లా కాస్తా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలుగా మారాయి. 57 మండలాలు ప్రస్తుతం 61 మండలాలుగా విస్తరించాయి. ఐదు రెవెన్యూ డివిజన్లు 9 రెవెన్యూ డివిజన్లుగా, 6 మున్సిపాలిటీలుండగా, మరో 8 కొత్తగా ఏర్పడ్డాయి. ప్రతి జిల్లాలో కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవల కోసం హైదరాబాద్ లేదా వరంగల్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ ప్రధాన ఆసుపత్రి ప్రధాన ఆధారంగా ఉండేది. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా మెడికల్ కాలేజీల ఏర్పాటు, జిల్లా ఆసుపత్రుల అప్గ్రేడేషన్, మాతాశిశు సంరక్షణ కేంద్రాలు, డయాలసిస్ కేంద్రాల విస్తరణ, ఐసీయూ, ఎన్ఐసీయూ, పీఐసీయూ సేవల పెంపు, ఆరోగ్య శ్రీసేవల విస్తరణ, పల్లెదవాఖానాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. -
పేదింటి పిల్లలకు ఐఐటీ సీట్లు
కోరుట్ల: సరస్వతీ కటాక్షం ఉన్నా ఆర్థిక చేయూత కో సం ఎదురుచూపులు తప్పడం లేదు. కోరుట్లకు చెందిన లక్కం లక్ష్మి భర్త దుబాయ్ వెళ్లినా కుటుంబా నికి అండగా నిలవలేదు. ఫలితంగా ఇద్దరు కూతుళ్ల పోషణ భారం లక్ష్మిపైనే పడింది. నానా కష్టాలు పడి పెద్ద కూతురుకు పెళ్లి చేయగా, చిన్నకూతురు భానుజ్ఞను బీడీలు చేస్తే వచ్చిన డబ్బులతో కోరుట్ల జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదివించింది. పదో తరగతిలో ప్రతిభచాటి ఐఐటీలో సీటు సాధించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనుకున్నంత మేర లేకపోవడంతో భానుజ్ఞ ఐఐటీ చదవడానికి చేయూత కోసం ఎదురుచూస్తుంది. పాఠశాల హెచ్ఎం గంగాధర్ చొరవ తీసుకుని భానుజ్ఞ చదువుకు తాము తోడ్పాటు అందిస్తామని ఆర్థిక చేయూతకు ముందుకు రావడం గమనార్హం. మరింత మంది దాతలు సహకరిస్తే భానుజ్ఞ ఐఐటీ చదువుకు చేయూతగా నిలవాలని తల్లి వేడుకుంటుంది. అలాగే కోరుట్లలోని కల్లూర్ మోడల్ స్కూల్లో చదివిన వాసాల ప్రస్విత పదో తరగతిలో ప్రతిభ చూపి ఐఐటీలో సీటు సాధించింది. ప్రస్విత తల్లి శివ రోజువారీ పాల అమ్మకాలతో కుటుంబ పోషణ సాగిస్తున్న క్రమంలో ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నారు. -
జగిత్యాల వాసి గిన్నిస్ రికార్డు
జగిత్యాల: నాన్ స్టాప్గా కీబోర్డు వాయించి ప్రతిక్ మక్క గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సాధించాడు. జగిత్యాలకు చెందిన మక్క ప్రవీణ్–సుచరిత దంపతుల కుమారుడు ప్రతిక్. చిన్నప్పటి నుంచే కీబోర్డుపై మక్కువ పెంచుకుని పట్టు సాధించాడు. మే 31న హైదరాబాద్లోని విక్టరి ఆడిటోరియంలో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్యకారులు గంటపాటు వాయిస్తూ పాల్గొన్నారు. ఇందులో కీబోర్డు వాయించడంలో ప్రతిభచూపిన 777 మంది ఎంపిక కాగా, విశేష ప్రతిభ కనబర్చిన ప్రతిక్కు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. గతంలో సైతం ప్రతిక్ చోటు సాధించగా, మరోసారి రికార్డు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. సరస్వతీ పుత్రులకు లక్ష్మీ కటాక్షంరాయికల్(జగిత్యాల): ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పేద విద్యార్థులు మండలంలోని భూపతిపూర్కు చెందిన న్యాతగిరి సంజన, రాజ్దీపక్కు దాతలు ఆపన్నహస్తం అందించారు. సోమవారం ‘సాక్షి’లో ‘సరస్వతీ పుత్రులకు లేని లక్ష్మీకటాక్షం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. జగిత్యాల పట్టణానికి చెందిన డాక్టర్ మైత్రిరెడ్డి రూ.5 వేలు, సామాజిక సేవకురాలు బోనాల సునీత రూ.5 వేలు, యాచమనేని రాజశేఖర్రావు రూ.10 వేలు, 2012–13 పదో తరగతి విద్యార్థులు రూ.5 వేలు, కుమ్మరిపల్లికి చెందిన జూనియర్ లెక్చరర్ సిరిపురం మహేశ్ రూ.3 వేలు, మరికొంత మంది గ్రామస్తులు స్పందించి సుమారు రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందించారు. అలాగే జగిత్యాలలోని హోప్ స్వచ్ఛంద సంస్థ ఈ విద్యార్థుల చదువుకు సహకారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
వేడుకల్లో అందరూ పాల్గొనాలి
జగిత్యాల: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అందరూ హాజరుకావాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు అమరవీరుల స్తూపం, అమరవీరుల పార్క్ వద్ద నివాళులర్పించడం జరుగుతుందని, 8 గంటలకు కలెక్టరేట్లో ముఖ్య అతిథితో పతాకావిష్కరణ, గీతాలాపన, పోలీసులతో వందన సమర్పణ ఉంటుందన్నారు. 8.05 గంటలకు సభ వేదిక వద్దకు ముఖ్య అతిథి వచ్చిన అనంతరం 8.10 వరకు పోలీసు మార్చింగ్, 8.10 నుంచి 8.20 వరకు ముఖ్య అతిథి సందేశం, 8.25కు వందన సమర్పణతో ముగుస్తుందని వివరించారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలిజగిత్యాలక్రైం: ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో 16 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. అసోసియేట్ డీన్గా సురేశ్జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా డాక్టర్ జె.సురేశ్ నియమితులు కాగా, సోమవారం కళాశాలలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డాక్టర్ సురేశ్ సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, నాన్టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
వేడుకలకు ఏర్పాట్లు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. వేదికతో పాటు అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, షామియానాలు తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య, వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడిన ఈ ప్రాంతం నేడు విద్యా,వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిమిత స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలుండగా, ప్రస్తుతం కొత్తజిల్లాల వారీగా ఆధునిక వైద్యసేవలు, మెడికల్ కాలేజీలు, మాతాశిశు ఆరోగ్యకేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, కార్పొరేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, డిజిటల్ విద్యావసతులు అందుబాటులోకి వచ్చాయి. నీటిపారుదల, సాగు రంగంలో వచ్చిన కీలకమార్పులతో ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కలిగి, తలసరి ఆదాయం మెరుగుపడింది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
విద్యారంగంలో పురోగతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, గురుకుల, రెసిడెన్షియల్, పాలిటెక్నిక్ కాలేజీలు విస్తరించాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో అభివృద్ధి జరిగింది. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్కు రూ.2,821 కోట్లు మంజూరయ్యాయి. సిది పేట వరకు 75 కిలో మీటర్లు రైల్వేలైన్ పూర్తయి రైలు నడుస్తోంది. మానేరు రివర్ ఫ్రంట్ మంజూరైంది. దీనికి రూ. 610 కోట్లు నిధులు కేటాయించారు. నదిపై 3 కిలో మీటర్ల మేర ఎంఆర్ఎఫ్ను ఏర్పాటు చేసేందుకు కొంత మేర సైడ్వాల్స్ ఏర్పాటు చేశారు. మానేరు నదిపై తీగల వంతెనకు రూ. 224 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దేశంలోనే రెండో తీగల వంతెనగా కరీంనగర్కు ఐకాన్గా నిలిచింది. స్మార్ట్ సిటీగా దేశంలోని వంద నగరాలతో పాటు కరీంనగర్ను అభివృద్ధి చేశారు. కేంద్రం రూ.845 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో నగరంలో రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులు, కమాండ్కంట్రోల్ సెంటర్ వంటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కరీంనగర్కు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. దీనికి రూ. 200 కోట్లు నిధులుమంజూరయ్యాయి. మానేరు డ్యాం సమీపంలో ఐటీ టవర్ ఏ ర్పాటు చేశారు. దీనికి రూ. 25 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ గెస్ట్హౌజ్ను పాత భవనంస్థానంలో అధునాతనంగా మార్చారు. దీనికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం పాత భవనంస్థానంలో కొత్త కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేశారు. దీనికి రూ.45 కోట్లు మంజూరుచేశారు. నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో రూ.400 కోట్లతో రామగుండం మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి అప్గ్రేడ్, పెద్దపల్లి, మంథనిలో కొత్తగా మాతశిశుఆరోగ్య కేంద్రాలు, కొత్త కలెక్టరేట్, రామగుండం కమిషనరేట్, మహిళ, సైబర్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి బస్డిపో, బైపాస్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి, పార్వతి బరాజ్లు, నంది పంపుహౌజ్, గాయిత్రీ పంపుహౌజ్, మిడ్మానేరులతో ఉమ్మడి జిల్లాలో సాగునీరుకు డోకాలేకుండా పోయింది. వేములవాడలో సుమారు 166కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. మూలవాగు బ్రిడ్జి నుంచి వేములవాడ దేవస్థానం వరకు రూ.45 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు మద్దతుగా యారాన్ డిపో(నూలు) ఏర్పాటు, జిల్లాలో 11వేలకు పైగా పాత పవర్లూమ్లను ఆధునీకరించారు. 126చేనేత సహకార సంఘాలు, 1600 చిన్న పవర్లూమ్ యూనిట్లకు ప్రోత్సాహం, టెక్స్టైల్ పార్కు, గార్మెంట్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ పరిసరాల అభివృద్ధికి సుమారు రూ.76 కోట్లు, అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.35 కోట్లు పైగా నిధుల కేటాయించారు. వీటీడీఏ ఏర్పాటుతో వేములవాడ సరికొత్తగా రూపుదిద్దుకోనుంది. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, పా రామెడికల్ విద్యా అవకాశాలు పెరిగాయి. నేషనల్ హైవే–563 విస్తరణ పనులు, రాళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయ్యాయి. బసంత్నగర్ ఎయిర్పోర్టు, రామగుండం–మణుగూర్ను కలిపే కోల్కారిడార్, ఈఎస్ఐ ఆసుపత్రి, పత్తిపాక రిజర్వాయర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తదితర దీర్ఘకాలిక ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో సైతం నెరవేరకపోవడంపై ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ఐపీఎల్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కారు డ్రైవింగ్ చేయడంతో.. ఆ వాహనం బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మృతుడిని జగిత్యాలకు చెందిన అరుణ్గా గుర్తించారు.వివరాల మేరకు.. జగిత్యాలకు చెందిన నివేష్, అశ్విన్, అరుణ్.. థార్ వాహనంలో బయటకు వెళ్లారు. వీరు ముగ్గురు వాహనంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ వాహనంలో వెళ్తుండగా జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి వద్ద ప్రమాదం జరిగింది. థార్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం డ్రైవింగ్ చేస్తున్న అరుణ్ బావిలో గల్లంతు కాగా.. అతి కష్టం మీద నివేష్, అశ్విన్ ప్రాణాలతో బయటపడ్డారు.అయితే, వాహనం బావిలో పడిన తర్వాత భారీ శబ్దం రావడంతో.. గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి రూరల్ పోలీసులు, రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. గల్లంతైన అరుణ్ కోసం రెండు గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. అనంతరం, కారుతో పాటు చిక్కుకుపోయిన అరుణ్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం బయటకు తీసింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. -
ఎరువు.. ధర బరువు
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్కు ముందుగానే రసాయన ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులకు తోడు అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో.. ఆ భారాన్ని ఎరువుల కంపెనీలు రైతులపై మోపాయి. కాంప్లెక్స్ ఎరువుల బస్తా కనీసం రూ.300కు పైగా పెరిగింది. దీనికితోడు స్టాక్ లేదంటూ వ్యాపారులు మరో రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువ పెంచి విక్రయించే అవకాశం ఉంది. పెరిగిన ధరలతో వానాకాలం సీజన్లో అవసరమయ్యే ఒక్క కాంప్లెక్స్ ఎరువులకే జిల్లా రైతులపై అదనంగా రూ.6కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. డీఏపీ, యూరియాకే రాయితీ ప్రస్తుతం కంపెనీలు ధరలు పెంచిన ఎరువుల్లో డీఏపీ, యూరియా లేవు. కేంద్ర ప్రభుత్వం డీఏపీ, యూరియా తయారు చేసే కంపెనీలకు రాయితీ అందిస్తుంది. ప్రస్తుతం డీఏపీ బస్తా ధర రూ.1356, యూరియా రూ.260గా ఉంది. వీటిని కొనుగోలు చేయాలంటే, కంపెనీలు, దుకాణదారులు ఇతర ఎరువులను కొనాలని లింక్ పెడుతున్నాయి. ఫలితంగా అవసరం లేకున్నా.. ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. మరోవైపు కాంప్లెక్స్ ఎరువులు ధరలు పెరగడంతో రైతులు తమ పంట అవసరాలకు కాంప్లెక్స్కు బదులు తక్కువ ధరకు దొరికే యూరియాను అధికంగా వినియోగించే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. జిల్లాకు ఎరువుల అవసరం ఇలా.. వానాకాలం సీజన్కు 88,732టన్నుల ఎరువులు అవసరం. ఇందులో ప్రస్తుతం 13,310 టన్నుల ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా ఎరువులను అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానాకాలం సీజన్లో 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ, 26,632 టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 10,653 టన్నుల కాంప్లెక్స్, 3,329 టన్నుల సింగిల్ సూపర్ పాస్ఫేట్ అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.పెరిగిన రసాయన ఎరువుల ధరలు (రూ.లలో) ఎరువు పాత ధర కొత్త ధర తేడా 14–35–14 1900 2350 450 24–24–0 2000 2300 300 10–26–26 1950 2250 300 20–20–0–13 1800 2150 350 16–16–16 1675 2050 375 15–15–15–0–9 1650 195 300 16–20–0–13 1400 1750 350 ఎన్ఓపి 1850 1975 125 ఎస్ఎపీ 615 775 160 (ఈ ధరలకు అదనంగా రవాణా చార్జీలు, గోదాముల ఖర్చులు అంటూ స్థానిక వ్యాపారులు మరింతగా వసూలు చేసే అవకాశం ఉంది) -
పంట అవశేషాలు తగలబెడితే జరిమానా
జగిత్యాలఅగ్రికల్చర్: పంట అవశేషాలు తగలబెడితే జరిమానా విధిస్తామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కొయ్యకాళ్లను కాల్చడం ద్వారా మంటలు అదుపు తప్పి సమీపంలోని ఆయిల్ పాం, మామిడి తోటలు కాలిపోతున్నాయని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, స్తంభాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణ దృష్ట్యా రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామన్నారు. బాధితుని వైద్య ఖర్చులకు రూ.1.27 లక్షల సాయంధర్మపురి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ నిరుపేదకు సాయం అందించాలని చేసిన ఫేస్బుక్ పోస్టుకు స్పందించిన ఎన్నారైలు రూ.1.27లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన ఎలిగేటి శ్రీధర్, హరిత దంపతులకు కుమారుడు సంతానం. శ్రీధర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. మూడేళ్ల క్రితం శ్రీధర్కు రెండు కిడ్నీలు చెడిపోగా.. భార్య కిడ్ని అమర్చారు. కొన్నినెలల క్రితం శ్రీధర్ గుండెజబ్బు బారిన పడ్డాడు. వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. రెండునెలల క్రితం పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితమయ్యాడు. అప్పటినుంచి హరిత బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. వైద్య ఖర్చులకు ఆ కుటుంబం తీవ్ర ఇబ్బంది పడుతుండగా.. సమస్య తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ మే 3వ తేదీన ఫేస్బుక్లో పోస్టు చేసి సాయం కోరాడు. అందుకు స్పందించిన ఎన్నారైలు, ఇతర దాతలు స్పందించి హరిత బ్యాంకు ఖాతాకు రూ.1.27లక్షలు విరాళంగా అందించారు. రమేశ్ వాటిని స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, యూనియన్ బ్యాంకు మేనేజర్ మాధవరావు చేతులమీదుగా బాధితుడి భార్యకు పంపిణీ చేయించాడు. చేయూత పెన్షన్ల మార్పిడికి డబ్బులు వసూలు మెట్పల్లిరూరల్: చేయూత పెన్షన్ల మార్పిడికి పంచాయతీ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెట్పల్లి మండలం కొండ్రికర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి.. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్దారుల నుంచి ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా, పెన్షన్ ఐడీ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎలాంటి అక్రమాలకూ తావులేకుండా చేపట్టాలి. కానీ కొండ్రికర్లలో మాత్రం ఒక్కొ పెన్షన్దారు నుంచి పంచాయతీ సిబ్బంది రూ.200 వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని మైక్లో చెప్పించడం గమనార్హం. గ్రామంలో దాదాపుగా 400కి పైగా పెన్షన్లు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా పెన్షన్దారులు కావాల్సిన ధృవీకరణ పత్రాలు సమర్పించారు. మార్పిడి విధానానికి ఇతర గ్రామాల్లో ఎక్కడా డబ్బులు వసూలు చేయడంలేదని తెలుసుకున్న గ్రామస్థులు డబ్బులు వసూలు చేసిన వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజును ‘సాక్షి’వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. -
ఏది కొనాలన్నా.. రూ.60పైనే
జగిత్యాలఅగ్రికల్చర్: ఓ వైపు ఎండలు.. మరోవైపు కూరగాయల ధరలు మండుతున్నాయి. ఇప్పటివరకు రూ.100 పట్టుకుని మార్కెట్కు వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు ఒక్కటి, రెండు రకాలు కూడా రావడం లేదు. టమాట, ఆలు, గోరుచిక్కుడు, అలిసంత, మిర్చి, వంకాయ, బెండ వంటివే మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. మార్కెట్కు అన్ని రకాలు రాకపోవడానికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎండలకు రాలిన పూత చాలామంది రైతులు వేసవి పంటగా టమాట, బీర సాగు చేస్తారు. పూత సమయంలో ఎండలు మండిపోవడంతో ఈ ఏడాది పూత మొత్తం రాలిపోయింది. ఫలితంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది. పంట మొదటి దశలో అకాల వర్షాలు కురవడంతో ఎదుగుదల లోపించింది. దీంతో కూరగాయల విస్తీర్ణం పడిపోయింది. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి పరిసర ప్రాంతాల రైతులు కూరగాయలు సాగు చేస్తారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారంతా సాగుకు దూరమయ్యారు. మార్కెట్కు బీర, సోర, కాకర, దొండ, బెండ వంటివి మాత్రమే వస్తున్నాయి. వ్యాపారులు మెదక్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండడంతో రవాణా చార్జీలు పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం మిర్చి కిలో రూ.70, టమాట రూ.50, సోర (ఒకటి) రూ.30, గోరుచిక్కుడు రూ.50, వంకాయ రూ.50, కొత్తిమీర రూ.100, చిక్కుడు రూ.60 చొప్పున పలుకుతున్నాయి. హోల్సేల్ వ్యాపారులు కొంత తగ్గించి ఇస్తున్నా.. రిటైల్ వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. కిలో రూ.50 నుంచి రూ.100 పెట్టలేక ప్రజలు రూ.10నుంచి రూ.20కి వచ్చే పాలకూర, పచ్చకూర, గొంగూర వంటి కూరగాయలే చివరకు దిక్కవుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరలు సామాన్య వినియోగదారులకు పెను భారంగా మారుతున్నాయి. ప్రధానంగా రైతులు వానాకాలం సీజన్కు సమాయత్తం అవుతుండటంతో చివరి దశకు చేరిన తోటలను దున్నించి వానాకాలం పంటలకు సిద్ధం చేస్తున్నారు. -
దాతలు సహకరిస్తేనే
మా నాన్న సాయన్న, అమ్మ చిన్నమ్మ. ప్రభుత్వ బడిలో 10వ తరగతి చదివి 553 మార్కులు సాధించాను. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. నాన్న అనారోగ్యంతో ఇంటి వద్ద ఉంటున్నాడు. అమ్మ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వంటమనిషి సహాయకురాలుగా పని చేస్తోంది. ఆమెకు వచ్చే రూ.2వేల జీతంతో కుటుంబాన్ని పోషించుకునే దీన పరిస్థితి మాది. దాతలు స్పందిస్తేనే ట్రిపుల్ ఐటీ చదవు. కనీసం అడ్మిషన్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి మా కుటుంబానిది. దాతలు సహకరించి అడ్మిషన్ ఫీజు చెల్లించి ఆదుకోండి. వివరాలకు 78158 80228 నంబర్లో సంప్రదించగలరు. – రాజ్దీపక్ -
మొత్తం దున్నేశా
వానాకాలం సీజన్ సమీపిస్తుండటంతో టమాట తోటను దున్నేశాను. వర్షాలు పడిన తర్వాత మళ్లీ కొంత కూరగాయలు సాగు చేయాలనుకుంటున్నాను. రోజు రూ.వెయ్యి వరకు కూరగాయలు అమ్మేవాడిని. ఇప్పుడు కూరగాయల తోట లేదు. – రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాలరూరల్(మం) ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి టమాట, మిర్చి, కొత్తిమీర వంటి వాటిని మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రవాణా చార్జీలు పెరిగి ధరలు మండుతున్నాయి. స్థానికంగా గోరుచిక్కుడు, సోర వంటి కొన్ని కూరగాయలు స్థానిక మార్కెట్లకు వస్తున్నాయి. – కట్ట లత, జిల్లా ఉద్యానశాఖాధికారిణి, జగిత్యాల -
నాన్నకు అనారోగ్యం.. అమ్మ దినసరి కూలీ
మాది రాయికల్ మండలం భూపతిపూర్. నాన్న లక్ష్మీరాజం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అమ్మ రాధ దినసరి కూలీ. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి 568 మార్కులు సాధించాను. ట్రిపుల్ ఐటీ బాసరలో సీటు వచ్చింది. సీటు వచ్చిన సంతోషమేగానీ.. చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. కనీసం అడ్మిషన్ ఫీజు, ఇతర ఖర్చులు చెల్లించలేని దుస్థితిలో మా కుటుంబం ఉంది. దాతలు స్పందిస్తే ట్రిపుల్ ఐటీలో చదవడానికి సిద్ధంగా ఉన్నాను. లేకుంటే చదువుకు దూరం కావాల్సిందే. ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ ఫీజు, ఇతర ఖర్చులు రూ.30వేల వరకు అవుతాయని అంటున్నారు. దాతలు స్పందించి ఆర్థిక సహాయం చేసి నా చదువుకు బాట వేయండి. దాతలు 86396 73343 నంబర్లో సంప్రదించండి. న్యాతగిరి సంజన -
‘బట్టీల్లో’ ఇష్టారాజ్యం
వెల్గటూర్:ఉమ్మడి వెల్గటూర్ మండలంలో ఇటుకబట్టీ వ్యాపారుల అక్రమ దందా జోరుగా సాగుతోంది. రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొసున్న అక్రమ ఇటుకబట్టీలు కార్మికుల బతుకులను చిధ్రం చేస్తుండడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్నాయి. యజమానులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తూ, కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయడంలో, సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో బట్టీల నిర్వహణతో దుమ్ము, ధూళి, పొగ రోడ్డంతా వ్యాపించి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం కొనసాగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఎకరాకు రూ.వెయ్యి వరకు అదనపు భారం
ఔఎరువుల పెరుగుదలతో ఎకరాకు రైతుపై రూ.వెయ్యికి పైగా అదనపు భారం పడనుంది. ఇప్పటికే గిట్టుబాటు కాని ధరలు, ప్రకృతి వైపరీత్యాలతో నెట్టుకొస్తున్న రైతన్నకు పెరిగిన ధరలు గుదిబండగా మారనున్నాయి. కంపెనీలకు స్వేచ్ఛ ఇవ్వడంతో ముడిసరుకులు కొంత పెరిగినా.. ఎరువులు ధరలు భారీగా పెంచుతున్నాయి. – వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు రైతులకు అండగా నిలబడాలి ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలబడాలి. పెరిగిన ధరలను ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. పంట భూములు నిస్సారంగా మారుతుండటంతో పోషకాల కోసం తప్పనిసరిగ్గా ఎరువులు వేయాల్సిందే. పెరిగిన ఎరువుల ధరలతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. – మామిడి మహేందర్, తొంబర్రావుపేట, మేడిపల్లి -
ఎద్దు, ఎవుసం తెలియని సీఎం
జగిత్యాలటౌన్: సీఎం రేవంత్రెడ్డికి ఎద్దు, ఎవుసం తెలియదని, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే తెలుసని మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. రేవంత్ మాటలకు.. చేతలకు పొంతన లేదని, చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తూ.. ఉచిత విద్యుత్పై ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెడుతూనే.. మోటార్లకు మీటర్లు పెడితే ఓటు అడగననడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చే కుట్రలో భాగమే ఇదంతా అని పేర్కొన్నారు. ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయని కాంగ్రెస్కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. జిల్లాలో ఇసుక దోపిడీ సాగుతుందని, ఆరపెల్లి, దొంతాపూర్, ధర్మపురిలో క్వారీలకు అనుమతించే అవకాశం ఉన్నా ఇసుక మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కో ట్రాక్టర్కు రూ.8వేలు వసూలు చేస్తున్నారని, ఇందులో ధర్మపురి సీఐకి రూ. 5వేలు, మంత్రికి రూ.3వేలు వెళ్తున్నాయని ఆరోపించారు. మార్పుకోరుకున్న ప్రజలు.. రాష్ట్రం దోపిడీ పాలవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను కనుమరుగు చేసేందుకే రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని, ఆయన మాటలకు రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాయకులు శ్రీకాంత్రెడ్డి, పుప్పాల అశోక్, కల్లెపెల్లి దుర్గయ్య, నేహాల్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్యపు ఊసుల ఉయ్యాల
నాన్నను పట్టుకు తిరిగిన లోగిలి అమ్మను తాకితే తీరిన ఆకలి బుడి బుడి అడుగుల జాబిలి విహార యాత్రపు జాలీ జాలీ నా మదిలో బాల్యపు రంగుల హోలీ సోపతి గాళ్లతో గోలీలాట.. భూపతి గానితో జలకాలాట.. సీతాపతితో జాతర పాట.. యాకుబ్ తోటలో కోతి కొమ్మచ్చీ జేకే వాడలో కాల్ చిచ్చి ముచ్చీ బాల్యపు ఊసుల ఉయ్యాలా..! సొంటి తెచ్చినా కంట్లో మంట చంటి తెచ్చినా ఇంట్లో తంట గద్యం చదవక కోదండాలు పద్యం చదవక అరదండాలు బాల్యం నేర్పిన గుణ పాఠాలు.. అయ్యోరిచ్చిన ఐదు పైసలు పూజారిచ్చిన పూత రేకులు ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్లూ కాగితప్పడవల వర్షపు నీళ్లూ మరచిపోనివీ మరలి రానివీ.. బాల్యం ఇచ్చిన బహుమతులు చెరువులో పట్టిన చేప పిల్లలు చేతిలో కాలిన అగ్గి పుల్లలు బడి మానేసి చూసిన చిత్రం బిర బిర గీసిన నల్లని ఛత్రం గిర గిర తిరిగిన రంగుల రాట్నం బిర బిర ఉరికిన హంగుల పట్నం ఇంకా ఇంకా గుర్తున్నాయి. ఇంపుగ మదిలో దాగున్నాయి! డాక్టర్ కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత జిల్లా: ఖమ్మం -
మరణానంతరం ముగ్గురి జీవితాల్లో వెలుగు
మెట్పల్లి: మరణించిన తర్వాత ఆయన అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేసి ముగ్గురి జీవితాల్లో వెలుగు నింపిన సంఘటన మెట్పల్లిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఆరపేటకు చెందిన పుడుకారం వెంకట్రెడ్డి(45) ఈనెల 26న ద్విచక్ర వాహనంపై తన తోటకు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. 29న బ్రెయిన్డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అవయవాలు దానం చేస్తే కొందరికి కొత్త జీవితం ఇచ్చినట్లవుతుందని భార్య హరిత, కుమార్తె సాహితికి వైద్యులు చెప్పగా.. వారు అంగీకరించారు. జీవన్దాన్ ద్వారా ఆయన 2 కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మెట్పల్లివాసి అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులు -
పొడుపు కథలు
01. గోధుమ వన్నె దేహం సోగ కన్నుల విత్తనం తింటే నోటికి జిగట 02.అమ్మాయి పేరున్న పండు సింధూరంలా మెరిసే పండు సిట్రన్ జాతి తినే పండు 03. పండ్లన్నింటికీ రారాజు రుచిని తూచలేదు తరాజు 04. ఒళ్లంతా ముళ్లుంటాయి నెత్తి మీద ఆకులుంటాయి పులుపు తీపి రుచులుంటాయి 05. కాటుక రంగు పిల్లల్ని కడుపుపున దాచుకున్న (మోస్తున్న) మిసిమి దేహపు అమ్మ 06. బాలిక నామం పెట్టుకున్నది దేహమంతా కన్నులు కలది విత్తుల చుట్టూ కండ కలిగినది ! 07. ఎండాకాలంలో ఎర్రని రసాలు నేలన పాకే తీగాలకే కాయలు దీని పొట్ట నిండా నీటి నిల్వలు 08. రంగేమో మేలిమి బంగారం రుచేమో మధురాతి మధురం పిల్లేమో ముదురు నీటి టెంక ఫలం 09. ఒళ్లంతా పసుపు పూసుకున్న ముత్తైదువ పూజలకూ వ్రతాలకూ ముందుండే ముత్తైదువ 10. ఈ పండును రోజూ తింటే డాక్టరు వద్దకు వెళ్ళే పని లేదు ఈ చెట్టు కింద కూర్చుంటేనే భూమ్యాకర్షణ తెలిసింది ! 11. సపోటా వుర్ల గడ్డలతో పోలికలు అడ్డుకోతలో సూర్యకిరణాల చిత్రాలు తింటే బీపీ, ఎల్ డీఎల్ ల తగ్గుదల 12. గుత్తులు గుత్తులుగా పండ్లు కానీ ద్రాక్ష గుత్తులు కాదు మెత్తని జెల్లీ లాంటి కండలు కానీ తాటి ముంజలు కాదు 13. ఉసిరిలా కాండానికి కాస్తాయి ద్రాక్షలా గుత్తులుగా కాస్తాయి చైనా దేశంలో అధికంగా కాస్తాయి 14. ఎరుపు తెలుపులలో ఉంటుంది చలి కాలంలో ఎక్కువ కాస్తుంది దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది 15. పైన సన్నగా కింద లావుగా నీటి చుక్క వలే బుడగగా వగరు తీపి పులుపు కలగలుపుగా 16. ఆకుపచ్చని గుండ్రని బంతులు గర్భాన దాచి పెట్టుకున్న ముత్యాలు రసం పిండామంటే గ్లాసులు 17. పొట్ట నిండా రత్నాల రాసులు పెట్టి కనపడకుండా ఎర్రని తోలు కప్పారు 18. కాయలన్నింటిలో చాలా పెద్దది పసిమి ఛాయ పిల్లలు కలది ఘాటైన సువాసన కలది చిటారు కొమ్మన కాస్తుంది 19. ఇల్లేమో ముళ్లకంప పళ్ళేమో డ్రూప్ జాతి రుచేమో తీపి పులుపు రంగేమో ముదురు ఎరుపు 20. చూపుకు మేలిమి దేహాలు పొట్ట విప్పితే పురుగులు చెట్టు కాండానికి గుత్తులు జావాబు: 01.సపోటా, 02.కమలా కాయ, 03.మామిడి, 04.అనాసకాయ, 05.బొప్పాయి, 06. సీతాఫలం, 07.పుచ్చ కాయ, 08.మామిడి, 09.అరటి కాయ, 10.యాపిల్, 11.కివి, 12. లిచి, 13.మల్బరీ, 14. జామ, 15.పియర్, 16. బత్తాయి, 17.దానిమ్మ, 18. పనస కాయ, 19. రేగి పండు, 20. మేడి పండుడాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
జాతి ఐక్యత–దేశ భద్రత!
ఈ పవిత్ర భారతదేశం నా దేశం నే పుట్టి పెరిగిన నా జన్మ ప్రదేశం అందిస్తుంది ఇది ఓ శుభ సందేశం బంధిస్తుంది మనలను ఆ ఆదేశం! స్పందిద్దాం భారతీయులకు అందిద్దాం విందిద్దాం మన ఐక్యతను చిందిద్దాం మన దేశ భద్రత మనందరకు ముఖ్యం అప్పుడే మనందరకు కలుగు సౌఖ్యం ! కలసికట్టుగా మనమంతా ఇక ఉందాం అలసినట్టున్న బలం పుంజుకుందాం దేశ భద్రతకు మనం కట్టుబడి ఉందాం దేశ ఐక్యతయే ఘనం పెట్టుబడి అందాం ! పరాయి ముష్కరుల పెంచి పోషిస్తున్న తురాయి ఎగిరేసి మనల ద్వేషిస్తున్న చైనా పాకిస్తానులకు చెప్పాలిక బుద్ధి అంతర్జాతీయ వేదికపై మనం బల్ల గుద్ది ! మన దేశ భద్రత మనందరి బాధ్యత ఘన సైనికులకే ఉంది ఆ యోగ్యత అయినా మనందరం పాలు పంచుకుందాం స్వయానా సరిహద్దు వివాదం తెంచుకుందాం ! ప్రజలందరకు కంటినిండా నిద్రించే భరోసానిద్దాం సైనిక రక్షణ వ్యవస్థను చక్కదిద్దు ధిలాసా చిందిద్దాం భరతజాతి సమైక్యతను పటిష్టం చేసేద్దాం భరతఖండం భద్రతను పరిపుష్టం గావిద్దాం! గుర్రాల లక్ష్మారెడ్డి – కవి, రచయిత – కల్వకుర్తి, నాగర్కర్నూల్ జిల్లా -
బన్నీ వేసవి యాత్ర –22 లేత ముంజకాయల పండుగ
ఎండాకాలం మధ్యాహ్నం. తాతయ్య వచ్చాడు. చేతిలో దాసరి రఘు గౌడ్ గారు ఇచ్చిన లేత ముంజకాయల గెల. పైన తడి గుడ్డ కప్పి తెచ్చాడు. వాకిట్లో ఆడుకుంటున్న బన్నీ, వాడి స్నేహితులు పరుగున వచ్చారు. ‘తాతయ్య... మాకు కూడా’ అని చుట్టూ మూగారు. తాతయ్య నవ్వుతూ కత్తి తెచ్చి ఒక్కొక్కటిగా కోశాడు. లోపల తెల్లని జిగేలు మంచులా మెరుస్తున్నాయి. బన్నీకి మొదట ఇచ్చాడు. తర్వాత రామ్కి, చుక్కకి, స్వప్నకి ఇచ్చాడు. అందరి అరచేతుల్లో చల్లటి ముంజ జిగురు నిండింది. ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే దాహం తీరింది. వేడి తగ్గింది. పిల్లల మొహాల్లో తియ్యటి నవ్వులు విరిశాయి. తాతయ్య వాళ్ళ ఆనందం చూసి మురిసిపోయాడు. ‘తినండి, ఇంకా ఉన్నాయి’ అన్నాడు. ఆ రోజు ముంజకాయలు కాదు, తాతయ్య ప్రేమే అందరికీ పంచాడు. పిల్లలకి మాట: లేత ముంజకాయల రుచి మమతలకు సురుచి గౌడన్నలకు అభివందనం – డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
చదువు.. చైతన్యం.. సాధికారత
జ్యోతినగర్: భారతావనికి వెలుగులు ప్రసరింపజేస్తున్న ఎన్టీపీసీ తమ పరిధిలోని ప్రజల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభావిత, పునరావాస ప్రాంతాలు అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, కమాన్పూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలకు బాలికా సాధికారత మిషన్–2026 ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ బేటీ బచావో.. బేటీ పడావోకు అనుగుణంగా ఎన్టీపీసీ నడుచుకుంటోంది. ఇందుకోసం రామగుండం ప్రాజెక్టులోని శ్రీచైతన్య కళాశాల భవనంలో బాలికా సాధికారత అంశంపై 10 నుంచి 12 ఏళ్ల వయసు లోపు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలను శిక్షణకు ఎంపిక చేసింది. వీరికి 28 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తోంది. ● కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. ● బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం ● వ్యక్తిగత ఆరోగ్యం, శారీరిక సమస్యలు, ఇంటర్నెట్, సైబర్ నేరాలు, భవిష్యత్ గురించి గొప్ప కలలు, ఆలోచనలు కలిగింపజేయడం. ● జీవితంలో సమున్నత లక్ష్యాలు చేరుకోవాలనే ఆలోచన, తపన కల్పించడం ● పాఠ్యాంశాల్లో శిక్షణ ● సరళమైన తెలుగు, ఆంగ్ల భాషపై పట్టు, యోగా, గణితశాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు, మెలకువలు, పర్యావరణశాస్త్రం, ఆత్మరక్షణ, క్రీడలు, కంప్యూటర్స్ వినియోగం, పౌష్టికాహారంతో ఉపయోగాలు, 5ఎస్ విధానాలు ● శిక్షణ ఇచ్చే అంశాలు ● అగ్నిమాపక భద్రతా చర్యలు, సివిల్ సర్వీసెస్ ● కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్స్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై అవగాహన ● సామూహిక చర్చలు ● సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకరంగం ● మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ ● యోగా ● శిక్షణ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ● వసతి గృహం వద్ద 24 గంటలు మహిళా సెక్యూరిటీ గార్డులతో రక్షణ ● ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా వార్డెన్లు ● కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ ● సీసీ కెమెరాలతో నిఘా బాలికా సాధికారతే దేశాభివృద్ధికి పునాది బాలికల కోసం ఎన్టీపీసీ వినూత్న కార్యక్రమం 140 మంది విద్యార్థినులకు వేసవి శిక్షణ శిబిరం -
ప్రోత్సాహం లభించింది
మా ఊరులో ఇలాంటి అవకాశాలు తక్కువ. ఇక్కడ చదువుతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తున్నరు. పెద్దయ్యాక నేను ఏం కావాలనే నా లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుంది. – రక్షిత, కుక్కలగూడూరు అందరి ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని. ప్రతిరోజూ ప్రసంగాలు, గ్రూప్ డిస్కషన్స్తో ధైర్యంగా మాట్లాడుతున్న. నా మీద నాకు నమ్మకం బాగా పెరిగింది. – సాహితి, గాంధీపార్కు పాఠశాల మా స్కూల్లో కంప్యూటర్లను దగ్గరగా చూసే అవకాశం తక్కువ. ఇక్కడ కంప్యూటర్ ప్రాథమిక అంశాలు నేర్పిస్తున్నరు. ఇంజినీర్ కావాలనే ఆసక్తి మరింత పెరిగింది. – అక్షర, మేడిపల్లి -
నేటి నుంచి తెలంగాణ పీఈసెట్
కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026(టీజీపీఈసెట్) శారీ రక, నైపుణ్య పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి తర ఫున శాతవాహన విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 2 సంవత్సరాల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 3 వరకు శారీరక పరీక్షలు జరగనుండగా.. 6న ఫలితాలను వెల్లడించనున్నారు. ఉదయం 6.30 గంటలకు జరగనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్టారెడ్డి, సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్, శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఉమేశ్కుమార్ హాజరు కానున్నారు. ఆదివారం 993 మంది పురుష అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ రాజేశ్కుమార్ తెలిపారు. మొత్తం 500 మార్కులు శారీరక పరీక్షలకు మొత్తం 500 మార్కులుంటాయి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(400 మార్కులు). అందరికీ తప్పనిసరి అయిన 4 అథ్లెటిక్స్ ఈవెంట్లు ఉంటాయి. ప్రతీ ఈవెంట్కు 100 మార్కులుంటాయి. స్కిల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 100 మార్కులుంటాయి. ప్రభుత్వం ఆమోదించిన ఆటల్లో అభ్యర్థి తనకు నచ్చిన ఏదైనా ఒక ఆటను ఎంచుకొని అందులో తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. అభ్యర్థులు ర్యాంకు సాధించడానికి మొత్తం మార్కుల్లో కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు. అభ్యర్థులకు సూచనలు ● అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్ను చూపించాలి. ● హాల్ టికెట్లో ఉన్న మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ● స్పోర్ట్స్, ఎన్సీసీ సర్టిఫికెట్లకు అదనపు ఇన్సెంటివ్ మార్కులు పొందడానికి, అభ్యర్థులు తమ అత్యున్నత క్రీడా ప్రతిభ, ఎన్సీసీకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను పరీక్ష సమయంలో వెరిఫికేషన్ కోసం చూపించాలి. ● క్రీడాపత్రాల గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో కలిపి పరీక్ష సమయంలో సమర్పించాలి. ● హాల్ టికెట్ను అభ్యర్థి చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ● కేటాయించిన తేదీన అభ్యర్థికి ఏదైనా ఇతర పరీక్ష ఉన్నా.. లేదా సరైన బలమైన కారణం వల్ల హాజరు కాలేకపోయినా.. వారికి మిగిలిన పరీక్ష తేదీల్లో ఏదో ఒకరోజు అవకాశం కల్పిస్తారు. ● గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇతర శారీరక సమస్యలతో బాధపడేవారిని శారీరక సామర్థ్య పరీక్షలకు అనుమతించరు. స్కిల్ టెస్ట్ పరికరాలు అభ్యర్థులు ఎంచుకున్న క్రీడానైపుణ్య పరీక్షకు సంబంధించిన సొంత క్రీడా పరికరాలను వెంట తెచ్చుకోవాలి. హాల్ టికెట్లో కేటాయించిన రిపోర్టింగ్ సమయం కంటే కనీసం ఒక గంట ముందుగానే శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తాం. అభ్యర్థులు నిర్దిష్ట సమయానికి చేరుకోవాలి. ప్రతిభ, శారీరక సామర్థ్యం ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, హాల్ టికెట్లతో ఒక గంట ముందే మైదానానికి చేరుకొని పరీక్షల నిర్వహణకు సహకరించాలి. – రాజేశ్కుమార్, కన్వీనర్, టీజీపీఈసెట్–2026 ప్రారంభించనున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్టారెడ్డి తొలిరోజు 993 మంది పురుష అభ్యర్థులకు స్కిల్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన శాతవాహన యూనివర్సిటీ -
కొత్త అనుభవాలు
ఊళ్లనుంచి చి వచ్చిన విద్యార్థినులతో కలిసి ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. యోగా, క్రీడలు, పాటలు, నృత్యాలు నేర్చుకుంటున్నం. ప్రతీరోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. సంతోషంగా ఉంది. – సహస్ర, నర్రాశాలపల్లె బాలికలు విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఎన్టీపీసీ శిక్షణ ఇస్తోంది. గ్రామీణ విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇది దోహదపడుతుంది. – చందన్కుమార్ సామంత, ఈడీ, ఎన్టీపీసీ బాలికలకు పాఠ్యాంశాలతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, యోగా, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాం. తద్వారా బాలికల్లో కొత్త ఆలోచనలు, ఉన్నత లక్ష్యాలు ఏర్పడుతున్నాయి. – సాగర్ రంజన్ సాహూ, ఏజీఎం(హెచ్ఆర్), ఎన్టీపీసీ -
రామాజీపేటలో అగ్ని ప్రమాదం
రాయికల్: రామాజీపేట గ్రామ శివారులో శనివారం పొలాల్లో ఉన్న 11 కేవీ తీగలు తెగి పడడంతో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గ్రామంలోని వందలాది ఎకరాల్లో కోత కోసిన వరి, మొక్కజొన్న కొయ్యలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు మంటలార్పడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మంటలు వ్యాపించాయని రైతులు ఆరోపించారు. ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందించాలని రైతులు సంతోష్రావు, అంబల రాజిరెడ్డి, రాజు, రాజశేఖర్ డిమాండ్ చేశారు. -
అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి
మార్కుల కాగితాలు ఇంటర్వ్యూ గేటు వరకే నడిపిస్తాయి. మీలోని ప్రాక్టికల్ నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగాన్ని సాధించి పెడతాయి. నేటి ఆధునిక పరిశ్రమలకు పుస్తకాల పురుగులు కాదు. సమస్యలను ధైర్యంగా పరిష్కరించే సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారే అత్యవసరం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను, ని రంతర అభ్యాసన తత్వాన్ని ఆయుధాలుగా మార్చుకుని ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి దూసుకుపోవచ్చు. ర్యాంకులు రాలేదని నిరాశ పడకుండా, మీలోని విశిష్ట ప్రతిభకు పదును పెడితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. – వై. తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి, కరీంనగర్ -
జగిత్యాల
46.0/36.07గరిష్టం/కనిష్టంకిక్కిరిసిన నృసింహుని సన్నిధిధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం అధికమాసం జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం నుంచే ఎండవేడిమి పెరుగుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేడిగాలులు కొనసాగుతాయి. కొండగట్టులో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు.ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026 -
ప్రతిభ చూపు!
మార్గం వెతుకు..కరీంనగర్ స్పోర్ట్స్/జగిత్యాల: బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయి. బంగారు బాటవేస్తాయి. సాధన చేస్తే ఏదైనా సులభమే. అభ్యాసమే ఏదో ఒకనైపుణ్య సాధనకు మందు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ప్రతిభ.. ఆలోచన.. ఆచరణతో ముందుకెళ్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలపై పట్టు పెంచుకుంటే భవిష్యత్ బాగుంటుంది. దూసుకెళ్తున్న ఐటీ.. తోటి వారితో పోటీ.. వీటన్నింటిని నెగ్గుకు రావాలంటే పట్టుదల ముఖ్యం.ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన వారుభావ వ్యక్తీకరణతో విజయం విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావవ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం.. భాష నైపుణ్యంతో వివరించగలగడం.. అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి శిక్షణ కేంద్రాలూ ఉంటాయి. వాటిలో చేరి సాధన చేయవచ్చు. ట్రైనింగ్తో ముందుకు.. సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్ దేనిలోనైనా సీటు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్లో చేరిన విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైవారు ఆ దిశగా కసరత్తు చేయాలి. లక్ష్యం.. గుర్తుంచుకోవాలి.. మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కవచ్చు. ఈ కోర్సులకు ప్రభుత్వ పరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పేద విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదివి ర్యాంకుతో సీటు పొందిన వారి స్ఫూర్తిని అంది పుచ్చుకోవాలి. సమయం వృథా.. జీవితాంతం వ్యథ పుస్తకాలతో పనేమీ లేదని ఫోన్లు, టీవీలతో ఎంజాయ్ చేద్దామనుకుంటే మాత్రం భవితను ముంచి వేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త విద్యాసంవత్సరంలో ఏ కోర్సులో చేరితే భవిష్యత్ బాగుంటుందో ఇంటర్నెట్లో పరిశీలించవచ్చు. ప్రణాళికతో ఉండాలి. విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.నైపుణ్యాలు పెంచుకునేందుకు పట్టుదల పెంచుకోవాలి. ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయా సమావేశాలు, నైపుణ్య కేంద్రాలు, లైబ్రరీలను సందర్శించాలి. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం వంటివాటిపై పట్టుసాధించాలి. ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. ఎప్పుడు సమయం దొరికినా వాటిపై పట్టుసాధించాలి. భవిష్యత్తుపై భరోసా పెంచుకోవాలి. నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనుల వృత్తికి డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు తెలిసిన వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి అన్నట్టు సంపాదించుకోవచ్చు 1,968పరీక్ష రాసినవారుఉత్తీర్ణత సాధించిన వారు3,35314,94311,9612,5624,3383,7625,796జగిత్యాలపెద్దపల్లికరీంనగర్రాజన్న సిరిసిల్ల -
ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్
జగిత్యాల: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్స్లో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పదో తరగతిలో వందశాతం మార్కులు సాధించిన 175 మంది విద్యార్థులకు శనివారం ప్రతిభ అవార్డులు అందించారు. హెల్త్కార్డుల విషయంలో ఉపాధ్యాయులకు ఎలాంటి అపోహలు వద్దని, ఇవి ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుందని, ట్రస్ట్లో ఉద్యోగ సంఘాలు కూడా సభ్యులుగా ఉన్నారని తెలిపారు. జూలైలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ఉంటాయన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేశ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందన్నారు. నియోజకవర్గానికో పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. డీఈవో రాము మాట్లాడుతూ, ఉపాధ్యాయుల కృషితో ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నాలుగో స్థానం సాధించామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, అమర్నాథ్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మహేందర్రెడ్డి పాల్గొన్నారు. -
గీత కార్మికులకు సహాయం అందించండి
కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో అగ్ని ప్రమాదానికి వేలాది ఈత చెట్లు దగ్ధమై గీత కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారికి ప్రభుత్వపరంగా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కుమార్ కలెక్టర్ బి.సత్యప్రసాద్ను కోరారు. గీత కార్మికులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. మెట్లచిట్టాపూర్, పెద్దాపూర్, కోనరావుపేట, సంగెం, ఐలాపూర్, మాదాపూర్, చిన్నమెట్పల్లి, మోహన్రావుపేట, ఫకీర్కొండాపూర్ గ్రామాల్లో సుమారు 18,100 ఈత చెట్లు దగ్ధమయ్యాయని, జీవనోపాధి కోల్పోయి గీత కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రెవెన్యూ, ఎకై ్సజ్ శాఖల అధికారులతో విచారణ జరిపించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదం సంభవించిన ఈత వనాల వద్ద బోర్లు మంజూరు చేసి నీటి సదుపాయం కల్పించాలని కోరారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజేశ్, భూమయ్య, పలువురు గీత కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. -
బీర్పూర్ నృసింహుని సన్నిధిలో జిల్లా జడ్జిలు
జగిత్యాలరూరల్: బీర్పూర్ నృసింహస్వామిని జిల్లా ఇన్చార్జి జడ్జి దంపతులు సునీత, మహేందర్రెడ్డి దంపతులు, పీడీఎం కోర్టు జడ్జి లావణ్య శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆలయ రినోవేషన్ కమిటీ సభ్యుడు భీమనాతి లవన్ కుమార్, బీర్పూర్ ఎస్సై సబ్బని రాజు పాల్గొన్నారు. ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి అజారుద్దీన్ జగిత్యాల: జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా మై నార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ హాజరుకానున్నారు. ముందుగా అమరవీరులకు నివాళులు అ ర్పించిన అనంతరం జాతీయ జెండాను ఆవి ష్కరించనున్నారు. గతేడాది మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పతాకావిష్కరణ చేసిన విష యం తెల్సిందే. ఈ ఏడాది అడ్లూరి కరీంనగర్లో పతాకావిష్కరణ చేయనున్నారు. బీజేపీ నాయకుల హౌస్ అరెస్ట్జగిత్యాలక్రైం/జగిత్యాలటౌన్: మూడు రోజు లుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చ పేరుతో సవాళ్లు విసురుకుంటున్నారు. ఈనెల 29న బీజేపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ సేవదల్ రాష్ట్ర కార్యదర్శి బాగోజి ముఖేశ్ కన్నా పిలుపునివ్వగా.. తాము సిద్ధమని, శనివారం ఉదయం 11 గంటలకు రావాలని బీజేపీ నాయకులు సవాల్ విసిరారు. దీంతోపాటు వాల్పోస్టర్లు వేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బోగ శ్రావణి ఇంట్లో ఉన్న కార్యకర్తలను పట్టణ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తహసీల్ చౌరస్తా వద్ధ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బీజేపీ నాయకులు శ్రావణి ఇంటి వద్దే ఖాళీ కుర్చికి ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ అంటించి నిరసన తెలిపారు. బ్యాంక్ రుణాలతో ఆర్థిక వృద్ధి రాయికల్: వడ్డీ లేని రుణాల ద్వారా మహిళల ఆర్థిక వృద్ధి సాధిస్తున్నారని ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇటిక్యాలలో ప్రజాపాలన – ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా మహిళల విజ యోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. సీ్త్రనిధి సేవలు, లోన్బీమా, ప్రమాదబీమా, బ్యాంక్ లింకేజీ వంటి పథకాలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ నీరటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ సాయిరెడ్డి, ఏపీఎం నరహరి, సీసీ లావణ్య, వీవో ఏలు రాధ, లావణ్య, రాజశ్రీ పాల్గొన్నారు. మామిడితోటల పెంపకంపై శిక్షణమేడిపల్లి: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మేడిపల్లి మండలం పోరుమల్లలో శని వారం మామిడి తోటల్లో కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. మామిడి కోత అనంతరం, చెట్లు ఒత్తిడికి గురై బలహీనపడే అవకాశం ఉన్నందున, తగినంతా నీరు అందించాలని సూచించారు. ఏడాదిపాటు పాటించాల్సిన నెలవారీ సాగు పద్ధతులను వివరించారు. పూత సమృద్ధిగా వచ్చినా.. పురుగుమందులను విచ్చలవిడిగా వినియోగించడం ద్వారా తేనెటీగల సంచారం తగ్గి పరాగసంపర్కం సక్రమంగా జరగక పిందె ఏర్పాటుపై ప్రభావం పడుతోందని, తద్వారా దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. కాయలను కోసిన వెంటనే కార్బండిజమ్ ద్రావణంలో శుద్ధి చేసి మార్కెట్కు తరలిస్తే మంచి ధర లభిస్తుందన్నారు. సర్పంచ్ అంజన్న, ఉప సర్పంచ్ ప్రణయ్, హెచ్ఈవో అనిల్ కుమార్, కట్లకుంట, పోరుమల్ల రైతులు పాల్గొన్నారు. -
● ప్రతీ పాఠశాలలో బాలల రక్షణ అధికారి ● జిల్లాలో 220 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు
కథలాపూర్(వేములవాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవ్టీజింగ్, వేధింపులు, బాల్య వివాహాలను అరికట్టడానికి ఉన్నత పాఠశాలల్లో నూతన వ్యవస్థ రూపుదిద్దుకోనుంది. ప్రతీ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలిని బాలల రక్షణ అధికారి(చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్)గా నియమిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర చట్టపరమైన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ కొత్త రక్షణ వ్యవస్థను అమల్లోకి తేనున్నారు. వచ్చే నెల 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో అప్పటినుంచే ఈ విధానం అమల్లోకి రానున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో 220 ఉన్నత పాఠశాలలు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలతోపాటు 385 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 189 జెడ్పీ హైస్కూళ్లు, 13 మోడల్ స్కూళ్లు, 16 కేజీబీవీలు, రెండు గురుకులాలున్నాయి. ఉన్నత పాఠశాలల్లో బోధించే ఒక ఉపాధ్యాయురాలిని బాలల రక్షణ అధికారిగా నియమించనున్నారు. ఉపాధ్యాయురాలు కేవలం బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల రక్షణ బాధ్యత కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థల నుంచి బాలలను రక్షించటమే దీని లక్ష్యం. వేధింపులకు గురయ్యే విద్యార్థినులు తమ సమస్యను నేరుగా సీపీవోకు తెలియజేసే అవకాశం ఉంటుంది. బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే వారికి అవసరమైన రక్షణ, న్యాయ సాయం అందించనున్నారు. చట్టాలపై ప్రత్యేక తరగతులు విద్యార్థులకు అవగాహన పెంచటానికి ప్రతీ వారం ఒక పీరియడ్ చట్టాలపై వివరించనున్నారు. లీగల్, లిటరసీ, చైల్డ్ రైట్స్ క్లబ్ను ఏర్పాటు చేసి సెమినార్లు, పోటీలు నిర్వహిస్తారు. కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయటానికి జిల్లాస్థాయిలో డీఈవో, మండలస్థాయిలో ఎంఈవోలు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. దీనిపై మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తారు. కార్యక్రమం నిర్వహణకు అందుబాటులో ఉన్న వనరులతోపాటు సీఎస్ఆర్ నిధులను ఉపయోగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే నేరుగా చెప్పుకునేలా ప్రతీ పాఠశాలకు ఒక బాలల రక్షణ అధికారిని నియమించాం. ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ప్రవర్తన, భద్రతపై ప్రత్యేకంగా చొరవ చూపాలి. అప్పుడే విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడినవారమవుతాం. – నీరజ, జీసీడీవో బడుల్లో ‘అభయం’ -
చట్టాలపై అవగాహన ఉండాలి
జగిత్యాల: చట్టాలపై యువత అవగాహన ఉండాలని, సోషల్ మీడియా విద్యాభివృద్ధికి ఉపయోగించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో స్నేహ కార్యక్రమం నిర్వహించారు. యువత, బాలికలు తమ హక్కులు, చట్టాలు, సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళల భద్రత, గౌరవం, సమాన అవకాశాల కోసం ప్రభుత్వం చట్టాలు, పథకాలు అమలు చేస్తోందన్నారు. సోషల్ మీడియా ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో మంచికి వినియోగించుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు, లింగవివక్ష, సైబర్ నేరాలు, మహిళల రక్షణ వంటి చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరణ్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయండిజగిత్యాల: గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని దేవా దాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పుష్కరఘాట్ల అభివృద్ధి, రహదారులు, పార్కింగ్, తాగునీరు, పారిశుధ్యం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించా రు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లా పరి ధిలో ఇరిగేషన్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, దే వాదాయ శాఖ ద్వారా చేపట్టే ఘాట్ల అభివృద్ధి, రోడ్ల ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిపారు. -
ప్రీ ప్రైమరీ మరింత బలోపేతం
మల్లాపూర్: ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీప్రైమరీ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జిల్లాలో కొత్తగా 69 ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. గతేడాది 51 ప్రీప్రైమరీ బడులు ప్రారంభించగా.. కొత్తవాటితో కలుపుకొని 120 కానున్నాయి. వచ్చే నెల 12నుంచి ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులోకి రానుంది. ఈ పాఠశాలల్లో ఫర్నిచర్, ఇండోర్, అవుట్డోర్ ఆట వస్తువులు, పెయింటింగ్స్ వంటి ఏర్పాట్లకు పాఠశాలకు రూ.1.70లక్షల చొప్పున కేటాయించనున్నారు ఒక్కో బడిలో ఇన్స్ట్రక్టర్.. ఆయా ప్రతి పాఠశాలలో ఒక ఇన్స్ట్రక్టర్తోపాటు ఒక ఆయాను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించనున్నారు. ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ.8వేలు, ఆయాకు రూ.6వేలు ఇవ్వనున్నారు. నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి త్రీమెన్ కమిటీ ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. ప్రీప్రైమరీకి ఎంపికై న బడుల జాబితా బీర్పూర్ మండలంలో కొండ్లపల్లి, మంగేళ, తుంగూర్, కొల్వాయి, భీమారం మండలంలో గోవిందారం, మన్నెగూడం, రాగోజిపేట, ఓడ్డాడ్, బుగ్గారం మండలంలో చిన్నాపూర్, గంగపురం, శేకల్ల, వెల్గొండ, ధర్మపురి మండలంలో నాగారం, తుమ్మెనాల, ఇప్పలపల్లి, బుడ్డోజిపల్లి, ఎండపల్లి మండలంలో కొండాపూర్, ఎండపల్లి, ఉండెడ, అంబారిపేట, గొల్లపల్లి మండలంలో చిల్వకోడూర్, చెందోలి, ఇస్రాజ్పల్లి, ఇబ్రహీంపట్నం మండలంలో కొజన్కొత్తూర్, తిమ్మాపూర్, గోధూర్, ఇబ్రహీపట్నం, జగిత్యాల రూరల్ మండలంలో పొలాస, చల్గల్, నర్సింగపూర్, తక్కళ్లపల్లి, జగిత్యాలఅర్బన్ మండలంలో పురాణిపేట, ఫోర్ట్, ధరూర్, తిప్పన్నపేట, కథలాపూర్ మండలంలో కలికోట, అంబారిపేట, తక్కళ్లపల్లి, దులూర్, కొడిమ్యాల మండలంలో తిర్మలాపూర్, కొడిమ్యాల, సంద్రాలపల్లి, రామకృష్ణాపురం, కోరుట్ల మండలంలో పైడిమడుగు, నాగులపేట, కోరుట్ల(గడి), ధర్మారం, మల్లాపూర్ మండలంలో రేగుంట, సాతారం, వేంపల్లి, గుండంపల్లి, మల్యాల మండలంలో ఒబులాపూర్, రాంపూర్, నూకపల్లి, ముత్యంపేట, మానాల, మేడిపల్లి మండలంలో కొండాపూర్, పోరుమల్ల, తొంబర్రావుపేట, మెట్పల్లి మండలంలో వెల్లుల, గాజులపేట, ఎస్సారెస్పీ క్యాంప్, బుడిగజంగంకాలనీ, పెగడపల్లి మండలంలో నంచెర్ల, సుద్దపల్లి, నామాపూర్, వెంగలాయిపేట, రాయికల్ మండలంలో కొత్తపేట, భూపతిపూర్ ఉన్నాయి. -
కల్లుగీతకు ప్రమాదకరంగా బెల్టుషాపులు
జగిత్యాలరూరల్: రాష్ట్రంలో గ్రామగ్రామాన బెల్టుషాపులు కల్లుగీత వృత్తికి ప్రమాదకరంగా మారా యని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఇటీవల కాలిపోయిన ఈత, తాటివనాన్ని శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. అ న్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనది గీతకార్మి క వృత్తి అని, ఇటీవల జిల్లాలో చాలా చోట్ల ప్రమాదవశాత్తు ఈత, తాటివనాలు కాలిపోవడంతో గీత వృత్తితో ఉపాధి పొందుతున్న వారికి తీవ్ర నష్టం వా టిల్లుతుందన్నారు. ప్రభుత్వం ఈత, తాటివనాన్ని నాటుకునేందుకు ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూ ములు కేటాయించాలన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్గౌడ్, సర్పంచ్ సతీశ్, మాజీ ఎంపీపీ రమేశ్బాబు, శ్రీని వాస్రెడ్డి, రాధకిషన్రావు, వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు. -
పోలీసుల ముందు జాగ్రత్త..
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండటంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఉభయవర్గాలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ వివాదం పెద్దది కాకుండా చూస్తున్నారు. శుక్రవారం ఉదయమే ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకుడు ముకేశ్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం చర్చకు సవాలు విసిరిన బీజేపీ నాయకులను కూడా హౌస్ అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ– కాంగ్రెస్ మధ్య పోరు.. ప్రెస్మీట్లు, ఆరోపణలు, పోస్టర్లకే పరిమితం కాకుండా సోషల్మీడియాకూ పాకింది. సోషల్మీడియాలో రెండు పార్టీల కార్యకర్తలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పోస్టులపైనా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఎంపీ– ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వర్గపోరు జగిత్యాల జిల్లా రాజకీయాలను అమాంతం వేడెక్కించాయి. -
వరి కొయ్యలను కాల్చొద్దు
వెల్గటూర్: వరి కొయ్యలు కాల్చడం వల్ల పర్యావరణం, భూసారానికి నష్టం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో రైతులు వరి కొయ్యలు కాల్చడం వల్ల 50 ఎకరాల్లో మంటలు వ్యాపించిన విషయమై శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల భూమిలో ఉన్న వానపాములు, జీవ ఎరువులను అందించె క్రిమి కీటకాలు అంతమవుతున్నాయని తెలిపారు. వరికొయ్యలు నేలలో కలియదున్నితే సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరుగుతాయన్నారు. దుక్కి దున్నే సమయంలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయని, దీంతో డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుందని అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, రైతులు పాల్గొన్నారు. -
24 గంటల్లో అన్లోడింగ్ చేయాలి
రాయికల్(జగిత్యాల): కొనుగోలు కేంద్రాల నుంచి లారీల ద్వారా తీసుకెళ్లిన ధాన్యాన్ని 24 గంటల్లో అన్లోడింగ్ చేయాలని అదనపు కలెక్టర్ లత సూచించారు. శుక్రవారం రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం శివమణి రైస్మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హమాలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, తద్వారా ధాన్యం లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేసి ఆలస్యం చేయకుండా లారీలను మిల్లులకు తరలించాలన్నారు. అన్లోడింగ్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట తహసీల్దార్ నాగార్జున ఉన్నారు. -
టీబీని నిర్మూలిద్దాం
జగిత్యాల: క్షయ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, టీబీని నిర్మూలిద్దామని డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్షయపై వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం, తెమడలో రక్తం పడటం, ఛాతిలో పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలుంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి పరీక్షలు చేయించుకుని మందులు వాడాలన్నారు. హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, సీనియర్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● ప్రస్తుత సీజన్ పంట రుణ ప్రణాళిక ఖరారు ● గతేడాదితో పోల్చితే రూ.153 కోట్లు అదనం
‘వానాకాలం’ రూ.1,693 కోట్లుజగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ పంటల రుణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో గతేడాది కన్నా అదనంగా రూ.153 కోట్ల రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు, ప్రసుత్త సీజన్లో ౖరైతులకు రూ.1,693 కోట్ల రుణాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లాలోని 35 బ్యాంకు శాఖల ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలోని బ్యాంకులు 10 శాతం మేర పంట రుణాలు ఇవ్వగా, మిగతా రైతులు పాతవి చెల్లించి, కొత్తగా రుణాలు తీసుకుంటున్నారు. లక్ష్యం మేరకు రుణాలు జిల్లాలో గ్రామీణ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిపి దాదాపు 130 శాఖలున్నాయి. అన్ని బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు లీడ్ బ్యాంకు మేనేజర్ రాంకుమార్ లక్ష్యాలను నిర్దేశించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 1,43,793 మంది రైతులకు రూ.2,821.52 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్లో 86,284 మంది రైతులకు రూ1,693 కోట్లు, యాసంగిలో 57,509 మంది రైతులకు రూ.1,128.61కోట్లు అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యం నిర్దేశించుకుంది. 35 బ్యాంకుల ద్వారా.. జిల్లాలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా, వానాకాలం సీజన్లో వాటి పరిధిలోని 53,258 మంది రైతులకు రూ.1,153.06 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 21 ప్రైవేట్ బ్యాంకుల ద్వారా 2,238 మందికి రూ.122.85 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా 14,442 మంది రైతులకు రూ.210.91 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా 16,346 మందికి రూ.206.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రైవేట్ బ్యాంకులు అంతంతే.. రైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రైవేట్ బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1,153.06 కోట్ల రుణాలు ఇస్తే, ప్రైవేట్ బ్యాంకులు 21 వరకు ఉండగా, కేవలం 9 బ్యాంకులు రూ.122.85 కోట్ల రుణాలు మాత్రమే ఇస్తున్నాయి. ప్రైవేట్బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ రూ. 14.49 కోట్లు, ఐసీఐసీఐ రూ.52.70 కోట్లు, సిటీ యూనియన్ బ్యాంకు రూ.17.98 కోట్లు ఇస్తుండగా, మిగతా బ్యాంకులు రూ.5–10 కోట్ల లోపునకే పరిమితమైనాయి. రైతులు ఏ బ్యాంకుకు వెళ్లినా పంట రుణాలు ఇవ్వాలని ఉన్నా, ప్రైవేట్ బ్యాంకులు లేనిపోని సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయి.రుణాల పంపిణీ ప్రారంభం అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు పాతవి చెల్లించి, కొత్త రుణం తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతీ రైతుకు పంట రుణం ఇస్తాం. రైతు పేరిట పట్టాదారు పాస్బుక్లో వ్యవసాయ భూమి ఏ మేరకు ఉంటే, ఆ మేరకు రుణం ఇస్తున్నాం. రుణాల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే తమ దృష్టికి తీసుకవస్తే సమస్య పరిష్కరిస్తాం. – రాంకుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్, జగిత్యాల -
పోస్టర్ వార్!
పొలిటికల్తారాస్థాయికి ఎంపీ– ఎమ్మెల్యే వైరంసాక్షిప్రతినిధి, కరీంనగర్: జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీనికి కొనసాగింపుగా.. మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే భోగ శ్రావణి వర్గం కూడా ఎమ్మెల్యేతో రాజకీయంగా తాడోపేడో తేల్చుకుంటామంటూ మాటల కత్తులు నూరుతున్నారు. ఇంతవరకూ మాటలకు, మైకులకే పరిమితమైన వీరి సవాళ్లు– ప్రతి సవాళ్లు పోస్టర్ల రూపంలో గోడల మీదకు ఎక్కాయి. బీజేపీ– కాంగ్రెస్ పార్టీలు ‘మీరు అవినీతి పరులంటే మీరే అవినీతి పరులు’ అంటూ పరస్పరం నిందించుకోవడం తీవ్రరూపం దాల్చింది. కేంద్రీయ విద్యాలయం భూకేటాయింపు విషయంలో మొదలైన విమర్శల పర్వం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. -
గీత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
మెట్పల్లిరూరల్/కోరుట్లరూరల్: గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వ కుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్, పెద్దాపూర్ గ్రామాల్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఈత వనాలను శుక్రవారం పరిశీలించారు. ఈ ఘటనతో దాదాపు 70 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని, తక్షణ సాయం కిందట రూ.40 వేలు అందజేశారు. అలాగే కోరుట్ల మండలం అయిలాపూర్, చిన్నమెట్పల్లి గ్రామాల్లో కాలిపోయిన ఈతవనాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా సాయం అందించేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
వేంకటేశ్వరస్వామికి క్షీరాభిషేకం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిఽ దిలో శుక్రవా రం స్వామి వారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీ ఈసెట్లో 112వ ర్యాంక్మల్లాపూర్(కోరుట్ల): మండలకేంద్రానికి చెందిన న్యావనంది నవీన్ శుక్రవారం విడుదలైన పీజీ ఈసెట్ (టీజీఈసీఈటీ–2026) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 112వ ర్యాంక్ సాధించాడు. పాలిటెక్నిక్(డిప్లొమా), బీఎస్సీ(మాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు లెటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో నవీన్ ప్రతిభ చాటాడు. పాలిటెక్నిక్ కౌన్సెలింగ్జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 200 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కౌన్సెలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రక్రియ జూన్ 1 వరకు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు తమ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా కోర్సులను ఎంపిక చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ జీవీఆర్, సాయిమధుకర్ పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలుధర్మపురి: మాదకద్రవ్యాల నిర్మూలనకు ధర్మపురి పట్టణంలోని వివిధ ప్రాంతాల్ల్లో శుక్రవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేశ్, సిబ్బంది డాగ్స్క్వా సాయంతో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కోసం కిరాణా దుకాణాలు, హోటళ్లు, పాన్షాపుల్లో తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తే కలిగే అనర్థాలపై యువతకు సీఐ అవగాహన కల్పించారు. వాటిని వినియోగిస్తున్న వారి సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. -
మరమ్మతుకొస్తే మూలకే..!
మెట్పల్లి: మన ఇంట్లో ఉన్న వస్తువు మరమ్మతుకు వస్తే ఏం చేస్తాం..?? వెంటనే బాగు చేయించి తిరిగి వినియోగంలోకి తెచ్చుకుంటాం. అలాగే దేనికై నా డబ్బులు ఖర్చు చేసే ముందు అది మనకు ఉపయోగపడుతుందా..? లేదా..? అని ఎంతో ఆలోచిస్తాం. మెట్పల్లి మున్సిపాలిటీలో అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం భారీగా దుర్వినియోగమవుతోంది. పోయేది తమ సొమ్ము కాదుకదా.. అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తుండడంతో రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు, చేపట్టిన నిర్మాణాలు పనికి రాకుండా పోతుండడం విమర్శలకు తావిస్తోంది. మరమ్మతుకొస్తే అంతే... నిర్మించారు..వదిలేశారు ఈ చిత్రంలో కనిపిస్తున్నది వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లు. సుమారు నాలుగేళ్ల క్రితం వీటిని నిర్మించారు. వ్యాపారులకు ఏమాత్రమూ ఉపయోగపడని ప్రాంతంలో ఈ షెడ్లను నిర్మించడంతో అక్కడకు వెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన షెడ్లు అప్పటి నుంచి నిరుపయోగంగానే ఉంటున్నాయి.వినియోగంలోకి తీసుకొస్తాం మినీ టిప్పర్ల మరమ్మతుకు టెండర్ నిర్వహించాం. సంబంధిత కాంట్రాక్టర్ తీరుతో కొంత జాప్యం జరుగుతోంది. అతనికి నోటీసులు జారీ చేశాం. ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకుపోతాం. తొందరలోనే వినియోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వర్రావు, డీఈఈ ఈ చిత్రంలో కనిపిస్తున్న రెండు మినీ టిప్పర్ వాహనాలను పట్టణంలో చెత్త సేకరణ కోసం కొనుగోలు చేశారు. కొంతకాలానికి అవి పాడైపోగా.. మరమ్మతు చేయించాల్సిన బల్దియా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ప్రస్తుతం వాటిని భగీరథ పంపుహౌజ్లో ఓ మూలన పెట్టేశారు. రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలను బాగు చేయించకుండా ఇలా వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వృథా అవుతున్న ప్రజాధనం వాహనాలు నడవక ప్రజల ఇబ్బందులు మెట్పల్లి బల్దియాలో వింత పరిస్థితి నిరుపయోగంగా వ్యాపారుల షెడ్లు -
గోదాములు నిర్మించరు.. గోడు తీర్చరు
కథలాపూర్: గ్రామాల్లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ ఆ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు గోదాములు లేకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మరోవైపు ధాన్యం సేకరణలో ఆలస్యం అవుతోంది. ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, కొత్తగా ధాన్యం తీసుకోబోమని రైస్మిల్లర్లు ప్రతి సీజన్లో చెబుతుండడంతో రైతులు ధాన్యం విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెటింగ్శాఖ తరఫున గోదాములు నిర్మిస్తే వరి, మక్కలతోపాటు ఇతర పంటలు కొనుగోలు చేసి అందులో నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మార్కెటింగ్శాఖకు ఆదాయం కూడా సమకూరుతుంది. రైతులకు ఇబ్బందులూ తొలగుతాయని రైతులు అంటున్నారు. స్థలాలు ఉన్నా.. నిర్మాణాలపై పట్టింపేదీ? కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. కానీ.. ధాన్యం నిల్వ చేసేందుకు ఒక్క గోదాం కూడా లేకపోవడం దారుణమని రైతులు అంటున్నారు. రైతులు విక్రయించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం ద్వారా మార్కెటింగ్ శాఖకు ప్రతి సీజన్లో పన్ను రూపంలో డబ్బులు సమకూరే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికి నిర్మాణలపై దృష్టిసారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో గోదాం నిర్మాణానికి అనువైన స్థలం ఉంది. మరోవైపు సబ్ మా ర్కెట్గా గుర్తించిన భూషణరావుపేటలో గోదాం నిర్మాణానికి సరపడా స్థలం ఉందని రైతులు చెబుతున్నారు. గంభీర్పూర్, చింతకుంట, తక్కళ్లపెల్లి, అంబారిపేటలోనూ అనువైన స్థలాలు ఉన్న ట్లు ఏకంగా అధికారులే గుర్తించారు. కథలాపూర్లో ఏఎంసీ కార్యాలయం సమీపంలోనే స్థలం గుర్తించి పలుమార్లు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. అయినప్పటికీ ఏళ్ల తరబడి అడుగు ముందుకు పడటంలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నిల్వ కోసం మార్కెటింగ్ శాఖతోపాటు గిడ్డంగుల సంస్థ, పౌర సరఫరాల శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గోదాములు నిర్మించే అవకాశాలు న్నాయి. పైగా నాబార్డు ఆర్థిక సహకారం కూడా అందిస్తుంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టిసారించి ధాన్యం నిల్వల కోసం గోదాముల నిర్మాణాలు చేపట్టాలని మండల రైతులు కోరుతున్నారు. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం ధాన్యం సేకరణలో తీవ్రమైన జాప్యం త్వరగా నిర్మించాలంటున్న రైతులు -
ప్రతిపాదనలు పంపించాం
కథలాపూర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో 2,500 టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. వారి నుంచి అనుమతి రాగానే గోదాం నిర్మిస్తాం. – రమణ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం మండల ప్రజలకు వ్యవసాయమే ప్రధాన వృత్తి. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు ఉపయోగపడే వాటిపై దృష్టిసారించకపోవడం బాధాకరం. ధాన్యం నిల్వ చేయాలంటే గోదాములు అవసరమని అందరికీ తెలుసు. మండలంలో ఒక్క గోదాం నిర్మించకపోవడం దారుణం. – బూస రమేశ్, రైతు, గంభీర్పూర్ క్లస్టర్కో గోదాం నిర్మించాలి పంట పండించడం ఒకెత్తయితే విక్రయించడం మరో ఎత్తవుతోంది. గోదాములు లేకపోవడం సమస్యని తెలిసినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వ్యవసాయ క్లస్టర్కొక గోదాం నిర్మించాలి. మండలంలో ఆరు గోదాంలు నిర్మించే అవకాశం ఉన్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – ఏనుగు గంగారెడ్డి, రైతు, సిరికొండ -
కోటేశ్వరస్వామి ఆలయంలో వేలం
వెల్గటూర్: ప్రముఖ పుణ్యక్షేత్రం కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజసామాగ్రి, కొబ్బరి ముక్కలు పోగుచేసుకునేందుకు గురువారం ఆలయం ఆవరణలో వేలం నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజసామగ్రికి రూ. 9.80లక్షలు, కొబ్బరిముక్కల సేకరణకు రూ.80వేలు, లడ్డూ పులిహోరకు రూ.3.20లక్షలు మొత్తం రూ.13.80లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ పర్యవేక్షకులు ఎం.రాజమౌళి, ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, సర్పంచ్ కోటయ్య, ధర్మకర్తలు వెంకటేశ్, రాయకోటి, బుద్దె రవి, రాజిరెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
139 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ
కథలాపూర్: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో 385 గ్రామపంచాయతీలుండగా.. 288 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నవారికి బదిలీ అవకాశం ఇచ్చారు. సీనియార్టీ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 139 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. వీరందరికీ ఈనెల 31న బదిలీ ఉత్తర్వులు అందిస్తామని, వచ్చేనెల ఒకటిన బదిలీ అయిన స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుందని డీపీవో మదన్మోహన్ తెలిపారు. డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు● ప్రిన్సిపాల్ రామకృష్ణ జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27లో రెండు అడ్వాన్స్డ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. విద్యార్థినులకు ఉన్నత విద్యతోపాటు, త్వరితగతిన ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. బీకాంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, బీఎస్సీ హెల్త్కేర్లో 60 సీట్లతోపాటు, రూ.7వేల ప్రోత్సాహం అందుతుందన్నారు. విద్యార్థినులు చదువుకుంటూనే సంపాదించుకునే వీలుందన్నారు. వివరాలకు కళాశాల కో–ఆర్డినేటర్ చంద్రయ్యను 94913 65275 నంబర్లో సంప్రదించాలని కోరారు. బల్దియాలో అవినీతిపై చర్చకు సిద్ధమా..?జగిత్యాలటౌన్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ ఖన్నా ఖండించారు. ఎమ్మెల్యేకు అవినీతి మరక అంటించేలా పదేపదే ఆరోపణలు చేస్తున్న శ్రావణి ఆమె మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిపై తహసీల్ చౌరస్తా వేదికగా బహిరంగ చర్చకు రావాలని పోస్టర్లు ముంద్రించారు. వాటిని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అంటించడం చర్చనీయాంశంగా మారింది. రక్తదానం గొప్పది ● ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి జగిత్యాల: రక్తదానంతో కొందరి ప్రాణాలు నిలబడతాయని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఐఎంఏ హాల్లో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆపదలో రోగులుకు రక్తం కొరత లేకుండా ప్రతిఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఐఎంఏ కోశాధికారి సుధీర్కుమార్ పాల్గొన్నారు. అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయండిజగిత్యాల: విద్యాశాఖలో 2026–27లో అక్రమ డిప్యూటేషన్లకు అవకతవకలకు తావు లేకుండా చూడాలని డీఈవో రాముకు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్సుందర్, అంబటి భూమేశ్వర్ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిప్యూటేషన్లు ప్రోత్సహించవద్దని, అలాంటి వాటిని వెంటనే రద్దు చేయాలని కోరారు. -
కబ్జా కోరల్లో చెరువులు
బుగ్గారం: గ్రామీణ జీవనానికి ఆధారమైన చెరువులు, కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకుని కుచించుకుపోతున్నాయి. బుగ్గారం మండలంలోని పలు గ్రామాల్లో వాటి ఉనికే కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ తాగు, సాగునీటికి ప్రధాన వనరులుగా చెరువులు, కుంటలే నిలుస్తున్నాయి. అలాంటి చెరువులు కబ్జాదారుల ఆక్రమణలకు బలవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో వాటి స్వరూపాన్నే కోల్పోతున్నాయి. అన్ని చెరువులదీ అదే పరిస్థితి బుగ్గారం మండలంలో పది గ్రామాలున్నాయి. ఇక్కడ మొత్తంగా 24 చెరువులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో బుగ్గారంలో 4, గంగాపూర్లో 3, మద్దునూర్లో 3, వెల్గొండలో 3, సిరివంచకోటలో 3, శెకెల్లలో 3, గోపులాపూర్లో 2, చిన్నాపూర్, సిరికొండ, యశ్వంతరావుపేటలో ఒకటి చొప్పున ఉన్నాయి. వీటన్నింటి విస్తీర్ణం 772.16 ఎకరాలుగా ఉంది. శెకెల్లలో సర్వే నంబరు 337లోగల చెరువు విస్తీర్ణం 146.16ఎకరాలు. సిరివంచకోటలోని చెరువు 97.39, వెల్గొండలోని బోలి చెరువు 94.38, సిరివంచకోటలోని పల్ల కుంట 79.08 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అయితే చాలావరకు వీటి విస్తీర్ణం కాగితాలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చెరువులకు సమీపంలో వ్యవసాయ భూములున్న కొందరు వ్యక్తులు క్రమక్రమంగా ఆక్రమించుకోవడంతో వీటి విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. చెరువులకు సంబంధించిన సమాచారం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల వద్ద వేర్వేరుగా ఉంది. రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం మండలంలో 24 చెరువులుండగా.. ఇరిగేషన్ అధికారుల ప్రకారం 29 చెరువులుగా ఉండడం గమనార్హం. ఫీడింగ్ కాలువలు కనుమరుగు మండలంలో అటవీ భూములున్నాయి. గుట్టలు, ఎత్తైన ప్రాంతాలూ ఉన్నాయి. వర్షాలు కురిసినప్పుడు వీటి నుంచి వచ్చే ప్రవాహాలతో చెరువులు, కుంటలు వేగంగా నిండుతాయి. ఏళ్ల తరబడి గుట్టల నుంచి వచ్చే నీటి ప్రవాహాలతో సహజసిద్ధంగా కొన్ని కాలువలు ఏర్పడ్డాయి. ఆ కాలువలు ప్రభుత్వ, పట్టా భూముల్లో ఏర్పడినప్పటికీ రైతులు వాటిని ఏనాడూ ధ్వంసం చేయలేదు. ప్రస్తుతం మా రుతున్న పరిస్థితుల దృష్ట్యా భూములకు డిమాండ్ పెరగడం.. యాంత్రీకరణ అందుబాటులోకి రావడంతో వీటి సమీపంలో పొలాలు గల రైతులు, ఇతర వ్యక్తులు వాటిని పూడ్చివేస్తున్నారు. ఫలితంగా చెరువులు నిండడానికి ప్రధానాధారమైన సహజంగా ఏర్పడిన ఫీడింగ్ కాలువలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఇటీవల గంగాపూర్లో కొంతమంది వ్యక్తులు తమకు పట్టా ఉందనే కారణంతో స్థానికంగా ఉన్న ఓ కుంటను మొరంతో పూడ్చివేయడానికి పూనుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాధు మేరకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. గొలుసుకట్టు వ్యవస్థ ధ్వంసం మండలంలోని ప్రతి చెరువు మరో చెరువుతో అనుసంధానించబడి.. గొలుసుకట్టు వ్యవస్థగా ఏర్పడి ఉంది. ఈ విధానంతో ఒక చెరువు నిండగానే ఎక్కువైన నీటిని మరో చెరువులోకి మళ్లించేలా కాలువలు (ఒర్రెలు) ఉన్నాయి. వీటిలో కొన్ని సహజంగా ఏర్పడగా.. మరికొన్ని ఏళ్ల క్రితమే నిర్మించారు. వీటిలో సహజంగా ఏర్పడిన కాలువలు చాలావరకు ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి. మండలంలోని చెరువుల కింద మొత్తం 3,543.49 ఎకరాల వ్యవసాయ భూమి ఆయకట్టుగా ఉంది. చెరువుల్లో పూడిక పేరుకుపోతుండడంతో యాసంగిలో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోవడం సర్వసాధారణంగా మారింది. క్రమక్రమంగా ఆక్రమణ కానరాని ఫీడింగ్ కాలువలు గొలుసుకట్టు వ్యవస్థ ధ్వంసం స్వరూపం కోల్పోతున్న కుంటలు -
బన్నీ వేసవి యాత్ర –19 / సులువైన గణితం
సాయంత్రం తాతయ్య అరుగు మీద కూర్చుని ‘రండి పిల్లలూ, లెక్కలు చేద్దాం’ అని పిలిచాడు. బన్నీ దగ్గర 5 చింతగింజలు ఉన్నాయి. తాతయ్య ఇంకో 3 ఇచ్చాడు. తాతయ్య: ‘బన్నీ, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 + 3 = ?’ బన్నీ లెక్కపెట్టి ‘8 ఉన్నాయి తాతయ్యా’ అన్నాడు. “ Very good!’ అన్నాడు తాతయ్య. స్వప్న దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి. రామ్కి 4 ఇచ్చింది. తాతయ్య: ‘స్వప్న, నీ దగ్గర ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 10 – 4 = ?’ స్వప్న: ‘6 బిస్కెట్లు మిగిలాయి’ అంది. రామ్ దగ్గర 7 పెన్సిల్స్ ఉన్నాయి. చుక్కకి 2 ఇచ్చాడు. మళ్లీ తాతయ్య 5 ఇచ్చాడు. తాతయ్య: ‘రామ్, ఇప్పుడు లెక్క చెప్పు. 7 – 2 + 5 = ?’ రామ్ ఆలోచించి ‘10 పెన్సిల్స్’ అన్నాడు. తాతయ్య మెచ్చుకుని ‘లెక్కలు ఇలా రోజూ చేస్తే తేలిక’ అన్నాడు. పిల్లలకి మాట : చిన్న చిన్నగా లెక్కలు చేస్తూ ఉంటే జీవితంలో సమస్యలను పరిష్కరించడం తెలుస్తుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
వద్దంటున్నా.. వినరేం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ప్రతి సీజన్లో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. వరి కోయించిన తర్వాత రైతులు వరి మొదళ్లు(కొయ్యకాళ్లను) కాల్చేస్తున్నారు. దీంతో పంటభూమికి ఉపయోగం లేకపోగా.. ఆ మంటల్లో విలువైన పైపులు, డ్రిప్పైపులు, కరెంట్ వైర్లు, కరెంట్ మోటార్లు, స్టార్టర్లు, ఈత, తాటి వనాలు కాలిపోయి భారీగా నష్టపోతున్నారు. వేసవిలో నిప్పు పెడితే జరిమానా విధిస్తామని ఇటీవల జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంలో పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. నష్టమే ఎక్కువ.. గతంలో పంట అవశేషాలు (చెత్తాచెదారం, పత్తి కట్టె, వరి కొయ్యకాళ్లు) కాలబెట్టకుండా వర్షాలు పడగానే సాగు భూమిలోనే దున్నేవారు. ప్రస్తుతం ఒక్క అగ్గిపుల్ల గీసి కాల్చేస్తున్నారు. అనంతరం పంట దిగుబడి కోసం బస్తాల కొద్ది రసాయన ఎరువులు కుమ్మరిస్తున్నారు. కాని ఫలితం మాత్రం కనబడటం లేదు. ఈ నేపథ్యంలో రైతులను చైతన్యం చేసేందుకు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి
సుల్తానాబాద్రూరల్/పెద్దపల్లి/ఓదెల: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి((39) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి, నాంసానిపల్లెకు చెందిన పోతగంటి రాజు కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్కు పనినిమిత్తం వెళ్తున్నాడు. ఈక్రమంలో కాట్నపల్లి శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ముందు టైర్ ఎక్కగా నిరంజన్రెడ్డి మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యులను విప్ విజయరమణరావు పరామర్శించారు. ఉప సర్పంచ్ మృతితో ఆయన స్వగ్రామం మడకలో విషాదం అలముకుంది. -
మద్యం తాగొచ్చి వేధింపులు..
రామడుగు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను భార్య రోకలి బండతో మోది హత్య చేసింది. ఈ ఘటన రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొక్కెరకుంట గ్రామానికి చెందిన వేముండ్ల రాజయ్య(70) కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎకరం వ్యవసాయ భూమి విక్రయించాడు. వచ్చిన డబ్బులతో నిత్యం తాగివచ్చి భార్య వేముండ్ల కనుకమ్మ, కొడుకు శేఖర్తో గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి సైతం మద్యం తాగి వచ్చాడు. భార్యతో గొడవ పడి నిద్రపోయాడు. రాజయ్య పడుకున్న తరువాత కనుకమ్మ ఇంట్లో ఉన్న రోకలి బండతో తల, చాతి, మోకాళ్లపై మోది చంపేసింది. కూతురు నంగి సుజాత బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య రామడుగు మండలం కొక్కెరకుంటలో ఘటన -
కొనుగోళ్లు వారంలో పూర్తికావాలి
ఇబ్రహీంపట్నం: ధాన్యం కొనుగోళ్లు వారంలోపు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని వర్షకొండలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆలస్యం చేయకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. డాటా ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. ఆర్డీవో నర్సింహారావు, డీసీఎస్వో జితేందర్రెడ్డి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేశ్, ఎంపీవో రామకృష్ణరాజు, సర్పంచు పొనకంటి వెంకట్, రైతులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగవంతం చేస్తాం జగిత్యాలరూరల్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. చల్గల్లో స్థల పరిశీలన చేశారు. నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలు సమగ్రంగా ప్రణాళికబద్ధంగా అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, రూరల్ తహసీల్దార్ హకీం పాల్గొన్నారు. -
పొదుపు సంఘాల్లో పారదర్శకత
ధర్మపురి: మహిళా సంఘాల్లో పొదుపు చేసిన డబ్బుల్లో అనేక అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయి. వీటితో సంఘాల్లో గొడవలు పడి మహిళా సంఘాలు రోడ్డున పడి విమర్శలకు తావిచ్చిన సంఘటనలున్నాయి. వీటిని అరికట్టడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రవేశపెట్టిన కటాఫ్ షీట్ల విధానం మంచి సత్ఫలితాలిస్తున్నాయని అంటున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 5,450 మహిళా సంఘాలున్నాయి. ప్రతిరోజు మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు, పొదుపు డబ్బుల లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే నమోదు చేయడంతో పాటు పుస్తకాల్లో జమ, ఖర్చులు నమోదు చేస్తున్నారు. బ్యాంకుల్లో జమ చేసిన డబ్బులు, రుణ వాయిదాల చెల్లింపులు తదితర వాటిని పుస్తకాల్లో రాయడంలో వీవోఏలు చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మహిళా సంఘాలు చెల్లించిన డబ్బుల్లో స్పష్టత లేకుండాపోతోంది. పుస్తకాలు, కంప్యూటర్లో లెక్కలన్నీ ఒకేలా లేకపోవడంతో సంఘాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి. కటాఫ్ షీట్లతో అక్రమాలకు చెక్ కేంద్రం ప్రవేశపెట్టిన కటాఫ్ షీట్ల విధానంతో అక్రమాలు జరగకుండా తోడ్పడుతుంది. కటాఫ్ షీట్ల తయారీతో పొదుపు సంఘం ఆర్థిక స్థితిగతులను సభ్యులతోపాటు ఉన్నతాధికారులు సులభంగా గుర్తించడానికి వీలుంటుంది. ఎక్కడైనా వీవోఏలు, గ్రూప్ లీడర్లు అక్రమాలకు పాల్పడితే ఆన్లైన్ ద్వారా నిమిషాల్లో తెలిసిపోతుంది. ఆర్థిక సంఘాల పొదుపు సంఘలకు సంబందించిన లెక్కల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పొదుపు సంఘాల వారిగా కటాఫ్ షీట్లను తయారు చే స్తున్నారు. లెక్కలన్నీ ఆన్లైన్లో నమోదు చేసి సంఘాల్లో నమ్మకం కలిగేలా చేస్తుంది. – రఘువరణ్, డీఆర్డీవో జిల్లాలో మొత్తం గ్రామైక్య సంఘాలు 3 మండలాలు 20 గ్రామాలు 380 -
బాల గేయం..!
ఉరుకుల పరుగుల ఓ ఉడుతా... ఊయల ఊపుత వచ్చి ఊగమ్మా..! గెంతులు గెంతే ఓ కోతి కొబ్బరి కుడకలు ఇస్తా కొరుక్కు తినవమ్మా..! భౌ భౌ అరుపుల ఓ బేబీ నీకు భోజనం పెడతా భోంచేయమ్మా..! మ్యావ్..మ్యావ్ మీసాల ఓ పిల్లి కూన తియ్యటి పాలు పోస్తా తాగి పోవమ్మా..! మే.. మే నెలల ఓ బుజ్జీ మేకా మా తోటకు పోదాం చక చక రారా...! కావ్..కావ్ కూతల ఓ నల్ల కాకీ కుండడు నీళ్లిస్త కూచోవమ్మా...! కూ.. కూ పాటల ఓ కోకిలమ్మా కొండపల్లి బొమ్మిస్తా ఆడుకోవమ్మా..! చిట్టి చిట్టి పలుకుల ఓ చిలకమ్మా నీకు జాంపండిస్తా మాటాడమ్మా..! ఆటల పాటల ఓ నేస్తాలూ అలుగక నాతో రావాలి కబుర్ల పండుగ చేయాలి..! చిలిపి చేష్టల ఓ చిన్నారి... చీకు చింతలూ వదలాలి చిందులు వేస్తూ నవ్వాలి..!! – డాక్టర్ కటుకోఝ్వల రమేశ్, కవి, రచయిత, ఖమ్మం జిల్లా -
ఇంధన ధరలు తగ్గించాలి
జగిత్యాలటౌన్: కేంద్రప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ఖన్నా డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరులతో మట్లాడారు. కేంద్రీయ విద్యాలయం స్థల కేటాయింపు విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, నియోజకవర్గ ఇన్చార్జి శ్రావణి వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అండదండలతో చైర్మన్గా ఎన్నికై న భోగ శ్రావణి ఆయనపైనే విమర్శలు చేయడం దారుణమన్నారు. సమావేశంలో మైనార్టీ నాయకుడు ఖుర్షీద్ అలీ, ద్యావనపెల్లి రాజేందర్, భోగ నాగభూషణం, ఉషకోల గంగాధర్, కమటాల జగదీష్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా బీరయ్య పట్నాలు
రాయికల్: మండలంలోని అల్లీపూర్లో బుధవారం బీరయ్య పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆయనను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్ గౌతమి, ఎంపీటీసీ మోర వెంకటేశ్వర్లు, సంఘ నాయకులు ఉన్నారు. ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలురాయికల్: మండలంలోని రామోజీపేటలో శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు అగ్నిగుండాల ప్రవేశం చేపట్టారు. శివసత్తులు, భక్తులు అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. జగిత్యాలటౌన్: అరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు మద్దతుధరతోపాటు క్వింటాల్కు రూ.వెయ్యి ప్రోత్సాహకం అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి కోరారు. ఆరుతడి పంటల సాగుకు ప్రధాన అడ్డంకిగా మారిన కోతుల బెడద నివారణకు జిల్లాకో స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎంకు లేఖ రాశారు. ఆయిల్ పాం సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీని ఆరుతడి పంటలకూ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ ఉచిత విద్యుత్ అందించగా.. కేసీఆర్ కాళేశ్వరం, మిషన్ కాకతీయతో సాగునీటి వనరులు పెరిగాయని, అదే సమయంలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పడిపోయిందని పేర్కొన్నారు. కోతుల బెడద నివారిస్తే పప్పుదినుసులు, కూరగాయల సాగు పెరుగుతుందని పేర్కొన్నారు. పోచమ్మకు బోనాలుపెగడపల్లి: మండలంలోని బతికపల్లిలో శ్రీమద్విరాట్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. సర్పంచ్ ముంజ మహేశ్వరి, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రమేశ్, మారుతి, మురళీచారి, మనోహర్, వెంకటేశ్వర్లు, హన్మండ్లు, రాజమౌళి, రాంమోహన్, కుల పెద్దలు పాల్గొన్నారు. మామిడి రైతులను ఆదుకోవాలిరాయికల్: మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని ధర్మాజీపేటలో అగ్ని ప్రమాదంలో మామిడితోట కాలిపోయి నష్టపోయిన రైతు లావుడ్య సురేష్ను బుధవారం పరామర్శించారు. మామిడి రైతులు కొన్నేళ్లుగా వివిధ కారణాలతో నష్టపోతున్నారని తెలిపారు. దీనికితోడు అగ్ని ప్రమాదాల్లో తోటలు కాలిపోయి నష్టం రెండింతలైందన్నారు. ఆమె వెంట నాయకులు బర్కం మల్లేష్, లావుడ్య నందునాయక్, మారంపల్లి సాయికుమార్, తిరుపతి, రాంప్రసాద్ తదితరులు ఉన్నారు. -
శిక్షణతో ఆత్మవిశ్వాసం
ప్రతిరోజు వచ్చి గణితంలో చిట్కాలు నేర్చుకున్నా. కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఎలా రాస్తే హ్యాండ్రైటింగ్ బాగుంటుందో ఉపాధ్యాయులు నేర్పించారు. ఇలాంటి శిక్షణ ఇంకొద్ది రోజులు ఉంటే ఉంటే బాగుండేది. అరాధ్యాయా, 8వ తరగతి శిక్షణ ఎంతో ఉల్లాసంగా అనిపించింది. మళ్లీ వచ్చే వేసవిలో కూడా ఇలాగే శిక్షణ ఇవ్వాలి. చెస్, అబాకస్ నేర్చుకున్నాను. నా తోటి విద్యార్థులతో ఆడుతూపాడుతూ అన్ని అంశాల్లో శిక్షణ తీసుకోవడం బాగుంది. మంచిమంచి విషయాలు చెప్పారు. – సాయిహర్ష, ఆరో తరగతి ప్రతి వేసవిలో ఇలాంటి సమ్మర్క్యాంపులు నిర్వహిస్తే విద్యార్థులకు నైపుణ్యం పెరుగుతుంది. నేను తెలుగు హ్యాండ్రైటింగ్, కంప్యూటర్ విద్య, క్యారం, చెస్ మొదలైనవి నేర్చుకున్నాను. మంచిగా అనిపించింది. నాతోపాటు విద్యార్థులను తీసుకెళ్లా. – మండలోజి అనన్య, 9వ తరగతివేసవి కాలంలో వివిధ రకాల్లో శిక్షణ విద్యార్థులకు ఇవ్వడం వలన వారిలోని ప్రతిభను వెలికి తీయవచ్చు. ఈ శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. జ్ఞానం కూడా పెరుగుతుంది. స్కూల్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. – రాజన్న, పీఎంశ్రీ పాఠశాల హెచ్ఎంఇబ్రహీంపట్నం: పరీక్షలు ముగియగానే వేసవిలో ఎండలో తిరగకుండా.. చెరువులు, కుంటలు, కాలువల వైపు వెళ్లకుండా విద్యార్థులకు వేసవిశిక్షణ శిబిరాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి అందులోని 100 మంది ఆరో తరగతి నుంచి 9వ తరగతి పిల్లలకు ఈనెల 11 నుంచి 25 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల దాకా ప్రతిరోజు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా వారికి ఉచితంగా అల్పాహారం అందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా లైవ్ స్కిల్స్, ఇండోర్ గేమ్స్, స్టోరీ టెల్లింగ్, కుట్లు, అల్లికలు, భాష ఉత్సవాలు, క్విజ్ పోటీలు, స్థానిక సంప్రదాయ ఆటల పోటీలు, కంప్యూటర్ పరిజ్ఞానం, చెస్, క్యారంలో తర్ఫీదు ఇచ్చారు. పిల్లలు కూడా ఉల్లాసంగా గడిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు హారిక (25) అనే వివాహిత భర్తతో గొడవపడి క్షణికావేశంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. రంగసాయిపల్లి గ్రామానికి చెందిన హారికను రెండు సంవత్సరాల క్రితం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు శరత్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె మానసికస్థితి సరిగా లేక తల్లిదండ్రులను తరచూ డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేదని, భర్తతోనూ డబ్బుల విషయంపై గొడవపడేదని ఎస్సై పేర్కొన్నారు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని తండ్రి గుడ్ల రాజయ్య ఫిర్యాదు చేశాడు. మృత్యువే గెలిచిందిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నెల రోజులుగా చేస్తున్న జీవన్మరణ పోరాటంలో ఆ యువరైతు చివరికి ఓడిపోయాడు. రూ.10లక్షలు వెచ్చించి చికిత్స అందించినా ప్రాణాలు నిలువలేదు. కుటుంబానికి పెద్ద దికై ్కనా రైతు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన రైతు ముత్యాల బాపురెడ్డి(43) నెల రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. మొదట కరీంనగర్లోని ఓ ప్రైవేట్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని కోమాలోనే 20 రోజులపాటు చికిత్స పొందుతున్న క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం మరణించాడు. మృతునికి భార్య మానస, ఇద్దరు కుమారులు తరుణ్, వరుణ్ ఉన్నారు. -
38.0/28.0
7గరిష్టం/కనిష్టంవాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. వేలాడుతున్న వైర్లు నడికుడలో ఈదురుగాలులకు ఎగిరిపోయిన పైకప్పు ఈదురుగాలుల బీభత్సంమల్లాపూర్/ఇబ్రహీంపట్నం/మేడిపల్లి: మల్లాపూర్ మండలం నడికుడ, ఇబ్రహీంపట్నంలో మంగళవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నడికుడలో మహిపాల్రెడ్డి ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. కుటుంబసభ్యులందరూ బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. ఇబ్రహీంపట్నం మండలంలో 18 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భీమారం మండలం ఈదులలింగంపేటకు చెందిన కాయితి శంకర్ పౌల్టీఫాం రేకులు కొట్టుకుపోయాయి. -
వినరు.. కనరు
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ.. అవినీతికి కేరాఫ్గా నిలుస్తోంది. ఫలితంగా బల్దియాలో పనిచేసేందుకు బదిలీపై రావాలంటేనే అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో నెల వ్యవధిలోనే అటు ఏసీబీ అధికారులు, ఇటు విజిలెన్స్ అధికారులు ఏకధాటిగా 16గంటలకు పైగానే సోదాలు చేసి ప్రతి ఫైల్ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బల్దియాలోని ప్రతి విభాగంలోనూ అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్తోపాటు పలువురు బదిలీపై వెళ్లారు. తాజాగా ఇక్కడకు కమిషనర్గా సత్యప్రణవ్, ఇతర అధికారులు వచ్చారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపాలిటీలో పనిచేసేందుకు సదరు అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రజలకు సత్వర సేవలు అందించలేకపోతున్నారు. ఏదైనా సమస్యతో వస్తే తీవ్రమైన జాప్యం జరుగుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ సమస్యను వినేవారు.. పరిష్కరించేవారు లేరా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన కమిషనర్కు సవాళ్లే.. నిత్యం ఫిర్యాదులు, ఏసీబీ, విజిలెన్స్ అధికారుల దాడుల నేపథ్యంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ పనిచేస్తున్న స్పందన బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో గ్రూప్–1 అధికారి సత్యప్రణవ్ నియమితులయ్యారు. అయితే ఇక్కడ కమిషనర్గా పనిచేయాలంటే సవాల్తో కూడుకున్నదే. మున్సిపాలిటీలో అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకుని.. చివరకు ఏసీబీ, విజిలెన్స్ తనిఖీల వరకు వెళ్లింది. అధికారుల సోదాల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా ముటేషన్లకు సంబంధించి అక్రమాలు, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం, ట్రేడ్ లైసెన్స్, ఇంజినీరింగ్ సెక్షన్, టెండర్లు సక్రమంగా లేకపోవడం, మున్సిపల్ కాంప్లెక్స్కు టెండర్ వేయకపోవడం, శానిటేషన్లో అక్రమాలు, ఇలా అనేకం గుర్తించారు. ప్రతి విభాగం ఫైళ్లను పట్టుకెళ్లారు. సదరు ఫైళ్లను పరిశీలిస్తున్న అధికారులు.. వాటిపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం వివిధ పనుల నిమిత్తం ప్రజలు దరఖాస్తు చేసుకున్నా.. సకాలంలో సేవలు అందడం లేదు. గాడిన పడేనా..? మున్సిపల్కు ఇటీవలే కొత్త పాలకవర్గం ఏర్పడింది. చైర్పర్సన్గా సమిండ్ల వాణి నియమితులయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపాలిటీ గాడినపడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉంది. రెవెన్యూ, శానిటేషన్, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్, ఎస్టాబ్లీష్మెంట్ సెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. వైస్ చైర్మన్కు కుర్చీ ఎక్కడ..? ఫిబ్రవరి 16న పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. అయినప్పటికీ బల్దియాలో వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్ మున్నాకు చాంబర్ కేటాయించలేదు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వైస్ చైర్మన్గా ఉన్నప్పటికీ చాంబర్ కేటాయించడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీలో ప్రజలు ఇళ్ల నిర్మాణ అనుమతులు, మ్యూటేషన్లు, అసెస్మెంట్లు ఇలా అనేక పనుల నిమిత్తం దరఖాస్తు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణ అనుమతులు 21రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి వారం రోజుల్లోనూ ఇవ్వొచ్చు. అయినప్పటికీ అధికారులు గడువు ముగిసినా రోజుల తరబడి ఫైల్ను దగ్గర ఉంచుకుని.. ఆచితూచిగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిసింది. మరోవైపు వేసవికాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఇళ్లు నిర్మించుకునేవారికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ముటేషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. -
ప్రజల సమస్యలు పరిష్కరించాలి
రాయికల్: కౌన్సిల్ సమావేశంలో సభ్యులు తీసుకొచ్చిన ప్రజా సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యేసంజయ్కుమార్ అన్నారు. రాయికల్ మున్సిపల్ సమావేశాన్ని చైర్మన్ కటుకం రవీందర్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పట్టణంలో వేసవి కాలం దృష్ట్యా పలు వార్డుల్లో నీటి సమస్య అధికంగా ఉందని, 1, 9, 10, 12వార్డుల్లో అమృత్ 2.0 పైప్లైన్తో డ్యామేజీ అయిన రహదారులకు మరమతు చేయించాలన్నారు. వీధి దీపాల సమస్య పరిష్కరించాలని సూచించారు. వైస్ చైర్మన్ తురగ సౌజన్య మాట్లాడుతూ సొంత ఇల్లు లేని వారు చనిపోతే దహన సంస్కారాల కోసం ప్రత్యేక షెడ్లు నిర్మించాలని కోరా రు. చైర్మన్ రవీందర్ మాట్లాడుతూ సమస్యలను నో ట్ చేసుకుని దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ మి షన్భగీరథ కింద పట్టణంలో రెండు ట్యాంకులు నిర్మించామని, రూ.16 కోట్లతో సమస్యలను పరి ష్కరిస్తామన్నారు. 13 అంశాలను ఏకగ్రీంగా తీర్మానించారు. మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి.శ్రీని వాస్గౌడ్, కౌన్సిలర్లు ప్రశాంతి, రాకేష్నాయక్, మానస, గంగాధర్, మహేశ్వరి, గంగలక్ష్మీ, శ్రీధర్, చిన్న ధర్మపురి, అధికారులు పాల్గొన్నారు. లారీల కొరత లేకుండా చూస్తాం అనంతరం ఎమ్మెల్యే రాయికల్లోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మక్కలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి జగిత్యాలరూరల్: మహిళాసాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సారంగపూర్ మండలం అర్పపల్లిలో రూ.10లక్షలతో నిర్మించే మహిళా సంఘం భవనాలకు భూమిపూజ చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. సర్పంచ్ సోల్లు సురేందర్ పాల్గొన్నారు. -
ఎంఆర్ లినాక్తో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్: ఎంఆర్ లినాక్తో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ భరత్ చంద్ర తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బ్రెస్ట్, ఊపిరితిత్తులు, నోటి, సర్వైకల్ కేన్సర్లు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేన్సర్ చికిత్సలో రేడియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది ట్యూమర్ కణాలను నాశనం చేయడమే కాకుండా రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. దేశంలో తొలిసారిగా యశోద హాస్పిటల్స్లో ఎలెక్టా సంస్థ రూపొందించిన అత్యాధునిక ఎంఆర్– లినాక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రీట్మెంట్ ప్లానింగ్, తక్కువ దుష్ప్రభావాలు, అధిక మోతాదులో రేడియేషన్ను సురక్షితంగా అందించే సామర్థ్యం ఈ సాంకేతికత ప్రత్యేకతలని తెలిపారు. ప్రోస్టేట్, సర్వైకల్, ప్యాంక్రియాటిక్, రెక్టల్ కేన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో ఎంఆర్– లినాక్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యశోద రేడియేషన్ ఆంకాలజిస్ట్ భరత్ చంద్ర -
అమ్మ కూచి పిల్లలం !
అమ్మ కూచి పిల్లలం ఉమ్మకోరు మల్లెలం వెన్నతిన్న వారలం చిన్నగున్న పోరలం! వెచ్చనైన ఆ తల్లి ఒడి మచ్చికై న మా తొల్లి బడి ఆ తల్లి ఒడిలో శయనిస్తం మా తొల్లి బడిలో విహరిస్తం అమ్మ చంక నెక్కుతాం నాన్న చేతికి చిక్కుతాం అమ్మ ఇచ్చు ముద్దులు నాన్న చెప్పు సుద్దులు ! వెండి గిన్నె నాన్న తెచ్చు వండి బువ్వ అమ్మ ఇచ్చు తియ్యగా మేము తింటాం హాయిగా ఇక ఆడుకుంటాం ! క్రమశిక్షణతో పొందుగుంటం అక్షర శిక్షణను అందుకుంటం గుడి గంటను కుద్దుగా వింటాం బడిబాటను ముద్దుగా కంటాం ! – గుర్రాల లక్ష్మారెడ్డి, కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా -
కేవీకి నర్సింగాపూర్లో స్థలం కేటాయింపు
జగిత్యాలరూరల్: జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి నర్సింగాపూర్లో స్థలం కేటాయించామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 437లోని స్థలాన్ని కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి మంగళవారం పరిశీలించారు. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని తెలిపారు. కేవీకి ఆరెకరాలు కేటాయించామన్నారు. ఇప్పటికే రూ.33 కోట్లతో ఐటీఐ, ఈఏటీఏ సెంటర్ తెచ్చామని, వృద్ధాశ్రమాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామని వెల్ల డించారు. చల్గల్లోని వాలంతరి భూములు 12ఎకరాలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు కేటాయించామన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు బండ శంకర్, సమిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలిజగిత్యాల: ధాన్యం కొనుగోళ్లను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కొనుగోళ్లపై కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమీక్షించారు. 10 నుంచి 15శాతం ధాన్యం కేంద్రాల్లోనే ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 10 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.59 లక్షల టన్నులు కేంద్రాలకు వస్తే.. 3.29 లక్షల టన్నులు కొన్నామని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. త్వరలోనే 100 శాతం కొనుగోలు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ లత, పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి, రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ పనులు షురూ
జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకున్నా.. రైతులు వానాకాలం సాగుకు సిద్ధపడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యంగానైనా వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాస్త్రవేత్తల ప్రకటనతో పనులు ప్రారంభించారు. మరోవైపు రోహిణికార్తె కూడా ప్రవేశించడంతో పొలాల్లో పశువులు ఎరువు చల్లుతూ.. లోతు దక్కులు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఎరువులు చల్లే పనుల్లో.. వర్షాలు కురవకముందే.. పొలాలు సిద్ధం చేస్తుంటారు. ఎరువులను చల్లుతున్నారు. ట్రాక్టర్ సహాయంతో పొల్లాన్ని కలియదుతున్నారు. పంటకు హానిచేసే పురుగులు భూమిలో ఉంటే అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. భారీవర్షం కురవగానే విత్తనాలు వేయనున్నారు. పశువుల ఎరువు లేని రైతులు గొర్రెలు, మేకలు, లేదా ఆవుల మందను పెట్టిస్తున్నారు. మందను బట్టి రోజుకు రూ.2000 నుంచి రూ.4000 తీసుకుంటున్నారు. కూలీల కోసం.. గ్రామాల్లో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం పురుషునికి రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు ఇస్తున్నారు. ఆడవారికి రూ.50వేల వరకు ఇస్తున్నారు. జిల్లాలో 4.24 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు వంటి పంటలు సాగుచేసే అవకాశం ఉండటంతో కూలీల అవసరం ఎక్కువగా ఉంది. రసాయన ఎరువుల కొనుగోలుకు మొగ్గు యూరియా వంటి రసాయన ఎరువులకు కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రసాయన ఎరువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ముందు జాగ్రత్తగా వానాకాలం సీజన్కు సరిపోయే యూరియా, కాంప్లెక్స్ కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు. రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు.. వాస్తవంగా రైతులు మే, జూన్లో బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. ఏడాదిలోపు రెన్యువల్ చేసుకుంటారు. పంటలు విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో పంట రుణం చెల్లించి, తిరిగి తీసుకుంటారు. బ్యాంకర్లు కేవలం రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకే రుణం ఇస్తుండటంతో బావులు తవ్వకం.. పైపులైన్లు వేసేందుకు భూములు కుదవపెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటున్నారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
● వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు మెట్పల్లి/కోరుట్లరూరల్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మెట్పల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో.. కోరుట్లలో మహిళా స్వశక్తి సంఘాల సభ్యులతో కలిసి మహిళా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్చైర్మన్ ఓంకారి నవీన్, మెట్పల్లి, కోరుట్ల బల్దియాల కమిషనర్లు శ్రీనివాస్గౌడ్, శ్రీనివాసరావు, కాంగ్రెస్ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. టీబీ నిర్ధారణకు ఉచిత పరీక్షలుజగిత్యాలరూరల్: టీబీ నిర్ధారణకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలనెలా ఉచిత పరీక్షలు నిర్వహించడంతోపాటు, మందులు అందించనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ, ఎక్స్రే క్యాంప్ను మంగళవారం ప్రారంభించారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో చాలామంది టీబీ, ఎక్స్రే టెస్ట్లు చేయించుకున్నారని తెలిపారు. టీబీగా అనుమానం ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధరెడ్డి, నర్సింగ్ అధికారి దామోదర్, కుద్దుస్ పాల్గొన్నారు. మోటార్లకు మీటర్లు పెడతారా..?కథలాపూర్(వేములవాడ): విద్యుత్ రంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి అన్నారు. మండలంలోని భూషణరావుపేటలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మంగళశారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరా లేకపోతే వ్యవసాయం నిలబడదన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని గతంలో కేంద్రం ఆదేశాలిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించిందని, ఇప్పుడు ప్ర జాభిప్రాయం లేకుండా.. అసెంబ్లీలో చర్చ లే కుండా విద్యుత్ డిస్కం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ముస్కు శ్రీనివాస్రెడ్డి, పుర్కుటపు గంగారెడ్డి, గడ్డం శేఖర్రెడ్డి, అంజయ్య, దేవయ్య పాల్గొన్నారు. కిక్కిరిసిన కొండగట్టు మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి సామూహిక అభిషేకాలు చేశారు. అంజన్న పెద్ద జయంతి సందర్భంగా దీక్షాపరులు సమర్పించిన ముడుపులను ఈనెల 29న వేలం వేయనున్నట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. బియ్యం, కొబ్బరికాయలు, ఎండుకుడుకలు, మాలలు వేలం వేస్తామన్నారు. -
బీజేపీకో న్యాయం.. కాంగ్రెస్కో న్యాయమా..?
జగిత్యాలటౌన్: ప్రజాసంక్షేమం మర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణిచివేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి భోగ శ్రావణి అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని బీజేపీ నిరాహార దీక్షకు అనుమతించని పోలీసులు.. పెట్రోల్ ధరలు తగ్గించాలన్న కాంగ్రెస్ ధర్నాకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బీజేపీకో న్యాయం.. కాంగ్రెస్కో న్యాయమా అంటూ నిలదీశారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్, ఎకై ్సజ్ డ్యూటీ వసూలు చేస్తూ ప్రజలపై తీరని భారం మోపుతున్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో పెట్రో ధరలను పరిశీలించాలని సూచించారు. వేముల శ్రీనివాస్, నిమ్మల నాగరాజు, దూరిశెట్టి మమత, సిరిపురం శ్రీనివాస్, గడ్డల లక్ష్మి, చెన్నాడి మధురిమ పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీజేపీ తోడుదొంగలు
జగిత్యాలటౌన్: కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలుగా మారాయని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ పార్టీ దొంగ ధర్నాకు దిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్పై 10శాతం వ్యాట్ తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకే పార్టీ సభ్యత్వ నమోదు చేపడుతున్నామని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ సభ్యత్వ నమోదు చేయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు, యువత, మహిళలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఇంకా రెండేళ్లు భరిస్తే వచ్చే పదేళ్లు అధికారంలో ఉండడం ఖాయమని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు మాట్లాడుతూ జీవన్రెడ్డి చేరికతో బీఆర్ఎస్కు మరింత బలం చేకూరిందన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, విజయలక్ష్మి, వెంకటేశ్వర్రావు, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ధర రమేష్, కల్లెపెల్లి దుర్గయ్య, సురేందర్, రాధాకిషన్, రఘువీర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థులకు ‘మధ్యాహ్న’ భోజనం
భూ వివాదాన్ని పరిష్కరించండిమల్లాపూర్: భూ సమస్య పరిష్కరించాలని మండలంలోని కుస్తాపూర్కు చెందిన ఈరవత్తిని గంగాధర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా.. సమస్యను పరిశీలించేందుకు అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మంగళవారం గ్రామంలో పర్యటించారు. సదరు స్థలం వద్దకు వెళ్లి గ్రామసభ నిర్వహించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీకాంత్, ఏపీఎం విమోచన, సర్పంచ్ జెల్ల రాజేశ్వర్, ఉపసర్పంచ్ సరికెల మహిపాల్, కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. ‘ఎస్డబ్ల్యూఎం’ పకడ్బందీగా అమలు చేయాలి జగిత్యాల: సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ (ఎస్డబ్ల్యూఎం) నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. కలెక్టరేట్లో సాలిడ్ వేస్ట్మేనేజ్మెంట్ కమిటీతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన రూల్స్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జిల్లాలో 385 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీల్లో తడి, పొడి, శానిటేషన్ వ్యర్థాలు, ప్రత్యేక హానికర వ్యర్థాలు మొదట్లోనే వేరుచేసేలా ఇళ్లు, సంస్థల్లో చెత్త డబ్బాలు ఉంచాలన్నారు. చెత్త తరలించేందుకు ప్రత్యేక వాహనాలు పెట్టాలన్నారు. జూన్ 31లోపు సమగ్ర యాక్షన్ ప్లాన్ తయారుచేసి గ్రామాలు, పట్టణాలను రిజిస్ట్రేషన్ చేయాలని, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎరువులు చల్లుతున్నాం వానాకాలం సీజన్ పనులు ప్రారంభమయ్యాయి. పసుపు వేద్దామని పొలాన్ని దున్నించాం. హైదరాబాద్ నుంచి కోళ్ల ఎరువును తెప్పించి తోటంతా చల్లించాం. కలుపు మొక్కలు లేకుండా దున్నాను. వర్షం కురిస్తే పసుపు వేసేలా భూమిని సిద్ధం చేశాను. – రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాల రూరల్(మం) పనులు ప్రారంభమయ్యాయి రోహిణి కార్తె ప్రారంభంతో వానాకాలం పనులు ప్రారంభయ్యాయి. ట్రాక్టర్తో లోతైన దుక్కులు చేసుకుంటే వర్షపు నీరు నిల్వ ఉండి పంటకు హాని చేసే పురుగులు కూడా చనిపోతాయి. జనుము, జీలుగ పచ్చిరొట్ట విత్తనాలను చల్లుకోవాలి. – హరీశ్కుమార్ శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాసమల్లాపూర్: జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయనుంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. హాజరుశాతం పెరగడంతోపాటు చదువుపై దృష్టి పెట్టనున్నారు. ఇంటర్ విద్యార్థులకూ ఆల్పాహారం, పాలు అందించనుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అర్ధాకలితోనే కళాశాలకు.. జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్ చదువు కోసం ఆయా జూనియర్ కళాశాలలకు వస్తుంటారు. ఉదయం 8 గంటలకే ఇంటినుంచి బయల్దేరుతారు. ఆ సమయంలో పేద విద్యార్థులు అల్పాహారం తీసుకోకుండానే వస్తుంటారు. మధ్యాహ్నం వరకు ఖాళీ కడుపుతో అలమటించాల్సిందే. అలా అర్ధాకలితో ఉన్న విద్యార్థులకు పాఠాలు అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి ఆ సమస్యకు చెక్ పెడుతూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు మేలు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది. నీట్, జేఈఈ వంటి తరగతులు వారు శ్రద్ధగా వినే అవకాశం ఉంటుంది. – రాజేశం, రసాయనశాస్త్రం, జేఎల్, జీజేసీ–మల్లాపూర్ -
ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారు..?
జగిత్యాలరూరల్:ధాన్యం కొనుగోళ్లను ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని, రైతులు నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని తెలిపారు. వర్షాలకు ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి యుద్ధప్రతిపాదికన కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ మహిపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ సర్పంచ్ సుభాష్, నాయకులు గంగారెడ్డి, మల్లేశంగౌడ్, నారాయణరెడ్డి, మల్లారెడ్డి, నర్సయ్య పాల్గొన్నారు. -
ఆక్రమణలను అరికట్టాలి
జగిత్యాల రూరల్ మండలం పొలాస దామెరకుంటలో 13.27ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. నీటి పారుదల, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా పరిశీలించారు. సదరు భూమిలో వరి సాగుచేస్తున్నందున పంట కోసిన తర్వాత సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. ప్రస్తుతం పంట కోసినందున సర్వే చేసి ఆక్రమణకు గురైన భూమిని కాపాడాలి. – పొలాస మత్స్య సంఘం ప్రతినిధులు విచారణ చేపట్టాలి దశాబ్ది సంపద వనాల పేరిట కొండాపూర్ గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువ పక్కన రెండు చోట్ల సుమారు 846మొక్కలు నాటినట్లు రికార్డులు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో 100లోపు చెట్లే ఉన్నాయి. అవి కూడా ఎండిపోతున్నాయి. వీటికి మరో రూ.లక్ష ఖర్చు చేసి రిప్లేస్మెంట్ మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, హరి తహారం లాంటి గొప్ప పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. – ప్రజా ఐక్యవేదిక ప్రతినిధులు,కొండాపూర్, మేడిపల్లి -
రైతు సమస్యలు విస్మరించి ధర్నా చేయడం సిగ్గుచేటు
రాయికల్(జగిత్యాల): రైతు సమస్యలను విస్మరించిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం రాయికల్ పట్టణంలో మొక్కజొన్న రైతులు లారీల కొరతపై నిర్వహించిన ధర్నాకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. పెట్రోల్పై 30 శాతం వ్యాట్, డీజిల్పై 28 శాతం ఉందని, ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందని గుర్తు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రోహిణి కార్తె ఆరంభం నాటికి గతంలో కొనుగోళ్లు పూర్తయ్యేవని, ప్రస్తుతం కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాయాల్సి న దుర్భర పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఈనెల 31లోపు కొనుగోళ్లు పూర్తి చేయాలని, లేకుంటే వంటావార్పు కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతులకు యూరియా బస్తా కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొందని, దీని కోసం యాప్లో అప్లోడ్ చేస్తేనే యూరియా సరఫరా చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, న్యాయవాది తాటిపర్తి రాంచంద్రారెడ్డి, ఏఎంసీ మా జీ చైర్మన్ మారంపల్లి రాణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బ ర్కం మల్లేశ్యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అ నిల్, నాయకులు తురగ శ్రీధర్రెడ్డి, మహిపాల్రెడ్డి, మండ రమేశ్, గోపి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
ò³{sZÌŒæ, yîlhÌŒæ «§ýlÆý‡-Ë$ ™èlWY…^éÍో
జగిత్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. పెట్రో ధరలను నిరసిస్తూ సోమవారం ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు పాతబస్టాండ్ సమీపంలోని ఓల్డ్ హైస్కూల్ నుంచి ర్యాలీగా తరలివచ్చి తహసీల్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో చార్జీలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయన్నారు. ప్రధాని మోదీ జపిస్తున్న పొదుపు మంత్రం దేశ ఆర్థిక అస్తిరతకు నిదర్శనమన్నారు. ఇప్పటికై నా కేంద్రం దిగివచ్చి పెట్రో ధరలు తగ్గించి సామాన్యులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పల్లెత్తు మాట అనకపోవడం వారి మైత్రికి నిదర్శనమన్నారు. దశాబ్ద కాలంపాటు కేసీఆర్ను ఎన్నో రకాలుగా విమర్శించిన జీవన్రెడ్డి ఇప్పుడు అదే కేసీఆర్ను దేవుడు అనడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. పెట్రో ధరలు తగ్గించడంతో పాటు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని ఆర్డీవో మధుసూదన్గౌడ్కు వినతిపత్రం అందజేశారు. వెలమ సంక్షేమ మండలి చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిండ్ల వాణి, బండ శంకర్ పాల్గొన్నారు. -
యాదాద్రిలా ఎములాడ వెలిగేనా?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రిలో శాస్త్రబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా నిర్మాణం సాగగా.. వేములవాడలో అస్పష్టత, సమన్వయ లోపంతో విమర్శల పాలవుతోంది. ఈ మధ్య పనులు కాస్త ఊపందుకున్నప్పటికీ.. సిమెంట్ నిర్మాణాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సిమెంటు నిర్మాణాలు ఎంతకాలం ఉంటాయి? కోడెమొక్కుల దర్శనాలు భక్తులకు తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అన్న అంశాలు నేటికీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ.. రూ.1200 కోట్లతో యదాద్రి, రూ.225 కోట్లతో బాసర ఆలయాలకు దక్కినస్థాయిలో గౌరవం దక్కకపోవడం, వేములవాడ ఆలయానికి కేవలం రూ.150 కోట్లే వెచ్చించడంతో రాజన్న భక్తులు చిన్నబుచ్చుకుంటున్నారు. మరోవైపు అధికారులు వచ్చే ఏడాది మార్చి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసే దిశగా వేగంగా పనులు సాగిస్తున్నారు. ఎములాడ అంటే ఇలానా? యాదాద్రికి దక్కిన ప్రాధాన్యం వేములవాడకు దక్కడం లేదన్నది సుస్పష్టమని భక్తులు వాపోతున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ప్లాన్లోనే అనేక లోపాలున్నాయని విమర్శిస్తున్నారు. దర్శనాల విషయంలో రోజుకో నిర్ణయం, కోడె మొక్కులు ఒకచోట, స్వామి దర్శనం మరోచోటపైనా భక్తులు పెదవి విరుస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల నిధులతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధం కాకుండానే శంకుస్థాపన జరగడం, టెండర్లు ఆలస్యంగా పూర్తవడం ప్రణాళికా లోపాలను బట్టబయలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యాదాద్రిలో సంపూర్ణ రాతి నిర్మాణం కొనసాగించగాం వేములవాడలో మాత్రం 700కి పైగా కాంక్రీట్ పిల్లర్లతో నిర్మాణ ప్రణాళిక రూపొందించడం, ఆ పిల్లర్లకు రాతి పలకలు అంటిస్తే.. ప్రాచీన వైభవం దెబ్బతింటుందన్న భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని కాంక్రీట్ మయం చేయడం సరైనదేనా?’ అన్న సందేహాలు భక్తులు లేవనెత్తుతున్నారు. మరోవైపు కాంక్రీట్ నిర్మాణాల మన్నిక ఎంతకాలం అన్న భక్తుల ప్రశ్నకు సమాధానం నేటికీ దొరకడం లేదు. ఈ విమర్శలేవీ అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదు. 2027 మార్చి నాటికి ఎలాగైనా ఆలయాన్ని సిమెంటు పిల్లర్లతోనే అందుబాటులోకి తీసుకువస్తామని ధీమాగా ఉన్నారు. యాదాద్రి మీద అలా.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయంగా పర్యవేక్షించారు. వైటీడీఏ వీ.సీ. కిషన్ రావు, ఇతర అధికారుల నిరంతర పరిశీలనలో రూ.1,200 కోట్ల వ్యయంతో అద్భుత నిర్మాణంగా తీర్చిదిద్దారు. పూర్తిగా కృష్ణశిలతో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణానికి దాదాపుగా 1,200 మంది శిల్పులు పనిచేశారు. అగమశాస్త్రాల ప్రకారం నిర్మించిన ఈ ఆలయం ఇంటర్లాకింగ్ టెక్నాలజీతో వెయ్యేండ్లు నిలిచి ఉండేలా బాధ్యతలను ప్రముఖ ఇన్ఫ్రా సంస్థ ఎల్అండ్టీకి అప్పటి ప్రభుత్వం అప్పగించింది. రాతి నిర్మాణాల కోసం చైనా లాంటి ఇతర దేశాలకు చెందిన రాతిని పరిశీలించారు. ఎక్కడా సిమెంట్ వినియోగం లేకుండా సంప్రదాయ పద్ధతులతో యాదాద్రి పునర్నిర్మాణం ఆలయ నిర్మాణంగానే కాదు, ఒక ఆధ్యాత్మిక నగర రూపకల్పనగా నిలిచింది. -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
జగిత్యాలటౌన్: ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులపై సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో మదన్మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గోవుల రవాణాను అరికట్టండి గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ కేంద్రంగా వ్యాపారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. చిల్వాకోడూర్ నుంచి అక్రమంగా కోరుట్ల, మెట్పల్లి, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆర్మూర్, కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలకు కంటైనర్లు, డీసీఎంలు, బొలెరో వాహనాల్లో పరిమితికి మించి గోవులను తరలిస్తూ క్రూరంగా వధిస్తున్నారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టి గోమాతను రక్షించాలి. – హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు సంతకం చేయకుండా వేధిస్తున్నాడు మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాను. అంతకు ముందు 23 ఏళ్లు జగిత్యాల ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేశాను. 2024లో ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపాల్ అరిగెల అశోక్ నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు. హైకోర్టును ఆశ్రయించగా నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎస్కేఎన్ఆర్ ప్రిన్సిపాల్ కక్ష పూరితంగా రిలీవింగ్ సంతకం చేయడం లేదు. దీంతో నా జీతభత్యాలు నిలిచిపోయాయి. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చిరుద్యోగినైన నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – జక్కుల లక్ష్మి, అటెండర్ -
వడదెబ్బతో 8 మంది మృతి
జగిత్యాలక్రైం/గోదావరిఖని/ రామడుగు/వీణవంక/జమ్మికుంట/పెద్దపల్లి/కాల్వశ్రీరాంపూర్: ఉమ్మ డి జిల్లావ్యాప్తంగా సోమవారం వడదెబ్బతో 8 మంది మృతిచెందారు. జగిత్యాలలోని మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన గొల్లపల్లి శివప్రసాద్గౌడ్ (50), కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన లక్ష్మీరాజం(48), గోపాల్రావుపేటకు చెందిన షేర్ల నరేశ్ (30), వీణవంక మండలం ఘన్ముక్కులకు చెందిన బొంగోని రాజవీరు(65), జమ్మికుంటలోని 28వ వార్డు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన దాసారపు కాంతమ్మ (59), సుల్తానాబాద్కు చెందిన తోడేటి లక్ష్మి (44), కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలి గోస్కుల గట్టయ్య(52), సింగరేణి రామగుండం డివి జన్–2లోని ఓసీపీ–3 ప్రయివేట్ ఓబీ వీ–9 కాంట్రాక్టర్ వద్ద క్యాంటీన్మెస్లో కుక్గా పనిచేస్తున్న కుమార్(40) వడదెబ్బతో మృతిచెందారు.షేర్ల నరేశ్(ఫైల్)శివప్రసాద్(ఫైల్) లక్ష్మి (ఫైల్)కాంతమ్మ, కుమార్ మృతదేహాలు -
ఇంకుడుగుంత ఉంటేనే ఇల్లు
జగిత్యాల: భూగర్భజలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తేనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని తాజాగా మున్సిపాలిటీలకు సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ తంలో ఇంకుడు గుంత చూపిస్తేనే ఇంటి అనుమతి ఇచ్చేవారు. కాగా, చాలా చోట్ల ప్లానింగ్లో ఇంకుడుగుంతలు ఉంటాయి కానీ, నిర్మాణాలు మాత్రం చేపట్టరు. దీనిపై మున్సిపల్ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం ఇంటి నిర్మాణాలు, బహుళ అంతస్తు ల భవనాలకు ఇంకుడుగుంత ఉంటేనే అనుమతి వ్వాలని.. టౌన్ప్లానింగ్, శానిటేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశాలు జారీ అ య్యాయి. కాగా, పట్టణాలు, గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఈనేపథ్యంలో ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు లక్షకు పైగా జనాభా దాటిన ప్రతీ మున్సిపాలిటీలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోంది. జల్ సంచాయ్ జన్ భగీదరి 2.0 పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు, అత్యధికంగా నిర్మాణాలు చేపడితే ర్యాంకులను బట్టి రూ.కోటి వరకు నిధులు మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీలో 170 ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టారు. ప్లానింగ్లో ఉంటుంది.. నిర్మాణంలో ఉండదు పలువురు ఇంటి నిర్మాణదారులు మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంటే ప్లానింగ్లో ఇంకుడు గుంతను చూపుతున్నారు. తర్వాత నిర్మించడం లేదు. ఫైల్లో మాత్రం ఇంకుడుగుంత నిర్మించుకున్నట్లే ఉంటుంది. దీనిపై టౌన్ప్లానింగ్ అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒక ఇంకుడుగుంతకు యజమానులు రూ.3 వేల నుంచి 4 వేలు డబ్బు కూడా చెల్లిస్తారు. కాగా, ఇప్పటికే కొత్తగా నిర్మాణం చేపట్టే వారి వద్దకు సర్వే బృందాలను పంపించాలని, యజమానులతో పాటు, మేసీ్త్రలు, భవన నిర్మాణ కార్మికులకు ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.నిర్మాణం చేపట్టేలా చర్యలు మున్సిపాలిటీలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే వారు కచ్చితంగా ఇంకుడుగుంత నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ సంఖ్యలో ఇంకుడుగుంతలు నిర్మిస్తే జల్ సంచాయ్ జన్ భగీదరి 2.0 పథకం కింద అత్యధిక నిధులు వస్తాయి. – శ్రీనివాస్, టీపీవో, జగిత్యాల -
బీటీ రోడ్డు ప్రారంభించాలి
కుల బహిష్కరణ చేసి వేధిస్తున్నారు మాది కోరుట్ల మండలం జోగినిపల్లి గ్రామం. గంగపుత్ర కులానికి చెందిన నేను 2012లో సంఘం నిర్వహించిన డ్రా పద్ధతిలో అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాను. వ్యక్తిగత కారణాలతో ఆ పదవిని తాను నిర్వహించలేనని చెప్పగా కుల పెద్దలు రూ.వెయ్యి జరిమానా విధించారు. జరిమానా చెల్లించనందుకు నా కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. ఎలాంటి కార్యాలకు పిలవకుండా మానసికంగా వేధిస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం కుల సంఘం పెద్దలను పలుమార్లు కలిసినా స్పందించడం లేదు. మా ఊరి చెరువులో నా వాటా కింద వచ్చే చేపలను పట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – పల్లికొండ పెద్ద పోచయ్య, జోగినిపల్లి, కోరుట్ల జగిత్యాల పట్టణం 16వ వార్డు రహమత్పురాలో బాబా కిరాణం నుంచి దగ్గులమ్మ గుడికి వెళ్లే రో డ్డు పూర్తిగా పాడయిపోగా గతేడాది బీటీ రో డ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. 7నెలలు గడుస్తున్నా పనులు సాగడం లేదు. రోడ్డు పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఎండీ సల్మాన్ సోదరులు, రహమత్పుర, జగిత్యాల -
ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు చర్యలు
జగిత్యాలక్రైం: ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్య రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో సిబ్బందికి కూలింగ్ గాగుల్స్, వాటర్ఫ్లాస్క్లు పంపిణీ చేసి మాట్లాడారు. రోడ్లపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర కీలకమన్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బంది తరచూ నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. అవసరమైతే కొద్దిసేపు నీడలో విశ్రాంతి తీసుకోవాలని, ఎండ తీవ్రతను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఏఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం, పట్టణ ఎస్సై సుప్రియ, సిబ్బంది పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి 14 దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఉత్సాహం నింపిన వేసవి శిక్షణ శిబిరంజగిత్యాల: వేసవి శిక్షణ శిబిరంలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిబిరం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని డీఈవో రాము అన్నారు. ఈనెల 11 నుంచి 25 వరకు ధరూర్ క్యాంప్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిబిరంలో అబాకస్, డ్రాయింగ్ తదితర గేమ్స్లో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచేలా అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్రెడ్డి, క్వాలిటీ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెట్టును ఢీకొన్న పోలీసు వాహనం జగిత్యాలక్రైం: విధి నిర్వహణలో ఉన్న పోలీసు వాహనం అర్ధరాత్రి అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్రోడ్లో దేవిశ్రీ గార్డెన్స్ వద్ద ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న క్యూఆర్ కోడ్ సిబ్బంది పోలీసు బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్కథలాపూర్(వేములవాడ): వరి ధాన్యం తూకంలో మోసం, లారీల కొరతతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి మండిపడ్డారు. సోమవారం మండలంలోని కలిగోటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. వరిధాన్యం బస్తాలో 40 కిలోల తూకం వేయాల్సి ఉండగా, 43 కిలోలు తూకం వేసి రైతులను నట్టేటా ముంచుతున్నారన్నారు. ఇంత దోపిడీ జరుగుతుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ హయంలో వరిధాన్యం త్వరగా తూకం వేయించి నెలరోజుల్లోనే ముగించామన్నారు. నాగం భూమయ్య, నాగేశ్వర్రావు, ఎండీ రఫీ, రమేశ్, వేముల గంగరాజం, సీతారామ్నాయక్, గంగారెడ్డి, బోదాస్ అంజయ్య, కల్లెడ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలి
● కలెక్టర్ బి.సత్యప్రసాద్ మల్యాల/కొడిమ్యాల: తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని తక్కళ్లపల్లి, బల్వంతాపూర్, రామన్నపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సోమవారం సందర్శించి మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మాయపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. డీఎస్వో జితేందేర్, తహసీల్దార్లు శ్రీనివాస్, నరేశ్, ఎంపీడీవోలు స్వాతి, స్వరూప, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వామి, ఆర్ఐ రాణి తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా మార్కెట్ విలువల ప్రక్రియ జగిత్యాల: మార్కెట్ విలువల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మార్కెట్ విలువల సవరణపై జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 41 రెవెన్యూ ప్రకారం భూ మార్కెట్ విలువలకు సంబంధించిన మార్గదర్శకాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ, వ్యవసాయేతర భూములు తదితర అంశాలపై వివరించారు. పట్టణప్రాంతాలు, గ్రామపంచాయతీలు, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేసిన కమిటీలు, బాధ్యతలు విధానాలు, అనుసరించాల్సిన చర్యలపై అవగాహన ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో జివాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
సన్న రకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయా లి. దొడ్డు ధాన్యం సాగు చేస్తే కొంటరా..? కొనరా..? అనే విషయంతోపా టు సన్న రకాల్లో ఏ రకాలు సాగు చేయాలి..? ఆ మేరకు విత్తనం లభిస్తుందా..? అనే విషయాలపై స్పష్టత ఇవ్వాలి. – గొంటి మొగిలి, రైతు సంఘం నాయకుడు, సోమన్పల్లిఅన్ని రకాలకు బోనస్ ప్రస్తుతం ఉన్న జీవో ప్రకారం అన్ని సన్న రకాలకు బోనస్ వర్తిస్తుంది. కేవలం మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న రకాలను మాత్రమే ఫ్లెక్సీలో ప్రదర్శిస్తున్నాం. ఆ రకాలతో పాటు ఇతర సన్న రకాలను సాగు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆదేశాలతో ముందుకెళ్తాం. – వడ్డేపల్లి భాస్కర్, డీఏవో -
భూముల మార్కెట్ ధర పెంపు
జగిత్యాల: వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఉన్న పాత ధరలు కొత్త ధరలతో వివరాలు నమోదు చేస్తున్నారు. దాదాపు 20 నుంచే 100 శాతం పెంచేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల విలువలకు సంబంధించిన సవరణ పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన మార్కెట్ విలువలు, వ్యవసాయ భూముల వివరాలు ఉండటంతో రెవెన్యూ సిబ్బంది సహకారంతో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమై భూముల విలువల సవరణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రస్తుత రికార్డు, మార్కెట్లోని భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని కచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, సర్వేనంబర్లు, వర్గీకరణ వారీగా మార్కెట్ విలువ పరిశీలించి పొరపాట్లు లేకుండా అధికారులకు నివేదిక పంపించారు. ఫార్మట్–1 నుంచి ఫార్మట్–4 వరకు వివరాలను సమగ్రంగా సిద్ధం చేశారు. నివాసాలు, రహదారులుంటే పెరిగే అవకాశం రహదారులు, నివాసాలుంటే మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది. చాలాచోట్ల భూభారతి చట్టంలో ఉన్న దరఖాస్తులకు సబ్రిజిస్ట్రార్ వ్యవసాయ ధరలకు అత్యధికంగా వ్యత్యాసం ఉండటంతో కొత్తగా ధరలు నమోదు చేస్తున్నారు. ఒకరాన రూ.2లక్షలు ఉంటే తాజాగా అది రూ. 5లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే భవనాలు, రహదారులు, జాతీయ రహదారులున్న చోట్ల రూ.10 లక్షల వరకు పెరిగే అవకాశాలున్నాయి. వ్యవసాయేతర స్థలాల్లో వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయాల్లో సుమారు 7.5శాతం స్టాంప్ డ్యూటీ వేస్తుంటారు. భూముల ధరలు పెరిగితే ప్లాట్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సుమారు 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ జాతీయ రహదారులపై నివాసాలుంటే అక్కడ మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. కొనేవారికి ఇబ్బందే భూముల విలువలు అధికంగా పెరిగితే రిజిస్ట్రేషన్ ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలుంటాయి. భవనాలు, రహదారులు ఉన్న భూములు కొనాలంటే ఇంకా ఇబ్బందికరంగానే ఉంటుంది. కసరత్తు పూర్తిఅధికారులు భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణకు సంబంధించి ఫార్మట్ సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు నివేదికను సమర్పించినట్లు తెలిసింది. భూముల రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించి ప్రక్రియ పూర్తయినట్లు జగిత్యాల ఎస్ఆర్వో సుజాత తెలిపారు. -
సన్నాలపై సందేహాలెన్నో..!
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లో రైతులు దొడ్డు వరిరకాలు తగ్గించి.. సన్నరకాల వైపు దృష్టి సారించేలా చూడాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కరప్రతాలు, రైస్మిల్లులు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు సన్నాల్లో కేవలం 8 రకాలను మాత్రమే వ్యవసాయ వర్సిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తుండడంతో వర్సిటీ రూపొందించిన ఇతర రకాలు, ప్రైవేటు కంపెనీల రకాలు సాగు చేయవచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఇష్టమొచ్చిన రకాలు సాగు చేస్తే రూ.500 బోనస్ వర్తిస్తుందా..? లేదా..? అని రైతులు సందేహిస్తున్నారు. వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాలు జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. అందులో కనీసం 1.50 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తారు. వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ–5204(సాంబమసూరి), ఆర్ఎన్ఆర్–15048(తెలంగాణ సోనా), కేఎన్ఎం–1638 (కూనారం వరి–2), జేజీఎల్–1798(జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్, హెఎంటీ సోనా వరంగల్–44(సిద్ది), డబు్?ల్జఎల్–962 మాత్రమే ఉన్నాయి. ఈ రకాలు అధిక దిగుబడి ఇస్తాయని, రైతులకు అధికకాదాయం వస్తుందని ప్రచారం చేస్తోంది. ప్రచారం చేస్తున్న రకాల్లో సమస్యలు ● బీపీటీ: ఈ రకం దీర్ఘకాలిక పంట. మే15 లోపు నార్లు పోసుకుంటే మంచిదని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. ● ఆలస్యమైతే తెగుళ్లు, పురుగులు ఆశించే అవకాశం ఉంది. ● దోమపోటు, మెడవిరుపు, ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది. ● బియ్యం నాణ్యత ఉన్నా.. దిగుబడి అంతగా రాదు. ● జేజీఎల్–1798: ఇది 125 రోజుల పంట. ● గింజ నాణ్యత అంతబాగా లేదు. ● జైశ్రీరాం: గడ్డి మాదిరిగా ఎత్తు పెరుగుతుంది. ● ఈదురుగాలలకు నేలవాలుతుంది. ● దిగుబడి తక్కువ.. బియ్యం నాణ్యత చప్పచప్పగా ఉంటుంది. ● హెచ్ఎంటీ: బియ్యం నాణ్యత ఎక్కువగా ఉంటుంది. తినడానికి సూపర్. ఇది ఒక ప్రైవేట్ రకం. ● వరంగల్–44 : అంతగా ప్రాచుర్యం పొందలేదు. ● గొట్టాల తెగులు బాగా వస్తుంది. ● కేఎన్ఎం–1638: ఒక డీఏపీ, ఒక యూరియా బస్తాతో పండే రకం. ● ఎక్కువగా యూరియా వేస్తే పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడి తగ్గుతుంది. ఇలా వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న సన్నరకాలపై రైతులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఇతర వరి రకాలు సాగు చేస్తే అంతేనా..? ● రైతులకు 33 సన్నరకాలు అందుబాటులో ఉండగా.. కేవలం 8 మాత్రమే ఫోకస్ చేస్తుండటంపై సందేహాలు అధికమవుతున్నాయి. ● ఏ రకంలోనైనా గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2ఎంఎం కంటే తక్కువ ఉండాలి. ● పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే ఆ రకాలకు ప్రాధాన్యమిచ్చి సన్న రకం కింద రూ.500 బోనస్ వస్తుంది. ● గ్రామాల్లో ఆయా రైతులు తమకు నచ్చిన విత్తనాలు వేసి పంట పండిస్తారు. ● ఆ విత్తనం ప్రైవేట్ది అయినా పరిశోధన స్థానానిది అయినా పంట ఎక్కువగా వచ్చే రకాలను సాగు చేస్తుంటారు. ● రైతుకు నచ్చిన రకాలు సాగు చేస్తే.. బోనస్ వస్తుందా..? రాదా అని ఆందోళన చెందుతున్నారు. సన్నరకాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టంగా వ్యవసాయశాఖకు ఆదేశాలు ఇవ్వలేదు. ● ఫలితంగా ఆయా రకాల సాగుపై గందరగోళం నెలకొంది. ● వానాకాలంలో ఏరకం ధాన్యం సాగు చేయాలనే దానిపై రైతులు మల్లాగుల్లాలు పడుతున్నారు. ● ఇదే అదునుగా వ్యాపారులు ఇతర సన్నరకాలను ప్రభుత్వం గుర్తించిన రకాలుగా చెబుతూ రైతులకు అంటగట్టే అవకాశం ఉంది. -
శ్రావణిపై విమర్శలు సరికాదు
జగిత్యాలటౌన్: బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి భోగ శ్రావణి కరెంట్ తీగ అని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తప్పదని బీజేపీ నాయకులు మ్యాదరి అశోక్, ఓరుగంటి చంద్రశేఖర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రావణికి 43వేల ఓట్లు రావడంతో బెంబేలెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు విద్య ప్రాధాన్యత తెలియదని, అందుకే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటును అడ్డుకుంటున్నారని తెలిపారు. మొన్నటిదాకా ఒరిజినల్, డూప్లీకేట్ అని కొట్టుకున్న నాయకులు బీసీ ఆడబిడ్డను ఎదుర్కొనేందుకు ఒక్కటయ్యారని విమర్శించారు. ఆముద రాజు, పుష్ప, మమత, సిరిపురం శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చంద్రశేఖర్, భోగ శ్రావణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అనూప్రావు, పూదరి అరుణ, ఓరుగంటి చంద్రశేఖర్ పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్లో పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత
పెగడపల్లి: విద్యుత్ సబ్స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా రైతులు, గృహ వినియోగదారులకు సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరిపడా సిబ్బంది లేక అదనపు భారం పడుతోందని ఉన్న సిబ్బంది, అన్మ్యాన్డ్ ఉద్యోగులు అంటున్నారు. పెగడపల్లి మండలంలో ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లున్నాయి. వీటి పరిధిలో సుమారు 9,200 వ్యవసాయ కనెక్షన్లు, 18,420 గృహ వినియోగదారులున్నారు. బతికపల్లి, పెగడపల్లిని రెండు సెక్షన్లుగా విభజించారు. పెగడపల్లి సెక్షన్లో ఏఈఈ, ఏఎల్ఎం, జేఎల్ఎం, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్తోపాటు ఆరు సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఎక్కడైనా సమస్య ఏర్పడితే పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ప్రజలు అంటున్నారు. రాత్రి సమయంలో విద్యుత్ సమస్య ఏర్పడితే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోయినా రైతులే వేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల నంచర్లలో ట్రాన్సఫార్మర్ వద్ద మరమ్మతు చేస్తుండగా ఓ రైతు మృతి చెందాడు. సిబ్బంది కొరతపై గొల్లపల్లి సబ్ డివిజన్ ఏడీఈ వరుణ్కుమార్ను వివరణ కోరగా.. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సేవల్లో అవాంతరాలు ఎదురైతే ఉన్న సిబ్బందితో సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మరమ్మతు చేయొద్దని, విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు. -
జగిత్యాల
46.0/39.07గరిష్టం/కనిష్టంమల్లన్నకు మొక్కులు ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామిని ఆదివారం భారీసంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. ఒ గ్గు పూజారులతో స్వామివారి పేరిట పట్నాలు వే యించారు. బోనాలతో నైవేద్యం సమర్పించారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం నుంచే వేడిగాలులు కొనసాగుతాయి. మధ్యాహ్నం తీవ్రమైన ఉక్కపోత పెరుగుతుంది. భీమన్నా రక్షించు వేములవాడ: భీమన్నను ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. షవర్ల వద్ద పుణ్యస్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డారు. సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026 -
46.3 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 46.3, ధర్మపురి మండలం నేరెళ్లలో 46.2, కోరుట్ల మండలం అయిలాపూర్, ధర్మపురి మండలం జైనాలో 46.1, సారంగాపూర్, ఎండపల్లి మండలం గుల్లకోట, రాయికల్ మండలం అల్లీపూర్లో 45.5, ఎండపల్లి మండలం మారేడుపల్లిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండగట్టులో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిపోయాయి. స్వామివారిని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రఘు, రాము, చిన్నరాము, అభిలాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ తూము శ్రీనివాస్, ఏఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. గంజాయి విక్రేతల అరెస్ట్ జగిత్యాల క్రైం: జగిత్యాలరూరల్ మండలం చల్గల్ శివారులో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఆదివారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. చల్గల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. టీఆర్నగర్ గ్రామానికి చెందిన తాటిపాముల వంశీ, రాయికల్ మండలం అయోధ్య గ్రామానికి చెందిన మొండె అనిల్ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా 1694 గ్రాముల గంజాయి లభించింది. గంజాయితోపాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలుజగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారులో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఇందిరమ్మ ఇళ్ల చుట్టూ వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో రైతుల వ్యవసాయ మోటార్ల వైర్లు, గ్రామానికి మంచినీటి సరఫరా అయ్యే విద్యుత్ మోటార్ కాలిపోయింది. పొగ దట్టంగా కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పక్కన చెట్లు దగ్ధం మల్యాల: మండలంలోని ముత్యంపేట దిగువ కొండగట్టులో పెట్రోల్బంక్ సమీపంలో రోడ్డు పక్కన చెట్లు, ఈతచెట్లు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. చదువుతోనే మంచి జీవితంజగిత్యాలటౌన్: చదువుతోనే చక్కని జీవితం సాధ్యమని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. గోప (గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్) ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్లో 90శాతానికి పైగా మార్కులు సాధించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ప్రభుత్వంతోపాటు గోపలాంటి సంస్థల సహకారంతో చదువుకుని ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సూచించారు. ఆర్డీవో పులి మధుసూదన్గౌడ్ మాట్లాడుతూ కష్టపడే గౌడ విద్యార్థులకు గోప అండగా నిలవడాన్ని ప్రశంసించారు. గోప ప్రతినిధులు బండి సాయన్న, దుర్గపు రవీందర్గౌడ్, గుడాల రాజేష్గౌడ్, గుర్రం సత్యనారాయణగౌడ్, దుర్గపు శ్రీనివాస్గౌడ్, పోతుగంటి వెంకటేశ్వర్లుగౌడ్, సదాశివ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను నష్టపోనివ్వం
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల: భూములు కోల్పోతున్న రైతులను నష్టపోనివ్వబోమని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రహదారి ఎన్హెచ్–63 విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులకు కలెక్టరేట్లో హియరింగ్ చేపట్టారు. వారు తమ సమస్యలను విన్నవించగా.. రైతుల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నామని కలెక్టర్ తెలిపారు. అనంతరం గుమ్లాపూర్, మోహన్రావు, మేడిపల్లి గ్రామాలకు చెందిన 323 మంది అవార్డీల కేసులను విచారణ చేశారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్రెడ్డి, ఉదయ్కుమార్ పాల్గొన్నారు. -
గతం పునరావృతం కావద్దు
గతేడాది యూరియా బస్తాల కోసం క్యూలైన్లు కట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మేలా నిఘా ఏర్పాటు చేసి, రైతులకు అండగా నిలవాలి. – గడ్డం సత్యనారాయణరెడ్డి, నాగారాం, ధర్మపురి ప్రణాళిక విడుదల వానాకాలం రైతులు, పంటల వివరాలతోపాటు వాటికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలకు ప్రణాళిక రూపొందించాం. ప్రణాళికను రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించాం. అవసరమైన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తూ, రైతులకు దిశానిర్దేశం చేయనున్నాం. – వడ్డేపల్లి భాస్కర్, డీఏవో -
మరో నాలుగు రోజులు వడగాలులే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా రెడ్ జోన్లోకి చేరగా శనివారం అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో రెండు, పెద్దపల్లిలో ఏడు మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా వడగాలుల ప్రభావం అధికంగా ఉందని ప్రణాళిక విభాగం అధికారులు ప్రకటించారు. కాగా ఉదయం 8గంటలకే వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రం 6దాటినా దారులపై వడగాలులే. మరో నాలుగు రోజుల పాటు వడగాలులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించగా ప్రజలంతా జాగ్రత్త ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే కాటన్ దుస్తులు ధరించాలని, వీలైతే పనులను వాయిదా వేసుకోవడమే ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఆందోళనకరస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరీంనగర్(గంగాధర) 46.4 పెద్దపల్లి (ఎలిగేడు) 46.4 జగిత్యాల (కోరుట్ల, అయిలాపూర్) 46.4 రాజన్న సిరిసిల్ల (పెద్దూరు) 46.4 -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లోనూ రైతులు వరిసాగు వైపే దృష్టి పెట్టనున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వానాకాలం పంటలు.. కావాల్సిన రసాయన ఎరువులు, సబ్సిడీ విత్తనాలపై వ్యసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. రైతులు, అధికారులను అప్రమత్తం చేసేలా విడుదల చేసింది. 4.25 లక్షల ఎకరాల్లో ప్రధాన పంటల సాగు ఈ సీజన్లో 4.25 లక్షల ఎకరాల్లో ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, కంది పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. వరిని అత్యధిక విస్తీర్ణంలో 3.16లక్షల ఎకరాలు, పత్తి 19వేల ఎకరాలు, కంది పంట 1500, మొక్కజొన్న 35,000, పసుపు 9500, పెసర 100, అనుములు 350, సోయాబీన్ 800, చెరుకు 350, ఆయిల్ పాం 5,000, ఇతర పంటలు 37,400 ఎకరాల్లో సాగు చేయనున్నారు. 88,732 టన్నుల ఎరువులు అవసరం జిల్లాలో ఆయా పంటల సాగుకు అనుకూలంగా రసాయన ఎరువులు నెలవారీగా జిల్లాకు రానున్నాయి. వానాకాలం సీజన్కు సంబంధించి 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ, 26,632 టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 10,653 టన్నుల కాంప్లెక్స్, 3,329 టన్నుల సింగిల్ సూపర్ పాస్పేట్ అవసరమని అధికారులు తేల్చారు. పంటల పెరుగుదలను బట్టి జూన్లో 21,786టన్నులు, జూలైలో 25,856 టన్నులు, ఆగస్టులో 19,074 టన్నులు, సెప్టెంబర్లో 8,707 టన్నుల ఎరువులు జిల్లాకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 13,310 టన్నుల రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు 61,363 క్వింటాళ్ల విత్తనాలు వానాకాలం పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 58,225 క్వింటాళ్ల వరి, 90 క్వింటాళ్ల కంది, 2800 క్వింటాళ్ల మొక్కజొన్న, పెసర 8 క్వింటాళ్లు, సోయాబీన్ 240 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు విత్తనాలను ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల్లో సిద్ధంగా ఉంచేలా ఏర్పాటు చేశారు. 38వేల వివిధ కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం పొలాల్లో తొలుత పచ్చిరొట్ట కోసం జనుము, జీలుగ విత్తనాలను రైతులు సాగు చేస్తుంటారు. 22వేల క్వింటాళ్ల జీలుగ, 4వేల క్వింటాళ్ల జనుము, 100 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను 50శాతం సబ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు జిల్లాకు కేటాయించారు. ప్రభుత్వ సబ్సిడీపోను.. మిగతా సొమ్మును రైతులు చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ విత్తనాలను జిల్లాలోని సింగిల్ విండోలు, ఆగ్రోస్ కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. -
వడదెబ్బ..11 మంది మృతి
కమల(ఫైల్)గోదావరిఖని/పెద్దపల్లి/పెద్దపల్లి రూరల్/కొత్తపల్లి/ఓదెల/రామగిరి/సిరిసిల్లటౌన్/యైటింక్లయిన్కాలనీ: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారం వడదెబ్బతో 11 మంది మృతిచెందా రు. పెద్దపల్లిలోని ముత్యాల పోచమ్మవాడకు చెందిన దినసరి కూలీ ఫయాజ్ (52), ఇదే జిల్లాలోని సుల్తానాబాద్ పట్టణం సుభాష్నగర్కు చెందిన న్యాతరి మొండయ్య (76), ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల మధుసూదన్రెడ్డి (53), రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన బుడిగె కమల(65), యైటింక్లయిన్కాలనీ వెంకట్రావుపల్లి కేకేనగర్కు చెందిన కనుకుట్ల ఐలమ్మ(73), గోదావరిఖని పరుశరాంనగర్కు చెందిన ఎం.శంకర్(45), గోదావరిఖనిలోని మధుప్రియ హోటల్లో పనిచేస్తున్న వెల్దండి మహేశ్(52), ఎన్టీఆర్నగర్కు చెందిన మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలు గజనవేని మల్లమ్మ(56), రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్కు చెందిన మంచాల నరసయ్య(75), శాంతినగర్కు చెందిన మిట్టపల్లి శంకర్(48), కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దామెరశెట్టి మల్లేశం (52) వడదెబ్బతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. -
రైస్మిల్లర్ల మాయాజాలం
రైస్మిల్లర్లు తప్ప, తాలు పేరిట కోతలు విధిస్తున్నారు. 40 కిలోల బస్తాకు 2–5 కిలోల వరకు కట్ చేస్తున్నారు. మిల్లుకు వెళ్లిన లారీని దించుకోకపోవడం, తప్ప, తాలు ఉందని వెనక్కి పంపిస్తున్నామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్తో ఏదో మాట్లాడుకోమని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. చేసేదేమి లేక రైతులు మిల్లర్లను బతిమిలాడి వారు చెప్పినంత ధాన్యం కటింగ్కు ఒప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రైతులు మిల్లర్లపై ఫిర్యాదు చేయలేదు. ఒక వేళ చేసినా పట్టించుకునే అధికారులు లేరు. -
117 మంది బాధితులకు ఫోన్ల అప్పగింత
● ‘సీఈఐఆర్’ వినియోగించుకోవాలన్న ఎస్పీ అశోక్ ● సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచనజగిత్యాలక్రైం: సెల్ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. వివిధ ప్రాంతాల్లో చోరీకి, పోగొట్టుకున్న రూ.23 లక్షల విలువైన 117 మొబైల్ ఫోన్లను బాధితులకు శనివారం అప్పగించారు. ఫోన్ల రికవరీలో సీఈఐఆర్ వెబ్సైట్ ఉపయోగపడుతుందన్నారు. ఫోన్ల రికవరీకి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఆర్ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3,67,60,000 విలువైన 1,838 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. సెకండ్హ్యాండ్ ఫోన్ కొనేముందు ఐఎంఈఐ నంబర్ చెక్ చేసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ చేతన్నితిన్, సైబర్ క్రైం ఎస్సై దినేష్, సీఈఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ అజర్, అనూష, ప్రశాంత్ పాల్గొన్నారు. సిరికొండ టు కొండ్రికర్ల జగిత్యాలక్రైం/కోరుట్ల: కోరుట్ల మండలం సిరికొండలో సాగే పేకాట స్థావరాన్ని నిర్వాహకులు కథలాపూర్ మండలం కొండ్రికర్ల శివారు మార్చినట్లు సమాచారం. సిరికొండలో పేకాట జోరుగా సాగుతుండడంతో ఈనెల 22న ‘జీవితాలు మూడు ముక్కలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పోలీసులు దృష్టి సారించడంతో పేకాట నిర్వాహకులు వెంటనే మకాం మార్చారు. అలాగే కోరుట్ల పట్టణంలో కూడా పలుచోట్ల పేకాట జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లక్షలు నిర్వాహకులు జేబులో వేసుకుంటున్నారు. ముగిసిన ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’జగిత్యాలఅగ్రికల్చర్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తల కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఏప్రిల్ 27 నుంచి ఈనెల 23 వరకు 64 గ్రామాల్లో నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన స్థానం, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులతో 8 శాస్త్రవేత్తల బృందాలను ఏర్పాటు చేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు, పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, రసాయన ఎరువుల తగ్గింపు, ఆధునిక యంత్రాల వాడకం, నూనెగింజల పంటల సాగు తదితర విషయాలపై రైతులకు వివరించారు. చివరిరోజు జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట, కోరుట్ల మండలం పైడిమడుగులో అవగాహన కల్పించి.. వానాకాలం పంటలపై దిశానిర్దేశం చేశారు. దాదాపు 5వేల మంది రైతులు హాజరై, తమ సాగు సందేహాలను నివృత్తి చేసుకున్నారని జిల్లా ఇన్చార్జి రాజేశ్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కొనుగోళ్లలో జాప్యంరాయికల్: అధికారుల నిర్లక్ష్యంతోనే కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని ఆలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని, బస్తాలు తరలించడం లేదని రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పంట పండించడం ఒకెత్తయితే అమ్ముకోవడం మరో ఎత్తు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్యాదవ్, సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, సర్పంచులు స్వామిరెడ్డి, గంగాధర్, నాయకులు మల్లారెడ్డి, జగదీశ్వర్రెడ్డి, ఆడెపు కృష్ణ, నందునాయక్ ఉన్నారు. -
కేవీ స్థలంపై రాద్దాంతం చేయొద్దు
జగిత్యాల: కేంద్రీయ విద్యాలయం స్థలంపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని, ఎమ్మెల్యే సంజయ్కుమార్ పలుచోట్ల పరిశీలించి విద్యార్థులకు అనుకూలమైన చోట కేటాయిస్తామని డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య అన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోగ శ్రావణి దీనిపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈన కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. శ్రావణి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని పేర్కొన్నారు. సుందరీకరణలో ఖర్జూర మొక్కలు నాటితే ఈతపళ్లు కాస్తున్నాయన్నారు. హైదరాబాద్లో బిజినెస్ చేసుకుంటూ మెరుపుతీగలా వచ్చి మా ట్లాడితే ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు. పసుపుబోర్డు అని చెప్పి ఎంపీ అర్వింద్ ప్రజలను మోసం చేశారని, స్పైస్ బోర్డుతో ప్రజలకు లాభం లేదన్నారు. జగిత్యాల అభివృద్ధికి ఎమ్మెల్యే సంజయ్కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని, శ్రావణి కుటుంబ చరిత్ర అందరికీ తెలుసునన్నారు. సమావేశంలో చైర్పర్సన్ సమిండ్ల వాణి, బండ శంకర్, గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, గట్టు సతీశ్, కొత్తమోహన్, రాజేశ్, చంద్రకళ పాల్గొన్నారు. -
క్షీరాభిషేకం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం రంగురంగుల పూలతో స్వామివారిని అలంకరించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉచిత శిక్షణజగిత్యాల: బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఫౌండేషన్ వారి సహకారంతో ఏఐ లైఫ్ స్కిల్స్పై నాలుగు రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26లోపు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈనెల 27 నుంచి 30 వరకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. మిగతా వివరాలకు 0878–2268686 నంబర్లో సంప్రదించాలని కోరారు. చల్గల్ మార్కెట్లో రైతుల ఆందోళనజగిత్యాలరూరల్: జిల్లా కేంద్రంలోని చల్గల్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం రైతులు ఆందోళన చేశారు. వరిధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోందని, అలాగే తూకం వేసేందుకు హమాలీలు ఒక్కో రైతు వద్ద రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. దీంతో పాటు, 43 కిలోలతో తూకం వేస్తున్నారని, దీంతో రైతులకు ఎంతో నష్టం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు నాణ్యతగా చేపట్టాలిజగిత్యాల: అభివృద్ధి పనులు వేగవంతంగా చే స్తూ నాణ్యతగా నిర్మించాలని ఎమ్మెల్యే సంజ య్కుమార్ అన్నారు. 42వ వార్డులో రోటరి క్ల బ్ పార్క్ పక్కన నిర్మించిన బీటీరోడ్డును శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. కొన్నేళ్లుగా ఈ రోడ్డుతో ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారని, బీటీ రోడ్డు మంజూరు కావడంతో ఇ బ్బందులు తొలగాయన్నారు. మున్సిపల్ చైర్మ న్ సమిండ్ల వాణి, నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, బండ శంకర్, సత్యప్రణవ్, నా గరాణి, నాగభూషణం, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ విధానంతో తిప్పలుపడుతున్న రైతులుజగిత్యాలరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతులకు బాధలు తప్పడం లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట, సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలులో జాప్యంతో రైతులు ఎర్రటి ఎండలో నానా కష్టాలు పడుతున్నారన్నారు. కొనుగోలు సెంటర్లలో గన్నీ బ్యాగులు, లారీల కొరతతో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. నాయకులు ఆనందరావు, సత్యంరావు, తిరుపతి, ప్రసాద్, రవీందర్రావు, రాజన్న, గంగారాం, రవీందర్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. బాంబు స్క్వాడ్ బృందం తనిఖీజగిత్యాలక్రైం: సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో శుక్రవారం బాంబు స్క్వాడ్ బృందం విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని బస్టాండ్, అంగడి బజార్ పరిసరాలు, దుకాణాలు, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. బాంబు డిటెక్షన్ టీంతో గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాల గుర్తింపును నైపుణ్యం కలిగిన బాంబుస్క్వాడ్ బృందంతో తనిఖీలు చేశారు. -
ఎండ.. ప్రచండ!
శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్లో)ఉమ్మడి జిల్లాలో ఆల్టైం రికార్డు ఉష్ణోగ్రతలు ● ఉదయం ఏడుగంటల నుంచే సూర్యుడి ప్రతాపం రాత్రి ఏడు గంటల వరకూ వేడిగాలులు ● అత్యవసరమైతే తప్ప.. బయటకు వెళ్లొద్దని అధికారుల సూచనసాక్షి పెద్దపల్లి: ఉమ్మడి జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. భాను డి ప్రతాపంతో శుక్రవారం ఆల్టైం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడిమి, వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం ఏడు గంటలకే ఇంటినుంచి బయటకు రాలేకపోతున్నా రు. రాత్రి ఏడుగంటల వరకూ వడగాలులు తగ్గడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుండగా, చిరువ్యాపారులు మధ్యాహ్నం వేళ బ్రేక్ ఇస్తున్నారు. ఎండ నేపథ్యంలో రోజువారీగా రద్దీగా కనిపించే ప్రధా న కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్లు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. రెడ్జోన్లో ఉమ్మడి జిల్లా వాతవరణశాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రెడ్జోన్గా ప్రకటించింది. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మించి నమోదైతే రెడ్జోన్గా ప్రకటిస్తారు. వారం రోలుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సగటున 45 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగత్రలు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత దంచి కొడతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో కార్మికులు వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగినా వేడినుంచి ఉపశమనం లభించడం లేదని వాపోతున్నారు. ఇళ్లనుంచి బయటకు రావొద్దు ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డాక్టర్లు చెబుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. పండ్లరసాలు, మజ్జిగ వంటిని తాగాలని సూచనలు ఇస్తున్నారు. ఈనెల 25న రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వడ దెబ్బ లక్షణాలు మగత లేదా మూర్ఛ, వికారం లేదా వాంతులు, తలనొప్పి, విపరీతమైన దాహం, అసాధారణంగా ముదురు పసుపు రంగులో తక్కువ పరిమాణంలో మూత్రవిసర్జన, వేగవంతమైన శ్వాస, హృదయ స్పందన వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవపదార్థాలు తాగాలి. ఆ వెంటనే వైద్య సాయం పొందాలి. వడదెబ్బతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి తారసపడితే దుస్తులు తొలగించి చల్లని నీటితో లేదా తడిబట్టతో తుడవాలి. ఽజైన, ధర్మపురి 46.4 గంగాధర 46.4 కమాన్పూర్ 46.4 మర్తన్నపేట 46.4 -
విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం తగదు
జగిత్యాలటౌన్: కేంద్రీయ విద్యాలయం విషయంలో విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు తగదని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి భోగ శ్రావణి అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో భారీ అవినీతి జరిగిందని, ఎమ్మెల్యే హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయానికి చల్గల్ వ్యవసాయ క్షేత్రంలో 5ఎకరాలు కేటాయించాలని కోరారు. జగిత్యాల మున్సిపాలిటీకి కేంద్రం మంజూరు చేసిన రూ.62కోట్ల నిధుల పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, నాయకులు ఆముద రాజు, మ్యాదరి అశోక్, మహిళా మోర్చా నాయకురాలు దూరిశెట్టి మమత, చెన్నాడి మధురిమ, గడ్డల లక్ష్మి, సింగం పద్మ పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలి జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని భోగ శ్రావణి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలం పోచంపేటలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల్లో ధాన్యం పోసి నెలలు గడుస్తున్నా కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్పంచ్ జగదీశ్, నాయకులు నాగేందర్, సుజాత, నరేశ్ పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతర గస్తీ
జగిత్యాలక్రైం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాత్రి వేళల్లో నిఘా మరింత బలోపేతం చేయడం జరిగిందని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం రాత్రి జిల్లాలోని పెట్రోలింగ్ వ్యవస్థను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అసాంఘిక కార్యకాలపాలు, చట్ట వ్యతిరేక చర్యలు, దొంగతనాలను అరికట్టేందుకు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంత గస్తీ నిర్వహించడంతో పాటు నైట్ బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రత భావం పెంపొందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. సమయానుకూలంగా స్పందిస్తూ నేరాలకు ముందుగానే అడ్డుకట్ట వేయవచ్చాన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు అన్నిరకాల భద్రత చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
బాధితులకు సత్వర సేవలందించాలి
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలు, చిన్నారులకు సత్వర సేవలందించాలని అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్ అన్నారు. శుక్రవారం భరోసా కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. మహిళల రక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లైంగిక దాడులకు గురైనవారికి సత్వర సాయం, న్యాయ పరిరక్షణ, మానసిక ధైర్యం కల్పించడం అత్యంత కీలకమన్నారు. జిల్లాలో ఎక్కడైనా పోక్సో, అత్యాచార కేసులు నమోదైతే వెంటనే బాధితులను భరోసా సెంటర్కు తీసుకువచ్చి చట్టపరంగా సూచనలు, సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. సీసీఎస్ సీఐ శ్రీనివాస్, పట్టణ ఎస్సై సుప్రియ, సిబ్బంది పాల్గొన్నారు. -
మహిళల విద్యాభివృద్ధికి కృషి
జగిత్యాల: మహిళల విద్యాభివృద్ధికి భాగ్యరెడ్డివర్మ ఎనలేని కృషి చేశారని అదనపు కలెక్టర్ లత అన్నారు. భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీఎస్సీడీవో రాజ్కుమార్, సునీత పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి పెగడపల్లి(ధర్మపురి): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి వారంలోపు పూర్తయ్యేలా చూడాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత పేర్కొన్నారు. మండలంలోని బతికపల్లిలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. కేంద్రంలోని నిల్వలను పరిశీలించి సేకరించిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. తేమశాతం వచ్చిన ధాన్యం కుప్పలను వెంటనే తూకం వేసి మిల్లర్లకు చేరవేయాలని సూచించారు. ట్యాబ్లో నమోదు చేసిన మరుసటి రోజునే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నట్లు తెలిపారు. లారీల కొరతతో ధాన్యం బస్తాల సరఫరాలో జాప్యం జరుగుతుందని, లారీల కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ను నిర్వాహకులు కోరారు. డీసీఎస్వో జితేందర్రెడ్డి, తహసీల్దార్ సయ్యద్ నిజామొద్దీన్, ఆర్ఐలు శ్రీనివాస్, జమున, ఏపీఎం రవివర్మ పాల్గొన్నారు. -
పీఎంజే దర్యాప్తు ముమ్మరం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసుల దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిందితుల గుర్తింపు పరేడ్ ముగిసింది. ఈనెల 3న జ్యోతినగర్లోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీ చేసిన ఐదుగురు దుండగులు అడ్డు వచ్చిన నలుగురి సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోవడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు దోపిడీకి పాల్పడింది.. సుబోధ్ సింగ్ గ్యాంగ్గా తేల్చారు. ఈ ఘటనలో పాల్గొన్న రఘునాథ్ కర్మాకర్, రావిశ్ కుమార్, వారికి సిమ్కార్డులు అందించిన మెహతాబ్ ఖాన్ను బిహార్లో అరెస్టు చేసి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కరీంనగర్ జైల్లో రిమాండ్లో ఉన్న నిందితులను గుర్తించేందుకు పోలీసులు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ (టీఐపీ) నిర్వహించారు. బుల్లెట్ గాయాలతో ప్రాణాపాయం తప్పిన నలుగురు, మే 3న విధుల్లో ఉన్న ఇతర పీఎంజే సిబ్బంది, పెద్దపల్లి లాడ్జి నిర్వాహకులను పోలీసులు పరేడ్ కోసం కరీంనగర్ జైలుకు రప్పించారు. జడ్జి సమక్షంలో జరిగిన గుర్తింపు ప్రక్రియలో దోపిడీలో పాల్గొన్న ఇద్దరు దొంగలు రఘునాథ్ కర్మాకర్, రావిశ్ కుమార్లను గుర్తుపట్టారు. పీటీ వారంట్ కోసం చర్యలు.. దోపిడీకి పథకం పన్నిన గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్ను కరీంనగర్కు తీసుకువచ్చేందుకు కావాల్సిన న్యాయప్రక్రియ ప్రారంభించారు. ప్రస్తుతం బిహార్ జైలులో ఖైదీగా ఉన్న సుబోధ్ని ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ ద్వారా కరీంనగర్కు తరలించేందుకు సిద్ధమయ్యారు. దర్యాప్తులో లభ్యమైన కీలక సమాచారం, డేటా, ఆధారాల ద్వారా అతన్ని పీటీ వారంట్ ద్వారా తీసుకొచ్చి విచారిస్తే.. కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఆయుధాలు తీసుకొచ్చిన వాహనం గుర్తింపు దోపిడీకి దుండగులు వాడిన ఆయుధాలు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు పోలీసులకు సమాధానం దొరి కింది. సుబోధ్ ముఠా దోపిడీకి ముందు కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి పట్టణాల్లో రెక్కీ చేసింది. పీఎంజేను టార్గెట్గా ఎన్నుకున్న వీరికి దోపిడీకి ముందురోజు ఆయుధాలు అందాయి. మహారాష్ట్ర మీదుగా తెలంగాణలోకి ఒక వాహనంలో ఆయుధాలు చేరినట్లు గుర్తించారు. సదరు వా హనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, నార్నూర్, ఇందనపల్లి చెక్పోస్టుల వద్ద సీసీ కెమెరాలకు చిక్కిన ఫుటేజీని పోలీసులు సంపాదించా రు. దీని ద్వారా దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితులకు ఏదీ ఆర్థిక సాయం..? దుండగుల కాల్పుల్లో ముస్తాక్, రాజేశ్, కమలాసన్, మధుకర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు ప్రాణాపాయం నుంచి తప్పించగలిగారు. ఇటీవల డిశ్చార్జి అయి ఇంటికి చేరిన బాధితులు కోలుకుంటున్నారు. వీరికి ఆసుపత్రి ఖర్చు మొత్తం పీఎంజే జువెల్లరీస్ యాజమాన్యమే భరించినట్లు సమాచారం. బాధితులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడం గమనార్హం. కనీసం ఆ సమయంలో ఆర్థిక సాయం చేస్తామన్న ప్రతిపక్షాలు కూడా చిల్లిగవ్వ ఇవ్వలేదని బాధితుల సన్నిహితులు వాపోతున్నారు. తమ వారు ఆసుపత్రిలో ఉంటే మీడియాకు పోజులు ఇచ్చిన నాయకులు ఇప్పుడు కన్నెత్తి ఇటువైపు చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రావిశ్ కుమార్రఘునాథ్ కర్మాకర్ -
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
జగిత్యాల: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం సుమంగళి గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి మరింత స్థలం ఇస్తామన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాలను లబ్ధిదారులకు చేరవేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల, రాయికల్ మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకాల కింద అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేశ్ తదితరులు పాల్గొన్నారు. ఏకవచనంతో సంబోధించడం సరికాదు రాజ్యాంగబద్దంగా ఎన్నికై న ముఖ్యమంత్రిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడం సమంజసం కాదని మంత్రి లక్ష్మణ్కుమార్ అన్నారు. కేటీఆర్ కుటుంబంలో కవిత కుర్చి లాక్కునేందుకు ప్రయత్నించడంతో నిత్యం అసహనానికి గురవుతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదని, 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. రైతులు అధైర్యపడొద్దు గొల్లపల్లి: రైతులు ఆందోళన చెందవద్దని, వరిధాన్యం, మొక్కజొన్నను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని మంత్రి లక్ష్మణ్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్, బోరుబావిని ప్రారంభించి మాట్లాడారు. తిరుమలాపూర్లో సమస్యల పరిష్కారానికి తనవంతు సహకరిస్తానని, రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు సహకరించాలని మంత్రి కోరారు.


