breaking news
Jagtial
-
‘ఎత్తిపోతల’కు మరమ్మతు చేయండి
సారంగాపూర్: ఎత్తిపోతల పథకాలకు మరమ్మతు చేసి పంటలకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అధికారులకు సూచించారు. బీర్పూర్ మండలం చిన్నకొల్వాయి శివారులోని ఎత్తిపోతల పథకాలను రైతులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఇటీవల వర్షాలకు గోదావరి ఉప్పొంగి మోటార్లలోకి ఇసుక చేరి పనిచేయడం లేదని, దీనిపై ఇటీవల నీటిపారుదల శాఖ ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో చిన్నకొల్వాయి ఎత్తిపోతల కింద కొల్వాయి, ఆరెపల్లిలో 1300 ఎకరాలకు సాగునీరు అందడం లేదన్నారు. రెండు మోటర్లు పనిచేసినా సాగునీరు అందుతుందని సీఈ సుధాకర్రెడ్డికి ఫోన్ చేశారు. రోళ్లవాగు ప్రాజెక్టు మూడు తూములకు రెండు నెలల్లో గేట్లు బిగించనున్నట్లు తెలిపారు. సింగిల్విండో చైర్మన్ పొల్సాని నవీన్రావు, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ ముక్క శంకర్, ఎత్తిపోతల పథకం చైర్మన్ రంగు లక్ష్మణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చెర్పూరి సుభాష్ పాల్గొన్నారు. -
జగిత్యాల బల్దియాపై ‘విజిలెన్స్’
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ అవినీతి మయంగా మారింది. ప్రతిపనికి ఓ రేటు నిర్ణయిస్తున్న బల్దియా సిబ్బంది అందినకాడికీ దోచుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో గతంలో కొందరు సిబ్బంది విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు అధికారులు ఆగస్టులో సుమారు 18 మంది విజిలెన్స్ అధికారుల బృందం జగిత్యాలకు చేరుకుని బల్దియాలోని ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఆయా విభాగాల రికార్డులను తీసుకెళ్లారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. అవి నీతిలో ప్రమేయముందని భావించి.. కొన్నివిభాగా ల సిబ్బందికి రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కా ర్యాలయంలో హాజరుకావాలని సోమవారం మె మో జారీ చేసినట్లు సమాచారం. వారంతా మంగళవారం విచారణకు హాజరైనట్లు తెల్సింది. ఆయా విభాగాల ఉద్యోగులను విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు మరిన్ని రికార్డులు తీసుకురావాలని చె బుతూ కరీంనగర్లోని కార్యాలయానికి రమ్మన్నట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు పుడుతోంది. అన్ని విభాగాల్లోనూ అంతే.. బల్దియాలో అవినీతి ఆరోపణలు రావడం కొత్తేమీకాదు. టౌన్ప్లానింగ్ విభాగంలో పర్మిషన్లు, శానిటేషన్ విభాగంలో ట్రేడ్లైసెన్స్లు, డీజిల్ కొనుగోలుకు సంబంధించి అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంజినీరింగ్ సెక్షన్లో వాటర్ చార్జీలు, టెండర్లకు సంబంధించి, రెవెన్యూ విభాగంలో అసెస్మెంట్ కాపీలు, ముటేషన్లలో అవకతవకలు జరుగుతున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వచ్చినా సిబ్బందిలో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం. వీటిని భరించలేని కొందరు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గతంలోనే విచారణ చేపట్టారు. నాటి ఫిర్యాదులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలోనే నిర్మించిన ప్రతి భవనాలను పరిశీలించారు. ఇక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందంటే.. గతంలో టౌన్ప్లానింగ్ విభాగంలో ఒకరు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడినంతగా.. ఆర్వో విభాగంలో ఓ భూకబ్జా యత్నంలో ఏకంగా మున్సిపల్ కమిషనరే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తాజాగా విజిలెన్స్ అధికారులు అవినీతి ఆరోపణలకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలిస్తుండడంతో అక్రమార్కుల్లో వణుకుపుడుతోంది. నామమాత్రపు చర్యలు బల్దియాలో అధికారులపై నేరుగా ఆరోపణలు వస్తున్నా నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నట్లు అపవాదు ఉంది. ఇటీవల ఓ బిల్కలెక్టర్ ఏకంగా ఆస్తిపన్ను డబ్బులను సొంతానికి వాడుకోగా సస్పెండ్ చేశారు. అలాగే కొన్ని కీలక శాఖల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
జిల్లాలో ‘జువైనల్ జస్టిస్’
జగిత్యాలజోన్: ఇటీవల బాలనేరాలు పెరిగిపోతున్నాయి. నేరాలకు పాల్పడిన చిన్నారులపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు. కోర్టులు వారిని జువైనల్ హోంకు తరలించి విచారణ చేపడుతున్నాయి. వారి జీవితం చీకటిమయం కాకుండా.. సమాజంలో ఉన్నతులుగా ఎదిగేందుకు అవసరమైన సహాయాన్ని జువైనల్ జస్టిస్ బోర్డులు అందిస్తున్నాయి. బాల నేరస్తుల్లో సత్ప్రవర్తన తెచ్చేలా.. కేసులు సకాలంలో విచారించేలా పిల్లల సంరక్షణ, రక్షణ చట్టం–2015 ప్రకారం ప్రతి జిల్లాలో జువైనల్ జస్టిస్ బోర్డులు (జువైనల్ కోర్టులు) ఏర్పాటు అవుతున్నాయి. జిల్లా కేంద్రానికి జువైనల్ జస్టిస్ బోర్డు మంజూరు కాగా.. బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి ప్రారంభించనున్నారు. జువైనల్ జస్టిస్ బోర్డులోనే విచారణ 18 ఏళ్ల లోపు ఉండి.. నేరాలకు పాల్పడిన బాల నే రస్థుల కేసులను జువైనల్ జస్టిస్ బోర్డు(కోర్టు)లో నే విచారిస్తాయి. ఈ కోర్టును జిల్లా కేంద్రంలోనే ప్ర త్యేక భవనంలో ఏర్పాటు చేస్తారు. ఈ బోర్డుకు చైర్పర్సన్గా జిల్లా మొదటి అదనపు జ్యూడిషి యల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా సామాజిక సేవకురాలు శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్ ఉంటారు. వారంలో ఒక్కటి రెండు రోజులు మేజిస్ట్రేట్ నేరుగా జువైనల్ జస్టిస్ బోర్డుకు వెళ్లి, బాల నేరస్తుల కేసులను విచారిస్తారు. ఆరోపణలు ఎదుర్కోంటున్న బాల నేరస్థులకు అదే భవనంలో వసతి కల్పిస్తారు. ఇప్పటివరకు కరీంనగర్లో.. ఇప్పటివరకు జువైనల్ కోర్టు కరీంనగర్లో ఉంది. తాజాగా జగిత్యాలలోని బైపాస్రోడ్డులో ప్రత్యేక భవనంలో ఏర్పాటుచేశారు. కోర్టు ఏర్పాటుతో 166 కేసులు కరీంనగర్ నుంచి జగిత్యాలకు బదిలీ అయ్యాయి. ఇంకా వందవరకు కేసులు రానున్నాయి. జువైనల్ జస్టిస్ బోర్డులు బాల నేరస్తుల్లో సత్ప్రవర్తను తెచ్చేందుకు పెద్దపీట వేస్తాయి. బాల నేరస్తులు ఒకేచోట ఉండడం ద్వారా వారు మంచి నడవడికతో ఉండేందుకు.. పోషకాలతో కూడిన ఆహారం అందించేందుకు, విద్యా, వైద్య సౌకర్యాలు అందించేందుకు, ఉపాధి అవకాశాలు పెంపొదించేందుకు బోర్డులు ప్రయత్నిస్తాయి. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి శిక్ష వేస్తే వారికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు చూపిస్తారు. -
‘గాలికుంటు’ నివారణకు స్పెషల్ డ్రైవ్
మెట్పల్లిరూరల్: పశువుల్లో సోకే ప్రధాన వ్యాధుల్లో గాలికుంటు ఒకటి. సకాలంలో వ్యాధి లక్షణాలు గుర్తించకుంటే పశువులు.. వాటి పాలు తాగిన దూడలు మృత్యువాతపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా గాలికుంటు నివారణ టీకాలు వేస్తోంది. ఎప్పటిలాగే ఈ సారి బుధవారం నుంచి నవంబర్ 14వరకు పశువైద్య, సంవర్థక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేయనున్నారు. దూడలు, ఆవులు, గేదేలకు టీకాలు వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా టీకాలు జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు, 31 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 45 ఉప పశువైద్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,17,734 పశువులు ఉన్నాయి. వీటన్నింటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసేలా జిల్లా పశువైద్య, సంవర్థక శాఖ సిద్ధమైంది. నిర్ణయించిన తేదీల్లో ఆయా గ్రామాలకు వెళ్లి టీకాలు, టీకా వేసిన పశువులకు ట్యాగ్ వేయనున్నారు. వ్యాధి లక్షణాలు గాలికుంటు అంటూ వ్యాధి. ఇది మార్చి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వ్యాపిస్తుంది. దేశవాళి పశువులతో పోల్చితే సంకరజాతి పశువుల్లో అధికం. వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వచ్చి నీరసించిపోతాయి. నోరు, గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. పొక్కులు పుండ్లుగా మారతాయి. నొప్పితో పశువులు మేత, నీరు తీసుకోవు. నోటి నుంచి చొంగ కారుతుంది. పాల దిగుబడి తగ్గిపోతుంది. నివారణ చర్యలతోనే రక్షణ గాలికుంటు వ్యాధి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని పశువైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకిన పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. పశువులను వేరుగా ఉంచాలి. ఆర్నెళ్లకోసారి తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దూడలు, ఆవులు, గేదెలకు ఈ టీకాలు వేయించి వ్యాధుల నుంచి రక్షించుకోవాలి. ఉచితంగానే వేస్తున్న టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – కొమ్మెర మనీషాపటేల్, మెట్పల్లి పశువైద్యాధికారి -
పనులు నాణ్యతతో చేపట్టాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులు నాణ్యతగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మున్సిపల్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. టీయూఎఫ్ఐడీసీ జనరల్ ఫండ్తో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులు వర్షాలతో నిలిచిపోయాయని, వెంటనే రంభించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఈ ఆనంద్, ఏఈలు వరుణ్, చరణ్ పాల్గొన్నారు. రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్రాజ్ రాష్ట్రస్థాయి సెమినార్ పోటీలకు ఎంపికై నట్లు ఎంఈవో రాఘవులు తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్లో నిర్వహించే సెమినార్లో ఆయన పాల్గొననున్నారు. విద్యార్థుల్లో ఉత్తమ ప్రవర్తన, మార్పులు పెంపొందించడం అనే అంశంపై ఒత్తిడి నుంచి విజయం వైపు, సమస్యల నుంచి పరిష్కారంవైపు అభయ్రాజ్ రూపొందించిన పరిశోధనపత్రాలు ఈ సెమినార్లో ప్రదర్శించనున్నారు. అభయ్రాజ్ను డీఈవో రాము, సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ, రాజేశ్, మహేశ్, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పొన్నం రమేశ్, కుంబాల శ్రీనివాస్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, మండల అధ్యక్షుడు గంగరాజం, ప్రధాన కార్యదర్శి రాపర్తి నర్సయ్యలు అభినందించారు. ఇబ్రహీంపట్నం: విద్యార్థినులు చదువుతోపాటు కుట్టు శిక్షణ నేర్చుకోవాలని డీఈవో రాము అన్నారు. మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓకేషనల్ కోర్సుల్లో భాగంగా టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఐదు కుట్టు మిషన్లు అందించింది. వాటిపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు శిక్షకురాలిని నియమించామని డీఈవో తెలిపారు. పది పరీక్షలకు పకడ్బందీగా సన్నద్ధం కావాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి రాజేశ్, ఎంఈవో మధు, ప్రధానోపాధ్యాయులు రాజేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జగిత్యాల: సోషల్ మీడియా, సెల్ఫోన్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని, బాలికలు సంస్కారంతో కూడిన చదువు నేర్చుకోవడం ద్వారా ఉన్నత విలువలు వస్తాయని, తద్వారా ఉన్నతస్థానాలు చేరవచ్చని జిల్లా సంక్షేమాధికారి బోనగిరి నరేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భవానినగర్లో గల గురుకుల పాఠశాలలో మహిళ సాధికారత అంశంపై అవగాహన కల్పించారు. మంచిని గ్రహించి క్రమశిక్షణతో చదువు నేర్చుకోవాలని అన్నారు. సైకాలజిస్ట్ గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దన్నారు. అనంతరం విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో సీడీపీవో మమత, ప్రిన్సిపాల్ సునీత, వైస్ ప్రిన్సిపాల్ జల, విజయలక్ష్మీ, శ్రీనివాస్, పవిత్ర, రాజశ్రీ, అశ్విని, స్వప్న పాల్గొన్నారు. కోరుట్ల: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కంప్యూటర్ లిటరసిపై అవహన కలిగేలా ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వాలని డీఈవో రాము అన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుల డిజిటల్ లిటరిసీపై మూడు రోజుల శిక్షణ శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. విద్యార్థులు కోడింగ్, ఆర్టీఫిషియల్ ఇంటలెజెన్స్పై పట్టు సాధించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. -
డివైడర్ల మధ్య మొక్కల తొలగింపు
ఇదేనా చి(చె)త్తశుద్ధిజగిత్యాల: జిల్లా కేంద్రంలో జంక్షన్లతోపాటు, డివైడర్లలో పిచ్చిమొక్కలు ఏపుగా మారి కళావిహీనంగా మారడంతో ‘పట్టణం కళావిహీనం’ శీర్షికన ఈనెల 14న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. జగిత్యాల నుంచి కరీంనగర్, నిజామాబాద్కు వెళ్లే రహదారి డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన కానోకార్పస్ మొక్కలను తొలగించారు. దీంతో పట్టణ ప్రజలు, స్థానికులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించండిజగిత్యాల: బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. విద్యార్థుల ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ.. కలెక్టర్, వి ద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల యజమాన్యాలతో చర్చించి విద్యార్థుల కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్, కిశోర్ పాల్గొన్నారు. మెట్పల్లి: పారిశుధ్యం విషయంలో మెట్పల్లి బల్దియా అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. వారి పనితీరుకు ఈ చిత్రాలే నిదర్శనంగా నిలుస్తాయి. 12వార్డులోగల ఓ వీధిలో ఉన్న డ్రైనేజీలు వ్యర్థాలతో నిండిపోయాయి. నెలల తరబడి పూడికతీయకపోవడంతో ఇదిగో ఇలా నిండి దుర్గంధం వెదజల్లుతోంది. సమస్య పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీగొల్లపల్లి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల జలేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మరిచి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బంగారం కోసమే విష ప్రయోగం
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తిలో వృద్ధ దంపతులపై విషప్రయోగం మిస్టరీ వీడింది. ఈ ఘటనలో వృద్ధుడు చనిపోగా.. వృద్ధురాలు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తెలిసిన వ్యక్తే బంగారం కోసం మత్తు మాత్రలు ఇవ్వగా.. నిందితుడిని గంగాధర పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌస్ ఆలం సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో వెల్లడించారు. గర్శకుర్తి గ్రామానికి చెందిన గజ్జెల శంకరయ్య– లక్ష్మీ దంపతులు ఇంట్లో ఇద్దరే ఉంటారు. వారి ఇంటికి సమీపంలో ఉండే కత్తి శివ(37) వృద్దులకు చేదోడుగా ఉంటూ మందులు తేవడం, ఇతర పనులు చేస్తుండేవాడు. శివకు పేకాట, ఆన్లైన్ గేమ్స్ ఆడడంతో అప్పులయ్యాయి. అప్పు తీర్చేందుకు దంపతుల వద్ద బంగారం కాజేయాలని నిర్ణయించాడు. గతంలో ముంబైలో కల్లుడిపోలో పనిచేసిన సమయంలో అందులో వాడే మత్తు టాబ్లెట్లు వెంట తెచ్చుకున్నాడు. ఈ నెల 7వ తేదీన వృద్ధులకు అనారోగ్యం ఉండడంతో మత్తు టాబ్లెట్లు ఇచ్చాడు. అవి వేసుకుంటే జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయని నమ్మించాడు. మాత్రలు వేసుకుని సొమ్మసిల్లిన రెండు గంటల తర్వాత ఇంట్లోకి వెళ్లి లక్ష్మి మెడలోని బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. అదే గ్రామంలోని కట్ల శ్రీనివాసాచారికి విక్రయించి, రూ.1.85 లక్షలు తీసుకున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న గంగాధర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివపై ఆనుమానంతో అతని కదలికలపై నిఘా పెంచారు. సోమవారం గర్శకుర్తి శివారులో అదుపులోకి తీసుకున్నారు. తానే వృద్ధులకు మత్తుమాత్రలు ఇచ్చి, బంగారం చోరీ చేశానని ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.25వేల నగదు, 11మత్తు మాత్రలు, సెల్ఫోన్, కట్ల శ్రీనివాసాచారి నుంచి పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ, హెడ్కానిస్టేబుల్ చారి, కానిస్టేబుళ్లు జంపన్న, అరవింద్ను సీపీ అభినందించి రివార్డు అందించారు. వీడిన గర్శకుర్తి వృద్ధ దంపతుల మిస్టరీ మత్తు మాత్రలు ఇచ్చిన తెలిసిన వ్యక్తి ఆపై బంగారం అపహరణ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
నీటిలో మునిగి వ్యక్తి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): మానేరువాగులో స్నానం చేసి బయటకు వస్తుండగా ఫిట్స్ వచ్చి నీటిలోనే వ్యక్తి చనిపోయిన సంఘటన పొత్తూరులో విషాదం నింపింది. మండలంలోని పొ త్తూరుకు చెందిన బండారి వెంకటయ్య(48) కొంతకాలంగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం హమాలీ పనులు ముగించుకున్న తర్వాత గ్రామ పొలిమేరలోని మానేరువాగులో స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తుండగానే వెంకటయ్యకు ఫిట్స్ వచ్చి నీటిలోనే పడి మృతిచెందాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మానేరువాగు వైపునకు వెళ్లిన గ్రామస్తులు వెంకటయ్య మృతదేహం చూసి కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుని భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై జి.లక్పతి తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు. ● ఢీకొట్టి వెళ్లిపోయిన గుర్తు తెలియని వాహనం కోరుట్ల రూరల్: మండలంలోని వెంకటాపూర్, మోహన్రావుపేట గ్రామాల మధ్య గుర్తు తెలియని వాహనం ఢీకొని పట్టణానికి చెందిన మారుపాక వినోద్ (28) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం వినోద్ వ్యవసాయ బోర్లు మరమ్మతు చేస్తుంటాడు. సోమవారం సాయంత్రం కోరుట్ల నుంచి మోహన్రావుపేట వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతోతల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వినోద్కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలిమెట్పల్లి రూరల్: పంటల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్లో కరీంనగర్లోని రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ ప్రదర్శన, పంటల్లో యాజమాన్య పద్ధతులపై సోమవారం రైతు సదస్సు నిర్వహించారు. ఆధునిక కేతిక విధానాలను రైతులు అందుకోవాలన్నారు. ఎరువులు మోతాదులో వాడాలని, పంట అవశేషాలను తగలబెట్టకూడదని, మెలకువలు పాటించి అధిక దిగుబడి పొందాలని పేర్కొన్నారు. రైతు విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ హరికృష్ణ, శాస్త్రవేత్తలు మదన్మోహన్రెడ్డి, రాజేంద్రప్రసాద్, రాంప్రసాద్, ఉమారాణి, భారతీనారాయణ భట్, అరుణ్బాబు, డీఏవో భాస్కర్, ఏవో దీపిక, ఏఈవో అనిల్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో సాంకేతికత అలవర్చాలిజగిత్యాల: విద్యార్థుల్లో సాంకేతికత అలవర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ లిటరసి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు క్షుణ్ణంగా తెలుసుకుని వారికి వివరించాలని డీఈవో రాము అన్నారు. భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసిపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి సోమవారం హాజరయ్యారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే కోడింగ్, ప్రోగ్రామింగ్లో ప్రాథమిక అభ్యాసంతో నైపుణ్యం అలవర్చేలా చూడాలన్నారు. కో–ఆర్డినేటర్ రాజేశ్, ఈశా స్కూల్ ఆఫ్ నాలెడ్జ్ చైర్మన్ కంది కై లాసం పాల్గొన్నారు. హుజూరాబాద్రూరల్: మండలంలోని వెంకట్రావ్పల్లెలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోతిరెడ్డిపేటకు చెందిన గీత కార్మికుడు చింత సమ్మయ్య (46) బైక్పై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సమ్మయ్య తలకు తీవ్ర గాయాలుకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనదారుడు మెట్పల్లి గ్రానై ట్ క్వారీలో పనిచేసే వ్యక్తిగా భావిస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులున్నారు. -
ఆర్థిక నేరగాళ్ల ఆస్తులు జప్తు చేయాలి
జగిత్యాలటౌన్: క్రిప్టో కరెన్సీ మోసాలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కోరారు. అధిక లాభాలు, విదేశీ టూర్ల ఆశతో బిట్కాయిన్, మెటాఫండ్ వంటి యాప్ల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడి పెట్టిస్తూ.. క్షణాల వ్యవధిలో ఆ యాప్లను తొలగిస్తూ మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఆర్బీఐ అనుమతి లేకుండా సాగుతున్న ఆన్లైన్ ఆర్థిక కార్యకలాపాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుని నకిలీ యాప్లు, వెబ్సైట్లలో పెట్టుబడి అరికట్టేలా చూడాలని కోరారు. నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, మసర్తి రమేశ్, కల్లెపెల్లి దుర్గయ్య, మహ్మద్భారీ, మన్సూర్, చాంద్పాషా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
తాళంవేసిన నాలుగిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్ర దాటాక దొంగలు తాళం వేసిన నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంటి నుంచి ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన వెన్నం శ్రీనివాస్ దుబాయ్లో ఉంటున్నాడు. ఆయన భార్య ఇంటికి తాళంవేసి ఊరు వెళ్లింది. ఆ ఇంట్లో నుంచి సుమారుడు మూడు తులాల బంగారం, 41 తులాల వెండి ఎత్తుకెళ్లారు. షేక్ షబానా ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారం, 12 తులాల వెండి, రూ.50 వేలు, ద్యాగల నరేశ్ ఇంటి నుంచి రూ.1.70 లక్షలు, మూడు గారు గొలుసులు, మంథని కవిత ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. గుమ్ముల రాజేశం ఇంట్లో పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ పుటేజీలను పరిశీలించారు. సోమవారం ఉదయం 2.30 గంటల నుంచి 3 గంటల సమయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బంగారం, నగదు, బైక్ ఎత్తుకెళ్లిన దొంగలు -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.08కోట్లు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షకులు రాజమౌళి సమక్షంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు ఆధ్వర్యంలో శ్రీవేంకట అన్నమాచార్య సేవా ట్రస్టు సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. 81రోజులకుగాను 12 హుండీలను లెక్కించగా.. రూ.1,08,72,591తోపాటు 55 విదేశీ కరెన్సీ సమకూరింది. మిశ్రమ వెండి, బంగారం తిరిగి బ్యాగుల్లో వేసి, సీల్ చేసి, హుండీలో భద్రపరిచారు. లెక్కింపులో దేశిని సునీల్కుమార్, నీల చంద్రశేఖర్, గుండి హరిహరనాథ్, ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఏఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు. -
సర్వేల ఆధారంగానే రన్వే
రామగుండం: ఆరంచెల విధానంలో వచ్చే నివేదికల ఆధారంగానే అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ లభించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో చేపట్టిన ప్రీఫిజిబిలిటీ నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు చేయడం ద్వారా ఎయిర్పోర్టు ఏర్పాటుకు తొలిఅడుగు పడినట్లు ఆశలు రేకెత్తుతున్నాయి. వివిధ విభాగాల అత్యున్నతస్థాయి నిపుణులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఆరుదశల్లో సర్వే చేపడతారని, తుది నివేదికను ఎయిర్ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి అందజేస్తారని అధికారులు చెబుతున్నారు. రూపొందించనున్నారు. ఆరు దశల్లో.. విమానాశ్రయం ఏర్పాటు జాతీయ భద్రత, పర్యావరణం, రవాణా, ఆర్థిక, ప్రజావసరాలతో ముడిపడి ఉందని అంటున్నారు. తొలిదశలో ప్రయాణికుల డిమాండ్, వాణిజ్య అవసరాలు, రవాణా సౌకర్యాలపై ఆయా విభాగాల ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తారు. మలిదశలో స్థలం ఎంపికపై భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, ఎత్తు, ప్రధాన పట్టణాలకుదూరం, రోడ్లు, రైలు కనెక్టివిటీ పరిశీలిస్తారు. మూడోదశలో భూమి ఎత్తుపల్లాలు, పర్వతాలు, లోయలు, నదులు, రోడ్లు, సరస్సుపై పరిశోధన చేస్తారు. నాలుగో దశలో పర్యావరణ ప్రభావంపై అధ్యయం చేస్తారు. ఐదోదశలో నిర్వాసితులకు పునరావాసం, ఉపాధి కల్పన, వ్యాపార, ప్రాంతీయ అభివృద్ధి ప్రభావంపై సర్వే చేస్తారు. ఆరోదశలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఏవియేషన్ అథారిటీ, ఏఏఐ, కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్ అత్యున్నత ప్రతినిధులతో డీపీఆర్ తయారీ, ఆర్థిక అంచనా, బడ్జెట్ ఆమోదం, నిర్మాణానికి తుది అనుమతులు, టెండర్ల విడుదల ద్వారా విమానాశ్రయానికి రన్వే సిద్ధమైనట్లు ప్రకటిస్తారు. అంతర్గాంలో విమానాశ్రయంపై నివేదిక అన్నీబాగుంటేనే అడుగుముందుకు ప్రారంభమైన వివిధ శాఖల సర్వే పక్కాగా ఆరంచెల విధానం అమలు -
అల్ఫోర్స్కు ‘సీబీఎస్ఈ’ అవార్డు
కొత్తపల్లి(కరీంనగర్): విద్య, క్రీడారంగాల్లో అవలంబిస్తున్న విధి విధానాలకు గాను అల్ఫోర్స్ హైస్కూల్కు అత్యుత్తమ సీబీఎస్ఈ పాఠశాల అవార్డు లభించింది. హైదరాబాద్లో గ్లోబల్ ట్రెండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా కంక్లేవ్ సమావేశంలో ఈ అవార్డును అల్ఫోర్స్ విద్యా సంస్థ ల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి అందుకున్నారు. వి ద్యారంగంలో అల్ఫోర్స్ విద్యా సంస్థలు చేస్తున్న కృషికి ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని వీఎన్ఆర్ తెలిపారు. నాణ్యమైన విద్య అందిస్తూ, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడమే కాకుండా ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ,, ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు, సీఏ పరీక్షల ఫలితాల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. అవార్డు అందుకోవడంపై యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నేతలు, యువజన, క్రీడా సంఘం ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తంచేస్తూ నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. -
లోక కల్యాణ్ మేళా
జగిత్యాల: పీఎం స్వనిధి స్థానంలో లోక కల్యాణ్ పేరిట కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. మొదట సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు వీధివ్యాపారులకు రుణాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. కొత్తగా వీధి వ్యాపారాలు చేసుకునే వారికి సైతం అవకాశం కల్పించారు. గతంలో రుణాలు తీసుకున్న వారితో పాటు, కొత్తగా వ్యాపారం మొదలుపెట్టుకునే వారికి సైతం అవకాశం ఇస్తున్నారు. చాలా మంది కొత్తగా వీధివ్యాపారం చేసుకునే వారికి అవగాహన లేక ఈనెల 15 వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మున్సిపాలిటీల పరిధిలో.. మున్సిపాలిటీల్లో ఫుట్పాత్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధానమంత్రి ఆత్మ నిర్భార్ నిధి (పీఎం స్వనిధి) పథకం ప్రవేశపెట్టింది. తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేలు అందించి, నాల్గో విడతకు వచ్చేసరికి ఈ పథకాన్ని ఆపేశారు. దీంతో ఇక రుణాలు వస్తాయో లేదోనన్న ఆందోళన చిరువ్యాపారుల్లో మొదలైంది. తాజాగా వీధివ్యాపారాలకు చేయూతనందించేందుకు కేంద్ర ప్రభుత్వం స్వనిధి రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. లోక్ కల్యాణ్ మేళా.. 9 నెలల పాటు పీఎం స్వనిధి పథకం నిలిచిపోగా, ప్రస్తుతం లోక్ కల్యాణ్ మేళా పేరిట రుణాలు అందించనున్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తుకు గడువు పెంచారు. ఇప్పటికే ఉన్నతాధికారులు మెప్మా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈసారి శిబిరాలు ఏర్పాటు చేసి పాతవారితో పాటు, కొత్తవారికి సైతం రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మొదటి విడతలో రూ.10 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.15 వేలకు పెంచారు. ఎవరైతే సక్రమంగా చెల్లిస్తారో వారికి రూ.20 వేలు ఇవ్వనున్నారు. గతంలో రుణం తీసుకుని సక్రమంగా చెల్లించిన వారుంటే వారికి రూ.50 వేలు అందిస్తారు. క్రెడిట్కార్డులు కూడా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిసింది. రూ.లక్ష లిమిట్తో క్రెడిట్కార్డు వాడుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. డిజిటల్ ప్రోత్సాహం చిరువ్యాపారులకు డిజిటల్ ప్రోత్సాహం అందించా లనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్స్ అందించారు. ప్రస్తు తం ప్రతీ చిరువ్యాపారి డిజిటల్ ద్వారానే లావాదేవీ లు నిర్వహిస్తున్నారు. కొత్త రుణాలు తీసుకునే వారి కి త్వరితగతిన ప్రాసెసింగ్ చేయనున్నారు. లబ్ధిదా రులు పీఎం స్వనిధి మొబైల్యాప్ ఇన్స్టాలేషన్తో పాటు, క్యూఆర్ కోడ్ పొందవచ్చు. మున్సిపల్ అఽ దికారులు అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి లోక్ కల్యాణ్ మేళా గడువు ఈనెల 15 వరకు ఉంది. కొత్త, పాత వీధివ్యాపారులకు మంచి అవకాశం. రుణాలు తీసుకుని లబ్ధి పొందాలి. ప్రతీ మున్సిపాలిటీలో కార్యక్రమం చేపడతాం. విడతల వారీగా రుణం చెల్లిస్తే మళ్లీ అత్యధిక రుణాలు పొందే వీలుంటుంది. – రాజాగౌడ్, అడిషనల్ కలెక్టర్ పాత వీధివ్యాపారులు ఇలా.. బల్దియా వ్యాపారులు లక్ష్యం దరఖాస్తు రుణం మంజూరు ఇచ్చిన రుణాలు జగిత్యాల 6,005 780 540 483 473 కోరుట్ల 4,081 539 210 154 145 మెట్పల్లి 3,548 384 239 206 204 రాయికల్ 815 208 121 114 112 ధర్మపురి 858 199 150 107 102 -
భీమన్న సన్నిధి.. భక్తుల సందడి
● బాలాలయంలో రాజన్న దర్శనాలు ● కోడెమొక్కుల చెల్లింపులు ● సౌకర్యాలపై భక్తుల సంతృప్తి ● రాజన్న ఆలయం అభివృద్ధిపై హర్షం వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న ఆలయంలో దర్శనం, కోడెమొక్కులకు కల్పించిన సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలాలయంలో దర్శనాలకు ఏర్పాట్లు బాగున్నాయని.. కోడెమొక్కులు సైతం ఇక్కడే చెల్లించుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 11న స్వామి వారి ఉత్సవమూర్తులను భీమన్నగుడిలోని బాలాలయంలో ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇక్కడే దర్శనాలు, కోడెమొక్కులు చెల్లించుకుంటున్నారు. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయడాన్ని స్వాగతిస్తున్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అదే సమయంలో భీమన్నగుడిలో చేసిన ఏర్పాట్లపై సంతృప్తిగా ఉందన్నారు. భీమన్నగుడిలో దర్శనాలు పూర్తి చేసుకున్న భక్తులు ‘సాక్షి’తో మాట్లాడారు. వారి మాటల్లోనే.. రాజన్న గుడిని విస్తరిస్తున్న క్రమంలో భీమన్నగుడిలో దర్శనాలు ఏర్పాటు చేయడం బాగుంది. ఇక్కడే దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాం. భీమన్నగుడిలోనూ సౌకర్యాలు బాగా కల్పించారు. ఎన్నో ఏండ్లకు వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి జరుగుతోందంటే సంతోషంగా ఉంది. – కాటం సత్యం, లక్ష్మి, సెంటినరీకాలనీ రాజన్న గుడి విస్తరణ పనుల్లో భాగంగా భీమన్నగుడిలో దర్శనాలకు మంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. అందరూ అధికారులకు సహకరిస్తే భవిష్యత్లో రాజన్న ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా తయారవుతుంది. – మహిపాల్రెడ్డి, కొత్తగూడెం, జనగామ జిల్లా రాజన్న దర్శనానికి వస్తే భీమన్న గుడిలో దర్శనం చేసుకోవాలన్నారు. భీమన్నగుడికి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాగాయి. రాజన్న ఆలయ విస్తరణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – మహేశ్వర్, ముణ్యాల్, నిర్మల్ -
ఎస్పీ పైలట్ వాహనంలో ఆస్పత్రికి..
● ప్రమాదాన్ని గమనించి ఆగిన ఎస్పీ ● తన వాహనంలో ఆస్పత్రికి తరలింపు సిరిసిల్లక్రైం: సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదవశాత్తు గాయపడ్డ వ్యక్తిని ఎస్పీ మహేశ్ బీ గీతే తన పైలట్ వాహనంలో ఆస్పత్రికి పంపించారు. సోమవారం బైపాస్రోడ్డుపై వెళ్తున్న ఎస్పీకి ప్రమాదంలో గాయపడ్డ అశోక్నగర్కు చెందిన రఫీక్పాషా కనిపించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపి క్షతగాత్రులను తన వాహనంలో సిరిసిల్లలోని ఆస్పత్రికి తరలింపజేశారు. భవనం పైనుంచి తోయడంతో ఒకరు మృతిచిగురుమామిడి: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ శివారులోని బ్రీడింగ్ అండ్ హెచరీస్ ప్రైవేటు కంపెనీలో పేయింటింగ్ పనిచేస్తున్న దాసో సోరెన్ (32)ను తోటి పేయింటర్ భవనం పైనుంచి తోయడంతో కిందపడి చనిపోయాడు. చిగురుమామిడి ఇన్చార్జి ఎస్సై స్వాతి వివరాల ప్రకారం.. సోరేన్ను 15 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి కాంట్రాక్టర్ ఎస్కే.అర్షద్ పేయింటింగ్ వేసేందుకు తీసుకొచ్చాడు. ఇతనితో పాటు ముస్లింఖాన్ కూడా వచ్చాడు. ఆదివారం రాత్రి ఇరువురు డబ్బుల విషయంలో గొడవపడ్డారు. మాటమాట పెరిగి ముస్లింఖాన్ సోరెన్ను భవనం పైనుంచి కిందకు తోసేశాడు. తీవ్రంగా గాయపడిన సోరెన్ను 108లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయాడు. అర్షద్ ఫిర్యాదుతో తిమ్మాపూర్ సీఐ సదన్కుమార్ సోమవారం శవపంచనామా నిర్వహించి, కేసు నమోదు చేశారు. -
అర్హులకు ‘డబుల్’ ఇళ్లు కేటాయించండి
జగిత్యాల: అర్హులందరికీ డబుల్బెడ్రూం కేటా యించాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్కు సూచించారు. ఇంకా మిగిలిన 859 ఇళ్లను అర్హులకు ఇంతవరకు లబ్ధిపొందని వారికి.. గతంలో 2008లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై అసంపూర్తిగా వదిలేసిన వారికి కేటాయించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మిగిలిపోయిన అంతర్గత పనులు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి లేఖ రాశారు. ఇస్లాంపురకు చెందిన సయ్యద్ ఫజుల్కు రూ.21,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించారు. ఎమ్మెల్యేను మిషన్ భగీరథ ఈఈ జానకి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ధరూర్ క్యాంప్లోని కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. వసతులు, స్టోర్రూమ్, వంటగది శుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు సుధాకర్, పృథ్వీ, ప్రశాంత్రాజ్, రాజ్కుమార్, ప్రిన్సిపల్ కవిత పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ ఇళ్లు పూర్తికావాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గృహనిర్మాణం, మున్సిపల్ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. జిల్లాకు 10,982 ఇళ్లు మంజూరు కాగా.. 7,343కు మార్క్అవుట్ చేశామని, 2,984 బేస్మెంట్, 721 లెంటల్, 369 స్లాబ్ దశకు వచ్చాయని, మూడు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా 22వ స్థానంలో ఉందని, అధికారులు సమన్వయంగా పనిచేసి మొదటి ఐదు స్థానాల్లో ఉండేలా చూడాలన్నారు. ఇసుక బజార్ నుంచి లబ్ధిదారులు ఇసుక పొందవచ్చన్నారు. బిల్లుల్లో జాప్యం ఉన్నా, సమస్యలున్నా తన దృష్టికి తేవాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, డిప్యూటీ అదనపు కలెక్టర్ హారిణి, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు. కార్డియక్ అరెస్ట్తోనే మరణాలు కార్డియక్ అరెస్ట్తోనే యుక్త వయస్సులో చాలామంది చనిపోతున్నారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కార్డియో పల్మనరి రిసాసిటేషన్ వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో సీపీఆర్పై అవగాహన కల్పించారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిచోట్ల వారంపాటు అవగాహన కల్పిస్తామన్నారు. -
పట్టణం.. కళావిహీనం
జగిత్యాల: పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యత అంటూ మున్సిపల్ అధికారులు చెబుతుంటారు. వారరే పరిశుభ్రతపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లాకేంద్రమైన జగిత్యాల సుందరీకరణ పేరుతో గతంలో సుమారు రూ.10 లక్షల వరకు నిధులు మంజూరయ్యాయి. కొత్తబస్టాండ్ పాతబస్టాండ్ వద్ద జంక్షన్లు నిర్మించి అందులో పక్షుల బొమ్మలు, రాతి కట్టడాలు, ఫౌంటేన్లను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వాటి నిర్వహణ మర్చిపోవడంతో ప్రస్తుతం కళావిహీనంగా మారాయి. ఫౌంటేన్ ఒక్కసారి కూడా పనిచేయడంలేదు. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే అడపదడపా వచ్చి ఫౌంటేన్ ప్రారంభించి వదిలేస్తుంటారు. అందులో ఉన్న పచ్చిగడ్డి ఎండిపోయింది. బొమ్మలు దుమ్ము, దూళితో కళాహీనంగా మారాయి. ఏపుగా పెరుగుతున్న కానోకార్పస్ చెట్లు జిల్లా కేంద్రంలో ఎప్పటికప్పుడు పిచ్చిమొక్కలను తొలగించడంతోపాటు, డివైడర్ల మధ్యనున్న చెట్లను తొలగిస్తుండాలి. వాటిని పట్టించుకోకపోవడంతో కానోకార్పస్ మొక్కలు ఏపుగా పెరిగాయి. కొత్తబస్టాండ్ నుంచి నిజామాబాద్ వెళ్లే రహదారితోపాటు, కరీంనగర్ వెళ్లే రహదారిలో కుడి, ఎడమ రహదారుల వైపు వెళ్లేవారు మచ్చుకై నా కన్పించరు. పైగా అందులో అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో కొత్తబస్టాండ్ నుంచి పాతబస్టాండ్కు వెళ్లే దారిలో సుమారు రూ.12 లక్షల వ్యయంతో చెట్లు ఏర్పాటుచేశారు. వాటి నిర్వహణ సక్రమంగా లేక ఎండిపోయే దుస్థితి నెలకొంది. మధ్యలో పిచ్చిమొక్కలు పెరిగాయి. పచ్చదనం పెంచుతూ.. అందంగా తీర్చిదిద్దుతామన్న అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో ఎటుచూసినా కళావిహీనంగా కనిపిస్తున్నాయి. పట్టింపేది..? అసలే జిల్లా కేంద్రం. నిత్యం వివిధ పనులపై జిల్లాకేంద్రానికి వస్తుంటారు. ఈ మధ్యనే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటు చేశారు. జంక్షన్లుగానీ, డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన మొక్కలపై నిర్వహణ చర్యలు తీసుకోకపోవడంతో విపరీతంగా పెరిగాయి. వాటి మధ్య పిచ్చిమొక్కలూ పెరిగిపోయాయి. ఎన్విరాన్మెంట్ అధికారులెక్కడ? హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లను అందంగా తీర్చిదిద్దడంతోపాటు, వాటిని రక్షించేందుకు ఎన్విరాన్మెంట్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. కానీ వారు మచ్చుకు కన్పించడం లేదనే ఆరోపణలున్నాయి. వీరు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని మొక్కలు నాటించడంతోపాటు, పిచ్చిమొక్కలను తొలగిస్తూ.. ఎప్పుడూ మొక్కలకు నీరు పోస్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సుందరీకరణపై శ్రద్ధ పెట్టి ఏపుగా పెరిగిన మొక్కలను తొలగించడంతోపాటు, ఫౌంటేన్లను పునఃప్రారంభించాలని పట్టణప్రజలు కోరుతున్నారు. -
శ్మశాన వాటిక వివాదం పరిష్కరించండి
రాయికల్లోని ఎర్రకుంట వద్ద గల సర్వే నంబర్ 740లోని 15గుంటల భూమిని మా పూర్వీకుల నుంచి రెవెన్యూ రికార్డుల్లో గోసంగి కుల సంఘం పేరిట నమోదై ఉంది. అక్కడ శ్మశానవాటికగా ఉపయోగిస్తున్నాం. ఆ భూమికి ఓ వ్యక్తి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తనదంటూ రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాడు. మోఖాపై విచారించిన అధికారులు కూడా ఆ భూమి మాదేనని తేల్చారు. కానీ.. సదరు వ్యక్తి ఆ స్థలం తనదేనంటూ బెదిరిస్తున్నాడు. ఆ భూమిని భూభారతి ఆన్లైన్లో నమోదు చేయించి శాశ్వత పరిష్కారం చూపండి. – గోసంగి కులస్తులు, రాయికల్ -
వ్యక్తి పేరుతో ఊరు.. వంశమంతా ఒకటే తీరు
వెల్గటూర్: అది ఎండపల్లి మండలంలో రాజారాంపల్లి. ఆ గ్రామానికి ఆ పేరు రావడానికి ఒకటే కారణం.. గ్రామానికి చెందిన ఏలేటి రాజారాంపటేల్ ఆ ఊరుకు చేసిన సేవ. ఆయన పేరునే గ్రామానికి పెట్టుకున్నారు. పాఠశాల, పంచాయతీ కార్యాలయం, దేవాలయాలు, సమ్మక్క, సారలమ్మ జాతర స్థలం, శ్మశాన వాటిక, డంపింగ్యార్డు, వాటర్ ట్యాంకులు, అంగన్వాడీ కేంద్రం, మహిళాసంఘం భవనం ఇలా అన్నీ ఏలేటి వంశీయుల జ్ఞాపకాలే. ఓ పదివేలు దానం చేసి వంద మందితో సన్మానాలు చేయించుకునే ఈ రోజుల్లో గ్రామ అభివృద్ధికి కోట్ల విలువైన స్థలాలు గ్రామానికి అప్పగించారు ఏలేటి వంశీయులు. తాజాగా మండలకేంద్రానికి సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి స్థలం కేటాయించాలని గ్రామస్తులు ఏలేటి వంశస్థులను కోరగా.. సుమారు రూ.ఐదుకోట్ల విలువైన భూమి ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏలేటి రాజారాంపటేల్ విగ్రహానికి గ్రామస్తులు సోమవారం క్షీరాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధికి ముందుకొచ్చిన ఏలేటి వంశస్థులు సత్యనారాయణ రెడ్డి, మనోహర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, చంద్రారెడ్డి, వెంకట్రెడ్డి, శైలేందర్రెడ్డి, విజయ మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
నా వాటా భూమి ఇప్పించండి
నా పేరు కోటె లాస్య. మాది కోరుట్ల మండలం మోహన్రావుపేట. భూ తగాదాలతో మా మామ, మరిది, మరో ఆరుగురు కలిసి నా భర్త కోటె రాజేశ్ను ఏడాది క్రితం హత్యచేశారు. అడ్డుకునేందుకు వెళ్లిన నాపైనా దాడి చేశారు. నా చేయి విరిగిపోయింది. అప్పటినుంచి నా భర్తకు రావాల్సిన భూమి వాటాను మరిది రాకేశ్ ఆక్రమించి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. భర్త మరణంతో నేను నా ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లమయ్యాం. సమభాగం ఇవ్వాల్సిన ఇంట్లోకి రానీయడం లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నం. పిల్లల పోషణ, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నా భర్తకు రావాల్సిన వాటా భూమి ఇప్పించి న్యాయం చేయండి. -
రాజరాజేశ్వరుని సన్నిధిలో మంత్రి అడ్లూరి
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపెల్లి రాజరాజేశ్వర స్వామిని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి ప్రసాదం అందించారు. గురుకులాలకు రూ.60 కోట్లు గురుకులం పాఠశాలలు, కళాశాలల్లో వసతులకు సీఎం రూ.60 కోట్లు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.20 కోట్లు, ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ. 10 కోట్ల చొప్పున మంజూరయ్యాయన్నారు. విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలుజగిత్యాలక్రైం: ఈనెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ‘పోలీస్ ఫ్లాగ్ డే’ సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అశోక్కుమార్ తెలిపారు. పోటీ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటుందని, 6వ తరగతి నుంచి పీజీ విద్యార్థులు పాల్గొనవచ్చని, తమ వ్యాసాలను ఈనెల 28 లోపు సమర్పించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన ముగ్గురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. ‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర.. ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు..’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని, ఆసక్తి గలవారు https://forms.gle/jaWdt2yhNr Mpe3A లింక్పై క్లిక్ చేసి చేసి పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయాలని, వ్యాసాన్ని 500 పదాలకు మించకుండా పేపర్పై రాసి, దానిని ఫొటోతీసి ఇమేజ్/పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సీపీఆర్తో ప్రాణాలు కాపాడే అవకాశంజగిత్యాల: సీపీఆర్తో ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని ఐఎంఏ సెక్రటరీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ వారికి సోమవారం అవగాహన కల్పించారు. గుండెపోటు బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించేందుకు సీపీఆర్ ఉపయోగపడుతుందన్నారు. కోశాధికారి సుధీర్కుమార్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రోడ్డెక్కిన బీసీ సంఘాలుకొడిమ్యాల: రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని పేర్కొంటూ మండలంలోని పూడూర్లో కరీంనగర్ – జగిత్యాల రహదారిపై సోమవారం బీసీ నాయకులు బైటాయించారు. ప్రభుత్వం ఖరారు చేసిన 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, నోటికాడి ముద్ద లాక్కోవద్దని, బీసీలను చిన్నచూపు చూడొద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బింగి మనోజ్, రాచకొండ చందు పాల్గొన్నారు. -
కాంక్రీట్ పిల్లర్ల రాజన్న మండపం
మద్యం దుకాణాలకు 135 దరఖాస్తులుజగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం దుకా ణాలకు ఇప్పటి వరకు 135 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సత్యనా రాయణ తెలిపారు. దరఖాస్తులు తీసుకునేందు కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పునర్ నిర్మాణం, అభివృద్ధి విషయంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం ఎలా సాగుతోందనే అంశం తెరపైకొచ్చింది. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిల రాయితో నిర్మించినట్టుగానే ఇక్కడ జరిగేనా లేక పిల్లర్లతో నిర్మిస్తారా? అనే చర్చ సాగుతోంది. సుమారు 70 పిల్లర్లతో స్లాబు వేసి రాజన్న ఆలయ మండపం నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆలయ పునర్ని ర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.76కోట్లను మంజూరు చేసింది. యాదాద్రి ఆలయ నిర్మాణానికి రూ.300 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని బట్టి చూస్తే యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ నిర్మాణం పూర్తయ్యేనా అనే అపోహలు భక్తుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం, దేవాదాయశాఖ స్ప ష్టమైన వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. పీఠాధిపతి రాకతో అపోహలు తొలగేనా? ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేకర భారతిస్వామి వేములవాడ ఆలయాన్ని సందర్శించి సలహాలు, సూచనలు అందించనున్నారు. ఈనేపథ్యంలో పీఠాధిపతి రాకతోనైనా ఆలయ నిర్మాణం విషయంలో స్పష్టత వచ్చేనా అని భక్తులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. స్వామీజీ సూచనల మేరకే దేవాదాయశాఖ ఆలయ పునర్ నిర్మాణ విషయంలో మాస్టర్ప్లాన్ బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఇందులో పిల్లర్లతో నిర్మాణం చేపడుతున్నట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. ఇదే కొనసాగితే రాజన్న ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. అలాగే ప్రాచీనతకు అద్దం పట్టినట్లు ఉండే రాజన్న ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా నిర్మించారు. అంతకంటే పురాతన చరిత్ర గల రాజన్న ఆలయాన్ని అలాంటి శైలిలోనే నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయానికి ఆధునిక పిల్లర్లు కట్టి, వాటికి రాతి పలకలు అద్దితే నాణ్యత ఎంతకాలం ఉంటుందనే విషయంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాజేశ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. కాంక్రీట్ పిల్లర్లతో మండప నిర్మాణం వాస్తవమేనని, ఆ పిల్లర్లకు రాతి పలకలు తొడుగుతామన్నారు. దీని నాణ్యత చాలాకాలం ఉంటుందని స్పష్టం చేశారు.రాజన్న ఆలయ పునర్నిర్మాణం జరిగే సమయంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగేనా లేక నిలిపివేస్తారా? అని అనుమానాలు ఉన్నాయి. దేవాదాయశాఖ అధికారులు నిర్మాణ సమయంలో స్వామివారికి ఏకాంత సేవలు మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో భక్తులకు రాజన్న దర్శనం కలిగేనా అనే అపోహలు నెలకొన్నాయి. నిర్మాణ సమయంలో భక్తులకు భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు ఉంటాయని, ఉత్సవ విగ్రహాలను మూడు రోజుల క్రితమే తరలించారు. కోడెమొక్కులు కూడా భీమేశ్వరాలయంలోనే ఏర్పాటు చేశారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు భక్తులకు రాజన్న ఆలయం నిర్మాణ సమయంలో దర్శన అవకాశం కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆలయ ఈవో రమాదేవి ఆలయం మూసివేత ఉండదని, ఆలయంలో జరిగే ఏకాంత పూజలు యథావిధిగా కొనసాగుతాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యాదాద్రి కానీ, కాణిపాకం ఆలయంలో గానీ పునర్నిర్మాణ విషయంలో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా దర్శనాలు నిలిపివేయడం సరికాదంటున్నారు. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.. అని ఇలాంటి సమయంలో దర్శనం విషయంలో గందరగోళం కలిగించే ప్రకటనలు సరికాదని హితవు పలుకుతున్నారు. -
ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్
మెట్పల్లి: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందన్నారు. పెన్షన్లను రూ.4వేలకు పెంచకపోవడం, ఆడపిల్ల వివాహానికి తులం బంగారం అందజేయకపోవడం, పూర్తి స్థాయిలో రూ.2లక్షల రుణమాఫీన అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగకు మహిళలకు చీరెలు అందించి గౌరవిస్తే.. కాంగ్రెస్ ఆ ప్రక్రియను నిలిపివేసి కించపరిచిందన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్కు భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. -
ఆలకించండి.. పరిష్కరించండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లానలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. 55 అర్జీలు రాగా.. పరిశీలించిన ఆయన సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జగిత్యాల, మెట్పల్లి కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్ పాల్గొన్నారు.చెరువుల్లో పూడిక తీయించండి మాది జగిత్యాల రూరల్ మండలం నాగునూర్. గ్రామంలో నాగులకుంట, బొట్లకుంట చెరువుల్లో పూడిక పేరుకుపోయింది. చెరువు సామర్ధ్యం తగ్గి సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందిగా మా రింది. ఈ చెరువుల కింద వంద ఎకరాలు సాగవుతుంది. పూడిక పేరుకుపోయి బావులు, బోర్లు వట్టిపోతున్నాయి. చెరువుల్లో పూడిక తీస్తే కొంత మేలు జరుగుతుంది. – నాగునూర్ గ్రామ రైతులు -
లేబర్ కార్డుల దందా
జగిత్యాల: కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో లేబర్కార్డు ఉన్నవారికే పథకాలు వర్తిస్తాయి. కాగా, కొందరు బ్రోకర్లు కార్డు ఇప్పిస్తామంటూ కార్మికుల నుంచి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హత లేని కార్మికులకు సైతం కార్డులు అందజేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కార్యాలయంలో బ్రోకర్లే హవా జిల్లాలో భవన నిర్మాణ, ఇతర రంగాల్లో సుమారు 2 లక్షల మంది కార్మికులుంటారని అంచనా. వీరికి పథకాలు, ఇన్సూరెన్స్ తదితరాలు వర్తించాలంటే లేబర్కార్డు తప్పనిసరి. అయితే కొందరికి కార్డు ఎలా పొందాలో తెలియక బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. దీంతో బ్రోకర్లు వసూళ్ల దందాకు తెరలేపారు. ఒక కార్డుకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 2 లక్షల మంది కార్మికులున్నా ఇప్పటి వరకు దాదాపు 50 వేల కార్డులు మాత్రమే అందజేశారు. అవగాహన లేక చాలా మంది లేబర్ కార్డు పొందలేకపోతున్నారు. కార్మికుల కుటుంబంలో వివాహం, ప్రసవం వంటి క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేస్తే లేబర్కార్డు ఉంటేనే సుమారు రూ.30 వేల వరకు గ్రాంట్ వస్తోంది. ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.1.30 లక్షలు వస్తాయి. ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకున్న బ్రోకర్లు కార్మికుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. కాగా, లేబర్ కార్యాలయంలో కూడా ఆమ్యామ్యాలు లేనిదే పనిచేయడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయంలో ఎక్కువగా బ్రోకర్లే దందా నడిపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పట్టింపులేని అధికారులు? భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్యాలయం అ ధికారులు పథకాలపై అవగాహన కల్పించాలి. కా నీ, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణ లున్నాయి. కార్మికులు మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసి లేబర్ కార్యాలయంలో సంప్రదిస్తే అధి కారులే కార్డు మంజూరు చేస్తారు. కానీ, వారికి తెలియక బ్రోకర్లను ఆశ్రయించక తప్పడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కార్మికులకు బ్రోకర్ల బెడద లేకుండా కార్డులు అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కార్మికులు బ్రోకర్లను ఆశ్రయించవద్దు. కార్డుల కోసం, ఇతరత్ర పనుల కోసం నేరుగా కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులకు పథకాలు వర్తిస్తాయి. ఎవరినీ ఆశ్రయించకుండా నేరుగా కార్యాలయానికే రావాలి. – కాడం అనిల్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, జగిత్యాల -
వ్యాధుల కాలం.. ట్యాంకులు అపరిశుభ్రం
కథలాపూర్: గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన రక్షిత మంచి నీటి ట్యాంకులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. క్రమం తప్పకుండా వాటిని పరిశుభ్రం చేసి ఆయా తేదీలను పట్టిక రూపంలో ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. కొన్ని గ్రామాల్లో ట్యాంకులను నెలల తరబడిగా శుభ్రం చేయడం లేదు. పైపులైన్ లీకేజీలు, అపరిశుభ్ర పరిసరాలతో అధ్వానంగా తయారయ్యాయని ప్రజలు వాపోతున్నారు. అసలే వ్యాధుల కాలం.. ఆపై ట్యాంకులు అపరిశుభ్రంగా ఉంటే రోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 385 గ్రామాలు.. 892 నీటి ట్యాంకులు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 385 గ్రామపంచాయతీలు, 113 అనుబంధ గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని ప్రజలకు తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు 892 రక్షిత మంచినీటి ట్యాంకులు నిర్మించారు. ఇదంతా బాగానే ఉన్నా ట్యాంకుల నిర్వహణను పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రజలకు శుద్ధ నీరు అందని ద్రాక్షలా మారింది. ట్యాంకులను నెలకు మూడుసార్లు శుభ్రం చేయించాల్సి ఉండగా.. ఎప్పుడో ఒకసారి శుభ్రం చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ప్రజలు తాగేందుకు మినరల్ వాటర్ను కొనుగోలు చేస్తున్నారు. ట్యాంకులను శుభ్రం చేయించే బాధ్యత పంచాయతీ కార్యదర్శులదని, గ్రామాల్లో తాము సరఫరాను మాత్రమే పర్యవేక్షిస్తామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. నీరు శుభ్రంగా రాకపోవడంతో ప్రజలు నెలకు రూ.100 నుంచి రూ.200వరకు చెల్లించి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని అదునుగా తీసుకుంటున్న కొందరు గ్రామాల్లో విచ్చలవిడిగా మినరల్ వాటర్ ప్లాంట్లు నెలకొల్పి వ్యాపారం జోరుగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పంచాయతీ, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉన్నతాధికారులు చొరవ చూపి ట్యాంకులను వారానికి రెండుసార్లు శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
సరిపడా లేక.. ఆపదలో రాక
జగిత్యాల/సాక్షి,పెద్దపల్లి: అత్యవసర సమయంలో 108కి ఫోన్ చేస్తే ఆగమేఘాల్లో వచ్చి రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఇది అంబులెన్స్ పని.. కానీ, కొన్ని సమయాల్లో అంబులెన్స్ కావాలని ఫోన్ చేస్తే గంట ఆగాలని అటునుంచి సమాధానం వస్తోంది. దీంతో చేసేది లేక బాధితులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం సరిపడా అంబులెన్స్ వాహనాలు లేకపోవడంతో పాటు జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యం అందించక కరీంనగర్కు రెఫర్ చేయడం. ఆపత్కాల సమయంలో అంబులెన్స్ సర్వీస్ కోసం ఫోన్ చేస్తే వెయిట్ చేయాలనే సమాధానం వస్తుందని బాధితులు వాపోతున్నారు. జాతీయ, రాజీవ్ రహదారిలో వాహనాల రద్దీ పెరగడంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. దీంతో అత్యవసర సేవలకు గిరాకీ బాగానే పెరిగింది. కాగా, ఏరియా హాస్పిటల్కు వచ్చే గర్భిణులు, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన బాధితులను ఇతర ఆసుపత్రులకు (రెఫర్) పంపిస్తూ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, రెఫర్ రాయగానే సమస్య పెద్దదని రోగులు ఆందోళన చెందుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇక గర్భిణులను వాహనాల్లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారికి పురుడుపోయాల్సి వస్తోంది. రెఫర్.. వాహనాల కొరత ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆస్పత్రుల్లో సరిపడా అంబులెన్స్లు అందుబాటులో లేక రోగులు ఇబ్బందిపడుతున్నారు. ఆయా పట్టణాల్లోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో రాత్రి వేళ కేసులు వస్తే ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తున్నారు. కరీంనగర్కు ఎక్కువగా రెఫర్ చేస్తుండడంతో అంబులెన్స్ల కొరతతో ప్రమాదాల బారినపడిన క్షతగాత్రుల బాధ వర్ణనాతీతం. ఆపద సమయంలో ఆయా పట్టణ ప్రాంతాలు, గ్రామాల నుంచి అంబులెన్స్కు ఫోన్ చేస్తే శ్రీకరీంనగర్లో ఉన్నాంశ్రీ అనే సమాధానం వస్తుండడంతో ఆ వాహనం వచ్చే వరకు బాధితులు వేచిచూడటం, లేదా ప్రైవేట్ వాహనాలకు ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో అత్యవసర వైద్యం కోసం ఆశ్రయించిన రోగులకు 108 అంబులెన్స్ సేవలు అందడం లేదు. ఈక్రమంలో వైద్యుల నిర్వాకంపై దృష్టిసారించడంతో పాటు, ప్రతి మండలానికి ఒక్క అంబులెన్స్ సర్వీసు ఉండేలా ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రోగుల బంధువులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిన అంబులెన్స్లు, ప్రస్తుతం ఉన్నవి జిల్లా ఉండాల్సినవి ఉన్నవి కరీంనగర్ 18 16 జగిత్యాల 18 15 సిరిసిల్ల 13 12 పెద్దపల్లి 14 08 ‘ఇటీవల సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని ట్యాంక్బండ్ మీద అంబులెన్స్లను ప్రారంభించి పెద్దపల్లి జిల్లాకు నాలుగు కొత్త వాహనాలను కేటాయించారు. జూలపల్లి, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాలకు కేటాయించగా, వాటిని జిల్లాకు తీసుకొచ్చి వారం రోజులు వినియోగించారు. కారణాలు ఏంటో కానీ, పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన నాలుగు అంబులెన్స్లను గజ్వేల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి రెండు అంబులెన్సులు అవసరం ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఒక్క అంబులెన్స్ను రాత్రివేళ రెఫర్ కేసులకు పంపిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయానికి వాహనాలు చేరుకోక బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. ‘ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని గౌరెడ్డిపేట గ్రామంలో ఓ విద్యార్థి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, అంబులెన్స్లో పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం కోసం అదే అంబులెన్స్లో కరీంనగర్కు తీసుకెళ్లారు. అయితే అదే రాత్రి లాలపల్లి గ్రామంలో ఓ మహిళ పురిటినొప్పులతో ఇబ్బందులు పడుతుంటే అంబులెన్స్ రావడానికి గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉంది’. -
బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ
జగిత్యాలరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ కపట ప్రేమ ప్రదర్శిస్తోందని జెడీప మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ బీసీలను పావుగా వాడుకుంటోందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో బీసీలకు చేసింది శూన్యమన్నారు. గవర్నర్ వద్ద.. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉన్నా.. జీవో9తో ఎన్నికలకు ఎలా వెళ్తారో సోయి కూడా ప్రభుత్వానికి లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం బీసీకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ర్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆనందరావు, మాజీ సర్పంచ్ ప్రవీణ్గౌడ్, నాయకులు శేఖర్, మహేశ్ గౌడ్, రాకేశ్, వెంకటేశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
ఎన్నికల వరకే రాజకీయం
రాయికల్: రాజకీయాలు ఎన్నికల వరకేనని, తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకే సీఎంతో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్లోని 35 మంది లబ్ధిదారులకు రూ. 8.50లక్షల చెక్కులు అందించారు. మున్సిపల్ పార్కు పనులపై సమీక్షించారు. రాయికల్ అభివృద్దికి నిరంతరం పనిచేస్తున్నానన్నారు. సింగిల్విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, బల్దియా కమిషనర్ మనోహర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మాండ్లు, నాయకులు పడిగెల రవీందర్ రెడ్డి, గన్నె రాజరెడ్డి, రవీందర్రావు, కోల శ్రీనివాస్, అచ్యుత్రావు, సుదర్శన్ పాల్గొన్నారు. సీపీఎస్ రద్దుకు కృషి జగిత్యాలటౌన్: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలయ్యేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పీఆర్టీయూ నాయకులకు హామీ ఇచ్చారు. జిల్లాకేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు క్యాష్లెస్ హెల్త్ స్కీం వర్తించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ మాట్లాడుతూ టెట్పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నెలవారీగా రూ.700కోట్లు విడుదలకు ఒత్తిడి తెస్తామన్నారు. వంగ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని కోరారు. ఇటీవల పదోన్నతి పొందిన 153మంది ఉపాధ్యాయులను సన్మానించారు. -
ఎవరూ పట్టించుకుంట లేరు
ఇప్పపెల్లిలో నల్లా నీరు సరఫరా అయ్యే పైపులైన్ సరిగా లేదు. మరమ్మతు చేయించాలని చెప్పినా ఏళ్లుగా ఎవ రూ పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామంలోని పలు వా డలకు నల్లానీరు రావడంలేదు. వాడల్లోని బోరుబావులతో ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నాం. తాగేందుకు మినరల్వాటర్ కొనుక్కుంటున్నం. – సంబ నవీన్, ఇప్పపెల్లి గ్రామాల్లో ట్యాంకులు ఉన్నా.. పైప్లైన్ లీకేజీ అవుతున్నాయి. మరమ్మతు చేయించకపోవడంతో నల్లా నీరు కలుషితం అవుతోంది. వాటర్ ప్లాంట్ నుంచి రూ.5చెల్లించి 20 లీటర్ల నీరు కొనుక్కుని తాగుతున్నాం. తాగునీటి సరఫరా విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయొద్దు. – తుమ్మనపెల్లి మహేశ్, భూషణరావుపేట గ్రామాల్లో రక్షిత మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలిస్తాం. నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాల్సిన బాధ్యత ఆయా గ్రామాల కార్యదర్శులదే. ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ఎప్పటికప్పుడు గ్రామాల్లో తాగునీటి సరఫరాను పర్యవేక్షించేలా చూస్తాం. – ఆనంద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ -
‘ ఆ కార్యక్రమంలో నా గురించి మాట్లాడటం బాధాకరం’
ధర్మపురి(జగిత్యాల జిల్లా): నిజామాబాద్లో మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి తన సహచర మంత్రి వివేక్ మాట్లాడటం బాధాకరమన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సాక్షి టీవీతో మాట్లాడారు అడ్లూరి. ‘లక్ష్మణ్ కుమార్ తండ్రి జయంతి కార్యక్రమాల్లో పేరు పెట్టకపోతే ప్రశ్నిస్తున్నాడు... ఇతర ఇన్విటేషన్స్ లో పేరు లేకపోతే ఎందుకు ప్రశ్నించడని వివేక్ మాట్లాడటం బాధాకరం. నేను ఆ విషయమే అసలెక్కడా మాట్లాడలేదు. వెంకటస్వామి జన్మదిన వేడుకలను నా ధర్మపురి నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జరిపాకే నేను హైదరాబాద్ వెళ్లాను.నాకు ఆ అభిమానం ఉంది. నా మైనార్టీ శాఖ కార్యక్రమానికి వారే వచ్చి వస్తడా, రాడా వెళ్లిపొమ్మంటరా అంటూ మాట్లాడటం ఎంతవరకు సబబు..?, తోటి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ నన్ను ఓ జంతువుతో పోలుస్తూ మాట్లాడితే కనీసం సహచర దళిత మంత్రిగా ఖండించకపోవడాన్నే నేను ప్రశ్నించా. తెల్లారే వ్యక్తిగతంగా ఫోన్ కాల్ అయినా చేస్తాడని భావించా. ఇవాళ మళ్లీ నిజామాబాద్కు వెళ్లి వ్యక్తిగతంగా నా పేరు తీసి మాట్లాడటం ఇక వివేక్ విజ్ఞతకే వదిలేస్తున్నా. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాలో ఉండి ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాలి తప్ప ఈ విధంగా కామెంట్స్ చేయడం బాధాకరం. నేను కాంగ్రెస్ వ్యక్తిని, వ్యక్తిగత విభేదాలు ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నా. కాంగ్రెస్లో పెద్దలు ఆశీస్సులతో ఇంత వరకూ వచ్చా’ అని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు సర్వంసిద్ధం
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్లో పండించిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే సన్న ధాన్యాన్ని కూడా కొనేందుకు ప్రత్యేక కేంద్రాలు ప్రారంభించనున్నారు. 421 కేంద్రాలు ధాన్యం కొనుగోళ్లకు జిల్లాలో 421 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో 283 కేంద్రాలు, మహిళా సంఘాల(ఐకేపీ) ఆధ్వర్యంలో 137, మెప్మా ఆధ్వర్యంలో ఒక కేంద్రం ప్రారంభించనున్నారు. యాసంగిలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగకుండా వానాకాలం సీజన్లో చర్యలు తీసుకోనున్నారు. ఏ గ్రేడ్ధాన్యం క్వింటాల్కు రూ.2,389, కామన్ రకానికి రూ.2369 చొప్పున కొననున్నారు. 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు ఈ వానాకాలం జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 1.26 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగవుతోంది. బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. 1.89 లక్షల ఎకరాల్లో సాగైన దొడ్డురకానికి ఈసారి తెగుళ్లు, పురుగుల బెడద లేకపోవడంతో ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల దిగుబడి రానుంది. ఈ లెక్కన దొడ్డురకం 47.025 లక్షల క్వింటాళ్లు, సన్నాలు 31.50 లక్షల క్వింటాళ్లు దిగుబడి రానుంది. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత సివిల్ సప్లై, డీఆర్డీఏ, సింగిల్ విండో, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్షించారు. గన్నీసంచులకు కొరత లేకుండా సివిల్సప్లై, ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా ట్రాన్స్పోర్ట్ యజమానులను ఆదేశించారు. బస్తాకు రెండు కిలోల వరకు కోత విధించడంపై ఇప్పటికే రైతులు ఆగ్రహంతో ఉన్నందున.. ఈసారి అలా జరగకుండా చూడాలని రైస్మిల్లర్లను ఆదేశించారు. -
అభిప్రాయ సేకరణ.. దరఖాస్తుల స్వీకరణ!
పోటీ పడుతున్నది వీరే.. సాక్షిప్రతినిధి,కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన నేపథ్యంలో అధికార పార్టీ జిల్లాలపై దృష్టి సారించింది. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు కొత్త అధ్యక్షులను నియమించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతీ జిల్లాకు పీసీసీ పరిశీలకులను నియమించింది. వీరంతా ఈనెల 13న ఉమ్మడి జిల్లాకు రానున్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజా మద్దతు ఉన్న నాయకుడిని గుర్తించి డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్న సంకల్పంతో వీరంతా పని చేయనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మమేకమై ఎవరి బలాబలాలు ఎంతెంత? అన్న విషయంపై అవగాహనకు రానున్నారు. ఏఐసీసీ పరిశీలకులు.. శ్రీనివాస్ మానే నేతృత్వంలో పీసీసీ పరిశీలకుల బృందం ఉమ్మడి జిల్లాకు రానుంది. వీరిలో ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్, ఆత్రం సుగుణ కరీంనగర్, చిట్ల సత్యనారాయణ సిరిసిల్ల, తూర్పు జయప్రకాశ్ రెడ్డి జగిత్యాల, ఎండీ.ఖాజా ఫక్రుద్దీన్ రామగుండం కార్పొరేషన్, కేతూరి వెంకటేశ్, గిరిజాషెట్కర్ పెద్దపల్లి రానున్నారు. చామల కిరణ్కుమార్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన రాక సందిగ్ధంలో పడింది. ముగ్గురి కోసం మధనం కాంగ్రెస్ వర్గాలు తెలిపిన ప్రకారం.. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మొత్తం ఆరురోజులపాటు డీసీసీ పరిశీలకులు జిల్లాల్లో పర్యటిస్తారు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి పార్టీ ఆలోచనలు వివరిస్తారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వీలును బట్టి పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో వారి ఆలోచనలు, ప్రణాళికలు ఇంటర్వ్యూ తరహాలో అడిగి తెలుసుకుంటారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ముఖ్యనాయకులతో సమావేశ మై వారి అభిప్రాయాలు సేకరిస్తారు. అలాగే క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ బలాబలాలు, ఏ నేతకు ఎంత ఆదరణ ఉందో తెలుసుకుంటారు. అనంతరం ఆశావహుల్లో నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఆ జాబితాను తొలుత కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు పంపిస్తారు. ఈ జాబితాను స్క్రూటినీ చేసి తిరిగి రాష్ట్రానికి పంపుతారు. అక్కడ దీపావళి నాటికి టీపీసీసీ చీఫ్, సీఎం, మంత్రి భట్టి విక్రమార్క, సంబంధిత ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రులు కలిసి ప్రతీ జిల్లాలో ముగ్గురిలో ఒకరిని డీసీసీ ప్రెసిడెంట్గా ఖరారు చేస్తారు.కరీంనగర్ డీసీసీకి పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి పోటీ పడుతున్నారు. సిరిసిల్ల డీసీసీ రేసులో.. గడ్డం నర్సయ్య, కె.చక్రధర్రెడ్డి, నేవూరి వెంకటరెడ్డి, సంగీతా శ్రీనివాస్ ఉన్నారు. జగిత్యాల డీసీసీకి జువ్వాడి కృష్ణారావు, సుజిత్రావు, కొమొరెడ్డి కరంచంద్ రేసులో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా నుంచి సారయ్యగౌడ్, శశిభూషణ్ కాచే, బోషానబోయిన రమేశ్గౌడ్, తొట్ల తిరుపతియాదవ్, కోలేటి మారుతి, చొప్పరి సదానందం డీసీసీ ప్రెసిడెంట్ పదవిని ఆశిస్తున్నారు. -
పేదలకు నాణ్యమైన వైద్యం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శనివారం పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. టీఆర్నగర్లో రూ.40 కోట్లతో ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. చల్గల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, త్వరలోనే రూ.20 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభం కానుందన్నారు. రూ.203కోట్లతో జగిత్యాలకు నూతన ఆస్పత్రి మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడువాల లక్ష్మణ్ పాల్గొన్నారు. కోతులను నివారించండిజగిత్యాలటౌన్: రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, స్టెరిలైజేషన్ ద్వారా వాటి పునరుత్పత్త అరికట్టాలని మాజీమంత్రి జీవన్రెడ్డి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరారు. కోతులను నివారించకుంటే వ్యవసాయం ప్రమాదంలో పడుతుందన్నారు. జిల్లాకో స్టెరిలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రధాని, సీఎంలకు లేఖ రాశారు. కోతుల సమస్య తీవ్రతను గుర్తించిన హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం నియంత్రణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి.. వాటి పునరుత్పత్తిని గణనీయంగా తగ్గించగలిగిందని, రాష్ట్రంలో కూడా అలాంటి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్కు 50శాతం సబ్సిడీతో యూనిట్లు మంజూరు చేయాలన్నారు. కోతుల బెడద కారణంగా రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనె గింజల సాగు కనుమరుగైందన్నారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం మేడిపల్లి: మండలంలోని కాచారంలో ఇందిరమ్మ ఇంటిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన బర్ల సాయమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా.. నిర్మాణం పూర్తికావడంతో విప్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారుకు కొత్త వస్త్రాలు అందించి గృహప్రవేశం చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిందని, ఇళ్ల నిర్మాణం వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. మండల పరిధిలో మొదట ఇల్లు పూర్తయిన లబ్ధిదారుకు రూ.50వేలు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించిన మాజీ సర్పంచ్ రాజాగౌడ్ మాట నిలుపుకొన్నారు. సాయమ్మకు విప్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్ రెడ్డి, చేపూరి నాగరాజు, శ్రీపతి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు మెట్పల్లి: విద్యార్థులు చదువుల్లో రాణిస్తే ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని మెట్పల్లి జూనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ఆరపేట బాలికల గురుకులంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సులో జడ్జి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని సాధించడానికి కృషి చేయాలన్నారు. అవరోధాలు ఎన్ని ఎదురైనప్పటికీ కుంగిపోకుండా పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. అనంతరం బాలికలకు పోక్సోతోపాటు పలు చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ధర్మపురి క్షేత్రానికి గోదావరి మణిహారం
ధర్మపురి: నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి పుణ్యక్షేత్రానికి గోదావరి నది ఒక మణికంఠహారంగా ప్రసిద్ధి చెందిందని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావు అన్నారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ సౌజన్యంతో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీమఠం స్థలంలో శనివారం సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చారు. నృసింహుడి పుణ్యక్షేత్రానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని. వేద పండితులకు పుట్టినిల్లయిన ఇక్కడి గోదావరి దక్షిణముఖంగా ప్రవహించడం గొప్ప విషయమని అన్నారు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దరుత దూర! అనే మకుఠంతో రాసిన ధర్మపురి నివాసి అయిన శేషప్ప కవి రాసిన పద్యాన్ని చాగంటి వివరించారు. భగవంతుని నామస్మరణ మానవ మనుగడకు ఎంతో మోక్షమని సూచించారు. ధర్మపురిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహుడి నామస్మరణలు, నరసింహుడు నరుడిగా, సింహంగా మారిన ఆయన మహిమాని త్వం, రాక్షసుడైన హిరణ్యకశిపుడు, భక్తి ప్రపత్తుడైన ప్రహ్లాదుడిపై భక్తులకు వివరించారు. 54 లక్షల జీవరాశుల్లో వాయుపుత్రుడైన హన్మంతునికి భగవంతుడు ప్రత్యేక స్థానం కల్పించినట్లు వివరించారు. చాగంటికి ఘన స్వాగతం ధర్మపురి పుణ్యక్షేత్రానికి చేరుకున్న చాగంటికి ఆలయం ఆధ్వర్యంలో ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, పాలకమండలి స్థానిక నందీ కూడలి వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చాగంటి స్వామివారిని దర్శించుకున్నారు. చాగంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ సన్మానించారు. ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్లు బందోబస్తును ఏర్పాటు చేశారు. -
10 టీమ్లు ఏర్పాటు చేయాలి
ప్రతి పాఠశాల నుంచి కనీసం 50 మంది విద్యార్థులతో 10 టీమ్లను ఈనెల 13 లోపు రిజిస్ట్రేషన్ చేసుకుని అదేరోజు జరగనున్న లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో పాల్గొనాలి. విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలకు ఇది మంచి అవకాశం. – రాము, డీఈవో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మంచి కార్యక్రమం. ప్రతి ఒక్క విద్యార్థి ఇందులో చేరాలి. వారి నైపుణ్యత బయటపడుతుంది. వెంటనే వారిని ఇందులో చేర్చేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాత్ర వహించాలి. – మచ్చ రాజశేఖర్, జిల్లా సైన్స్ అధికారి -
ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
జగిత్యాల: ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగినివ్వొద్దని, కేంద్రాల్లో వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండు సీజన్లలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగాయని, ఈసారి కూడా పక్కా ప్రణాళికతో కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలం సంబంధించి జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని, 7.50–8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేయడం జరిగిందన్నారు. మద్దతు ధర క్వింటాల్కు గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369, బోనస్ క్వింటాల్కు రూ.500 చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రంలో రిజిస్టర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, టార్పాలిన్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. ఏ రోజు వచ్చిన ధాన్యాన్ని ఆ రోజే కొనుగోలు చేయాలని సూచించారు. అవసరం మేరకు గన్నీ బ్యాగులు ఉంచాలని, హమాలీల కొరత ఉండకూడదని ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీఆర్డీవో రఘువరణ్, డీఎస్వో జితేందర్రెడ్డి, జితేంద్రప్రసాద్, ప్రకాశ్, అధికారులు పాల్గొన్నారు. -
ఆ పక్క.. ఈ పక్క.. మక్క
ఈ వర్షకాలంలో రైతులు వేసిన మొక్కజొన్న పంట చేతికి రాగా, రోడ్లపైనే కంకులను ఆరబెడుతున్నారు. రోడ్డులో సగ భాగం వరకు కంకులను పోసి, పక్కన బండరాళ్లను పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం– మూలరాంపూర్ రోడ్డుపై మొక్కజొన్న కంకులు పోయడంతో ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన ఆటో, మరో జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాయి. ఇబ్రహీంపట్నంలో ఇలా రోడ్డుపై కంకులను ఆరబెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు వాపోతున్నారు.– ఇబ్రహీంపట్నం(కోరుట్ల) -
ముగిసిన జిల్లాస్థాయి క్రీడా పోటీలు
జగిత్యాలటౌన్: నాలుగురోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి పాఠశాల క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. నాల్గో రోజు పోటీలను జిల్లా విద్యాధికారి రాము ప్రారంభించారు. చివరి రోజు అండర్– 17 బాలుర విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. కబడ్డీ మొదటి స్థానంలో మెట్పల్లి, రెండో స్థానంలో రాయికల్, వాలీబాల్ మొదటి స్థానంలో మెట్పల్లి, ద్వితీయ స్థానంలో వెల్గటూర్, ఖోఖో మొదటి స్థానంలో కోరుట్ల, ద్వితీయ స్థానంలో మేడిపల్లి నిలిచాయని డీఈవో తెలిపారు. క్రీడాకారులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని జిల్లా యువజన, క్రీడల అధికారి రవికుమార్ పేర్కొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లా క్రీడల కార్యదర్శి చక్రధర్రావు క్రీడా నివేదిక సమర్పించారు. పెటా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, కార్యదర్శి అశోక్, పీడీలు పడాల కృష్ణప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మీరాంనాయక్, అజయ్బాబు, కోటేశ్వర్రావు, కొమురయ్య, వెంకటలక్ష్మి, మాధవీలత, జమునారాణి, మల్లేశ్వరి, రవి, లక్ష్మణ్ పాల్గొన్నారు. డిజిటల్పై నైపుణ్యం పెంపొందించుకోవాలిజగిత్యాల: ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న డిజిటల్ లిటరసిలో భాగంగా ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని డీఈవో రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్లో గణిత ఉపాధ్యాయులకు డిజిటల్ లిటరసిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు డిజిటల్పై నైపుణ్యం పెంపొందించుకోవాలని, విద్యార్థులకు టెక్నాలజీని ఉపయోగించి బోధన చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాస్లు, డిజిటల్ లైబ్రరీలు ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులకు కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ, డేటా సైన్స్లపై నేర్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వ డం జరుగుతుందన్నారు. సెక్టోరియల్ అధికా రి రాజేశ్, జయసింహారావు పాల్గొన్నారు. -
మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దు
జగిత్యాలజోన్: మానసిక వికలాంగులను చిన్నచూపు చూడొద్దని, వారికి చేయూత నందించాలని జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.లావణ్య అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జగిత్యాల ఓల్డ్ హై స్కూల్, భవిత వికలాంగుల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, మానసిక వికలాంగుల్లో అద్భుత శక్తి ఉంటుందని, ఆ శక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించాలని కోరారు. మొదటి అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీనిజ మాట్లాడుతూ, బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.సతీశ్, విజయకృష్ణ, అనురాధ పాల్గొన్నారు. వరదకాల్వ గండి పరిశీలనజగిత్యాలఅగ్రికల్చర్: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గండ్లపేట వద్ద ఎస్సారెస్పీ వరదకాల్వకు 16.425 కి.మీ పరిధిలో గండి పడడంతో కొద్దిరోజులుగా నీటి విడుదలను నిలిపివేశారు. ఈ మేరకు శుక్రవారం ఎస్సారెస్పీ అధికారులు సత్యనారాయణరెడ్డి, సుధాకర్రెడ్డి గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణసారంగాపూర్(జగిత్యాల): పంటపొలాల వద్ద విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో పనులు నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో ఏడీఈ సిందూర్శర్మ, బీర్పూర్ ఏఈ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం బీర్పూర్ మండల కేంద్రంతో పాటు కొల్వాయి గ్రామంలో నిర్వహించిన పొలంబాట కార్యక్రమంలో మాట్లాడారు. ఎక్కడైనా లూజ్ వైర్లు, కిందికి వేళాడుతున్న వైర్లు, వంగిన, విరిగిన స్తంభాలు, ఇతర సమస్యలు ఉంటే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతులు కెపాసిటర్లను వినియోగిస్తే విద్యుత్ ఆదాతోపాటు, మోటార్లు ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం శేఖర్, మహేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వేతనాలు చెల్లించాలికోరుట్లటౌన్: జీతాలు చెల్లించాలని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు శుక్రవారం ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్య పరిషత్కు సంబంధించిన ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయని, బ్యాంకు అధికారులు వేధిస్తున్నారని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రతి నెలా వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతరాణి, జూనియర్ అసిస్టెంట్లు రాజశేఖర్, రాజయ్య, వైద్యసిబ్బంది సరళ, ప్రమీళ, కవిత, శ్రీధర్, చారి, సురేందర్, చిరంజీవి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
లిక్కర్ టెండర్ ప్లీజ్!
40.40214.182,61640.66షాపులుపార్ట్నర్షిప్..4,04080.802,02010,70952.322,033ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు‘గతంలో మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా మద్యం షాపులు కేటాయించేవారు. ఏ వార్డులో వైన్స్ దక్కితే అదేవార్డులో వైన్స్ తెరవాల్సి ఉండేది. ఈసారి మున్సిపాలిటీ పరిధిలోని మద్యం షాపు లాటరీలో దక్కితే ఏ వార్డులోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. హద్దులు ఏమీ లేవు. కొత్త షాపుల ఏర్పాటు తరువాతే స్థానిక ఎన్నికలు జరుగుతాయి’.. అంటూ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎకై ్సజ్శాఖ అధికారులు మద్యం వ్యాపారులకు ఫోన్లు చేసి మరీ టెండర్లు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని మించింది మరోటి లేదంటూ టెండర్ వేయండి ప్లీజ్ అంటూ వాట్సప్లో సందేశాలు పంపిస్తున్నారు. -
మెడికల్ షాపులపై నిఘా
జగిత్యాల: జిల్లాలోని మెడికల్ షాపులపై డ్రగ్ అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గు సిరప్ వాడటంతో చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్ మందులచీటి లేకుండా ఎలాంటి మందులు ఇవ్వొద్దని, అలాగే రెండేళ్లలోపు చిన్నారులకు ఎలాంటి సిరప్లు ఇవ్వొద్దని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. దీంతో మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్న మందులపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేస్తున్నారు. మందులచీటి లేకుండానే.. మెడికల్షాపుల నిర్వాహకులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. వైద్యుల మందులచీటి లేకుండానే మందులు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు చేసిన మందులకు రశీదులు ఇవ్వాల్సిండగా కొన్నిషాపుల్లో పాటించడం లేదు. జిల్లాలో 800కు పైగా మెడికల్ షాపులు, 100కు పైగా ఏజెన్సీలు ఉంటాయి. జనరిక్ మందులను కూడా బ్రాండెడ్ మందుల రేట్లకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వీటిని అంటగడుతున్నారు. డ్రగ్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలు హుష్కాక్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెడికల్ షాపులను లైసెన్స్ దారుడైన ఫార్మాసిస్ట్ నిర్వహించాలి. కానీ, చాలా దుకాణాల్లో ఫార్మాసిస్ట్లే కన్పించరు. అమ్మకాలకు సంబంధించి రశీదులు, ప్రిస్కిప్షన్ నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ ఒక్క మెడికల్షాపుల్లోనూ ఇవి అమలు చేయరు. ఫిజిషియన్లు ఇచ్చే షాంపిల్ మందులు, ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులను విక్రయించరాదు. కానీ జగిత్యాలలోని కొన్ని మెడికల్ షాపుల్లో వీటిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆర్ఎంపీలు, పీఎంపీలు సూచించిన మందులే విక్రయించాలి. మెడికల్ షాపునకు వచ్చిన ఏ కొనుగోలుదారుకై నా మందులను ఇవ్వరాదు. కాగా పలు షాపుల్లో ఇవేమీ పట్టించుకోవం లేదు. గల్లీకో మెడికల్షాపు జిల్లా కేంద్రంలో గల్లీకో మెడికల్షాపు ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం మెడికల్ షాపులను అనువైన స్థలం ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలు పాటించడం లేదు. కొన్ని చోట్ల రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల మెడికల్ మందులతో పాటు, ఇతరత్ర వస్తువులను అమ్ముతున్నారు. రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తే వేసవికాలంలో మందులు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ నిబంధనలను పాటించడం లేదు. రేకులషెడ్లలో ఆస్పత్రులు ఏర్పాటు చేసినప్పుడు ఎక్కడ స్థలం ఉంటే అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మెడికల్ షాపు నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేనిది మందులు ఇవ్వరాదు. మెడికల్ షాపులు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. కేసులు కూడా నమోదు చేస్తాం. షాంపిల్స్ విక్రయించరాదు. తప్పకుండా రికార్డులు నమోదు చేయాలి. – ఉపేందర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ -
నైరాశ్యం
శుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఉత్సాహం..స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రధాన పార్టీల కేడర్, ఆశావహుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. పంచాయతీ పాలకవర్గాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయ్యి ఏడాదిన్నర కాలం గడిచింది. సుదీర్ఘ కాలంగా ఎన్నికలకు కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ జీవో విడుదల చేయడంతో బీసీవర్గాలకు దక్కే స్థానాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడంతో పెద్ద సంఖ్యలో ఆశావహులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. తాజాగా ఎన్నికల నిర్వహణ నిలిచిపోనుండటం ఆశావహులు, ప్రధాన పార్టీల కేడర్లో నైరాశ్యాన్ని నింపింది. కోర్టు తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల తర్వాతే ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా బీసీలకు రిజర్వేషన్లపై కోర్టులో తేలేవరకు వేచి చూస్తారా, లేక పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ గ్రామ్లాలో కొనసాగుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం ఉదయం నామినేషన్ల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయడంతో ఉమ్మడి జిల్లాలోని పలు పల్లెల్లో సందడి నెలకొంది. అక్కడక్కడ కొందరు ఆశావహులు మద్దతుదారులతో వెళ్లి నామినేషన్లు వేశారు. కాగా.. బీసీ రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలవాలనుకున్న వారి ఆశలపై సాయంత్రానికి నీళ్లు చల్లినట్లయ్యింది. కొద్దిరోజులుగా అధికార యంత్రాంగం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బందికి శిక్షణ, రిజర్వేషన్ల ప్రకటన, ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా ఎన్నికలు ఉంటాయని భావించిన వారికి కోర్టు స్టేతో ఊరించి ఉసురుమనిపించిన ట్లయ్యింది. ఆరు వారాల తరువాత కోర్టు విచారణ చేపట్టనుండటంతో, అప్పుడే ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో గ్రామాల్లో నిన్నటి వరకు సందడి నెలకొనగా.. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 311 ఎంపీటీసీలు, 30 జెడ్పీటీసీ స్థానాలకు తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్ను ఆయా జిల్లాల కలెక్టర్లు విడుదల చేశారు. రిజర్వేషన్ల కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపలేదు. ఈక్రమంలో జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎంపీటీసీ స్థానానికి కారపు గంగాధర్, ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి ఎంపీటీసీకి నాంపెల్లి వెంకటాద్రి నామినేషన్ వేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం జల్లారం ఎంపీటీసీకి ఓదెలు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్, బోయినపల్లి మండలాల జెడ్పీటీసీలకు ఎడపల్లి అనిల్, గురజా ల శ్రీధర్ నామినేషన్ వేశారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేట ఎంపీటీసీ స్థానానికి చిలుక ప్రభాకర్ నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, మెట్పల్లి ఎంపీటీసీలకు రెడ్డి కుమార్, గొట్టె మధు, వి.సైదాపూర్ జెడ్పీటీసీ స్థానాలకు అరుణ లంకదాసరి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీలకు 6, జెడ్పీటీసీలకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు మారేనా? ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు 23శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో జారీచేసి, దాని అనుగుణంగా సీట్లు ప్రకటించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో బీసీలకు ఉన్న 23శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహిస్తే, 19శాతం మేర బీసీలకు సీట్లు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీలు ఉండగా, 26బీసీలకు కేటాయించగా, 19 జనరల్కు కేటాయించారు. 556 ఎంపీటీసీలకు 240బీసీలకు, 184 జనరల్కు కేటాయించగా, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలల్లో 19శాతం సీట్లు తగ్గి, అంతే మొత్తంలో జనరల్ సీట్ల సంఖ్య పెరగనుంది. మొత్తంగా స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. పొలిటికల్ సీన్ -
ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం
ధర్మపురి: విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసిన ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డిని బుధవారం రాత్రి ఎస్పీ అశోక్కుమార్ అభినందించిన ప్రశంసాపత్రం అందజేశారు. ఇటీవల జరిగిన వినాయక, దుర్గా నవరాత్రోత్సవాలు, దసర ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి చర్యలు చేపట్టిన సీఐని అభినందించారు. సర్వేకు సహకరించాలిజగిత్యాల: ప్రజల జీవన స్థితిగతులపై జగిత్యాల పట్టణంలో జాతీయ గణాంక శాఖ సర్వే చేపట్టనున్నట్లు గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం సర్వేకు సంబంధించిన కరపత్రాలను కమిషనర్ స్పందనకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ, మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన అనంతరం ప్రత్యేక ట్యాబ్ ద్వారా కుటుంబాలను ఎంపిక చేస్తూ కుటుంబ యజమాని పేరు, సభ్యుల వివరాలు, విద్యార్హతలు, తదితర వివరాలు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది సహకరించాలని కోరారు. అందరూ తమ కళ్లను ప్రేమించాలిజగిత్యాల: అందరూ తమ కళ్లను ప్రేమించాలని, సెల్ఫోన్లకు బానిస కావొద్దని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. కంప్యూటర్, సెల్ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయిస్తే దృష్టిలోపం ఏర్పడుతుందన్నారు. ఆరుబయట గడిపే సమయాన్ని పెంచుకోవాలని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్లు, పోషకాహారం తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని, షుగర్ వ్యాధి ఉన్న వారు తప్పకుండా రెటినా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ కృష్ణ, ఆర్ఎంవో గీతిక, డీపీవో రవీందర్ పాల్గొన్నారు. -
కుక్కల బెడద
కోరుట్లటౌన్: పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో కుక్కల భయంతో వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. రోజూ రాత్రి గ్రౌండ్లో 20 నుంచి 30 కుక్కలు నిద్ర పోతున్నాయి. ఉదయం వేళ గ్రౌండ్కు వచ్చే వాకర్స్ గుంపుగా ఉన్న కుక్కలను చూసి భయాందోళనకు గురవుతున్నారు. కుక్కలు ఒక్కసారిగా పరిగెత్తడం, రకరకాల విన్యాసాలు చేస్తూ గ్రౌండ్లో తిరగడం ఇబ్బందికరంగా మారింది. అలాగే పట్టణ శివారులోని కల్లూర్రోడ్ పెట్రోలు బంకు సమీపంలో కుక్కలు గుంపుగా రోడ్డుపై ఉండి వెంటాడుతున్నాయని వాహనదారులు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు కుక్కల బెడదను నియంత్రించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
మట్టికుప్పలు.. పిచ్చిమొక్కలు
అంబారిపేట చౌరస్తా వద్ద బస్ షెల్టర్కు అడ్డుగా ఉన్న కర్రలు, మట్టి కుప్పలుఇప్పపెల్లిలో బస్ షెల్టర్ వద్ద పెరిగిన పిచ్చిమొక్కలుకథలాపూర్(వేములవాడ): గ్రామాల్లో ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్ షెల్టర్లు నిర్మించినా కనీస సౌకర్యాలు లేవు. ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సులు ఎక్కుతున్నారు. మండలంలోని సిరికొండ, తాండ్య్రాల, ఇప్పపెల్లి, పోసానిపేట, అంబారిపేట చౌరస్తా వద్ద బస్ షెల్టర్లు నిర్మించారు. బస్ షెల్టర్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో మల మూత్ర విసర్జన కోసం దూరం వెళ్లాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. అంతలోపే బస్సు వస్తే ఎక్కడమా.. మూత్ర విసర్జనకు వెళ్లడమా అని అవస్థలపాలవుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. బస్ షెల్టర్లు అపరిశుభ్రంగా ఉండటంతో అందులో నిలబడేందుకు ఇబ్బందులుపడుతున్నారు. బస్సులు వచ్చేవరకు రోడ్డుపై నిలబడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు చొరవచూపి బస్ షెల్టర్లలో సౌకర్యాలు కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు. -
కార్యకర్తలే పార్టీకి బలం
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమైన శక్తి అని మాజీ మంత్రి జీవన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీగార్డెన్స్లో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో తాను బలంగా ఉండడానికి కారణం క్షేత్రస్థాయిలో తన కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలేనని, వారి కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన నాయకులకు తన అండదండలు ఎప్పటికీ ఉంటాయన్నారు. బీఆర్ఎస్, టీడీపీ హయాంలో మెజార్టీ సీట్లు గెలిచినట్లుగానే రాబోయే ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యకం చేశారు. ఈ సమావేశంలో నాయకులు బండ శంకర్, తాటిపర్తి విజయలక్ష్మి, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, ధర రమేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల న్యాయ పోరాటానికి కోర్టు అండ.. ఆర్డీవో కార్యాలయం జప్తు
సాక్షి,జగిత్యాల : జగిత్యాల కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రైతులకు సరైన పరిహారం చెల్లించలేదని కారణంతో ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేసినట్లు తెలుస్తోంది.పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వేలైన్ కోసం 2006లో రైతుల నుంచి సుమారు 100 ఎకరాలు భూమిని సేకరించారు. రైతులకు ఒక్క ఎకరాకు కేవలం రూ.లక్షా 30వేలు మాత్రమే అధికారులు చెల్లించారు. అయితే, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు రైతులకు అండగా నిలిచింది. ఒక్కో ఎకరాకు రూ.లక్షా 30వేలు కాదని, 15లక్షల97 వేల200 చెల్లించాలని కోర్టు ఉత్తర్వులుజారీ చేసింది.కోర్టు ఉత్తర్వులు జారీ చేసినా రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఆర్డీఓ అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆర్డీఓ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ఆర్డీవో కార్యాలయ సామాగ్రి జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో అధికారులు ఆర్డీవో కార్యాలయా సామాగ్రిని జప్తు చేశారు. -
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పునర్ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు. దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కోసమేనంటున్న గురుకుల అధ్యాపకులు -
24 గంటలు.. 20 ఆపరేషన్లు
వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆఫరేషన్ ఒకటి చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యులు సంధ్య, సోని, మాధవి, సుభాషిణి, చారీ, రమణ, అనిల్కుమార్, రాజశ్రీ, తిరుపతి, రవీందర్, రత్నమాల, నర్సింగ్ ఆఫీసర్స్ ఝాన్సీ, జ్యోతి, అనసూయతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ఎక్స్లో కేంద్ర మంత్రి అభినందనలు వైద్యసేవలు అందించడంలె నిబద్ధతతో పనిచేస్తున్న వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఎక్స్ వేదికగా అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్యకు, వైద్యసిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యులకు ప్రభుత్వ విప్ ఆది అభినందనలు వేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులు 24 గంటల్లో 20 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. ఆధునిక వైద్యసేవలతోపాటు శుభ్రత, రోగి సేవ ధోరణిలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. వైద్యులు, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ ఆస్పత్రి రికార్డు -
రైలు నుంచిపడి వ్యక్తికి గాయాలు
రామగుండం: కదులుతున్న రైలు నుంచి దిగే ప్రయత్నంలో సుమిత్గుప్తా అనే ప్రయాణికుడు ప్లాట్ఫారమ్పై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. కరీంనగర్ నుంచి రామగుండం వైపు వస్తున్న పుష్పుల్ రైలులో సుమిత్గుప్తా వస్తున్నాడు. స్థానిక రైల్వేస్టేషన్లో రైలు ఆగింది. ఆ తర్వాత కదులుతున్న క్రమంలో సుమిత్గుప్తా దిగే ప్రయత్నం చేసి ప్లాట్ఫారంపై పడగా తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కరీంనగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేశామని జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి తెలిపారు. -
గంగ స్నానానికి వచ్చేదెట్లా..
● బస్సుల రద్దుతో ప్రయాణం ప్రయాస ● రద్దయిన సిరిసిల్ల, బెల్లంపల్లి బస్సు సర్వీసులు ● నిలిచిపోయిన సిరిసిల్ల, గర్శకుర్తి, కరీంనగర్ రూట్ సర్వీస్ ● బస్సులను పునరుద్ధరించాలని విన్నపంబోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల ప్రజలకు ఆర్టీసీ బస్సు సేవలు అంతంతే. అందులోనూ ఇటీవల మూడు బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణ కష్టాలు మరింత పెరిగాయి. సిరిసిల్ల డిపో నుంచి వయా బోయినపల్లి, గంగా ధర, జగిత్యాల, ధర్మపురి మీదుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వరకు రోజు ఉదయం రెండు బస్సులు నడిచేవి. ఇవే రెండు బస్సులు తిరిగి సాయంత్రం మళ్లీ ఇదే రూట్లో సిరిసిల్లకు చేరుకునేవి. ఇందులో ఒక బస్సు ఉదయం 7 గంటలకు, మరో బస్సు ఉదయం 9 గంటలకు బోయినపల్లికి చేరుకునేవి. కరీంనగర్–1 డిపో నుంచి వయా కురిక్యాల, గర్శకుర్తి, విలాసాగర్, బోయినపల్లి మీదుగా వేములవాడ సిరిసిల్ల వెళ్లేది. గర్శకుర్తి, సిరిసిల్ల బస్సు ఉదయం వచ్చేది. ఈ బస్సు సైతం కొద్ది రోజులుగా నిలిచిపోయింది. బెల్లంపల్లి బస్సు రాక గంగస్నానానికి ఇక్కట్లు సిరిసిల్ల, బెల్లంపల్లి, కరీంనగర్– సిరిసిల్ల మూడు ఆర్టీసీ బస్సుల రాకపోకలు బంద్ కావడంతో ఈ బస్సుల ఆధారంగా ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల–బెల్లంపల్లి బస్సుతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే వారు. ఎక్కువ మంది భక్తులు గంగ(గోదావరి నది) స్నానానికి ఈ బస్సులోనే వెళ్లేవారు. బోయినపల్లిలో బస్సు ఎక్కితే ధర్మపురిలోనే దిగేవారు. ఈ బస్సు ఇప్పుడు నిలిచిపోవడంతో ధర్మపురికి వెళ్లే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్–సిరిసిల్ల బస్సు గర్శకుర్తి మీదుగా వెళ్లడంతో పలువురు నేతకార్మికులు, ఇతర వ్యాపారులు ఈ బస్సులో వెళ్లి ముడిసరుకులు తెచ్చుకునేవారు. ఈ బస్సు రద్దు కావడంతో ఈ రూట్లోని ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోయినపల్లి మండలానికి గంగాధర–వేములవాడ రింగ్ బస్సు నడిచేది. అది కూడా రావడం లేదు. ఆర్టీసీ అధికారులు స్పందించి సిరిసిల్ల–బెల్లంపల్లి, కరీంనగర్–సిరిసిల్ల బస్సులు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. -
కాంగ్రెస్ మోసాలను ఎండగడుతాం
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లో ఎండగడుతామని, 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఎనిమిది హామీలతో కూడిన కాంగ్రెస్ బాకీ కార్డులను బుధవారం ఆవిష్కరించారు. 2023లో ఎన్నికల ముందు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రతీ మహిళకూ రూ.2500 ఇస్తామని ఇవ్వలేదని, ఇలా ఒక్కో మహిళకు 22 నెలలుగా రూ.55 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వృద్ధులకు పెన్షన్ను రూ.4 వేలు ఇస్తామని రూ.44వేలు బాకీ పడ్డారని, దివ్యాంగులకు రూ.44వేలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతు భరోసాగా ప్రతీ రైతుకు రూ.2లక్షలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినిలకు స్కూటీ, విద్యాభరోసా కార్డులు బాకీ పడ్డారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ బాకీకార్డులను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాల ప్రచారం చేశారని, వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయొద్దని కోరారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, టెస్కో మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, పార్టీ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, సిద్ధం వేణు, గజభీంకార్ రాజన్న, పబ్బతి విజయేందర్రెడ్డి, జక్కుల నాగరాజు, ‘సెస్’ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, శ్రీనివాస్రావు, నారాయణరావు, హరిచరణ్రావు తదితరులు పాల్గొన్నారు. బాకీ కార్డులతో ఇంటింటికీ వెళ్తాం ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ -
ఆయుధాలు డిపాజిట్
జగిత్యాలక్రైం: స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలపై పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో వ్యక్తిగతంగా లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారి నుంచి డిపాజిట్ చేసుకునేందుకు పోలీస్స్టేషన్ల వారీగా నోటీసులు జారీ అయ్యాయి. జిల్లాలో 30 మంది వద్ద లైసెన్స్డ్ తుపాకులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం లైసెన్స్డ్ తుపాకులను తెప్పించుకుని పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయిస్తున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు ఆయుధాల కోసం లైసెన్స్ పొందారు. వీరితోపాటు ప్రైవేటు బ్యాంక్ల భద్రత కోసం ఆయుధాలకు లైసెన్స్ జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆయుధాలు ఉన్నవారు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉండటంతో ఎన్నికలయ్యే వరకు పోలీసులు డిపాజిట్ చేసుకుంటారు. ఆయుధ లైసెన్స్ ఉన్నవారి వివరాలను నేషనల్ డేటా బేస్ ఆర్ట్స్ లైసెన్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరికి ఐడీ నంబరు కేటాయించారు. ఇప్పటికే జిల్లాలో 30 మంది లైసెన్స్దారులకు నోటీసులు జారీ చేసి వారి నుంచి బుధవారం సాయంత్రం వరకు డిపాజిట్ చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆయుధ లైసెన్స్ పొందాలంటే... భద్రత కోసం వ్యాపారవేత్తలు, ఇతరులు ఆయుధ లైసెన్స్ పొందాలంటే పలు కారణాలు చూపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ప్రతి వ్యక్తికి ఇతరుల నుంచి ప్రాణహాని ఉంటేనే లైసెన్స్ ఇస్తారు. సంబంధిత వ్యక్తి సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టులతో సంబంధం ఉండకూడదు. రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీ నుంచి ముప్పు ఉంటే లైసెన్స్ ఇస్తారు. పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వ్యాపారులు, రియల్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆస్తుల రక్షణ కోసం ఆయుధ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్లు కావాలంటే కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయన రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారి పూర్తిస్థాయిలో విచారణ చేపడతారు. లైసెన్స్దారుడు మూడేళ్లకోసారి రెన్యూవల్ చేయించుకోవాలి. ఒక లైసెన్స్పై 3 ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆయుధాలను కొనుగోలు చేసి వాటి వివరాలను పోలీస్స్టేషన్లో అందించాల్సి ఉంటుంది. లైసెన్స్ కలిగిన వ్యక్తులపై ఏదైనా సందర్భాల్లో క్రిమినల్ కేసులు నమోదైతే వారి ఆయుధ లైసెన్స్ రద్దు చేస్తారు. జిల్లాలో లైసెన్స్డ్ తుపాకులు 30 పోలీస్స్టేషన్లో డిపాజిట్ చేయాలని నోటీసులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): బీటెక్ చదివినా వార్షిక పరీక్షలో ఫెయిలయ్యాడు.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసినా కలిసిరాక అప్పుల పాలయ్యాడు.. మనస్తాపం చెందిన గోప గోని అజయ్కుమార్(26) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన అజయ్కుమార్ హైదరాబాద్లో బీటెక్ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. పంటల పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. మరికొంత మద్యం తాగేందుకు వెచ్చించాడు. వ్యవసాయం కలిసిరాకపోవడం, అప్పులు తీర్చే దారిలేక, బీటెక్ కూడా ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఈనెల 4న పొలం వద్ద గడ్డిమందు తాగాడు. తాను గడ్డిమందు తాగి విషయాన్ని తన ఫ్రెండ్స్కు ఫోన్ ద్వారా చేరవేశాడు. వారి సమాచారంతో తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈనెల 7న రాత్రి మృతి చెందాడు. తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. మద్యానికి బానిసై..మానకొండూర్: మానకొండూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సదాశివపల్లి గ్రామానికి చెందిన సాయిని మహిపాల్(35) మద్యానికి బానిసై బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బి.సంజీవ్ వివరాల ప్రకారం.. మహిపాల్కు పదేళ్ల క్రితం వివాహమైంది. భార్యతో గొడవలతో ఐదేళ్లక్రితం విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటున్న మహిపాల్ మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కనకమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
నడకతో మేలు
నేను ఉద్యోగ విరమణ పొంది ఐదేళ్లవుతంది. రోజూ 30 నిమిషా లపాటు నడుస్త. మరో 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్త. చాలాఆరోగ్యంగా ఉంటున్నా. ప్రాంతాలు వేరైనా అందరం కలిసి ప్లాంట్లో పనిచేశాం. ఒకేప్రాంతంలో ఉంటున్నాం. మాకు మేమే స్నేహితులం. – కొమ్ము గోపాల్ ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఇంతకుముందు విద్యుత్ ఉత్పత్తిలో అందరం కలిసి పనిచేసేవాళ్లం. ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్లో కలుస్తూ అందరం కలిసిమెలసి ఉంటున్నాం. బాధలు, సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా ఉంటున్నాం. – పురుషోత్తం నాలుగేళ్ల క్రితం రిటైర్డ్ అయిన. ఉద్యోగం చేసే సమయంలో కొందరం మిత్రులం కలిసి కృష్ణానగర్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నాం. నాకు యోగా అంటే చాలాఇష్టం. నేను సాధన చేస్తూనే మిత్రులకు నేర్పిస్తున్నా. – రాజయ్య -
గుండెపోటుతో యువకుడి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్కు చెందిన కూడలి పర్శరాములు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. పర్శరాములు గ్రామంలో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామంలోనే కూలీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కడు పేదరికం అనుభవిస్తున్న పర్శరాములు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం పర్శరాములు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుడికి భార్య వినోద, కుమారుడు రిత్విక్ ఉన్నారు. మల్లాపూర్: మండలంలోని వాల్గొండ తండాకు చెందిన లకావత్ రమేశ్ (45) దుబాయిలోని షార్జాలో బుధవారం వేకువజామున మూడు గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రమేశ్ ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. షార్జాలోని ఓ కంపనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు నిర్వర్తించి తన గదిలో నిద్రిస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు ఇక్కడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. రమేశ్కు భార్య పద్మ, కుమార్తె వసంత, కుమారుడు హర్షిత్ ఉన్నారు. శవాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్కుమార్ను కోరారు. హుజూరాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందినట్లు తెలిపారు. మున్సిపల్ పారిశుధ్య సూపర్వైజర్ తూముల కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఓ గుర్తు తెలియని మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడి వయస్సు 40ఏళ్లు ఉంటుందని గుర్తించారు. మృతుడు రెండు రోజుల క్రితం కాలువలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యనా.? లేక మరేదైనా కారణాలా అని తెలియాల్సి ఉంది. ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి గంగాధర: వృద్ధదంపతులిద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. భర్త చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో గజ్జెల శంకరయ్య(75)– లక్ష్మి(70) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఎవరూ లేరు. మంగళవారం ఇద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గ్రామస్తులు గమనించారు. వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శంకరయ్య బుధవారం చనిపోయాడు. లక్ష్మి చికిత్స పొందుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఆర్టీసీ లక్కీడ్రా విజేతలు వీరే
విద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 11డిపోల పరిధిలో నిర్వహించిన లక్కీడ్రాను బుధవారం కరీంనగర్ బస్స్టేషన్ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తీశారు. కరీంనగర్కు చెందిన ఈ.రమేశ్ మొదటి బహుమతి రూ.25వేలు, గోదావరిఖనికి చెందిన వి.సదానందం రెండో బహుమతిగా రూ.15వేలు, జగిత్యాలకు చెందిన కె.నాగరాజు మూడోబహుమతిగా రూ.10వేలు గెలుచుకున్నారు. కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్.భూపతిరెడ్డి, 1,2 డిపోల మేనేజర్లు ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్, బస్స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశం, అకౌంట్స్ ఆఫీసర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆనందంగా.. ఆహ్లాదంగా.. ఆరోగ్యంగా..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో సుదీర్ఘకాలం భాగస్వాములై ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ సూర్యోదయానికి ముందే స్థానిక ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ మైదానానికి కాలినడకన చేరుకుంటున్నారు. వ్యాయామం, యోగా, ధ్యానం సాధన చేస్తూ, ఆసనాలు వేస్తున్నారు. మనశ్శాంతి, ఆహ్లాదం కోసం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సూర్యాస్తమయానికి ముందే మళ్లీ అందరూ మైదానం చేరుకుని సాధన చేస్తున్నారు. రోజూ వ్యాయామం.. యోగా సాధన సుఖదుఃఖాలు పంచుకుంటున్న వైనం ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆదర్శం -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
మెట్పల్లిరూరల్: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, అధికారంలోకొచ్చిన 22నెలల్లో చేసిందేమీలేదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం వెల్లుల్లలో బుధవారం పర్యటించారు. ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ బాకీకార్డులు అందించారు. కాంగ్రెస్ హామీలు, మోసం, నయవంచనను ప్రజలకు వివరించారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు బండ రాజేందర్, మురళి పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ -
జగిత్యాల
32.0/24.0గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 20257గరిష్టం/కనిష్టంఆయుధాలు డిపాజిట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలపై పో లీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది. నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు. -
ఆర్టీసీకి దసరా బోనాంజ
జగిత్యాలటౌన్: దసరా సందర్భంగా జిల్లా పరిధిలోని జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోల పరిధిలో సంస్థకు కాసుల పంట పండింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈనెల ఏడో తేదీ వరకు (17రోజులపాటు) చేపట్టిన స్పెషల్ ఆపరేషన్స్తో జిల్లా ఆర్టీసీకి రూ.10కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డిపోల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపించారు. ఇందులో రూ.4,49,056తో జగిత్యాల డిపో మొదటి స్థానంలో.. రూ.3,72,051 ఆదాయంతో కోరుట్ల డిపో రెండోస్థానంలో.. రూ.2,56,044తో మెట్పల్లి డిపో మూడో స్థానంలో నిలిచాయి. మూడు డిపోల పరిధిలో ఉన్న బస్సులు 17లక్షల కిలోమీటర్ల మేర నడిచాయి. మొత్తంగా 19 లక్షల మంది ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో 15లక్షల మంది ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలు ఉండటం విశేషం. మూడు డిపోలకు రూ.10 కోట్లకుపైగా ఆదాయం రావడంపై ఆర్టీసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 20 నుంచి ఈనెల ఏడు వరకు ‘స్పెషల్’ బస్సులు జిల్లా పరిధిలో మూడు బస్ డిపోలు 17లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 19 లక్షల మంది గమ్యస్థానానికి.. వీరిలో 15లక్షల మంది ‘మహాలక్ష్ములు’ మూడు డిపోల పరిధిలో రూ.10.78 కోట్ల ఆదాయం -
ప్రణాళికతో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
జగిత్యాలక్రైం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికతో విజయవంతం చేయాలని ఎస్పీ అశోక్కుమార్ సూచించా రు. నేర విచారణ, కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఎన్నికల నియమావళి, అధి కారులు తీసుకోవాల్సిన చర్యలు, నేరాలపై సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియమావళి, ప్రవర్తనపై ప్రతి పోలీసు అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా వేయాలన్నారు. నేరాలు చేసేవారు, నేర స్వభావం కలిగిన వారిని గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ అమరవీరుల ది నోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి 31 వరకు ఫ్లాగ్ డేను ప్రతి స్టేషన్లో విధిగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన, గణేశ్, దుర్గామాత, దసరా, బతుకమ్మ పండుగలు ప్రశాంతంగా పూర్తి చేయడంలో పాత్ర వహించిన పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. డీఎస్పీలు వెంకటరమణ, రఘుచంధర్, రాములు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ అశోక్కుమార్పాల్గొన్న పోలీసు అధికారులు నియమావళిపై అవగాహన ఉండాలి పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించాలి ఎస్పీ అశోక్ కుమార్ -
రోడ్డు ఇలా.. వెళ్లేది ఎలా..?
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని 48వార్డులోని టీఆర్నగర్కాలనీకి వెళ్లే దారి. ఎక్కడ చూసినా బురదే. ఎక్కడ జారి పడతామోనని కాలనీవాసులు భయపడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటున్నారు. మొన్నటివరకు ఇది గ్రామపంచాయతీగా ఉండేది. మున్సిపాలిటీలో విలీనం చేసినప్పటినుంచి అక్కడి ప్రజలను పట్టించుకునే నాథుడే లేడు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్కుమార్ స్పందించి కాలనీ రోడ్డును బాగుచేయించాలని కోరుతున్నారు. – జగిత్యాల -
ఈవీఎం గోదాముల పరిశీలన
జగిత్యాల: ఈవీఎంలు భద్రపర్చిన జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్లోగల గోదాములను కలెక్టర్ సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. యంత్రాల భద్రత, సీసీకెమెరాల పనితీరును తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏవో హకీం, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. గుండె సంబంధిత వ్యాధులు నిర్ధారణ చేసుకోవాలి ● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించుకోవాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. బుధవారం మాతాశిశు సంక్షేమ కేంద్రంలో హృదయ సంబంధిత వ్యాధుల నిర్ధారణ శిబిరాన్ని ప్రారంభించారు. 2డీఈకో ద్వారా పరీక్షించి సిద్దిపేటలోని సత్యసాయి సంజీవని ఆస్పత్రిలో చికిత్స అందిస్తారని వెల్లడించారు. అనంతరం జగిత్యాల మైనార్టీ గురుకులంలో ఆరోతరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుని నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫ్రీ సీటు సాధించిన విద్యార్థి సురేందర్ను అభినందించారు. ప్రిన్సిపల్ మహేందర్, అధ్యాపకులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత రాయికల్: రైతుల దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రూ.1800 నుంచి రూ.1900వరకే కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరమన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్కుమార్, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, కో–ఆర్డినేటర్ తురగ శ్రీధర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సాయికుమార్, మహేందర్, మాజీ కో–ఆప్షన్ మెంబర్ సోహెల్, నాయకులు రాంచంద్రం, వినోద్, రాజేందర్గౌడ్ పాల్గొన్నారు. మద్యం దుకాణాలకు 25 దరఖాస్తులు జగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం షాపులకు బుధవారం వరకు 25 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తుదారులు నేరుగా ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించినా.. అధికారులు సలహాలు, సూచనలు ఇస్తారని పేర్కొన్నారు. -
కట్టలకు పగుళ్లు.. ప్రమాదంలో చెరువులు
రైతులు అప్రమత్తంగా ఉండాలి జిల్లాకేంద్రం చుట్టూ చెరువులు ఉన్నాయి. కొన్ని కట్టలు కుంగిపోయి పగుళ్లు బారాయి. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. త్వరలోనే మరమ్మతు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్లో ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లాను. లోతట్టు ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. – సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటున్నాం చెరువుల మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతు చర్యలు చేపడతాం. అలాగే కాలువల్లో పూడిక తీసేలా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు, రైతులకు ఇబ్బందులు రానీయం. – ఖాన్, ఎస్సారెస్పీ ఈఈ జగిత్యాల: జిల్లా కేంద్రం చుట్టూ మోతె చెరువు, కండ్లపల్లి చెరువు, లింగంపల్లి చెరువు, ముప్పారపు చెరువు ఉన్నాయి. వీటితోపాటు చల్గల్లో పెద్ద చెరువు, పొలాసలో కొత్తకుంట చెరువులు ప్రధానమైనవి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అన్ని చెరువుల కట్టలు కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. కట్టలకు గండ్లుపడితే జిల్లాకేంద్రాన్నే ముంచెత్తనున్నాయి. కండ్లపల్లి చెరువుకు ప్రమాదం జరిగితే నీరంతా పట్టణంలోకే చేరుతాయి. మోతె, కండ్లపల్లి, ముప్పారపు చెరువుల చుట్టూ అనేక ఇళ్ల నిర్మాణాలున్నాయి. ఆ చెరువు కట్టలు పగుళ్లు పారడంతో ఎప్పుడేం జరుగుతుందోనని చుట్టుపక్కల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొంచి ఉన్న ముప్పు: జిల్లాకేంద్రంలోని చింతకుంట నుంచి కండ్లపల్లి చెరువు, ధరూర్, మోతె చెరువు మధ్య నిర్మించిన గొలుసుకట్టు కాలువల్లో చెట్లు విపరీతంగా పెరిగాయి. కాలువ ద్వారా నీరు ప్రవహించే పరిస్థితే కన్పించడం లేదు. ఇటీవల చింతకుంట చెరువును కలెక్టర్ సత్యప్రసాద్ స్వయంగా పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కాలువ కూడా కబ్జా కావడంతో కుచించుకుపోయింది. ఒకవేళ నీటి ప్రవాహం పెరిగితే కాలువద్వారా కాకుండా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కట్టలు పూర్తిగా పగుళ్లుబారడం కలవరపెడుతోంది. కాలువల్లో పూడిక తీయకపోవడం, చెరువు కట్టలకు మరమ్మతు చేయించకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ, మున్సిపల్, ఎస్సారెస్పీ అధికారులు స్పందించి మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు. మరమ్మతు ఎప్పుడో..? చెరువుల మరమ్మతుకు ఎస్సారెస్పీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. మోతె పెద్ద చెరువుకు రూ.288 లక్షలు, ధర్మసముద్రం చెరువుకు రూ.121.20 లక్షలు, చల్గల్ పెద్ద చెరువుకు రూ.54.20 లక్షలు, పొలాస కొత్తకుంట చెరువుకు రూ.14.89 లక్షలు, ముప్పారపు చెరువుకు రూ.101 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా.. నిధులు మంజూరుకాకపోవడం గమనార్హం. రైతుల్లోనూ కలవరం చెరువు కట్టలు కుంగిపోవడంతో ఆయకట్టు రైతుల్లో నూ ఆందోళన నెలకొంది. పగుళ్లు చూపిన కట్టలకు గండిపడితే తమ పంటలు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంగపుత్రుల ఫిర్యాదు మేరకు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ కండ్లపల్లి చెరువు కట్టను పరిశీలించారు. వెంటనే మరమ్మతు చేపట్టాలని క్వాలిటీ కంట్రోలర్, కన్స్ట్రక్షన్స్ ఎస్ఈతో మాట్లాడారు. కండ్లపల్లి చెరువు కట్టకు మరో రూ.27 లక్షలు మంజూరయ్యాయని పనులు అలసత్వం వద్దని సూచించారు. పట్టణం చుట్టూ నాలుగు చెరువులు కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఎప్పుడేం జరుగుతుందోనని భయంభయం జిల్లాకేంద్రం వాసులకు పొంచి ఉన్న ప్రమాదం చెరువుల మరమ్మతుకు నిధుల ప్రతిపాదన ఇలా.. మోతె పెద్ద చెరువు : రూ.288 లక్షలు ధర్మసముద్రం చెరువు: రూ. 121.20 లక్షలు చల్గల్ పెద్ద చెరువు : రూ.54.20 లక్షలు పొలాస కొత్తకుంట చెరువు : రూ.14.89 లక్షలు ముప్పారపు చెరువు : 101 లక్షలు -
‘భూభారతి’ దరఖాస్తులు పరిష్కరించాలి
జగిత్యాల: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో తహసీల్దార్లతో సమీక్షించారు. ఆర్ఎస్ఆర్లో తేడా ఉన్న సర్వేనంబర్లపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలన్నారు. సాదాబైనామా కేసులు పరిష్కరించాలని, అసైన్డ్ కేసుల్లో ఎంకై ్వరీ పూర్తి చేసి కోర్టు కేసుల్లో ఉన్న భూములపై కౌంటర్ దాఖలు చేయాలన్నారు. భూసేకరణకు తొందరగా అవార్డు చేయాలన్నారు. దరఖాస్తులు పరిశీలించాలి మల్యాల: రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. స్తానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం సిబ్బంది, జీపీలతో సమావేశమయ్యారు. జీపీఓల బాధ్యతలు, విధులపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ అనంద్కుమార్, ఆర్ఐ శ్రీనివాస్, జమున తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
మహనీయుడు వాల్మీకి మహర్షి
జగిత్యాల: రామాయణం మహాకావ్యాన్ని గ్రంథరూపంలో అందించిన మహనీయులు వాల్మీకి మహర్షి అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జీవిత పాఠాలు నేర్పిన రామాయణాన్ని ప్రతిఒక్కరం గుర్తు చేసుకోవాలన్నారు. రామాయణం కథ మాత్రమే కాదని, ధర్మం, నీతి, స్నేహం, కుటుంబ విలువలు నేర్పే అద్భుత పాఠంలా ఉపయోగపడుతుందన్నారు. అదనపు కలెక్టర్లు బీఎస్.లత, రాజాగౌడ్, బీసీ సంక్షేమాధికారి సునీత, డీఆర్డీఏ పీడీ రఘువరణ్ పాల్గొన్నారు. -
కండ్లపెల్లి చెరువుకట్టకు మరమ్మతు చేయండి
జగిత్యాలటౌన్: కుంగిపోయిన కండ్లపెల్లి చెరువు కట్టకు మరమ్మతు చేయించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డిని కోరారు. భారీవర్షాలకు చెరువు కట్ట పది గజాల వరకు కుంగిపోయిందని, దీంతో రైతులు, కండ్లపల్లి, హన్మాజిపేట ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రజాజీవితంలో బాధ్యతగా ఉండాలి ప్రజాజీవితంలో ఉన్నవారు అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని జీవన్రెడ్డి అన్నారు. మంత్రి అడ్లూరిపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఉపసంహరించుకుంటే గౌరవ ప్రదంగా ఉంటుందన్నారు. -
ఆహార నిధి ఏర్పాటు చేయాలి
కొండట్టు ఆలయ పరిసరాలు, ఘాట్రోడ్డు వెంట ఉన్న వందలాది వానరాల ఆకలి తీర్చేందుకు ప్రత్యేక స్థలంలో ఆహారకేంద్రం ఏర్పాటు చేయాలి. దాతల విరాళాల కోసం ఆహార నిధి పేరిట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. వీటితోపాటు ఆలయ ఆదాయం నుండి కొంత మొత్తం కేటాయించాలి. – గసిగంటి ఉపేంద్ర, భక్తుడు,మల్యాల భక్తులు స్పందించాలి కొండగట్టుకు వచ్చే భక్తులు వానరాల ఆకలి తీర్చేందుకు అరటిపండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొస్తే బావుంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వానరాల కోసం కొంత ఖర్చు చేయగలిగితే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. – ఆగంతపు నవతేజ్, భక్తుడు, మల్యాల -
భీం స్ఫూర్తితో ఆదివాసీలు ముందుకెళ్లాలి
మల్లాపూర్: ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు కొమురం భీం అని నాయక్పోడ్ (ఆదివాసి) సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు మొట్ట సంజీవ్ అన్నారు. కొమురం భీం 85వ వర్ధంతి సందర్భంగా మండలంలోని చిట్టాపూర్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీలు, నాయక్పోడ్లు అన్నిరంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. ఆదివాసీల న్యాయపరమైన హక్కుల సాధనకు.. వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కొమురం భీం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఆదివాసీలు, నాయక్పోడ్ కులపెద్దలు బిచ్చల అనిల్, సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. -
దళితులంటే అందరికీ చులకనే..
● ఏ స్థాయిలో ఉన్నా వివక్ష తప్పడం లేదు ● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్జగిత్యాల: సమాజంలో దళితులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగి నా అందరికీ చులకనగానే ఉంద ని, వివక్ష తప్పడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు. అంబేడ్కర్ నుంచి ఇప్పటివరకు దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు. కుల వివక్ష అంతానికి ఆర్థిక, సామాజిక సమానత్వం అవసరముందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్రామకృష్ణ గవాయ్పై జరిగిన దాడి.. దళిత మంత్రి అడ్లూరిపై అనుచిత వ్యాఖ్యలు జాతికే అవమానం జరిగినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, దాడులపై వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి జగిత్యాలఅగ్రికల్చర్: విద్యుత్ ఉద్యోగులు నిబద్దతతో పనిచేయాలని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం విద్యుత్ సిబ్బందితో సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్సేవల్లో ఆగస్టులో జిల్లా ముందువరుసలో ఉందన్నారు. కార్యక్రమంలో అన్ని విభాగాల ఉద్యోగులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఆయిల్ పాం తోటల్లో ‘కామెరూనికస్’ కీటకాలు
కొడిమ్యాల: మండలంలోని కోనాపూర్లో సాగుచేస్తున్న ఆయిల్పాం తోటల్లో మంగళవారం ఉద్యానశాఖ, లోహియా కంపెనీ ఆధ్వర్యంలో పరాగ సంపర్కం కోసం ఉపయోగపడే ఎలైడోబియస్ కామెరూనికస్ కీటకాలను విడుదల చేశారు. జిల్లా ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగుచేస్తున్న ఆయిల్ పాం తోటలు ప్రస్తుతం మూడేళ్ల వయస్సుకు వచ్చాయని, అధిక దిగుబడి కోసం కీటకాలను విడుదల చేశామని, ఒకే మొక్కపై ఆడ, మగ పుష్పాలు పూస్తాయని, వాటిలో పరాగసంపర్కం జరిగి పిందెలుగా మారడానికి ఈ కీటకాలు పుప్పొడిని ఆడ పూల వద్దకు చేర్చుతాయని తెలిపారు. తద్వారా పిందెలో నాణ్యత పెరిగి ఆర్నెళ్లలో దిగుబడి చేతికి అందుతుందని తెలిపారు. ప్రస్తుతం టన్ను ఆయిల్ పాం గెలలకు ధర రూ.19400 ఉందన్నారు. మూడేళ్ల వయస్సున్న తోటల్లో కీటకాలను వదులుతామని లోహియా కంపెనీ జిల్లా మేనేజర్ విజయభరత్ తెలిపారు. కార్యక్రమంలో డీఏవో భాస్కర్, ఏవో పి.జ్యోతి, ఉద్యాన విస్తరణ అధికారి అనిల్, రైతులు పాల్గొన్నారు. -
డీజీపీని కలిసిన ఎస్పీ
జగిత్యాలక్రైం: డీజీపీ శివధర్రెడ్డిని మంగళవారం ఎస్పీ అశోక్కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సారెస్పీకి 1.86 క్యూసెక్కుల ఇన్ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 1.86లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 37 గేట్లను ఎత్తి 2,27,940 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. మద్యం దుకాణాలకు 13 దరఖాస్తులుజగిత్యాలక్రైం: జిల్లాలోని 71 మద్యం దుకాణా లకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా.. ఇప్పటి వరకు 13 వచ్చినట్లు ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సత్యనారాయణ తెలిపారు. దరఖాస్తులు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కూరగాయల పంటలపై అవగాహనకొడిమ్యాల: మండలకేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమంలో మిరప, కూరగాయల సస్యరక్షణ చర్యలు, కాపాస్ కిసాన్ యాప్, పత్తి కొనుగోలుపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. డీఏవో వి.భాస్కర్, ఉద్యాన అధికారి శ్యాంప్రసాద్, వెటర్నరీ అధికారి రాకేశ్ పాల్గొన్నారు. పూడూరులో అభ్యుదయ రైతు రాంరెడ్డి శాస్త్రవేత్తలతో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. తిరుమలాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతునేస్తంలో ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం దిష్టిబొమ్మ దహనంజగిత్యాలటౌన్: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు పొన్నం దిష్టిబొమ్మను దహనం చేశారు. దళిత మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో ల్యాబ్లు ప్రారంభంజగిత్యాల: పాఠశాలల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని డీఈవో రాము అన్నారు. జిల్లాలోని పీఎంశ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలైన కోరుట్ల, మగ్గిడి, ధర్మపురి పాఠశాలలకు అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్) వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ సైన్స్ ల్యాబ్లు మంజూరు కాగా.. మంగళవారం వాటిని ప్రారంభించారు. ఈ టెక్నాలజీ ద్వారా విద్యార్థులకు వివిధ అంశాలను త్రీడీగా చూపిస్తూ.. వారిలో లోతైన అవగాహన, కల్పిత ప్రపంచాల అన్వేషణను ప్రోత్సహిస్తాయన్నారు. బయోల జీ చరిత్ర, భౌతికశాస్త్రల్లో నూతన ప్రయోగాలు, ల్యాబ్ అనుకరణలు, వర్చువల్ టూల్స్ ద్వారా విద్యార్థులు సురక్షితంగా అభ్యసించడమే కాకుండా జ్ఞాన సాధన సాధిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
వానరాల వీరవిహారం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో వానరాలు ఆకలితో నకనకలాడుతున్నాయి. భక్తుల చేతుల్లోని ప్రసాదాలే వాటికి ఆహారం అవుతున్నాయి. మరోవైపు వానరాలతో కొండగట్టుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రసాదం కవర్లు మొదలు.. సంచులనూ లాక్కేందుకు ప్రయత్నం చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాటి ఆకలి తీర్చేందుకు విరాళాల సేకరణ కోసం వానరాల ఆహారనిధి, ప్రత్యేక ఆహార కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తీరని ఆకలి.. కొండగట్టులో వేల సంఖ్యలో వానరాలు ఉన్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతోపాటు కొంతమంది అరటిపండ్లు తీసుకొచ్చి అందిస్తున్నారు. దిగువ కొండగట్టులో.. ఘాట్ రోడ్డు వెంట భక్తులు అడపాదడపా పుట్నాలు, బియ్యం, వివిధ రకాల పండ్లు అందిస్తున్నా.. ఆ ఆహారం ఎటూ సరిపోవడం లేదు. దీంతో కోనేరు, ఆలయ పరిసరాల్లోని కొబ్బరి చిప్పలు తింటూ కాలం వెల్లదీస్తున్నాయి. అవి కూడా సరిపోకపోవడంతో భక్తులచేతుల్లోని లడ్డూ, ప్రసాదాలను లాక్కెళ్తున్నాయి. రోడ్డుపై గుంపులుగా చేరుతుండడంతో భక్తులు, వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆలయానికి వెళ్లే దారిలో ఆకలి తీర్చుకుంటున్న వానరాలు, కోనేరు వద్ద కొబ్బరి చిప్ప తింటున్న వానరం -
న్యాయవాదుల ఆందోళన
జగిత్యాలజోన్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో న్యాయవాదులు మంగళవారం ఆందోళనకు దిగారు. కోర్టు విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు. న్యాయవాదులు బిరుదుల లక్ష్మణ్, ఉమామహేశ్, దిలీప్, కరుణాకర్, పురుషోత్తం, సంతోష్, అక్బర్, రాజన్న, సాయి, కిరణ్ పాల్గొన్నారు. కోరుట్లలో.. కోరుట్ల: బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట నిరసన తెలిపారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థకు మంచిది కాదన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరి విజయ్కుమార్, న్యాయవాదులు ఫసియోద్దీన్, కడకుంట్ల సదాశివ రాజు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
జగిత్యాల: ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. మంగళవారం బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రులు కచ్చితంగా క్లినికల్ ఎస్లాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. మున్సిపల్ వాహనాలకు బయో మెడికల్ వేస్ట్ను అందించొద్దన్నారు. ఏజెన్సీ వారికి అప్పగించాలన్నారు. డీఎంహెచ్వో ప్రమోద్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 302 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ స్పందన, మోహన్ పాల్గొన్నారు. -
వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం
మల్లాపూర్: వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శప్రాయమని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచుల నర్సయ్య అన్నారు. వాల్మీకి జయంతి సందర్భంగా మంగళవారం మండలకేంద్రంతో పాటు వెంకట్రావ్టపేలో ఉత్సవాలను ఘ నంగా నిర్వహించారు. బోయ వాల్మీకుల్లో 80శాతం ప్రజలు నిరుపేదలు ఉన్నారని, కొన్నిచోట్ల ఎస్టీలు గా, మరికొన్ని చోట్ల బీసీలుగా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని చెల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్రానికి బిల్లు పంపించినా పెండింగ్లో ఉందన్నారు. కార్యక్రమంలో బోయ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు మీనుగు చంద్రశేఖర్, నాయకులు పెనుకుల మల్లేశ్, పెనుకుల మనోహర్, మీనుగు కొండయ్య, రాజమౌళి, రాజేందర్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న కేంద్రాలు ఏర్పాటు చేయండి
మెట్పల్లి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, లేకుంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. పంట కోతకు వచ్చి రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంతో మార్కెట్లో వ్యాపారులు మద్దతు ధర క్వింటాల్కు రూ.2400 ఉంటే.. రూ.1800కు మించి చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. ఎన్నికలకు ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో జరిగిన సభలో పంటలకు మంచి ధరలను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత దానిని విస్మరించిందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్వింటాల్కు రూ.2800 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎలాల దశరథరెడ్డి, నోముల లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, జేడీ.సుమన్, ఏలేటి చిన్నారెడ్డి, భాస్కర్రెడ్డి, తిరుపతిరెడ్డి, రాజాగౌడ్ తదితరులున్నారు. -
మంత్రి ‘పొన్నం’ క్షమాపణ చెప్పాలి
జగిత్యాలటౌన్/ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం అన్నారు. జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసేలా సహచర మంత్రి అడ్లూరిని కించపరిచేలా పొన్నం మాట్లాడడం సరికాదన్నారు. 24గంటల్లో క్షమాపణ చెప్పకుంటే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పొన్నం దిష్టిబొమ్మలు దహనం చేస్తామని హెచ్చరించారు. ధర్మపురి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెందోలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాదిగల ఆత్మగౌరవం దెబ్బతీసేలా వ్యవహరించిన పొన్నం తీరు సరికాదన్నారు.దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకోండిజగిత్యాల: ఆస్పత్రుల్లో వైద్యులపై కొందరు చికిత్స కోసం వచ్చి దుర్భాషలాడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో ప్రమోద్కుమార్కు ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందించారు. మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధి నిర్వహణలో ఉన్న వైద్యులపై అనుచితంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలన్నారు. ఈ ఘటనలతో వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారన్నారు. వైద్యులు శశికాంత్రెడ్డి, నవీన్, అమరేందర్ పాల్గొన్నారు.కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ కరువైందిజగిత్యాలటౌన్: జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ కరువైందని, పోలీస్ యంత్రాంగమే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. బాలెపల్లి రేవంత్రెడ్డిపై గంగారెడ్డి అనుచరులు రాళ్లతో దాడులు చేయగా.. కార్తీక్ అనే మధ్యవర్తికి తగిలిందని, రేవంత్రెడ్డిపై దాడి చేస్తున్నారని, శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన రేవంత్రెడ్డినే అరెస్టు చేసి రిమాండ్కు పంపడం దారుణమన్నారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటనలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ, సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.కోరుట్ల నుంచి వేములవాడకు టికెట్ ధర రూ.60ఆర్టీసీలో రెట్టింపు చార్జీ వసూలుకథలాపూర్: కోరుట్ల నుంచి వేములవాడకు ఆర్టీసీ బస్ చార్జి రూ.60. కానీ.. కోరుట్ల డిపోకు చెందిన ఓ బస్ కండక్టర్ మండలంలోని సిరికొండకు చెందిన ప్రయాణికుడు గుండేటి రాజు నుంచి రూ.120 తీసుకున్నారు. ఇదేమిటని అడిగితే కోరుట్ల డిపో అధికారులు చెప్పడంతోనే తాను వసూలు చేస్తున్నట్లు కరాఖండీగా చెప్పాడు. రాజుతోపాటు ప్రయాణికులు వారించినా వినిపించుకోలేదు. విషయాన్ని రాజు కోరుట్ల డిపో అధికారులకు ఫోన్లో తెలపగా.. పొంతనలేని సమాధానమిచ్చారు. రాజు తిరుగు ప్రయాణంలో వేములవాడ నుంచి సిరికొండకు వేములవాడ డిపో బస్సులో వెళ్లగా కండక్టర్ మాత్రం రూ.60 తీసుకున్నాడు. రెట్టింపు చార్జి వసూలుపై కోరుట్ల ఆర్టీసీ డిపో అధికారులను వివరణ కోరగా.. ఒక బస్సు ట్రిప్పులో ఎక్కువ ధర తీసుకున్న మాట నిజమేనని, మిగిలిన బస్సుల్లో పెంచలేదని తెలిపారు. -
‘పరిషత్’ ఏర్పాట్లు ముమ్మరం
కౌంటింగ్ కేంద్రాలు జగిత్యాల: జిల్లా, మండల పరిషత్ ఎన్నికల దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మొదటగా పరిషత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీటీసీ రిజర్వేషన్ వివరాలు ఇలా.. బీర్పూర్ (ఎస్టీ జనరల్), ఎండపల్లి, మల్యాల (ఎస్సీ మహిళ), కొడిమ్యాల, గొల్లపల్లి (ఎస్సీ జనరల్), పెగడపల్లి, జగిత్యాల, భీమారం, మేడిపల్లి (బీసీ మహిళ), రాయికల్, కోరుట్ల, వెల్గటూర్, సారంగాపూర్, మెట్పల్లి, బుగ్గారం (బీసీ జనరల్), బుగ్గారం, మల్లాపూర్, కథలాపూర్ (జనరల్ మహిళ), ఇబ్రహీంపట్నం, ధర్మపురి, జగిత్యాల రూరల్ (జనరల్)కు కేటాయించారు. ఎంపీపీ రిజర్వేషన్ల వివరాలు ఇలా.. బీర్పూర్ (ఎస్టీ జనరల్), ఎండపల్లి, బుగ్గారం (ఎస్సీ మహిళ), కొడిమ్యాల, మల్యాల (ఎస్సీ జనరల్), రాయికల్, భీమారం, గొల్లపల్లి, కోరుట్ల (బీసీ మహిళ), పెగడపల్లి, జగిత్యాల, మేడిపల్లి, వెల్గటూర్ (బీసీ జనరల్), ధర్మపురి, మెట్పల్లి, జగిత్యాలరూరల్ (జనరల్ మహిళ), సారంగాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్ (జనరల్) స్థానాలుగా ఖరారయ్యాయి. మొదటి దశ పోలింగ్కు ఈనెల 9న నోటిఫికేషన్ రానుండగా.. ఈనెల 23న పోలింగ్, నవంబర్ 11న కౌంటింగ్ చేపట్టనున్నారు. అలాగే రెండో దశకు ఈనెల13న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఈనెల 27న పోలింగ్, నవంబర్ 11 కౌంటింగ్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ కల్పించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. ఫేస్–1 పోలింగ్: 10 జెడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలు పోలింగ్ కేంద్రాలు: 554మండలాలు: బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో: జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, ధర్మపురి, బుగ్గారం కండ్లపల్లి మోడల్స్కూల్లో: రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ ఇబ్రహీంపట్నం మోడల్స్కూల్లో మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కల్లూరు మోడల్స్కూల్లో కోరుట్ల, భీమారం, మేడిపల్లి గొల్లపల్లి మోడల్స్కూల్లో: గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్, ఎండపల్లిఫేస్–2 పోలింగ్ 10 జెడ్పీటీసీ, 108 ఎంపీటీసీ స్థానాలు పోలింగ్ కేంద్రాలు: 569మండలాలు: బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లిఫేస్–1 నోటిఫికేషన్ విడుదల: 9న పోలింగ్: అక్టోబర్ 23కౌంటింగ్: నవంబర్ 11ఫేస్–2 నోటిఫికేషన్ విడుదల: 13న పోలింగ్ : అక్టోబర్ 27కౌంటింగ్ : నవంబర్ 11 -
‘బెస్ట్ అవెలబుల్’ విద్యార్థుల ఆందోళన
జగిత్యాలటౌన్: చదువుకునేందుకు తమను పాఠశాలలోకి అనుమతించడం లేదంటూ బెస్ట్ అవెలబుల్ స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు జిల్లాకేంద్రంలో ని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద జగి త్యాల, కరీంనగర్ రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. బెస్ట్ అవెలబుల్ స్కూళ్లుగా గుర్తించిన కొ న్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. రెండేళ్లుగా నిధులు విడుదలకాకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను క్లాసులకు అనుమతించలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ముందుగా కలెక్టరేట్కు చేరుకున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించారు. అక్కడ కాసేపు నిరసన తెలిపారు. అనంతరం రహదారిపై బైటాయించారు. బకాయిలు విడుదల చేసి పిల్లల విద్యాభ్యాసం నిలిచిపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఎస్సై మల్లేశం వారికి సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. -
ఎన్నికల్లో లోటుపాట్లు రానీయొద్దు
జగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో లోటుపాట్లు జరగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో నామినేషన్ల స్వీకరణపై ఆర్వో, ఏఆర్వోలకు అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో ఎన్నికలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నామినేషన్లు తీసుకోవాలని, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అధికారులు, ఆర్వో, ఏఆర్వోలు పాల్గొన్నారు. కారిడార్ అభివృద్ధికి డీపీఆర్ చేపట్టాలి: స్పెషల్ చీఫ్ సెక్రటరీ గ్రీన్ఫీల్డ్ నాగ్పూర్, హైదరాబాద్ హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి డిటేయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) చేపట్టాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్తో సమీక్షించారు. జాతీయ రహదారుల మాస్టర్ ప్లాన్లో భాగంగా నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు హైస్పీడ్ కారిడార్ అభివృద్ధికి డీపీఆర్ తయారుచేయాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో కొంతమేర కారిడార్ ఉన్న నేపథ్యంలో దాని ప్రకారం చేపడతామన్నారు. కా ర్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ ఉన్నారు. -
కరీంనగర్కు ఒడిశా పోలీసులు
కరీంనగర్క్రైం: సైబర్ క్రైం కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలీసులు సోమవారం కరీంనగర్కు వచ్చినట్లు తెలిసింది. కరీంనగర్ టూటౌన్ పరిధికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి పాత్ర ఉందని భావించి అతను ఉంటున్న విద్యానగర్ ప్రాంతంలో దర్యాప్తు చేశారు. సైబర్ నేరస్తులు సామాన్యులకు కొంతడబ్బు ఇచ్చి వారి పేర్లపై ఖాతాలు తెరుస్తుండటంతో ఇలాంటి నేరంతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న పోలీసులు అతడిని అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. వేములవాడలో కొండచిలువవేములవాడ పట్టణ శివారులోని మూలవాగు తీరంలో ధోబీఘాట్ వద్ద 9 ఫీట్ల పొడవు ఉన్న కొండచిలువ సోమవారం కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రాఫిక్ ఎస్సై రాజు అక్కడికి చేరుకుని పాములు పట్టే జగదీశ్కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి కొండచిలువను పట్టుకొని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. – వేములవాడ -
పంటలకు తెగుళ్ల బెడద
సుల్తానాబాద్/జూలపల్లి/ఓదెల(పెద్దపల్లి): కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో వరి, పత్తి పంటలకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. వర్షాకాలం ఆరంభంలో ఆలస్యంగా కురిసిన వానులు.. ఇప్పుడు సీజన్ చివరిదశకు వచ్చినా భారీవర్షాలు కురుస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. వీటికితోడు వాతావరణంలో ఆకస్మిక మార్పులతోనూ వరి, పత్తి పంటలకు వివిధ తెగుళ్లు ఆశిస్తున్నాయి. మరో నెలరోజుల్లో పంటలు చేతికి వస్తాయి. ఈ క్రమంలో తెగుళ్లు ఆశించడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీవర్షాలతో వరి పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. గింజదశలోని పంటను ఆశించడంతో దిగుబడి తగ్గుతుందని, అంతేకాకుండా తాలు అధికంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను ముంచిన భారీ వర్షాలు జూలపల్లి మండలంలోని కోనరావుపేట, నాగులపల్లె, కల్లెంరెడ్డిపల్లె, తెలుకుంట తదితర గ్రామాల్లోని వరిపంట కోతదశకు చేరింది. గింజగట్టిపడక ముందే ఏకధాటివానలతో తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగులపల్లె, తెలుకుంట, కల్లెంరెడ్డిపల్లెలో వర్షం ధాటికి దాదాపు 30 ఎకరాల్లో వరిపైరు నేలవాలిందని, గింజలు పనికిరాకుండా పోయానని వాపోతున్నారు. తెల్లబంగారానికి తెగులు.. ఓదెల మండలంలోని వివిధ గ్రామాల్లో పత్తి పంటకు తెగులు సోకింది. మచ్చతెగుళ్లతో పంట దెబ్బతింటోదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓదెల మండలంలోని 22 గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారని అధికారుల అంచనా. ఇందుర్తిలో 250 ఎకరాలు, పొత్కపల్లిలో వెయ్యి , శాన గొండలో 500, గుంపులలో 350, ఓదెలలో 570, కొమిరలో 320, కొలనూర్లో 200, మడకలో దాదాపు 250 ఎకరాల్లో పత్తి సాగైందని, కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటకు నల్లమచ్చలు వస్తున్నాయని, మొక్కలు కుళ్లిపోతున్నాయని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉందని, ఈ సమయంలో కాయలు, బుగ్గలు నల్లగా మారడంతో దిగుబడి తగ్గుతుందని, పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు.. చేను జాలువారి మొక్కలన్నీ ఎర్రబారుతున్నాయని అంటున్నారు. కొద్దిరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతోనే పత్తి పంటకు తెగులు సోకుతోంది. మొక్కలు, ఆకులు, కాయలపై నల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. తెగుళ్ల నివారణ కోసం అన్నదాతలు రైతువేదికలో ఏఈవోలను తక్షణమే సంప్రదించాలి. – రామకృష్ణ, ఏఈవో, కొలనూర్, ఓదెల -
స్థానిక ఎన్నికల్లో పొత్తు ఉండదు
విద్యానగర్(కరీంనగర్): ఎంఐఎం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి యాసర్ ఆర్ఫాత్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ సుబహాన్, నాయకులు బర్కత్ అలీ, హాఫిజ్ యూసుఫ్, ఖమరొద్దీన్, ఆతిన, ఖాజా, ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు అఖీల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, ఆరిఫ్ అహ్మద్, మాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
‘అడవిలో అన్నలు’ సిరిసిల్లలో కలిశారు!
సిరిసిల్ల: సిరిసిల్లకు వచ్చిన మంత్రి సీతక్కను అప్పటి అన్నలు కలిశారు. ములుగు జిల్లాకు చెందిన ధనసరి అనసూర్య ఉరఫ్ సీతక్క 1985–92 ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) జనశక్తిలో దళనేతగా పనిచేశారు. అనంతరం ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం సిరిసిల్లకు వచ్చిన మంత్రిని జనశక్తి మాజీ నక్సల్స్ కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బుర్ర మల్లేశంగౌడ్ ఉరఫ్ కుమారన్న, ఇదే మండలంలోని మల్కపేటకు చెందిన బుట్టం చంద్రయ్య ఉరఫ్ సోమన్న కలిశారు. గతంలో సీతక్కతో కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఇది ఇలాఉంటే 1989లో గ్రెనేడ్పేలి సోమన్న చేయి నుజ్జునుజ్జయ్యింది. అనంతరం వ్యక్తిగత కారణాలతో 1995లో ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. మరో నాయకుడు కుమారన్న వరంగల్ జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేశారు. 1989లో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముష్టిపల్లి సర్పంచ్, ఉపసర్పంచగా పనిచేశారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి
మరో పదిహేను రోజుల్లో వరి పంట కోతకు వస్తుంది. ఈ సమయంలో భారీ వర్షాలు పడుతున్నయి. నాకున్న మూడెకరాల్లో ఏసిన పంటకు నష్టం జరిగింది. పంట నష్టపోయిన మాలాంటి రైతులను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలి. – భూసారపు శ్రీనివాస్, రైతు, కోనరావుపేట నాకున్న మూడెకరాల్లో ఈ సారి పత్తి పంట ఏసిన. ఏకరాపై రూ. 30వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. పత్తి పంట కాయ దశకు వచ్చింది. ఏకధాటి వానలతో వైరస్ సోకిందట. కాయలు నల్లగా, ఆకులు ఎర్రగా మారినయి. – ఉప్పుల అనిత, రైతు, గూడెం వాతావరణంలో వస్తున్న మార్పులు, భారీవర్షాలతోనే తెగుళ్లు ఆశిస్తున్నాయి. వాటి నివారణకు వ్యవసాయాధికారుల సూచన ప్రకారమే పురుగు మందులు వాడాలి. ఇందుకోసం స్థానిక ఏఈవోలను తప్పకుండా సంప్రదించాలి. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి -
యువత స్వయం ఉపాధి సమాజానికి మేలు
● ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల: యువత స్వయం ఉపాధితో ముందుకెళ్లాలని, అది సమాజానికి మేలు అని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలకు చెందిన యువత అన్ని రకాల వస్తువులు ఆన్లైన్ ద్వారా డెలివరీ చేసేలా ఇటీవల జిపాక్ యాప్ రూపొందించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. యువత ఇలాంటివి ఆవిష్కరించాలన్నారు. అనంతరం సారంగాపూర్ మండలం అర్పపల్లికి చెందిన ప్రతిభ డీఎస్పీగా ఎంపికై న సందర్భంగా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిభ డీఎస్పీ పోస్టు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. ధరూర్ క్యాంప్లోని ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం రోటరీ క్లబ్, ఆపి సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్యూరీఫైర్ ప్లాంట్ను ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి కథలాపూర్: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మండలంలోని సిరికొండలో నిర్వహించిన మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాను అధిష్టానానికి పంపించామన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు ఎండీ.అజీమ్, తొట్ల అంజయ్య, చెదలు సత్యనా రాయణ, ఎండీ.హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు
కథలాపూర్: ఓటరు జాబితా పారదర్శకంగా రూపొందించాలని, పొరపాట్లకు తావు ఇవ్వొద్దని ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించి చెప్తున్నా.. క్షేత్రస్థాయి అధికారుల, సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. ఏళ్ల క్రితమే మరణించిన వారి పేర్లు కూడా జాబితాలో కనిపించడం.. పలువురి పేర్లు తప్పుగా నమోదు కావడం.. కొందరికి రెండుచోట్లా ఓటు హక్కు ఉండడం సిబ్బంది పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఎలా ఉంటాయంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కథలాపూర్లో వెలుగులోకి.. కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు తుది ఓటరు జాబితా విడుదల చేశారు. ఒక జెడ్పీటీసీ, 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 37,724 మంది ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తయారుచేసిన ఓటరు జాబితాను రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్శాఖకు అప్పగించారు. వాటిని సదరు శాఖ అధికారులు ఎంపీటీసీ స్థానాల వారీగా ఒక జాబితా.. వార్డులవారీగా మరో జాబితా రూపొందించారు. వాటిని బీఎల్వోలతోపాటు పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు పరిశీలించాక తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. ఇంత వడబోసినా పలు గ్రామాల్లో మరణించిన వారి పేర్లు ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి గ్రామంలో 10 మంది వరకు మరణించినవారి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు దృష్టి సారించి మరణించినవారి పేర్లు తొలగించాలని, అర్హుల పేర్లు చేర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ వినోద్ను వివరణ కోరగా.. మరణించిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉంటే బీఎల్వోలతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎన్నికల సమయం వరకు తుది ఓటరు జాబితా తయారు చేయిస్తామన్నారు. -
యువకుడిపై దాడి
సిరిసిల్లక్రైం: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం వెంకంపే ట ప్రాంతంలో సోమవారం పాతపగలతో జరిగిన దాడి ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాలు. వెంకంపేటకు చెందిన రాజశేఖర్పై అదే పట్టణానికి చెందిన హరికృష్ణ, విగ్నేశ్, నరేశ్లు కర్రలతో దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాడి చేయగా అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. తల పై గాయాలతో రక్తస్రావమైన రాజశేఖర్ వెంటనే హాస్పిటల్లో చికిత్స పొంది, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ దాడితో బాధితుని ఉండే ఏరియాలో నివసించే వారు భయాందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
స్థానికంలో కాసుల గోల
గోదావరిఖని: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు. నగదు ప్రవాహంపై దృష్టి సారించారు. రూ.50వేల కన్నా ఎక్కువ వెంట తీసుకెళ్తే కచ్చితమైన ఆధారాలు చూపించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే సీజ్ చేస్తామంటున్నారు. ఇదేక్రమంలో ఈనెల 4న రామగుండం పోలీస్ కమిషనరేట్ కోటపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు పారుపల్లి చెక్పోస్టు వద్ద రూ.1.90లక్షలను సీజ్ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికలు లేకపోవడంతో కోడ్ విషయం తెలియక కారులో ఓ వ్యక్తి నగదు తీసుకెళ్తున్నాడు. రూ.50వేల కన్నా ఎక్కువ తీసుకెళ్తుండడంతో సీజ్ చేశారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలాజరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆందోళన.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాల కొనుగోలు కోసం పెద్దమొత్తంలో నగదు అవసరం ఉంటుంది. పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలన్నా కనీసం రూ.1.20లక్షలు అవసరం అవుతోంది. ఈక్రమంలో నగదు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. కొంతమంది ఆన్లైన్ లా వాదేవీల ద్వారా కొనుగోలు చేస్తున్నా.. చాలామంది నగదు రూపేణా లావాదేవీలు జరుపుతున్నారు. ఈక్రమంలో పోలీసులు అధిక డబ్బులు తీసుకెళ్తున్నారని సీజ్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎన్నికలకు సంబంధించిన డబ్బులు చాపకింద నీరులా వెళ్తాయని, ఎన్నికల కమిషన్ అతి నిబంధనలతో తాము ఇబ్బందిపడాల్సి వస్తోందన సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాందీ షాపుల టెండర్లు.. రాష్ట్రప్రభుత్వం బ్రాందీషాపుల టెండర్లను ప్రారంభించింది. రెండేళ్ల కాలపరిమితికి ఒక్కోషాపు వేలంలో పాల్గొనేందుకు రూ.3లక్షలు చెల్లించి డీడీ తీయాలని సూచించింది. దీంతో చాలామంది టెండర్లలో పాల్గొనేందుకు నగదు వెంట తీసుకెళ్లడం సహజం. స్థానిక ఎన్నికల కోడ్ కూసిన క్రమంలో తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో పట్టణాల్లో మినహాయించి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈనిబంధన ఉండాలని కోరుతున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మంచిర్యాల జిల్లా: నగదు రూ.4.48లక్షలు లిక్కర్ 146లీటర్లు(రూ.65వేలు) పెద్దపల్లి జిల్లా: లిక్కర్ 48లీటర్లు(రూ.17వేలు) గంజాయి 5కిలోలు(రూ.1.25లక్షలు) పీడీఎస్రైస్ క్వింటాల్ చెక్పోస్టులు: మంచిర్యాల జిల్లా: పారుపల్లి(అంతర్రాష్ట్ర), ఇందన్పల్లి, ఇందారం, తాండూర్, గూడెం పెద్దపల్లి జిల్లా: దుబ్బపల్లి, గుంపుల, ఎక్లాస్పూర్, గోదావరి బ్రిడ్జి పెళ్లిళ్ల సీజన్.. బ్రాందీ షాపుల టెండర్లు రూ.50వేలకుపైగా ఉంటే సీజ్ చేస్తున్న పోలీసులు ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. నిబంధనలు అతిక్రమించి రూ.50వేలకుపైగా వెంట తీసుకెళ్తే అందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే రూ.50వేల కన్నా ఎక్కువ ఉన్నసొమ్మును సీజ్ చేస్తాం. జిల్లా సరిహద్దులతోపాటు అంతర్ రాష్ట్ర సరిహద్దు అయిన కోటపల్లి మండలం శివారులోని మహారాష్ట్ర బ్రిడ్జి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశాం. నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
మంచి ముహూర్తాలు లేవని..
జగిత్యాలక్రైం: మద్యం షాపులకు టెండర్ల గడువు ఈనెల 18తో ముగియనుంది. గత నెల 27 నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ఇప్పటివరకు కేవలం ఏడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లాలోని మొత్తం 71 షాపులకు గతంలో కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ.. మంచి ముహూర్తాలు లేకపోవడంతో దరఖాస్తులు సమర్పించే వారు వెనుకంజ వేస్తున్నారు. ఈనెల 8న భారీగా రానున్న దరఖాస్తులు చాలారోజులుగా మంచి ముహూర్తాలు లేవు. ఈనెల 8న మంచి ముహూర్తం ఉండటంతో అదే రోజు మద్యంషాపులకు టెండర్లు వేసేందుకు దరఖాస్తుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో దరఖాస్తుకు రూ.2లక్షలు ఉండగా.. ప్రస్తుతం దానిని రూ.3 లక్షలకు పెంచారు. ఇది దరఖాస్తుదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. పైగా దరఖాస్తు ఫీజు వాపస్ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంపైనా తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. భారీగా ఏర్పాట్లు మద్యంషాపులకు దరఖాస్తులు మందకొడిగా వస్తుండడం.. రానున్న రోజుల్లో భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఎకై ్సజ్ శాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటోంది. శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సెలవులను రద్దు చేశారు. ప్రతి అధికారి తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండి దరఖాస్తుదారులకు సూచనలు, సలహాలు ఇస్తూ.. దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఈనెల 18న చివరి రోజు కావడంతో క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరి దరఖాస్తు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో చాలా మంది దరఖాస్తుదారులు ఈనెల 18నే దరఖాస్తులు సమర్పిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సింగరేణి రెస్క్యూ శిక్షణ
గోదావరిఖని: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులకు సింగరేణి యాజమాన్యం సోమవారం శిక్షణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని 10వ బెటాలియన్కు చెందిన మొదటి బ్యాచ్కు శిక్షణ ఇస్తున్నారు. భూగర్భగనుల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఒక్కో బ్యాచ్కు 14రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకున్న సింగరేణి రెస్క్యూ ద్వారా ఎన్డీఆర్ఎఫ్కు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఎన్డీఆర్ఎఫ్, మినిస్టరీ ఆఫ్ హోం ఎఫైర్స్, డీజీఎంఎస్, సింగరేణి సంస్థ కలిపి ఈనిర్ణయం తీసుకున్నాయి. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సంఘటన సమయంలో సింగరేణి రెస్క్యూ బృందాల పనితీరు దేశవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేయాలనే ఆలోచనతో ఈశిక్షణకు అంకురార్పన జరిపారు. మొదటి బ్యాచ్లో 30మంది సభ్యులు ఉంటారని, ఈ బెటాలియన్లో 18 బ్యాచ్లు ఉంటాయని అసిస్టెంట్ కమాండర్ కె.కిరణ్కుమార్ తెలిపారు. ఈశిక్షణను ఆర్జీ–2 జీఎం బండి వెంకటయ్య, ఏరియా సేఫ్టీ జీఎం మధుసూదన్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి ప్రారంభించారు. 14రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ కొనసాగనుంది. మొదటి బ్యాచ్కు శిక్షణ ప్రారంభం -
స్థానికం’పై సందిగ్ధం
● ‘జనరల్’ ఆశావహుల్లో ఉత్కంఠ ● బీసీ రిజర్వేషన్పై నేడు సుప్రీంకోర్టులో.. ఈనెల 8న హైకోర్టులో విచారణ ● ఆసక్తి రేపుతున్న రాజకీయంజగిత్యాల: స్థానిక సంస్థల ఎన్నికలపై స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. ఎన్నికలు నిర్వహిస్తారా..? నిర్వహిస్తే ఎలా ముందుకెళ్తారు..? కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ప్రకటించినట్లు 42 శాతం రిజర్వేషన్తోనేనా..? లేక మరేదైనా జరగనుందా..? అన్న సందిగ్ధం నెలకొంది. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడంపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడమే ఇన్ని అనుమానాలకు తావిస్తోంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తీర్పు ఎలా ఉండబోతోంది..? స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే దానిపై గ్రామాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పోటీ చేయాలనుకుంటున్న జనరల్ ఆశావహులు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు, 20 ఎంపీపీ స్థానాలు, 216 ఎంపీటీసీ స్థానాలు, 385 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కాగా మొదటి నుంచే పదవులపై కన్నేసిన కొందరు నాయకులకు 42శాతం బీసీ రిజర్వేషన్లు కలిసి వచ్చాయి. జెడ్పీటీసీ స్థానాలతోపాటు, ఎంపీపీ స్థానాలు నాలుగు చొప్పున పెరిగాయి. అలాగే ఎంపీటీసీ స్థానాలతోపాటు గ్రామ పంచాయతీలు కూ డా అదనంగా పెరిగాయి. దీంతో బీసీల్లో కొంత ఆశలు రేకెత్తాయి. ఈ క్రమంలో రిజర్వేషన్పై కొందరు సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లడంతో తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఆశావహుల్లో నెలకొంది. ఆచీతూచి అడుగులు ఎన్నికల్లో పోటీలో ఉండాలనుకున్న నాయకులు ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి నుంచే పెట్టుబడి (ఎన్నికల ఖర్చు) పెడితే.. ఒకవేళ ఎన్నికలు వాయిదాపడితే ఎలా అని మదనపడుతున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టుల తీర్పుతో ప్రతికూల వాతావరణం ఏర్పడితే అనవసరంగా ఖర్చు పెట్టినట్లవుతుందని భావిస్తున్నారు. ఒకవేళ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరిగితే జనరల్లో ఉన్న అభ్యర్థులకు అవకాశం లభిస్తుందని ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. అలాగని రిజర్వేషన్లు మారితే బీసీ వర్గాల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించి సీట్లు కేటాయించారు. కోర్టు తీర్పును బట్టి ఆశావహులు ముందుకుసాగే అవకాశం కనిపిస్తోంది. రిజర్వేషన్లు మారినా ఎస్సీ, ఎస్టీల స్థానాల్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల నిర్ణయంపై.. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థుల వేటలో పడ్డాయి. అధికార పార్టీ అభ్యర్థులు కొందరు స్థానిక ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలించిందని, తమకు పోటీ చేసే అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి చూపిస్తామని వారికి అభయం ఇస్తున్నారు. మరోవైపు జగిత్యాల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. మాజీమంత్రి, సీనియర్ నాయకుడు జీవన్రెడ్డి ఇప్పటికే తన వర్గానికి చెందిన అభ్యర్థుల పేర్లతో జాబితాను తయారుచేసి అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే సంజయ్కుమార్ కూడా తన వర్గానికి చెందిన వారి పేర్లతో జాబితాను రూపొందించి అధిష్టానానికి పంపించినట్లు సమాచారం. ఈ రెండు జాబితాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. -
జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన మహిళ..
● కనికరం చూపని వైద్యసిబ్బంది ● ఆస్పత్రి ఎదుటే నిరీక్షించిన వైనం ● మీడియా చొరవతో అడ్మిట్ చేసుకున్న వైద్యులుజగిత్యాల: జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రాగా కనీసం పరీక్షించకుండానే వైద్యులు తిప్పి పంపిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన లక్ష్మీ అనే మహిళ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చింది. ఆమె వెంట ఎవరూ లేకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లి ‘సారూ జ్వరంగా ఉంది. కొంచెం చూడండి.. గోలీ అయినా ఇవ్వండి.. దండంపెడతా..’ అంటూ మొరపెట్టుకుంది. దీనికి వైద్యులు అత్యవసర కేసైతేనే పరీక్షిస్తామంటూ అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో ఒంట్లో సత్తువా లేని లక్ష్మి ఆస్పత్రి ఎదుట ఉన్న బెంచ్పై పడుకుంది. కొందరు పాత్రికేయులు ఆమెను గమనించి.. ఆమె వద్దకు వెళ్లి ఆరా తీశారు. జరిగిన విషయాన్ని ఆమె ద్వారా తెలుసుకుని వైద్యులకు సమాచారం అందించారు. ఆమెను ఎందుకలా వెనక్కి పంపించారని ప్రశ్నించడంతో వైద్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. -
ప్రతిభకు ‘ఉపకారం’
మల్లాపూర్: పేదరికం చదువుకు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు భరోసా కల్పిస్తోంది. ఎనిమిదో తరగతి డ్రాపౌట్స్ను నివారించేందుకు ఏటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)తో ప్రోత్సహిస్తోంది. ఎంపికై న విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఏటా రూ.12వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తోంది. అర్హతలు 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లా పరిషత్, మోడల్, ఎయిడెడ్ తదితర పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్నకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలు ఉండాలి. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతూ ఏడో తరగతిలో జనరల్, బీసీ కులానికి చెందిన వారు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు. జనరల్, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఆన్లైన్లో http//bre.telangana.gov.in ఎస్బీఐ కలెక్టర్ ద్వారా ఫీజు చెల్లించాలి. దరఖాస్తులకు ఈనెల ఆరో తేదీ చివరి గడువు. డిసెంబర్ 7న రాతపరీక్ష ఎన్ఎంఎంఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో విద్యార్థులకు డిసెంబర్ 7న రాత పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో పరీక్ష ఉంటుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష విధానం.. ‘ఎన్ఎంఎంఎస్’ పరీక్ష రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి మెంటల్ ఎబిలిటి (ఎంఏటి), రెండో ది అప్టిట్యూట్ టెస్ట్ (ఎస్ఏటీ). ఇందులో ఏడు, 8వ తరగతి పాఠ్యపుస్తకాల్లోని సైన్స్, గణితం, సామాజి క అధ్యయనాల విభాగాల్లో 90 మార్కులు చొప్పున మొత్తం 180 మార్కులు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఇస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. కనీస అర్హత మార్కులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 32 శాతం కటాఫ్గా నిర్ణయించారు. ఎంపిక సమయంలో రిజర్వేషన్ నిబంధన పాటిస్తారు. నాలుగేళ్లుగా స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు ఏడాది విద్యార్థులు 2021–22 67 2022–23 65 2023–24 64 2024–25 72విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పథకాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 7న నిర్వహించే అర్హత పరీక్షలో ప్రతిభ కనభరిస్తే నాలుగేళ్లపాటు ఏటా రూ.12 వేల చొప్పున అందిస్తారు. రాము, డీఈవో -
నమస్తే సదా వత్సలే..
రాయికల్: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రాయికల్ పట్టణంలో స్వయంసేవకులు సుమారు వెయ్యి మంది శివాజీ చౌక్, గాంధీవిగ్రహం, పాతబస్టాండ్ మీదుగా పథ సంచాలన్ చేపట్టారు. నమస్తే సదా వత్సలే.. అంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాడిన దేశభక్తి గేయాలు ఆకట్టుకున్నాయి. పట్టణ ప్రజలు పూలు చల్లి స్వాగతం పలికారు. హిందూ ధర్మ పరిరక్షణే ఆర్ఎస్ఎస్ ధ్యేయమన్నారు. ఆచార, సంప్రదాయాలను ప్రపంచ దేశాలన్నీ ఆదర్శంగా తీసుకుంటున్నాయని, వాటిని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని, భారతీయులంతా ఐక్యంగా ఉంటూ సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. -
యుద్ధ ప్రాతిపదికన చెరువు మరమ్మతు
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాలరూరల్: వరద తాకిడికి కండ్లపల్లి చెరువు కట్ట ధ్వంసమయ్యే ప్రమాదం ఉండటంతో యుద్ధ ప్రతిపాదికన చెరువు మరమ్మతు పనులు చేపడతామని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి చెరువు కట్టను గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కట్టతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరమ్మతు పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. క్వాలిటీ కంట్రోల్ కన్స్ట్రక్షన్ ఎస్ఈ బుచ్చిరెడ్డి, జగదీశ్వర్తో ఫోన్లో మాట్లాడి కట్ట పరిస్థితిని వివరించారు. పలువురికి పరామర్శ మేడిపల్లి: జెడ్పీ వైస్ చైర్మన్ వొద్దినేని హరిచరణ్రావు అమ్మమ్మ, వెలమ సంఘం సయుక్త కార్యదర్శి రవీందర్రావు తల్లి ఆయిల్నేని లలితమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్ రెడ్డి కుమారుడు చనిపోగా.. వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. -
ప్రజావాణి రద్దు● కలెక్టర్ సత్యప్రసాద్
దాడికి పాల్పడిన నిందితులపై కేసుకోరుట్ల: కోరుట్ల తహసీల్దార్ కార్యాలయ ఆర్ఐ, సిబ్బందిపై దాడి చేసిన సంఘటనలో బాధ్యులైన లారీ ఓనర్, డ్రెవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి ఆదివారం తెలిపారు. ఐదు రోజుల క్రితం ఆర్ఐ రాజేందర్రావు, సిబ్బందితో కలిసి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీని పట్టుకున్నారు. ఈ క్రమంలో లారీ ఓనర్ సింగిరెడ్డి ప్రవీణ్రెడ్డి రెవెన్యూ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు దాడికి పాల్పడ్డారు. వారిపై చర్యలు తీసుకోవడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీనిపై ఈనెల 4న శ్రీమతలబు ఏమిటో శ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించింది. స్పందించిన ఆర్ఐ దాడికి పాల్పడిన వారిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన లారీ ఓనర్ ప్రవీణ్రెడ్డి, డ్రైవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలిమెట్పల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనతోనే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలను సాధించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కాంగ్రెస్పై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉందని, ఈ స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు చిట్నేని రఘు, వడ్డెపల్లి శ్రీనివాస్, చెట్లపల్లి సుఖేందర్, బొడ్ల రమేశ్ తదితరులున్నారు. ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలికథలాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని తాండ్య్రాలలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు, మహిళలకు, యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. సమావేశంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు ఏనుగు జలంధర్రెడ్డి, కథలాపూర్ మహేశ్, పిడుగు ప్రతాప్రెడ్డి, గంగాధర్, శంకర్, అంజయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
662 టీఎంసీలు గోదావరి పాలు
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆ నీటిని ఎప్పటికప్పుడు గోదావరి నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90.138 టీఎంసీలు కాగా.. జూన్ నుంచి ఇప్పటివరకు సుమారు ఏడు రెట్లు అధికంగా నీరు వచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టు నుంచి అన్ని కాలువలకు నీరు విడుదల చేశారు. గేట్ల ద్వారా 662.891 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ఆగస్టులో 188.630 టీఎంసీలు, సెప్టెంబర్లో 391.493 టీఎంసీలు, అక్టోబర్లో 82.768 టీఎంసీలు గోదావరిలోకి వదిలారు. జూన్ నుంచి ప్రాజెక్టులోకి 812.755 టీఎంసీల వరద నీరు చేరగా.. 745.49 టీఎంసీలను వదిలారు. తాగునీటికి 2.515 టీఎంసీ ల నీటిని జగిత్యాల, కోరుట్ల, ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల ప్ర జల దాహార్తి తీర్చేందుకు వినియోగించారు. ప్రతి రోజు 709 క్యూసెక్కుల చొప్పున ఈ ఏడాది ఇప్పటివరకు 5.064 టీఎంసీల నీరు ఆవిరి అయ్యింది. -
హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడానికి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులతో పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి వివరించాలన్నారు. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, బీఆర్ఎస్ శ్రేణులు సమష్టిగా పని చేస్తే ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రతి వర్గానికి మేలు జరిగేలా పాలన అందించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, ఇది కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలను ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వాటిని విస్మరించి ప్రజలను మోసం చేసిందన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని ఆయన స్పష్టం చేశారు. -
సెల్యూట్ ‘108’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండగ. ఆ రోజున పిల్లాపాప అంతా వేడుకల్లో మునిగి తేలుతుంటారు. కానీ.. 108 సిబ్బంది మాత్రం ఎలాంటి పండుగ చేసుకోకుండా ప్రజల ప్రాణాలు కాపాడి మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఎక్కడ నుంచి అత్యవసర పరిస్థితి ఉందని ఫోన్ వచ్చినా ఆ రోజంతా సేవలందిస్తూ.. 108 ప్రాధాన్యం మరోసారి లోకానికి చూపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకం నేటికీ నిరంతరాయంగా ప్రజల ప్రాణాలను కాపాడుతూనే ఉంది. దసరా రోజున సైతం ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్) ఏకంగా 209 అత్యవసర కేసులు స్వీకరించారు. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే 108 సిబ్బంది పండగ రోజు కూడా సెలవు లేకుండా విధులు నిర్వహించి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కాపాడారు. దసరా పండుగ రోజు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా 209 కేసుల్లో 150 మంది బాధితులను కాపాడారు. 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (ఈఎంటీ)53, పైలెట్లు 53మంది పండుగ రోజు కూడా విశ్రమించకుండా మూడు షిఫ్టులలో విధులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ప్రాణనష్టం జరగకుండా ఆసుపత్రికి చేర్చేవరకు వైద్య సేవలు అందించారు. ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో మద్యం ముందస్తు కొనుగోళ్లు విపరీతంగా జరి గాయి. గతేడాది దసరా సమయంలో వారం రోజుల్లో జరిగిన సేల్స్ ఈ ఏడాది మూడు రోజులలోనే మించిపోయాయి. దీంతో మద్యం మత్తులో వాహనాల నడిపి ప్రమాదాలకు గురైన వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ నిర్విరామ విధులతో 108 సిబ్బంది క్షతగాత్రులను కాపాడడంలో నిమగ్నమయ్యారు. సెల్యూట్ 108 అంటూ ప్రజల నుంచి అభినందనలు పొందారు. పండుగలు, ఉత్సవాలు ఏవైనా మాకు సాదారణ రోజులుగానే భావిస్తాం. ప్రమాదాలు జరిగాయని మాకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వారిని కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తాం. గతంలో కన్నా ఈ ఏడాది దసరా రోజు కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మా సిబ్బంది నిర్విరామంగా పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు. – జనార్దన్, ప్రోగ్రాం మేనేజర్ -
కలిసొచ్చిన అవకాశం
జగిత్యాల/జగిత్యాలరూరల్ బీసీలకు ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్ వరంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంతో పోల్చితే సీట్లు పెరిగాయి. ఎంపీపీ, జెడ్పీటీసీతో పాటు, సర్పంచ్ పదవులు బీసీలకు కలిసివస్తున్నాయి. జెడ్పీటీసీ స్థానాలు గతంలో 18 ఉండగా.. అందులో బీసీలకు 5 దక్కాయి. ఈసారి ఏకంగా 9కి చేరాయి. ఎంపీపీ స్థానాలు గతంలో బీసీలకు 4సీట్లు ఉండేవి. అవి ప్రస్తుతం 8కి చేరాయి. సర్పంచుల్లో 385 గ్రామపంచాయతీలకుగాను 79 స్థానాలు దక్కాయి. సీట్లు పెరగడంతో బీసీ సామాజిక వర్గాల నాయకులు టికెట్ల కోసం పైరవీలు కూడా చేస్తున్నారు. దసరా, సద్దుల బతుకమ్మ సెలవులు కలిసిరావడంతో చాలామంది ఊరిబాట పట్టారు. దీంతో ఆశావహులు వారిని ప్రత్యేకంగా కలిసి మద్దతు కోరుతున్నారు. కొన్ని చోట్ల అసంతృప్తి రిజర్వేషన్ల కేటాయింపుతో పోటీకి దూరమైన వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో సర్పంచ్గా కొనసాగిన వారు జెడ్పీటీసీ కావాలని చూశారు. అలాంటివారికి రిజర్వేషన్ అనుకూలించలేదు. ఎంపీపీ పదవి ఆశించిన వారికి రిజర్వేషన్ కలిసి రాక ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ల కేటాయింపు ఇలా.. జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 216 ఉన్నాయి. ఇందులో ఎస్సీ 26, ఎస్టీ 7, బీసీ 52, జనరల్ 41, మహిళలకు 90 కేటాయించారు. జెడ్పీటీసీ 20స్థానాలకు ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 9, జనరల్ 6 కేటాయించారు. ఎంపీపీ 20స్థానాలు ఉండగా.. ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ, జనరల్లో 7 స్థానాలు కేటాయించారు. 385 పంచాయతీలకు ఎస్సీలకు 40, ఎస్టీలకు 27, బీసీలకు 79, జనరల్ 70, మహిళలకు 169 స్థానాలు కేటాయించారు. మహిళలకు ఈ సారి 50 శాతం రిజర్వేషన్ కేటాయించడంతో పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. పోటీపై యువత ఆసక్తి ఎన్నికల్లో యువకులే ఎక్కువగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాల యువత పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం రాక ఇంటి వద్దే ఉంటున్నారు. అలాంటి స్థానిక యువతతో సన్నిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. 2025లో... జెడ్పీటీసీ స్థానాలు : 20 ఎస్సీ : 4 ఎస్టీ : 1 బీసీ : 9 (4 పెరిగాయి) జనరల్ : 6 2019లో... జెడ్పీటీసీ స్థానాలు : 18 ఎస్సీ : 3 ఎస్టీ : 1 బీసీ : 5 జనరల్ : 9 2025లో... ఎంపీపీ స్థానాలు : 20 ఎస్సీలు : 4 ఎస్టీ : 1 బీసీ : 8 (4 పెరిగాయి) జనరల్ : 72019లో... ఎంపీపీ స్థానాలు : 18 ఎస్సీలు : 4 ఎస్టీ : 1 బీసీ : 4 జనరల్ : 9 -
సద్దుల సంబరం
రాయికల్/మెట్పల్లి/కోరుట్లరూరల్: సద్దుల బతుకమ్మను శనివారం సంబరంగా జరుపుకొన్నారు. వివిధ రకాల పూలు సేకరించి.. బతుకమ్మగా తయారుచేసి.. గౌరమ్మకు పూజలు చేశారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ ఆడుకుని నిమజ్జనం చేశారు. రాయికల్ మండలం ఆలూరు, మైతాపూర్, మూటపల్లి, రామాజీపేటలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ ఆడుకున్నారు. జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల్లో ఆటపాటలతో అలరించారు. చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్, సంగెం, చిన్నమెట్పల్లి, జోగిన్పెల్లి, పైడిమడుగులో మహిళలు బతుకమ్మ ఆడారు. మెట్పల్లిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు సతీమణి పాల్గొని మహిళలను ఉత్తేజ పరిచారు. ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ మోహన్, సీఐ అనిల్కుమార్ పరిశీలించారు -
లండన్లో తెలుగు విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా : జిల్లాలోని మేడిపల్లి మండలం దమ్మనపేట్లో విషాదచాయలు అలుముకున్నాయి. దమ్మనపేట్కు చెందిన ఎనుగు మహేందర్ రెడ్డి (26) అనే అనే విద్యార్థి లండన్లో దుర్మరణం చెందాడు. ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్కు వెళ్లిన మహేందర్రెడ్డికి గుండెపోటు రావడంతో మృత్యువాత పడినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నిన్న(శుక్రవారం, అక్టోబర్ 3వ తేదీ) రాత్రి మహేందర్రెడ్డి చనిపోయిన విషయాన్ని అతని స్నేహితులు తండ్రి రమేష్రెడ్డికి తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం లండన్కు వెళ్లాడు మహేందర్రెడ్డి. కుమారడు ప్రయోజకుడు అవ్వడానికి లండన్ వెళ్లి ఇలా మృతి చెందడం కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయారు. -
తెగ తాగేశారు..
జగిత్యాలక్రైం: జిల్లాలో దసరా పండుగ వేడుకల్లో మద్యం ప్రియులు తెగతాగేశారు. ఒకే రోజు రూ.1,49,30,648 మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు రూ.59,79,21,347 మద్యం అమ్మకాలు జరుగగా.. ప్రస్తుతం సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటివరకు రూ.71,82,27,141 అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే రూ.12,03,05,794 అమ్మకాలు పెరిగాయి. మొదట ఎకై ్సజ్ అధికారులు సెప్టెంబర్ మాసంలో వినాయక నిమజ్జనం, దసరా, దుర్గామాత ఉత్సవాలు ఉండటంతో మద్యం అమ్మకాలు తగ్గుతాయని ఊహించినా అంచనాల కంటే ఎక్కువగా మద్యం అమ్మకాలు జరిగాయి. రికార్డుస్థాయి ఆదాయం జిల్లాలో 21 బార్లు, 71 వైన్స్లు ఉన్నాయి. 2024 సెప్టెంబర్లో 49,543 లిక్కర్ కేసులు, 1,31,937 బీరుపెట్టెలు అమ్మగా.. రూ.59,79,21,347 ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్లో జిల్లాలో 58,849 లిక్కర్ కేసులు, 1,21,381 బీరుపెట్టెలు అమ్మగా రూ.71,82,27,141 ఆదాయం వచ్చింది. దీంతో గతేడాది కంటే ఈసారి రూ. 12,03,05,794 రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. గ్రామాల్లో ఏరులై పారిన మద్యం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దసరా వేడుకలకు భారీగా మద్యం ఏరులై పారింది. దసరా రోజు గాంధీ జయంతి ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా రెండు రోజుల ముందు నుంచే వైన్స్ల వద్ద మద్యం ప్రియులు పెద్ద ఎత్తున క్యూలో ఉండి భారీగా మద్యం కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో గత ఏడాది కంటే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. మద్యం అమ్మకాలు పెరిగాయి -
సత్ప్రవర్తనతో జైలు నుంచి బయటకు రావాలి
జగిత్యాలజోన్: ఖైదీలకు జైలు జీవితం ఒక గుణపాఠంగా మారి, సత్ప్రవర్తనతో జైలు నుంచి బయటకు రావాలని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి మల్లిక్ వెంకటసుబ్రమణ్యశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలులో గురువారం నిర్వహించిన ఖైదీల దినోత్సవంలో మాట్లాడారు. తెలి సోతెలియకో నేరాలు చేసి జైలుకు రావడం వల్ల కు టుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని అన్నారు. ఇకనైనా తప్పులు చేయకుండా సమాజంలో మంచి నడవడిక కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఖైదీలకు అందుతున్న వసతులు, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైలర్ మొగిలేశ్, హెడ్ వార్డర్ మజారొద్దీన్, జిల్లా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కట్కం చంద్రమోహన్, జైలు సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు. కొండగట్టు ఈవోపై ఎమ్మెల్యే ఆగ్రహంమల్యాల: కొండగట్టు ఆలయ ఈవో ప్రవర్తనపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దసర పండుగ పురస్కరించుకొని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గరుడ సేవ, శమీ పూజలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే వాహనానికి ఆలయ రాజగోపురం ఎదుట పూజ చేయించేందుకు వాహనం తీసుకువచ్చారు. ఆలయం వెనుక వైపు వాహన పూజ చేసుకోవాలని ఈవో శ్రీకాంత్రావు సూచించడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అర్చకులు ఎమ్మెల్యే వాహనానికి పూజ చేయడంతో వివాదం సద్గుమణిగింది. -
అన్నిస్థానాలు గెలవాలి
సాక్షి ప్రతినిది, కరీంనగర్: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ గెలవాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులంతా గాంధీభవన్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేతృత్వంలో స్థానిక సంస్థల అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలాలు, బలహీనతలు, అనుకూలతలు, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావులతోపాటు ప్రణవ్బాబు (హుజురాబాద్), వెలిచాల రాజేందర్ రావు (కరీంనగ ర్), అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి (కరీంనగర్), కేకే మ హేందర్రెడ్డి (సిరిసిల్ల) తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇలా అభ్యర్థుల ఎంపికపై కూలంకుశంగా చర్చ జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే అప్పగించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే స్థానికంగా బలాల ఆధారంగా ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. జెడ్పీటీసీల విషయంలోనూ డీసీసీ అధ్యక్షులు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి పీసీసీ అధ్యక్షుడికి పంపుతారు. అధిష్టానం రహస్యంగా సర్వే నిర్వహించి, నలుగురిలో ఒకరి పేరును ఖరారు చేస్తారు. అభ్యర్థుల జాబితాను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయంపైనా చర్చించారు. 42శాతం రిజర్వేషన్లకు అన్నిపార్టీలు తమ సానుకూలత వ్యక్తం చేశాయని, కోర్టు తీర్పు అనుకూలంగానే వస్తుందని సానుకూలత వ్యక్తం చేశారు. తీర్పు ప్రతికూలంగా వస్తే.. ఎలా వ్యవహరించాలో కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి హాజరై తాను సిద్ధం చేసిన జాబితాను అందజేసినట్లు తెలిసింది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మాజీమంత్రి జీవన్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. సంజయ్ చేరికను ఆదినుంచి వ్యతిరేకిస్తున్న జీవన్రెడ్డి.. తన వర్గీయులకు ఎలాగైనా టికెట్ ఇప్పించుకోవాలన్న పంతంతో ఉన్నారు. వీరిద్దరి విషయంలో ఎవరి జాబితా ఖరారు చేస్తారన్న విష యం అధిష్టానానికి చూసుకుంటుందని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. కోర్టు తీర్పు.. సంజయ్ జాబితాపై చర్చ -
మతలబు ఏమిటో?
మామూళ్ల మతలబు..!?కోరుట్ల: ‘నవ్విపోదురు గాక.. మాకేంటి..’ అన్న నానుడిని గుర్తు తెస్తుంది కోరుట్ల రెవెన్యూ అధికారుల తీరు. మూడు రోజుల క్రితం ఇసుక వ్యాపారి ఒకరు రెవెన్యూ సిబ్బందిపై దాడి చేసి కొట్టడం..సెల్ఫోన్ లాక్కున్న సంఘటన జరిగింది. ఈ దాడి వీడియో సైతం వైరల్ అవుతోంది. ఇంత జరిగినా రెవెన్యూ అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఇప్పటి వరకు రెవెన్యూ నుంచి పోలీసులకు ఫిర్యాదు ఎందుకు రాలేదన్న విషయం చర్చనీయంగా మారింది. దీని వెనుక అసలు మతలబు ఏమిటన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. దాడి సమయంలో సదరు వ్యక్తి రెవెన్యూ మామూళ్ల ప్రస్తావన తీయడం.. ఈ విషయం ఎక్కడ బయటకు వస్తుందోనన్న కారణంగానే దాడి జరిగినా సిబ్బంది ఉలుకుపలుకు లేకుండా పిర్యాదు చేయడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లెక్క లేని లారీలు.. కోరుట్ల మండలం నాగులపేట సరిహద్దుల్లో కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి–బొమ్మెన శివారు వాగులో పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. తక్కళ్లపల్లి బొమ్మెన వాగు నుంచి నాగులపేట, సంగెం గ్రామాల మీదుగా కోరుట్ల శివారులో ఉన్న జాతీయ రహదారిపైకి ఇసుక లారీలు వస్తాయి. అక్కడి నుంచి జగిత్యాల, మెట్పల్లి, ఆర్మూర్ వైపు లారీలు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా సరాఫరా అవుతోంది. ప్రతీరోజు సాయంత్రం 6–7 గంటల సమయంలో కథలాపూర్ మండలం తక్కళ్లపల్లి–బొమ్మెన వాగు నుంచి ఇసుక తెచ్చుకోవడానికి పదుల సంఖ్యలో లారీలు కోరుట్ల జాతీయ రహదారి మీదుగా వెళ్తాయి. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు వాగులో ఇసుక నింపుకున్న లారీలు వరుసగా మళ్లీ కోరుట్లకు చేరుకుని నాగులపేట క్రాసింగ్ వద్ద జాతీయ రహదారి మీదుగా జగిత్యాల, మెట్పల్లి, ఆర్మూర్ పట్టణాలకు ఇసుక తరలివెళ్తున్నాయి. ఈ విషయం ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెబుతారు. కానీ కథలాపూర్, కోరుట్ల రెవెన్యూ అధికారులకు మాత్రం అక్రమ ఇసుక లారీల ఆచూకీ కనిపెట్టడం గగనతరంగా మారింది. లింకులు వెలుగులోకి.. ఇసుక అక్రమార్కులతో కోరుట్ల రెవెన్యూ సిబ్బందిలో కొందరికి ఉన్న లింకులు మూడు రోజుల క్రితం జరిగినా దాడి ఘటనతో వెలుగులోకి వచ్చాయి. దాడి సమయంలో సదరు వ్యక్తి మాముళ్ల ప్రస్తావన పదేపదే తెస్తూ గట్టిగా అరవడం గమనార్హం. కోరుట్ల, కథలాపూర్ పరిసరాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారికి రెవెన్యూ సిబ్బందితో లింకులు ఉన్నాయన్న అంశం ఈ సంఘటనతో తేటతెల్లమయింది. రెవెన్యూ సిబ్బంది అండతో ఇసుక అక్రమ రవాణాదారులు గ్రూపులుగా మారి తమలో తామే ఆరోపణలు చేసుకోవడం గమనార్హం. ఈక్రమంలో కొంత మంది రెవెన్యూ సిబ్బంది రాత్రివేళ ఓ గ్రూపు ఇసుక అక్రమార్కుల కారుల్లోనే నిఘా కోసం తిరుగుతూ ఎదుటి గ్రూపుల వారి ఇసుక లారీలు పట్టుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. చివరికి రెండు గ్రూపులు మామూళ్ల సెటిల్మెంట్ చేసుకునే వరకు వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాత్రివేళ నిఘా పేరిట ఇసుక అక్రమ రవాణాదారులతో కలిసి విందులు చేసుకోవడం ఇక్కడ షరామాములుగా మారింది. ఫలితంగానే రెవెన్యూ సిబ్బందిపై ఇసుక అక్రమార్కులకు కొంత చులకన భావం ఏర్పడిందన్న వాదనలు ఉన్నాయి. ఈక్రమంలోనే రెవెన్యూ సిబ్బంది మొక్కుబడిగా అడపదడపా ఇసుకను పట్టుకుంటే ఇలాంటి దాడులు చోటు చేసుకుంటున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత బహిరంగంగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్న క్రమంలో రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలియదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కథలాపూర్, కోరుట్ల మండలాల రెవెన్యూ సిబ్బంది, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. వారానికి ఒక రోజు తూతూ మంత్రంగా ఓ లారీని పట్టుకుని రూ.20–30 వేల జరిమానా వేసి వదిలేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో లారీలు వెళ్తున్నా కేవలం వారానికి ఒకటి రెండుకు మించి రెవెన్యూ సిబ్బందికి దొరకడం లేదంటే దీని వెనుక మామూళ్ల మతలబు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
గాంధీజీ సిద్ధాంతాలను ఆచరించాలి
గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్ నివాళి అర్పిస్తున్న ఎస్పీ అశోక్కుమార్జగిత్యాలటౌన్: గాంధీ మహాత్ముడు సూచించిన అహింసా, శాంతి మార్గాన్ని అందరూ అనుసరించి ఆచరించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్లత, డీడబ్ల్యూవో నరేశ్, బీసీ సంక్షేమ అదికారి సునీత, మెప్మా పీడీ శ్రీనివాస్గౌడ్, హకీం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయంలో.. జగిత్యాలక్రైం:జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్కుమా ర్ మాట్లాడుతూ అహింసతో అఖండ భారతావనికి స్వాతంత్య్రం తీసుకవచ్చిన మహాత్ముడు గాంధీజీ అని అన్నారు. ఆయన సిద్ధాంతాలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ ఆరీఫ్ అలీఖాన్, ఆర్ఐ కిరణ్కుమార్, సైదులు, ఆర్ఎస్సైలు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
హైదరాబాద్ టీ–20 మహిళల జట్టులో శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్/ఇల్లంతకుంట(మానకొండూర్): హైదరాబాద్ మహిళల టీ–20 క్రికెట్ జట్టులో కరీంనగర్కు చెందిన క్రీడాకారిణి కట్ట శ్రీవల్లి చోటు సంపాదించింది. హైదరాబాద్ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ జట్టును క్రికెట్ సంఘం బాధ్యులు బుధవారం ప్రకటించారు. అక్టోబర్ 8 నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బీసీసీఐ టీ20 టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే హైదరాబాద్ సీనియర్ మహిళల జట్టులో శ్రీవల్లి చోటు దక్కించుకుంది. శ్రీవల్లి ఎంపికపై కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగం రావుతోపాటు తల్లిదండ్రులు కట్ట ఉమా–లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవల్లి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం. మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలిమల్లాపూర్ : మహిళలు ఆరోగ్యంపై దృష్టి సారించాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. 128మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, నేషనల్ హెల్త్ మిషన్ అధికారి రవీందర్, మండల వైద్యాధికారి వాహిని, పీహెచ్సీ సీహెచ్వో రామ్మోహన్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
● మరో బాలుడికి తీవ్రగాయాలు ● వైద్యుల నిర్లక్ష్యమేనంటూ వైద్య సిబ్బందిపై దాడి జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో.. జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఓ బాలుడు మృతిచెందాడు. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన తూర్పాటి శశికుమార్ (16), మోతె తరుణ్ ద్విచక్రవాహనంపై జగిత్యాలకు వస్తున్నారు. తాటిపల్లి శివారులో వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం వీరిని ఢీకొంది. ఈ ఘటనలో బైక్ అదుపుతప్పి శశికుమార్, తరుణ్ కింద పడ్డారు. వారిని స్థానికులు 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శశికుమార్ మృతిచెందాడు. శశికుమార్ మృతికి వైద్యులు, వైద్య సిబ్బంది కారణమని బంధువులు, కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోగుల బంధువులతో మాట్లాడారు. పట్టణ సీఐ కరుణాకర్ను వివరణ కోరగా.. గొడవ నిజమేనని, ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలురాయికల్: మండలంలోని అల్లీపూర్ బుధవారం సాయంత్రం బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో సింగర్రావుపేటకు చెందిన జైనొద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించి కేసు విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బందిపై దాడి..?కోరుట్ల: లారీలు, టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిని అడ్డుకున్నందుకు మంగళవారం రాత్రి ఓ వ్యక్తి రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. కోరుట్ల మండలం నాగులపేట సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో ఇసుకను అక్రమంగా తీసుకెళుతున్న లారీని నలుగురు రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి శ్రీడబ్బులు తీసుకుంటున్నారు.. మళ్లీ ట్రాక్టర్లు పట్టుకుంటున్నారు..శ్రీ అని ఆరోపిస్తూ గొడవకు దిగినట్లు ఓ కిందిస్థాయి ఉద్యోగిపై దాడికి పాల్పడినట్లు తెలిసింది. నలుగురు రెవెన్యూ సిబ్బంది సదరు వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. వీరిలో ఓ కిందిస్థాయి ఉద్యోగికి ఇసుక అక్రమ రవాణాదారులతో ఉన్న సంబంధాల ఫలితంగానే అక్రమార్కులు రెచ్చిపోతున్నట్లు సమాచారం. టిప్పర్ను అడ్డుకున్న వారిలో సదరు ఉద్యోగి ఉన్నట్లు తెలిసింది. ఈ గొడవ జరిగిన వెంటనే రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు టిప్పర్ను స్వాధీనం చేసుకుని రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఆర్టీసీ డిపోలో ఉంచినట్లు తెలిసింది. నలుగురు రెవెన్యూ సిబ్బందిలో ఇద్దరు వారసత్వంగా పనిచేస్తున్న వారు కావడంతో పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయాలన్న విషయంలో మీమాంస నెలకొన్నట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు దాడి జరిగిన ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై చిరంజీవి తెలిపారు. -
జగిత్యాల, మోతె మైత్రికి చిహ్నం జంబిగద్దె
● విజయనగరం తర్వాత జగిత్యాలలోనే గద్దె ● నేడు దసరా... ఏర్పాట్లు పూర్తిజగిత్యాల: జిల్లా కేంద్రంలోని జంబిగద్దెకు ప్రత్యేక స్థానం ఉంది. జగిత్యాల, మోతె ప్రజలు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో పట్టణంలోని అశోక్నగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా జంబిగద్దెను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో అప్పటి రాజులు అక్కడ జంబిగద్దెను నిర్మించినట్టుగానే ఇక్కడ కూడా అలాగే నిర్మించారు. ఏటా విజయదశమి రోజున జంబిగద్దె వద్ద జంబిచెట్టును ఏర్పాటు చేసి పూజ చేస్తారు. అనంతరం ప్రజలందరూ జంబి పెట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జంబిగద్దె వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కలర్లు వేయించారు. రంగురంగుల విద్యుద్దీపాలు అమర్చినట్లు కమిషనర్ స్పందన తెలిపారు. జిల్లాకేంద్రానికే ప్రత్యేకత మోతె, జగిత్యాల ప్రజలు ఎళ్లప్పుడు స్నేహపూర్వకంగా ఉండాలని జంబిగద్దెను నిర్మించారని పూర్వీకుల నుంచి వస్తున్న మాట. విజయనగరంలోనూ ఇలాగే ఉంది. ప్రతి విజయదశమి రోజున ఇక్కడ శమీ పూజలు నిర్వహిస్తారు. – కౌశిఖ వేణుగోపాలాచార్యులు, వేదపండితులు రాజరాజేశ్వరిగా అమ్మవారుధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం రాజరాజేశ్వరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చండీహోమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు. ఆలయ ఈవో శ్రీని వాస్, చైర్మన్ జక్కు రవీందర్ తదితరులున్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
జగిత్యాలటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటర్లు లేనిచోట రిజర్వేషన్లుజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మాజీపేట గ్రామం ఓసీ మహిళకు కేటాయించగా ఓసీ ఓటరు ఒక్కరే ఉన్నారు. కన్నాపూర్ గ్రామం ఓసీ మహిళకు కేటా యించగా అక్కడ ఓసీ ఓటర్లు వందశాతం లేరు. వడ్డెరకాలనీ జనరల్కు కేటాయించగా అక్కడ జనరల్ ఓటర్లు వందశాతం లేరు. వంజరిపల్లి జనరల్ చేయగా ఒక్క ఓటరు కూడా జనరల్ ఓటరు లేరు. -
దావత్ షురూ!
‘తమ్మీ.. మన కులపెద్ద మనుషులతో మాట్లాడు.. దసరాకు యాటను కొనిస్త.. మీ కులసంఘంలోని ప్రతీఇంటికి పోగు చేరేలా నువ్వే చూసుకో.. ముఖ్యమైనోళ్లు ఉంటే చెప్పు.. వారికి క్వార్టర్ మందు కూడా ఇద్దాం.. ఎన్నికలప్పుడు ఓటుకు పైసలు గూడా ఇచ్చుడే.. కానీ గంపగుత్తగా ఓట్లు నాకే పడాలే.. మల్లా ఎవరికీ మాటివ్వకు’ – ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ స్థానం ఆశావహుడి ఆఫర్ ‘అన్నా.. పార్టీలో కొన్నేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న.. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీతోనే ఉన్న.. ఇప్పుడు రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఎమ్మెల్యే కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిండు.. ఎంతఖర్చయినా పర్లేదు పెడత.. నాకు ఫుల్సపోర్ట్ జేస్తే.. జెడ్పీటీసీగా గెలుస్త’ – ముఖ్య నేతలతో దావత్ ఇస్తూ ఓ జెడ్పీటీసీ ఆశావహుడి వేడుకోలుసాక్షి పెద్దపల్లి: ఎన్నికలు అంటే సుక్క.. దసరా అంటే ముక్క.. ఇప్పుడు ఈ రెండు పెద్దపండుగలు కలిసే వచ్చా యి. పైగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పండుగ సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు ప్రలో భాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కులపెద్దలు, నలుగురిని ప్రభావితం చేసే కార్యకర్తలను మద్యంతో దావత్లు షురూ చేశారు. దసరా సందర్భంగా ఓటర్లకు మటన్పోగులు పంచిపెడుతూ ఖుషీ చేసేందుకు గ్రౌండ్వర్క్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరికొందరు దసరా పండుగ రోజు రావణవధ కార్యక్రమాన్ని తమ సొంత డబ్బుతో భారీఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. మామూళ్లతో ముచ్చెముటలు తెలంగాణలో అతి పెద్దపండుగ దసరాకు నేతలు, ఊరులో పలుకుబడి కలిగినవారు తమ అనుచరులకు, తమ వద్ద పని చేసుకునేవారికి పండుగ సందర్భంగా ఎంతోకొంత దావత్ చేసుకునేందుకు డబ్బు లు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. పండుగ సమయంలోనే ఎన్నికలు రావడడంతో అడిగిన ప్రతీఒక్కరికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. ఊళ్లకు లిక్కర్.. యథేచ్ఛగా బెల్ట్షాప్ల రన్ దసరా పండుగ రోజు వైన్స్షాప్లు మూసిఉంటాయి. ఆరోజు మహాత్మా గాంధీ జయంతి కావడంతో మాంసం, మద్యం విక్రయాలు ఉండవు. దీంతో తొలుత లిక్కర్ను పల్లెల్లోని బెల్ట్షాపులకు తరలిస్తుండగా, మరికొందరు నేతలు వైన్స్ షాప్లకు అడ్వాన్స్ చెల్లించి క్వార్టర్స్ను తమకు నమ్మకస్తుడైన లీడర్లకు చెందిన నివాసాలు, వ్యవసాయ పొలాల్లోకి డంప్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కోడ్ అమల్లోకి వచ్చినా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లెల్లో బెల్ట్షాపులు 24గంటలపాటు తెరిచే ఉంటున్నాయి. ఎన్నికల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయనే ఆశతో బెల్ట్షాపు వ్యాపారులు భారీగా మద్యం డంప్ చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.ఆశావహులు తమ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయా రాజకీయ పార్టీల్లోని ఆశావహులు.. కులసంఘాల ఆధారంగా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కులంలో ఉన్నఓట్ల ఆధారంగా యాటలను కోయించి, ఇంటింటికీ మటన్ పోగులు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. పండుగపూట మచ్చిక చేసుకోకపోతే ఎన్నికల్లో ఫలితం బెడిసి కొడుతుందని.. ఒకరినిచూసి మరొకరు మద్యం, మాసం పంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయో, వాయిదా పడుతాయో అనే సందిగ్ధంలో ఉన్నా.. అశావహులు ఖర్చుకు భయపడకుండా వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వెనకాడడంలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీసీ, 646 ఎంపీటీసీలు, 1,226 పంచాయతీల్లో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ప్రకృతిపై గొడ్డలివేటు
గోదావరిలో నిమజ్జనంబతుకమ్మతో యువతులుజగిత్యాల: జిల్లాకేంద్రంలోని ధర్మపురిలో ఉన్న ఎస్కేఎన్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దాదాపు 35 ఎకరాలకు పైన విస్తరించి ఉంటుంది. చుట్టూ ఆహ్లాదకరమైన చెట్లు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్తో పాటు, విద్యార్థులకు తరగతి గదులు నిర్మించారు. ఏళ్లకాలంగా చదువుల కోవెలగా పేరుగాంచింది. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడి చెట్ల కిందే విద్యావంతులు అయ్యారు. కళాశాల ఆవరణలో రూ.35కోట్లతో మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సమీపంలోనే దీన్ని నిర్మిస్తున్నా రు. ఇందుకోసం ఇప్పటి వరకు ఏపుగా పెరిగిన తొమ్మిది చెట్లను తొలగించారు. పట్టణ ప్రజల కోసమని చెప్పి కళాశాలలోవాటర్ ట్యాంక్ నిర్మించడంతో అసౌకర్యంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎడమవైపు దాదాపు 9 గుంటల స్థలంలో పెద్దవాటర్ ట్యాంక్ నిర్మిస్తుండడంతో భవిష్యత్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇబ్బంది ఏర్పడుతుందని చెబుతున్నారు. కళాశాలలో చాలా మంది వాకర్స్ వాకింగ్ చేస్తుంటారు. వారకీ అసౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ట్యాంక్ నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతున్నారు. -
రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు
జగిత్యాల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తొలి విడతలో 10 మండలాలు, రెండో విడతలో 10 మండలాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వెబ్కాస్టింగ్ నిర్వహణ, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత బలగాలు ఉండేలా చూడాలన్నారు. సోషల్ మీడియాను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్పేపర్లు సిద్ధంగా ఉన్నాయని, సిబ్బంది ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి అన్ని వసతులున్నాయో లేదో చూసుకోవాలన్నారు. మండలకేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, నామినేషన్ల స్కృటిని, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ అందించాలన్నారు. అధికారులకు పాటించాల్సిన నిబంధనలు, విధులపై అవగాహన ఉండాలన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులను నియమించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నోడల్ అధికారిని నియమించాలన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రీపోలింగ్ జరగకుండా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, డీపీవో మధన్మోహన్ పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ పాటించాలి ఎన్నికల కోడ్ పాటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన గోడ రాతలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని కోరారు. ఎన్నికల నిబంధనలకు లోబడి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇబ్బందులుంటే కలెక్టరేట్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 96662 34383 నంబర్ను సంప్రదించాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జెడ్పీ సీఈవో గౌతమ్రెడ్డి, డీపీవో మదన్మోహన్ పాల్గొన్నారు. -
200 రకాల నైవేద్యం
సింహ వాహనంపై నృసింహుడుసిద్దిధాత్రిగా అమ్మవారుమెట్పల్లి:మెట్పల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఆలయంలో మంగళవారం పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి 200 రకాల ఫలహారాలు తయారు చేసి, నైవేద్యంగా సమర్పించారు.ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం యోగ, ఉగ్ర శ్రీలక్ష్మీనృసింహస్వాములను సింహ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, అర్చకులు పాల్గొన్నారు.ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో దసరా నవరాత్రోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. 9వ రోజు మంగళవారం అమ్మవారు సిద్దిధాత్రి రూపంలో దర్శనమిచ్చారు.చిలుక వాహనంపై శ్రీవారు కోరుట్ల: పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర, అష్టలక్ష్మీ ఆలయాల్లో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అష్టలక్ష్మి ఆలయంలో లక్ష్మీనారాయణుడు చిలుక వాహనంపై, వేంకటేశ్వరస్వామి సింహవాహనంపై ఊరేగారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు యతిరాజం నర్సయ్య, బురుగు రామస్వామిగౌడ్ పాల్గొన్నారు.బీర్పూర్ నృసింహస్వామికి శేషవాహనసేవసారంగాపూర్: ప్రముఖ పుణ్యక్షేత్రం బీర్పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం సన్నిధిలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారిని, అమ్మవారిని శేషవాహనంపై ఊరేగించారు. భక్తుల నృసింహ నామస్మరణలతో క్షేత్ర కొండలు మార్మోగాయి. -
సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి
రాయికల్: సనాతన ధర్మం పరిరక్షణే ఆర్ఎస్ఎస్ ధ్యేయమని జిల్లా కార్యవాహ్ గోల్కొండ నాగరాజు అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో మంగళవారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శతజయంతి సందర్భంగా విజయదశమి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణే ఆర్ఎస్ఎస్ ధ్యేయమన్నారు. ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందిస్తామన్నారు. ప్రపంచ దేశాలు భారత ఆచార సాంప్రదాయాలను ఆదర్శంగా తీసుకుంటే, కొన్ని ఉగ్రవాద శక్తులు విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, దానికి కొన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామియాదవ్, స్వయం సేవకులు చిలువేరి రామస్వామి, పుల్ల కిషన్, శంకర్, గంగాధర్, భూమన్న, గుగ్గిళ్ల రాము, శేఖర్, రవి, కిషన్ పాల్గొన్నారు. -
ఇక సంగ్రామమే..
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్ కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్) సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్) జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్) పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంకు భిన్నంగా... ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది. కోర్టులో ఉండడంతో.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 39 00 73 58 170 సిరిసిల్ల 25 07 56 35 123 జగిత్యాల 26 07 52 41 126 పెద్దపల్లి 25 03 59 50 137జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం సిరిసిల్ల 53 30 101 76 260 జగిత్యాల 68 31 153 133 385 పెద్దపల్లి 54 06 110 93 263 కరీంనగర్ – – – – –జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 03 00 06 06 15 సిరిసిల్ల 03 01 05 03 12 జగిత్యాల 04 01 08 07 20 పెద్దపల్లి 05 03 00 05 13 -
స్థానిక పోరుకు ఏర్పాట్లు
● రెండు దశల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ● రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలుజగిత్యాల: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత వివరాలు ప్రకటించారు. 9న నోటిఫికేషన్ విడుదలవుతుందని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 23, 27 తేదీల్లో రెండు దశల్లో నిర్వహించనుండగా.. కౌంటింగ్ నవంబర్11న ఉంటుందన్నారు. సర్పంచ్ ఎన్నికలు 10 మండలాలు ఫేస్–2లో.. మరో 10 మండలాలు ఫేస్–3లో జరుగుతాయని తెలిపారు. ఎస్పీ అశోక్కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాలు ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో.. జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మలా ల, ధర్మపురి, బుగ్గారం కండ్లపల్లి మోడల్స్కూల్లో.. రాయికల్, సారంగాపూర్, బీర్పూర్ ఇబ్రహీంపట్నం మోడల్స్కూల్లో.. మల్లాపూర్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కల్లూరు మోడల్స్కూల్లో... కోరుట్ల, బీమారం, మేడిపల్లి గొల్లపల్లి మోడల్స్కూల్లో... గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్, ఎండపల్లి రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 4 వరకు మండలాలు : మేడిపల్లి, బీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 8 వరకు మండలాలు : ధర్మపురి, బుగ్గారం, మల్యాల, కొడిమ్యాల, ఎండపల్లి, వెల్గటూర్, జగిత్యాలరూరల్, జగిత్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మొదటి విడత పోలింగ్ 10 నుంచి 108 ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాలు 554మండలాలు: బీర్పూర్, రాయికల్, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి, బీమారం, కథలాపూర్, కోరుట్ల, మేడిపల్లి రెండో విడత పోలింగ్ 10 నుంచి 108 ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రాలు 569మండలాలు: బుగ్గారం, ధర్మపురి, ఎండపల్లి, జగిత్యాల, జగిత్యాలరూరల్, కొడిమ్యాల, మల్యాల, పెగడపల్లి, వెల్గటూర్, గొల్లపల్లిగ్రామపంచాయతీలు 385వార్డులు 3,536పోలింగ్ కేంద్రాలు 3,536పోలింగ్ లొకేషన్స్ 477క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 244సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు 1361మండలాలు 20జెడ్పీటీసీ స్థానాలు 20ఎంపీటీసీ స్థానాలు 216ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలు 1123పోలింగ్ లొకేషన్స్ 416ఓటర్లు 6,07,263పురుషులు 2,89,266మహిళలు 3,17,988ఇతరులు 9జెడ్పీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్లు 20+ (4 రిజర్వ్) ఎంపీటీసీ రిటర్నింగ్ ఆఫీసర్లు 70+ (14 రిజర్వ్) జోనల్ ఆఫీసర్లు 70+ (14 రిజర్వ్) -
అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి
పెగడపల్లి: మండలంలోని నామాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) ఐలయ్య (38) చికిత్స పొదుతూ మృతి చెందాడు. ఈనెల 25న మల్యాలలో జరిగిన ఎన్నికల శిక్షణలో పాల్గొన్న ఆయన అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఐలయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఐలయ్య మృతిపై తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాద్రావు సానుభూతి తెలిపారు. ఐలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. పోతారంలో వివాహిత అదృశ్యంమల్యాల: మండలంలోని పోతారానికి చెందిన దాసరి లత అదృశ్యమైనట్లు ఆమె భర్త రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. రవీందర్ ఈనెల 25న మర్రిపల్లిలో ఉన్న తన కూతురు ఇంటికి కొడుకుతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికే ఆయన భార్య లత ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రవీందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంథనిరూరల్: పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్నుంచి అక్రమంగా తరలిస్తున్న యూరియాను అడవిసోమన్పల్లి చెక్పోస్ట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. యూరియా అక్రమ రవాణాను నియంత్రించేందుకు అడవిసోమన్పల్లి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అయితే, సోమవారం ఓ మినీ వాహనంలో సుమారు 50 యూరియా బస్తాలు తరలిస్తుండగా సిబ్బంది తనిఖీ చేశారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని మంథనికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యజమానికి జరిమానా విధించారు. ఇందిరమ్మ చీరలు ఎక్కడ?● ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ● బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్రావు జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ప్రజలను విస్మరిస్తోందని, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, రూ.800 బతుకమ్మ చీరలు ఎక్కడిచ్చారని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్రావు ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రూ.4 వేల పెన్షన్, రైతులకు బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ అని ప్రశ్నించారు. మాజీ కౌన్సిలర్ దేవేందర్నాయక్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు మెట్పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని విద్యాసాగర్రావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఐక్యంగా పని చేస్తే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. -
సరస్వతీమాతగా అమ్మవారు
గరత్మంతుని వాహనంపై లక్ష్మీనృసింహుడుమల్యాల: దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సరస్వతీ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామచంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ధర్మపురి: శరన్నవరాత్రోత్సోవాల సందర్భంగా సోమవారం సాయంత్రం యోగ, ఉగ్ర శ్రీలక్ష్మీనృసింహస్వాములను గరత్మంతుని వాహనంపై ఊరేగించారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మహాగౌరిగా అమ్మవారుధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సోమవారం మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో 8వ రోజు చండీపారాయణం, దేవి భాగవత పారాయణం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు హాజరయ్యారు. -
ఎకై ్సజ్ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..
చిగురుమామిడి: కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి సాయికీర్తన ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సీఎం రేవంత్రెడ్డి నుంచి నియామకపుపత్రం అందుకున్నారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. గ్రూపు– 2 ద్వారా ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా గ్రూప్–1 పరీక్ష రాసి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. నిజామాబాద్లో బీడీఎస్ పూర్తిచేసి.. ఏడాదిపాట ప్రాక్టీస్ చేసినా సంతృప్తి చెందలేదలేదు. ఏడాదిపాటు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాసి.. ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సాయికీర్తన తల్లిదండ్రులు సరోజన– సంపత్కు సాయికీర్తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. -
ఒక్కేసి పువ్వేసి చందమామ..
జగిత్యాలటౌన్/జగిత్యాలరూరల్/కోరుట్ల/సారంగాపూర్/ పెగడపల్లి/మల్యాల:ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్కజాములాయే చందమామ.. అంటూ మహిళలు బతుకమ్మ ఆడిపాడారు. ఉదయమే లేచి రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి సాయంత్రం కూడళ్లలో ఆడుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. జిల్లాకేంద్రంలోని ధరూర్ క్యాంపు రామాలయం, మోతె చెరువు, చింతకుంట చెరువు, కండ్లపల్లి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పోయిరా గౌరమ్మా.. మళ్లీ రావమ్మా.. అంటూ వీడ్కోలు పలికారు. -
దుబాయ్లో బతుకమ్మ సంబరాలు
రాయికల్: దుబాయ్లో ఈటీసీఏ ఆధ్వర్యంలో అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్ బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. యూఏఈలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5 వేల మంది ప్రవాసీలు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఈటీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు పీచర్ల కిరణ్కుమార్, అధ్యక్షుడు చీటి జగదీశ్వర్రావు, జనరల్ సెక్రటరీ కోట్ల రాణి, ఉపాధ్యక్షుడు అలిగేటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరి శేఖర్గౌడ్, కోశాధికారి తిరుమల్ పాల్గొన్నారు. దుర్గమ్మకు బోనమెత్తిన భవానీలుధర్మపురి: దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా భవానీలు ధర్మపురిలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం దుర్గమ్మ బోనాలతో శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం నుంచి నందీకూడలి మీదుగా శోభాయాత్రగా వెళ్లారు. ఉదయం రుద్రాభిషేకం, సరస్వతీపూజలు చేశారు. -
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రై ం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గ్రీవెన్స్లో భాగంగా వివిధ ప్రాంతాల 12 మంది దరఖాస్తులు సమర్పించారు. వారితో ఎస్పీ నేరుగా మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీకి 3.50 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లోజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో 39 గేట్లను ఎత్తి 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 3.59 లక్షల క్యూసెక్కుల నీటిని వివిధ మార్గాల ద్వారా విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు నాలుగు వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, సరస్వతి కెనాల్కు 400, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. మాజీ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ సస్పెండ్ జగిత్యాల: జగిత్యాల రూరల్ మండల మాజీ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వచ్చే జెడ్పీటీసీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరగా.. తనను ఎవరు రమ్మన్నారంటూ అవమానించి బయటకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 23 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని, కుట్రతో ఇలా చేశారని, కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఫ్లెక్సీ చించినందుకు తనపై కక్షగట్టారని తెలిపారు. సేవకులకు వేతనాలు పెంపుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ఏళ్ల తరబడి వివిధ రకాల సేవలందిస్తున్న తాత్కాలిక సేవకులకు (బోయలు) వేతనాలు పెంచుతూ సోమవారం జీవో జారీ అయింది. ఆలయంలో పనిచేసే 12 మంది తాత్కాలిక సేవకులకు ప్రస్తుతం రూ.14వేల వేతనం వస్తుండగా.. దానిని రూ.17,500 వరకు పెంచుతున్నట్లు జీవో జారీ అయ్యింది. జీవో పత్రాలను మంత్రి అడ్లూరి చేతులమీదుగా పంపిణీ చేశారు. -
విశ్వవిపణిలోకి సింగరేణి
గోదావరిఖని: దసరా పండగకు ముందే ప్రభుత్వం సింగరేణికి శుభవార్త చెప్పింది. ఫ్యూచర్ సిటీలో పదెకరాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభలో ప్రకటించడంతో ప్రపంచస్థాయి వ్యాపార విస్తరణకు మార్గం సుగమమైనట్లయ్యింది. అయితే, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేస్తేనే స్థలం అప్పగిస్తామని సీఎం కండిషన్ పెట్టారు. ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడే అవకాశం సింగరేణికి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహారత్న కంపెనీలకు దీటుగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సింగరే ణి వరుస లాభాలతో మహారత్న కంపెనీలకు ధీటు గా ముందుకు సాగుతోంది. సుమారు 41వేల మంది పర్మినెంట్, మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులతో ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. దీంతోపాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోనూ దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో వ్యాపారాలను మరింతగా విస్తరించేందుకు యోచిస్తోంది. ఇప్పటికే గోల్డ్, మెటల్ మైన్స్ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిఉంది. క్లిటికల్ మినరల్ పరిశోధనలోనూ ముందుకెళ్తోంది. రామ గుండం రీజియన్లోని మేడిపల్లి ఓసీపీలో హైడ్రోపవర్ ఉత్పత్తికి కూడా ప్రయోగ్మాకంగా సిద్ధమైంది. ఇతర రాష్ట్రాలకూ విస్తరణ.. సింగరేణి తెలంగాణతోపాటు పలురాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కొనసాగిస్తోంది. గోల్డ్, కాపర్ అన్వేషణ కోసం కర్నాటక రాష్ట్రంలోని దేవదుర్గలో పరిశోధనకు లైసెన్స్ పొందింది. ఒడిశా నైనీబ్లాక్లో భారీ ప్రాజెక్టు ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. పదెకరాల్లో కార్పొరేట్ కార్యాలయం.. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా కార్యాలయాన్ని కూడా విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ కనెక్టివి కల్పించారు. నెట్జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ, వాణిజ్య, వసతి, పారిశ్రామిక, వినోదం ప్రాంతాలు అనుసంధానంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అందులో పదెకరాలు కేటాయించడం సింగరేణికి శుభసూచకమని నిపుణులు పేర్కొంటున్నారు. -
‘సానుభూతి’కి నో చాన్స్!
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. గతానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతానికి భిన్నంగా.. గతంలో ముందుగా ఒక్క నోటిఫికేషన్ జారీ అయ్యేది. అయితే ఎంపీటీసీ ఎన్నికలు, లేదా సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో ఏదో ఒక్కటి ముందు జరిగేవి. ఇలా జరగడం మూలంగా ముందుగా వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఆ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించి, దరి దాపుల్లోకి వచ్చి ఓడిపోయినవారు.. మరోసారి వెంటనే వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశం ఉండేది. కానీ ఈ సారి శ్రీసానుభూతిశ్రీ చాన్స్ లేకుండానే నేరుగా ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు శ్రీసానుభూతిశ్రీని మూటగట్టుకునే చాన్స్ లేకుండా పోయింది. రెండు ఎన్నికల్లో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండింటికీ పోటీ చేస్తే.. నెగెటివ్ ఫలితాలు వస్తాయని కొందరు భావిస్తున్నారు. మొదటి ఎన్నికల్లో ఓడి.. రెండో ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఈ సారి లేవు. గతంలో చాలా మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి ఓడిపోయి, మళ్లీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారు. ముందుగా ఎంపీటీసీగా ఓడిపోయి, తర్వాత సర్పంచ్గా గెలిచిన ఘటనలు ఉన్నాయి. ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. పార్టీ నేతలకు తలపోట్లు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ పరంగా జరుగుతుండగా.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా సాగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి అటు ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను ఆయా పార్టీ నేతలు ఎంపిక చేయాల్సి వస్తుంది. రెండు వేర్వేరుగా నోటిఫికేషన్లు వస్తే.. ఆయా పార్టీలకు కొంత సమయం దొరికి అభ్యర్థుల ఎంపిక సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఎన్నికలు రావడంతో ఒక్క ఊరిలో ఎంపీటీసీ అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, మండల స్థాయిలో జెడ్పీటీసీ అభ్యర్థిని, మళ్లీ గ్రామస్థాయిలో వార్డు సభ్యులను ప్యానల్గా నిలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని పార్టీలకు ఈ జమిలి నోటిఫికేషన్ తలనొప్పిగా మారింది. రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్ రెండు విడతల్లో ఎంపీటీసీ, మూడు విడతల్లో సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబరు 11న నామినేషన్లు వేసేందుకు చివరి రోజు కాగా, అక్టోబరు 23న ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు అక్టోబరు 15న నామినేషన్లకు చివరి రోజు. 27న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబరు 11న వెలువడుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాల కోసం పక్షం రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అక్టోబరు 31, నవంబరు 4, 8వ తేదీల్లో మూడు విడతల్లో పూర్తి కానున్నాయి. ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రమే ఫలితాలు వెలువడుతాయి. మొత్తంగా ఒకేసారి స్థానిక సంస్థల ఎన్నికలు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను జారీ చేస్తూ ఎన్నికల కోడ్ను అమలులోకి తెచ్చింది. ‘స్థానిక’ంలో ఒకే దఫా అన్ని ఎన్నికలు ఓడి, గెలిచేందుకు అవకాశమే లేదు వరుసగా ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు -
చెత్త కుప్పల్లో ఫోర్టిఫైడ్ రైస్
వెల్గటూర్: ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ను గుర్తు తెలియని వ్యక్తులు మండలకేంద్రంలోని పెద్దవాగు పక్కన చెత్త కుప్పల్లో పడేసి వెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు 50కి పైగా ఫోర్టిఫైడ్ రైస్ సంచులను పడేసి వెళ్లారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్లో ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ–12 పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం మిల్లర్లకు ఫోర్టిఫైడ్ రైస్ను ప్రభుత్వమే అందిస్తుంది. బియ్యాన్ని మూడు నెలలవరకు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమై తహసీల్దార్ శేఖర్ను వివరణ కోరగా.. గడువు ముగిసిన బియ్యాన్ని ఎవరో మిల్లర్లు ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, బియ్యం బహిరంగ ప్రదేశంలో పడేయడం ద్వారా పశువులు, ఇతర జీవులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, జేసీబీతో గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టామని తెలిపారు. -
పక్షవాత బాధిత కుటుంబానికి రూ.1.23 లక్షలు
ధర్మపురి: ఒక వైపు పేదరికం.. మరోవైపు పక్షవా తం రావడంతో ఓ నిరుపేద ఇంటికే పరిమితమయ్యాడు. ఆ బాధితుడిని ఆదుకునేందుకు ఫేస్బుక్ మిత్రులు రూ.1.23 లక్షలు సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ధర్మపురికి చెందిన సంకు రాజశేఖర్ బీడీ కంపెనీలో కార్మికుడిగా పనిచేసేవాడు. చిన్న అద్దె ఇంట్లో ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండేళ్ల క్రితం అప్పు చేసి కూతు రు వివాహం చేశాడు. ఏడు నెలల క్రితం పక్షవాతం బారిన పడడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఇంటి అద్దె, కుటుంబ ఖర్చులు భారంగా మారడంతో వైద్యానికి దూరమయ్యాడు. ఆయన దీనస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకు డు రేణికుంట రమేశ్ ఈనెల 4న ఫేస్బుక్లో పోస్టు చేశారు. బాధితుడికి సాయం అందించాలని కోరారు. స్పందించిన ఎన్నారైల మిత్రులు రాజశేఖర్ భార్య భూలక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.1.23 లక్షలు విరాళాలుగా పంపించారు. ప్రస్తుత వైద్యం, ఇతర ఖర్చుల కోసం రూ.23వేలను స్థానిక ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ దిలీప్ చేతుల మీదుగా ఆమెకు అందించారు. మిగిలిన డబ్బులను భూలక్ష్మి బ్యాంకు ఖాతాలో జమ చేశామని రమేశ్ తెలిపారు. -
వేధించినందుకే యువకుడి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఈనెల 27న ఎదురుగట్ల సతీశ్ (28) హత్యకు గురైన విషయం తెల్సిందే. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీశ్ వేధించినందుకే యువతి బంధువులు హత్య చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేచపల్లికి సతీశ్ 20రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెను తన ప్రేమికురాలని, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 27న రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సతీశ్ను బయటకు తీసుకొచ్చి కారంపొడి చల్లి కర్రలతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను అదే గ్రామానికి చెందిన నాంతారి వినాజీ, నాంతారి శాంత, జలగా గుర్తించామని, సోమవారం 10 గంటల ప్రాంతంలో రేచపల్లిలో వారిని పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మైనర్ పరారీలో ఉన్నాడని వివరించారు. నిందితుల నుంచి రక్తపు మరకల దుస్తులు, హత్యకు ఉపయోగించిన కర్రలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీతను అభినందించారు. పరారీలో మైనర్ డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
అబుదాబిలో పూలపండుగ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అబుదిబిలోని తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఇండియా అండ్ సోషల్ కల్చర్ వేదికగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యలో ఉత్సవాలు నిర్వహించారు. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫస్ట్ సెక్రటరీ కమ్యూనిటీ వెల్ఫేర్ కో ఆర్డినేషన్ జార్జీజార్జ్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతినిధులు జయచంద్రన్ నాయర్, షాజీ వీకే, సర్వోత్తమ్ శెట్టి, విజయ్ మానె, దివాకర్ ప్రసాద్, వినాయక్ అవాటె తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, గాయకుడు కోకిల నాగరాజు, యువగాయని సోని యాదర్ల బతుకమ్మ ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఉత్సవ నిర్వాహకులు రాజా శ్రీనివాస్రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీశ్, పావని, అర్చన, దీప్తి, పద్మజ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
దంత వైద్యుడి పోస్టు ఖాళీ
రాయికల్: రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి దంతవైద్యుడి పోస్టు మంజూరైంది. ఇక్కడ పనిచేసిన వైద్యురాలిని జిల్లా కేంద్రానికి డిప్యూటేషన్పై పంపించారు. దీంతో స్థానిక ఆస్పత్రిలో దంతవైద్యం అందకుండాపోతోంది. ఫలితంగా పట్టణంతోపాటు మండలంలోని 32 గ్రామాల బాధితులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ప్రవీణ్చంద్ర మోర్తాడ్కు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కోరుట్లకు చెందిన లావణ్య రెగ్యులర్ పోస్టుపై వచ్చారు. ఆస్పత్రిలో దంత వైద్యానికి సంబంధించిన పరికరాలన్నీ ఉన్నాయి. అయితే లావణ్యను డిప్యూటేషన్పై జిల్లా కేంద్రానికి బదిలీ చేశారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో దంత సమస్యలతో బాధపడుతున్నవారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీమంత్రి జీవన్రెడ్డి స్పందించి రాయికల్ ఆస్పత్రికి దంత వైద్య పోస్టు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
‘టెట్’ టెన్షన్
జగిత్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టీచర్ ఎల్జిబిలిటి టెస్ట్ (టెట్) టెన్షన్ పట్టుకుంది. 2010కు ముందు ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు టెట్ రాసి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో వారిలో అలజడి మొదలైంది. దీనికి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. ఐదేళ్లకు పైబడి సర్వీస్, ఇన్ సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కాని పక్షంలో ఉద్యోగం వదులుకోవాల్సిందేనన్న భయాందోళన మొదలైంది. ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు కూడా టెట్ తప్పనిసరి అని చెప్పడంతో రెండేళ్లలో ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల సమయం ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి పదోన్నతి రావాలంటే టెట్ రాయాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేశారు. 2008 నుంచి డీఎస్సీ రాయాలంటే టెట్ అర్హత తప్పనిసరి ఉంది. అంతకుపూర్వమే ఎంపికై న ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత ఉండాల్సిందేనని నిబంధనలు రావడంతో ఉపాధ్యాయులు తర్జనభర్జన పడుతున్నారు. చాలా మంది ఉపాధ్యాయులు జిల్లాలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో సుమారు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు రెండు వేలకు పైగా ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సిన వారున్నారు. సీనియర్ ఉపాధ్యాయులు, చాలాకాలం నుంచి పాఠశాలలో బోధన చేస్తున్న వారు ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతల వంటి కారణాలతో ఈ పరీక్షలకు హాజరుకావడం ఇబ్బందేనని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరుతున్నారు. టెట్ అర్హతపై సడలింపులు, లేదా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎప్పుడో చదివిన ఉపాధ్యాయులు2008 డీఎస్సీ నుంచి టెట్ తప్పనిసరి చేశారు. అప్పుడు చాలా మంది ఉపాధ్యాయులు టెట్లో అర్హత సాధించి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. కానీ.. ఎప్పుడో ఉపాధ్యాయులుగా చేరిన వారికి ఇప్పుడు టెట్ రాయాలంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. టెట్లో అన్ని సబ్జెక్ట్లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. ఒక్కో సబ్జెక్ట్కు ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ఉదాహరణకు మ్యాథ్స్ ఉపాధ్యాయుడు టెట్ రాయాలంటే అతనికి అన్ని సబ్జెక్ట్లపై అవగాహన ఉండాలి. టెట్లో అర్హత సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. -
ఏటా రూ.250 పెంచాలి
ఏటా వరి పంటకు ఉన్న ధరలకు అదనంగా కనీసం రూ.250వరకు పెంచితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఏటా రూ.50, రూ.100 పెంచుకుంటే వెళ్తుంటూ రైతులకు పెద్దగా లాభం చేకూరదు. కొంతమొత్తం పెరిగిందో.. లేదో కూలీల ఖర్చు రెట్టింపవుతోంది. – నక్కల తిరుపతి రెడ్డి, తొంబరావుపేట రైతులు పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం రావాలి. అప్పుడే రైతులు నిలదొక్కుకునే అవకాశం ఉంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ధరలు పెరగడం లేదు. రైతులు పెడుతున్న ఖర్చుకు అనుగుణంగా ధరలు పెంచితేనే వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. – ఎల్లాల జలపతిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు -
మినహాయింపు ఇవ్వాలి
సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ రాయాలంటే ఇబ్బందే. ప్రమోషన్లకు దగ్గరగా చాలామంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పుడు రాయాలంటే కష్టగా ఉంటుంది. మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. – మచ్చ శంకర్, ఉపాధ్యాయుడు ప్రభుత్వం చొరవ చూపాలి ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. టెట్ వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ టెట్ రా యాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. – అమర్నాథ్రెడ్డి, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి -
అల్లీపూర్ మండలం ఏర్పాటు సీఎం దృష్టికి
రాయికల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫాం ఇచ్చే అవకాశం వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 69శాతం సీట్లు కేటాయిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. మండలంలోని కిష్టంపేట నుంచి చల్గల్, అల్లీపూర్ నుంచి శ్రీరాంనగర్, చెర్లకొండాపూర్ నుంచి మైతాపూర్, ఇటిక్యాల మోడల్స్కూల్ వరకు, చింతలూరు నుంచి బషీర్పల్లె వరకు రూ.6.30కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. సీఎం రేవంత్రెడ్డితో కలిసి నియోకవర్గ అభివృదికి నిరంతరం కృషిచేస్తానన్నారు. బీఫాం ఇచ్చే అవకాశం వస్తే ఆయా సామాజికవర్గాలకు 69 శాతం సీట్లు కేటాయిస్తానన్నారు. అల్లీపూర్ను మండలం చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సింగిల్విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, డీటీ రాజరెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, డీఈ మిలింద్, ఏఈ ప్రసాద్, నాయకులు మోర హన్మాండ్లు, గన్నె రాజరెడ్డి, అచ్యుత్రావు, కోల శ్రీనివాస్, పడిగెల రవీందర్రెడ్డి, కాటిపెల్లి గంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణు, ఆదిరెడ్డి, దేవుని రవి పాల్గొన్నారు ఆలయాల అభివృద్దికి కృషి జగిత్యాలరూరల్: ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పొలాసలోని పౌలేస్తేశ్వర స్వామి ఆలయంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ధర్మకర్తల్లో ముగ్గురు పొలాస వాసులు ఉన్నారని తెలిపారు. దామోదర్ రావు, పాలెపు రాజేంద్రప్రసాద్, ధర్మకర్తలు భూమన్న, సత్యనారాయణ, కొండాల్రావు, రాజయ్య, వినిత, డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు. -
రైతులకు స్వల్ప ఊరట
జగిత్యాలఅగ్రికల్చర్: వివిధ పంటలకు కేంద్రప్రభుత్వం మద్దతు ధరను స్వల్పంగా పెంచింది. ఏటా మాదిరిగానే 22 రకాల పంటలకు ధరలు ప్రకటించింది. ఈ ధరలు ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచే రైతులకు అందించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో జిల్లాలో అత్యధికంగా సాగు చేసే వరి, మొక్కజొన్న రైతులకు లబ్ధి చేకూరనుంది. రూ.2,389కి చేరిన క్వింటాల్ ధాన్యం మొన్నటివరకు వరి ధాన్యం క్వింటాల్కు మద్దతు ధర రూ.2,320గా ఉంది. ప్రస్తుతం ధాన్యానికి క్వింటాల్కు రూ.69 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన ఇకనుంచి రైతుకు రూ.2,389 అందనుంది. అలాగే కామన్ రకం రూ.2,300 నుంచి రూ.2,369కి పెరిగింది. జిల్లాలో వానాకాలం సీజన్లో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈసారి పురుగులు, తెగుళ్ల బెడద పెద్దగా లేకపోవడంతో సగటున ఎకరాకు 23 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అంచనా. ఈ మేరకు 71.30 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మొన్నటివరకు ఉన్న ధర రూ.2,320 ప్రకారం రైతులకు రూ.1,654కోట్లు వస్తే.. పెరిగిన ధర రూ.2,389 ప్రకారం రూ.1,703 కోట్లు రానున్నాయి. రైతులకు అదనంగా రూ.49 కోట్లు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మొక్కజొన్నకు రూ.175 పెంపు మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. క్కజొన్నను జిల్లాలో దాదాపు 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు సగటున కనీసం 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన 8.75లక్షల క్వింటాళ్లు దిగుబడి రానుంది. మొన్నటివరకు క్వింటాల్కు రూ.2,225 ఉండగా.. ప్రస్తుతం రూ.175 పెంచి రూ.2400గా నిర్ణయించారు. ఓపెన్ మార్కెట్లో మొక్కజొన్నకు డిమాండ్ ఉండటంతో క్వింటాల్కు రూ.2600 నుంచి రూ.మూడువేల వరకు పలుకుతోంది. ఓపెన్మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. మద్దతు ధర చెల్లించడం ద్వారా రైతులకు లాభం జరిగే అవకాశం ఉంది. గతంలో జిల్లా మొక్కజొన్న రైతులకు రూ.194.68 కోట్ల వరకు రాగా.. ఈ ఏడాది పెరిగిన ధరలతో రూ.210.00 కోట్లు రానుంది. మొత్తంగా రైతులకు రూ.15.32కోట్ల లబ్ధి చేకూరనుంది. గుడ్డిలో మెల్లగా.. పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో మద్దతు ధర పెంపు కొంతమేర ఊరట నిచ్చినా.. సాగు ఖర్చులకు అనుగుణంగా ధరలు పెరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించాల్సి ఉండగా.. కేంద్రం నామమాత్రంగా పెంచుతోందనే విమర్శలు ఉన్నాయి. మద్దతు ధరలను నిర్ణయించే కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి.. రైతుల నుంచి సాగు ఖర్చుల వివరాలు తీసుకుంటే కొంత మేలు జరిగేది. గతంలో ఉన్న ధరలకే కొంత కలిపి ఇస్తుండటంతో సాగు ఖర్చులు, రైతులకు వచ్చే ఆదాయానికి పొంతన లేకుండా పోతోంది. ఇవేవీ పట్టించుకోకుండా ధరల నిర్ణాయక కమిషన్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయడంతో రైతులకు అంతంతమాత్రంగానే లాభం చేకూరుతోంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సాగు ఖర్చుకు రెట్టింపు ఆదాయం రావాల్సి ఉండగా.. కనీసం సాగు ఖర్చులు కూడా రావడం లేదు. -
‘సద్దుల’ సందడి
సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం మార్కెట్లో సందడి నెలకొంది. గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, కలువ పూలు, పండ్లు, రంగుల కొనుగోలులో మహిళలు బిజీబిజీ అయ్యారు. అలాగే బతుకమ్మల నిమజ్జనం కోసం జగిత్యాల బల్దియా యంత్రాంగం 18 చోట్ల ఘాట్లు ఏర్పాటు చేసింది. రామాలయం, బసవేశ్వర కూడలి, పొన్నాల గార్డెన్స్, లింగంపేట చెరువు, ధర్మసముద్రం, వీక్లీబజార్ స్కూల్ సమీపంలో, చిలుకవాడ, గొల్లపల్లి రోడ్, కండ్లపల్లి చెరువు, శంకులపల్లి చౌరస్తా, ముప్పారపు చెరువు వద్ద రెండు ఘాట్ల చొప్పున ఏర్పాట్లు చేశారు. ఘాట్ల వద్ద లైటింగ్ తదితర సదుపాయాలు కల్పించారు. – జగిత్యాలటౌన్ -
నక్సలైట్గా మారేందుకు అవకాశం ఇవ్వండి
సిరిసిల్లక్రైం: అధికారుల తీరుతో పదేళ్లుగా తనకు అన్యాయం జరుగుతోందని, తనలాంటి బాధితులకు న్యాయం చేసేలా నక్సలైట్గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చల్లా బాలరాజు కోరారు. ఈమేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడు బాలరాజు మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టులో స్థలం కోల్పోయానని తెలిపాడు. అధికారులు తనకు పదేళ్లుగా నష్టపరిహారం చెల్లించకుండా దరఖాస్తులు, పరిశీలన అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు మిగతా వారికి నష్టపరిహారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన సందీప్కుమార్ ఝా నిర్వాసితుల సమస్యలపై అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులపై కేసు నమోదు తమ పరిధిలో లేదని ఎస్పీ తెలిపినట్లు చెప్పారు. జిల్లాకు కొత్తగా రానున్న కలెక్టర్ రెవెన్యూ విభాగంలోని చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని ఎస్పీ సూచించారని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఇనుకొండ లక్ష్మి, మంజుల, తిరుపతి, ఉపేందర్ ఉన్నారు. -
కొండా లక్ష్మణ్ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలి
జగిత్యాలటౌన్: రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి మరువలేనిదని, పదవా..? ప్రాంతమా..? అంటే ప్రాంతమే ముఖ్యమన్న తొలితరం ఉద్యమకారుడైన లక్ష్మణ్ను జాతిపితగా గుర్తించాలని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ 109వ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రలోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దశాబ్దాల పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాపూజీ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. నాయకులు కల్లెపెల్లి దుర్గయ్య, ఎలి గేటి నర్సయ్య, ఒల్లాల గంగాధర్ పాల్గొన్నారు. -
ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్
జగిత్యాలటౌన్: ఉద్యమాల ఊపిరి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్లో లక్ష్మణ్ జయంతిలో పాల్గొన్నారు. చేనేత కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొండా లక్ష్మణ్ పేరిట ప్రతిభా పురస్కారాలు అందిస్తోందన్నారు. బీసీ సంక్షేమ అధికారి సునీత, డీఎంహెచ్వో ప్రమోద్, మెప్మా పీడీ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ జగిత్యాలటౌన్: ఆడబిడ్డల ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని కలెక్టర్ సత్యప్రసాద్ అ న్నారు. సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శని వారం కలెక్టరేట్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సమష్టిగా బతుక మ్మ ఆడటం ద్వారా ఐక్యత బలపడుతుందన్నా రు. పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే ఏకై క పండుగ బతుకమ్మ అన్నారు. అదనపు కలెక్టర్లు ల త, జిల్లా సంక్షేమ అధికారి నరేశ్, ఈడీఎం మమ త, మహిళా అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ముంచుతున్న ముసురు
జగిత్యాలఅగ్రికల్చర్: మొక్కజొన్న పంట కోతకు వచ్చింది. 15 రోజులుగా ప్రతిరోజూ వర్షం కురుస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మొక్కజొన్న చేనుల్లో నీరు నిలిచిపోయింది. ఆ నీటిని తొలగించేందుకే నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. పంటను కోయలా..? వద్దా అని రైతులు అయోమయంలో పడుతున్నారు. మరికొందరు రైతులు పంటను కోసినప్పటికీ ఆరబెట్టేందుకు నానా తిప్పలు పడుతున్నారు. తడిసిముద్ద జిల్లాలో రెండో ప్రధాన పంటగా మొక్కజొన్నను సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేస్తారు. ఆ పంట కోతకు రావడం.. ప్రతిరోజు వర్షం కురవడంతో కో త ఇబ్బందిగా మారింది. కోసిన చొప్ప తడిసి కుళ్లి పోయే పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మెట్పల్లి వంటి ప్రాంతాల్లో సాగు చేసిన మొక్కజొన్నను కోసి ఆరబెట్టారు. వర్షానికి తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నారు. సో యాబీన్, పెసర, కంది వంటి పంటలైతే దిగుబడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో రైతులు దున్ని కొత్తగా పంట వేసే పరిస్థితి నెలకొంది. అంతరపంటగా పసుపు పసుపులో అంతరపంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. వర్షాలకు నీరు నిలవడంతో తేమ ఆరిపోయేవరకూ మొక్కజొన్నను కోయలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే మొక్కజొన్న పసుపుపై పడిపోయి పంట దెబ్బతినే అవకాశం ఉంది. కోసిన కంకులను కుప్పపోస్తే.. వర్షానికి నాని మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొత్తంగా కోతల వేళ వర్షాలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. డిమాండ్ ఉన్నా.. దిగుబడి అంతంతే.. మొక్కజొన్నకు పౌల్ట్రీ పరిశ్రమ నుంచి డిమాండ్ ఉంది. మద్దతు ధర క్వింటాల్కు రూ.2400 ఉండగా.. ఓపెన్ మార్కెట్లో క్వింటాల్కు రూ.2800 నుంచి రూ.3000 వరకు ఉంది. ఈ ఏడాది తొలిదశ కత్తెర పురుగు దెబ్బతీసింది. గింజ దశలో కోతులు, రామచిలుకలు, అడవి పందులు దెబ్బతీశాయి. ఫలితంగా ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి ఆశిస్తే 15 నుంచి 20 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. -
స్థానిక సందడి షురూ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. గత కొన్ని నెలలుగా గ్రామాల వారీగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. కలిసొచ్చినా రిజర్వేషన్తో పలువురు సంబరాలు జరుపుకోగా, మరికొందరు నిరాశలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయగా, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికల కసరత్తును పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిటీ సిఫార్సులను అనుగుణంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీంతో గతంలో కన్నా అన్ని స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిథ్యం పెరిగింది. ఎన్నికల పక్రియలో భాగంగా శనివారం తొలుత ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్స్కు రిజర్వేషన్లు రొటేషన్ పద్ధతిలో ఖరారు చేయగా, మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఆయా కలెక్టరేట్లలో వివిధ రాజకీయపక్షాల సమక్షంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు లాటరీ పక్రియ ద్వారా నిర్ణయించారు. పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కేటాయింపులు పూర్తాకాగానే జిల్లాలవారీగా రిజర్వేషన్ల గెజిట్ను ఆయా జిల్లా కలెక్టర్లు విడుదల చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండటంతో తమ గ్రామంలో, తమ మండలంలో ఎంపీపీ ఏవరికి కేటాయించరో తెలుసుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపారు. తమకు రిజర్వేషన్ అనూకూలించని వారు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దించాలనే దిశగా పావులు కదుపుతున్నారు. త్వరలో స్థానిక ఎన్నికల నగారా మోగనుండటంతో పల్లెల్లో రాజకీయం వెడేక్కింది. రెండు మహిళలకు... ఎస్సీ, బీసీలకు ఒక్కోటి పెద్దపల్లి, జగిత్యాల జెడ్పీ చైర్మన్ స్థానాలను జనరల్ మహిళలకు కేటాయించగా, కరీంనగర్ జెడ్పీస్థానం బీసీ జనరల్కు, సిరిసిల్ల జెడ్పీ పీఠంను ఎస్సీ జనరల్కు కేటాయిస్తూ శనివారం రాత్రి పంచాయితీరాజ్శాఖ అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని నాలుగు జెడ్పీ చైర్మన్లలో రెండు మహిళలకు, ఎస్సీ, బీసీలకు ఒక్కోటి కేటాయించినట్లయింది. మొదలైన ఆశావహుల సందడి.. జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామపంచాయతీల ఎన్నికలకు కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆశావహుల్లో హడావుడి మొదలైంది. ముసాయిదా రిజర్వేషన్ల జాబితాను శనివారం జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట ప్రదర్శించారు. ఈ క్రమంలో కలెక్టరేట్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆశావహులు క్యూకట్టారు. లాటరీ పక్రియలో పాల్గొన్న నేతలతో ఆశావాహులు ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు అధికంగా సీట్లు కేటాయించడంతో ఉత్సాహం నెలకొంది. స్థానిక పోరు మరింత వేడెక్కింది. ఎన్నికలు జరిగేనా.. సామాజిక న్యాయం కలిగించేలా ప్రభుత్వం బీసీవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేస్తూ జీవోను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వెలువడవచ్చన్న అంచనాలు నెలకొన్న క్రమంలో బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా పలువురు హైకోర్డుకు వెళ్లిన నేపథ్యంతో జీవో అమలుపై సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు ఎన్నికలు నిర్వహిస్తారా, లేక మరోసారి ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుంటాయా అనేదాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 6 3 0 4 జగిత్యాల 9 4 1 6 సిరిసిల్ల 0 0 0 0జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ కరీంనగర్ 6 3 0 6 పెద్దపల్లి 5 3 0 5 జగిత్యాల 8 4 1 7 సిరిసిల్ల 0 0 0 0సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు ఖరారుసిరిసిల్ల: ఎస్సీ జనరల్కరీనగర్: బీసీ జనరల్ జగిత్యాల: జనరల్ మహిళపెద్దపల్లి: జనరల్ మహిళ -
సాంకేతికతతో ఉపాధి అవకాశాలు మెరుగు
జగిత్యాల: సాంకేతికతతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రభుత్వం యువతకు గ్లోబల్స్థాయి నైపుణ్యాలు అందించడమే లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఎమ్మెల్యే సంజయ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాటా టెక్నాలజీ లిమిటెడ్ భాగస్వామ్యంతో సుమారు రూ.45 కోట్ల విలువైన ఆధునిక యంత్ర పరికరాలు విద్యార్థుల శిక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. టెక్నాలజీ అవసరం కాబట్టి ఆధునికత సాంకేతిక విద్య అవసరమని, అందుకే ఈ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. యువత ఈ కోర్సుల్లో చేరి ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారని, మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ను కోరగానే ఏటీసీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. 125 మంది విద్యార్థులకు ఇందులో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, ప్రిన్సిపల్ రవీందర్, తహసీల్దార్ వరందన్ పాల్గొన్నారు. బుగ్గారం అభివృద్ధికి కట్టుబడి ఉంటా.. బుగ్గారం: బుగ్గారం మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంటానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలకేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుర్గమాతాకు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. గౌడ కులస్తులకు కాటమయ్య కిట్లను అందించారు. మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందన్నారు. -
పేదల సొంతింటి కల తీరుతోంది
జగిత్యాలరూరల్: పేదల సొంతింటి కల సాకా రం అవుతోందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం కండ్లపల్లి లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, కండ్లపల్లిని పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసిందని తెలిపారు. ఇళ్లు నిర్మించుకున్న లబ్ధి దారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోందని తెలిపారు. అదనపు కలెక్టర్ లత, హౌసింగ్ పీడీ ప్రసాద్, తహసీల్దార్ వరందన్, డీఈ భాస్కర్, సీఐ సుధాకర్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పొలాసలో రూ.20 లక్షల నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.21లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో చేపట్టే పనులకు భూమిపూజ చే శారు. డీఈ మిలింద్, తహసీల్దార్ వరందన్, మా జీ సర్పంచులు,ఏఎంసీ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘ అభివృద్ధికి కృషి రాయికల్: పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సేవ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. సంఘం అధ్యక్షుడిగా మానాల వెంకటి ఎన్నికకాగా.. అభినందించారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాలని వెంకటి ఎమ్మెల్యేను కోరగా సానుకూలంగా స్పందించారు. మహేందర్బాబు, అజయ్ ఉన్నారు. పల్లె దవాఖానాలతో మేలుసారంగాపూర్: పల్లె దవాఖానాలతో ఇంటిముందుకు వైద్యం చేరిందని ఎమ్మెల్యే అన్నారు. బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో రూ.20లక్షలతో నిర్మించిన పల్లెదవాఖానా ప్రారంభించారు. 14 మందికి రూ.3.58 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.